పీయూ బాలికల హాస్టల్స్లో ఇటీవల కొత్త హాస్టల్స్ ప్రారంభంతోపాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం టిఫిన్ కోసం చపాతీలు చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇందులో సుమారు 750 మందికిపైగా ఉండగా ఒక్కొక్కిరికి సుమారు నాలుగు చపాతీలు ఇచ్చినా ఒక్కరోజు సుమారు 4 వేల చపాతీలు చేయాల్సి వస్తుంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో ఎస్బీఐ గణేష్నగర్ బ్రాంచ్ యూనివర్సిటీ అధికారులు రోటీ మేకర్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. దీంతో స్పందించిన ఎస్బీఐ అధికారులు పీయూ హాస్టల్స్కు రూ.10 లక్షల విలువైన రెండు రోటీ మేకర్స్ను అందించారు. ఇవి ప్రస్తుతం బాలికల హాస్టల్స్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి అవసరం రెండు బాలుర హాస్టల్స్లో కూడా ఉండడంతో అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది.


