చకచకా.. సుందరీకరణ | - | Sakshi
Sakshi News home page

చకచకా.. సుందరీకరణ

Mar 12 2026 8:35 AM | Updated on Mar 12 2026 8:35 AM

ఊపందుకున్న అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం పునరాభివృద్ధి పనులు

రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్‌పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్‌కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్‌కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్‌కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్‌సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం’ (ఏబీఎస్‌ఎస్‌) కింద రైల్వేస్టేషన్‌లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తుండటంతో.. ఈ పథకం కింద ఎంపికై న రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో నాలుగు స్టేషన్లు

విమానాశ్రయాల స్థాయిలో వసతుల కల్పనకు చర్యలు

ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌,

జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లు

ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్న జనరల్‌ మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement