ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే చర్యలు

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ నారాయణ, ఏఓ కృష్ణ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పలు ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువులు, విత్తనాలతో పాటు పురుగుమందుల స్టాక్‌ వివరాలు పరిశీలించారు. ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హచ్చరించారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదులు తీసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement