breaking news
Mahabubnagar
-
చనిపోయిన వారికి ఎన్నికల విధులు..
నారాయణపేట రూరల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు డేటాను అప్డేట్ చేయకపోవడంతో తప్పిదాలకు దారితీస్తుంది. ఇటీవల మొదటి విడత ఎన్నికల నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులకు మూడో విడత ట్రైనింగ్కు రావాలని ఫోన్ చేయడంతో పాటు గైర్హాజరు పేరుతో షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంఘటన మరవక ముందే.. తాజాగా మరొకటి బయటకు వచ్చింది. మరణించిన ఉపాధ్యాయులకు సైతం ఎన్నికల విధులు కేటాయించడం చూస్తుంటే అధికారుల పనితీరు ఇట్టే అర్థం అవుతుంది. నారాయణపేటకి చెందిన అలివేలుమంగ దామరగిద్ద జీపీఎస్లో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ.. ఆరు నెలల క్రితం మృతి చెందింది. అయితే తాజాగా ఆమెకు మాగనూరు మండలంలో ఎన్నికల విధులు కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. అయితే దీనిని చూసిన పలువురు చనిపోయిన వారి ఆత్మ వచ్చి డ్యూటీ చేయలేమో అంటూ సైటెర్లు వేస్తున్నారు. ఇలా చాలా తప్పుల తడకగా ఎన్నికల విధుల కేటాయింపు జరిగిందని ఆరోపణలున్నాయి. -
గెలుపు ముఖ్యం బిగిలూ..
● చివరి విడత ఎన్నికల్లో కొనసాగిన ప్రలోభాలు ● బాలానగర్ మండలంలో అత్యధికంగా ఓటుకు రూ.5 వేల వరకు అందజేత ● అభ్యర్థులందరి ఖర్చు కలిపి రూ.కోట్లలోనే.. పాలమూరు: ‘ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి.. పరువు నిలబెట్టుకోవాలి’ ఇదే నినాదం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా అభ్యర్థులు, నాయకుల నుంచి వినిపిస్తోంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కొందరు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు బాట పట్టేందుకు రూ.లక్షలు ఖర్చు చేసేందుకు వెనకాడట్లేదు. బుధవారం ఐదు మండలాల్లో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం తుది దశ పంచాయతీ ఎన్నిక సందర్భంగా పంపకాలు మంగళవారం రాత్రి వరకు సాగాయి. గ్రామాల్లో కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అంతర్గతంగా కలిసి, మద్యం, నగదు, ఇతర కానుకలు అందజేస్తున్నారు. ఓటర్లకు తాయిలాలు సమర్పిస్తే తప్పా ఎన్నికల్లో గెలవడం కష్టమే ధోరణి పెరగడంతో అభ్యర్థులు అందుకు సిద్ధపడ్డారు. కొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్లి.. మరో చోట కుల, యువజన సంఘాల ప్రతినిధులను కలిసి క్రీడా, వంట సామగ్రి ఇస్తూ ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. చివరి విడత ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులు చాలా మంది ఇంటింటికీ కిలో చికెన్ పంపిణీ చేస్తున్నారు. కొన్ని ఇళ్లల్లో ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటే మటన్ కూడా అందిస్తున్నారు. వాటిని వద్దన్న వారికి స్వీట్బాక్స్లు పంపిణీ చేస్తున్నారు. అడ్డాకుల, భూత్పూర్ మండలాల పరిధిలో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు.. జడ్చర్ల పరిధిలో రూ.3 వేల వరకు ఇస్తే అత్యధికంగా బాలానగర్ మండలంలో చాలా గ్రామాల్లో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. భూత్పూర్ మండలంలోని ఓ గ్రామంలో హ్యాండ్ బ్యాగ్ల్లో మద్యం బాటిల్స్ పెట్టి ఇచ్చినట్లు తెలిసింది. ఎలాగైనా విజయం సాధించడానికి చివరి వరకు ప్రయత్నం చేశారు. మరికొందరు అభ్యర్థులు ఎదుటి వర్గం ఏమేమి పంపిణీ చేస్తున్నారో ఆరా తీసి అంతకు ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల రెండవ విడతలో హన్వాడ మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడి రూ.కోటి ఖర్చు చేశారు. చారిత్రాత్మక గ్రామం ముంపులో.. వల్లూరుకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముందుగా ఊరంతా కోటలనే ఉండేదని పెద్దలు చెప్పేవాళ్లు. కాలక్రమేణా కోట బయట ఇండ్లు నిర్మాణమయ్యాయి. ఇప్పుడు కోట, ఇండ్లు అన్ని ముంపులోకే వెళ్తున్నాయి. మా గ్రామంలో పంచాయతీకి ఇవే చివరి ఎన్నికలు. ఎలాగోలా వచ్చే ఎన్నికల్లోగా మమ్మల్ని ఇక్కడి నుంచి తరలిస్తరు. ఆ మాట తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏం చెప్పలేం. – ఈదె సత్తయ్య, వల్లూరు. పెరిగిన చికెన్ కల్చర్.. -
సీఎన్బీ అధికారుల మెరుపు దాడులు
గద్వాల క్రైం: సెంట్రల్ నార్కోటిక్ ఆఫ్ బ్యూరో అధికారులు సోమవారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేపట్టి.. నిషేధిత ఆల్ఫాజోలం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 171 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టిన సీఎన్బీ అధికారులు.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన ఈడిగి నరేశ్గౌడ్ నిషేధిత మత్తు పదార్థం (ఆల్పాజోలం)తో హైదరాబాద్ నుంచి వాహనంలో గద్వాలకు బయలుదేరాడు. పక్కా సమాచారం మేరకు సీఎన్బీ అధికారులు సుష్పాల్, పవన్, సాయివరుణ్, గౌరవ్లు అతడి వాహనాన్ని ఎర్రవల్లి–గద్వాల మార్గంలో పట్టుకొని 171 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలం తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆల్ఫాజోలం విలువ రూ. 4లక్షలు ఉంటుందని తెలిపారు. కాగా, నిందితుడు నరేశ్గౌడ్ను సీఎన్బీ అధికారులు గద్వాల రూరల్ పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టగా.. పలువురు కీలక వ్యక్తుల పేర్లును బహిర్గతం చేసినట్లు తెలిసింది. నిందితుడు తన స్వగ్రామంలో కల్లు దుకాణం ఏర్పాటు చేసుకుని కల్లు విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెలుగులోకి ఇలా.. హైదరాబాద్లో నివాసముంటున్న మెదక్ జిల్లావాసి సుంకి శ్రీనివాస్ అలియాస్ కృష్ణతో నరేశ్గౌడ్ నిషేధిత ఆల్ఫాజోలం కొనుగోలుచేసి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే సుంకి శ్రీనివాస్ను సీఎన్బీ అధికారులు పట్టుకొని విచారణ చేపట్టగా.. ఆల్ఫాజోలం మాఫియా దందా వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడి సమాచారం మేరకు సీఎన్బీ అధికారులు బృందాలుగా ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఓ బృందం కర్నూలు జిల్లాలో ఇద్దరు నిందితులు నవీన్, మాధవ్ అలియాస్ గోపాల్ వద్ద 3 కేజీల ఆల్ఫాజోలం పట్టుకోగా.. మరో బృందం జోగుళాంబ గద్వాల జిల్లాలో నరేశ్గౌడ్ వద్ద 171 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. సిన్నీ ఫక్కీలో.. ఎర్రవల్లి–గద్వాల మార్గంలో కాపు కాసిన సీఎన్బీ అధికారులు.. నరేశ్గౌడ్ వాహనాన్ని గుర్తించి నిలుపు దల చేశారు. అయితే వారి నుంచి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ఓ అధికారి గన్ ఎక్కుపెట్టడంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. అంతా గోప్యం.. మాదకద్రవ్యాలను సరఫరాచేసే మాఫియాను సెంట్రల్ నార్కోటిక్ ఆఫ్ బ్యూరో అధికారులు గుర్తించిన క్రమంలో ఎకై ్సజ్, పోలీసు, ఇంటెలిజెన్సీ, ఎస్బీ విభాగం అధిపతులకు ముందస్తు సమాచారం చేరవేయకుంగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మెదక్కు చెందిన ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుబడిన నిందితుల జాబితా బయట తెలియకుండా అంతా గోప్యంగా విచారించి.. పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఈ చీకటి దందా వెనుక ఉన్న అసలు దోషులు ఎవరనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. జిల్లాలో ప్రకృతిసిద్ధ కల్లు కంటే ప్రమాదకరమైన కల్లు విక్రయాలు ఉన్నట్టు గుర్తించిన సీఎన్బీ అధికారులు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. నడిగడ్డలో 171 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలం సీజ్ సనీ ఫక్కీలో బిజ్వారం గ్రామవాసి అరెస్టు ప్రధాన నిందితుడి అరెస్టుతో వెలుగులోకి -
ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2837
జడ్చర్ల/దేవరకద్ర/నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,837, కనిష్టంగా రూ.2,099 ధరలు లభించాయి. అదేవిధంగా హంస రూ.1,901, కందులు రూ.6,500, వేరుశనగ గరిష్టంగా రూ.7,668, కనిష్టంగా రూ.7,351, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,025, కనిష్టంగా రూ.1,650 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ. 2673, కనిష్టంగా రూ.2406, హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.2009గా ఒకే ధర పలికాయి. కాగా.. దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం ఉల్లి పాయల బహిరంగ వేలం నిర్వహిస్తారు. నవాబుపేటకు పోటెత్తిన ధాన్యం నవాబుపేట మార్కెట్ యార్డుకు భారీగా ధాన్యం పోటెత్తింది.ఇప్పటికే మార్కెట్లో 40 వేల బస్తాల ధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం 55 వేలకు పైగానే ధాన్యం రాగా టెండర్లు సైతం సోమవారం నిర్వహించాల్సి వచ్చింది. మంగళవారమే యార్డు నిండిపోగా బుధవారం ధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో రోజు వారి టెండర్లు వేసేలా మార్కెట్ అధికారులు వ్యాపారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ‘జైభీమ్ జైమీమ్’ నినాదంతో ముందుకు.. ఆత్మకూర్: జై భీమ్, జై మీమ్ నినాదంతో ముందుకెళ్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని ఏఐఎంఐఎం రాష్ట్ర సంస్థాగత బాధ్యుడు అబ్దుల్సమద్బిన్ అబ్దాద్ అన్నారు. మంగళవారం ఆత్మకూర్లోని ఎంజీ గార్డెన్లో ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తలతో సంస్థాగత సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి అనవసరమైన విషయాలపై రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం సత్తాచాటే విధంగా కార్యకర్తలు ముందుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా నిరంజన్, ప్రధానకార్యదర్శిగా షాకీర్, మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఇమ్రాన్, ప్రధానకార్యదర్శిగా జావిద్, కోశాధికారిగా ఫిరోజ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జుబేర్బిన్సయిద్, ఎంఏ రహీం, అబ్దుల్హాదీ, సాదతుల్లాహుస్సేన్, గయాసుద్దీన్, ఖదీర్, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానభ్రంశం అనివార్యం.. ఉన్నచోట చివరి ఓటు!
జడ్చర్ల టౌన్: ఉదండాపూర్, వల్లూరు రెండు గ్రామాల్లోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు ఇవే చివరివి. అదేమిటి రెండు గ్రామాలు మున్సిపాలిటీలో ఏవైనా.. విలీనమవుతున్నాయా.. అనే సందేహం వస్తుంది. అదికాదు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతుండడంతో ఆ గ్రామాలు అక్కడి నుంచి తరలింపు అనివార్యమవుతుంది. ప్రస్తుతం రెండు గ్రామాలకు అక్కడ ఎన్నికలు చివరివి కావడం గమనార్హం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఉదండాపూర్, వల్లూరు జీపీలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఆ రెండు గ్రామాలకు బండమీదిపల్లి జీపీ సమీపంలో పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముంపు నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ ఆలస్యం కావడంతో ఇంకా గ్రామాల తరలింపు జరగలేదు. కొన్నేళ్లుగా గ్రామస్తులు పోరాటం చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునరావాసానికి హామీ ఇచ్చినప్పటికీ సాధ్యపడలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ముంపు బాధితుల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్యాకేజీ పెంపునకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో రూ.144కోట్లు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ ముగిశాక ఆ డబ్బులు నిర్వాసితులకు పంపిణీ చేయనున్నారు. దీంతో గ్రామాల తరలింపు అనివార్యంగా మారింది. ఏడాదిలోగా గ్రామం పూర్తిగా తరలింపు కావాల్సిందే. అందుకే రెండు జీపీలకు ప్రస్తుతం ఉన్నచోట జరిగే ఎన్నికలు ఇవే చివరివి. పునరావాసం తర్వాత ఇవే గ్రామాలకు ఎన్నికలు జరగనున్నప్పటికీ స్థానభ్రంశం తప్పదు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇక్కడే జరిగే అవకాశాలున్నాయి. -
నిలువురాళ్ల పరిశోధనకు సహకారం
కృష్ణా: మండలంలోని ముడుమాల్ నిలువురాళ్ల పరిశోధనకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ చేస్తున్న కృషి అమోఘమని, వారికి తన సహాయ సహకారాలు అందిస్తామని పురవాస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావువ అన్నారు. మంగళవారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముడుమాల్ నిలువురాళ్ల ప్రాంతంలోని సప్తరుషి మండలి తదితర వాటిని ఆయన పరిశీలించారు. అనంతరం దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ వేదకుమార్ మణికొండతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. నిలువురాళ్ల ప్రదేశంలో పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసేందుకు త్వరలోనే తవ్వకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్రొఫెసర్ పుల్లారావు, నాగలక్ష్మి, రాములునాయక్, రాజు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాన్గల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. వీనపగండ్ల మండలం తూంకుంటకు చెందిన వసంతపురం వీరస్వామి(37) జిల్లా కేంద్రంలో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. భార్య, పిల్లలు సొంత గ్రామంలో ఉంటారు. సోమవారం రాత్రి వనపర్తి నుంచి స్వగ్రామం తూంకుంటకు బైక్పై వెస్తుండగా మండలంలోని దావాజిపల్లితండా సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన పంట పొలాలలో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి వనపర్తి రూరల్: పట్టణంలోని కొత్తకోట రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణంలో కొత్తకోట రోడ్డులోని విజన్ స్కానింగ్ సెంటర్ పక్కన 75 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. అతడి ఒంటిపై ఆకుపచ్చ రంగు టీషర్ట్, మెరూన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉందని, గుర్తు పట్టిన వ్యక్తులు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధం రాజోళి: వడ్డేపల్లి మండల పరిధిలోని బుడమరుసు గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుర్వ వెంకటేశ్వర్లు గుడిసెలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో బంగారం, రూ.2.50 లక్షల నగదు, నిత్యవసర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితుడు పేర్కొన్నాడు. జాతీయ రహదారిపై వాహనం బోల్తా మానవపాడు: జాతీయ రహదారి– 44పై డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం జాతీయ రహదారిపై బోరవెల్లి స్టేజి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ మహమూద్కు స్వల్ప గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కల్పన ప్రథమ చికిత్స అందించి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సర్పంచ్ అభ్యర్థి ఇంటి ఎదుట క్షుద్రపూజలు
మక్తల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని కాచ్వార్ గ్రామంలో అభ్యర్థి ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేయడం కలకలం రేపుతోంది. సర్పంచు ఎన్నికల్లో తమను ఓడించేందుకు ప్రత్యర్థి వర్గం తన ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటమ్మ ఆరోపించారు. ఇంటి ముందు తెల్ల ఆవాలు, చనిపోయిన తర్వాత మృతదేహంపై చల్లే మొలకెత్తిన గింజలు, ఇసుక చల్లారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇంటి ముందే కాకుండా తమకు మద్దతు ఇస్తున్న వారి ఇంటి వద్ద క్షుద్రపూజలు చేస్తున్నారని వాపోయారు. ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, ఇలాంటి పనులు చేయొవద్దని హితువు పలికారు. తమకు ఏమైనా జరిగితే ప్రత్యర్థి వర్గం వారు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాచ్వార్ గ్రామంలో సర్పంచు పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. బరిలో నిలిచిన ప్రత్యర్థి మహిళా అభ్యర్థి మామనే ఈ పని చేసినట్లు గ్రామస్తుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ తతంగం అంతా జరుగుతుండగానే వెంకటమ్మ భర్తకు గుండెనొప్పి రాగా చికిత్స కోసం అంబులెన్స్ల్లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఈ ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ● ‘పాలమూరుశ్రీలో ముంపునకు గురవుతుండడంతో తరలింపు ● ఉదండాపూర్, వల్లూరులో భావోద్వేగానికి గురువుతున్న గ్రామస్తులు -
సీసీకుంట పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయింపు
● బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన ● ఎస్ఐ హామీతో ధర్నా విరమించిన గ్రామస్తులు, కుటుంబీకులు చిన్నచింతకుంట: ప్రమాదవశాత్తు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన మధు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నచింతకుంట పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి భార్య మనీష, గ్రామస్తులు మాట్లాడుతూ.. గరుడ కెమికల్ కంపెనీకి చెందిన బొలేరో డ్రైవర్ బొలేరోను నిర్లక్ష్యంగా నడుపుతూ ఏదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టి కౌకుంట్ల మండలం అప్పంపల్లికి చెందిన తెలుగు మధును అకారణంగా చంపేశాడని ఆరోపించారు. మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి పెద్దదిక్కు మృతిచెందడంతో భార్యాపిల్లలు రోడ్డున పడ్డారని వాపోయారు. మృతుడి కుంటుబానికి సరైన న్యాయం చేయాలని రెండురోజులుగా పోలీసులను ఆశ్రయిస్తున్నా.. పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఓ పక్కన మృతదేహాన్ని పెట్టుకొని భార్యాపిల్లలు పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతూ తల్లడిల్లిపోతున్నారని వాపోయారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి చర్యలు చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నిరసన వద్దకు ఎస్ఐ ఓబుల్రెడ్డి చేరుకొని బాధితులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కుటుంబానికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోలీసులు డ్రామా చేస్తున్నారని ఆరోపణ మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇస్తూ పోలీసులు డ్రామా చేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. సోమవారం రాత్రి ప్రమాదం జరిగిన ఘటన వద్దనే మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదలనివ్వమని భీష్మిస్తే బొలేరో యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి తగు న్యాయం చేస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. తీరా ఉదయం చూస్తే బొలేరో యాజమాన్యంతో చేతులు కలిపి యాజమాన్యం స్పందించడంలేదంటూ చావుకబురు చల్లగా చెబుతున్నారని ఆరోపించారు. రెండురోజులుగా తిండీతిప్పలు లేక కుటుంబ సభ్యులు అల్లాడుతుంటే పోలీసులకు ఆటవిడుపుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఉన్నతాధికారులు గమనించాలని కోరారు. -
పాన్గల్లో పట్టుబడిన చీరలు
పాన్గల్: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతు దారుల ఇళ్లలో చీరలు పట్టుబడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో ఓటర్లకు పంచేందుకు చీరలు ఉన్నాయన్నా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వందల సంఖ్యలో ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్కు తరలించారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ నాయకుడు చీరలను కేఎల్ఐ కాల్వ సమీపంలోని చెట్ల పొదల్లో వేశారు. అనంతరం కాంగ్రెస్ మద్దతుదారుడి ఇంటిలో రెండు కాటన్ల మద్యం పట్టుబడిందని, రెండు సంఘటనలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్చ్.. ఈ ఏడు గ్రామాలలో ఎన్నికలే లేవు!
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పలు సిత్రాలు కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు.. అయిన వాళ్ల మధ్యే పోరు.. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏడు గ్రామాలకు ఎన్నికలే లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో 52 జీపీలు ఏకగ్రీవం కాగా.. ఏడు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), వంగురోనిపల్లె, కల్ములోనిపల్లె, ప్రశాంత్నగర్ పంచాయతీలకు మూడో విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రజలు బహిష్కరించారు. కారణం ఆ పల్లెల్లో గిరిజనులు లేకున్నా.. ఏజెన్సీ నిబంధనల ప్రకారం సర్పంచి స్థానాలను గిరిజనులకే కేటాయించాల్సి రావడం. ఇక చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు గోకారం రిజర్వాయర్ ముప్పు తగ్గించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ స్థానానికి ఎన్నికలు లేకుండా పోయాయి.ఇవి పోనూ 504 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 504 సర్పంచ్ స్థానాలకు 1,652 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా 942 వార్డులు ఏకగ్రీవం కాగా.. 58 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. ఇవి పోనూ మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా.. 10,436 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కో సర్పంచ్, ఒక్కో వార్డుకు సగటున ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు. -
ఏజెన్సీ పేరున్నా.. గిరిజనులు లేరాయె!
అచ్చంపేట: ఏజెన్సీ పంచాయతీలుగా గుర్తింపున్న కొన్ని గ్రామాలకు ఎస్టీ ఓటర్లు లేక ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. వాటిని నాన్ ఏజెన్సీ గ్రామాలుగా మార్చాలంటే పార్లమెంట్లో చట్టం చేయడం రాజ్యాంగ పరమైన మార్పులతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అది అనుకున్నంత సులువైనదేం కాదు. మూడంచెల పంచాయతీరాజ్ చట్టం 1995 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ఏజెన్సీలో 1/70 చట్టం అమలు కారణంగా ఈ గ్రామాల్లో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీలకే ఉంటుంది. అప్పట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన తప్పులతో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, లక్ష్మాపూర్, కల్ములోనిపల్లి, వంగరోనిపల్లి, ప్రశాంత్నగర్ ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో కుమ్మరోనిపల్లి పంచాయతీ నుంచి వంగరోనిపల్లి, మన్ననూర్ నుంచి ప్రశాంత్నగర్, కల్ములోనిపల్లి నుంచి తెలుగుపల్లి, లక్ష్మాపూర్ నుంచి లక్ష్మాపూర్తండాను ప్రత్యేక పంచాయతీలుగా మార్చడంతో గిరిజనేతరులున్నా ఏజేన్సీ గ్రామాలుగా ఏర్పడ్డా యి. సర్పంచ్తోపాటు వార్డుస్థానాలను ఎస్టీలకు కేటాయించడంతో ఎన్నికలకు అవరోధకంగా మారుతోంది. సర్పంచ్తో సహా 8వార్డుల్లో 4వార్డులకు జరపాల్సిన ఎన్నికలు ఎస్టీ జనాభా లేకుండా వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఎస్టీ జనాభా లేక పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేకుండా పోయింది. హన్వాడ: మండలంలోని టంకర సర్పంచ్ స్థానానికి ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో మహిళా జనరల్లో పోటీచేసిన స్వంతంత్ర అభ్యర్థిని మెండె లక్ష్మి భారీ మెజార్టీతో గెలుపొందింది. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని మదులపాటి పూజపై 2వేల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 3,425 ఓట్లలో 3,113ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి మెండె లక్ష్మికి 2,113ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిని మధులపాటి పూజకు వెయ్యి ఓట్లు వచ్చాయి. మండలంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థినిగా నిలిచింది. స్వతంత్ర అభ్యర్థిని మెండె లక్ష్మికి స్థానిక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలవడంతో ఆమె గెలుపు సులువుగా మారింది. ఆమె ప్యానెల్లో బీజేపీ 5, బీఆర్ఎస్ 6వార్డు స్థానాలు కై వసం చేసుకోగా.., కాంగ్రెస్ కేవలం ఒక్కవార్డు స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఆ వార్డు స్థానం కూడా కేవలం 6ఓట్ల స్వల్ప మెజార్టీలో గెలుపొందింది. భారీ మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి ఘనవిజయం -
టోర్నీలో ప్రతిభ చాటాలి
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో మంగళవారం నుంచి జరుగనున్న హెచ్సీఏ ఇంటర్ స్కూల్స్ వన్డే నాకౌట్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబర్చాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో టోర్నీలో పాల్గొననున్న అండర్– 14 జిల్లా బాలుర క్రికెట్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోర్నీలో క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలన్నారు. సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చని సూచించారు. టోర్నీలో గ్రూప్– ఏలో జిల్లా జట్టు మొదటి మ్యాచ్లో ఎస్టీ మైకల్స్ స్కూల్ (ఆల్వాల్) జట్టుతో తలపడనుందని పేర్కొన్నారు కార్యక్రమంలో కోచ్లు గోపాలకృష్ణ, ముఖ్తార్అలీ, సీనియర్ క్రీడాకారుడు రంజిత్కుమార్ పాల్గొన్నారు. అండర్–14 క్రికెట్ జట్టు రాహుల్ రైన (మహబూబ్నగర్), అర్హాన్, జైద్ (జడ్చర్ల), సాయిహర్షిత్ (మహబూబ్నగర్), రాఘవ, పునీత్ (జడ్చర్ల), వెంకటసాయి– కెప్టెన్, కార్తీకేయ (గద్వాల), సాయిరాం (మహబూబ్నగర్), జోసెఫ్ (జడ్చర్ల), హృతిక్ (వనపర్తి), చరణ్తేజ (జడ్చర్ల), సాత్విక్, సోహైల్, ధనుష్ (మహబూబ్నగర్), కోచ్ ముఖ్తార్ అలీ. -
నల్లమలలో పెద్దపులుల కనువిందు
మన్ననూర్: నల్లమల, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంగల్ సఫారీలో ప్రయాణం చేస్తున్న ప్రకృతి ప్రియులకు అటవీ ప్రాంతంలో తరుచుగా పెద్దపులులు కనిపిస్తుండటంతో పర్యాటకుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆదివారం సాయంత్రం సమయంలో హైద్రాబాద్కు చెందిన కొందరు సఫారీలో ప్రయాణిస్తుండగా నిజాం బంగ్లా సమీపంలో వాహనం ముందు నుంచి పెద్ద పులి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. అభయారణ్యంలో సహజ సిద్ధంగా సంచరిస్తున్న పెద్దపులిని చూసి సంబరపడిన పర్యాటకులు వారి సెల్ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. -
సుంకరామయ్యపల్లిలో ఒకే ఓటు..!
అడ్డాకుల: సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఓటుతో పాటు వార్డు సభ్యుడి ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ అడ్డాకుల మండలం సుంకరామయ్యపల్లి గ్రామంలో మాత్రం ఒకే ఓటు వేయాల్సి ఉంది. అది కూడా సర్పంచ్ ఓటు మాత్రమే. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో 445 ఓట్లు, 8 వార్డు స్థానాలు ఉన్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు ఒక్కో వార్డుకు ఒక్కరితోనే నామినేషన్ వేయించారు. సర్పంచ్ స్థానానికి మాత్రం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో సర్పంచ్ ఎన్నిక అనివార్యమైంది. ఇకపోతే వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో వారంతా ఏకగ్రీవమయ్యారు. ఇక రేపు (బుధవారం) గ్రామంలో జరిగే పోలింగ్లో ఓటర్లు సర్పంచ్ ఓటు మాత్రమే వేయాల్సి ఉంది. -
మార్కెట్లోకి ఎంజీ హెక్టర్ నూతన మోడల్
పాలమూరు: ఎంజీ హెక్టర్ నూతన మోడల్ను సోమవారం నగరంలోని ఏనుగొండ షోరూంలో కంపెనీ ఏఎస్ఎం టేజా కిలారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం ఎండీ వేణుగోపాల్సింగ్ మాట్లాడుతూ.. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎంజీ హెక్టర్ సీవీటీ పెట్రోల్ మోడల్లో ఆకర్షిణీయమైన ఫీచర్స్ ఉన్నాయన్నారు. ఆరా హెక్సాగ్ రిల్, ఆధునిక ఐఎస్ఎంఐఐఈ టెక్నాలజీ, పనోరామిక్ సన్రూఫ్ ఉంటుందన్నారు. ఆరా స్కల్ప్ బంపర్లు, స్టైలిష్ ఆరా బోల్ట్ అలాయ్ వీల్స్, 14 ఇంచుల పోర్ర్టెయిట్ టచ్ స్క్రీన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహబూబ్నగర్లో ఎంజీ హెక్టర్ వాహనాలకు మంచి స్పందన లభిస్తోందని, ఈ కొత్త వేరియంట్ కస్టమర్లకు అత్యుత్తమంగా ఉపయోగపడుతుందన్నారు. -
అన్నదమ్ముళ్ల సవాల్..!
● రసవత్తరంగా స్థానిక ఎన్నికలు ● తిమ్మాయిపల్లి తండాలో సొంత అన్నదమ్ముళ్ల మధ్య పోటీ ● అడ్డాకులలోనూ సోదరుల పోరు ● సుంకరామయ్యపల్లిలో బాబాయ్, అబ్బాయ్ల అమీతుమీ అడ్డాకుల: పల్లె పోరులో రక్తం పంచుకు పుట్టిన వారు, ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రత్యర్థులవుతున్నారు. సొంత అన్న, తమ్ముళ్లు, బాబాయ్, అబ్బాయ్ల మధ్య పోటీతో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లితండాలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నలుగురిలో జరుప్ల హన్మంతునాయక్, జరుప్ల గోపాల్నాయక్ సొంత అన్నదమ్ముళ్లు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థిగా హన్మంతునాయక్, రెబల్గా గోపాల్నాయక్ పోటీ చేస్తున్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నుంచి బొక్కలపల్లి దశరథ్రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు వరుసకు అన్నదమ్ముళ్లు. సుంకరామయ్యపల్లిలో బాబాయ్, అబ్బాయ్ మధ్య పోటీ జరుగుతోంది. బీఆర్ఎస్ తరఫున ఆకులమోని రవి, కాంగ్రెస్ తరఫున ఆకులమోని చెన్నకేశవులు పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏకగ్రీవంగా రవిని సర్పంచ్, చెన్నకేశవులను ఉప సర్పంచ్గా నిర్ణయం తీసుకున్నా నామినేషన్ల ఉపసంహరణ రోజు ఏకాభిప్రాయం కాస్త పోరుకు దారి తీసింది. ఏదేమైనా పల్లె పోరులో రక్తం పంచుకు పుట్టిన వారు కూడా ప్రత్యుర్థులుగా మారడం రసవత్తరంగా మారింది.గోపాల్నాయక్ – జరుప్ల తిరుపతిరెడ్డి– బొక్కలపల్లి దశరథ్రెడ్డి– బొక్కలపల్లి రవి– ఆకులమోని చెన్నకేశవులు– ఆకులమోని -
పట్టపగలు ఇంట్లోకి చొరబడి చోరీ
కల్వకుర్తి టౌన్: తాగేందుకు నీళ్లు ఇవ్వాలంటూ వచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి మంగళసూత్రం అపహరించుకువెళ్లాడు. ఈఘటన కల్వకుర్తిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న లకీ్ష్మ్నగర్ కాలనీలో రాజేశ్వరి, సంతోష్రెడ్డి దంపతులు నూతనంగా ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే రాజేశ్వరి తన బిడ్డను ఇంటి వరండాలో ఆడిస్తూ ఉండగా.. ఓ వ్యక్తి బాగా దాహంగా ఉంది, నీరు ఇవ్వాలని అడిగాడు. నీరు ఇచ్చాక.. మరోగ్లాస్ ఇవ్వాలంటూ అడగడంతో ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకోవాలని చూసింది. ఇంతలోనే ఆ దొంగ తలుపు గడియ పెట్టకుండా అడ్డుతగిలి ఇంట్లోకి చొరబడి రాజేశ్వరిని కొట్టడంతోపాటు ఆమె బిడ్డను పక్కకు విసిరేసి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. రాజేశ్వరి బయటకు వచ్చి చుట్టుపక్కల వాళ్లకు ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పే సరికి అతను పారిపోయాడు. పోలీసులకు బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తాగేందుకు నీళ్లు ఇవ్వాలంటూ వచ్చి మంగళసూత్రం అపహరణ -
మా ఊరోళ్ల్లే.. నా గుండెల మీద కొట్టారు
జడ్చర్ల: మా సొంత ఊరుకు ఎంతో చేశా.. కానీ సర్పంచ్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఓడించి తన గుండెల మీద కొట్టారని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి మండలంలోని గంగాపూర్, నసరుల్లాబాద్, చర్లపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గంగాపూర్లో పలువురు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. తన సొంతూరు రంగారెడ్డిగూడలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినా బయటినుంచి వచ్చిన వ్యక్తులు తమ గ్రామస్తులను ప్రభావితం చేసి ఎమ్మెల్యేను ఓడించాలన్న ప్రయత్నం చేశారన్నారు. అయితే తన నియోజకవర్గంలోని అన్నిగ్రామాలు తన సొంతూర్లేనన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంగా ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడానని, నేడు ఎమ్మెల్యేగా ఉదండాపూర్ నిర్వాసితుల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతున్నానంటూ వివరించారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్రెడ్డి, గిరిప్రసాద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి -
బాండ్ పేపర్పై ఆస్తుల ప్రకటన
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బత్తుల బాలగౌడ్ తన ఆస్తులను బాండ్ పేపర్పై ప్రకటించారు. ఎన్నికల చివరి రోజైన సోమవారం ప్రజలతో సమావేశం నిర్వహించి ఆస్తులను ప్రకటించాడు. తనకు రెండు రూములు, 15/40 ఖాళీ స్థలం, చెరువు కింద 10 గుంటల భూమి, హీరోహోండా బైక్ కలదని పేర్కొన్నాడు. ఈ రోజు ఎన్ని ఆస్తులు ఉన్నాయో పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా అదే ఆస్తులతో ఉంటానని చెన్నకేశవస్వామిపై ప్రమాణం చేసి బాండ్ పేపరును ప్రజలకు అందజేశారు. ఒకవేళ ఈ ఆస్తుల కన్నా ఎక్కువ సంపాదిస్తే గ్రామానికి అందజేస్తానని అన్నారు. సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలంలోని పెద్దవడ్డెమాన్–నెల్లికొండి మధ్యలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఓబుల్రెడ్డి కథనం ప్రకారం.. కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లికి చెందిన తెలుసు మధు బైక్పై నెల్లికొండి నుంచి వడ్డేమాన్వైపు వస్తున్నాడు. వడ్డెమాన్ నుంచి నెల్లికొండి వైపు వెళ్తున్న బొలేరో డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ రోడ్డుపక్కకు పడిపోగా.. మధుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎలాంటి ఫిర్యాదు అందక పోవడంతో కేసు నమోదు చేయలేదని తెలపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన మృతుడు తెలుగు మధు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఘటనా స్థలం వద్ద రోడ్డుపై బైఠాయించారు. బొలేరో డ్రైవర్ అజాగ్రత్తతోనే ఓ నిండు ప్రాణం బలైందని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని భీష్మించారు. ఘటనా స్థలానికి సీఐ రామకృష్ణ చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళనను విరమించలేదు. భవనంపై నుంచిపడి తాపీమేసీ్త్ర మృతి పెంట్లవెల్లి: మండల కేంద్రంలో ఇంటినిర్మాణం చేపడుతుండగా.. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిన ఘటనలో తాపీమేసీ్త్ర బత్తిని వెంకటేశ్(46) మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామన్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన భవనం నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ తొలగిస్తుండగా.. ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు పైనుంచి కాలుజారి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే..
పాలమూరు: పోలింగ్ కేంద్రంలో ఓటరుకు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. కానీ ఆ వ్యక్తి ఎడమచేతికి చూపుడువేలు లేకుంటే ఎలా? అనే ప్రశ్న కొందరికి తలెత్తవచ్చు. ఎన్నికల సంఘం దీనికి ప్రత్యామ్నాయం చూపింది. ఎడమచేతి చూపుడువేలు లేకపోతే మధ్య వేలు, అదికూడా లేకుంటే ఉంగరం వేలు, అదీ లేకుంటే చిటికెన వేలు, అదీ లేకుంటే బొటన వేలుకు సిరాచుక్క పెట్టే అవకాశం కల్పించింది. ఎడమ చెయ్యి లేకుంటే కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, బొటనవేలుకు సిరాచుక్క పెట్టవచ్చు. రెండు చేతులకు వేళ్లు లేని పక్షంలో ఎడమ, కుడి చేతుల పైభాగంలో సిరాచుక్క పెడతారు. -
పల్లె పాలనకు 61 ఏళ్లు
● 1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు ● మొదటి పంచాయతీగా షాద్నగర్ ఎంపిక ● 1959 నుంచి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ బల్వంత్రాయ్ మెహతా కమిటీ నివేదిక ప్రకారం.. ● ప్రజల భాగస్వామ్యం కోసం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ● పాలన వికేంద్రీకరణ ద్వారా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వనరులను వినియోగించుకోవాలి. ● శాశ్వతమైన పరిపాలన అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అచ్చంపేట: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నారు మహాత్మాగాంధీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభమైన గ్రామ పంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నాయి. ఇంతకీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకొందాం. నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్యం– సామ్యవాదం నినాదంతో దేశంలో పాలన సాగించారు. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో పాటు గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని సంకల్పించారు. ప్రొఫెసర్ ఎస్కే డే నేతృత్వంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమం అమలు చేశారు. దీనిపై శాసీ్త్రయ అధ్యయనానికి 1957లో సామాజిక, ఆర్థికశాస్త్రవేత్త డాక్టర్ బల్వంత్రాయ్ మెహతా నేతృత్వంలో అధ్యయన బృందాన్ని నియమించారు. దాని ఆధారంగా 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయతీ ఇలా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనిని దేశంలో మొట్టమొదట రాజస్థాన్లో అక్టోబర్ 2న, మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో 1959 అక్టోబర్ 11న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. అనంతరం దశల వారీగా దేశమంతటా అమలైంది. మొదట్లో పరోక్ష పద్ధతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1964లో సమగ్ర గ్రామ పంచాయతీ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 500కు పైగా జనాభా కలిగిన గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులు ఉండవచ్చని ఇందులో పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లను ఎన్నుకుంటే, వారు సర్పంచ్ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సర్పంచ్లు కలిసి సమితి(బ్లాక్) ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకనేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలకు ఓటుహక్కు ఉండేది. 1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఎస్పీ, ఎస్టీలకు రిజర్వేషన్లు 1992లో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పించాలని, అలాగే 1/3వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మండల వ్యవస్థ మార్పుతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలుకాలను రద్దుచేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు. 1994లో పరిషత్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం– 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థను ఆమోదించింది. మండల పరిషత్లో సర్పంచ్లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ను ఎన్నుకోవడం ప్రారంభమైంది. -
మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభ?
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. మరోవైపు నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పాలమూరు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాలమూరు ఎత్తిపోతలపై అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 19న తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కీలక ప్రకటన చేయనున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి ఈ నెల 11న ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, వి.శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. ‘కొడంగల్ లిఫ్ట్’పై బీఆర్ఎస్ వ్యతిరేకత90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని వివరించేందుకు ఈ నెలాఖరు లేదా జనవరిలో మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. కేసీఆర్ ఈ సభలకు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నదీ జలాల అనుసంధానం పేరిట ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమానికి కేసీఆర్ ఇప్పటికే రూపకల్పన చేసినట్లు సమాచారం.కాళేశ్వరం మరమ్మతుల కోసం ఒత్తిడికాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ను మరమ్మతు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రభుత్వానికి జల విధానం లేకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న జరిగే భేటీలో కేసీఆర్ ప్రకటించే ఉద్యమ కార్యాచరణపై బీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత కేసీఆర్ పార్టీ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వస్తున్న కేసీఆర్.. పంచాయతీ ఎన్నికలు, ఫలితాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా స్పందించే అవకాశం ఉంది. -
ఆ ఇద్దరికి స్వగ్రామాల్లో చుక్కెదురు!
● దమగ్నాపురంలో ఎమ్మెల్యే జీఎమ్మార్కు షాక్ ● 120 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారు విజయం ● ధన్వాడలో కోడలు ఎమ్మెల్యే పర్ణికారెడ్డిపై అత్త ఎంపీ డీకే అరుణదే పైచేయి.. ● 617 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతుదారుపై బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు ● నాగర్కర్నూల్లోని సొంతూరు తూడుకుర్తిలో పట్టు నిలుపుకున్న ‘కూచుకుళ్ల’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు ‘అధికార’ ప్రజాప్రతినిధులకు వారివారి స్వగ్రామాల్లో చుక్కెదురైంది. కాంగ్రెస్కు చెందిన దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సొంతూరు చిన్నచింతకుంట మండలం దమగ్నాపురంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పంచాయతీ పీఠాన్ని దక్కించుకున్నారు. బీజేపీ నాయకురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, కాంగ్రెస్కు చెందిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అత్తాకోడళ్లు కాగా.. కోడలిపై అత్త పైచేయి సాధించారు. వారి పుట్టినిళ్లు అయిన ధన్వాడలో సర్పంచ్గా ‘కమలం’ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఇదిలా ఉండగా.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి స్వగ్రామం తూడుకుర్తిలో వారు పట్టు నిలుపుకున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా అంటే.. ● దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి స్వగ్రామం దమగ్నాపూర్లో మొత్తం 1,704 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భారతమ్మకు 640 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ మద్దతుదారు ఇ.పావనికి 760 ఓట్లు వచ్చాయి. 120 ఓట్ల మెజార్టీతో పావని గెలుపొందారు. ● ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సొంతూరు ధన్వాడలో సర్పంచ్ పదవికి 6,250 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మద్దతుదారు పంది జ్యోతికి 3,287 ఓట్లు రాగా.. కాంగ్రెస్ బలపరిచిన చిట్టెం జ్యోతికి 2,670 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ మద్దతుదారు శ్రీదేవికి కేవలం 249 ఓట్లు పోలయ్యాయి. తన సమీప ప్రత్యర్థి చిట్టెం జ్యోతిపై పంది జ్యోతి 617 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ● నాగర్కర్నూల్లో కూచు కుళ్ల స్వగ్రామమైన తూడుకుర్తిలో 4,074 ఓట్లు పోలయ్యాయి. కూచుకుళ్ల దామో దర్రెడ్డి అనుచరుడైన కాంగ్రె స్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మికి 2,045 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ మద్దతుదారు విమలకు 1,810, బీఎస్పీ బలపరిచిన అభ్యర్థికి 179, నోటాకు 40 ఓట్లు పడ్డాయి. 235 ఓట్లతో లక్ష్మి తన సమీప ప్రత్యర్థి విమలపై గెలుపొందారు. -
గ్రామాలు పోటెత్తాయి..
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్ ● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్ ● అత్యల్పంగా నాగర్కర్నూల్లో 84 శాతం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 84 శాతం.. ఆపైనే.. ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు.. ● నారాయణపేట జిల్లా ధన్వాడలో ఎన్టీఆర్ కాలనీ వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది కాంగ్రెస్కు చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరగగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పంపించారు. ● వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలోని ఎనిమిదో వార్డులో 260 ఓట్లకు 50 ఓట్లు పోలైన తర్వాత 51వ ఓటరు వార్డు అభ్యర్థి శివమ్మ సిలిండర్ గుర్తు లేకపోవడంపై ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. పలువురు గొడవకు దిగడంతో సుమారు గంటపాటు పోలింగ్ నిలిచింది. అధికారులు కొత్త బ్యాలెట్ పత్రాలను తెచ్చి మళ్లీ పోలింగ్ నిర్వహించారు. అంతకు ముందు వేసిన ఓటర్లను మళ్లీ పిలిపించి ఓట్లు వేయించారు. ● నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో తెల్లవారుజామున బీఆర్ఎస్లోని ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుదారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అదే పార్టీకి చెందిన రెబల్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్పంచ్ మద్దతుదారు చంద్రకళ, రెబల్గా పోటీలో ఉన్న సౌమ్య వర్గీయులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే బాహాబాహీకి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో గాయపడిన ఇద్దరిని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. కాగా ఎన్నికల ఫలితాల్లో చంద్రకళ విజయం సాధించారు. -
1, 2, 3, 4 ఓట్ల మెజార్టీతో విజయం
నారాయణపేట జిల్లాలో నలుగురిని వరించిన అదృష్టనారాయణపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో నలుగురు అభ్యర్థులు ఒకటి, రెండు, మూడు, నాలుగు ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. దీన్ని సమీప ప్రత్యర్థి అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా కొంత కష్టపడితే విజయం తమదే అయ్యేదంటూ తలపట్టుకుంటున్నారు. ఆ ఒకటి, రెండు, మూడు, నాలుగు ఓట్లు చివరగా వేసిన ఓటర్లు ఏవరోనంటూ చర్చించుకుంటున్నారు. కాగా, వరుసగా ఒకటి, రెండు, మూడు ఓట్ల తేడాతో విజయం సాధించిన అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుదారులే కావడం విశేషం. నాలుగు ఓట్ల తేడాతో సీపీఐ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లాలో 1, 2, 3, 4 ఓట్లతో విజయం సాధించిన సర్పంచుల వివరాలిలా ఉన్నాయి. ఒక్క ఓటుతో తిరుపతమ్మ గెలుపు.. మరికల్ మండలం పెద్దచింతకుంటలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు తిరుపతమ్మ విజయం సాధించారు. (రీ కౌంటింగ్ చేసినా విజయం ఆమెనే వరించింది.) ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు కాగా.. బీఆర్ఎస్ మద్దతుదారు పద్మకు 604 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారు తిరుపతమ్మకు 605 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక్క ఓటు అధికంగా రావడంతో తిరుపతమ్మను అదృష్టం వరించినట్లయింది. రెండు ఓట్లతో కేతావత్ మంగ.. ధన్వాడ మండలం మడిగేలా తండా జీపీలో ఎస్టీ మహిళా రిజర్వేషన్లో పోటీపడిన కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ మంగకు 343 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి గీతకు 341 ఓట్లు పోలయ్యాయి. అయితే 2 ఓట్ల ఆధిక్యంతో కేతావత్ మంగ విజయం సాధించారు. మూడు ఓట్లతో రాందాస్ నాయక్.. ధన్వాడ మండలం తోళ్లగుట్టతండా జీపీ ఎస్టీ జనరల్కు రిజర్వు అయింది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుదారు రాందాస్నాయక్కు 200 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి బీజేపీ మద్దతుదారు పాండునాయక్కు 197 ఓట్లు వచ్చాయి. 3 ఓట్ల తేడాతో రాందాస్ సర్పంచ్ కుర్చీని కై వసం చేసుకున్నారు. నాలుగు ఓట్లతో పేరప్ప.. ధన్వాడ మండలం పాతపల్లి జీపీ జనరల్కు రిజర్వు అయింది. అక్కడ సీపీఐ మద్దతుదారు పేరప్ప 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పేరప్పకు 511 ఓట్లు రాగా.. ప్రత్యర్థి బీజేపీ మద్దతుదారుకు 507 ఓట్లు వచ్చాయి. -
ఓటేసిన 92 ఏళ్ల వృద్ధుడు
గద్వాల: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని చెబుతున్నప్పటికీ చాలా మంది ఓటుహక్కును వినియోగించుకునేందుకు సంశయిస్తుంటారు. అయితే ఆదివారం జరిగిన రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా మల్దకల్ మండలం అమరవాయికి చెందిన 92 ఏళ్ల వృద్ధుడు ధర్మారెడ్డి ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అక్కడే వృద్ధులకు ఏర్పాటు చేసిన వీల్చైర్లో వృద్ధుడిని ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు వృద్ధుడు ధర్మారెడ్డితో మాట్లాడారు. ఈ వయసులో కూడా ఓటువేయటానికి వచ్చినందుకు వారు ధర్మారెడ్డిని అభినందించారు. -
కందనూలులో హోరాహోరీ
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మొత్తం 151 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 78 చోట్ల గెలుపొందగా, బీఆర్ఎస్ మద్దతుదారులు 60 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. రెండో విడతలో బీఆర్ఎస్ దాదాపుగా అన్నిచోట్ల బలమైన పోటీనిచ్చింది. అంతిమంగా కాంగ్రెస్ స్వల్ప ఆధిపత్యం ప్రదర్శించినా పెద్దకొత్తపల్లి మండలం మినహా మిగిలిన ఆరు మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు సత్తాచాటారు. మరో ఆరు చోట్ల బీజేపీ, ఏడు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. బీఆర్ఎస్కే 13 స్థానాలు.. మలి విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్కు చేరువగా బీఆర్ఎస్ సైతం సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోవడం గమనార్హం. తిమ్మాజిపేట మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో కాంగ్రెస్ 11 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే బీఆర్ఎస్ 13 స్థానాలను సొంతం చేసుకుంది. బిజినేపల్లి మండలంలో 35 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక్కడ బీజేపీ మూడు సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంది. పెంట్లవెల్లి మండలంలో 10 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఐదేసి చొప్పున స్థానాల్లో గెలుచుకున్నాయి. కోడేరులో మొత్తం 16 స్థానాలకు కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ మద్దతుదారులు 5 స్థానాల్లో గెలిచారు. కొల్లాపూర్లో మొత్తం 18 స్థానాలకు 10 కాంగ్రెస్, 7 స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. చేజారిన సర్పంచ్ పీఠం.. రెండో విడత ఎన్నికల్లో చాలాచోట్ల అభ్యర్థులు అతితక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులకు ఇద్దరికీ సమానంగా 236 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ నిర్వహించినా ఒకే ఫలితం వచ్చింది. దీంతో టాస్ వేయగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో గెలిచినట్లుగా ప్రకటించారు. పెద్దకొత్తపల్లి మండలం దేవినేనిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంజీవపురంలో కాంగ్రెస్ అభ్యర్థి 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చంద్రబండతండాలో అభ్యర్థి చిట్టి 15 ఓట్లతో గెలిచారు. సాతాపూర్లో బీఆర్ఎస్కు చెందిన వంశీకృష్ణ 11 ఓట్లతో గెలుపొందగా ఇక్కడ రెండుసార్లు రీకౌంటింగ్ చేశారు. తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లిలో బీఆర్ఎస్కు చెందిన వెంకటయ్య 11 ఓట్లు, నాగర్కర్నూల్ మండలం నల్లవెల్లిలో కాంగ్రెస్కు చెందిన వెంకటస్వామి 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా.. జిల్లాలో అత్యధికంగా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో బీఆర్ఎస్ మద్దతుదారు చిట్టెమ్మ 1,352 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండో విడతలో పార్టీల వారీగా వచ్చిన సర్పంచ్ స్థానాలు మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్రులు బిజినేపల్లి 35 18 14 3 – నాగర్కర్నూల్ 18 10 8 – – తిమ్మాజిపేట 26 11 13 – 2 కొల్లాపూర్ 18 10 7 1 – పెంట్లవెల్లి 10 5 5 – – కోడేరు 16 7 5 – 4 పెద్దకొత్తపల్లి 28 17 8 2 1 నాగర్కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్కు 78, బీఆర్ఎస్కు 60 సర్పంచ్ స్థానాలు తిమ్మాజిపేట మండలంలో బీఆర్ఎస్కే అధికం పెద్దకొత్తపల్లి మండలం మినహా అన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ స్వల్ప తేడాతో సర్పంచ్గిరి కోల్పోయిన అభ్యర్థులు -
చాంపియన్ పాలమూరు
బాలుర, బాలికల విభాగాల్లో విజేతగా జిల్లా జట్లు ● ముగిసిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్– 19 టోర్నీ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో ఆదివారం ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ రాష్ట్రస్థాయి అండర్– 19 హ్యాండ్బాల్ టోర్నమెంట్లో బాల, బాలికల విభాగాల్లో ఆతిథ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్లు సత్తా చాటి చాంపియన్గా నిలిచాయి. టోర్నీలో మొదటి నుంచి మెరుగైన ప్రతిభ కనబర్చిన జిల్లా జట్లు ఫైనల్లో కూడా అదేస్థాయిలో రాణించి చాంపియన్షిప్ కై వసం చేసుకున్నాయి. ఉత్కంఠ పోరులో విజయం బాలుర విభాగంలో మహబూబ్నగర్ హైస్కూల్ మైదానంలో ఉత్కంఠంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు 11– 7 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగంలో మూడో స్థానంలో కరీంనగర్ జట్టు నిలిచింది. బాలికల విభాగం ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 9– 5 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై గెలుపొందింది. మూడో స్థానంలో ఖమ్మం జట్టు నిలిచింది. విజేత జట్లకు బహుమతుల ప్రదానం టోర్నీ విన్నర్, రన్నరప్, థర్డ్ప్లేస్ జట్లకు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్, ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి తదితరులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్పీ వెంకటేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా క్రీడాకారుడు అయినందున క్రీడా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి మహబూబ్నగర్లో ఎన్నో రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం శ్రమించాలని పేర్కొన్నారు.టోర్నీ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, పుల్లయ్య, జిల్లా ఎస్జీఎఫ్ కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, రజనీకాంత్రెడ్డి, ఎండీ.జియవుద్దీన్, బాల్రాజు, అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరులో అధికార పార్టీ జోరు
పాలమూరు: జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభీ మోగించింది. ఐదు మండలాల్లో పూర్తిగా పైచెయ్యి సాధించగా కోయిలకొండ మండల పరిధిలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా స్థానాలు కై వసం చేసుకున్నాయి. హన్వాడ మండల పరిధిలో అయితే కాంగ్రెస్ పూర్తిగా వన్సైడ్గా విక్టరీ నమోదు చేసుకున్నాయి. మిగిలిన మిడ్జిల్, దేవరకద్ర, సీసీకుంట, కౌకుంట్ల మండలాల్లో కూడా అదేవిధంగా దూసుకుపోయింది. మహబూబ్నగర్ జిల్లాలో మండలాల వారీగా.. మండలాలు జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు /స్వతంత్ర చిన్నచింతకుంట 18 12 4 2 0 దేవరకద్ర 18 11 4 0 3 కౌకుంట్ల 12 10 2 0 0 హన్వాడ 35 25 4 5 1 కోయిలకొండ 44 25 17 1 2 మిడ్జిల్ 24 16 8 0 0 మొత్తం 151 98 39 8 6 -
బీఎల్వోల తప్పిదం.. ఓటర్లకు శాపం
● సంబంధంలేని వార్డులకు ఓటర్ల బదిలీ హన్వాడ: రెండో విడత పోలింగ్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో బీఎల్ఓల తప్పిదంపై ఓ సీఆర్డీ అధికారి నిరుత్సాహం వ్యక్తం చేస్తూ.. విషయాన్ని ఏకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని సీఆర్డీ అధికారి మురళీధర్ తన స్వగ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. తాను నివాసం ఉండే 6వ వార్డు నుంచి తన ఓటును 7వ వార్డుకు బదిలీ చేశారు. అదేవిధంగా మండల కేంద్రానికి చెందిన మరో రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఓటు 7వ వార్డు నుంచి 5వ వార్డుకు మార్చారు. దీంతో ఈవిషయంపై సదరు అధికారి మురళీధర్ కలగజేసుకుని ఓ వార్డులో ఉండాల్సిన ఓటును మరో వార్డుకు మార్చడంపై స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. పంచాయతీ అధికారి వివరణ ఇచ్చుకోక మౌనం పాటించాల్సి వచ్చింది. ఇలా ఓటును విడదీసి పక్క వీధిలో వేయడం మూలంగా తన ఇంటి ముందు శానిటేషన్, తదితర సమస్యలపై ఏ వార్డు సభ్యుడిని సంప్రదించాలని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఉన్నతస్థాయిలో ఉండే ఓ అధికారికే ఇలాంటి సమస్య వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అధికారుల పనితీరును నిలదీశారు. ఈ అంశంపై తనకు క్లారిటీ కావాలని ఏకంగా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. మొత్తానికి బీఎల్ఓల నిర్లక్ష్యపు పనితీరుకు కలెక్టర్ సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వచ్చినట్లయిందని పలువురు పేర్కొన్నారు. -
మలివిడత పోరు.. ప్రశాంతం
వనపర్తి జిల్లాలో 87 శాతం ఓటింగ్ ● రాత్రి 10.30 వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు ● కొత్తకోట మండలం అజ్జకొల్లులో క్లీన్స్వీప్ చేసిన బీఆర్ఎస్ ● కొత్తకోట, ఆత్మకూర్, అమరచింతలో కాంగ్రెస్ హవా.. ● వనపర్తి, మదనాపురం మండలాల్లో గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్ ● రెండు సర్పంచ్ స్థానాలకు పరిమితమైన బీజేపీ వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మలివిడత ఘట్టం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, మదనాపురం, వనపర్తి మండలాల పరిధిలోని 94 సర్పంచ్, 850 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 5 సర్పంచ్, 148 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 89 సర్పంచ్, 702 వార్డు స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, భోజన విరామ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. రాత్రి 10.30 వరకు అన్ని గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు వెల్లడించారు. కలెక్టర్ వనపర్తి మండలం నాచహళ్లిలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, పెద్దగూడెం తదితర గ్రామాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కేంద్రం నుంచి జిల్లాలోని పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్పీ సునీతరెడ్డి చిట్యాల, అచ్యుతాపురం, రాజపేట, కొత్తకోట మండలం కానాయపల్లి, కొత్తకోట తదితర ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు. వనపర్తి, మదనాపురంలో పోటాపోటీ.. వనపర్తి, మదనాపురం మండలాల్లో అధికార కాంగ్రెస్పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. మదనాపురంలో బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ కంటే ఎక్కువ చోట్ల సర్పంచ్లుగా విజయం సాధించారు. వనపర్తి మండలంలోని 26 గ్రామపంచాయతీల్లో 11 స్థానాల్లో బీఆర్ఎస్ బలం చాటుకుంది. మూడు మండలాల్లో కాంగ్రెస్దే ఆధిక్యం.. కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో అధికార కాంగ్రెస్పార్టీ ఆధిక్యం చాటింది. బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా.. బీజేపీ అమరచింత మండలంలో రెండు సర్పంచ్ స్థానాలకు పరిమితమైంది. స్వతంత్రుల సంఖ్య 9కి చేరింది. మదనాపురం మండలం అజ్జకొల్లులో సర్పంచ్తో పాటు అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయభేరీ మోగించారు. ఆత్మకూర్ మండలం ఆరేపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రామచంద్రయ్య జిల్లాలోనే అత్యధికంగా 1,180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వనపర్తి మండలం కీర్యతండా సర్పంచ్ అభ్యర్థి క్రిష్టియా ఒక ఓటుతో విజయం సాధించింది. -
పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత
● బందోబస్తు తనిఖీ చేసిన డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ముగ్గురి నుంచి ఐదుగురికి వరకు బందోబస్తు కేటాయించి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేశారు. సమస్యాత్మక గ్రామాలు, కేంద్రాల్లో ప్రత్యేక గస్తీ పెట్టడం, ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వహించారు. మొత్తం 1,249 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: డీఐజీ హన్వాడ మండలం టంకర్ పోలింగ్ కేంద్రాన్ని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పరిశీలించారు. టంకరలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ను డీఐజీ తనిఖీ చేసి భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం పోలింగ్కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యలు, ఓటింగ్ ప్రక్రియ సరళిని ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మకంగా ఉండే కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఉండి గస్తీ చేస్తూ పర్యవేక్షణ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేస్తున్నామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ● ఎస్పీ డి.జానకి మొదట మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు వాల్యాల ఆ తర్వాత హన్వాడ మండలకేంద్రంతో పాటు వేపూర్, టంకర, దేవరకద్ర మండల పరిధిలోని గురకొండ, కోయిలకొండ మండల పరిధిలోని ఇంజమూర్, ఎల్లారెడ్డిపల్లిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. -
చెల్లని ఓటుతో విజయం
చిన్నచింతకుంట మండలం గూడూర్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున శేఖర్, అదే పార్టీ రెబల్గా భీమన్నగౌడ్ పోటీపడ్డారు. ఆదివారం పోలింగ్ అనంతరం కౌంటింగ్ చేయగా.. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. అభ్యర్థులు రీకౌంటిగ్కు అభ్యర్థించడంతో అధికారులు మూడు సార్లు రీ కౌంటింగ్ చేశారు. అయినప్పటికీ సమానంగానే ఓట్లు వచ్చాయి. అయితే టాస్ లేదా చీటి ద్వారా ఎంపిక చేస్తామని అధికారులు తెలియజేయగా.. అభ్యర్థులు ఒప్పుకోలేదు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎల్లన్న పోలింగ్ కేంద్రానికి చేరుకొని మరో రెండు సార్లు కౌంటింగ్ చేయించగా.. అలాగే వచ్చాయి. దీంతో మొదట చెల్లని ఓట్లుగా పరిగణించి పక్కనపెట్టిన ఓట్లను పరిశీలించి.. అందులో గుర్తులపై సక్రమంగా ఓటు పడని పత్రాన్ని స్కేల్ ద్వారా కొలతలు వేసి సర్పంచ్ ఎన్నికను పూర్తిచేశారు. ఉత్కంఠ పోరులో సర్పంచ్గా భీమన్నగౌడ్ ఒక్క ఓటుతో అదృష్టం వరించింది. – చిన్నచింతకుంట -
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
హ్యాండ్బాల్ ఫైనల్కు పాలమూరు జట్లు
● బాల, బాలికల విభాగాల్లో జిల్లా జట్ల సత్తా ● నేడు ముగియనున్న అండర్– 19 టోర్నీ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్– 19 రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య ఉమ్మడి పాలమూరు జట్లు సత్తా చాటి ఫైనల్కు చేరుకున్నాయి. బాలుర విభాగం మ్యాచ్లను హీరా మోడల్ స్కూల్ మైదానం, బాలికల మ్యాచ్లను మహబూబ్నగర్ హైస్కూల్లో నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన బాలుర విభాగం సెమీఫైనల్ మ్యాచ్లో జిల్లా జట్టు 13–6 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో వరంగల్ జట్టు 14–6 తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. బాలికల విభాగం సెమీఫైనల్లో మహబూబ్నగర్ జట్టు 5– 2 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై, మరో సెమీస్లో వరంగల్ జట్టు 14– 6 తేడాతో ఖమ్మం జట్టుపై గెలుపొందాయి. టోర్నమెంట్ నేటి(ఆదివారం)తో ముగియనుంది. లీగ్ మ్యాచ్ల వివరాలు.. బాలుర విభాగం లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 10– 4 గోల్స్ తేడాతో నిజామాబాద్ జట్టుపై గెలుపొందగా, మరో మ్యాచ్లో జిల్లా జట్టు 15– 8 తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచుల్లో ఖమ్మం జట్టు 13– 10 గోల్స్ తేడాతో మెదక్పై, రంగారెడ్డి జట్టు 8– 7 తేడాతో నిజామాబాద్పై, మెదక్ జట్టు 7– 2 తేడాతో నల్లగొండపై, హైదరాబాద్ జట్టు 7– 6 తేడాతో ఆదిలాబాద్పై, వరంగల్ జట్టు 13– 1 తేడాతో నల్లగొండపై, కరీంనగర్ జట్టు 14– 6 తేడాతో ఖమ్మంపై, వరంగల్ జట్టు 13– 8 తేడాతో ఖమ్మంపై, కరీంనగర్ జట్టు 7– 1 తేడాతో మెదక్పై, హైదరాబాద్ జట్టు 6– 4 తేడాతో నిజామాబాద్పై గెలుపొందాయి. బాలికల విభాగం లీగ్ మ్యాచుల్లో మహబూబ్నగర్ జట్టు 12– 5 గోల్స్ తేడాతో మెదక్పై, మరో మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 5– 0 గోల్స్ తేడాతో నిజామాబాద్పై విజయం సాధించింది. ఇతర మ్యాచుల్లో ఖమ్మం జట్టు 8– 5 గోల్స్ తేడాతో మహబూబ్నగర్ జట్టుపై, కరీంనగర్ జట్టు 17– 0 తేడాతో నల్లగొండపై, ఖమ్మం జట్టు 13– 2 తేడాతో మెదక్పై, ఆదిలాబాద్ జట్టు 9– 6 తేడాతో నల్లగొండపై, రంగారెడ్డి జట్టు 2– 1 తేడాతో నిజామాబాద్పై, వరంగల్ జట్టు 13– 5 తేడాతో హైదరాబాద్పై, ఖమ్మం జట్టు 12– 3 తేడాతో రంగారెడ్డిపై, వరంగల్ జట్టు 9– 0 తేడాతో నల్లగొండపై విజయం సాధించగా ఆదిలాబాద్– కరీంనగర్ జట్లు చెరో 5 గోల్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. -
బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అమరచింత: బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమరచింతకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. అమరచింతకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ పెద్దకుమారుడు శరత్ (24) రెండేళ్లుగా బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అయితే, ఐదురోజుల క్రితం బెంగళూరులో తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి బయటికి వెవెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఈ విషయాన్ని ఇతర స్నేహితులు శరత్ తండ్రి చంద్రశేఖర్కు రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తమ బంధువులు, యువకుడి స్నేహితుల గ్రామాల్లో వాకబు చేశారు. చివరకు శరత్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లారు. అయితే, రోడ్డు ప్రమాదంలో శరత్ మృతదేహం ఛిద్రమైందని.. కొన్ని వస్తువులను గుర్తించి అవి తన కుమారుడివే అని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అందించారు. ఇదిలాఉండగా, మృతుడు శరత్ ఐదు రోజుల క్రితం తన మొబైల్ నుంచి చెల్లెలికి రూ.3 లక్షల పంపడం, అదే రోజు తండ్రికి ఫోన్ చేసినా తండ్రి ఎత్తకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం రాత్రి భోజనం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన శరత్ తన మొబైల్ను రూంలోనే ఉంచి బయటకు వెళ్తున్నానని చెప్పి ఇలా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. -
సిలిండర్ పేలిన ఘటనలో మరో మహిళ మృతి
ధరూరు: మండల కేంద్రంలో ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మరో మహిళ కుర్వ సునీత (23) శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్స పొందుతున్న ముగ్గురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు సునీత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త వెంకటేష్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ డీఆర్ విజయ్కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే ప్రమాదంలో గాయపడిన తల్లీకొడుకులు (అశ్విని ఆమె ఏడాదిన్నర కుమారుడు) ఈ నెల 10న కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మూడుకు చేరిన మృతుల సంఖ్య -
తగ్గేదేలే.. !
● ఎగిసిన ప్రలోభాలు, తాయిళాలు.. మద్యం ● ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు.. ● అంచనాలకు మించిన ఖర్చులతో ఆస్తుల తనఖా.. ● బెంబేలెత్తుతున్న అభ్యర్థులు.. అయినా ముందుకే.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో దశలో ఆదివారం ఉమ్మడి పాలమూరులోని 26 మండలాల పరిధిలో 565 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. 46 ఏకగ్రీవం పోనూ 519 జీపీల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియగా.. ఆ తర్వాత ప్రలోభ పర్వం ఎగిసిపడింది. మొదటి దశలో జరిగిన ఎన్నికల్లో ఆయా జీపీల్లో అభ్యర్థుల జయాపజయాలు.. లోటుపాట్లను బేరీజు వేసుకున్న రెండో విడత అభ్యర్థులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో మద్యం ఏరులై పారగా.. కుల, మహిళా సంఘాలు, యువత.. ఇలా వర్గాల వారీగా తాయిలాల పంపిణీ జోరుగా సాగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పుంజుకోవడం చూసి కంగుతున్న ఆయా నియోజకవర్గాల్లోని అధికార కాంగ్రెస్కు చెందిన ముఖ్య నేతలు రెండు, మూడో విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామాలపై ప్రత్యేక నజర్ వేశారు. ప్రధానంగా మలి విడతలో కారు, కమలం పొత్తు.. రెబల్స్ ప్రభావం.. ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు వంటి వాటితో పాటు ఆయా పల్లెల్లో ప్రభావిత వర్గాల సమాచారాన్ని తెలుసుకుని..అందుకనుగుణంగా ముందుకు సాగారు. ఈ మేరకు వారే నేరుగా ఆయా వర్గాలకు చెందిన ముఖ్యులతో మాట్లాడడంతోపాటు పలు రకాల హామీలు గుప్పించినట్లు సమాచారం. ప్రత్యర్థి పక్షంలోని తమ సన్నిహితులైన గ్రామ స్థాయి నాయకులతోనూ టచ్లో ఉంటూ పరిస్థితులను చక్కబెట్టేలా మంత్రాంగం నడిపించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థి వర్గాలు సైతం పై ఎత్తులతో ముందుకుసాగినట్లు తెలుస్తోంది ఒక్కో చోట.. ఒక్కో రేటు రెండో విడతలో పలు గ్రామాల్లో అధికార, ప్రతిపక్షాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న క్రమంలో ప్రలోభాల పర్వం ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగిసిన శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు పలు పల్లెల్లో వార్డులు, కూడళ్ల వారీగా విందులు.. వర్గాల వారీగా మద్యం పంపిణీ.. మహిళలకు చీరల వంటి పంపిణీని నిఘా కళ్లు తప్పించి పూర్తి చేశారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో యూత్కు క్రీడా సామగ్రి పంపిణీతో పాటు మద్యం బాటిళ్లు అందజేశారు. ప్రత్యర్థి మద్దతుదారులు, బంధువుల ఇళ్లకు అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి దండాలు పెట్టడంతో పాటు ఓటుకు ఇంత చొప్పన ఎందరు ఉంటే అందరికీ లెక్కలేసి ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ఓటుకు అత్యల్పంగా రూ.500.. అత్యధికంగా రూ.3 వేల చొప్పున అందజేసినట్లు సమాచారం. ఈ రేటు ఒక్కో పల్లెలో ఒక్కోరకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక శాతం గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి.. ఒక్క క్వార్టర్, కొన్ని చోట్ల హాఫ్ బాటిల్ మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. బెంబేలెత్తుతూనే ముందుకు.. తొలి విడత సర్పంచ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్.. అనూహ్య ఫలితాలతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరికి వారు రెండు, చివరి విడత గ్రామాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతుదారులు ఎక్కడా తగ్గని పరిస్థితులు నెలకొన్నాయి. అంచనాలకు మించి రెట్టింపు ఖర్చులు అవుతుండడంతో బెంబేలెత్తుతున్నారు. ఎన్నికల కోసం ముందస్తుగా సమకూర్చుకున్న మొత్తం అయిపోవడంతో కొందరు అభ్యర్థులు ఆస్తులు, నగలు తనఖా పెట్టి నగదు తెచ్చి..పంచుతున్నారు. అయినా తగ్గేదేలే అన్నట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చివరి దశ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. రోజుకు మద్యం ఇతరత్రా ఖర్చులతో అభ్యర్థులకు ఇప్పటికే తడిసిమోపైడెంది. అసలు ఘట్టం ముందుగా ఉండగా.. ఏం చేయాలో తోచక పలువురు తలపట్టుకుంటున్నారు. ● మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలోని ఓ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శనివారం రాత్రి పలు వార్డుల్లో ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేశాడు. కాంగ్రెస్ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి పోటీగా ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, కార్టర్ మద్యం బాటిల్ పంచాడు. అయితే ఆదివారం రాత్రి బీఆర్ఎస్కు చెందిన మద్దతుదారుడు మళ్లీ ఒక్క ఓటర్కు క్వార్టర్ మద్యం బాటిల్, రూ.500 చొప్పున కొందరికి పంచాడు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా కొందరికి ఆ విధంగానే పంచాడు. ఆ తర్వాత ఓ వార్డులో లొల్లి మొదలైనట్లు తెలిసింది. తమకు మళ్లీ రాలేదంటూ కొందరు శాపనార్ధాలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ● రెండో విడతలో జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి, రాజోలి మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకునేందుకు పోటీపడుతున్న అభ్యర్థులు పలువురు తమ విలువైన భూములను తనఖా పెట్టి అప్పులు చేసినట్లు సమాచారం. మూడో విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఎర్రవెల్లి, మానవపాడు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్ గట్టు: మండలంలోని గొర్లఖాన్దొడ్డి సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులు భార్యభర్తలకు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే.. మొదటి విడతలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొర్లఖాన్దొడ్డి పోలింగ్ జరగగా.. షేకమ్మ అలియాస్ శ్వేత తన సమీప అభ్యర్థి జయమ్మపై 287 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసి పోటీపడ్డారు. మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులు ఏకగ్రీవం కాగా.. 5 వార్డుల్లో పోటీ ఏర్పడింది. ఇందులోను సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి షేకమ్మ పక్షానికి 3 వార్డుల్లో విజయం సాధించగా, మొత్తం 9 వార్డులు సర్పంచ్ పక్షం వారు గెలుచుకున్నారు. దీంతో 7వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమైన ఉప్పరి ఆంజనేయులును మిగతా వార్డు సభ్యులు ఉప సర్పంచుగా ఎన్నుకున్నారు. దీంతో గొర్లఖాన్దొడ్డి గ్రామంలో భార్య షేకమ్మ సర్పంచ్గా, భర్త ఉప్పరి ఆంజనేయులు ఉప సర్పంచ్గా ఎంపికయ్యారు. ఈ విజయం మీ అందరిదీ.. ● ఇంటింటికీ స్వీట్ బాక్సులు అందజేసిన సర్పంచ్ నవాబుపేట: తనను సర్పంచ్గా గెలిపించిన ఊరందరి నోరు తీపి చేసి కృతజ్ఞతలు తెలిపారు కొత్త సర్పంచ్ గీతారాణి. మండల కేంద్రానికి చెందిన గీతారాణీ సర్పంచ్గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు నవాబుపేటలో ప్రతి ఇంటికి తిరిగి స్వీట్ బాక్సులు అందించి కృతజ్ఞతలు చెప్పారు. గెలిచినందుకు సంతోషంతో తానే మిఠాయిలు తింటే సరిపోదని తన ఊరందరి నోరు తీపి చేస్తేనే అసలైన సంబురమని ఆమె పేర్కొన్నారు. జుట్టు కత్తిరించి.. ఓటు పట్టి మానవపాడులో ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇంటింటికి తిరిగి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో గ్రామంలోని హెయిర్ సెలూన్ వద్ద ఓ వ్యక్తికి కటింగ్ చేసి ఓటు అభ్యర్థించడం ఆకట్టుకుంది. – మానవపాడు -
రెండో పోరుకు రెడీ
నేడు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు. 520 సర్పంచ్లకు 1,709 మంది పోటీ.. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడతలో ఇలా.. జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది.. మహబూబ్గర్ 151 9 142 474 1,334 267 1,065 2,811 నాగర్కర్నూల్ 151 4 147 473 1,412 143 1,269 3,228 నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755 వనపర్తి 94 5 89 294 850 148 702 1,769 జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263 మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826 2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు.. 2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా.. జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 94,975 96,998 4 1,91,977 నాగర్కర్నూల్ 1,27,142 1,26,602 5 2,53,749 జో.గద్వాల 55,710 57,094 3 1,12,807 వనపర్తి 61,553 62,726 2 1,24,281 నారాయణపేట 73,674 76,642 2 1,50,318 నాగర్కర్నూల్: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట)మహబూబ్గర్: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్, హన్వాడ, కోయిల్కొండ) జోగుళాంబ గద్వాల: 4 (మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి) నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్) వనపర్తి: 5 (వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత) నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్ నిర్వహించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 45 మంది సర్పంచ్లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం 520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉదయం 7 గంటలకు షురూ.. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 8,33,132 మంది ఓటర్లు.. రెండో విడతలో పోలింగ్ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. -
ఖాకీల నిఘా
మహబూబ్నగర్ క్రైం: రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఖాకీలు గట్టి నిఘా పెట్టారు. 1,334 పోలింగ్ కేంద్రాల్లో 1,249 మందిని బందోబస్తు కోసం కేటాయించారు. ఇందులో 36 గ్రామాల్లో 355 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు.49 రూట్ మొబైల్స్, 16 ఎఫ్ఎస్టీ, 5 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు కేటాయించిన వారందరూ శనివారం సాయంత్రం నాటికి ఎన్నికల సామగ్రితో సహా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల కోసం ఒక ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 29మంది సీఐలు, 66 మంది ఎస్ఐలు, 1,134 మంది ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్ విధుల్లో ఉన్నారు. ● పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ జిల్లావ్యాప్తంగా రూ.11 లక్షల నగదు, 80 మద్యం కేసుల్లో రూ.6.72 లక్షల విలువ చేసే 1 043.43 లీటర్ల మద్యం, ఎన్నికల నియమావళి కేసులు మూడు, నాకా బందీ 55, 37 తుపాకులు డిపాజిట్, 448 కేసుల్లో 630 మందిని బైండోవర చేశారు. అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. శనివారం దేవరకద్ర, హన్వాడలో పోలీస్ సిబ్బందికి విధులపై సూచనలు చేశారు. రాత్రి టంకర పోలింగ్ కేంద్రం వద్ద గస్తీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ జరుగుతున్న సమయంలో అవాంచనీయ ఘటనలు, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటే వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీస్ సిబ్బంది చురుకుగా విధులు నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే క్షణం వరకు ప్రతి ఒక్కరూ కేటాయించిన స్థానాల నుంచి పక్కకు వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి పెట్టాలని, ఏదైనా గొడవలు చేయాలని చూసినా, గుంపులుగా నిలబడినా అప్రమత్తంగా ఉంటూ అడ్డుకొని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రూ.11 లక్షల నగదు, 1,043 లీటర్ల మద్యం సీజ్ గ్రామాల్లో 630 మంది బైండోవర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి -
ఆరు కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ
● పరిశీలించిన కలెక్టర్ విజయేందిర జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 142 సర్పంచ్ స్థానాలు, 1,065 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఆరు కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. చిన్నచింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవరకద్రలోని మార్కెట్యార్డు, హన్వాడలోని బాలిక పాఠశాల, కోయిలకొండలో రైతు వేదిక, కౌకుంట్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మిడ్జిల్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీల వారీగా కేటాయించిన పీఓలు, ఓపీఓలకు సామగ్రిని పంపినీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయనీదేవిలు వేర్వేరుగా దేవర కద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల పోలింగ్ సామ గ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చా రు. పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు మొత్తం 148 వాహనాలను అందుబాటులో ఉంచారు. ● రెండో విడత పోలింగ్కు సంబంధించి 151 మంది రిటర్నింగ్ అధికారులను నియమించడంతో పాటు 13 రిజర్వ్తో కలిపి 164 ఆర్ఓలను నియమించారు. 1,334 ప్రిసైడింగ్ ఆఫీసర్లను, 1,584 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని, 45 మంది జోన్ ఆఫీసర్లను నియమించారు. ఈ విడతలో 48 రూట్లు ఉండగా.. 65 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. ● ఈ విడతలో 58 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. హన్వాడ మండలంలోని టంకర గ్రామ పంచాయతీ పరిధిలో 12, సీసీకుంటలోని ఉంద్యాల 8 , దేవరకద్రలోని నాగారంలో 10, కోయిల్కొండ శేరివెంకటపూర్లో 8, కౌకుంట్లలోని ఇస్రాంపల్లిలో 8, మిడ్జిల్లో 12 పోలింగ్స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. 36 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ● రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లా పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు కాత్యాయనీదేవితో కలిసి వెబెక్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. వార్డు సభ్యుల సంఖ్య ననుసరించి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ వీడియోగ్రఫీ నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించాలని, కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పేపర్లు సీల్ వేసేప్పుడు కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు.అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఈఓ ప్రవీణ్కుమార్, సీఎంఓ సుధాకర్రెడ్డి, మాస్టర్ ట్రైనర్ బాలు పాల్గొన్నారు. -
‘స్వగ్రామాలే’ సవాల్..!
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు ● జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం ● స్వీయ పర్యవేక్షణతోపాటు వేగుల ద్వారా పావులు ● ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్ఎస్ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్గా గెలుపొందారు. ..ఇలా తొలి విడత సం‘గ్రామం’లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ తూడుకుర్తి: నువ్వా.. నేనా.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి స్వగ్రామం తూడుకుర్తి. నాగర్కర్నూల్ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్ పదవి అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ, బీఆర్ఎస్ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్గా పనిచేశారు. దామోదర్రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరగా.. ఆయన ‘కారు’లోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పురుషులు : 2658, మహిళలు 2706; మొత్తం ఓటర్లు: 5364 ప్రభావిత వర్గాలు.. బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, ఉప్పరి దమగ్నాపూర్: ఇద్దరూ.. ఇద్దరే దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ సర్పంచ్ అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్ఎస్ బలపరిచిన ఇ.పావని సర్పంచ్గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పురుషులు : 848, మహిళలు 856; మొత్తం ఓటర్లు: 1704 ప్రభావిత వర్గాలు.. రెడ్డి, యాదవ, గొల్ల, బోయ, ఎస్సీ పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్ రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న భాస్కర్ యాదవ్ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్ యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు. పురుషులు : 1071, మహిళలు 1021; మొత్తం ఓటర్లు: 2092 ప్రభావిత వర్గాలు.. యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి ఽదన్వాడ: అత్తాకోడళ్ల మధ్యే..! నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్లుగా కాంగ్రెస్ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్ఎస్కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పురుషులు : 4034, మహిళలు 4293; మొత్తం ఓటర్లు: 8347 ప్రభావిత వర్గాలు.. పద్మశాలి, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి పుల్లూరు:ఎవరి ధీమా వారిది ఇటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ సర్పంచ్ స్థానానికి మొత్తం నలుగురు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ మద్దతుదారు సునీత, కాంగ్రెస్ బలపరిచిన సువర్ణతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఉమామహేశ్వరి, కవిత పోటీలో నిలిచారు. ప్రధానంగా సునీత, సువర్ణ మధ్యే పోటీ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బీఆర్ఎస్కు చెందిన వారు కావడం.. చల్లా స్కెచ్తో తన గెలుపు ఖాయమని సునీత ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం తనకు కలిసి వస్తుందని సువర్ణ భావిస్తున్నారు. పురుషులు : 1369, మహిళలు 1416; మొత్తం ఓటర్లు: 2785 ప్రభావిత వర్గాలు.. ఎస్సీ, వాల్మీకి, ముస్లిం, కురువ, ముదిరాజ్ తూడుకుర్తి పంచాయతీ కార్యాలయం -
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు
● హామీ అమలు కాకపోవడంతోనే రంగారెడ్డిగూడలో ఓటమి● ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యలుజడ్చర్ల: రగామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారిగా కుమ్మక్కయ్యాయని, ఫలితంగా కొన్ని గ్రామాల్లో గెలుపు అంచుకు వచ్చి తమ అభ్యర్థులు ఓటమి చెందారని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలివిడత ఎన్నికలు జరిగిన నవాబ్పేట, రాజాపూర్, ఊర్కొండ మండలాల్లో 50 శాతానికిపైగా తమ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారన్నారు. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ సొంతంగా అభ్యర్థులను పోటీలో నిలబెట్టకుండా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. రాజాపూర్ వంటి కీలక పంచాయతీలో సైతం బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. ఇక్కడ రెండు సార్లు ఓడిన అభ్యర్థి ఎలాగూ సానుభూతి వచ్చి గెలుస్తాడన్న నమ్మకంతో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఇలా చాలా చోట్ల మద్దతు ఇచ్చి కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేసిందని, అయినా మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు సీఎం రేవంత్రెడ్డి, తన ఫొటోలు పెట్టుకుని దర్జాగా ప్రచారం చేశారని, బీఆర్ఎస్కు చెందిన వారు కేసీఆర్, లక్ష్మారెడ్డి ఫొటోలతో ఎక్కడా ప్రచారం చేసిన పరిస్థితి కనిపించలేదని ఎద్దేవా చేశారు. కన్నీళ్లు పెట్టుకొని, కాళ్ల బేరాలు ఆడుతూ.. ఆత్మహత్య చేసుకుంటామంటూ సానుభూతి ఓట్లతో గట్టెక్కారని దుయ్యబట్టారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ అంతర్గత కలహాల కారణంగా ఎక్కువ మంది పోటీ చేసి ఓట్లు చీలిపోయి ఓటమి చెందారని అన్నారు. రెండు, మూడో విడత ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకుండా సమీక్షిస్తామన్నారు.రంగారెడ్డిగూడలో ఓడిపోయాం..తన సొంతూరు రంగారెడ్డిగూడలో తమ అభ్యర్థి ఓటమి చెందడంపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థికి కేవలం 13 ఓట్లు మాత్రమే వచ్చాయన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. తమ గ్రామాన్ని స్పాంజ్ ఐరన్ కాలుష్య పరిశ్రమ నుంచి కాపాడుతానని ఇచ్చిన హామీని సకాలంలో నిలబెట్టుకోకపోవడం వల్ల తమపై అసంతృప్తితో ఓడించారని చెప్పారు. గతంలో తమ అమ్మ, సోదరుడు ఇక్కడ మూడుసార్లు విజయం సాధించారని తెలిపారు. గతంలో లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కావేరమ్మపేట సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని, లక్ష్మారెడ్డి సొంతూరు ఆవంచలో ఆయన మద్దతు అభ్యర్థి ఓడారని గుర్తుచేశారు. సమావేశంలో నాయకులు శివకుమార్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ
కల్వకుర్తి టౌన్: ఇటీవల ప్రతి ఒక్కరిలో సెల్ఫీ పిచ్చి పెరిగిపోయింది. కానీ, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడడం లేదు కదా అని సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ దానిని సీరియస్గా తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధం. ఓటర్ నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేసినట్లుగా గుర్తిస్తే అధికారులు వెంటనే 49(ఎం) (ఓటు రహస్యం బహిర్గతం) నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును ఓట్ల లెక్కింపు సమయంలో పరిగణించకుండా, ఓటును 17(ఏ) ఫారంలో నమోదు చేస్తారు. ఎన్నికల సంఘం నియమావళి 49(ఎన్) ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటిన సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. సహాయకుడు అతడు ఓటును బహిరంగపరచనని ఎన్నికల నియమావళిలోని నిబంధన 10లో ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. -
డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు
బల్మూర్: ఎన్నికల నియమావళి ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థులను డబ్బులు డిమాండ్ చేసినా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ఇచ్చినా చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. డబ్బులు ఇచ్చినోళ్లకే ఓటేస్తాం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షి పత్రికలో వెలువడిన కథనానికి డీఎస్పీ స్పందించి అచ్చంపేట సీఐ నాగరాజుతో కలిసి లక్ష్మిపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో గురువారం స్థానిక కూడలిలో అభ్యర్థులను కొంత మంది ఓటర్ల డబ్బులు డిమాండ్ చేసిన విషయంపై విచారించారు. అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని కోరారు. గ్రామస్తులు సహరించాలని కోరారు. -
అట్టహాసంగా హ్యాండ్బాల్ టోర్నీ
● పాల్గొన్న ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు ● పోటీలు ప్రారంభించిన డీఐఈఓ కౌసర్ జహాన్, పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్– 19 రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ చాంపియన్షిప్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పోటీల్లో రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొనున్నాయి. బాలికలకు మహబూబ్నగర్ ఉన్నత పాఠశాలలో హైస్కూల్లో, బాలురకు హీరా మోడల్ పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు పోటీలు జరుగనున్నాయి. గెలుపోటములు సమానంగా స్వీకరించాలి రాష్ట్రస్థాయి అండర్– 19 ఎస్జీఎఫ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ను డీఐఈఓ కౌసర్ జహాన్, పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా జ్వోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రీడలు ఆడేవారు చదువులో కూడా ముందుంటారన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. ఓటమి తర్వాతే గెలుపు సాధ్యమన్నారు. పారిశ్రామిక వేత్త బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. టోర్నీలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ.. దాతల సహకారంతోనే రాష్ట్రస్థాయి టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీని విజయవంతంగా నిర్వహించామన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో టోర్నీ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, పుల్లయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, స్పోర్ట్స్ ఇన్చార్జి వేణుగోపాల్, అండర్– 19 ఎస్జీఎఫ్ మాజీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పాపిరెడ్డి, రజినీకాంత్రెడ్డి, ఎండీ జియావుద్దీన్, బాల్రాజు, రాంమోహన్, ప్రదీప్కుమార్, అహ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు. శుభారంభం చేసిన పాలమూరు హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ఆతిథ్య పాలమూరు ఉమ్మడి బాలుర జట్టు శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్లో 10– 5 గోల్స్ తేడాతో ఆదిలాబాద్ జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో ఆదిలాబాద్ జట్టు 9– 6 గోల్స్ తేడాతో నల్లగొండ జట్టుపై గెలుపొందింది. -
పోలింగ్ ఏజెంట్లే కీలకం
● గ్రామ ఓటర్లనే నియమించుకోవాలి ● వార్డుల్లో వార్డు ఓటరై ఉండాలి ● దొంగ ఓట్లను గుర్తించేది స్థానికులే.. జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంటే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డుకు పోటీ చేస్తున్న ప్రతివ్యక్తి, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్ను నియమించుకోవాలి. సదరు ఓటర్లను గుర్తించేది. ఏజెంట్స్ కావడంతో సర్పంచ్ పోటీచేసే ప్రతి అభ్యర్థి వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థి కీలకమైన వ్యక్తిని నియమించుకుంటేనే వారి గెలుపు సాధ్యమవుతుంది. సర్పంచ్ పదవికి పోటీచేసే వ్యక్తులు ఏ వార్డు నుంచైనా వార్డు మెంబర్ అయితే ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారో అదే వార్డుకు సంబంధించిన ఓటరును పోలింగ్ ఏజెంట్గా నియమించుకోవాలనే నిబంధన ఉంది. ఏదైనా కారణాలతో ఇతరులను నియమించుకోవాల్సి వస్తే ముందే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా తెలియజేయాలి. దానిని పరిశీలించి అనుమతిస్తే తప్పా ఇతరులను నియమించుకునేందుకు వీల్లేదు. -
స్వస్తిక్ ముద్ర సరిగా వేయండి
అచ్చంపేట: ఓటు వేసేటప్పుడు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. పోలింగ్ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే సరైన అభ్యర్థికి ఓటు వేయగలరు. ● పోలింగ్ కేంద్రం లోపలికి ఓటరు స్లిప్పు,గుర్తింపు కార్డును వెంట తీసికెళ్లాలి. ● లోపలికి వెళ్లగానే ప్రిసైడింగ్ అధికారి(పీవో) మీరిచ్చిన స్లిప్పు, జాబితా చూసి పేరు చదువుతారు. ● అక్కడున్న ఏజెంట్లు సరిచూసుకుంటారు. ● మీ ఎడమ చేతి చూపుడు వేలుకు సిబ్బంది సిరా చుక్క వేస్తారు. ● పక్కనున్న మరో సిబ్బంది మీసంతకం తీసుకుంటారు. సర్పంచ్,వార్డు మెంబరు రెండింటికీ రెండు బ్యాలెట్ పత్రాలను పద్దతి ప్రకారం మడత పెట్టి మీకిస్తారు. స్వస్తిక్ ముద్రకు సిరా అంటించి మీ చేతికిస్తారు. ● గదిలో ఓమూలన తెరచాటు ఏర్పాటు చేసి ఉంటుంది. అందులోకి మీరు వెళ్లి బ్యాలెట్ పత్రాలపై నచ్చిన వారి గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేయాలి. ● సిబ్బంది ఇచ్చిన తీరులోనే మడత మార్చకుండా బ్యాలెట్ బాక్సులో వేయాలి. ● స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఒకవేళ బ్యాలెట్ పత్రాన్ని మరోవిధంగా మడత పెడితే సిరా చుక్క ఇంకో గుర్తుపై పడి మీఓటు చెల్లుబాటు కాదు. ● బ్యాలెట్ పత్రాలపై పేర్లు రాయవద్దు. వేలిముద్ర, సంతకం చేయకూడదు. స్వస్తిక్ ముద్ర అభ్యర్థి గుర్తు పైనే వేయాలి. మధ్యలో వేయకూడదు. ● పోలింగ్ కేంద్రం లోపలికి పోన్లను అనుమతించరు.చాటుగా తీసుకెళ్లి పోటోలో తీస్తే అధికారులు పట్టుకొని మీపై చర్యలు తీసుకుంటారు. -
నాడు మామ.. నిన్న అత్త.. నేడు కోడలు...
సర్పంచ్ బరిలో అక్కా తమ్ముడు ● ఆ కుటంబానికే మూడోసారి సర్పంచ్ గిరి నవాబుపేట: మండలంలోని అమ్మాపూర్ సర్పంచ్గా రావలీల గెలుపొందారు. సర్పంచ్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబం నుంచి ముచ్చటగా మూడోసారి నిలిచి విజయం సాధించింది. ఆమె మామ అంతయ్య 1995లో సర్పంచ్గా గెలిచారు. 2001లో మహిళా రిజర్వేషన్ కావడంతో ఆయన భార్య అరుణమ్మ సర్పంచ్ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజాగా అంతయ్య కోడలు రావలీలకు మూడోసారి సర్పంచ్ గిరి దక్కింది. ఎంపీటీసీ మాజీ సభ్యురాలు.. తాజా సర్పంచ్ తీగలపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యురాలు లక్ష్మమ్మ తాజాగా కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా విజయం సాధించారు. ఈమె భర్త నారాయణ కూడా గతంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్గా పనిచేశారు. తక్కువ వయస్కులే ఎక్కువ.. మండలంలో మొత్తం 42 గ్రామపంచాయతీలు ఉండగా.. ఇందులో 16 జీపీల్లో 30 నుంచి 34 ఏళ్లలోపు వారే సర్పంచ్లుగా విజయం సాధించడం విశేషం. వీరిలో ఇప్పటూర్, కారుకొండ సర్పంచ్లు రవికిరణ్, సంతోషికుమారి 31 ఏళ్లవారు కాగా.. పుట్టోనిపల్లి సంగీత, దేపల్లి ప్రణవి, నవాబుపేట గీతారాణి, పోమాల్ కవిత, అమ్మాపూర్ రవలీల, జంగమయ్యపల్లి విశాల, రుద్రారం రవి, యన్మన్గండ్ల రంజిత్కుమార్గౌడ్, కారూర్ శంకర్, రాంసింగ్తండా జ్యోతి, కాకర్జాల్తండా సంతోష్నాయక్, సిద్దోటం మల్లేష్గౌడ్, చెన్నారెడ్డిపల్లి నవనీత, బట్టోనిపల్లి స్వాతి 34 ఏళ్లలోపు వారే. స్థానిక ఎన్నికల సందడి రసవత్తరంగా సాగుతోంది. అయితే, లింగాల మండలంలోని క్యాంపురాయవరం సర్పంచ్ బరిలో అక్కా తమ్ముడు నిలవడంతో అందరి చూపు ఈ పంచాయతీ వైపు పడింది. ఈ పంచాయతీ బీసీ జనరల్కు రిజర్వు కాగా.. కాంగ్రెస్ మద్దతుతో అక్క పెర్మళ్ల నాగవేణి పోటీలో ఉండగా.. ప్రత్యర్థిగా బీఆర్ఎస్ మద్దతుతో తమ్ముడు బొల్లు నరేష్ తలపడుతున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్యాంపురాయవరం కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయ్యింది. ఇక్కడ 450 మంది వరకు ఓటర్లు ఉన్నారు. గతంలో రాయవరం ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ గ్రామం ఉండేది. తమను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని ఇరువురు అభ్యర్థులు ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు. – లింగాల -
నాడు తండ్రి.. నేడు కూతురు
● గడ్డంపల్లి సర్పంచ్గా గెలిచిన వెన్నెల నాగర్కర్నూల్ రూరల్: నియోజకవర్గ పరిధిలోని తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామ సర్పంచ్గా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బొక్క వెన్నెల పోటీ చేసి 320 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2001 వెన్నెల తండ్రి కోట్ల జంగయ్య టీడీపీ నుంచి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ఐదేళ్లపాటు సేవలందించారు. తాజాగా జంగయ్య అడుగుజాడల్లో ఆయన కూతురు వెన్నెల సర్పంచ్ స్థానానికి పోటీ చేసి గెలవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తాను గ్రామానికి సర్పంచ్గా ఎన్నిక కావడానికి నా భర్త శేఖర్ ప్రోత్సాహంతోపాటు సినీ నిర్మాతలు దిల్రాజ్, శిరీష్, ఎమ్మెల్యే రాజేష్రెడ్డి తోడ్పాటు ఎంతో ఉందన్నారు. తన భర్త శేఖర్ బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి సినీ నిర్మాతలు దిల్రాజు, శిరీష్ వద్ద 23 ఏళ్లుగా విధులు నిర్వర్తించారని, ప్రస్తుతం తాను పోటీ చేసేందుకు వారు ఎంతో ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. గ్రామస్తులు తనపై నమ్మకాన్ని ఉంచి సర్పంచ్గా ఎన్నుకున్నారని, త్వరలో వనపట్ల క్రాస్రోడ్ వద్ద రామలింగేశ్వర ఆలయ టార్చును నిర్మిస్తామని, గ్రామానికి వైకుంఠ రథాన్ని అందిస్తానని, గ్రామ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. -
పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జవహార్ నవోదయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. – భాస్కర్కుమార్, ప్రిన్సిపల్, వట్టెం నవోదయ విద్యాలయం ● -
ప్రతి ఒక్కరికీవైద్యం అందాలి
పాలమూరు: ఆర్థిక అంశాలతో సంబంధం లే కుండా ప్రతి ఒక్కరికీ కావాల్సిన ఆరోగ్య సేవ లు అందుబాటులో ఉండేలా చూడటమే యూ నివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యం అని జిల్లా న్యా య సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. సర్వ సామాన్య ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి న్యాయమూర్తి హాజరై మాట్లాడారు. రోగులకు న్యాయ సలహాలు అందించడానికి ప్రతి సోమవారం ఆస్పత్రిలో పారాలీగల్ వలంటీర్లు అందుబా టులో ఉంటారని తెలిపారు. అనంతరం జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత వైద్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీలు డాక్ట ర్ సురేష్, డాక్టర్ అమరావతి, లక్ష్మీప్రసన్న, డాక్టర్ ప్రేరణ, ఆర్ఎంఓ జరీనా పాల్గొన్నారు. ● నగరంలోని పాతపాలమూరు అర్బన్ హెల్త్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర హాజరై మాట్లాడారు. మదీన మజీద్ హైస్కూల్, మార్కెట్ రోడ్ హైస్కూల్లో బాల్య వివాహాలపై న్యాయమూర్తి ఇందిర అవగాహన కల్పించారు. రెండోదశ ఎన్నికలకుపోలీస్శాఖ సన్నద్ధం: ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: రెండో దశ ఎన్నికలు హన్వాడ, కోయిలకొండ, మిడ్జిల్, దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లో నిర్వహిస్తున్న క్రమంలో ఆయా పోలింగ్స్టేషన్లలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ డి.జానకి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయా అధికారులతో శుక్రవారం ఎస్పీ మాట్లాడారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బీఎన్ఎస్ 163 అమల్లో ఉండటం వల్ల పోలింగ్ కేంద్రాల చుట్టూ వంద మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండరాదన్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు నిశ్శబ్దకాలం అమల్లో ఉండటం వల్ల ఇంటింటా ప్రచారం లేదా ర్యాలీలు అన్నింటిని నిషేధించినట్లు చెప్పారు. ఎన్నికలు జరిగే మండలాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు సైతం ఈనెల 15 ఉదయం 10 గంటల వరకు మూసి ఉంచాలన్నారు. మద్యం అక్రమ రవాణా చేసినా, నిల్వ చేసినా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు పూర్తిగా నిషేధమన్నారు. నేడు జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: కరీంనగర్ జిల్లాలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్జిల్లాల మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికనే నేడు (శనివారం) స్థానిక మెయిన్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు మాస్టర్ అథ్లెటిక్స్ అధ్యక్ష, కార్యదర్శులు జాజిమొగ్గ నర్సింహులు, సునీల్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం సునీల్కుమార్ 9440656162 నంబర్ను సంప్రదించాలని వారు సూచించారు. ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటా రూ.2,851 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి దాదా పు 3,500 క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 3,000 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ. 2,851, కనిష్టంగా రూ.1,730 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,902, కనిష్టంగా రూ.1,730, చిట్టిముత్యాలు గరిష్టంగా రూ.4,169, కనిష్టంగా రూ.3,125, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,972, కనిష్టంగా రూ.1,956 ధరలు లభించాయి. -
మంత్రి జూపల్లికి నిరసన సెగ
● ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని గ్రామస్తుల అడ్డగింత పెంట్లవెల్లి: రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో శుక్రవారం రెండో దశ స్థానిక ఎన్నికల్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ మద్దతుదారు తరపున ప్రచారం చేస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ క్రమంలో కొంతమంది గ్రామస్తులు స్పందిస్తూ ‘మంత్రిగారు.. హామీలపై హామీలు ఇస్తారు కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోతున్నారని’ గ్రామ సర్పంచ్ అభ్యర్థి, బీఆర్ఎస్ మద్దతుదారు మేడిపల్లి సరితాబిచ్చారెడ్డి అన్నారు. మా గ్రామానికి ఎక్కువ మొత్తంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని గ్రామస్తులు మంత్రితో నిరసన తెలిపారు. ఓటమి భయంతో హామీలు ఇవ్వడం కాదని వాటిని కచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం కాదని గోప్లాపూర్ గ్రామాన్ని గతంలో కూడా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేసి చూపిస్తానని, ఇందుకోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తానని పేర్కొన్నారు. -
జనరల్లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని 24 మండలాల్లో తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి 237 అన్రిజర్వ్డ్ (జనరల్, మహిళ కలిపి) సర్పంచ్ స్థానాల్లో 116 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు 114 బీసీ రిజర్వ్ (బీసీ జనరల్, బీసీ మహిళ కలిపి) స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 550 సర్పంచ్లకు గాను 230 మంది (41.82 శాతం) బీసీలు ఎన్నికయ్యారు. తొలివిడతలోసర్పంచ్లుగా విజయం 237 అన్రిజర్వ్డ్ స్థానాల్లో 116 మంది జయకేతనం మొత్తంగా 550 పంచాయతీల్లో 230 మంది గెలుపు బీసీలు పోటీలో ఉన్న జనరల్ స్థానాలపై సంఘాల ప్రత్యేక నజర్ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. శుక్రవారం వరదలు, పరిశ్రమ ప్రమాదాలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ (రిటైర్డ్) వీసీ నిర్వహించారు. వరదలు వచ్చినప్పుడు, పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై జిల్లాలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని, దీనికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వరదలు, పరిశ్రమ ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు అధికార యంత్రాంగం స్పందించాల్సిన తీరుపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జిల్లాలో భారీ వరదల సమయంలో నీటి విడుదలకు పైనున్న ప్రాంతాలు, దిగువ ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలన్నారు. విపత్తుల సమయంలో వెంటనే ఎన్డీఆర్ఏఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ వంటి ఏజెన్సీలకు సమాచారం వెళ్లేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, అగ్నిమాపక శాఖ అధికారి కిశోర్, పశువంవర్ధక శాఖ అధికారి మధుసూదన్గౌడ్, డీఎస్ఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సువర్ణ రాజ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ష్.. గప్చుప్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్కు సమయం దగ్గర పడింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం సైతం ముగిసింది. ఆరు రోజుల పాటు గ్రామాల్లో హోరెత్తిన ప్రచారం, మైక్ల చప్పుడు ఇప్పుడు మూగబోయింది. ఇప్పటికే ప్రలోభాలకు తెరలేపారు. అభ్యర్థులందరూ ఈ నిశ్శబ్ద సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రెండో విడతలో హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్కొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని 151 సర్పంచ్, 1,334 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ విడతలో 475 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,871 మంది వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. 6 కేంద్రాల్లో సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహించే పీఓలు, ఓపీఓలకు శనివారం పోలింగ్ సామగ్రిని అందజేయనున్నారు. ఇందుకోసం చిన్నచింతకుంట మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవరకద్రమార్కెట్యార్డులో, హన్వాడ బాలిక ఉన్నత పాఠశాల, కోయిల్కొండ రైతు వేదికలో, కౌకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మిడ్జిల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీల వారీగా కేటాయించిన పీఓలు, ఓపీఓలకు సామగ్రిని అందజేస్తారు. ● ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం ● రేపు 6 మండలాల్లో 151 గ్రామపంచాయతీల్లో పోలింగ్ -
రెండో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరు కాకపోతే చర్యలు ● జిల్లా ఎన్నికల అధికారి విజయేందిర బోయి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): అన్ని శాఖల అధికారుల టీమ్ వర్క్తో మొదటి విడత ఎన్నికలు సజావుగా జరిగాయని, ఈ నెల 14వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీసీ నిర్వహించారు. రెండో విడత పోలింగ్ కేంద్రాలకు చెక్లిస్టు ప్రకారం సామగ్రిని పంపిణీ చేయాల ని సూచించారు. పోలింగ్కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని, ఓటింగ్కి సంబంధించి ఇచ్చే నివేదికలన్నీ పూర్తి సమాచారంతో ఉండాలన్నారు. పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ బృందాల జాబి తా అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలన్నా రు. జోన్లు, రూట్ల వారీగా గ్రామపంచాయతీ వార్డులతో బ్యానర్ ప్రదర్శించి, అవసరమైన ఏర్పా టు చేయాలని సూచించారు. పీఓ, ఓపీఓలు, జోన ల్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలని, పోలింగ్ బృందాల జాబితా ప్రకారం ఉద్యోగి ఐడీ, పేరు, సంతకంతో హాజరు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో విధులకు రాని ఉద్యోగుల గైర్హాజరు జాబితా మధ్యాహ్నం 12 గంటల వరకు తహసీల్దార్లుకు అందజేయాలన్నారు. విధులకు హాజరు కాకపోతే కఠినచర్యలు తీసుకుంటామని, వారికి షోకాజ్, సస్పెన్షన్ చేయనున్నట్లు హెచ్చరించారు. పోలింగ్ముగిసిన తర్వాత ఓట్లు లెక్కించేందుకు అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫలితాలు వెల్లడైన తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్పెషల్ అధికారులు సమన్వయంగా పని చేసి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఈఓ ప్రవీణ్ కుమార్, డ్రెయినీ డీపీఓ నిఖిలశ్రీ పాల్గొన్నారు. -
120 సీట్లు.. 7,115 విద్యారు్థలు
గద్వాలటౌన్: నవోదయ విద్యాయాల్లో ప్రవేశం కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. తల్లిదండ్రులు సైతం ఆ దిశగా పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. గ్రామీణ, పట్టణం తేడా లేకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని నవోదయలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి మహబుబ్నగర్ జిల్లా (రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొన్ని మండలాలు)లో నవోదయ ప్రవేశాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. అంటే 120 సీట్లకు అంత మంది పోటీ పడాల్సి వస్తోంది. డిసెంబర్ 13న నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అరగంట ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రెండు విద్యాలయాలలో.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కొత్త నవోదయ విద్యాలయాలు వస్తే పోటీ తగ్గి ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం వస్తుందని అనేకమంది ఎదురుచూశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కొత్త నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం మహబూబ్నగర్ శివారులో స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి తరగతులు కొనసాగిస్తున్నా రు. అందులో 40సీట్లను భర్తీ చేశారు. వట్టెం జవహ ర్ నవోదయ విద్యాలయంలో 80సీట్లు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 120సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. నాణ్యమైన విద్య.. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల మోత.. అర్హులైన అధ్యాపకుల లేమి.. తదితర సమస్యలు పూర్తిస్థాయి లో నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్ర వేశాలకు నిర్వహించే అర్హత పరీక్షలో ఒకసారి ప్రవే శం లభిస్తే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అందులోనే నాణ్యమైన విద్య అందుతుంది. క్రీడలకూ ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. వసతి, భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, ఏకరూప దుస్తులు తదితర అన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. నడిగడ్డలో ఏర్పాటుకు కృషి చేయాలి రాష్ట్రంలో పూర్వం 10 జిల్లాలు ఉండగా.. వీటిలో అర్బన్ జిల్లాకు నవోదయ విద్యాలయాలు ఉండవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 9 జిల్లాల పరిధిలో తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి విద్యాలయంలో 80 సీట్లు ఉంటాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరికొన్ని నవోదయ విద్యాలయాలను మంజూరు చేస్తూ.. రాబోవు కాలంలో మరిన్ని మంజూరు చేస్తామని ప్రకటించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడి జోగుళాంబ గద్వాల జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరైతే ఇక్కడి విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అక్షరాస్యతలో ఈ జిల్లా ఎంతో వెనుకబడి ఉంది. ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే అక్షరాస్యత పెంపుతో పాటు విద్యాభివృద్ధికి బాటలు వేసినట్లవుతుంది. ఆ దిశగా పాలకులు నడిగడ్డలో కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర ప్రత్యేక బందోబస్తు మహబూబ్నగర్ క్రైం: జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష సందర్భంగా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్ నగరంలోని మహాత్మాగాంధీరోడ్, మోడల్ బేసిక్ హైస్కూల్, మాడ్రన్ హైస్కూల్, న్యూటౌన్ ఉన్నత పాఠశాల, జడ్చర్ల పరిధిలో బాయ్స్ స్కూల్, బాలిక హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఉన్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నిబంధనలు అమల్లో ఉంటాయని పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో గుంపులుగా ఎవరూ ఉండరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవోదయలోప్రవేశాలకు డిమాండ్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు నేడే ప్రవేశ పరీక్ష -
Sarpanch Election: నా డబ్బులు నాకు ఇచ్చేయండి..!
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది. సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమ్లాతండా సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు. బాట బంద్ చేయించాడుధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు. దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నిర్వాసితులది న్యాయమైన పోరాటం
చారకొండ: ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను గోకారం జలాశయం ముంపు నుంచి మినహాయించాలంటూ ఆయా గ్రామస్తులు చేస్తున్న పోరాటం న్యాయమైందని పాలమూరు అధ్యయన వేదిక నాగర్కర్నూల్ జిల్లా కన్వీనర్ రాఘవాచారి అన్నారు. ముంపు నుంచి మినహాయించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలంటూ ఆయా గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం 10వ రోజుకు చేరాయి. గురువారం రాఘవాచారితో పాటు కల్వకుర్తి కన్వీనర్ వెంకట్గౌడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ షాబాజ్ఖాన్, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానందంగౌడ్ దీక్షా శిభిరాన్ని సందర్శించి వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్తులు ఉన్న ఫలంగా గ్రామాలు ఖాళీ చేయాలంటూ సర్వం కోల్పోతున్నారని, వారి న్యాయమైన డిమాండ్ జలాశయం సామర్థ్యం తగ్గించి వెంటనే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచి అండర్–19 హ్యాండ్బాల్ టోర్నీ
● హాజరుకానున్న పది ఉమ్మడి జిల్లాల జట్లు ● 340 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్ రాక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ హై స్కూల్లో రెండు కోర్టుల్లో శుక్రవారం నుంచి ఈ నెల 14 తేదీ వరకు 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాల, బాలికల అండర్–19 రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ టోర్నీ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ హ్యాండ్బాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలైన మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండకు చెందిన బాల, బాలికల జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీలో బాల, బాలికలు కలిపి 340 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్ పాల్గొననున్నారు. ఈ టోర్నీలో రాణించే క్రీడాకారులను ఎస్జీఎఫ్ అండర్–19 జాతీయస్థాయి టోర్నీల్లో పాల్గొనే తెలంగాణ జట్లకు ఎంపిక చేయనున్నారు. క్రీడాకారులకు వసతి హ్యాండ్బాల్ టోర్నీలో పాల్గొనే బాలుర క్రీడాకారులకు హీరా మాడల్ స్కూల్లో వసతి ఏర్పాటు చేయగా.. అక్కడే మ్యాచ్లు జరగనున్నాయి. బాలికలకు మహబూబ్నగర్ హైస్కూల్లో వసతితో పాటు అక్కడే మ్యాచ్లు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్నగర్ హైస్కూల్లో పోటీలు ప్రారంభమవుతాయి. గురువారం మహబూబ్నగర్ హైస్కూల్లో రాష్ట్రస్థాయి టోర్నీ ఏర్పాట్లను జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి పరిశీలించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, సీనియర్ పీడీ వేణుగోపాల్, ఎండీ జియావుద్దీన్, ప్రదీప్కుమార్, రంజిత్, శివుడు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా బాలుర జట్టు కె.మహేష్, ఆర్.ఉమేష్ కుమార్, ఆర్.గణేష్, విశాల్నాయక్, ఎండీ జుబేర్, బి.ప్రేమ్వసంత్, మహ్మద్ రజియోద్దీన్, పి.శ్రీను, ఎం.సక్కురామ్, ఎండీ జైనోద్దీన్, వినయ్, వి.యోగేశ్వర్, ఎస్.చరణ్తేజ్, ఎం.రాజేష్, ఎం.జగన్నాథ్, పి.దినేష్, స్టాండ్బై ఎ.రేవంత్రెడ్డి, ఎం.మహేష్, ఎం.విష్ణు బాలికల జట్టు కె.లక్ష్మీప్రియ, జి.సంద్య, జి.జ్యోతి, ఎం.రాధిక, పి.జానుబాయి, పి.లాస్యప్రియ, సయ్యద్ యాస్మీన్, పి.శ్రవంతిక, ఎం.సుమతి, పి.బిందుప్రియ, ఎ.స్నేహలత, సి.శివాని, టి.మాళవిక, బి.శైలజ, ఎండీ ఆఫ్రిన్, కె.దివ్య, స్టాండ్బై ఎస్.అక్షిత, కె.కావేరి, జి.అంజలి, కె.భానుప్రియ -
యువత పలుకులు..
ఓటు విలువైంది.. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. – అమ్ములు, జంగమాయపల్లి (పెద్దమందడి) ఓటుతోనే మార్పు.. ప్రజాస్వామ్యంలో పౌరుడిగా ఓటింగ్లో పాల్గొనడం ప్ర త్యేకంగా అనిపించింది. ఓటు విలువ తె లుసుకొని గ్రామాభివృద్ధికి పాటుపడే వారినే గెలిపించాలి. యువత రాజకీయ అవగాహన పెంచుకొని తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. – అరుణ్రెడ్డి, బలిజపల్లి (పెద్దమందడి) ప్రజాస్వామ్యానికి పునాది కల్వకుర్తి రూరల్: ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న. ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాను. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉంది. – తలసాని అక్షిత, మార్చాల సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశా మొదటిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశా. ఓటు వేసే సమయంలో ఎంతో సంతోషం కలిగింది. ఈ జ్ఞాపకం మరిచిపోలేను. మార్చాలలో ఓటు హక్కు వినియోగించుకున్నాను. పోలింగ్పై అవగాహన వచ్చింది. – జాహ్నవి, ఎంబీఏ విద్యార్థిని -
వృద్ధాప్యంలోనూ ఓటు స్ఫూర్తి
ఆనందంగా ఉంది.. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు వజ్రాయుధం లాంటిది.. నీతి, నిజాయితీ, ధర్మంగా ఓటును వినియోగించుకుంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి. – యార దీపిక, తాడూరు మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే.. సర్పంచ్ ఎన్నికలో పార్టీలకతీతంగా ఎవరు గ్రామాభివృద్ధికి పని చేస్తారో వారిని గుర్తించి మొదటిసారి వచ్చిన ఓటు హక్కును వినియోగించుకున్నా. ఓటుహక్కుతో సర్పంచ్ను ఎన్నుకోవడం ఆనందంగా ఉంది. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు భవిష్యత్లోనూ ఓటును ఉపయోగిస్తా. – మధు, తాడూరు -
యువతకు ఉపాధి అవకాశాలు: యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలోని బోయపల్లిగేట్ సమీపంలో అధునాతన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం మోతి మసీదు వద్ద ఈ కేంద్రం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి మైనారిటీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించామన్నారు. జిల్లా కేంద్రంలోని యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, మాజీ కౌన్సిలర్లు ఖాజాపాషా, రాషెద్ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్అలీ, ఎం.డి.ఇబ్రహీం, అతీఖ్అహ్మద్, ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులు ఇచ్చినోళ్లకే ఓటేస్తాం..
● లక్ష్మీపల్లి జీపీలో అభ్యర్థులతో గ్రామస్తుల బేరసారాలు ● సామాజిక మాధ్యమాల్లో వైరల్ బల్మూర్: పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఓటర్లు కొందరు.. తమకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే గంపగుత్తగా ఓట్లు వేస్తామంటూ అభ్యర్థులతో బేరసారాలకు దిగారు. గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో సాగిన ఈ చర్చలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వివరాల్లోకి వెళ్లే.. బల్మూర్ మండలం లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీలో 1,040 మంది ఓటర్లు ఉండగా.. చెంచుగూడెం, బిల్లకల్, వెంకటగిరి అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. ఈ జీపీలో ఆయా పార్టీల మద్దతుతో ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులతో ఓటర్లతో కలిసి గ్రామ పెద్దలు బేరసారాలకు దిగారు. గ్రామంలోని సంఘాలు, ఆలయానికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓట్లేస్తామని చెప్పడంతో అభ్యర్థులు నివ్వెరపోయారు. అభ్యర్థులు, ఓటర్ల మధ్య సాగిన చర్చలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో మండల ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధం
కృష్ణా: షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లింది. గుడెబల్లూర్ గ్రామంలోని మారుతీనగర్లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎండీ బాబు రోజు మాదిరిగానే పిల్లలను బడిలో దింపేందుకు వెళ్లాడు. భార్య కూలి పనికి వెళ్లగా ఇంట్లో అకస్మాత్తుగా కరెంట్ వైర్లకు నిప్పంటుకొని గుడిసె మొత్తం కాలిపోయింది. ప్రమాదంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అప్పుగా తీసుకొచ్చిన రూ.1.50 లక్షలతో పాటు బంగారు, వెండి నగలు, నిత్యవసర సరుకులు కాలిపోయాయి. దీంతో సర్వం కోల్పోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్చర్లలో ఎస్బీఐ ఏటీఎం.. జడ్చర్ల: పట్టణంలోని సిగ్నల్గడ్డ ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం గురువారం దగ్ధమైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉంటాయని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. యంత్రంలోని నగదుకు మంటలు వ్యాపించనట్లు చెప్పారు. సాంకేతిక నిపుణులు పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ కమలాకర్ తెలిపారు. -
అత్యధికం.. అత్యల్పం
గద్వాల జిల్లాలో ధరూర్లో కాంగ్రెస్ మద్దతుదారుడు డీఆర్ విజయ్ కుమార్ 2,616 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. గంగిమాన్దొడ్డిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఒక ఓటు తేడాతో విజయం సాధించారు. నారాయణపేట జిల్లా గుండుమాల్లో కాంగ్రెస్ మద్దతుదారురాలు దడ తిరుపతమ్మపై కాంగ్రెస్ రెబల్గా పోటీచేసిన గొల్ల శ్రీశైల అత్యధికంగా 1,360 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇదే మండలం అమిన్కుంట్లలో కాంగ్రెస్ మద్దతుదారు వినోద 9 ఓట్లతో వెంకటయ్య (కాంగ్రెస్ రెబల్)పై గెలిచారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం సోళీపురంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సింధూజ విజయం సాధించింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (కాంగ్రెస్) సొంతూరు సల్కెలాపురంలో బీఆర్ఆర్ మద్దతుదారు గుళ్ల గిరమ్మ ఏడు ఓట్లతో గెలుపొందింది. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో కాంగ్రెస్ బలపరిచిన గోనెల రమేష్పై బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుడు రామకృష్ణ అత్యధికంగా 1,104 ఓట్లతో విజయం సాధించారు. రామకృష్ణకు 1,739 ఓట్లు రాగా.. గోనెల రమేష్కు 635 ఓట్లు పోలయ్యాయి. ఇదే మండలం ఈదుగానిపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు వెంకటేశ్వర్రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుదారుడు గణేష్ యాదవ్ అత్యల్పంగా 13 ఓట్లతో విజయం సాధించారు. అనిరుధ్రెడ్డి సొంత మండలం రాజాపూర్లో 24 జీపీలకు ఎన్నికలు జరగగా.. 15 పంచాయతీల్లో సర్పంచ్లుగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కేవలం నాలుగు గ్రామాలోన్లే కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. అంతేకాదు ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి గూడ సర్పంచ్గా బీజేపీ మద్దతుదారు రేవతి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
ప్రశాంతంగా తొలి విడత పోలింగ్
మహబూబ్నగర్ క్రైం: మొదటి విడత ఎన్నికల సందర్భంగా 1188 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్స్టేషన్స్తో పాటు సమస్యాత్మక గ్రామాలను ఎస్పీ డి.జానకి సందర్శించి భద్రత విధులను పర్యవేక్షించారు. ప్రధానంగా వీహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా ఎప్పటికప్పుడు రూట్ మొబైల్స్ బృందాలతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అనుక్షణం పర్యవేక్షించారు. ముఖ్యంగా ధర్మపూర్, రాజాపూక్, తిరుమలాపూర్, నవాబ్పేట, లింగంపల్లి, గురుకుంట, కారుకొండ, మహమ్మదాబాద్, కొండారెడ్డిపల్లి, గండేడ్, వెన్నచేడ్ గ్రామాల్లో పర్యటించి సిబ్బందిని అలర్ట్ చేస్తూ ఆదేశాలు ఇస్తూ ఓటరు క్యూలైన్లు పరిశీలించారు. అన్ని గ్రామాల్లో ఉన్న పరిస్థితులను సెట్ ద్వారా అధికారుల తెలుసుకున్నారు. టాస్లో వరించిన అదృష్టం కల్వకుర్తి రూరల్: నాగర్కర్నూల్ జిల్లా మండలంలోని తోటపల్లి 7వ వార్డు సభ్యుడిగా జోగు వెంకటయ్య టాస్ వేయడం ద్వారా గెలుపొందారు. 7వ వార్డులో 134 ఓట్లు ఉండగా.. 130 పోలయ్యాయి. ఇందులో జోగు వెంకటయ్యతోపాటు ప్రత్యర్థి జోగు వీరయ్యకు 65 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేయగా.. బీఆర్ఎస్ మద్దతుదారు వెంకటయ్యను అదృష్టం వరించింది. -
నువ్వా.. నేనా !
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నడిగడ్డ..అంటేనే విభిన్న రాజకీయాలకు మారు పేరు. ఈ జిల్లాలో నిర్వహించిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు తీర్పు మరోసారి ఆ శైలిని ప్రతిబింబించింది. ఏకగ్రీవం పోనూ మిగిలిన 92 జీపీల్లో సర్పంచ్ స్థానాలకుపోలింగ్ జరగగా.. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. అయితే గద్వాల నియోజకవర్గంలో పోటీ అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కాకుండా.. హస్తంలో వర్గాల మధ్యే కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాలకు చెందిన మద్దతుదారులు నువ్వా, నేనా అన్నట్లు పోటీపడ్డారు. 839 వార్డు స్థానాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు 56.. ఇటు 26 షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల పరిధిలో 106 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. 82 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్లుగా గెలుపొందారు. ఇందులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి చెందిన మద్దతుదారులు 56.. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గానికి చెందిన 26 మంది సర్పంచ్లుగా గెలుపొందారు. మూడో స్థానానికి బీఆర్ఎస్.. 2019 ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ జీపీ ఎన్నికల్లో సత్తా చాటి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. హస్తం హవా చాటగా.. కారు తలకిందులైంది. బీజేపీ మద్దతుదారులు తొమ్మిది గ్రామాల్లో సర్పంచ్లుగా గెలుపొంది రెండో స్థానంలో నిలవగా.. బీఆర్ఎస్ ఐదింట గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది. గద్వాలలో హోరాహోరీగా సాగిన పోరు సర్పంచ్లు, వార్డులు అత్యధికంగా ‘హస్త’గతం ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాల మధ్యే పోటీ -
ఓటెత్తారు..
– గట్టుసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్నగర్ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్లో వెనుకపడ్డారు. నవాబ్పేటలో ఓటు వేయడానికి వృద్ధురాలిని తీసుకెళుతున్న మహిళ మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 83.04 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 83.37 శాతం, మహిళలు 82.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా 86.32 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 87.13 శాతం, మహిళలు 85.53 శాతం మంది ఓటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో తొలి విడత జీపీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తంగా 86.77 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 87.79 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 85.79 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 84.90 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 85.91 శాతం, మహిళలు 83.99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో జరిగిన జీపీ ఎన్నికల్లో మొత్తంగా 84.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 85.55 శాతం, మహిళలు 83.66 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు వృద్ధురాలిని వీల్చైర్పై తీసుకొస్తున్న యువకుడు జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 86.77 శాతం మహబూబ్నగర్లో అత్యల్పంగా 83.04 శాతం అన్ని జిల్లాల్లోనూ పురుషుల ఓటింగ్ శాతమే ఎక్కువ -
రాజాపూర్లో అత్యధికం..
