breaking news
Mahabubnagar
-
ఉత్సాహంగా బాస్కెట్బాల్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంపికై న జట్లు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచాటి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్ అడ్వకేట్, నసరుల్లా హైదర్, సుబాన్జీ, ఎండీ ఇలియాజ్, షకీల్, ఉస్మాన్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే వారం సంగమేశ్వరుడికి తొలిపూజలు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల గ్రామ సమీపంలో కృష్ణానది అవతలి ఒడ్డున నదిలో ఉన్న ప్రాచీన సంగమేశ్వర దేవాలయం కృష్ణమ్మ ఒడి నుంచి బయట పడుతుంది. సోమవారం ఆలయం దాదాపుగా సగం భాగం వరకు దర్శనమిచ్చింది. శ్రీశైలం జలాశయం నీటిమటం 843.70 అడుగులకు చేరడంలో ఆలయ ప్రహరీ భాగం కింది వరకు నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో ఆలయ ముఖద్వారం దర్శనమిచ్చింది. మరో ఐదు అడుగులు నీరు తగ్గితే ఆలయం పూర్తిగా బయట పడుతుందని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. రానున్న సోమవారం ప్రాచీన సంగమేశ్వరుడికి తొలి పూజలు ప్రారంభమవనున్నట్లు పేర్కొన్నారు. -
పీయూలో ఖోఖో మహిళా జట్టు ఎంపిక
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఖోఖో మహిళా జట్టు ఎంపికలను సోమవారం నిర్వహించారు. ఈ మేరకు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు యూనివర్సిటీ క్రీడలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని, ఇక్కడ క్రీడల్లో ఎంపికై న విద్యార్థులు నిరంతర సాధన ద్వారా మంచి ఫలితాలను రాబట్టేందుకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఇక్కడ ఎంపికై న విద్యార్థినులు ఈనెల 26నుంచి 31వ వరకు కర్ణాటకలోని దేవేంగిరి యూనివర్సిటీలో నిర్వహించే పోటీల్లో పాల్గొనున్నారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్, ఇన్చార్జి సత్యభాస్కర్, కోకో అసోసియేషన్ సెక్రెటరీ బాలరాజయ్య, కోచ్లు రూప, శ్రీనివాస్, రజిని, శ్వేత పాల్గొన్నారు. పీయూలో భగత్సింగ్ వర్ధంతి పీయూలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారుతి, సీతారాం మాట్లాడుతూ.. బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బలైన రాజ్గురు, సుఖ్దేవ్, భగత్సింగ్ విప్లవవీరులు స్వాతంత్య్రం కోసం జీవితాలనే అర్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హర్షవర్ధన్, సంజీవ్, బాలు, నవీన్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు సామాజికంగా ఎదగాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహిళలు సామాజికంగా ఎదగాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కొకన్వీనర్ శ్రీదేవి అన్నారు. సోమవారం స్థానిక డైట్ కాలేజీలో అంతర్జాతీయ శ్రామిక పోరాట దినంపై సెమినార్ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా శ్రామిక పోరాట దినం అంటే అందాలు, ముగ్గులు పోటీలు కాదని.. అదొక స్ఫూర్తిదాయకమైన రోజని తెలియజేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికపరంగా ముందుండి వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డైట్ కాలేజీ లెక్చరర్ జ్యోతి మాట్లాడుతూ.. మహిళలకు వేరే ఎవరో చెప్పనవసరంలేదని.. తమకు తాము అద్భుతంగా సృష్టించుకోగలరన్నారు. పాలమూరు యూనివర్సిటీ జేఏసీ లీడర్ నరేందర్ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో సాధించాల్సింది ఇంకా మిగిలే ఉందని, హక్కులు, చట్టాల కొరకు నిరంతరం వి ద్యార్థిదర్శనం నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డైట్ లెక్చరర్స్ రఫియా, ఐషా, బాలీశ్వరి, పాలమూ రు యూనివర్సిటీ విద్యార్థి పవన్ పాల్గొన్నారు. -
క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే నయం
● పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రివైద్యనిపుణుడు రాజ్కుమార్ పాలమూరు: ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, మొదటి దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా సులువుగా తగ్గించ్చవచ్చని పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బిల్లకంటి రాజ్కుమార్, మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కె రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ కృష్ణకిషోర్ పేర్కొన్నారు. నగరంలోని పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. క్యాన్సర్ నానాటికి పెరుగుతున్న క్రమంలో పేదలకు స్థానికంగా ఖరీదైన క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉండాలని 2022లో ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆస్పత్రి ఏర్పాటు చేసిన నాటినుంచి ఇప్పటి వరకు వెయ్యి వరకు సర్జరీలు, 5వేల మందికి కీమో థెరపీ చేసినట్లు పేర్కొన్నారు. ఊపిరితిత్తులు, లివర్, మూత్రాయం, పాన్క్రీస్ క్యాన్సర్కు మొదటిసారిగా స్థానికంగా వైద్యం చేసినట్లు వెల్లడించారు. క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా, ఒత్తిడి, కెమికల్స్ కూడిన ఆహారం, ఊబకాయం, మద్యం, సిగరేట్ గుట్కా వంటి అలవాట్లతో వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు. జిల్లాలో క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో చాలామంది ఆలస్యంగా గుర్తించి ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారని అప్పటికే ఆలస్యం చేస్తున్నారని, అలా కాకుండా లక్షణాలు కన్పిస్తే వెంటనే పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. మొదటి దశలో వస్తే తప్పక రోగం నయం చేయడానికి అధికంగా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకవైపు వైద్యసేవలతోపాటు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులు, ర్యాలీలు నిర్వహించి పల్లెల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, కార్భశయ ముఖద్వారా క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని, చిన్నారుల నుంచి పెద్దలు ఈ ప్రాణాంతకమైన వ్యాధిబారినపడుతున్నట్లు వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు ప్రజల్లో ఈ వ్యాధిపై సరైన అవగాహన ఉండడం లేదన్నారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు పంజా విసురుతున్నాయని తెలిపారు. వ్యాధిసోకుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాలవారే అధికంగా ఉంటున్నారని, గతంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ 50ఏళ్లపైబడి మోనోపాజ్ దశలో ఉన్నవారికి మాత్రమే వచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుతం యుక్త వయస్సు వారిలో ఇది వస్తున్నట్లు తేలిందని, హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, బాల్యవివాహాలు, సుఖవ్యాధులు, పౌష్టికాహార లోపం ఎక్కువమంది పిల్లలను కనటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలో 90శాతానికిపైగా రొమ్ము క్యాన్సర్ బాధితులు వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు వెళ్తున్నారని తెలిపారు. చిన్నచిన్న గడ్డలను గుర్తించినా నిర్లక్ష్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కరివేపాకు సాగుతో లాభాలు
అలంపూర్: కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అందుకే కొందరు కూరల్లో వేసుకోని తింటే మరి కొందరు పౌడర్ రూపంలో తీసుకోని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కరివేపాగు సాగు చేయడం ఎంతో సులభమని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరివేపాకు సాగు పలు సూచనలు అందిస్తున్నారు. జిల్లా వాతావరణానికి కరివేపాకు సాగు అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఎర్రనేలలో పంట సాగు చేయడంతో అధిక దిగుబడి, సులభంగా సాగు చేసుకోనే అవకాశం ఉందని దీంతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు. కరివేపాకు సాగులో మెళకువలు.. పంట రకాలు.. సెంకంపు: ఈ రకాన్ని తమిళ నాడులో అధికంగా సాగు చేస్తారు. ఆకు ఎక్కువగా ఉండి నూనె శాతం, వాసన కలిగి ఉంటాయి. డీడబ్ల్యూడీ–1 : ఈ రకం వేరు పిలకల ద్వారా ఎన్నుకోబడింది. ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చలిని తట్టుకోలేదు. ఆకులను పొడిగా చేసుకోని వాడుకోవచ్చు. డీడబ్ల్యూ డీ–2: విత్తనాల ద్వారా వేసిన పంట రకం నుంచి ఎన్నుకోబడిన రకం ఇది. ఆకు లేత పసుపు రంగులో ఉండి వాసన తక్కువగా ఉంటుంది. ఈ రకం చలిని తట్టుకుంటుంది. దీని పెరుగుదల అధికంగా ఉంటుంది. సువాసిని: వేరు మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. మెట్ట ప్రాంతాలకు ఇది అనుకూలం. భువనేశ్వర: నీటి వసతి ప్రాంతాల్లో ఎక్కువగా సాగు అవు తుంది. అన్ని రకాల నేలల్లో పండిస్తారు. మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్న ఎర్ర నేలలు శ్రేష్టం. ఎర్రతువ్వ నేలల్లో పెరుగుదల బాగా ఉంటుంది. ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మురుగు నీటి పారుదల లేని నల్ల నేలలు పనికి రావు. విత్తుట.. కరివేపాకును విత్తనాల ద్వారా పెంచవచ్చు. విత్తనా లతో నారు మొక్కలను పెంచి ప్రధాన పొలాల్లో నా టాలి. నారు పెంచేందుకు బాగా పండించిన మంచి పండ్లను, బాగా పెరుగుదల కలిగిన తల్లి చెట్ల నుంచి కోయాలి. జూలై, ఆగస్టు నెలల్లో పండ్లు కాస్తా యి. ఆగస్టు నెలలో పండ్లను సేకరించిన 3–4 రోజు ల్లో విత్తనాలను తీసి నారుమళ్లు, పాలిథిన్ సంచుల్లో విత్తాలి. ప్రతి పండులో 3– 4 విత్తనాలు ఉంటాయి. విత్తన మోతాదు.. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనాలు లేదా 25 కిలోల పండ్లు సరిపోతాయి. విత్తే పద్ధతి.. మీటర్ విస్తీర్ణంలో 30 సెం.మీ. ఎత్తు కలిగిన నారుమళ్లను తయారు చేయాలి. నారుమళ్లకు తగినంత పశువుల ఎరువులు వేసిన తరువాత 10 సె.మీ. దూరంలో గీసి విత్తనాలను విత్తుకోవాలి. మూడు రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. నేల తయారీ మొక్కలు నాటుట.. ప్రధాన భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువులు వేయాలి. 30.30.30 సె.మీ. పరిమాణం గల గుంతలను 1.2 నుంచి 1.5 మీ దూరంలో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి రెండు నెలల ముందు గుంతలు తీయాలి. ఈ గుంతలను పశువుల ఎరువును కలిపి నింపాలి. గుంత మధ్యలో ఒక్కో నారుమొక్క నాటాలి. ఎరువులు.. ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 28 కేజీల నత్రజని, 9 కిలో భాస్వరం, 8 కిలో పొటాష్ని ఇచ్చే ఎరువులను కలిపి గుంతలో సమానంగా నింపాలి. నీటి యాజమాన్యం, మొక్కలను నాటిన వెంటనే గుంతలను తడపాలి. నాటిన మూడో రోజు మరొక తడి అందించాలి. తర్వాత వారానికి ఒక తడి అందిస్తూ ఉండాలి. గుంతలను కలుపుతూ కాల్వలను ఏర్పాటు చేసి నీటిని అందించాల్సి ఉంటుంది. అంతర కృషి.. గుంతల మధ్య ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. మొదటి సంవత్సరం గుంతల మధ్య అపరాలు పండించవచ్చు. సస్యరక్షణ చర్యలు గొంగళి పురుగు: గొంగళి పురుగు చిన్నప్పుడు తెల్లని చా రలతో నలుపు రంగులో ఉంటుంది. తరువాత ముదురు ఆకుపచ్చ రంగులో లావుగా స్థూపాకారంలో ఉంటుంది. పురుగులను చేతితో తీసి నాశనం చేయడం శ్రేయస్కరం, వేప సంబంధిత క్రిమి సంహార మందులు ఉపయోగించాలి. తప్పని పరిస్థితుల్లో నువాన్ 1 మి.లీ. లేదా 2 మి.లీ. క్వినాల్పాస్ లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లు : ఆకుపచ్చ తెగుళ్ల సోకే ఆవకాశం ఉంది. దీని నివారణకు గ్రామ కార్బాండిజమ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గంధం కలిగిన క్రిమి నాశకాలను వాడితే ఆకు రాలిపోతుంది. కాబట్టి మందును వాడరాదు. కోత దిగుబడి మొదటి సంవత్సరం ఎకరాకు 100 నుంచి 160 కిలోల దిగుబడి వస్తుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒక్కోక్క కోతలో ఎకరాకు 700 కిలో చొప్పున సంవత్సరానికి 2,100 కిలోల ఆకు దిగుబడి వస్తుంది. 4వ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కోతలో 1000 కిలోల చొప్పున 4 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది. అయిదు సంవత్సరాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కోతలో ఎకరాకు 2 వేల కిలోల ఆకు చొప్పున ఏడాదికి 8 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది. పాడి–పంట -
గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం
● గోదాంలో 250 సిలిండర్ల వ్యత్యాసం అచ్చంపేట రూరల్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సైదులు హెచ్చరించారు. పట్టణంలోని లక్ష్మీప్రసన్న గ్యాస్ ఏజెన్సీ(భారత్) గోదాంను సోమవారం ఆయన తనిఖీ చేశారు. గోదాంలోని సిలిండర్ల నిల్వలను పరిశీలించారు. అలాగే ఏజెన్సీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా 250 సిలిండర్లు వ్యత్యాసం వచ్చినట్లు గుర్తించారు. దీంతో కలెక్టర్కు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు సకాలంలో సిలిండర్లు అందించకుండా కృత్రిమ కొరతకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుందని, డెలివరీ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. తనిఖీలో ఎంఆర్ఐ శివ, ఆర్ఐ బాల్రాం, సిబ్బంది పాల్గొన్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టివేత బిజినేపల్లి: మండల కేంద్రంలోని పలు హోటళ్లలో మండల రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడంతో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ దాడులు చేపట్టినట్లు డిప్యూటి తహాసీల్దారు రవికుమార్ తెలిపారు. సోమవారం నిర్వహించిన దాడులలో 10 దుకాణాలలో 20 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
ప్రతి పల్లెకు న్యాయ సేవలు వెళ్లాలి
పాలమూరు: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లెకు న్యాయసేవలను తీసుకువెళ్లడానికి పారా లీగల్ వలంటీర్లు బాధ్యత తీసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. అన్ని రకాల చట్టాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వల్ల ప్రజలకు అవగాహన పెరుగుతుందన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాన్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అధ్యక్షతన సోమవారం పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ నిర్వహించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు, చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీలు అందిస్తున్న న్యాయ సేవలు మరింత మెరుగైన స్థాయిలో అందించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న పేదలకు న్యాయం సక్రమంగా అందడం లేదనే విషయం ఎన్నో నివేదికలు చెబుతున్నాయని, ఇలాంటి అంశాలపై వలంటీర్లు దృష్టి సారించాలన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం జరగాలన్నారు. శిక్షణలు ప్రతి వలంటీర్ సద్వినియోగం చేసుకుని నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఇందిర, డీపీఓ నర్మద, సహాయ కార్మికశాఖ అధికారి అల్తాఫ్, న్యాయవాదులు కృష్ణ, కార్తీక్, సామాజిక కార్యకర్తలు చంద్రశేఖర్, శివన్న పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్పల్లిలో 523 సర్వే నంబర్లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్లను అప్పటి ప్రభుత్వం తీసుకుని డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించలేదని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ అన్నారు. పట్టాలు తీసుకున్న ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలనే డిమాండ్తో సోమవారం కలెక్టరేట్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పటి కలెక్టర్ రొనాల్డ్రోస్ మాటను నమ్మి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో తమ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అప్పటి నుంచి బాధితులు ఇండ్లకోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఏడేళ్లు గడుస్తున్నా కలెక్టర్ హామీ నెరవేరకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత కలెక్టర్ గత కలెక్టర్ హామీని అమలు చేసి ప్రభుత్వ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికై నా కలెక్టర్ పట్టా సర్టిఫికెట్లు ప్రభుత్వానికి స్వాధీనపరిచిన వాళ్లందరికీ తక్షణం డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు జలాల్ పాషా, గట్టన్న, డబుల్ బెడ్రూం బాధితులు పాల్గొన్నారు. -
భైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ఉండవెల్లి: మండలంలోని పుల్లూరు శివారులోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉండవెల్లికి చెందిన తల్లి కుమారుడు సర్తాజ్ బేగం, మజూర్ (19) బైక్పై కర్నూలుకు బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదంలో తల్లి పక్కనే పడిపోగా కుమారుడు ఎగిరిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో కర్నూలు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లి కన్నిటిపర్యంతమయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ యువతి మృతి తెలకపల్లి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గడ్డంపల్లి గ్రామానికి చెందిన వడ్డెమాన్ భార్గవి (21)కు తండ్రి పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి నిశ్చయం కోసం ఈనెల 15న తెలకపల్లికి వెళ్లగా అదే రోజు సాయంత్రం భార్గవి క్రిమి సంహారక మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు తండ్రికి సమాచారం అందింంచి చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి మరణించింది. భార్గవి వేరే యువకుడిని ఇష్టపడుతుందని, ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆలయంలో చోరీ.. కేసు నమోదు ఉప్పునుంతల: మండలంలోని జప్తీ సదగోడు లో గల పెద్దమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి వెండి విగ్రహం, వడ్డానం, బంగారు మాంగల్యం, ముక్కుపుడకను అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం స్థానిక యాదవ సంఘం నాయకులు ఆలయంలోకి రాగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ వెంకట్రెడ్డి జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాన్ని రప్పించి ఆలయంలో వేలి ముద్రలను సేకరించినట్లు పేర్కొన్నారు. మొగుల్మడ్కలో నగదు, నగలు చోరీ దామరగిద్ద: మండలంలోని మొగుల్మడ్క గ్రామానికి చెందిన మహామ్మద్ ఆసిఫ్ ఇంట్లో దొంగలు ప్రవేశించి నగలుతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఆసిఫ్ జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలస వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పోలెపల్లి ఎల్లమ్మ జాతరకు ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్కు వెళ్లాడు. కాగా సోమవారం ఉదయం గ్రామానికి వచ్చి ఇంటిని తెరిచి చూడగా బీరువా తలపులు తెరిచి ఉండటాన్ని చూసి కంగుతిన్నాడు. బీరువాల్లో దాచి ఉంచిన 15 తులాల వెండి, 10 వెండి ఉంగరాలు. కాళ్లపట్టీలు, రూ.20 వేల నగదు చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. -
జీవవైవిధ్య సంరక్షణకు పాటుపడాలి
జడ్చర్ల టౌన్: జీవ వైవిధ్య సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మాజీ చైర్మన్ అచలేందర్రెడ్డి, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్ కోరారు. పట్టణంలోని డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ 6వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మాజీ చైర్మన్ అచలేందర్రెడ్డి, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్ హాజరై గార్డెన్లో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం కళాశాల సమావేశ మందిరంలో జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు ఎన్సీసీ సభ్యులు గౌరవ వందనం సమర్పించారు. గార్డెన్లో దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో ఔషధ మొక్కల కోసం నిర్మించిన చరక నెట్హౌస్ను అచలేందర్రెడ్డి, 1993–96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన వాండా ఆర్కిడేరియం, కాక్టస్హౌస్ను ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్, ప్రిన్సిపాల్ సుకన్య ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ తలమానికం డా.సదాశివయ్య రూపొందించిన బొటానికల్ గార్డెన్ జడ్చర్లకే తలమానికంగా మారిందని, ప్రతి కళాశాలలోనూ మొక్కలు నాటి ప్రకృతి పరిరణక్షకు పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల రాష్ట్రానికే ఆదర్శ కళాశాలగా మారిందన్నారు. గార్డెన్ సమన్వయకర్త డా.సదాశివయ్య మాట్లాడుతూ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 852 జాతులు, 8 వేల పైచిలుకు మొక్కలను సంరక్షిస్తున్నామని వివరించారు. జీవవైవిధ్య సంరక్షణకు, పరిశోధనలకు గార్డెన్ కేంద్రబిందువుగా మారిందన్నారు. గార్డెన్ అభివృద్ధికి సహకరించిన పూర్వవిద్యార్థులు, పట్టణవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ప్రిన్సిపాల్ డా.సుకన్య, వైస్ప్రిన్సిపాల్ నర్మద, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు. స్కిల్ ఓరియంటెడ్ కోర్సులతో సంపాదన విద్యార్థులు చదువుతోపాటు స్కిల్ ఓరియంటెడ్ కోర్సుల ద్వారా భావితరాలు చదువుతో పాటు సంపాదించడం నేర్చుకోవాలని నేషనల్ బయోడైవర్సిటి మాజీ చైర్మన్ అచలేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బొటానికల్ గార్డెన్లో సంరక్షిస్తున్న అరుదైన ఔషధ మొక్కలు, అటవీ జాతుల మొక్కలను తక్కువ ఖర్చుకై నా అమ్మి గార్డెన్కు సంపాదన వచ్చేలా చేయాలన్నారు. -
సత్వరం పరిష్కరించండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 165 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి ఎండార్స్ చేస్తూ ఫిర్యాదులు పరిష్కారం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రజావాణిలో కలెక్టర్కు అందిన పెండింగ్ ఫిర్యాదులు శాఖల వారీగా సమీక్షించారు. మూడు నెలలకు మించి పెండింగ్లో నున్న ఫిర్యాదులు అన్ని వెంటనే పరిష్కరించాలని, గత ప్రజావాణిలో కూడా కలెక్టర్ సమీక్షించి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ● ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజు కార్యక్రమానికి చెందిన హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన హెల్ప్లైన్ నంబర్స్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి జరీనాబేగం, తదితరులు పాల్గొన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి స్టేషన్ మహబూబ్నగర్: సమాజంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మహిళలు ధైర్యంగా ముందుగా సాగాలని కలెక్టర్ ఖుష్భూ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రం మదీనా మసీద్ప్రాంతంలో గాలిబ్ హాల్లో మెరాజ్ ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదురోజుల ‘సమాత్–ఏ–ఖురాన్ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కట్నం, బాల్య వివాహాలు, బాలికల నిరక్షరాస్యత వంటి సమస్యలు ఇంకా సమాజంలో ఉన్నాయని, మహిళలు విద్యను సాధించి ఈ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఒక కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా వెలుగొందుతుందన్నారు. రంజాన్ మాసం ఐక్యత, సోదరభావం, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం సమాత్–ఏ–ఖురాన్ కార్యక్రమంలో భాగంగా ఖురాన్ పఠనం విజయవంతంగా పూర్తి చేసిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెరాజ్ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ సొసైటీ స్థాపకురాలు అయేషా తఖీయోద్దీన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ, జేబా, ఫర్హతుల్లా, షఫియోద్దీన్ పాల్గొన్నారు. -
పోలీస్, న్యాయశాఖ సమన్వయంతో పనిచేయాలి
● అప్పుడే నిందితులకు శిక్షలు పడతాయి: ఎస్పీ జానకి పాలమూరు/హన్వాడ: ఇటీవల మూడు పోక్సో కేసులతో పాటు ఒక రాబరీ, ఒక అత్యాచార కేసులలో నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడటంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, పోలీస్ సిబ్బందిని సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి సన్మానించడంతో పాటు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో పోలీస్ అధికారులు సేకరించిన బలమైన సాక్ష్యాధారాలు, న్యాయ శాఖ అధికారుల సమర్ధమైన వాదనల వల్ల నిందితులకు కఠిన శిక్షలు పడటం సాధ్యమైందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్, న్యాయ శాఖలు సమన్వయంతో పని చేయడం అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. హన్వాడ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ హన్వాడ పోలీస్స్టేషన్ను సోమవారం సాయంత్రం ఎస్పీ డి.జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, ఇతర కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణపై సమీక్షించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు బాధ్యతగా ఉండాలని, ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సకాలంలో పరిష్కరించాలన్నారు. నేరాల నియంత్రణలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాల గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక
● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ పనులు ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం: 4 టీఎంసీలు మొత్తం విడతలు : 3మంజూరైనవి : రూ.1,400 కోట్లు వ్యయం : రూ.2,945 కోట్లు కొడంగల్ పనులు ప్రారంభమయ్యాయి. స్టేజీ–1 కింద మక్తల్ మండలంలోని కాట్రేవులపల్లి నుంచి ఊట్కూర్ వరకు, స్టేజీ–2 కింద ఊట్కూర్ మండలంలోని బాపూర్ నుంచి కానుకుర్తి వరకు పనులను డిసెంబర్ 2027 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 2 ప్యాకేజీలకు సంబంధించి రూ.2,945 కోట్లతో భూసేకరణ, కాల్వ, పంప్ హౌస్లు, రిజర్వాయర్ల పనులు రాఘవ, మెగా కన్స్ట్రక్షన్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. – శ్రీధర్, ఎస్ఈ, ఇరిగేషన్, మహబూబ్నగర్ -
స్టేజీ–1 పనులు ప్రారంభం..
రూ.4,885 కోట్ల వ్యయంతో కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం పనులను మూడు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. మొదటి విడత కింద రూ.2,945 కోట్ల పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో స్టేజీ–1 (కాట్రేవులపల్లి), స్టేజీ–2 (ఊట్కూరు/బాపూర్), స్టేజీ–3 (జాయమ్మ చెరువు)కి సంబంధించి పంప్హౌస్లు, పైపులైన్ పనులు చేయాలి. ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రూ.1,400 కోట్లు మంజూరు కాగా.. సంబంధిత కాంట్రాక్టర్లు స్టేజీ–1లో భాగంగా మక్తల్ మండలం కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ పనులు ప్రారంభించారు. అదేవిధంగా కాట్రేవులపల్లి, మంథన్గోడు, కాచ్వార్ మీదుగా ఊట్కూరు పెద్దచెరువు వరకు అనుసంధానం చేసేలా ప్రెషర్ మెయిన్ పైపులను కాచ్వార్ వద్ద అందుబాటులో ఉంచారు. -
బైపాస్పై ఆశలు
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన ప్రతి పల్లెకు న్యాయ సేవలు వెళ్లాలి ● చట్టాలపై అవగాహన కల్పించే బాధ్యత పారా లీగల్ వలంటీర్లు తీసుకోవాలి ● న్యాయమూర్తి ఎన్.ప్రేమలత జడ్చర్ల: జడ్చర్లకు బైపాస్ మంజూరుపై ఆశలు చిగురిస్తున్నాయి. జడ్చర్ల పట్టణ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించిన బైపాస్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం పంపే కబురు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న జడ్చర్ల పట్టణం గుండా ప్రయాణం నరకప్రాయంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు జడ్చర్ల దాటితే సరి అన్న ఆందోళనలో ప్రయాణాలు సాగిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం కూడా అడ్డదిడ్డంగా ఉండడంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారులు ఇరుగ్గా ఉన్నాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు.. రహదారుల వెడల్పునకు ఎక్కడా పొంతన లేక అడుగడుగునా ట్రాఫిక్తో నిత్యం సతమతమవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి–44, ఇంకోవైపు ఎన్హెచ్–167తోపాటు రాష్ట్రీయ రహదారులు సైతం పట్టణం నడిబొడ్డుగుండా వెళ్తున్నాయి. వీటికి తోడు రైల్వే మార్గం కూడా ఉండడంతో రాకపోకలు అంత సునాయసంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రైల్వే మార్గం కారణంగా రెండు ప్రాంతాల రాకపోకలు సిగ్నల్గడ్డ వద్ద ఉన్న సింగిల్ బ్రిడ్జి మీదుగా మాత్రమే దాటే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాగే జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఎన్హెచ్–44పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర సైతం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఇలా అనేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి పాలకవర్గాల నుంచి అనుకూల ప్రకటనలు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్తో సతమతం.. జడ్చర్ల మీదుగా ఒక్క హైదరాబాద్కు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర తదితర ఉత్తర, దక్షిణ భారతం వైపు భారీ సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే జడ్చర్ల పట్టణం గుండానే అది కూడా సింగిల్ రోడ్డుగా ఉన్న ఒక చిన్నపాటి రైల్వే వంతెనపైనే రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. కాగా ఇటీవల జాతీయ రహదారి–167 విస్తరణ పనులలో భాగంగా ఒకవైపు సింగిల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయగా.. మరోవైపు బ్రిడ్జి విస్తరణ పనులు నిలిచిపోవడంతో గుంతలమయంగా మారిన రహదారిపైనే రాకపోకలు సాగుతున్నాయి. వనపర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాలకు సైతం ఇదే రహదారి కీలకంగా ఉంది. జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులు సిగ్నల్గడ్డ మీదుగానే సాగుతుండడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీంతో గంటల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రజలు బైపాస్ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా.. జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా ఉంది. అయితే గత బీఆర్ఎస్ పాలనలో బైపాస్ రోడ్డుకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపాదించినా కార్యాచరణ రూపొందలేదు. తాజాగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్గడ్కరీకి ప్రతిపాదించడంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెలాఖరులోగా బిడ్డింగ్ ఓపెన్ చేసి డీపీఆర్ బాధ్యతలను అప్పగించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ నెలాఖరులోగా డీపీఆర్ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జడ్చర్ల బైపాస్తోపాటు జాతీయ రహదారి–167కి సంబంధించి రెండు వరుసలుగా ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలన్న ప్రతిపాదనలకు కూడా డీపీఆర్ చేయనున్నారు. దీనికి సంబంధించి జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారి–167ని అనుసరించి నక్కలబండతండా మీదుగా మల్లెబోయిన్పల్లి, చిట్టింబోయిన్పల్లి మధ్యగా జాతీయ రహదారి–44 మీదుగా మరికల్, నాగసాల గ్రామాల సమీపం నుంచి చర్లపల్లి మీదుగా ఆల్వాన్పల్లి, గంగాపూర్ గ్రామాల పరిధిలోని జాతీయ రహదారి–167ని తాకేలా ప్రతిపాదనలు నివేదించారు. అయితే డీపీఆర్ ఆయా ప్రతిపాదనల మేరకే చేపడుతారా.. మరేమైనా కొత్తవి తెరపైకి వస్తాయా అన్నది వేచిచూడాల్సి ఉంది. డీపీఆర్కు రంగం సిద్ధంతో ముందడుగు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నీ సవ్యంగా జరిగితే జడ్చర్ల మరింత అభివృద్ధి -
7 రోజుల్లో 3,599 మందికి స్క్రీనింగ్
● జిల్లాలో పీహెచ్సీలలో కొనసాగుతున్న ఆరోగ్య వైద్య శిబిరాలు ● స్థానికంగా హైక్వాలిటీ ట్యాబ్లెట్స్ కొరత పాలమూరు: జిల్లావ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి కింద హెల్త్ మిషన్–100 పేరుతో ఈనెల 6 నుంచి వంద రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పీహెచ్సీ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని వయసుల వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సోమవారం నాటికి 9 పీహెచ్సీలలో ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మొత్తం 3,599 మందికి స్క్రీనింగ్ చేశారు. పలు విభాగాల వైద్య నిపుణులు చేస్తున్న పరీక్షల్లో అధికంగా గైనిక్లో రక్తహీనత, రుతుస్రావం, తెల్లబట్ట, కంటిచూపు సమస్యలో శుక్లాల ఇబ్బందులు, చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. దంత సమస్యలు సైతం వైద్యుల దృష్టికి వస్తున్నాయి. మందుల కొరత ఆరోగ్య శిబిరాల్లో పలు రకాల విభాగాల వైద్య నిపుణులు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన ట్యాబెలెట్స్, ఇంజక్షన్స్ రాసిన క్రమంలో ఆయా పీహెచ్సీలలో అలాంటి మందులు స్థానికంగా ఉండటం లేదని తెలుస్తోంది. హైక్వాలిటీ ట్యాబ్లెట్స్ ఇచ్చిన క్రమంలో పీహెచ్సీలలో సాధారణ మాత్రలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న డ్రగ్స్తోనే సరిపెడుతున్నట్లు తెలుస్తోంది. -
ఆస్తి పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో మొత్తం రూ. 51.61కోట్లకు ఇప్పటివరకు రూ.19 కోట్లే వసూలు కావడమేమిటని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని, నిత్యం కనీసం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వసూలు చేయాలని ఆదేశించారు. ఎవరైనా చెల్లించకుంటే రెవెన్యూ చట్టం ప్రకారం వారి ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. అంతకుముందు నగరంలోని బండమీదిపల్లి, హనుమాన్పురా, భగీరథ కాలనీ తదితర ప్రాంతాలలో ఆయనతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కలిసి ఆస్తిపన్ను వసూళ్ల కోసం తిరిగారు. సకాలంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు చెల్లించి నగర అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ అజ్మీర రాజన్న, ఆర్ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య, ఆర్ఐలు రమే ష్, అహ్మద్షరీఫ్, ముజీబుద్దీన్ పాల్గొన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కేజీబీవీలు, యూఆర్ఎస్లు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ విద్యాశాఖలో వివిధ విభాగాల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వారికి తక్కువ వేతనాలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు ఇవ్వాలన్నారు. హెల్త్కార్డులు మంజూరు చేయాలని, గతంతో చేసిన సమ్మే వేతనాలను కూడా ఇవ్వాలని, పీఆర్సీ ప్రకారం ప్రతి ఏడాది రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కోశాధికారి భాస్కర్, కార్యదర్శులు వేణుగోపాల్, అజయ్, హేమంత్కుమార్, జయంతి, ఖాదరయ్య, శ్రీనివాసులు, కనకమ్మ, రాధ, శంకర్, నరేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
నాగర్కర్నూల్ రూరల్: రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం గుడిపల్లి రిజర్వాయర్ను సందర్శించిన ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో నీటిని పూర్తిస్థాయిలో నింపి రైతులకు సకాలంలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయని, మిగిలిన రెండు మోటార్లు కూడా ప్రారంభించాలని సూచించారు. కాల్వ వెడల్పు పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇంజినీర్లు, రాజకీయ నాయకులు కక్కుర్తి వల్ల ప్రాజెక్టు పరిస్థితి దెబ్బతిందని ఆరోపించారు. సాగునీటి మంత్రి పర్యటనలు కేవలం చుట్టపు చూపులు గానే మిగిలిపోతున్నాయని వాఖ్యానించారు. గుడిపల్లి కట్టపై ముళ్లపొదలు, చెట్లు పెరగడం వల్ల ప్రమాదం పొంచి ఉందని అందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శశిధర్రెడ్డి, రవి, బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయురాలి బలవన్మరణం
వనపర్తి రూరల్: మహిళా ఉపాధ్యాయురాలు ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ–2 శశిధర్ తెలిపిన వివరాలు.. న్యూటౌన్ కాలనీకి చెందిన రాకాసి శ్రీదేవి(45) చిన్నంబావి మండలం వెల్గొండ జిల్లా ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయురాలిగి పని చేస్తుంది. కొంత కాలం నుంచి మానసిక వ్యాధిలో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పిల్లలతో బయటికి వెళ్లిన భర్త సత్యనారాయణరెడ్డి ఇంటికి వచ్చి చూడగా ఫ్యానుకు వేలాడుతుండటం చూ సి తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి బాలీశ్వరమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్య
నాగర్కర్నూల్ క్రైం: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలులో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్దన్ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన జరుపటి ఖాజా (39) మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య శనివారం ఉదయం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఖాజా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కూలి పనులకు పిలిచేందుకు ఓ వ్యక్తి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ.. యువకుడి మృతి నాగర్కర్నూల్క్రైం : ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ కొట్టుకోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండల పరిధిలోని వనపట్ల గేటు సమీపంలో ఆదివారం చో టుచేసుకుంది. ఎస్ఐ గోవర్దన్ తెలిపిన వివరా ల ప్రకారం లింగాల మండలం కేసితండాకు చెందిన శ్రీఽశైలం (25), బాలరాజులు సొంత అన్నదమ్ములు. ఇద్దరు హైదరాబాద్లో లేబర్ కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరు కలిసి బైక్పై స్వగ్రామం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొనడంతో శ్రీశైలానికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా ,బాలరాజును హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దైవ దర్శనం ముగించుకొని వెళ్తూ.. జడ్చర్ల: మండలంలోని గంగాపూర్ శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామిని దర్శించుకొని, తిరిగి వెళ్తున్న క్రమంలో గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బంధువుల కథనం మేరకు.. కోయిలకొండ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బొంతల చంద్రమ్మ (27) కుటుంబ సభ్యులతో కలిసి శనివారం గంగాపూర్లోని ఆలయానికి చేరుకున్నారు. అక్కడే నిద్ర చేసిన వారు ఆదివారం ఉదయం స్వామి దర్శనం చేసుకొని, తిరిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్లో వైద్య చికిత్స కోసం జడ్చర్ల ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చంద్రమ్మ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి బిజినేపల్లి: మండలంలోని వట్టెంకు చెందిన వ్యక్తి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాంచంద్రయ్యరాంచంద్రయ్య (62) హైదరాబాద్లోని హైటెక్ సిటీలో పూల దుకాణం నిర్వహిస్తున్నాడు. వట్టెం జాతర ఉత్సవాల సందర్భంగా నాలుగురోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వట్టెం నుంచి బిజినేపల్లి వైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అటుగా వెళ్లిన కొందరు గమనించగా.. రాంచంద్రయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాంచంద్రయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. మనస్తాపంతోమహిళ ఆత్మహత్య జడ్చర్ల: కుటంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బోయలకుంటకు చెందిన యాదమ్మ (42) మూడు రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె ఉరి వేసుకొనిఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.వెంటనే గమనించిన ఆమె కు మార్తె స్వాతి వైద్య చికిత్స కోసం యాదమ్మను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..అప్పటి కే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆ స్పత్రికి వచ్చిన మంత్రి శ్రీహరి మృతురాలి కు మార్తె స్వాతిని ఓదార్చి,అండగా ఉంటామ ని భ రోసానిచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా బ్రిడ్జి సమీపంలో మృతదేహం లభ్యం కృష్ణా: మండలంలోని కృష్ణా బ్రిడ్జి సమీపంలో ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పో లీసులు వచ్చి విచారణ చేపట్టారు. ఈ క్ర మంలో రెండు రోజుల క్రితం మాగనూర్లో స్పృహ కోల్పోయి పడిన నల్లెనాగప్ప(45)గా గుర్తించి జక్లేర్లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తమ్ముడు నల్లె కుర్మయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ నవీద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎరువుల వాడకం– చీడపీడల నివారణ
అలంపూర్ : పంటల సాగులో అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం ముఖ్యమైంది. అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దేశంలో ఎరువుల వాడకం తక్కువగా ఉన్నప్పటికి పోషకాల సమతుల్యత సమగ్ర ఎరువుల వాడకం పాటించకపోవడం సమస్యగా మారిందని ఏడీఏ సక్రియనాయక్ పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో దేశ జనాభాకు తగ్గట్టుగా ఆహార ధాన్యాలు అవసరమవుతాయి కాబట్టి ఆహార ఉత్పత్తిలో సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. సమతుల ఎరువుల వాడకం : పైరుకు కావాల్సిన పోషకాలు ఎక్కువ.. తక్కువ కాకుండా అవసరమైన మేరకు అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండే విధంగా అందించ డాన్ని సమతుల ఎరువుల వాడకం అంటారు. దీని పై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో నత్రజని వినియోగం అధికమై మిగిలిన పోషకాలను మొక్కలకు అందించడంలో రైతులు అశ్రద్ధ చేస్తున్నా రు. దీని వలన నేల ఫలదత తగ్గిపోవడం, చౌడు బారడం, పైర్లు చీడపీడలకు సులభంగా గురికావడం వంటి పరిణామాలు కనిపిస్తాయి. కనుక భూసార పరీక్షల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను సరిపడా మోతాదులో వాడాల్సి ఉంటుంది. సమగ్ర ఎరువుల వాడకం : రసాయన, సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా తగిన రీతిలో పైర్లకు పోషకాలు అందించడాన్ని సమగ్ర ఎరువుల వాడకంగా పేర్కొంటారు. పైరుకు సిఫార్సు చేసిన పోషక మోతాదులో మూడింట రెండు వంతులు రసాయన ఎరువుల ద్వారా ఒక వంతు సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించినప్పుడు దీర్ఘకాలం పాటు భూసారం, ఫలదతతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రసాయన ఎరువుల ద్వారా ముఖ్య పోషకాలు, సేంద్రియ ఎరువుల ద్వారా అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో లభ్యమవుతాయి. జీవన ఎరువులు గాలి నుంచి నత్రజని, నేల నుంచి భాస్వరం అందించడానికి దోహదపడటమే కాక మొక్కలకు కావాల్సిన హార్మోన్లు, ఏంజైములు అందించడానికి రసాయన ఎరువుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించుకోవడానికి తోడ్పడతాయి. పాడి–పంట -
ముస్లింలకు వరం హజ్యాత్ర
● ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి 251 మంది ఎంపిక ● మహబూబ్నగర్ నుంచి అధికంగా 180 మంది ● కొనసాగుతున్న హజ్ యాత్రికుల శిక్షణ శిబిరాలు స్టేషన్ మహబూబ్నగర్: ముస్లింలు పవిత్రంగా భావించే హజ్యాత్రకు ప్రాముఖ్యత పెరగడంతో ధనికుల నుంచి పేదవారు కూడా హజ్ యాత్రకు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా హజ్ యాత్ర చేయాలని పవిత్ర ఖురాన్లో పేర్కొనబడినందున గ్రామీణ ప్రాంతాలకు చెందిన ముస్లింలలో సైతం హజ్యాత్ర చేయాలనే ఆకాంక్ష పెరుగుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా హజ్యాత్ర చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి 251 మంది ప్రయాణం.. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి 251 మంది ముస్లింలు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్యాత్రకు వెళ్తున్నారు. వీరిలో మహబూబ్నగర్ జిల్లా నుంచి అధికంగా 180 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. అదే విధంగా వనపర్తి నుంచి 35, నాగర్కర్నూల్ నుంచి 9, నారాయణపేట నుంచి 10, గద్వాల నుంచి 17 మంది హజ్కు యాత్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మరి కొంతమంది హజ్కు వెళ్లే అవకాశం ఉంది. యాత్రికులకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు... ఇస్లామిక్ సంవత్సరంలోని ‘జిల్హజ్జా’ మాసంలో మక్కా, మదీనా తదితర పుణ్యక్షేత్రాల్లో పాటించాల్సిన నియమాలు, నిబంధనల పట్ల హజ్ యాత్రికులకు అవగాహన కల్పించడానికి జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. మతపెద్దలను ఆహ్వానించి హజ్ యాత్రలో పాటించాల్సిన నియమ, నిబంధనలు, ప్రసిద్ద స్థలాల ప్రాశస్త్యాలను వివరించి అవగాహన కల్పిస్తారు. కొనసాగుతున్న శిక్షణా శిబిరాలు ప్రస్తుతం జిల్లాలో హజ్యాత్రీకుల శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. మతపెద్దలతో హజ్యాత్రపై యాత్రీకులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ విధానంలో హజ్ గురించి సమగ్రంగా వివరిస్తారు. అలాగే హజ్ యాత్రలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పిస్తారు. ఇప్పటి వరకు మూడు శిక్షణా శిబిరాలు పూర్తి కాగా మరో మూడు శిబిరాలతో పాటు చివరి శిబిరంలో టీకాల క్యాంపు ఏర్పాటు చేస్తారు. -
ఓపెన్ స్కూల్తో ఉజ్వల భవిష్యత్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని యూనివర్సిటీ ఈఎంఆర్ఆర్ డైరెక్టర్ రబీంద్రనాథ్ సోలమాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం టీసీఎస్ ఐయాన్ జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు టీసీఎస్ సహకారంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులను కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా తయారు చేస్తామని.. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీస్ వింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యేలోగా కమ్యూనికేన్ స్కిల్స్, పలు అంశాలపై అవగాహన పెంచుతామన్నారు. వియ్ హబ్, రాస్కీ, రామానంద తీర్థ ఇనిసిట్యూషన్స్ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. విద్యార్థులు వాటిని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి వేణుగోపాల్రెడ్డి, నిరంజన్గౌడ్, రాఘవేందర్రెడ్డి, హన్మంతు, వెంకటేశ్ పాల్గొన్నారు. -
నల్లమల పండితుడి అరుదైన ఘనత
అచ్చంపేట రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మగిరి వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో నిర్వహించిన శ్రీవేంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో నల్లమల ప్రాంతానికి చెందిన మద్దిమడుగు దేవస్థానం ప్రధాన అర్చకుడు వీరయ్య శాస్త్రి కుమారుడు డాక్టర్ ఎస్.ఎస్. శివప్రసాద్శర్మ ఉత్తరభాగ శాస్త్రపరీక్షలో విజయాన్ని సాధించారు. వేద, శాస్త్ర, ఆగమ విద్యల అభివృద్ధి కోసం 1969లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పండితుల పాండిత్యాన్ని కఠిన పరీక్షల ద్వారా పరిశీలించి ఉత్తీర్ణులైన వారికి పట్టాలు ప్రదానం చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు 13 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 6 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో డాక్టర్ శివప్రసాద్శర్మ ఒక్కడే ఉత్తీర్ణత సాధించడం ప్రత్యేకతగా నిలిచింది. గత నలభై సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో ఉత్తరభాగ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారు కేవలం కొద్ది మందే ఉండటం, అందులో ఆయన సాధించిన విజయం విశేష ప్రాధాన్యం పొందింది. ఈ సందర్భంగా శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతి స్వామిజీ చేతుల మీదుగా ఆయనకు ప్రమాణపత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఘనతను పొందిన రెండో పండితుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి పండితుడిగా నిలిచిన డాక్టర్ శివప్రసాద్ శర్మను నల్లమల ప్రాంతంలోని పలువురు అభినందనలు తెలియజేశారు. -
నల్లమల.. అగ్నికీల
● వేసవిలో తరచుగా కార్చిచ్చు ● అగ్నికి ఆహుతి అవుతున్న అటవీ సంపద ● ప్రశ్నార్థకంగా మారుతున్న జీవవైవిధ్యం ● ఈ ఏడాది నెల రోజుల్లోనే 50 అగ్ని ప్రమాదాలు అచ్చంపేట: ఆకులు రాలే కాలానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తోడవ్వడంతో నల్లమల అటవీ ప్రాంతం భగ్గుమంటోంది. నిత్యం ఏదో ఒకచోట కార్చిచ్చు రాజుకుంటోంది. వందలాది ఎకరాల అటవీ ప్రాంతం అగ్ని కీలగా మారుతోంది. ప్రతి ఏటా వేసవిలో ఈ తంతు పరిపాటిగా మారింది. 2,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అడవుల్లో గడ్డిక్షేత్రాలు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఎక్కడ చిన్న అగ్గి రాజుకున్నా అడివంతా విస్తరిస్తోంది. వన్యప్రాణులతో పాటు వృక్ష సంపదకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 7.73 లక్షల ఎకరాల్లో అటవీ భూమి విస్తరించి ఉంది. ఇందులో కేవలం నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల ప్రాంతమే 6.17 లక్షల ఎకరాలు ఉంది. ఈ ఏడాది నెలరోజుల వ్యవధిలోనే దోమలపెంట, అమ్రాబాద్, కొల్లాపూర్, లింగాల అటవీ పరిసరాల్లో మొదలైన కార్చిచ్చును ఆపడం సిబ్బందికి శక్తికి మించిన పనిగా మారింది. ఒకచోట మంటలను ఆర్పితే.. మరుసటి రోజు మరో చోట మంటలంటుకుంటున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరిన్ని అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నల్లమల అడవిలో ఎండిన గడ్డి, ఎండిన చెట్లు, వెదురు కర్రలు అధికంగా ఉంటాయి. అడవి జంతువులు పరుగెత్తే సమయంలో రాళ్లకు రాళ్లు తగిలి నిప్పురవ్వలు వచ్చి క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తున్నాయి. అదే విధంగా నారవేప, దేవదారు, నల్లమద్ది వంటి చెట్ల కొమ్మలు ఒకదానికొకటి తాకడం వల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉంది. కాగా, సహజ సిద్ధంగా ఏర్పడే మంటలను మినహాయిస్తే.. 70–80 శాతం అగ్ని ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యమే కారణమని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారి వెంట దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. మన్ననూర్ నుంచి వట్టువర్లపల్లి, దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగా, శ్రీశైలం వెళ్లే యాత్రికులు, పర్యాటకులు, ఇతరులు రోడ్డు పక్కన, అటవీ ప్రాంతంలో నిప్పు రగిల్చి సక్రమంగా ఆర్పకపోవడం.. సిగరెట్లు, బీడీలు తాగి పడే యడం వంటి వాటితో పాటు అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లినవారు మంటలు పెట్టి ఆర్పకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు అని అటవీ అధికారులు చెబుతున్నారు. 2023లో 4,450 హెక్టార్ల అడవిలో మంటలు చెలరేగాయి. 2024లో అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అచ్చంపేట డివిజన్లో 382, అమ్రాబాద్లో 989, నాగర్జునసాగర్ పరిధిలో 7 బ్లాక్ల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2025లో నల్లమల అటవీ ప్రాంతంలో 1,026 హెక్టార్లలో అగ్ని ప్రమా దాలు చోటు చేసుకున్నాయి. ఈఏడాది ఇప్పటి వరకు 50 ప్రాంతాల్లో అగ్రి ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు శాటిలైట్ వివరాలు చెబుతున్నాయి. -
భారతదేశం వేదభూమి
బిజినేపల్లి: వేల ఏళ్లు విదేశీయులు భారతదేశంపై దాడిచేసి పరిపాలించినా, హిందూ సంస్కృతి చెక్కు చెదరలేదని, భారతదేశం వేద భూమి అని భువనేశ్వరి పీఠం పీఠాధిపతి శ్రీకమలానంద భారతిస్వామి అన్నా రు. ఇలాంటి భరత భూమిపై జన్మించడం అంటే ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలన్నారు. ఆదివారం పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతిస్వామి మాట్లాడుతూ.. హిందూ అంటేనే నాగరికత అని, హిందువులు భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారన్నారు. హిందుత్వం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. ఆల యాలు కేవలం నిర్మాణాలే కాదని, అవి మన నాగరికతకు ఆత్మ అని నేటి తరానికి మనం గుర్తు చేయాలన్నారు. మనుషులు దుర్గుణా లను వదిలి సన్మార్గంలో నడిచినప్పుడే ఆధ్యాత్మికత పెంపోందు తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు జున్న శేఖర్రెడ్డి, జగదీష్, డా.గోపాల్, జాకీర్హుస్సేన్, విష్ణుమూర్తి, గాడి శశికల, సురేందర్, భక్తులు పాల్గొన్నారు. -
అడ్డాకులకు మార్కెట్ యార్డు
అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లాకు మరో వ్యవసాయ మార్కెట్ యార్డు మంజూరైంది. దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకులలో మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేవరకద్ర నియోజకవర్గంలో దేవరకద్రతోపాటు ప్రస్తుతం వనపర్తి జిల్లా పరిధిలో ఉన్న మదనాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. తాజాగా అడ్డాకులకు మార్కెట్ యార్డు మంజూరు కోసం ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆ సంఖ్య మూడుకు చేరనుంది. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అడ్డాకులలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో ఇటీవల ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లోని రైతులు పండించిన ధాన్యం సులువుగా విక్రయించుకునే సౌకర్యం ఈ మార్కెట్ యార్డు ద్వారా కలగనుంది. రైతుల సౌలభ్యం కోసమే.. దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మార్కెట్ యార్డుకు అడ్డాకుల, మూసాపేట మండలాలు అనుసంధానంగా ఉండేవి. అదేవిధంగా బాదేపల్లి మార్కెట్ యార్డుకు నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం అనుసంధానంగా ఉంది. అయితే అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని రైతులు తమ ఉత్పత్తులను మదనాపురం తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి సౌలభ్యం కోసం దేవరకద్ర నియోజకవర్గానికి మరో మార్కెట్ యార్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అడ్డాకులలో మార్కెట్ యార్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటయ్యే కొత్త మార్కెట్ యార్డు అడ్డాకులదే కావడం విశేషం. మూడు మండలాలతో..! అడ్డాకుల మార్కెట్ యార్డు పరిధిలో అడ్డాకులతోపాటు మూసాపేట, భూత్పూర్ మండలాలను కలిపారు. భూత్పూర్ మండలాన్ని బాదేపల్లి మార్కెట్ యార్డు నుంచి, అడ్డాకుల, మూసాపేట మండలాలను మదనాపురం మార్కెట్ యార్డు నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పాటు చేసే అడ్డాకుల మార్కెట్ యార్డులో చేర్చారు. అడ్డాకుల శివారులోని సర్వే నంబర్ 161లోని ఆరున్నర ఎకరాల స్థలంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మార్కెట్ యార్డు ఏర్పాటైతే రైతుల ఉత్పత్తుల విక్రయాలు సులభతరం కావడంతోపాటు హమాలీలు, ఇతర కూలీలకు ఇక్కడ ఉపాధి కలగనుంది. రైతులకు ఎంతో మేలు.. దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తగా అడ్డాకులకు మార్కెట్ యార్డును మంజూరైంది. దీంతో మూడు మండలాల రైతులకు ఈ మార్కెట్తో ఎంతో మేలు జరగనుంది. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు సులభతరం కావడంతోపాటు హమాలీలు, కూలీలకు స్థానికంగా ఉపాధి కలుగుతుంది. రైతుల ఉత్పత్తులకు మంచి ధర కూడా లభించనుంది. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందనడానికి ఇదే నిదర్శనం. అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ రైతులకు ప్రయోజనం బాదేపల్లి, మదనాపురం నుంచి పై మూడు మండలాల తొలగింపు ఫలించిన ఎమ్మెల్యే కృషి.. రైతన్నల హర్షం అడ్డాకుల మండలంలోని గుడిబండ, కాటవరం, కందూరు, అడ్డాకుల, చిన్నమునుగల్ఛేడ్, కన్మనూర్, ముత్యాలంపల్లి, పెద్దమునుగల్ఛేడ్, రాచా ల, తిమ్మాయిపల్లి, శాఖాపూర్, వర్నె, బలీదుపల్లి, పొన్నకల్, తిమ్మాయిపల్లి తండా, రాంచంద్రాపూ ర్, సుంకరామయ్యపల్లి గ్రామాలున్నాయి. మూసాపేట మండలంలోని నందిపేట, దాసర్పల్లి, తుంకినీపూర్, వేముల, మూసాపేట, నిజాలాపూర్, జానంపేట, అచ్చాయపల్లి, కొమి రెడ్డిపల్లి, చక్రాపూర్, కనకాపూర్, పోల్కంపల్లి, తిమ్మాపూర్, సంకలమద్ది, మహ్మదుస్సేన్పల్లి. భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్, అమిస్తాపూర్, గోప్లాపూర్, భూత్పూర్, హస్నాపూర్, కప్పెట, కర్వెన, కొత్త మొల్గర, కొత్తూరు, మద్దిగట్ల, పోతులమడుగు, రావులపల్లి, తాటికొండ, తాడిపర్తి, ఎల్కిచర్ల ఉన్నాయి. -
జన గణన–2027 అత్యంత కీలకం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు, దేశాభివృద్ధికి జన గణన–2027 అత్యంత కీలకం అని అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జన గణన–2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజు ల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో జన గణన –2027 సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జన గణన రెండు దశల్లో కొనసాగుతుందని, మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్ లిస్టింగ్, హౌస్ ఎన్యుమరేషన్), గృహాల గణన కాగా.. రాష్ట్రంలో ఈ దశ మే 11న ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుందన్నారు. రెండో దశలో జనాభా గణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమై.. మార్చి 1న రిఫరెన్స్ తేదీగా పరిగణి స్తారని చెప్పారు. ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధాన ంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ను ఉపయోగించి గణన చేపట్టాలని సూచించారు. అలాగే ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి ముందు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరిస్తారన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి రవీందర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చార్జి అధికారులుగా గ్రామీణ ప్రాంతంలో తహసీల్దార్, పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్, కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ ఉంటారన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్పై దృష్టి ఏది?
● ఆరు రోజుల్లో 322 మంది బాలికలకు టీకాలు పాలమూరు: జిల్లాలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు ఇస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. బాలికల తల్లిదండ్రులు వారి పిల్లలకు టీకాలు వేయించడంపై ఆసక్తి చూపడం లేదా.. లేక ఆరోగ్య శాఖ అధికారులు ప్రచారం చేయడంలో వెనుకబడ్డారా.. అనేది అంతుచిక్కడం లేదు. క్షేత్రస్థాయిలో అర్హులైన బాలికలను గుర్తించి కౌన్సిలింగ్ కల్పించి టీకాలు తీసుకునే విధంగా చైతన్యం కల్పించడంలో ఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తిగా విఫలం అవుతున్నారు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మొదటి నెలరోజులపాటు జనరల్ ఆస్పత్రితోపాటు జడ్చర్ల ఆస్పత్రిలో టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 322 మంది బాలికలకు టీకాలు ఇస్తే ఇందులో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో 154, జడ్చర్లలో 168మందికి ఇచ్చారు. జిల్లాలోని ఆయా ఆస్పత్రుల్లో బాలికలకు టీకాల పంపిణీ ఇలా.. తేదీ మ.నగర్ జడ్చర్ల 08.3.2026 21 35 09.3.2026 07 06 10.3.2026 34 44 11.3.2026 13 34 12.3.2026 36 25 13.3.2026 28 6 -
మహనీయుల ఆశయ సాధనే బీసీ జాగృతిసేన లక్ష్యం
కందనూలు: మహనీయుల ఆశయసాధనే బీసీ జాగృతి సేన లక్ష్యమని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్లో మహానీయుల నెల సందర్భంగా పూలె, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ .. పేదప్రజల బతుకుల్లో అక్షర జ్యోతి వెలిగించిన పూలె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివిన తర్వాత గొప్పగా జీవించే అవకాశం ఉన్నా షెడ్యూల్ కులాల ప్రజలతో పాటు దేశ ప్రజలకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కల్పించారన్నారు. కార్యక్రమంలో బీసీ జాగృతిసే రాష్ట్ర కార్యదర్శి రఘునందన్చారి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నిరంజన్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు
నారాయణపేట రూరల్: జీవితంలో కొన్ని క్షణాలు మనసును బరువెక్కిస్తాయి. కానీ బాధను మించిపోయే బాధ్యతలు కూడా ఉంటాయి. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. తాత మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగినా.. చదువుపై ఉన్న నిబద్ధతతో మనవడు పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట మండలం జలాల్పూర్కు చెందిన అరవింద్ జిల్లా కేంద్రంలోని హంసవాహిని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కావడంతో అతడు కూడా పరీక్షకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడి తాత భీంశప్ప (70) తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న తాత మృతితో అరవింద్ కూడా తీవ్రంగా కలత చెందాడు. అయితే తన భవిష్యత్కు ఎంతో ముఖ్యమైన పదో తరగతి పరీక్షను వదులుకోకూడదని భావించాడు. గుండెల్లో తాత జ్ఞాపకాలతోనే కన్నీరు తుడుచుకుంటూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కేటాయించిన పరీక్షా కేంద్రంలో తెలుగు పరీక్షకు హాజరయ్యాడు. పుట్టెడు దుఃఖంలోనే పరీక్షను పూర్తిచేశాడు. అనంతరం తాత భీంశప్ప అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకావిష్కరణ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సంచార, వియుక్త జాతుల జీవన విధానం, సామాజిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర అధ్యయనానికి సంబంధించి ‘సంచార జాతుల సమగ్ర సమాచారం’ అనే పుస్తకాన్ని పీయూలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ సంచార జాతుల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన ముఖచిత్రాన్ని ప్రతిబించే ఈ పుస్తకం విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు సోమేశ్వర్, చంద్రశేఖర్రెడ్డి, వేణు, రవీందర్రెడ్డి, రాఘవేందర్, నాగరాజు, నిరంజన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలకు సాగునీరందేలా చూడాలి
కందనూలు: నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, కాలువల ద్వారా నీరందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంట పొలాలకు నీటి కొరత లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మూడు కిలోమీటర్ల మేర పనులు పూర్తయితే దాదాపు 57 టీఎంసీల నీరు నిల్వ ఉండేదన్నారు. వాటిపై శ్రద్ధ పెట్టకుండా ప్రభుత్వ పెద్దలు అలసత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి నాగర్కర్నూల్ జిల్లా సస్యశ్యామలం చేయాలని లేకపోతే ఏడారి అయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ తిమ్మాజీపేట పాండు, నాయకులు అర్థం రవి, తదితరులు పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ!
