breaking news
Health
-
శస్త్ర చికిత్స లేకుండా 'ఏఐ' ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా?
టెక్ బిలియనీర్, దీర్ఘాయువు ప్రచారకర్త బ్రయాన్ జాన్సన్ తన స్నేహితురాలు కేట్కు శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఏళ్ల తరబడి స్కానింగ్ల తర్వాత ఏఐ సహాయక ఎంఆర్ఐ విశ్లేషణలో ఎండోమెట్రియోసిస్ని సులభంగా నిర్థారించిదని వెల్లడించారు. శస్త్ర చికిత్స లేకుండా నిర్థారించలేని ఈ సమస్యను తాము ఏఐ ఆధారిత స్కానింగ్, బహుళ రక్త పరీక్షల సాయంతో నిర్థారించామని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఎండోమెట్రియోసిస్?, ఈ సమస్యను గుర్తించడంలో ఏఐ ప్రత్యామ్నాయంగా ఉంటుందా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఎండోమెట్రియోసిస్ అంటే..ఇది మహిళల్లో కనిపించే ఒక సాధారణ మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఇందులో, గర్భాశయం లోపలి పొరను పోలి ఉండే కణజాలం (ఎండోమెట్రియం) గర్భాశయం వెలుపల.. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్లు, లేదా పొత్తికడుపులోని ఇతర అవయవాలపై పెరగడం ప్రారంభమవుతుంది. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల వాపు, మచ్చలు, తీవ్రమైన కటి నొప్పి కలుగుతాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీని బారిన పడుతున్నారని అంచనా. దీని కారణంగా మహిళలు ఈ కింది సమస్యలు ఎదుర్కొంటారు.లక్షణాలు..నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పిరుతుస్రావం సమయంలో లేదా సంభోగం సమయంలో విపరీతమైన నొప్పిఅధిక రక్తస్రావం (హెవీ పీరియడ్స్)వంధ్యత్వం (గర్భం దాల్చడంలో ఇబ్బందులు)దీన్ని నిర్థారించడం ఎందుకంత కష్టం అంటే..ఈ సమస్య లక్షణాలు తరచుగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), పెల్విక్ ఇన్ప్లమేటరీ డిసీజ్ లేదా అండాశయ తిత్తులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో కలిసి ఉంటాయి. ఫలితంగా, చాలా మంది మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ కావడానికి 6 నుంచి 10 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి వస్తుంది.సాధారణ స్కాన్లు గుర్తించలేకపోవడానికి రీజన్..ఇక్కడ బ్రయాన్ జాన్సన్ తన గర్ల్ఫ్రెండ్ కేట్ మొదటగా ఎమ్మారై, ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ చేయించుకుందని చెప్పారు. కానీ ఈ రెండూ ఆ వ్యాధిని గుర్తించడంలో విఫలమయ్యాయని చెప్పారు. నిజానికి సాధారణ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా ఎండోమెట్రియోసిస్ గాయాలను గుర్తించడం కష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు. అండాశయాలు లేదా లోతైన పెల్విక్ కణజాలాలను ప్రభావితం బాగా ప్రభావితం చేసే ముదిరిన పరిస్థితుల్లోనే సాంప్రదాయ స్కానింగ్లో దీన్ని గుర్తించగలరట. అదీగాక దశాబ్దాలుగా, ఎండోమెట్రియోసిస్ను నిర్ధారించడానికి లాపరోస్కోపీని (వైద్యులు పెల్విక్ కుహరాన్ని నేరుగా పరీక్షించడానికి వీలు కల్పించే అతి తక్కువ కోతతో చేసే శస్త్రచికిత్సా విధానం) అత్యుత్తమ ప్రమాణంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఏఐ ఆధారిత అధిక నాణ్యత ఇమేజింగ్ ఆ కోతను కూడా తగ్గించి సులభంగా ఈ సమస్యను గుర్తించడం విశేషం.కృత్రిమ మేధ (AI) రోగ నిర్ధారణను మెరుగుపరచగలదా?మహిళల ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ ఒక ఆశాజనకమైన సాధనంగా ఆవిర్భవించనుంది. పెల్విక్ MRI స్కాన్లను విశ్లేషించడానికి, రేడియాలజిస్టులు కూడా గమనించలేని సూక్ష్మమైన నమూనాలను గుర్తించడానికి AI అల్గారిథమ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ఈ సాంకేతికత లోతుగా చొచ్చుకుపోయే ఎండోమెట్రియోసిస్ను గుర్తించడంలో చక్కటి మెరుగుదలను అందిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇక్కడ జాన్సన్ AI-సహాయక ఇమేజింగ్, ఎండోమెట్రియోసిస్-నిర్దిష్ట అల్ట్రాసౌండ్తో పాటు వివధ రక్త పరీక్షల ఆధారంగా ఈ సమస్యను నిర్థారించినట్లు తెలిపారు. అందువల్ల ఇది కచ్చితంగా మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని చెప్పలేమని..ఇంకా పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని అంటున్నారు. అందువల్ల తాము ఏఐ సాధనం గైనకాలజిస్ట్ నిపుణుడికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుపెట్టుకోండని హెచ్చరిస్తున్నారు.ప్లీజ్ ఈ విషయాలన్ను విస్మరించొద్దు..అందుకనే మహిళలు ఎండోమెట్రియోసిస్ను సూచించే లక్షణాలు ఉంటే, కేవలం ప్రాథమిక స్కాన్ ఆధారంగా నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు. ఎండోమెట్రియోసిస్ విషయంలో అనుభవం ఉన్న గైనకాలజిస్ట్ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఇక్కడ జాన్సన్ చెబుతోంది దీర్ఘకాలిక కటి నొప్పితో బాధపడుతున్న లక్షలాది మంది మహిళలకు, ఈ ఆవిష్కరణలు ముందస్తు నిర్థారణకు, అలాగే తక్కువ బాధతోనే త్వరితగతిని వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశానికి వీలు కల్పిస్తుందనే ఆశను అందిస్తుందే తప్ప..దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: కేన్సర్తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..) -
కేన్సర్తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..
బాలీవుడ్ నటి, మోడల్ నఫీసా అలీ కేన్సర్ వారియర్. ఇప్పటికీ దానిపై పోరాడుతున్నారామె. నిజానికి ఇలాంటి వ్యాధి ఎంతటి వ్యక్తులనైనా కుంగదీసేస్తుంది. కానీ ఆమె ఆ మహమ్మారి విడవకుండా మరోసారి తిరగబెడుతున్నా..నవ్వుతూనే పోరాడుతోంది. పైగా ఎందుకిలానో ఆమెనే స్వయంగా వెల్లడించారు. అంతేగాదు తనకు తొలిసారి కేన్సర్ నిర్థారణ అయినప్పుడూ కూడా షూటింగ్ల్లో పాల్గొన్నానని అందుకు కారణం ఉందంటూ ఆలోచింప చేసేలా మాట్లాడారామె. ఆ ఆసక్తికర విషయాల గురించి సవివరంగా తెలుసుకుందామా. బాలీవుడ్ ప్రముఖ నటి నఫీసా అలీ జూనూన్' (1979), 'మేజర్ సాబ్' (1998), 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' (2007), 'గుజారిష్' (2010), 'యమ్లా పగ్లా దీవానా' (2011) వంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో నటనకు పేరుగాంచింది. తన నటన, అభినయంతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ బెంగాలీ భామకు 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్జాకి' షూటింగ్ సమయంలోనే స్టేజ్ 3 కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపింది. అయితే ఆ టైంలో ఈ మూవీని పూర్తి చేయగలనా..ఆ పాత్రలో నటించగలనా అనే భయాలు వెంటాడుతున్న తరుణంలో ఆ చిత్రనిర్మాత పద్మకుమార్ నరసింహమూర్తి తనపై పూర్తి నమ్మకం ఉంచారని అందుకు ఆయనకు శతకోటి ధన్యవాదాలని అన్నారామె. ఆయన తనని ప్యాడీ అని ముద్దుగా పిలిచేవారని, ఆ టైంలో అంత ధైర్యంగా సినిమా చేయడానికి కారణం కూడా ఆయనే అని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు. ఆ చ్రితం కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చేది కావడం ఒకటైతే, కేన్సర్ లాంటి వ్యాధితో పోరాడుతూ కూడా తన పనుల్లో సాగిపోవాలని భవిష్యత్తు తరాలకు కొత్త ఆశను అందించేందుకు అంటోంది నఫీసా అలీ. అంతేగాదు తన జీవితంతో ఒక సందేశాన్ని అందించాలనే పోరాటమే అత్యంత ముఖ్యమైనదని తెలుసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు, అలాంటప్పడు నాకే ఇలా అనే కుంగుబాటుకు లోనవ్వాల్సిన పనిలేదు అని చెప్పేందుకని అంటోందామె. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ దీని గురించి ఆలోచించడం ముఖ్యం. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, నైతిక బాధ్యత గురించి ఆలోచించాలని చెబుతోంది. జీవితం ఎప్పటికీ అనూమ్యమైనదే, అందుకనే ప్రజలు సదా కరుణతో ఉండాలి, సాముహిక బాధ్యతను కలిగి ఉండాలన్నేదే నమ్ముతానని అంటోంది. ఈ రోజు ఇక్కడ ఉన్నానని, రేపు ఏం జరుగుతుందనే ఎవరికి తెలుసు కాబట్టి ఆ వ్యాధిపై ధైర్యంగా పోరాడుతూనే ఉండండి..ఆ సత్యాన్ని చెప్పేందుకే ఆ సమయంలో కూడా షూటింగ్లలో పాల్గొన్నట్లు తెలిపింది. తాను అప్పుడు స్టేజ్ 3 కేన్సర్తో పోరాడా, గెలిచా..కానీ మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4 కు చేరుకుంది అయినా..తన పోరాటం ఆపనని ధీమాగా చెబుతోందామె. ఆమె ముందు క్రీడాకారిణి..కోల్కతాలో బెంగాలీ తండ్రికి, ఆంగ్లో ఇండియన్ తల్లికి జన్మించిన నఫిసా అలీ విభిన్న సంస్కృతులు కలగలసిన కుటుంబ నుంచి వచ్చారామె. ఆమె స్విమ్మింగ్లో అర్జున అవార్డు గ్రహిత. క్రీడాకారుడైన కల్నల్ రవీందర్ సింగ్ సోధీని పెళ్లి చేసుకున్నారు. నటలోకి ప్రవేశించడానికి ముందే ఆమె నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్గా ఉండేవారు. 1976లో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్నారు. అంతేగాదు శశి కపూర్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంఇ ప్రముఖ నటనలతో పనిచేశారు. 2004, 2009లలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేశారు. 2005లో, ఆమె చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI) ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. నవంబర్ 2018లో, ఆమెకు స్టేజ్ 3 పెరిటోనియల్, ఓవేరియన్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi) (చదవండి: కదులుతున్న రైలులో పూజలు..! రైల్వే ఏం చెప్పిందంటే) -
షుగర్ సూదులు, మందులు వద్దంటూ వైరల్ డైట్!
"మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.. ఇక ఇన్సులిన్, మందులు అవసరం లేదు!" అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ డైట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైట్ను నమ్మి వేలాది మంది షుగర్ పేషెంట్లు వైద్యులు సూచించిన మందులు ఆపేయడంతో.. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'ఎల్-తయ్యిబాత్' డైట్.. ఆ పదానికి అరబిక్లో "మంచివి" అనే అర్థం. ఈ డైట్ను ఈజిప్టుకు చెందిన మాజీ వైద్యుడు దియా ఎల్-అవాడీ (Diaa El-Awadi) విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రకారం.. తినే తిండిలో కొన్నింటిని దూరంగా పెడితే చాలూ.. డయాబెటిస్ దానంతట అదే తగ్గిపోతుందట!. మధుమేహానికి అసలు కారణం కొన్ని ఆహార పదార్థాలేనని, వాటిని పూర్తిగా మానేస్తే షుగర్ మందులు, ఇన్సులిన్ అవసరమే ఉండదని దియా ఎల్ అవాడీ చెప్పేవాడు. ఆ డైట్లో.. ఆకుకూరలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు బంద్ చేయాలని సూచించాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో.. గుడ్డిగా ఆ మాటలు నమ్మి లక్షలాది మంది ఈ డైట్ను అనుసరించడం ప్రారంభించారు.మందులు ఆపేసి... ప్రాణాల మీదకుఎల్-తయ్యిబాత్ డైట్ను నమ్మి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. యెమెన్లో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. 67 ఏళ్ల మురాద్ అల్-అదిమి అనే మధుమేహి కూడా ఇదే డైట్ను నమ్మాడు. 15 ఏళ్లుగా షుగర్ మందులు వాడుతున్న ఆయన.. ఈ డైట్ పాటిస్తే మందులు అవసరం లేదని తెలిసి వాటిని ఆపేశాడు. మొదటి కొన్ని రోజులు బాగానే అనిపించడంతో స్నేహితులకు కూడా ఇదే డైట్ను సూచించాడు. కానీ పదో రోజుకే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.."మందుల ఖర్చు తగ్గుతుందని అనుకున్నా.. ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ మందులు ఆపొద్దు" అని హెచ్చరిస్తున్నాడు.క్యూ కడుతున్న షుగర్ పేషెంట్లుయెమెన్లోని తైజ్ రిపబ్లికన్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అత్యవసర విభాగానికి వస్తున్న మధుమేహుల్లో చాలా మంది ఈ డైట్ను అనుసరించి మందులు మానేసినవారే. చాలామంది తీవ్రమైన షుగర్, డీహైడ్రేషన్, డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులతో ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలుదేశాల్లోనూ ఈ తరహా డైట్ పాటించి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి.ఈ డాక్టర్ ఎవరంటే..దియా ఎల్-అవాడీ ఒకప్పుడు ఈజిప్టులో వైద్యుడిగా పనిచేశారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేని వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలతో ఈజిప్ట్ వైద్య మండలి ఆయన వైద్య అనుమతిని రద్దు చేసింది. ఆయన నిర్వహిస్తున్న రెండు క్లినిక్లను కూడా 2026 మార్చిలో మూసివేసింది. అనంతరం యూఏఈలో ఉన్న సమయంలో 2026 ఏప్రిల్లో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు. యూఏఈ వైద్య నివేదిక ప్రకారం ఆయన మరణం సహజ కారణాలతోనే జరిగిందని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వైరల్ కావడంతో.. ఆయన ప్రచారం చేసిన ‘ఎల్-తయ్యిబాత్’ (El-Tayyebat) డైట్కు మరింత ప్రచారం లభించింది.ధరలు కూడా కుప్పకూలాయి!ఈ డైట్ ప్రభావం అరబ్ దేశాల్లోని మార్కెట్పైనా పడింది. గుడ్లు, చికెన్, ఆ డైట్లో ఉన్న కూరగాయలు కొనేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. తైజ్లో గుడ్ల ట్రే ధర 3.5 డాలర్ల నుంచి 1.6 డాలర్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 20 కోళ్లు అమ్మే దుకాణాల్లో ఇప్పుడు ఐదు కూడా అమ్ముడవడం లేదని వారు వాపోతున్నారు.వైద్యులు ఏమంటున్నారు?వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం ఈ డైట్కు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు వంటి ఆహారాల్లో శరీరానికి అవసరమైన.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు, డైటీషియన్లు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.సోషల్ మీడియా సలహాలొద్దు"సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ అందరికీ సరిపోదు. కొందరికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. అదే అందరికీ చికిత్స కాదు. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపేయడం ప్రాణాలకు ప్రమాదం" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వైరల్ వీడియోను నమ్మి మందులు మానేస్తే.. షుగర్ తగ్గకపోగా ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.గమనిక: మన దేశంలోనూ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్లో వైరల్ అయ్యే "షుగర్కు అద్భుత చికిత్స" వంటి వీడియోలను చూసి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేయడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
సజ్జనుడు – దుర్జనుడు
జీవశాస్త్రం ఆధారంగా ఒక ఆసక్తికరమైన పోలికతో ఆరిషడ్వర్గాలను వ్యాఖ్యానించవచ్చు. అరిషడ్వర్గాలు దుష్టుడికి ‘ప్రొటో– ఆంకోజీన్స్’ లాంటివి. మొదట సాహచర్యం చేస్తాయి, తర్వాత మార్పుచెంది అజమాయిషీ చేయడం మొదలుపెడతాయి. చివరకు ప్రాణాధారంగా మారతాయి.ఆరోగ్యకరమైన కణంలో ‘ప్రొటో–ఆంకోజీన్స్’ అనేవి కణ విభజనను నియంత్రించే ప్రొటీన్లను తయారుచేసే జన్యువులు. కొన్ని సంకేతాలు అందుకున్నప్పుడు ఈ జన్యువులు క్రియాశీలమై, ఆ ప్రొటీన్లను ఉత్పత్తి చేసి కణాన్ని విభజనకు ప్రేరేపిస్తాయి. పని పూర్తయ్యాక మళ్ళీ నిష్క్రియగా మారతాయి. ఈ జన్యువులు ప్రతి కణంలోనూ ఉంటాయి.కామ–క్రోధ–లోభాది ఆరు మనిషి సహజ ప్రవృత్తులు (షడ్వర్గాలు) కూడా అంతే. ఇవి సజ్జనులలోనూ, దుర్జనులలోనూ ఉంటాయి. అవి శ్రుతిమించినప్పుడే సమస్య. ఆరోగ్యకరమైనకణంలో ప్రొటో– ఆంకోజీన్ ఎలా అవసరమైనప్పుడు నియంత్రణ మేరకు పనిచేసి, ఆ తర్వాత మౌనం వహిస్తుందో... అలాగే సజ్జను లలో షడ్వర్గాలు నియంత్రణకు లోబడి ఉంటాయి. నియంత్రణ తప్పినప్పుడు మాత్రమే చెడు మార్పు మొదలవుతుంది.నియంత్రణ తప్పడమే మ్యుటేషన్ ఈ నియంత్రణ తప్పడాన్నే జీవశాస్త్రంలో మ్యుటేషన్గా వ్యవహరిస్తారు. ప్రొటో–ఆంకోజీన్ మ్యుటేషన్ చెందినప్పుడు రూపాంతరం చెంది ఆంకోజీన్గా మారుతుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, జన్యువు పనిచేసే స్థితిలో (ఫంక్షనల్ స్టేటస్)లో కలిగే నిజమైన మార్పు కూడా. దాని పర్యవసానంగా కణం మొత్తం గుర్తింపు (ఐడెంటిటీ) మారిపోతుంది. అంటే ఆరోగ్య కరమైన కణం, క్యాన్సర్ కణంగా మారుతుంది.షడ్వర్గాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. నియంత్రణ తప్పిన మనిషిలో, గుణాలు అరిషడ్వర్గాలుగా పరిణమిస్తాయి: షడ్వర్గ సహిత మనిషి సజ్జనుడు, అరిషడ్వర్గ సహిత మనిషి దుర్జనుడు! దుర్జనుడు ఈ అరిషడ్వర్గాల నియంత్రణలోనే నడుస్తాడు. వీటి ప్రేరణతోనే నిర్ణయాలు తీసుకుంటాడు. అవే అతనికి శక్తినిచ్చే ప్రేరకాలు. అంటే ఇప్పుడు అరిషడ్వర్గాలు యజమానులుగా మారా యన్నమాట!ఈ యజమానిత్వం కూడా ఒక మజిలీయే, గమ్యం కాదు. జీవశాస్త్రంలో దీనికి ‘ఆంకోజీన్ ఎడిక్షన్’ అనే పేరుంది. కణంలో అనేక ఇతర జన్యుపరమైన లోపాలు పోగుపడినా, ఆ కణం తన మనుగడ మొత్తాన్నీ ఒక్క మార్పు చెందిన (మ్యుటేటెడ్) ఆంకోజీన్ మీదే ఆధారపడేలా చేసుకుంటుంది. ఆ ఒక్క జన్యువుని నిరోధిస్తే చాలు, కణం మొత్తం నశిస్తుంది. దుష్టుడి స్థితి కూడా ఇదే. అరిషడ్వర్గాలే వాడికి శక్తినిచ్చి నడిపే జీవాధారాలుగా నిలుస్తాయి. వాటిని అదుపుచేస్తే సహజ స్థితిని పొంది సజ్జనుడు కాగలడు.ఆసక్తికరమైన విషయం ఏమంటే గుణాల మూలతత్త్వం ఒక్కటే. గుణం ఎప్పటికీ మారదు, దాని స్వరూపం స్థిరంగానే ఉంటుంది. మారేది దాని నియంత్రణ స్థితి మాత్రమే. ఈ స్థితి మారడం వల్లే మనిషి స్వరూపం మారిపోతుంది. ప్రోటో–ఆంకోజీన్... ఆంకోజీన్గా మారి కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చి నట్టే, షడ్వర్గాలు అరిషడ్వర్గాలుగా మారి సజ్జనుడిని దుర్జనుడిగా మారుస్తాయి. మనిషి స్వభావాన్ని నియంత్రించే శక్తి ఏది అనేది ఒక తాత్త్విక ప్రశ్న. పురాణాలు, ఉపనిషత్తులలో చెప్పిన ఎన్నో విషయా లను ఆధ్యా త్మిక ధోరణిలోనే కాకుండా సామాజిక కోణంలోనూ, శాస్త్రీయ దృక్పథంతోనూ వ్యక్తిగత ఉన్నతికి ఉత్ప్రేరకాలుగానూ విశ్లేషించి ఆచరించే ప్రయత్నం చేస్తే వ్యక్తులు, సమాజం అభివృద్ధిపథంలో పయనించగలరు.- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
యాంటీ'భయో'టిక్స్!?
సాక్షి, హైదరాబాద్: సమాజంలో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ పేషెంట్ (ఓపీ)కి వచ్చిన ప్రతి నలుగురు పిల్లల్లో ముగ్గురికి యాంటీబయాటిక్స్ సూచించడం..వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే పెద్దల్లో 83 శాతం మందిలో ఏఎంఆర్ బ్యాక్టీరియా ఉందని ఏఐజీ పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా జ్వరం, జలుబు, గాయం, ఒళ్లు నొప్పులకు ఓవర్ది కౌంటర్లో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఇవి వినియోగించడం, కోర్సు పూర్తి చేయకపోవడం, ఇతర కారణాలతో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరుగుతుంది. రోగం వచ్చినపుడు ప్రాణాలు కాపాడాల్సిన మందులు పనిచేయకుండా ఏఎంఆర్ అడ్డుకుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఓపీలో పిల్లలకు ఇచ్చే ప్రిస్కిప్షన్లలో 76 శాతం మందికి వైద్యులు యాంటీబయాటిక్స్ సూచిస్తున్నారని కేర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. 891 మంది పిడియాట్రిక్ ఔట్ పేషెంట్ల (ఓపీ) వివరాలను విశ్లేíÙంచగా అందులో 65.8 శాతం బాలురు, 34.2 శాతం బాలికలు ఉన్నారు. అధ్యయనం చేసిన పిల్లల్లో శ్వాసకోస ఇన్ఫెక్షన్లు (49.6) అత్యంత సాధారణంగా ఉన్నాయి. 678 మంది ప్రిస్కిప్షన్లలో 96.9 శాతం ఒకే రకమైన యాంటీబయాటిక్ ఉండగా, 3.1 శాతం మరో రెండు రకాలు ఉన్నాయి. అత్యధిక భాగం బ్రాండెడ్ మందులే ఉండగా కేవలం 2.4 శాతం మాత్రమే జనరిక్ మందులు రాస్తున్నారని కళాశాల ప్రాక్టీస్ హెచ్ఓడీ సత్యనారాయణ వివరించారు.83 శాతం మంది రోగుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉంటోందని ఏఐజీ ఆసుపత్రి పరిశోధనల్లో తేలింది. ఇది మందులు పనిచేయకుండా అడ్డుకుంటుందని, ఈ పరిస్థితిని నియంత్రించకపోతే భవిష్యత్తులో వైద్యం ఖర్చులు పెరగడంతో పాటు, హై డోస్ మెడిసిన్ వాడాల్సి ఉంటుందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ నాగేశ్వర్రెడ్డి పేర్కొంటున్నారు. అయినా ఖచ్చితంగా రోగం నయం అవుతుందన్న గ్యారంటీ ఇవ్వలేమన్నారు.బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు..శరీరంలో వైరస్, ఫంగల్, ప్యారాసైట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అతిగా యాంటీబయాటిక్స్ వినియోగం మానవ ఆరోగ్యానికి కీడు చేస్తుంది. దీనిపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ అధికారులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఫొటో కేఎస్ అని ఉంటుంది. ‘కోర్సు’ మేర మందులు వాడాలి..మెదడు, ఉదరం, యూరిన్, శ్వాసకోశ వ్యవస్థ.. ఇలా శరీరంలోని అవయవాలకు యాంటీబయాటిక్ మోతాదు ఉంటుంది. దీన్ని మించి ఇవ్వకూడదు. యాంటీబయాటిక్ ఇవ్వండని తల్లిదండ్రులే అడుగుతున్నారు. అడినోవైర్తో వచ్చే జ్వరం 15 రోజులు ఉంటుంది. డెంగీ, కోవిడ్, మలేరియా వంటి రోగాలకు యాంటీబయాటిక్స్ అవసరం లేదు. సీబీపీ, సీఆర్పీ, యూరిన్ వంటి చిన్నచిన్న పరీక్షల ఆధారంగా యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఎంత డోస్, ఎన్ని రోజులు వినియోగించాలో చెబుతారు. కోర్సు పూర్తి చేయాలి. మధ్యలో ఆపేసినా రెసిస్టెన్స్ పెరుగుతుంది. పరిస్థితిని చక్కదిద్దకపోతే భవిష్యత్తులో రోగాలను నయం చేయడం కష్టంగా మారుతుంది.– డా. కావలి సత్యనారాయణ, రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రి -
Health: నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా?
నా వయస్సు 22 సంవత్సరాలు. నాకిప్పుడు ఏడోనెల. ఇటీవల పరీక్ష చేయించుకుంటే రక్తపోటు ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. మందులు కూడా వాడమన్నారు. ఈ సమస్య వల్ల నాకు లేదా నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా? ఈ మందులు గర్భంలో సురక్షితమేనా? – చైత్ర, మంచిర్యాల.గర్భధారణ సమయంలో మొదటిసారిగా అధిక రక్తపోటు రావడాన్ని ‘ప్రీఎక్లాంప్సియా’ అంటారు. సాధారణంగా రక్తపోటు ‘140/90 ఎమ్ఎమ్హెచ్జీ’ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అనుమానిస్తారు. కొంతమందిలో దీనితో పాటు మూత్రంలో ప్రొటీన్ కనిపించడం, రక్తపరీక్షల్లో మార్పులు లేదా కాలేయం, మూత్రపిండాల పనితీరులో లోపాలు కూడా ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి గర్భం దాల్చడం, చాలా చిన్న వయస్సులో లేదా ఎక్కువ వయస్సులో గర్భం ధరించడం లేదా గత గర్భంలో అధిక రక్తపోటు వచ్చినా, కవల పిల్లలు గర్భంలో ఉన్నా, గర్భానికి ముందే రక్తపోటు లేదా మధుమేహం ఉన్నా, అధిక బరువు ఉన్నా లేదా సంతానలేమి చికిత్సల ద్వారా గర్భం దాల్చినా ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా 20 వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఎక్కువగా మూడో త్రైమాసికంలో కనిపిస్తుంది. అరుదుగా ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు కూడా రావచ్చు.చాలామంది గర్భిణీల్లో ఈ సమస్యకు మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణ గర్భధారణ పరీక్షల్లోనే ఇది బయటపడుతుంది. అయితే కొందరిలో అకస్మాత్తుగా బరువు పెరగడం, శరీరం మొత్తం వాపు రావడం, స్కానింగ్లో బిడ్డ ఎదుగుదల తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. అయితే కొందరిలో తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం లేదా వెలుగులు మెరుస్తున్నట్లు కనిపించడం, వాంతులు, ముఖం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా వాపు రావడం, మూత్రం తగ్గిపోవడం, కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన పరిస్థితుల్లో మూర్ఛలు (సీజర్లు) రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.ప్రీఎక్లాంప్సియా నిర్ధారణ అయితే రక్తపోటును నియంత్రించేందుకు మందులు అవసరం అవుతాయి. సాధారణంగా ‘లాబెటాలోల్’లేదా ‘నైఫెడిపిన్’ వంటి మందులు గర్భధారణలో సురక్షితంగా పరిగణించబడతాయి. వైద్యుడి సూచన మేరకు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్వయంగా మందులు ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకూడదు. గర్భధారణ ప్రారంభ దశలో చేసిన ఎన్ టీ స్కాన్, ఇతర రక్తపరీక్షల ఆధారంగా ప్రీఎక్లాంప్సియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తిస్తే, నివారణ కోసం కొంతమందికి తక్కువ మోతాదులో మందును సూచిస్తారు.ప్రీఎక్లాంప్సియాను నిర్లక్ష్యం చేస్తే తల్లికీ, బిడ్డకీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిలో రక్తపోటు మరింత పెరగడం, మూర్ఛలు రావడం, కాలేయం లేదా మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, ముందస్తు ప్రసవం లేదా అత్యవసర శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. బిడ్డలో ఎదుగుదల తగ్గిపోవడం, గర్భాశయంలో నీటి పరిమాణం తగ్గడం, ముందుగానే పుట్టడం లేదా పుట్టిన తర్వాత కొంతకాలం ప్రత్యేక సంరక్షణ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు.అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, రక్తపోటును నియంత్రిస్తూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షిస్తే చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి పరీక్షను సమయానికి చేయించుకోవడం, వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం, తలనొప్పి, చూపు మసకబారడం, శరీరం ఎక్కువగా వాపు రావడం లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం చాలా ముఖ్యం. సరైన సమయంలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం, నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉండడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఆందోళన చెందకుండా మీ వైద్యుల సూచనలు తప్పకుండా పాటించండి.- డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
అరుదైన సార్కోమా క్యాన్సర్.. గుర్తించడం ఎలా?
క్యాన్సర్ అనగానే మనకు సాధారణంగా రొమ్ము, ఊపిరితిత్తులు లేదా ప్రేగుల క్యాన్సర్లు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. అయితే శరీరంలోని అనుసంధాన కణజాలాలలో (connective tissues) వచ్చే ‘సార్కోమా’ అనే అరుదైన క్యాన్సర్ను త్వరగా గుర్తించలేం. ఫలితంగా తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సార్కోమా క్యాన్సర్లు ఎముకలు, కండరాలు, కొవ్వు, మృదులాస్థి (cartilage), రక్తనాళాలు, నరాలు, ఇతర మృదువైన కణజాలాలలో (soft tissues) ఉత్పన్నమవుతాయి. పెద్దవారిలో వచ్చే క్యాన్సర్లలో ఇవి కేవలం ఒక శాతం మాత్రమే అయినప్పటికీ, ఇవి అటు పిల్లలపై, ఇటు పెద్దలపై కూడా ప్రభావం చూపిస్తాయి. దీని ప్రారంభ లక్షణాలు చాలా స్వల్పంగా, నొప్పి లేకుండా ఉండటం వల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతున్నది. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.సార్కోమా అంటే ఏమిటి?మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ ఖత్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సార్కోమా అనేది ఒక అసాధారణ క్యాన్సర్. ఇది స్పష్టమైన కారణం లేకుండానే వస్తుంది. ‘సార్కోమా బారిన పడిన చాలామందికి అది తమకు ఎందుకు వచ్చిందో అసలు తెలియదు. చాలా కేసులలో దీనికి నిర్దిష్టమైన జీవనశైలి అలవాట్లు గానీ లేదా బాహ్య కారణాలు గానీ బాధ్యత వహించవు’ అని ఆయన వివరించారు. సార్కోమాలో 100 కంటే ఎక్కువ ఉప రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. అందుకే దీని నిర్ధారణ, చికిత్స చాలా సవాలుతో కూడుకున్నవి. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు.ప్రమాద కారకాలు సార్కోమాను సాధారణంగా నివారించలేనప్పటికీ, దీని ముప్పును పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు. అవి.. ‘లి-ఫ్రౌమెని సిండ్రోమ్’ వంటి వంశపారంపర్య జన్యుపరమైన సమస్యలు. న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1.. గతంలో ఇతర క్యాన్సర్ల కోసం రేడియేషన్ థెరపీ తీసుకోవడం. దీర్ఘకాలంగా ఉండే లింఫెడెమా (lymphoedema - వాపు సమస్య). కొన్ని రకాల పారిశ్రామిక రసాయనాలకు సుదీర్ఘకాలం గురికావడం.ఉపేక్షించకూడని హెచ్చరిక సంకేతాలుసార్కోమా ఆలస్యంగా నిర్ధారణ కావడానికి ప్రధాన కారణం.. దీని ప్రాథమిక లక్షణం నొప్పి లేని గడ్డలా కనిపించడమే. క్యాన్సర్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరంతరం పెరుగుతూ ఉండే గడ్డ, ఐదు సెంటీమీటర్ల కంటే పెద్దగా (సుమారుగా ఒక గోల్ఫ్ బంతి పరిమాణంలో) ఉండే వాపు, కండరాల లోపల లోతుగా ఉండే గడ్డ, ఎటువంటి గాయం కాకపోయినా ఎముకలలో నిరంతరం నొప్పి రావడం, రాత్రి వేళల్లో ఎముకల నొప్పి మరింత తీవ్రం కావడం, తగ్గకుండా పదే పదే వచ్చే వాపు. శరీరంలో వచ్చే చాలా గడ్డలు ప్రమాదకరమైనవి కానప్పటికీ, ఏదైనా వాపు తగ్గకుండా ఉన్నా లేదా పరిమాణం పెరుగుతున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షించుకోవాలి.వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు?అనుమానాస్పదంగా ఉన్న గడ్డలను పరీక్షించడానికి వైద్యులు సాధారణంగా ఎంఆర్ఐ స్కాన్లు, పెట్-సిటి ఇమేజింగ్, ముందస్తు ప్రణాళికతో చేసే బయాప్సీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, మాలిక్యులర్, జన్యుపరమైన పరీక్షలు, నెక్స్ట్-జనరేషన్ సీక్వెన్సింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. సార్కోమా చికిత్సలో అనుభవజ్ఞులైన కేంద్రాలలోనే బయాప్సీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నివారించడం సాధ్యమేనా?మిగతా సాధారణ క్యాన్సర్లలా కాకుండా, సార్కోమా రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి దీనిని నివారించడానికి నిర్దిష్టమైన మార్గాలేవీ లేవు. అయితే, అనవసరమైన రేడియేషన్కు గురికాకపోవడం, ప్రమాదకర రసాయనాలను ఉపయోగించే కార్యాలయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం, వంశపారంపర్య క్యాన్సర్ సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరంలో తగ్గని గడ్డలు లేదా ఎముకల నొప్పులు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
సోషల్ మీడియా డైట్ మేనియా
‘మొలకెత్తిన గింజలు తినండి... జబ్బులన్నీ పరార్’‘చిరుధాన్యాలు తినండి... చిటికెలో ఆరోగ్యం పొందండి’‘రోజూ పాతిక గుడ్లు తినండి... తేలికగా బరువు తగ్గించుకోండి’‘ఆకుకూరలు తినండి.... ఆయురారోగ్యాలు పొందండి’ఇవన్నీ సోషల్ మీడియాలో మార్మోగిపోయే మాటలు. యూట్యూబ్ తెరిచినా, ఇన్స్ట్రాగ్రామ్ తెరిచినా ఉచిత ఆరోగ్య, ఆహార సలహాలతో ఊదరగొట్టే మహానుభావులు కనిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటనే దానిపై వీరెవరికీ ఏకాభిప్రాయం ఉండదు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క సిద్ధాంతం. ఒకరు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను తినాలంటారు. ఇంకొకరు ఆకులు అలములు మొలకలతోనే అద్భుతమైన ఆరోగ్యం సాధ్యమని ప్రవచిస్తారు. మరొకరు ‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ అన్నట్లుగా కొవ్వును కొవ్వుతోనే కరిగించవచ్చని నమ్మకంగా చెబుతారు.‘నా సలహా పాటిస్తే డయాబెటిస్, బీపీ దగ్గరకే రావు; మీ గుండె ఉక్కు గుండులా మారుతుంది’ అని చెబుతారొకరు. ‘నేను చెప్పే ఆహార పద్ధతిని పాటిస్తే క్యాన్సర్ కూడా పరారవుతుంది’ అని సవాలు చేస్తారొకరు. ‘నేను చెప్పిన కషాయాలు తాగుతూ, ఆకులు అలములు మొలకలు తింటే అరవైలోనూ ఇరవైలా ఉరకలేస్తారు’ అని ఢంకా బజాయిస్తారు మరొకరు. సోషల్ మీడియాలో వీళ్ల వీడియోలు చూసే జనాలు గందరగోళంలో పడుతుండటం మామూలుగా మారింది. ముందు వెనుకలు ఆలోచించకుండా, నిపుణులను సంప్రదించకుండా, సోషల్ మీడియాలో ఊదరగొట్టే ఆహారారోగ్య ప్రవాచకుల సలహాలు పాటించడం వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారు ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలను ఊదరగొట్టేవారిలో అత్యధికులు వైద్యులు కాదు. కనీసం అర్హత కలిగిన న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు కూడా కాదు. వీళ్లంతా స్వయంప్రకటిత నిపుణులు. వీళ్లలో కొందరు కేవలం తోచిన సలహాలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోకుండా; డాక్టర్లను, ఆధునిక వైద్యరంగాన్ని పూచికపుల్లతో సమానంగా తీసిపారేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ప్రబలుతోంది.థంబ్నెయిల్ ప్రచారాలుసోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుంటాయి. ఈ సలహాలు చెప్పేవారిలో చాలామందికి పోషకాహార శాస్త్రంలో గాని, వైద్యశాస్త్రంలో గాని ఎలాంటి అర్హతలూ ఉండవు. అర్హులైన వారి వీడియోల కంటే అనర్హుల వీడియోలే ఎక్కువగా సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వీటిలో దాదాపు 70 శాతానికి పైగా వీడియోలు ‘స్వయంప్రకటిత’ నిపుణులవే! సోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలు చెబుతూ వీడియోలు చేసేవారిలో అర్హులైన న్యూట్రిషనిస్టులు, వైద్యులు 30 శాతానికి లోపే ఉంటున్నారు.‘సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే ఆహార ఆరోగ్య సలహాలకు ఎలాంటి ఆధారాలూ ఉండవు. వీటిలో ఉండేది చాలావరకు తప్పుడు సమాచారమే’ అని కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలోని మెడిసిన్ రీసెర్చ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ లీ కేహిల్ తన అధ్యయనంలో వెల్లడించారు. ‘సోషల్ మీడియాలోని వీడియోలు చూస్తూ, రకరకాల ఆహార ప్రయోగాలు చేయడం వల్ల సమస్యల బారినపడ్డ వారు చాలామంది నా వద్దకు వస్తుంటారు. సోషల్ మీడియాలో చూసే సమాచారం ఎంతవరకు కచ్చితమైనదో తెలుసుకునే ప్రయత్నం ఎవరికి వారే చేయాలి. పోషకాహారం గురించి, ఆరోగ్య సమస్యల గురించి సాధికారికమైన సమాచారాన్ని అందించే వెబ్సైట్లు, వీడియోలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల గుండె సమస్యలతో బాధపడేవారు ఉత్తపుణ్యానికి పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటున్నారు’ అని కెనడాలోని ఒటావాకు చెందిన రిజిస్టర్డ్ డైటీషియన్ వెరోనికా రోజ్ చెబుతున్నారు. పోషకాహారం గురించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అపోహలను తొలగించి, శాస్త్రీయంగా వాస్తవాలను వెల్లడించడానికి తాను కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు పెడుతున్నట్లు ఆమె తెలిపారు.‘ఇన్స్టాగ్రామ్’లో ఆహార సలహాలు ఇచ్చేవారి వీడియోల్లో దాదాపు సగానికి సగం తప్పుడు సమాచారంతో కూడుకున్నవేనని ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషన్ (ఐపీఏఎన్) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం లక్షకు పైగా ఫాలోవర్లు కలిగిన వారి ఖాతాలనే నమూనాగా తీసుకున్నారు. ‘సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించే అంశాల్లో పోషకాహారం కూడా ఒకటి. అయితే, సోషల్ మీడియా ద్వారా ఈ అంశంపై జనాలకు అందుతున్న సమాచారంలో కచ్చితత్వం, ప్రామాణికత కొరవడుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. సోషల్ మీడియా ద్వారా అర్హతలు లేకుండానే పోషకాహార, ఆరోగ్య సలహాలు ఇచ్చేవారిని కొన్ని ఫుడ్ సప్లిమెంట్ బ్రాండ్లు తమ ప్రచారం కోసం కూడా వాడుకుంటున్నాయి’ అని ఈ అధ్యయనం జరిపిన రీసెర్చ్ స్కాలర్ ఎమిలీ డెన్నిస్ తెలిపారు. సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు ఇచ్చే ఆహార ఆరోగ్య సలహాపైన, వారు ప్రచారం చేసే ఫుడ్ సప్లిమెండ్ బ్రాండ్లపై జనాలు అప్రమత్తంగా ఉండాలని ఎమిలీ హెచ్చరిస్తున్నారు.తప్పుడు సమాచారానికి ఉదాహరణలుసోషల్ మీడియాలో ఆహార ఆరోగ్యాల గురించి ప్రమాదకరమైన స్థాయిలో తప్పుడు సమాచారం వచ్చి పడుతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న తప్పుడు ప్రచారం గురించి కొన్ని ఉదాహరణలు, వాస్తవాలు...ప్రచారం: చక్కెర పూర్తిగా విషం. వాస్తవం: చక్కెర విషమేమీ కాదు. చక్కెర తక్షణ శక్తిదాయకం. పరిమిత మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల నష్టమేమీ ఉండదు.ప్రచారం: ఆల్కలైన్ వాటర్తో అన్నీ నయమైపోతాయి.వాస్తవం: ఆల్కలైన్ వాటర్ శరీరంలోని పీహెచ్ స్థాయిని మార్చేస్తుందని చాలామంది ప్రచారం చేస్తున్నా, ఇది పూర్తి అవాస్తవం. శరీరం తన పీహెచ్ స్థాయిని తానే నియంత్రించుకుంటుంది. ఆల్కలైన్ వాటర్ వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయి అమాంతం మారిపోదు. దాని వల్ల వ్యాధులు నయం కావు.ప్రచారం: గ్లూటెన్ చాలా హానికరం.వాస్తవం: గోధుమలు, బార్లీ వంటి వాటిలో గ్లూటెన్ ఉంటుంది. వీటి పిండితో తయారు చేసే రొట్టెలు, బిస్కట్లు తదితర పదార్థాల్లో ఉండే గ్లూటెన్ కొద్దిమందికి సరిపడదు. ఈ పరిస్థితిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ అంటారు. ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ లేనివారికి గ్లూటెన్ వల్ల జరిగే హాని ఏమీ ఉండదు.ప్రచారం: ఈ ఆహారాలతో క్యాన్సర్ నయమవుతుంది.వాస్తవం: సీతాఫలం గింజలు, లక్ష్మణఫలం, పసుపు, వెల్లుల్లి వంటి పదార్థాలు క్యాన్సర్ను నయం చేస్తాయని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలతోను, ప్రత్యేక ఆహార పద్ధతులతోనే క్యాన్సర్ను నయం చేయడం అసాధ్యం. క్యాన్సర్కు కీమో థెరపీ, రేడియో థెరపీ, ఇమ్యూనో థెరపీ వంటి చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది.ప్రచారం: మా డైట్ ప్లాన్తో వారం రోజుల్లోనే పదికిలోల బరువు తగ్గవచ్చువాస్తవం: ఎలాంటి డైట్ ప్లాన్తోనైనా తక్కువ వ్యవధిలో ఎక్కువ బరువు తగ్గడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అందుకు ప్రయత్నించినా, శరీరంలో పోషక లోపాలు ఏర్పడి అనర్థాలు తలెత్తవచ్చు.ప్రచారం: డీటాక్స్ డ్రింక్స్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తాయి.వాస్తవం: నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ సహా పలు డీటాక్స్ డ్రింక్స్ లివర్, కిడ్నీల పనిని పూర్తిగా భర్తీ చేస్తాయని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవం. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో లివర్, కిడ్నీలు సహజంగానే డీటాక్సిఫికేషన్ చేస్తాయి. ఇవి పాడైనప్పుడు తగిన వైద్య చికిత్స తప్పనిసరి.ప్రచారం: డయాబెటిస్కు మందులు అక్కర్లేదు.వాస్తవం: డయాబెటిస్కు మందులు వాడటం అనవసరమని; వేపాకు, నేరేడు ఆకు, మెంతాకు వంటి ఆకులు తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. కొన్నిరకాల ఆకులు, పండ్లు వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి స్వల్పంగా అదుపులోకి వచ్చినా, ఇవేవీ డయాబెటిస్ చికిత్సకు పూర్తి ప్రత్యామ్నాయం కావు.ప్రచారం: నూనెలు, నెయ్యి, ఇతర కొవ్వులతోనే ఆరోగ్య సమస్యలువాస్తవం: సమతుల పోషకాహారంలో కొవ్వులు కూడా తప్పనిసరి భాగంగా ఉండాలి. కొవ్వులను, నూనెలను పూర్తిగా మానేస్తే పోషక లోపాలు ఏర్పడతాయి. కొవ్వుల్లో కరిగే ఏ, డీ, ఈ, కే విటమిన్ల లోపం ఏర్పడి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలు, కొవ్వులను తగిన మోతాదులో వాడాలి.ప్రచారం: ఎంత కొవ్వు తిన్నా హానిలేదు.వాస్తవం: వెన్న, నెయ్యి, కొబ్బరినూనె ఎంత తిన్నా ఏమీ కాదని, వీటితో బరువు తగ్గవచ్చని కొందరి ప్రచారం. ఇవి మితిమీరితే బరువు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఎక్కువ. పైగా ఒంట్లో కొవ్వు మితిమీరితే అధిక బరువు మొదలుకొని గుండెజబ్బుల వరకు రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ప్రచారం: కీటో డైట్తో డయాబెటిస్ పూర్తిగా నయమవుతుంది.వాస్తవం: కీటో డైట్ తీసుకుంటే, డయాబెటిస్ మందులతో పని ఉండదని కొందరి ప్రచారం. కీటో డైట్ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ కొంత మెరుగుపడవచ్చు. అలాగని డాక్టర్లు సూచించిన మందులు వాడటం ఆపేస్తే పరిస్థితి విషమించే ప్రమాదాలు ఉంటాయి.తప్పుడు సమాచారం ఉచ్చులో యువతరంసోషల్ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన తప్పుడు సమాచారానికి యువతరమే ఎక్కువగా ప్రభావితమవుతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. తెలిసీ తెలియని స్థితిలో ఉండే 18–25 ఏళ్ల లోపు వయసువారు ఈ వీడియోల ద్వారా ప్రభావితమై, కనీసం నిపుణులను సంప్రదించకుండా రకరకాల ఆహార పద్ధతులను పాటిస్తూ ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని న్యూజీలండ్కు చెందిన ‘సెంటర్ ఫర్ న్యూట్రిషనల్ సైకాలజీ’ అధ్యయనం వెల్లడించింది.శరీరాకృతి, చర్మం తీరు, జుట్టు తీరు వంటి చిన్న చిన్న అంశాల్లో అపనమ్మకంగా ఉండే యువత సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో చెప్పేవారి సలహాలు విని, వాటిని పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయనే భ్రమతో స్వయంగా ప్రయోగాలు చేస్తున్నారని, అకస్మాత్తుగా ఆహారపు అలవాట్లను మార్చుకుని చిక్కుల్లో పడుతున్నారని ఈ అధ్యయనం జరిపిన బృందానికి నేతృత్వం వహించిన జాక్ ఆర్.హెచ్.కూపర్ చెబుతున్నారు.‘కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో చాలామంది సోషల్ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాల పట్ల తేలికగా ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వాటిలో వచ్చే వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే సలహాలు పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మి ఆహార పద్ధతులపై ప్రయోగాలు చేస్తున్నారు. వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు ఊదరగొట్టే స్థాయిలో ఫలితాలు రాకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొస్తుండటంతో మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు’ అని కూపర్ వెల్లడించారు.నియంత్రణ లోపమే అసలు సమస్యపోషకాహార సలహాలు, ఆరోగ్య సలహాలు ఎవరు ఇవ్వాలనే దానిపై నియమ నిబంధనలు, నియంత్రణ లేకపోవడమే అసలు సమస్యగా ఉంటోంది. ఇతరేతర రంగాల్లో డిగ్రీలు ఉన్నవాళ్లు కూడా సోషల్ మీడియాలో స్వయంప్రకటిత పోషకాహార ఆరోగ్య నిపుణులుగా చలామణీ అవుతున్నారు. శరీరనిర్మాణ శాస్త్రం, పోషకాహార శాస్త్రం వంటి అంశాల్లో అవగాహన లేకుండానే, తాము నమ్మిన విషయాలనే పరమ సత్యాలుగా ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 కింద ఏర్పడిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార ఉత్పత్తులు, ఫుడ్ సప్లిమెంట్ల నాణ్యత ప్రమాణాలపై మాత్రమే నియంత్రణ కలిగి ఉంది.ఆహార ఆరోగ్య సలహాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఎలాంటి నియంత్రణ లేదు. ఆహార ఆరోగ్యాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని నియంత్రించడానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేవు. మన దేశం నుంచి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆహార ఆరోగ్య అంశాలపై ప్రతిరోజూ పుంఖాను పుంఖాలుగా వస్తున్న వీడియోల్లో దాదాపు 80 శాతం వరకు గుర్తింపు కలిగిన అర్హతలు లేనివారు చెబుతున్నవేనని ఒక అంచనా.ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్న వారిలో ఆధునిక వైద్యంలోను; ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, నేచురోపతి తదితర వైద్య విధానాల్లోను; న్యూట్రిషన్, డైటెటిక్స్ విధానాల్లోను డిగ్రీలు కలిగిన వారు సుమారు 20 శాతం వరకు మాత్రమే ఉంటున్నారు. అయితే, అర్హతలు లేనివారి వీడియోలకు కూడా లక్షలాది ఫాలోవర్లు ఉంటుండటమే ఆందోళన కలిగించే అంశం.తప్పుడు ప్రచారానికి కారణాలు...సోషల్ మీడియాతో ప్రచారం మాత్రమే కాదు, డబ్బు కూడా దండిగా వస్తుంది. యూట్యూబ్, ఇన్స్ట్రాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ఎక్కువమంది చూసే కంటెంట్ను మరింత ఎక్కువమందికి చూపిస్తాయి. దీనివల్ల ప్రకటనలు ఎక్కువగా వస్తాయి. ప్రకటనల ఆదాయంలో కొంత వీటిలో వీడియోలు పెడుతున్నవారికి వస్తుంది. దీనికితోడు సప్లిమెంట్లు, డైట్ కోర్సుల అమ్మకాలకు కూడా సంబంధిత కంపెనీలు ‘స్వయంప్రకటిత’ నిపుణులను సాధనంగా ఉపయోగించుకుంటాయి. వీటి ద్వారా కూడా వారికి ఆదాయం వస్తుంది. ప్రచారానికి ప్రచారం, ఆదాయానికి ఆదాయం అప్పనంగా దొరుకుతుండటంతో కొందరు తమ చదువుకు, నైపుణ్యాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అకస్మాత్తుగా ఆహార ఆరోగ్య నిపుణులుగా సోషల్ మీడియాలో అవతారమెత్తుతూ జనాలను గందరగోళంలో ముంచుతున్నారు. కొంచెం దృష్టిపెడితే, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో అసలైనవేవో, తప్పుడు ప్రచారంతో కూడినవేవో తేలికగానే కనిపెట్టవచ్చు. ‘డాక్టర్లు దాచిన రహస్యం!’, ‘ఫార్మసీ మాఫియా’, ‘శాస్త్రవేత్తలకే తెలియని ఆరోగ్య రహస్యం’, ‘వారం రోజుల్లో ఫ్యాటీ లివర్ నయం’, ‘క్యాన్సర్ను ఈజీగా తగ్గించవచ్చు’, ‘ఈ తైలంతో పక్షవాతం నయం’ వంటి థంబ్నెయిల్స్తో వచ్చే కంటెంట్లో చాలావరకు అవాస్తవాలే ఉంటాయి. వీటిని ప్రచారంలోకి తెచ్చేవారికి ఆహార, ఆరోగ్య, వైద్య శాస్త్రాలపై కనీస అవగాహన కూడా ఉండదు. సోషల్ మీడియాలో కొద్ది శాతమైనా అర్హులైన వైద్యులు కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కంటెంట్కు, పోస్ట్ చేసిన వారి అర్హతలను బేరీజు వేసుకుని ఈ వీడియోలను చూడటం క్షేమం.∙పన్యాల జగన్నాథదాసు -
93.95 కోట్లు దాటిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లు
భారతదేశ ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ (ఏబీడీఎం) ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ల్లో ఒకటిగా అవతరించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 93.95 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు (ఆబా) జనరేట్ అయ్యాయని, వీటికి అనుబంధంగా 105 కోట్ల ఆరోగ్య రికార్డులను డిజిటల్గా లింక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా అధ్యక్షతన జరిగిన మిషన్ స్టీరింగ్ గ్రూప్ మూడో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలో డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణ (రోడ్మ్యాప్)పై చర్చించారు.రికార్డు స్థాయిలో డిజిటల్ నమోదుదేశంలో వైద్య సేవలను పారదర్శకంగా, వేగవంతంగా మార్చే ప్రక్రియలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ రిజిస్ట్రీల్లో భారీగా నమోదు ప్రక్రియ సాగుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం..ఆరోగ్య ఖాతాలు (ఆబా) 93.95 కోట్లు దాటాయి.లింక్ అయిన హెల్త్ రికార్డులు 105 కోట్లకు పైగా ఉన్నాయి.నమోదైన ఆరోగ్య సౌకర్యాలు (హాస్పిటల్స్/క్లినిక్స్) 5.33 లక్షలు.నమోదైన ఆరోగ్య సంరక్షణ నిపుణులు (డాక్టర్లు/నర్స్ లు) 9.85 లక్షల మంది.2.72 లక్షల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏబీడీఎం సాఫ్ట్వేర్ సాంకేతికతను వాడుతున్నాయి.ఆసుపత్రుల్లో ఓపీడీ కోసం క్యూలైన్ బాధలు తప్పించే ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ విధానం ద్వారా దాదాపు 24 కోట్ల టోకెన్లను జనరేట్ చేశారు.డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్రనాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సామాన్యుడికి సైతం చేరవేయడంలో, పౌరుల ఆరోగ్య రికార్డులను అత్యంత సురక్షితంగా భద్రపరచడంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా స్పష్టం చేశారు. ‘సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తోంది. ప్రతి పౌరుడికి సులభంగా, పారదర్శకంగా వైద్య సేవలు అందడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది’ అని నడ్డా చెప్పారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
మెన్స్ట్రువల్ లీవ్.. ఓ చర్చ! బలమా... బలహీనతా?
ఉద్యోగాలు చేసే మహిళలకు ఇచ్చే మెన్ స్ట్రువల్ లీవ్ పాలసీపై సానుకూల, ప్రతికూల కోణాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని కార్పొరేట్ కంపెనీలు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తుండగా.. సుప్రీంకోర్టు, పలువురు మేధావులు మహిళలకు పీరియడ్స్ లీవ్స్ తప్పనిసరి చేయడం వల్ల వారు ఉపాధి రంగంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉండటమే కాదు, ప్రాజెక్ట్ డెడ్లైన్లు, వ్యాపార ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ సంస్థలు పురుషులకేప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సెలవుల వల్ల పురుషులతో సమానంగా గుర్తింపు, వేతనం కోసం మహిళలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు నీరుగారిపోయి, మహిళలను శారీరకంగా బలహీనులుగా చూసే పాతకాలపు మూస పద్ధతులు మళ్లీ బలపడతాయని ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.కాబట్టి మహిళల కెరీర్ను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన విధానాలను రూ΄÷ందించాలి. అంటే ‘ఆ రోజుల్లో’ ఇంటినుంచి పనిచేసే సౌలభ్యం ఇవ్వడం, మెడికల్ లీవ్స్ పెంచడం, పనిగంటల్లో వెసులుబాటు... వంటివి. దీనివల్ల యాజమాన్యాలకు నష్టం జరగకుండా.. పని ఉత్పాదకత లో మార్పు లేకుండా ఉంటుంది. మహిళలకూ ఉపశమనంగా ఉంటుంది. దీనివల్ల మెన్స్ట్రువల్ లీవ్ అనే ప్రత్యేక లేబుల్ లేకుండా.. మహిళల గోప్యతకు భంగం లేకుండా కూడా ఉంటుందని పలువురి అభిప్రాయం. -
Health: శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి..