● మహమ్మదాబాద్లో అత్యల్పం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఐదు మండలాల్లోని 129 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. 83.04 శాతం పోలింగ్ నమోదైంది. రాజాపూర్ మండలంలో అత్యధికంగా ఓటింగ్ జరగగా.. మహమ్మదాబాద్ మండలంలో అత్యల్పంగా నమోదైంది. మహబూబ్నగర్ రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 33,918 మంది ఉండగా 29,407 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 86.70 శాతం నమోదైంది. గండేడ్ మండలంలో 31,295 మంది ఓటర్లు ఉండగా.. 24, 217 మంది ఓటేశారు. ఇక్కడ 77.38 శాతం పోలింగ్ జరిగింది. నవాబ్పేట మండలంలో మొత్తం ఓటర్లు 38,535 మంది ఉండగా 33,544 మంది ఓటు వేయడంతో 87.05శాతం నమోదైంది. రాజాపూర్ మండలంలో 20,925 మంది ఓటర్లు ఉండగా...18,824 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 89.96 శాతం పోలింగ్ జరిగింది. మహమ్మదాబాద్ మండలంలో 30,871 మంది ఓటర్లు ఉండగా.. 23,173 మంది ఓటేయడంతో 75.06 శాతం నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో మందకోడిగా సాగింది. ఆ తర్వాత ఓటర్లు క్యూ కట్టారు. జిల్లావ్యాప్తంగా చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తలేదు. రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి దంపతులు స్థానిక ప్రాథమిక పాఠశాలలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
బ్యాలెట్లో కనిపించని అభ్యర్థి గుర్తు
వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల పంచాయతీ అనుబంధ గ్రామం గొల్లోనిపల్లి(10వ వార్డు) పోటీచేసిన అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్లలో లేకపోవడంతో కలకలం రేపింది. 10వ వార్డులో మొత్తం 161 ఓట్లు ఉండగా 12 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థి యాద మ్మ ఓటు వేయడానికి రాగా బ్యాలెట్లో తనకు కేటాయించిన గుర్తు లేకపోవడాన్ని గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశా రు. వెంటనే ఎన్నికల అధికారులు ప్రిసైడింగ్ అధికారి ద్వారా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ముందు వేసిన ఓట్లను ఏజెంట్ల సమక్షంలో చించివేశారు. దాదాపు గంటపాటు పోలింగ్ను నిలిపివేసి తిరిగి కొత్త బ్యాలెట్ పత్రాలను తీసుకువచ్చి 12 మంది ఓటర్లతో మళ్లీ ఓటు వేయించడంతో వివాదం సద్దుమణిగింది. చివరికి సద రు అభ్యర్థి ఓటమి పాలు కావడం గమనార్హం. -
ఒక్క ఓటు తేడాతో విజయం.. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, వనపర్తి: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఘనపూర్ మండలంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో, అక్కడ రీకౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో, ఘర్షణలు నెలకొంది.వివరాల ప్రకారం.. ఘనపూర్ మండలంలోని సోలిపూర్ గ్రామంలో నిన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్థానిక మహిళ, కాంగ్రెస్ అభ్యర్థి సింధు.. బీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి, శ్రేణులు.. రీకౌంటింగ్ చేయాలని ధర్నాకు దిగారు. అనంతరం, రీకౌంటింగ్ చేసినా కూడా ఓడిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ససేమిరా అంటూ నిరసనలు చేపట్టారు. దీంతో, బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.అనంతరం, పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో, పలువురు గాయపడ్డారు. మరోవైపు.. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థిని మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ భారీగా మోహరించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
తాత x మనువడు
అడ్డాకుల: మూసాపేట మండలం చక్రాపూర్లో తాత, మనువడి సమరం రసవత్తరంగా సాగుతోంది. సర్పంచ్ స్థానం బీసీ జనరల్కు కేటాయించడంతో బీఆర్ఎస్ మద్దతుతో గంటెల రఘురాములు, కాంగ్రెస్ మద్దతుతో అతడి సోదరుడి మనువడు లక్ష్మీనారాయణ పోటీపడుతున్నారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో నువ్వా–నేనా అన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా గతంలో రఘురాములు తల్లి వెంకటమ్మ రెండు పర్యాయాలు, లక్ష్మీనారాయణ తండ్రి పెద్ద వెంకటయ్య ఒక పర్యాయం సర్పంచ్గా సేవలందించారు. పెద్ద వయస్కుడైనందున తనకు చివరిసారి ఒక అవకాశం ఇవ్వాలని తాత.. గ్రామస్తులకు సేవలందిస్తున్నందున తనకు అవకాశం కల్పించాలంటూ మనువడు ప్రచారం సాగిస్తున్నారు. విజేత ఎవరన్నది ఈ నెల 17న తేలనుంది. -
కాలిన గాయాలతో తల్లీకొడుకు మృతి
ధరూరు: మండల కేంద్రంలో ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న తల్లీకొడుకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక కుర్వ వీధిలో గ్యాస్ లీకై చెలరేగిన మంటల్లో సునీత, అశ్విని, అశ్విని ఏడాదిన్నర కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఐదు రోజులుగా కర్నూల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఏడాదిన్నర బాబు బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చనిపోగా.. ఆ బాలుడి తల్లి అశ్విని (22) సాయంత్రం మృతి చెందింది. చికిత్స పొందుతున్న తల్లీ, కుమారుడు ఒకేరోజు చనిపోవడంతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తీవ్రంగా గాయపడిన గర్భిణి సునీత బుధవారం ప్రసవించగా.. శిశువు చనిపోయినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. -
పల్లె ఒక్కటే.. పంచాయతీలు రెండు
● రంగాపూర్ నుంచి దర్గాతండా విడదీసి పంచాయతీగా ఏర్పాటు ● తాజా పంచాయతీ ఎన్నికల్లో రంగాపూర్ ఏకగ్రీవం అచ్చంపేట: అచ్చంపేట మండలంలోని రంగాపూర్ రెండు గ్రామపంచాయతీలకు నిలయంగా మారింది. ఒకే ప్రాంతంలో పైభాగంలో దర్గాతండా ఉండగా, కింది వైపు రంగాపూర్ ఉంటుంది. ఇదివరకు పంచాయతీ ఎన్నికల్లో రంగాపూర్, జయరాంనగర్తండా, దర్గాతండాలు కలిసి ఉండేవి. గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా గుర్తించడంతో 2019 పంచాయతీ ఎన్నికల్లో రంగాపూర్, జయరాంనగర్తండా ఒకటిగా, దర్గాతండా రెండో పంచాయతీగా ఏర్పడింది. ఒకే గ్రామంగా కలిసి ఉన్న ఈ పంచాయతీ.. అధికారుల తప్పిదం వల్ల రెండుగా ఏర్పాటయ్యాయని, ఇలా విడదీయడం చట్టబద్దంగా లేదని అప్పట్లో గ్రామస్తులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా పంచాయతీలను గుర్తించినా సమస్య ఉండేది కాదని, అలా కాకుండా గ్రామంలో కొంత భాగంలో ఉన్న తండాను వీడదీసి, ఓటర్లను ఇష్టం వచ్చినట్లు కలపడం వల్ల ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు వాపోయారు. రంగాపూర్ పంచాయతీ పరిధిలో 1,340 మంది ఓటర్లు, దర్గాతండాలో 1,530 మంది ఓటర్లు ఉన్నారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న రంగాపూర్ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కాగా ఉపసంహరణల అనంతరం ఈ పంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థి ముడావత్ సుజాత, 8 వార్డులు ఏకగ్రీవం కాగా రెండు వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. దర్గాతండా ఎస్టీ జనరల్కు కేటాయించగా ముడావత్ హతీరాం, నెనావత్ శివ, ముడావత్ జ్యోతి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దర్గాతండాలో ముగ్గురు అభ్యర్థుల మధ్య రాజకీయం వేడెక్కగా..రంగాపూర్లో ఏకగ్రీవంతో స్తబ్దత నెలకొంది. రెండు పంచాయతీల పరిధిలో జాతర ప్రతీ ఏటా జనవరి 17న రాత్రి రంగాపూర్ నిరంజన్ షావలీదర్గా ఉర్సు ప్రారంభమవుతుంది. దర్గాతండా పంచాయతీ పరిధిలో నిరంజన్ షావలీ దర్గా ఉండగా, ఉర్సు (జాతర) జరిగే మరో భాగం రంగాపూర్ పంచాయతీ పరిధిలో ఉంటాయి. జాతరలో వెలిసే దుకాణాలు టెంకాయల వేలం, తైబజారు వంటివి మొదలు కొన్ని జాతర ఏర్పాట్లు ఇతరత్రా కార్యక్రమాలు రెండు పంచాయతీలు పాలుపంచుకుంటున్నాయి. రంగాపూర్ రెండు పంచాయతీలుగా విడిపోవడంతో ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు పనులు చేస్తున్నాయి. ఒక్కటిగా ఉంటే బాగుండేది -
చిన్నారికి లాల.. ఓటు వల
ఫలితాల కోసం కాదు.. డ్యూటీ కోసం జాతీయ రహదారిపై తనిఖీలు అడ్డాకుల: మూడో విడత సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్న అడ్డాకుల, మూసా పేట మండలాల్లో పోలీసులు జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నారు. కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనదారులను తనిఖీలు చేస్తున్నారు. మద్యం, డబ్బుల రవాణాపై దృష్టిసారించారు. పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నారు. అధికారులు చేపడుతున్న తనిఖీలను వీడియో చిత్రీకరణ చేయిస్తున్నారు. శాఖాపూర్ టోల్ప్లాజా వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. -
కుమారుడి మృతిపై విచారణకు తండ్రి డిమాండ్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తన కుమారుడు ఆది నవీన్కుమార్ (16) అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని తండ్రి ఆది విష్ణువర్ధన్ బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకద్ర మైనార్టీ గురుకుల సంక్షేమ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న తన కుమారుడు గత నెల 9న తోటి స్నేహితులైన మహ్మద్ గౌస్, మాలిక్, టి.చందు, పురుషోత్తంతో కలిసి బయటకు వెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీల్లో బయటపడిందన్నారు. మరుసటి రోజే వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల శివారులోని ఏనుగుంట కాల్వలో మృతదేహం లభించిందని.. ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, విచారించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఓటుహక్కు వినియోగించుకోండిలా..!
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో నేడు (గురువారం) పంచాయతీ ఎన్నికలు ఉండగా మొదటి విడతలో 492 చోట్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు కింద నిబంధనలు పాటిస్తూ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ● పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ● అర్హులు: సదరు గ్రామ పంచాయతీలో ఓటరు జాబితాలో పేరు నమోదై ఉన్నవారు మాత్రమే. ● ఈ గుర్తింపు కార్డులు తప్పనిసరి: ఓటురు గుర్తింపు కార్డు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి. లేని పక్షంలో ఆధార్, పాస్పోర్టు, రేషన్కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ జాబ్కార్డు, ఫోటో ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా పాస్బుక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల గుర్తింపు కార్డు, పెన్షన్ పొందే గుర్తింపు కార్డు తీసుకెళ్లవచ్చు. ● ఒక్కో వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తుండగా సర్పంచ్ అభ్యర్థి, వార్డు అభ్యర్థికి ఒకేసారి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ● సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు అభ్యర్థికి తెలుపు బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. ● నచ్చిన అభ్యర్థుల గుర్తుపై స్వస్తిక్ ముద్రవేసి ఒకే బ్యాలెట్ డబ్బాలో వేయాల్సి ఉంటుంది. -
శెభాష్.. భగవేందర్
డీజీపీని చూసి నిమిషాల్లోనే చిత్రపటం గీసిన గురుకుల విద్యార్థి నాగర్కర్నూల్: హైదరాబాద్లోని మీర్ఖాన్పేటలో ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి నిమిషాల్లోనే డీజీపీ బి.శివధర్రెడ్డి చిత్రపటాన్ని గీసి అందరితో ఔరా అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ మండలం ఎత్తం గ్రామానికి చెందిన రాజు – అనిత కుమారుడు ఎ.భగవేందర్ ప్రస్తుతం ఘట్కేసర్లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో గురుకుల విద్యార్థులు ఫైన్ ఆర్ట్స్ స్టాల్ ఏర్పాటుచేశారు. మంగళవారం అక్కడ భద్రతా ఏర్పాట్లను డీజీపీ బి.శివధర్రెడ్డి పరిశీలిస్తున్న క్రమంలో విద్యార్థి భగవేందర్ డీజీపీ వద్దకు వెళ్లి ‘సార్ మీ చిత్రపటాన్ని ఇప్పుడే గీసి ఇస్తాను’. అని వినయంగా కోరాడు. బాలుడి ఉత్సాహాన్ని గమనించిన డీజీపీ.. అందుకు అంగీకరించి కొన్ని నిమిషాల పాటు భగవేందర్ ఎదురుగా కూర్చోగా.. కొన్ని నిమిషాల్లోనే ఆయన చిత్రాన్ని గీసి తన చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తొమ్మిదో తరగతి చదువుతూ.. ఇంతటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన భగవేందర్ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. -
పెళ్లి చేసుకోవాలని అడిగితే ప్రాణం తీశాడు
● యువతి హత్య కేసును చేధించిన పోలీసులు ● రోకలిబండతో తలపై మోది హతమార్చిన ప్రియుడు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్ ● హతురాలిది నాగర్కర్నూల్ జిల్లాగా గుర్తింపు వెల్గటూర్: పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ప్రియురాలిని అతికిరాతంగా హత్య చేశాడు ఆమె ప్రియుడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన యువతి హత్యకు సంబంధించిన వివరాలను వెల్గటూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిగ్రామానికి చెందిన అతినారపు అలివేలు భర్తకు వదిలి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తూ ఒంటరిగా ఉంటోంది. వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన మండలి నరేశ్ ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. ఆ సమయంలో తన కుమారుడికి అనారోగ్యం బాగాలేక గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అలివేలుతో నరేశ్కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న నరేశ్ భార్య రెండేళ్ల క్రితం అతడిని వదిలి పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కొన్నాళ్లు సహజీవనం చేసిన నరేశ్, అలివేలు కొన్నిరోజుల క్రితం మంచిర్యాలకు మకాం మార్చారు. కూన లక్ష్మి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉండడంతో ఆమె ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాల కోసం ఆమెనే చంపేశారు. ఆ కేసులో ఇద్దరూ ఆదిలాబాద్ జైలుకు వెళ్లి మూడు నెలల క్రితమే విడుదలయ్యారు. అప్పటినుంచి అలివేలు తనను పెళ్లి చేసుకోవాలని నరేశ్పై ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో నరేశ్ మంగళవారం సాయంత్రం స్తంభంపల్లికి వచ్చాడు. కొద్దిసేపటికే అలివేలు కూడా వచ్చింది. ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవపడ్డారు. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రోకలిబండతో తలపై కొట్టాడు. ఈ ఘటనలో అలివేలు (38) అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు నేరుగా పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు వినియోగించిన రోకలిబండ, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. సమావేశంలో సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పుంజుకున్న ఉల్లి ధరలు
దేవరకద్ర: స్థానిక మార్కెట్లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు మరింత పుంజుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్కు వానాకాలం సీజన్ కింద పండించిన కొత్త ఉల్లి మార్కెట్కు అమ్మకానికి వస్తోంది. ప్రారంభంలో రూ.వెయ్యి దాటని ధరలు ప్రస్తుతం రూ. 2,000కు చేరువగా పలుకుతోంది. వేలంలో గరిష్ట ధర రూ. 1,900, కనిష్టంగా రూ. 1,000గా లభించాయి. వ్యాపారులు పోటా పోటీగా వేలం పాడి కొనుగోళ్లు చేపట్టారు. 50 కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,000, కనిష్టంగా రూ.500గా అమ్మకాలు సాగించారు. దాదాపు అయిదు వందల బస్తాల ఽఉల్లి అమ్మకానికి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఎట్లనన్న గెలువాలే తమ్మీ!
అచ్చంపేట: పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కింది. మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఈనెల 11న గురువారం మొదలవుతుంది. రెండో విడత 14, మూడో విడత పోలింగ్ 17న జరగనుంది. దీంతో గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనకాడడం లేదు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి ఆడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. ఓడిపోవద్దని కొందరు గ్రామానికి భూమి ఇస్తామని, మరికొందరు కులా సంఘాలకు కావాల్సిన భవనాలు కట్టిస్తామని హామీలు ఇస్తున్నారు. మరికొందరు ఆలయాల నిర్మాణాలు, గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామని ముందుగానే ప్రకటిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా.. ఏ ఒక్క ఓటునూ వదలకుండా పట్టుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి ఏమివ్వాలి, ఏ కులసంఘాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలన్న ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికకు ఒక్కరోజు ఈ తాయిలాలు సమర్పించుకుని, ఓట్లు తీసుకోవడమే తరువాయి అన్నట్లుగా గ్రామాల్లో అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఒకరిని మించి మరొకరు ఎంత ఖర్చు అయినా.. సర్పంచ్గా గెలిచి తీరాలనే పట్టుదలతో అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మేజర్, పెద్ద పంచాయతీల్లో రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చుకు వెనుకాడడంలేదు. గ్రామాల్లో నిర్మించే అలయాలకు పోటీపడి చందాలు ఇస్తున్నారు. యూత్ కోసం శివాజీ, అంబేడ్కర్, ఇతర విగ్రహాల ఏర్పాటు, క్రీడాసామగ్రి హామీలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు. సంఘాల వారీగా.. ఫలానా సంఘం వాళ్లకు ఫంక్షన్లు చేసుకోవడానికి వంట సాంగ్రి లేదట.. అని తెలియగానే నేనిస్తాగా.. అంటూ అభ్యర్థులు కొనిచ్చేస్తున్నారు. మరో సంఘానికి ఇంకో తాయిలం ఇలా.. వ్యక్తిగతంగా ఇవ్వడంతో పాటు కులసంఘాల వారీగాను అభ్యర్థులు తాయిలాలు ఇస్తూ ఓట్లను రాబట్టుకునే ఎత్తులు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు తాయిలాలు ఇవ్వడంతోపాటు ఆ కులపెద్దల నుంచి తనకే ఓట్లు వేయాలని మాట తీసుకుంటున్నారు. ● ఖర్చు ఎంతైనా సరే.. ● పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు ఆకట్టుకునే హామీలు ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో సమర్థుడిని ఎనుకోవాలని, డబ్బు, మద్యం, మాంసాన్నికి అమ్ముడు పోవద్దని పోస్టర్లు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. రూపాయి అవినీతికి పాల్పడకుండా గ్రామం కోసం కృషి చేస్తామని అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఆకట్టుకునే హామీలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. జోరుగా ప్రచారం చేసినా.. ఎంతమంచి పేరున్నా ఎంతోకొంత ఇస్తేగానీ తమకు ఓట్లు రావంటూ చాలామంది అభ్యర్థులు ఓట్ల కోసం నోట్ల పంపకాన్నే నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజుల ప్రచారం ఒకెత్తు.. ఈ రెండ్రోలు మరోఎత్తు అంటూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రలోభపర్వంలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. -
జీవితంలో సవాళ్లను అధిగమించాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో సవాళ్లును అధిగమించి ఎదగాల్సిన అవసరముందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో బీయండ్ యువర్ మైండ్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చిన సవాళ్లను అధిగమించినప్పుడే కొత్త అవకాశాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయని, చదువులు ఎదుగుదలలో విద్యార్థులు భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటినికి వినియోగించుకుని అద్భుతాలను సృష్టించ్చవని, ఆన్లైన్ విధానంలో ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందని అందులోని అంశాలను తెలుసుకోవాలని, వాటిద్వారా మనిషి జీవితం సులభతరం అవుతుందన్నారు. ఇటీవల ఆర్చరీలో రాష్ట్రస్థాయిలో విద్యార్థి గోల్డ్మెడల్ సాధించడం గొప్ప విషయమన్నారు. కీనోట్ స్పీకర్ సరోజ గుల్లపల్లి మాట్లాడుతూ.. నేటికాలంలో బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తురన్నాని, అంతరిక్షయానం మొదలుకొని అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని, వారిని నేటితరం బాలికలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమస్యను సమస్యగా భావించకుండా దాన్ని ఎదుర్కొనే మార్గాన్ని గుర్తించాలని, ప్రతి అంశం నుంచి అనుభవాన్ని గడించి జీవితంలో ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, ఎన్సెఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, రవికాంత్, భూమయ్య, రవికుమార్, అర్జున్కుమార్, రాఘవేందర్, గాలెన్న, /్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్ -
ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా పంపిణీ చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాలకు వెళ్లే పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మహబూబ్నగర్ రూరల్ మండలం ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా పీఓలు, ఓపీఓలకు సామగ్రిని అందించాలన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు వెల్లడించారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు తమ పూర్తి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి వేణుగోపాల్, ఎంపీడీఓ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి మహబూబ్నగర్ బాలికల జూనియర్ కళాశాల, రాజాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
తొలి తీర్పు నేడే..
129 గ్రామ పంచాయతీల్లో మొదటి విడత పోలింగ్ పోలింగ్ సిబ్బంది 3,097 మందిజెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మొదటి విడత పంచాయతీ సమరానికి సమయం రానే వచ్చింది. జిల్లాలో 423 గ్రామపంచాయతీలు, 3,674 వార్డులు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం మొదటి విడతగా ఐదు గండేడ్, మహహ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్నగర్ రూరల్ మండలాల పరిధిలో పోలింగ్ జరగనుంది. సర్పంచ్, వార్డులకు కలిసి మొత్తం 2,620 మంది బరిలో నిలిచారు. ఈ విడతలో 139 సర్పంచ్, 1,188 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... పది సర్పంచ్ స్థానాలు, మరో 264 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో ఏడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లతో సహా వార్డు సభ్యులతో కలిపి పాలక వర్గం మొత్తం ఏకగ్రీమయ్యాయి. వీటిని మినహాయిస్తే.. 129 సర్పంచ్ స్థానాలకు 924 వార్డులకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతకు సంబంధించి 3097 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో పీఓలు 1,426, ఓపీఓలు 1,671 మంది ఉన్నారు. మొదటి విడత జరిగే 5 మండలాల పరిధిలో మొత్తం 1,188 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వార్డులకు ఇద్దరు, జనాభాను బట్టి మగ్గురు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలింగ్ సిబ్బందితో 20 శాతం అదనంగా పోలింగ్ సిబ్బందిని రిజర్వ్లో ఉన్నారు. తొలి విడతలు జరిగే ఐదు మండలాల్లో మొత్తం 1,60,353 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 79,994 మంది, మహిళలు 80,359 మంది ఉన్నారు. ఇందులో 365 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలానికి సంబంధించిన ఎన్నికల సామగ్రి జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో, మహమ్మదాబాద్ మండలంలో జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో, నవాబ్పేటలో ఎంపీడీఓ కార్యాలయంలో, రాజాపూర్లో జెడ్పీహెచ్ఎస్లో, గండేడ్లో విశ్వభారతి జూనియర్ కాలేజీలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీల వారీగా కేటాయించిన పీఓలు, ఓపీఓలకు సామగ్రిని అందజేశారు. పంపిణీ కేంద్రాల నుంచి గ్రామాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు బందోబస్తుతో తరలించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. గంటసేపు భోజనం విరామం ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొదటి వార్డులు సభ్యుల ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. పోలింగ్ రోజే పోటీ లో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. సాయంత్రం 6 గంటలలోగా పూర్తి కావచ్చని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా తొలి విడత అభ్యర్థులు ఇలా.. మండలం సర్పంచ్ వార్డు మహబూబ్నగర్ రూరల్ 91 532 నవాబ్పేట 130 663 మహమ్మదాబాద్ 60 310 గండేడ్ 79 349 రాజాపూర్ 65 341 ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఉద్యోగులు బ్యాలెట్ పద్ధతిన ఎన్నికల నిర్వహణ ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి తేలనున్న 2,620 మంది సర్పంచ్, వార్డు సభ్యుల భవితవ్యం -
‘కొల్లగుట్ట తండా’దే..!
మొదటి ఫలితంసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. మహబూబ్నగర్ జిల్లాలో గురువారం 129 సర్పంచ్.. 924 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పలు హామ్లెట్లు, తండాలకు జీపీ హోదా లభించగా.. ఆ గ్రామాల్లో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతి తక్కువ ఓట్లు ఉండడమే ఇందుకు కారణం. మొదటి దఫాలో ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 500 ఓట్లలోపు ఉన్న జీపీలు 15 (నవాబ్పేట–5, రాజాపూర్–5, మహబూబ్నగర్ రూరల్–2, గండేడ్–2, మహమ్మదాబాద్ 1) కాగా.. ఓట్ల లెక్కింపు చేపట్టిన గంటలోపే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నవాబ్పేట మండలంలోని కొల్లగుట్ట తండాలో అత్యల్పంగా 270 ఓటర్లు ఉండగా.. ఇక్కడే తొలి ఫలితం రానున్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ రూరల్ మండలంలో 24 జీపీలకు తొలి దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఓబులాయపల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 23 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. భవాని తండా జీపీలో మొత్తం ఓటర్లు 375 కాగా.. ఇక్కడ తొలి ఫలితం రానున్నట్లు తెలుస్తోంది. తువ్వగడ్డ తండాలో 419 కాగా ఇక్కడ కూడా ఫలితం త్వరగా రానుంది. మణికొండలో అత్యధికంగా 3,852 ఓటర్లు ఉండగా.. ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గండేడ్ మండలంలో 27 గ్రామపంచాయతీలు ఉండగా.. రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 25 జీపీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో అత్యల్పంగా జిన్నారం తండాలో 433 ఓట్లు, గోవిందపల్లిలో 466, సాలార్నగర్లో 514, మన్సూర్పల్లి తండాలో 534 ఓట్లు ఎన్నాయి. ఈ గ్రామాల్లో ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. పంచాంగం తండాలో 631, కప్లాపూర్లో 639, చెన్నయ్పల్లి తండాలో 659, జానంపల్లిలో 793, అసిరెడ్డిపల్లిలో 817, జంగంరెడ్డి పల్లిలో 976 ఓట్లు ఉన్నాయి. కాగా.. మండలంలోని వెన్నాచెడ్ జీపీలో అత్యధికంగా 4,273 ఓట్లు ఉన్నాయి. మహమ్మదాబాద్ మండలంలో 22 పంచాయతీలు ఉండగా.. ఆముదాలగడ్డ తండా ఏకగ్రీవమైంది. మిగిలిన 21 జీపీల్లో పోలింగ్ జరగనుంది. ధర్మాపూర్ గ్రామంలో అతి తక్కువగా 384 మంది ఓటర్లు ఉండగా.. ఓట్ల లెక్కింపు చేపట్టిన గంటలోపే ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది. మహమ్మదాబాద్లో అత్యధికంగా 5,811 ఓట్లు ఉన్నాయి. తొలి దఫాలో జరిగే ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్న గ్రామం ఇదే. ఇక్కడ ఫలితాలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. నవాబుపేట మండలంలో 42 జీపీలు ఉండగా.. నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 38 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలంలోని కొల్లగుట్ట తండాలో 270 ఓట్లు ఉన్నాయి. మండలంతోపాటు జిల్లాలో అత్యల్ప ఓట్లు ఉన్న గ్రామం ఇదే. అన్నింటికంటే ముందుగానే ఈ జీపీ పరిధిలో సర్పంచ్, వార్డు స్థానాల ఫలితాలు రానున్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా మండలంలో మల్లారెడ్డిపల్లిలో 416, మట్టుగడ్డ తండాలో 425, తిమ్మాయపల్లిలో 431, కాకర్జాల్ తండాలో 446 ఓట్లు ఉండగా.. ఫలితాలు గంటలోపు వచ్చే అవకాశం ఉంది. మండలంలో అత్యధికంగా నవాబుపేటలో 3,228 ఓటర్లు ఉన్నారు. రాజాపూర్ మండలంలో 24 జీపీలు ఉండగా.. మోత్కులకుంట తండా, కల్లేపల్లి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 22 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలంలో అత్యల్పంగా కొర్రతండా జీపీ పరిధిలో 369 ఓట్లు ఉండగా.. ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మోత్కులకుంట తండాలో 424, నర్సింగ్ తండాలో 434, అగ్రహారం పొట్లపల్లిలో 448, రాఘవాపూర్లో 472, బీబీనగర్ తండాలో 531, దొండ్లపల్లెలో 546 ఓట్లు ఉండగా.. లెక్కింపు చేపట్టిన గంట లోపు ఫలితాలు రానున్నాయి. మండల పరిధిలో అత్యధికంగా రాజాపూర్లో 2,652 ఓట్లు ఉన్నాయి. మొత్తంగా 15 జీపీల్లో 500ల్లోపే ఓటర్లు ఆయా చోట్ల గంటలోపు వెల్లడికానున్న ఫలితాలు తొలిదఫా ఎన్నికల్లో అత్యధికంగా మహమ్మదాబాద్లో 5,811 ఓట్లు -
1,650
సర్పంచ్ స్థానాలు పోటీలో ఉన్నవారు ● ఉమ్మడి జిల్లాలో ‘తొలి’ పోరు ఇలా.. ● వార్డులు 3,691.. బరిలో నిలిచిన వారు 9,127 ● మొత్తంగా 58 సర్పంచ్, 1,147 వార్డులు ఏకగ్రీవం ● 2 వార్డు స్థానాల్లో దాఖలు కాని నామినేషన్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 గ్రామాలు, 15,077 వార్డులు ఉన్నాయి. తొలి విడత షెడ్యూల్ ప్రకారం 550 గ్రామాలు, 4,840 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 58 జీపీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 492 సర్పంచ్ పదవులకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు 1,650 మంది బరిలో నిలిచారు. అదేవిధంగా మొదటి విడతలో పోలింగ్ జరగనున్న వార్డు స్థానాల్లో 1,147 ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోనూ 3,691 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. 9,127 మంది పోటీలో నిలిచారు. గద్వాల, వనపర్తిలో పోటాపోటీ.. తొలి దశ జీపీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున ముగ్గురు పోటీపడుతున్నారు. పాలమూరులోని ఐదు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండగా.. ప్రధానంగా గద్వాల, వనపర్తిలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు రెబల్స్గా బరిలో ఉన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన బలమైన నాయకులు సైతం పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ● తొలి విడత ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో వాల్యానాయక్ తండాలో ఆరో వార్డుకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఆ అభ్యర్థి సర్పంచ్ స్థానానికి కూడా నామినేషన్ వేశారు. ఆయన సర్పంచ్గా ఏకగ్రీవం కాగా.. ఆరో వార్డు కు వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అదేవిధంగా వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో ఏడో వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. తొలి విడతలో ఎన్నికల వివరాలు.. జిల్లా జీపీలు ఏకగ్రీవం పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్ జరిగేవి ఉన్నవారు జరిగేవి ఉన్నవారు మహబూబ్నగర్ 139 10 129 425 1,188 264 924 2,195 నాగర్కర్నూల్ 151 14 137 447 1,326 208 1,118 2,774 జోగుళాంబ గద్వాల 106 15 91 321 974 361 613 1,425 నారాయణపేట 67 14 53 170 572 210 361 1,017 వనపర్తి 87 05 82 287 780 104 675 1,716 మొత్తం 550 58 492 1,650 4,840 1,147 3,691 9,127 -
గట్టి బందోబస్తు..