రాజాపూర్(బాలానగర్): రోడ్డుప్రమాదాల నివారణకు జాతీయ రహదారి పైనున్న గ్రామాల ముఖ్య కూడళల్లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆగుతూ.. సాగుతున్నాయి. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.22కోట్ల నిఽ దులు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 2024సెప్టెంబర్లో పనులను ప్రారంభించారు. రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ నత్తనడకన సాగిస్తుండటంతో ప్రతిరోజూ బాలానగర్ మండల కేంద్రంలో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం బాలానగర్ మండల కేంద్రంలో వారాంతపు సంత నిర్వహిస్తుండంతో గ్రామప్రజలు సంతలో కూరగాయలు కొనుగోలు చేయాలన్నా రోడ్డు దాటాల్సిన పరిస్థితి. వంతెన పనులు సాగుతుండటంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులు, గృహ యజమానులు పనులు పూర్తికాక పోవడంతో వాహనాల ధాటికి దుమ్ము, ధూళీ పడుతుండటంతో ఇంకా ఎన్నిరోజులో ఈ అవస్థలు అంటు ఆవేదన చెందుతున్నారు. ఒక్కోరోజు పెద్దాయపల్లి వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అవుతోంది. ఇంకా ఎన్ని నెలలు పడుతుందో ఈ పనులు పూర్తికావడానికి అని వాహనదారులు, ప్రజలు ఆపిస్తున్నారు. కొన(సాగు)తున్న బాలానగర్ ఫ్లైఓవర్ పనులు మండల కేంద్రంలో రోడ్డు దాటేందుకు జనం ఇక్కట్లు రెండేళ్లు కావస్తున్నా పూర్తికాని ఫ్లైఓవర్ నిర్మాణం పనులు -
కోతులను తరిమేందుకు కొండముచ్చు వేషధారణ
అచ్చంపేట రూరల్: మండలంలోని సింగారం గ్రామస్తులను కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడద తప్పించేందుకు గ్రామ సర్పంచ్ నీలం శేఖర్ వినూత్న ఆలోచన చేశారు. గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ జగన్తో కొండముచ్చు వేషధారణ వేయించి.. గ్రామం నుంచి కోతులను తరిమే ప్రయత్నం చేశారు. వింత వేషధారణ చూసిన కోతులు.. కొంత వరకు ఆందోళనకు గురై చెట్లపైకి పరుగులు పెట్టాయి. కోతులు మైదాన ప్రాంతం, గ్రామాల్లోకి వచ్చి పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లలో వండిన ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నాయి. కోతుల బెడద నుంచి తప్పించి శాశ్వత పరిష్కరం చూపాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇరాన్పై యుద్ధాన్ని ప్రధాని ఖండించాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: ఇరాన్ దేశంపై అమెరికా దురహంకార ధోరణితో యుద్ధం చేస్తుందని, యుద్ధాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ వివిధ దేశాలపై అమెరికా చూపుతున్న దురహంకారాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని ప్రధాని నరేంద్రమోదీ ఖండించడంతో పాటు చొరవ తీసుకొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇరాన్లో ఉన్న నిల్వలను అమెరికా కొల్లగొట్టేందుకు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుందని ఇరాన్పై దాడి చేసి ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పాఠశాలపై దాడి చేసి 150 మంది విద్యార్థులను అమెరికా పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇండియాలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. 15 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసినా పంపిణీ జరగడం లేదన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. ఇజ్రాయిల్, అమెరికా దేశాలు ఇరాన్పై చేస్తున్న యుద్దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులు, బడుగు బలహీన వర్గాలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ వీబీజీ రాంజీ చట్టాన్ని తెచ్చిందని, రాష్ట్రాలపై భారాన్ని మోపుతూ ఉపాధి కూలీల పొట్టకొట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వన సంఘాన్ని ఎన్నుకున్నారు. చైర్మెన్గా డాక్టర్ మధుసూదన్రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్, కోశాధికారిగా ఎ.రాములు, ఉమ్మడి జిల్లా వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వాన సంఘానికి ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.సాగర్, సభ్యులు జయలక్ష్మి, భూపాల్, రాష్ట్ర మహిళా కన్వీనర్ బి.పద్మ, నాయకులు కిల్లెగోపాల్, ఎండీ జబ్బార్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులది గొప్ప కళా నైపుణ్యం
నారాయణపేట: కంచి వస్త్రాలతో గద్వాల, నారాయణపేట చీరలు డిమాండ్లో పోటీ పడుతున్నాయని.. చేనేత కార్మికులది గొప్ప కళా నైపుణ్యమని.. ఇక్కడ నేచిన చీరలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం మండలంలోని కోటకొండలో చేనేత కార్మికులకు చేనేత మగ్గాలు, ఇతర పరికరాల మొదటి విడత పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేసి మాట్లాడారు. చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్రం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కోటకొండను హ్యాండ్లూమ్ క్లస్టర్గా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు రూ.కోటి రెండు లక్షల నిధులతో చేనేత పరికరాలను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మొదటి విడతలో 70మంది చేనేత కార్మికులకు వచ్చిన పరికరాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే రెండో విడతలో పరికరాలు వస్తాయన్నారు. చేనేత కార్మికులు మరింత ఆర్థికంగా స్థిరపడతారన్నారు. జక్కడ్లు, ఇతర పనిముట్లు ఉపయోగించుకొని చేనేత కార్మికులు లబ్ధి పొందితే కేంద్రం లక్ష్యం నెరవేరుతుందన్నారు. నారాయణపేట, గద్వాల చీరలు పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నాయన్నారు. చేనేత వస్త్రాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందన్నారు. చేనేత కార్మికులందరూ ఎప్పటికప్పుడు కొత్తకొత్త డిజైన్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు. సరికొత్త డిజైన్లతో మార్కెట్తో పోటీపడి డిమాండ్ పెంచుకోవాలన్నారు. అలాగే మార్కండేయ స్వామి కమ్యూనిటీ హాల్పై మరో అంతస్తు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి తప్పకుండా సహకరిస్తాన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రతంగ్పాండురెడ్డి, శ్రీనివాస్, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్, కెంచె శ్రీనివాస్, హ్యాండ్లూం అధికారి బాబు తదితరులు పాల్గొన్నారు. -
భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
కృష్ణా: మండలంలోని ముడుమాల్ గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కురువ హన్మేష్(27) అదే గ్రామానికి చెందిన తాయమ్మలు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలను ఒప్పించి 2017లో వారు పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. హన్మేష్ వృత్తి రీత్యా గొర్రెలను కాచేందుకు అడవికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న హన్మేష్ నెలరోజుల క్రితం భార్యను, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హెచ్చరించాడు. అయినా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో మానసిక వేధనకు గురై శుక్రవారం మధ్యాహ్నం పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో హన్మేష్ మృతికి కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని, ఆ తర్వాతే మృతదేహాన్ని ఖననం చేస్తామని మృతుడి కుటుంబ సభ్యులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ నవీద్ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని, నిందితుడిపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించిన వారు మృతదేహాన్ని ఖననం చేసేందుకు అంగీకరించారు. ● ప్రేమించి పెళ్లి చేసుకున్న మోసం చేసిన వైనం ఖననం చేసేందుకు కుటుంబ సభ్యుల నిరాకరణ -
దుమ్ము క్లీన్ చేయలేకపోతున్నాం
ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి విపరీతమైన దుమ్ము ధూళీ షాప్లోకి వస్తుంది. షాప్లో ఉన్న వస్తువులపై దుమ్ము క్లీన్ చేసిచేసి చస్తున్నాం. వినియోగదారులు వస్తువులు కొనుగోలుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ఎప్పుడు పూర్తవుతాయో ఇంకా ఎన్నిరోజులు మాకి సమస్యలు. – కట్ట అనుషా, సూపర్ మార్కెట్ నిర్వాహకురాలు, బాలానగర్ ట్రాఫిక్తో ఇబ్బందులు తప్పడంలేదు ఫ్లైఓవర్ పనులు మొదలయినప్పటి నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు షాద్నగర్ వెళ్లాలంటే బ్రిడ్జి పనుల మూలంగా ఇటు పెద్దాయపల్లి చౌరస్తావరకు వాహనాలు నిలుస్తున్నాయి. అటు పోలీస్టేషన్ పెట్రోల్ బంక్ వరకు వాహనాలు ఆగుతున్నాయి. కాంట్రాక్టర్ పనులను త్వరగా పూర్తి చేస్తే బాగుటుంది. – నవీన్రెడ్డి, శేరిగూడ, బాలానగర్ ● -
లారీ, బైక్ ఢీకొని ఒకరి దుర్మరణం
కృష్ణా: లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన కృష్ణా మండలం టైరోడ్డులో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నవీద్ వివరాల మేరకు.. కర్ణాటకలోని ఇబ్రహీందొడ్డి గ్రామానికి చెందిన ఖతల్ (50), మరో వ్యక్తి బైక్పై వస్తుండగా.. టైరోడ్డు వద్ద ప్రమాదవశాత్తు లారీ, బైక్ డీకొన్నాయి. ప్రమాదంలో ఖతల్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. గాయపడిన వ్యక్తిని రాయచూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని వృద్ధుడి మృతి కల్వకుర్తి రూరల్: మండలంలోని తర్నికల్ గేట్ సమీపంలో శనివారం కారు ఢీకొట్టిన ఘటనలో అదే గ్రామానికి చెందిన మంగలి ఎల్లప్ప(80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన ఎల్లప్ప మోకాళ్ల నొప్పుల మందుల కోసం కల్వకుర్తికి వెళ్లి తిరిగి వస్తూ సుమారు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తర్నికల్ స్టేజి వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా నాగర్కర్నూల్ నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లింగమ్మ, ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చేపల వేటకు వెళ్లి.. శవమై తేలాడు నాగర్కర్నూల్ క్రైం: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకోగా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని బొందలపల్లి గ్రామానికి చెందిన గుంటి గిరి(42) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని నల్లకుంట చెరువులో చేపల పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతదేహం శనివారం ఉదయం నీటిపై తేలియాడటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య నవాబుపేట: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మరికల్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నడిమింటీ శేఖరయ్య (59) భార్య అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా బాధపడేవాడు. ఈ క్రమంలో శనివారం తన వ్యవసాయ పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. వివాహిత ఆత్మహత్య ఉప్పునుంతల: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉప్పునుంతల బీసీ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్రెడ్డి వివరాల మేరకు.. బీసీ కాలనీకి చెందిన మెడమోని శిరీష (28) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై తన వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త మల్లేష్ హైదరాబాద్లో బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తండ్రి పర్వతాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 60 ఏళ్ల వృద్ధురాలు నేత్రదానం భూత్పూర్: మండలంలోని కర్వెనకు చెందిన వడ్డె వెంకటమ్మ(60) శనివారం అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న జూనియర్ రెడ్క్రాస్ కో–ఆర్డినేటర్ కందుకూర్ అశోక్కుమార్ వారి కుటుంబ సభ్యులను సంప్రందించారు. కందుకూర్ అశోక్కుమార్ వడ్డె వెంకటమ్మ కుమారుడైన వడ్డె నర్సింహతో మాట్లాడి నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చారు. వడ్డె వెంకటమ్మ నేత్రాలను హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్కు దానం చేశారు. నేత్రదానం చేయుటకు ముందుకొచ్చిన వడ్డె నర్సింహను సర్పంచ్ మాసగౌడ్, ఉపసర్పంచ్ మల్లేశ్, వార్డు సభ్యుడు శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ కందుకూర్ అశోక్ కుమార్ అభినందించారు. -
తూకం తప్పుతోంది!
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ● వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలను తెలుసుకోవాలి ● కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి ● వినియోగదారుడికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన తప్పనిసరి ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వినియోగించే ప్రతి వస్తువులోనూ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తాగే పాల దగ్గర నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వినియోగించే మందుల వరకు ప్రతీది కల్తీయే. ప్రతి వస్తువు సరైన తూకంలో లభిస్తున్నాయా అంటే అనుమానమే. కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రశ్నించేతత్వం లేనంత వరకు ఈ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికై నా వినియోగదారులు మేల్కొని తప్పును నిలదీయాలి. మోసాన్ని వేలెత్తిచూపి.. జరిగిన నష్టానికి న్యాయం పొందాలి. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – పాలమూరు రూ.5 లక్షల వరకు ఉచితం వినియోగదారుల హక్కుల ఫోరం ఉమ్మడి జిల్లాలో 1988 అక్టోబర్లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు, ఒకరు సభ్యులు ఉన్నారు. పరిపాలన కోసం ప్రత్యేక విభాగంతో పాటు ఒక కోర్టు కూడా అందుబాటులో ఉంది. వచ్చిన వినియోగదారుల కేసుల నమోదు చేసుకోవడం కోసం ప్రత్యేక భవనం ఉంది. ● జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు.రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. ● వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత సదరు వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ వన్సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన కోసం 08542-245633 నంబర్కు ఫోన్ చేయాలి. టోల్ఫ్రీ నంబర్లు.. 1800 425 003331967పౌర సరఫరాల శాఖతెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హెల్ప్లైన్ నంబర్ 1800 11 4000, 1915జాతీయ వినియోగదారులహెల్ప్లైన్ ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగ ఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు. వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్,టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణ, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల వల్ల వినియోగదారులు నష్టపోతే ఇలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది. ● సురక్షిత ఆహారం లేక.. నాణ్యత వస్తువులు లభించక దాదాపు 200 రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఒకవైపు ప్రజల ఆర్యోగంపై కల్తీ జరుగుతుంటే మరోవైపు నాణ్యత లేని వస్తువలను వినియోగదారులకు అంటగడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వినియోగదారులు మోసపోవడంతో పాటు కల్తీ బారిన పడుతున్నారు. ఒక్క ఆహార వస్తువుల్లో మాత్రమే కాదు... ఎలక్ట్రానిక్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇలా ప్రతి దాంట్లో వినియోగదారుడిని మోసం చేయాలనే భావన స్పష్టంగా కన్పిస్తోంది. చాలా వరకు వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపోయిన కోర్టును ఎలా ఆశ్రయించి న్యాయం పొందాలనే విషయంపై అవగాహన లేక విరమించుకుంటారు. మరికొందరు సమయం వృథా అవుతుందనే భావనతో మోసపోయినా ఊరుకుంటారు. కానీ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకుంటే నాణ్యత లోపం ఉంటే తప్పక కోర్టుకు వెళ్లవచ్చు. నాణ్యతపై ప్రశ్నిద్దాం..!‘నగరానికి చెందిన చంద్రశేఖర్, సుమిత్ర దంపతులతో పాటు వారి పిల్లలు కలిసి 2008 నవంబర్ 26న రూ.21,250తో టీటీడీలో శ్రీవారి మేల్ చాట్ వస్త్ర సేవ టికెట్లు బుక్ చేసుకున్నారు. అప్పటి నుంచి సంవత్సరాల పాటు ఎదురుచూసినా స్వామి సేవలో పాల్గొనడానికి అవకాశం రాలేదు. చివరికు 2021 సెప్టెంబర్ 10న స్లాట్ బుకింగ్ అయిందని కరోనా కారణంగా ఆ సేవ రద్దు చేసినట్లు తెలిపారు. దాని స్థానంలో బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అయిన కూడా వారికి టీటీడీ అవకాశం కల్పించలేదు. దీంతో చంద్రశేఖర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. దీంతో కోర్టు చంద్రశేఖర్కు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తారా లేక జైలుకు వెళ్తారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీటీడీ 2025 ఆగస్టు 14, 15తేదీలలో చంద్రశేఖర్ దంపతులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్పల్లిలో మూడు నెలల కింద రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటా తూకాల్లో మోసాలు చేస్తున్నట్టు రైతులు గుర్తించారు. పత్తి సంచుల బరువు ఎలక్ట్రానిక్ కాంటాలో తక్కువగా చూపుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అచ్చంపేట మార్కెట్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పినా ఇప్పటివరకు తనిఖీలు చేపట్టలేదు.’ -
తూకాల్లో మోసాలు
తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. –మోహన్రెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా ఫిర్యాదులు పెరుగుతున్నాయి.. వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొను గోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత భీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం. – అశోక్ వర్ధన్రాజు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరిటెండెంట్ ● -
అలరించిన ఉగాది కవి సమ్మేళనం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో శనివారం పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపరాభవ ఉగాది కవి సమ్మేళనం అలరించింది. కవి సమ్మేళనంతో పాటు బోల యాదయ్య రచించిన తండ్లాట అనువాద కృతి ‘హార్ట్ బీట్’ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వి.మనోహర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది యువ కవులు రావడానికి, రాయడానికి ఇలాంటి కవి సమ్మేళనాలు ఉపయోగపడతాయన్నారు. కవిత్వం అంటే ఒక రకమైన తండ్లాట అని అన్నారు. హార్ట్ బీట్ పుస్తకావిష్కర్త బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ పాలమూరు కవిత్వం ప్రపంచస్థాయిలో రాణించాలంటే మన కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం కావాలన్నారు. బోల కవిత్వాన్ని అనువాదం చేసిన పుస్తక అనువాదకులు సానె శివశంకర్ను ఈ సందర్భంగా అభినందించారు. బైరెడ్డి సతీష్రెడ్డి పుస్తకాన్ని సమీక్షించారు. అనంతరం శ్రీపరాభవ ఉగాది పురస్కారాలను ప్రముఖ కవి, నటులు ఏపూరి కిష్టప్ప, ప్రముఖ కవయిత్రి టి.అంబుజలకు అందజేశారు. పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, లక్ష్మణ్గౌడ్, ఉదయమిత్ర పాల్గొన్నారు. -
తొలి రోజు ప్రశాంతం
● పదో తరగతి పరీక్షలు ప్రారంభం ● 13,188 మంది విద్యార్థులు హాజరు.. 23 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం తెలుగు పరీక్ష జరిగింది. ఉదయం 8 గంటలకే విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలంతో పరీక్ష కేంద్రాలు సందడిగా మారాయి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. 9 గంటలకే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మొత్తం 60 పరీక్ష కేంద్రాల్లో 13,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 13,188 మంది హాజరయ్యారు. మిగిలిన 23 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఓ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. డీఈఓ ప్రవీణ్కుమార్ 8 కేంద్రాలు, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ నాలుగు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పది కేంద్రాలను తనిఖీ చేశారు. -
బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
● రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ఎన్నికై న బీసీ ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని పార్లమెంట్ వద్ద అనేక సార్లు ధర్నాలు చేపట్టాలని, పలువురు మంత్రులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. ఎంపీలు, ప్రతిపక్ష పార్టీలను కలిసి ఈ విషయంలో విజ్ఞప్తి చేశామన్నారు. ఈ క్రమంలో కొన్ని డిమాండ్లను కేంద్రప్రభుత్వం నెరవేర్చిందన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ద హోదా, కేంద్రంలో ఓబీసీల వర్గీకరణకు అంగీకరించిందని, అంతేకాకుండా వివిధ వృత్తుల వారికి రూ.90 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు జీఓలు జారీ చేసిందని తెలిపారు. మరో రెండు డిమాండ్లు అలాగే ఉండిపోయాయని, మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ ఇవ్వడం ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గురుకులాలు, ఇతర పాఠశాలల మాదిరిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ, విద్య విషయాల్లో ఇచ్చే రిజర్వేషన్ను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 40 శాతానికి పెంచాలన్నారు. కార్యక్రమంలోమాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మేయర్ మమత, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, బీసీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. -
సిలిండర్ కోసం తప్పని తిప్పలు
● గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ● తహసీల్దార్ జోక్యంతో వినియోగదారులకు గ్యాస్ పంపిణీ జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీల్లో గ్యాస్ నిల్వలున్నప్పటికీ వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. సిలిండర్ కోసం గంటల తరబడి వేచి ఉన్నా ఇస్తారో.. లేదో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండేన్ గ్యా్ స ఏజెన్సీలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచే లబ్ధిదారులు బారులు తీరారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాక.. శ్రీనివాసనగర్ వద్ద ఉన్న కార్యాలయంలో రశీదులు పొందాల్సి రావటంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అక్కడ కొందరికి రశీదులు ఇచ్చారు. తీరా రశీదు తీసుకొని గోడౌన్కు వెళ్తే అక్కడ తాళం వేసి ఉండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఏజెన్సీ కార్యాలయానికి పెద్దఎత్తున వినియోగదారులు తరలి రావటం, వాగ్వాదం పడుతుండటంతో నిర్వాహకులు కొద్దిసేపు కార్యాలయం మూసివేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వినియోగదారులకు, ఏజెన్సీ నిర్వహకులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. సర్వర్ సమస్య వల్ల గోడౌన్ వద్ద సిలిండర్లు ఇవ్వటం లేదని నిర్వహకులు తెలియజేశారు. అయితే బుకింగ్ చేసి రశీదు పొందిన తరువాత ఎందుకు ఇవ్వరని వినియోగదారులు మండిపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని రశీదుపై వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్ రాయించుకుని సిలిండర్లు ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో కొందరు వినియోగదారులు గోడౌన్ ఎంతకు తెరవకపోవటంతో తహసీల్దార్ నర్సింగ్రావుకు ఫి ర్యాదు చేశారు. స్టాక్ ఉన్నప్పటికీ సిలిండర్లు ఇవ్వ టం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన నిర్వాహకులతో మాట్లాడి వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే సిలిండర్లు ఇవ్వా లని ఆదేశించారు. 12.30 గంటలకు గోడౌన్ తెరిచి వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇబ్బందులు అంగన్వాడీ కేంద్రాల్లో నిత్యం, బాలింతలు, చిన్నారులు, గర్భిణులకు భోజనం వండి పెట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్లు తప్పనిసరి. ఒక సిలిండర్ పొందాక 45 రోజులకు మరో సిలిండర్ ఇస్తారు. ఇటీవలే మండలంలోని కొన్ని కేంద్రాల్లో 45 రోజులు పూర్తి కావటంతో సిలిండర్ కోసం రశీదులు పొంది పడిగాపులు గాస్తున్నారు. రెండు రోజులుగా కార్యాలయం చుట్టు తిరుగుతున్నా ప్రయోజనం లేదని కేంద్రం నిర్వాహకులు వాపోతున్నారు. -
ట్రాక్టర్ల చోరీ.. నిందితుల అరెస్టు
మిడ్జిల్: మండల కేంద్రానికి చెందిన గూళ్లరాములు, కొత్తూర్కు చెందిన జంగాల శ్రీనువాసులకు చెందిన రెండు ట్రాక్టర్లను చోరి చేసిన నిందితులను శుక్రవారం పట్టుకొని రిమాండ్ చేసి జడ్చర్ల కోర్టులో హాజరు పర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ శివనాగేశ్వరనాయుడు చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఈనెల, గత నెలలో వ్యవసాయ పొలాల దగ్గర నిలిపిన ట్రాక్టర్లను ఏపీకి చెందిన పల్నాడు జిల్లా రొంపచర్ల మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నందిగాం పాపారావు, చంద్రశేఖర్ రావు కొత్తూర్ గ్రామంలో వరి గడ్డి కట్టలు కట్టేందుకు వచ్చి వాహనాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నిందితుల ఆచూకీ లభ్యం కావడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బాలు, వెంకటేష్, రహీమ్ తదితరులు ఉన్నారు. రెండు ట్రాక్టర్లు స్వాధీనం -
గొల్లపల్లి కేంద్రం కోసం..
గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రం కోసం గ్యాస్ సిలిండర్ తీసు కెళ్దామని వచ్చా. గురువారం వస్తే శుక్రవారం రమ్మన్నా రు. మధ్యాహ్నం 12 గంటలవుతున్నా గోడౌన్ తెరుచుకోలేదు. కార్యాల యంలో అడిగితే సర్వర్ సమస్య అంటున్నారు. ఇప్పటికే వంట చేయాలంటే కట్టెల పొయ్యి పెట్టాల్సి వస్తుంది. స్టాక్ ఉన్నా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో తెలియటం లేదు. – నాగరాజు, గొల్లపల్లి కోడ్గల్లో రెండు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒకసారి సిలిండర్ తీసుకున్నాక 41 రోజుల తరువాతే మళ్లీ ఇసా రు. 41 రోజులు దాటి పోయినా ఇంకా ఇవ్వటం లేదు. సిలిండర్ బుకింగ్ చేసి గురువారం నుంచి తిరుగుతున్నా ఇవ్వటం లేదు. కార్యాలయానికి వెళ్తే గోడౌన్కు వెళ్లమంటున్నారు. ఇక్కడేమో ఇంకా తెరవలేదు. ఇలా అయితే అంగన్వాడీ కేంద్రాల్లో వంట వండటం ఇబ్బందిగా ఉంది. – విశ్వేష్, కోడ్గల్ ● -
సింగిల్ స్టూడెంట్... బోధన జీరో!
