పాలమూరు: మహిళల భద్రత, హక్కులపై చట్టపరంగా పొందే సహాయంపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం నగరంలోని ధన్వంతరి ఫార్మా కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పోక్సో, డొమెస్టిక్ వైలెన్స్తో పాటు చట్టాల్లో ఉండే హక్కులు, రక్షణ చర్యలు, శిక్షలపై సమగ్ర అవగాహన కల్పించారు. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యశోద, రాజు, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