మహబూబ్నగర్ క్రైం: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా 1,088 మంది పోలీస్ బలగాలతో జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టారు. అభ్యర్థులు మద్దతుదారులతో ఎలాంటి గొడవలు కాకుండా దృష్టి సా రించారు. ప్రధానంగా గురువారం జరిగే మొదటి విడత ఎన్నికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి పో లింగ్ కేంద్రం ఇద్దరు సిబ్బంది విధుల్లో ఉంటారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ముగ్గురు లేదా నలుగురు బందోబస్తు నిర్వహిస్తారు. ఓటర్లు, వార్డుల సంఖ్యతో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల పరిస్థితి ఆధారంగా సిబ్బందిని కేటాయిస్తున్నారు. రెండో దశలో మూడు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి ఒక రూట్గా నిర్ణయించి రూట్ మొబైల్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. మూడోదశలో పోలీస్స్టేషన్ స్థాయిలో సీఐ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, నాలుగో దశలో సర్కిల్ స్థాయిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఐదో దశలో మండలానికి ఒక డీఎస్పీస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల ద్వారా పర్యవేక్షణ చేస్తారు. ● నగరంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఎస్పీ డి.జానకి సందర్శించి సిబ్బంది హాజరు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల విధులపై సూచనలు చేశారు. పోలింగ్కేంద్రంలో గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా క్యూలైన్లలో నిలబడి ఉన్న క్రమంలో గొడవలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. రాత్రి కోడూరు పంచాయతీలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 1,088 మంది పోలీసులకు విధుల కేటాయింపు ప్రత్యేక రూట్ మొబైల్స్ ఏర్పాటు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా -
జైలు జీవితం మంచిగా మారేందుకు అవకాశం
పాలమూరు: జైలులో శిక్ష అనుభవించే ఖైదీలు సత్ప్రవర్తనతో ఉంటూ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి హక్కులు తెలుసుకొని బాధ్యతగా మెలగాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా జైలులో ఖైదీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే నేరం అవుతుందని, బాధ్యతను మరిచి ఎవరూ ప్రవర్తించరాదన్నారు. నేర ఆరోపణలతో జైలుకు వచ్చి స్వేచ్ఛ హక్కును కోల్పోతున్నారని, ఇక్కడ శిక్ష కాలంలో ఉత్తమ జీవనం గడిపి బయటకు వెళ్లిన తర్వాత ఎలాంటి తప్పులు చేయరాదన్నారు. తప్పు చేసిన మనిషికి జైలు అనేది మారడానికి ఒక అవకాశంగా భావించాలన్నారు. తమపై ఆధారపడిన కుటుంబాలు, తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తుపెట్టుకుని సమాజంలో గౌరవంగా బ్రతకలన్నారు. ఖైదీల సంక్షేమం విషయంలో ఇబ్బంది జరిగితే వెంటనే జైలు అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, న్యాయవాదులు రవీందర్, కృష్ణ, యోగేశ్వర్రాజ్, కార్తీక్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవ ప్రవేశానికి గడువు పెంపు స్టేషన్ మహబూబ్నగర్: పిల్లలమర్రి బాలోత్సవం 4వ పిల్లల జాతరలో పాల్గొనడానికి గూగుల్ ఫారం పంపేందుకు గడువు ఈనెల 10వ తేదీ ఉండగా దానిని ఈనెల 15 వరకు పెంచినట్లు ఆ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరాంజనేయులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల విజ్ఞప్తుల మేరకు బాలోత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో బృందావన్ గార్డెన్స్లో బాలోత్సవం జరుపుతున్నామని, ఇందులో ప్రవేశం పూర్తిగా ఉచితమని, ఎలాంటి ప్రవేశం రుసుము లేదని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 93983 05993, 94909 09780 నంబర్లను సంప్రదించాలని కోరారు. క్వింటా ఆర్ఎన్ఆర్ రూ.2,811 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం వివిద ప్రాంతాల నుంచి దాదాపు 6వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,811, కనిష్టంగా రూ.1,996, హంస గరిష్టంగా రూ.2,265, కనిష్టంగా రూ.1,857, కందులు రూ.6,811, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,975, కనిష్టంగా రూ.1,836, పత్తి గరిష్టంగా రూ.6,759, కనిష్టంగా రూ.5,011 ఽ ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,659, కనిష్టంగా రూ.2,350, హంస గరిష్టంగా రూ.1,961, కనిష్టంగా రూ.1,953గా ధరలు పలికాయి. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో స్టాటస్టికల్ సబ్జెక్టులో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. నెట్, సెట్, పీహెచ్డీ అర్హతలు కలిగినవారు దరఖాస్తులు చేసుకోవాలని ఈనెల 11, 12వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు గురువారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఈఓ ప్రవీణ్కుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు థియరీ సబ్జెక్టులకు ఎస్సెస్సీ విద్యార్థులు రూ.100, ప్రాక్టికల్స్కు రూ.100, ఇంప్రూమెంట్కు రూ.200 చెల్లించాలని తెలపారు. ఇంటర్ వారు థియరీ సబ్జెక్టులకు రూ.150, ప్రాక్టికల్స్కు రూ.150, ఇంప్రూమెంట్కు రూ.350 చెల్లించాలని కోరారు. -
Panchayat Elections : జర.. ఆగరాదే
దేవరకద్ర రూరల్: మండలంలోని లక్ష్మీపల్లిలో సర్పంచ్ రోజా అభ్యర్థి గ్రామంలోని ఓటర్లును ఆకట్టుకునేలా సర్పంచ్గా తనను ఎన్నుకుంటే చేసే పనులపై ఓ మేనిఫెస్టో చేసి బాండ్పేపర్తో ప్రచారం నిర్వహిస్తున్నారు. మ్యానిఫెస్టోకు సంబంధించిన బాండ్పేపర్ను గురువారం లక్ష్మీపల్లిలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రశాంత్రెడ్డి చేతులమీదుగా గ్రామస్తుల సమక్షంలో విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా శివాజీ విగ్రహ ఏర్పాటు, గ్రంథాలయం, హెల్త్క్యాంప్లు, గ్రామంలో మౌలిక వసతులు కలిపి 20 వరకు ఉన్నాయి. ఇచ్చిన హామీలలో 70 శాతం పనులు మూడేళ్లలో పూర్తి చేస్తానని.. లేదంటే రాజీనామా చేస్తానని పేర్కొంటూ ఓట్లు అభ్యరి్థంచారు.గిన్నెలు ఇప్పిస్తా.. ఓటేయండి ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజులయ్యతండాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తుండగా గిన్నెల వ్యాపారి అటుగా వచ్చాడు. దీంతో వెంటనే సర్పంచ్ అభ్యర్థి ఒక్కొక్క మహిళకు గిన్నెలు ఇప్పించి.. ఓట్లు వేయాలని విన్నవించాడు. – మరికల్జర.. ఆగరాదే స్నానం చేస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని.. రిమోట్ కంట్రోల్ గుర్తుకు ఓటేయండి అంటూ అమరచింత మండలంలోని చంద్రనాయక్తండాలో సర్పంచ్ అభ్యర్థి కోరగా.. సదరు వ్యక్తి స్పందిస్తూ జర.. ఆగరాదే అనడంతో నవ్వులు పూశాయి. – అమరచింత -
మద్యం మత్తులో స్నేహితుల ఘర్షణ
● కత్తితో పరస్పర దాడులు ● ముగ్గురికి తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమం ● గద్వాల జిల్లాకేంద్రంలో కలకలం గద్వాల క్రైం: మద్యం మత్తులో స్నేహితులు ఘర్షణపడి కత్తితో పరస్పర దాడులు చేసుకున్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గద్వాల కృష్ణవేణి చౌరస్తాలో బీసీ కాలనీకి చెందిన కుర్వ వంశీ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి స్నేహితులైన కుర్వ వంశీ, అరవింద్ (ఐడీఎస్ఎంటీ కాలనీ), బన్నీ (హమాలీ కాలనీ), అనిల్ (నల్లకుంట), వసంత్ (సెంకడ్ రైల్వేగేట్)లకు షేరేల్లి వీధికి చెందిన సంతోష్ మందు పార్టీ ఇచ్చాడు. వారందరూ అర్ధరాత్రి దాటే వరకు ఫొటో స్టూడియోలోనే మద్యం తాగారు. వీరిలో సంతోష్ అనే యువకుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వసంత్ మరో స్నేహితుడైన బుల్లెట్ వంశీ (బీసీ కాలనీ)కి ఫోన్ చేసి మందు పార్టీకి ఆహ్వానించాడు. అందరూ కలిసి మద్యం తాగుతున్న క్రమంలో వివాదం చోటు చేసుకుంది. మాటామాట పెరిగి ఫొటో స్టూడియోలో పనిచేసే వసంత్పై మూకుమ్మడిగా దాడికి పాల్పడి.. స్టూడియో నుంచి బయటికి పంపించారు. అయితే బయటికి వెళ్లిన వసంత్.. రోడ్డుపై హంగామా చేస్తూ స్టూడియోలో ఉన్న యువకులను పరుష పదజాలంతో దూషించాడు. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తితో ఫొటో స్టూడియోలోకి వెళ్లి అరవింద్ను గాయపరిచాడు. ఈ క్రమంలో అరవింద్, బుల్లెట్ వంశీలు వసంత్ వద్ద ఉన్న కత్తిని లాక్కొని విచక్షణారహితంగా దాడిచేశారు. కత్తి పోట్లకు గురైన వసంత్ తప్పించుకొని రోడ్డుపైకి చేరుకున్నాడు. అక్కడే రాత్రి విధులు నిర్వర్తిస్తున్న పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది గమనించి.. కత్తి పోట్లకు గురైన ముగ్గురు యువకులను పోలీసు వాహనంలోనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వసంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అరవింద్, బుల్లెట్ వంశీ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం వెనుక పాత గొడవలు ఏమైనా ఉన్నాయా.. లేక ప్రేమ వ్యవహారమా.. ఆర్థిక పరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకేంద్రంలో రెండు రోజుల క్రితం చికెన్ సెంటర్ నిర్వాహకుడిపై అకారణంగా కత్తితో దాడికి పాల్పడిన ఘటనను మర్చిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విచారణ చేస్తున్నాం.. జిల్లా కేంద్రంలోని వంశీ ఫొటో స్టూడియోలో మద్యం మత్తులో యువకులు పరస్పర దాడులు చేసుకున్న ఘటనపై విచారణ చేపడుతున్నాం. మందు పార్టీలో ఎంతమంది ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నాం. సీసీ కెమెరాల సహాయంతో అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాం. ప్రస్తుతం ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నాం. ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. – శ్రీను, సీఐ, గద్వాల -
వలస వెళ్లిన చోట గొర్రెల కాపరి మృతి
గద్వాల(గట్టు): గొర్రెల మందతో కర్ణాటకకు వలస వెళ్లిన గట్టుకు చెందిన గొర్రెల కాపరి ఉలిగెప్ప (28) అక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గట్టుకు చెందిన కుర్వ డోలన్న కుమారుడు ఉలిగెప్పతో పాటుగా మరో ఇద్దరు కలిసి గొర్రెల మందను మేపడానికి కర్ణాటక ప్రాంతానికి వెళ్లారు. కర్ణాటకలోని ముండ్లదిన్నె శివారులో గొర్రెల మందను నిలిపి ఉన్న తరుణంలో సోమవారం రాత్రి అక్కడే కాపలాగా ఉన్న కుర్వ ఉలిగెప్ప నిద్రలోనే మృతి చెందాడు. గమనించిన తోటి కాపరులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. కర్ణాటక నుంచి మృతదేహాన్ని గట్టుకు తీసుకొచ్చి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య సంధ్యతో పాటుగా ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న నాయకులు బల్గెర హనుమంతునాయుడు, రామకృష్ణారెడ్డి, మోహన్గౌడు, సత్యనారాయణ, కృష్ణమూర్తి, ఎస్.కృష్ణ, రామునాయుడు తదితరులు బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం గద్వాల క్రైం: ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని వేణుకాలనీలో ఉంటున్న అయిజ మండలం చిన్నతాండ్రపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు రమణారెడ్డి స్నేహితులతో కలసి ఫైనాన్స్, చిట్టీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్స్ వ్యవహారం, వ్యక్తిగత సమస్యలతో కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్థాపం చెందిన రమణారెడ్డి ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఈసారి ఇంటినుంచి ఓటు లేనట్లే!
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రెండేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్యే, లోక్సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటివద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నడవలేని, చేతగాని, మంచానికే పరిమితమైన వృద్ధులు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేక పోవడంతో వారు తమ ఓటుహక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతుందన్న వాదనలు ఉన్నాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అటువంటి వారికి ఇంటినుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేసేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. ఎన్నికల సంఘం నుంచి అలాంటి ప్రకటన ఏదీ నేటికీ రాలేదు. గత ఎన్నికల్లో ఇలా.. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేరుండి 85ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు ఇంటినుంచే ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా 12–డీ ఫారాన్ని ముందస్తుగానే నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అధికారులు వారు ఇచ్చిన అడ్రస్కు పూర్తిస్థాయి భద్రతతో పోలింగ్ సామగ్రితో వెళ్లి ఓటు వేయించారు. ఇబ్బందులు పడే అవకాశం ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం లేకపోవడంతో వారు కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం కూడా ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది. నిర్ణీత సమయంలోగా కుటుంబ సభ్యులు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాల్సి ఉంటుంది. కాదూ అని వారిని వదిలేస్తే ఓటింగ్ శాతం తగ్గి గెలుపు, ఓటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతోపాటు ఓటర్లు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ● అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటేసిన వృద్ధులు ● పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వని ఎన్నికల సంఘం -
చిత్రవిచిత్రాల పొత్తులు
నారాయణపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. చిత్రవిచిత్ర పొత్తులతో ఓటర్ల ముందుకెళ్తున్న అభ్యర్థులను ఏ పార్టీ అని ఓటర్లు అడిగితే ముక్కున వేలేసుకుంటున్నారు. గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎవరికి వారు తమ నాయకుడంటే.. తమ నాయకుడిని గెలిపించాలంటూ ఎవరి పార్టీల్లో వారు ప్రచారం హోరెత్తించారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో మాత్రం తమకు అనుకూలమైన పార్టీలతో పొత్తు పెట్టుకొని పోరులో నిలవడాన్ని ఓటర్లు తప్పుబడుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఎక్కడా కనిపించడం లేదని.. ఎవరు గెలుస్తారో వారికే వంతు పాడే వారు ఏం లీడర్లంటూ మొఖంపైనే ఓటర్లు చెబుతుండటాన్ని అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీచేసే అభ్యర్థులు తమ పార్టీ వారే అయినా.. తమకు పడదంటూ మరో పార్టీకి మద్దతునివ్వడం పల్లె పోరులో చర్చనీయాంశంగా మారింది. పల్లె పోరులో ఒక్కటైన ప్రధాన పార్టీలు తమ పార్టీ కండువాలతో ప్రచారం బిత్తరపోతున్న ఓటర్లు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరికి వారే ప్రచారం స్థానిక ఎన్నికల్ల్లో మాత్రం పొత్తులతో ప్రజల్లోకి.. -
పోలింగ్ నిర్వహణకు 88 రకాల సామగ్రి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎన్నికల నిర్వహణలో అధికారులు, అభ్యర్థులు, ఓటర్లు అనే పదాలు తరచూ వింటుంటాం. వీటితోపాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, వేలికి అంటించే సిరా మాత్రమే గుర్తుకొస్తాయి. ఇవేగాక సూది, దారం, కొవ్వొత్తులు, అగ్గిపెట్టె, పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు, అట్టలు, సీల్ వేసేందుకు లక్క, బ్యాలెట్ పేపర్లు చింపేందుకు స్కేలు, బ్యాలెట్ బాక్కులకు వేసేందుకు సంచులు, స్టీల్ పెట్టెలు ఇలా చెప్పుకొంటు పోతే మొత్తంగా 88 రకాల సామగ్రి వినియోగిస్తారు. పోలింగ్కు వినియోగించే సామగ్రి -
హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు
● ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య ● ఆరేళ్ల విచారణ తర్వాత శిక్ష ఖరారు ● ఒక్కొక్కరికి రూ. 5 వేల జరిమానా అలంపూర్: హత్య కేసులో గద్వాల జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత ఐదుగురు నిందితులకు జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించినట్లు అలంపూర్ ఎస్ఐ వెంకటస్వామి, జిల్లా పోలీస్ కార్యాలయం సంయుక్త ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు.. 2019 జూన్ 4న అలంపూర్కు చెందిన చాకలి శాలు భార్య కృష్ణవేణి(అలియాస్ హరిత), పిల్లలతో కలిసి కర్నూలుకు వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇమాంపురం శివారులో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చాకలి శాలును అడ్డగించి పొలాల్లోకి లాక్కెళ్లి హత్య చేశారు. మృతుడి తమ్ముడు గోపి అలంపూర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ మధుసూదన్రెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ రాజు కేసును విచారించగా మృతుడి భార్య అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియుడు సాంకటి మహేశ్తో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో 2019 జూన్ 7న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించి అప్పటి సీఐ వెంకట్రామయ్య 2020 జూన్ 30న కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం వాదనలు విన్న జడ్జి నిందితులైన చాకలి కృష్ణవేణి అలియాస్ హరిత, సాంకటి మహేష్, దాదపోగు మహేష్, ఈడిగ మహేంద్ర, హుల్చా రాజాకు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితులకు శిక్ష పడే విధంగా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోదాచారి, అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్యను, సీఐ రవిబాబును, ఎస్ఐ వెంకటస్వామి తదితరులను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. -
బాండు పేపర్ రాసి.. హామీ ఇచ్చి
గిన్నెలు ఇప్పిస్తా.. ఓటేయండి జర.. ఆగరాదే దేవరకద్ర రూరల్: మండలంలోని లక్ష్మీపల్లిలో సర్పంచ్ రోజా అభ్యర్థి గ్రామంలోని ఓటర్లును ఆకట్టుకునేలా సర్పంచ్గా తనను ఎన్నుకుంటే చేసే పనులపై ఓ మేనిఫెస్టో చేసి బాండ్పేపర్తో ప్రచారం నిర్వహిస్తున్నారు. మ్యానిఫెస్టోకు సంబంధించిన బాండ్పేపర్ను గురువారం లక్ష్మీపల్లిలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రశాంత్రెడ్డి చేతులమీదుగా గ్రామస్తుల సమక్షంలో విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా శివాజీ విగ్రహ ఏర్పాటు, గ్రంథాలయం, హెల్త్క్యాంప్లు, గ్రామంలో మౌలిక వసతులు కలిపి 20 వరకు ఉన్నాయి. ఇచ్చిన హామీలలో 70 శాతం పనులు మూడేళ్లలో పూర్తి చేస్తానని.. లేదంటే రాజీనామా చేస్తానని పేర్కొంటూ ఓట్లు అభ్యర్థించారు. -
జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
కల్వకుర్తి రూరల్: మండలంలోని తర్నికల్ సమీపంలోని బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. పత్తిని జిన్నింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్య్యూట్తో పత్తి అంటుకొని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది, రైతులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. అప్రమత్తంగా ఉండడంతో పెద్ద నష్టం తప్పింది. నష్టం తీవ్రత తక్కువగానే ఉందని జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్ తెలిపారు. జిన్నింగ్ మిల్లును ఎస్ఐ మాధవరెడ్డి సందర్శించారు. -
కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా ఆవిష్కరించగా జిల్లాలో జిల్లా పశు సంవర్ధక అధికారి మధుసూదన్గౌడ్, ఆర్అండ్బీ ఈఈ సంధ్య జిల్లా అధికారులు ఆవిష్కరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్ర ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి ఇందిర, సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాస్, టీఎన్జీఓ జిల్లాఅధ్యక్షుడు రాజీవ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జడ్చర్లలో సోదాలు
వెల్దండ: ఇంటికి విద్యుత్ మీటరు బిగించడానికి లంచం తీసుకుంటూ విద్యుత్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మహబూబ్నగర్ ఇన్చార్జి డీఎస్పీ జగదీష్చందర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.60 వేలు డీడీ చెల్లించారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్ బిగించగా.. అక్కడ నిర్మించిన ఓ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించాలని బాధితుడు ఇన్చార్జి ఏఈ వెంకటేశ్వర్లుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మీటర్ బిగించడానికి ఏఈ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న బాధితుడు ఆన్లైన్లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళవారం వ్యవసాయ పొలంలోని ఇంటి వద్ద బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా విద్యుత్ ఏఈను పట్టుకున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం ఏఈని వెల్దండ విద్యుత్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇదే సమయంలో జడ్చర్లలోని విద్యుత్ ఏఈ ఇంట్లో మరో బృందం తనిఖీలు చేపట్టింది. విద్యుత్ ఏఈని బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరస్తామని వివరించారు. దాడుల్లో మహబూబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. జడ్చర్ల: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఏఈ వెంకటేశ్వర్లు అద్దె ఇంటిలో సైతం ఏసీబీ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలు ఫైళ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రలోభాల పర్వం
ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గురువారమే తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. యథేచ్ఛగా మద్యంతోపాటు డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిన్న గ్రామాల్లోనూ భారీగానే.. తొలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు దిగుతున్నారు. వెయ్యిలోపు ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గ్రామాల్లోని వార్డుల వారీగా లెక్కలు వేసి కేటాయింపులు చేస్తున్నారు. ఒక్కో వార్డుకు రూ.లక్ష, ఒక్కో కుల సంఘానికి రూ.2 లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. కుల సంఘాల పెద్దల వద్ద రూ.2–3 లక్షల వరకు ఉంచుతూ గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. మహిళా సంఘాల సమస్యలపై హామీలు గుప్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళల ఓట్లు పొందేందుకు మహిళా సంఘాలకు రూ.లక్షల్లో ముట్టజెప్పుతూ ప్రలోభాలను సాగిస్తున్నారు. మద్యం ప్రవాహం.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఓటర్లకు మద్యం పంపిణీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు మూసివేయగా.. అంతకు ముందే అభ్యర్థులు భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఓటరుకో క్వార్టర్ చొప్పున పంపిణీ చేస్తుండగా.. కొన్నిచోట్ల మద్యంతోపాటు డబ్బుల పంపిణీ సైతం కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో పోటీని బట్టి ఓటరుకు క్వార్టర్తోపాటు రూ.వెయ్యి వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ‘నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేవలం 1,200 లోపు ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.15 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ రోజునే ఒకరు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయగా.. నిత్యం ప్రచారంలో భాగంగా ఇప్పటికే రూ.8 లక్షలు దాటింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం కూడా ముగియడంతో అభ్యర్థులు నేరుగా మద్యం, డబ్బులతో ప్రలోభాలకు దిగుతున్నారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఇక్కడ సర్పంచ్ స్థానం కోసం అభ్యర్థులు రూ.30 లక్షల దాక ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకో మందు సీసాతో పాటు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాక ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.’ గ్రామాల్లో జోరుగా మద్యం, డబ్బుల పంపిణీ ఒక్కో వార్డుకు రూ.లక్ష, కుల సంఘాలకు రూ.2 లక్షలు చిన్న పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు రేపే ఉమ్మడి జిల్లాలోని 550 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు -
బెల్ట్ షాపులపై దాడులు
మహబూబ్నగర్ క్రైం: ‘కోడ్ ఉన్నా బెల్ట్ జోరు’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పించారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కృష్ణా మండల పరిధిలోని హిందూపూర్లో నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణంపై దాడులు చేసి సిద్దప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 7.72 లీటర్ల మద్యం సీజ్ చేయగా బస్వరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఆరు లీటర్ల మద్యం సీజ్ చేయడంతో పాటు ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అనంతయ్య వెల్లడించారు. నారాయణపేట ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో ఊట్కూర్ మండలం పులిమామిడిలో సోదాలు చేసి 2.52 లీటర్ల మద్యం సీజ్ చేశారు. జడ్చర్ల సర్కిల్ పరిధిలో రాజాపూర్లో 7.8 లీటర్ల బీరు, 0.550 లీటర్ల మద్యం, కావేరమ్మపేటలో లిక్కర్ 24.050 లీటర్లు, బీర్ 14.345 లీటర్లు పట్టుకున్నారు. గెగ్యా తండాలో రెండు లీటర్ల నాటుసారా సైతం సీజ్ చేశారు. చట్టాలపై విద్యార్థులు విజ్ఞానం పెంచుకోవాలి పాలమూరు: నగరంలోని మెట్టుగడ్డ దగ్గర ఉన్న స్టేట్ హోంతో పాటు బీసీ స్టడీ సర్కిల్లో మంగళవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ హక్కుల ప్రాముఖ్యత నూతన సవాళ్లు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి డి.ఇందిర హాజరై మాట్లాడారు. సమాజంలో ప్రతి వ్యక్తికి గౌరవంతో జీవించే హక్కుతో పాటు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక హక్కులు రాజ్యాంగం ద్వారా పరిరక్షించబడుతున్నాయని తెలిపారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ వేధింపులు, ట్రాఫికింగ్, బాలల దుర్వినియోగం గృహహింస వంటి సమస్యలు అధికం అవుతున్నట్లు తెలిపారు. హక్కుల ఉల్లంఘనలు జరిగితే విద్యార్థులు ధైర్య ్డంగా ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయ పోరాటం చేయాలన్నారు. విద్యార్థులు చట్టపరమైన జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. క్వింటా ఆర్ఎన్ఆర్ రూ.2,839 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 5,700 క్వింటాళ్ల ధాన్యం రాగా.. ఆర్ఎన్ఆర్ క్వింటాలు గరిష్టంగా రూ.2,829, కనిష్టంగా రూ.1,674 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,866, కనిష్టంగా రూ.1,625, చిట్టి ముత్యాలు రూ.3,016, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,972, కనిష్టంగా రూ.1,950 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,659, కనిష్టంగా రూ.2,309 ధర వచ్చింది. కాగా.. బుధవారం ఉదయం మార్కెట్లో ఉల్లిపాయల బహిరంగవేలం నిర్వహించనున్నారు. -
ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు
● సాధారణ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు కాత్యాయనీదేవి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని జిల్లా పంచాయతీ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ విజయేందిరతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీపీ ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే గండేడ్, నవాబ్పేట, రాజాపూర్, మహమ్మదాబాద్, మహబూబ్నగర్ రూరల్ మండలాల పరిధిలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు ఈ ఐదు మండలాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులోకి వచ్చిందని, ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుమిగూడటం నిషేధమని చెప్పారు. 11వ తేదీ పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ మండలాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ర్యాండమైజేషన్ పూర్తి మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించిన మూడో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి సమక్షంలో కలెక్టర్ విజయేందిర నిర్వహించారు. ఈ జీపీల్లో పోలింగ్ కేంద్రాలకు విధులు నిర్వహంచే విధంగా ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, ట్రైని డీపీఓ నిఖిలశ్రీ, ఆర్డీఓ నవీన్ పాల్గొన్నారు. -
తొలి పరీక్ష..!