● నాగంబాయితండా ఏకోపాధ్యాయ పాఠశాలలో విచిత్ర పరిస్థితి ● విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతున్న అధికారులు కిష్టంపల్లిగేట్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకుండా కొనసాగుతున్న పాఠశాల నాగంబాయితండాలో ఉపాధ్యాయుడి రాక కోసం సింగిల్ విద్యార్థి మహేశ్ నిరీక్షణ హన్వాడ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుల గైర్హాజరు కారణంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. మండల పరిధిలోని నాగంబాయితండా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇలాంటి దుస్థితే నెలకొంది. పూర్తి వివరాలు.. మాదారం ఉమ్మడి పంచాయతీ నుంచి వేరుపడి నూతన పంచాయతీగా ఏర్పడిన నాగంబాయితండా ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒకే ఒక్క విద్యార్థి ఏ.మహేష్ ఐదో తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. ఆ ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసి నిర్మించిన భవనం, రూ.లక్షల్లో వేతనం పొందే ఉపాధ్యాయిని రేహానాబేగ్ను నియమించింది. కానీ ఆ ఉపాధ్యాయిని మాదారం పాఠశాలకు వెళ్లి తనకు బదులుగా అక్కడ ఉన్న మరో ఉపాధ్యాయుడు శ్రీనివాస్గౌడ్ను కేటాయించారు. కానీ సదరు ఉపాధ్యాయుడు విధులకు చుట్టపు చూపుగా వస్తూ వెళ్తున్నాడే తప్పా, ఎలాంటి బోధన చేయడం లేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మహే ష్కు క్రమబద్ధమైన విద్యాబోధన లేని కారణంగా తనకు కేవలం క, ఖ వరకు మాత్రమే ఓనమాలు వస్తాయని, కానీ ఐదో తరగతికి వచ్చినా తనకు చదవడం, రాయడం పూర్తిస్థాయిలో రాదని సదరు విద్యార్థి పేర్కొంటున్నాడు. ఉపాధ్యాయుడు రాకపోవడంతో అంగన్వాడీ చిన్నారులతో కలిసి కూర్చుంటున్నాని తెలిపాడు. ఇకపోతే ఇక్కడకు వచ్చే ఉపాధ్యాయుడు వచ్చేనెల రిటైర్మెంట్ ఉందని తెలిసింది. దీంతో అతను కూడా వెళ్లిపోతే అప్పుడు ఆ పాఠశాలకు, ఆ విద్యార్థికి దిక్కెవరు అన్న ప్రశ్న తండాలో కలకలం రేపుతోంది. నాగంబాయితండాలో ఒకే విద్యార్థి ఉన్నాడు. అక్కడి ఉపాధ్యాయుడు మెడికల్ లీవ్ కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. సర్పంచ్తో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ విద్యార్థిని మాదారం పాఠశాలలో అడ్మిట్ చేస్తాం. కిష్టంపల్లిగేట్ పాఠశాలలో పరిస్థితి పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అంబటోనిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నారు. మండలంలో ఎక్కడా వలంటీర్లను నియమించలేదు. అంబటోనిపల్లిలో వలంటీర్ను నియమించుకున్న విషయం తెలియదు. వీటన్నింటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – గోపాల్నాయక్, ఎంఈఓ, హన్వాడ -
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
కృష్ణా: ఓ యువకుడి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముడుమాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు వివరాలు.. గ్రామానికి చెందిన గుంటెప్ప కుమారుడు కుర్వ హన్వేశ్ (22) శుక్రవారం తన పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం సమయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి, ఆత్మహత్యకు గల కారణాలను గుర్తించాలని తండ్రి గుంటెప్ప విజ్ఞప్తి చేస్తున్నారు. యువకుడు అనుమానాస్పద మృతి కొల్లాపూర్ రూరల్: మండల పరిధిలోని కుడికిల్లకు చెందిన జుగుట్ట రాంబాబు (30) అనే యువకుడు గ్రామ సమీపంలో ఉన్న కేఎల్ఐ ప్రధాన కాలువ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఈ నెల11న వ్యవసాయ పొలానికి వెళ్లొస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకు తిరిగి రాకపోవడంతో రెండు రోజుల నుంచి గా లింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం కేఎల్ఐ కాలువ సమీపంలో శవమై కనిపించడంతో మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి మహేశ్వరం కొల్లాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రాంబాబు బైక్ స్నేహితుడు శ్రీకాంత్ దగ్గర దొరకడంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లోకిరేవు రోడ్డు బాధితులకు ఇళ్ల స్థలాలు జడ్చర్ల: నవాబ్పేట మండలం లోకిరేవు రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులకు త్వరలోనే ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. శుక్రవారం సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. త్వరలోనే కలెక్టర్తో సమావేశమై సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. అనంతరం 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. బాధిత కటుంబానికి పరామర్శ బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న ఘటనకు సంబంధించి నాగసాల గ్రామానికి వెళ్లి బాధిత భీమేశ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్యార్డు చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ రాజేందర్గౌడ్, నాయకులు గోప్లాపూర్ యాదయ్య, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన డీ8 సాగునీరు.. రైతుల ఆందోళన
గోపాల్పేట: మండలంలో డీ8 కాల్వ సాగునీరు గురువారం రాత్రి నుంచి నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీ8 మేజర్–2 కాల్వ కింద గోపాల్పేట, ఏదుట్లకు చెందిన రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటను సాగు చేసుకున్నారు. ఇంకో ఇరవై రోజులు నీరు వస్తే పంటలు పూర్తి అవుతాయి. అయితే ప్రస్తుతం డీ8 కాల్వనీరు నిలిచిపోవడంతో స్థానిక రైతులు అయోమయంలో పడిపోయారు. గోపాల్పేట, ఏదుట్లకు చెందిన రైతులు సుమారు తొంబై ఎకరాల వరకు మేజర్–2 కాల్వ కింద పంటలు సాగు చేశారు. డీ–8 కాల్వకింద ఈ సీజన్లో కేవలం రెండు గ్రామాల పరిధిలోనే తొంబై ఎకరాలు సాగు చేశారు. మొత్తంగా డీ8 కాల్వ కింద ప్రస్తుతం పది వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగు చేసి ఉంటార ని అంచనా. గురువారం నుంచి నీరు నిలి చిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఇంకో ఇరవై రోజులు నీరు వచ్చేలా చేయాలని కోరుతున్నారు. సాగునీటి నిలిపివేతపై వివరాలు తెలుసుకునేందుకు నీటిపారుదలశాఖ అధికారులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. మన్యంకొండలో మైసూరు ఉత్తరాది పీఠాధిపతి మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని శుక్రవారం మైసూరు ఉత్తరాది పీఠాధిపతి దత్త విజయానంద తీర్థస్వామిజీ దర్శించుకొన్నారు. స్వామిజీకి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను, దేవస్థానం చారిత్రిక ప్రాధాన్యతను చైర్మన్ స్వామిజీకి వివరించారు. అనంతరం ఆలయం తరఫున శేషవస్త్రాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ జేపీఎన్సీ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, రిటైర్డ్ ఆర్డీఓ హన్మంతరావు పాల్గొన్నారు. కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఎర్రవల్లి: కృష్ణానదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు కోదండాపురం ఎస్ఐ తరుణ్కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మానవపాడు మండలంలోని పల్లెపాడు గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో ఓ మగ మనిషి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పంచాయతీ కార్యదర్శి నరేందర్రెడ్డికి తెలుపగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించారన్నారు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, ఎత్తు 5.5 అడుగులు, చామచ్చాయ రంగు, ఒంటిపై గోదుమ రంగు ప్యాంట్, పసుపు–ఆకుపచ్చ రంగు టీషర్ట్, బ్లూ రంగు బనియన్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి గురించి ఎలాంటి ఆచూకీ లేదని, శవం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉందని, ఎవరైనా గుర్తిస్తే కోదండాపురం పీఎస్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
కల్వకుర్తి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
● భర్తను హత్య చేశారని ఆరోపిస్తున్న భార్య ● మృతదేహాన్ని తరలిస్తుండగా ఉద్రిక్తత ● పోలీసుల దురుసు ప్రవర్తన కల్వకుర్తి టౌన్: తన భర్తను అత్తారింటి వారే హత్య చేశారని, ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని అడ్డదారిలో తరలించడానికి ప్రయత్నిస్తున్నారని మృతుడి భార్య ఆందోళనకు దిగిన ఘటన శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వాస్పతి వద్ద చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని భార్య తరఫు బంధువులు మృతదేహాన్ని తరలిస్తున్న ఆటోను అడ్డగించడంతో పోలీసులు వారితో దురుసుగా వ్యవహిరించారని ఆరోపించారు. వివరాలలోకి వెళ్లే.. చారకొండ మండలంలోని సారబండతండాకు చెందిన హారికృష్ణ (28)కు కల్వకుర్తి మండలంలోని కుర్మిద్దతండాకు చెందిన భారతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో భారతి రెండు సార్లు గర్భం దాల్చినా.. అది నిలవకపోవడంతో పిల్లలు కాలేదు. దీంతో కుటుంబంలో చిన్నపాటి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారతి రెండు నెలలుగా తన తల్లిగారిళ్లు అయిన కుర్మిద్దతండాలోనే ఉంటోంది. భారతిని భర్త దగ్గరికి పంపించాలని ఆమె తల్లిదండ్రులు చూసినా, భర్త తరఫు కుటుంబీకులు విజ్ఞప్తి చేసినా వెళ్లలేదు. చివరకు గురువారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో హరికృష్ణ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కల్వకుర్తిలోని సీహెచ్సీకి తరలించారు. మృతుడిని చూసేందుకు భార్యతో పాటు గా వారి బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. తన భర్త మృతిపై అనుమానం ఉందని గురువారం నుంచి చెబుతున్నా పోలీసులు పట్టించుకోవటం భార్య, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆటోలోకి మృతదేహాన్ని సారబండతండాకు తరలించేందుకు ప్రయత్నించగా భార్య తరఫు బంధువులు అడ్డగించారు. భర్త మృతిపై అనుమానం ఉందని నేను నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే నన్ను కొట్టడానికి చారకొండ పోలీసులు వచ్చారు. లాఠీ ని చూయించి నాతో పాటుగా, మా బంధువులను బెదిరించారు.న్యాయం చేయాల్సి న వారే ఇలా ఒకరికి వత్తాసు పలకడంపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. పోలీ సుల తీరు పూర్తి అభ్యంతరకరంగా ఉంది. – భారతి, మృతుడి భార్య -
అక్రమార్కులపై ఉక్కుపాదం
● పక్కదారి పడుతున్న గ్యాస్ సిలిండర్లపై ఫోకస్ ● ముమ్మరంగా దాడులు చేస్తున్న అధికారులు మహబూబ్నగర్ రూరల్: జిల్లాలో గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న అక్రమాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గ్యాస్ సిలిండర్ల పక్కదారి వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.శుక్రవారం పౌర సరఫరాల శాఖ అధికారులు మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గృహ వినియోగానికి మాత్రమే అనుమతించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై అధికారులు 31 (6ఏ) కేసులు నమోదు చేసి మొత్తం 54 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి గంప శ్రీనివాస్తో పాటు అధికారులు రాజీవ్రెడ్డి, డి.ఆదిత్యగౌడ్, ఎస్.మమత, దీపక్, ఎండీ అమేర్ తదితర అధికారులు పాల్గొన్నారు. పాత సమస్య.. కొత్త తనిఖీలు జిల్లాలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు వాణిజ్య సిలిండర్లకు బదులుగా తక్కువ ధరకు లభించే గృహ సిలిండర్లనే వినియోగిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీల సహకారంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై గతంలో పెద్దగా చర్యలు తీసుకోలేదని ప్రజలు చెబుతున్నారు. కొంతమంది అక్రమార్కులు అధికారులకు మామూల్లు ఇచ్చి గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
విద్యుదాఘాతంతో వాహనం దగ్ధం
బల్మూర్: పశుగ్రాసం తరలిస్తున్న ఓ వాహనం విద్యుత్ షాట్ సర్క్యూట్తో దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రం బల్మూర్కు చెందిన జల్లెల సురేష్ పొలంలో ఉన్న పశుగ్రాసాన్ని ఇంటికి తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి గడ్డికి మంటలు అంటుకొని పశుగ్రాసంతో పాటు వాహనం కూడా దగ్ధమైంది. ప్రమాదంలో రూ.10 లక్షల వరకు నష్టం వాటిళ్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై విద్యుత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు కొల్లాపూర్: పట్టణంలోని సాయికృప నర్సింగ్హోంను శుక్రవారం వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఓ బాలికకు అబార్షన్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం డీఎంహెచ్ఓ, డీఎస్పీలు తనిఖీలు చేసి ఆస్పత్రి నిర్వాహకులు కొండా శ్రీనివాసులు, వైద్య సిబ్బందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. శుక్రవారం కలెక్టర్, ఎస్పీ, డీఎంహెచ్ఓతో పాటు పలువురు కలెక్టరేట్లో సమావేశమై ఆస్పత్రిని సీజ్ చేయాలని నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశానుసారం డీఎంహెచ్ఓ రవికుమార్నాయక్, ఎస్ఐ సురేష్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి పై భాగంలోనే కొండా శ్రీనివాసులు కుటుంబీకులు నివాసం ఉంటున్నారు. వారు ఇంట్లోకి రాకపోకలు సాగించేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆస్పత్రిలోని రోగులకు ఇతర ఆస్పత్రులకు తరలించారు. తదుపరి అనుమతులు వచ్చే వరకు ఆస్పత్రిలో వైద్యసేవలు నిర్వహించవద్దని సూచించారు. భర్తను కట్టేసి కొట్టిన భార్య నాగర్కర్నూల్ క్రైం: కుటుంబ కలహాలతో భర్తను భార్య కట్టేసి కొట్టడంతో తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు.. మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన మేకల రాములు, భార్య లక్ష్మికి తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఈ నెల 11న మరోమారు ఇరువురు గొడవపడగా భార్య లక్ష్మి రాములును గొంతుకు టవల్ బిగించి దాడికి పాల్పడింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన తూడుకుర్తికి చెందిన తిరుపతయ్య రాములు కాళ్లు, చేతులను చీరతో కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం వరకు భార్య లక్ష్మి అతడిపై దాడికి పాల్పడంతో తీవ్రగాయాలయ్యాయి. గురువారం ఉదయం తూడుకుర్తి ఉప సర్పంచ్ బాధితుడిని విడిపించడంతో శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో వచ్చి చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. -
ప్రశాంతంగా పరీక్షలు రావాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పదో తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి భయం, ఆందోళన పడకుండా, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా చూడాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వారికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని కోరారు. జిల్లా యంత్రాంగం పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించామని, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. -
తొలిసారి ‘నల్లమల’కు గవర్నర్
● స్వాగతం పలికిన నాగర్కర్నూల్ కలెక్టర్, ఎస్పీ మన్ననూర్: శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గాన వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు శుక్రవారం మన్ననూర్ మృగవాణి అతిథిగృహం వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయన.. కలెక్టర్, ఇతర అధికారులతో ఈ ప్రాంతం విశేషాలు, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అతిథిగృహంలో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. -
‘ఇందిరమ్మ ఇంటి’ బిల్లుల కోసం లంచం డిమాండ్
● రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి అయిజ: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లు చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బోయ రంగన్న ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు చేసేందుకు లబ్ధిదారుల నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంల సమీపంలో లబ్ధిదారుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి మొదటి విడత బిల్లు చెల్లించేందుకు, తదుపరి మూడు వాయిదాలకు అంతరాయం లేకుండా బిల్లులు చెల్లించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశారని, లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఓ ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్లో జడ్జి ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఆందోళన వద్దు.. వంట గ్యాస్కు కొరత లేదు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్యాస్ సరఫరా పరిస్థితిపై ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియతో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ డీలర్ల దగ్గర బుకింగ్ స్టాక్, సరఫరాపై సమావేశంలో సమీక్షించి ప్రతి రోజు రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు.జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎల్పీజీ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ఆస్పత్రులు, విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటి సంస్థలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సరఫరా చేయాలని సూచించారు. జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ వాణిజ్య అవసరాలకు వినియోగించినా, స్టాక్ నిల్వ చేసినా చర్యతు తప్పవని, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలు, ఎస్ఐలతో కూడిన ఐదు బృందాలను ఏర్పాటు చేశామని, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీ జరగాలన్నారు. సిలిండర్ నిర్దేశించిన పరిణామంలో గ్యాస్ సరఫరా చేయాలని, తూనికల కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేల్స్ అధికారి సూర్య కిరణ్, లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర సాగు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హైదరాబాద్ సచివాలయం నుంచి కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో వీసీలో మాట్లాడారు. వంట గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి గందరగోళానికి గురి కావొద్దని, గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. -
పురపాలిక భవనం ప్రారంభోత్సవం
జడ్చర్ల: స్థానిక పురపాలిక కార్యాలయ భవనాన్ని శుక్రవారం రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రారంభించారు. దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఈ భవనాన్ని నిర్మించారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకమండలి సభ్యులకు, సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తన సొంత ఖర్చుతో దుస్తువులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, వైస్ చైర్పర్సన్ సారిక, కమిషనర్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు ప్రశాంత్రెడ్డి, నందకిషోర్, చైతన్య, చౌహాన్, రాజు, శ్రావణి, నవనీత, మహేశ్, సతీష్, ఉమాగౌడ్, జ్యోతి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అదిరిందయ్యా షర్ఫద్దీన్
● ఎండను తట్టుకునేందుకు బైక్కు గుడిసెలాంటి గొడుగు జడ్చర్ల టౌన్: జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లుగా మండుతున్న ఎండలను తట్టుకునేందుకు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన షర్ఫద్దీన్ బైక్కు గుడిసెలాంటి గొడుగును ఏర్పాటు చేసుకుని.. ప్రయాణం సాగిస్తున్నారు. రైస్మిల్ వర్కర్ కావటంతో నిత్యం ఏదో ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో బైక్కు ఒక గొడుగు అమర్చుకోవాలనుకున్నారు. స్వతహాగా వర్కర్ కావడంతో తన ఆలోచనను ప్రకారం రూ.3 వేలతో బైక్కు గొడుగును తయారు చేసుకున్నారు. ఇందుకు ఇనుప పైపులు, నెట్, గోనె సంచులు, వెదురుదబ్బలు ఉపయోగించారు. వాటిని కొనుగోలు చేసి చిన్నపాటి గొడుగు మాదిరి ప్రేమ్ తయారు చేసి బైక్ బంపర్కు అమర్చారు. ఇంకేముంది మండుటెండల్లోనూ బైక్పై రయ్ రయ్మంటూ ప్రయాణం సాగిస్తున్నారు. గొడుగు బైక్తోనే కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట, అచ్చంపేట పట్టణాలకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. మరి ఎండలు ఎక్కువగా ఉంటే టాప్పై కొన్ని నీళ్లు చల్లుకుంటే చల్లగా ఉంటుందని, సాధారణంగా 50 కి.మీ.స్పీడ్ వెళితే గాలులు ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. దీంతో బైక్ను చూసిన వారంతా అదిరిందయ్యా షర్ఫద్దీన్ అంటున్నారు. ఎండలనుంచి తట్టుకునేందుకు బైక్కు ఏర్పాటు చేసుకున్న గుడిసెలాంటి గొడుగు -
డిమాండ్ నోటీసులు అందించాం..
బీడీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ చిన్నచింతకుంటలో భారీ ప్రదర్శన నిర్వహించి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు వేతన పెంపు డిమాండ్ నోటీసులు అందించాం. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలని కోరాం. దీంతోపాటు పీఎఫ్, ఈపీఎఫ్ ప్రతి కార్మికుడికి వర్తింపచేజేయాని విన్నవించాం. – రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం, అమరచింత నెలలో 20 పనిదినాలు ఉండగా.. 15 వేల బీడీలు తయారు చేస్తున్నాం. కుటుంబ పోషణ బీడీల తయారీపైనే ఆధారపడింది. వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లిస్తున్నారు. కూలి సరిపోక పోషణ భారంగా మారింది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా రూ.400 చెల్లిస్తే బాగుంటుంది. – సులోచనమ్మ, బీడీ కార్మికురాలు, అమరచింత చాలీచాలని కూలితో ఇబ్బందులు పడుతున్నా ం. యాజమాన్యం వెంటనే ధరలు పెంచాలి. అలాగే జరిమానాను పూర్తిగా రద్దు చేయాలి. పొద్దంతా కూర్చొని తయారుచేసిన వెయ్యి బీ డీలకు రూ.400 చెల్లించాలి. లేనిపక్షంలో కార్మిక సంఘంతో కలిసి ఆందోళన చేపడతాం. – సరోజ, బీడీ కార్మికురాలు, మస్తీపురం ● -
మాతృ మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు: జిల్లాలో ఉన్న ప్రమాద లక్షణాలు గల గర్భిణీలను గుర్తించి, సమగ్ర ఆరోగ్య సేవల కింద ప్రతి ఏఎన్ఎం సమాచారం రికార్డు చేసి అవసరమైన పరీక్షలు చేయించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ అన్నారు. గర్భిణీ సమగ్ర ఆరోగ్య సేవల నిర్వహణపై ఏఎన్ఎంలకు శుక్రవారం జనరల్ ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు. గర్భి ణీలకు అన్నిరకాల సేవలు అందేలా చూడాలని, గర్భం దాల్చిన వెంటనే వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో మాతృమరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఆర్మన్, యూనిసెఫ్ ఎన్జీఓ నుంచి డాక్టర్ కావ్య, డాక్టర్ సర్వాణి.. జ్వరం, 20 వారాల లోపు రక్తస్రావం, మానసిక ఆరోగ్యం, మూర్చ, కామెర్లు, తగ్గిన పిండ కదలికలు, ఇతర సమస్యలపై శిక్షణ ఇచ్చారు. సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, డాక్టర్ శివకాంత్, డీఐఓ డాక్టర్ విద్య పాల్గొన్నారు. -
28న జాతీయలోక్ అదాలత్
● 1,334 కేసుల్లో కక్షిదారులకునోటీసులు జారీ ● ప్రధాన కోర్టు న్యాయమూర్తి ఎన్.ప్రేమలత పాలమూరు: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉండి కోర్టు ముందుకు రాని కేసులను పరిష్కరించేందుకు ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. జిల్లా కోర్టులో ని న్యాయమూర్తి చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ నిర్వహణ కోసం మొత్తం 8 బెంచీలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 1,334 కేసులను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ గుర్తించిన కేసుల్లో 32 కేసులు ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు. రాజీ అయ్యే అన్ని రకాల క్రిమినల్, సివిల్ కేసులు, రోడ్డు ప్రమాద, బ్యాంకు కేసులు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు సైతం తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా డబ్బు వృథా కాకుండా ఉంటుందని, దీంతో పాటు ఇరువర్గాలకు తక్షణ పరిష్కారం దొరుకుతుందన్నారు. లోక్ అదాలత్లో దాఖలు చేసే క్రమంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పోలీస్ శాఖతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకు అధికారులు ప్రతి ఒక్కరూ వారి పరిధిలో ఉన్న పెండింగ్ కేసులలో ఉన్న కక్షిదారులకు నోటీసులు ఇచ్చి లోక్ అదాలత్కు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. -
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
రాజాపూర్: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన నరేష్(31) షాద్నగర్ శివారులోని ఎంఎస్ఎన్ ఫార్మాలో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగా బైక్పై ఇంటి నుంచి బయలుదేరాడు. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ లారీ రాజాపూర్ మండల శివారులో బైక్ను వెనక నుంచి ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుభధ్ర, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. -
రైలు కిందపడి మహిళ మృతి
జడ్చర్ల: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ ఎస్ రాజు వివరాల ప్రకారం జడ్చర్ల రైల్వే స్టేషన్ పరిధిలో ఉదయం గుర్తుతెలియని మహిళ(48) ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతిచెందింది. రైలులో ప్రయాణిస్తూ కాలుజారి కిందపడిందా లేదా పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య వెల్దండ: మండలంలోని కొట్ర రెవెన్యూ శివారులో జాతీయ రహదారి సమీపంలోని వ్యవపాయం పొలంలో బుధవారం రాత్రి ఎరుకలి బాలకృష్ణ (27) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న మహీంద్రాథార్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లికి చెందిన బాలకృష్ణపై ఆదిబట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రమాదానికి కారణమైన బాలకృష్ణ పరారీలో ఉండడంతో పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో గురువారం కొట్ర రెవెన్యూ శివారులోని వ్యవసాయ పొలంలో యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడిని బాలకృష్ణగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆదిబట్ల పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో వారితో గొడపవడి.. కృష్ణా: కుటుంబ కలహాలతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నవీద్ తెలిపిన వివరాల ప్రకారం.. రంజిత్ వైద్యనాథ్ (20) మండల పరిధిలోని హిందూపూర్ గ్రామ సమీపంలో గల ఇటుక బట్టిలో పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాడుగా ఉండేవాడు. అయితే బుధవారం రాత్రి మద్యం తాగి ఇంట్లో వారితో గొడవ పడి అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై మృతుడు తండ్రి వైద్యనాథ్ శ్రీపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మనస్తాపంతో యువకుడి బలవన్మరణం చారకొండ: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వీరబాబు కథనం మేరకు.. మండలంలోని సారంబండతండాకు చెందిన వడ్త్యావత్ హరికృష్ణ నాయక్ (29) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హరికృష్ణ ఏడేళ్ల క్రితం భారతితో వివాహం కాగా.. వారికి ఇద్దరు పిల్లలు పుట్టి పురిటిలోనే చనిపోయారు. దీంతో కుటుంబంలో సమస్యలు రావడంతో భార్య ఇటీవల తల్లిగారింటికి వెళ్లడంతో ఒంటరితనం అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం తల్లిదండ్రులు వచ్చేసరికి విగతజీవిగా మారాడు. విషయంపై సమాచారం అందుకున్న చారకొండ ఎస్ఐ వీరబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి దస్రునాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పంటలు ఎండుతున్నాయి.. కరెంట్ ఇవ్వండి సారూ
దేవరకద్ర రూరల్: పంటలు ఎండుతున్నాయి.. కరెంట్ ఇవ్వండి సారూ అని వెంకటగిరి, ఇస్రంపల్లికి చెందిన రైతులు గురువారం కౌకుంట్లలోని సబ్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. త్రీఫేస్ కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, సమస్య పరిష్కరించాలని ట్రాన్స్కో అధికారులను వేడుకున్నారు. కొన్ని రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైందని, పరిస్థితి ఇలాగే ఉంటే కళ్లెదుటే చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతాయని వాపోయారు. సమస్యపై బాధిత రైతులతో ఏడీ సంతోష్ ఫోన్లో మాట్లాడుతూ.. లోఓల్టేజ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి, అంతరాయం లేకుండా త్రీఫేస్ అందిస్తామని హామీ ఇచ్చారు. -
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
ఖమ్మం తరహా క్రిష్టియన్పల్లి బాధితులకు ● మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ● 523 సర్వేనంబర్ బాధితుల ధర్నాకు మద్దతు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో ఇండ్లు కూలగొట్టిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన విధంగానే మహబూబ్నగర్లోని క్రిస్టియన్పల్లి 523 సర్వే నంబర్లో కూలగొట్టిన ఇండ్ల బాధితులకు కూడా కూలగొట్టిన ప్రాంతంలో ఇండ్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆదర్శనగర్లో బాధితులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. అంధులు, వికలాంగులు నివాసముంటే ఇండ్లను అర్ధరాత్రి వచ్చి కూలగొట్టారని ఆరోపించారు. ఇక్కడ చెరువులేదని, ప్రభుత్వ భూమిని ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఇచ్చిందని.. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు కూలగొట్టడం దుర్మార్గమన్నారు. కొందరు వచ్చి ఇప్పటికీ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రతిఒక్కరూ మానవీయ కోణంలో ఆలోచన చేయాలని, రాజకీయంగా ఆలోచించి ప్రత్యేక అవసరాలు కలిగిన వారి జీవితాలతో ఆడుకోవడద్దన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పోలీస్ అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ● 523 సర్వే నంబర్ బాధితుడు ఎల్లప్ప మాట్లాడుతూ.. ఖమ్మం తరహా ఇండ్లు కూలగొట్టిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు. మమ్మల్ని భయపెట్టాలని చాలామంది చూస్తున్నారని, ఎవరికీ భయపడేదిలేదన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, కార్పొరేటర్లు హైందవి, మధుమోహన్, రమేశ్నాయక్, శరత్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు క్రాంతి, పాల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
సరి అడ్డు లేకుండా అక్రమ దందా!
గండేడ్: రెండు మండలాల సరిహద్దును ఆసరాగా చేసుకొని అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణకు తెరలేపారు. ట్రాక్టర్లలో తెచ్చి రెండు మండలాల సరిహద్దుల్లో పోస్తున్నారు. టిప్పర్లలో రాత్రికి రాత్రికి ఎత్తేస్తున్నారు. ఇందుకు అధికారుల అండదండలు మెండుగా ఉండడంతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఓవైపు ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని మోత్తుకుంటున్నా అక్రమార్కులు, అధికారులు వాటిని తుంగలో తొక్కేస్తున్నారు. గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామం మండలంలోని శివారు, మారుమూల గ్రామం. ఈ గ్రామం దాటితే కోయిల్కొండ మండలం పరిధి. ఈ మండలంలోని సురారం ఇసుకకు ప్రత్యేకత. ఇక్కడ పెద్దవాగు ఉండడం మూలంగా ఇసుక ఎక్కువగా లభిస్తుంది. ఈ ఇసుక నాణ్యమైనదిగా ఉండడంతో ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే అక్కడినుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గండేడ్ మండలంలోని పగిడ్యాల్తోపాటు కొండాపూర్, బల్సుర్గొండ, తువ్వగడ్డతండా, మన్సూర్పల్లి తదితర గ్రామాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. నేరుగా ఇళ్లు కట్టుకునేవారికి ఇసుక వేయడంతోపాటు బయటికి తరలించేందుకుగాను టిప్పర్లకోసం డంపులు వేస్తున్నారు. రెండు మండలాల సరిహదులో.. కోయిల్కొండ మండలంలోని కొత్లాబాద్, గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామాల సరిహద్దులో కొత్లాబాద్ చెరువు సమీపంలో సురారం గ్రామానికి చెందిన వారు ట్రాక్టర్లలో తెచ్చి డంపులు పోస్తున్నారు. ఉదయం, సాయంత్రం 10 నుంచి 20 ట్రాక్టర్లలో తెచ్చి డంపు పోస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ రూ.2వేల నుంచి రూ.3వేలకు ఒక ట్రిప్పు చొప్పున పోస్తున్నారు. ఇది ప్రతిరోజు కొనసాగుతున్నది. అలా పోసిన ఇసుకను గండేడ్ మండలానికి చెందిన కొందరు వాటిని టిప్పర్లలలో నింపి రాత్రి వేళల్లో గుట్టుగా కోస్గి, పరిగి, కుల్కచర్ల తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మండలంలో మూడు టిప్పర్లు నిత్యం అక్రమంగా ఇసుకను రాత్రివేళల్లో తరలిస్తున్నాయి. దీంతోపాటు సురారం, లింగల్చేడ్కు చెందిన మరో మూడు టిప్పర్లు కూడా గండేడ్ మహమ్మదాబాద్ మండలాలతోపాటు ఇతర ప్రాంతాలకు సురారం నుంచే ఇసుకను తరలిస్తున్నాయి. పగిడ్యాల్ శివారులో మరో రెండుచోట్ల కూడ ఇసుక డంపులు పోస్తున్నారు. జేసీబీల సహాయంతో యథేచ్చగా టిప్పర్లు నింపి తరలిస్తున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రూ.3వేల వరకు వసూలు అక్రమ రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దందా సాఫీగా నడవడానికి టాక్టర్లు, టిప్పర్ల నుంచి రెండునుంచి మూడువేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వసూలు చేసిన డబ్బులు ఆయా శాఖల అధికారులకు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా కారణంగా ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా ఒక ట్రాక్టరు రూ.5వేలకు ఓ ట్రిప్పు వేస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలం కోయిల్కొండ మండలం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అక్కడి అధికారులు కిమ్మనకపోవడమేకాక వారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కోసారి వరుసకట్టి ట్రాక్టర్లు వస్తున్నా కూడ అటు కోయిల్కొండ కాని ఇటు గండేడ్ మండల అధికారులు కాని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈతంతు దాదాపు నాలుగైదు నెలలుగా కొనసాగుతున్నా ఒక్క ట్రాక్టర్గాని టిప్పర్గాని పట్టుకున్న దాఖలాలు లేవు. దీనికి తోడు జేసీబీతో లోడు చేస్తున్న కూడా అధికారుల్లో చలనం లేదు. ఈ విషయం అధికారులను అడిగితే మాకేమీ సమాచారం లేదని అమాయకంగా సమాధానం ఇస్తున్నారు. కనీసం సంబంధిత జీపీఓలు కూడా అక్రమ రవాణా గురించి పట్టించుకోవడం లేదంటే విడ్డూరంగా ఉంది. అధికారుల అండదండలతో జోరుగా ఇసుక రవాణా సురారం నుంచి పగిడ్యాల్ మీదుగా ఇతర ప్రాంతాలకు.. ట్రాక్టర్లలతో తరలించి టిప్పర్లతో చేరవేస్తున్న ఇసుకాసురులు అరికట్టడంలో విఫలమవతున్న అధికారం యంత్రాంగం -
ప్రజాపాలనలో భాగస్వాములు కావాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యలు పరిష్కారం చేసేందుకు సీఎం ప్రజాపాలన–ప్రగతిపాలన 99 రోజుల కార్యక్రమం ప్రారంభించినట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని అనంత మారుతీ గార్డెన్ సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్లకు అధికారంతో పాటు బాధ్యతలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి కృషి చేసి.. వారికి నమ్మకం కల్పించాలని సూచించారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా పొందాలో మార్గనిర్దేశం చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం రూపొందించి వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ప్రజారోగ్యం, పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టా సారించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించడం, స్థానిక పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రచారం నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమస్యలు ఎదురైతే జిల్లా పరిపాలన విభాగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగస్వామ్యులై సహకారం అందించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఐదు దశల్లో 10 ప్రాధాన్యత అంశాలతో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు 99 రోజులు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ఈ ప్రణాళికలో అందరం భాగ్యస్వాములై విజయవంతం చేద్దామన్నారు. ● రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దశల వారీగా అమలు చేస్తుందని తెలిపారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ జి.మమత మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు తమ పరిపాలన సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశమన్నారు. అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, ఆర్డీఓ నవీన్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నరసింహారెడ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాల్కోటి, దేవరకద్ర మున్సిపల్ చైర్మన్ దమయంతి, జిల్లా అధికారులు, పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఎలా పొందాలో మార్గనిర్దేశం చేయాలి ప్రజాసమస్యలు పరిష్కరించి నమ్మకం కలిగించాలి కలెక్టర్ ఖుష్బూ గుప్తా -
బస్సు ఢీ.. ఒకరు మృతి
మక్తల్: పట్టణంలో గురువారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మున్సిపల్ పరిధిలోని దండు గ్రామానికి చెన్నారెడ్డి (36) అలియాస్ చిన్న తన కుమారుడితో కలిసి జీపులో మక్తల్కు బయలుదేరారు. గురువారం రాత్రి తిరుగు ప్రయాణంలో పెట్రోల్ బంకు దగ్గరకు రాగానే హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్తున్న వోల్వో బస్సు జీపును ఢీ కొట్టింది. ప్రమాదంలో చెన్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అతని కుమారుడు అభినందనకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి ఘటనాస్థలానికి చేరుకునేలోపే బస్సు డ్రైవర్ పరార్ అయ్యాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పుణె టూ పాలమూరుకు ఎండు గంజాయి
మహబూబ్నగర్ క్రైం: ద్విచక్ర వాహనంలో ఎండు గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్నగర్ ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, ఎస్ఐ సుష్మ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని బోయపల్లి గేట్ దగ్గర చేసిన తనిఖీల్లో మహ్మద్ఖాన్పల్లి తండాకు చెందిన విస్లావత్ రమేష్ తనకు సంబంధించిన ద్విచక్రవాహనంలో 240గ్రాముల ఎండు గంజాయి తీసుకుని వెళ్తుంటే అదుపులోకి తీసుకోన్నారు. రమేష్ నాయక్ కొన్ని రోజుల నుంచి పుణేలో నివాససటున్న క్రమంలో ఇటీవల మహబూబ్నగర్కు వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి గంజాయి తీసుకువచ్చి స్థానికంగా విక్రయాలు చేసినట్లు గుర్తించారు. రమేష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడంతో పాటు గంజాయి, ఒక బైక్, ఒక సెల్ఫోన్ సీజ్ చేసినట్లు సీఐ వీరారెడ్డి వెల్లడించారు. -
మహబూబ్నగర్
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026పాలమూరు: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం స్థానికంగా కన్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు నెలకొనడంతో కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వాణిజ్య సిలిండర్ల పంపిణీలో కోతలు మొదలయ్యాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. ఇలాగైతే హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో కోత పెట్టడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఏజెన్సీలు నిలిపేయడం, ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. రెట్టింపు మొత్తం ఇస్తామన్నా సిలిండర్ దొరకడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పురుగు మందులు.. విషప్రభావం లక్షణాలు
అలంపూర్: పురుగు మందులోని విష తీవ్రతలలో తేడాలు ఉన్నప్పటికి పురుగు మందులు అన్నీ నిస్సందేహంగా విష పదార్థాలని గ్రహించాలి. అవి తయారయ్యే కర్మాగాలలో, నిల్వ ఉండే గిడ్డంగిల్లో, రైతు పైరుపై చల్లే సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటితో అతి జాగ్రత్తగా వ్యవహరించాలని ఏడీఏ సక్రియ నాయక్ సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా పురుగు మందుల విష ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో లక్షణాలను గుర్తించి సత్వరమే ప్రథమ చికిత్స అందించాలని ఏడీఏ పేర్కొంటున్నారు. పు రుగు మందులు మానవ శరీరంలోకి మూడు విధా లుగా చేరడానికి ఆస్కారం ఉందని వివరిస్తున్నారు. చర్మం ద్వారా.. శరీరంపై పురుగు మందులు పడినప్పుడు చర్మం ద్వారా విషపదార్థం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నప్పుడు మరింత సులభంగా, త్వరగా శరీరంలోకి ప్రశేశించి నష్టం కలిగిస్తుంది. ముక్కు ద్వారా.. పురుగు మందుల ద్వారా వెలువడే వాయువులు, ధూళీ అణువులను పీల్చడం వల్ల శరీరంలోకి విష పదార్థాం ప్రవేశించి హాని కలిగిస్తుంది. నోటి ద్వారా.. పురుగు మందులను ముట్టుకున్నప్పుడు లేదా వాడిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహార పదార్థాలు తీసుకుంటే పురుగు మందుల అవశేషాలు మన శరీరంతోకి ప్రవేశిస్తాయి. అలాగే కలుషిత ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా పురుగు మందులు లోపలికి వెళ్లి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ఒక్కొక్కసారి మరణం సంభవిస్తుంది. పాడి–పంట -
సర్వర్ సమస్య వస్తోంది..