‘నెలసరి సమస్యల గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత అవగాహన పెరుగుతుంది’ అంటున్నారు వైద్యులు. ‘శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి, అర్థం చేసుకోవాలి’ అంటున్నారు. పీరియడ్ సేఫ్ గురించి స్త్రీల వైద్య నిపుణులు చెప్పే విషయాలు తెలుసుకుందాం.. ఆచరణలో పెడదాం..సేఫ్ పీరియడ్ పద్ధతిని అనుసరించాలనుకునే మహిళలు ముందుగా తమ రుతుక్రమ చక్రాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు గమనించడం మంచిది. ప్రతి నెల పీరియడ్స్ ప్రారంభమైన తేదీని నమోదు చేసుకోవడం, చక్రం క్రమబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. అవసరమైతే మొబైల్ యాప్ లేదా క్యాలెండర్ను ఉపయోగించవచ్చు. సాధారణంగా 28 రోజుల క్రమబద్ధమైన నెలసరి చక్రం ఉంటుంది. అయితే, ప్రతి మహిళ రుతుక్రమ చక్రం ఒకేలా ఉండదు. కొందరికి 21 రోజులు, మరికొందరికి 35 రోజుల వరకు కూడా సైకిల్ ఉండవచ్చు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ప్రయాణాలు, అనారోగ్యం, బరువులో మార్పులు వంటి కారణాల వల్ల అండాల విడుదల తేదీ మారవచ్చు. అందుకని ఎవరికి వారు మెన్స్ట్రువల్ క్యాలెండర్ని ఏర్పాటు చేసుకోవాలి.ప్యాడ్స్ పడేయడమూ సమస్యే!రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేవాళ్లు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవాలనే అవగాహన ఉంది. కానీ, వాటిని ఎక్కడ పడేయాలో తెలియక, ఇంట్లో పిల్లలు ప్రశ్నిస్తారనో, ఎవరూ చూడకుండా చీకటిపడ్డాక తీసేద్దామని అలాగే ఉంచడం.. ఈ కారణాలతో రోజంతా ప్యాడ్స్లోనే ఉంటారు. కొందరు తక్కువ స్రావం అవుతుందని ప్యాడ్స్ ఖర్చు తగ్గించుకోవడానికి కూడా రోజంతా అలాగే వాడతారు. ప్రతి 4 నుంచి 8 గంటలలోపు ప్యాడ్ మార్చుకోవాలి. లేదంటే అలెర్జీ, ఇన్ఫెక్షన్ వస్తాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్యాడ్స్ అందిస్తే వాడి పడేస్తారు. తిరిగి అడగరు. వారికై వారు కొనుగోలు చేయరు. సమస్య మళ్లీ మొదలవుతుంది. వారికి మెనుస్ట్రువల్ కప్స్ వాడకాన్నిప్రోత్సహిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. పీరియడ్ సేఫ్ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యంపై అవగాహన, శాస్త్రీయ సమాచారం, వైద్యుల సూచనలు ఉంటేనే మహిళలు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మరింత సురక్షితంగా కాపాడుకోగలరు.అవగాహన తప్పనిసరి..పిల్లలు కావాలని డాక్టర్లను సంప్రదించేవారే తమ రుతుక్రమ సైకిల్ను శ్రద్ధగా పట్టించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. స్కూల్కి వెళ్లే అమ్మాయిలకు తమ శరీరం గురించి, రుతుక్రమం సైకిల్ గురించి సరైన అవగాహన లేక΄ోవడం వల్ల గర్భధారణ, విచ్చిత్తి.. వంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. పీరియడ్స్ వచ్చిన అయిదవ రోజు నుంచి శరీరంలో జరిగే మార్పుల గురించి అమ్మాయిలకు చె΄్పాలి. ఈ విషయంలో టీచర్లు, తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – డాక్టర్ మనోరమ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్సొంత నిర్ణయాలు వద్దు..చాలా మంది నెలసరి సమయాలలో అధిక రక్తస్రావం, హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, తీవ్రమైన నొప్పి.. వంటి సమస్యలెన్నో ఎదుర్కొంటుంటారు. ఇక గర్భధారణ లేదంటే గర్భం రాకూడదనుకునేవాళ్లు తమ సొంత నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నెలసరి ఆలస్యం కావడానికి వాడే మాత్రలు, గర్భనిరోధక పద్ధతులు వైద్యుల సూచన మేరకే ఉపయోగించాలి. లేదంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి మహిళ శరీరం భిన్నమైనది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా పాటించడం సురక్షితమైన మార్గం.– డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్ -
సంతోషాన్ని ప్రకటించడానికి 'నవ్వు' చాలు..
నవ్వే ఆరోగ్యం అని, ఔషధం అనీ కొందరంటుంటే అందానికి చిహ్నం అని మరికొందరు అంటున్నారు.. నవ్వుల రేడు చార్లీ చార్లిన్ నవ్వలేని రోజు వృథా అంటాడు... శతకాల్లో నవ్వును గురించి పెద్దలు ఏం చెప్పారో తెలుసుకుందాం.సభల్లో, పెద్దల ముందు ఎవరిని చూసి నవ్వకూడదో సుమతీ శతకంలో బద్దెన చెప్పాడు...‘నవ్వకుమీ సభ లోపల నవ్వకుమీతల్లిదండ్రి నాధులతోడన్నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ‘తాను చెప్తున్నది లోకనీతి అంటూ ఎవరితో అపహాస్యంగా నవ్వకూడదో ఒక జాబితా తయారు చేశాడు బద్దెన. ఏడు శతాబ్దాలు దాటినా బద్దెన చెప్పిన మాటలు ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనువర్తించేలా ఉంటాయి..వేమన ‘కల్మషం లేని నవ్వును, నిర్మలమైన మనస్సులేని నవ్వును నిజమైన నవ్వు కాద’ని తీర్పే ఇచ్చాడు.అదే తోవలో కపట నవ్వుని ప్రస్తావిస్తూ ఆ నవ్వు నవ్వే కాదని తేల్చేశాడు.‘మనసునందు మాలిన్యంబు మానకుండామాటలందు మైత్రి నాటింపనేలలోని కల్మషంబు లేకుండ నవ్వని నవ్వు నవ్వు గాదు నరులకెల్లవిశ్వదాభిరామ వినుర వేమ..’ అని అంటాడు.నిర్మలమైన మనసుకు నవ్వే అందం అంటాడు.‘తప్పులెన్నువారు తమ తమ తప్పులెరుగురు’ అన్నట్లు..‘తమకుగల్గు పెక్కు తప్పులునుండగా ఓగు నేరమంచు నోరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్టు విశ్వదాభిరామ వినుర వేమ ‘పద్యం లో ‘నగి’ అంటే నవ్వు గూర్చి ప్రస్తావన... చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.మరో సందర్భంలో వేమన ఏమని అంటున్నాడో చదవండి.‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వుదానహీను జూచి ధనము నవ్వుకదన భీతు జూచి కాలుండు నవ్వును ‘ఇందులో నవ్వు మాట వచ్చినా వేదాంతం గోచరిస్తుంది..ఈ రోజుల్లో భూమి కోసం హత్యలు చేస్తున్నారు... యాజమాన్యం మారుతుంది, భూమి మారదు, అందుకే నవ్వుతుందేమో.. దానం చేయమని, యుద్ధంలో పారిపోకుండా ఉండాలని యోగి భావన.భాస్కర శతకం ద్వారా ‘పరులను హేళన చేసేవాడు తానే నవ్వుల పాలవుతాడు’ చెప్పారు..సంతోషాన్ని ప్రకటించడానికి నవ్వు చాలు.. మనసారా నవ్వండి.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
నీళ్లు తాగితే ఇరుక్కుపోతాయేమోనని.. తాగడమే మానేశా!
నాకు 24 ఏళ్లు. నేను బీటెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాను. మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి మా అమ్మే ఎంతో కష్టపడి నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. నాకు గత ఆరు నెలలుగా గొంతులో ఏదో ముద్ద ఉన్నట్లుగా అనిపిస్తోంది. మొదట్లో తినడానికి, తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ క్రమంగా ఏదైనా తింటే లేదా నీళ్లు తాగితే అవి గొంతులోనే ఇరుక్కుపోతాయేమో, ఊపిరాడక చనిపోతానేమో అనే భయం మొదలై, అన్నం, నీళ్లు చాలా తక్కువగా తీసుకుంటున్నాను. దాంతో నా బరువు కూడా బాగా తగ్గిపోయింది. ఈఎన్టీ స్పెషలిస్టును సంప్రదించాను. ఆయన పరీక్షించి గొంతులో ఎలాంటి సమస్యా లేదని, ఒకసారి సైకియాట్రిస్టును కలవమని సూచించారు. గొంతులో మింగడానికి ఇబ్బంది ఉంటే సైకియాట్రిస్టును ఎందుకు కలవాలన్నది నా సందేహం. – సుజాత, తిరుపతిమీరు పడుతున్న ఇబ్బంది, మీ మనసులోని ఆందోళన అర్థమైంది. అధైర్య పడకండి, సమస్య ఏదైనా... దానికి పరిష్కారం ఉంటుంది. మీరు చెప్పిన వివరాల ప్రకారం వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘గ్లోబస్ ఫారింజియస్’ లేదా ‘ఫాగోఫోబియా’ అంటారు, అంటే మింగడానికి భయపడటం. మన మనసుకు, శరీరానికి విడదీయరాని సంబంధం ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నప్పుడు, శరీరం రకరకాలుగా స్పందిస్తుంది. మీ విషయంలో ఆ ఒత్తిడి గొంతులోని కండరాలను గట్టిగా బిగుసుకుపోయేలా చేసింది, దాంతో ఏదో ముద్దలా అడ్డం పడినట్లు అనిపిస్తోంది. ఇది శారీరక రోగం కాదు, తీవ్రమైన ఆందోళన వల్ల శరీరం చూపే స్పందన మాత్రమే, దీనినే ‘సైకోసోమాటిక్ సింప్టమ్’ అంటారు.రూపాయి నాణెంలో బొమ్మను, బొరుసును ఎలా వేరు చేయలేమో మనిషి మనసును– శరీరాన్ని కూడా వేరు చేయలేము. వాటిలో ఒకటి ఒత్తిడికి లోనయితే మరొకటి స్పందిస్తుంది. ఇలాంటి వాటిని నయం చేయడానికి సైకియాట్రిస్ట్లే సరైన నిపుణులు. ఒంట్లో నలతగా ఉంటే జనరల్ ఫిజీషియన్ ను ఎలా కలుస్తామో... మనసులో ఆందోళన ఎక్కువైతే సైకియాట్రిస్ట్ను అలాగే కలవాలి, ఇందులో సంకోచించడానికేం లేదు.మీరు తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్న మంచి మానసిక వైద్యుణ్ణి కలవండి, మీ ఆందోళన తగ్గడానికి వారు కొన్ని సురక్షితమైన మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు, దీనివల్ల గొంతు కండరాలు రిలాక్స్ అయి, మింగడం మళ్లీ మామూలైపోతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు త్వరగా కోలుకుంటేనే, మీ కుటుంబానికి మీరు అనుకున్నట్లుగా ఆసరాగా నిలబడగలుగుతారు. మంచి వైద్యం అందుబాటులో ఉన్న ఈ చిన్న సమస్యను, అనవసరమైన అపోహలతో పెద్దది చేసుకోకండి, మీరు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, ఉద్యోగంలో స్థిరపడాలని ఆశిస్తున్నాను, మీకు అంతా మంచే జరుగుతుంది!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
డాక్టర్ రోబో..! ఎంత దూరం నుంచైనా..
మనిషి నిర్మించిన యంత్రాల్లో అద్భుతమైనదీ, మానవుడికి ఇప్పుడు దాదాపుగా ప్రత్నామ్నాయం లాంటిది ‘రోబో’. అప్పట్లో కేవలం సైన్స్ ఫిక్షన్లా ఉన్న ‘ రోబో’లు ఇప్పుడు మానవ దేహ నిర్మాణానికి ఉండే పరిమితులను అ«ధిగమించి పనిచేస్తున్నాయి. దాంతో కొన్ని సమయాల్లో ఫిక్షన్కూ, వాస్తవానికీ మధ్య ఉండే సన్నటి రేఖ కూడా చెరిగిపోయిందా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానవుడు చేయడానికి కొంత ఇబ్బంది పడేవీ, లేదా పూర్తిగా చేయలేకపోయే ఎన్నింటినో ‘రోబో’ అలవోకగా చేసేస్తుంది.అందులో సర్జరీలూ ఉండటం విశేషం. సర్జరీలో మనిషి చేయి కొన్ని సంక్లిష్టమైన చోట్లకు చేరడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ‘యంత్రుడి’ వేళ్లు అలాంటి చోట్లకూ చేరగలవు. నిజానికి ఈ పనులు రోబో చేస్తున్నట్టు అనిపించినా మళ్లీ వాటిని నిజానికి చేసేది నిపుణులైన శస్త్రచికిత్సకులే. కొన్ని కష్టసాధ్యమైన శస్త్రచికిత్సల్ని రోబోలు ఎలా చేస్తున్నాయో, ఏయే వైద్యవిభాగాల్లోని ఏయే శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో తెలపడంతో పాటు రోబోలకు సంబంధించి అనేక అంశాలను ఈ కథనంలో చూద్దాం.రోబోటిక్ టెలీ సర్జరీతో వైద్యరంగంలో కొత్త అధ్యాయం ఈ రోబో శస్త్రచికిత్సలని చెప్పవచ్చు. ప్రస్తుతం రోబోటిక్ టెలీ సర్జరీ ప్రపంచ వైద్యరంగంలో విప్లవాత్మక సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది. అమెరికాలో దాదాపు పదేళ్ల క్రితమే ఈ విధానం ప్రయోగాత్మకంగాప్రారంభమైంది. యుద్ధరంగంలోని సైనికులకు నేరుగా వెళ్లి శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండకపోవడంతో... సమరరంగంలో ఉన్నవారికీ సర్జరీలు చేసే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్సలు ఇప్పుడు పూర్తిస్థాయిలో అవసరమైన బాధితులకు అందుతున్నాయి.మన భారతదేశంలో మాత్రం గత మూడేళ్లుగా ఈ సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ, వైద్య సేవలను మరింత మందికి అందునా సుదూరప్రాంతాల్లోని పేషెంట్స్కు పెద్ద పెద్ద నగరాల్లో ఉండే అత్యంత నిపుణులైన శస్త్రచికిత్సల నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఇండియా వంటి విశాలమైన దేశంలో, ఒక రాష్ట్రంలో ఉన్న నిపుణులైన వైద్యులు మరో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లకుండానే రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలు చేయగలగడం ఈ సాంకేతికత తాలూకు ప్రధాన ప్రయోజనం. దీంతో నాణ్యమైన వైద్య సేవలు దూర ప్రాంతాల రోగులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.భారతదేశంలో రోబోటిక్ టెలీ సర్జరీకి శ్రీకారం చుట్టిన వారిలో డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ ప్రముఖులు. ఆయన ఢిల్లీలోని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి దూర నియంత్రణ ద్వారా తొలి గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కిడ్నీ, ప్రోస్టేట్ తదితర సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా ఈ విధానంలో విజయవంతంగా నిర్వహితమయ్యాయి.ఈ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా డా. చంద్రమోహన్ వడ్డి (ప్రస్తుత ఈ కథన / ఆర్టికల్) రచయిత కూడా ఢిల్లీలోని రోబోటిక్ కన్సోల్ నుంచి హైదరాబాద్లో ఉన్న కేవలం 16 నెలల చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో రోబోటిక్ టెలీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయం తాలూకు కేసు వివరాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురితమయ్యాయి.అటు తర్వాత దేశంలోని పలుప్రాంతాల మధ్య, అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా రోబోటిక్ టెలీ సర్జరీలు విజయవంతంగా నిర్వహితమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్లోని పేషెంట్కూ టెలీ సర్జరీ నిర్వహించడం ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియజేస్తోంది. భవిష్యత్తులో రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా దూరప్రాంతాల్లోని రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, సురక్షితంగా అందించడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయం.ఇటీవలి చైనా కేస్ స్టడీ : ఇటీవలే మన భారతీయ డాక్టర్ ఒకరు చైనా నుంచి దాదాపుమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్లోని పేషెంట్కు రోబో సహాయంతో శస్త్రచికిత్స చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన ఈ సర్జరీలో సుదూరంలో ఉన్న ఊహాన్ నగరంలోని టాంగ్జీ హాస్పిటల్లోంచి... దేశ దేశాంతరాలు దాటి మరీ మన హైదరాబాద్లోని పేషెంట్కు శస్త్రచికిత్స చేయడం... ఆ చేసిన వైద్యుడు కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్ అనే మన భారతీయ డాక్టర్ కావడం మన దేశవాసులందరికీ గర్వకారణమైన విషయం. అల్ట్రాఫాస్ట్ 5జీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో జరిగిన ఈ సర్జరీ చేసింది. మన ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ విషయాన్ని భారత్లోని చైనా ఎంబసీ స్పోక్స్పర్సన్ యూ జింగ్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘3000 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ పేషెంట్కు 5జీ టెక్నాలజీ సహాయంతో సరిహద్దులను అధిగమించి జీవితాన్ని రక్షించే వైద్య సహాయం అందించడం ఓ అద్భుతం’’ అని ఆమె ‘ఎక్స్’లో ప్రస్తావించారు.ఆపరేషన్కు ముందర ఇక్కడ హైదరాబాద్లో కూడా డాక్టర్లు అవసరమైన ఉపకరణాలను, హై–డెఫినిషన్ కెమెరాలను సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేశాక... అక్కడ వూహాన్లోని టాంగ్జీ హాస్పిటల్లో డాక్టర్ గౌస్ శస్త్రచికిత్స మొదలు పెట్టగానే ఇక్కడి రోబోటిక్ హస్తాలు శస్త్రచికిత్స చేయాల్సిన భాగాన్ని 3–డీ చిత్రాల్లో చూస్తూ తమ పనులు పూర్తి చేశాయి. హైస్పీడ్ 5జీ నెట్వర్క్ కావడంతో కేవలం 200 మిల్లీసెకండ్స్లోనే డాక్టర్ ఆజ్ఞలు పేషెంట్కు చేరి సజావుగా సర్జరీ జరగడంతో పాటు అది విజయవంతమూ అయ్యింది. అయితే సమాంతరంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే రంగంలోకి దూకడానికి సిద్ధంగా డాక్టర్లంతా శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ అప్రమత్తంగా అక్కడే ఉన్నారు.‘ద ఇంటర్నేషనల్ హెపాటో ΄్యాంక్రియాటో బిలియరీ అసోసియేషన్’, చైనీస్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 డెమాన్స్ట్రేషన్స్లో ఈ శస్త్రచికిత్స కూడా ఒకటి. ఇందులో లైవ్గా శస్త్రచికిత్స చేసి చూపినవారిలో... భారత్, బ్రెజిల్, జార్జియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వైద్యనిపుణులున్నారు.చూడగలిగే రేంజ్ కూడా ఎక్కువే... రోబో చేతుల సహాయంతో సర్జరీ చేస్తున్నప్పుడు... డాక్టర్ తాను శస్త్రచికిత్స నిర్వహిస్తున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్ను) 3–డీ ఇమేజ్లో తెరపై స్పష్టంగా చూస్తుంటారు. ఆ వర్చువల్ ఇమేజ్ చాలా పెద్దగా, స్పష్టంగా ఉండటంతో అక్కడి నరాలూ, రక్తనాళాలు చాలా పెద్దగా (మాగ్నిఫికేషన్తో) కంటికి కనిపిస్తుంటాయి. ఈ అంశం కూడా సాంప్రదాయికమైన శస్త్రచికిత్స కంటే రోబో చేసే సర్జరీని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. అంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో సదరు అవయవభాగం కాస్త వెనక ఉంటే అది స్పష్టంగా కనిపించక... తెగకూడని భాగం ప్రమాదవశాత్తూ తెగేందుకు అవకాశం ఉంటే ఉండవచ్చుగానీ... చాలా ఎక్కువ మాగ్నిఫికేషన్తో అన్ని అవయవాలూ, నరాలూ, రక్తనాళాలూ కనిపిస్తున్నప్పుడు మరి దేన్నీ టచ్ చేయకుండా కేవలం కోయాల్సిన భాగంలోనే కోత పడటమూ, రక్షించాల్సిన అవయవాలకు ఏమాత్రం దెబ్బతగలకుండా చూసుకోవడం సాధ్యమవుతాయి.స్పష్టత ఎక్కువ... మెరుగుదలా ఎక్కువే... సంప్రదాయ శస్త్రచికిత్సలో నేరుగా చూసేవాటితో పోలిస్తే... ఇక్కడ రోబోటిక్ శస్త్రచికిత్సలో.... డాక్టర్లు తాము తొలగించాల్సిన హానికరమైన చిన్న కణుతుల్నీ, గడ్డలనూ... లేదా కుట్లు వేయాల్సిన అత్యంత సన్నటి సూచర్స్ వంటి వాటిని (అంటే కొన్నిసార్లు పెన్సిల్లోపలి లెడ్ కంటే సన్నటి రక్తనాళాల్నీ, అలాంటి అవయవాల్ని) స్పష్టంగా చూడగలుగుతుంటారు. దాంతో తాము చేయాల్సిన పనుల్ని నైపుణ్యంతో మరిత సమర్థంగానూ చేయగలుగుతారు. ఇక్కడ నిశితత్వం కూడా ఎక్కువే. అంటే ఉదాహరణకు తొలగించాల్సిన కణజాలాన్ని అత్యంత ఖచ్చితంగా అవసరమైనంత మేరకే తొలగించవచ్చు. అదే నేరుగా మనిషి చేతితో చేసే శస్త్రచికిత్సల్లో హానికర కణజాలాన్ని మళ్లీ పెరగకుండా నివారించేందుకు కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్నీ తొలగించాల్సి రావచ్చు. కానీ రోబో సాయంతో అదెంతో ఆక్యురేట్గా జరుగుతుంది. కాబట్టి మున్ముందు హానికర కణజాలం మళ్లీ పెరగకుండా ఉండేందుకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మరింత సురక్షితమంటే... కోత చాలా చిన్నగా, ఖచ్చితంగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోతా, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. అంతేకాదు... సర్జరీకి పట్టే సమయమూ, అవసరమైన మత్తుమందూ, రక్తస్రావం... ఇఅన్నీ తక్కువే. దాంతో శస్త్రచికిత్స మరింత సురక్షితం కావడంతో కోలుకోవడమూ చాలా వేగంగా జరుగుతుంది.ఏయే శాఖల్లో ఏయే శస్త్రచికిత్సలు? మొదట్లో రోబో సహాయంతో నిర్వహించే శస్త్రచికిత్సలు... మెదడు వంటి కీలకమైన, సున్నితమైన ప్రదేశాల్లో చాలా లోతుగా ఉండి, మానవ హస్తంగా అంత తేలిగ్గా చేరలేని భాగాల్లోనే జరిగేవి. ఉదాహరణకు... మెదడు కణితి తొలగింపు చికిత్సల్లో ట్యూమర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే... చిన్న రంధ్రంనుంచి అత్యంత నిశితంగా, ఎంతో నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో చక్కగా సహాయపడుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు. అలాగే మూర్ఛవ్యాధికి సాధారణంగా మందులతోనే చికిత్స జరుగుతుంది. అయితే ఎంతకీ తగ్గని కేసుల్లో అత్యంత సునిశితంగా శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో సహాయం తీసుకోవడం వల్ల సర్జరీ మరింత ఎక్కువ సురక్షితంగా జరుగుతుంది.అయితే... వైద్యశాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోబోల సర్జరీలు ఇప్పుడు రకరకాల వైద్యవిభాగాల్లోకి విస్తరించాయి. ఉదాహరణకు సంయుక్తంగా మొత్తం మూత్ర వ్యవస్థ (యూరో, నెఫ్రో, గైనిక్) విభాగాలతో పాటు ఇంకా అనేక విభాగాల్లో రోబో సహాయంతో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోబోలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న దేహ వ్యవస్తలూ... ఆ వ్యవస్థల్లో ఏయే శస్త్రచికిత్సలను అవి నిర్వహిస్తున్నాయో చూద్దాం.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి... ∙విపుల్ ప్రొసీజర్ : పాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్ను (పిత్తాశయాన్ని), బైల్ డక్ట్ను తొలగించే శస్త్రచికిత్సను ‘పాంక్రియాటికో–డియోడనెక్టమీ’ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయా భాగాల్లోని గడ్డల తొలగింపుతో పాటు... పాంక్రియాస్, చిన్నపేగులు, గాల్బ్లాడర్లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్రానిక్ పాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.థైరాయిడెక్టమీ..క్యాన్సర్కు గురైన థైరాయిడ్ను తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా ఉండదు. అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు కాస్మటిక్గా ఇదో వరం.భవిష్యత్ ఆశారేఖగా ‘మైక్రో–రోబో’ చికిత్స! సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది డాక్టర్లతో పాటు చాలామంది పేషెంట్లకూ తెలిసిన విషయమే. తొలుత వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా అటు తర్వాత ఊపిరితిత్తుల్లో నిమోనియా వస్తే దాన్ని ‘సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్’ అంటారు. నేరుగా వచ్చే నిమోనియా కంటే దీంతో ప్రమాదం చాలా ఎక్కువ.ఇలాంటి ప్రమాదకరమైన నిమోనియాకి చాలా చాలా చిన్నవైన మైక్రోస్కోపిక్ ‘రోబో’లతో కొంతకాలం కిందట వైద్య పరిశోధకులు ఎలుకల్లో ఓ ప్రయోగాత్మకమైన చికిత్స నిర్వహించారు. అతి చిన్న ఆల్గైలను (పాచిలాంటి మొక్కలను) సేకరించి మైక్రోస్కోపులో చూస్తే తప్ప కనిపించనంతటి ఆ చిన్న చిన్న జీవమున్న మొక్కలపై ‘యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్’ను పైపూతగా పూశారు. ఈ పూత... ఇన్ఫెక్షన్లను సమూలంగా నిర్మూలించే తెల్లరక్తకణాల్లోని ‘న్యూట్రోఫిల్స్’.వాటినే ఓ పూతలా పూసి నిమోనియాతో బాధపడుతున్న ఎలుకల ఊపిరితిత్తులోకి ఈ సజీవ ‘మైక్రో–రోబో’లను పంపారు. జీవమున్న ఈ మైక్రో రోబోలకు ‘మైక్రోబో’ (మైక్రో + రోబో = మైక్రోబో) అని పేరు పెట్టారు. యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్ పూత ఉన్న ఈ ‘మైక్రోబో’లు ఊపిరితిత్తుల్లో కదులుతూ, ఈదులాడుతూ నిమోనియాకు కారణమైన అతి చిన్న సూక్ష్మజీవులను తుదముట్టించాయి. నిమోనియా వచ్చిన కేసుల్లో చాలావరకు ‘సూడోమొనాస్ ఆరిజినోసా’ అనే అత్యంత సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ను కలిగించి, బాధితుల మరణానికి కారణమవుతుంటాయి.ఈ సూడోమొనాస్ ఆరిజినోసా మైక్రోబ్స్ కారణంగా నిమోనియా ఇన్ఫెక్షన్ గురైన వాటిల్లోని సగం ఎలుకల్లోకి ఈ మైక్రోబోలను పంపి, మరో సగానికి పంపకుండా వదిలేశారు. మైక్రో రోబోలు పంపిన ఎలుకలన్నీ బతికాయి. మిగతావి మూడు రోజుల్లో చనిపోయాయి. ఈ ప్రయోగ ఫలితాలు ‘నేచర్ మెటీరియల్స్’ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే... భవిష్యత్తులో మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియల నిర్వహణకు మైక్రో రోబోలు ఎలా పనిచేయగలవో అన్నది ఊహించవచ్చు. ఇది ప్రయోగదశలో ఉన్న మున్ముందు సాకారం కాబోయే చికిత్స ప్రక్రియ.మానవ హస్తం కంటే రోబోతో సర్జరీలు కొంత ఈజీ... ఎందుకంటే... మానవ మణికట్టును అటు ఇటు తిప్పి చూసినప్పుడు కొంతవరకే తేలిగ్గా తిరగగలుగుతుంది. అయితే ఓ రోబో మణికట్టు మాత్రం ఎటువైపైనా దాదాపు 270 డీగ్రీల వరకు తిరిగేలా రూపొందిస్తారు. ఇక రోబో చేతులూ, వేళ్లూ సన్నగా, బాగా పొడుగ్గా ఉంటాయి. దాంతో సన్నటి ఇరుకైన చోట్లకు కూడా చేరగలుగుతాయ. అంతేకాదు... వాటికి అందించిన ఆదేశాల మేరకు ముందుగా నిర్దేశించిన మేరకు మాత్రమే కోసేలా... ఖచ్చితంగా అంతే గాటు పెట్టేలా చూస్తాయి. ఇలా మానవహస్తానికి కష్టసాధ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబో సహాయంతో డాక్టర్లు చేయగలుగుతారు.మూత్ర / గైనిక్ వ్యవస్థలో ... ∙మూత్రపిండాల శస్త్రచికిత్సలో : మూత్రపిండం నుంచి మూత్రాశయానికి (బ్లాడర్కు) మూత్రం తీసుకొచ్చే పైపులు... యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ‘పైలో΄్లాస్టీప్రొసిజర్’ అనే శస్త్రచికిత్సతో దాన్ని చక్కదిద్దవచ్చు. (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అని అంటారు). అలాగే మూత్రపిండాల్లో ఏర్పడ్డ గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు, కిడ్నీని పూర్తిగా తొలగించడానికి చేసే నెఫ్రెక్టమీ వంటి చికిత్సల్లో రోబోలు బాగా ఉపయోగపడతాయి.ప్రోస్టెక్టమీ :ప్రోస్టేట్ గ్రంథిని తొలగించే శస్త్రచికిత్సలో..గైనకాలజీలో: గర్భసంచికీ... అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మెలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడు; ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో; ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి రోబోలు చక్కగా ఉపయోగపడతాయి. మామూలుగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బాధితుల్లో రుతుస్రావం సరిగా రాకపోవడం, తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఎక్కువ. రోబో శస్త్రచికిత్సలతో వాటిని తేలిగ్గా సరిదిద్దవచ్చు. యుటెరస్ పెద్దదిగా ఉన్నప్పుడు రోబో చేసే శస్త్రచికిత్సతో తేలిగ్గా తొలగించవచ్చు. మరీ ముఖ్యంగా ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్ వచ్చినప్పుడు (ఒక అవయవంలో ఒక భాగం ఇతర శరీర అవయవ భాగాలకు అతక్కుపోవడం) అది సర్జన్లకు ఓ సవాలుగా మారుతుంది. రోబో చేతులు వాటిని తేలిగ్గా విడదీస్తాయి.యూరో–గైనకాలజీ శస్త్రచికిత్సల్లో: పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. అవి మరో అవయవంలోకి చొచ్చుకునిపోయి (హెర్నియా కేసులతో) బాధించేప్పుడు చేసే సాక్రోకాల్పోపెక్సీ చేయడానికీ; అలాగే దగ్గినప్పుడూ, ఒత్తిడికి గురైనప్పుడు తమ ప్రమేయం లేకుండా బాధితుల్లో మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించేందుకు రోబోలు ఎక్కువగా సహాయపడుతుంటాయి.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఇలాంటి వాటిల్లో ఒకటి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో ఇవి... అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అందునా చాలా చవగ్గా కూడా.- డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరో సర్జన్. నిర్వహణ: యాసీన్ -
జంతువులతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: మనుషులు, జంతువుల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. మనుషులకు మేలు చేయడంతోపాటు హాని కలిగించడంలో కూడా జంతువుల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలోనే ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నిర్వహిస్తారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ప్రపంచంలో వెలుగుచూస్తున్న అంటువ్యాధుల్లో దాదాపు 60 శాతం జూనోటిక్ వ్యాధులేనని ప్రపంచ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెంపుడు జంతువులను నేరుగా తాకడం, మూత్రం, విసర్జనలు, వెంట్రుకలు, లాలాజలం ద్వారా అనేక వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది. వాటి నుంచి తయారయ్యే పాలు, మాంసం, గుడ్లు వంటి ఉత్పత్తుల ద్వారా కూడా పలు వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేబిస్పై అప్రమత్తత అత్యవసరం జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైనది. లక్షణాలు బయటపడిన తర్వాత దాదాపు 100 శాతం ప్రాణాంతకమైన ఈ వ్యాధిని, సకాలంలో వ్యాక్సిన్ తీసుకుంటే పూర్తిగా నివారించొచ్చు. భారత్లో వీధి కుక్కలే రేబిస్ వైరస్కు ప్రధాన వాహకాలుగా ఉన్నాయి. బహిరంగంగా చెత్త వేయడం, ఎక్కడపడితే అక్కడ కుక్కలకు ఆహారం వేయడం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరుగుతోంది. కుక్కలతోపాటు కోతులు, గబ్బిలాలు, ఎలుకలు కరిచినా వెంటనే వైద్యులను సంప్రదించి యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవాలి. ఎవరెవరికి ఇబ్బంది.. రైతులు, పశువుల పెంపకందారులు, పశు వైద్యులు, మాంసం కోసే కార్మికులు, ప్రయోగశాల సిబ్బంది, తోలు, ఉన్ని పరిశ్రమల్లో పనిచేసేవారు జూనోటిక్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పక్షులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సిట్టాకోసిస్, ఆర్నిథోసిస్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరమంటున్నారు. పందులు కూడా అనేక వైరస్లకు నిలయంగా ఉండటంతో వాటి నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి. పాలు, మాంసం, గుడ్లతోనూ ప్రమాదం » సరిగ్గా పాశ్చరైజ్ చేయని పాలు, పాల ఉత్పత్తులతో బ్రూసెల్లోసిస్ వ్యాపిస్తుంది. » కలుషితమైన లేదా సరిగ్గా ఉడికించని మాంసం ద్వారా ఆంథ్రాక్స్, టేప్వార్మ్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. » వ్యాధి సోకిన కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను పచ్చిగా లేదా సగం ఉడికించి తీసుకున్నా అనారోగ్యమే. » సూపర్ మార్కెట్లలో నిల్వ ఉంచిన క్యాన్డ్ పానీయాలపై ఎలుకల మూత్రం పడితే వాటి ద్వారా లెప్టోస్పిరోసిస్ వ్యాపిస్తుంది. ఎలుకలు, కుక్కల మూత్రంతో కలుషితమైన నీరు, పరిశుభ్రంగా నిర్వహించని స్విమ్మింగ్ పూల్స్, బయ ట నిల్వ చేసే చెరుకు రసం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. » పిల్లుల నోరు, గోళ్ల వద్ద ఉండే సూక్ష్మజీవుల వల్ల క్యాట్ స్క్రాచ్ ఫీవర్, రేబిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లుల వెంట్రుకల వల్ల కొందరిలో అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నివారణే ఉత్తమ మార్గం » జూనోటిక్ వ్యాధుల నివారణకు పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. వాటికి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. » జంతువులను తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. » పాలు, మాంసం, గుడ్లను పూర్తిగా ఉడికించి తీసుకోవాలి. » క్యాన్డ్ పానీయాలను శుభ్రం చేసిన తర్వాతే తాగాలి. » జంతువులు కరిచినా లేదా గాయపరిచినా వెంటనే వైద్యసేవలు పొందాలి. -
Beauty Tips: ఈ మాస్క్తో ముడతలు దూరం
వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మార్కెట్లో దొరికే చాలా రకాల ఎల్ఈడీ ఫేస్ మాస్క్లు కేవలం ముఖంపై వచ్చే ముడతలు, చారలు, మచ్చలను మాత్రమే తగ్గిస్తాయి. కానీ, సోలావేవ్ నెక్ – చెస్ట్ రెజువనేటింగ్ మాస్క్ ముఖం కింద ఉండే నెక్, చెస్ట్ చర్మ సంరక్షణలోనూ తోడ్పడుతుంది.ముఖం లాగే మెడ, ఛాతీ భాగాలపై కూడా వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల చర్మం సాగడం, ముడతలను తగ్గించుకోవాలనుకునే వారి కోసం సోలావేవ్ సంస్థ రూపొందించిన ఈ రెజువనేటింగ్ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ‘మైక్రోకరెంట్’, ‘రెడ్ లైట్ థెరపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ మాస్క్ మెడ, ఛాతీ భాగాలపై ఉండే సన్నని ముడతలను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. రోజుకు పది నిమిషాలు దీనిని ఉపయోగిస్తే చాలు. దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెల్ట్తో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.బొగ్గుపొడితో దంతాలు ధగధగకొన్ని సందర్భాల్లో కాఫీ, టీ లు ఎక్కువగా తాగడం, ఎనామిల్ పొర బలహీనపడటం వల్ల దంతాలు పచ్చగా మారిపోతుంటాయి. ఇందుకోసం డెంటిస్టుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా, సహజంగా దొరికే వస్తువులతోనే దంతాలను మెరిపించుకోవచ్చు.దంతాలను సహజంగా క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దంతాలపై పేరుకుపోయిన మరకలను సున్నితంగా తొలగిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై ఉండే రంగు మారిన పొరలను తొలగిస్తుంది. అయితే దీనిని చాలా జాగ్రత్తగా, తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, బొగ్గుపొడి పళ్లపై ఉండే టాక్సి¯Œ ్స, రంగు మరకలను తన వైపుకు లాక్కునే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.సాంబ్రాణితో సహజ మెరుపు!తలస్నానం చేసిన వెంటనే నేడు జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. కానీ పూర్వం ఎంతటి పొడవాటి జుట్టునయినా ఆరబెట్టుకోవడానికి తలకు ‘ధూపం’ వేసుకునేవారు.ఇది నేటి తరానికి కేవలం సువాసన కోసం చేసే ప్రక్రియగా అనిపించినప్పటికీ ఇందులో ఎన్నో ఆయుర్వేద, ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాంబ్రాణిని వేయడం వల్ల, ఆ వెచ్చని పొగ జుట్టులోని తేమను వేగంగా పీల్చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి తలనొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీ–మైక్రోబియల్, యాంటీ–ఫంగల్ గుణాలు తలలో చుండ్రు చేరకుండా రక్షిస్తాయి. -
మోకాలు పట్టేస్తోందా?
మెనిస్కస్ అంటే... అది మోకాలి జాయింట్ దగ్గర పైన ఉండే తొడ ఎముక (ఫీమర్)కూ, కిందనుండే కాలి ఎముక (టిబియా)కూ మధ్యన ‘సి’ ఆకారంలో ఉండే కార్టిలేజ్ అని పిలిచే మృదులాస్థి. నడుస్తున్నప్పుడూ, పరుగెడుతున్నప్పుడూ... కాలితో జరుగుతున్న ప్రతి పనిలోనూ ఇది ఈ రెండు ఎముకల మధ్య ఓ కుషన్లా, షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంటుంది. కాలిపై పడే ప్రతి ఒత్తిడిని తాను తీసుకుంటూ ఉంటుంది. మోకాలి కదలికలు సాఫీగా జరిగేందుకు, కీళ్లను రక్షించేందుకు ఇది ఎంతో ముఖ్యమైన భాగం. ఏదైనా కారణాల వల్ల ఇది దెబ్బతినడాన్ని ‘మెనిస్కస్ టియర్’ అంటారు. ఇది ఏయే సందర్భాల్లో జరుగుతుంటుంది, అప్పుడు కనిపించే లక్షణాలూ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం...మోకాలి నొప్పి, వాపు, నడిచేటప్పుడు ఇబ్బంది లేదా మోకాలు ఒక్కసారిగా ‘లాక్‘ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్య అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇవి మోకాలి దగ్గరి మృదులాస్థి ‘మెనిస్కస్ టియర్’ సమస్యకు సూచనలు కావచ్చు. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొన్ని ్ర΄ాథమికమైన జాగ్రత్తలతో... శస్త్రచికిత్స అవసరం లేకుండానే కోలుకునే అవకాశం ఎక్కువ. ఆ వివరాలను తెలుసుకుందాం. మెనిస్కస్ టియర్ సమస్య ఎందుకు వస్తుందంటే..? ఆటల్లో మోకాలు ప్రమాదవశాత్తూ ఆకస్మికంగామెలితిరగడం ప్రమాదాల్లో గానీ లేదా ఇతరత్రా మోకాలి దగ్గర బలమైన దెబ్బ తగలడం వయస్సు పెరగడంతో మెనిస్కస్ అరుగుదలకు లోనై బలహీనపడడం మెట్లు ఎక్కడం లేదా బరువులు ఎత్తేటప్పుడు మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడడంప్రధాన లక్షణాలు... మోకాలి నొప్పి , వాపు మోకాలు లాక్ అయినట్లు అనిపించడం నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది మోకాలు పూర్తిగా వంచలేకపోవడం లేదా చాపలేకపోవడం కదిలించినప్పుడు ‘క్లిక్‘ లేదా ‘పాప్‘ శబ్దం వినిపించడం మోకాలిలో ఇబ్బందిగా అనిపించడంనిర్థారణ ఇలా... డాక్టర్లు చాలావరకు బాధితులు చెప్పే లక్షణాలను బట్టి శారీరకంగా (ఫిజికల్గా) పరీక్షించి... ఈ సమస్యను చాలావరకు అంచనా వేయగలుగుతారు. అవసరమైతే ఎమ్మారై స్కాన్ ద్వారా మెనిస్కస్ టియర్ను ఖచ్చితంగా నిర్ధారణ చేస్తారు. నివారణ కోసం జాగ్రత్తలివి... వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం ∙తొడ అలాగే మోకాలి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం ∙అధిక బరువును నియంత్రించుకోవడం ∙ఆటల్లో స్వీయభద్రత కోసం తగిన ఉపకరణాలూ, పరికరాల ఉపయోగం ∙మోకాలి నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా తొలి దశలోనే డాక్టర్ను సంప్రదించడం. డాక్టర్ను సంప్రదించాల్సిందెప్పుడు? మోకాలి నొప్పి కొన్ని రోజుల పాటు తగ్గకపోయినా, మోకాలి దగ్గర వాపు ఎక్కువైనా, మోకాలు లాక్ అవుతున్నా లేదా నడవడం కష్టంగా ఉంటే వెంటనే ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే మోకాలి దగ్గరి కీళ్లకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది.చికిత్స ఇలా... మోకాలి దగ్గర అయ్యే చిన్న΄ాటి గాయాలకు ‘రైస్’ అనే తేలిగ్గా గుర్తుంచుకునే యాక్రనిమ్ సహాయంతో సులభంగా చికిత్స అందించుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు ‘ఆర్’ అంటే రెస్ట్ (విశ్రాంతి), ‘ఐ’ అంటే ఐస్ (ఐస్తో కోల్డ్ కాపడం పెట్టడం), ‘సి’ అంటే కంప్రెషన్ (అంటే ఒత్తిడి కలిగించేలా క్రేప్ బ్యాండ్ చుట్టడం), ‘ఈ’ అంటే ఎలివేషన్... అంటే మోకాలిని ఓ తలగడ సహాయంతో మిగతా దేహ భాగం కంటే కాస్త పైన ఉండేలా చూసుకోవడం ద్వారా సులభంగా చికిత్స అందించవచ్చు. తొలిదశల్లో ఇది శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎవరికి వారు ఇంట్లోనే తీసుకోగల జాగ్రత్తలుగా అనుకోవచ్చు. ఇక మెనిస్కస్ టియర్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే కొన్ని మందులు, ఫిజియోథెరపీ సహాయంతో చికిత్స అందిస్తారు. అయితే ఈ మృదులాస్థి తాలూకు టియర్ చాలా తీవ్రంగా ఉండి మోకాలు లాక్ అవుతున్నా లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే ఆర్థ్రోస్కోపీ (కీహోల్) శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అతి చిన్న కోతలతో చికిత్స చేయడం వల్ల నొప్పి తక్కువగా ఉండి, బాధితులు చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.చివరగా... మోకాలి నొప్పి, అక్కడ వాపు లేదా లాక్ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా అవి మెనిస్కస్ టియర్కు సంకేతాలుగా భావించి వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సకాలంలో నిర్ధారణ, సరైన చికిత్స తీసుకుంటే మోకాలి పనితీరును కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో తీవ్రమైన కీళ్ల సమస్యలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ పి.ఆర్. వినయ్ కిషోర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ -
వైర్లెస్ ఇయర్బడ్స్ ఎంత వరకు సేఫ్?
ప్రయాణంలో, వ్యాయామం చేసేటప్పుడు, ఆఫీస్ పనిలో.. ఇలా అన్నిచోట్లా ఫోన్ ఎలా కామన్ అయిందో వైర్లెస్ ఇయర్బడ్స్ కూడా అదేవిధంగా మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే వీటి వాడకం మంచిదేనా కాదా అనే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం.నిజానికి వైర్లెస్ ఇయర్బడ్స్ చాలా తక్కువ స్థాయిలో రేడియో ధార్మిక తరంగాలను విడుదల చేస్తాయి. అదే వైర్డ్ హెడ్ ఫోన్లు కేబుల్ ద్వారా సిగ్నల్స్ పంపిస్తాయి కాబట్టి వాటి నుంచి ఎలాంటి రేడియేషన్ రాదు. అలాగని అవసరం ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం మంచిది కాదు.. ఇది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కువసేపు పాటలు వినేటప్పుడు వైర్డ్ హెడ్ ఫోన్లు వాడటం మంచిది. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఏకనాథ్ షిండే
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అనారోగ్యం బారినపడి, శనివారం థానేలోని జుపిటర్ ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి ఆయన స్వల్ప జ్వరం, నీరసం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యుల సలహా మేరకు ముందస్తు జాగ్రత్తగా ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ప్రస్తుతం ఆయనకు సాధారణ ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.అధిక పనిభారమే కారణంప్రాథమిక సమాచారం ప్రకారం.. గత కొన్ని రోజులుగా పర్యటనలు, రాజకీయ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనడం, తీవ్రమైన పనిభారం కారణంగానే షిండే అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయనకు జ్వరం వచ్చి, తీవ్ర నీరసానికి గురైనట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా షిండే శనివారం నాటి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అనంతరం ఆయను చికిత్స నిమిత్తం థానేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే షిండే ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని శివసేన వర్గాలు తెలిపాయి.మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న కీలక రాజకీయ పరిణామాల్లో షిండే చురుగ్గా పాల్గొన్నారు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలతో పాటు ముంబయి శాసనమండలి సభ్యుడు సచిన్ అహిర్.. షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఈ ‘ఆపరేషన్ టైగర్’ వ్యూహంలో షిండే కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పలుమార్లు ఢిల్లీ పర్యటనలు కూడా చేశారు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. -
అందరిలా కాదు.. నీలా నువ్వుండు చాలు!
మనకు లేనిదానిపైనే మన చూపంతా.. యువతలో బాగా ప్రబలుతున్న ఈ మానసిక నిర్లిప్తత ఇప్పుడు బడికెళ్లే పిల్లల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం పెద్దలకే కాదు.. చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ కన్నవాళ్లను కలవరపెడుతోంది. ‘అందరూ ఏదేదో చేస్తున్నారు.. ఎక్కడికంటే అక్కడికెళుతున్నారు వారిలా నేనెందుకు లేను.. వారిలా నేనెందుకు ఏ పనీ చేయలేకపోతున్నాను.. ’ఈ భావననే ‘ఫెమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అంటారు. ఎప్పుడూ ఎదుటివారిలా తానెందుకు ఉండలేకపోతున్నానని బాధపడడం, ఎప్పుడూ తనని తాను నిందించుకుంటూ ఉండడం, కోపం వచ్చినా.. దానిని ఎవరి మీద చూపించాలో తెలియక అవస్థలు పడడం... ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే ఏం చేయాలో వెంటనే ఈ సూచనలు పాటించడం మంచిది.ఎవరిలో ఫెమో ఉంది?1. తరచూ ఫోన్లో తన వయసువాళ్ల వీడియోలు, రీల్స్ చూడడం, తనెందుకు చేయలేకపోతున్నానని బాధపడడం2. తమకు లేని ప్రతిభ కోసం లేదా తమ దగ్గర లేని వస్తువుల కోసం పట్టుబట్టడం.3. ప్రతి విషయానికీ ఇతరులతో పోల్చుకోవడం. ఆత్మన్యూనతాభావానికి లోనవ్వడం.4. చిన్న పొరపాటు జరిగినా తమని తాము నిందించుకోవడం.5. ఏ పని చేయాలన్నా ఆసక్తి కనబరచక పోవడం, ఒంటరిగా ఫీలవ్వడం.ఏం చేయాలి?1. ఫెమో సమస్య కి విరుగుడు జెమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్). పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు వారిని మందలించడం కంటే ప్రతిరోజు వారితో కాస్త సమయం గడపాలి. వారి సమస్యల్ని వినాలి. 2. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజ జీవితం కాదని వారికి అర్థమయ్యేలా చె΄్పాలి.3. స్క్రీన్ టైమ్కు పరిమితులు విధించి, ఆటలు, పుస్తక పఠనం, సంగీతం, కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని ్రపోత్సహించాలి. 4. ఎవరినో చూసి వారిలా ఉండాలని కోరుకోవడం కన్నా నువ్వు నీలా ఉంటేనే మంచిదని తెలిసేలా చేయాలి.5. నచ్చిన పని చేసినప్పుడు వచ్చే అనుభూతే నిజమైన ఆనందమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. -
సీతాకోకచిలుకలా... ప్రయోజనాలను ఇచ్చే బద్ధకోణాసనం!
డెస్క్ ఉద్యోగాల్లో ఒత్తిడిని తగ్గించి, శరీరానికి మంచి ప్రయోజనాలను అందించడంలో అధిక ప్రయోజనాలను ఇచ్చే యోగాసనాల్లో బద్ధకోణాసనం ఒకటి. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మోకాళ్లు కదలికలు ఉంటాయి కాబట్టి దీనిని ఈ పేరుతో పిలుస్తారు. కాళ్లు, తుంటి, వెన్ను భాగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.ఉదయం లేదా సాయంత్రం రోజూ కొన్ని నిమిషాలు ఈ బటర్ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. కంప్యూటర్లలో పని చేసే వారు, వెన్ను నొప్పి, మెడ, తుంటి నొప్పితో ఇబ్బంది పడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.చేసే విధానం (20 నుంచి 30 సార్లు)నేలపై యోగా మ్యాట్పై కూర్చోవాలి.రెండు పాదాలను ఒకదానికొకటి తాకించి, చేతులతో పాదాలను పట్టుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉంచాలి.శ్వాసను గమనిస్తూ మోకాళ్లను సీతాకోకచిలుక రెక్కల్లా మెల్లగా పైకి–కిందికి మెల్లగా కదిలించాలి ∙సాధారణ శ్వాసతో 20 నుంచి 30 సార్లు చేయాలి.ప్రయోజనాలు...పెల్విక్ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.వెన్ను నొప్పి, నడుము బిగుతు తగ్గించడంలో సహాయపడుతుంది.ఎక్కువసేపు కూర్చునే వారికి ఉపశమనం కలిగిస్తుంది.మహిళల్లో పెల్విక్ ఆరోగ్యానికి, గర్భధారణ సమయంలో (నిపుణుల పర్యవేక్షణలో) ఉపయోగకరంగా ఉంటుంది.శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.లోయర్ బ్యాక్ కండరాలకు బలం చేకూరుతుంది.ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.వెన్ను, మెడ, తుంటి నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలు...మోకాలి లేదా హిప్కు తీవ్రమైన గాయం ఉంటే చేయకూడదు. ∙మోకాళ్లను బలవంతంగా నేలకు నొక్కకూడదు. ∙వెన్ను వంచకుండా నిటారుగా ఉంచాలి.నొప్పి అనిపిస్తే వెంటనే ఆపాలి.గర్భిణులు తప్పనిసరిగా శిక్షణ పొందిన యోగా గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.-అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
అంటార్కిటికాలో ఆశాకిరణం..
క్యాన్సర్ చికిత్సలో, సాధారణ కణజాలానికి నష్టం కలగకుండా క్యాన్సర్ కణాలను నాశనం చేయడమనేది అతి పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా (యూఎస్ఎఫ్) శాస్త్రవేత్తల పరిశోధన కొత్త ఆశను రేకెత్తిస్తోంది.అంటార్కిటికాలో గడ్డ కట్టిన నీటి అడుగున నివసించే ఒక సముద్రజీవి భవిష్యత్లో క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మానవ కణాలకు నష్టం కలిగించకుండా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడే అంటార్కిటిక్ సీ స్క్విర్ట్ జాతి బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సలో ఒక ముందడుగు అని చెబుతున్నారు.‘సీ స్క్విర్ట్’ను అసిడియన్స్ అని కూడా పిలుస్తారు. భూమిపై అత్యంత కఠినమైన వాతావరణంలో అంటార్కిట్ జాతులు లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందుతున్నాయి. వేటాడే జంతువులు, వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యేకమైన రసాయన రక్షణలను (కెమికల్ డిఫెన్స్) అభివృద్ధి చేసుకున్నాయి. ఈ రక్షణలు కొత్త ఔషధాల తయారీలో బాగా ఉపయోగపడతాయి.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలకు అంటార్కిటికాలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు.క్యాన్సర్ నిరోధక సమ్మేళనాన్ని బ్యాక్టీరియ ఎలా ఉత్పత్తి చేస్తుందో అర్థం చేసుకోవడానికి సీ స్క్విర్ట్ డీఎన్ఏ, కెమిస్ట్రీ... మొదలైన వాటిని శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. ఈ ఆవిష్కరణ చికిత్సగా మారడానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఆ మహిళ బ్రెయిన్లో 38 పరాన్న జీవులు..!కానీ సర్జరీ చేయకుండానే..
ఒక విదేశీ మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడింది. ఆమె సాధారణ తలనొప్పి అనుకుంది కానీ..అది చూస్తుండగానే బుర్ర బద్దలైపోయేంతట విపరీతమైన నొప్పి..మూర్చ, మతిస్థిమతం వంటివి అటాక అయ్యి..కుప్పకూలిపోయింది. అప్పటిదాక బాగానే ఉన్న ఆమెకు ఆకస్మికంగా ఇలా ఎందుకు జరిగిందని విచారిస్తే..అసలు విషయం బయటపడింది. అలాగే వైద్య పరీక్షల్లో ఆమె బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులకే నోట మాటరాలేదు. అయితే ఇలాంటి సమస్య ఆ దేశంలో అత్యంత అరుదు కావడంతో ఎలా వచ్చింది అని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడటమే గాక..ఆమె ఈ సమస్య నుంచి బయటపడటానికి పడరాని నరకం అనుభవించింది. ఇంతకీ ఎవారా ఆ మహిళంటే..యూకేకు చెందిన లోరీ డెన్మాన్ అనే మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ..మూర్చ వంటి సమస్యలు ఎదుర్కొంది. రాను రాను సమస్య మరింత దిగజారిపోయింది. ఒకరోజు ఉన్నట్లుండి కుప్పకోలిపోయింది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి హుటాహుటినా తీసుకెళ్లగా వైద్యపరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆమె బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులే కంగుతిన్నారు. చివరికి తనకు ఈ సమస్య ఎలా వచ్చిందో తెలిసి విస్తుపోవడమే కాదు..రోజురోజుకి ఆమె మరింత దిగజారి ప్రాణాంతకంగా మారింది. అసలు ఇలా ఎందుకు జరిగిందని విచారించగా తాను భారత్ పర్యటకు వెళ్లానని..ఆ టూర్కి వెళ్లి ఇప్పటికీ మూడేళ్లు అవతుందని పేర్కొంది. అయితే ఆ తర్వాత ఒక రోజు మలవిసర్జనలో టేప్వామ్ని చూసి విస్తుపోయానని చెప్పింది. ఆ తర్వాత నుంచి పరిస్థతి నార్మల్గా ఉండటంతో లైట్ తీసుకున్నానని చెప్పింది. అప్పటి నుంచి తనలో ఈ బద్దెపురుగులు ఉన్నాయా అని వైద్యలును ప్రశ్నించింది లోరి. అయితే వైద్యులు పలు టెస్ట్లు చేసి శరరీంలో ఎక్కడ ఈ సమస్య లేదని, కేవలం బ్రెయిన్లోనే ఏకంగా 38 టేప్వార్మ్లు ఉన్నాయని అన్నారు. దీన్ని వైద్య పరిభాషలో ‘న్యూరోసిస్టిసెర్కోసిస్’ అని పిలుస్తారని అన్నారు. యూకేలో ఈ సమస్య చాలా అరుదని, ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాల నుంచి వలస వచ్చినవాళ్లే ఈ సమస్య బారిన పడతారని అనడంతో కంగుతింది లోరీ.న్యూరోసిస్టిసెర్కోసిస్ అంటే..ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇది పంది టేప్వార్మ్ వల్ల కేంద్ర నాడీ వ్యవస్థకు సోకే ఒక పరాన్నజీవి సంక్రమణ. సరిగ్గా ఉడకని ఆహారం, ముఖ్యంగా పంది మాంసం తినడం వల్ల మనుషులు ఈ వ్యాధి బారిన పడతారని అన్నారు. అలాగే టేప్వార్మ్ గుడ్లతో కలుషితమైన నీటి ద్వారా కూడా ఇది సంభవిస్తుందని తెలిపారు వైద్యులుఈ వ్యాధిని గుర్తించిన తర్వాత లోరీకి పరాన్న జీవి నిరోధక మందులు, స్టెరాయిడ్లు ఇచ్చారు. అవి మొదట్లో బాగానే పనిచేశాయి. కానీ రాను రాను దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. గందరగోళానికి గురవ్వడం, శరీరంలో తిమ్మిర్లు, జలదరింపు, బ్రాంతి వంటి మానసిక రుగ్మతలు బారినడపడింది. రోజురోజుకి పరిస్థితి మరింత దిజగారిపోయింది. చూడటానికి ఒక చిన్నపిల్ల మాదరి ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలా ఆమె కోలుకుని యథాస్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం 42 ఏళ్లు ఉన్న ఆమె జీవితాంతం మూర్చ వ్యాధి మందులు వాడుతూనే ఉండాల్సి రావడం బాధకరం. అంతేగాదు ఆమెకు సర్జరీ చేయకుండానే ఆ పరాన్నజీవులను మట్టుబెట్టారు. అవి మెడిసిన్ ప్రభావంతో బ్రెయిన్లోనే గట్టిపడిపోతాయని చెప్పారు వైద్యులు. ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడమే కాదు.. ఆ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పిస్తోంది. పైగా తనలా ఎవ్వరూ ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తోందామె.(చదవండి: లక్షల జీతం వదులుకుని వెయిటర్గా..! ఎందుకంటే..) -
నా చేతి రాత మారి.. నా బతుకు రాతను మార్చేసింది!
నా వయసు 45 సంవత్సరాలు. నేను ఒక రచయితను, నా రచనలన్నీ చేత్తోనే రాసుకోవడం నా అలవాటు. కానీ గత రెండు సంవత్సరాల నుంచి సరిగా రాయలేక పోతున్నాను. కొంచెంసేపు రాసేటప్పటికి, వేళ్ళు విపరీతంగా నొప్పులు పుట్టి, అక్షరాలు చిన్నవిగా, వంకరగా మారిపోయి, ఇతరులకు అర్థం కావడం లేదు. పదినిమిషాలు వరుసగా రాస్తే మళ్ళీ పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటే గానీ రాయలేకపోతున్నాను. దీనివల్ల ఈ మధ్య నా రచనా వ్యాసంగంలో బాగా వెనుకబడ్డాను. అదే నా బతుకు దెరువు. మా ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదిస్తే, దీనికి చికిత్స లేదంటున్నారు. మీరే ఏదైనా పరిష్కారం చూపిస్తారనే ఆశతో రాస్తున్నాను. – సుబ్రహ్మణ్యం. అమలాపురంమీరు ‘రైటర్స్ క్రాంప్’ అనే ఒక అరుదైన సమస్యతో బాధ పడుతున్నారు. మానసిక, నాడీ మండలానికి సంబంధించిన ఈ సమస్యతో బాధపడేవారిలో, రాసే సమయంలో చేతివేళ్లు పట్టేయడం, వంకర్లు తిరిగిపోవడం, విపరీతమైన నొప్పితో కొంతసేపు రాసిన వెంటనే ఆగిపోవడం ఈ సమస్య లక్షణం. కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారు అంటే టైపిస్టులు, ఎక్కువగా పెన్నుతో రాసేవారు, ఏదైనా సంగీత వాద్యాన్ని, వేళ్ళతో ఎక్కువగా పని చేసేవారిలో ఈ సమస్యను చూస్తుంటాము. దీనివల్ల మొదట్లో కొన్ని వాక్యాలు బాగా రాసినా, సడన్గా చేతివేళ్ళు పట్టేసి, చేతిరాత అధ్వానంగా మారిపోతుంది.నొప్పితో΄ాటు, చేతిలో వణుకు కూడా రావచ్చు. కొంత విరామం తర్వాత మళ్ళీ మామూలు స్థాయికి రావచ్చు. ఈ సమస్య వల్ల కొంత టెన్షన్కు లోనై, పోనుపోను బటన్స్ పెట్టుకోవడం, షేవింగ్ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు రావచ్చు. గతంలో టెలిగ్రామ్ పంపే పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవారు, చేత్తో తీరికలేకుండా టైపు చేయడం ద్వారా కూడా వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చేది. అసలు సమస్యతో ΄ాటు దీనివల్ల పనిలో వెనుకబడి, మానసిక ఒత్తిడికి గురై ఈ సమçస్య మరింత జటిలమవుతుంది.ఈ సమస్యకు కూడా చికిత్స ఉందనేది చాలామందికి తెలియక, ఉద్యోగాలు మానేసిన వారు కూడా ఉన్నారు. ‘బొటాక్స్’ ఇంజక్షన్’ ద్వారా ఈ సమస్యను చాలా వరకు నయం చేయవచ్చు. ‘సుపినేటా రైటింగ్’ అనే ఒక ప్రత్యేక మానసిక చికిత్సా పద్ధతితో΄ాటు, ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని మందులు, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ ‘రైటర్స్ క్రాంప్’ సమస్యను నయం చేయవచ్చు. మీరు అధైర్యపడకుండా దగ్గర్లోని సైకియాట్రిస్టును సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి. ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.- మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
మెడ వణుకుతోంది… కనీసం ఫోన్ను పట్టుకోలేకపోతున్నా!
ఆ యువతి తరచూ మెడ నొప్పి, చేతుల్లో బలం తగ్గిపోతున్న సమస్యతో డాక్టర్ను సంప్రదించింది. తన జీవనశైలి, రోజువారీ అలవాట్లు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రపోయే భంగిమ.. ఇవన్నీ కారణాలేమోనని ఆమె ముందుగానే అనుకుంది. కానీ అన్ని వివరాలు విన్న తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఆమెను ఆశ్చర్యంలో ముంచేశాయి. ‘‘అది సాధారణ అలసట కాదు… ఆమె శరీరం ఫోన్ ప్రభావానికి లోనవుతోంది’’ అనే వ్యాఖ్యతో అసలు సమస్యపై కొత్త చర్చ మొదలైంది.స్మార్ట్ఫోన్ వినియోగం ఇప్పుడు లింగ భేదానికి పరిమితం కాని సమస్యగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి స్క్రీన్పై గడపడం వల్ల మెడపై ఒత్తిడి పెరగడం, భంగిమలో మార్పులు, చేతి బలం తగ్గడం వంటి లక్షణాలు యువతలో సాధారణంగా కనిపిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పని, చదువు, వినోదం అన్నీ డిజిటల్ పరికరాలపైనే ఆధారపడటం వల్ల ఈ ప్రభావం మరింత విస్తరిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు… ఆధునిక జీవనశైలి కలిగిస్తున్న సామూహిక ఆరోగ్య సవాలుగా మారుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి డిజిటల్ పరికరాలు మన శరీర ఆకృతినే నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెడ వంగిపోవడం, చూపు బలహీనపడటం, చేతి బలం తగ్గడం, మోటార్ స్కిల్స్పై ప్రభావం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పైగా ఈ మార్పులన్నింటినీ ఇప్పుడు నిపుణులు ఒక కొత్త పదంతో వివరిస్తున్నారు. అదే “ఫోన్ బాడీ (Phone Body)”. అంటే..ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో కనిపిస్తున్న మార్పులు, భంగిమలో వచ్చే మార్పుల సమాహారం అని దీని అర్థం. ఇది వైద్యపరంగా అధికారిక పదం కాకపోయినా.. ఆధునిక జీవనశైలి ప్రభావాన్ని వివరించేందుకు వాడుతున్నారు. బీబీసీ టెక్నాలజీ జర్నలిస్ట్ థామస్ జర్మైన్ తన తాజా వ్యాసంలో ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించారు.అందులో నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం సమస్య కేవలం “స్క్రీన్ టైమ్” మాత్రమే కాదు.. ఎక్కువ సమయం ఇంట్లో కూర్చొని ఫోన్, కంప్యూటర్లకు అతుక్కుపోవడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని హెచ్చరిస్తున్నారు.👉ప్రపంచవ్యాప్తంగా మయోపియా (దూరం చూపు బలహీనత) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే దీని ప్రధాన కారణం ఫోన్ను దగ్గరగా చూడటం మాత్రమే కాదని, బయట సమయం తగ్గిపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. సహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.👉మరోవైపు “టెక్ నెక్” (Tech Neck) అనే సమస్య కూడా వేగంగా పెరుగుతోంది. నిరంతరం తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై తీవ్ర ఒత్తిడి పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల వంచే కోణం పెరిగే కొద్దీ మెడపై పడే బరువు అనేక రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నొప్పులు, కండరాల గట్టిపడటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో పోశ్చర్(posture) మార్పులు కూడా రావచ్చని డెర్మటాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.👉ఇక చేతి బలం విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యువతలో గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం చేతుల బలహీనత మాత్రమే కాకుండా మొత్తం శారీరక ఆరోగ్య సూచికగా పరిగణించబడుతోంది.👉టెక్నాలజీ మోటార్ స్కిల్స్పైనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఫోన్పై స్వైప్ చేయడం, క్లిక్ చేయడం వంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతున్నప్పటికీ, చేతి-మెదడు సమన్వయంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.అయితే నిపుణులు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. రోజూ కొంతసేపు ఫోన్కు విరామం ఇవ్వడం.. కొన్ని అలవాట్లు మార్చుకుంటే “ఫోన్ బాడీ” ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.20–20–20 రూల్ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లు చూడాలని సూచిస్తున్నారు. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మెడ పోశ్చర్పై దృష్టిఫోన్ను కిందకి వంచి చూడకుండా, కంటి లెవెల్లో ఉంచుకోవడం ద్వారా “టెక్ నెక్” ప్రమాదాన్ని తగ్గించవచ్చు.స్క్రీన్ టైమ్ పరిమితిరోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే ఫోన్ వినియోగానికి కేటాయించడం మంచిదని నిపుణుల సూచన. అవసరం లేని స్క్రోలింగ్ తగ్గించాలి.శారీరక కదలికలు తప్పనిసరిప్రతి గంటకోసారి లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల గట్టిపడటం తగ్గుతుంది.గ్రిప్ & చేతి వ్యాయామాలుబంతి పట్టుకోవడం, స్ట్రెస్ బాల్ వాడడం, చిన్న హ్యాండ్ ఎక్సర్సైజ్లు చేయడం చేతి బలం మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.బయట గడిపే సమయం పెంచాలిసహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజులో కనీసం కొంత సమయం బయట గడపడం మయోపియా ప్రమాదాన్ని తగ్గించగలదు.డిజిటల్ డీటాక్స్ అలవాటువారానికి ఒకసారి కొన్ని గంటలు ఫోన్ లేకుండా గడపడం మానసికంగా, శారీరకంగా ఉపశమనం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.మొత్తం మీద, ఫోన్ ఇప్పుడు మన జీవితంలో భాగంగా మారినప్పటికీ, అది శరీరంపై నెమ్మదిగా కానీ స్పష్టంగా ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. టెక్నాలజీని పూర్తిగా దూరం చేయలేకపోయినా, దాన్ని నియంత్రితంగా ఉపయోగించడం ద్వారా శరీరంపై దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
వైఎస్ జగన్కు ఎప్పటీకీ రుణపడి ఉంటాం: ముద్రగడ గిరి
సాక్షి, తాడేపల్లి: తన తండ్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని.. ప్రజల అందరి ఆశీస్సులతో తన తండ్రి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ముద్రగడ గిరి అన్నారు. తన తండ్రి అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ప్రతిరోజూ ముద్రగడ ఆరోగ్యంపై వివరాలుఅడిగి తెలుసుకుంటున్నారన్నారు.‘‘డాక్టర్లతోనూ వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. స్పెషల్ కేర్ తీసుకోవాలని డాక్టర్లతో చెప్పారు’’ అని గిరి తెలిపారు. నాన్నకు వైఎస్ జగన్ చేసిన సాయం మరిచిపోలేమని.. మేం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని గిరి తెలిపారు. -
స్లిమ్గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..
ఈ ఏడాది జనవరిలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కవలలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల హీరో రామ్చరణ్ పెద్ది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ నేపథ్యంలో జరిగి సక్సెస్ మీట్లో ఉపాసన ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఐదు నెలలే అయినా ఎంత స్మార్ట్గా మారింది అంటూ సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఒక్కరికి జన్మనిచ్చిన తల్లులు బరువు తగ్గడమే కష్టం అలాంటిది ఇద్దర పిల్లలకు జన్మనిచ్చిన తల్లలు బరువు తగ్గడం మరింత సవాలుగా ఉంటుంది. అలాంటిది ఉపాసన ఐదు నెలల్లోనే చాలా నాజుగ్గా ఆకర్షణీయంగా మారారు. అసలు ట్విన్స్ తర్వాత బరువు తగ్గడం ఎలా?, అది సాధ్యమేనా? అంటే..ఒక గర్భంతో పోలిస్తే.. కవలల గర్భం తర్వాత బరువు తగ్గడం చాలా కష్టమనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మహిళలు గర్భధారణ సమయంలో అధికంగా బరువు పెరుగుతారు. వారి శరీరాలు మరిన్నీ శారీరక, హార్మోనల్ మార్పులకు లోనవ్వుతాయి. శరీరం కోలుకోవడం కోసం కండరాల బలం తిరిగి నిర్మించుకోవడానికి, ఇద్దరు పిల్లల సంరక్షణ ఇదంతా ఒక పెద్ద సవాలుగా పేర్కొన్నారు. కొత్త తల్లులు యథావిధిగా ఇదివరకటిలా నార్మల్ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా అన్నారు. అయితే ప్రసవానంతరం కోలుకోవడం అనేది పరుగుపందెం లాంటిది కాదని గ్రహించాలన్నారు. ప్రతి మహిళ శరీరం ఒకేలా స్పందించదని అన్నారు అందువల్ల ఆరోగ్యకరంగా స్థిరంగా బరువు తగ్గేందుకే ప్రయత్నించాలని అన్నారామె. బరువు తగ్గాలంటే..ప్రసవానంతరం బరువు తగ్గాలంటే చక్కటి నిద్ర, సమతుల్య భోజనం, తగినంత నీరు, తగిన కదలికలు ఉండాలన్నారు. కొత్త తల్లులు కఠినమైన ఆహార నియమాలు పాటించొద్దని అన్నారు. ముఖ్యంగా పాలిచ్చేవాళ్లకు మరింత ప్రమాదమని అన్నారు. శరీరం ఆ స్థితి నుంచి కోలుకోవడానికి, శక్తి కోసం తగిన పోషకాలు అవసరం. ఈ టైంలో కేలరీలు లెక్కించడం మానేసి, ప్రోటీన్, ఫైబర్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పౌష్టికరమైన భోజనంపై దృష్టి సారించమని సూచిస్తున్నారు. ఆ తప్పులు అస్సలు చెయ్యొద్దు..సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావంతో బరువు తగ్గే ప్రయత్నం చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే వాళ్లు పోషకాహర నిపుణులు, ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షంలో ఆయా డైట్ విధానాలు అనుసరిస్తారు కాబట్టి గుడ్డిగా అనుసరించొద్దని అన్నారు. అలాగే తక్షణ ఫలితాలు ఆశించొద్దని చెప్పారు. తొమ్మిది నెలల్లో పెరిగిన బరువు కొన్ని వారాల్లో మాయమవ్వాలంటే తీవ్రమైన డైటింగ్, భోజనం మానేయడం, అతిగా వ్యాయామాలు చేయడం, బరువు తగ్గించే సప్లిమెంట్లపై ఆధారపడటం వంటివి పూర్తి స్థాయిలో కోలుకోవడాన్ని ఆటంక పరుస్తుందని అన్నారు.కొత్త తల్లులూ ఇది మరవద్దు..ప్రసవానంతరం ఫిట్నెస్ అంటే బలాన్ని తిరిగి నిర్మించుకోవడం అంతేతప్ప మాటిమాటికీ బరువు చెక్చేస్తూ..నెంబర్ని వెంబడించడం కాదు. ఆరోగ్యకరమైన శరీరం, స్థిరమైన పురోగతి, బిడ్డను చూసుకోవడానికి తగినంత శక్తిమంతంగా ఉండటం అనేవి ప్రధానం అని గ్రహించండి. ఏ క్రాష్ డైట్ ఈ సమయంలో అస్సలు పనికిరాదు. కేవలం ఓర్పు, నిలకడతో పాటించే మంచి అలవాట్లతోనే సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?) -
అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు స్ఫూర్తిదాయకంగా ఉన్నా..అందరికీ సరిపడవు. ఆయా వ్యక్తిగత సమస్యలు, వైద్య నిపుణుల పర్యవేక్షణ ఆధారంగా ప్రయత్నించాలే తప్ప..లేదంటే అసలుకే ప్రమాదం. ఇక్కడ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ అలాంటిదే. ఆయన గుండెపోటుకి గురై కోలుకున్న తర్వాతా దాదాపు 27 కేజీల బరువు తగ్గారు. ఈ అద్భుతమైన మార్పు అందరికీ స్ఫూర్తినిచ్చినప్పటికీ..ఆయన ఫాలో అయిన డైట్ మంచిదేనా అనే సందేహాలు వెల్లువెత్తాయి. మరి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ఒక్కోసారి ఆరోగ్య సమస్యల రీత్యా క్రాష్డైట్లు ఫాలో అవ్వొచ్చా అంటే..అనురాగ్ కశ్యప్ గుండెపోటు తర్వాత చాలా తక్కువ టైంలోనే అనూహ్యంగా బరువు తగ్గారు. అది కూడా ఇంత వేగంగా అందులోనూ గుండె సంబంధిత సమస్య నుంచి కోలుకున్నాక..ఇది సరైనదేనా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే వైద్యులు అది ఆయన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక డైట్ అని అంటున్నారు. అలాంటి క్రాష్ డైట్లు అందరికీ సరిపడవని హెచ్చరిస్తున్నారు. ఆయనకి ఉన్న రుగ్మతల దృష్ట్యా నిపుణుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలతో అనుసరించిని డైట్ అని చెప్పారు. ఇలా గుండెపోటు వచ్చిన వాళ్లందరికి ఇలాంటి క్రాష్ డైట్లు సరిపడవని హెచ్చరించారు. పైగా అది మేలు కంటే కీడే చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు. అలాగే ఇక్కడ ప్రతి రోగి కోలుకోవడం అనేది అప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మందులు, పోషకాహార స్థితి, మొత్తం గుండె పనితీరు వంటి అంశాల ఆధారపడి ఉంటుందన్నారు. ఇక్కడ కశ్యప్కు ఆస్తమా చరిత్ర, స్టెరాయిడ్ల వాడకం ఉంటం వల్ల వైద్య బృందం ఆయనకు లిక్విడ్ క్రాష్ డైట్ని సూచించిందని చెప్పారు. గుండెపోటు తర్వాత క్రాష్డైట్ ఎందుకు మంచిదికాదంటే..గుండెపోటు తర్వాత, గుండె కండరం ఇంకా కోలుకుంటూ ఉంటుంది. ఇక్కడ క్రాష్ డైట్లో కేలరీలను తీవ్రంగా పరిమితం చేస్తారు. ఫలితంగా శరీరంపై అదనపు ఒత్తిడిని తగ్గించి, సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన కేలరీల పరిమితి కండరాల క్షీణత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అలసట, తలతిరగడం వంటి సమస్యలు కోలుకోవడంలో ఆలస్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని అంటుఉన్నారు.గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎలా బరువు తగ్గాలంటే..గుండెపోటు తర్వాత వేగంగా బరువు తగ్గడానికి నిశితమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న చాలా మంది రోగులకు వారానికి సుమారు 0.5 నుంచి 1 కిలోల చొప్పున క్రమంగా బరువు తగ్గడం సురక్షితమని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడే నిలకడైన ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం మంచిదంటున్నారు. గుండెకు మేలు చేసే ఆహారంపీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలుచేపలు, పప్పుధాన్యాలు, స్కిన్లెస్ కోడి మాంసం వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులురక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి తక్కువ ఉప్పు ఉన్న భోజనంఅలాగే ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప, తీవ్రమైన ఉపవాసాలు, డిటాక్స్ ప్రణాళికలు, జీరో-కార్బ్ డైట్లను సాధారణంగా నివారించాలి.ఈ లక్షణాలు కనిపిస్తే..అకస్మాత్తుగా నీరసించడంగుండె దడనిరంతర నిర్జలీకరణంతల తిరగడం లేదా స్పృహ కోల్పోవడంమానసిక గందరగోళం లేదా అయోమయంఈ లక్షణాలను మనం అనుసరిస్తున్న ఆహార నియమం శరీరంపై అధిక ఒత్తిడిని కలిగిస్తోందనేందుకు సూచనగా గుర్తెరగాలి.అందువల్ల గుండెపోటు నుంచి కోలుకుంటున్న ఎవరైనా క్రాష్ డైట్లకు దూరంగా ఉండాలని, బదులుగా సమతుల్య పోషణ, నిలకడ అనుసరించి చక్కటి జీవనశైలిని పాటించాలని చెబుతున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు నిలకడగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఇక్కడ గుండెను కాపాడుకోవడం అంటే త్వరగా బరువు తగ్గడం కాదు, సురక్షితంగా బరువు తగ్గడం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఉద్యోగం!) -
అందమైన జుట్టు కోసం.. తలకట్టు.. దీర్ఘమూ..!
చిన్నప్పుడు అక్షరాలు దిద్దే టైమ్లో తలకట్టూ, దీర్ఘం చదువుకుంటాం. స్టైల్గా అక్షరంపైన స్టైల్గా, ఠీవిగా ఉండే దాన్ని తలకట్టు అంటాం కదా. అలా తలపైనా అందంగా, స్టైల్గా ఉండేజుట్టునీ తలకట్టు అంటాం. అమ్మాయిల అందం ఇనుమడించాలంటే ఆ తలకట్టు పొడవుగా, సు‘దీర్ఘం’గా ఉండాలి. చదువుకుంటూ అక్షరాలు దిద్దినప్పుడు ఉండే ఆ తలకట్టూ, దీర్ఘాలే యుక్తవయసు దాటాక కూడా కొనసాగాలనేది టీనేజ్ నుంచీ యువతీయువకులందరి కోరిక.ఇక అమ్మాయిలూ మహిళలూ కోరుకునేది మంచి పొడవాటి జడ. ఒకవేళ ఈ రోజుల్లో జడ ఎవరూ వేసుకోవడం లేదనుకున్నా... జలపాతంలా జారిపోయే మృదువైన పొడవైన జుట్టు. మంచి అందమైన, పొడవైన జుట్టుకోసం అమ్మాయిలూ, హీరో లాంటి లూక్ కోసం అబ్బాయిలూ... ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతుంటారో లేక్కేలేదు. మాటల్లో ‘ఆఫ్టరాల్ వెంట్రుక...’ అంటూ వ్యవహరించే ఈ జుట్టు కోసం కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుందంటే అతిశయోక్తే కాదు. ఆ జుట్టు ఎందుకు, ఎలా పెరుగుతుంటుంది, ఎందుకు రాలుతుంది అలా రాలకూడదంటే ఏం చేయాలి లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల సమాహారమే ఈ కథనం.జుట్టు, రోమాలు, తలకట్టు, వెంట్రుకలు, అందమైన భాషలో కురులు అంటూ పిలిచే ఆ నల్లటి, సన్నటి, పొడవైన తీగలాంటి జుట్టు నిర్మాణం నిజానికి చాలా సంక్లిష్టం. చూడ్డానికి సింపుల్గా కనిపించే ఆ జుట్టు కథ ఏమిటో, ఎలా పుడుతుందో, దానికి వచ్చే రకరకాల సమస్యలేమిటన్న అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.జుట్టు ఎలా పెరుగుతుందంటే... ప్రతిరోజూ వెంట్రుక 0.3 మి.మీ. నుంచి 0.4 మి.మీ. వరకు పెరుగుతుంది. అంటే ఏడాదికి దాదాపు ఆరు అంగుళాలు పెరుగుతుంది. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి.కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండటం వల్ల దానిలో పెరుగుదల ఏమాత్రం ఉండదు.టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో సాధారణంగా 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలోనే వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ దశలో ఉన్నప్పుడు పీకితే వెంట్రుక కింద దాని గసగసాల్లా ఉండే గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.అనాజెన్ : వెంట్రుక పెరుగుదల తాలూకు దశలన్నింటిలోనూ అనాజెన్ చురుకైన దశ. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. ఈ పెరుగుదల ఇలా రెండు నుంచి ఆరేళ్లు కొనసాగుతుంది. కొందరిలో ఆ వ్యవధి తర్వాత వెంట్రుక అదే వేగంతో పెరగదు. కొంత పొడవు పెరిగి ఆగిపోతుంది. అయితే తల మీద ఉన్న వెంట్రుకలు రెండు నుంచి ఆరేళ్లు పెరుగుతాయి. బాహుమూలాల్లో, కాళ్లపైనా, కనుబొమలు, కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో ఈ వ్యవధి 30–45 రోజులు మాత్రమే ఉంటి, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఈ కారణం వల్లనే ఈ ప్రాంతాల్లోని వెంట్రుకలు మాడుపై ఉండే వెంట్రుకలంతగా పెరగవు.వెంట్రుకల తీరుతెన్నులు : కొందరిలో వెంట్రుకలు స్ట్రెయిట్గా పెరుగుతాయి. ఇలా పెరిగే వారి జుట్టు సాఫీ (స్ట్రెయిట్)గా ఉంటుంది. అదే కొందరిలో జుట్టు పెరుగుతున్న కొద్దీ వెంట్రుక ఒంపు తిరుగుతుంటుంది. ఇలా జరిగేవారికి రింగులు రింగులుగా ఉండే ఉంగరాల జుట్టు వస్తుంది. వెంట్రుకను అడ్డుగా కోసినప్పుడు ఆ అడ్డుకోత గుండ్రంగా ఉంటే అది సాఫీగా (స్ట్రెయిట్)గా పెరుగుతుంది. అదే ఒకవేళ ఆ అడ్డుకోత దీర్ఘవృత్తంలా ఉంటే అది రింగులుగా పెరుగుతుంది. సాఫీగా (స్ట్రెయిట్గా) ఉండే జుట్టుకు... అడుగున ఉండే సబేషియస్ గ్రంథి నుంచి పోషకాలు సాఫీగా అందుతాయి. దాంతో ఇవి మరింత జీవంతో ఉంటాయి. ఇలా కనిపించడం కోసమే చాలామంది జుట్టును తిన్నగా ఉండేలా (హెయిర్ స్రెయిటెనింగ్) చేయించుకుంటుంటారు. అదే ఉంగరాల్లా తిరిగే జుట్టు వారిలో పోషకాలు చివరివరకూ చేరడానికి కాస్త అడ్డంకులు ఉండటంతో పొడవు జుట్టు ఉన్నవారి కంటే ఉంగరాల జుట్టు కాస్తంత మెరుపు తక్కువగా ఉంటుంది.జుట్టు రాలడానికి కారణాలు శారీరక ఒత్తిడి : రోజూ తీవ్రమైన శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు జుట్టులో భౌతికంగా మార్పులు తెచ్చి వాటిని రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ వైపునకు ప్రయాణం కొనసాగి, టిలోజెన్ దశ దీర్ఘకాలం కొనసాగుతుంది. దాంతో తలపై జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటాన్ని గమనించవచ్చు.పరిష్కారం ఇలా : ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.గర్భధారణ తర్వాత : చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలిపోయి మాడుపై జుట్టు బాగా పలచబారిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఈ దశలో మహిళల శారీరక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. ఆ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు కడుపులోని బిడ్డకు అందడంతో ఇలా పోషకాలు జట్టుకు అందకుండాపోతాయి. పరిష్కారం ఇలా : తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు.ప్రోటీన్ లోపాలతో : ప్రోటీన్లోపం కారణంగా జుట్టు రాలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటివారు తమ ఆహారంలో తగినంతగా ప్రోటీన్ తీసుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్గా మారి జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ ఉపయోగపడతాయి.పరిష్కారం ఇలా : ఈ కారణంతో జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శాకాహారులైతే ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే... గ్రీన్పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.విటమిన్–ఏ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల : ఆహారంలో విటమిన్–ఏ మోతాదులు మరీ ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుంది. విటమిన్–ఏ మనకు ప్రతిరోజూ 5000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) అవసరం. ప్రతిరోజూ విటమిన్–ఏ ను 10,000 ఐయూ కంటే ఎక్కువగా తీసుకునేవారు దాన్ని అదేపనిగా చాలాకాలం పాటు తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే అవకాశాలు ఎక్కువ.పరిష్కారం ఇలా : విటమిన్–ఏ టాబ్లెట్లు తీసుకునేవారు కేవలం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే, వారు నిర్ణయించిన మోతాదులోనే తీసుకోవాలి. హార్మోన్ లోపాల (హార్మోనల్ ఇంబ్యాలెన్స్) వల్ల : సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. స్త్రీలలో కూడా పురుష హార్మోన్ అయిన టెస్టో స్టెరాన్ కొద్ది మోతాదులో స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా స్రవిస్తుంది. ఇది జుట్టు రాలిపోడానికి ఒక కారణమవుతుంది. హైపోథైరాయిడిజమ్ కండిషన్ కూడా జుట్టు రాలడానికి మరో కారణం.పరిష్కారం ఇలా : పీసీఓఎస్తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా... అలాగే హైపోథైరాయిడిజమ్తో బాధపడేవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం జుట్టు రాలడం తగ్గవచ్చు.కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల : తమ సొంత వ్యాధి నిరోధకశక్తే తమకు దేహంపై ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్గా చెబుతారు. ఉదాహరణకు...పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల... మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్లుగా కనిపిస్తుంటాయి.లైకెన్ ΄్లానస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. ∙లూపస్ అనే మరో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం ఇలా : ఆటోఇమ్యూన్ కారణాల వల్ల జుట్టు రాలిపోవడాన్ని నివారించడానికి డ్యాప్సోన్ అనే మందులు కొంతవరకు పనిచేస్తాయి.ఏయే మందులతో జుట్టు రాలవచ్చు...మొటిమలకు వాడే మందులు (ఆక్నే మెడిసిన్స్),కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు,యాంటీ డిప్రెసెంట్స్నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు,రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్ (బ్లడ్ థిన్నర్స్),యాంటీకొలెస్ట్రాల్ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్,కీమోథెరపీ మందులు.మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు,హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్,ఇంటర్ఫెరాన్స్,వేగంగా మారిపోయే మూడ్స్ను నియంత్రించడానికి వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు,నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు,స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్ మందులు.పరిష్కారం ఇలా...మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు.జుట్టు రాలడం మరీ ఎక్కువగా ఉంటే కొన్ని మందులు వాడటం ద్వారా.జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ద్వారాకీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్ ఫాలికిల్ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.స్కారింగ్ అలొపేషియా : ఈ సమస్య కారణంగా దాదాపు మూడు శాతం మందిలో జుట్టు రాలిపోతుంటుంది. ఇలా రాలిపోయే జుట్టు మళ్లీ రాదు. ఎందుకంటే ఇందులో ఫాలికిల్ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఆ స్థానంలో స్కార్ కణజాలం భర్తీ అవుతుంది. అందుకే ఈ కారణంగా జుట్టు రాలిపోతే అది మళ్లీ మొలవదు. ఇలా జుట్టు రానప్పుడు అది ప్యాచ్లు ప్యాచ్లుగా ఉండి, ఆ ప్యాచులు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిన చోట కనిపించే ప్యాచ్లలో దురద, మంట, నొప్పి కూడా ఉండవచ్చు. డిసెక్టింగ్ సెల్యులైటిస్, ఇసినోఫిలిక్ పస్ట్యూల్ ఫాలిక్యులైటిస్, ఫాలిక్యులార్ డీజనరేషన్ సిండ్రోమ్, లైకెన్ ΄్లానో పైలారిస్, సూడోపెలేడ్ ఆఫ్ బ్రాక్ అనే కండిషన్లు... స్కారింగ్ అలొపేషియాకు కారణమవుతాయి.జుట్టును రాల్చే ఇన్ఫెక్షన్లు...రింగ్వార్మ్ : ఇది ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ కండిషన్ను టీనియా కాపిటిస్ అంటారు. ఇది ఫంగస్ కారణంగా మాడుపై వస్తుంది. మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా పరిమాణం పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు.చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్ వంటి యాంటీఫంగల్ మందులతో చికిత్స చేయవచ్చు.ఫాలిక్యులైటిస్ : ఇది జుట్టు ఫాలికిల్ (అంకురాల్లో) ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.చికిత్స : యాంటీబయాటిక్ మందులతో దీన్ని తగ్గించవచ్చు.పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్.డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్. ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్పలను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేయడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.సెబోరిక్ డర్మటైటిస్ : వాస్తవానికి ఇది ఇన్ఫెక్షన్ కాని కండిషన్. ఈ కండిషన్లో చర్మం పగుళ్లు ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు కలిసి వస్తాయి. ఈ పరిస్థితిని సల్ఫర్, సెలీనియమ్ సల్ఫైడ్, జింక్ పైరోథియాన్ (జడ్పీటీఓ), తార్, శాల్సిలిక్ ఆసిడ్ లేదా ఆయిల్ ఆఫ్ లేడ్, కార్టికోస్టెరాయిడ్ లోషన్లతో చికిత్స చేసి, నియంత్రణలోకి తెస్తారు.వెంట్రుక తీగ (షాఫ్ట్)కు వచ్చే లోపాలు...వెంట్రుకలో మనకు పైకి కనిపించే తీగ వంటి భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని...లూజ్ అనాజెన్ సిండ్రోమ్ : దీన్నే లూజ్ హెయిర్ సిండ్రోమ్ అంటారు. దీని పేరే దీని వల్ల కలిగే లోపాన్ని సూచిస్తుంది. అంటే అనాజెన్ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ముఖ్యంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన తేలిగ్గా మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది.పరిష్కారం : సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు.ట్రాక్షన్ అలొపేషియా: చాలామంది తల్లులు జడవేసే సమయంలో తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్గా జడవేస్తుంటారు. ఇలా చాలాకాలం పాటు జుట్టును చాలా బలంగా లాగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది.ట్రైకో టిల్లోమేనియా : ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్నట్టుగానే ఈ సమస్య ఉన్నవారు తమ జుట్టు తామే పీకేసుకుంటుంటారు. వీళ్లు తమ కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.ట్రైకోఫేజియా : ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే చికిత్స (ఎమర్జెన్సీ ట్రీట్మెంట్) ఇవ్వడం అవసరం. చివరగా... జుట్టు రాలుతున్నప్పుడు వెంట్రుకలకు ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని... ఆ మేరకు చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల వైద్యపరంగా తగిన విద్యార్హతలు లేనివారు జుట్టుకు చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతినడం లేదా రాలిపోవడం జరగవచ్చు. అందుకే తమ జుట్టు సమస్యలకు తగిన విద్యార్హతలు ఉన్న నిపుణలను సంప్రదించడం అన్న జాగ్రత్త తీసుకోవడం మంచిది.తొలి రోమం పుట్టేదిలా... బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం తాలూకు 22వ వారంలోనే వెంట్రుక మూలాలు చిన్నారి తాలూకు దేహమ్మీద ఆవిర్భవిస్తాయి. వాటిని ఫాలికిల్స్ అంటారు. అంటే పుట్టుకకు ముందే బిడ్డ శరీరంపై 50 లక్షల ఫాలికిల్స్ ఉంటాయి. వీటిల్లో పదిలక్షలు తల (మాడు) మీద ఉంటాయి. పుట్టుకకు ముందు ఈ ఫాలికిల్స్ (వెంట్రుక మూలాలు) ఎన్ని ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. అంతేతప్ప వీటి సంఖ్య జీవితకాలంలో ఎప్పుడూ పెరగదు. పైగా వ్యక్తులు పెరుగుతున్నకొద్దీ వీటి సంఖ్య తగ్గుతూ పోతుంది.వెంట్రుక నిర్మాణం ఇలా... వెంట్రుకను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పవచ్చు. అదే మాడు మీది చర్మం లోపల ఉండే ‘అంకురం’ (బల్బ్) భాగం. ఇక మనకు బయటకు కనిపించే భాగాన్ని ‘వెంట్రుక’ (షాఫ్ట్) అంటారు. ఇలా వెంట్రుకలో బల్బ్ అలాగే షాఫ్ట్ అని రెండు భాగాలుంటాయి.బల్బ్ అని పిలిచే ఈఅంకురంలో అనేక పొరలు ఉంటాయి. అంకురం లోపల ఒక మోలక(్రపొజెక్షన్)లా ఉండే భాగాన్ని పాపిల్లా అంటారు. దీనికి రక్తసరఫరా ఉంటుంది. వెంట్రుకలో జీవంతో ఉండే భాగం ఇదే. ఈ బల్బ్లో ఎప్పుడూ కణవిభజన జరుగుతూ ఉంటుంది. ఇంత వేగంగా శరీరంలోని మరేప్రాంతంలోనూ కణవిభజన జరగదు. ప్రతి 23 నుంచి 72 గంటలకొకసారి కణాల విభజన జరుగుతూ ఉండటం వల్ల వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి అంకురం పక్కనే ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని ‘సబేషియస్ గ్రంథి’ అంటారు. ఇది నూనెలాంటి ద్రవాన్ని స్రవిస్తుంటుంది. ఇది జుట్టుకు స్వాభావికమైన (నేచురల్) కండిషనర్లా పనిచేస్తుంటుంది. చిన్నపిల్లలు తమ టీనేజీలోకి రాగానే ఈ గ్రంథి నుంచి స్రావం ఎక్కువై జుట్టులో మెరుపును పెంచి, ఆ వయసులో కౌమార బాలబాలికలు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.మందుల వల్ల...రకరకాల ఆరోగ్య సమస్యలకు కొన్ని రకాల మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం సాధారణంగా జరుగుతుంటుంది. కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశల్లో జోక్యం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల/జీవిత చక్రాల (సైకిల్)లో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి జుట్టు రాలేలా చేస్తాయి.టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక 2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలాక మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది.అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో జుట్టు రాలడం విషయంలో... వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. ఈ ఫలితం మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైన ఉండే జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి.జుట్టు... దానిపై రసాయనాల ప్రభావం... జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్ చేసుకోవడం, బ్లీచింగ్ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి వెంట్రుకలు మళ్లీ రిపేర్ చేయలేని విధంగా దెబ్బతినవచ్చు. మనకు కనిపించే వెంట్రుక పై పొర అయిన క్యూటికిల్ పూర్తిగా దెబ్బతినవచ్చు. ఇలా వెంట్రుక పైపొర అయిన క్యూటికిల్ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది పైపొరలా నునుపుగా కాకుండా కాస్త గరుకుగా ఉంటుంది. ఈ కార్టెక్స్ భాగం బయటపడిన జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్స్ప్రేలలో ఉండే రసాయనాలు క్యూటికిల్నే కాకుండా కార్టెక్స్నూ దెబ్బతీయవచ్చు. అప్పుడు వెంట్రుక తేలిగ్గా విరిగిపోతూ ఉంటుంది.వెంట్రుకను దెబ్బతీసే భౌతిక పద్ధతులు : విపరీతంగా దువ్వడం, చాలా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బు మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. ఇలా కనిపించే వెంట్రుకలను ‘బబుల్డ్ హెయిర్’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి.పుట్టుకతోనే జుట్టు రాలిపోయే కండిషన్లు... హైపోట్రైకోసిస్ : జుట్టు సమస్యల్లో ఇదో రకం. అలొపేషియాలో మొదట జుట్టు ఉన్న చోట రాలిపోయి, మళ్లీ మొలవడంలో ఇబ్బందులు ఏర్పడితే... ఈ ‘హైపోట్రైకోసిస్’ అనే సమస్యలో అసలు జుట్టు పెరగాల్సిన చోట... మొదట్నుంచి కూడా వెంట్రుకలే మొలవవు. దాంతో పుట్టుకతోనే జుట్టు మొలవకపోవడంతో పాటు... జీవితకాలంలో అసలెప్పుడూ వారిలో జుట్టు మొలవదు. ఇందుకు కారణాలు ప్రధానంగా జన్యుపరమైనవి. ఇక పిండదశలో వచ్చే లోపాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఈ సమస్యతో పాటు కనిపించే గ్రాహమ్ లిటిల్ సిండ్రోమ్, ఒఫ్యూజీ సిండ్రోమ్, మేవిక్ క్లేవ్ సిండ్రోమ్ వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి.కంజెనిటల్ అలొపేషియా : ఈ కండిషన్ కారణంగా పుట్టుకతోనే బట్టతల వస్తుంది.ట్రైయాంగ్యులార్ అలొపేషియా : ఈ కండిషన్లో కణతల వద్ద జుట్టు రాలిపోతుంది. కంజెనిటల్ ఏట్రికియా : పిల్లల్లో కనిపించే ఈ కండిషన్లో మొదట వారికి ఒత్తైన జుట్టు ఉండి, అది రాలిపోయి మళ్లీ మొలవదు.- డా. విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్.నిర్వహణ : యాసీన్ -
జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు బరువు ..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..
బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ కఠినమైన ఆహార నియమాలు లేదా తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని కొందరు ఫిట్నెస్ ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. కేవలం నిలకడతో జీవనశైలి మార్పులను అనుసరిస్తే చాలంటున్నారు. తాజాగా మరో ఫిట్నెస్ నిపుణుడు అలా చేసే జస్ట్ ఆరు నెలల్లో 25 కిలోలు పైనే తగ్గి చూపించాడు. తన శరీరాకృతిని స్లిమ్గా మార్చుకోవడానికి సహాయపడిన ఆచరణాత్మక నియామాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అవేంటంటే..ఫిట్నెస్ నిపుణుడు జీషన్అలీ తాను సులభమైన జీవనశైలి మార్పులతోనే 25 కిలోలు పైనే తగ్గానని అన్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోవడమే అధికంగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుందని అన్నారు. ఫలితంగా జింక్ ఫుడ్పైకి మనసు మళ్లుతుందని అన్నారు. అందుకోసం తాను జస్ట్ మూడు నియమాలను పాటించానని అన్నారు.నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి..నీరు తాగండి..నిద్ర నీరు రహస్య ఆయుధాలని నొక్కి చెబుతున్నాడు. తాను ప్రతి రాత్రి 10:30 గంటలకల్లా పడుకునేవాడినని, రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగేవాడినని అన్నారు. ఇక్కడ ఎక్కువ నిద్ర, ఎక్కువ నీరు అంటే.. ఎక్కువ శక్తి, తక్కువ ఆకలి అని చెప్పారు. ప్రతిరోజు ఒక దినచర్యను పాటించడం..అంటే నిద్ర, జిమ్, వాకింగ్లకు సమాన ప్రాధాన్యతి ఇస్తూ చేయాలి. ముందుగా ప్లాన్ చేసుకుని అనుసరిస్తే..సవ్యంగా ఉంటుంది లేదంటే ఆ ప్లాన్ కాగితానికే పరిమితం అవుతుందని అంటున్నారు.తగినంత ప్రోటీన్ తీసుకోండి..అతని బరువు తగ్గే ప్రయాణంలో ఆకలిని నియంత్రించడంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. తాను తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ..ప్రోటీన్ మాత్రం రోజుకి 180–200 గ్రాములకు పరిమితం చేశానని అన్నారు. కండరాలను కాపాడుకోవడానికి, ఆకలి కోరికలు తగ్గించుకోవడానికి, అలాగే జీవక్రియను మెరుగ్గా ఉంచడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు. దీనివల్ల పొట్టకొవ్వు వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలా 46 ఏళ్ల వయసులో 24 వారాల్లో తాను 101 కేజీల నుంచి 76 కేజీలకు తగ్గానని చెప్పారు. View this post on Instagram A post shared by Zee Ali - South Asian Health and Fitness Expert (@_zeeali1)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టైప్రైటర్'తో అద్భుతమైన చిత్రం..! ఆ క్రియేటివిటీకి మాటల్లేవ్ అంతే) -
హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..
దేహంలో ఎక్కడైనా వాపుగానీ నొప్పిగానీ వస్తే కాపడం పెట్టడం చాలా సాధారణం. ఇలా కాపడం పెట్టడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందడం ఎప్పటినుంచో అనుసరిస్తున్న ప్రక్రియ. అయితే ఏయే సందర్భాల్లో ఐస్ ప్యాక్ (ఐస్ కాపడం) పెట్టాలో... మరే సందర్భంలో వేడి కాపడం అవసరమవుతుందో చూద్దాం. ఐస్ప్యాక్ ఎప్పుడంటే... గాయం తగిలిన చోట ఐస్తో అద్దడం వల్ల ఉపశమనం కలగడం అన్నది తాజాగాయాల విషయంలోనే ఎక్కువ. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎర్రబడుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా అనిపిస్తుంటుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల అక్కడి (లోకల్) ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్–హంటింగ్ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచ బారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఐస్ పెట్టడం వల్ల కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్కెఫలిన్స్ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్ వల్ల నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్ కండక్షన్ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్ప్యిక్ అన్నది కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్ క్యూబ్స్ను నేరుగా అద్దడం కంటే... టవల్లోగాని, లేదా ఏదైనా కవర్లోగాని పెట్టి ఐస్ప్యిక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : ఆర్థరైటిస్ ఉన్నప్పుడు / వాపు, మంట వచ్చిన చోట (టెండర్పాయింట్స్లో) / తాజా గాయాలు (ఫ్రెష్ ఇంజరీస్) అయినప్పుడు. హాట్ ప్యాక్ (వేడికాపడం) ఎప్పుడంటే... సాధారణంగా దీర్ఘకాలికంగా వచ్చే నొప్పులూ, అలాగే నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు వేడికాపడం ద్వారా మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ వెచ్చదనం ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ప్రభావం చూపుతుంది. వేడికాపడం వల్ల ఆ పరిసరాల్లో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. దాంతో అక్కడ జీవక్రియల వేగం (మెటబాలిక్ రేట్) కూడా పెరుగుతుంది. వేడికాపడంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల ఉపశమనం కలుగుతుంది. వేడికాపడం అన్నది కాస్త కాస్తగా కాపడం పెడుతూ 10–15 నిమిషాలు కొనసాగించాలి. వేడికాపడం బట్టను వేడి చేయడం ద్వారాగానీ, హాట్ వాటర్ బ్యాగ్తోగాని, ఎలక్ట్రిక్ హీట్ప్యాక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : నడుమునొప్పి / ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి (మెకానికల్ బ్యాక్పెయిన్) / డిస్క్ప్లాప్స్ / సయాటికా. -
రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?
డాక్టర్ గారు, నా రెండేళ్ల బాబుకు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. చాలాసార్లు యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తోంది. అతని రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?– రమణి, నెల్లూరు. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. రెండు సంవత్సరాల వయసులో పిల్లలకు సంవత్సరానికి ఆరు నుంచి పదిసార్లు జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. ఇది ఇమ్యూనిటీ బలహీనంగా ఉందని అర్థం కాదు. ఈ వయసులోనే పిల్లల రోగనిరోధక వ్యవస్థ వివిధ సూక్ష్మక్రిములను ఎదుర్కొంటూ క్రమంగా బలపడుతుంది. అయితే తరచుగా యాంటీబయాటిక్స్ అవసరం అవుతున్నాయనిపిస్తే, పిల్లల వైద్యుడిని సంప్రదించి నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమా లేదా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే చాలా జలుబులు, వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ ఉపయోగం ఉండదు. అందుకే, వారి ఇమ్యూనిటీ పెంచే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి 7 బంగారు సూత్రాలు ఉన్నాయి.1. రంగురంగుల ఆహారంప్రతి రోజు పిల్లల ప్లేట్లో వివిధ రంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూడండి. పిల్లల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సమతుల్య ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బొప్పాయి, జామ, నారింజ, క్యారట్, టొమాటో, పాలకూర వంటి పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందించి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.2. ప్రొటీన్ తప్పనిసరిరోగనిరోధక కణాలు, యాంటీబాడీలు తయారవ్వడానికి ప్రొటీన్ కీలకం. గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, చికెన్ లేదా చేపలు వంటి ప్రోటీన్ పదార్థాలు తీసుకోవడం అవసరం.3. తగినంత నిద్రనిద్రలోనే శరీరం తనను తాను పునరుద్ధరించుకుని రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకుంటుంది. అందుకే, రెండేళ్ల పిల్లలకు రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర తప్పనిసరి.4. బయట ఆడుకోవడంప్రతిరోజూ కనీసం గంటసేపు బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. సూర్యరశ్మి ద్వారా విటమిన్–డి లభించడంతో పాటు శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన ఎదుగుదల, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తుంది.5. అన్ని టీకాలు సమయానికి వేయించండిటీకాలు పిల్లల శరీరానికి వివిధ వ్యాధులను ఎదుర్కోవడం నేర్పించే రక్షణ కవచంలాంటివి. అన్ని టీకాలను సమయానికి వేయించడం కూడా చాలా అవసరం. దీంతో అనేక తీవ్రమైన అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.6. జంక్ ఫుడ్కు దూరంగా ఉంచండిచాక్లెట్లు, చిప్స్, కూల్డ్రింక్స్, ప్యాకెట్ ఫుడ్స్ వంటి జంక్ ఫుడ్ను పరిమితం చేయాలి. కడుపు నిండటం ఒకటి అయితే, శరీరానికి అవసరమైన పోషకాలు అందడం మరొకటి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తుంచుకోవాలి.7. చేతుల పరిశుభ్రత అలవాటు చేయండిఅనేక ఇన్ఫెక్షన్లు చేతుల ద్వారా వ్యాపిస్తాయి. అందుకే, చిన్నప్పటి నుంచే పరిశుభ్రతను నేర్పించాలి. భోజనం ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. అయితే సంవత్సరానికి పదిసార్లకుపైగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, తరచూ న్యూమోనియా బారిన పడటం, బరువు సరిగా పెరగకపోవడం, నోటిలో పదేపదే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం లేదా తరచూ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే ప్రత్యేక ఇమ్యూనిటీ పరీక్షలు చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇమ్యూనిటీని ఒక్కసారిగా పెంచే మంత్రం లాంటి సిరప్ లేదా టానిక్ ఏదీ లేదు. సమతుల ఆహారం, తగిన నిద్ర, పూర్తి టీకాలు, శారీరక చలనం, పరిశుభ్రత వంటి ఆరోగ్యకరమైన అలవాట్లే పిల్లల రోగనిరోధక శక్తిని సహజంగా బలపరుస్తాయి. డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
మూత్రపిండం ప్రాణగండం
మన దేహంలో మూత్రపిండాలు (కిడ్నీలు) ప్రతి క్షణం మన రక్తాన్ని వడపోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అవి రక్తంలోని విషపదార్థాలనూ, వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో కిడ్నీలు అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తాయి. ఈ కండిషన్నే ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ (ఏకేఐ) అంటారు. ఇది కొంత ప్రమాదకరమైన పరిస్థితే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో బాధితులకు తగిన చికిత్స అందక΄ోతే కొన్ని గంటలు లేదా రోజుల్లోనే ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ ఎప్పుడు ఏర్పడుతుంది, దీనికి కారణాలేమిటి, దీనికి నివారణ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.కొంతమందిలో యూరిన్ పాస్ చేస్తున్న సమయంలో మూత్రం తక్కువగా రావడం జరుగుతుండవచ్చు. అలా మూత్రం పరిమాణం తగ్గడం అంత మంచి సూచన కాదు. అలాగే దేహంలో ముఖం లేదా కాళ్లూ చేతుల్లో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్) వంటి లక్షణాలను చిన్న సమస్యగానే అనుకుని కొంత నిర్లక్ష్యం చేసే అవకాశమూ ఉంది. అయితే ఈ లక్షణాలన్నీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే తొలి సంకేతాలు కావచ్చు. సమయానికి చికిత్స తీసుకోక΄ోతే దేహంలో విషపదార్థాలు పేరుకు΄ోయి గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమూ ఉంటుంది. చికిత్స ఇలా... అక్యూట్ కిడ్నీ ఇంజరీ (ఏకేఐ)కి కారణమైన సమస్యను వెంటనే గుర్తించి, దానికి తక్షణ చికిత్స అందించడమన్నది ఏకేఐ చికిత్సలో అత్యంత కీలకం. ఉదాహరణకు డీ–హైడ్రేషన్ వల్ల దేహంలో ద్రవాలు తగ్గితే వెంటనే సెలైన్ ఎక్కించడం ద్వారా శరీరంలో నీటిమోతాదు సమతుల్యంగా ఉండేలా చూడాలి. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ముప్పు వాటిల్లినట్టు తెలిస్తే దాన్ని తగ్గించడం కోసం అవసరమైన చికిత్స ఇవ్వడం, కిడ్నీలకు హానికరమైన మందులను నిలిపివేయడం, అవసరమైతే తాత్కాలికంగా డయాలసిస్ చేయడం ద్వారా కిడ్నీలు తిరిగి కోలుకునేలా చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే... ఏకేఐలో అందుకు కారణాన్ని బట్టి తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. చివరగా... మూత్రం పరిమాణం అకస్మాత్తుగా తగ్గిపోవడం చిన్న విషయం కాదు. అది కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని దేహం ఇస్తున్న హెచ్చరిక కావచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ సమస్యను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే కిడ్నీలనూ... ఒక్కోసారి ప్రాణాలనూ కాపాడుకోవచ్చని గుర్తుంచుకోవాలి.డాక్టర్ అరుణ్కుమార్ దొనకొండ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ – కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్(చదవండి: హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..) -
ఏఐ కాలం 'మాయరోగం'
‘సైబర్కాండ్రియా’ మనుషులను కుదురుగా ఉండనివ్వడంలేదు. వ్యాధుల వల్ల వచ్చే బాధలను మించిన భయాలను రేకెత్తించి, కంటికి కునుకు పట్టనివ్వడంలేదు. ‘సైబర్కాండ్రియా’ బాధితులు తమ ఆరోగ్యంపై లేనిపోని అనుమానాలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, పదేపదే రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ బెంగతో కుదేలైపోతున్నారు. డాక్టర్లు వారించినా, మనసులోని శంకలు తీరక రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం; పెద్ద ఇబ్బందేమీ లేదని అనుభవజ్ఞులైన డాక్టర్లు నచ్చచెప్పినా, వినిపించుకోకుండా డాక్టర్లనే పదేపదే మార్చేస్తూ, లేని రోగాల ఆనవాళ్లు కనిపెట్టడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం డబ్బు మంచినీళ్లలా ఖర్చుచేస్తున్నారు. వీరి కారణంగా ఉత్పాదకతకు భారీనష్టం వాటిల్లుతోంది. ‘సైబర్కాండ్రియా’ సహా ఆరోగ్య సంబంధమైన రకరకాల మానసిక ఆందోళనల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 1 ట్రిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘సైబర్కాండ్రియా’ మరింతగా పెరిగింది. చిన్న చిన్న శారీరక లక్షణాలనే పెద్దగా అనుమానించడం; అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్యపక్రియల్లోనూ చికిత్స ప్రయోగాలు చేయడం; వైద్యులను తరచుగా మార్చడం; వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ప్రమాదకర సంకేతాలు ఏవీ లేనప్పటికీ పదేపదే పరీక్షలు చేయించుకోవడం; ఈ లక్షణాలతో బాధపడే ఉద్యోగులు తరచుగా విధులకు సెలవు పెట్టడం వంటివి చేస్తున్నారు. ‘సైబర్కాండ్రియా’ వల్ల విలువైన పనిగంటలకు, ఉత్పాదకతకు తీవ్రనష్టం వాటిల్లుతోంది.కాస్త తలనొప్పిగా ఉన్నా, కొంచెం ఒళ్లు వెచ్చబడి జ్వరంగా ఉన్నా ఇదివరకటి జనాలు పెద్దగా కంగారు పడేవారు కాదు. తలనొప్పిగా ఉంటే నొవాల్జిన్ మాత్ర, జ్వరంగా ఉంటే పారాసిటమాల్ మాత్ర వేసుకుని, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేవారు. ఎప్పుడైనా అజీర్తిచేసి కడుపు గడబిడ చేస్తే, వంటింటి చిట్కాలు పాటించేవారు. అప్పటికీ నయం కాకుంటే, డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. ఇంట్లో చిన్నా పెద్దా ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా, ఇంట్లోని పెద్దలు అనుభవ వైద్యం చేసేవారు. ఇంటి వైద్యానికి కుదరని సమస్యలకైతే ఫ్యామిలీ డాక్టర్లు ఆపద్బాంధవుల్లా తగిన చికిత్స అందించేవారు. జబ్బూ జట్రా సర్వసాధారణంగా ఉన్నా, జనాలు వాటి గురించి బెంగ పెట్టేసుకోకుండా నిక్షేపంగా బతికేసేవారు. ఇప్పుడలా కాదు, ఒంటికి ఏ బాధ వచ్చినా వెంటనే ఏఐ వైపు చూస్తున్నారు. సర్వసాధారణంగా వచ్చే బాధలకు పెద్దపెద్ద వ్యాధులను ఊహించుకుని భయపడుతున్నారు.తలనొప్పి వస్తే బ్రెయిన్ ట్యూమరేమోనని; కడుపునొప్పి వస్తే బొవెల్ క్యాన్సరేమోనని; దగ్గు వస్తే లంగ్ క్యాన్సరేమోనని; నడుంనొప్పి వస్తే డిస్క్ జారిపోయిందేమోనని అనుమానిస్తున్నారు. ఈ అర్థంలేని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఇంటర్నెట్ అంతా జల్లెడ పట్టేస్తున్నారు. ఏఐ ముందు తమ సందేహాల చిట్టా విప్పుతున్నారు. ఇదంతా ఏఐ కాలం తెచ్చిన మాయరోగం. దీనికి అంతర్జాతీయ వైద్యనిపుణులు సైబర్కాండ్రియా అని పేరు పెట్టారు.మొదటి స్థానంలో భారత్కొన్ని ఘనతలకు సంబంధించి మొదటి స్థానంలో నిలవడం దేశానికి గర్వకారణంగా ఉంటుంది. కాని, కొన్ని ప్రతికూల అంశాల్లో మొదటి స్థానానికి చేరడం విచారించదగ్గ విషయమవుతుంది. డబ్ల్యూహెచ్ఓ సహా పలు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం ‘సైబర్కాండ్రియా’ బాధితుల్లో మన భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. ‘సైబర్కాండ్రియా’ బాధితుల్లో ఎక్కువమంది చదువుకున్నవారు, పట్టణ, నగర ప్రాంతాలకు చెందినవారే ఉంటున్నారు. ‘సైబర్కాండ్రియా’ బాధితుల్లో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాల పరిస్థితి ఇదీ... అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ‘కోవిడ్–19’ కాలం నుంచి భారత్లో సైబర్కాండ్రియా బాధితుల్లో సుమారుగా 120% పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల అమెరికాలో 80%, బ్రిటన్లో 70%, ఇటలీలో 60%, స్పెయిన్లో 50% మేరకు పెరుగుదల నమోదైంది. ‘కోవిడ్–19’ మహమ్మారి ఫలితంగా జనాల్లో ఆరోగ్యం పట్ల అతిజాగ్రత్తలు, వాటితో పాటు ఆరోగ్య స్థితిగతులపై అర్థంలేని అనుమానాలు కూడా బాగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 560 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉంటే, వారిలో దాదాపు 190 కోట్ల మంది ఏదో ఒక స్థాయిలో ‘సైబర్కాండ్రియా’ బాధితులే! వీరిలో దాదాపు 55 కోట్ల మంది తీవ్రస్థాయిలో ‘సైబర్కాండ్రియా’ లక్షణాలతో బాధపడుతున్నారని ‘సైబర్కాండ్రియా సివియారిటీ స్కేల్’ ఆధారంగా అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ‘సైబర్కాండ్రియా’ బాధితుల్లో ఎక్కువగా యువతరం వారే ఎక్కువగా ఉంటున్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం వివిధ వయసుల వారిలో ‘సైబర్కాండ్రియా’ బాధితుల వివరాలు...ఈ వలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే...‘సైబర్కాండ్రియా’ విషవలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే, ఇంటర్నెట్ వాడే చిన్నా పెద్దా అందరూ కొంత సంయమనంతో కూడిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వలయంలో చిక్కుకోకుండా ఉండటానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో నిపుణులు చెబుతున్న సూచనలు ఇవీ...చేయాల్సినవి» ఏఐని ప్రాథమిక సమాచారం కోసమే వాడాలి» ఏఐ సమాచారాన్ని విశ్వసనీయ మార్గాల ద్వారా తనిఖీ చేసుకోవాలి » శరీరంలో అసౌకర్యం కలిగితే ఆ లక్షణాలను వివరంగా రాసుకుని, వైద్యులను సంప్రదించాలిచేయకూడనివి» ఏఐ ఆధారంగా స్వీయ వ్యాధినిర్ధారణ తగదు» ఏఐ ఆధారంగా స్వీయ వైద్యం ప్రారంభించవద్దు.» ఏఐ సమాచారం ఆధారంగా ప్రాణాంతక వ్యాధులు సోకినట్లుగా లేనిపోని భయాలు పెట్టుకోవద్దు.వివిధ వయసుల వారిలో...‘సైబర్కాండ్రియా’ మూలకారణం ఇంటర్నెట్– దానివల్ల అందుబాటులోకి వచ్చిన సోషల్మీడియా, ఏఐ ప్లాట్ఫామ్స్ అయినా, అంతర్జాతీయ అధ్యయనాలు వేర్వేరు వయసుల వారిలో వేర్వేరు కారణాలను ప్రధానంగా గుర్తించాయి. సోషల్ మీడియాకు కొత్తగా పరిచయమైన 13–17 ఏళ్ల వయసు వారిలో ఆరోగ్య సమస్యలపై అరకొర అవగాహన; శరీరంలో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వెదుకులాట సాగించి, అందులో దొరికే సమాచారం చదివి లేనిపోని భయాలు పెంచుకోవడం వల్ల ‘సైబర్కాండ్రియా’ బారిన పడుతున్నారు.కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లే 18–24 ఏళ్ల వయసు వారు మితిమీరి సోషల్ మీడియాకు అలవాటు పడటం, ఆరోగ్య సమస్యలపై ఇంటర్నెట్, ఏఐపై ఆధారపడటం వల్ల ‘సైబర్కాండ్రియా’ బాధితులవుతున్నారు. కొత్తగా కెరీర్ ప్రారంభించి, కెరీర్లో నిలదొక్కుకునే దశలో ఉన్న 25–44 ఏళ్ల వయసువారు తమ ఆరోగ్య సందేహాల కోసమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపై సమాచారం తెలుసుకోవడానికి సోషల్ మీడియా, ఏఐ ప్లాట్ఫామ్స్పై ఆధారపడుతున్నారు. వీటి ఆధారంగా పదేపదే వైద్యపరీక్షలు జరిపించుకోవడం, డాక్టర్లను సంప్రదించడం చేస్తున్నారు. డాక్టర్లు ఒకవేళ ఏమీ లేదని చెప్పినా, తృప్తిపడకుండా డాక్టర్లను తరచు మారుస్తున్నారు. ఇక 45–64 ఏళ్ల వయసు వారిలో చాలామందికి నిజంగానే కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలై ఉంటాయి. వీటిలో బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉంటాయి. వీరు ఆరోగ్య సమస్యలపై తెలుసుకోవడానికి సోషల్ మీడియా, ఏఐ ప్లాట్ఫామ్స్లో వెదుకులాట సాగిస్తున్నా, డాక్టర్లపై కూడా కొంత నమ్మకం ఉంచుతున్నారు. అయితే, సోషల్ మీడియా, ఏఐ ప్లాట్ఫామ్స్లో దొరికే సమాచారం వల్ల గందరగోళానికి లోనై ఆందోళన పెంచుకుంటున్నారు.చివరిగా 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల్లో ‘సైబర్కాండ్రియా’ తక్కువే! వీరిలో సంప్రదాయ పద్ధతులపై ఇంకా పూర్తిగా సడలిపోని నమ్మకమే ఇందుకు కారణం. ఈ వయసు వారిలో చాలా కొద్దిమంది మాత్రమే ఆరోగ్య సమాచారం కోసం సోషల్ మీడియా, ఏఐ ప్లాట్ఫామ్స్పై వెదుకులాట సాగిస్తున్నారు. అయినా, వీరిలో ఎక్కువమంది ఇంకా డాక్టర్లనే నమ్ముకుంటూ ఉండటం కొంత ఊరట.ఏఐ వైద్యునికి ప్రత్యామ్నాయం కాదుఏఐలో ఎలాంటి సమాచారమైనా ఉండవచ్చు. అదంతా ఏఐకి మనుషులు ఇచ్చినదే! ఏఐలో ఏ అంశంపై వెదుకులాట సాగించినా, నిమిషాల్లోనే బోలెడంత సమాచారాన్ని మన ముందు పోగు పెడుతుంది. ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, అది అనుభవం, నైపుణ్యం ఉన్న వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యల గురించి ఏఐలో వెదుకులాట సాగించేవారు ఈ సంగతిని గుర్తెరగాలి. ఏఐకి, నిపుణుడైన డాక్టర్కు తేడా చాలానే ఉంటుంది. ఆ తేడా ఏ స్థాయిలో ఉంటుందో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం...ఛాతీనొప్పిఏఐగుండెపోటు కావచ్చువైద్యుడురోగి వయసు, ఎత్తు, బరువు, జన్యు చరిత్ర తెలుసుకుంటారు. ఈసీజీలాంటి ప్రాథమిక పరీక్షలు జరిపి, పరిస్థితిని బట్టి వైద్యం చేస్తారు.కడుపు ఉబ్బరం, మంటఏఐఅల్సర్ కావచ్చువైద్యుడురోగి ఆహారపు అలవాట్లు, అరుగుదల పరిస్థితిని తెలుసుకుంటారు. ఇతర జీర్ణ సంబంధ కారణాలను పరిశీలించి, తగిన మందులు సూచిస్తారు.కీళ్లనొప్పులుఏఐఆర్థరైటిస్ కావచ్చు.వైద్యుడునొప్పి ఉన్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలిస్తారు. ఆ భాగంలో కదలికలు ఎలాఉన్నాయో పరిశీలిస్తారు. తగిన మందులు సూచిస్తారు.తలనొప్పిఏఐబ్రెయిన్ ట్యూమర్ కావచ్చువైద్యుడుతలనొప్పి ఎప్పుడెప్పుడు వస్తోందో, ఏ పరిస్థితుల్లో వస్తోందో తెలుసుకుని, అవసరమైన వైద్యం చేస్తారు.బరువు పెరుగుదలఏఐథైరాయిడ్ సమస్య కావచ్చు.వైద్యుడురోగి జీవనశైలిని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. రోగి ఆహారపు అలవాట్లు, ఇతర మందులు ఏవైనా తీసుకుంటున్నారా అనేది కనుక్కుని, తగిన చికిత్స చేస్తారు.అలసట, నీరసంఏఐక్యాన్సర్ కావచ్చువైద్యుడురోగి నిద్ర, ఒత్తిడి, ఆహారం, అనీమియా, థైరాయిడ్ వంటి కారణాలను పరిశీలిస్తారు. కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.గుండెదడఏఐగుండెజబ్బు కావచ్చువైద్యుడురోగి నాడి పరిశీలిస్తారు. కెఫీన్ మోతాదు ఎక్కువైందేమో తెలుసుకుంటారు. అవసరం అనిపిస్తే ఈసీజీ చేయిస్తారు. అప్పుడు తగిన చికిత్స చేస్తారు.బయటపడాలంటే..?‘సైబర్కాండ్రియా’ నుంచి బయటపడటం కొంత కష్టమే అయినా, అసాధ్యం కాదని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), బ్రిటన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) నిపుణులు చెబుతున్న ప్రకారం ‘సైబర్కాండ్రియా’ బారిన పడినవారు శరీరంలో ఏ చిన్న అసౌకర్యం కలిగినా, వెనువెంటనే ఆన్లైన్లో వెదకడం, ఏఐ ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం మానుకోవాలి. కచ్చితమైన సమాచారం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలు అంతర్జాతీయ వైద్య సంస్థల వెబ్సైట్లను చూడవచ్చు. ఆన్లైన్లో సమాచారం వెదుకులాట కోసం సమయం వృథా చేసుకుని, లేనిపోని భయాలు పెట్టుకునే బదులు సమీపంలో ఉన్న వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలపై సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వచ్చే వీడియోలను చూడటం మానుకోవాలి. వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, వైద్య చికిత్సల్లో వందశాతం ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుందని గ్రహించాలి. కొన్ని వ్యాధులకు ఇప్పటికీ శాశ్వత చికిత్స అందుబాటులో లేదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. వైద్యంలో కూడా అనిశ్చితి సహజమే! దానిని ఆమోదించగలిగి ఉండాలి. క్రమం తప్పని వ్యాయామం, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మానసిక ఆందోళనను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పటికీ ఆందోళన తగ్గకుంటే, మానసిక వైద్య నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స పొందాలి.‘సైబర్కాండ్రియా’ విషవలయం లాంటిది. ఒకసారి మొదలైతే, అది ఆగకుండా ఆరోగ్యం పట్ల లేనిపోని భయానుమానాల చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. దీని నుంచి బయటపడటం కష్టమని అంతర్జాతీయ మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ చక్రం ఎలా మొదలవుతుందంటే?... -
హమ్మయ్యా... అది కూడా ఆరోగ్యమేనట!
ఆరోగ్యం అంటే ఏమిటి? కండలు తిరిగిన దేహమా? జబ్బుల్లేని జీవితమా? ఎంత తిన్నా లావు కాకపోవడమా? లేక ఎలాంటి చింతా, దిగులు లేకుండా జీవించడమా?..నిజానికి, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే భారతీయ సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటికీ, వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. "మెంటల్" అనే ముద్ర పడుతుందేమో, నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అనే భయంతో చాలామంది తమ సమస్యను బయటకు చెప్పడానికే వెనుకాడుతున్నారు.అయితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మణిపాల్ సిగ్నా నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ సర్వే ప్రకారం తొలిసారిగా భారతీయులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది మానసిక ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావిస్తుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో 53 శాతం మంది ఇప్పటికీ వ్యాయామం, ఫిట్నెస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.మెదడు పగిలేంత ఒత్తిడి... కానీ సమస్యే కాదట!ఈ అధ్యయనం బయటపెట్టిన మరో ఆందోళనకర విషయం భారతీయులు.. స్ట్రెస్ను చాలా తేలికగా తీసుకోవడం!. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పినా, అది తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అంగీకరించింది కేవలం ఒక శాతం మాత్రమే. అంటే ఒత్తిడి ఎంత తీవ్రమైనా, దాన్ని ఆరోగ్య సమస్యగా భావించే అవగాహన ఇంకా చాలామందిలో లేదన్నమాట.ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆరోగ్య ఖర్చుల భారం చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ)ని పెంచుతుండగా, ఆరోగ్య బీమా ఉన్నవారిలో ఈ ఒత్తిడి కొంత తక్కువగా కనిపించింది.శారీరక, మానసిక ఆరోగ్యాలను వేర్వేరుగా చూడలేమని, రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని మణిపాల్ సిగ్నా సీఈవో జోయ్దీప్ సాహా పేర్కొన్నారు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం పెరగడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే సవాళ్లు ఇంకా పెద్దవే. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మానసిక వైద్యుల సంఖ్య పదివేలకు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతుండటం మాత్రం ఆశాజనక పరిణామమే.భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఐదు మానసిక సమస్యలు1. డిప్రెషన్:సుమారు 4.57 కోట్ల మంది భారతీయులు డిప్రెషన్తో బాధపడుతున్నారు. దేశంలో ఏటా జరిగే దాదాపు 2.5 లక్షల ఆత్మహత్యలకు ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిరుద్యోగం, లింగ వివక్ష, సామాజిక అసమానతలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.2. యాంగ్జైటీ డిజార్డర్స్:ఓసీడీ, పీటీఎస్డీ, పానిక్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, ఫోబియాలు వంటి అనేక సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని చాలామంది అసలు మానసిక సమస్యలుగానే గుర్తించకపోవడం వల్ల లక్షలాది మంది చికిత్సకు దూరమవుతున్నారు.3. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం: దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 83 లక్షల మంది తీవ్ర వ్యసనపరులుగా ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించే వారు 3.7 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. సుమారు 18 లక్షల మంది చిన్నారులు కూడా వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.4. బైపోలార్ డిజార్డర్:దేశ జనాభాలో కనీసం రెండు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతకాలం అమితమైన ఉత్సాహంతో ఉండటం, ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోవడం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆత్మహత్య ప్రమాదం కూడా పెరుగుతుంది.5. స్కిజోఫ్రేనియా:ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రాంతులు, ఆలోచనల్లో గందరగోళం, సమాజానికి దూరంగా ఉండడం దీని ప్రధాన లక్షణాలు. పురుషుల్లో ఇది తక్కువ వయసులోనే కనిపించగా, మహిళల్లో గర్భధారణ, ప్రసవం సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల్లాగే వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులే. వాటిని దాచిపెట్టడం కాదు, గుర్తించి సరైన సమయంలో నిపుణులను సంప్రదించడమే నిజమైన ఆరోగ్యానికి మొదటి అడుగు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గుడ్డు! రకరకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్ ఉండే ఎగ్ని కొందరు ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు వేడివేడిగా ఆమ్లెట్ వేసికుని లాగించేస్తుంటారు. ఈ రెండు రకాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బరువు తగ్గడానికి, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు.కొందరు ఆమ్లెట్ తింటే కడుపు నిండుగా ఉంటుందని నమ్మితే, మరికొందరు ఉడకబెట్టిన గుడ్డే ఉత్తమం అని వాదిస్తారు. మనం గుడ్డును వండే విధానం, అందులో కలిపే ఇతర పదార్థాల వల్ల దాని పోషక విలువలు ఎలా మారిపోతాయో తెలిస్తే.. మన ఫిట్నెస్ లక్ష్యాలకు ఏది సరైనదో సులభంగా ఎంచుకోవచ్చు.మీరు క్యాలరీలను చాలా ఖచ్చితంగా లెక్కబెడుతూ డైట్ ఫాలో అవుతుంటే, నిస్సందేహంగా ఉడకబెట్టిన గుడ్డుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో దాగి ఉన్న కొవ్వులు లేదా అదనపు క్యాలరీలు ఉండే అవకాశం అస్సలు లేదు. అయితే, కూరగాయలతో పక్కాగా తయారుచేసిన ఆమ్లెట్కు మరో ప్రత్యేకమైన ప్లస్ పాయింట్ ఉంది. రెండు గుడ్లకు ఎక్కువ కూరగాయలు కలిపి వేసుకునే ఆమ్లెట్ ఎక్కువ క్వాంటిటీని ఇస్తుంది. ఇది మీ ఆకలిని సమర్థవంతంగా అణిచివేసి, జంక్ ఫుడ్స్ తినకుండా నియంత్రిస్తుంది. ఇందుకే చాలా మంది న్యూట్రిషనిస్టులు మీ డైట్ అవసరాలను బట్టి రోజు మార్చి రోజు ఈ రెండింటినీ మార్చుకుంటూ తినాలని సలహా ఇస్తుంటారు.చివరగా చెప్పాలంటే.. బరువు తగ్గాలనుకునే వారి హెల్తీ డైట్లో ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ రెండూ కూడా అద్భుతమైన భాగాలే. మీ జీవనశైలికి, మీ రుచికి ఏది కంఫర్ట్గా ఉంటే దానిని సరైన పద్ధతిలో వండుకుని తినడమే అత్యుత్తమం. -
సానుకూల శక్తికి విపరీత కరణి ఆసనం..
విపరీత కరణి ఆసనం ఒక సరళమైన కానీ అత్యంత ప్రభావవంత మైన ఆసనం. రోజుకు కేవలం 10–15 నిమిషాలు ఈ ఆసనం సాధన చేస్తే శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, జీవితానికి సానుకూల శక్తి లభిస్తాయి. విపరీత కరణి అనే సంస్కృత పదంలో ‘విపరీత’ అంటే తలకిందులైన లేదా వ్యతిరేకమైన, ‘కరణి’ అంటే చర్య లేదా స్థితి. ఈ ఆసనంలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తుతారు. ఇది శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందించే యోగాసనం.ప్రయోజనాలు...ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.కాళ్లలో నిలిచిన రక్తం గుండె వైపు సులభంగా ప్రవహించడానికి సహాయపడుతుంది.ఎక్కువసేపు నిలబడే వారు, నడిచే వారికి కాళ్ల నొప్పి, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.నిద్రలేమి సమస్యలను తగ్గించి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది.పెల్విక్ ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతకు పరోక్షంగా ఉపయోగపడవచ్చు.పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజపరిచి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.అలసటను తగ్గించి శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది.జాగ్రత్తలు....తీవ్రమైన మెడ, వెన్నెముక గాయాలు ఉన్నవారు, అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.ఆసనం చేస్తూ ఎటువంటి ఒత్తిడి లేదా నొప్పి కలిగితే వెంటనే ఆపాలి.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 2–3 గంటల విరామం ఉండాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
90 డేస్ టీ చాలెంజ్! ఏం‘టీ’ నిజమా?
రోజూ ఉదయం నిద్రలేవగానే గుర్తొచ్చేది తాజా టీ. ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఇంకేవో గందరగోళాలు.. ఇలా హడావిడిగా సాగే జీవితంలో ఎన్ని అగచాట్లున్నా చక్కని, చిక్కని ఓ టీ కప్పు సిప్పు చేస్తే తప్ప వాటన్నింటికీ పరిష్కారం దొరకదు. మనదేశంలో టీతోనే రోజు మొదలెట్టేవారు కోట్లలో ఉంటారు. భాషాభేదం లేకుండా, నార్త్, సౌత్ అనకుండా అందరినీ మమేకం చేసి అదో రకం మైకంలో ముంచేసే టీ నిజంగా ఓ రకం డ్రగ్.. అయితే ఇలాంటి టీని ఓ తొంభై రోజులు తాగడం మానేస్తే ఏమవుతుంది?మొదటివారంలో..టీలో ఉండే కెఫీన్కు శరీరం అలవాటు పడుతుంది. అందుకే ఉన్నట్టుంటి టీ తాగడం మానేస్తే మొదటివారం రోజులు చికాకు, దేనిమీద ఏకాగ్రత లేకపోవడం, తలనొప్పి, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి అలవాటైన కెఫీన్ ఒక్కసారిగా దూరమైతే వచ్చే ప్రతి స్పందన ఇది.2–4 వారాల్లో...టీ తాగడం తగ్గించాక తర్వాత చాలామందిలో రాత్రి పూట తొందరగా నిద్రపట్టడం, మధ్యలో మెలకువలు తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు. అలాగే ఉదయం కూడా తాజాగా నిద్రలేవడం ఉషారుగా ఉండడం జరుగుతుంది. ఈ మార్పులు రాత్రిళ్లు టీ తాగే అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.ఆందోళనకి దూరంటీలోని కెఫీన్ శరీరంలో గుండె వేగాన్ని పెంచుతుంది. సాధారణంగా టీ గ్యాప్ వస్తే కొందరిలో ఆందోళన కనిపించడం, చేతులు వణుకుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఈ లక్షణాలు ఇంకా అధికం. గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీతో కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు టీ మానేస్తే సగానికి సగం సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర వినియోగం కూడా తగ్గడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.ఏం‘టీ’ నిజమా?ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ.టీ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.ప్రపంచంలో ప్రతి రోజూ మూడు బిలియన్ల కప్పులకు పైనే టీని తాగేస్తున్నారు.బ్రిటీషర్లు భారత్కి టీ పరిచయం చేస్తే భారతీయులు అందులో పాలు, పంచదార కలిపి కొత్త రూపాన్నిచ్చారు. ఆ తర్వాత ఏలకులు, లవంగాలు, అల్లం కలిపి మసాల టీగా రూపాంతరం చెందింది.ఎంతోప్రాచుర్యం పొందిన టీ పుట్టిన ప్రదేశం మాత్రం చైనానే. క్రీస్తు పూర్వం 2737లో అప్పటి ప్రజలు తొలిసారిగా టీ రుచి చూశారు.వైట్ టీ తెలుసా?బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ గురించి విన్నాం. మనలో చాలామంది వాటిని రుచి చూశాం కాని వైట్ టీ ఏంటి? అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి. అత్యంత స్వచ్ఛమైన సహజమైన టీ రకాలలో ఈ వైట్ టీ ఒకటి. ఈ టీ పొడి కోసం కేమెలియా సినెన్సిస్ అనే మొక్కకు వచ్చే లేత మొగ్గలను, చిన్న ఆకులను మాత్రమే కోస్తారు. దీని డికాషన్ ముదురు రంగులో కాకుండా చాలా తేలికపాటి పసుపు లేదా వెండి రంగులో ఉంటుంది. రుచి కూడా కాస్త తియ్యగా పూల వాసనతో ఉంటుంది. కేవలం వసంత కాలంలో మాత్రమే దొరికే ఈ టీ ఆకులను చాలా జాగ్రత్తగా కోసి ప్రాసెస్ చేస్తారు. రకాన్ని బట్టి దీని రేటు కిలోకి ఐదు వేల నుంచి నాణ్యతను బట్టి లక్షల రూపాయల వరకు ఉంటుంది. -
వయసు 25.. వొంటికి 35.. కారణమేంటి?
‘వయసు కేవలం ఒక సంఖ్య’ అంటారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది మాత్రం అందుకు భిన్నం. క్యాలెండర్ మీ వయసు 25 లేదా 30 ఏళ్లు అయినా... మీ శరీరం మాత్రం 35 లేదా 40 ఏళ్ల వ్యక్తిలా పని చేస్తుండచ్చట! తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది.అమెరికాలోని పరిశోధకులు లక్షలాది మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించగా.. నేటి తరం యువత శరీరాలు గత తరాలతో పోలిస్తే మరింత వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తున్నట్లు గుర్తించారు. దీనినే ‘బయోలాజికల్ ఏజింగ్’ అంటారు. అంటే పుట్టిన తేదీ ప్రకారం వచ్చే వయసు కన్నా శరీరం లోపల జరిగే మార్పుల వల్ల ఎంత వేగంగా ముసలితనం వస్తుందనేదే అసలు విషయం.వయసుదేముందిలే అని సరిపెట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఈ అకాల, అనూహ్య, వేగవంతమైన వృద్ధాప్యం వల్ల 50 ఏళ్లలోపే క్యాన్సర్ బారినపడే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణాశయం, ఊపిరితిత్తులు, గర్భాశయం వంటి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కనిపిస్తోందని తెలి΄ారు.అయితే దీనికి ఇతమిత్థంగా ఇదీ కారణం అని చెప్పలేమనీ, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి అనేక అంశాలు కలిసి శరీరాన్ని వయసు కంటే ముందే బలహీనపరుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అలాగని ఇది అంత భయపడాల్సిన విషయం కూడా కాదని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా శరీర వృద్ధాప్య వేగాన్ని కొంతవరకు నియంత్రించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.తరచు నీరు తాగడం వల్ల కూడా వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. వాటర్ తాగడం పెరిగితే, మూత్రవిసర్జన, చెమట, పేగు కదలికలతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. మనం సాధారణంగా విటమిన్ డిని సూర్యరశ్మి ద్వారా పొందుతాం. ఇది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.– నిర్వహణ: డి.వి.ఆర్ -
మీ పాప టీనేజ్లోకి అడుగు పెట్టిందా? ఈ సూచనలు మీకోసమే!
చిన్నారులు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న కౌమార దశ లేదా టీనేజ్ ఎంతో కీలకం. ఆ సమయంలో వారు చేసుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వాళ్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. అందువల్ల తల్లిదండ్రులు కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!సరిగ్గా చెప్పాలంటే, టీనేజ్లోనే భావోద్వేగాల పరిణతి వస్తుందట. ప్రతిదీ ఈ దశలోనే నేర్చుకుంటారట. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు అయినదానికీ కానిదానికీ పిల్లలను విమర్శిస్తూ, కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనూ, తోటి పిల్లలతోనూ వాళ్లు ఎమోషనల్గా దూరమవుతారని, తమ సమస్యలను చెప్పడానికి భయపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వారి తప్పు సరిచేసే ముందు వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దేనని చెబుతున్నారు. టీనేజీ పిల్లలను కుటుంబ సభ్యులను, టీచర్లు మరింతగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.శుభ్రతా ముఖ్యమే... ఇక పీరియడ్స్ మొదలయ్యాక మరో కొత్త సవాలు ఎదురైవుతాయి. ముఖ్యంగా, పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు.తగ్గ ఆహారం... ఎదిగే వయసులో అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరంటున్నారు నిపుణులు. ఎంత బిజీగా ఉన్నా సరే, మంచి ఆహారం అందించడం మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు. అధి కప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో–ఫ్యాట్, లో–కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలి.క్లాస్, చదువుల్లో పడి స్కూల్లో నీళ్లు తాగడం మర్చిపోతారు కాబట్టి, మీ పాప రోజుకి కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, చక్కెర లేని పండ్ల రసాలూ మంచివేని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్లు, కృత్రిమ తీపి కలిగిన పానీయాలకూ దూరంగా ఉంచాలని తెలియజేస్తున్నారు.ప్రశాంతంగా: ఓ వైపు శరీరంలో మార్పులు, మరోవైపు చదువు ఇవన్నీ పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి రోజుకి ఒక గంటైనా వాళ్లు ప్రశాంతంగా కూర్చొనేలా సమయమివ్వడం వల్ల తమ గురించి తాము ఆలోచించుకునేందుకు సాయపడుతుంది. డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు, క్రియేటివ్ క్రాఫ్ట్వర్క్ వంటివి చేసేలాగాప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. అప్పుడే మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు.అంతేకాకుండా, టీనేజ్ పిల్లలకు వారి పరిధి మేరకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. గుడ్టచ్, బ్యాడ్టచ్ లాంటి వాటి గురించి తెలియజేయాలని చెబుతున్నారు. అప్పుడే వాళ్లు చైల్డ్ అబ్యూజింగ్ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారని సూచిస్తున్నారు.హార్మోన్లలో మార్పులు...టీనేజ్లో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే మరో సమస్య మొటిమలు ఒకటి. ఇవే వారిలో ఆత్మన్యూనతకూ దారితీస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇందుకు కారణం హార్మోనుల్లో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలూ చెప్పాలంటున్నారు. వాటిని గిల్లడం, వత్తడం లాంటివి చేయనీయకూడదు.అర్థం అయేలా చెప్పాలి...రుతుక్రమం... శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులే వస్తాయి. కాబట్టి, వాటి గురించి పీరియడ్స్ మొదలవక ముందే పిల్లలకు అర్థమయ్యేలా వారి మనసు నొప్పించకుండా సున్నితంగా చెప్పాలనీ, అప్పుడే, మనసులో ఉన్న భయాలూ, అపోహలూ తొలగిపోయి, తమలో వస్తోన్న మార్పులను అర్థం చేసుకుంటారని చెబుతున్నారు.వ్యాయామంతో...సిగ్గు, బిడియం లాంటి వాటి వల్ల టీనేజ్ అమ్మాయిలు ఆటలకు దూరం అవుతున్నారనీ, కాబట్టి, ఆ ఫీలింగ్స్ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. స్విమ్మింగ్, బాస్కెట్బాల్, వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒకదాన్లో భాగమయ్యేలా చూడాలి. వ్యాయామం అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయి. -
కండ కలిగితే ఆయుష్షు కలదోయ్!
ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దీంతోపాటు అప్పుడప్పుడూ కండలు పెంచేందుకు బరువులెత్తండి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే కండలు ప్రదర్శనకు మాత్రమే కాదు...నాలుగు కాలాలు ఎక్కువ బతికేందుకూ సాయపడతాయట. ఇదేదో ఆషామాషిగా చేసిన అధ్యయనం కాదండోయ్. అమెరికాలో సుమారు 30 ఏళ్లుగా 1.5 లక్షల మంది నర్సులను పరిశీలించి చేసుకున్న నిర్ధారణ. రెండేళ్లకు ఒకసారి వీరి నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. వారంలో 90 – 120 నిమిషాలపాటు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు (బరువులు, పుషప్స్, బెంచ్ ప్రెస్, పుల్అప్స్, డంబెల్స్, బార్బెల్స్) చేస్తే చేయని వారితో పోలిస్తే అకారణంగా మరణించే అవకాశాలు 13% తగ్గినట్లు తేలింది. అలాగే గుండెజబ్బులతో మరణించే చాన్స్ 19%, నాడీ సమస్యలతో చావు ముప్పు 27% తక్కువైనట్లు తెలిసింది. బరువులు ఎత్తితే ఆరోగ్యమన్నారు కదా అని అతిగా చేయొద్దని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. వారానికి రెండు గంటల కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు చేసినా అదనపు ప్రయోజనం ఏదీ లభించలేదు. మరో విషయం.. ఏరోబిక్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రెండు చేస్తే లాభమెక్కువ. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కనీసం రెండున్నర గంటలు చేసిన వారిలో చావు ముప్పు 26 నుంచి 43 % తక్కువగా ఉన్నట్లు స్పష్టం కాగా... స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు జోడిస్తే ముప్పు మరింత తగ్గింది. ఒకే ఒక్క మినహాయింపు ఏమిటంటే... కేన్సర్ ఉన్న వాళ్లు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు కొంత తగ్గించడం అవసరం. వారంలో గంటపాటు చేసినా మెరుగైన ఫలితాలుంటాయి. కండలతో దీర్ఘాయుష్షు ఎలా...? శరీరం మొత్తమ్మీద జీవక్రియల పరంగా బాగా చురుకుగా ఉండేవి కండల్లోని కణజాలాలు. అందువల్లనే కండలు బలంగా ఉంటే రక్తంలోని గ్లూకోజు నియంత్రణ సాధ్యమవుతుంది. మధుమేహం నుంచి రక్షణ లభిస్తుందన్నమాట. ఇది కాస్తా గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. కండరాలు ముడుచుకుపోయినప్పుడు విడుదలయ్యే మైయోకైన్స్ అనేక జబ్బులకు దారితీయగల ఇన్ఫ్లమేషన్ (మంట/వాపు)లను తగ్గిస్తుంది. కండలు కాలేయం, కొవ్వు కణజాలం, రక్తనాళాలు, ఎముకలు, మెదళ్లకూ మేలు జరుగుతుంది. దీర్ఘకాలంలో ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రక్తపోటును తగ్గించడమే కాకుండా.. రక్తనాళాలు పెళుసు బారకుండా చేస్తాయి. ఇవి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కండలు గట్టిగా ఉంటే పట్టు బాగా ఉంటుంది కాబట్టి పడిపోవడం, ఎముకలు విరగడం వంటివి తక్కువగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం...జిమ్కు వెళ్లినా వెళ్లకపోయినా.. ఇంట్లోనే రోజూ కాసేపు బరువులు ఎత్తేయండి. దీర్ఘాయుష్మాన్ భవ అని మీకు మీరే దీవించేసుకోండి! –సాక్షి, నేషనల్ డెస్క్ -
యువతే మత్తును చిత్తు చేయాలి
మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (ఆడిక్షన్ ). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి . ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాఇ 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి.వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.హాలుసినోజెన్లు తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించాలా చేస్తాయి. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి, పగటికి తేడా తెలియదు. ఉదాహరణకు చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలని భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.డిస్అస్సోసియేటివ్ అనస్థెటిక్స్ లాంటివి తీసుకోవడం వల్ల నొప్పి తెలియకుండా చేస్తాయి. నార్కోటిక్ అనాల్జెసిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి.ఓపియం (నల్ల మందు), కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మేథాడోన్, వికోడిన్, ఆక్సీకోన్టిన్ ఈ తరహా మాదక ద్రవ్యాల కిందకు వస్తాయి.మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. అల్సర్లు, క్రామ్ప్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు. చేతులు, కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు. మాటలో తడబాటు కలుగుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కొంత మంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలుపెడతారని వైద్యులు చెబుతున్నారు.డ్రగ్ వినియోగం వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు ప్రతి ఏటా జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు. ప్రస్తుతం గంజాయి వినియోగం కూడా ఎక్కువ అయింది. సిటీల్లో రేవ్ పార్టీల సంస్కృతి పెరుగుతుంది. పిల్లలు తల్లి తండ్రుల వద్ద ఉండకుండా చిన్న తనం నుంచి వారికి దూరం ఉండి చదువుకోవడం, ఒత్తిడిని తట్టుకునేందుకు డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి. గట్టి కార్యాచరణ ద్వారానే వీటిని నియంత్రణ చేయవచ్చు.మాచన రఘునందన్ టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత (చదవండి: ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!) -
మామ్ వెయిట్లాస్ స్టోరీ..! జస్ట్ 11 నెలల్లో 32 కిలోలు..
ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది కూడా జస్ట్ 11 నెలల్లోనే. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.కంటెంట్ క్రియేటర్ దీప్తి హర్షనా ఇద్దరు పిల్లల తల్లి. అదులోనూ సీసెక్షన్ చేయించుకుందామె. అలాంటప్పుడు పొట్ట భాగం దగ్గర నుంచి మిగతా శరీర భాగం అంతా షేప్ అవుట్గా ఉంటుంది. పైగా బరువు తగ్గడం కూడా అంత ఈజీ కాదు. అయితే ఆమెకు కూడా ఎలా తన అధిక బరువుని తగ్గించుకోవాలో తెలియలేదట. కానీ ప్రసవానంతరం బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామాలు ముఖ్యం. అయితే ఎలా ప్రారంభించాలో తెలియలేదని, దాంతో యూట్యూబ్లో పొట్ట భాగం తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది అని సర్చ్ చేసి మరి ప్రారభించినట్లు తెలిపింది. తాను చేసిన వ్యాయమాలు గురించి కూడా వివరించింది.వర్కౌట్ 1: ప్రారంభకులకు అనువైన చేతి వ్యాయామాలుదీప్తి, తక్కువ పరికరాలు అవసరమయ్యే సులభమైన నిలబడి చేసే వ్యాయామాలతో ప్రారంభించాలని సిఫార్సు చేస్తోంది. ఎక్కడైనా నిలబడి, అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్ లేదా డంబెల్ ఏదైనా తీసుకుని, ప్రతి వైపు 15 సార్లు చొప్పున మూడు సెట్లు చేయాలని ఆమె సలహా ఇస్తోంది.వర్కౌట్ 2: డంబెల్ ఆర్మ్ రైజెస్5 కేజీల డంబెల్ను ఉపయోగించి, దీప్తి చేతులను బలోపేతం చేసే తేలికపాటి వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. ముందుగా 5 కేజీల డంబెల్ను పట్టుకుని, చేతులను నిటారుగా ఉంచి ప్రారంభించాలని చెప్పింది. దీన్ని ప్రతివైపు 15 సార్లు చొప్పున మూడు సార్లు చేయాలని చెప్పిందామె.వర్కౌట్ 3: స్క్వాట్స్స్క్వాట్స్ ఆమె దినచర్యలో మరొక ముఖ్యమైన వ్యాయామం. కొత్తగా చేసేవారైతే డంబెల్ లేకుండా వీటిని చేయవచ్చు. లేకపోతే, డంబెల్ పట్టుకుని సాధారణ స్క్వాట్స్ చేయాలని పేర్కొంది. ఇలా మొత్తం15 రిపిటీషన్లు చొప్పున మూడు సెట్లు చేయమని సూచిస్తుంది.వర్కౌట్ 4: స్టాండింగ్ కిక్స్అలాగే ఆమె తన దినచర్యలో స్టాండింగ్ కిక్ వ్యాయామాలను కూడా చేర్చుకుంటుంది. కేవలం తన్నడం లేదా తాకేలా చేసే వ్యాయామం. ఇక్కడ ఏది సౌకర్యంగా ఉంటే అది చేయవచ్చు. ఇక్కడ ప్రతి వ్యాయామాన్ని 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు చేయాలని ఆమె వివరించారు.వర్కౌట్ 5: తలపైన చేతులతో చప్పట్లుఇది కూడా ఒక సులభమైన కదలిక. చేతులను తల పైకి ఎత్తి, పదేపదే చప్పట్లు కొట్టాలి. ఈ వ్యాయామం చాలా సులభం. చేతులు పైకి, అదే పనిగా చప్పట్లు కొట్టాలి.వర్కౌట్ 6: వెనుకకు కాలును చాచడంతన చివరి వ్యాయామం కోసం, దీప్తి తన చేతులను తలపైన జోడించి, ఒక కాలును వెనుకకు చాచాలి. ఇక్కడ కాలును వీలైనంత వెనుకకు తీసుకువెళ్లి, ఆ తర్వాత ముందుకు తీసుకురండి. ప్రతి వైపు 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు పూర్తి చేయాలిన చెప్పిందామె.గమనిక: ప్రసవానంతర వ్యాయామ దినచర్యలను ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి, ముఖ్యంగా సి-సెక్షన్ తర్వాత, ఎందుకంటే కోలుకోవడానికి పట్టే సమయం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana) (చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!) -
తగ్గినట్టే తగ్గి..మళ్లీ యథావిధిగా! స్ట్రిక్ట్ డైటింగ్ చేసినా ఎందుకిలా అంటే..
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలామంది మొదట ధనాధన్ బరువు తగ్గిపోతారు. కానీ ఆ తర్వాత మళ్లీ యథావిధిగా బరువు పెరగకుండా కాపాడుకోవడమే అత్యంత ముఖ్యం. అయితే ఇది చాలా కష్టం. ఇక్కడొక నలభైఏళ్లు పైబడిన మహిళ ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. ఆరు నెలలపాటు క్రమశిక్షణతో కూడిన ఆహారం, రోజువారీ నడక తర్వాత దాదాపు పది కిలోల బరువుని విజయవంతంగా తగ్గించుకుంది. కానీ అదే దినచర్యను కొనసాగించినా..మరింత బరువు తగ్గకపోగా..మళ్లీ యథావిధిగా పెరుగుతున్నట్లు అనిపించిందామెకు. ఎందుకంటే ఆకలి కోరికలు పెరగడం, ఎక్కువ కేలరీలు ఖర్చు చేయలేకపోయినట్లు వాపోయింది. ఇది చాలామందికి ఎదురయ్యే పెనుసమస్యే. ఎందుకిలా అంటే..ప్రపంచవ్యాప్తంగా ఇలా డైటింగ్ చేస్తున్నా లక్షలాదిమందికి ఎదురైన అనుభవమే ఇది. మనం వెయిట్లాస్ అవ్వాలనుకున్నప్పుడు మానవశరీరం జీవశాస్త్రపరంగా సిద్దంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హార్మోనల్, న్యూరోలాజికల్, మెటబాలిక్ అనుసరణ కలయిక ద్వారా శరీరం కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అందువల్లే దీర్ఘాకాలిక బరువు నిర్వహణ సవాలుగా మారిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బరువు తగ్గినట్టే తగ్గి యథావిధిగా పెరగడాన్ని 'వెయిట్-లాస్ ప్లాటో'గా పిలుస్తారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే..శరీరం బరువు తగ్గే కొద్దీ శక్తిని ఆదా చేసి, మరింత బరువు తగ్గకుండా నిరోధించడం మొదలుపెడుతుందట. దీనిలో బ్రెయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకుంటామో..అందుకు అనుగుణంగా మన బ్రెయిన్ కడపు నిండిన భావన, శక్తి సమతుల్యతకు సంబంధించిన సంకేతాలను శరీరానికి అందిస్తుందట. దాంతో మనం అమాంతం బరువు తగ్గుతూ వస్తూ ఉంటామని అన్నారు. అయితే..కాలక్రమేణ శరీరం ఒక ప్రాధాన్య బరువు పరిధిని ఏర్పరచుకుంటుందట. దీనిని 'సెట్ పాయింట్' అని అంటారని అన్నారు. శరీర బరువు ఈ పరిధి కంటే తక్కువకు పడిపోయినప్పుడూ..మెదడు ఆ మార్పును ఒక సంభావ్య ముప్పుగా భావించి, కోల్పోయిన బరువును తిరిగి పొందడానికి ఉద్దేశించిన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందట. ఇక్కడ మెదడు తరుచుగా గణనీయమైన బరువు తగ్గడాన్ని ఆకలితో అలమటించే సంకేతంగా పరిగణిస్తుంది, తద్వారా కోల్పోయిన శక్తి నిల్వలను తిరిగి పొందడంలో సహాయపడటానికి రూపొందించిన యంత్రాంగాలను ప్రేరేపిస్తుంది. దాంతో కేలరీలను తక్కువగా ఖర్చు చేస్తాం. పైగా ఆకలి కోరికలు ఎక్కువవ్వడం మొదలవుతాయట. ఫలితంగా యథావిధాగా బరువు పెరుగుతామని అన్నారు. అలాగే బరువు తగ్గాక రోజువారీ శక్తి వ్యయం ఆటోమేటిగ్గా తగ్గుతుందట. దాంతో మొదట ఏ ఆహారం అయితే బరువు తగ్గడానికి సహాయపడిందో అదే మరింత బరువు తగ్గడానికి సరిపడకపోవచ్చని అన్నారు. అలాగే బరువు తగ్గాక హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు నిపుణులు. కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే కొవ్వు కణజాలం ద్వారా ఉత్పత్తి అయ్యే లెప్టిన్ అనే హార్మోన్ స్థాయిలు బరువు తగ్గిన తర్వాత తగ్గుతాయి. అదే సమయంలో, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆకలి ఎక్కువగా అనిపించి.. ఎక్కువ లాగించడం తోపాటు ఖర్చు చేసే కేలరీల సంఖ్య కూడా తగ్గిపోతుందట. ఈ జీవసంబంధమైన కలయికే ఎక్కువగా తినేలా చేయడానికి, కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి కారణమవుతుందని అన్నారు. అందువల్ల బరువు తగ్గడం అనేది మెదడు, హార్మోన్లు, జీవక్రియలు మధ్య ఉన్న సంక్లిష్టసంబంధంగా పరిగణించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తోపాటు శరీరం సహజ నిరోధకతను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు తమ ఫిట్నెస్ జర్నీని సహనంతో వాస్తవిక అంచనాలతో జాగురుకతతో చేపట్టాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: డెలివరి బాయ్ నుంచి ఏకంగా మెసేజింగ్ ప్లాట్ఫామ్కు గ్లోబల్ హెడ్ రేంజ్కు!) -
అతిగా పాలు తాగడం ఎముకలకు హానికరమా? వైద్యులు ఏమంటున్నారంటే..
పాలు ఆరోగ్యానికి మంచిదని, దానిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుందని విన్నాం. అయితే అతిగా తాగితే అవే పాలు హానికరమై ఎముకలు పెళుసుగా మారిపోయి విరిగిపోతాయనే అపోహ కూడా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అంటూ సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. కానీ ఇందులో ఏమంత వాస్తవం లేదని తేల్చి చెబుతున్నారు వైద్యులు. చాలామంది పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందని చెబుతుంటారు.. ఇది కూడా ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు ఆర్ధోపెడిక్ సర్జన్లు. అసలు ఈ అపోహ ఎందుకు వచ్చింది?, నిజంగానే పాలు అధికంగా తీసుకోకూడదా అంటే..?మాంసం, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి దానిని తటస్థీకరించడానికి ఎముకల నుంచి కాల్షియం గ్రహించాల్సి వస్తుందని, తత్ఫలితంగా ఎముకల సంబంధిత సమస్యలు అధికమవుతాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజం కాదని పరిశోధనల్లో ఇలా జరుగుతుందని నిర్థారితం కాలేదని అన్నారు. ఆహారంలోని ప్రోటీన్ ముఖ్యం, సరైన మోతాదులో కాల్షియం తీసుకుంటే ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా ఎముకలు విరగకుండా కాపాడతాయని చెబుతున్నారు. పాలు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందనే వాదనకు శాస్త్రియ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అలాగే ఆమ్లీకరణం సమస్య వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. ఆస్టియోపొరోసిస్ అంటే..ఎముకల ఖనిజ సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే పరిస్థితి. ఇది అనేక జన్యు, జీవ, జీవనశైలి కారకల వల్ల ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యం, హార్మోన్ల స్థితిలో మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, సరైన పోషకాహారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు. అయితే పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్ (బలవర్ధకమైన) విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో ఎముకల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కానీ అతిగా తీసుకుంటే అసమతుల్యత ఏర్పడి పోషకాహార లేమికి దారితీస్తుందే తప్ప..ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని పెంచదన్నారు. ఎప్పుడైతే పాలను ఎక్కువగా తీసుకుంటామో ఫలితంగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోతాయన్నారు. అలాగే అజీర్ణం, పాలు పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎముకల బలం కోసం బేషుగ్గా పాలు తీసుకోవచ్చని అన్నారు. కానీ మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని చెప్పారు. పైగా ఆస్టియోపొరోసిస్ను నివారిస్తుందన్నారు. చాలామటుకు సమతుల్యతకు పెద్దపీట వేస్తూ..అన్ని రకాల పోషకాలు అందేలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. (చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్కు బదులుగా చీర..! బ్రిటన్ పౌరురాలేనే ఐనా..) -
కొన్ని తలనొప్పులను.. సీరియస్గా తీసుకోవాల్సిందే! లేదంటే..
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో కనీసం ఒక్కసారైనా తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. అలా చూసినప్పుడు తలనొప్పి చాలా సాధారణ సమస్య. అయితే కొన్ని జబ్బులకు తలనొప్పి ఒక సూచనలా, ఒక లక్షణంగా కూడా కనిపించవచ్చు. అందుకే తరచూ తలనొప్పితో బాధపడేవారిలో దాని కారణం కనుగొనడం కూడా డాక్టర్లకూ తలనొప్పే. తలనొప్పుల్లో రకరకాలు ఉంటాయి. రకరకాల కారణాలతోనూ వస్తుంటాయి. ఎప్పుడో ఒకసారి తలనొప్పి కనిపించినా లేదా ఏదైనా ప్రత్యేక కారణంతో అప్పుడప్పుడూ వచ్చే తలనొప్పుల గురించి అంతగా పట్టించుకోనక్కర్లేదుగానీ... కొన్ని తలనొప్పులను చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. అసలు స్థూలంగా చూసినప్పడు తలనొప్పులను ఎలా విభజించుకోవచ్చు. ఏయే సందార్భాల్లో తలనొప్పుల సీరియస్గా తీసుకోవాలో చూద్దాం.గతంతో పోలిస్తే ఇప్పుడు తలనొప్పులు మరింత తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఒకప్పుడు కాస్త పెద్దవయసువారిలో తరచూ కనిపించే ఈ తలనొప్పులు ఇటీవల చిన్నవయసువారిలోనూ కనిపిస్తున్నాయి. ఇక కొన్ని తలనొప్పులు జీవనశైలి మార్పుల వల్ల వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నప్పటికీ అన్నింటినీ ఒకేగాటన కట్టడమూ సరికాదు. ఇలా చిన్నవయసు వారిలో తలనొప్పులు కనిపించగానే కళ్ల డాక్టర్తో కళ్లను పరీక్షింపజేసుకోవడమూ మామూలే. అలాగని మొత్తం కేసులను కళ్ల సమస్య ఖాతాలోనూ వేయడం సరికాదు. అందుకే తరచూ వస్తున్న తలనొప్పులను... అవి వచ్చే వేళలనూ, ఏదైనా ప్రత్యేక సందర్భంలో అంటే ఏదైనా వాసనలు పీల్చినప్పుడో లేదా ఏవైనా కాలుష్యాలకు గురైనప్పుడో వస్తుంటే వాటిని డాక్టర్లకు వివరించడమూ అవసరం. అప్పుడవి ఏ కారణంగా వస్తున్నాయో అంచనా వేయడానికీ డాక్టర్లకు అవకాశముంటంది.తలనొప్పుల గురించి విపులంగా...ప్రైమరీ తలనొప్పులు : సాధారణంగా ఇవన్నీ మెదడులోని రసాయనాల సమతౌల్యత తప్పడం వల్ల తలలో ఉద్భవించే తలనొప్పులని చెప్పవచ్చు. వీటిలో ప్రధానమైనవి...మైగ్రేన్...తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందునా యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. సాధారణంగా ఒక వయసు వచ్చాక దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉన్నప్పటికీ... అది వచ్చినప్పుడు నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉంటూ చాలా ఎక్కువగా బాధిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక వయసులో ఉన్న చాలా మందిలో వాళ్ల పనిగంటలనూ, స్కూలు పిల్లలూ, విద్యార్థుల్లో వాళ్లు చదివే సమయాన్ని ఎక్కువగా వృథాచేసే తలనొప్పి ఇదే.లక్షణాలు...ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. అందుకే చాలా సందర్భాల్లో చాలాచోట్ల దీన్ని ‘పార్శ్వపు నొప్పి’ అని కూడా అంటుంటారు. అయితే కొంతమందిలో మాత్రం కొన్ని సార్లు ఇది తలకు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు రెండు నుంచి నాలుగు గంటలు మొదలుకొని... కొన్ని సందర్భాల్లో 72 గంటల వరకూ రావచ్చు. తీవ్రమైన తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూడలేకపోవడం, వెలుతురు లేని చీకటి గదిలో ఉండాలనిపించడం... లేదా చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి విపరీతంగా పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఆరా / ఫ్లాషింగ్ లైట్స్) కనిపిస్తాయి.కారణాలు... మైగ్రేన్కు చాలా కారణాలే ఉండవచ్చు. ఉదాహరణకు... తీవ్రమైన ఒత్తిడీ, యాంగై్జటీ; తమకు సరిపడని పదార్థాలేవైనా తినడం (ఉదాహరణకు చాక్లెటు, ఛీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాలు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతి పండ్లు వంటివి... ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు); తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితోనే ఉండిపోవడం, తీవ్రమైన శారీరక శ్రమ తర్వాతా, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలూ లేదా కొన్ని రసాయనాలతో తయారుచేసిన సెంట్ల నుంచి వచ్చే బాగా ఘాటైన వాసనలు, ఆల్కహాల్ (ముఖ్యంగా రెడ్వైన్), చైనీస్ ఫుడ్ ఐటమ్స్ (ముఖ్యంగా చైనా సాల్ట్ వాడిన పదార్థాలు), యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతైన హెయిర్ బ్యాండ్ ధరించడం, ఎండకు ఒక్కసారిగా ఎక్స్పోజ్ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించడంతో పాటు మరింత తీవ్రతరం చేస్తాయి.ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్...ఇవే కాకుండా కొందరిలో వారికి మాత్రమే ప్రత్యేకమైన కారణాలు కూడా మైగ్రేన్ను ట్రిగర్ చేయవచ్చు. అంటే మైగ్రేన్ అన్నది ఒక్కొక్కరిలో ఒక్కోకారణం వల్ల వచ్చే అవకాశమూ ఉంది. అందుకే మైగ్రేన్ రావడానికి ముందు 6– 12 గంటల వ్యవధిలో ఏమైనా తిన్నారా, దేనికైనా ఎక్స్పోజ్ అయ్యారా వంటి అంశాలను డాక్టర్లు అడిగి తెలుసుకుంటారు. దీని ద్వారా నిర్దిష్టంగా తలనొప్పి ఏ కారణంగా వస్తుందో తెలుస్తుంది. ఈ కారణాలను మైగ్రేన్ను ప్రేరేపించే అంశాలు (ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్)గా చెబుతారు.నిర్ధారణ ఇలా...మైగ్రేన్ నిర్ధారణకు నిర్దిష్టంగా వైద్య పరీక్ష అంటూ ఏదీ ఉండదు. అంటే మైగ్రేన్ అనేది నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షలోనూ తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని పట్టి ఇచ్చే ΄్యాటర్న్ అంటూ ఏదీ ఉండదు. అందుకే... తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఏ లోపమూ కనిపించకపోవడంతో పాటు... మైగ్రేన్లో కనిపించే ఒకవైపు తలనొప్పి లేదా దాని లక్షణాలతో అది తరచూ అదేపనిగా వస్తుండటం, మాటిమాటికీ తిరగబెడుతుండటం వంటి లక్షణాలతో దీన్ని నిర్ధారణ చేస్తారు.చికిత్స..మైగ్రేన్కు రెండు రకాల చికిత్స చేస్తారు. మొదటిది... తలనొప్పి తీవ్రతను వెంటనే తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. రెండోది... ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టకుండా ఉండేందుకు ఇచ్చే దీర్ఘకాలిక చికిత్స. ఇందుకోసం డాక్టర్ల సలహా మేరకు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ముందులు వాడాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్కు మందులతో పాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. ఇటీవల మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్లకు బొటాక్స్ ఇంజెక్షన్ను ఉపయోగించి కూడా చికిత్స చేస్తున్నారు. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్ (బి2 విటమిన్) సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది.క్లస్టర్ హెడేక్... మైగ్రేన్తో పోలిస్తే... ఇది కాస్తంత అరుదుగా కనిపించే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పితో ఇది మొదలవుతుంది. రెండు మూడు గంటలపాటు తీవ్రంగా బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తూ ఉంటుంది. రోజూ ఒకే వేళకు కనిపిస్తూ ఉంటుంది. ఏడాదిలో 8–10 వారాల పాటు రావచ్చు. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు మళ్లీ రాకపోవచ్చు. అయితే... ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8–10 వారాల పాటు అదే వేళకు వస్తూ ఉంటుంది.చికిత్స...దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్ను అందిస్తారు లేదా ముక్కు ద్వారా పీల్చే ట్రి΄్టాన్ మందులను ఇస్తారు. ఇలా మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక ఆ తర్వాత ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి దీర్ఘకాలిక చికిత్స అందించాల్సి ఉంటుంది.టెన్షన్ హెడేక్ : తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి విపరీతమైన తలనొప్పి రావడం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ఈ నొప్పి తలకు ఇరువైపుల గానీ లేదా కొన్నిసార్లు తలలో అన్నివైపులా ఉంటుంది. కొన్ని సార్లు చాలాకాలం (దీర్ఘకాలం పాటు) వస్తుంటుంది. ఒత్తిడి తీవ్రతను బట్టి తలనొప్పి తీవ్రత కూడా పెరుగుతుండటం, ఒక్కోసారి రోజులూ, నెలల తరబడి కనిపించడం కూడా జరుగుతుంటుంది. మార్కెట్లో దొరికే సాధారణ తలనొప్పి మందులతోనే దీన్ని తగ్గించుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ ఒత్తిడి తగ్గించుకోడానికి అవలంబించే మార్గాలతో ఈ తలనొప్పి కూడా తగ్గుముఖం పట్టే అవకాశముంది.క్రానిక్ డైలీ హెడేక్... దీర్ఘకాలం పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను తగ్గించుకోడానికి తరచూ నొప్పి నివారణ మందులు వాడటం వల్ల వచ్చే తలనొప్పి ఇది. మాత్ర వాడగానే మొదట్లో తలనొప్పులు తగ్గినప్పటికీ ఒక దశ తర్వాత నొప్పి నివారణ మందు తీసుకోగానే ఈ తరహా తలనొప్పి వస్తూ ఉంటుంది.ప్రైమరీ కాఫ్ అండ్ లాఫ్ హెడేక్... తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. చాలా అరుదుగా ఇది తలలోని సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ వంటి ద్రవాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి తలలోని రక్తనాళాలనూ అడ్డుకోవచ్చు. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచి రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావడానికి అవకాశముంది.ప్రైమరీ స్టాబింగ్ హెడేక్... తలలో కత్తితో పొడిచినట్లుగా ఉండే తలనొప్పిని ఈ పేరుతో పిలుస్తారు.ప్రైమరీ హెడేక్ అసోసియేటెడ్ విత్ సెక్సువల్ ఇంటర్కోర్స్... సెక్స్లో పాల్గొన్నప్పుడు భావ్రపాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. సెక్స్ ముగిశాక వచ్చే ఈ తలనొప్పి సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్గాటమైన్ లేదా ఇండోమెథాసిన్ వంటి మందులను సెక్స్కు ముందుగా వాడటం ద్వారా ఈ తరహా తలనొప్పిని నివారించవచ్చు. ఇక దీర్ఘకాలం పాటు ఈ నొప్పి రాకుండా ఉండటానికి ప్రొపనలాల్, డిల్టియాజెమ్ వంటి మందులు సూచిస్తారు.హిప్నిక్ హెడేక్... ఈ తరహా తలనొప్పి నిద్రలో మొదలై... నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు వస్తూనే ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.తలనొప్పులు స్థూలంగా ఎన్ని రకాలంటే...తలనొప్పుల తీరుతెన్నులు, వాటి నిర్ధారణ పద్ధతులు, చికిత్సలూ, ఇతరత్రా చాలా అంశాల ఆధారంగా తలనొప్పులను చాలారకాలుగా విభజించవచ్చు. అయితే... తలనొప్పులు ఎందుకొస్తున్నాయనే కారణాలూ లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి...1. ప్రైమరీ తలనొప్పులు : ఈ తలనొప్పులు నేరుగా తలలోనే పుడతాయి. అంటే... ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది. అంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వాటి రిఫరల్ పెయిన్ తలకు పాకడం వల్ల ఇవి రావడం లేదనీ... ఇవి నేరుగా తలలోనే పుడుతున్నాయని అర్థం.2. సెకండరీ తలనొప్పులు: ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతోగానీ లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్య కారణంగా గానీ వస్తుంటాయి. అంటే... తలలో గడ్డలు ఏర్పడటం లేదా తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు రావచ్చు. అందుకే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.3. క్రేనియల్ న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్తో పాటు ఇతర తలనొప్పులు : తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.సెకండరీ తలనొప్పులు...నేరుగా తలలో పుట్టే నొప్పులు కాకుండా... ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులివి. వీటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని ప్రధానమైన తలనొప్పులు.మెనింజైటిస్... ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా తలనొప్పి వస్తుంది. ఇందులోని లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయి ఉండటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్ సమస్యను సీఎస్ఎఫ్ (మెదడులోని ద్రవం – సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు.బ్రెయిన్ ట్యూమర్... మెదడులో ఏర్పడే గడ్డల వల్ల తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చే తలనొప్పిలో.... మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. కొన్ని సందర్భాల్లో వారాల తరబడి తలనొప్పి వస్తూనే ఉంటుంది. నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. కొందరిలో తలనొప్పితో పాటు వాంతులూ కావచ్చు. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి మరింత పెరుగుతుంది.ఇంట్రాక్రేనియల్ హేమరేజ్ తలనొప్పులు... తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరగవచ్చు. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులూ కనిపించవచ్చు. ఈ తరహా తలనొప్పిని సీటీ స్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు.టెంపోరల్ ఆర్టిరైటిస్... ఇది సాధారణంగా 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి ఇందులో కనిపించే లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్ఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపొరల్ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.గ్లకోమా హెడేక్... కంట్లో ఇంట్రా ఆక్యూలార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య నెమ్మదినెమ్మదిగా క్రమక్రమంగా బాధితులకు తెలియకుండానే చూపును హరించి వేస్తుంది. కాబట్టి తలనొప్పి బాధిస్తున్నప్పుడు డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. ఇవే గాక... పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు, మన దేహం భంగిమ (పోష్చర్) సరిగా లేనప్పుడు కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఇలా ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులు చాలా ఎక్కువగానే ఉంటాయి.క్రేనియల్ న్యూరాల్జియా...మన తలలోని పుర్రెను క్రేనియమ్ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. వీటి నుంచి వచ్చే తలనొప్పులను ‘క్రేనియల్ న్యూరాల్జియా’ అంటారు. న్యూరా.. అంటే నరం అనీ, అలాగే ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. అందుకే ఈ తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అని చెబుతుంటారు.ఆక్సిపెటల్ న్యూరాల్జియా... ఎక్కువ తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని వెనుక భాగంలో (ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో) ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు.ట్రైజెమినల్ న్యూరాల్జియా... ట్రైజెమినల్ నర్వ్ అని పిలిచే ఈ నరం... నుదుటి నుంచి చెంప, దవడ వరకు అంటే దాదాపు పూర్తి ముఖానికి వెళ్లే తలనరాలలో ప్రధానమైనది. ఇది తీవ్రంగా ఉద్రిక్తమైనపుపడు ఏ పదార్థాన్ని కూడా నమలలేనంత / తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇందులో ఉడికించిన కోడిగుడ్డులోని తెల్లటి భాగాన్ని కూడా నమలలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కనీసం మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ నొప్పితో చాలాసార్లు బాధపడ్డాడు. ఈ తరహా తలనొప్పిని ముందుగా మందులతో తగ్గిస్తారు. 95 శాతం కేసుల్లో మందులతోనే తగ్గుతుంది. అయితే మందులతో తగ్గనప్పుడు చిన్న శస్త్రచికిత్స లేదా రేడియో శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పిని శాశ్వతంగా తగ్గించవచ్చు.ఒక అపోహ – వాస్తవం... కొంతమంది హైబీపీ వల్ల తలనొప్పి వస్తుందని అపోహ పడుతుంటారు. నిజానికి హైబీపీ కారణంగా తలనొప్పి రావాలంటే బీపీ కొలత 180 / 110 ఉండాలి. అప్పుడు హైబీపీ కారణంగా తలనొప్పి వస్తుంది.తలనొప్పిని తీవ్రంగా పరిగణించి, ఎప్పుడు చికిత్సకు వెళ్లాలంటే...జీవితంలో మొట్టమొదటిసారే అయినప్పటికీ అది భరించలేనంత తీవ్రమైన తలనొప్పిగా వస్తున్నప్పుడు. మొదలు కావడమే తలబద్ధలైపోతూ భరించలేనంతగా తలనొప్పి వస్తున్నప్పుడు.సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా అసలేమీ తగ్గకుండా తలనొప్పి తీవ్రత అంతకంతకూ పెరుగుతూ పోతున్నప్పుడు.తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్/ చేయి లేదా కాలిలో బలహీనత వచ్చి కళ్లు మసకబారుతున్నప్పుడు.పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి వస్తుంటే.నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్ఎఫ్ (సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్) పరీక్ష వంటివి చేయించాల్సి ఉంటుంది.సాధారణ తలనొప్పి నివారణ ఇలా...తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. తలనొప్పి రాకపోయినా భవిష్యత్తులో రాకుండా నివారించడానికి ఇవే జాగ్రత్తలు పనికివస్తాయి. అవి...కంప్యూటర్పై పనిచేసేతవారు కంటిపై ఒత్తిడి పడకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించడం. అలాగే ప్రతి గంటకోమారు అయిదు నిమిషాల పాటు రిలాక్స్ కావడం. కంప్యూటర్పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా తదేకంగా స్క్రీన్ను చూడటం సరికాదు.కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్ల అల్లకం పని చేస్తుండేవారు తమ పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం.పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే న్యూరాలజిస్టుతో పాటు కంటి వైద్యులనూ సంప్రదించడం మంచిది.రోజూ ప్రశాంతంగా కంటినిండా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొంతమందికి వారి వ్యక్తిగత నిద్ర అవసరాలను బట్టి కాస్త ఎక్కువగా, తక్కువగా నిద్రపోతారు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రించడం మంచిది.మనకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయడం.ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయడం మేలు.కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ లాంటి పదార్థాలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలకు దూరంగా ఉండటం మంచిది.ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసుకోవడం సరికాదు.ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం మంచిదికాదు.తీవ్రమైన చప్పుళ్లకూ, చెవులు బద్దలు కొట్టే రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల చాలారకాల తలనొప్పులు రాకుండా నివారించవచ్చు.ఇతర రకాల తలనొప్పులు... ఇవేగాక న్యూ డైలీ పర్సిస్టింగ్ హెడేక్ (ఎన్డీపీహెచ్), ప్రైమరీ థండర్క్లాప్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్లో ఒక రకమైన ప్రైమరీ పారాక్సిస్మల్ హెమిక్రేనియా వంటి చాలా రకాల తలనొప్పుల కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, కళ్లు నొప్పిగా ఉండటం వంటి కారణాలు కూడా తలనొప్పికి దారితీస్తాయి. అంటే దేహంలో ఒకచోట వచ్చిన నొప్పి మరోచోటికి పాకుతుంది. రిఫరింగ్ పెయిన్ కారణంగా ఈ నొప్పులు తలనొప్పి రూపంలో కనిపిస్తుంటాయి.తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్ను కలిసి కారణాన్ని కనుగొనేందుకు అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించాలి. తెలిసిన కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవాలి.చివరగా... ముందుగా చెప్పినట్లు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో తలనొప్పి కనిపించకమానదు. అయితే మంచి జీవనశైలి (లైఫ్ స్టైల్) అలవాట్లతో చాలా రకాల తలనొప్పులను మాత్రమే కాదు... చాలా రకాల జబ్బులనూ నివారించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఉదయం నిద్రలేవగానే కనిపించే తలనొప్పలూ, వాటితో పాటు వాంతులు, వికారం, స్పృహ తప్పిపడిపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా, వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలని తప్పక గుర్తుపెట్టుకోవాలి.- డా. ఎస్. రమేశ్, సీనియర్ న్యూరోసర్జన్ నిర్వహణ : యాసీన్ -
పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..