డీసీసీ చీఫ్లకు ‘పంచాయతీ’ సవాల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచార పోరు కొనసాగిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. మెజార్టీ పంచాయతీల్లో సర్పంచ్ వార్డు స్థానాలను కై వసం చేసుకుంటామనే నమ్మకం ఉంది. – సంజీవ్ ముదిరాజ్, డీసీసీ అధ్యక్షుడు, మహబూబ్నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా పోటీచేసిన వారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రెబల్గా వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తున్నాం. విడతల వారీగా కొనసాగుతున్న ఎన్నికల్లో కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. – కె.ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట ● మెజార్టీ జీపీల్లో గెలుపే మొదటి టాస్క్ ● నేతల మధ్య సమన్వయమే ప్రధాన సమస్య ● పలు నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా అసంతృప్త నేతలు ● పట్టించుకోని అధిష్టానం తీరుతో అలక ● అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ సత్తా చాటుతామంటున్న నూతన అధ్యక్షుల ధీమా సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నూతనంగా ఎన్నికై న అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పంచాయతీ పోరు సవాల్ విసురుతోంది. డీసీసీ చీఫ్లుగా నియామకమైన వెంటనే ఎన్నికలకు తెరలేవడం.. వారి సత్తాకు పరీక్షగా మారింది. మెజార్టీ పంచాయతీల్లో గెలుపే వారి తొలి టాస్క్ కాగా.. క్షేత్రస్థాయిలో సంగ్రామం బాట పట్టారు. పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో గ్రూప్లు.. అంటీముట్టనట్లుగా ఉన్న నేతలతో వారికి సమన్వయం కత్తిమీద సాములా మారినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత భర్త తిరుపతయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజీవ్రెడ్డి, నల్లారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి ఆశించారు. అధిష్టానం రాజీవ్రెడ్డికి అవకాశం కల్పించింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పలు గ్రామాల్లో పార్టీ మద్దతుదారులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గద్వాల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇదివరకే డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపాటుకి గురైన సరిత వర్గం.. తాజాగా ఎమ్మెల్యేతో కలిసి రాజీవ్రెడ్డి ప్రచారంలో పాల్గొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ జిల్లాలో పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు అటు సరిత, ఇటు బండ్ల వర్గానికి చెందిన మద్దతుదారుల మధ్యే పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాజీవ్రెడ్డి.. ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేయడంపై సరిత వర్గం గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నాగర్కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తన సొంత నియోజకవర్గం అచ్చంపేటకే పరిమితమయ్యారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు హీటెక్కింది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఏకమై మెజార్టీ గ్రామాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు సంబంధించిన వర్గాలు సైతం పోరులో నిలిచాయి. ప్రధానంగా వనపర్తి, గద్వాలలో చేతులు కలవని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడడం ఒకవైపు కాగా.. భర్తీ తరువాత అధిష్టానం కనీసం సంప్రదింపులు చేయకపోవడం, బుజ్జగించకపోవడం అసంతృప్త నేతలను మరింత నారాజ్లోకి నెట్టినట్లు సమాచారం. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పునర్నియామకమైన కె.ప్రశాంత్రెడ్డి కూడా జీపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ జిల్లా పరిధిలోని నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి.. మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి అన్నీ తామై తమ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం రూపొందించిన వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్గా బరిలో నిలిచిన వారిని పోటీ నుంచి విరమింపజేసేలా ప్రశాంత్కుమార్రెడ్డి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన సంజీవ్ ముదిరాజ్ పంచాయితీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నుంచి డీసీసీ పీఠాన్ని అధిరోహించాలని ఆశలతో ఉన్న వారిని సైతం కలుసుకొని సహకరించాలని కోరారు. ఆ వెంటనే జీపీ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలో రెండు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన శివసేనారెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోనే పంచాయతీ ఎన్నికల తంతు కొనసాగుతుందని చెప్పారు. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు
● సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా బందోబస్తు కేటాయింపు ● అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టండి ● ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలను కఠినంగా పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పరేడ్ మైదానంలో పోలింగ్బూతుల్లో భద్రత, రూట్ మొబైల్స్ టీంలు, క్యూఆర్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్, అన్ని బృందాలకు ఎన్నికల విధులపై అవగాహన శిక్షణ నిర్వహించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడి లేదా ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ స్టేషన్లు దగ్గర అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలతో పాటు మద్యం, డబ్బు పంపిణీలపై వంటి అక్రమాలపై నిఘా పెట్టాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా ఓటు వేయగల వాతావరణాన్ని కల్పించాలన్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులు, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమాచారం అందిన వెంటనే అధికారులు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడంతో పాటు ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ సమన్వయంతో పటిష్టంగా కొనసాగించాలన్నారు. చిన్నగొడవలనైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. ఎన్నిక వేళ ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రతి పోలీస్ యూనిట్ సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, గిరిబాబు, రమణారెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మొదటి విడత కింద 139 గ్రామ పంచాయతీల్లో ఏడు ఏకగ్రీవం కాగా 132 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో 28 సమస్యాత్మక, 104 సాధారణ, 167 పోలింగ్ లోకేషన్స్, 1,188 పోలింగ్ స్టేషన్స్ ఉండగా దీనికి 39 రూట్ మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. అలాగే 5 స్ట్రైకింగ్, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియామించారు. ఎస్పీ 1, అదనపు ఎస్పీలు 2, డీఎస్పీలు 3, సీఐ,ఆర్ఐలు 16, ఎస్ఐలు 57, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్ 167, కానిస్టేబుల్స్ 647, హోంగార్డులు 293 మందికి బందోబస్తు కేటాయించారు. -
కల్వకుర్తిలో భారీ చోరీ
40 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు అపహరణ కల్వకుర్తి టౌన్: వారం రోజులుగా తాళం వేసిన ఇంట్లో భారీ చోరి జరిగిన ఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని కేశవనగర్లో ఊర్కొండపేట ఆలయ పూజారి శ్రీనివాస్శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 30న తన భార్య కుమార్తెలతో కలిసి పుట్టింటికి వెళ్లగా, పూజారి ఊర్కొండపేట దేవాలయంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో పూజారి భార్య సోమవారం ఇంటికి వచ్చి చూడగా తలుపునకు ఉన్న తాళం విరిగొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి భర్తకు ఫోన్ చేసింది. బీరువాలోని 40 తులాల బంగారం, రూ.ఆరు లక్షల నగదు చోరీకి గురైనట్లు శ్రీనివాస్శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకట్రెడ్డి క్లూస్టీం ద్వారా ఆధారాలు సేకరించారు. సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, రాజశేఖర్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. -
ప్రత్యర్థుల అవమానం.. యువకుడి ఆత్మహత్యాయత్నం
గట్టు: మండల పరిధిలోని యల్లందొడ్డిలో సర్పంచ్ అభ్యర్థి అంపగాళ్ల జయసుధ కుమారుడు అంజి సోమవారం అత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. యల్లందొడ్డిలో సర్పంచ్ పదవికి ముగ్గురు మహిళలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో జయసుధ నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతులో పోటీ చేస్తున్నారు. ఆమె కుమారుడు అంజిని ఎన్నికల్లో నిలబడి గెలువగలరా అంటూ ప్రత్యర్థులు అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. దీంతో అంజి మనస్థాపం చెంది పురుగు మందు తాగాడు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. సెల్టవర్ ఏర్పాటు చేస్తామని డబ్బులు స్వాహా జడ్చర్ల: పొలంలో టవర్ ఏర్పాటు చేస్తామని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి డబ్బు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కవులాకర్ కథనం మేరకు.. మిడ్జిల్ మండలంలోని వస్పులకు చెందిన గొరిగె చంద్రశేఖర్ స్థానిక గౌరీశంకర్ కాలనీలో నివాసముంటున్నాడు. అతనికి గతనెల 18వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ పొలంలో వి1 టవర్ ఏర్పాటు చేస్తామని.. దాంతో మీకు అధిక మొత్తం అందుతుందని ఆశచూపించారు. ఇందుకుగానూ ప్రాసెసింగ్ ఫీజు, ట్యాక్స్, తదితరాల కోసం విడతల వారీగా రూ.45, 250 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. రూ.10లక్షలు మీ బ్యాంకు ఖాతాలో జమచేస్తామని నమ్మబలికారు. తర్వాత ఎన్ని పర్యాయాలు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో బాధితుడు నేషనల్ సైబర్ క్రైం టోల్ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ బాలిక మృతి తిమ్మాజిపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కర్నేకోట రేణుక(16) అనే బాలిక సోమవారం ఫిట్స్తో మృతి చెందింది. గ్రామానికి చెందిన యాదయ్య, తిరుపతమ్మ రెండో కుమార్తె రేణుకకు ఆదివారం ఫిట్స్ రావడంతో చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
చెరగని సిరా చుక్క
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటరు చేతివేలికి వేసే సిరా చుక్కకు ఓ లెక్కుంది. ఒకసారి ఓటేసిన ఓటరు మళ్లీ అదే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసిన ప్రత్యేక ఏర్పాటే ఇది. చేతివేలికి పెట్టే ఇంకు చుక్క కొన్ని రోజుల వరకు చెరిగిపోదు. శరీర తత్వాన్ని బట్టి కొందరికి నెలరోజుల వరకు కూడా ఉంటుంది. ఈ ఇంకును కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ తయారు చేస్తోంది. కౌన్సిల్ ఆప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇంకు ఉత్పత్తి కోసం 1962లో మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిడెట్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఇందులో 7.15 శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఈ మిశ్రమంతో కూడిన ఇంకును ఇతర రసాయనాలతో సులభంగా చెరిపివేయలేరు. ఎడమ చూపుడు వేలి గోరు పైభాగం నుంచి ఇంకు చుక్క వేస్తారు. -
ప్రచారం.. ఆర్థిక భారం
● రోజుకు రూ.200 నుంచి రూ.300 చెల్లింపుతో పాటు మద్యం, మాంసాహార విందులు ● జన సమీకరణ, ద్వితీయశ్రేణి నాయకులకు వెచ్చింపు ● ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్రులు సైతం ఖర్చుకు వెనుకాడని వైనం ‘మీ వార్డుకు ఎన్నికల ఖర్చు కింద రూ.10 వేల నుంచి రూ.15 వేల చొప్పున అందుతాయి. వీటితో స్థానికంగా ఖర్చు చూసుకోవాలి. మన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి’. ఇది ప్రస్తుతం పల్లెల్లో కొనసాగుతున్న ఎన్నికల ప్రచార తీరు. ఏ గ్రామంలో చూసినా స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. యువత నుంచి మొదలు వృద్ధుల వరకు అందరూ ఎన్నికలు మరి ఏం లేదా? అనే ప్రశ్న సంధిస్తున్నారు. దీంతో అభ్యర్థులు, వారి అనుచరగణం రోజు మద్యం, మాంసాహార విందులు ఏర్పాటు చేస్తున్నారు. ‘నీవు ప్రచారానికి 50 మందిని తీసుకురా.. ఒక్కొక్కరికి రూ.100 అని చెప్పు, కాదంటే రూ.200 వరకు పెంచు. ఉదయం, సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించి వెళ్లాలి. పార్టీ నేతలు వచ్చినప్పుడు జనం లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎంత మందిని తీసుకొస్తే అన్ని డబ్బులు ఇచ్చేస్తాం.’ పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మొదటి, రెండోవిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. పలు పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, వార్డుసభ్యులు జన సమీకరణ, ద్వితీయ శ్రేణి నాయకులకు డబ్బు వెచ్చించక తప్పని పరిస్థితి. ఎంత అభిమానం ఉన్నా.. ఎంతో కొంత ముట్టచెప్పకపోతే ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. కొందరు ప్రధాన పార్టీల మద్దతుదారులు కూలీలను మాట్లాడుకొని ప్రచారం సాగిస్తున్నారు. వాహన ర్యాలీకి రావాలంటే పెట్రోల్ పోయించాల్సి వస్తోంది. ఇందుకు కీలక నేతలు డబ్బులు పంచాల్సిన పరిస్థితి నెలకొంది. తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ● ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రామాలకు ప్రధాన పార్టీల నుంచి ఖర్చుల నిమిత్తం నగదు అందుతోంది. వార్డుకు ఓటర్ల సంఖ్య ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.15 వరకు పంపిస్తున్నారు. గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి జనాన్ని సమీకరించేందుకు ప్రత్యేకంగా కొందరిని నియమించుకొని ప్రచారం పూర్తికాగానే డబ్బులు ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచారం ఉదయం, సాయంత్రం ఎక్కువగా కొనసాగుతుండటం రోజువారీ కూలీలతో పాటు కొందరు పేదలకు ఆసరాగా మారింది. -
వెల్డింగ్ సిలిండర్ పేలి వృద్ధుడు మృతి
బిజినేపల్లి: వెల్డింగ్ గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన అమీర్ఖాద్రి (76) కొన్నేళ్లుగా ఇంటి వద్ద గ్యాస్ వెల్డింగ్ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రమాదవశావత్తు వెల్డింగ్ సిలిండర్ పేలి గాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం దేవరకద్ర: లారీ బైక్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మండలంలోని డోకూర్ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన సాలె బాల్రాజు (35) బ్యాంకు పని నిమిత్తం బైక్పై దేవరకద్రకు వచ్చాడు. పని ముగించుకొని తిరిగి కౌకుంట్లకు వెళ్తుండగా డోకూర్ శివారులోని కస్తూర్బా పాఠశాల రోడ్డు మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బావిలో పడి వ్యక్తి మృతి తెలకపల్లి: బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని చిన్నముద్దునూరు గ్రామానికి చెందిన గుండాల బాలకిష్టయ్య(51) ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రతిరోజు రాత్రి పడుకొని ఉదయం ఇంటికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గుడి వద్దకు వెళ్లాడు. సోమవారం ఉదయం ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు దేవాలయం పరిసర ప్రాంతాల్లో వెతకగా ఆవరణలోని బావిలో శవమై కనిపించాడు. మృతుడి భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ఎస్ఐ పేర్కొన్నారు. వ్యక్తి ఆత్మహత్య జడ్చర్ల: మండల పరిధిలోని అల్వాన్పల్లిలో వాడ్యాల బాలయ్య (55) సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. భార్య వెంకటమ్మ ఆవంచలోని తన చెల్లెలు వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న జంగయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
27 కాటన్ల మద్యం పట్టివేత
చిన్నంబావి: మండలంలోని భారీగా మద్యం పట్టుకున్న ఘటన మండలంలో చోటు చేసుకున్నది. ఎస్ఐ నాగరాజు వివరాలు ప్రకారం.. మండలంలో మియాపూర్ గ్రామంలో సప్తగిరి రైస్మిల్లో అక్రమంగా మద్యం ఉందని నమ్మదగిన వ్యక్తుల సమాచారం మేరకు 27 కాటన్ల మద్యం పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.56లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రూ.1.27 లక్షలు పట్టివేత అమరచింత: ఎన్నికల సందర్భంగా మస్తీపురం ఎక్స్రోడ్లో సోమవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా రూ.1.27లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ స్వాతి తెలిపారు. ఆత్మకూర్ పట్టణానికి చెందిన శ్రీనివాసులు తన వాహనంలో రూ.1.27లక్షలతో వెళ్తుండగా వాహనాన్ని తనిఖీ చేశామన్నారు. నగదుకు సంబంధించిన రసీదులు లేని కారణంగా డబ్బును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా రూ.50వేలకంటే అధికంగా తీసుకెళ్లారాదన్నారు. చెక్పోస్టు వద్ద నగదు పట్టివేత గోపాల్పేట: మండలంలోని బుద్దారం జిల్లా చెక్పోస్టు వద్ద పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. గోపాల్పేట ఎస్ఐ నరేశ్కుమార్ కథనం ప్రకారం.. అచ్చంపేట నుంచి కడపకు ఓ వ్యక్తి రూ.4,80,000 తరలిస్తుండగా డబ్బులకు సంబంధించిన పత్రాలు చూపించమని కోరారు. తాను గొర్రెలు కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు వెళ్తున్నానని చెప్పాడు. డబ్బుల తరలింపునకు సంబంధించి సరైన పత్రాలు చూపించాలని చెప్పారు. డబ్బులను ఉన్నతాధికారులకు అందిచనున్నామని తెలిపారు. ప్రజలు రూ.50వేల నగదుకు మించి డబ్బులను వెంట తీసుకెళ్లవద్దని తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్ వద్దులే..
● ఓటు గోప్యత లేక జంకుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పోస్టర్ బ్యాలెట్ అంటేనే పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది జంకుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, స్టేజ్–2, ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ అధికారులు, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ను జారీ చేస్తుంది. దీనిని ఉపయోగించుకుని వారు తమకు నచ్చినవారికి పెన్నుతో టిక్ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన తర్వాత అది సంబంధిత గ్రామ పంచాయతీ స్టేజ్–2 ఆఫీసర్కి ఓట్ల లెక్కింపు కంటే ముందు అందజేస్తారు. సదరు పోస్టల్ బ్యాలెట్ను తెరిచి అభ్యర్థులకు చూపిస్తారు. తనకు ఓటుపడిన అభ్యర్థికి సంతోషంగా ఉన్నా, ఓటు పడని అభ్యర్థులు ఆ ఉద్యోగిపై కక్షగట్టి, గొడవలు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెటుకు దరఖాస్తు చేసు కోవడానికి జంకుతున్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ రహస్యతకు భంగం వాటిల్లకుండా ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక పోలింగ్ బూత్ పెట్టాలని, ఓట్ల లెక్కింపు కంటే ముందే అందరి ఓట్లలో ఇవికూడా కలపాలని కోరుతున్నారు. -
విలువిద్యలో ప్రతిభ
●ఒలింపిక్లో పాల్గొనడమే లక్ష్యం చిన్నప్పటి నుంచి క్రీడల అంటే ఎంతో ఇష్టం. ఆరేళ్ల నుంచి ఆర్చరీలో కోచ్ జ్ఞానేశ్వర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న. భవిష్యత్లో దేశం తరఫున ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం. అందుకు నిరంతరం ప్రాక్టిస్ చేస్తున్న. – రమావత్ రవి, ఆర్చరీ క్రీడాకారుడు, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రానికి చెందిన రమావత్ రవి ఆర్చరీలో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆరేళ్ల నుంచి కోచ్ జ్ఞానేశ్వర్ వద్ద రవి ఆర్చరీలో మెరుగైన శిక్షణ తీసుకుంటున్నాడు. ఆర్చరీ పోటీల్లో ఇండియన్ రౌండ్లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. రమావత్ రవి ఆర్చరీ కెరీర్ ఇప్పటి వరకు 14సార్లు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్రస్థాయిలో 2024 వరంగల్లో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–19 రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ఇండియన్ రౌండ్లో బంగారు పతకం, సబ్ జూనియర్ పోటీల్లో బంగారు పతకం, హైదరాబాద్లో జరిగిన సీనియర్ పోటీల్లో బంగారు పతకం, ఈ ఏడాది జనవరిలో 12న హైదరాబాద్లో జరిగిన జూనియర్ ఆర్చరీ పోటీల్లో రజతం సాధించాడు. ఈ ఏడాది నవంబర్లో హైదరాబాద్ కొల్లూర్లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో కాంస్యం సాధించాడు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్ కొల్లూర్లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ ఆర్చరీ పోటీల్లో ఇండియన్ రౌండ్లో రవి మెరుగైన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. హైదరాబాద్లో ఈనెల 10 నుంచి 16వరకు జరిగే సీనియర్ నేషనల్ ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయస్థాయిలో నాలుగుసార్లు రమావత్ రవి ఇప్పటివరకు నాలుగుసార్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2023 మధ్యప్రదేశ్లో ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి పోటీల్లో ఇండియన్ రౌండ్లో పాల్గొన్నాడు. 2024లో గుజరాత్ రాష్ట్రం నడియాడ్లో ఎస్జీఎఫ్ అండర్–19 పోటీల్లో రజత పతకం సాధించాడు. జంషెడ్పూర్లో జరిగిన సీనియర్ నేషనల్, రాజస్థాన్లో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్లో పంజాబ్లోని గురుకాశి యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా ఆర్చరీ పోటీల్లో పాలమూరు యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. జాతీయ క్రీడల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉత్తరాఖండ్లో ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరిగిన 38వ జాతీయ క్రీడల్లో రవి పాల్గొన్నాడు. ఆర్చరీలో తెలంగాణ నుంచి పురుషుల విభాగంలో ఇద్దరు క్రీడాకారుల్లో రవి కూడా జాతీయ క్రీడల్లో పాల్గొనడం విశేషం రాష్ట్ర, జాతీయ స్థాయిలో రమావత్ రవి రాణింపు జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఈ నెల 10 నుంచి జరిగే సీనియర్ నేషనల్కు ఎంపిక -
బండమీదిపల్లికి వీడిన గ్రహణం
● తొలిసారి ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు ● 2018లో గ్రామపంచాయతీగా ఆవిర్భవించినా పోలింగ్ జరగని వైనం జడ్చర్ల టౌన్: మండలంలోని బండమీదిపల్లి గ్రామపంచాయతీకి తొలిసారి మూడోవిడతలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2018లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడినప్పటికీ జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్నందున 2019లో ఎన్నికలు జరగలేదు. 2020, డిసెంబర్తో జడ్చర్ల గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగిసి పురపాలికగా మారింది. దీంతో అనుబంధ గ్రామంగా ఉన్న బండమీదిపల్లి పంచాయతీగా ఏర్పడినప్పటికి ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించలేదు. 2020, డిసెంబర్ 20 నుంచి గ్రామపంచాయతీ పాలన ప్రారంభమై పంచాయతీ కార్యదర్శిని నియమించి ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. ఇన్నాళ్లకు ఎన్నికలు జరుగుతుండటంతో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేవు. ఈ గ్రామంలో 820 జనాభా, 498 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బీసీ జనరల్కు కేటాయించారు. సర్పంచ్తో పాటు 8 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ‘గ్రామపాలన’పై పాఠం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): విద్యార్థులకు గ్రామ పాలనపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో విధులు, విధానాలు, బాధ్యతలను వివరిస్తూ పాఠ్యాంశం రూపొందించింది. ఆరోతరగతి సాంఘికశాస్త్రం పార్ట్–2 పాఠ్య పుస్తకంలో 13వ పాఠ్యాంశంగా ‘గ్రామపంచాయతీలు’ శీర్షికన ఏడు పేజీల్లో ముద్రించారు. గ్రామస్తులకు సౌకర్యాల కల్పన, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం, గ్రామసభ, ఓటరు జాబితా, వార్డులు, రిజర్వేషన్లు, ఎన్నికలు, నిధులు, మండల పరిషత్, జిల్లా పరిషత్ తదితర వివరాలను ఈ పాఠ్యాంశంలో క్షుణ్ణంగా వివరించారు. ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు ఈ పాఠం చదివితే పూర్తి అవగాహన కలుగుతుందని పలువురు చెబుతున్నారు. -
ఖాళీ చేయించాం..
‘మహాకేఫ్’లో కేవలం టీ, ఐస్క్రీం మాత్రమే అందుబాటు లో ఉంచినట్లు మా పరిశీలనలో తేలింది. దీనిపై ఆర్పీ పద్మ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు నోటీసులిచ్చి ఇటీవల ఖాళీ చేయించాం. ఇక బేకరీ, తినుబండారాల తయారీపై హైదరాబాద్లో శిక్షణ తీసుకున్న 13మంది ఎస్హెచ్జీ మహిళలకు టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో అప్పగించాలని నిర్ణయించాం. అవసరమైన పదార్థాలు, ఇతర ముడిసరుకుల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణం సైతం ఇప్పిస్తాం. దీనిని బాగా నడిపిస్తే మహిళలకు ఎంతో ఉపాధి లభిస్తుంది. – మహమ్మద్ యూసుఫ్, మెప్మా పీడీ -
ఆరుతడికే సాగునీరు
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈసారి యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా చేపట్టనుండగా.. కనీసం 15 రోజులకు ఒకసారి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అత్యధికంగా 2,81,754 ఎకరాలకు ప్రస్తుత సీజన్లో సాగునీటిని అందించనున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెండింగ్ పనుల కారణంగా ఈసారి ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించారు. 15 రోజుల వ్యవధిలో.. యాసంగి సీజన్కు సాగునీటి వనరులను పకడ్బందీగా వినియోగించడంపై నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. యాసంగిలో వేరుశనగ, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి పంటకు ఈ సీజన్లో నీటి సరఫరా ఉండదు. వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని పరిమిత స్థాయిలో సరఫరా చేస్తారు. ప్రధానంగా తాగునీటి అవసరాల మేరకు తగినంత నిల్వ ఉంచుతూనే వారాబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే కనీసం 15 రోజుల వ్యవధిలో ఒకసారి ఆరుతడి పంటలకు నీటి సరఫరా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా కేఎల్ఐ.. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 3,70,469 ఎకరాలు ఉండగా.. యాసంగి సీజన్లో 2,81,754 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,01,317 ఎకరాల మేర ఆరుతడి పంటలతోపాటు మరో 80,437 ఎకరాలకు వరి సాగుకు నీటిని అందిస్తారు. అలాగే కోయిల్సాగర్ కింద 35,600 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆరుతడి పంటలకు 7,700 ఎకరాలకే పరిమితం చేశారు. భీమా లిఫ్ట్–1 కింద 82,523 ఎకరాలు ఉండగా కేవలం ఆరుతడికి 21,690 ఎకరాల్లో నీరందిస్తారు. భీమా లిఫ్ట్–2 సైతం 92 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 5,350 ఎకరాల్లో ఆరుతడి, 4,650 ఎకరాల్లో వరి పంటకు నీరందించనున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 1,09,296 ఎకరాలకు గాను ఆరుతడి కింద 20,014 ఎకరాలకు, వరి 6,910 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు గాను ఆరుతడికి 22,800 ఎకరాల మేరకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు రైతులు పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు. మరమ్మతుల నేపథ్యంలో.. ఆర్డీఎస్ కింద ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడే శాపంగా మారింది. ఆర్డీఎస్ హెడ్వర్క్స్ పెండింగ్ పనులు, మరమ్మతు కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించలేమని అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో 83,998 ఎకరాల ఆయకట్టు నీటి సరఫరా నోచుకోవడం లేదు. కనీసం వేరుశనగ, మొక్కజొన్న, కంది తదితర ఆరుతడి పంటలను సైతం సాగుచేసుకునే అవకాశం ఉండటం లేదు. యాసంగి పంటలకు సాగునీటి ప్రణాళిక ఖరారు వారబందీ పద్ధతిలో విడుదలకు నిర్ణయం కనీసం 15 రోజులకు ఒకసారి వదిలేలా చర్యలు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కేఎల్ఐ కింద 2.81 లక్షల ఎకరాలకు.. ఆర్డీఎస్ కింద పరిధిలో పంట విరామం ప్రకటన -
వందశాతం ఫలితాలు సాధించాలి: యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పదోతరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పోలీస్లైన్, ఎదిర, ఏనుగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ కంటెంట్కు సంబంధించి ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చదువుకోగలిగేలా పాఠ్యాంశాలు, వీడియో పాఠాలు ప్రాక్టీస్ బిట్స్ వంటివి అందుబాటులోకి తెచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యావకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్, మాజీ కౌన్సిలర్లు తోకల యాదమ్మ, మహ్మద్ మోసిన్, రాషెద్ఖాన్, ఖాజాపాషా, నాయకులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పాలమూరు: విద్యార్థుల ఆలోచనలు నిరంతరం ఉత్తమ భవిష్యత్ వైపు పరుగెత్తాలి తప్పా మరో ధ్యాస ఉండడరాదని, గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి ప్రణాళిక ప్రకారం చదువుపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సూచించారు. నగరంలోని బండమీదిపల్లిలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం పలు రకాల చట్టాలతో పాటు పోక్సో, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థికి ఎప్పుడూ కెరీర్పై ఫోకస్ ఉండాలని, ఇతర అంశాలు కాదన్నారు. సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. డీసీపీఓ నర్మద, సద్దాం హుస్సెన్, కలీం పాల్గొన్నారు. 19 నుంచి స్వయం ఉపాధి శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఈనెల 15వ తేదీ నుంచి 19వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అఽధికారి ఎస్.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కో ర్సు, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొ న్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని, శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారు సర్టిఫికెట్ ఇస్తారని వివరించారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 14 తేదీ లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు కేంద్రం ఇన్చార్జి రవీందర్రెడ్డి (9440788502)ని సంప్రదించాలని కోరారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,839 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డు కు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 9వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,839, కనిష్టంగా రూ.1,660 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,681, సోనామసూరి రూ.2192, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,921, ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2702, కనిష్టంగా రూ.2,459, సోనామసూరి గరిష్టంగా రూ.2,371, కనిష్టంగా రూ.2,301, హంస గరిష్టంగా రూ.1,950, కనిష్టంగా రూ.1,859గా ధరలు లభించాయి. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
● కలెక్టర్ విజయేందిరబోయి రాజాపూర్/జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న నిర్వహించే మొదటి విడత ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణ తరగతుల్లో పాల్గొని ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన రాజాపూర్ మండలంలోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను పరిశీలించారు. స్టేజ్ 2 అధికారుల ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు పూర్తయినట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు. ఎంపీడీఓ విజయలక్ష్మి, డీటీ భారతి, స్టేజ్ 2 అధికారులు ఎల్లయ్య, మోజెస్ తదితరులు ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో ఓటు సద్వినియోగం గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండి, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, పోస్ట్ద్వారా బ్యాలెట్ పొందే అవకాశం లేనివారు, పోస్టల్ బ్యాలెట్ వసతి వాడుకోలేని వారు ఫారం–14 తీసుకొని నేరుగా తమ ఓటుహక్కున్న మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఓటు వేయొచ్చని కలెక్టర్ విజయేందిర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం జిల్లాలో మొదటి విడత డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించే గండేడు, మహమ్మదాబాద్, నవాబుపేట రాజాపూర్, మహబూబ్నగర్ మండలాల్లో 9న, రెండో విడత జరిగే హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్కొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల వారు 12వ తేదీన, మూడో విడత జరిగే అడ్డాకుల, ముసాపేట, భూత్పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో ఈనెల 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరుకు పోస్టల్ బ్యాలెట్ సమర్పింవచ్చని తెలిపారు. ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తూ జిల్లాలో ఓటుహక్కు కలిగిన ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు పేర్కొన్నారు. జిల్లా, మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తూ, తమ సొంత మండలంలో ఓటుహక్కు కలిగిన ఉద్యోగులందరూ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. -
టోకెన్ల విధానంపై ప్రత్యేక దృష్టి ఏదీ ?
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం పంపిణీ చేయడానికి టోకెన్ల విధానం వాడుతుంటారు. ఈ ఎన్నికల్లో టోకెన్ల విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి మద్యం దుకాణంపై నిఘా ఏర్పాటు చేసి ఎవరైనా ఈ విధానం అమలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు బాల్క్గా సేల్స్ ఉండరాదు. ఇళ్లలో, పాత భవనాలలో మద్యం నిల్వలు ఉంటే తనిఖీలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో వీటిపై ఆశించినస్థాయిలో నిఘా కానీ సోదాలు కనిపించడం లేదు. గ్రామాల్లో చిన్నచిన్న కిరాణ దుకాణాలు బార్లను తలపిస్తున్నాయి. అన్ని పార్టీలు బహిరంగంగానే మద్యం తరలిస్తున్నా.. మద్యం అమ్మకాలు భారీస్థాయిలో జరగాలనే ఉద్దేశంతో సదరుశాఖ అధికారులు నామమాత్రపు చర్యలకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. -
ముచ్చటగా 3 నెలలకే..!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ జంక్షన్లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘మహా కేఫ్’ నిర్వహణ లేమితో ముచ్చటగా మూడు నెలలకే మూతబడింది. వాస్తవానికి దీనిని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.ఏడు లక్షలతో నిర్మించారు. ఇందులో మెప్మా తరఫున నవభారత్ పట్టణ సమాఖ్య రూ.2.23 లక్షలను భరించగా అనంతరం ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ఈ క్రమంలోనే ఆగస్టు 18న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే హడావుడిగా హనుమాన్పురాకు చెందిన ఆర్పీ పద్మకు మెప్మా అధికారులు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె సొంతంగా రూ.1.25 లక్షలు వెచ్చించి ఫర్నిచర్ (ర్యాక్స్)తో పాటు తినుబండాల తయారీకి ఉపయోగించే పరికరాలను కొనుగోలు చేశారు. అందులో టీ, స్నాక్స్, ఐస్క్రీమ్స్, కూల్డ్రింక్స్ అందుబాటులో ఉంచారు. అక్కడ సువిశాలమైన స్థలం ఉండటంతో ఆరుబయట ఎవరు వచ్చినా కూర్చోవడానికి ఏర్పాట్లు సైతం చేశారు. ఎక్కువ గిరాకీ ఉండటంతో.. నగరం నడిబొడ్డున ముఖ్యకూడలిలో ‘మహా కేఫ్’ ఉన్నందున ప్రతి నిత్యం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు గిరాకీ అయ్యేది. ఇక్కడ అడ్డా బాగుందని కొందరు మాజీ కౌన్సిలర్లు తాము సూచించిన వారికే నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయసాగారు. దీంతో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఇటీవల మెప్మా అధికారులను పిలిపించుకుని ఆరా తీశారు. దీనిని కేవలం ఎస్హెచ్జీ మహిళలకు మాత్రమే అప్పగించాలని ఆదేశించారు. ముఖ్యంగా గతంలో బేకరీ, తినుబండారాల తయారీపై శిక్షణ తీసుకున్న 13 మందిలో ఎవరు ముందుకొచ్చినా, వారికి ఇ వ్వాలని సూచించారు. అనంతరం మెప్మా పీడీ మహమ్మద్ యూసుఫ్ అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చి పూర్తి నివేదిక సమర్పించారు. దీంతో 13 మందిలో కనీసం ముగ్గురికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆర్పీ పద్మ చివరకు గత నెల 21 నుంచి ‘మహా కేఫ్’ను మూసివేశారు. తాను సొంతంగా ఫర్నిచర్కు పెట్టిన ఖర్చులను తిరిగి చెల్లిస్తేనే తాళం చెవి అప్పగిస్తానని మెప్మా అధికారులకు బదులివ్వడం గమనార్హం. ఇలా మొండికేయడంతో ఆమైపె పోలీసు కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. జిల్లాకేంద్రంలోమూతబడిన ‘మహాకేఫ్’ ఆగమేఘాల మీద ప్రారంభించిన అధికారులు ఆ తర్వాత నిర్వహణ లేమితో చేతులెత్తేసిన వైనం తాళం చేతులు అప్పగించని హనుమాన్పురా ఆర్పీ ఎస్హెచ్జీలు మాత్రమే నిర్వహించాలన్న ఉన్నతాధికారులు -
‘కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపునకు కృషి చేయాలి’
జడ్చర్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ముదిరాజ్ పేర్కొన్నారు. శనివారం జడ్చర్లలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల తరఫున ప్రచారాలను ముమ్మరం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్యాదవ్, మాజీ ఎంపీపీ నిత్యానందం, నాయకులు వెంకటేశం, మినాజ్, గోప్లాపూర్ యాదయ్య, ప్రవీన్, చందు, మదుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
పండగ సాయన్న వర్ధంతిని ఘనంగా నిర్వహిద్దాం
మెట్టుగడ్డ: పండుగ సాయన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుందామని బీసీ జేఏసీ చైర్మన్ బెక్కెం జనార్దన్ తెలిపారు. శనివారం టీఎన్జీవో భవన్లో మన ఆలోచన సాధన సమితి సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆనాటి తెలంగాణ సమాజంలోని జమీందారుల భూస్వాముల పెత్తందారితనాన్ని ప్రశ్నించిన పండుగ సాయన్నను స్మరించడం పాలమూరు ప్రజల బాధ్యత అని పేర్కొన్నారు. పండుగ సాయన్న నిజాం నిరంకుశ ఆధిపత్యాన్ని నిలదీశారని, పేదవర్గాలు జీవించే హక్కు కోసం నిరంతరం పోరాటం చేశారని, వెనకబడిన కులాల ఆత్మగౌరవం కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. మన ఆలోచన సాధన సమితి ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య మాట్లాడారు. ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆదివారం టీఎన్జీవో భవన్లో మధ్యాహ్నం 1:30కు నిర్వహించే వర్ధంతి సభకు బీసీలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మన ఆలోచన సాధన సమితి నాయకులు విద్యాసాగర్ ముదిరాజ్, బ్రహ్మయ్య, నరహర చారి, విట్టలయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్కు ఘననివాళి
అంబేడ్కర్ వర్ధంతిని శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో విగ్రహానికి, కాంగ్రెస్ కార్యాలయంలో చిత్రపటానికి ఎమ్మెల్యేతోపాటు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. సిగ్నల్గడ్డ చౌరస్తాలో అంబేడ్కర్ చిత్రపటానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లాకేంద్రంలో రాజకీయ నాయకులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేశవులు, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహయ్య, అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కమిటీ, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మోహన్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదయ్య ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో కాంస్య విగ్రహానికి, పాతపాలమూరులోని జై భీమ్ చౌరస్తాలో విగ్రహానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదివిష్ణువర్ధన్ ఆధ్వర్యంలో, ఏను గొండలో విగ్రహానికి ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్, బార్ అసోసియేషన్ భవ న్లో అధ్యక్షుడు అనంతరెడ్డి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. – నెట్వర్క్, సాక్షికాంగ్రెస్ కార్యాలయంలో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సిగ్నల్ గడ్డ చౌరస్తాలో నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి -
పోలింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విధులు కేటాయించిన పోలింగ్ సిబ్బందికి సకాలంలో నియామక ఉత్తర్వులు అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. శనివారం కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయనీదేవితో కలిసి రెండోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని పేర్కొన్నారు. రెండోదశ ఎన్నికలు జరిగే మండలాల్లో 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి 1,601 పీఓలకు, 1902 ఓపీఓలు మొత్తం 3503 మందికి రాష్ట్ర ఎన్నికల సంఘం టీపోల్ పోర్టల్ సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆఱర్డీఓ నవీన్, తదితరులుపాల్గొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లా అంతటా గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ విజయేందిర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా సంబంధిత గ్రామాలు, మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని, మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోతుందని తెలిపారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు!