నగరంలో మా ఏజెన్సీ పరిధిలో నెలకు 3 వేల వరకు కమర్షియల్ సిలిండర్లు అందిస్తున్నాం. వాటన్నింటినీ పూర్తిగా నిలిపివేశాం. ఇళ్లకు ఇచ్చే వాటిలో ఎలాంటి సమస్య లేదు.. వాటిని సక్రమంగా అందిస్తున్నాం. రెండు, మూడు కనెక్షన్స్ ఉన్న వాళ్లు మొత్తం అడ్వాన్స్ బుక్ చేసుకోవడానికి చూస్తున్నారు. దీంతో సర్వర్ సమస్య వస్తోంది. హోటల్స్, పరిశ్రమలు ఇతర కమర్షియల్ వాటికి ఇవ్వడం లేదు. తర్వాత ఎలా ఉంటుందనే అంశంపై నేడు సమావేశం ఉంటుంది. – లక్ష్మీకాంత్రెడ్డి, స్వప్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు హోటల్ నిర్వహణ కష్టంగా ఉంది మా రెస్టారెంట్లో రోజుకు నాలుగు సిలిండర్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఒకటి ఇచ్చారు. దీంతో హోటల్ నడపటం చాలా కష్టం. మా దగ్గర 150 రకాల వంటకాలు ఉంటాయి. కానీ సిలిండర్ల కొరత వల్ల బిర్యానీతో పాటు ఒకటి రెండు రకాల వంటలు చేయాల్సిన పరిస్థితి. రోజు కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం కష్టం. ఇలాగే కొనసాగితే హోటళ్ల నిర్వహణ పూర్తిగా కష్టంగా మారుతుంది. – నిరంజన్రెడ్డి, శిల్పి హోటల్ యాజమాని, మహబూబ్నగర్ సిలిండర్లు లేవని చెబుతున్నారు సాధారణంగా కట్టెల పొయ్యిపై అన్ని రకాల టిఫిన్స్ చేయడం సాధ్యం కాదు. టిఫిన్ హోటల్స్కు తప్పక సిలిండర్లు అవసరం అవుతాయి. అవంతి హోటల్లో నిత్యం ఐదు సిలిండర్ల వినియోగం ఉంటుంది. ప్రస్తుతం కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సిలిండర్ల ధరను పెంచడం కూడా ఇబ్బందికరంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల దగ్గర సిలిండర్లు లేవని చెబుతున్నారు. – చంద్రశేఖర్ శెట్టి, అవంతి హోటల్ కమర్షియల్ సిలిండర్లు నిలిపివేశాం.. జిల్లాలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్ ఇతర కమర్షియల్ వాటికి సిలిండర్ల వినియోగం పూర్తిగా నిలిపివేశాం. డొమెస్టిక్ సిలిండర్ల పంపిణీలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నాం. ప్రభుత్వ వసతి గృహాల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా సిలిండర్లు అందిస్తాం. ఈ అంశంపై ఉన్నత అధికారులతో శుక్రవారం సమావేశం ఉన్న నేపథ్యంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రానున్నాయి. – శ్రీనివాస్, డీఎస్ఓ, మహబూబ్నగర్ ● -
జాతీయ సమగ్రతను పెంచుతాయి: వీసీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ల వల్ల జాతీయ సమగ్రతను పెంపొందిస్తాయని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటకలోని రాయచూర్లో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ను పీయూ విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ క్యాంపులో విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయం అని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి క్యాంపులో పాల్గొనడం వల్ల పలు అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. జాతీయ ఐక్యత, సహకారం, సామాజిక బాధ్యత.. తదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఇందులో నేర్చుకున్న అంశాల ద్వారా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, లీడర్లు సోమ్లా, అధ్యాపకులు భూమయ్య, రవికుమార్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘బోరు’మన్న కుటుంబం
భూత్పూర్: అసలే అప్పులు పెరిగిపోయాయి.. బావి వద్ద మరో బోరు వేయొద్దని వాదించినా భర్త వినలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లితోపాటు ఇద్దరు కూతుళ్లు మృత్యువాత పడగా, కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామానికి చెందిన కుర్వకేత బీరయ్య–జంగమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. బీరయ్య గతేడాది పొలంలో రెండు బోర్లు వేయగా నీరు పడలేదు. దీంతో బీరయ్య భార్య జంగమ్మతో కలిసి 150 గొర్రెలు తెచ్చుకొని వాటిని సాకుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల పాత ఇంటిని కూలగొట్టి పునర్నిర్మించగా.. రూ.30 లక్షల వరకు అప్పు అయింది. ఈ క్రమంలోనే బీరయ్య పొలం వద్ద మరో బోరు వేస్తానని చెప్పడంతో భార్య జంగమ్మ వద్దని వారించింది. అయినా, బుధవారం బీరయ్య పొలంలో బోరు వేయగా నీరు రాలేదు. ఆ వెంటనే మరో చోట బోరు వేయడానికి భర్త ప్రయత్నిస్తుండటంతో భర్తతో వాదించింది. బుధవారం సాయంత్రం సైతం గొర్రెల మంద వద్ద ఉన్న భర్తను బతిమాలిన వినలేదు. గురువారం తెల్లవారుజామున బోరు వేస్తుండటంతో గమనించిన జంగమ్మ(35) ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి తన కుమార్తెలు జ్యోతి (14), శైలజ (12)తోపాటు కుమారుడు జశ్వంత్ను పొలానికి కొద్ది దూరంలో ఉన్న బావి వద్దకు బలవంతంగా తీసుకెళ్లి పిల్లలను తోసేసి తానూ బావిలో దూకింది. ఈ ఘటనలో జంగమ్మతోపాటు ఇద్దరు కూతుళ్లు మృతిచెందగా, కొడుకు జశ్వంత్ బావిలో ఉన్న కట్టెను పట్టుకొని బయటకు వచ్చాడు. గ్రామంలోని పెద్దలు, బంధువులకు తల్లి, అక్కలు బావిలో దూకారని చెప్పాడు. దీంతో బంధువులు బావి వద్దకు వచ్చి తాళ్ల సహాయంతో మృతదేహాలను బయట కు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.మూడు రోజుల క్రితమే పాఠశాల నుంచి వచ్చి..భూత్పూర్ సమీపంలోని రాజీవ్ స్వగృహలోని జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జ్యోతి 9వ తరగతి, శైలజ 5వ తరగతి చదువుతున్నారు. జంగమ్మ పాఠశాలకు వెళ్లి ఫంక్షన్ ఉందని ప్రిన్సిపాల్కు చెప్పి 3 రోజుల క్రితమే కూతుళ్లను ఇంటికి తీసుకొ చ్చింది. ఇంతలో ఈ ఘాతుకానికి పాల్పడింది. -
రోడ్లపైనే నిలుపుతున్న బస్సులు
దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో రెండేళ్లుగా ఆర్టీసీ బస్సులు, కర్ణాటక బస్సులను ఆర్వోబీకి రెండు వైపుల రోడ్లపైనే నిలుపుతున్నారు. దీనివల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రయాణికులు, విద్యార్థులు సైతం రోడ్లపై నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి. ఇక ఆర్టీసీ వారు కనీసం తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వానలో తడుస్తూ, ఎండలో నిలబడి ఇబ్బందులు పడుతూ బస్సులను ఎక్కాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. -
ఏప్రిల్ 28 నుంచి.. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): తీర్థ యాత్రలకు వెళ్లేవారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని మహబూబ్నగర్ డీపీఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం డీపీఆర్ఓ కార్యాలయంలో ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు వివరాలతో కూడిన బ్రౌచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏప్రిల్ 28 నుంచి జూన్ 12 వరకు 4 ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్ గౌరవ్ టూరిస్టు రైలు’ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో అయోధ్య– కాశీ : బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర, పూరి కోణార్క్– బైద్యనాథ్ ధామ్– వారణాసి అయోధ్య– ప్రయాగరాజ్, హరిద్వార్– మాతా వైష్ణోదేవి– రిషికేష్ యాత్ర, అరుణాచలం– చిదంబరంతో దివ్య దక్షిణ యాత్రలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ యాత్రలో రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం) సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో టూరిజం అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కీచకుడికి జీవితఖైదు
● సంచలన తీర్పు వెలువరించినజిల్లా కోర్డు ● కన్నకూతురి కోసం భర్తపై న్యాయపోరాటం వనపర్తి: సభ్యసమాజం తలదించుకునే.. రెండోసారి గుర్తుచేసుకునేందుకు సిగ్గుగా అనిపించే దురదృష్టకరమైన ఘటన కన్నకుమార్తైపె లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి కేసులో బుధవారం జిల్లా జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. భర్తే కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడడంతో కీచకుడిని ఎదిరించి ఆ తల్లి చేసిన న్యాయపోరాటం సఫలీకృతమైంది. ఇలాంటి ఘటనలు సమాజంలో మరోసారి పునరావృత్తం కావొద్దంటూ.. బుధవారం వనపర్తి జిల్లా కోర్టులో న్యాయమూర్తి ఎంఆర్ సునీత నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా విధించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి హెచ్చరికలు చేసినట్లు అవుతుందని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా పానగల్ మండలానికి చెందిన వల్లెపోలు కురుమయ్య తన కుమార్తెకు పుస్తకాలు ఇప్పిస్తానని నమ్మించి పెబ్బేరు మండలంలోని రంగాపూర్ శివారులోని జూరాల కాల్వ వద్దకు తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు పోలీసులు విచారణ చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు కోర్టు ముందు ఉంచడంతో.. వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం తుది తీర్పును వెలువరించింది. భర్తపై న్యాయపోరాటం కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తైపె మృగంలా అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని తల్లికి చెప్పేందుకు బాధితురాలికి నాలుగురోజుల సమయం పట్టింది. విషయం తెలుసుకున్న వెంటనే భరించలేని తల్లికి న్యాయపోరాటానికి సిద్ధమై.. పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం తీసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టిన ఆధారాల ప్రకారం జిల్లా జడ్జి తీర్పునిచ్చినట్లు ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటానికి కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
గ్రామాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామ సర్పంచు బొజ్జ గీత కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించిన మహిళా జాతీయ సదస్సులో నల్లమల ప్రాంతానికి చెందిన మహిళా సర్పంచు బొజ్జ గీత పాల్గొన్నారు. జాతీయ సదస్సులో రాష్ట్రంలో నుంచి 16 మంది మహిళా సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయగా... అందులో నాగర్కర్నూల్ జిల్లా నుంచి ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ గీత కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సదస్సులో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని కోరారు. ప్రజాప్రతినిధులుగా మహిళలు ఉన్న ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నల్లమల ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర నిధులు కేటాయించాలని కోరారు. నిధుల ఆధారంగానే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. తన గ్రామ పంచాయతీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సదస్సులో నాగర్కర్నూల్ జిల్లా నుంచి పాల్గొనడానికి అవకాశం కల్పించిన కలెక్టర్, డీపీఓ, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
బస్టాండ్ ఉన్నా.. తప్పని వెతలు
దేవరకద్రలో బస్సుల రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారిన బస్టాండ్ దేవరకద్ర: ఆర్టీసీ బస్టాండ్ ఉన్నా.. బస్సులు లోపలికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు. బస్సులన్నీ ప్రధాన రోడ్డుపై నుంచే వెళ్తుండడంతో ప్రయాణికులు ఎండకు, వానకు రోడ్లపైనే వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం నుంచి నిత్యం మహబూబ్నగర్, హైదరాబాద్, నారాయణపేట, మక్తల్, ఆత్మకూర్, మంత్రాలయం, రాయిచూర్, సింధనూర్, గంగావతి, హుబ్లీ, యాద్గిరి, దావణగెరె, బాగల్కట్, లింగ్సూగూర్తో పాటు పలు ప్రధాన పట్టణాలకు వందలాది బస్సులు సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి రద్దీ ఉన్న దేవరకద్రలో ఏడాదిన్నరగా బస్టాండ్ మూత పడింది. దీనికి కారణం ఆర్వోబీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైంది. ఆర్వోబీ ప్రారంభం కాకముందు బస్సుల రాకపోకలతో కళకళలాడిన బస్టాండ్ ఇప్పుడు దైన్యస్థితిలో వెలవెలబోతుంది. బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడంతో బస్టాండ్లోని షాపులన్నీ మూతపడ్డాయి. బస్టాండ్ బయట, చుట్టుపక్కల వ్యాపార కేంద్రాలన్నింటిని మూసి వేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో బస్టాండ్ ఆవరణ నిర్మానుష్య ప్రాంతంగా దర్శమిస్తోంది. యూటర్న్ లేకపోవడంతో.. దేవరకద్రలో నిర్మించిన ఆర్వోబీకి టాకీస్ వైపు ఇటీవల కొత్తగా సీసీ రోడ్డు వేశారు. మరోవైపు పాత రోడ్డుపైనే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆర్వోబీకి సమీపంలో యూటర్న్ లేకపోవడం వల్ల బస్సులు బస్టాండ్లోకి రాని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ నిధులతో సర్వీసు రోడ్లు వేయడానికి ఇటీవల శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు పూర్తయితే సర్వీసు రోడ్లు బాగుపడతాయి కానీ బస్సుల రాకపోకలకు అనువుగా మారుతుందా అనే ప్రశ్న తలెత్తుంది. పరిశీలనలకే పరిమితం ఆర్టీసీ అధికారులు పలుమార్లు వచ్చి పరిశీలించి, ప్రయాణికులకు తాత్కాలికంగా షెల్టర్ను ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలకు అనువుగా రోడ్లను మారుస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. అలాగే ప్రస్తుతం రిక్వెస్ట్ స్టాప్లు ఉన్న చోట ప్రయాణికులకు కనీస సౌకర్యాలను కూడా కల్పించకపోవడంతో బస్సుల కోసం వేచి ఉండే వారు నానా ఇబ్బందుల పాలవుతున్నారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో కనీసం నీడ లేక ప్రయాణికులు ఎండలోనే నిలబడే పరిస్థితి ఉంది. ఇక చిన్న పిల్లలతో వచ్చే మహిళలు పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. దీనికితోడు ప్రయాణికులు రోడ్లపై నిలబడడం, బస్సులు రోడ్డుపైనే ఆపుతుండడంతో ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి దేవరకద్ర బస్టాండ్ విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే రిక్వెస్ట్ స్టాప్లో అయిన తాత్కాలిక షెల్టర్లు వేసి తాగునీటిని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. దేవరకద్ర బస్టాండ్లోకి రాని బస్సులు రోడ్డుపైనే ప్రయాణికుల ఎదురుచూపులు మహిళలు, పిల్లలు, వృద్ధులకు తప్పని పాట్లు పరిష్కారం చూపని ఆర్టీసీ అధికారులు -
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
మరికల్: మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న కల్వకుర్తికి చెందిన రఘుకుమార్ బుధవారం మరికల్ రైల్వేస్టేషన్ దగ్గర పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే సిబ్బంది గమనించి వెంటనే 108 అంబులైన్స్కు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పొందుతూవ్యక్తి మృతి అచ్చంపేట రూరల్: విష పదార్థం తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. సిద్దాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన రామస్వామి(52)మనస్తాపానికి గురై ఈనెల 1న వ్యవసాయ పొలంలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు గమనించి అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నాగర్కర్నూల్, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య రసుల ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో అధికారుల తనిఖీ కొల్లాపూర్: పట్టణంలోని సాయికృప ఆస్పత్రిలో బుధవారం రాత్రి వరకు పోలీసులు, వైధ్యశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఓ అబార్షన్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా డీఎస్పీ శ్రీనివాస్యాదవ్, డీఎంహెచ్ఓ రవికుమార్లు ఆస్పత్రిలో రికార్డులు తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులను సుధీర్ఘంగా విచారించారు. రాత్రి 9 గంటల తర్వాత ఆసుపత్రి నిర్వాహకులు కొండా శ్రీనివాసులుతో పాటు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అంతకుముందు డీఎంహెచ్ఓ విలేకరులతో మాట్లా డుతూ ఆస్పత్రిలో గతంలో నిబంధనలకు విరు ద్ధంగా అబార్షన్ చేశారని, ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఆస్పత్రిని సీజ్ చేయమని ఉన్నతాధికారులు ఆదేశించారని, ప్రస్తుతానికి స్కానింగ్ యంత్రాలను సీజ్ చేశా మని, గురువారం కలెక్టర్తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ ఘటనపై ఆస్పత్రి నిర్వాహకుడు కొండా శ్రీనివాసులు మాట్లాడుతూ తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాగునీటి కటకట ● మూడురోజులుగా నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా దేవరకద్ర: పట్టణంలో మూడు రోజులుగా ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతుతో సోమవారం సాయంత్రం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేశారు. బుధవారం ఉదయం 6 గంటల తర్వాత నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పినా రాత్రి వరకు సరఫరా కాలేదు. దీంతో కొన్ని వార్డుల్లో ప్రజలకు ట్యాంకర్లతో నీటిని అందించారు. బోర్లు ఉన్నవారు ఎలాగో నీటిని వాడుకునే అవకాశం ఉండగా.. కేవలం మిషన్ భగీరథ నీటిపై ఆధారపడిన వారు మాత్రం నీటికోసం పడరాని పాట్లు పడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పిన అధికారులు తాగునీటి సమస్యపై దృష్టిసారించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. -
విద్యాసంస్థల పరువు తీసేలా ప్రవర్తించొద్దు
● నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ వెల్దండ: విద్యాసంస్థల పరువు తీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. వెల్దండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన బాలికల గురుకుల పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తప్పనిసరిగా ప్రభుత్వం అందించిన కామన్డైట్ మెనూ పాటించాలన్నారు. విద్యార్థులకు సరిపడా ఆహార పదార్థాలు అందించాలని సిబ్బందికి సూచించారు. నాణ్యమమైన ఆహార పదార్థాలను వంటలకు ఉపయోగించాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి వంటలు ఎలా ఉన్నాయి, ఆహారం రుచిగానే అందిస్తునారా అని ఆరాతీశారు. సాంఘిక గురుకుల పాఠశాలలో బాలికలతో కలిసి సహపంక్తి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో బోధన విధానం, విద్యార్థులక సౌకర్యాలు, భౌతిక వసతులు, క్రమశిక్షణ, నిర్వహణ పరిస్థితులను వివరంగా పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్ ఉపాధ్యాయునులతో మాట్లాడుతూ.. గురుకులాల ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నిబద్ధతగా నిర్వర్తించి, విద్యార్థుల విద్యాభ్యున్నతికి మాత్రమే కృషి చేయాలన్నారు. విద్యాసంస్థ, పాఠశాల పరువు తీసేలా, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. గురుకులాల్లో ఎమైనా సమస్యలు ఉంటే, వాటిని తక్షణమే ఉన్నతాధికారులు, తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా, వ్యక్తిత్వ, నైతిక అభివృద్ధికి మరింత కృషి చేయాలని, గురుకులాల్లో క్రమశిక్షణ, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు హితవు పలికారు. ఉపాధ్యాయుల అంతర్గత విభేదాల కారణంగా విద్యాసంస్థల పరువు తీయకూడదన్నారు. ఇటీవల కేజీవీబీలో జరిగిన ఘటనలపై కొంతమందిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా టర్మినేషన్ చేశామని సూచించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్పా.. డ్డుపైకి విద్యార్థులను పంపడమేంటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సమస్యలుంటే బయట పరిష్కరించుకోండి.. పాఠశాలల్లో సమస్యలు సృష్టించి విద్యార్థులకు ఆటంకం కలిగించొద్ద ఆదేశించారు. ఇకపై ఇలాంటి విషయాలపై సహించబోమన్నారు. విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నందున వారి విద్యాభ్యాసంపై దృష్టిపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, వెల్దండ తహసీల్దార్ కార్తీక్కుమార్, ఎంపీడీఓ కృష్ణయ్య, సర్పంచ్ మట్ట యాదమ్మ తదితరులు ఉన్నారు. -
మహిళలకు అన్ని ఇబ్బందులే..
బస్టాండ్లోకి బస్సులు రాకపోకలు లేక ఆర్వోబీ పక్కనే రోడ్డుపైనే బస్సులు ఆపుతున్నారు. గ్రామాలకు వెళ్లే బస్సుల కోసం రోడ్డుపైనే ఎదురుచూడాల్సి వస్తోంది. సరైన నీడ లేక ఎండలో నిలబడుతున్నాం. కనీసం కూర్చోడానికి కూడా జాగా లేదు. తాగడానికి నీళ్లు లేవు, మూత్రశాలలు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి. –రాములమ్మ, అప్పంపల్లి, చిన్నచింతకుంట మండలం రోడ్డుపైన నిలబడలేక.. దేవరకద్ర బస్టాండ్ మూతపడడంతో బస్సుల కోసం రోడ్డుపైనే ఎదురు చూడాల్సి వస్తోంది. కనీస నీడ సౌకర్యం కూడా లేకపోవడంతో ఎండలో వేసిన బెంచీలపై కూర్చోవాల్సిన దుస్థితి ఉంది. దాహం తీర్చుకోవడానికి తాగునీరు కూడా దొరకడం లేదు. పిల్లలతో వచ్చే ఆడవారు చాలా ఇబ్బందులు పడతున్నారు. నీడను కల్పించడానికి తాత్కాలికంగా షెడ్డు వేసి సౌకర్యాలు కల్పించాలి. –మణెమ్మ, వెంకంపల్లి, కౌకుంట్ల మండలం● -
సరిహద్దులో బారులు
● ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాయచూర్ జిల్లా బంధ్ ● సరిహద్దులో నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు కృష్ణా: రాష్ట్ర సరిహద్దులోని టైరోడ్డులో రాయచూర్ జిల్లా పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే రాయచూర్కు వెళ్లనివ్వకుండా వాహనాలను నిలిపేశారు. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని అదే విధంగా బడ్జెట్లో దళితుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడంతో ఆగ్రహించిన దళిత సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాయచూర్ జిల్లా బంధ్కు పిలుపునిచ్చారు. దీంతో కర్ణాటక పోలీసులు సరిహద్దు గ్రామాల నుంచి వాహనాలను అనుమతించకపోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మక్తల్ సీఐ రాంలాల్, కృష్ణా ఎస్ఐ నవీద్, మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మారెడ్డిల ఆధ్వర్యంలో బందబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి రాయచూర్కు వెళ్లే ఆర్టీసీ బస్సులను టైరోడ్డు నుంచే వెనక్కి పంపించి వేశారు. దీంతో రాయచూర్ పట్టణానికి వెళ్లే ప్రయాణికులు కాలినడకన అలాగే కొందరు ద్విచక్రవాహనాలపై ఆపసోపాలు పడుతూ వెళ్లారు. బంధ్కు పిలుపునిచ్చిన సమయంలో కనీసం ముందస్తుగా సమాచారం అందించినట్లయితే తమ ప్రయాణాలను వాయిదా వేసుకునేవాళ్లమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకువాహనాల నిలిపివేత ఎమ్మార్పీఎస్ నాయకులు రాయచూర్ జిల్లాకు బంధ్ పిలుపు నివ్వడంతో ఎస్పీ ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దులోని టైరోడ్డులో వాహనాలను నిలిపేశాం. ముందస్తు జాగ్రత్తగా సాయంత్రం వరకు అనుమతించడం లేదు. ఈ విషయంపై ఆర్టీసీ డిపోలకు ముందస్తు సమాచారం అందించాం. – నారాయణ, ఎస్ఐ, శక్తినగర్ -
వాతావరణం.. చీడపీడలు
అలంపూర్: వ్యవసాయం... వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా నేల స్వభావం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. విత్తనం వేసే సమయం నుంచి పంట చేతికి వచ్చే వరకు వాతవరణ ప్రభావం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అతివృష్టి లేక అనావృష్టి ఏది సంభవించినా పంటలకు తీవ్ర నష్టం తప్పదని ఏడీఏ సక్రియ నాయక్ వివరిస్తున్నారు. వీటిని ముందుగా తెలుసుకోగలిగితే కొంత వరకై నా నష్టాల బారి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. తుఫాను సమయం మబ్బులు, తేమ వాతావరణం, ఉష్ణోగ్రతలు తగ్గడం వంటివి బూజు తెగుళ్ల ఉధృతికి తోడ్పతాయని, వాతావరణం పొడిగా ఉంటే ఆకుముడత, రసం పీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇటువంటప్పుడు వ్యవసాయాధికారుల సూచనలతో పంటను కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. పాడి–పంట -
సంతోషంగా ఉంది..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు అవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేవరకద్ర, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్లు కూడా ఏబీఎస్ఎస్ కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. – దిడ్డి గోపాల్ నారాయణ, డీఆర్యూసీసీ మెంబర్ -
హోటళ్లలో తనిఖీలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని పలు హోటళ్లను బుధవారం మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మూకుమ్మడిగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నాలుగు చోట్ల ఆహార పదార్థాలలో శుచి, శుభ్రత పాటించడం లేదని గుర్తించారు. ఒక స్టార్ హోటల్లో ఒకరోజు ముందు వండిన అన్నం, చికెన్ నిల్వ ఉన్నట్లు వారి పరిశీలనలో బయటపడింది. అలాగే కొత్తబస్టాండు సమీపంలోని ఓ బేకరీలో ఎక్స్పైరీ డేట్ దాటిన పదార్థాలు ఉండగా వాటిని పారబోయించారు. దీంతో నలుగురు యజమానులకు కలిపి మొత్తం రూ.13వేల జ రిమానా విధించారు. దాడుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. పడిపోయిన ఉల్లి ధరలు ● క్వింటాల్కు గరిష్టంగా రూ.1,200, కనిష్టంగా రూ.900 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు సుమారు 6 వేల బస్తాలలో ఉల్లిని అమ్మకానికి తీసుకురావడంతో యార్డు మొత్తం ఉల్లి కుప్పలతో నిండిపోయింది. అయితే దిగుబడులు పెరగడంతో ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ వారం వేలంలో ఉల్లి ధరలు బాగా పడిపోయాయి. క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.1,200, కనిష్టంగా రూ.900 వరకు ధర పలికింది. ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలామంది తెచ్చిన ఉల్లిని తిరిగి తీసుకుపోలేక వచ్చిన ధరలకే విక్రయించారు. స్థానిక వ్యాపారులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొని ఉల్లిని కొనుగోలు చేశారు. బయట నుంచి వచ్చిన వ్యాపారులంతా కొనుగోలు చేసిన ఉల్లిని వాహనాల్లో తరలించారు. మార్కెట్ వ్యాపారులు 50 కిలోల బస్తాలుగా తూకం వేసి గరిష్టంగా రూ.600, కనిష్టంగా రూ.450 చొప్పున విక్రయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉల్లి వేలం కాగా సాయంత్రం వరకు విక్రయాలు కొనసాగాయి. ‘ఉపాధిహామీ’పై నిర్లక్ష్యం తగదు అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై వివక్ష చూపుతూ లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందని.. ఉపాధి కూలీలకు అండగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీ రాంజీగా పేరు మార్చి జీఓ తీసుకురావడం దారుణమన్నారు. కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం సిగ్గుమాలిన చర్యగా అభి వర్ణించారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి పనులు చేస్తున్నా కూలి డబ్బుల అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్ధితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ముదురుతున్నందున నీడ కోసం షేడ్నెట్లు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారి కూలి రూ.307 చెల్లిస్తున్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని.. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. -
యువతకు కిడ్నీ గండం
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవన విధానంతో యువత ఒత్తిడికి లోనవుతోంది. దీనికితోడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారానికి అలవాటు పడటం, మానసిక ఒత్తిడి, ఎక్కువగా నొప్పులకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ వాడటం, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యం, పొగాకుకు బానిసవ్వడం తదితర అలవాట్లు కిడ్నీ రోగాలకు దారితీస్తోంది. రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహారం తినేటప్పుడు మాత్రమే యువత నీళ్లు తాగుతుండటం వల్ల శరీరానికి అవసరమైన నీరు సరిపోవడం లేదు. మరోవైపు ప్రాథమిక స్థాయిలో కిడ్నీ సమస్యలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది. జిల్లాలో 28– 30 ఏళ్ల వయస్సులో అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్న వారిలో కిడ్నీలు దెబ్బతింటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 479 మందికి డయాలసిస్ ఉమ్మడి పాలమూరులో గద్వాల, వనపర్తి జిల్లాలో అధికంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో డయాలసిస్ రోగులు అధికంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితితోపాటు ఆహార అలవాట్ల వల్ల కూడా కిడ్నీ బాధితులు అధికం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 77 మిషన్ల ద్వారా 479 మంది రోగులకు నిత్యం డయాలసిస్ చేస్తున్నారు. కొత్తగా ఆత్మకూర్లో ఐదు, మక్తల్లో ఐదు మిషన్లతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మార్చి రెండో గురువారం.. ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తారు. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా 9– 10 సెంటిమీటర్ల వెడల్పుతో పాటు 150గ్రాముల బరువు కల్గి ఉంటాయి. కిడ్నీ ప్రధాన శరీరంలోని నీటి లవణాల సమత్యులత, రక్త తయారీలో కీలక పాత్ర, మూత్రం తయారీ చేస్తుంటాయి. ప్రధానంగా కిడ్రీలలో సమస్య తీవ్రతరం అయితే తప్ప లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఆకలి మందగించడం, నీరసం, వాంతులు, చిరాకు, బరువు తగ్గడం, కాళ్ల వాపులు, మూత్రం తగ్గడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్ర, ఒత్తిడి లేకుండా జీవనం, సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. రోగులకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే డయాలసిస్ చేపట్టాలి. అందుబాటులో కేంద్రం ఉంటే రోగికి మేలు జరుగుతుంది. సుదూరంలో ఉండటం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉంటే ఎరిత్రోఫాయింట్ ఇంజెక్షన్ ఇస్తారు. మరీ తక్కువగా ఉంటే నేరుగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమీపంలోనే కేంద్రం ఉంటే ఇలాంటి సందర్భాల్లో రోగి కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండదు. కిడ్నీ రోగులకు ఒక్కసారిగా బీపీ పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రాలు దగ్గరలోనే ఉంటే వెంటనే రోగిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ. మూత్రపిండం.. జరభద్రం మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు మోతాదులో నీళ్లు తాగక అనర్థాలు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధిత బాధితులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
చకచకా.. సుందరీకరణ
ఊపందుకున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం పునరాభివృద్ధి పనులు రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. స్టేషన్ మహబూబ్నగర్: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’ (ఏబీఎస్ఎస్) కింద రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తుండటంతో.. ఈ పథకం కింద ఎంపికై న రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగు స్టేషన్లు విమానాశ్రయాల స్థాయిలో వసతుల కల్పనకు చర్యలు ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్న జనరల్ మేనేజర్ -
నేడు నూతన ప్రజాప్రతినిధులకు శిక్షణ
● హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఇటీవల నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె జిల్లాకేంద్రంలోని అనంత మారుతి గార్డెన్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని వీసీ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. శిక్షణకు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్లు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు పది థీమ్లపై చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అవగాహన కల్పిస్తారన్నారు. ఒకరోజు శిక్షణకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని, పోలీస్ బందోబస్తు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ ఘన్సీరాం, డీటీ దేవేందర్, ఆర్ఐ సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ ఈవీఎం గోదాం వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాంను త్రైమాసిక తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టర్ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదిక పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈవీఎంల రక్షణకు సంబంధించి ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఆకర్షణీయంగా.. ఆహ్లాదకరంగా
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్ని విధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పార్కింగ్, రైల్వే బుకింగ్ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులు వివిధ ప్లాట్ఫాంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు. రైల్వేస్టేషన్లో అనసవర నిర్మాణాలు తొలగించి సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు. అమృత్ భారత్ స్కీంకు ఎంపికై న శ్రీజోగుళాంబ రైల్వేస్టేషన్ -
‘పది’కి సమాయత్తం
● జిల్లాలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు ● సీసీ కెమెరాలు, నెట్ సౌకర్యం ఉన్నవాటికి డీఈఓ కార్యాలయంతో అనుసంధానం ● 10 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు.. ప్రత్యేకంగా సిట్టింగ్ స్క్వాడ్ నియామకం ● ఆన్లైన్లో అందుబాటులో హాల్టికెట్లు ● 60 కేంద్రాల ఏర్పాటు.. పరీక్ష రాయనున్న 13,217 మంది విద్యార్థులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో శనివారం నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి కాపీయింగ్ జరగకుండా, ఇతరత్రా సమస్యలు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 10 సమస్యాత్మక సెంటర్లను గుర్తించారు. ఇందులో కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో సిట్టింగ్ స్క్వాడ్ను నియమించనున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాకేంద్రంలోని కొన్ని పాఠశాలలు అడ్రస్ మారిన పాత పాఠశాల భవనం పేరు మీద ఎస్సెస్సీ విద్యార్థుల నామినల్ రోల్స్ సమర్పించినట్లు తెలుస్తుంది. భవనం మారినప్పటికీ కొత్త భవనం మారి సుమారు నాలుగేళ్లు గడుస్తున్నా.. కొత్త పాఠశాల పేరు మీద అసలు అనుమతులు తీసుకోకుండా పాత పాఠశాల భవనంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు నామినల్ రోల్స్ సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ఎంఈఓ కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది లోపాయికారిగా సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు.. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 40 ప్రభుత్వ పాఠశాలలు కాగా.. 20 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెమెరాలను ప్రధానంగా ప్రశ్నాపత్రం తెరిచే గదిలో మాత్రమే ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్నెట్, సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో ఉన్నవాటిని జిల్లా డీఈఓ కార్యాలయానికి అనుసంధానం చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ● జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తేనే హాల్టికెట్లు ఇస్తామని యాజమాన్యాలు వేధిస్తున్నారని, ఫీజుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని, నేరుగా హాల్టికెట్ తీసుకుని పరీక్షకు విద్యార్థులు వెళ్లవచ్చని సూచిస్తున్నారు. ఆన్లైన్లో హాల్టికెట్లు.. పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థులకు హాల్టికెట్ ఇవ్వడానికి ఫీజులు అడగడం సరికాదు. అలా ఎవరైనా అడిగితే విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు వెళ్లవచ్చు. ఇక పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నాపత్రం తెరిచే దగ్గర మాత్రం తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఐదు నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతి ఉంటుంది. తప్పుడు అడ్రస్ ఇచ్చిన పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ -
లిఫ్ట్ అడిగిన మహిళపై సామూహిక అత్యాచారం
మహబూబ్ నగర్ జిల్లా: మోటార్బైక్పై లిఫ్ట్ అడిగిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. బాదేపల్లి శివారులోని ఓ కాలనీకి చెందిన వివాహిత మహిళ(35) పట్టణంలో పనులు ముగించుకుని తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి మోటార్బైక్పై వెళ్తుండగా ఆమె గమనించి లిఫ్ట్ అడిగింది. దీంతో మోటార్ బైక్పై ఉన్న ఇద్దరూ ఆమెను ఎక్కించుకుని వెళ్లారు. అయితే మార్గమధ్యలో ఉన్న నిర్జన ప్రదేశానికి వెళ్లిన వెంటనే చీకట్లోకి బైక్ను మళ్లించి ఆమెను భయబ్రాంతులకు గురిచేసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
రేపు జిల్లా అథ్లెటిక్స్క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈనెల 15న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కార్నివాల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈనెల 11వ తేదీన స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్లలోపు బాలబాలికలకు 60 మీ., 600 మీటర్ల పరుగు, 20 ఏళ్లలోపు వారికి 100 మీ., 400మీటర్ల పరుగు, పురుషులు, మహిళలకు 100 మీ., 400మీటర్ల పరుగు పందెం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్ఎస్సీ మెమో, జనన ధ్రువీకరణ పత్రం, కులధ్రువపత్రంతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు. జిల్లాకు చేరిన టెన్త్ ప్రశ్నపత్రాలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ప్రశ్నపత్రాలు సోమవారం చేరాయి. ఒక్కొక్క సబ్జెక్ట్కు సంబంధించి 14 వేల ప్రశ్నపత్రాల చొప్పున జిల్లాకు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 13 స్ట్రాంగ్ పాయింట్ల పోలీస్స్టేషన్ పరిధిలో డిపాజిట్ చేశారు. సోమవారం హన్వాడలోని స్ట్రాంగ్ పాయింట్ను డీఈఓ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. స్ట్రాంగ్ పాయింట్లలో డిపాజిట్ చేసిన ప్రశ్నపత్రాలు పరీక్ష ప్రారంభానికి ముందు కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. 17, 18నయూనివర్సిటీల కన్వెన్షన్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్ను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వెన్షన్కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్ రమేష్బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్సీ రవికుమార్, మధుసూదన్రెడ్డి, బెక్కం జనార్దన్, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్, భరత్, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.9,200 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ.9,200, కనిష్టంగా రూ.4,329 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు గరిష్టంగా రూ.7,400, కనిష్టంగా రూ.5,009, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,401, కనిష్టంగా రూ.5,370, ఆముదాలు గరిష్టంగా రూ.6,112, కనిష్టంగా రూ.6,040, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,836, కనిష్టంగా రూ.1,600 ధరలు పలికాయి. ● నారాయణపేట మార్కెట్యార్డులో పెసర క్వింటా గరిష్టంగా రూ.7,977, కనిష్టంగా రూ.7,427, వేరుశనగ గరిష్టంగా రూ.8,169, కనిష్టంగా రూ.5,940, జొన్నలు గరిష్టంగా రూ.5,369, కనిష్టంగా రూ.5,160, అలసందలు గరిష్టంగా రూ.6,209, కనిష్టంగా రూ.5,600, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,969, కనిష్టంగా రూ.6,501, తెల్లకందులు గరిష్టంగా రూ.7,629, కనిష్టంగా రూ.6,769 ధరలు పలికాయి. భగీరథ నీటి సరఫరా నిలిపివేత నారాయణపేట ఎడ్యుకేషన్: మన్యంకొండ – నారాయణపేట మార్గంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ లీకేజీ మరమ్మతు కోసం 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు డి.శ్రీనివాస్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. లీకేజీ కారణంగా దెబ్బతిన్న పైపు భాగాన్ని తొలగించి.. కొత్త పైపుతో భర్తీ చేసేందుకు గాను నీటి సరఫరా నిలిపివేతతో దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలోని మండలాలు ప్రభావితం కానున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
కేఎల్ఐ, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లపై ఫోకస్..
