మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన హుండీ లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.10,09,442 ఆదాయం వచ్చింది. ఈ హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ మల్లిఖార్జున్, పాలక మండలి సభ్యులు, సత్యసాయి సమితి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.