విదేశీ పళ్లు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర పోషిస్తోందన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో విదేశీ పండ్ల వినియోగం 5 ఏళ్లలో బాగా పెరిగింది. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) లెక్కల ప్రకారం 2024–25లో రూ.8,500 కోట్ల విలువైన పండ్లు దిగుమతి అయ్యాయి. అమెరికా యాపిల్స్, న్యూజిలాండ్ కివీ, చిలీ చెర్రీలకు డిమాండ్ ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్3, 4తో మొదలైతే ప్రమాదం... 9తో మొదలైతేనే భద్రంపండ్లపై ఉండే ప్రైస్ లుక్–అప్ (పీఎల్యూ) కోడ్లోనే అసలు రహస్యం ఉంది.4 అంకెలు.. 3 లేదా 4తో మొదలు: రసాయన ఎరువులతో పండించినవి.5 అంకెలు.. 9తో మొదలు: 100 శాతం సేంద్రియం.5 అంకెలు.. 8తో మొదలు: జన్యు మార్పిడి (జీఎమ్వో) పండ్లు. భారత్లో నిషేధం.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటోంది అంటే..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రసాయన అవశేషాలతో కాలేయం, కిడ్నీలు దెబ్బ తింటాయి. పిల్లల్లో హార్మోన్ల సమస్యలు, పెద్దల్లో క్యాన్సర్ వస్తాయి. అమెరికా యాపిల్ను 6 నెలలు నిల్వ ఉంచేందుకు ‘డైఫినైల్ అమైన్’ వాడతారు. ఇది యూరప్లో నిషేధం.స్టిక్కర్ కోడ్ చెక్ చేయండికొనేముందు 5 సెకన్లు కేటాయించి స్టిక్కర్ చూడండి. 9తో మొదలయ్యే కోడ్ ఉంటేనే కొనండి. స్టిక్కర్ లేకుంటే ముట్టుకోవద్దు. గర్భిణులు, పిల్లలకు కెమికల్ పండ్లు వద్దని నిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.నిబంధనలు ఏవి?భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం కాల్షియం కార్బైడ్తో మాగబెడితే రూ.10 లక్షల జరిమానా, 6 నెలల జైలు విధించాలి. కానీ దిగుమతి పండ్లపై తనిఖీలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. -
వైరస్ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్ ప్రయోగం..
భవిష్యత్తులో వచ్చే సరికొత్త వైరస్లకు... అవి అసలు పుట్టకముందే మన శాస్త్రవేత్తలు కర్మకాండలు జరిపించే పనిలో ఉన్నారు! వాటి అంత్యక్రియలు జరిపించేది మరెవరో కాదు, ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’! శత్రువు యుద్ధానికి రాకముందే ఆ శత్రువును కనిపెట్టి, చిత్తు చేసే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది మాత్రం కేంబ్రిడ్జ్ నిపుణులు. తాజాగా వాళ్లు కనిపెట్టిన సూపర్ వ్యాక్సిన్... ఇకపై కరోనా అయినా, ఎబోలా అయినా, అవి ఎలాంటి రూపు మార్చుకుని వచ్చినా సరే, ఆ వేషధారులను ఊచకోత కోసేస్తుంది.‘ప్యాండమిక్–ప్రూఫ్’ వ్యాక్సిన్మున్ముందు రాబోయే మహమ్మారుల అంతానికి శాస్త్రవేత్తలు ఇప్పుడే పునాది వేశారు. మనకింకా తెలియని, అసలు పుట్టనే పుట్టని కరోనా రకాల వైరస్లను సైతం ముందే ఊహించి, వాటిని మట్టుపెట్టే వ్యాక్సిన్స్ను శాస్త్రవేత్తలు ఏఐ సహాయంతో రూపొందించారు. ఈ వ్యాక్సిన్ సర్వరోగ నివారిణిలా సకల కరోనా జాతులకూ నిరోధకంగా పని చేస్తుందని కేంబ్రిడ్జి పరిశోధకులు జూన్ మొదటి వారంలో వెల్లడించారు.ఒక్కటిస్తే చాలు.. ఒక్కటీ రాదు!సాధారణంగా ఒక వైరస్ బయటపడిన తర్వాత దానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ, భవిష్యత్తులో వైరస్లు ఎలా రూపాంతరం చెందుతాయో ముందే ఊహించి, వాటిని ఎదుర్కొనేలా ఈ వ్యాక్సిన్ను డిజైన్ చేసింది. ఒక్కటంటే ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే చాలు... ఎబోలా వంటి వేలాది ప్రమాదకర వైరస్ రకాల నుండి, అలాగే భవిష్యత్తులో అవి మార్చుకునే ఏ కొత్త రూపం నుండి అయినా ఇది మనల్ని కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ప్రొఫెసర్ జొనాథన్ హీనీ, వైరల్ జూనోటిక్స్అలాంటిలాంటిది కాదుప్రస్తుతం మనం వాడుతున్న వ్యాక్సిన్లు యాంటీజెన్ల ఆధారంగా పనిచేస్తాయి. యాంటీజెన్ అంటే మన శరీరంలోకి ఏదైనా హానికరమైన క్రిమి ప్రవేశిస్తే... ‘ఇది శత్రువు!’ అని మన రోగనిరోధక వ్యవస్థ గుర్తుపట్టేలా చేసే ఒక రకమైన సిగ్నల్. అయితే, యాంటీజెన్లు కేవలం అప్పటికే మనుషుల్లో బయటపడిన నిర్దిష్ట వైరస్ రకాలపైన మాత్రమే పనిచేస్తాయి. అయితే ఈ సరికొత్త వ్యాక్సిన్లో పరిశోధకులు ఒక ఉపాయం ఆలోచించారు. ఒకే జాతికి చెందిన మొత్తం వైరస్ కుటుంబాలన్నిటిలోనూ ‘కామన్గా’ ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాలను సేకరించి, వాటన్నిటినీ నిరోధించే గుణాలను కలిపి కొత్త వ్యాక్సిన్లో పొందుపరిచారు.‘‘వైరస్ దాడి మొదలవ్వడానికి ముందే... ఈ సరికొత్త రకం వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగలిగితే, భవిష్యత్తులో లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చు. లాక్డౌన్ల అవసరమే రాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలకుండా నిలబడతాయి’’ అని ఈ ప్రాజెక్టు చీఫ్, సౌతాంప్టన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ సాల్ ఫాస్ట్ అంటున్నారు.సార్స్, కోవిడ్, ఎబోలా.. ఏదైనా!ఈ కొత్త వ్యాక్సిన్ కేవలం కరోనా పైనే కాదు... గతంలో వణికించిన సార్స్, మొన్నటి వరకు ఉన్న కోవిడ్, ఇప్పుడున్న ఎబోలా, అలాగే భవిష్యత్తులో జంతువులు, గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉన్న వైరస్లన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వైరల్ జూనోటిక్స్ (జంతువుల నుండి మనుషులకు వచ్చే వైరస్లపై పరిశోధన చేసే విభాగం) ప్రొఫెసర్ జొనాథన్ హీనీ మాట్లాడుతూ... ఈ సరికొత్త టెక్నాలజీ వైద్య రంగపు రూపురేఖల్నే మార్చే ఒక పెద్ద ‘గేమ్ చేంజర్’ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ టెక్నాలజీ వల్ల వ్యాక్సిన్లు మరింత శక్తిమంతంగా, విస్తృతంగా మారి, వైరస్ల నుండి మనకు అత్యంత బలమైన రక్షణను అందిస్తాయి’’ అని ఆయన నమ్ముతున్నారు.సూపర్ యాంటీజెన్: రోగ నిరోధక వ్యవస్థకు తిరుగులేని ఆయుధంఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్కు ‘సూపర్–యాంటీజెన్’ అని పేరు పెట్టారు. ఏఐలో ఒక భాగమైన మెషిన్ లెర్నింగ్ ద్వారా దీనిని తయారు చేశారు. గతంలో వచ్చిన మహమ్మారులను, ఇప్పుడున్న వైరస్లను ఏఐ క్షుణ్ణంగా విశ్లేషించి... ఒక వైరస్ బ్రతికి బట్టకట్టాలంటే దానికి అత్యంత ముఖ్యమైన భాగాలు ఏంటో కనిపెట్టింది. సరిగ్గా అవే భాగాలపై ఈ సూపర్ యాంటీజెన్ను ఎక్కుపెట్టారు.వేర్వేరు వైరస్లలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రొటీన్లను ఒకదానితో ఒకటి అతుకుపెట్టి ఈ వ్యాక్సిన్ను రూపొందించారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ మన శరీరంలోకి వెళ్లగానే, మన రోగనిరోధక వ్యవస్థకు ఆ ప్రొటీన్లపై దాడి చేయడం నేర్పుతుంది. భవిష్యత్తులో ఆ ప్రొటీన్ ఉన్న ఏ కొత్త వైరస్ మన శరీరంలోకి వచ్చినా... మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వెంటనే గుర్తుపట్టి అక్కడికక్కడే నిర్మూలిస్తుంది.సూది లేని ఇంజెక్షన్!సూపర్ యాంటీజెన్ వ్యాక్సిన్ను మన శరీరంలోకి పంపే విధానం కూడా చాలా సరళంగా, సరికొత్తగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సూదీ ఉండదు! బదులుగా ‘మైక్రో ఫ్లూయిడ్ జెట్’ అనే పద్ధతిని పాటిస్తారు. ఇది చాలా ఎక్కువ ఒత్తిడితో, ఒక సన్నని ద్రవ రూపంలో వ్యాక్సిన్ను నేరుగా మన చర్మ కణాల్లోకి పంపుతుంది. అంటే సూది గుచ్చుకునే నొప్పి అస్సలు ఉండదు!మైక్రో ఫ్లూయిడ్ జెట్వెనుక పరిగెత్తడం ఆపేద్దాం!కాంగోలో మళ్లీ ఇప్పుడు ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న విషయాన్ని గురు ్తచేస్తూ: ‘‘కోవిడ్ మహమ్మారి మనకు వ్యాక్సిన్లను వేగంగా తయారు చేయడం నేర్పించింది నిజమే కానీ, మనం ఇంకా పాత విధానాన్నే అనుసరిస్తున్నాం. వైరస్ కొత్తగా పుట్టడం, అది మనల్ని భయపెట్టడం, ఆ తర్వాత మనం దాని వెనుక పరిగెత్తి వ్యాక్సిన్ కనిపెట్టడం... ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్ హీనీ అంటున్నారు.‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరస్ జెనెటిక్ కోడ్ మొత్తాన్ని ఈ ఏఐకి ఇస్తాం. అది వాటన్నిటినీ పరిశీలించి, ఆ వైరస్ కుటుంబంలో అస్సలు మారకుండా ఉండే భాగం ఏంటో కనిపెడుతుంది. వైరస్ తన రూపాన్ని ఎంత మార్చుకున్నా ఆ ముఖ్య భాగాన్ని మార్చుకోలేదు. మనం సరిగ్గా దాన్నే టార్గెట్ చేస్తున్నాం. దీనివల్ల ఈరోజు ఉన్న వైరస్ల నుండే కాదు... భవిష్యత్తులో పుట్టబోయే సరికొత్త వైరస్ల నుండి కూడా మనం ముందే రక్షణ పొందవచ్చు!’’ అని హీనీ వివరించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారిన బర్డ్ ఫ్లూ వైరస్ను కూడా అంతమొందించేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందం ఇదే టెక్నాలజీతో మరో సరికొత్త వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో పడింది.వైరస్ల కంటే ఒకడుగు ముందేఇతర సైన్స్ నిపుణులు కూడా ఈ వాక్సిన్ను ఒక అద్భుతమైన ‘సరికొత్త విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత వైద్య విధానం అంతా ‘రియాక్టివ్’ (కంటì æముందుకు ప్రమాదం వచ్చాక స్పందించేది)గా ఉంది. అంటే వైరస్ రూపాంతరం చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే, దాన్ని పట్టుకోవడానికి మన వ్యాక్సిన్లు వెనుకబడిపోతున్నాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీ.. వైరస్ కంటే ఒకడుగు ముందే ఉంటుంది!రెండో దశ ప్రయోగాలుసిద్ధంగా మరో 200 మందిట్రయల్స్ ఎక్కడివరకు వచ్చాయి? మొదటి దశ విజయవంతం అయింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ సరికొత్త టెక్నాలజీతో చేసిన వ్యాక్సిన్ను 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న 49 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రయోగించి, ఇది పూర్తిగా సురక్షితమైనదని నిర్ధారించుకున్నారు. అంతకుముందు జంతువులపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇది రకరకాల కరోనా వైరస్లపై ప్రభావంతంగా పనిచేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు రెండవ దశ మొదలైంది. ఈ వ్యాక్సిన్ తదుపరి పరీక్షల కోసం మరో 200 మందికి పైగా వ్యక్తులను సంసిద్ధం చేస్తున్నారు.అత్యంత బలమైన రక్షణఏఐ సహాయంతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ల గురించి బ్రిటన్లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్’ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేరియన్ నైట్ అత్యంత ఆశాజనకంగా మాట్లాడారు. ‘‘ఏఐ డిజైన్ చేసిన ఈ ‘సూపర్–యాంటిజెన్’ క్లినికల్ ట్రయల్స్ సాధించిన అద్భుత విజయం. వైద్య రంగంలోనే ఒక విప్లవాత్మకమైన అడుగు. భవిష్యత్తులో వైరస్ల నుండి మానవాళికి సుదీర్ఘమైన, అత్యంత బలమైన రక్షణను అందించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు. మొత్తానికి, ఈ ‘సూపర్–యాంటీజెన్’ వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి వస్తే... భవిష్యత్తులో మనం ఎలాంటి వైరస్ మహమ్మారికీ భయపడాల్సిన అవసరం ఉండదు. శాస్త్ర విజ్ఞాన రంగం సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది కూడా! - సాక్షి స్పెషల్ డెస్క్ -
ఉదయ రాగం.. నాన్న యోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు నగర జీవనశైలిలో నాన్న అంటే.. ఉదయం ఇంటినుంచి బయలుదేరి, ట్రాఫిక్తో పోరాడి, ఆఫీస్ బాధ్యతలు మోసి, రాత్రి అలసటతో ఇంటికి చేరే వ్యక్తి. పిల్లలతో గడిపే సమయం ‘వీకెండ్ ఆప్షన్’గా మిగిలేది. కానీ.. ఇప్పటి నాన్నలు కొంచెం విభిన్నంగా, వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఉన్న సమయాన్ని అనువుగా వినియోగించుకుంటూ ఆరోగ్యం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల వైపు కొత్తదారులు వెతుక్కొంటున్నారు.ఇటీవలి కాలంలో ఉదయపు పార్కులు, అపార్ట్మెంట్ టెర్రస్లు, కమ్యూనిటీ హాళ్లలో పిల్లలతో కలిసి యోగా మ్యాట్పై కనిపిస్తున్నారు. ఐటీ, ఫార్మా, స్టార్టప్ల హబ్గా పేరొందిన కార్పొరేట్ నగరంలో పని ఒత్తిడి సహజం. ఈ పరుగుల మధ్య తండ్రితనం కూడా ఒక ‘రెస్పాన్సిబిలిటీ లిస్ట్’గా మారడంతో ఉదయాన్నే యోగాతో పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటు మానసికంగా, అటు శారీరక మేలు కోసం అన్నింటికీ మించి పిల్లలకు సమయం ఇవ్వాలనే కోరిక దీనికి ప్రధాన కారణం. నేడు ఫాదర్స్ డే, యోగా డే రెండూ ఒకే రోజున కలిసి రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇలా నాన్న– పిల్లలు నిత్యం చేస్తున్న యోగా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారికి ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. డాడ్– కిడ్ యోగా రీల్స్.. యోగా.. ఇక్కడ కేవలం ఫిట్నెస్ ట్రెండ్ కాదు.. ఇది ఒక న్యూ ఏజ్ ఫాదర్హుడ్ స్టేట్మెంట్. ‘శ్వాసపై దృష్టి పెట్టడం, నిశ్శబ్దాన్ని వినడం, శరీరంతో పాటు మనసును సర్దుకోవడం’ ఈ అలవాట్లు తండ్రులను మరింత సమతుల్యంగా మార్చుతున్నాయి. పిల్లలతో కలిసి సూర్య నమస్కారాలు చేయడం, ప్రాణాయామం నేర్పడం.. ‘క్వాలిటీ టైమ్’ కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. ఫలితంగా తండ్రి–పిల్లల మధ్య సంభాషణ పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఈ మార్పు డాడ్–కిడ్ యోగా రీల్స్, ఫ్యామిలీ ఫిట్నెస్ చాలెంజ్లుగా ట్రెండ్ అవుతున్నాయి. పిల్లలు తండ్రిని కేవలం సంపాదించే వ్యక్తిగా కాకుండా, మార్గదర్శిగా చూడటం మొదలుపెడుతున్నారు. నాన్నలు సమయమిచ్చి పిల్లలతో కలిసి యోగా చేయడమే నిజమైన ఫాదర్స్ డే గిఫ్ట్ అని చెబుతున్నారు.కూతురుతో కలిసి యోగా ఆనందకరంఉద్యోగం, బిజీబిజీ నగర జీవన శైలితో అలసిపోయే నాకు యోగాతో ఒక చక్కని పరిష్కారంతో పాటు నాన్నగా కూతురుతో అద్భుత క్షణాలను ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. ఇది అలవాటుగా మారకముందు మా దినచర్య వేరేలా ఉండేది. కానీ.. ప్రస్తుతం వినోదం, వి/ê్ఞనం, ఆరోగ్య వికాసం.. ముఖ్యంగా నాన్నగా ఆతీ్మయ సంతృప్తి పొందుతున్నా. మొబైల్స్, టీవీలకు అతుక్కు పోయే బాల్యం ఇలా నాన్నతో, ఆరోగ్యంగా కొనసాగడం సంతోషంగా ఉంది. నా పాప అని్వక కూడా అందరి పిల్లల్లా కాకుండా వినూ త్న ఆలోచనా విధానంతో పెరుగుతోంది. – నవీన్ కుమార్, సరూర్నగర్ -
మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా..
సాక్షి, హైదరాబాద్: మానసిక ఒత్తిడి మనుషులకే కాదు, మూగజీవులకూ ఉంటుంది. మరి వాటి మానసిక ఒత్తిడిని గ్రహించేదెలా? హైదరాబాద్, సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ)లోని అంతరించిపోతున్న జాతుల పరిక్షణ ప్రయోగశాల (లాకోన్స్) శాస్త్రవేత్తలు జంతువుల మనసును చదవడానికి ‘బయో–స్కోర్’విధానాన్ని అభివృద్ధి చేశారు. మలపరీక్ష చాలు! సాధారణంగా జంతువుల అనారోగ్యాన్ని గుర్తించడానికి రక్తపరీక్ష చేస్తారు. రక్తం సేకరించే క్రమంలో అవి మరింత ఒత్తిడికి గురవుతాయి. బయో–స్కోరింగ్ విధానంలో జంతువుల మలాన్ని పరీక్ష చేస్తారు. దీనిని ‘ఫీకల్ గ్లూకోకార్టికాయిడ్ మెటాబోలైట్’(ఎఫ్జీఎం) విశ్లేషణ అంటారు. ఈ పరీక్ష ద్వారా జంతువుల్లోని హార్మోన్ల హెచ్చుతగ్గులను పరిశీలించి, అవి కొన్ని రోజులు, వారాలుగా అనుభవిస్తున్న ఒత్తిడిని కచి్చతంగా నిర్ధారిస్తారు. బోనులోని సింహానికీ తప్పని ఒత్తిడి జంతుప్రదర్శనశాలల్లోని బోనుల్లో ఉండే పులులు, సింహాల వంటి వన్యప్రాణులు పైకి ఎంత గంభీరంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తుంటాయి. జూ నిర్వహకులు జంతువుల శారీరక లక్షణాలు, ప్రవర్తన ఆధారంగా ఇచ్చే ‘కేర్ ఇన్ క్యాప్టివిటీ’స్కోర్కార్డులు కచ్చితమైన ఆరోగ్యస్థితిని అంచనా వేయలేవని గుర్తించిన శాస్త్రవ్తేలు ఈ బయో–స్కోర్ విధానాన్ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తు సమస్యలకు అద్దం జూలలో జంతువు చురుగ్గా తిరుగుతోందా, బక్కచిక్కిందా, ఆహారం సరిగ్గా తింటోందా వంటి పైకి కనిపించే విషయాల ఆధారంగా రిపోర్టు ఇస్తారు. బయో స్కోర్ డేటా ద్వారా జంతువుల ప్రస్తుత ఆరోగ్య స్థితితోపాటు భవిష్యత్తు ఆరోగ్యాన్ని కూడా గ్రహించవచ్చు. తీవ్రమైన ఒత్తిడి వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినడం వంటి పరిణామాలను గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
బ్రెయిన్కు బూస్ట్.. ఇక ఆందోళనకు చెక్!
యోగా.. నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరికీ పరిచయం చేయక్కర్లేని పదం. పాఠశాల స్థాయి నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ వరకు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. బ్రెయిన్ను రీవైరింగ్ చేస్తూ.. మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుందని అనేక పరిశోధనల్లో సైతం రుజువయ్యింది. అందుకే యోగా ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కేవలం ఒక రోజు వేడుక కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఆరోగ్య విప్లవంగా మారింది.బ్రెయిన్కు బూస్ట్యోగా అనగానే చాలామందికి కేవలం శరీరాన్ని విల్లుగా వంచడం, శ్వాసపై ధ్యాస పెట్టడం లేదా శారీరక దృఢత్వం కోసం చేసే ఒక వ్యాయామం మాత్రమే గుర్తొస్తుంది. కానీ, యోగా అంతకుమించి మన మెదడును సమూలంగా మార్చేయగలదని, మానసిక ఒత్తిడిని దూరం చేయగలదని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో తేలింది. మెదడులోని నాడీ వ్యవస్థ తనను తాను పునర్నిర్మించుకునే ప్రక్రియను న్యూరోప్లాస్టిసిటీ అంటారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మెదడులో ఈ ప్రక్రియ వేగవంతమై, మానసిక స్థితి పూర్తిగా మారుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఒత్తిడి హార్మోన్లకు బ్రేక్!మనం తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ లో ఉన్నప్పుడు శరీరంలో ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ విపరీతంగా విడుదలవుతుంది. ఇది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, కేవలం ఒకే ఒక్క యోగా సెషన్తోనే శరీరంలో కార్టిసాల్ స్థాయులు 30 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. యోగాలోని ‘్రపాణాయామం’ మన శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది గుండె వేగాన్ని, శ్వాసను నియంత్రించి శరీరానికి, మనస్సుకు పూర్తి ప్రశాంతతను ఇస్తుంది.ఆందోళనకు చెక్మెదడును ప్రశాంత పరిచే ‘గాబా’ అనే కెమికల్ కొరత వల్ల మనుషుల్లో యాంగ్జైటీ, డిప్రెషన్ పెరుగుతాయి. నిరంతర యోగా సాధన వల్ల మెదడులో ఈ ‘గాబా’ స్థాయులు గణనీయంగా పెరుగుతాయని, తద్వారా ఎలాంటి మందులు లేకుండానే మానసిక ఆందోళనలను అదుపులోకి తీసుకురావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తీవ్రమైన మానసిక గాయాలతో బాధపడేవారికి కూడా యోగా ఒక అద్భుతమైన థెరపీలా పనిచేస్తోందని తేలింది.అయితే యోగా వల్ల కలిగే ఈ మానసిక ప్రయోజనాలు శాశ్వతంగా ఉండాలంటే మాత్రం క్రమం తప్పకుండా చేయడం మాత్రం తప్పనిసరి. ఇది ‘యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్’ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే యోగా ఆపేస్తే మెదడు మళ్లీ పాత స్థితికి చేరుకుంటుంది. అందువల్ల రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు సరళమైన ఆసనాలు,ప్రాణాయామం చేసినా మెదడును ఆధునీకరిస్తుంది. అద్భుతాలను సృష్టిస్తుంది. లేదంటే వాడని వస్తువులు తుప్పు పట్టినట్లే మెదడు కూడా ముందు స్థితికి చేరుకుంటుంది.ఈ ఏడాది యోగా థీమ్...ఈ సంవత్సరం అంటే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా 'Yoga for Healthy Ageing' అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే శారీరక మార్పులను తట్టుకుని, మానసిక స్థిరత్వంతో ఆరోగ్యంగా ఎలా జీవించాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. -
నడుము, కాళ్లు, వెన్నెముకకు శక్తినిచ్చే త్రికోణాసనం!
త్రికోణాసనం అర్థం... ‘త్రి‘ అంటే మూడు, ‘కోణం‘ అంటే కోణం. శరీరం త్రిభుజాకారంలో ఉండే ఆసనాన్ని త్రికోణాసనం అంటారు. చేసే విధానం... నిటారుగా నిలబడి కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచాలి. చేతులను భుజాల స్థాయిలో పక్కలకు చాచాలి. కుడి పాదాన్ని కుడివైపుకు తిప్పాలి.శ్వాస వదులుతూ కుడివైపుకు వంగి, కుడి చేతిని కుడి పాదం దగ్గర ఉంచాలి. ఎడమ చేతిని పైకి చాచి, చూపును ఎడమ చేతి వేళ్లపై నిలపాలి. 10–30 సెకన్లు ఈ స్థితిలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ మళ్లీ మొదటి స్థితికి రావాలి. ఇదే విధంగా ఎడమ వైపు చేయాలి.ప్రయోజనాలు... శరీర కండరాలను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సమతుల్యత, ఏకాగ్రతను పెంచుతుంది. కాళ్లు, తొడలు, నడుము భాగాలను దృఢంగా చేస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఛాతీ విస్తరించి శ్వాసక్రియ మెరుగుపడుతుంది.జాగ్రత్తలు... తీవ్రమైన వెన్నునొప్పి లేదా మెడ నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. తల తిరగడం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఆసనాన్ని బలవంతంగా చేయకూడదు. – అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
ఖర్చు లేకుండా.. ప్రశాంతతను చేకూర్చే సహజ ఔషధం ఇదే..!
ఎలాంటి ఖర్చు లేకుండా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే ఒక అద్భుతమైన సహజ ఔషధం మ్యూజిక్. కేవలం వినోద సాధనంగానే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా సంగీతం ఒక దివ్యౌషధంగా పనిచేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.శాస్త్రీయ సంగీతం మనస్సుకు ఎనలేని ప్రశాంతతను, నిశ్చలతను ఇస్తే, రాప్ సంగీతం జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే పక్షుల కిలకిలరావాలు, వాన జల్లుల చప్పుడు, సముద్రపు అలల ధ్వనులు గుండె వేగాన్ని నియంత్రించి, ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తాయి.అందువల్ల మనకు నచ్చిన సంగీతాన్ని వినడం వల్ల మన మెదడులోని రసాయన ప్రక్రియల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గించి, మూడ్ను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనల నుంచి మనస్సును పక్కకు మళ్లించడానికి ఇది ఒక సులువైన మార్గం.ఆఫీసులో ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సంగీతం వినే ఉద్యోగుల్లో కేవలం నెల రోజుల్లోనే ఒత్తిడి స్థాయిలు భారీగా తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు.అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఉత్సాహభరితమైన పాటలు వింటూ ఇల్లు లేదా డెస్క్ శుభ్రం చేసుకోవడం వల్ల అలసట తెలియదు. అలాగే, చదువుకునేటప్పుడు లేదా ఆఫీస్ పనులు చేసేటప్పుడు లిరిక్స్ లేని కేవలం ఇ¯Œ స్ట్రుమెంటల్ సంగీతాన్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతత కోసం హెడ్ఫోన్స్ తగిలించుకుని మీకు నచ్చిన సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోవడమే ఒత్తిడికి సరైన పరిష్కారం! -
మనం వాడుతున్న టొమాటోలు.. ఏ దేశానికి చెందినవో తెలుసా..?
నిత్యం మనం వాడుతున్న కొన్ని పదార్థాలు ఎక్కడినుంచి వచ్చాయి? ఆ పదార్థాలతో లాభాలేంటి అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం!ఇండియాలో మిరపకాయలను, టొమాటోలను, బంగాళా దుంపలను ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో టొమాటోలు లేని కూరలు అసలే ఉండదు. అలాంటి ఈ టొమాటోలు అసలు మనదేశానివే కావనే విషయం మీకు తెలుసా..? వీటిని పోర్చుగీసు వారు భారత దేశానికి తీసుకొచ్చారు.జలుబు, దగ్గు లేదా సైనస్ సమస్యలు వచ్చినప్పుడు తల్లులు పిల్లలకు పాలు తాగించడం మానేస్తారు. అయితే పాలు ఎలాంటి హాని కలిగించవు, సైనస్ సమస్యలను మరింత తీవ్రతరం చేయవు. జలుబుతో బాధపడే పిల్లలు, పెద్దవారు ఎలాంటి భయం లేకుండా పాలు తాగొచ్చు. -
బాదంతో.. కంటి చూపు భేష్!
బాదం పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్నులాగే ఉంటుంది. అందువల్ల దీనిని కనుదృష్టి కోసం వాడతారు. బాదం పప్పులు 200 గ్రాములు తీసుకొని రాత్రి వేడి నీటిలో నానబెట్టాలి.తెల్లవారిన తరువాత పై తోలు తీసి నలగ్గొట్టి చూర్ణం చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.అదే విధంగా సోంపు గింజలు 200 గ్రాములు తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకొని దానికి మెత్తగా పొడి చేసిన 200 గ్రాముల కండ చక్కెర కలుపుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి.పెద్దలకు రెండు స్పూన్లు మోతాదుగా ఆవుపాలు వేడి చేసుకొని అందులో ఈ చూర్ణం కలుపుకొని సేవిస్తుంటే నేత్ర దృష్టి పెరుగుతుంది. పిల్లలకయితే ఒక స్పూన్ చాలు. ఈ విధంగా ఒక సంవత్సరం వాడితే కంటిచూపు బాగుండటమే గాక జ్ఞాపక శక్తి పెరుగుతంది. కృశించి ΄ోయిన శరీర భాగాలు కూడా ఉత్తేజం చెందుతాయి. -
ఆ రోజుల్లో కూడా యోగా చేయొచ్చు!
క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అందరికీ తెలిసిందే.అయితే స్త్రీలు రుతుక్రమం (పీరియడ్స్) సమయంలో యోగా చేయకూడదనే అపోహతో ఆ రోజుల్లో యోగాకు దూరంగా ఉంటారు చాలామంది స్త్రీలు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన మార్గదర్శకత్వంతో యోగా చేయడం పీరియడ్స్ సమయంలో కూడా సురక్షితమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా...చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో యోగాకు దూరంగా ఉంటారు. అయితే పిరియడ్స్లో ఉన్నా, యోడసాధనను ఆపాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పీరియడ్స్ టైంలో శరీరాన్ని తలక్రిందులుగా ఉంచే ఇన్వర్షన్ ఆసనాల విషయంలో మాత్రం ఎలాంటి అసౌకర్యం అనిపించినా వాటిని చేయకుండా ఉండటం ఉత్తమం.పీరియడ్స్ సమయంలో యోగా చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవడంతో పాటు ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలై మానసిక ప్రశాంతత కలుగుతుందంటున్నారు నిపుణులు.. పీరియడ్స్ సమయంలో యోగా చేస్తే రుతుచక్రం మారిపోతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది కూడా అపోహేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైగా క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి రుతుచక్రం క్రమబద్ధంగా ఉండే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. -
వర్షాకాలం వచ్చేసింది.. పాదరక్షలతో పదిలం!
వర్షాకాలం వచ్చేసింది. ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే వేసుకునే చెప్పుల విషయంలోనూ జాగ్రత్తలు ముఖ్యమే. లేదంటే కొద్దిపాటి అజాగ్రత్తగా ఉన్నా జారిపడటమో, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడమో జరుగవచ్చు. అందుకోసం ఈ చిన్నచిన్న టిప్స్...మంచి గ్రిప్ ముఖ్యం: వర్షాకాలంలో అడుగు భాగంలో అరిగిపోయిన ఫ్లాట్ చెప్పులను అస్సలు వాడకూడదు. తడి నేలపై నడిచేటప్పుడు జారిపడకుండా ఉండటానికి గరుకుగా, గట్టిగా నేలను పట్టుకునే గ్రిప్ ఉన్న చెప్పులను మాత్రమే ఎంచుకోవాలి.వాటర్ ప్రూఫ్వి: లెదర్, కాన్వాస్ లేదా బట్టతో చేసిన చెప్పులు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇవి త్వరగా ఆరకపోవడమే కాకుండా దుర్వాసనకు, బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. కాబట్టి రబ్బర్, సిలికాన్ లేదా ప్లాస్టిక్తో తయారైన వాటర్ ప్రూఫ్ చెప్పులను వాడటం ఉత్తమం.సరైన సైజ్: చెప్పులు మరీ లూజ్గా గానీ, మరీ టైట్గా గానీ ఉండకూడదు. బురదలో నడిచేటప్పుడు కాళ్ళు బెణకకుండా ఉండేందుకు యాంకిల్ సపోర్ట్ ఉన్న చెప్పులు మరింత సురక్షితం. -
‘బోన్ మీల్’ ఉపయోగాలేంటి?
సేంద్రియ మిద్దెతోటలు, ఇంటిపంటల సాగులో బోన్ మీల్ వాడటం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.మిద్దెతోటల్లో పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలకి బోన్ మీల్ పొడిని వేయడానికి కొన్ని ప్రత్యేక సమయాలు, పద్ధతులు ఉన్నాయి.ఇది మొక్కలకు కావలసిన ఫాస్పరస్, కాల్షియంను నెమ్మదిగా అందిస్తుంది.కొత్తగా మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనాలు వేసేటప్పుడు కుండీలోని మట్టి మిశ్రమంలో బోన్ మీల్ కలపడం చాలా మంచిది. దీని వల్ల వేర్లు బలంగా అభివృద్ధి చెందుతాయి.మొక్కలు పూతకు వచ్చే ముందు లేదా మొగ్గలు తొడిగే దశలో బోన్ మీల్ వేయడం వల్ల పూత రాలకుండా ఉంటుంది. కాయ సైజు పెరుగుతుంది. ముఖ్యంగా టమోటాలు, మిర్చి వంటి కూరగాయలకి ఇది బాగా ఉపయోగపడుతుంది.బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంప వంటి నేల లోపల పెరిగే దుంప జాతి మొక్కలకు ఇవి ఊరే సమయంలో వేస్తే నాణ్యమైన దిగుబడి వస్తుంది.వర్షాకాలం ప్రారంభంలో మొక్కలు వేగంగా పెరిగే సమయంలో ఒకసారి వేయవచ్చు.బోన్ మీల్ చాలా నెమ్మదిగా కరిగే ఎరువు. కాబట్టి దీన్ని ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి వేస్తే సరిపోతుంది.కుండీలోని పై మట్టిని కొద్దిగా తవ్వి, మొక్క మొదలుకు కొంచెం దూరంగా వేసి తిరిగి మట్టితో కప్పేయాలి.బోన్ మీల్ వేసిన తర్వాత వెంటనే తగినంత నీరు పోయాలి. - కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!
సాధారణంగా బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ పీసీఓఎస్ అంటే అంత సులభం కాదు బరువు తగ్గడం. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ జస్ట్ రెండు నెల్లలోనే ఏకంగా తొమ్మిది కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం తానే ఏం చేసింది? ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యిందో షేర్ చేసుకుంది. మరి అవేంటో చూద్దామా..!.పీసీఓఎస్తో బరువు తగ్గడం అనేది అసంభవం అనిపించే సవాలులా ఉంటుంది. పైగా అందరికీ ఈ సమస్య ఒకేలా ఉండదు. అలాగే అందరికీ సరిపోయే డైటింగ్, వ్యాయామాలు ఉండవు. అలాంటిది కంటెంట్ క్రియేటర్ తాన్య మాత్రం పీసీఎస్ని ఆరోగ్యవంతంగా నిర్వహించుకుంటూనే బరువు తగ్గిందామె. పైగా ఎలాంటి కఠినమైన ఆహార నియామాలు, తీవ్రమైన వ్యాయమాల జోలికి పోకుండా నిలకడగా జీవనశైలి మార్పులను పాటించానని అంటోంది. అంతేగాదు తాను ఎలా బరువు తగ్గిందో కూడా షేర్ చేసుకున్నారామె. ఆమె కేవలం రెండు నెలల్లో 75 కిలోల నుంచి 66 కిలోలు అంటే మొత్తం 9 కిలోలు తగ్గినట్లు పేర్కొంది. అయితే ఇలా పీసీఓఎస్తో బరువు తగ్గే ప్రయత్నంలో తాను ఆ ఐదు తప్పిదాలను చేయకుండా జాగ్రత్తపడ్డానని అంటోంది. అందువల్ల ఇంత సులభంగా బరువు తగ్గానని పంచుకుంది. చేయకూడని తప్పిదాలు..అల్పాహారం మానేయడంతాన్య ప్రకారం, అల్పాహారం మానేయడం తాను చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి. చాలా కాలం పాటు, తక్కువ తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతానని నమ్మేదాన్ని అంటోంది. అయితే, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంపై దృష్టి పెట్టడం ప్రారంభించాక పరిస్థితులు మారాయని వెల్లడించింది.అంతులేని కార్డియో చేయడంగంటల తరబడి కార్డియో చేయడమే బరువు తగ్గడానికి కీలకం అని చాలా మంది అనుకుంటారు. తాన్య దీనితో ఏకీభవించదు. అంతులేని కార్డియో సెషన్లతో తనను తాను బలవంతం చేసుకోవడం కంటే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్రమం తప్పకుండా నడవడం తనకు చాలా బాగా పనిచేశాయని ఆమె చెప్పింది.ఆహారానికి భయపడటంతాను వదిలేసిన మరో అలవాటు ఆహారాన్ని శత్రువులా చూడటం అని చెబుతోంది తాన్య. PCOS ఉన్నంత మాత్రాన పస్తులుండటం లేదా క్రాష్ డైట్లపై ఆధారపడటం కానేకాదని అంటోందామె. బదులుగా ప్రోటీన్తో కూడిన సరైన భోజనమే ఎంతో మేలు చేస్తుందని చెబుతోంది.పానీయాల ద్వారా కేలరీలు తీసుకోవడంచక్కెర పానీయాలలో దాగి ఉన్న కేలరీల గురించి కూడా తాన్య ప్రస్తావించింది. ఫ్యాన్సీ కాఫీ డ్రింక్స్ నుంచి ప్యాకేజ్డ్ జ్యూస్ల వరకు, ఈ పానీయాలు కడుపు నిండినట్లు అనిపించకుండానే అదనపు కేలరీలను చేర్చగలవు. ఇలాంటి పానీయాలు ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతాయని, PCOS ఉన్న చాలా మంది మహిళలు దీన్ని నియంత్రించడానికి ప్రయత్నించరని అన్నారామె.అనారోగ్యకరమైన అలవాట్లను తేలిగ్గా తీసుకోవడంకొందరు అనారోగ్యకరమైన అలవాట్లని తెలిసి కూడా చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. ఏదో అప్పడప్పుడూ అంటూ ఆ అలవాట్లకు దూరంగా ఉండరు. ఇక్కడ కేవలం తన రూపానికి సంబంధించి కాదు బరువు తగ్గడం, ఇది తన మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకి సంబంధించింది అని భావించి ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అంటోంది తాన్య. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకునే యత్రం చేయాలి. ఇది కేవలం రూపం కోసం కాదు భవిష్యత్తులో ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పీసీఓఎస్ని మెరుగ్గా నిర్వహించుకోవడానికి అన్న దృక్పథంతో జాగుకరకతతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..సత్ఫలితాలను అందుకోగలమని అంటోంది. అందుకోసం తీవ్రమైన ఆహార నియమాలు లేదా కఠినమైన వ్యాయామాలు కంటే నిలకడగా పాటించే అలవాట్లు, సమతుల్య భోజనం, శక్తినిచ్చే శిక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి మంచి మార్పుని తీసుకొస్తాయని నమ్మకంగా చెబుతోంది కంటెంట్ క్రియేటర్ తాన్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Tanya (@tanyabackstage) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..) -
30 ఏళ్లు దాటాయా? జాగ్రత్త.. ఈ అలవాటు లేకపోతే ఇబ్బందులే!
చాలామంది వృద్ధాప్యం వచ్చాకే శరీరం బలహీనపడుతుందని భావిస్తారు. కానీ కండరాల బలం తగ్గే ప్రక్రియ 30 ఏళ్ల తర్వాతే నెమ్మదిగా ప్రారంభమవుతుంది. 60 ఏళ్లు దాటాక ఇది మరింత వేగంగా సాగుతుంది. ఫలితంగా శక్తి తగ్గడం, నడకలో సమతుల్యత కోల్పోవడం, తరచూ పడిపోవడం, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతాయి. అంటే సమస్య వయసు కాదు.. వయసుతో పాటు తగ్గిపోతున్న కండరాల బలమే అని నిపుణులు చెబుతున్నారు.వయసు పెరుగుతోందంటే వెంట్రుకలు తెల్లబడటం, ముడతలు పడటమే కాదు. మీకు తెలియకుండానే శరీరంలోని కండరాలు కూడా క్రమంగా బలహీనపడుతున్నాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యే ఈ ప్రక్రియను పట్టించుకోకపోతే.. 60, 70 ఏళ్ల వయసులో మెట్లు ఎక్కడం, కుర్చీ నుంచి లేవడం, రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.నడక ఒక్కటే సరిపోదంట: ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడిస్తే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే నడక గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కండరాల బలాన్ని కాపాడుకోవడానికి మాత్రం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం జిమ్కు వెళ్లి భారీ బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. కుర్చీ నుంచి లేచి కూర్చోవడం, స్క్వాట్స్, గోడకు ఆనుకుని పుష్అప్స్ చేయడం, మెట్లు ఎక్కడం, రెసిస్టెన్స్ బ్యాండ్లతో చేసే వ్యాయామాలు కూడా కండరాలను బలోపేతం చేస్తాయి.మొదట్లోనే అతి వద్దు: అయితే ఒక్కసారిగా ఎక్కువ వ్యాయామం చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు రోజులు, రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించాలని సూచిస్తున్నారు. శరీరం అలవాటు పడిన తర్వాత క్రమంగా తీవ్రత పెంచాలని చెబుతున్నారు.కండరాలు బలపడితే: స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల కేవలం కండరాలే కాదు.. ఎముకలు కూడా బలపడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. శరీర సమతుల్యత పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.50.. 60.. 70 వచ్చినా.. డోంట్ వర్రీ: "ఇప్పుడేం ఉపయోగం?" అని అనుకునేవారికి నిపుణులు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నారు. కండరాల బలాన్ని పెంచుకోవడానికి వయసు అడ్డంకి కాదని చెబుతున్నారు. 50, 60, 70 ఏళ్ల వయసులో కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు.వ్యాయామంతో పాటు: కండరాల నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరం. పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, చేపలు, మాంసాహారం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం తర్వాత సరైన విశ్రాంతి కూడా అవసరమే. ఎందుకంటే కండరాలు వ్యాయామం చేసే సమయంలో కాకుండా.. విశ్రాంతి సమయంలోనే మరింత బలపడతాయి.వయసు పెరగడం ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ వయసు పెరిగాక ఎంత చురుకుగా, ఎంత స్వతంత్రంగా జీవించాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే 30 దాటిందంటే నిర్లక్ష్యం చేయొద్దు. మీ శరీరంలోని కండరాలు నిశ్శబ్దంగా బలహీనపడకముందే అప్రమత్తం కావాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలుపెట్టకపోతే.. వృద్ధాప్యంలో మూల్యం చెల్లించాల్సి రావచ్చని స్పష్టం చేస్తున్నారు. -
Health: కాళ్లు వాచిపోతే.. ఎలర్ట్ టైమ్!
