మహమ్మదాబాద్: మండలంలోని నంచర్ల ప్రాథమిక పాఠశాల తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నంచర్లలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉదయం 2వ తరగతి విద్యార్థులు ఎప్పటిలాగే వచ్చి తమ గదిలో చదువుకుంటూ కూర్చున్నారు. ఒక్కసారిగా పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడటంతో మిగతా వారంతో బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న డీఈఓ ప్రవీణ్కుమార్ పాఠశాలను సందర్శించి ఘటనపై ఆరా తీశారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి.. పాఠశాలకు మరమ్మతు చేయాలని ఆదేశించారు.