చిన్నచింతకుంట: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని పలు గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేయనున్నాయి. అందుకు పలు గ్రామాల్లో పొత్తులు ఏర్పర్చుకున్నారు. చిన్నచింతకుంట, పర్ధిపురం గ్రామాల్లో బీజేపీ మద్దతు సర్పంచు అభ్యర్థులు అలాగే దమగ్నపురం, ఏదులాపురంలో బీజేపీ సర్పంచు అభ్యర్థులు శనివారం నామినేషన్లు విరమించుకున్నారు. చిన్నవడ్డెమాన్లో బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేయలేదు. చిన్నచింతకుంట, పర్ధిపురం, బీజేపీ పార్టీకి సర్పంచు పదవి, బీఆర్ఎస్కు ఉపసర్పంచులు అలాగే దమగ్నపురం, చిన్నవడ్డేమాన్, ఏదులాపురంలో బీఆర్ఎస్కు సర్పంచు పదవి, బీజేపీకి ఉపసర్పంచ్ పదవులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పీయూలో స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో భూమి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ మ్యాథ్స్ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మాక్ పోలింగ్ నవాబుపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ఈనెల 11న జరగనుంది. కాని ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ముగిసిందంటున్నారు. అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇది నిజంగా పోలింగ్ కాదు.. కాని అచ్చం అదే తరహాలో చిన్నారులు పంచాయతీ పోరును కళ్లకు కట్టినట్టు పోలింగ్ తీరును మాక్ పోలింగ్ రూపంలో చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శనివారం మండల కేంద్రంలో సిద్ధార్థ ప్రైవేట్ పాఠశాలలో మాక్పోలింగ్ నిర్వహించి విద్యార్థులకు పంచాయతీ పోరుపై అవగాహన కల్పించారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
చిన్నచింతకుంట: వరిధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డీపీఎం రామ్మూర్తి మండల మహిళా సమాఖ్య అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిస్తే వరి ధాన్యం తడిసిపోతుందన్నారు. కొనుగోలు చివరి దశలో ఉందని కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య ఏపీఎం నాగమణి, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
అవినీతి నిరోధక శాఖ అవగాహన ర్యాలీ
మహబూబ్నగర్ క్రైం: ప్రభుత్వ శాఖలలో ఎవరూ కూడా డబ్బులు ఇచ్చి పనులు చేసుకోవడం చేయరాదని, ఎవరైనా అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ అన్నారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాధితులు 1064 టోల్ఫ్రీతో పాటు 9440446106 వాట్సాప్లో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ఇతర సోషల్ మీడియా, క్యూ ఆర్కోడ్ నుంచి ఏసీబీ అధికారుల సమాచారం ఇవ్వడానికి ప్రస్తుతం అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రతిఒక్కరూ సరైన పద్ధతిలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి పనులు చేసుకోవడానికి చైతన్యం కావాలన్నారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐ లింగస్వామి, ప్రిన్సిపాల్ భగవంతచారి పాల్గొన్నారు. -
పోరుబాట ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం..
సాయి ఈశ్వర్ మృతితోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. పోరు బాట ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం. పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు కూడా సర్పంచ్, వార్డులకు సంబంధించి జనరల్ స్థానాల్లో ఎంత మంది బీసీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో జాబితా వెల్లడించాలి. – రాచాల యుగంధర్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
పోలీస్శాఖలో హోంగార్డుల సేవలు కీలకం
మహబూబ్నగర్ క్రైం: క్రమశిక్షణ, నిజాయితీతో పని చేస్తున్న హోంగార్డుల సేవలు పోలీస్శాఖలో ఎంతో కీలకమని, జిల్లాలో 208 మంది అంకితభావంతో పని చేస్తున్నారని ఎస్పీ డి.జానకి అన్నారు. 63వ హోంగార్డ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరేడ్ మైదానంలో శనివారం ప్రత్యేక కవాతు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లా డుతూ ట్రాఫిక్ నియంత్రణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, అత్యవసర సమయంలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోంగార్డ్స్ సంక్షేమం, గుర్తింపు ప్రోత్సాహం పెంపొందించడంలో ముందుండి పని చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ హోంగార్డుల ను ఘనంగా సన్మానించారు. అలాగే మృతి చెందిన నలుగురు హోంగార్డ్ కుటుంబాలకు ఆర్థిక సహా యం అందించారు. ఏడాది కాలంలో ఉత్తమ సేవలు అందించిన 40మంది హోంగార్డ్స్కు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యాత్మక గ్రామాలపై నిఘా
నవాబుపేట: సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచి పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని అడిషనల్ ఎస్పీ రత్నం అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వివరించారు. కారుకొండ, ఇప్పటూర్, యన్మన్గండ్ల సమ స్యాత్మకంగా ఉన్నయాని, వాటికి ప్రత్యేక సిబ్బందితోపాటు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎన్నికల నిబంధలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజాపూర్: ప్రతిఓటరు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని చొక్కంపేట్లో ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు డబ్బు, మద్యం ఉచితాల బహుమతులనే ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. జడ్చర్ల రూరల్సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ శివానందంగౌడ్ పోలీసులు పాల్గొన్నారు. భూత్పూర్: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు పండుగలా శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్ఐ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని ఎల్కిచర్లలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా సురక్ష పోలీసు కళాబృందం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, షీటీంలు, పోలీసు అధికారుల ఽఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. -
పోరాడి సాధించుకుందాం.. ఆత్మహత్యలు వద్దు..
సాయి ఈశ్వరాచారి మృతి బాధించింది. పాలకుల మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం. దశల వారీ పోరాటాలకు సిద్ధం. పూలే, పండుగ సాయన్న బాటలో ముందుకు సాగుతాం. బీసీలు అడగకముందే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పి.. మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకుందామే తప్ప.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈశ్వర్ చారి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. – బెక్కం జనార్దన్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఇప్పటికై నా మేల్కోవాలి.. బీసీలకు రాజ్యాధికారం రావడం కష్టమని భా వించి సాయి ఈశ్వర్ చారి బలిదానం కావ డం బాధేస్తోంది. బీసీల కు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మోసం చేసింది. 17 శాతానికే పరిమితం చేయడం దారుణం. బీసీలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికై నా మేల్కోవాలి. లేకుంటే పోరు బాట తప్పదు. మాకు ఉద్యమం కొత్త కాదు.. బీసీలందరం ఏకమై సత్తా ఏంటో చూపిస్తాం. – శ్రీనివాస్ సాగర్, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
ఘనంగా శ్రీనివాసుడి కల్యాణం
దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి దేవాలయ ప్రాంగణంలో శ్రీనివాసుడి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీగా నిర్వహిస్తున్న వేడుకను వేలాదిమంది భక్తులు తిలకించారు. ఉదయం ఆంజన్నకు పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక కృషి మహబూబ్నగర్ క్రీడలు: క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారించిందని, జిల్లాలో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. వారణాసిలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన జిల్లా ఆర్చరీ క్రీడాకారులు సమీక్ష, శార్వాణి, జి.సమీక్ష, ఆయేషా సిద్ధిఖీ, సాయి మనీశ్వర్, శ్రావణి, కృతిక్ శ్రీవాత్సవ్, స్మృతి సన్నిభాలను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్నగర్ నుంచి దేశస్థాయిలో ప్రతిభ ప్రదర్శించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.కార్యక్రమంలో మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్, ఆర్చరీ కోచ్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. పరిశోధనలకు పెద్దపీట వేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పరిశోధనలకు పెద్దపీట వేయాలని వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఐపీఆర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పరిశోధన వాతావరణం నెలకొల్పాలని, ఐపీఆర్ హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. కీనోట్ స్పీకర్ కేఆర్ పౌల్ మాట్లాడుతూ.. ఐపీఆర్ అనేవి వ్యక్తులు తమ ఆలోచనలను ఉపయోగించి, వస్తువులు ఇతర పరికరాలు తయారుచేస్తే వాటిని హక్కు లు కల్పిచేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వివిధ రకాల పేటెంట్లకు విదేశాల్లో చట్టపరమైన భద్రత ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, మధుసూదన్రెడ్డి కుమారస్వామి, రాజశేఖర్ పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలి
మెట్టుగడ్డ: బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించి బీసీల రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వలేమని, పార్టీపరంగా ఇస్తామని ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ప్రకటించిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ఆ మాటే మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ స్థానాల్లో ఎంతమంది బీసీ అభ్యర్థులకు మద్ధతు ఇస్తున్నారో వారి జాబితా వెల్లడించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగినందుకే సాయి ఈశ్వర్చారి ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని, అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 5,380 సర్పంచ్ స్థానాలు దక్కేవని, రిజర్వేషన్లు 17 శాతానికి తగ్గించడంతో బీసీలు రాజకీయంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు భరత్, వీవీగౌడ్, అంజన్న యాదవ్, శివ, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేశ్, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాయి ఈశ్వర్చారిని బలితీసుకున్న కాంగ్రెస్’
మెట్టుగడ్డ: రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ 42శాతం రిజర్వేషన్లు రాదేమోనన్న ఆందోళనలో ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్చారి మృతికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని స్వర్ణకారుల సంఘం పట్టణాధ్యక్షుడు రమేషాచారి ఆరోపించారు. ఆత్మబలిదానం చేసుకున్న సాయిఈశ్వర్ చారి మృతికి నిరసనగా జిల్లా కేంద్రంలో స్వర్ణకారులు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. దుకాణాలు బంద్ చేసి ర్యాలీగా క్లాక్టవర్ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, శ్రీకాంత్ చారి, రేణుక చారి, రాజుచారి, నర్సింహాచారి, కిరణ్ చారి, సుధాకర్ చారి తదితరులు పాల్గొన్నారు. -
మా ఓటు బీసీలకే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్పై మళ్లీ లొల్లి మొదలైంది. హైదరాబాద్లో సాయి ఈశ్వర్ చారి మృతితో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయా సంఘాలకు చెందిన పలువురు నేతలు ఆయనది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే అని ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వగా.. వేడి రాజుకుంది. పంచాయతీ పోరు మొదటి విడతలో ప్రచారం హోరెత్తుతుండగా.. రెండో దశకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తి కాగా.. నేటి నుంచి ప్రచారం మొదలు కానుంది. చివరి దఫాకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇలా పంచాయతీ సంగ్రామం కీలక ఘట్టానికి చేరుకున్న క్రమంలో మళ్లీ బీసీ లొల్లి రాజుకోవడం రాజకీయ పార్టీలను కలవరానికి గురి స్తోంది. 42 శాతం ఏమైంది.. స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లగా.. హైకోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. నోటిఫికేషన్ వెలువడే రోజు రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటొద్దనే సుప్రీంకోర్టు సూచనలతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో బీసీ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రం చేసే దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని.. ప్రస్తుతం చట్టపరంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ మేరకు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మూడు దశల పల్లె పోరు కీలక ఘట్టానికి చేరుకోగా.. బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపు ఎంతవరకు వచ్చిందంటూ బీసీ సంఘాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సంఘటితంగా పోరు బాట.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ సంఘాలు, వెనుకబడిన తరగతులకు చెందిన కులసంఘాలు సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధానంగా బీసీ సంక్షేమ, బీసీ సమాజ్, బీసీ పొలిటికల్ జేఏసీ, మున్నూరు కాపు, ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ, బీసీ లెక్చరర్ల ఫోరం, విశ్వకర్మ, బీసీ మేధావులు, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక తదితర సంఘాలు ఏకమై బీసీ ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. రెండు దశలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ.. చివరి దశలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామన్న అధికార కాంగ్రెస్ నేతల హామీ ఏమైంది అంటూ బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు మద్దతు ప్రకటించడం వరకు మాత్రమే బీఆర్ఎస్, బీజేపీ పరిమితమా అని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఈశ్వరాచారి ఆత్మహత్యకు యత్నించడం.. చికిత్సపొందుతూ ఆయన మృతి చెందడం వెనుకబడిన వర్గాల్లో విషాదం అలుముకుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వడంతో మళ్లీ సెగ రాజుకున్నట్లు తెలుస్తోంది. -
మెరుగైన వైద్యం అందించాలి
మిడ్జిల్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ సందర్శించారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ప్రసవాలను పెంచాలని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆయన వెంట వైద్యాధికారి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు స్వెట్టర్లు పంపిణీ స్టేషన్ మహబూబ్నగర్: వివేకానంద విద్యానికేతన్ రిటైర్డ్ టీచర్స్, పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మున్సిపల్ కార్మికులకు స్వెట్టర్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికుల శ్రమను గౌరవిస్తూ మున్సిపల్ కార్యాలయం, అశోక్ టాకీస్ చౌరస్తా, వన్ టౌన్ చౌరస్తా, శ్రీనివాసకాలనీ, బీకేరెడ్డికాలనీ, భగీరథ కాలనీ, రాజేంద్రనగర్తోపాటు పట్టణంలోని పలుచోట్ల దాదాపు 500మందికి వెచ్చని టోపీలు, మఫ్లర్లు అందజేసినట్లు ప్రతినిధులు తెలిపారు. సమాజంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికులు చలికాలంలో ఇబ్బంది కలగకుండా వారికి కొంత ఉపశమనం అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. భక్తిశ్రద్ధలతోఅయ్యప్ప పడిపూజ గండేడ్: మండలంలోని వెన్నాచేడ్లో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన బోయిని గోపాల్, గురుస్వాములు శ్రీనివాస్, రాజశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహించగా.. అయ్యప్ప నామస్మరణతో గ్రామమంతా మారుమోగింది. హన్వాడ, మహమ్మదాబాద్, కోస్గి, గండేడ్ మండలాల నుంచి అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదానం బిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గురుస్వాములు చెన్నయ్య, రవి, లక్ష్మీకాంత్రెడ్డి, బాల్రాజ్, గోవర్దన్, పాండు, పెంట్యానాయక్, మారుతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఎన్నిక జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా కార్యవర్గాన్ని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ శనివారం జి ల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ప్రకటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడిగా నాగరాజుగౌడ్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనున్నకున్నారు. అధ్యక్షుడిగా నాగరాజుగౌడ్, జిల్లా కార్యదర్శిగా సతీశ్కుమార్ రెడ్డి, కోశాధికారిగా రఘు, ఉపాధ్యక్షులుగా పవన్కుమార్రెడ్డి, భాస్కర్రావు, శేఖర్, మెహరాజ్, సంయుక్త కార్యదర్శులుగా రవీందర్గౌడ్, జాఫర్, ప్రభాకర్, వెంకటేశ్, కార్యవర్గ సభ్యులుగా మాణిక్రావు, ప్రశాంత్, వేణుగోపాలచారి, వెంకటయ్యతోపాటు తదితరులు ఎన్నికయ్యారు. -
ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,739
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 15వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. అత్యధికంగా 13,376 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.1,689 ధరలు పలికాయి. హంస గరిష్టంగా రూ.1,821, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,951, కనిష్టంగా రూ.1701, పత్తి గరిష్టంగా రూ.6,177, కనిష్టంగా రూ.4,379, వేరుశనగ రూ.7,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,671, కనిష్టంగా రూ.2,359, సోనామసూరి గరిష్టంగా రూ.2,353, కనిష్టంగా రూ.2,129గా ధరలు పలికాయి. -
ఒరిగిన చెన్నకేశవస్వామి ఆలయ ముఖద్వారం
జడ్చర్ల: మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ముఖద్వారం వరి ధాన్యం బస్తాలతో వెళ్తున్న ఓ లారీ అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి కోడ్గల్ గ్రామం వైపు నుంచి ముఖద్వారం కిందుగా 167నంబర్ జాతీయ రహదారిపైకి వస్తుండగా లారీలో వరి ధాన్యం బస్తాలు ఎత్తుగా ఓవర్లోడ్ ఉన్న కారణంగా ఎత్తు బస్తాలు ముఖద్వారాన్ని ఢీ కొనడంతో ఒక్కసారిగా ముఖద్వారం పునాధులు కదిలి ముందు వైపునకు ఒరిగిపోయింది. ముఖద్వారం ఏ క్షణమైనా నేలకూలే ప్రమాదం ఏర్పడింది. దీంతో ముఖద్వారం కిందుగా కోడ్గల్, తదితర గ్రామాలపైపు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. -
ఓటులోనూ నారీ శక్తి!
సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో మహిళలే అధిక సంఖ్యలో పోటీలో ఉండగా.. ఓటర్లుగానూ పురుషుల కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఫలితంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసేలా మహిళాశక్తి పనిచేయనుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్.. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం సర్పంచ్, వార్డు స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండగా, ఈ మేరకు స్థానాలన్నింటిలో మహిళలే అభ్యర్థులుగా బరిలో ఉంటున్నారు. వీటితోపాటు జనరల్ స్థానాల్లోనూ కొన్నిచోట్ల మహిళలు పోటీలో ఉంటున్నారు. గతంలో మహిళ రిజర్వేషన్ ఉన్నచోట్ల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు ఈసారి రిజర్వ్ కాకపోయినా పోటీలో ఉంటున్నారు. అలాగే ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు జనరల్ స్థానాల్లోనూ తమ సతీమణులను బరిలో దింపుతున్నారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కారణంగా 50 శాతం స్థానాలతోపాటు మిగతా రిజర్వ్ కాని చోటా మహిళలు పోటీచేస్తుండటంతో 50 శాతానికి మించి మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. సంఘాలతో సంప్రదింపులు.. గ్రామాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా మహిళా ఓటర్లు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానికంగా మహిళల సమస్యలపై దృష్టిసారించి హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో త్వరితగతిన పరిష్కారానికి వీలున్న వాటిని పూర్తిచేసేందుకు సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభావిత వర్గంగా మహిళా శక్తి ఎన్నికల బరిలో 50 శాతంపైగా వారిదే హవా జనరల్ స్థానాల్లోనూ పోటాపోటీ ఇటు ఓటర్లు గానూ మెజార్టీ స్థాయిలో.. -
గిరిజన గురుకులంలో విద్యార్థినులతో వెట్టిచాకిరి
జడ్చర్ల: మండలంలోని రిజన గురుకులం విద్యాలయంలో విద్యార్థినులతో వెట్టి చాకిరి చేయించిన ఘటనలు శనివారం వెలుగులోకి వచ్చాయి. గురుకుల విద్యాలయంలో ఓ విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటనలో వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం, తదుపరి ఆమెతో పాటు ప్రిన్సిపాల్ రజనీపై కూడా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో చేయించిన వెట్టి పనులకు సంబంధించిన ఫొటోలను తల్లిదండ్రులు బహిర్గతం చేశారు. సొంత కార్లను నీటితో కడిగించుకోవడం, తరగతి గదులను ఊడ్పించడం, వంటపాత్రలను శుభ్రం చేయించడం తదితర పనులను విద్యార్థినుల చేతనే చేయించే ఫొటోలున్నాయి. ఇన్నాళ్లు ఈ కష్టాలను అనుభవిస్తున్నా.. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ భయంతో బయటకు వెళ్లగక్కే పరిస్థితి లేకపోయినట్లు తెలిసింది. సంబంధిత ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు కూడా విద్యార్థినులు వారికి విషయం చెప్పడానికి భయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి గురుకులాల్లో చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
4జీపీలు, 110వార్డులు ఏకగ్రీవం
● ముగిసిన రెండో విడత ఉపసంహరణ ● అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ● నేటినుంచి ఊపందుకోనున్న ప్రచారం పాలమూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ఉపసంహరణ శనివారంతో ముగిసింది. కోయిలకొండ మండలంలో మొత్తం 55మంది సర్పంచ్ అభ్యర్థులు, 58వార్డు మెంబర్లు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అదేవిధంగా మండలంలో 44గ్రామ పంచాయతీలు ఉండగా 4జీపీలు ఒకే నామినేషన్ రావడంతో ఏకగీవ్రమయ్యాయి. హనుమాన్గడ్డ తండా సర్పంచ్గా మాణిక్యమ్మ, పలుగుతండా సర్పంచ్గా సునీత, సంగనోనిపల్లి సర్పంచ్గా మేఘనాథ్, నక్కవానికుంట తండా సర్పంచ్గా అనసూయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతోపాటు 110వార్డు మెంబర్లు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఇక 270వార్డులకు 729మంది పోటీలో ఉండటం విశేషం. అదేవిధంగా 40సర్పంచ్ స్థానాలకు 135మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడత ఈనెల 14న జరిగే ఎన్నికల కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం అన్నిరకాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 27వార్డు సభ్యులు ఏకగ్రీవం దేవరకద్ర: మండలంలో 18 గ్రామ పంచాయతీలకుగాను రెండు గ్రామాల్లో సర్పంచ్లు, 27 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. నార్లోనికుంట్ల సర్పంచ్గా లక్ష్మీదేవమ్మ, 8 వార్డులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బస్వాపూర్ సర్పంచ్గా నవనీత, 8 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. మిగతా 16 జీపీలకుగాను 49మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 141 వార్డులకుగాను 336 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్ల పరిశీలన అడ్డాకుల: మూసాపేట, అడ్డాకుల మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను శనివారం అధికారులు పరిశీలన చేపట్టారు. అడ్డాకుల మండలంలో 17 జీపీలకు 119 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పరిశీలనలో 29 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. వార్డు స్థానాలకు 396 నామినేషన్లు రాగా పరిశీలనలో 19 వార్డు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇదిలా ఉండగా మూసాపేటలో 15 పంచాయతీలకు 100 సర్పంచ్ నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 31 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇక వార్డులకు 363 నామినేషన్లు రాగా 13 నామినేషన్లను తిరస్కరించారు. ఉప సంహరణల గడువు ముగిస్తే బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలనుంది. సర్పంచ్కు 73, వార్డులకు 427 మిడ్జిల్: మండలంలో ఈనెల 14న రెండో విడతలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. దీంతో 24 జీపీలకు సంబంధించి సర్పంచ్కు 73మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 204 వార్డు స్థానాలకు 427మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎంపీడీఓ గీతాంజలి తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు శనివారం గుర్తులు కేటాయించినట్లు తెలిపారు. ఊపందుకోనున్న ప్రచారం చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండలంలో రెండో విడత సర్పంచుల ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల విడ్రాల పర్వం శనివారం ముగిసింది. దీంతో అధికారులు అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. చిన్నచింతకుంటలో 18 జీపీలకు సర్పంచులకు 96, 174వార్డు స్థానాలకు 484 నామినేషన్లు దాఖాలయ్యాయి. ప్రస్తుతం 59మంది సర్పంచు అభ్యర్థులు, 436 వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. 37మంది సర్పంచు అభ్యర్థులు, 48 వార్డు సభ్యులు ఉపసంవరించుకున్నారు. 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అందులో దమగ్నపురం 1, 4, గూడూరూ 6, సీతరాంపేట 2, 3, 6, 7, 8, పర్ధిపురం 5, 6, ఉంధ్యాల 8, 10 వార్డులు ఉన్నాయి. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో నేటినుంచి గ్రామాల్లో ప్రచారం ఊపందుకోనుంది. సర్పంచ్ బరిలో 108, వార్డు మెంబర్లు 431 భూత్పూర్: మండలంలో మూడో విడత ఎన్నికలకుగాను శనివారం అధికారులు స్క్రూట్నీ చేపట్టారు. మండలంలో 19 జీపీలకుగానూ 108మంది సర్పంచులు, 174 వార్డు మెంబర్లకుగాను 431మంది బరిలో ఉన్నారు. అన్నాసాగర్ జీపీలో 8వ వార్డు మెంబర్గా భాగశ్రీ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. శనివారం స్క్రూట్నీలో 8వ వార్డు మెంబర్గా భాగ్యశ్రీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. బరిలో 170మంది సర్పంచ్ అభ్యర్థులు రాజాపూర్: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీలకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శనివారం స్క్రూట్నీ అనంతరం 170 మంది సర్పంచ్ అభ్యర్థులు 739 వార్డు సభ్యులు పోటీలో నిలువనున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అభ్యర్థులను బుజ్జగించి పోటీలో నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నంలో అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకగ్రీవం చేస్తే గ్రామ పంచాయతీలకు సొంతంగా డబ్బులు ముందుగానే గ్రామపంచాతీ అకౌంట్లో వేస్తామని కొన్ని గ్రామాల్లో సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు బుజ్జగింపులు మొదలుపెట్టారు. లక్ష్మీదేవమ్మ, నార్లోనికుంట్ల నవనీత, బస్వాపూర్ -
కాబోయే సర్పంచ్కు యువత డిమాండ్లు
కాబోయే సర్పంచ్ గ్రామంలో నెలకొన్న సమస్యలు, గ్రామాభివృద్ధిలో చేపట్టాల్సిన పనులపై ఆదివారం మండలంలోని గంగాపూర్ గ్రామ యువత డిమాండ్లతో కూడిన వాల్పోస్టర్ విడుదల చేశారు. ముఖ్యంగా క్రీడాకారులకు మైదానం, విద్యార్థుల కోసం గ్రంథాలయంతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్, ప్రహరీ నిర్మాణం, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని వాల్పోస్టర్లో పేర్కొన్నారు. అలాగే పంచాయతీ నిధులను పారదర్శకంగా వినియోగించాలని, నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వాలని, గ్రామంలో మద్యం, సిగరెట్ల అమ్మకాలు నిషేధించాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. – జడ్చర్ల -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆత్మకూర్: మితిమీరిన అతివేగం, నిర్లక్ష్యపు ప్రయాణంతో యువకుడి మృతి చెందగా భార్య, నలుగురు పిల్లలు అనాథలుగా మారిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ జయన్న తెలిపిన వివరాలు.. నర్వ మండలం రాయికోడ్కి చెందిన తెలుగు నవీన్కుమార్(32) అమరచింతలో తమ బంధువులను కలసి ఆత్మకూర్కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో పట్టణ శివారులోని పెట్రోల్ బంక్ మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శరణ్యతో పాటు నలుగురు కుమారులు ఉన్నారు. చిన్నబాబు పుట్టి 20 రోజులు అవుతుందని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. నవీన్కుమార్(ఫైల్) -
చేపల వేటకు వెళ్లి వృద్ధుడు మృతి
బిజినేపల్లి: మండలంలోని శాయిన్పల్లి గ్రామానికి చెందిన పెద్ద కొండయ్య (75) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా ఆదివారం ఉదయం వెలుగు చూసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండయ్య చేపలు పట్టుకోవడానికి మమ్మాయిపల్లిలోని మార్కండేయ చెరువు వద్దకు వెళ్లాడు. వల వేసే క్రమంలో ప్రమాదశావత్తు చెరువులో పడి మరణించాడు. కుటుంబసభ్యులు రాత్రి ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చేపల కోసం వెళ్లి ఉంటాడనే అనుమానంతో ఆదివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి చూడగా నీటిపై తేలియాడుతూ కనిపించాడు. దీంతో కుటుంససభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కొండయ్య కుమారుడు నిరంజన్ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివాహిత బలవన్మరణం కల్వకుర్తి టౌన్: క్షణికావేశంలో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో నివాసముండే స్రవంతి (37) భర్త ప్రవీణ్తో కలిసి కళాంజలి పేరుతో లేడీస్ టైలర్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండేది. అయితే శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదివారం ఉదయం మరో మారు గొడవ పడగా స్రవంతి మనస్థాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు భర్తకు సమాచారం ఇచ్చి బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి అదృశ్యం.. కేసు నమోదు ఊట్కూర్: మండలంలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన ఉదయ్కుమార్ అనే యువకుడు అదృశ్యమవడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ ఆదివారం తెలిపారు. ఉదయ్కుమార్ శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయారు. ఉదయం లేచి చూడగా ఇంట్లో కనపించలేదు. ఫొన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో కుటుంబసభ్యులు అంతా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో భార్య, యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
మానవపాడు: జాతీయ రహదారి– 44పై ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ ఢీకొట్టిన ఘటన మండల కేంద్ర శివారు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మాధవి ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మానవపాడు స్టేజి సమీపంలో ముందు వవెళ్తున్న కారు సడెన్ బ్రెక్ వేయడంతో అదుపు తప్పి రహదారి పక్కనున్న రక్షణ గోడను ఢీకొట్టి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది ఆగింది. ప్రమాద సమయంలో డోర్ పూర్తిగా లాక్ అవ్వడంతో ప్రయాణికులు భయందోళనకు లోనయ్యారు. ఎమర్జెన్సీ తలుపు ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని డ్రైవర్ ప్రసాద్, క్లీనర్ దేవదానం తెలిపారు. 27 మంది సురక్షితం -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
వెల్దండ: మండలంలోని రాఘవాయపల్లి గేట్ వద్ద హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. ఆమనగల్లు మండలం చంద్రాయన్పల్లితండాకు చెందిన జటావత్ ఛత్రపతి(21) కల్వకుర్తిలోని ప్రిటింగ్ప్రెస్లో పనిచేస్తున్నాడు. పనిముగించుకొని శనివారం రాత్రి 11గంటలకు ఆమనగల్లుకు ఆరీఫ్, సమీర్తోపాటు బైక్పై వెళ్తుండగా రాఘవాయపల్లిగేట్ వద్ద ఎన్ హె చ్పై కల్వకుర్తి వైపు వస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఛత్రపతి, అరీఫ్, సమీర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్రపతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హెదరాబాదులోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి బాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


