● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్..ఈసారి 358వ ర్యాంక్
● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్.. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం
● ఐఏఎస్ కావడమే లక్ష్యమంటున్న వెంకటేష్
● ఖిల్లాఘనపురం ఎంపీడీఓ విజయసింహారెడ్డికి 682వ ర్యాంక్
అడ్డాకుల/ఖిల్లాఘనపురం: అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించిన సివిల్స్ లో పాలమూరు బిడ్డ మరోసారి సత్తా చాటారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేష్ప్రసాద్ సాగర్ మొదటి ప్రయత్నంలో 700 ర్యాంక్ సాధించగా.. రెండో ప్రయత్నంలో మరింత మెరుగుపరుచుకొని 358 ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న విజయసింహారెడ్డి (రంగారెడ్డి జిల్లా)ఆలిండియా 682వ ర్యాంక్ సాధించారు.