2025 మే 1న మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, సాగునీటి పారుదల శాఖ అధికారుల బృందం పాలమూరు ప్రాజెక్ట్ను సందర్శించింది. నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు పంప్హౌజ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2026 మార్చి కల్లా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయితే తాజాగా మరో 20 నెలలకు గడువును పొడిగించింది. ● ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ), నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2027 మార్చికల్లా పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అలాగే కొడంగల్–నారాయణపేట–మక్తల్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచి 2027 మార్చి నాటికే పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. -
కాండం తొలుచు పురుగు.. నివారిస్తేనే లాభాలు
అలంపూర్: వరికి అధికంగా ఆశించే పురుగులలో కాండం తొలుచే పురుగు ఒకటి. ఈ పురుగునే మొవ్వ పురుగుగా పేర్కొంటారు. ఇది ప్రధానంగా నారు నుంచి పైరు పాలు పోసుకోనే దశ వరకు ఆశిస్తుంది. వరిలో అధిక దిగుబడికి పురుగు నివారణతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏడీఏ సక్రియనాయక్ రైతులకు సూచిస్తున్నారు. పురుగు జీవిత చక్రం : తల్లి పురుగు కనీసం 300 గుడ్ల వరకు పెడుతుంది. ఒక్కో గుంపులో 20 నుంచి 80 గుడ్లు ఉంటాయి. ఈ గుడ్లు 5 నుంచి 7 రోజులలో పొదిగి పురుగులు బయటికి వస్తాయి. లార్వా దశ పూర్తి కాలం 30 నుంచి 40 రోజులు ఉంటుంది. పూర్తి జీవిత చక్రం 70 రోజుల్లో పూర్తవుతుంది. నష్టపరిచే విధానం : ● చిరు పొట్ట ఏర్పడిన తర్వాత పురుగు ఆశిస్తే వెన్నులో నుంచి గింజలకు పోషకాలు అందక అవి తాలుగా మారుతాయి. ● తల్లి రెక్కల పురుగు గుడ్లను ఆకు చివరిపై భాగంలో గుంపులుగా పెట్టి ఉదరం చివర గల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది. ● ఈ పురుగులు గుంపులుగా మొక్క పైభాగంలో చేరి ఆకు తొడిమపై నున్న పత్ర హరితాన్ని గోకి తింటాయి. ● పూర్తిగా ఎదిగిన పురుగు వరి కాండంలో కోశస్త దశకు చేరుకుంటాయి. ●పైరు పిలకలు వేసే దశలో గుడ్ల నుంచి వెలుబడిన వెంటనే మొదట దశ పిల్ల పురుగులు ఆకు కొమ్మకు చేరుకొని అక్కడ పత్రహరితాన్ని గోకి తింటాయి. ● పంటల్లో ఈ పురుగు చేసే నష్టం వలన మొక్క ఆకులపై తెల్లని చారలుగా ఏర్పడతాయి. ● పురుగు కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినడం వలన మువ్వ ఆకులు విడిపడక మువ్వ కోళ్లు ఏర్పడుతుంది. నారు మడి నుంచే జాగ్రత్తలు : నారు తీయడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ గుళికలు సెంటు నారుమడికి 170 గ్రాము లు చొప్పున నీటిలో ఇసుకతో కలిపి చల్లుకోవాలి. నారు నాటేటప్పుడు నారు చివర్లు తుంచి వేయాలి. పంటలో నివారణ చర్యలు : వరి పిలకలు తొడిగే దశలో లీటరు నీటికి 2 మి.లీ క్లోరోఫైరిపాస్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అంకురం దశలో 10 నుంచి 15 రోజుల సమయంలో ఎకరానికి 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు చల్లుకోవాలి. పురుగు మందులైతే క్లోరో ఫైరిపాస్ 2 మి.మీ, అసిఫేట్ 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2.0 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది. కాండం తొలుచు పురుగు ఆశించన వరి పంట వరి కాండంను తొలుచుతున్న పురుగు పాడి–పంట -
నిర్ణీత కాలంలో పరిష్కరించి.. నివేదిక ఇవ్వండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణికి ప్రజలు జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఎంతో నమ్మకంతో వారి సమస్యల పరిష్కారం కోసం వస్తారని, వారి ఫిర్యాదులు, వినతులను పరిశీలించి తగు న్యాయం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 119 అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడం అధికారుల బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని, అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాకుండా ఒక శాఖ నుంచి మరొక శాఖకు అర్థం లేకుండా దరఖాస్తులను పంపించడం సరైన పద్ధతి కాదనిచెప్పారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్, అటవీ శాఖ, డీఆర్డీఏ, ప్రణాళిక శాఖ, గనుల శాఖ, భూ సేకరణ విభాగాలకు చెందిన అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై కలెక్టర్ వివరణ కోరారు. వచ్చే వారంలోగా అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి, గత వారం అందిన దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించినవి, ఇంకా పెండింగ్లో ఉన్నవి వంటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను స్పష్టమైన నమూనాలో సమర్పించాలని ఆదేశించారు. ● 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లాస్థాయిలో రోజువారీ షెడ్యూల్ ప్రకారం ప్రజలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ప్రతి రోజూ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను కార్యక్రమం అనంతరం జిల్లా అధికారుల వాట్పప్ గ్రూప్లో అప్లోడ్ చేయాలని, ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తారని, పంచాయతీస్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. అనంతరం జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు జగపతిరావు, ఎం.బాలయ్య, అశోక్కుమార్, నాగభూషణం, కోటిరెడ్డి తదితరులు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్బీ హరిప్రియలను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి దరఖాస్తును చదివి.. అవసరమైన విచారణ చేయండి అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రజావాణిలో 119 దరఖాస్తుల స్వీకరణ -
ఇప్పుడే నిప్పుల కొలిమి
● మూడురోజుల నుంచి పెరిగిన ఎండలు పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇంతలా మండుతుంటే.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతుండగా వాతావరణ కాలుష్యంతో వేడి తీవ్రత మరింత అధికమవుతోంది. జిల్లాలో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ఎండల తీవ్రత వల్ల ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకునే పనిలో ప్రతిఒక్కరూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తున్న క్రమంలో వచ్చే వారంరోజుల్లో కూలర్ల కొనుగోళ్లు అధికంగా పెరగనున్నాయి. ● ఉమ్మడి పాలమూరులో ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పీహెచ్సీల్లో అవసరమైన మందులతోపాటు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో దినసరి కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. -
ఎస్టీపీ పనులను వేగవంతం చేయండి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అమృత్–2 పథకం కింద నగరానికి మంజూరైన మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ (ఎంఏయూడీ జేడీ) డి.మమత అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’కు జిల్లా నోడల్ అధికారిణి అయిన ఆమె సోమవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా స్థానిక పద్మావతికాలనీలోని పార్కుకు వెళ్లి వర్మి కంపోస్టు తయారీ విధానంపై ఆరా తీశారు. అనంతరం విఘ్నేశ్వర కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్యం, శివశక్తినగర్లో నిర్మిస్తున్న వరద కాల్వ, శ్రీనివాసకాలనీ సమీపంలోని చెరువు వద్ద ఎస్టీపీ పనులను, కోయిల్కొండ ఎక్స్రోడ్లోని డంపింగ్ యార్డులో డీఆర్సీసీ, వర్మి కంపోస్టు ఎరువుల తయారీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరగా భూసేకరణ ప్రక్రియ చేపట్టి మిగతా రెండు చోట్ల ఎస్టీపీ పనులను ఆరంభించాలన్నారు. శివశక్తి నగర్ వద్ద ఆరంభించిన వరద కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే వర్మి కంపోస్టు ఎరువు తయారీతో పాటు పొడి, తడి చెత్తను వేరే చేసే విధానాన్ని ఇంకా మెరుగుపరచాలన్నారు. ఆయా కార్యక్రమాలలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి, డీఈఈ ప్రవీణ్కుమార్రెడ్డి, ఏఈ వసంత, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్జీ, లక్ష్మయ్య, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమీత్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి యూనిట్ బంగారమే..
ఇలా చేస్తే ఆదా.. ప్రతిఇంట్లో ప్రస్తుతం ఎల్ఈడీ బల్బులనే వినియోగిస్తున్నారు. ఇప్పటికీ కొందరు ఫ్లోర్సెంట్ ట్యూబ్లైట్లు వాడుతున్నారు. వీటి సామర్థ్యం 40వాట్లు ఉండడంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిదృష్ట్యా ఎల్ఈడీ ట్యూబ్లైట్లు మేలు. ● ఏసీలను 24నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతోపాటు బిల్లు ఆదా అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్తో నడిచే ఏసీలు లభిస్తున్నాయి. గది చల్లబడగానే ఆటోమేటిక్గా ఏసీ నిలిచిపోతుంది. వీటితో కొంత విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు పునఃప్రారంభమయ్యే సమయంలో లోడ్ పెరుగుతుంది. ఇది విద్యుత్ సరఫరా వ్యవస్థపై భారం పడుతుంది. ● సీజన్ మేరకు ఫ్రీజర్లో దశలు మారుస్తూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి. ● ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్ఈడీ బల్బులు, రిఫ్రిజరేటర్లు తదితర విద్యుత్ గృహోపకరణాలు 5స్టార్ ఉంటేనే విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు ఆదా అవుతుంది. ● కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరం లేని సమయంలో స్విచ్చాఫ్ చేయాలి. ఫోన్చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్ను ప్లగ్ నుంచి తొలగించాలి. కల్వకుర్తి టౌన్: వేసవి నేపథ్యంలో ప్రజలు ఎండ వేడికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుండటంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ప్రభు త్వం తెల్లరేషన్ కార్డు దారులకు ప్రతినెలా గృహజ్యోతి కింద నెలకు 200యూనిట్లలోపు జీరో బిల్లులు జారీచేస్తున్నారు. అయితే విద్యుత్ను విచ్చలవిడిగా వాడితే ఈ పథకం వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది. 200 యూనిట్లకు ఒక్క యూనిట్ అదనంగా వచ్చినా బిల్లు కట్టాల్సిందే. ఒకవైపు వేసవి తాపం, మరోవైపు విద్యుత్ బిల్లుల భారంతో ఒకటి కావాలంటే మరొకటి వదుకోవాల్సిన పరిస్థితి. దీనినుంచి గట్టెక్కాలంటే విద్యుత్ను పొదుపు చేసుకోవటమే మార్గం. ఉపకరణాలను పూర్తిగా కట్టేయాల్సిన అవసరం లేకుండా విద్యుత్ను పొదుపుగా వాడుకుంటే నిరంతరాయంగా గృహజ్యోతిని వెలిగించవచ్చు. పొదుపుగా వాడుకోవాలి వేసవి కాలంలో విద్యుత్ పొదుపుగా వాడుకుంటేనే గృహజ్యోతి పథకాన్ని పొందేందుకు సులువుగా ఉంటుంది. అంచనాలు లేకుండా వాడే విద్యుత్తో 200యూనిట్లు దాటితే విద్యుత్ బిల్లు పూర్తిగా చెల్లించాల్సి వస్తుంది. బిల్లుల భారం నుంచి గట్టెక్కాలంటే విద్యుత్ పొదుపుగా వాడటమే ఏకై కమార్గం. – నర్సింహారెడ్డి, ఎస్ఈ, నాగర్కర్నూల్ వేసవిలో విద్యుత్ను ఆదా చేస్తేనే ‘గృహజ్యోతి’ 200 యూనిట్లు దాటితే వర్తించని పథకం చిట్కాలు పాటిస్తే బిల్లుల భారం తగ్గే అవకాశం -
కౌకుంట్లలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
● మంత్రిని విన్నవించిన ఎమ్మెల్యే జీఎంఆర్ దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గంలో రైతులకు సంబంధించి పలు అబివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును సోమవారం కలిసి చర్చించారు. హైదరాబాద్లోని మంత్రి చాంబర్లో ఎమ్మెల్యే కలిసి కౌకుంట్ల మండలకేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో రైతులకు సహకారం అందించేందుకు కొత్తగా ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. పేరూర్, చౌదర్పల్లి గ్రామాలలో వ్యవసాయశాఖ సేవలు రైతులకు దగ్గరగా ఉండేలా కొత్తగా ఏఈఓ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కోరారు. దేవరకద్ర, కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రాలలో వ్యవసాయ శాఖకు చెందిన ఏడీఏ కార్యాలయాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ● నూతనంగా ఎన్నికై న రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని సోమవారం ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
పునరావాసం కల్పించాలని మంత్రికి వినతి
మక్తల్: మక్తల్ మండలం భూత్పూర్, మాగనూర్ మండంలోని నేరడుగోమ్ గ్రామస్తులకు పునరావాసం క ల్పించాలని రెండు గ్రామాలకు చెందిన బాధితులు మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లో జల సాధన సమీక్ష సమావేశంలో భాగంగా మంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు పునరావాస బాధితులు తెలిపారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ ఎంపీటీసీ కుర్మయ్యగౌడ్, రాఘవేందర్రెడ్డి, చెన్నయ్యగౌడ్, అశోక్గౌడ్, బీంసేన్రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సినేషన్కు కనిపించని ఆదరణ
● రెండో రోజు 13 మందికి హెచ్పీవీ టీకాలు పాలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హెచ్పీవీ వ్యాక్సినేషన్కు అంతగా ఆదరణ లభించడం లేదు. 14 ఏళ్లు నిండిన బాలికల సంబంధించిన తల్లిదండ్రుల నుంచి స్పందన రాకపోవడంతో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతుంది. రెండో రోజు సోమవారం జనరల్ ఆస్పత్రిలో ఏడుగురికి, జడ్చర్లలో ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చారు. తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్వచ్ఛందంగా వచ్చిన వారికే టీకాలు ఇస్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న లెక్కలు చూస్తుంటే ఏడాది గడిచిన జిల్లాలో ఉన్న లక్ష్యం పూర్తి అయ్యే అవకాశ కన్పించడం లేదు. జిల్లాలో 8,936 మంది అర్హులైన బాలికలు ఉన్న నేపథ్యంలో రోజు పదిమందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకు వస్తే గానీ విజయవంతం అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. -
‘ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలి’
ఉండవెల్లి: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, ఉచితంగా ఇసుక అందించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కంచుపాడులో సురవరం విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, మహిళలకు రూ.2.500, ఆసరా పింఛన్ పెంపు, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం అందించడం గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కేవలం రెండుసార్లే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేశారన్నారు. నడిగడ్డలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఒక ఎత్తిపోతల పథకానికి సురవరం సుధాకర్రెడ్డి పేరు పెడతామని హామీ ఇచ్చిన అమలు కాలేదని తెలిపారు. కంచుపాడు హత్య కేసులో నిందితులను విడిచిపెట్టి, అమాయకుల శిక్షించిన పోలీసులపై చర్యలను తీసుకోవాలిన ఉన్నతాధికారులను కోరారు. అనంతరం తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని మీటర్ రీడర్లు ఎమ్మెల్సీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సురవరం విజయలక్ష్మి, సీపీఐ నాయకులు శ్రీరాములు, కపిల్, నాగార్జున, రవి తదితరులు పాల్గొన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించాలి జాతీయ, రాష్ట్ర స్థాయిలో మహిళలు రాజకీయంగా ఎదిగి చట్టసభల్లో తమ గళం వినిపించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో రాణించిన మహిళలకు మెమొంటోలు అందించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు మాట్లాడుతూ.. సమాజంలో సీ్త్ర, పురుషులు సమానమే అని, అందరికీ సమాన అవకాలు కల్పించాలన్నారు. స్వామి రామానంద తీర్థ చైర్మన్ కిషోర్రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధితో కూడిన అవకాశాలు కల్పిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మహిళా సర్పంచులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, ఎంఈఓ సువార్తమ్మ, కపిల్, శ్రీరాములు, పోలీస్ సిబ్బంది, టీచర్లు పాల్గొన్నారు. -
సామాజిక పోరాటాలను ఉధృతం చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: వెనుకబడిన వర్గాలపై రోజురోజుకు దాడులు, అన్యాయాలు, వివక్షలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు సామాజిక పోరాటాలకు సిద్ధం కావాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్కుమాల్ అన్నారు. సోమవారం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా రెండో మహాసభలు జిల్లాకేంద్రంలోని సురవరం వెంకట్రామిరెడ్డి భవన్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, సామాజిక రుగ్మతలు ఇంకా ప్రజలను పట్టి పీడిస్తుందన్నారు. హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దళితులకు కేటాయించిన సబ్ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారన్నారు. దళితుల భూ సమస్యలు, ఉపాధి సమస్యలు, విద్యావకాశాల లోపం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయకపోవడం వంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నాయన్నారు. డీహెచ్పీఎస్ రాష్ట్ర రెండో మహాసభలను ఏప్రిల్ 17, 18వ తేదీల్లో వరంగల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భార్గవి, పద్మావతి, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో వెట్టిచాకిరీ
మాగనూర్: మండల పరిధిలోని వడ్వాట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు వెట్టిచాకిరీ చేయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు వారితో తరగతి గదులను, పరిసరాలను ఊడిపించడంతో పాటు ఇతర పనులు కూడా చేయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. విద్యార్థులతో పనులు చేయించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించిన ఉపాధ్యాయులపై ఉన్నతా ధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
● జిల్లాలో 51 వేల పశువులకు టీకాలు లక్ష్యం ● నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో పశువుల ఆరోగ్య పరిరక్షణకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పశువులలో వేగంగా వ్యాపించే గాలికుంటు వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించారు. జిల్లాలోని పశువైద్య సిబ్బందిని 51 బృందాలుగా ఏర్పాటు చేశారు. సుమారు 51 వేల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్గౌడ్ తెలిపారు. టీకాల కార్యక్రమం మార్చి 10 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ● జిల్లాలోని 17 మండలాల్లో పశువైద్య బృందాలు గ్రామాలకు వెళ్లి ఆవులు, ఎద్దులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. ఈ వ్యాధి కారణంగా పశువుల పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుందని అధికారులు తెలిపారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పశువులకు జ్వరం రావడం, నోరు, కాళ్ల వద్ద పుండ్లు ఏర్పడడం, తినలేకపోవడం వంటి లక్షణాలు గాలికుంటు వ్యాఽధి సంకేతాలని పశువైద్యులు తెలిపారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించాలని రైతులకు సూచించారు. -
మల్లేశ్వరంలో అలివి పట్టు పంచాయితీ
● టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన మహిళ పెంట్లవెల్లి: మండలంలో అలివి పట్టు పంచాయితీ ఓ మహిళ ఆత్యహత్య చేసుకునేందుకు యత్నించిన పరిస్థితికి దారితీసింది. వివరాలు ఇలా.. మల్లేశ్వరంలో సమీపంలోని కృష్ణానది బ్యాక్వాటర్లో అలివి వలలతో పాటు ఇతర వలలతో చేపల వేట సాగించేందుకు కొందరు అడ్డాలు ఏర్పాటు చేసుకున్నారు. సింగోటం పట్టు అనే అడ్డాలో కొన్నేళ్ల క్రితం వరకు కర్నూల్ జిల్లా కొండపాటూరు గ్రామానికి చెందిన గోపాల్ అలివి వలలతో చేపల వేట సాగించేవాడు. ఆయన మరణాంతరం మల్లేశ్వరం గ్రామానికి చెందిన మంగమ్మ ఈ అడ్డాలో చేపల వేట సాగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆమె తన అడ్డాను గ్రామానికి చెందిన తెలుగు శేఖర్ అనే వ్యక్తికి రూ.7 లక్షలకు లీజుకు ఇచ్చింది. దీంతో లీజు డబ్బులు తమకు ఇవ్వాలంటూ కొండపాటూరు గోపాల్ కుమారులు రవి, మధు కొన్ని రోజులుగా మంగమ్మను అడుగుతూ వచ్చారు. లేదంటే మా నాన్నకు చెందిన అడ్డాలో చేపలు పట్టుకోనియ్యమని బెదిరించారు. దీంతో ఆమె సోమవారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి పై నుంచి దూకుతానంటూ హల్చల్ చేసింది. ఆంధ్రాకు చెందిన వారు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి కాపాడాలని వేడుకొంది. ఎస్ఐ రామన్గౌడ్ అక్కడికి చేరుకొని ఆమెకు నచ్చజెప్పి కిందికి దించారు. ఈ ఘటనపై ఇరుపక్షాలతో మాట్లాడతామని తెలిపారు. -
ఇసుక మాఫియాపై విజిలెన్స్ దాడులు
● 3 హిటాచీలు, 2 టిప్పర్ల పట్టివేత మరికల్: కోయిల్సాగర్ వాగులో అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్న మాఫియాపై హైదరాబాద్ విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం తెల్లవారుజామున మెరుపుదాడులు చేసింది. ఈ క్రమంలో కోయిల్సాగర్ వాగులో ఉన్న 3 హిటాచీలు, 2 టిప్పర్లను పట్టుకున్నారు. పట్టుబడిన హిటాచీలు, టిప్పర్లను మరికల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కోయిల్సాగర్ వాగులో అధికారుల అనుమతి లేకుండా ఏడాది నుంచి రాత్రి సమయంలో ధన్వాడ మండలం గోటూర్ నుంచి మరికల్ మండలం రాకొండ వరకు వాగులోని ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక బయటకు వెళ్తే రూ.35 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అయితే ఇసుక అక్రమ రవాణాపై జిల్లా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ విషయాన్ని కొందరు హైదరాబాద్ విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విజిలెన్స్ అధికారుల బృందం అర్ధరాత్రి నుంచి గోటూర్, కొండాపూర్, పూసల్పహాడ్, రాకొండ ఇసుక రీచ్లపై మెరుపుదాడి చేయగా రాకొండ రీచ్లో 3 హిటాచీలు, 2 టిప్పర్లు పట్టుబడ్డాయి. ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ భగవంతురెడ్డి, ఎస్ఐ రాము తెలిపారు. -
జేపీఎన్సీలో బీటెక్ కోర్సులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: చదువుకోవాలని ఆసక్తి ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు, పేదరికం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాయంత్రం వేళల్లో విద్యార్థులు చదువుకునే విధంగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. పాలిటెక్నిక్, కనీసం సంవత్సరం ఉద్యోగ అనుభవం ఉన్నవారు బీటెక్ కోర్సుల్లో చేరవచ్చు. వీటితోపాటు బీటెక్ చేసినవారు ఎంటెక్ కోర్సుల్లో కూడా ప్రవేశం పొందవచ్చు. ఇందులో చేరిన వారికి సాయంత్రం వేళల్లో కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తారు. ఫీజులు మాత్రం రెగ్యులర్ ఫీజులకు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు తీసుకోనున్నారు. కాగా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలకు మాత్రమే సాయంత్రం వేళల్లో కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో 60 సీట్లు, సివిల్ ఇంజినీరింగ్లో 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్లో 30, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో 30, మెకానికల్ ఇంజినీరింగ్లో 30 సీట్లు ఉన్నాయి. ఈ మేరకు కళాశాలకు సాయంత్రం వేళల్లో తరగుతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో కళాశాల చైర్మన్ రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో కేవలం జేపీఎన్సీకి అవకాశం ప్రభుత్వం ఇవ్వడం గొప్ప విషయం అని, ఇక్కడ పనిచేస్తూ చదువుకుంటున్న విద్యార్థులకు సదావకాశం అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సాయంత్రం తరగతులు నిర్వహించేలా అవకాశం ఐదు కోర్సులకు గాను 180 సీట్ల కేటాయింపు ఉత్తర్వులు జారీచేసిన ఉన్నత విద్యామండలి -
హలీం.. సలాం
● రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకం ● సంప్రదాయమైన బలవర్ధకమైన ఆహారం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హలీమ్, హరీస్ దుకాణాలు స్టేషన్ మహబూబ్నగర్: రంజాన్ మాసం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది హలీం (హరీస్). రంజాన్ మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే ఈ వంటకం కోసం ఎంతోమంది ఎదురుచూస్తారు. ముస్లింలే కాకుండా అన్ని మతాలవారు వీటిని ఇష్టంగా ఆరగిస్తున్నారు. మహబూబ్నగర్ నగరంతోపాటు జిల్లాలోని పలు పట్టణ ప్రాంతాల్లో హరీస్, హలీమ్ దుకాణాలు వెలిశాయి. సాయంత్రం ఇఫ్తార్ అనంతరం నుంచి అర్ధరాత్రి దాకా హరీస్ సెంటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది సంఖ్యలో హరీస్, హలీమ్ స్టాళ్లు వెలవగా.. ఒక్క మహబూబ్నగర్ నగరంలోనే వంద దాకా కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన రహదారులు, జనాలు సందడిగా ఉండే ప్రాంతాలతోపాటు కొన్నిచోట్ల గల్లీల్లోనూ దుకాణాలను ఏర్పాటు చేశారు. సాధారణంగా హలీమ్ (మటన్) రూ.200– 350 (ప్లేట్), హరీస్ (చికెన్) రూ.80– 130 (ప్లేట్), హలీమ్ ఫ్యామిలీ ప్యాక్ రూ.800–1,200, హరీస్ ఫ్యామిలీ ప్యాక్ రూ.400– 600ల వరకు విక్రయిస్తున్నారు. -
జాతీయ మహిళా సదస్సుకు నల్లమల సర్పంచు
అచ్చంపేట రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ మహిళా సదస్సులో నల్లమల ప్రాంతానికి చెందిన మహిళా సర్పంచు బొజ్జ గీత పాల్గొననున్నారు. జాతీయ సదస్సుకు 16 మంది మహిళా సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయగా... నాగర్కర్నూల్ జిల్లా నుంచి ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ గీత ఉన్నారు. ఈ మేరకు ఈమె బుధవారం జరిగే మహిళా ప్రజాప్రతినిధుల జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. సదస్సుకు రాష్ట్రపతి హాజరు కానున్నారని తెలిసింది. కాగా సర్పంచు బొజ్జ గీత అమెరికాలో ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, గ్రామ ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందారు. అలాగే ఆమె భర్త బొజ్జ అమరేందర్రెడ్డి సీఎం ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. -
హెచ్సీఏ కార్యదర్శిగా మన్నె జీవన్రెడ్డి
నవాబుపేట: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా మండలంలోని గురుకుంట గ్రామానికి చెందిన మన్నె జీవన్రెడ్డి మంగళవారం నియమితులయ్యారు. ఈయన గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. కాగా ఎంఎస్ఎన్ ఫార్మ అధినేతగా ఉన్న ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చురుకై న పాత్ర పోషిస్తున్న తరుణంలో అసోసియేషన్కు ఎంపిక కావడం విశేషం. ఈయన ఎంపిక పట్ల ఎంజేఆర్ యువసేన సభ్యులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మన్నె జీవన్రెడ్డి ఆధ్వర్యంలో హెచ్సీఏ మరింత బలోపేతం అవుతుందని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు మొదటిసారిగా హెచ్సీఏ కార్యదర్శి పదవి రావడంతో క్రీడాకారులు అభినందనలు తెలిపారు. టీ స్టాల్లో నగదు చోరీ గద్వాల క్రైం: ఓ టీస్టాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి నగదు అపహరించిన ఘటన సోమవారం అర్థారాత్రి చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన ఆనంద్ స్నేహితులతో కలసి అనంతపురం స్టేజీ రోడ్డుమార్గంలో టీ బ్రేక్ పేరుతో టీ స్టాల్ను నిర్వహిస్తున్నాడు. రాత్రి కావడంతో టీ స్టాల్కు తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అర్థారాత్రి గుర్తు తెలియని దుండగులు తాళం ధ్వంసం చేసి క్యాష్ కౌంటర్లో భద్రపరిచిన రూ.21వేల నగదును అపహరించారు. మంగళవారం ఉదయం నిర్వాహకులు టీ స్టాల్ను తెరిచేందుకు రాగా.. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. చోరీ ఘటనలో గుర్తు తెలియని ట్రాన్స్జెండర్ ఉన్నట్లు నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు
మహమ్మదాబాద్: మండలంలోని నంచర్ల ప్రాథమిక పాఠశాల తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నంచర్లలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉదయం 2వ తరగతి విద్యార్థులు ఎప్పటిలాగే వచ్చి తమ గదిలో చదువుకుంటూ కూర్చున్నారు. ఒక్కసారిగా పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడటంతో మిగతా వారంతో బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న డీఈఓ ప్రవీణ్కుమార్ పాఠశాలను సందర్శించి ఘటనపై ఆరా తీశారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి.. పాఠశాలకు మరమ్మతు చేయాలని ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలోఒకరి దుర్మరణం
ఉండవెల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన మణెమ్మ(60), నాగరాజు, మద్దిలేటి, కృష్ణవేణి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కారులో ఉండవెల్లి మండలం కంచుపాడులోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి బయలుదేరారు. ఉండవెల్లి శివారుకు రాగానే ఎదురుగా బైక్ రావడంతో దానిని తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణెమ్మ మృతిచెందారు. మణెమ్మ చిన్న కుమారుడు మధుసూదన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. కాగా.. గాయపడిన వ్యక్తులు కర్నూలు జిల్లా ఎంపీ నాగరాజుకు సంబంధించిన కుటుంబీకులుగా తెలిపారు. కారు, బైక్ ఢీ..వృద్ధుడి మృతి గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. మల్దకల్ మండలం సద్దనోన్నిపల్లికి చెందిన గోపాల్ (58) పని నిమిత్తం బైక్పై గద్వాలకు వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మెళచెరువు క్రాస్రోడ్డు వద్దకు రాగానే మల్దకల్ నుంచి గద్వాలకు వస్తున్న కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో గోపాల్ అక్కడిక్కడే పడి మృతి చెందాడు. వేరొక ప్రమాదంలో పట్టణానికి చెందిన వీరేష్ బైక్పై ఫ్లై ఓవర్ మీదుగా ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవర్ ఢీ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పై రెండు ప్రమాదాలపై పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదాలకు కారణమైన ఇద్దరు డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. కాలిన గాయాలతో యువకుడి మృతి మహబూబ్నగర్ క్రైం: పంట పొలాల మధ్యలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. కోయిలకొండ మండలం గార్లపాడ్కు చెందిన కావలి శివకుమార్(23) సోమవారం రేగడిగడ్డతండా శివారులోని పంటపొలాల మధ్య అనుమానాస్పదంగా మృతిచెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు చూసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు కావలి శివకుమార్ మహబూబ్నగర్ నగరంలో కార్ల పెయింటింగ్, డెంటింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. రోజు గార్లపాడ్నుంచి మహబూబ్నగర్ వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఇంట్లో నుంచి వచ్చిన శివకుమార్ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే మృతుడు శరీరం కాలిన గాయాలు కన్పించాయి. ముఖంతోపాటు ఇతర శరీర భాగాలు కొంత కాలిపోయాయి. ఘటనా స్థలంలో అగ్గిపెట్టే, ప్లాస్టిక్ బాటిల్, టిఫిన్ బాక్స్ లభ్యమయ్యాయి. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి తగలపెట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ మేరకు వెంకటమ్మ ఫిర్యాదుపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి అయిజ: మండలంలోని చిన్న తాండ్రపాడుకు చెందిన భరత్కుమార్ (18) సోమవారం రాత్రి పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ.. మంగళవారం మృతిచెందాడు. ఆంజనేయులు, ఈదమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు భరత్కుమార్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. లిఫ్ట్ అడిగిన మహిళపై సామూహిక అత్యాచారం జడ్చర్ల: మోటార్బైక్పై లిఫ్ట్ అడిగిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. బాదేపల్లి శివారులోని ఓ కాలనీకి చెందిన వివాహిత మహిళ(35) పట్టణంలో పనులు ముగించుకుని తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి మోటార్బైక్పై వెళ్తుండగా ఆమె గమనించి లిఫ్ట్ అడిగింది. దీంతో మోటార్ బైక్పై ఉన్న ఇద్దరూ ఆమెను ఎక్కించుకుని వెళ్లారు. అయితే మార్గమధ్యలో ఉన్న నిర్జన ప్రదేశానికి వెళ్లిన వెంటనే చీకట్లోకి బైక్ను మళ్లించి ఆమెను భయబ్రాంతులకు గురిచేసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
● ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వెల్లడి జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, సింగిల్, డబుల్ ఫ్యామిలీలకు చెల్లించే ఆర్అండ్ఆర్ పరిహారాన్ని రూ.18 లక్షలకు ప్రభుత్వం పెంచిందని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పరిహారం పెంపు జీఓను విడుదల చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో సింగిల్ ఫ్యామిలీకి రూ.6.50 లక్షలు, డబుల్ ఫ్యామిలీకి రూ.16.30 లక్షలు ఉండగా.. తాము సింగిల్, డబుల్ ఫ్యామిలీలకు సమానంగా రూ.18 లక్షలకు పెంచినట్లు వివరించారు. ఇప్పటికే పరిహారం అందుకున్న వల్లూరు, తదితర తండాలకు సంబంధించిన కుటుంబాలకు సైతం ఈ పెంపును వర్తింపజేస్తామన్నారు. అవార్డు పాసైన తర్వాత పరిహారాన్ని పెంచిన దాఖలాలు ఎక్కడా లేవని, ఇక్కడ స్పెషల్ కేసుగా పరిగణించి పరిహారం పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వచ్చే రెండు నెలల్లో అదనంగా పెంచిన రూ.146 కోట్లతో కలిపి మొత్తం రూ.374 కోట్ల పరిహారం అందజేస్తామన్నారు. అలాగే భూ పరిహారం పెంపు కోసం కోర్టును ఆశ్రయించిన రైతులతో సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తాను రైతుల పక్షాన మాట్లాడుతానని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ తరహాలోనే ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వ ఖర్చులతో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. ఉదండాపూర్ ప్రాజెక్ట్ పనులకు కొందరు అడ్డు తగులుతున్నారని, భూ పరిహారం తీసుకుని కూడా దౌర్జన్యంగా పనులు అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఇలా చేస్తే నిర్ణీత కాలంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేమన్నారు. పనులు అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, నాయకులు శివకుమార్, అశోక్యాదవ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
పంటపొలాలు, బోరుబావులు నాశనం
● పెద్దతిప్పకు క్వారీ ఏర్పాటు చేయొద్దని రైతుల విన్నపం ● క్వారీ ఏర్పాటుపై అదనపు కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చిన్నచింతకుంట: పెద్ద తిప్పకు క్వారీ ఏర్పాటు చేయడంతో పంటపొలాలు, బోరు పంపులు నాశనమవుతాయని.. మా బతుకులు ఆగమవుతాయని మైనింగ్ క్వారీ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని అమ్మాపురం రైతులు, ప్రజలు విన్నవించారు. అమ్మాపురం సమీపంలోని సర్వేనం 89 యన్. నవీన్కుమార్, యం. లక్ష్మికి 4.95 హెక్టర్ల భూమి విస్తీర్ణంలో 90.970 క్యూబిక్ మీటర్ల మైనింగ్కు వారి ప్రతిపాదనతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు మంగళవారం క్వారీ ఏర్పాటుపై హైదరాబాద్కు చెందిన పర్యావరణ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, గ్రామప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హరిప్రియ, పర్యావరణ పరిరక్షణ అధికారి సురేశ్ హాజరై అభిప్రాయాలు సేకరించారు. ముందుగా పర్యావరణ పరిరక్షణ కమిటీ అధికారులు క్వారీ ఏర్పాటుపై ప్రభుత్వ నిబంధనలు, నియమాలను ప్రజలు, రైతులకు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పెద్ద తిప్పకు క్వారీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే కొనసాగుతుందన్నారు. రైతులు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. అభిప్రాయ సేకరణ జాబితాను సంబంధిత ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. దీంతో పలువురు రైతులు మాట్లాడుతూ.. మైనింగ్ క్వారీ ఏర్పాటుతో పంట పొలాలు నాశనమవుతాయన్నారు. బోరుపంపులు ధ్వంసమవుతాయని ఆరోపించారు. దీంతో చిన్న, సన్నకారు రైతులు పంటలు పండించుకోలేక భూములను వదిలేసి పోవాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు రైతులు గుట్టకు క్వారీ ఏర్పాటు చేస్తే పంట పొలాలకు బీటలు ఏర్పడుతాయన్నారు. అందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు క్వారీ ఏర్పాటు చేసుకోవచ్చిని తెలిపారు. అలాగే పలువురు ప్రజలు మాట్లాడుతూ.. క్వారీ ఏర్పాటుతో గ్రామాభివృద్ధికి నిధులు సమకూరుతాయని తమ అభిప్రాయాని తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అంతరించి వన్యప్రాణులకు ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. మరికొందరు హిందూబాంధవులు మాట్లాడుతూ.. కురుమూర్తి స్వామి మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. భావితరాలకు ఇబ్బందులు పెద్ద తిప్పకు మైనింగ్ క్వారీ ఏర్పాటు చేస్తే భవిష్యత్లో భావితరలాకు ఇబ్బందులు ఏర్పడుతాయని రైతు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద తిప్పచుట్టు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారన్నారు. ఇక్కడ క్వారీ ఏర్పాటు చేస్తే దుమ్ముధూళితో వ్యవసాయ భూములు పంటలకు పనికి రాకుండా పోతాయన్నారు. పంటలు పండించుకోలేక భావితరాలలో భూములను అమ్ముకొని పొట్టకూటి కోసం వలస పట్టే పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు. ఆత్మహత్యే శరణ్యం గుట్టకు క్వారీ ఏర్పాటు చేస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యమని అమ్మాపురం రైతులు బుచ్చన్న, అంజన్న తెలిపారు. క్వారీ సమీపంలో మాకు ఎకరం, అర ఎకరం పొలాలు ఉన్నాయన్నారు. ఈ పొలాలకు ఇప్పటికే బోర్లు వేస్తే నీరు పడడంలేదు. క్వారీ ఏర్పాటుతో బోర్లు పడుతాయన్న ఆశ ఉండదు. అలాగే మా పంట పొలాల్లో దుమ్ము ధూళి ఏర్పడి పంటలు పండే అవకాశం ఉండదు. దీంతో మాకు ఆత్మహత్యలే శరణ్యం. భక్తుల మనోభావాలుదెబ్బతింటాయి కురుమూర్తి స్వామి ఏడు కొండలలో ఒక కొండను తొలిచేందుకు అధికారులు పూనుకున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్వరమేష్ ఆరోపించారు. కురుమూర్తి స్వామికి ఏడు కొండలు ఉన్నాయని.. ఏడు ఒండలలో ఒక కొండను తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొండను తొలగిస్తే కురుమూమూర్తి స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు. వీటితోపాటు పర్యావరణం, పరిరక్షణతో పాటు జంతువులు నశించిపోతాయంటూ 20021లోనే ఇక్కడ క్వారీ ఏర్పాటు చేయవద్దంటూ గ్రామప్రజలు, రైతులతో కలిసి అప్పట్లో కలెక్టరేట్లో విన్నవించామన్నారు. మా విన్నపాన్ని మన్నించి అధికారులు క్వారీ ఏర్పాటును విరమించారు. మళ్లీ ఇప్పుడు క్వారీ ఏర్పాటు చేస్తామంటూ వచ్చారు. కురుమూర్తి స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవరిస్తే సహించబోమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన రైతులు, ప్రజలు బ్లాస్టింగ్తో భూప్రకంపనలు క్వారీ వద్ద రాయిని తొలగించేటప్పుడు బ్లాస్టింగ్తో గుట్టల చుట్టూ పరిసర ప్రాంతాల్లో భూమి కంపిస్తుందని గ్రామస్తుడు బలరాం తెలిపారు. ఈ భూప్రకంపనలతో క్వారీ సమీపంలోని రైతులు భయబ్రాంతులకు గురవుతారన్నారు. క్వారీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల రైతులు భయబ్రాంతులతో పంటపొలాలను విడిచిపెట్టిపోతారన్నారు. -
బిల్లుల చెల్లింపుల్లో పర్సంటేజీలు!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తయిన పనులకు సంబంధించి జనరల్ ఫండ్ లేదా 15వ ఆర్థిక సంఘం నుంచి బిల్లులు చెల్లించాలంటే కార్యాలయంలో పర్సంటేజీలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని కాంట్రాక్టర్లు బాహాటంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఓ సీనియర్ అకౌంటెంట్ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమారు పదేళ్లుగా సదరు ఉద్యోగి ఇక్కడే పనిచేస్తూ పై అధికారుల పేర్లు చెప్పి ఏకంగా 5 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. కాగా.. 2024–25లో సుమారు 360 పనులకు అప్పటి పాలకవర్గం (కౌన్సిల్) నుంచి ఇంజినీరింగ్ అధికారులు ఆమోదం తీసుకున్నారు. అదే ఏడాది సుమారు 300 పనులకు, 2025– 26 (ప్రత్యేకాధికారి పాలన)లో మిగిలిన 60 పనులకు టెండర్లు పిలిచారు. వీటిలో ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి కాగా.. రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ.15–20 కోట్ల వరకు జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నుంచి చెల్లించారు. ఇంకా రూ.40 కోట్లు పైబడి ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి ఏటా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్కు రూ.30 కోట్ల ఆదాయం దాటడం లేదు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన వారికి మాత్రమే అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని, కమీషన్ ఇవ్వని వారికి చెక్కులు ఇవ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ రెండేళ్లలో ముడా ఆధ్వర్యంలో రూ.30 కోట్లకు పైబడి విలువజేసే వివిధ పనులు చేపట్టారు. వీటి బిల్లుల చెల్లింపుల్లోనూ పర్సంటేజీల బాగోతం నడుస్తోందని వారు పేర్కొన్నారు. ఇక్కడ కూడా సదరు సీనియర్ అటౌంటెంటే కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇటీవల సీడీఎంఏ టీకే శ్రీదేవికి నేరుగా కొందరు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) శ్రీనివాసరావు గత నెల 28న మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (ముడా వైస్ చైర్మన్)కు లేఖ పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు సీనియర్ అకౌంటెంట్పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదించాలని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా 2024– 25, 2025– 26లలో ఎన్ని పనులు పూర్తయ్యాయి.. ఎన్నింటికి బిల్లులు చెల్లించారు.. ఇంకెన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.. వాటికి గల కారణాలేమిటో వారం రోజుల్లో తెలియజేయాలని కోరినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. ● ఈ విషయమై కమిషనర్ పి.రామాంజులరెడ్డిని వివరణ కోరగా ఆర్డీ నుంచి తమకు ఇంత వరకు ఎలాంటి లేఖ అందలేదన్నారు. ఒకవేళ వస్తే ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. పూర్తయిన పనులకు 5 శాతం వరకు వసూలు ఇవ్వని కాంట్రాక్టర్లకు చెక్కులు ఆపేస్తున్న సీనియర్ అకౌంటెంట్ రాష్ట్ర ఉన్నతాధికారులకు బాధిత కాంట్రాక్టర్ల ఫిర్యాదు పూర్తిస్థాయిలో విచారణకు ఆర్డీ శ్రీనివాసరావు ఆదేశం -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
జడ్చర్ల టౌన్: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా న్యాయం పొందేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. మంగళవారం జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ సౌజన్యంతో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. పీడబ్ల్యూడీవీ, పీన్డీటీ, పోక్సో చట్టాల గురించి వివరించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ప్రివెన్షన్ అంటే అవేర్నెస్ తీసుకురావడమేనన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుకన్య, చైల్డ్ హెల్ప్లైన్ కౌన్సిలర్ యాదగిరి, వైస్ ప్రిన్సిపాల్ నర్మద, శ్రీనివాసులు, పరీక్షల ని యంత్రణ అధికారి సులేమాన్, ఏపీఓ రాఘవేందర్రెడ్డి, అధ్యాపకులు సతీష్రెడ్డి, సురయ, జబ్బార్, రాజేశ్వరి, నర్సింహులు, నందకిశోర్, ఇస్రత్ సుల్తాన, జయలీల, రజనిలు పాల్గొన్నా రు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఐఎంఎస్ఎస్ డీమ్డ్ యూనివర్సిటీ పారా లీగల్ వలంటీర్స్ డ్రగ్ అబ్యూస్పై చేసిన స్కిట్ ఆకట్టుకుంది. ప్రగతి ప్రణాళికలోఅందరి భాగస్వామ్యం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వాము లు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ పంచాయతీల సర్పంచ్లు, వార్డుసభ్యులు, మున్సిపల్ చైర్మన్లకు అవగాహన కల్పిస్తామన్నారు. అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తామన్నారు. 14న ఉగాది కవి సమ్మేళనం స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో శ్రీపరాభవ ఉగాది కవి సమ్మేళనం, బోల యాదయ్య రచించిన హార్ట్బీట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాహితీ అధ్యక్షుడు భీంపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పాలమూరు నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న రెడ్క్రాస్ భవన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వి.మనోహర్రెడ్డి, బెక్కెం జనార్దన్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కవి సమ్మేళనంలో కవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
విద్యుత్ శాఖను కాపాడుకుందాం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కేంద్రం ప్రభుత్వం విద్యుత్ శాఖను ప్రైవేట్పరం చేయాలని చూస్తుందని, ఉద్యోగులు ఏకమై ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని కాపాడుకుందామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ స్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు–2025కు వ్యతిరేకంగా మంగళవారం విద్యుత్ భవన్ ఎదుట భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాల్లో 29 రకాల ప్రయోజనాలు ఉన్నాయని, కేంద్రం తెస్తున్న కొత్త చట్టం వల్ల ఆ ప్రయోజనాలు పోతాయన్నారు. విద్యుత్ కార్మికులకు నష్టం కలిగించే చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్పరం కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగి నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు, డీఈ మోహనకృష్ణ, సోమశేఖర్ బాబ్య, విజయ్, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు. -
కొరవడిన పర్యవేక్షణ..
మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధీనంలో పనిచేస్తున్న అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోడి గుడ్లు ముఖ్యమైన పోషకాహారంగా అందిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు సమయానికి సరఫరా కావాల్సి ఉంది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా గుడ్ల సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు తక్కువగా రావడం, మరికొన్ని చోట్ల నాణ్యత లేని గుడ్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అలాగే 45–50 గ్రాముల బరువున్న గుడ్లకు బదులుగా 35 గ్రాముల బరువున్నవే సరఫరా చేస్తున్నారు. దీనికి ప్రధానంగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, సూపర్వైజర్లు, ప్రాజెక్టు అధికారులు సరైన సమన్వయం లేకుండా వ్యవహరించడం వల్లే పరిస్థితి మరింత ఇంతలా దిగజారిందని స్థానికులు చెబుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల అస్తవ్యస్త నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టిసారించి.. పటిష్టపరచాలని కోరుతున్నారు. -
ర్యాలంపాడుకు మోక్షం
గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్కు నాలుగేళ్ల క్రితం లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ.. 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు అందించకుండా క్రాప్హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ర్యాలంపాడు రిజర్వాయర్కు మరమ్మతు చేయాలని రైతులు ప్రతి ఏడాది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైదరాబాద్, పుణె నుంచి ఇంజినీరింగ్ నిపుణుల బృందం రిజర్వాయర్ను సందర్శించి.. సర్వే చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎట్టకేలకు ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు మోక్షం లభించింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లకే లీకేజీలు.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ప్రజలకు తాగునీటితో పాటు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు పరుగులు పెట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. వైఎస్సార్ అకాలమరణంతో అసంపూర్తిగా నిలిచాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తం 20 టీఎంసీల సామర్థ్యంతో ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం.. గుత్తేదారు లోపభూయిష్ట నిర్మాణంతో రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు నిధులు.. ర్యాలంపాడు రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ ఆనకట్టలోని రాక్టోల్ లేయర్ల మట్టి నమూనాలు, తూముల అడుగు భాగంలోని నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టనున్నారు. రిజర్వాయర్ మరమ్మతుకు రూ. 4.92 కోట్లు మంజూరు సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు కేటాయింపు రూ. 3.66కోట్లతో జలాశయం ఆనకట్ట, తూములకు మరమ్మతు త్వరలోనే ప్రారంభంకానున్న పనులు -
డ్రగ్స్ మహమ్మారిని తరిమివేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో మత్తు పదార్థాలు, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టి, డ్రగ్స్, మత్తు పదార్థాల వ్యసనాల నుంచి విద్యార్థులు, యువతను కాపాడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించేందుకు శాఖల వారీగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆమె సూచించారు. ప్రత్యేకంగా విద్య, వైద్యం, పోలీసు, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రతినెలా కనీసం ఐదు పాఠశాలల్లో మత్తు పదార్థాల వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, పోలీసు శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ అందించి అవసరమైతే పునరావాస కేంద్రాలకు పంపాలన్నారు. ఈ సందర్భంగా గంజాయి సహా ఇతర హానికర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రతి పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి తరగతి నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారి ద్వారా పాఠశాలలో మత్తు పదార్థాల వ్యసనం, దుష్ప్రభావాలపై ఇతర విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఏఎస్పీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనాబేగం, సీఐ గాంధీనాయక్, సీఎంఓ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. రహదారి భద్రతా కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎన్హెచ్–44, 167లపై గుర్తించిన 25 బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, బారీకేడ్ల ఏర్పాటు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్నిచోట్ల 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వద్ద కొంతమంది బాలురు బైక్లపై వచ్చి విద్యార్థినులను వేధిస్తున్నారనే ఫిర్యాదు అందిందని, దీనిపై షీటీంను నియమించి పాఠశాలల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముఖ్య కూడళ్ల వద్ద కొత్త ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు విషయమై ట్రాఫిక్ పోలీసులు అడగగా మున్సిపల్ అధికారులు సమాధానం ఇస్తూ, టెండర్లు పూర్తయినందున వచ్చే వారంలో 10–15 కొత్త ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్కు తెలిపారు. -
ఏమిటో.. లోగుడ్డు
● 45– 50 గ్రాములకు బదులుగా 30 గ్రాముల బరువున్నవే పంపిణీ ● కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం.. పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు ● పౌష్టికాహారం అందక చిన్నారులు, గర్భిణుల అవస్థలు ● జిల్లావ్యాప్తంగా గుడ్ల సరఫరాలో యథేచ్ఛగా దోపిడీ అంగన్వాడీ కేంద్రాలకు చిన్నసైజు గుడ్ల సరఫరా -
పలుమార్లు సర్వే..
ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా రూ. 60లక్షలతో హైదరాబాద్కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరునెలల పాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించారు. సర్వేకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. -
చిన్నవి ఇస్తే ఏం ప్రయోజనం
అంగన్వాడీలో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు చిన్నగా ఉన్నాయి. పిల్లలకు సరైన పోషకాహారం అందాలంటే మంచి సైజు గుడ్లు ఇవ్వాలి. ప్రభుత్వం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గుడ్లు ఇస్తోంది. కానీ, అంగన్వాడీకి వచ్చే గుడ్లు చిన్న సైజులో ఉండటంతో పిల్లలకు తగిన పోషకాహారం అందడం లేదు. ఈ విషయంపై అధికారులు దృష్టిపెట్టి నాణ్యమైన గుడ్లు ఇవ్వాలి. – రాజేశ్వరి, రామచంద్రాపూర్ గ్రామం, మహబూబ్నగర్ రూరల్ విచారణ జరిపిస్తాం.. అంగన్వాడీలకు 45– 50 గ్రాముల మధ్య గుడ్ల సరఫరా చేయాలి. కోడి గుడ్లలో చిన్నసైజువి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం చిన్న గుడ్ల సరఫరాపై విచారణ చేస్తాం. తక్కువ పరిమాణం ఉన్న గుడ్లు సరఫరా చేస్తే వెంటనే వాటిని ‘వద్దు’ అ నేందుకు టీచర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే సూపర్వైజర్లపై, అంగన్వాడీ టీచర్లపై చర్య లు తీసుకుంటాం. చిన్నగుడ్లు సరఫరా చేసినట్లు తేలితే కాంట్రాక్టర్కు నోటీసులిస్తాం. – జరీనాబేగం, జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి ● -
పిలవని పేరంటానికి వస్తే జైలు, జరిమానా
మహబూబాబాద్ జిల్లా: పెళ్లి, ఇతర శుభకార్యాలను తమ హోదాతోపాటు బంధుమిత్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ఫంక్షన్హాల్ను ఎంచుకుంటారు. ముక్కూమొహం తెలియని వారు ఫంక్షన్కు రావడం వల్ల అతిథులు ఇబ్బంది పడడం, చివరగా భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుండడంతో ఆ ఫంక్షన్హాల్కు పెద్దగా గిరాకీ ఉండకపోవడంతో ఆ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. ‘ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తులు లోనికి వచ్చి పట్టుబడితే సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా’అంటూ ఫంక్షన్హాల్ ముందు ఫ్లెక్సీ పెట్టాడు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ‘ఎవరైనా పిలవని పేరంటానికి వెళ్లకండి.. భోజనం లాగిద్దామని వెళ్తే..లాగి లోపలేస్తారు.. తస్మాత్ జాగ్రత్త’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వృథాగాగోదావరి జలాలు ఎయిర్ వాల్వ్ ఓపెన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు చేర్యాల (సిద్దిపేట): గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. తపాసుపల్లి రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేసే పైప్లైన్ ఎయిర్ వాల్్వను గుర్తుతెలియని వ్యక్తులు ఓపెన్ చేశారు. దీంతో గోదావరి జలాలు పెద్దఎత్తున వృథాగా పొలాల్లోకి వెళ్తున్నాయి. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడం వల్ల దేవాదులకు సంబంధించిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో నీటి వృథా కొనసాగుతూనే ఉంది. -
అంబులెన్స్ అందించిన ఎంపీ..
యూనివర్సిటీలో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు అధికారులు ప్రత్యేక పీహెచ్సీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు మాత్రమే చికిత్స ఇవ్వనున్నారు. అయితే విద్యార్థులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేంది. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎంపీ డీకే అరుణను సంప్రదించగా ఆమె స్పందించి యూనివర్సిటీకి సుమారు రూ.10 లక్షల విలువైన అంబులెన్స్ను అందించారు. ప్రస్తుతం అది విద్యార్థులకు సేవలు అందిస్తుంది. -
‘పేట’కు జీఐ ట్యాగ్
● వన్నెకు తగ్గని విలువ.. మన్నికకు మారు పేరు ● ఇక్కడి బులియన్ మర్చంట్ అసోసియేషన్కు 130 ఏళ్ల చరిత్ర ● త్వరలోనే భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశం ●నారాయణపేట: పేట అంటేనే చేనేత చీరలు, బంగారానికి ప్రసిద్ధి. మగువ మనసుదోచే అద్భుతమైన బంగారు ఆభరణాల మన్నికకు మారు పేరుగా.. నగల నాణ్యతలో సోనేకా థేట్– నారాయణపేట్ అని తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. త్వరలోనే భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్) రానుంది. ఇక్కడి బులియన్ మర్చంట్ అసోసియేషన్కు 130 ఏళ్ల చరిత్ర ఉంది. స్వర్ణకారులు 24 క్యారెట్ల బంగారంతో సన్నని ధారాలు తీసి.. నగలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం జనం బంగారం కొనడానికి వస్తుంటారు. ఏటా దాదాపు రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో కళకళ.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. సరాఫ్ బజార్ కళకళలాడుతుంది. శుభకార్యలు, పండుగలు ఉన్నప్పుడు పేట బంగరాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని రాయచూర్, యాద్గీర్, సేడం, గుల్బర్గ, బీదర్, మహారాష్ట్రలోని పుణె, షోలాపూర్, హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావాసులు ఎక్కువగా వస్తుంటారు. ఆకట్టుకునేలా డిజైన్లు.. స్థానికంగా జువెల్లర్స్ దుకాణాల్లో తయారు చేసిన ఆభరణాలపై చిన్నసైజులో తమ దుకాణం పేరు ముద్ర (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలుచేసిన వారు విక్రయించేందుకు వెళ్తే గుర్తుపట్టేందుకు వీలుగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లు వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు. తారాపూర్, అమృత్సర్, ముంబాయి, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్లో డైస్ వచ్చిన పదిరోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. అంతేకాకుండా హాల్మార్క్తో వివిధ రకాల డిజైన్ నగలను పశ్చిమబెంగాల్ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మి నెక్లెస్, లక్ష్మి లాంగ్చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల ఆభరణాలు లభిస్తాయి. నారాయణపేట గోల్డ్ ప్యూరిటీతో 24 క్యారెట్ల బంగారంతో మోడ్రన్ డిజైన్లు తయారుచేసి విక్రయిస్తున్నాం. 130 ఏళ్ల చరిత్ర ఉన్న నారాయణపేట బంగారానికి జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాం. బంగారాన్ని సేవింగ్స్గా భావిస్తాం. కొన్న బంగారాన్ని అమ్మితే 98 శాతం రిటర్న్ డబ్బులు వస్తాయి. 150 జ్యువెల్లర్స్, 270 మంది స్వర్ణకారులతో మరో 1,700 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తయారుచేసే నగలు 24 క్యారెట్లతో తయారు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. కానీ నారాయణపేటలో అది సాధ్యమని నిరూపిస్తున్నాం. అందుకే జీఐ గుర్తింపు వస్తుందని నమ్మకం ఉంది. – సాకేత్ భట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్, నారాయణపేట -
రోటీ మేకర్స్తో తీరిన ఇబ్బంది..
పీయూ బాలికల హాస్టల్స్లో ఇటీవల కొత్త హాస్టల్స్ ప్రారంభంతోపాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం టిఫిన్ కోసం చపాతీలు చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇందులో సుమారు 750 మందికిపైగా ఉండగా ఒక్కొక్కిరికి సుమారు నాలుగు చపాతీలు ఇచ్చినా ఒక్కరోజు సుమారు 4 వేల చపాతీలు చేయాల్సి వస్తుంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో ఎస్బీఐ గణేష్నగర్ బ్రాంచ్ యూనివర్సిటీ అధికారులు రోటీ మేకర్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. దీంతో స్పందించిన ఎస్బీఐ అధికారులు పీయూ హాస్టల్స్కు రూ.10 లక్షల విలువైన రెండు రోటీ మేకర్స్ను అందించారు. ఇవి ప్రస్తుతం బాలికల హాస్టల్స్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి అవసరం రెండు బాలుర హాస్టల్స్లో కూడా ఉండడంతో అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. -
20 నెలల్లో పూర్తిచేస్తాం
పాలమూరును.. కృష్ణానదిలో మన వాటా నీటిలో బొట్టు కూడా వదిలిపెట్టం ● రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి ● సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం ● హాజరైన ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 20 నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోని ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివారం హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్నగర్లోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణానదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. వచ్చే ఏడాది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్సాగర్కు రూ.185 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పనులను మిషన్ మోడ్లో పూర్తి చేసేందుకు భూ సేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. జూరాల ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆదేశించారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదట 11.94 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నా.. మట్టిపూడిక కారణంగా ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరిందన్నారు. డీసిల్టింగ్ ద్వారా తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇటీవల వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 148.5 లక్షల మె.ట., ధాన్యం ఉత్పత్తి నమోదు కావడం దేశంలోనే రికార్డు అన్నారు. అలాగే సుమారు 72 లక్షల మె.ట., ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. సమావేశంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ సెక్రెటరీ ఈ.శ్రీధర్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం రూ.338 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్అండ్ఆర్ పరిహారం మొత్తాన్ని రెండు నెలల్లో నిర్వాసితులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారన్నారు. దీంతోపాటు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇచ్చిన తరహాలోనే ఉదండాపూర్ నిర్వాసితులకు కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని కోరామన్నారు. అలాగే ఆర్అండ్ఆర్ పరిహారాన్ని రూ.16.30 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచామని, దీంతో నిర్వాసితులకు అదనంగా రూ.148 కోట్లు మొత్తాన్ని చెల్లించేందుకు గతంలోనే ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు. పెంచిన పరిహారంతో కలిపి మొత్తంగా రూ.338 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే భూ పరిహారం పెంపుపై కోర్టును ఆశ్రయించిన రైతులకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పనుల కోసం జూన్ 2 నాటికి రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2014 తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి పథకంలో నీటి ఎత్తిపోతల పాయింట్ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల ఖర్చు పెరిగి రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్నారు. అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో తుమ్మిడిహట్టి స్థానంలో మేడిగడ్డను ఎంచుకోవడం కూడా తెలంగాణ రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. అన్ని పనులు పారదర్శకంగా, చట్టబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. కృష్ణానది పరివాహకంలోని రైతులకు సాగునీరు, పంటల ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కేంద్రిత విధానాలతో ముందుకెళ్తోందన్నారు. తమ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.7,161 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో ప్రాజెక్టు పనులకు రూ.6,718 కోట్లు, భూ సేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర పనులకు రూ.94 కోట్లు వెచ్చించామన్నారు. -
రెండు ఇళ్లలో చోరీ
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని వెంకటపతిరావునగర్ కాలనీలోని రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. చోరీలో 7 తులాల బంగారం, రూ.65 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలోని ఒకే భవనంలో సరస్వతి, మరియమ్మలు నివాసం ఉంటున్నారు. మరియమ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి డ్యూటికి వెళ్లి శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళం విరగగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా చిందరవందర చేసి ఉండటంతో దొంగలు పడ్డారని గుర్తించి 6 తులాల బంగారు నగలు, కొన్ని వెండి ఆభరణాలతో పాటు రూ.15వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది లబోదిబోమంది. ఇదే భవనంలో ఉంటున్న సరస్వతి రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లింది. ఆమె ఇంటి తాళం కూడా విరగ్గొట్టి తులం బంగారంతోపాటు రూ.50వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇద్దరి మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత వారం చైన్స్నాచింగ్ కేసును రోజుల్లోనే చేధించిన పోలీసులకు వరస దొంగతనాలు సవాల్గా మారాయి. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగులు చోరీకి యత్నిస్తుండటంతో ఎవరైనా ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే ఇంటిపక్కన వారికి సమాచారం ఇవ్వాలని, ఎక్కువ రోజులు వెళ్లాల్సి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ కమలాకర్ పేర్కొన్నారు. 7 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు -
రాజకీయాల్లో ఓబీసీలకు మరింత ప్రాధాన్యత కల్పించాలి
స్టేషన్ మహబూబ్నగర్: గ్రామస్థాయి నుంచి రాజకీయం, పరిపాలన వ్యవస్థలో ఓబీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో శనివారం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు అనిల్ జైహింద్ ఆధ్వర్యంలో ఓబీసీ సముదాయాల సమస్యలపై కీలక సమావేశం జరిగింది. తెలంగాణలో ఓబీసీ సముదాయాల ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు జరిగిన పురోగతి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలపై ఈ సమావేశంలో విస్త్రతంగా చర్చ నిర్వహించారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో సంజీవ్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్గాంధీ ఆలోచనా విధానం మేరకు బడుగు, బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని అన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో ఓబీసీ సెల్ ఇన్చార్జీ రద్ర సంతోష్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఐకానిక్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి’
కొల్లాపూర్: 167కే జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా మల్లేశ్వరం– సంగమేశ్వరం ప్రాంతాల మధ్య కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఎన్హెచ్ అధికారులను బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్రావు కోరారు. శనివారం ఆయన హైదరాబాద్లో నేషనల్ హైవే అధారిటీ రాష్ట్ర అధికారి ఆదిత్యను కలిశారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల గురించి చర్చించారు. అటవీ, రెవన్యూ శాఖల నుంచి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వంతెన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉందని, అప్పటిలోగా వంతెనకు అటాచ్మెంట్ రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరినట్లు సుధాకర్రావు తెలిపారు. వంతెన నిర్మాణం గూర్చి కేంద్ర మంత్రి నితిన్గడ్కరీని ఇప్పటికే పలుమార్లు కలిశామని, మరోసారి కలిసి పనులు వేగంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. -
యాక్షన్ ప్లాన్ కాదు.. యాక్టింగ్ ప్లాన్
● మాటల గారడీ తప్పా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం ● ఏప్రిల్ 9 నుంచి 24 వరకుసంసద్ ఖేల్ మహోత్సవం పాలమూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ కాదని కేవలం యాక్టింగ్ ప్లాన్ మాత్రమేనని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనను పట్టించుకోకునే దిక్కు లేదని, మాటల గారడీ తప్ప ప్రగతి ప్రణాళిక అనేది ఒక పెద్ద మోసం అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. నిధులు ఇవ్వకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని దీనికి సీఎం జవాబు చెప్పాలన్నారు. హామీలు నెరవేర్చకపోవడంతో గ్రామాల్లో తిరగలేక ఎమ్మెల్యేలు ముఖాలు చాటేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ప్రణాళికల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం కింద పార్లమెంట్, నియోజకవర్గ పరిధిలో యువతను క్రీడల పట్ల ప్రోత్సహించడానికి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కల్గిన క్రీడకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ ఇచ్చే విధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఏప్రిల్ 9నుంచి 24వరకు మండల స్థాయి, నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిలో క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ నాలుగు క్రీడలను ఆడించడం జరుగుతుందన్నారు. ఒక క్యూఆర్ కోడ్ను ప్రతి ఒక్క మండలానికి ఇవ్వడం జరుగుతుందని దీంట్లో క్రీడాకారులు తమ వివరాలను మార్చి 9 నుంచి 24 వరకు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 16 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ చేసుకొని క్రీడల్లో పాల్గొనవచ్చన్నారు. కష్టపడితే విజయం తధ్యం ప్రతి మహిళ లక్ష్యం కోసం కష్టాన్ని సైతం ఇష్టంగా చేసుకొని ముందుకుసాగితే విజయం వరిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మహిళలు నిరాశ చెందకుండా ముందుకుసాగాలన్నారు. బీజేపీలో మహిళలకు మంచి ప్రాధన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళనేతలు పద్మజారెడ్డి, జయశ్రీ, బాలిశ్వరమ్మ, మహిళ కార్పొరేటర్లు జ్యోతి, శ్రీలేఖ, సువర్ణ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
1200 ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు
మానవపాడు: మండలంలోని బోరవెల్లిలో చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం బోరవెల్లి సర్పంచ్ హరిశ్చంద్రారెడ్డి సమాచారంతో గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బోరవెల్లిలో బురుజు దగ్గరరున్న బాదామి చాళుక్యుల(సా.శ.8వ శతాబ్దం) కాలపు చండీ, చాముండి విగ్రహాలు, అక్కడే ఉన్న కందూరి చోళులు (12వ శతాబ్దం) కాలపు గణపతి విగ్రహం, వీరభద్రాలయం పక్కనే ఉన్న కళ్యాణ చాళుక్యుల కాలపు నాగదేవత శిల్పాలు, మరో బురుజు పక్కనున్న కాకతీయుల (13వ శతాబ్దం) కాలపు వీరుల శిల్పాలు పరిశీలించి, వాటి చారిత్రక ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. అనంతరం సర్పంచ్ హరిశ్చంద్రారెడ్డి సూచన మేరకు.. గ్రామం మధ్యలో ఉన్న బోరవెల్లి సంస్థానం వారు 17వ శతాబ్దం విజయనగర వాస్తుశైలిలో నిర్మించిన చెన్నకేశవాలయం, గర్భాలయం, అర్థమండపం, మహామండపం, మూడు వైపులా ప్రవేశం మండపాలు, ఆలయ అధిష్టానం గోడలు, కప్పుల పైనున్న విష్ణు దశ అవతరాలు, నాట్యగత్తెలు, కాళీయమర్ధన, బైరవుడు, వెంకటేశ్వరస్వామి విగ్రహాలు, ఇంకా ఏనుగులు, సింహాలు, యాలి శిల్పాలు 17వ శతాబ్దం శిల్పశైలిలో ఉన్నాయన్నారు. వీరభద్రుని గుడికి కొంచెం దూరంలో దిగుడు బావి, నిజాం నవాబులు చుట్టూ నిర్మించిన కందకంతో ఉన్న కోటగోడ, బురుజులు అసఫ్ జాహివాస్తు శైలిలో ఉన్నాయని, రెండు ఫిరంగులు ఆలనాటి రక్షణ వ్యవస్థను తెలియజేస్తున్నాయని తెలిపారు. దాదాపు 1200 ఏళ్ల వారసత్వానికి అద్దం పడుతున్న బోరవెల్లి చారిత్రక ఆనవాళ్లను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో గిరిధర్రెడ్డి, అఖిలభారత పాత ఆలయాలు పునరుద్ధరణ ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్కే జైన్, తెలంగాణ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఎండీ శ్రీనివాస్బండ, బోరవెల్లి నాయకులు శేషిరెడ్డి, ఎల్లారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి -
డ్రంకెన్డ్రైవ్లో న్యాయవాదుల రిమాండ్
కల్వకుర్తి టౌన్: వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా, వారిపై చేయిచేసుకున్న ఇద్దరు న్యాయవాదులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. రిమాండ్కు సంబంధించి డీఎస్పీ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన పృథ్వి సుప్రీం కోర్టు, అంకంరావు హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. వీరితోపాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బల్మూర్ మండలంలోని జిన్కుంటకు శుభకార్యానికి శుక్రవారం వచ్చారు. రాత్రి 8గంటలకు సుభాష్నగర్లోని గచ్చుబావి వద్ద నారాయణమూర్తి ఇంటి వద్ద మద్యంతాగి ఇంటిపైకి మద్యం సీసాలను విసిరేసి ఇంటి యజమానితో గొడవ పడ్డారు. శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కారులో ఎక్కువ శబ్దంతో పాటలు పెట్టుకొని వెళ్తుండగా.. హైదరాబాద్ చౌరస్తాలో పెట్రోలింగ్లో ఉన్న ఎస్ఐ రాజశేఖర్ కారును ఆపగా.. విధుల్లో ఉన్న పోలీసులపై అసభ్య పదజాలంతోపాటు, విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులు వారి రక్తనమూనాలు సేకరించి, బ్రీత్ ఎనలైజర్తో పరీక్ష చేయగా మద్యం తాగినట్లుగా నిర్ధారణ అయింది. మద్యం మత్తులో పోలీసులపై దాడి చేయడానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్స్టేషన్కు తరలించగా.. స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపైన అసభ్య పదజాలంతో దూషించారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రామకృష్ణ, నారాయణమూర్తి ఫిర్యాదుతో ఇద్దరిపై రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్దనుంచి కారును స్వాధీన పర్చుకొని, కల్వకుర్తి సీనియర్ సివిల్ కోర్టులో హాజరుపర్చగా వారికి జడ్జి రిమాండ్ విధించారు. కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి పాల్గొన్నారు. -
అలివేలు మంగ హుండీ లెక్కింపు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన హుండీ లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.10,09,442 ఆదాయం వచ్చింది. ఈ హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ మల్లిఖార్జున్, పాలక మండలి సభ్యులు, సత్యసాయి సమితి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
విద్యాదాఘాతంతో యువరైతు మృతి
మాగనూర్: యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బచ్చి దేవప్ప(32) శుక్రవారం తన పొలంలో స్టార్టర్లో కరెంట్ సమస్య చూస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దేవప్ప రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ అర్జున్ తెలిపారు. తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య నవాబుపేట: తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని గురుకుంటలో చోటు చేసుకుంది. గురుకుంటకు చెందిన వీరన్న కుమారుడు గణే్ష్(21) హోలీ సందర్భంగా యువకులతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో గొడవలు మంచివి కావంటూ తండ్రి వీరన్న కుమారుడిని మందలించగా శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. రాత్రి సైతం ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతకగా శనివారం వారి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. ప్రసవానంతరం బాలింత మృతి మహబూబ్నగర్ క్రైం: జనరల్ ఆస్పత్రిలో ప్రసవం తర్వాత ఓ బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన పావని(21) మొదటి కాన్పు కోసం జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో ఆడ్మిట్ అయ్యింది. శనివారం ఉదయం ప్రసవం తర్వాత గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. గతంలో ఆమెకు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుందని, ప్రసవం తర్వాత పరిస్థితి విషమించి సడన్ స్ట్రోక్ వచ్చి మృతి చెందినట్లు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని కొంత సమయం కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. గడ్డివాములు దగ్ధం ● రూ.3లక్షలు నష్టం ఉండవెల్లి: మండల కేంద్రంలో గడ్డి వాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో అగ్నికి ఆహూతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. రైతులు ఎర్ర శ్రీరాములు, నాగమద్దిలేటి, మద్దిలేటి, చిన్న రాముడు, పెద్ద రాముడు పశువుల కోసం ఐదు గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పుపెట్టారు. మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో స్థానికులు గమనించి అలంపూర్ చౌరస్తాలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాకపోవడంతో గద్వాల నుంచి మరో ఫైరింజన్ను రప్పించి మంటలను అదుపుజేశారు. అయితే అప్పటికే గడ్డివాములు కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు నష్టం సంభవించిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కాలిన గడ్డి వాములను ఎస్ఐ శేఖర్ ,సర్పంచు నాగరాజు పరిశీలించారు. అనంతరం ఆర్ఐ నాగరాజు, జీపీఓ ఎల్లగౌడు పరిశీలించి పంచనామ తీసుకుని కలెక్టర్కు పంపుతామన్నారు. -
పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి
● అదనపు కలెక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో పర్యావరణ పబ్లిక్ హియరింగ్ ● ప్రత్యక్ష, పరోక్ష, మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసిన మోతీఘనపూర్ వాసులు రాజాపూర్(బాలానగర్): మండలంలో ఏర్పాటు చేసే పరిశ్రమలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, జన, జీవరాసులకు కాలుష్యకారకం కాకుండా ఉండడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మోతీఘనపూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. శనివారం బాలానగర్ మండలం మోతీఘనపూర్ శివారులో అడిషనల్ కలెక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో దివ్యసాయి బోర్డ్స్ ప్రైవేట్ లిమిటేడ్ పరిశ్రమ ఏర్పాటుపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో నిబంధనలు పాటించడంలేదని.. కనీసం గ్రీనరీ మేయిన్టేన్ చేయాలనే కచ్చితమైన నిబంధనలున్నా.. అవేవి పరిశ్రమల యాజమాన్యాలు పాటించడంలేదని వివరించారు. ముఖ్యంగా తమ గ్రామశివారులో ప్రస్తుతమున్న పరిశ్రమలు నిబంధనలు గాలికొదిలి జల, వాయు కాలుష్యాలను రైతుల పొలాల్లోకి వదులుతున్నారని.. దానిమూలంగా రైతులు పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వడమే కాకుండా సీఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కొందరు ఎన్జీఓలు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ హియరింగ్లో 41మంది ప్రత్యక్షంగా తమ అభిప్రాయాలను తెలిపారని, 44మంది లఖిత పూర్వకంగా వినతులు ఇచ్చారని, మరికొందరు మేయిల్స్ ద్వారా చేసిన ఫిర్యాదులను పరిశీలించి నివేదికను అందజేనున్నట్లు పీసీబీ ఈఈ సురేశ్ పేర్కొన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్సీఐ నాగార్జునగౌడ్, టౌన్ సీఐ కమలాకర్, బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
అలంపూర్ ఆలయాల్లో గవర్నర్ సతీమణి
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర క్షేత్రాన్ని గవర్నర్ సతీమణి సుధాదేవ్వర్మ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆలయ ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి గవర్నర్ సతీమణికి పూర్ణకుంభస్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ సతీమణి బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగుళాంబ మాతను దర్శించుకుని విశేష పూజలు చేశారు. వేద పండితులు ఆమెకు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఉన్నారు. నల్లమల అడవిలో మంటలు మన్ననూర్: ఆమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం, నల్లమల పరిసర ప్రాంతంలోని అప్పాపూర్ సమీపంలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అటవి శాఖ ఫైర్ సిబ్బందితో పాటు వివిధ క్యాడర్లలో విధులు నిర్వహిస్తున్న వాచర్లు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నల్లమల అటవీ సరిహద్దు ప్రాంతంలో ప్రతి నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో తరుచుగా అడవికి నిప్పు అంటుకుంటుందని అటవీశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఫైర్, వాచర్ సిబ్బంది రాము, చంద్రమౌళి, రవి, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. -
సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరిస్తాం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వేగంగా విస్తరిస్తున్న నగరానికి కొత్తగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమైందని డీటీసీపీ జాయింట్ డైరెక్టర్ అశ్విని అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ముడా కార్యాలయంలో ప్రత్యేక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు 2010 నాటి మాస్టర్ ప్లానే అమలులో ఉందన్నారు. అప్పట్లో 32.27 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉండేదన్నారు. ఈ క్రమంలోనే నగరం నలువైపులా విస్తరిస్తున్నందున 2019 నుంచి 2021 వరకు కొత్త మాస్టర్ ప్లాన్ కోసం క్షేత్రస్థాయిలో సర్వే చేయించామన్నారు. దీనికి సంబంధించి 2022లో అప్పటి అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో వర్క్షాపు నిర్వహించామన్నారు. ఇప్పటికే నగరంలో ఏనుగొండ నుంచి క్రిస్టియన్పల్లి వరకు బైపాస్ అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే అక్కడి నుంచి పీయూ పక్క నుంచి చిన్నదర్పల్లి వరకు బైపాస్ పొడిగింపు త్వరలోనే పూర్తి కానుందన్నారు. దీంతోపాటు అప్పన్నపల్లి నుంచి చిన్నదర్పల్లి వరకు 150 ఫీట్ల వెడల్పుతో కొత్తగా మరో బైపాస్ కోసం ఇటీవలే ప్రాథమిక స్థాయిలో సర్వే జరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రంగాల్లో నగరం అభివృద్ధి చెందుతున్నందున 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా 108.63 చదరపు కిలోమీటర్ల పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను తయారు చేయించామన్నారు. దీనికి ఉత్తరం దిక్కులో కొత్తపేట నుంచి వల్లూరు వరకు, తూర్పు దిక్కులో శంకరయ్యపల్లి నుంచి కొత్తతండా వరకు, దక్షిణం దిక్కులో మల్లెబోయినిపల్లి నుంచి తాటికొండ వరకు, పడమర దిక్కులో అల్లీపూర్ నుంచి వెంకటాపూర్ వరకు సరిహద్దులను నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి సూచనలు, సలహాలు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామన్నారు. వీటిని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డికి పంపించవచ్చన్నారు. దీనికోసం త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామన్నారు. ఇప్పటినుంచి 90 రోజులలోగా లేదా ఈ ఏడాది జూన్ 5వ తేదీ నాటికి ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ముందుగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రొజెక్టర్ ద్వారా ఆమె వివరించారు. అనంతరం ఈ ముసాయిదాకు ముడా పాలకవర్గం ఆమోదం తెలిపింది. సమావేశంలో మహబూబ్నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ జి.మమత, ఎం.సురేందర్రెడ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, ముడా సీపీఓ శేఖర్, ఏసీపీలు కరుణాకర్గౌడ్, జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధం డీటీసీపీ జాయింట్ డైరెక్టర్ అశ్విని ముడా కమిటీ ప్రత్యేక సమావేశంలో వెల్లడి -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజాపూర్: క్షనికావేశంలో పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందిన ఘటన మండలంలోని నర్సింగ్తండాలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన జఠావత్శ్రీను(55)తండాలో ఇంటి పక్కన బాత్రూం గుంతల నిర్మాణం స్థలాల విషయమై అదేతండాకు చెందిన రవీందర్ భార్య అంజమ్మ, శ్రీను పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటుండగా.. గొడవ పెట్టుకున్నారు. మనస్తాపానికి గురైన శ్రీను పొలం వద్దకు వెళ్లి ఈనెల 5వ తేదీన పురుగులమందు తాగి ఇంటివచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా శనివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు.. బైక్పై వెళ్తున్న యువకుడిని బొలేరో ఢీకొన్న ఘటనలో గాయాలపాలైన యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. ఖానాపూర్కు చెందిన శ్రీశైలం(19) తల్లిదండ్రులు కృష్ణయ్య, లావణ్యతో కలిసి బైక్పై అమ్మమ్మ గ్రామమైన ధర్పల్లిలో శుక్రవారం వెళ్లాడు. కందూరు పండుగలో పాల్గొని తిరుగుప్రయాణంలో తల్లిదండ్రులను అక్కడే ఉంచి స్వగ్రామానికి వస్తుండగా ఖానాపూర్ నుంచి ఓ బొలేరో డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. తీవ్రగాయాలపాలైన శ్రీశైలంను స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి కందనూలు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దముద్దునూరులో శుక్రవారం రాత్రి జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. ప్రకారం పెద్ద గ్రామానికి చెందిన భాస్కర్ (57) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బుధవారం రాత్రి కిరాణం దుకాణానికి వెళ్లి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
జోగుళాంబ క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి
అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతికి అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పీఠాధిపతులు అలంపూర్కు వచ్చారు. క్షేత్రానికి చేరుకున్న పీఠాధిపతులకు అర్చక స్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీజోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పీఠాధిపతులకు పాదుకా పూజలు నిర్వహించారు. అనంతరం శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి ఆలయ ప్రాంగణంలోని కుంకుమార్చన మండపంలో చంద్రమౌలీశ్వర ఆరాధన, శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. ఉదయం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబఆలయాల్లో పూజలు నిర్వహించనున్నారు. -
బాబోయ్.. దోమలు!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో దోమల బెంబేలెత్తిస్తున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో పాటు ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం వేస్తుండడమే ప్రధాన కారణం. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో దాదాపు మూడు లక్షలకు పైగా జనాభా ఉంది. ముఖ్యంగా మురికివాడలుగా పేరొందిన కిద్వాయిపేట, వీరన్నపేట, ఎర్రమన్నుగుట్ట, మదీనా మసీదు, టీడీగుట్ట, బండ్లగేరి, కిసాన్నగర్, కురిహినిశెట్టికాలనీ, హనుమాన్నగర్, మోతీనగర్, షాషాబ్గుట్ట, క్రిస్టియన్కాలనీ, బోయపల్లిగేట్, మోనప్పగుట్ట, సంజయ్నగర్, మేకలబండ, రామయ్యబౌలి, శివశక్తినగర్, పాతపాలమూరుతో పాటు 14 విలీన గ్రామాలలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల ఓపెన్ నాలాలు, దెబ్బతిన్న డ్రెయినేజీలే కనిపిస్తున్నాయి. దీనికితోడు అన్ని డివిజన్లలో ఓపెన్ ప్లాట్లను చుట్టుపక్కలవారు చెత్తాచెదారంతో నింపేస్తున్నారు. మురుగు కాల్వ ల్లోనూ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పడేస్తున్నారు. ఈ ప్రాంతాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు ఇంట్లోకి వచ్చి కాటు వేయడంతో కొందరు రోగాల బారిన పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో దోమ తెరలు వాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. నగరంలోని వివిధ బహిరంగ ప్రదేశాలు, ఓపెన్ ప్లాట్లు, ముఖ్య కూడళ్లలో చెత్త వేయొద్దని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తరచూ ఇల్లిల్లూ తిరిగి అవగాహన కల్పిస్తున్నా ప్రజల నుంచి సరైన స్పందన రావడం లేదు. కేవలం స్వచ్ఛ ఆటోలకు మాత్రమే వేరు చేసిన తడి, పొడి చెత్త ఇవ్వాలని సూచిస్తున్నా ఆశించిన స్థాయిలో మార్పు కానరావడం లేదు. ఇదిలా ఉండగా పారిశుద్ధ్య నిర్వహణకు ఈసారి (2025–26 ఆర్థిక సంవత్సరంలో) ఏకంగా రూ.8.50 కోట్లు వెచ్చించారు. ఇందులో దోమల నివారణకు ఫాగింగ్ కోసమే సుమారు రూ.పది లక్షలు ఖర్చు చేశారు. కీమోపాస్ రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. దీనికోసం ఈ ఏడాది సుమారు రూ.లక్ష విలువజేసే 20 హ్యాండ్ పంప్ స్ప్రేలను కొనుగోలు చేశారు. దీనిని ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలలో పిచికారీ చేయడానికి ఒక్కో డివిజన్కు ఇద్దరు సిబ్బందిని కేటాయించారు. ఫాగింగ్ చేసే నాలుగు వాహనాలకు ప్రతినెలా డీజిల్, పెట్రోల్కు రూ.1.50 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. పాల్సాబ్గుట్ట ప్రాంతంలో ఫాగింగ్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది(ఫైల్) నగరంలో ఎక్కడబడితే అక్కడ అపరిశుభ్రత వాతారణం ఓపెన్ నాలాలు, అస్తవ్యస్త డ్రెయినేజీలతో దోమలు వృద్ధి ఈ ఏడాది పారిశుద్ధ్య నిర్వహణకు రూ.8.50 కోట్లు ఖర్చు కేవలం ఫాగింగ్కే రూ.10 లక్షల వ్యయం అయినా పరిస్థితిలో కనిపించని మార్పు -
ప్రగతి ప్రణాళికతో ప్రజల్లోకి..
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో తాగునీటి సమస్యను ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉందని, ఇందుకు గాను ముందుగానే అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందిన వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని సూచించారు. లబ్ధిదారుల జాబితా, నోడల్ అధికారుల జాబితా, దరఖాస్తుల వివరాలను అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. 46 లక్షల మంది మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఒక్కోరోజు తాను పాల్గొంటానని పేర్కొన్నారు. ఇందులో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయని, 99 రోజుల కార్యక్రమానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సైతం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. అటవీ పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల సమావేశాలు నిర్వహించేలా చూస్తామన్నారు. అందరూ చొరవ తీసుకోవాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదటిరోజు నుంచి చివరి వరకు అదే ఉత్సాహంతో నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. 99 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని, కలెక్టర్లు, అధికారులు చొరవ తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్బాషా షేక్, నారాయణపేట అదనపు కలెక్టర్ ఫణీంద్రరెడ్డి, మహబూబ్నగర్ మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ఆయా జిల్లాల ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ప్రచార వాల్పోస్టర్లు, టీషర్ట్లను ఆవిష్కరించారు. ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలి 99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ -
ఎవరెవరు ఏమన్నారంటే..
మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 20 మున్సిపాలిటీలు ఉన్నందున రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ● వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కొన్ని ఇళ్లు ఎల్–2, ఎల్–3 రిజెక్షన్ల కారణంగా నిలిచిపోయి పెండింగ్లో ఉన్నాయన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు ఈ అంశాన్ని సమీక్షించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రోడ్లు, కాల్వల నిర్మాణ పనులకు చిన్నపాటి అడవులు అడ్డుగా రావడంతో అటవీ శాఖ అనుమతులు ఇవ్వక నిలిచిపోయాయని తెలిపారు. దీని కారణంగా వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కలిసి సంయుక్త సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ● ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్కు సంబంధించిన కొన్ని భూ సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, రైతులు, భూ యజమానులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ● అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో పోడు భూములను సాగు చేస్తున్న రైతులు వ్యవసాయం చేయడానికి అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందన్నారు. దీని కారణంగా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం అమలులో ఆలస్యమవుతుందన్నారు. పోడు భూముల్లో హార్టికల్చర్ పంటలు సాగు చేయడం ద్వారా రైతులకు మంచి లాభం కలుగుతుందని, అదే సమయంలో అటవీ శాఖకూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ● రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలోనే ప్రతి పంచాయతీకి రూ.45 వేల విలువైన స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయనుందన్నారు. ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో ఆటలకు సంబంధించిన కిట్లు, మ్యాట్లు వస్తాయని పేర్కొన్నారు. ● దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపితే కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారు. -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ
● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్..ఈసారి 358వ ర్యాంక్ ● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్.. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ● ఐఏఎస్ కావడమే లక్ష్యమంటున్న వెంకటేష్ ● ఖిల్లాఘనపురం ఎంపీడీఓ విజయసింహారెడ్డికి 682వ ర్యాంక్ అడ్డాకుల/ఖిల్లాఘనపురం: అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించిన సివిల్స్ లో పాలమూరు బిడ్డ మరోసారి సత్తా చాటారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేష్ప్రసాద్ సాగర్ మొదటి ప్రయత్నంలో 700 ర్యాంక్ సాధించగా.. రెండో ప్రయత్నంలో మరింత మెరుగుపరుచుకొని 358 ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న విజయసింహారెడ్డి (రంగారెడ్డి జిల్లా)ఆలిండియా 682వ ర్యాంక్ సాధించారు. -
విద్యార్థులు చట్టాల గురించి తెలుసుకోవాలి
పాలమూరు: మహిళల భద్రత, హక్కులపై చట్టపరంగా పొందే సహాయంపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం నగరంలోని ధన్వంతరి ఫార్మా కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పోక్సో, డొమెస్టిక్ వైలెన్స్తో పాటు చట్టాల్లో ఉండే హక్కులు, రక్షణ చర్యలు, శిక్షలపై సమగ్ర అవగాహన కల్పించారు. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యశోద, రాజు, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