ప్రతి ఒక్కరి జీవితంలో పాదాల వాపు ఏదో ఒక సమయంలో కనిపించడం చాలా సాధారణం. రకరకాల కారణాల వల్ల పాదాల్లో వాపు కనిపిస్తుంటుంది. చాలాసేపు ఏదైనా వాహనంలోగానీ లేదా బస్సులోగానీ కూర్చుని ప్రయాణం చేశాక... పాదాల్లో వాపు రావడం చాలామందిలో కనిపించేదే. ఇది నిరపాయకరమైన వాపు. దీన్ని బినైన్ ఎడిమా అంటారు. అయితే సందర్భాల్లో మాత్రం పాదాల వాపు కాస్తంత సీరియస్ ఆరోగ్య సమస్యలనూ సూచించవచ్చు. అందుకే సాధారణంగా ప్రయాణం చేసిన వెంటనే కాకుండా మామూలుగా ఇతర సందర్భాల్లో పాదాల వాపు కనిపిస్తే ఒకసారి డాక్టర్ను సంప్రదించడం అవసరం. ఏయే సందర్భాల్లో పాదాల వాపు అన్నది ప్రమాదకరమైన సూచన కావచ్చనే అంశంపై అవగాహన కోసం ఈ కథనం...కాళ్లలో/పాదాల్లో వాపు కనిపించే లక్షణాన్ని వైద్య పరిభాషలో ‘ఎడిమా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో ముందుగా అనుమానించాల్సినవి సెల్యులైటిస్, డీప్వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్లు. ఇవి మాత్రమే కాకుండా... హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్... ఈ మూడు కీలక అవయవాల పనితీరు తగ్గడం వల్ల కూడా కాళ్లలో వాపు కనిపించవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో హైపోథైరాయిడిజమ్ వల్ల కూడా పాదాల వాపు కనిపించవచ్చు. కొన్ని మందుల వాడకం వల్లగానీ లేదా అసలే కారణమూ తెలియకుండా కూడా పాదాల్లో వాపు రావచ్చు.పాదాల వాపునకు రకరకాల కారణాలివి...పాదాల వాపునకు కారణాలలో రెండు రకాలుంటాయి. అందులో 1. సాధారణ (కామన్) కారణాలు... 2. తీవ్రమైన కారణాలు.1. సాధారణ కారణాలు (కామన్ కాజెస్) ∙ రక్తహీనత ∙హైపోథైరాయిడిజమ్ ∙ మూత్రం ద్వారా ్రపోటీన్ పోవడం (్రపోటీన్ లాస్ ఇన్ యూరిన్) ∙ కొన్ని రకాల మందుల వాడకం వల్ల (మెడికేషన్స్)2. తీవ్రమైన కారణాలు (సీరియస్ కాజెస్) ∙ కాలేయ వ్యాధులు (లివర్ డిసీజెస్) ∙ మూత్రపిండాల వైఫల్యం (రీనల్ ఫెయిల్యూర్) ∙ గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్)కొన్ని కారణాల గురించి మరింత విపులంగా...లివర్ ఫెయిల్యూర్ వల్ల... కాలేయ వైఫల్యం (లివర్ ఫెయిల్యూర్) అయిన వాళ్లలో కాళ్లు లేదా పాదాల్లో వాపు కనిపించే అవకాశాలెక్కువ. ఇలాంటి సందర్భాల్లో ‘లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్టీ) అనే పరీక్ష చేయించి, ఆ వాపు లివర్ ఫెయిల్యూర్ వల్లనా లేదా మరో కారణం వల్లనా అనే విషయం తెలుసుకుంటారు. సమస్య నిర్ధారణ తర్వాత దానికి అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు.కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల...కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్లో ముఖం మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో కాళ్లలో వాపు కూడా కనిపించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేయించి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.పాదాలకూ, గుండెకూ సంబంధమిలా... పాదాల వాపు గుండెజబ్బుకు ఒక ప్రధాన సూచన. గుండె జబ్బు కారణంగా పాదాల వాపు వస్తే అది రెండు కాళ్లలోనూ కనిపిస్తుంది. తొలినాళ్లలో కాలి ముందు భాగంలోనూ, మడమ భాగంలోనూ ఉంటుంది. ఆ తర్వాత పాదం పైన కూడా కనిపించవచ్చు. ఈ వాపు కారణంగా ఎలాంటి నొప్పీ ఉండదు. కాబట్టి ఈ సమస్యతో డాక్టర్ వద్దకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ లక్షణంతో పాటు ఆయాసం రావడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం బాధితులు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఆయాసం, గుండెదడ, ఛాతీ నొప్పి లాంటి లక్షణాలు రాకముందే ఆ పాదాల వాపు అన్నది గుండె జబ్బుకు సూచన కావచ్చన్నది అనుమానించడం వల్ల... సమస్య నిర్ధారన కాస్త త్వరగా జరిగే అవకాశముంది. అలాగో చూద్దాం.గుండెజబ్బులో పాదాల వాపు ఎందుకొస్తుందంటే...పాదాలవాపు అనేది గుండె పంపింగ్ సామర్థ్యం (పంపింగ్ కెపాసిటీ) తగ్గినప్పుడు కనిపించే ఓ ముఖ్యమైన లక్షణం. గుండెలో తాను సంకోచించే శక్తి తగ్గినా లేక వ్యాకోచించే సామర్థ్యం లోపించినప్పుడు కాళ్ల వాపు కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తపోటు పెరిగి ఉండటానికి కూడా కాళ్లవాపు అన్నది ఒక లక్షణంగా గుర్తించాలి. గుండెజబ్బు కారణంగా కాళ్ల వాపు వచ్చిందా అన్న విషయం తెలుసుకోడానికి బీఎన్పీ అనే రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. బీఎన్పీ విలువ 100 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది గుండెజబ్బు కారణంగానేమో అని అనుమానించాల్సి ఉంటుంది. అప్పుడు కార్డియాలజిస్టును సంప్రదించి ఆయన సలహా మేరకు ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతో కాలివాపు గుండెజబ్బు కారణంగానా, కాదా అన్నది నిర్ధారణ చేయవచ్చు.ఒకవేళ కాలివాపు అన్నది గుండెజబ్బు కారణంగానే అయితే... కాలి వాపు అన్నది గుండె జబ్బు కారణంగానే వస్తే... ఆ సమస్యకు డైయూరెటిక్స్ అనే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డైయూరెటిక్స్ మందులు... దేహంలోంచి నీటిని మూత్రం రూపంలో బయటికి పోయేలా చేస్తాయి. అయితే గుండెజబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఈ డైయూరెటిక్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. గుండెజబ్బు లేకుండా ఆ మందులు వాడితే అవి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... గుండెజబ్బు కాకుండా ఇతరత్రా ఏదైనా ఇతర కారణం వల్ల పాదాల / కాళ్ల వాపు వచ్చి ఉంటే... ఆ అసలు కారణాన్ని కనుగొనే అవకాశాన్ని కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో డాక్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా కనిపించే పాదాల వాపు కాళ్లకు నీరు పట్టి కాళ్లలో వాపు కనిపించడానికి మరో ప్రధాన కారణం ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం. ఇటీవల చాలామందిలో పెరుగుతున్న ఊబకాయం వల్ల నిద్రపోతున్నప్పుడు ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయి ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. దాంతో ఆ సమయంలో ఊపిరితిత్తుల్లో రక్తపోటు కూడా పెరగవచ్చు.ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు : ∙ పెద్దగా గురకపెట్టడం∙ నిద్రలో ఉలిక్కిపడి లేవడం∙ దగ్గుతో పొలమారి నిద్రనుంచి మెలకువ రావడం∙ నిద్రపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం. ఈ వ్యాధి గురించి అంతగా అవగాహన లేకపోవడంతో నిర్ధారణ సరిగా జరగడం లేదు.చేయించాల్సిన వైద్య పరీక్షలు : ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడాన్ని నిర్ధారణ చేయడం కోసం ఎకో పరీక్ష చేయించాలి. కాళ్ల వాపులు వచ్చే వ్యక్తులకు 45 ఏళ్లు దాటితే... వారికి తప్పనిసరిగా ఎకో పరీక్ష చేయించాలి.చికిత్స : ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియాకు తప్పనిసరిగా చికిత్స చేయించాలి. దాంతో స్లీప్ ఆప్నియా సమస్య తగ్గడంతో పాటు అలా ఆ సమస్య తగ్గినంతున కాళ్ల వాపు కూడా తగ్గుతుంది.కొన్ని రకాల ఇతర వ్యాధులూ... కాళ్ల వాపులు ఈ కాళ్లలో వాపు అన్నది కొన్ని రకాల ఇతర జబ్బుల వల్ల కూడా కనిపించవచ్చు. ఇందులో ప్రధానమైనవి... మూత్రపిండాల జబ్బులు, కాలేయ వ్యాధులు కాగా... వాటితో పాటు కటి (నడుము కింది) భాగంలో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లలో కూడా కాళ్ల వాపు కనిపించవచ్చు. కొందరు గర్భవతుల్లో కాలి సిరలు పటుత్వం కోల్పోవడం వల్ల కూడా కాళ్ల వాపు రావచ్చు. కొన్ని సార్లు థైరాయిడ్ హార్మోన్ లోపించనప్పుడూ ఈ సమస్య కనిపించడం కాస్త సాధారణమే. శరీరంలో ్రపోటీన్లు మూత్రం ద్వారా పోతున్నప్పుడు కూడా కాళ్ల వాపు కనిపించవచ్చు. అందుకే కాళ్ల వాపు లక్షణం కనిపించినప్పుడు ప్రధాన కారణాలను కనుగొని వాటికి సరైన చికిత్స తీసుకోవాలి.కొన్ని రకాల మందుల వాడటం వల్ల... కొన్నిసార్లు మనం వాడే మందుల వల్ల కూడా కాళ్ల వాపు రావచ్చు. సాధారణంగా రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులకు వాడే మందుల వల్ల ఇలా జరిగే అవకాశముంది. అలాగే నొప్పుల నివారణ కోసం వాడే ఇబు్రపోఫెన్, డయాబెటిస్ను నియంత్రణలో ఉంచేందుకు వాడే పయోగ్లిటజోన్, స్టెరాయిడ్స్తో కాళ్ల వాపులు వచ్చినప్పుడు... పేషెంట్స్ ఏవైనా మందులు వాడుతుండటం వల్ల ఈ వాపు వచ్చిందా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ మందుల వల్లనే కాళ్ల వాపు వచ్చి ఉంటే తక్షణం వాటిని ఆపివేయడం, వాటిని ప్రత్యామ్నాయంగా వేరే మందులు ఇవ్వడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలెక్కువ.కారణం తెలియని కాళ్ల వాపులు... మహిళల్లో ముఖ్యంగా 30– 40 ఏళ్లు దాటిన వారిలో కాళ్ల వాపు సమస్య చాలా ఎక్కువ. కాలి వాపుతో పాటు ముఖం, చేతులు కూడా ఉబ్బి ఉండటం సాధారణంగా కనిపిస్తుంటాయి. దీనికి ఇదమిత్థంగా ఎలాంటి కారణం ఉండదు. అందువల్ల వైద్య చికిత్స చేయడం కూడా ముందుగా జరగదు. ఇలాంటి వారికి అన్ని సాధారణ పరీక్షలు చేసి... ఎలాంటి కారణం లేదని నిర్ధారణ చేశాక మాత్రమే కాలివాపునకు చికిత్స చేయడానికి డైయూరెటిక్స్ వాడుతుంటారు. ఇలాంటి వారు కాలి వాపు తగ్గడానికి ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి.సిరల (వెయిన్స్) సామర్థ్యలోపం వల్ల... రక్తాన్ని కాలు మొదలుకొని ఇతరత్రా దేహభాగాల నుంచి గుండెకు తీసుకెళ్లే రక్తనాళాలను సిరలు అని అంటారు. సాధారణంగా డీ–ఆక్సినేటెడ్ (ఆక్సిజన్ లేకుండా కార్బన్ డై ఆక్సైడ్తో కూడిన) రక్తాన్ని ఈ సిరలు వెనక్కు గుండెవైపునకు తీసుకెళ్తూ ఉంటాయి. మనలోని జీవక్రియల వల్ల కొన్ని కాలుష్యాలు వెలువడతాయి. ఆ కాలుష్యాలు కలిసిన రక్తమే చెడు రక్తం. ఉదాహరణకు నడక అనే ప్రక్రియలో... రక్తం కాలి సిరల నుంచి ఊపిరితిత్తులకు చేరి అక్కడ శుభ్రపడి మళ్లీ గుండె నుంచి ధమనుల ద్వారా మళీ కాళ్లకు సరఫరా అవుతుంది.కొన్ని సార్లు కాళ్లలోని సిరల సామర్థ్య లోపం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండిపోతుంది. అది పాదాల వాపు రూపంలో బయటపడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసేవారిలో లేదా ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య మరికాస్త ఎక్కువగా కనిపించవచ్చు. కాలివాపు కనిపించినప్పుడు అనుమానించాల్సిన కారణాలలో ఈ సిరల సామర్థ్య లోపం చాలా ప్రధానమైనదీ చాలా సాధారణమైనది కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ జబ్బు వచ్చే ముప్పు మరింతగా పెరుగుతుంటుంది. తొలి దశలో ఎక్కువ సేపు ప్రయాణం చేసినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది.ప్రధానంగా ప్రయాణాల సమయంలో సాయంత్రానికి కాళ్ల వాపు కనిపిస్తుంది. దీని వల్ల ఇబ్బంది లేకపోవడంతో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలెక్కువ. ఈ సమస్య ఉన్నవారిలో పిక్కల్లో కూడా నొప్పి అనిపించడం, కాళ్లు బరువుగా ఉన్నట్లు అనిపించడమూ జరుగుతుంది. క్రమంగా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగి ఉన్నట్లుగా చర్మంలోంచి బయటికి కనిపిస్తాయి. అవి పచ్చగా లేక నల్లగా కనిపిస్తుంటాయి. ఈ కండిషన్ను వేరికోస్ వెయిన్స్ అంటారు. తొలి దశలో కేవలం సాయంత్రాలు మాత్రమే కనిపించే ఈ సమస్య ఆ తర్వాత రోజంతా ఉంటుంది.కొందరిలో సెల్యులైటిస్ అనే కండిషన్లోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా వాపు వచ్చిన కారణంగా కాలు కాస్త మెరుపుతో కనిపిస్తుంది. దీనితో పాటు కాలి సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కనిపించే ‘డీప్ వీన్ థ్రాంబోసిస్ – (డీవీటీ)’ అనే కండిషన్లో కూడా కాలివాపు కనిపిస్తుంది. ఈ కండిషన్స్ అన్నింటి నిర్ధారణ కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి.సిరల సామర్థ్య లోపంవల్ల సమస్య వస్తే... ∙ ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవడం ∙ఎలాస్టిక్ స్టాకింగ్స్ వేసుకుని ఉండటం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలివాపు రాకుండా ఉంటుంది. స్టాకింగ్ వల్ల కాలిపై పడే ఒత్తిడి కారణంగా సిరలకు అది మంచి సపోర్ట్ అందడంతో పాటు ఈ కారణంగా సిరల్లో మళ్లీ రక్తం సులువుగా / సాఫీగా ప్రవహిస్తుంటుంది. ఒకవేళ సమస్యను ఈ దశలో నిర్లక్ష్యం చేయడం వల్ల అది ముదిరి వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధిగా పరిణమిస్తుంది. వ్యాధి బాగా ముదిరితే కాళ్లకు పుండ్లు పడే అవకాశమూ ఉంటుంది.జాగ్రత్తలు / ఫస్ట్లైన్ చికిత్స... కాళ్లవాపులు కనిపించినప్పుడు బాధితులు...చాలాసేపు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వాపు ఉన్న కాళ్లపై ఎలాస్టిక్ స్టాకింగ్స్ తొడగాలి. ఈ జాగ్రత్తలతో కాలివాపును నివారించవచ్చు.స్టాకింగ్ సిరలకు అది మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల క్రమేణా రక్తం సజావుగా ప్రవహిస్తుంటుంది.ఈ దశలో నిర్లక్ష్యం చేసి, సమస్య ముదిరి ‘వేరికోస్ వెయిన్స్’గా పరిణమిస్తే, కాళ్లకు పుండ్లు పడటం వంటి కాంప్లికేషన్లు కనిపించవచ్చు.అలాంటప్పుడు ఆయా లక్షణాలూ, కండిషన్లకు అనుగుణంగా రేడియాలజీ చికిత్స, శస్త్రచికిత్సలు చేయించాల్సిన అవసరం పడవచ్చు.చివరగా... కాళ్లు లేదా పాదాలలో వాపు రావడానికి ఉన్న కారణాలు తెలుసుకున్న తర్వాత... ఎప్పుడో, ఏదో సందర్భంలో అరుదుగా కాళ్లూ లేదా పాదాలలో వస్తున్న వాపులను మినహాయిస్తే... ఈ పాదాల వాపు తరచూ కనిపించడం మరీ ముఖ్యంగా ఏవైనా మందులు వాడుతున్నప్పుడో... ఏదైనా జబ్బు (అండర్ లైయింగ డిసీజ్) కారణంగా కాళ్ల వాపులు వస్తున్నాయేమో అని అనుమానం వస్తే... తక్షణం డాక్టరు / మెడికల్ స్పెషలిస్ట్కు చూపించుకుని, తగిన పరీక్షలు చేయించుకుని... అవి మామూలుగా వస్తే కాళ్లవాపులే అని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండవచ్చు. లేదా మరేదైనా కారణం వల్ల వచ్చే కాళ్లవాపులని తేలితే... తగిన చికిత్స చేయించుకుని... ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. - డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్నిర్వహణ : యాసీన్ -
అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ నియామకం
ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తమ సరికొత్త హెల్త్ టెక్ స్పిన్-ఆఫ్ (నూతన విభాగం) పునర్నిర్మాణంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి ఈ ప్రతిపాదిత పథకానికి తుది ఆమోదం లభించిన అనంతరం అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా శోభన కామినేనిని నియమించనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. కంపెనీ ప్రతిపాదిత విభజన, అపోలో హెల్త్ టెక్ లిస్టింగ్ (స్టాక్ మార్కెట్లో నమోదు), కార్పొరేట్ గవర్నెన్స్ (పాలనా ఫ్రేమ్ వర్క్)కు సంబంధించిన అదనపు వివరాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.12 మందితో బోర్డు ఏర్పాటుదీర్ఘకాలిక విలువ సృష్టి, పారదర్శకమైన పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ పునర్నిర్మాణ పథకంలో బలమైన అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించినట్లు అపోలో తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో హెల్త్ టెక్ బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉంటారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బోర్డులో సగం మంది (ఆరుగురు) స్వతంత్ర డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డులోని ప్రతి డైరెక్టర్ తమ విశ్వసనీయ విధులకు కట్టుబడి ఉంటారని, స్వతంత్ర డైరెక్టర్లు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ సమతుల్య నిర్ణయాలు తీసుకునేలా చూస్తారని కంపెనీ పేర్కొంది. నిబంధనలను పర్యవేక్షించేందుకు ఒక లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ను నియమించనున్నట్లు, బోర్డు వ్యవహారాలను క్రమానుగతంగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది.శోభన కామినేని నియామక నిబంధనలు, పదవీకాలం, వేతన ప్యాకేజీకి సంబంధించి వాటాదారుల అనుమతిని త్వరలోనే కోరనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, పాలనాపరమైన పారదర్శకత కోసం పెట్టుబడిదారు లేదా ప్రమోటర్ గ్రూప్ వాటా 10 శాతం కంటే తగ్గితే వారి నామినేషన్ హక్కులు ముగుస్తాయి.అప్సైడ్ అగ్రిమెంట్ వివరాలుఈ విలీన పథకంలో భాగమైన ‘అప్సైడ్ అగ్రిమెంట్’ గురించి వస్తున్న ఊహాగానాలకు అపోలో తెరదించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిధులను వ్యూహాత్మక పెట్టుబడిదారు రాస్మేలి (Rasmeley) మాత్రమే సమకూరుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల అపోలో హెల్త్ టెక్ నుంచి గానీ, దాని ప్రస్తుత వాటాదారుల నుంచి గానీ ఎటువంటి నగదు బయటకు వెళ్లదు.వ్యూహాత్మక పునర్నిర్మాణం లక్ష్యం ఇదే..అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చేపట్టిన ఈ భారీ విభజన, పునర్నిర్మాణ పథకం వెనుక స్పష్టమైన వ్యాపార వ్యూహం ఉంది. కంపెనీకి చెందిన సేవలను విడివిడిగా విభజించి (స్పిన్ ఆఫ్), విలీనం చేయడం ద్వారా స్వతంత్రంగా మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఓమ్నిఛానల్ రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పంపిణీ వ్యాపారం, డిజిటల్ హెల్త్ వ్యాపారం (Apollo 24/7 వంటి డిజిటల్ సేవలు) వంటి విభాగాలన్నింటినీ ‘అపోలో హెల్త్ టెక్’ గొడుగు కిందికి తెచ్చి ప్రత్యేకంగా వృద్ధి పథంలో నడిపించనున్నారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
జామ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
జామకాయలు అందరికీ సులభంగా దొరికే పండు. అలాగే ప్రతి ఇంటి పెరటిలో ఉండే మొక్క కూడా. అందుకే ఈ పండు అంటే మనకు చిన్న చూపు. జామకాయ అనగానే పైన వగరుగా ఉండే తొక్క, గింజలు పడేసి తింటుంటారు కొందరు. అంతేగాదు ఈ జామ గింజలు అరగవని, కడుపునొప్పి పట్టుకుంటుందని చెబుతుంటారు పెద్దలు. కానీ అదంతా అపోహేనని కొట్టిపారేస్తున్నారు ఐసిఎఆర్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆదర్శ గౌడ. అంతేగాదు అరుగుదల తక్కువగా ఉండి, సున్నితమైన జీర్ణ సంబంధిత వ్యాధులుంటే వైద్యులను సంప్రదించి ఈ పండు తినడం మంచిదన్నారు. కానీ చాలామటుకు జామపండు ఆరోగ్యానికి మంచిదేనని, ముఖ్యంగా గింజలు ఎక్కువ ఉండే జామకాయలు మరింత ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అసలు ఈ జామగింజలతో కలిగే లాభాలేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!జామగింజలు తినదగినవి, వాటిల్లోని పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. పండుతో సహా వీటిని ఎప్పుడైతే తింటామో..మొతం పీచు పదార్థం శరీరానికి అందతుంది. ఫలితంగా జీవక్రియ క్రమబద్ధతకు, పేగు ఆరోగ్యానికి, కడుపు నిండిన భావన వంటి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.కలిగే లాభాలు..జామ గింజల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, తక్కువ మొత్తంలో ఒమేగా-3, ఒమేగా -6 కొవ్వుల తోపాటు విటమిన్ ఈ, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గింజలను నలపడం లేదా నమలడం వల్ల వాటిలో దాగిఉన్న పోషకాలు నేరుగా విడుదల కావడానికి సహాయపడతాయట. తద్వారా జీర్ణక్రియ(అరుగుదల) సమయంలో అవి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల తోపాటు పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది మలానికి బలాన్ని చేకూర్చి జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలడానికి సహాయపడుతుందనట. అలాగే ఈ పండులో విటమిన్ సీ, లైకోపీన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయట. అందువల్ల జామ అందుబాటులో ఉన్న అత్యంత పోషక-సాంద్రత కలిగిన ఉష్ణమండల పండ్లలో ఒకటిగా పేర్కొటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గింజలు గట్టిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా పండులో ఉన్న ఈ భాగాన్ని నిరంభ్యంతరంగా తినవచ్చుని చెబుతున్నారు నిపుణులు. వీటిలో పోషక విలువలు తక్కువగానే ఉండవచ్చు, కానీ వాటిని పారేయడం వల్ల విలువైన పీచుపదార్థం, సహజంగా లభించే ఫైటోన్యూట్రియెంట్లను కోల్పోయినట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.అందుకే గింజలను ఉమ్మివేయడానికి బదులుగా, పండిన జామకాయను తినేటప్పుడు వాటిని బాగా నమలండి లేదా అదనపు పీచుపదార్థం, ప్రయోజనకరమైన కొవ్వుల కోసం పండు మొత్తాన్ని స్మూతీస్లో కలుపుకోని తినమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..) -
90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..
బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు. ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్ హీర్ కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు. మరి ఆర్యన్ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!.సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో కార్తిక్ ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ. గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు. ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్లాస్ కోసమే ఆర్యన్ బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది. ఆయన ఫిట్నెస్ శిక్షణ అందించిన త్రిదేవ్ పాండే సైతం నిజమైన బాక్సర్ అనుసరించే శిక్షణా విధానాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నెలల తరబడి కఠినమైన క్రమశిక్షణ, నిరంత కృషి ఉందన్నారు. అయితే ఆయన మొదట్లో ఒక్క పుష్ అప్ కూడా చేయలేకపోయారని, కానీ క్రమంగా వీపుపై 50 నుంచి 60 కేజీల అదనపు బరువుతో వాటిని చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అతని స్కిప్పింగ్ కూడా మెరుగపడింది. ప్రాథమిక ఫుట్వర్క్తో ఇబ్బందుల నుంచి సుమారు 14 నుంచి 15 ఇతన ఆధునతాన జిమ్ వర్కౌట్లు చేసే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు అనుకున్నట్లుగానే 14 నెలల్లో 18 కేజీలు తగ్గి అద్భుతంగా కనిపించడమే కాదు, ఆ పాత్రకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలందుకున్నారు కార్తీక్ ఆర్యన్. చెయ్యాలి అని బలంగా అనుకుంటే..ఎన్ని కష్టాలకైనా ఓర్చి..అనుకున్నది సాధిస్తాం అనేందుకు హీరో కార్తీక్ ఆర్యన్నే ఉదాహరణ. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అనుసరించడం ఉత్తమం. (చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..
మా బాబుకు రెండేళ్లు. పేరు పిలిచినా చాలాసార్లు తిరిగి చూడడం లేదు. సరిగ్గా ఆడుకోవడం లేదు. మాటలు కూడా సరిగా రావడం లేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇవన్నీ ఆటిజం లక్షణాలా? నాకు చాలా ఆందోళనగా ఉంది. – రాము, ఒంగోలు.ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆటిజం అనేది తల్లిదండ్రుల తప్పు వల్ల వచ్చే సమస్య కాదు. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం’ అనేది మాత్రం చాలా నిజం. సాధారణంగా ఆటిజం లక్షణాలు 9 నుంచి 12 నెలల వయస్సు నుంచే కొద్దికొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది.అయితే చాలామంది పిల్లల్లో 18 నుంచి 24 నెలల మధ్య స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే మొదటి వెయ్యి రోజులు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలోనే ముందస్తు చికిత్స లేదా థెరపీ ప్రారంభిస్తే పిల్లల్లో భాష, సామాజిక నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలలో ఆటిజం లేదా అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడే తొమ్మిది సింపుల్ స్క్రీనింగ్ ప్రశ్నలు ఉన్నాయి. అవే ఇవీ.. 1. పేరు పిలిచినప్పుడు తిరిగి చూస్తాడా?2. కంటి చూపు బాగా కలుపుతాడా?3. నవ్వు లేదా ముఖభావాలకు స్పందిస్తాడా?4. కావాల్సిన వస్తువును చూపించి అడుగుతాడా?5. చేతితో బైబై లేదా ఇతర సంకేతాలు చేస్తాడా?6. ఇతర పిల్లలతో లేదా పెద్దలతో కలవాలనే ఆసక్తి ఉందా?7. మాటలు లేదా శబ్దాల అభివృద్ధి వయస్సుకు తగ్గట్టుగా ఉందా?8. ఒకే పని లేదా అలవాటు పదేపదే చేస్తూ ఉంటాడా?9. నేర్చుకున్న మాటలు లేదా సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయాయా?ఈ ప్రశ్నల్లో ఏదైనా ఆందోళన కలిగిస్తే ‘ఇంకొంచెం పెద్దవాడైతే సర్దుకుంటాడు’ అని ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా అభివృద్ధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.ఆటిజంను పూర్తిగా నివారించే కచ్చితమైన పద్ధతి లేదు. ఎందుకంటే దీనికి ఒకే ఒక్క కారణం ఉండదు. అయితే పిల్లల మెదడు ఆరోగ్యకర అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, అయోడిన్ వంటి పోషకాలు సరిపడా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలకు టీకాలు సమయానికి వేయించాలి. టీకాలు ఆటిజం కలిగిస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ కూడా తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడటం, ఆటలు ఆడించడం వల్ల మెదడు అభివృద్ధికి చాలా మంచిది. ఆటిజంను ముందుగానే గుర్తించడం అంటే పిల్లలకు ఒక ‘లేబుల్’ వేయడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు సరైన సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. తల్లిదండ్రుల గమనికే పిల్లల మొదటి రక్షణ. - డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
వృక్షాసనం.. ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం!
వృక్షాసనం అంటే ‘చెట్టు భంగిమ‘ అని అర్థం. ‘వృక్షాసనం మనకు చెట్టు వంటి స్థిరత్వం, సమతుల్యత, ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం. ‘వృక్షాసనం అనేది ఒక కాలి మీద నిలబడి, శరీర సమతుల్యతను కాపాడుకునే యోగాసనం. చెట్టు మాదిరిగా స్థిరంగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 4–6 గంటల వ్యవధి తర్వాత ఈ ఆసనం వేయడం అత్యంత శ్రేయస్కరం.వృక్షాసనం చేసే విధానం..యోగా మ్యాట్పై నిలబడి, రెండు కాళ్లను దగ్గరగా ఉంచండి. ఇప్పుడు కుడి కాలిపై నిలబడి, శరీర బరువును బ్యాలెన్స్ చేయండి.ఎడమ మోకాలిని వంచి, ఎడమ పాదాన్ని కుడి కాలి తొడ లోపలి భాగానికి (తొడమూలానికి వీలైనంత దగ్గరగా) గట్టిగా ఆన్చండి. రెండు చేతులను నెమ్మది గా పైకి లేపి, నమస్కార ముద్రలో అరచేతులను కలపాలి.ముందు భాగంలో ఏదైనా ఒక వస్తువుపై దృష్టిని కేంద్రీకరిస్తూ, శ్వాసను సాధారణంగా తీసుకుంటూ 10–20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.ఇదే పద్ధతిని కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచి మరోవైపు రిపీట్ చేయాలి..ప్రయోజనాలు..విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది, మనో నిబ్బరం, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.కాళ్లు, చీలమండలు, వెన్నెముక దృఢంగా మారతాయి.నాడీ వ్యవస్థకు ప్రశాంతత చేకూరుతుంది.నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.శరీరం బ్యాలెన్స్, స్టెబిలిటీ పెరుగుతాయి.జాగ్రత్తలు..తీవ్రమైన మైగ్రేన్, అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉంటే ఈ ఆసనం వేయకూడదు.నిద్రలేమి సమస్య ఉన్నవారు దీనిని నిపుణుల సమక్షంలోనే చేయాలి.మోకాళ్లు, తుంటి లేదా మెడకు సంబంధించిన సర్జరీలు అయినవారు ఈ ఆసనాన్ని వేయరాదు.మొదటిసారి చేసేవారు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి గోడ సపోర్ట్ తీసుకోవచ్చు లేదా కుర్చీని పట్టుకుని చేయవచ్చు.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
నేరేడు పండ్లు తింటున్నారా?
నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆయుర్వేద పరంగా అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే నేరేడు పండ్లు తీసుకోకూడదో తెలుసుకుందామా.!.నేరేడు పండ్లు ఇపుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు, అందరికీ మేలు చేయకపోవచ్చు. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. అయితే, డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు వీటిని అధికంగా తీసుకుంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, కంగారు, గుండె వేగం పెరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పండ్లలో సహజంగానే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రంలోని క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు నేరేడు పండ్లను పరిమితంగానే తినాలి. నేరేడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదే. కానీ, ఒకేసారి వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు రావచ్చు. ∙ఈ పండ్లను అతిగా తింటే బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల గర్భిణులు నేరేడు పండ్లను తినే ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. అలర్జీ హిస్టరీ ఉన్నవారు ఈ పండును మొదటిసారి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి నేరేడు పండ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది. -
బరువు తగ్గాలంటే.. మోయాలంతే!
స్మార్ట్ ఉండాలంటే ఆలోచిస్తే సరిపోదు.. ఫిట్గా కూడా ఉండాలి. అలాంటప్పుడే బ్రెయిన్ బాగా పని చేస్తుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఫిట్సెస్ సెంటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామాల్లో కూడా కొత్త విధానాలొచ్చేస్తున్నాయి. జిమ్, ఏరోబిక్స్, యోగా లాంటివి..కాని ఇవ్వన్నీ కామన్.. ఇప్పుడు కొత్తరకం ఫిట్నెస్ మంత్ర వచ్చింది అదే ‘రక్కింగ్’.కొత్త ఫిట్నెస్ ట్రెండ్ ఇప్పుడు బాగాప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో ఒక నిర్దిష్ట బరువున్న వెస్ట్ను లేదా బ్యాక్ప్యాక్ను ధరించి నడస్తూ వెళ్లాలి. అలా అనుకున్న టార్గెట్ వరకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఒకసారి టార్గెట్ పూర్తయ్యాక నడకలో కాస్త వేగాన్ని పెంచాలి. అమెరికా, యూరప్లలో ఇప్పటికే ఈ పద్ధతిని లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఈ రక్కింగ్ వల్ల కాళ్ల కండరాలు రక్తప్రసరణ జరిగి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. వాస్తవానికి ఇదేం కొత్త పద్ధతేం కాదు.. మిలటరీ శిక్షణలో భాగంగా సైనికులకు తుపాకీ, బ్యాక్ప్యాక్ ఇచ్చి నడిపిస్తారు. ఈ పద్ధతినే జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి కొత్తరకం ఫిట్నెస్ సూత్ర అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని ఊబకాయంతో బాధపడేవారికి మాత్రం ఈ రక్కింగ్ పద్ధతే కరెక్ట్... పైగా రక్కింగ్ చేయడానికి జిమ్లకు, యోగా క్లాసులకు వెళ్లక్కర్లేదు. ఎవరైనా ఇంట్లో ఉంటూ రక్కింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. -
జెన్జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు
నిన్నటివరకు కేవలం గాడ్జెట్లు, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఎంపికలకే పరిమితమనుకున్న ‘జెన్-జీ’ వినియోగదారుల ప్రభావం.. ఇప్పుడు ఫుడ్ బ్రాండ్లకు పాకింది. దశాబ్దాల చరిత్ర గల ప్రముఖ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు సైతం ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోక తప్పడం లేదు. కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, ప్రొడక్ట్ లేబులింగ్, సరికొత్త ఉత్పత్తుల రూపకల్పన.. ఇలా ప్రతి నిర్ణయాన్నీ ఈ తరం యువ వినియోగదారులే శాసిస్తున్నారని పరిశ్రమవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.దేశీయ వినియోగంలో 35 శాతం వీరిదే!ఇప్సోస్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఫుడ్ వినియోగ వ్యయంలో దాదాపు 35 శాతం వాటా 15 నుంచి 20 ఏళ్ల పైబడిన జెన్-జీ యువతదే. ఆరోగ్యం, డిజిటల్ పరిజ్ఞానం, పర్యావరణ స్పృహ వంటి అంశాలే వీరి ఎంపికలను నిర్ణయిస్తున్నాయి.లేబుల్స్ చదువుతున్నారు.. ప్రశ్నిస్తున్నారు!ఒకప్పుడు బ్రాండ్ పేరు చూసి వస్తువులు కొనేవారు. కానీ నేటి తరం ఆలోచనా విధానం వేరుగా ఉంది. దీనిపై ఎమ్టీఆర్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘కాలేజీకి వెళ్లే నా కుమారుడు, అతని స్నేహితులు ఏ ప్రొడక్ట్ కొన్నా.. బ్రాండ్తో సంబంధం లేకుండా వెనుక వైపు ఉన్న లేబుల్ను నిశితంగా పరిశీలించడం స్వయంగా చూశాను. నేను మార్కెట్ విజిట్స్కి వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గమనిస్తుంటాను. యువ వినియోగదారులు షాపింగ్ మాల్స్లో నిలబడి లేబుల్స్ను పోల్చి చూస్తూ ఆ ప్రొడక్ట్లో ఏమేం పదార్థాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. బ్రాండ్లు చెప్పే మాటలను నమ్మడం లేదు. చదువుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఆపైనే నిర్ణయం తీసుకుంటున్నారు’ అని విశ్లేషించారు.ఫ్యూచర్-రెడీ దిశగా దిగ్గజ కంపెనీలుయువతను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా మారిపోతున్న ట్రెండ్ను మారికో ఎండీ సౌగతా గుప్తా వివరిస్తూ.. ‘మేము ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు సంస్థను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలంటే.. మా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కచ్చితంగా జెన్-జీ, మిలీనియల్స్ అభిరుచులకు అనుగుణంగా ఉండాలి’ అన్నారు. ఇందుకు తగ్గట్టుగానే, మారికో సంస్థ కేవలం మూడు వారాల వ్యవధిలోనే యువతను టార్గెట్ చేసే మూడు డైరెక్ట్-టు-కన్స్యూమర్ బ్రాండ్లను దాదాపు రూ.800 కోట్లతో కొనుగోలు చేసింది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..అంశంశాతం తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలనుకుంటున్న జెన్-జీ యువత79%అరోగ్యం కోసం జీవనశైలిలో గణనీయమైన మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నవారు83%2022 - 2025 మధ్య కాలంలో భారతదేశంలో ప్లాంట్-బేస్డ్ (మొక్కల ఆధారిత) ఫుడ్ ఇండస్ట్రీ సాధించిన వృద్ధి19% -
Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇవే మేలు!
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారిపోవడం, కాంతి విహీనంగా మారడం సహజం. అయితే మార్కెట్లో దొరికే కెమికల్ప్రొడక్ట్స్ కంటే, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వాటితోనే చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి ఓట్మీల్, హనీ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన ఎక్స్ఫోలియేటర్. ఓట్స్ను పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి స్క్రబ్ లాగా అప్లై చేయాలి. ఇది చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేయడమే కాకుండా, తేనెలోని గుణాలు చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి.ముఖానికి తక్షణ మెరుపును ఇవ్వడానికి పసుపు, కాఫీతో పాటు తేనె కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా, చర్మానికి మంచి తాజాదనాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన లుక్ను అందిస్తుంది.చాలామంది అరటిపండు తొక్కను పారేస్తుంటారు. కానీ, అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై మెల్లగా రుద్దడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది ముఖానికి ఇన్స్టంట్గా ఒక సహజసిద్ధమైన మెరుపును ఇస్తుంది. -
ఆ నటుడికి అరుదైన బ్రెస్ట్ కేన్సర్..!ఎందువల్ల వస్తుందంటే..
రొమ్ము కేన్సర్ అంటే మహిళలకే వస్తుందని అనుకుంటారు. కానీ పురుషులకు కూడా వస్తుందట. అయితే పురుషుల్లో ఇది అత్యంత అరుదు. మరి మగవాళ్లలో ఈ కేన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?, ఎందువల్ల వస్తుంది?, నివారణ చర్యలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్, టైలర్ మానేకు బ్రెస్ట్ కేన్సర్ ఉన్నట్లు వైద్యులు ఇటీవలే నిర్థారించారు. అందుకోసం కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కూడా తెలిపారు. 59 ఏళ్ల హీరో పురుషుల రొమ్ము కేన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుక్చొఆరు. అవును నాకు బ్రెస్ట్ కేన్సర్ ఉంది. ఇది చాలా అరుదైనది, పైగా ఇది 1% మంది మగవాళ్లే ఈ సమస్య బారిన పడతారట. నిజం చెప్పాలంటే మొదట బహిరంగంగా మాట్లాడాలనుకోలేదు. కానీ తర్వాత నాకు తెలిసిందేంటంటే..దీని గురించి మాట్లాడకపోవడం, దీనికోసం తెలుసుకోకపోవడం వల్లే పురుషులలో ఈ వ్యాధి చాలామటుకు లాస్ట్ స్టేజ్లో నిర్థారిస్తున్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. డాక్టర్లంతా కొట్టిపారేసినా..నా భార్య ఆ గడ్డను తొలగించుకోమని ఒత్తిడి చేయడంతోనే ముందుగానే చికిత్స తీసుకుంటున్నా. ప్రతి 755 మంది పురుషులలో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము కేన్సర్ నిర్థారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీన్ని ముందుగానే గుర్తింస్తే..చికిత్స చేయడం సులభం. అందువల్ల ఇకనైనా మేల్కోవాలి, తక్షణమే స్పందించాలి అని పిలుపునిచ్చారు.పురుషుల రొమ్ము కేన్సర్ అంటేరొమ్ము కణజాలంలోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగి కణితిగా ఏర్పడినప్పుడు పురుషులలో రొమ్ము కేన్సర్ వస్తుంది. పురుషులకు రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది, అంటే అక్కడ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ ఇది మహిళలతో పోలిస్తే తక్కువ.కేన్సర్ లక్షణాలుప్రారంభ సంకేతాలను గుర్తించడం సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సకు సహాయపడుతుంది.కొన్ని సాధారణ లక్షణాలు:రొమ్ములో గడ్డ లేదా వాపురొమ్ము కణజాలం గట్టిపడటంరొమ్మును కప్పి ఉంచే చర్మంలో మార్పులు, ఎరుపు లేదా గుంటలు పడటం వంటివిచనుమొన నొప్పి లేదా సున్నితత్వంలోపలికి తిరిగిన చనుమొనచనుమొన నుండి స్రావం, కొన్నిసార్లు రక్తంతో కూడి ఉండవచ్చుచంక కింద శోషరస గ్రంథులు వాపునిరంతర పుండ్లు లేదా చనుమొనల చుట్టూ మార్పులుపురుషులు తమ ఛాతీ లేదా రొమ్ము ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ గడ్డ నొప్పిలేకుండా ఉన్నప్పటికీ, దానిని ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.పురుషులలో రొమ్ము కేన్సర్కు ప్రమాద కారకాలుఅనేక కారకాలు పురుషులలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వాటిలో ఇవి ఉన్నాయి:వయస్సు పెరగడం: చాలా కేసులు 60 ఏళ్లు పైబడిన పురుషులలో నిర్ధారణ అవుతాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది.కుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము క్యాన్సర్ ఉన్న పురుషులకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యు మార్పులు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.జన్యు మార్పులు: కొన్ని జన్యువులలో, ముఖ్యంగా BRCA2 జన్యువులో మార్పులు, పురుషులలో రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.హార్మోన్ల అసమతుల్యత: ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం రొమ్ము కేన్సర్ అభివృద్ధికి దోహదపడవచ్చు.స్థూలకాయం: శరీరంలో అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, ఇది ప్రమాదాన్ని పెంచవచ్చు.కాలేయ వ్యాధి: సిర్రోసిస్ వంటి పరిస్థితులు హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి, కేన్సర్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి.రేడియేషన్ ప్రభావం: గతంలో ఛాతీ ప్రాంతానికి రేడియేషన్ చికిత్స చేయించుకోవడం వల్ల.. రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరగవచ్చు.నివారణరొమ్ము కేన్సర్ను పూర్తిగా నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కానప్పటికీ, కొన్ని జీవనశైలి ఎంపికలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రమాదం.అధిక బరువు ఉండటం అనేది అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడతాయి.అధికంగా మద్యం సేవించడం వల్ల రొమ్ము కేన్సర్తో సహా అనేక కేన్సర్ల ప్రమాదం పెరగవచ్చు.క్రమం తప్పని శారీరక శ్రమ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న పురుషులు తమ ప్రమాదం గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో చర్చించాలి. కొన్ని సందర్భాల్లో, జన్యుపరమైన కౌన్సెలింగ్ సిఫార్సు చేయవచ్చు కూడా.క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సత్వరమే సమస్యను గుర్తించడానికి సహాయపడతాయి. రొమ్ము మార్పుల గురించి అవగాహన పెంచుకోవాలి. పురుషులు తమ ఛాతీ ప్రాంతంలోని సాధారణ స్వరూపం, స్పర్శ గురించి తెలుసుకోవాలి. ఏవైనా గడ్డలు, వాపు లేదా చనుమొనలలో మార్పులను ఆలస్యం చేయకుండా వైద్యుడికి తెలియజేయడం వలన ముందుగానే ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Tyler Mane (@therealtylermane)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్) -
ఎనిమిది వారాల్లో కాలేయ మార్పిడి రోగులు కోలుకుంటున్నారు..
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకన్న చేయించుకున్న వారు ఎనిమిది వారాల్లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. ప్రపంచ అవయవ ట్రాన్స్ప్లాంట్ డే వేడుకలను ఆయన బంజారాహిల్స్లోని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్లో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా ఆయన 1995లో అయవవ దానంతో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ చట్టం తీసుకొచ్చిన నాటి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాజీ ఏఐఎస్ ఏపీవీఎన్ శర్మతో పాటు లివర్ దాతలను, కాలేయ గ్రహితలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మందికి ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నాయని 30 శాతం ఫ్యాటీ లివర్ కేసుల్లో మాత్రమే ఆల్కహాల్ వల్ల సంభవిస్తాయని 70 శాతం కేసుల్లో జన్యుపరంగా, డయాబెటిస్, ఒబేసిటి కారణాలు ఉంటాయని అన్నారు. ఫ్యాటీ లివర్ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని లివర్ సిరోసిస్గా మారి వ్యాధి ముదిరితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అవయవ దానంపై ఎంతో అవగాహన పెరుగుతుందని ప్రతియేటా దేశంలో 2లక్షల మందికిపైగా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నారని అయవవ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సల్లో మన దేశంలో ప్రపంచంలోనే అయిదో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. -
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్ నుంచి ఫిట్గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్ లేకపోతే ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్నుంచి ఫిట్గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంతలోనూ ఊహించని ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.అల్ట్రామారథాన్కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్ల సమయంలో ట్రాక్పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా, ఏళ్లుగా గుర్తించడని పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది. 40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.బయటకు ఎంతో ఫిట్గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్కు దారితీయవచ్చు.40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం. పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్ను ముందే గుర్తించవచ్చు.వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదుకొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.మరి ఏం చేయాలి?40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరివారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది. ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్ -
గంటలతరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!
ఆధునిక యుగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తుల్లో కొంతమంది గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే 'సిట్టింగ్ డిసీజ్' అని పిలుస్తున్నారు. ఈ సిట్టింగ్ డిసీజ్ ఇతర రోగాలకన్న ప్రమాదకరమైనది. చాపకింద నీరులా.. అనారోగ్య సమస్యల్ని మరింత తీవ్రం చేస్తుంది.ఆరోగ్య సమస్యలు..ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నెముకపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నడుము, మెడ నొప్పులు వస్తాయి. అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు ఖర్చు కాక స్థూలకాయానికి దారి తీస్తుంది. రక్తప్రసరణ మందగించి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు స్క్రీన్లను నిరంతరం చూడటం వల్ల కళ్లు పొడిబారడం, తలనొప్పి అదనంగా వచ్చే అనారోగ్య సమస్యలు.అయితే, ఎంత సేపు కూర్చుంటే, ఎంత ప్రమాదం ఉంటుందనే విషయంలో కొన్ని లెక్కలు చెబుతున్నారు నిపుణులు.రోజుకి 4 గంటలోపు కూర్చుంటే.. ప్రమాద తీవ్రత కాస్త తక్కువే ఉంటుందట.అదే 4 - 8 గంటలు కూర్చోవడంతో మధ్యస్థ ప్రమాదంగా చెప్పవచ్చు.8- 11 గంటలు పాటు కూర్చోవడంతోనే మరింత ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుందంటున్నారు.రోజుకి 11 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చోవడం అంటే ప్రమాదం అంచున ఉన్నట్టే. ఎంతలా అంటే.. హఠాత్తుగా గుండెపోటు రావడం, పక్షవాతం, శరీరం చలించకపోవటంవంటి సమస్యలు వస్తాయి.ఈ ప్రమాదంనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కనీసం వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ చూడటం ఆపాలి. 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూడటం వల్ల కంటి రెటినా పొర చల్లబడుతుంది.చిన్న విరామాలు: ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు సీటు నుండి లేచి నడవాలి. దాంతో శరీర కండరాల్లో కదలిక వల్ల రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది.సరైన భంగిమ: వెన్నుముక నిటారుగా ఉండేలా కుర్చీలో కూర్చోవాలి. వెన్నుముక వంపుగా ఉంచి.. కుర్చీని ఆనుకుని ఉండటం వల్ల శరీరం మొద్దుబారి, మెదడు నిద్దురను కోరుకుంటుంది.స్క్రీన్ ఎత్తు: కంప్యూటర్ మానిటర్ మన కంటి ఎత్తుకు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. దీంతో మెడ కండరాల్లో నొప్పి రాకుండా ఉంటుంది.శారీరక వ్యాయామం: మెడ, చేతులు అలాగే నడుమును క్రమంగా స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి. కదలకుండా కూర్చోవడంతో శరీర కండరాలు తిమ్మిరెక్కి, రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది.హైడ్రేషన్: పని మధ్యలో తగినంత నీరు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. -
అదే తలమానికం.. మార్చుకోకండి!
మన తలపై ఉండే ఉపరితల భాగమైన మాడును ఇంగ్లిష్లో స్కాల్ప్ను అంటారన్నది తెలిసిందే. నిజానికి మాడు అంటే అదో దేహ భాగం అనుకునేందుకు అవకాశముంది. కానీ అది సరికాదు... ఇంగ్లిష్లో పేరు పెట్టిన ఆ యాక్రొనిమ్కి విస్తృతార్థం ఉంది. ఇంగ్లిష్ స్కాల్ప్ స్పెల్లింగ్లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాల్లో... ‘ఎస్’ అంటే స్కిన్ అనీ, ‘సీ’ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ‘ఏ’ అంటే ఎపోన్యూరోటికా అనీ, ‘ఎల్’ అంటే లూజ్ ఏరియోలా అనీ, ‘పీ’ అంటే పెరియాస్టియమ్ అని అర్థం. ఆ ఐదు అక్షరాలూ కలిసి ‘స్కాల్ప్’గా ఏర్పడ్డాయని ఈ పదాల వల్ల తెలుస్తుంది. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలుకొని... ‘పి’ అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక వరకు వరసగా ఉంటే పొరల తాలూకు ఇంగ్లిష్ పేర్లతో ఈ ‘స్కాల్’ అనే ఇంగ్లిష్ పదం ఏర్పడింది. మాడు అనే స్కాల్ప్ సంరక్షణ ఎలాగో తెలుసుకుందాం...మాడును వెంట్రుకలు కప్పేసి ఉంచి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ వెంట్రుకలు దట్టంగా ఉన్నవారిలో ఎండకూ, వెలుతురుకూ అడ్డు పడటం ద్వారా అక్కడ పుట్టే చెమట తాలూకు తేమ వాతావరణం కొన్ని సూక్ష్మజీవులు పెరిగే వాతావరణాన్ని కల్పించడం వల్ల దురద రావడం వంటి నలుగురిలో ఇబ్బంది పెట్టే లక్షణాలూ కనిపించవచ్చు. అలాగే ఎండ వల్ల కూడా మాడుపై కొన్ని అనర్థాలూ కనిపించవచ్చు. ఆ అనర్థాలూ, నష్టాలూ ఎలా వస్తాయో చూద్దాం.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మాడుకు కలిగే అనర్థాలేమిటంటే...మానవ దేహం మీద మిగతా చర్మంతో పోలిస్తే మాడు మీద ఉండేవీ... నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. ఈ నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అని పిలుస్తారు, అలా స్రవించే నూనెను సీబమ్ అంటారు. ఈ సీబమ్ ఎప్పుడూ స్రవిస్తూ ఉన్నప్పటికీ ఎంత తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువగా సీబమ్ స్రవిస్తుంటుంది. దానికి తోడు మిగతా చర్మం కంటే మాడులో ఈ సెబేషియస్ గ్రంథులు పది రెట్లు ఎక్కువ కావడం వల్ల స్రావాల పరిమాణం కూడా బాగా పెరురుగుతుంది. దాంతో చర్మం త్వరగా జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.చర్మంలో ప్రధానంగా మూడు రకాలుంటాయి. అవి... 1. పొడి చర్మం (డ్రై స్కిన్)2. సాధారణ చర్మం (మాడరేట్ స్కిన్)3. జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్)పైన చెప్పిన నేపథ్యంలో జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో సీబమ్ మరింత ఎక్కువగా స్రవిస్తుంటుంది. దాంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో తల మరింత జిడ్డుగా మారడం చాలా సాధారణం. దానికి తోడు చర్మంపై చెమట పట్టే గుణం ఎక్కువగా ఉన్నవారిలో తల మరింత జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.జిడ్డు చర్మంపై చుండ్రు ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే...‘మలసేజియా’ అనే ఒక రకం ఫంగస్ పెరగడానికి మన తలపైన ఉండే మాడు చాలా అనువైన ప్రదేశం. ఆ మలసేజియా ఫంగస్ అనేది ఈ ‘సీబమ్’ను ఆహారంగా తీసుకుంటుంది. దాంతో సీబమ్ ఎక్కువగా స్రవించేవారిలో మలజేజియా పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది అదే చుండ్రు పెరుగుదలకు కారణమవుతుంది. దానికి తోడు తలమీద ఫంగస్ మరింతగా పెరిగిపోతే అది ‘సెబోరిక్ డర్మటైటిస్’ అనే చర్మవ్యాధికి కారణమై... చర్మంపై నుంచి జిడ్డు పొడిబారినప్పుడు అది పొట్టుగా రాలుతుంటుంది. అందుకే మాడుపైన ఈ తరహా పెరుగుదల ఉన్నవారి తలలో దురదగా ఉండటం, గీరినప్పుడు పొట్టు రాలుతుండటంతో నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతుంటారు.ఫాలిక్యులైటిస్ వంటి సమస్యలు కూడా... మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించడంతో పాటు కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి చెమట ఎక్కువగా పడుతుండటం, దానికి తోడు జుట్టు దట్టంగా ఉండేవారిలో ఈ చెమట కారణంగా తలలో చెమ్మ వాతావరణం ఏర్పడి... అక్కడ మరికొన్ని రకాల బ్యాక్టీరియా కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటి కారణంగా కొందరిలో రోమాంకురాలకు (హెయిర్ ఫాలికిల్స్కు) ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ సమస్యనే వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా కనిపించే కురుపులు, గుల్లలు) వస్తుంటాయి. వాటి వల్ల తీవ్రమైన నొప్పి, విపరీతమైన దురద రావచ్చు. ఈ పరిస్థితి కూడా ఆ వ్యక్తుల్ని నలుగురిలో మెలగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేలా చేస్తుంది.ఎలా దువ్వుకోవడం అన్నది మాడుకు మంచిదంటే...జుట్టు రాలకుండా ఉండటంతో పాటు మాడు ఆరోగ్యం బాగుండాలంటే జుట్టు దువ్వుకునే సమయంలో ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం మేలు.తల మీద ఉన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగితే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు త్వరగా రాలిపోకుండా ఉంటుంది. ఇందుకోసం పరిశుభ్రమైన మంచి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది.జుట్టును పాయలు పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల మొదలు దగ్గర నుంచి చివర్ల వరకు జుట్టును దువ్వాలి. ఇందుకు మరీ సన్నటి పళ్లు ఉన్న దువ్వెన కంటే కాస్తంత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వడమే మంచిది. సన్నటి పళ్ల దువ్వెన వల్ల జుట్టును లాగినట్టుగా ఉంటుంది. కాస్త వెడల్పాటి పళ్లున్న దువ్వెన వల్ల రోమాంకురాలకు అంతగా నష్టం ఉండదు. జుట్టును ఇలా పాయలు పాయలుగా విడదీసే సమయంలో మాడుపై వెలుగూ వెలుతురూ ఎక్కువగా ప్రసరించడం వల్ల చుండ్రు పెరిగే వాతావరణానికి భంగం కలిగి చుండ్రు అంతగా పెరగదు. దీనికి తోడు ఇలా దువ్వడం వల్ల తలలో దుమ్ము తగ్గి అది మాడుకు మేలు చేస్తుంది.మాడు సంరక్షణ కోసం ఆహారపరమైన జాగ్రత్తలివి...మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, ప్రోటీన్లు, ఖనిజలవణాలతో పాటు తాజా పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ, తగినన్ని ద్రవాహారాలూ, నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభించడంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. దాంతో సాధారణ ఆరోగ్యం బాగుండటంతో పాటు... మాడుకు వచ్చే అనేక సమస్యలూ నివారితమవుతాయి.ప్రతిరోజూ రెండు లీటర్లకు తగ్గకుండా లేదా కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగుతూ ఉండడటం వల్ల మాడు మీద ఏర్పడుతుండే మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దాంతో మాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే తప్పనిసరి అయినప్పుడు వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.మాడు విషయంలో డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలంటే...ఈ కింద పేర్కొన్న లక్షణాలలో ఏదైనా కనిపిస్తే మాడుకు ఏదైనా సమస్య వచ్చినట్లు గ్రహించి తక్షణం డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఆ లక్షణాలేమిటంటే...మాడు మీద దురద విపరీతం వస్తూ మరింతగా పెరుగుతూ పోతుండటంఎండలోకి వెళ్లగానే దురద మరింతగా పెరగడంమాడుపైన ఎర్రగాగనీ లేదా చీముతో కూడిన కురుపులు కనిపించడంమాడు మీద తెలుపు లేదా గ్రే కలర్లో పెచ్చులు వస్తున్నప్పుడుఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జుట్టు మరింతగా రాలిపోతుండటం.అపోహలూ... వాస్తవాలుమంచి షాంపూతో తల స్నానం చేశాక ఎండలోకి వెళ్తే జుట్టు బాగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంటుందనీ, అలాగే ఎండ నుంచి రక్షించుకోడానికి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందనే అపోహలు చాలామందిలో ఉంటాయి. అవెంతవరకు వాస్తవమో చూద్దాం.ఎండవేడిమిలో జుట్టు ఆరబెట్టుకుంటే సూర్మరశ్మి కారణంగా వెంట్రుకలు మెరిసిపోతూ జుట్టు అందం ఇనుమడిస్తుందా?ఇది చాలామందిలో ఉండే అపోహే. మంచి షాంపూతో తలస్నానం చేశాక... కాసేపు మంచి ఎండలో వెంట్రుకలను ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు బాగా మెరుస్తూ కనిపిస్తుందని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి జుట్టుపై ఎండ తీవ్రత నేరుగా పండటం అంత మంచిది కాదు. నేరుగా వెంట్రుకలపై పడే ఎండ తీవ్రత వాటిని డల్గా మార్చేసేందుకు అవకాశాలెక్కువ. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే... ఎండ సమయంలో వెంట్రుకలకు రక్షణగా గాలి ఆడుతూ ఉండే బ్రిమ్ హ్యాట్ లేదా క్యాప్ ధరించడం మేలు. కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరీ మంచిది. అంచులు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ అయితే వెంట్రుకలకు మరింత ఎక్కువ రక్షణ కలుగుతుంది.ఎండ వల్ల కూడా జుట్టు రాలే ముప్పు... ఎండ తీవ్రత నేరుగా మాడుపై పడే కొందరిలో జుట్టు రాలిపోయే ముప్పు కూడా ఎక్కువే. దీనికి కారణమూ ఉంది... నేరుగా వెంట్రుకలపై పడే ఎండ కారణంగా కొందరిలో ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్) దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లూవియమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యతో పాటు మరికొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి కూడా కనిపిస్తుంటాయి. ఎండ తీవ్రత నుంచి మాడును రక్షించుకోవడమిలా...ఎండలో మాడును రక్షించుకోడానికీ, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం మేలు. అవి...మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించే దేహలక్షణం ఉన్నవారిలో జుట్టు జిడ్డుగా మారడం చాలా ఎక్కువ. ఆ జిడ్డు కారణంగా జుట్టు మరీ ఎక్కువ డల్గా కనిపించవచ్చు. ఇలా జుట్టు డల్గా కనిపించకూడదంటే... జిడ్డు చర్మం ఉన్నవారు వారంలో రెండు సార్లు లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయడం మంచిది.స్కాల్ప్పైనున్న మన దేహ భాగంలో పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. ఇలాంటివారు సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే అది వాళ్ల మాడుకు ఉపయుక్తంగా ఉంటుంది.చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టులను పాటించడం మంచిది. సాధారణంగా చుండ్రు ఉన్నవారికి డర్మటాలజిస్టులు వారికి అనువైన లేదా కీటకెనజోల్ వంటి యాంటీఫంగల్ షాంపూలను సూచిస్తుంటారు. ఆ మేరకు బాధితులు వాటిని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లాగా వాడుకోవచ్చు.జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు తలకు నూనె పట్టించడం అంత మంచిది కాదు.ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అన్నది జిడ్డు చర్మంతో ఉండేవారితో పాటు అందరికీ మేలు చేసే అంశం.హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా రాలుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. గాలి ఆడక చెమట పడుతుండటం వల్ల ఇలాంటి అభి్రపాయం చాలామందిలో కలగడం చాలా సాధారణం. అయితే నిజానికి హెల్మెట్ అన్నది ప్రమాద సమయంలో తలనూ ్రపాణాలనూ కాపాడటమే కాదు... దాన్ని ధరించడం వల్ల అది ఇటు జుట్టునూ, అటు మాడునూ ఏకకాలంలో రక్షిస్తుంటుంది. అంతేకాదు... బయటి వాతావరణంలోని కాలుష్యం నుంచి కూడా జుట్టును కాపాడుతుంది. నిజం చెప్పాలంటే... హెల్మెట్ ధరించని బైక్ రైడర్స్తో పోలిస్తే హెల్మెట్ వాడే వారిలోనే జుట్టు రాలిపోకుండా సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.హెల్మెట్ వాడే వారు పాటించాల్సిన సూచన... అయితే హెల్మెట్ తొడుక్కునేప్పుడు ఒక జాగ్రత్త పాటిస్తే మంచిది. ఒక పరిశుభ్రమైన పొడి గుడ్డను కాస్తంత లూజ్గా ఉండేలా తల మీద కప్పుకొని, ఆ పైనుంచి హెల్మెట్ ధరించాలి. ఆ గుడ్డ కూడా కాటన్తో తయారైన మృదువైన కర్చిఫ్లాంటిదైతే మరింత మేలు. ఇలా ధరించడం వల్ల హెల్మెట్ పైభాగం ఆ వ్యక్తి తాలూకు చెమటతో తడిసిపోకుండా ఎప్పుడూ పొడిగా ఉంటుంది. దాంతో చెమటతో తడిసిన హెల్మెట్నే మాటిమాటికీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం తలపైన పరచుకునే గుడ్డను మారుస్తూ దాన్ని మాటిమాటికీ ఉతుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉతికిన వస్త్రాన్ని వాడుకోవచ్చు. అయితే ఇలా కాకుండా హెల్మెట్ను నేరుగా ధరిస్తుంటే... దాన్ని శుభ్రపరచుకోవడం సాధ్యం కాదు కాబట్టి నిపుణులు ఈ జాగ్రత్తను సూచిస్తుంటారు.చివరగా... మనిషిని చూడగానే మొదటగా అందరికీ కనిపించేది తల... దానిపైన ఉండే మాడు భాగం మాత్రమే. అది ఆరోగ్యంగా కనిపిస్తుంటేనే సదరు వ్యక్తి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపిస్తుంటాడు. కేవలం నలుగురిలోకి వెళ్లినప్పుడు కలిగే ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించుకోడానికే కాకుండా... మాడును ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా కనిపిస్తాడని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు మాడు విషయంలో జాగ్రత్త వహించడమన్నది మిగతా దేహ ఆరోగ్యానికీ మేలు చేసే అంశమని గుర్తుంచుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్నిర్వహణ : యాసీన్ -
బ్రెయిన్ ట్యూమర్కి వైఫై, స్మార్ట్ఫోన్లే కారణమా?
గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో అంతా మొబైల్ ఫోన్లు, వైఫై రౌటర్లు, స్క్రీన్ టైం తదితరాలే అందుకు కారణమని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగావీటన్నింటికి ఒత్తిడి కూడా తోడవ్వుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే (World Brain Tumor Day) సందర్భంగా డిజిటల్ వినియోగం ఈ సమస్యకు ఎంత వరకు కారణం? శాస్త్రీయపరంగా ఇది ఎంత వరకు కరెక్ట్ వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.వై-ఫై, స్మార్ట్ఫోన్లు, ఒత్తిడి, లేదా అధిక స్క్రీన్ టైమ్ వంటివే బ్రెయిన్ ట్యూమర్కి ప్రధాన కారణమని చెప్పడానికి సరైన ఆధారాలే లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా డిజిటల్ వాడకం వల్ల రేడియేషన్ బారినపడతారనే దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మొబైల్ ఫోన్లు మరియు వై-ఫై పరికరాల నుంచి లువడే రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ కారణంగానే ఈ ఆందోళన వ్యక్తమైందది గానీ..ఎక్స్-రేలు లేదా అణు పదార్థాల నుంచి వెలువడే అయనీకరణ రేడియేషన్ లా కాకుండా RF రేడియేషన్ను తక్కువ-శక్తి గలదిగా, అయనీకరణం చెందనదిగా పరిగణిస్తారని అన్నారు. అందువల్లే కేన్సర్ పరిధకులు..మొబైల్ ఫోన్లు లేదా వై-ఫై సాధారణ వాడకం బ్రెయిన్ కేన్సర్కు కారణమని నిర్థారించలేమని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ వాడకం బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని ఎంత మేరకు కలిగించగలదో చేసిన అధ్యయనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయన్నారు. కొన్ని అధ్యయనాల్లో ఫోన్ని అతిగా వాడే వారిలో కొన్ని అరుదైన కణితులు పెరిగినట్లు తేలిందని..మరికొన్ని పరిశోధనల్లో సరైన ఫలితాలివ్వలేదని చెబుతున్నారు. దీనిపై మరింత దీర్ఘకాలిక పరిశోధన అవసరమని చెబుతున్నారు.అధిక స్క్రీన్ సమయం బ్రెయిన్ని దెబ్బతీస్తుందా?స్క్రీన్ సమయం బ్రెయిన్ ట్యూమర్కి కారణమని నేరుగా చెప్పలేకపోయినా.. అధికంగా వాడకం మాత్రం ఇతర మార్గాల్లో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. ఒకవేళ స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడడితే మాత్రం..కంటి ఒత్తిడి, తలనొప్పులునిద్ర నాణ్యత తగ్గడంఒత్తిడి, ఆందోళన పెరగడంశారీరక శ్రమ తగ్గడంమానసిక అలసటకానీ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి, ముఖ్యంగా రాత్రి పొద్దుపోయాక పరికరాలను ఉపయోగించినప్పుడు, మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించి, నిద్ర చక్రాలను కూడా భంగపరచవచ్చు. అందుకే ఆరోగ్య నిపుణులు వినోదం కోసం చూసే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోవాలని, క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదీఏమైనా..ఈ అధిక డిజిటల్ వినియోగం మానసిక శారీరక ఆరోగ్యంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఒత్తిడి కారణమా?కేన్సర్తో సహా అన్ని రోగాలకు ఒత్తిడే కారణమని చెబుతుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, వాపును పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ..ఒత్తిడి మెదడు కణితులకు కారణమవుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవనే అంటున్నారు.అసలు కారణం ?చాలా సందర్భాలలో, మెదడు కణితులకు ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అనేక ప్రమాద కారకాలను గుర్తించారు. అవేంటంటే..జన్యుపరమైన పరిస్థితులు, వారసత్వంగా వచ్చే సిండ్రోమ్లుఅధిక మోతాదులో అయోనైజింగ్ రేడియేషన్కు గురికావడంవయస్సుకొన్ని రకాల కేన్సర్ల కుటుంబ చరిత్రఅరుదైన సందర్భాల్లో పర్యావరణ విషపదార్థాలుసాధ్యమైనంత వరకు మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ, క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య పోషణతో ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రెగ్యులర్ చెకప్లతో ముందుగానేబ్రెయిన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి చేస్తే..ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
వారానికి ఒక్క డోస్.. షుగర్, వెయిట్ అన్నీ కంట్రోల్!
న్యూ ఓర్లీన్స్: ఫార్మా రంగంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమయ్యింది. ఊబకాయం సమస్యతో బాధపడేవారికి సరికొత్త ఆశలు రేకెత్తిస్తూ ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘ఎలి లిల్లీ’ ఒక అద్భుతమైన మందును కనుగొంది. శనివారం (జూన్ 6) న్యూ ఓర్లీన్స్లో జరిగిన అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో కంపెనీ తన తాజా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించింది. ‘రెటాట్రుటైడ్’ (Retatrutide) అని పిలిచే ఈ నెక్స్ట్-జనరేషన్ ఊబకాయం డ్రగ్.. ఒక్క బరువు తగ్గించడమే కాకుండా.. ప్రాణాంతక స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస ఆడకపోవడం), తీవ్రమైన మోకాళ్ళ నొప్పులను సైతం సమర్థవంతంగా నివారిస్తుందని పరిశోధనల్లో తేలింది.మూడో దశ ట్రయల్స్లో సంచలన ఫలితాలుఎలి లిల్లీ నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న వయోజనులకు వారానికి ఒకసారి ఈ ‘రెటాట్రుటైడ్’ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా, వారిలో తీవ్రమైన అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్య ఏకంగా 60.6 శాతానికి పైగా తగ్గినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అంతేకాదు మోకాళ్ళ కీళ్లనొప్పుల తీవ్రతను ఈ డ్రగ్ గరిష్టంగా 73.1 శాతం వరకు తగ్గించిందని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ‘జెప్బౌండ్’ అనే పాత డ్రగ్కు ఈ తరహా చికిత్స కోసం అనుమతులు ఉండగా, ఇప్పుడు ‘రెటాట్రుటైడ్’ మరింత మెరుగైన ఫలితాలను చూపించింది.ట్రిపుల్ జి ఫార్ములా విశేషాలుఈ ప్రయోగాత్మక ఔషధం మానవ శరీరంలో బరువు, మధుమేహాన్ని నియంత్రించే కీలక హార్మోన్లను టార్గెట్ చేస్తుంది. అంతకుముందు జరిగిన అధ్యయనాల్లో ఈ మందు వాడిన రోగులు తమ శరీర బరువులో 28 శాతం వరకు తగ్గడమే కాకుండా, టైప్-2 డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు ఎలి లిల్లీ గతంలోనే వెల్లడించింది.లాన్సెట్ జర్నల్ నివేదిక - మార్కెట్ పోటీప్రఖ్యాత 'ది లాన్సెట్' జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం, ఈ డ్రగ్ అత్యల్ప మోతాదు తీసుకున్న రెండు శాతం మంది డయాబెటిస్ రోగుల్లో గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ప్రతికూల సంఘటనలు నమోదయ్యాయి. అయితే ఇవి నేరుగా ఈ మందు వల్లే సంభవించాయని చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉన్న ఊబకాయం, మధుమేహం మందుల మార్కెట్ను శాసించేందుకు ఇండియానా కేంద్రంగా పనిచేసే ఎలి లిల్లీ సంస్థ, డెన్మార్క్కు చెందిన నోవో నార్డిస్క్ సంస్థల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.ఇది కూడా చదవండి: వాట్సాప్లో ‘బొద్దింకల పార్టీ’: క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ! -
ప్లీజ్ అంతా అయిపోయాక కాదు..! ముందుగానే తెలుసుకుందాం..
ఏ విషయంలోనైన అశ్రద్ధ ఉన్నా..పర్లేదు కానీ..ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పెద్దయ్యాక..చూద్దాంలే అనుకుంటూ..ఉంటే..కథే అడ్డం తిరుగుతుంది. మనం యంగ్ ఏజ్లో తీసుకున్న ఆహారాలు, జీవనశైలి వంటివే నాలుగుపదుల వయసులో మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యం సమీపించే సమయానికి రకరకాల వ్యాధుల బారినపడి..ఆరోగ్యాన్ని చేజాతులారా పాడు చేసుకుంటారని అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అంతేగాదు. ముందుగానే ఈవిషయాలు తెలిసి ఉంటే బాగుండును అనుకునే ఐదు శక్తిమంతమైన ఆరోగ్య పాఠాలపై అందరికీ అవగాహన ఉండాలంటున్నారు. అవేంటంటే..యంగ్ ఏజ్లో ఉండగా..ఆ తర్వాత అంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. నిశబ్దంగా నష్టం జరిగిపోయాక గానీ మేల్కోరని అంటున్నారామె. నిద్ర అలవాట్ల నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతిదాంట్లో కేర్ఫుల్గా ఉండాలని అంటున్నారు.తెలుసుకోవాల్సిన ఐదు శక్తిమంతమైన పాఠాలు..తన 20 ఏళ్ల వయసులో తనకు తెలిసి ఉంటే బాగుండేదని అతను భావించే ఐదు శక్తివంతమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి:జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మిగతా అన్నింటినీ నిర్ధారిస్తుంది..శక్తి, మానసిక స్థితి, చర్మం, రోగనిరోధక శక్తి, మానసిక స్పష్టత అన్నీ జీర్ణవ్యవస్థలోనే మొదలవుతాయని అంటున్నారు వైద్యులు. ఇదంతా జీర్ణవ్యవస్థలో నిశ్శబ్దంగా ఉంటుంది,నిద్ర అనేది మీరు తర్వాత భర్తీ చేసుకోగలిగేది కాదుచాలా మంది అనుకున్నట్లుగా నిద్రలేమిని పూడ్చలేము. ప్రతి రాత్రి సరిగా నిద్రపోకపోవడం కాలక్రమేణా పేరుకుపోతుంది. కోల్పోయిన నిద్రకు బ్యాంకు ఖాతా లేదు,అని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వేగవంతమైన జీవసంబంధమైన వృద్ధాప్యం, అధిక జీవక్రియ ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధనలు చెబుతున్నాయని చెబుతున్నారు.ఆహారం కంటే.. ఒత్తిడి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తుంది..దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంపై ప్రత్యక్ష జీవసంబంధమైన ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి కొన్ని గంటల్లోనే జీర్ణవ్యవస్థ, శరీరాన్ని ప్రభావితం చేయగలదు. నాడీ వ్యవస్థ నియంత్రణ గురించి మంచి అవగాహన ఉండాలి.ఇష్టంగా తినే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం..ఇవాల్టి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక కాలేయం, జీవక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి సమస్యలు అకస్మాత్తుగా రావు, దశాబ్దాల తరబడి పునరావృతమయ్యే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేవని అంటున్నారు.అత్యంత శక్తిమంతమైన పదార్థం ఫైబర్అందరు రోజుకు కేవలం పది నుంచి 15 గ్రాముల ఫైబరే తీసుకుంటున్నారు. తగినంత ఫైబర్ పెద్ద ప్రేగు కేన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!) -
భారత్ ఆరోగ్య స్కోరు @ 65
ముంబై: దేశీయంగా ప్రజలు తమ శారీరక, మానసిక, ఆర్థిక ఆరోగ్యంతో పాటు ఉద్యోగాలు, బంధాలు మొదలైన వాటన్నింటినీ సమన్వయం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శారీరక, మానసిక, ఆర్థిక, వృత్తి, సామాజికం అనే ఐదు అంశాలపై మణిపాల్ సిగ్నా ఇండియా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన హెల్త్ కోషంట్ 2026లో ప్రజల సమగ్ర ఆరోగ్య స్కోరు 100కి గాను 65గా నమోదైనట్లు సంస్థ వెల్లడించింది. శారీరక ఆరోగ్యం అత్యధికంగా 68 స్కోరు సాధించగా, ఆర్థిక ఆరోగ్యం 62 స్కోరుతో అన్నింటికంటే వెనుకబడింది. పట్టణ ప్రాంత భారతీయుల్లో 82 శాతం మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, కేవలం ఒక శాతం మంది మాత్రమే తమ ఆరోగ్యం బాగోలేదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేథ వాడకంపై 63 శాతం మంది సానుకూలంగా ఉన్నప్పటికీ, అది వైద్యులకు సహాయకారిగా ఉండాలే తప్ప మానవ మేథస్సు స్థానాన్ని ఆక్రమించేదిగా ఉండకూడదని చెప్పారు. ప్రజలు చికిత్స ఎలా అందుతుందని ఆందోళన చెందడం కాకుండా తాము ఆరోగ్యంగా ఎలా ఉండాలనే దానిపై దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ జాయ్దీప్ సాహా తెలిపారు. -
నిద్రతో పేగుబంధం
మంచినిద్ర లేకపోతే పొట్ట పనిచేయదు... నిజమే నిద్రకు, పేగు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంది. దీన్ని గట్–స్లీప్ యాక్సిస్ అంటారు. పేగులోని బ్యాక్టీరియా మనం నిద్రపోవడానికి అనువైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. సుఖ నిద్రతో దేహంలోని మైక్రోబయోమ్ యంత్రాంగం చక్కగా పనిచేసి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సీబీఐ) ప్రకారం మంచి నిద్ర–జీర్ణకోశ ఆరోగ్యం పరస్పర ఆధారితాలు.యంత్రం పనిచేయాలంటే..మన జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఆ సముదాయాన్ని, వాటి జన్యు పదార్థం, ఫంగస్లను మైక్రోబయోమ్ అంటారు. ఇది జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తూ మనిషి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుంది. ఈ మైక్రోబయోమ్ చక్రం సవ్యంగా సాగాలంటే మంచి నిద్ర అవసరం.మంచినిద్ర లేకపోతే...⇒ పేగులో ఉండే ప్రో–బ్యాక్టీరియా (దేహానికి ప్రయోజనకారి) వృద్ధి తగ్గుతుంది. ప్రో–బ్యాక్టీరియా వృద్ధి తగ్గిందంటే హానికారక బ్యాక్టీరియా వృద్ధిపై నియంత్రణ లేకపోవడంతో ఆ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ స్థితిని డిస్బయోసిస్ అంటారు.⇒ గాఢనిద్రలో ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్ల సమతుల్యత నిద్రలేమి కారణంగా దెబ్బతింటుంది.⇒ జీవక్రియలు మందగించడం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు దారితీస్తుంది.శరీరంలో ఉత్పత్తి అయ్యే 90% సెరోటోనిన్ హార్మోన్ పేగులోనే ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ న్యూరో ట్రాన్స్మీటర్గా పనిచేస్తుంది. మానసిక స్థితి, నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది మెలటోనిన్ హార్మోన్కు ముందస్తు దశగా చెప్పవచ్చు. నిద్రపట్టడం, మెలకువ రావడం అనే ప్రక్రియలను మెలటోనిన్ నియంత్రిస్తుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. అంటే మనం మంచిగా నిద్రపోతేనే జీర్ణవ్యవస్థ తన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే నిద్ర పడుతుంది. -
డాక్టర్ స్మార్ట్ స్కేల్స్!
కేవలం బరువును బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని చెప్పలేము. ఒకే బరువు ఉన్న ఇద్దరిలో ఒకరు ఫిట్గా, మరొకరు అన్ఫిట్గా ఉండవచ్చు. అందుకే, కేవలం బరువునే కాకుండా శరీర సమగ్ర ఆరోగ్యాన్ని అంచనా వేసే స్మార్ట్ స్కేల్స్ (బాడీ స్కానర్లు) ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బి.ఐ.ఎ. టెక్నాలజీతో పనిచేస్తాయి.అందించే ఆరోగ్య వివరాలు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్: బరువు తగ్గడం కంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గడమే ముఖ్యం. ఈ స్కేల్ మీ శరీరంలో కొవ్వు శాతం ఎంతో కచ్చితంగా చెబుతుంది.బాడీ వాటర్ పర్సంటేజ్: శరీరం ఎంతవరకు హైడ్రేటెడ్గా (నీటి శాతం) ఉందో చూపిస్తుంది.మెటబాలిక్ ఏజ్: మీ శరీరం లోపల ఎంత యాక్టివ్గా ఉందో మీ అసలు వయసుతో పోల్చి చెప్తుంది. (ఉదాహరణకు: మీ వయసు 30 ఏళ్లయితే, బాడీ మెటబాలిజం 25 ఏళ్ల యువకుడిలా ఉందా లేదా 40 ఏళ్ల వ్యక్తిగా ఉందా అనేది చెబుతుంది).విసెరల్ ఫ్యాట్: గుండె, కాలేయం వంటి అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే అత్యంత ప్రమాదకరమైన కొవ్వు ఇది. దీని స్థాయిని బి.ఐ.ఎ. ద్వారా తెలుసుకుని, గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించవచ్చు.ఎముకల సాంద్రత: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.మజిల్ వర్సెస్ ఫ్యాట్: కొవ్వు శరీరాన్ని లావుగా చూపిస్తే, కండరాలు ఫిట్గా ఉంచుతాయి. సాధారణ బరువు మిషన్లలో ఈ తేడా తెలియదు, కానీ స్మార్ట్ స్కేల్ ఈ రెండింటి బరువును విడివిడిగా చూపిస్తుంది. బి.ఐ.ఎ. అంటే ఏమిటి? బయోఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్కి సంక్షిప్త రూపమే బి.ఐ.ఎ.ఈ స్మార్ట్ స్కేల్పై నిలబడినప్పుడు, మనకు తెలియకుండానే ఒక చిన్న విద్యుత్ తరంగం శరీరం ద్వారా వెళ్తుంది. ఇది శరీరంలోని కొవ్వు, కండరాలు, నీటి శాతాన్ని బట్టి వేర్వేరు వేగంతో ప్రయాణించి, కచ్చితమైన బాడీ రిపోర్ట్ను లెక్కిస్తుంది.ఇంటిల్లిపాదికీ ఒకటే స్కేల్: ఒకే స్మార్ట్ స్కేల్ను కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు. స్కేల్పై ఎవరు నిలబడ్డారో వారి బాడీ ప్రొఫైల్ను బట్టి ఆటోమేటిక్గా గుర్తించి, వారి వ్యక్తిగత మొబైల్ యాప్కే డేటాను పంపుతుంది. ఒకరి డేటా మరొకరికి కలవదు. -
సైక్లింగ్తో యాక్టివ్గా..!
ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ఒకే ఒక్క సులువైన పరిష్కారం ఉంది, అదే సైక్లింగ్. మరి ఆ సైక్లింగ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.శరీర భాగాల సమన్వయం, సమతుల్యత మెరుగవుతుంది.రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. ఊబకాయం నుంచి కాపాడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. కేన్సర్ నివారణకు సహాయపడుతుంది. కీళ్ల కదలికలు సులువవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించే ప్రాణయామంయోగాలో శ్వాస నియంత్రణ ప్రక్రియను ణాయామం అంటారు. ప్రాణ (జీవశక్తి) + ఆయామ (నియంత్రణ/విస్తరణ) కలయికే ప్రాణాయామం. ఇది ఒత్తిడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.ప్రయోజనాలు: ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి, కుడి ముక్కు ద్వారా వదలడం వల్ల నాడీ వ్యవస్థ శుభ్రపడుతుంది. భ్రామరీ: తుమ్మెదలా శబ్దం చేస్తూ గాలిని వదలడం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది.కపాలభాతి: శ్వాసను వేగంగా బయటకు వదలడం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.భస్త్రిక: బలమైన, వేగవంతమైన శ్వాస ప్రక్రియ. శరీరంలో శక్తిని పెంచుతుంది.ముఖ్యమైన జాగ్రత్తలు: ఖాళీ కడుపుతో (ఉదయం లేదా సాయంత్రం) చేయడం మంచిది. గుండెజబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల సమక్షంలోనే అభ్యసించాలి.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ (చదవండి: Weight loss Tips: 65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..) -
బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం..! కానీ పేదవాడే..
మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సన్నీ గార్గ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్ 34 ఏళ్ల గుర్గావ్ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్ఫుల్ మ్యాన్లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్ బెడ్రూం ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్ సన్నీ. ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు. దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్ సన్నీ "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్ అని ఎన్నిసార్లు అనుకున్నావ్ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం. రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్ సన్నీ. అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Dr Sunny Garg (@drsunnygarg) (చదవండి: భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు) -
65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..
బరువు తగ్గాలంటే కఠినమైన ఆహార నియమాలు, కష్టతరమైన వ్యాయమాల క్రమం అనుకుంటారు అంతా. కానీ తెలివిగా ఎంజాయ్ చేస్తూ సులభంగా తగ్గే ప్రక్రియ అని అంటోంది ఫిట్నెస్ కమ్ యోగా కోచ్ త్రిప్తి. చాలామంది. ఇక్కడ స్మార్ట్గా ఆలోచిస్తే స్లిమ్ అవ్వడం చాలా సులవు అని చెబుతోందామె. మరి అదెలాగో త్రిప్తి మాటల్లోనే తెలుసుకుందామా.!.దుబాయ్కు చెందిన ఫిట్నెస్, స్ట్రెంత్, యోగా కోచ్ త్రిప్తి తను కేవలం ఏడు నెలల్లో 7.7 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఎక్కువ కేలరీలు ఖర్చు చేసేందుకు, పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి సహాయపడిన సులభమైన ప్రభావవంతమైన వ్యాయామాలను పంచుకున్నారామె. తాను కాంపౌండ్ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ 7.7 కిలోలు తగ్గినట్లు తెలిపారు. ఇది కొవ్వు తగ్గడాన్ని వేగవంతం చేయడంలోనూ, మొత్తం ఫిట్నెస్ను మెరుగుపరచడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్త్రిప్తి తన వర్కౌట్ను మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్తో ప్రారంభించారు. ఈ వ్యాయామం కోర్ తోపాటు శరీర దిగువ భాగాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. కొత్తగా చేసేవారికి, కేవలం శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్ చేయమని ఆమె సిఫార్సు చేశారు.కాలును పైకి లేపేటప్పుడు శ్వాసను బయటకు వదలండి, తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చేటప్పుడు శ్వాసను లోపలికి తీసుకోండి. కదలిక అంతటా మీ కోర్ను బిగుతుగా ఉంచి, నిటారుగా ఉండే భంగిమను కొనసాగించాలని చెప్పారామె. అలాగే క్రమం తప్పకుండా వర్కౌట్ చేసేవారికి లేదా జిమ్కు వెళ్లేవారికి, బరువులను జోడించి, రెప్స్ సంఖ్యను 20కి పెంచమని త్రిప్తి సూచించారు. నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించడంతరువాత, ఆమె నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించింది. ఇది కోర్, హామ్స్ట్రింగ్స్ మరియు హిప్ ఫ్లెక్సర్లను లక్ష్యంగా చేసుకునే ఒక సులభమైన వ్యాయామం. తొలిసారిగా ప్రారంభించేవారు తమ శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్తో మొదలుపెట్టవచ్చు. ఆ తర్వాత ఆమె 10 కేజీల డంబెల్ను పట్టుకొని అదే వ్యాయామాన్ని చేసింది. మరింత సవాలు కోరుకునే వారు వేగాన్ని పెంచుకోవచ్చు లేదా సరైన భంగిమను పాటిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.మోకాలిని తిప్పే వ్యాయామంఆ తర్వాత త్రిప్తి మోకాలిని తిప్పే వ్యాయామం గురించి వివరించింది. ఈ వ్యాయామం ఒబ్లిక్స్ను బలపరచడానికి, మొండెం కదలికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కదలికను చేయడానికి, ఒక మోకాలిని పైకి లేపి, కోర్ను బిగుతుగా ఉంచుతూ పై శరీరాన్ని దాని వైపుకు తిప్పండి. తొలిసారిగా ప్రారంభించినవారు ప్రతి వైపు 10 రెప్స్ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఈ కదలికను మరింత సవాలుగా మార్చడానికి, ఆమె డంబెల్ లేదా వెయిట్ ప్లేట్ను జోడించమని సూచించింది. అధునాతన వ్యాయామం చేసేవారు వేగంపై కాకుండా నియంత్రిత మెలికలపై దృష్టి పెడుతూ, 5-10 కేజీల బరువును పట్టుకొని ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.హై నీస్ (లేదా హై-నీ మార్చ్)ఈ వర్కౌట్లో హై నీస్ కూడా ఉంది. ఇది ఒక కార్డియో వ్యాయామం, ఇది ఓర్పును పెంచుతూనే కోర్, గ్లూట్స్, కాలి కండరాలను ఉత్తేజపరుస్తుంది. తొలిసారి ప్రారంభించేవారు సౌకర్యవంతమైన వేగంతో మోకాళ్లను నడుము ఎత్తు వరకు పైకి లేపుతూ, 10-12 సార్లు హై-నీ మార్చ్ చేయవచ్చు. తీవ్రతను పెంచడానికి, ఇంతకు ముందు వర్కౌట్ అనుభవం ఉన్నవారు ప్రతి చేతిలో తేలికపాటి డంబెల్స్ పట్టుకుని 45-60 సెకన్ల పాటు హై నీస్ చేయవచ్చు. నిటారుగా కూర్చోవడం,చేతులను పంప్ చేయడం ఈ వర్కౌట్ను మరింత మెరుగుపరుస్తాయి.ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజ్ఆమె ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజెస్ చేసింది. ఈ వ్యాయామం భుజాలు, కోర్, గ్లూట్స్, బయటి తొడలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్, స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తొలిసారిగా ప్రారంభించేవారు కేవలం తమ శరీర బరువును ఉపయోగించి, ప్రతి వైపు 10 రెప్స్తో ప్రారంభించవచ్చు. ఈ కదలిక అంతటా కోర్ను నిమగ్నంగా ఉంచడం నిటారుగా కూర్చోవడంపై దృష్టి పెట్టాలి.వ్యాయామం చేసేటప్పుడు డంబెల్ను తలపైన పట్టుకోవాలని త్రిప్తి సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు మధ్యస్థం నుండి ఎక్కువ బరువును ఉపయోగిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ వరకు పెంచుకోవచ్చు. చివరగా ఆమె ఈ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర రోజువారీ కదలికలు కలిపి చేస్తే..బరువులో మాత్రమే కాకుండా, బలం, శక్తి, ఆత్మవిశ్వాసంలో కూడా మార్పుని గమనించగలుగుతాం అని అంటోంది త్రిప్తి. ఇక్కడ కేవలం నిలకడ, క్రమశిక్షణే మంచి ఫలితాలను తెలస్తుందని అంటున్నారామె. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారామె. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TriptiFitFlow | Strength•Yoga•Transformation (@triptifitflow) (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం
సాధారణంగా మల్లెలు అనగానే మగువలే గుర్తొస్తారు. ఇది తరతరాలుగా మహిళలకు, మల్లెలకు ఉన్న అనుబంధం. అలంకారానికి మాత్రమే కాక ఆహ్లాదం, ఆనందం, అనురాగాన్ని కూడా పంచుతాయి మల్లెలు. అన్నట్లు మహిళలు మల్లెలను ధరించేది తమకోసమే కాదు, తమను ప్రేమించే వారి కోసం కూడా! మల్లెలు ఏడాదిలో మూడు నాలుగు నెలలు మాత్రమే పూస్తాయి. అది కూడా వేసవి ఎండల్లోనే. అందుకే మల్లెల గురించి మరింతగా...మనసుకు, మేనికి ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సువాసన కారణంగా మల్లెపూలను మన దేశంలో పూలకే రాణిగా పరిగణించడంతో పాటు బెల్లె ఆఫ్ ఇండియా లేదా సువాసన రాణి అని కూడా సంబోధిస్తుంటారు. తలకు..మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. మల్లెల కషాయంతో కళ్లమంటలు, నొప్పులు తగ్గుతాయి. మల్లె పూలు, ఆకులతో కషాయం కాచి, వడగట్టి చల్లార్చాలి. అనంతరం రెండు వంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. కోపం, డిప్రెషన్ తదితర సమస్యలను దూరం చేసే స్వభావం మల్లెపూలకు ఉంది. సువాసన వెదజల్లే పూలను తల దిండు పక్కన పెట్టుకుని పడుకుంటే.. మనసు స్థిమితమై హాయిగా నిద్ర పడుతుంది. మధుమేహులు మల్లెపూలతో చేసిన టీ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం వీటికి ఉంటుంది. కొబ్బరినూనెలో మల్లెపూలను రోజంతా నానబెట్టి, తర్వాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. అదేవిధంగా కొబ్బరినూనెతో మల్లెపూల రసాన్ని కలిపి తలకు రాసుకుంటే.. మంచి సువాసన వస్తుంది. చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలు పోగొట్టడంలోనూ మల్లెలు ఉపకరిస్తాయి. అంతేకాదు మల్లెపూలతో చేసిన పలు ఔషధాలు శరీరంపై ఏర్పడే కణితులను కూడా నివారిస్తాయని పరిశోధనల్లో తేలింది. మహిళలకు రుతుస్రావంలో తలెత్తే సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయట. అలాగే గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేందుకు ఇవి ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మల్లెలు భాగస్వాముల మధ్య మానసిక ఆందోళనలను, బిడియాన్ని తొలగించి, మనోల్లాసం కలిగించే భావనలను ప్రేరేపిస్తాయట. అందుకే భారతీయ సంప్రదాయంలో మల్లెలకు పెద్ద పీట వేశారు. సాహిత్యంలోనూ మల్లెలకు ప్రముఖ స్థానం ఇచ్చారు. కవులు, గాయకులు, రచయితలు మల్లెపూల సొగసును, వాటి పరిమళాన్ని వర్ణిస్తూ ఎన్నో పాటలు రాశారు. రచనలు చేశారు. కవితలు అల్లారు. స్త్రీల సౌకుమార్యాన్ని మల్లెపూలతో పోల్చారు. ఏ రకంగా చూసినా మల్లెపూలు నిత్యజీవితంలో పరిమళాన్ని అద్దుతూనే ఉంటాయి. గాఢమైన వాసనతో గుండెను హత్తుకుంటూనే ఉంటాయి. ఎన్నో పరిమళాలుభారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని విభిన్న రకాల పేర్లతో పిలుస్తుంటారు. మోగ్రా, మోతియా, చమేలి, మల్లి పూవ్వు, జాటి, మల్లిగే, జూహి, మోగ్రా లేదా పొద జాతి వక్షాల్లో మూన్లైట్ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. మొత్తం మీద మల్లెపూలలో 300 రకాలు ఉన్నట్టు అధికారికంగా నమోదైంది. మల్లెపువ్వుకి మల్లిక, మగేష్టము, మల్లియ, ప్రయ, శూన్య, ముద్గరము, హసంతి, చంద్రిక, సుభగ వంటి పేర్లెన్నో ఉన్నాయి. మరి ఇంత చరిత్ర, ఇన్ని పేర్లు ఉన్న మల్లెపూలలో నిత్యమల్లెలు, బొండు మల్లెలు, దొంతర మల్లెలు, కాగడ మల్లెలు, శంకు మల్లెలు, బొడ్డు మల్లెలు, నాగ మల్లెలు, కొండమల్లెలు, కంచె మల్లెలు, దేశవాళి మల్లెలు వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. అరోమా థెరపీమల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్బులు, తలనూనె, సౌందర్య సాధనాల్లో కూడా మల్లెపూలను వాడుతున్నారు. అలాగే సుంగంధ మొక్కల ద్రవ్యాలతో చేసే అరోమాథెరపీలోనూ మల్లె పూలను వాడతారు. కళ్లు అలసటగా ఉన్నప్పుడు మల్లెపూల రసంతో కంటి చుట్టూ మర్దన చేసుకుని పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే తాజా మల్లెలను మెత్తగా నూరి, తడిబట్టతో చుట్టి కళ్లమీద పెట్టుకుంటే, కళ్లలో నీరు కారడం, తడి ఆరిపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. నపుంసకత్వం, శీఘ్రస్కలన సమస్యల పరిష్కారానికి కూడా మల్లెపూలు ఉపకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. చర్మానికి అవసరమయ్యే విటమిన్–సి మల్లెపూలలో సమృద్ధిగా లభిస్తుంది. – డి.వి.ఆర్.(చదవండి: జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన రిక్షాడ్రైవర్ కుమారుడు..!) -
అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!
ఈ అడవి పండుకు ఇంగ్లీష్ పేరు: వైల్డ్ జుజుబె. తెలుగు పేర్లు: గొట్టె తీగ, పిండి పరిఘము, ఆనె పరిగె, తెల్ల పరిగె. అస్సామీస్: బిధావో భోగారి, బోన్ బాగరి, బోన్ బొగోరి, డిండవో బోగన్. ఒరియా: తినకోలి. కన్నడ: కట్టిలండల్, బేలహదు, బిళీముళ్ళిహను, కనిక, కొట్ట ముల్లుహణ్ణు.గుజరాతీ: తోరన్. తమిళం: కట్టిలండల్, తోతరి, తోటన. మలయాళం: జాలి, కొట్టముళ్ళు, తొడలి, తుటరి, మలంతుటలీ. మరాఠీ: తురన్, తోరణ. హిందీ: చూర్ణ, సూరన్. సంస్కృతం: ఘంటా అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది. ఇది జిట్ట రేగు కుటుంబానికి చెందినది. దీనికి కూడా ముండ్లు కురచగా జంటగా కానీ ఒంటరిగా కానీ ఉంటాయి. తెల్ల పరిగె దాదాపు 5–7 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. మానుకు దగ్గరలో వేరే చెట్టు ఉంటే దాని సహాయంతో తీగలా కూడా పెరుగుతుంది. రేగు చెట్టులా ఇది కూడా ఆకులు రాల్చుతుంది. పండ్లు తెల్లగా ఉండి, అడుగు భాగాన కొద్ది నాటి కాషాయం రంగు ఉంటుంది. పండ్లు తెల్లగా ఉన్నందున దీనికి చెంచులు ‘తెల్ల పరిగె’ లేక ఆనె పరిగె అని పిలుస్తారు.థాయిలాండ్లో దీని ఉనికి ఎక్కువగా ఉంది. ఇండియా, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్ తదితర దేశాల్లోని ఉష్ణ మండల అడవుల్లో పెరుగుతుంటాయి. భారతదేశంలో మాత్రం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్–నికోబార్ దీవుల్లో ఈ చెట్లు ఉన్నాయి. తెలంగాణలోని నల్లమల అడవులలో అక్కడక్కడా ఉన్నాయి. ముఖ్యంగా మల్లాపూర్, కుడిచింత బయలు మొదలగు ప్రాంతాలలో గమనించవచ్చు. అక్కడి చెంచుల అభిప్రాయం మేరకు ఈ చెట్లు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. వీటిని అభివృద్ధి పరిచే అవసరం ఎంతైనా ఉంది.ఆనె పరిగె పండు ఉపయోగాలుపండ్లు తెలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పండులో గుజ్జు కొంత వరకు పిండిగా ఉండి రుచికరంగా ఉండటం వలన చెంచులు ఈ పండ్లను బాగా ఇష్ట పడుతారు. జీవాలు వీటి ఆకులను బాగా ఇష్టపడతాయి. పంటపొలం చుట్టూ తెల్లపరిగె కొమ్మలను కంచెగా వేసుకొని పశువులు ఇతర జంతువుల నుండి పంటను కాపాడుకోవచ్చు. రాలిన పండ్లను ఉడుతలు, కుందేళ్లు ఇతర జంతువులు ఇష్టంగా తింటాయని చెంచులు అన్నారు.తెల్ల పరిగెను చెంచులు, ఇతరులు అనేక రోగాలను నయం చేయటానికి వాడుతారు. ముఖ్యంగా విరేచనాలు, అల్సర్లు, చర్మ వ్యాధులు, దగ్గు, రక్తపోటు మొదలైన వాటికి వాడతారు.ఈ పండులో ఉన్న ఔషధ, పోషక గుణాలు ఉన్నందు వల్ల పోషక లోపాలను కొంతవరకు అరికట్టవచ్చు. ఆ పండ్లలో కూడా ఇతర పంటల్లో మాదిరిగానే చక్కెర, కొవ్వు, పీచు మొదలైన పదార్ధాలు ఉంటాయి. పోషకాల విశ్లేషణ ఈ పట్టికలో పొందుపరిచాం...పండ్లు: మార్చ్ – ఏప్రిల్ నెలలోకాస్తాయి. 5–7 మీటర్ల ఎత్తు పెరుగుతుందిడాక్టర్ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924 (చదవండి: ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..! డైట్ ప్లాన్..) -
నటి కంగనా వెండిగ్లాసులో నీళ్లు తాగడం..! ఆరోగ్యానికి మంచిదేనా?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల భారత 'భారత్ భాగ్య విధాత' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ కనిపించారు. 40 ఏళ్ల నటి గతంలో కూడా ఇలానే ఒక సందర్భంలో తాగుతూ కనిపించడంతో విమర్శులు వెల్లువెత్తాయి కూడా. అయితే తాను ఇలా వెండిగ్లాస్లో నీళ్లు తాగడానికి రీజన్ ఏంటో వివరించారు. ఎందుకు తాగుతానంటే..తాను తాగే వెండిగ్లాస్ చాలా పాతదని, ముఖ్యంగా రాజ కుటుంబాలలో అనుసరిస్తున్న ఒక పురాతన సంప్రదాయం అని అన్నారామె. తాను ఆరోగ్యం కోసం ఇలా వెండిగ్లాస్లో తాగుతున్నట్లు తెలిపారు. అధిక పిత్తదోషం ఉన్నవారికి చల్లదనం కోసం ఇది ఎంతో మంచిదని అన్నారు. వెండికి, నీటికి ఉన్న చల్లదనాన్నిచ్చే గుణాలను గురించి కూడా నొక్కి చెప్పారామె.నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?వెండి పాత్రలో నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా వెండి పాత్రలో నీళ్లు తాగడం అనేది భారతీయ సంప్రదాయంలో ఆరోగ్యంలో ఒక భాగం. పైగా వెండికి సహజంగా సూక్ష్మజీవులను నిరోధించే గుణం ఉన్నందున దానికి ప్రాధాన్య ఇస్తారని అన్నారు. వెండిగిన్నెలో నిల్వ ఉన్న నీరు కొన్ని సూక్ష్మ జీవుల పెరుగుదలను నెమ్మదింప చేస్తుందన్నారు. మొత్తం ఆరోగ్య విషయానికి వస్తే ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయన్నారు. ఇలా వెండిగిన్నెలో నీరు తాగితే దానంతట అదే పోషణ, రోగనిరోధక శక్తి వస్తాయని కాదని, ఈ చిన్న మార్పు మొత్తం ఆరోగ్య మెరుగుదల అని అనుకుంటే పొరపాటే అని అన్నారు.మన ఆయుర్వేదంలోనూ, భారతీయ సాంప్రదాయంలోనూ వెండి అనేది ఆరోగ్యానికి మంచిదే . అది వాస్తవమే అయినా..మొత్తం ఆరోగ్యంకి ముడిపెట్టడం సరికాదన్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లలో చేర్చడం కూడా సముచితం కాదన్నారు ఆరోగ్య నిపుణుల. View this post on Instagram A post shared by Peepingmoonofficial (@peepingmoonofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: బంధనం, బాధ..భళ్లుమనేలా అద్భుతమైన కళకు ఊపిరిపోసింది..!) -
వైఎస్ జగన్కు వైద్యుల ఫిర్యాదు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారంటూ డాక్టర్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటురూ జిల్లా డాక్టర్లు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్రశ్రీ నిర్వీర్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారన్న డాక్టర్లు..ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమీషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తెచ్చారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం అందించాం. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టాం. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కానీ చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేయటం బాధాకరం. బాధితులకు అండగా నిలుద్దాం’అని పిలుపునిచ్చారు. -
చద్దన్నం తినడం మంచిదా? కాదా?..
మిగిలిపోయిన అన్నాన్ని నీటిలో, పెరుగులో లేదా మజ్జిగలో నానబెట్టి మరుసటి రోజు తినడం ఒకప్పుడు మన ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చద్దన్నం ఉదయపు ఆహారంలో అంతర్భాగంగా ఉండేది. అయితే కాలం మారేకొద్దీ ఈ అలవాటు క్రమంగా కనుమరుగవుతోంది. రాత్రంతా నానబెట్టిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం చాలామందిలో బలపడింది. కానీ తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆహారపు అలవాటు వెనుక నిజంగా ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? చద్దన్నం కేవలం పాతకాలపు ఆహారమేనా, లేక ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఇందులో నిజంగానే దాగి ఉన్నాయా?.. సైన్స్ మరోసారి ఈ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.. వండిన అన్నాన్ని రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికి సహజ కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్) ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరిగి, అన్నంలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో అన్నం మరింత సులభంగా జీర్ణమవుతుంది. ఇది కేవలం పుల్లటి రుచిని ఇవ్వడమే కాదు.. శరీరానికి ఉపయోగపడే మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. అందుకే చద్దన్నాన్ని సహజ ఫెర్మెంటెడ్ ఆహారంగా పరిగణిస్తారు.మిగిలిపోయిన అన్నం.. పోషకాల నిల్వ?ఫెర్మెంటేషన్ వల్ల ఆహారంలోని కొన్ని పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీ-కాంప్లెక్స్ విటమిన్ల లభ్యత పెరగడంతో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను శరీరం మరింత సమర్థంగా గ్రహించగలుగుతుంది. సాధారణంగా ఆహారంలోని కొన్ని పదార్థాలు ఖనిజాల శోషణకు అడ్డుపడతాయి. ఫెర్మెంటేషన్ ఆ అవరోధాలను తగ్గించడం వల్ల పోషకాలు మరింత ఉపయోగకరంగా మారుతాయి.గట్ హెల్త్పై ఎందుకింత చర్చ?ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా "గట్ హెల్త్" అంటే పేగుల ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, శరీర పోషకాల శోషణలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గట్ హెల్త్ను మెరుగుపరిచే ఆహారాలపై ఆసక్తి పెరిగింది.ఇక్కడే చద్దన్నం ప్రాధాన్యం పెరుగుతోంది. ఖరీదైన ప్రోబయోటిక్ డ్రింక్స్, సప్లిమెంట్లకు బదులుగా ఇందులో సహజంగా ఏర్పడే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం తగ్గించడంలో, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.వేసవిలో ఎందుకు ఎక్కువగా తినేవారు?భారతదేశంలో చద్దన్నం సంప్రదాయం ఎక్కువగా వేసవికాలంలో కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది శరీరాన్ని చల్లబరచడంలో, హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. చద్దన్నంలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి తేమ అందుతుంది. అలాగే ఫెర్మెంటేషన్ వల్ల ఏర్పడే లాక్టిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకప్పుడు రైతులు, కూలీలు ఎండలో పనికి వెళ్లే ముందు చద్దన్నం తినేవారు. ఇది కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు రోజంతా శక్తిని అందించేదని పెద్దలు చెబుతుంటారు.ఎలా తింటే మంచిది?రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రమైన పాత్రలో నీటితో నానబెట్టి, ఉదయం పెరుగు లేదా మజ్జిగ కలిపి తినవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు జోడిస్తే రుచితో పాటు పోషక విలువలు కూడా పెరుగుతాయి. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం మట్టి పాత్రలో నానబెడితే సహజ ఫెర్మెంటేషన్కు మరింత అనుకూలంగా ఉంటుంది.అందరికీ సరిపోతుందా?చద్దన్నం చాలామందికి మేలు చేసినా.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం. మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే జీర్ణకోశ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.మొత్తానికి... చద్దన్నం గురించి ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలకు శాస్త్రం ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది. ఇది ఏదో అద్భుత ఔషధం కాకపోయినా.. సహజ ఫెర్మెంటేషన్ వల్ల జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి, వేసవిలో శరీరానికి తేమ అందించడంలో ఉపయోగపడే సంప్రదాయ ఆహారంగా గుర్తింపు పొందుతోంది. ఒకప్పుడు "మిగిలిపోయిన అన్నం"గా తక్కువగా చూసిన చద్దన్నం.. ఇప్పుడు శాస్త్రీయ పరిశోధనల్లో కొత్త కోణంలో కనిపిస్తోంది. ఖరీదైన ఆరోగ్య ఆహారాల కోసం వెతుకుతున్న ఈ కాలంలో.. మన వంటింట్లోనే తరతరాలుగా ఉన్న ఈ సాధారణ ఆహారం వెనుక దాగి ఉన్న విజ్ఞానాన్ని సైన్స్ మరోసారి గుర్తు చేస్తోంది. -
గంటకు 400 కిలోమీటర్ల వేగం!
మనం ఏదైనా వస్తువును తాకినా లేదా ఏదైనా ఆలోచించినా, ఆ సమాచారం మన నరాల ద్వారా మెదడుకు, అలాగే మెదడు నుంచి శరీర భాగాలకు అత్యంత వేగంగా చేరుకుంటుంది.ఈ సంకేతాలు మన నరాల వ్యవస్థలో ఏకంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఒక బుల్లెట్ ట్రైన్ లేదా ఒక సూపర్ కార్ టాప్ స్పీడ్ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.మన శరీరంలో ఉన్న ఈ అద్భుతమైన వైరింగ్ సిస్టమ్ వల్లే మనం ప్రమాదాల నుంచి త్వరగా తప్పించుకోగలుగుతున్నాం. ఉదాహరణకు, మనం ఏదైనా వేడి వస్తువును తాకగానే, మనం ఆలోచించే లోపే చేతిని వెనక్కి లాగేసుకుంటాం. దీనికి కారణం నరాల ద్వారా మెదడుకు అందే ఈ మెరుపు వేగపు సంకేతాలే! -
ట్రంప్ హెల్త్ రిపోర్ట్: ఫుల్ ఫిట్.. కానీ..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలకు వైట్ హౌస్ తెరదించింది. త్వరలో 80వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ట్రంప్.. తన విధులను నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నారని తాజాగా విడుదలైన వైద్య నివేదిక వెల్లడించింది. అయితే దీర్ఘకాలం పాటు ఆయన ఉత్సాహంగా ఉండాలంటే బరువు తగ్గడంతో పాటు వ్యాయామంపై దృష్టి సారించాలని వైద్యులు సూచించారు.పూర్తిగా ఫిట్.. కానీ జాగ్రత్తలు అవసరంవాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ట్రంప్నకు వైద్య పరీక్షలు జరిగిన అనంతరం, వైట్ హౌస్ ఫిజీషియన్ డాక్టర్ సీన్ బార్బబెల్లా అధికారిక నివేదక విడుదల చేశారు. ట్రంప్ తన కమాండర్ ఇన్ చీఫ్ విధులను నిర్వహించడానికి ఎటువంటి శారీరక ఇబ్బందులు లేవని నివేదిక తెలిపింది. ఆయన బరువు 238 పౌండ్లు ఉండగా, గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 73 సార్లుగా నమోదైంది. వైద్యపరంగా అన్ని అవయవాల పనితీరు సాధారణ స్థితిలోనే ఉన్నదని, క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు గుండె సంబంధిత పరీక్షలన్నీ సజావుగా సాగాయని అధికారులు తెలిపారు.మేధో శక్తికి పక్కా స్కోరువయసు రీత్యా ట్రంప్ మేధస్సుపై వస్తున్న విమర్శలకు ఈ నివేదిక గట్టి సమాధానం ఇచ్చింది. పూర్తిస్థాయి నాడీ సంబంధిత పరీక్షలు నిర్వహించగా, ట్రంప్ 30కి 30 మార్కులు సాధించి, తన మానసిక పదునును నిరూపించుకున్నారు. గతంలో పలుమార్లు ఆయన సభల్లో కళ్లు మూసుకోవడంపై వచ్చిన విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. అలసట వల్ల కాకుండా, కేవలం విశ్రాంతి కోసమే అలా చేస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత ఆరోగ్య స్థితిని కాపాడుకునేందుకు ఆయనకు వ్యక్తిగత ఆహార నియమాలు, వ్యాయామాలపై ప్రత్యేక సూచనలు చేశారు.నిరంతర పర్యవేక్షణలో ఆరోగ్యంనివేదికలో పేర్కొన్నట్లుగా, ట్రంప్ చేతులపై ఉన్న స్వల్ప రంగు మార్పులు తరచుగా షేక్హ్యాండ్స్ ఇవ్వడం, గుండె ఆరోగ్యం కోసం తీసుకునే ఆస్ప్రిన్ మందుల ప్రభావమేనని వైద్యులు వివరించారు. ఈ చిన్నపాటి సమస్యలు మినహా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. గతంలో ఆరోగ్యంపై వచ్చిన వదంతులను పక్కనపెట్టి, ఇప్పుడు సూచించిన జీవనశైలి మార్పులను ట్రంప్ పాటించాలని డాక్టర్లు కోరారు. -
పాడు పొగతో మూడింతల సెగ
సిగరెట్ తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాంతో కలిగే నష్టం దాని పొగంత నల్లగా ఉంటుంది. స్టైల్గా రెండు వేళ్లతో పట్టుకోడానికి అనువుగా ఉండవచ్చు. కానీ దానితో వచ్చే నష్టాలు వేలు కాదు కదా... లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా సరిపోనంతగా లేదా బాగు చేయలేనంతగా భారీగా ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా కోరవచ్చు కూడా. రెండు వేళ్లతో కలిగే మూడు చేతుల నష్టాలేమిటో చూద్దాం.ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్... నష్టాలు..సిగరెట్ లేదా పొగతాగడం అలవాటున్న వ్యక్తి... ఆ దుష్ప్రభావాల వల్ల తానే స్వయంగా నష్టపోతాడు. ఆ అలవాటుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తల మీద ఉన్న వెంట్రుకలూ, తలలోని కీలక అవయవాలు మొదలుకొని కాలూ, కాలి వేలి వరకు పొగాకు వల్ల ప్రభావితం కాని అవయవమంటూ ఏదీ ఉండదు. తలలోని అవయవాలూ, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్లు మొదలుకొని ఊపిరితిత్తులూ, కడుపు... ఇలా ప్రతి అవయవమూ క్యాన్సర్తో ప్రభావితం కావడానికి కారణం... పొగాకులో దాదాపు 5000 హానికరమైన రసాయనాలు దేహానికి హాని చేస్తాయి. అంతేకాదు... దాదాపు 60 రకాల రసాయనాలైతే నేరుగా క్యాన్సర్ను కలగజేస్తాయి కాబట్టి వాటిని కార్సినోజెన్స్ అని కూడా పిలుస్తారు. ఇలా తానే స్వయంగా నష్ట΄ోతున్నందున దీన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ – అనర్థాలు...నేరుగా పొగతాగే వ్యక్తితోపాటు పక్కనే ఉండే స్నేహితులకూ, తనతోపాటు గడిపే మిత్రులతోపాటు జీవిత భాగస్వామి పొగపీల్చడాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. దీంతో వాళ్లు నేరుగా సిగరెట్ తాగక΄ోయినప్పటికీ పొగాకు దుష్ప్రభావాలకు లోనవుతారు. ప్రధానంగా జీవిత భాగస్వామీ, పిల్లలూ ఇలా ప్యాసివ్ స్మోకింగ్కు గురవుతారు. మరీ ముఖ్యంగా భర్త తాలూకు ఆ అలవాటు భార్య గర్భధారణ విషయంలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భర్త తాలూకు సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యంపై దాని ప్రభావమూ పెరుగుతుంది. భర్త పొగతాగే అలవాటుతో భార్య జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెలలు నిండకముందే బిడ్డపుట్టడమూ, అలా పుట్టే పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉండటమూ, ఆ పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు పెరగడమూ జరుగుతాయి.థర్డ్ హ్యాండ్ స్మోకింగ్... దుష్ప్రభావాలు...నేరుగా సిగరెట్ కాల్చేవారిది ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. మన స్నేహితుడో లేదా కుటుంబసభ్యుడైనందువల్లనో ఆ అలవాటు ఉన్నవారి నుంచి పొగ పీల్చడాన్ని సెకండ్హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇక ఓ వ్యక్తి మూసి ఉన్న ఓ గదిలోనో లేదా లిఫ్ట్లోనో కొద్దిసేపటి కిందట సిగరెట్ కాల్చి వెళ్లిపోయినప్పటికీ... చాలాసేపటి తర్వాత ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే అప్పటికీ ఆ సిగరెట్ వాసన వస్తుండటం, అక్కడ ఉన్న నుసిలాంటి ఇతరత్రా చాలా సూక్ష్మమైన వ్యర్థాలు ఆ గదిలోకి వెళ్లినవారి బట్టలకు అంటుకుపోవడం, మన బట్టల్ని వాసన చూసినవారు కూడా సిగరెట్ వాసనను పసిగట్టడం... ఇవన్నీ ‘థర్డ్ హ్యాండ్ స్మోకింగ్’ కిందకు వస్తాయి. ఈ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా గదిలో ఉండిపోయే నుసి, అతి సూక్ష్మమైన సన్నటి ధూళి కణాలు... పొగకు ఎక్స్పోజ్ అయిన బట్టలపై కొన్ని నెలలపాటు, ఆ మాటకొస్తే కొన్నేళ్ల వరకు కూడా అలాగే ఉండిపోతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా గాలి ప్రవేశించలేకుండా ఉండి, గట్టిగా మూసి ఉన్న గదుల్లో స్మోకింగ్ చేసినప్పుడు, ఇతరులు అందులోకి వెళ్లినప్పుడు ఈ థర్డ్ హ్యాండ్ దుష్ప్రభావాలు మరింత ఎక్కువకాలం కొనసాగుతుంటాయి. ఈ పరిశోధనల్లో తేలినదేమిటంటే.. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్కు గురైన 22 గంటల తర్వాత కూడా... వ్యక్తులపై ఆ దుష్ప్రభావాల ప్రభావం కనిపిస్తుందన్నది పరిశోధకుల మాట. యూఎస్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్లో సెల్బయాలజిస్ట్ ప్రూ టాల్బోట్ చెబుతున్న దాని ప్రకారం... థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ దుష్ప్రభావాలపై ఇప్పటివరకూ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదనీ, పొగతాగే అలవాటున్న వ్యక్తుల తాలూకు కార్లు వాడేవారూ, కొనేవారూ లేదా హోటళ్లలో అంతకుముందు స్మోకర్స్ ఉండి ఖాళీ చేసిన గదులు షేర్ చేసుకునేవారు, క్యాసినోలకు వెళ్లేవారందరికీ ఈ ముప్పు చాలా ఎక్కువనీ, అన్ని అవయవాలకంటే చర్మానికి నేరుగా ఈ ముప్పు ఉంటుందంటూ చెబుతున్నారు.క్యాన్సర్ను సిగరెట్ బాక్స్లో ప్యాక్ చేసి, పిల్లలకు ఇవ్వడం సబబేనా?ప్రాణాంతకమైన క్యాన్సర్ను అందమైన సిగరెట్ పెట్టెలో ప్యాక్ చేసి తీసుకెళ్లి ఇంట్లోని అమాయకమైన పిల్లలకు గిఫ్ట్గా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ పరిశోధకులూ, వైద్య ప్రముఖులు పొగాకు వాడేవారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్ఏను సంక్రమింపజేస్తున్నారని వాపోతున్నారు. పిల్లలకు లోపభూయిష్టమైన డీఎన్ఏ దక్కడానికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట బ్రాడ్ఫోర్ట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. తమ పొగతాగే అలవాటు కారణంగా తండ్రులు తమ పిల్లలకు దెబ్బతిన్న (డ్యామేజ్డ్) డీఎన్ఏ ను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని ఆ అధ్యయనం చెబుతోంది. దీనికి కారణమేమిటంటే... పురుషుల వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన ఆ డీఎన్ఏ కారణంగా పిల్లల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. పుట్టబోయే పిల్లల్లో కనిపించే రిస్క్ను తప్పించుకునేందుకు ఒక ఉపాయాన్ని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. ఈ అనర్థాలన్నిటి కంటే... స్వయానా తానూ, జీవన సహచరి అయిన తన భార్య, తమకు పుట్టే పిల్లలూ, తన తోటి స్నేహితులూ, వారితోపాటు సమస్త సమాజమంతా ఆరోగ్యంగా ఉండటానికి పొగతాగడమూ, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయడమే మంచిదంటూ డాక్టర్లూ, వైద్య పరిశోధకులూ, ఆరోగ్యాన్ని కోరుకునే అందరూ సూచిస్తున్నారు. ఇక్కడ పొగతాగడం అంటే కేవలం సిగరెట్, బీడీ, చుట్ట అనే కాదు... జర్దా, ఖైనీ, పాన్మసాలా... ఇలా పొగాకు ఏ రూపంలో ఉన్నా అంతే ప్రమాదకారి అని గుర్తించడం అవసరం. నిర్వహణ: యాసీన్ (చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
పాతికేళ్లకే పీడిస్తోంది!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో రొమ్ము కేన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహిళల పాలిట శాపంగా మారుతోంది. దేశంలో రొమ్ము కేన్సర్ బాధితుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్న అంశం ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ సగటు ప్రతి లక్ష మందిలో 26.6 మందిగా ఉండగా, హైదరాబాద్లో ఏకంగా 54 మందికి చేరింది. గతంలో 50 ఏళ్లు దాటిన వారినే ఈ మహమ్మారి లక్ష్యంగా చేసుకునేది.మారుతున్న కాలంతో పాటే జీవన శైలి, ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక అంశాల ప్రభావంతో పాతికేళ్ల యువతులనూ రొమ్ము కేన్సర్ కబళిస్తోంది. 2020 నుంచి ఏటా రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్యలో 15 శాతం వృద్ధి కనిపిస్తోందని ఎంఎన్జే ఆసుపత్రి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 60 శాతం మంది రోగులు అవగాహనా లోపంతో 3, 4వ స్టేజిల్లో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.ఎంఎన్జే ఆసుపత్రికి వస్తున్న బాధితుల సంఖ్య ఏటా సుమారు 15 శాతం పెరుగుతోంది. 2020లో కొత్తగా నమోదైన రొమ్ము కేన్సర్ కేసులు 677 ఉండగా, 2025 నాటికి 2500కు చేరింది. ఇది మహిళాలోకాన్ని కలవరానికి గురిచేస్తోంది. మొత్తం కేన్సర్ కాటేస్తున్న బాధితుల్లో 40 ఏళ్ల వయసులోపు ఉన్నవారే 25 శాతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. నగరానికి చెందిన 22 ఏళ్ల నర్సింగ్ విద్యార్థికి రొమ్ము సాధారణానికి భిన్నంగా ఉండటంతో ఇటీవల ఎంఎన్జే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. రొమ్ము కేన్సర్ సోకిందని నిర్ధారించుకుని, చికిత్సలకు సిద్ధమైంది. వైద్యుల శస్త్ర చికిత్సల అనంతరం ఆమె కోలుకుంటోంది.రంగారెడ్డి జిల్లాకు చెందిన 34 ఏళ్ల గృహిణి రొమ్ము కేన్సర్తో ఎంఎన్జే ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సుమారు 9 నెలల చికిత్స అనంతరం సాధారణ స్థితికి చేరుకుంది. వీరిద్దరే కాదు రొమ్ము కేన్సర్తో బాధపడుతున్న వారిలో సుమారు 25 శాతం మంది 40 ఏళ్ల వయసు లోపే ఉంటున్నారని ఎంఎన్జే వైద్యులు చెబుతున్నారు. కారణాలనేకం.. గడిచిన ఐదేళ్లలో రొమ్ముకేన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పాతికేళ్లకే రొమ్ము కేన్సర్ అంటే ఆశ్చర్యమేస్తోంది. ఆధునిక జీవన శైలిలో వచ్చిన మార్పులు, ప్రాసెస్ చేసిన, జంక్ ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ఆలస్యంగా వివాహాలు, 30 ఏళ్లు దాటేంత వరకు సంతానం లేకపోవడం, పిల్లలకు సరిగా పాలివ్వకపోవడం, వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువ సమయం కూర్చుని ఉండటం, శారీక శ్రమ లేకపోవడం, మధుమేహం, మానసిక ఒత్తిళ్లు రొమ్ము కేన్సర్ను ప్రేరేపిస్తున్నాయి.– మాటూరి రమేష్, సర్జికల్ అంకాలజీ హెచ్ఓడీ, ఎంఎన్జే ఆసుపత్రి -
వింత పండు: కొమ్ముల దోసకాయ
పిల్లలూ... మనం తినే దోసకాయ ఆకుపచ్చగా, నున్నగా ఉంటుంది కదా. కానీ ఆఫ్రికాలో ఒక దోసకాయ ఉంది. దాన్ని చూస్తే ‘అమ్మో గ్రహాంతరవాసి’ అని పరిగెత్తుతారు. పేరు ‘కివానో’. ముద్దు పేరు ‘కొమ్ముల మెలన్’ లేదా ‘జెల్లీ మెలన్’. ఇది మన దేశంలో అస్సలు దొరకదు.కివానో పసుపు, నారింజ రంగులో ఉంటుంది. దాని ఒంటి నిండా కొమ్ముల్లాంటి ముళ్లు ఉంటాయి. పైన గట్టిగా ఉన్నా లోపల మాత్రం పచ్చటి జెల్లీ ఉంటుంది. దాన్ని సగానికి కోస్తే అరటి, కీరదోస, నిమ్మరసం కలిపినట్టు వాసన వస్తుంది. గరిటెతో గీకితే జెల్లీ లాంటి గుజ్జు వస్తుంది. అందులో దోస గింజల్లాంటి చిన్న గింజలు తేలుతూ ఉంటాయి. ఆ గింజలతో సహా తినేయ్యచ్చు. రుచి మాత్రం పుల్లగా, తియ్యగా, ఉప్పగా, మూడూ కలిపినట్టు ఉంటుంది. ఆఫ్రికా పిల్లలు ఎండాకాలంలో దీన్ని లాగించేస్తారు.కివానో అసలు ఇల్లు కలహారి ఎడారి. దక్షిణ ఆఫ్రికా, బోట్సా్వనా, నమీబియా దేశాల్లో ఇది విపరీతంగా పెరుగుతుంది. ఎడారిలో నీళ్లు దొరకనప్పుడు అక్కడి జంతువులు, మనుషులు దీన్ని తిని దాహం తీర్చుకుంటారు. దీంట్లో 90% నీరే ఉంటుంది. అందుకే దీన్ని ‘ఎడారి వాటర్ బాటిల్’ అంటారు. -
ఫిట్నెస్... ఫర్ స్ట్రెస్!
గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్ ద్వారా ప్రభావం చూపిన అతి కొద్దిమంది వ్యక్తులలో మిళింద్ సోమన్ ఒకరు. చాలామందికి రిటైర్ మెంట్ తీసుకునే 60 ఏళ్ల వయసులో ఆయన యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉండడం విశేషం.‘యూరప్ నుంచి ఆఫ్రికా దాకా 15 కి.మీ దూరం సముద్రంలో ఈత కొట్టాను. అదో అందమైన అనుభవం’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు మిళింద్ సోమన్. బాడీ ఫిట్నెస్తో దేశంలో తరచు చర్చనీయాంశం గా మారే ఏకైక సెలబ్రిటీ మిళింద్. తెరపై నటుడిగా ఆయన సినిమా ప్రేక్షకులకు మాత్రమే పరిచితులు కావచ్చు.. ఫిట్నెస్ ఐకాన్గా మాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి.సూపర్ మోడల్ టూ సూపర్ రన్నర్...ఆయన ప్రయాణం 1990లలో సూపర్ మోడల్గా నిలవడంతో మొదలైంది. ఆ తర్వాత జుర్మ్ , ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు దాదాపు పాతికేళ్లుగా రన్నింగ్ ట్రాక్ మీద సాటిలేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుదూరప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అనూహ్యమైనప్రాంతాల్లో పరుగులు తీయడం ద్వారా ఫిట్నెస్కు సరికొత్త అర్థాన్ని చె΄్పాడు. చెప్పులు లేకుండా పరుగెత్తడంలో కూడా ఆయన పాపులర్.పింక్థాన్.. మహిళలకు ఇన్స్పిరేషన్ప్రస్తుతం దాదాపు ప్రతినగరంలో సర్వసాధారణంగా మారిన మారథాన్లు, ఫిట్నెస్ ఈవెంట్స్కు ఆయన దాదాపు దశాబ్దమున్నర క్రితమే రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి లేదని గమనించాక... మహిళల కోసం ప్రత్యేకించి ఒక ఈవెంట్ను రూపకల్పన చేయాలన్న ఆలోచనతో గత 2012లో, సోమన్, ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి ప్రారంభించిన పింక్థాన్ ఈవెంట్ ప్రస్తుతం మన దేశంలోనే అతిపెద్ద మహిళల రన్నింగ్ ఈవెంట్ గా అవతరించింది.హిట్... ఫిట్... ఫీట్స్ ఎన్నో...50 ఏళ్ల వయసులో గత 2015లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో జరిగిన ఐర¯Œ మ్యాన్ ట్రయాథ్లాన్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42.2 కిలోమీటర్ల పరుగును కలిపి... 15 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశాడు.2017లో ఫ్లోరిడాలో 3రోజుల పాటు జరిగిన, 517 కిలోమీటర్ల ట్రయాథ్లా¯Œ లో భాగంగా 10 కిలోమీటర్ల ఈత, 421 కిలోమీటర్ల సైకిల్, 84.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశాడు.సిక్స్ ΄్యాక్ కాదు... స్ట్రెస్ బ్యాక్ ముఖ్యంకండలు తిరిగిన శరీరం కన్నా తన దృష్టిలో ఫిట్నెస్ అంటే ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యమేనంటాడు సోమన్. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన అభి్రపాయం. ఎంతో డబ్బు వెచ్చించి జిమ్లకు వెళ్లడానికి బదులు పుష్–అప్స్ పుల్–అప్స్ వంటి సహజమైన బాడీ వెయిట్ వ్యాయామాలపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక శిక్షణ కంటే రోజువారీ కదలికకుప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాడు. సమతుల్యమైన, ΄ోషకాహారం కోసం ఇంటి భోజనానికేప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాడు.30 రోజుల్లో 1500 కి.మీ. పరుగు తీయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.59 ఏళ్ల వయసులో ఐదు రోజుల్లో పూణే నుంచి వసాయి వరకు 240 కి.మీ. పరుగెత్తాడు. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
మైక్రో ప్లాస్టిక్స్ను తరిమికొడుతున్న ‘కిమ్చి’!
వాయు కాలుష్యం కారణంగా శరీరంలోకి చొచ్చుకుపోయి అవయవాల్లో తిష్టవేస్తున్న మైక్రో, నానో ప్లాస్టిక్ రేణువులను తరిమికొట్టడంలో దక్షిణ కొరియా పాపులర్ వంటకం కిమ్చి ఎంతగానో తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్లాస్టిక్ రేణువులను అదిమిపట్టి బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతకీ ప్లాస్టిక్ పనిపడుతున్న ఆ వంటకంలో ఉన్నది ఏమిటో తెలుసా? ప్రోబయోటిక్స్. అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అన్నమాట.పులియబెట్టడంతో..కిమ్చి అనేది దక్షిణ కొరియా సంప్రదాయ వంటకం. క్యాబేజీ, ముల్లంగి, ఇతర కూరగాయలను పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. కిమ్చిని పులియబెట్టడం వల్ల అందులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియాకు మైక్రో, నానో ప్లాస్టిక్ రేణువులను గట్టిగా అతుక్కునే గుణం ఉందని గుర్తించారు.కిమ్చి వంటి ప్రో బయోటిక్స్తో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు అందులోని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉదరంలోకి చేరి నానో ప్లాస్టిక్స్కు అతుక్కుంటుంది. అనంతరం శరీర జీర్ణ ప్రక్రియలో భాగంగా ఆ బ్యాక్టీరియా ఆహారంలోని వ్యర్థాలతోపాటు నానో ప్లాస్టిక్స్తో సహా బయటకు విసర్జితం అవుతుంది. నానో ప్లాస్టిక్స్ శరరీ అవయవాల్లోకి చేరకుండా అడ్డుకోవాలంటే ఆ ప్లాస్టిక్ రేణువులు ఉదరం, పేగుల్లో ఉండగానే విసర్జితం అయ్యేలా చూడటమే ఉత్తమ మార్గమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఎలుకలపై ప్రయోగాలతో.. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం నిరూపితమైందన్నారు. ఎలుకలకు అందించిన ఆహారంలో ప్రో బయోటిక్ బ్యాక్టీరియా కలిపినప్పుడు వాటి విసర్జితాల్లో నానో ప్లాస్టిక్స్ ఆనవాళ్లు ఎక్కువ మొత్తంలో కనిపించాయని పేర్కొన్నారు. పులియబెట్టిన ఆహారం ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని అధ్యయనం చేయడానికి దక్షిణ కొరియా జాతీయ ఆహార సంస్థ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిమ్చి పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అధ్యక్షుడు హే చూన్ చాంగ్ బృందం కిమ్చిలో పులియబెట్టిన ఆహారంపై పరిశోధన ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు వ్యవసాయ ఇంజనీరింగ్లో అగ్రస్థానంలో ఉన్న బయోరిసోర్స్ టెక్నాలజీ (ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 9.0) అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.అవయవాల్లోకి ప్లాస్టిక్ చేరితే.. నానో ప్లాస్టిక్స్ అనేవి ఒక మైక్రోమీటర్ (మిల్లీమీటర్లో వెయ్యోవంతు) పరిమాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన కణాలు. పెద్ద ప్లాస్టిక్ పదార్థాలు కాలక్రమేణా విచ్ఛిన్నమవుతూ సూక్ష్మ పరిమాణంలో విభజితమవుతాయి. ఇవి మన ఆహారం, తాగునీటిలో సులువుగా కలిసిపోయి తినేటప్పుడు, తాగేటప్పుడు ఉదరంలోకి చేరిపోతాయి. ఈ ప్లాస్టిక్ రేణువులను అలాగే వదిలేస్తే క్రమంగా పేగుల్లోంచి మూత్రపిండాలు, మెదడుకు కూడా చేరి అక్కడే పేరుకుపోయి అవయవాలను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
కాలేయం ఆరోగ్యం కోసం..!
ఇటీవల కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య అధికమైంది. ఆల్కహాల్ తాగకపోయినా ఈ సమస్య బారినపడుతున్నారు చాలామంది. అసలు కాలేయం అనారోగ్యం బారిన పడకూడదంటే జీవనశైలిలో ఈ మార్పలు చోటుచేసుకుంటే చాలు అని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ. సమతుల్య ఆహారం, రోజూవారీ వ్యాయామంతో ఈ సమస్యకు చెక్కుపెట్టొచ్చని అంటున్నారు. జస్ట్ ఒక అరగంట వ్యాయామాలు, మంచి ఆహారంతోనే కాలేయాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చిన చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.ముందుగా కాలేయంపై భారాన్ని తగ్గించడని విజ్ఞప్తి చేస్తున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అనవసరమైన పెయిన్ కిల్లర్ మందులు అతిగా వాడటం, దీర్ఘకాలిక ఒత్తిడి, సరిగా నిద్రపోవకపోవడం వంటి వాటితో కాలేయంపై అతిగా భారాన్ని మోపొద్దు అంటున్నారు. అంటే సమయానికి భోజనం, నిద్ర ఉండేలా కేర్ తీసుకుంటూ ఆరోగ్యకరమైన పోషకవంతమైన ఆహారాలను తినమని సూచిస్తున్నారు. తీసుకోవాల్సినవి..కాలేయం ఆరోగ్యానికి నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందించి హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది.మిల్క్ థిస్టిల్: అనేది శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్న ఒక పురాతన మూలిక. దీనిలో ఉండే 'సిలిమరిన్' అనే క్రియాశీలక సమ్మేళనం కాలేయ ఆరోగ్యానికి (Liver health) అత్యంత మేలు. ఇది లివర్ వాపును తగ్గించి, విషతుల్య పదార్థాలను బయటకు పంపి కణాలను పునరుద్ధరిస్తుంది. హెపటైటిస్, కామెర్లు వంటి సమస్యల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలను తగ్గించి, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుందినిమ్మకాయ పరోక్షంగా డిటాక్స్కు మద్దతు ఇస్తుంది. ఇది విటమిన్ సిని అందిస్తుంది, ఇది యాంటీఆక్సిడెంట్ రక్షణకు సహాయపడుతుంది మరియు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందిస్తుంది, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వ్యర్థాల విసర్జన అనేది పైత్యరస ప్రవాహం, మూత్ర విసర్జన మరియు జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది.క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవడం: దీనిలో గ్లూకోసినోలేట్లు ఉంటాయి, ఇవి సల్ఫోరాఫేన్ సంబంధిత సమ్మేళనాలుగా మారగలవు. ఇవి ఫేజ్ 2 డిటాక్స్ ఎంజైమ్ చర్యకు, యాంటీఆక్సిడెంట్ ప్రతిస్పందన మార్గాలకు మద్దతు ఇస్తాయి.క్రూసిఫెరస్ కూరగాలు అంటే..బ్రోకలీక్యాబేజీకాలీఫ్లవర్ముల్లంగిపాలకూర (కాలే)బోక్ చోయ్ఔషధాల పరంగా: గ్లూటాథయాన్ అండ్ బి విటమిన్లు ఫ్యాటీ లివర్ ఫేజ్ 2కు కీలకమైన సాధనాలు. గ్లూటాథయాన్ రియాక్టివ్ సమ్మేళనాలను బంధించి, తటస్థీకరించడంలో సహాయపడుతుంది. బి విటమిన్లు మిథైలేషన్, శక్తి జీవక్రియ డిటాక్స్ మార్గాలకు మద్దతు ఇస్తాయి.వీటితోపాటు ప్రోటీన్, గ్లైసిన్, సిస్టీన్, ఫోలేట్, బి12, బి6, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం ఉండే ఆహారాలను తీసుకోవడంపై దృఫ్టి పెట్టాలి.వెల్లుల్లి సల్ఫర్ సమ్మేళనాలను అందిస్తుంది, ఇవి డిటాక్స్ కెమిస్ట్రీకి, యాంటీఆక్సిడెంట్ రక్షణకు మద్దతు ఇస్తాయి. ఇది హృదయ సంబంధ, రోగనిరోధక మార్గాలకు కూడా మద్దతు ఇస్తుంది. ఇలా ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో మార్పులు చేర్పులు చేసుకుంటే..మంచి ఆరోగ్యం సులభంగా సొంతం చేసుకోవచ్చిన అంటున్నారు. మరిన్ని వివరాలకు ఈ కింది లింక్పై క్లిక్ చేయండి (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్రైస్ కంటే బ్రౌన్రైస్ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్ రైస్ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్రైస్ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్ రైస్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్ రైస్ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే..తెల్లబియ్యం..తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది.బ్రౌన్రైస్ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.పోలిస్తే..సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9) అధిక స్థాయిలో ఉంటాయిఆరోగ్య పరంగా..ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తుంటే, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గడం, అలాగే బరువును మెరుగ్గా నియంత్రించుకోవడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ± 4, ఇది అధికం. బ్రౌన్ రైస్ను మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ 68 ± 4 కారంగా ఆరోగ్యప్రదంగా పరిగణించారు నిపుణులు. అదీగాక, బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది, కానీ తెల్ల బియ్యం తినడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.ఎలా తీసుకుంటే మంచిదంటే..చాలా మంది బ్రౌన్ రైస్ మంచిదన్న ఉద్దేశ్యంతో దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీనిలోని అధిక ఫైబర్ జీర్ణం చేసుకోవడం కష్టతరం చేసి జీర్ణసంబంధిత రుగ్మతలు తీవ్రమై ప్రమాదం లేకపోలేదని అంటున్నారు ఆదర్శ గౌడ. అందువల్ల బ్రౌన్ రైస్, వైట్రైస్ రెండిటిని కలిపి ఎంచుకోమని సూచిస్తున్నారు నిపుణులు. మెరుగైన పోషకాహారం కోసం కొద్దిపాటి మార్పులతో రెండిటిని సమంగా తీసుకునే ప్రయత్నం చేయమని అంటున్నారు అప్పుడు శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు ఆదర్శ గౌడ.(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ట్రంప్ హెల్త్ చెకప్ .. అధ్యక్షుడు సేఫేనా?
వాషింగ్టన్, డీసీ: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగా ఫర్ఫెక్ట్ ఉన్నానని ప్రకటించారు. తనకు వైద్య పరీక్షలు అద్భుతంగా జరిగాయని అందులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. త్వరలో డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చాలానే పుకార్లు వచ్చాయి. ట్రంప్ ఆరోగ్యంగా లేరని వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయని కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చేతులపై కమిలిన గుర్తులు ఉండటం, సమావేశాలలో నిద్రపోతున్నట్లు కనిపించడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితులపై ట్రంప్ కీలక ప్రకటన చేశారుతన ట్రూత్ సోషల్ పోస్ట్లో " అంతా ఖచ్చితంగా ఉంది నేను 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదేమో" అని సరదాగా అన్నారు. జూన్ 14 నాటికి ట్రంప్ 80వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. ట్రంప్ ఆరోగ్య పరీక్షలను వైట్ హౌస్ 'వార్షిక పరీక్ష' అని ప్రకటించినప్పటికీ, ట్రంప్ మాత్రం దీనిని 6 నెలల ఫిజికల్ టెస్ట్' అని పేర్కొనడం కొంత గందరగోళానికి దారితీసింది. ట్రంప్ ఆరోగ్య సమస్యలుట్రంప్ 0 గతేడాది ట్రంప్ కాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. సిరల్లోని కవాటాల లోపం వల్ల రక్తం చేరి ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. చేతులపై గుర్తులు: ఆయన చేతులపై కనిపించే మచ్చలకు, గుండె ఆరోగ్య నియమాలలో భాగంగా ఆయన తీసుకునే 'ఆస్పిరిన్'టాబ్లెట్లే కారణమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.రాజకీయ ప్రాధాన్యతఅమెరికా రాజకీయాల్లో అధ్యక్షుల వయస్సు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో 81 ఏళ్ల జో బైడెన్ వైదొలిగిన తర్వాత, ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన ప్రత్యర్థుల కంటే తాను శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉన్నానని ట్రంప్ తరచుగా అంటుంటారు. -
'పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ అంటే..?
అది కీలకమైన మెదడు కణమైనా.... లేదా కాళ్లూ చేతుల్లో ఉండే మామూలు కణమైనా... అది ఏదైనా సరే... దేహంలోని ప్రతి జీవకణానికీఆహారం, ఆక్సిజన్ అందడం అవసరం. ఒకవేళ అలా అందకపోతే... కీలకమైన మెదడూ, గుండె లాంటి వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో... మనం అంత ప్రధానం అనుకోని మిగతా కణజాలానికీ అలాంటి ప్రమాదమే జరుగుతుంది. అంటే... కాళ్లూ, చేతుల విషయంలోనూ జరుగుతుంది. అలా కణజాలానికి తగినంత ఆక్సిజన్, ఆహారం అందనందువల్ల వచ్చే అనారోగ్యం... ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’. ఈ సమస్య ఏమిటో, దానితో వాటిల్లో అనర్థాలేమిటో చూద్దాం...మన కాళ్లూ, చేతుల్లోని ప్రతి కణానికీ రక్త సరఫరా నిరంతరాయం జరుగుతూనే ఉండాలి. అలా జరిగినప్పుడే అవి సమర్థంగా తమ విధులు నిర్వహించగలుగుతాయి. ఏదైనా కారణాల వల్ల మన కాళ్లూ, చేతులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడటంగానీ లేదా వాటిల్లో కొవ్వు పేరుకోవడంగానీ జరిగితే... నిరంతరమూ కొనసాగాల్సిన రక్తసరఫరా సాఫీగా జరగకపోవచ్చు. అలా రక్తసరఫరా జరగనందువల్ల వచ్చే ఆరోగ్య సమస్యను ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ (ప్యాడ్) అంటారు. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే ఈ వ్యాధి స్త్రీలూ, పురుషులూ అనే తేడాలేకుండా అందరిలో కనిపించే అవకాశముంది. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీస్ ఉన్నవారిలో కాళ్లలోని పిక్కలు, నడుం కింది భాగం (హిప్)లో తరచూ తీవ్రమైన నొప్పితో కూడిన తిమ్మిర్లు (క్రాంప్స్) వస్తాయి. చాలా సందర్భాల్లో నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ లక్షణం... అంటే పిక్కలు పట్టేయడం ఎక్కువగా కనిపింవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా కనిపించవచ్చు. అంటే ఆ సమయంలో కాలూ, చేతిలోని సదరు భాగానికి తగినంత రక్తసరఫరా అందకపోవడం వల్లనే ఇలా తిమ్మిర్లు వచ్చే అవకాశాముంది. ఇలాంటప్పుడు ఆ భాగానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వగానే ఆ నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. కొందరిలో తాత్కాలికంగా స్పర్శ తెలియకుండా పోవడం (నంబ్నెస్) లేదా సూదులతో పొట్లుగా అనిపించడం (టింజ్లింగ్). మరికొందరిలో ఒక్కోసారి ఆ కాలు లేదా చేయి బలహీనంగా మారినట్లుగా అనిపించవచ్చు. ఇంకొందరిలో విశ్రాంతిగా ఉన్నప్పుడు పాదాలకింద మంటగా ఉన్నట్లుగా లేదా పాదాలు, కాలివేళ్ల కింది భాగంలో నొప్పిగానూ, మంటగానూ ఉన్నట్లు అనిపించడం. ఇక కొందరిలో పాదాలకు లేదా కాలి కింది భాగంలో ఏదైనా పుండు వంటిది వస్తే అది ఒక పట్టాన మానకపోచ్చు.పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీస్ తర్వాతి దశలో కాలు/చేయి తాలూకు రంగు మారడం, అది చల్లబారినట్లుగా ఉండటం మామూలే. ఈ దశలో కొంతమందిలో కాలు /చేతి పైన ఉండే వెంట్రుకలన్నీ రాలిపో ఇక రక్తసరఫరాకు పూర్తిగా ఆటంకం ఏర్పడి గ్యాంగ్రీన్లా పరిణమించిన కొందరిలో... కాలు / చేయి తొలగించాల్సిన (యాంప్యుటేషన్కు వెళ్లాల్సినంత) తీవ్రమైన పరిస్థితి కూడా రావచ్చు.గుండె జబ్బులకూ/ స్ట్రోక్కూ అవకాశం:పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందంటే అది కేవలం కాలూ, చేతికే పరిమితం అవుతుందనేందుకు వీల్లేదు. అంటే... ఎవరిలోనైనా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందంటే ఆ వ్యక్తిలో రక్తం సాఫీగా ప్రవహించేలాంటి తత్వం (టెండెన్సీ) లేదని అర్థం. ఇది కాళ్లూ, చేతుల్లోనే ఉంటే తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ కీలకమైన అవయవాలైన గుండె లేదా మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అదెంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్నవారికి గుండెపో పక్షవాతం ముప్పుండే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారు తమ ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో వారు సూచించిన విధంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నిర్థారణ: ఫిజికల్గా బయటకు కనిపించే లక్షణాలతోపాటు... ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ను నిర్ధారణ చేయడానికి ‘యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’ (ఏబీఐ) అనే పరీక్ష తోడ్పడుతుంది. ఇందులో ఎంతమాత్రమూ నొప్పి ఉండదు. ఈ పరీక్షలో అల్ట్రా సౌండ్ తరంగాల సహాయంతో భుజాలు / పాదాలు ఉండాల్సిన రక్తపోటునుకొలుస్తారు. ఈ ఏబీఐ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలనూ, వ్యాధి ఉందని అనుమానిస్తున్న వ్యక్తిలోని రిస్క్ ఫ్యాక్టర్లనూ సరిపోల్చి చూస్తారు. ఈ పరిశీలన తర్వాత... వ్యాధి నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా, లేదా అన్న విషయాన్ని ఫిజీషియన్ నిర్ణయిస్తారు. ఏబీఐ టెస్ట్లో... మొదట భుజం లేదా చేతిలోని రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)ను... మామూలు బీపీ యంత్రంలో కొలవడంతోపాటు, డాప్లర్ అని పిలిచే ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ స్టెతస్కోపు సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ వ్యాధినిర్థారణ కోసం శరీరంపై గాటు పెట్టకుండా కూడా నిర్ధారణ చేసే (నాన్ ఇన్వేజివ్) పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇమేజింగ్ టెక్నిక్స్ సహాయంతో ఈ నిర్ధారణ ప్రక్రియ జరుగుతుంది. ఉదాహరణకు... మాగ్నెటిక్ రిజోనెన్స్ యాంజియోగ్రఫీ (ఎమ్మార్ఏ), సీటీ యాంజియోగ్రఫీ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ వంటి పరీక్షలు ఈ వ్యాధినిర్ధారణకు తోడ్పడతాయి.ఈ వ్యాధి ఎవరెవరిలోనంటే.. వయసు యాభై ఏళ్లు పైబడ్డ ఏ వ్యక్తిలోనైనా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అయితే పెరిగే వయసు(ఏజింగ్)తోపాటు మరికొన్ని అంశాలూ ఈ వ్యాధికి కారణమవుతుంటాయి. అవి... పొగతాగే అలవాటు ఉండటం ∙వ్యాయామం చేయకపోవడం స్థూలకాయం ∙డయాబెటిస్ ∙నియంత్రణలో లేని రక్తపోటు / రక్తపోటు పెరగడం రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉండటం ఈ లక్షణాలతో పాటు కుటుంబ సభ్యుల్లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉండటం అనేది ఆ ముప్పును మరింత పెంచే అంశం. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులకూ ‘ప్యాడ్’ రిస్క్ ఉందనే అంశాన్ని గుర్తెరిగి... దగ్గరి కుటుంబ సభ్యులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కారణాలు...పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కు అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది... రక్తనాళాల్లోపల రక్తం ప్రవహించే పైప్ లోపలి పొర గట్టిబారడం. ఈ కండిషన్ను అథెరోస్కీఫ్లోరోసిస్ అంటారు. నునుపుగా ఉండే తలం మీద ద్రవం ఎలాంటి అంతరాయమూ లేకుండా సాఫీగా జారిపోతుంటుంది. ఒకవేళ ఆ తలం గరుగ్గానూ, గట్టిబారినట్లుగా మారడం వల్ల రక్తసరఫరా సాఫీగా జరగదు. దాంతో రక్తసరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఇలా రక్తనాళంలోని లోపలి తలం గరుగ్గా, గట్టిబారినట్లుగా మారడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి రక్తప్రవాహం సాఫీగా వెళ్లే ఆ పైప్లోపలి తలంపై అంటుకుని అక్కడ గారలా ఏర్పడటం వల్ల రక్తప్రవాహానికి అంతరాయాలు, అడ్డంకులు ఏర్పడవచ్చు. దాంతో ఒకచోట క్రమంగా రక్తానికి ఏదైనా తట్టుకుంటూ తట్టుకుంటూ ఉండటం వల్ల క్రమంగా అక్కడ రక్తం గడ్డకట్టినట్లుగా ఓ ఉండలాగా (క్లాట్స్) ఏర్పడవచ్చు. ఇది ఒక్కోసారి రక్తనాళాన్ని బ్లాక్ చేసి రక్తసరఫరాను అపేయవచ్చు.చికిత్సపెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కు చికిత్స చేసే ముందర బాధితుల ఫిట్నెస్, వ్యాధి తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కేవలం బాధితుడి జీవనశైలిలో మార్పులు చేయడంతోనే వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశముంది.ఉదాహరణకు బాధితుడికి పొగతాగే అలవాటు ఉంటే, పూర్తిగా మానేయడం ద్వారా మున్ముందు కాలూ / చేయి కోల్పోయే పరిస్థితి తప్పిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులతో పాటు, వ్యాధి మరింత ముదరకుండా కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు మూసుకుపోయిన చోట వాటిని తెరచేందుకు అవసరమైన చికిత్స ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది.వాడాల్సిన మందులురక్తనాళాలు మూసుకుపోవడం అన్నది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల జరుగుతుంటే దేహంలో కొలెస్ట్రాల్ మోతాదులను నియంత్రించడానికి అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో కాలు /చేయి తిమ్మిర్లు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కూడా మందులు వాడాల్సి రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ (క్లాట్)ను కరిగించే మందులూ ఉపయోగించాల్సి రావచ్చు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు బాధితులకు రక్తపోటును నియంత్రించే మందులు కూడా వాడాల్సి రావచ్చు.ఒకవేళ జీవనశైలి మార్పులూ... మందులూ సరిపోకపోతే?కొందరిలో కేవలం జీవనశైలి మార్పులతోనూ లేదా మందులు వాడటం వల్ల గాని ఈ జబ్బు అదుపులోకి రాకపోతే అప్పుడు కూడా రక్తనాళాల్లో రక్తసరఫరాను సాఫీగా జరిగేలా చూడటానికి అనేక ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... ఎక్కడైతే రక్తసరఫరాకు అడ్డంకి ఏర్పడి... తట్టుకుంటూ రక్తసరఫరా జరుగుతుంటుందో ఆ ప్రాంతాన్ని అక్కడికక్కడే తెరచి సాధారణ రక్తసరఫరాను పునరుద్ధరించవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియను గతంలోలా సంప్రదాయిక సర్జరీ రూపంలోగాక ఎలాంటి గాటూ లేకుండానే కొన్ని ప్రక్రియల ద్వారా చేయడమిప్పుడు సాధ్యమవుతుంది.గాటు పెట్టకుండా రక్తప్రవాహాన్ని సరిచేయడం ఇలా...రక్తప్రవాహానికి అడ్డుపడ్డ క్లాట్ను తొలగించి, రక్తసరఫరాను పునరుద్ధరించడానికి ఈ కింది పద్ధతులను అవలంబిస్తారు. యాంజియోప్లాస్టీ : గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డు పడ్డప్పుడు చేసినట్లుగానే కాళ్లూ/ చేతుల తాలూకు రక్తనాళంలోనూ... అడ్డు పడ్డ ప్రాంతానికి ఒక బెలూన్ లాంటి దాన్ని పంపి... ఆ బెలూన్ను రక్తం ఆగిన చోట ఉబ్బేలా చేస్తారు. దాంతో రక్తనాళంలోని ఆ ప్రదేశంలో అడ్డు తొలగిపోయి, రక్తసరఫరా మామూలుగా అవుతుంది.అథెరెక్టమీ: ఈ ప్రక్రియలో రక్తనాళం (ధమని)లోకి ఒక క్యాథెటర్ను పంపుతారు. రక్తనాళంలోకి వెళ్లే ఒక నునుపైన పైప్ లాంటి దాన్ని క్యాథెటర్ అంటారు. దీని ద్వారా రక్తనాళం లోపలి ఉన్న గారను తొలగిస్తారు. గట్టిగా మారి ఉన్న ప్రాంతాన్ని నున్నగా అయ్యేలా చేయడం, లేదా షేవ్ చేసినట్లుగా నునుపుగా మార్చడం జరుగుతుంది.స్టెంట్ వేయడం: గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళం సన్నబడ్డప్పుడు ఆ సన్నటి ప్రాంతాన్ని మళ్లీ మామూలుగానే తెరుచుకుని ఉంచేలా చేస్తారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి పైప్ లాంటి దాన్ని వేసి తెరచి ఉండేలా చేసినట్లే (స్టెంట్ వేసినట్లే)... అచ్చం అదే తరహాలో కాలు / చేతిలోని రక్తనాళాల్లోని మూసుకుపోయి ఉన్నభాగానికి ఒక స్టెంట్ వేస్తారు. దాంతో మూసుకుపోయిన భాగం తెరచుకుంటుంది. ఫలితంగా ఎలాంటి అంతరాయం లేకుండా రక్తసరఫరా సాఫీగా జరిగిపోతుంది. స్టెంట్ గ్రాఫ్ట్స్: కొన్ని సందర్భాల్లో ఈ స్టెంట్లలో సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటిదాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కేవలం ఇలాంటి మార్గాలే కాకుండా కొన్నిసార్లు సాంప్రదాయికంగా చేసే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళంలో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించాల్సి రావచ్చు. ఒక్కోసారి రక్తనాళం అంతా మూసుకుపోతే బైపాస్ కూడా చేయాల్సి రావచ్చు. వ్యాయామం లేకుండా ఉండటం వంటి బద్ధకంగా ఉండే జీవనశైలి, పొగతాగడం వంటి దురలవాట్ల కంటే మన దేహంలోని అవయవాలు విలువైనవి కాబట్టి... అలాంటి దురలవాట్లను వదులుకొని, చురుకైన జీవితం గడపడం అవసరం. దాంతో ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగించవచ్చు.డాక్టర్ రాజా వి కొప్పాల సీనియర్ ఇంటర్వెన్షనల్ , రేడియాలజిస్ట్నిర్వహణ: యాసీన్చదవండి: అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా 47 ఏళ్ల మామ్..! నో ఐస్ బాత్, నో క్రేజీ డిటాక్స్.. -
40 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ.. సవాళ్లు ఇవే
ప్రస్తుతం సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ విషయంలో సరికొత్త ట్రెండ్కు తెరలేపారు. సోనమ్ కపూర్, కత్రినా కైఫ్ తదితర ప్రముఖ తారలు 30 ఏళ్ల చివరలో లేదా 40 ఏళ్ల వయసులో మాతృత్వాన్ని స్వీకరించి, సరికొత్త ఆలోచనలకు పురిగొల్పారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులు 30 ఏళ్లు దాటాక గర్భధారణ ప్రక్రియను సాధ్యం చేస్తున్నప్పటికీ, ఈ వయసులో గర్భం దాల్చడం అనేది శరీరానికి ఒక సవాలుతో కూడుకున్న ప్రయాణమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.‘అడ్వాన్స్డ్ ఏజ్ ప్రెగ్నెన్సీ’ అంటే ఏమిటి?వైద్య పరిభాషలో 35 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు జరిగే ప్రసవాలను ‘అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్’ (ఏఎంఏ) అని పిలుస్తారు. ఇది ప్రమాదకరమని కాదుగానీ.. వయసు పెరిగేకొద్దీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యత, అవయవాల పనితీరులో మార్పులు సహజం. ఈ మార్పులు ప్రసవ సమయంలో కొన్ని ఇబ్బందులకు దారితీయవచ్చు. సరైన వైద్య పర్యవేక్షణ, జీవనశైలి మార్పులతో ఈ ముప్పులను తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.రక్తపోటుపై ప్రత్యేక దృష్టివయసు పైబడిన ప్రెగ్నెన్సీలలో డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా గమనించే అంశం ‘బ్లడ్ ప్రెషర్’. వయసు పెరిగేకొద్దీ రక్తనాళాలు బిగుతుగా మారి, రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ‘ప్రీఎక్లాంప్సియా’ అనే స్థితికి దారితీయవచ్చు, దీనివల్ల కాలేయం లేదా మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే, ఫిట్స్ రావడం లేదా ముందస్తు ప్రసవం వంటి తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు.గర్భస్రావం: మానసిక, శారీరక వేదనదురదృష్టవశాత్తూ, వయసు పెరిగేకొద్దీ అండాల నాణ్యత తగ్గుతుంది? ఇది గర్భస్రావం లేదా పిండం ఎదుగుదలలో సమస్యలకు కారణమవుతుంది. 40 ఏళ్ల దాటిన మహిళల్లో క్రోమోజోమ్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఇది శారీరక ఆరోగ్యానికే కాకుండా, మహిళల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మళ్లీ గర్భం దాల్చడం లేదా ‘వైఫల్యాలు’ ఎదురైనప్పుడు ఆ బాధ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.గెస్టేషనల్ డయాబెటిస్ ముప్పువయసు పెరిగిన మహిళల్లో జీవక్రియ, ఇన్సులిన్ ప్రతిస్పందనలో వచ్చే మార్పుల వల్ల ‘గెస్టేషనల్ డయాబెటిస్’ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవడంలాంటివి సంభవించవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.ముందస్తు ప్రసవం మరియు రికవరీ40 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన వారిలో 37 వారాల కంటే ముందే ప్రసవం జరిగే అవకాశాలు అధికం. అకాలంగా జన్మించే శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం కావచ్చు. ఇది తల్లికి మరింత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రసవం తర్వాత రికవరీ కావడానికి కూడా ఎక్కువ సమయం పట్టవచ్చు. అధిక రక్తస్రావం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.ప్రసవ సమయంలో అనిశ్చితిప్రసవం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు పెరిగిన మహిళల్లో గర్భాశయ ముఖద్వారం, కండరాలు చిన్న వయసువారితో పోలిస్తే నెమ్మదిగా స్పందించవచ్చు. దీనివల్ల ప్రసవం ఆలస్యమయ్యేందుకు అవకాశముంది. శిశువు స్థానం లేదా తల్లి ఆరోగ్య పరిస్థితులను బట్టి ‘సిజేరియన్’ అవసరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 40 ఏళ్ల వయసులో మాతృత్వం అసాధ్యం కాకపోయినప్పటికీ, మరిన్ని జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘యోగి’ మార్క్ రూల్స్: నమాజ్లు, బలులు బ్యాన్ -
వామ్మో.. థైరాయిడ్! కీళ్ల నొప్పులు, డిప్రెషన్..
కొద్దిగా పని చేసినా నిస్సత్తువ ఆవహించడం, చిన్న విషయాలకే కోపం రావడం, ముఖం ఉబ్బుగా కనిపించడం, చర్మం పొడిబారడటం, కీళ్ల నొప్పులు వేధించడం, ఊబకాయం రావడం, అకస్మాత్తుగా సన్నబడటం వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్షించుకోండంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ప్రతి పది మందిలో ఒకరికి థైరాయిడ్ వ్యాధి వేధిస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నేడు వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈ లక్షణాలు కనిపిస్తే.. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్ థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. థైరాయిడ్ నోడ్యూల్స్, గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు), థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉన్నాయి. అలసట, బరువు పెరడగం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోౖథెరాయిడిజం లక్షణాలు, బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్ లేదా నోడ్యూల్స్ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. ఇలా కణితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ అవసరం లేదు. క్యాన్సర్గా మారితేనే ఆపరేషన్ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడ్డ వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్ కణితులు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది. కారణాలు.. థైరాయిడ్ సమస్యకు కారణాలు అనేకం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. హైపోౖథెరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అయోడిన్ లోపం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీతో గానీ, కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథి వాపు వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం/ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణం. అయోడిన్ లోపం గానీ, అధికంగా ఉన్నా దీని బారినపడతారు. నివారణ ఇలా.. థైరాయిడ్ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు) తీసుకోవాలి. వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోౖథెరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, హైపర్ థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ, శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారి శస్త్ర చికిత్స, కిమోథెరపీ గానీ రేడియేషన్ గానీ అవసరం కావచ్చు మహిళల్లోనే అధికం.. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత, రుతుక్రమం ఆగిన తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోౖథెరాయిడిజం, హైపర్ౖథెరాయిడిజం మాతా,శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జిల్లాలో థైరాయిడ్ బాధితులు అధికంగా ఉండటంతో ప్రతీ పీహెచ్సీలో థైరాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.త్వరగా గుర్తిస్తే మేలు సమాజంలో 11 శాతం మందిలో హైపోౖథెరాయిడ్, రెండు శాతం మందిలో హైపర్ థైరాయిడ్ సమస్య ఉంది. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు రాకుండా చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ దల్లి సురేష్రెడ్డి, ఎండీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఇచ్ఛాపురంగర్భిణులు జాగ్రత్త.. థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. పుట్టబోయే బిడ్డకు కూడా పరీక్ష చేయించాలి. థైరాయిడ్ ఉందంటే మందులు వాడాలి. లేకపోతే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు అధికం. – డాక్టర్ ఎ.రమ్యారెడ్డి, వైద్యాధికారి, ఈదుపురం మరిన్ని వివరాలకు ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి -
ప్లీజ్..వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి!
మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహారమే ఆరోగ్యకరమైనది. నాలుకకు రుచిగా, కంటికి ఇంపుగా కనిపించే జంక్ఫుడ్ ఎన్నటికీ అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ద తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుందని అంటున్నారు. మనం తీసుకునే ఆహారమే ఒత్తిడి, అలసట, నిరుత్సాహం వంటి మూడ్స్కి కారణమవుతుందని గమనించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ఆహారం కారణంగానే..మన ఒత్తిడి, ఆందోళన బారిన పడి క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వారి మాటల్లోనే తెలుసుకుందాం.మన తీసుకునే ఆహారం కేవలం కేలరీలు మాత్రమే కాదు, శక్తి, మానసిక స్థితి, నిద్ర, ఏకాగ్రత, స్వస్థత వంటి వాటిక మూలం. నిరంతరం అలసటగా, ఉబ్బరంగా, ఆందోళన, నిరుత్సాహం, ఒత్తిడి ఎదురవ్వుతుంటే శరీరం ఆహారాన్నికాదు పోషణను కోరుకుంటుందని అర్థమట. అందుకే శుభ్రమైన ఆహరం తినమని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా హైడ్రేటెడ్గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగమని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా సహజమైన ఆహారాన్నే ఎంచుకోమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన మనస్సు + ఆరోగ్యకరమైన శరీరం అని నొక్కి చెబుతున్నారు. దయచేసి వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి.. స్వస్థతకు ఆహారం ఇవ్వడం ప్రారంభించండి అని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు.డా. ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం నిపుణుల ఆధారంగా ఇచ్చిన కథనం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!) -
ఫోరెన్సిక్ వైద్యంలో 'మరణపూర్వ గాయాలు' అంటే? ఎలా గుర్తిస్తారంటే..
భోపాల్లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణించడానికి ముందు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయలయ్యాయని ఫోరెన్సిక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మరణపూర్వ గాయాలు అంటే ఏంటీ?, ఫోరెన్సిక్ వైద్యులు వాటిని ఎలా గుర్తిస్తారు వంటి వాటి గురించి తెలుసుకుందామా.!.ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఇవి అత్యంత కీలకమైన ఆధారాలు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోస్ట్మార్టం నిర్వహించడానికి తరలిస్తారు పోలీసులు. అక్కడ ఫోరెన్సిక నిపుణులు ఆ వ్యక్తి ఎలా మరణించాడో నిర్థారించే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నిపుణులు పోస్ట్మార్టం నివేదికలో మరణానికి ముందు గాయాలు, మరణానంతర గాయాలు అని పేర్కొంటూ ఇస్తారు. ఇవి కేసుని చేధించడానికి ఎంత కీలకం అంటే..ఆయా వ్యక్తుల మరణానికి కారణమైన నేరస్తులను వెలకితీయడానికి ప్రధాన ఆధారాలు. 'మరణపూర్వ గాయాలు' అంటే ..ఫోరెన్సిక్ వైద్యంలో, "మరణపూర్వ" అంటే మరణానికి ముందు జరిగే గాయలని అర్థం. జీవించి ఉండగానే అయ్యిన గాయాలని అర్థం. అవికోతలు లేదా రాపిడి గాయాలువాపుఎముకలు విరగడంఅంతర్గత రక్తస్రావంబలహీనమైన దెబ్బలుఆత్మరక్షణ గాయాలు తదితరాలు.వైద్యులు చెప్పేదేమిటంటే, ఈ పదం గాయాలు ఎలా జరిగాయో దానంతట అదే వెల్లడించనప్పటికీ, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తుంద.ఎలా గుర్తిస్తారంటే?మరణానంతర పరీక్ష సమయంలో, ఫోరెన్సిక్ నిపుణులు మరణానికి ముందు శరీరం గాయానికి ప్రతిస్పందించిందని చూపే ఆధారాలను సేకరిస్తారు. కణజాలంలోకి రక్తస్రావం, వాపు లేదా ఉబ్బరం, రంగు మార్పులతో కూడిన కమిలిన గాయాలు, రక్తం గడ్డకట్టడం, రక్త ప్రసరణ చురుకుగా ఉందని సూచించే కణజాల ప్రతిచర్యలు వంటివి ముఖ్యమైన సంకేతాలు. గుండె ఇంకా రక్తాన్ని పంపింగ్ చేస్తూ, శరీరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు సాధ్యమవుతాయి. ఇవి చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నివేదిక. దర్యాప్తు అధికారులు ఈ గాయాలు మరణానికి ఏవిధంగా దోహదపడ్డాయి, ఆ టైంలో ఏదైన పెనుగులాట జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగాయ, స్వయంగా జరిగినవా వంటివి నిర్థారిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కేలుసలలో లేదా ఏదైన కుట్రపన్ని ఉద్దేశ్యపూర్వకంగా చంపేసిన ఘటనల్లోనే ఇలాంటి బహుణ మరణ పూర్వగాయాలకు ఆస్కారం ఉంటుంది. అదీగాక పోలీసులు వైద్య నివేదికలు లేకుండా ఒక నిర్ధారణకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. మరణానంతర గాయాలు అంటే..మరణం తర్వాత కలిగే గాయాలను మరణానంతర గాయాలు అంటారు. ఇవి సాధారణంగా అవే జీవసంబంధమైన ప్రతిచర్యలను చూపించవు.మరణానికి పూర్వం-మరణానంతర గాయాల మధ్య వ్యత్యాసం..మరణానికి ముందు గాయాలుమరణానికి ముందు సంభవిస్తాయిరక్తస్రావం, వాపును చూపుతాయిగాయం జరిగినప్పుడు శరీరం సజీవంగా ఉందని సూచిస్తాయిమరణానంతర గాయాలుమరణం తర్వాత సంభవిస్తాయిసాధారణంగా వాపు లేదా కణజాల ప్రతిచర్య ఉండదుమృతదేహాన్ని తరలించే సమయంలో, పర్యావరణానికి గురైనప్పుడు లేదా శరీరాన్ని తాకినప్పుడు జరగవచ్చు. ఇక్కడ కేసుని చేధించడంలో ఫోరెన్సిక్ నివేదిక అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అధికారులు ఒక నిర్ధారణకు రావడానికి ముందు పోలీసుల ఇన్విస్టిగేషన్, సాక్షుల వాంగ్మూలాలు, టాక్సికాలజీ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వైద్య చరిత్ర వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.(చదవండి: సింగింగ్'తో జీర్ణక్రియ మెరుగుపడుతుందా? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు) -
క్రూజ్ షిప్లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!
ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.కెనడాలో తొలి కేసు నమోదుఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.మనిషి నుంచి మనిషికి వ్యాప్తిసాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేపట్టాయి.కోవిడ్లా కాదు.. ప్రజలకు ముప్పు లేదుక్రూజ్ షిప్లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట! -
టీ, కాఫీ తాగుతున్నారా? పరిశోధనలో ఏం తేలిందంటే?
టీ లేదా కాఫీని చాలా మంది ప్రాణానికి ప్రాణంలా భావిస్తుంటారు. సమయానికి కాఫీ తాగనిదే ఏదీ తోచదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జీవితంలో భాగమైపోయిన కాఫీపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. తాజాగా, జరిగిన మరో పరిశోధనలో శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు గుర్తించారు. రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగడం డిమెన్షియా (చిత్త వైకల్యం) ప్రమాదాన్ని తగ్గిస్తుందని గుర్తించారు. ముఖ్యంగా 75 ఏళ్ల లోపు వయస్సు వారిలో ఈ ప్రభావం బాగా కనిపించింది. కెఫీన్ మెదడు కణాలను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న వాపు, హానికర ప్లాక్ పేరుకుపోవడాన్ని తగ్గించవచ్చు. అయితే, అధికంగా కాఫీ తాగితే మాత్రం చాలామంది అంతగా ప్రయోజనాలు పొందలేరు. మితంగా, మోతాదులో తాగేవారిలో డిమెన్షియా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గింది. పూర్తి వివరాలు...మోతాదులో కెఫీన్ ఉన్న కాఫీ లేదా టీ తాగితే వయస్సు పెరిగేకొద్దీ డిమెన్షియా ప్రమాదం తగ్గవచ్చని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనాన్ని 131,821 మంది నర్సులు, ఆరోగ్య రంగ నిపుణులను 43 ఏళ్ల పాటు పరిశోధకులు చేశారు. అధ్యయనం ప్రారంభమైనప్పుడు ఇందులో పాల్గొన్నవారి వయస్సు 40 ఏళ్ల ప్రారంభ దశలో ఉంది. అధ్యయనం కాలంలో 11,033 మందికి డిమెన్షియా వచ్చింది. మొత్తం పాల్గొన్నవారిలో ఈ సంఖ్య సుమారు 8 శాతం మాత్రమే. మితమైన మోతాదులో కెఫీన్ ఉన్న కాఫీ లేదా టీ తాగినవారిలో డిమెన్షియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. 75 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిలో మంచి ప్రయోజనాలు కనిపించాయి. రోజుకు 250ఎంజీ నుంచి 300ఎంజీ వరకు కెఫీన్ తీసుకున్నవారిలో, అంటే సుమారు 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగినవారిలో డిమెన్షియా ప్రమాదం 35 శాతం తగ్గింది. అంతకంటే ఎక్కువ కెఫీన్ తీసుకున్నా అదనపు రక్షణ కనిపించలేదు.అధ్యయనం ప్రారంభంలో మహిళలు రోజుకు సగటున నాలుగున్నర కప్పుల కాఫీ లేదా టీ తాగుతున్నట్లు చెప్పారు. పురుషులు సుమారు రెండున్నర కప్పులు తాగుతున్నట్లు తెలిపారు. ఎక్కువ కెఫీన్ ఉన్న కాఫీ తాగినవారు సాధారణంగా తక్కువ వయస్సు ఉన్నవారే అయినా.. వారు ఎక్కువ మద్యం సేవించడం, ఎక్కువగా పొగ తాగడం, అధిక కేలరీలు తీసుకోవడం వంటివి చేశారు. ఇవన్నీ డిమెన్షియా ప్రమాదంతో సంబంధం ఉన్న అంశాలు.డీకాఫ్ కాఫీ (కాఫీ గింజల నుంచి 97 శాతం కంటే ఎక్కువ కెఫిన్ను తొలగించి తయారుచేసే కాఫీ) విషయంలో అనూహ్య ధోరణిని కూడా పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ డీకాఫ్ తాగినవారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల వేగంగా కనిపించింది. నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు, గుండె స్పందనలో లోపాలు వచ్చిన తర్వాత కొందరు డీకాఫ్కు మారి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సమస్యలు జ్ఞాపకశక్తి తగ్గుదల, డిమెన్షియాతో సంబంధం ఉన్నాయి.కెఫీన్ మెదడును ఎలా రక్షిస్తుంది?కెఫీన్ మెదడుకు ఆరోగ్యకర ప్రయోజనాలు అందించడానికి పలు జీవశాస్త్ర కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెఫీన్ అడెనోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. ఇది డోపమైన్, అసిటైల్కోలిన్ వంటి ముఖ్యమైన మెదడు సందేశ రసాయనాల పనితీరును మందగింపజేస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ, అల్జీమర్స్ వంటి వ్యాధుల్లో ఈ రసాయనాలు సహజంగానే తగ్గుతాయి. కెఫీన్ ఆ తగ్గుదలను ఎదుర్కోవడంలో సహాయపడవచ్చు.కెఫీన్ వాపును తగ్గించడం, రక్తంలో చక్కెర వినిమయాన్ని నియంత్రించడం ద్వారా కూడా మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. జీవితాంతం రోజు 2 కప్పులకంటే ఎక్కువ కాఫీ తాగినప్పటికీ డిమెన్షియా రాని వ్యక్తుల మెదడులో అమైలాయిడ్ ప్లాక్ స్థాయులు తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు తేల్చాయి. అల్జీమర్స్ ఉన్నవారిలో ఈ విషపూరిత ప్లాక్లు సాధారణంగా కనిపిస్తాయి. -
బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు!
నూహ్: నీరే ప్రాణాధారం... కానీ ఆ గుక్కెడు నీటి కోసమే ఓ గ్రామం ప్రతిరోజూ ప్రాణసంకటాన్ని ఎదుర్కొంటోంది. ‘హర్ ఘర్ జల్’ అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాగా, వాస్తవ పరిస్థితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. హర్యానాలోని నూహ్ జిల్లా మలాబ్ గ్రామంలో సూర్యోదయంతోనే మహిళల నీటి కష్టాలు మొదలవుతాయి. పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలయినా,పురుషులైనా, చివరికి నిండు గర్భిణులైనా ఆ నీటి కుండల బరువు మోయక తప్పని దయనీయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.కాగితాలపైనే పథకాలు... కన్నీళ్లలో మహిళలుజల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా, మలాబ్ గ్రామంలో మాత్రం పైపుల ద్వారా చుక్క నీరు రావడం లేదు. భూగర్భ జలాలు ఉప్పగా మారడంతో, దాదాపు 12,200 మంది గ్రామస్తులు తాగే నీటి కోసం ‘కుండ్’ అనే భూగర్భ ట్యాంకులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. 82 ఏళ్ల వృద్ధురాలు షకీలా తన జీవితమంతా తలపై నీళ్ల బిందెలు మోస్తూనే గడిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం వారి నిరీక్షణ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.నిండు గర్భిణులకూ తప్పని..నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, ఏడు నెలల గర్భిణీ అయిన 26 ఏళ్ల అర్షీ సైతం ప్రతిరోజూ బరువైన నీటి బకెట్లు మోస్తోంది. బరువులు ఎత్తకూడదని వైద్యులు హెచ్చరించినా, ఆమెకు వేరే దారి లేదు. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ రోజుకు పలుమార్లు ఈ భూగర్భ ట్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దయనీయ పరిస్థితి కారణంగా స్థానిక మహిళలు నిరంతర వెన్నునొప్పి, డీహైడ్రేషన్, తీవ్రమైన అలసటకు గురవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.చదువును మింగేస్తున్న నీటి కటకటనీటి కోసం సాగే ఈ జీవన్మరణ పోరాటం బాలికల భవిష్యత్తును సైతం ఛిద్రం చేస్తోంది. ఇంటి పనుల్లో, ముఖ్యంగా నీళ్లు మోయడంలో సహాయపడేందుకు తల్లిదండ్రులు ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. పైగా పాఠశాలల్లో కనీస నీటి సౌకర్యం, శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడంతో నెలసరి సమయంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఆరుబయట ఉండే భూగర్భ ట్యాంకుల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. అధికారులు ప్రాజెక్టుల పేరిట కేవలం హామీలకే పరిమితమవుతున్నారు.ఇది కూడా చదవండి: హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు! -
సమస్యగా మారిన వర్క్ ఫ్రమ్ హోమ్!
ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం చాలామంది ఉద్యోగులకు సౌకర్యంగా మారింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తూ సమయం, ప్రయాణ ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. అయితే.. ఈ విధానం కొంతమందికి ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తోంది. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం పెద్ద చర్చకు దారితీసింది.ఆ ఇంజనీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది తనకు మొదటి వర్క్ ఫ్రం హోమ్ అనుభవం. తాను సహజంగా చాలా యాక్టివ్ పర్సన్, అయితే.. ఇంట్లో ఒంటరిగా పని చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతున్నట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ప్రతిరోజూ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే బద్ధకంగా, అలసటగా అనిపిస్తోందని తెలిపారు. దీని కారణంగా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నానని, ఉత్సాహం తగ్గిపోయిందని వివరించారు.అతను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి పనిచేసే గది. ఆ గదిలో కిటికీలు లేవని, పొరుగింటి గోడ ఉండటం వల్ల సహజ కాంతి అసలు లోపలికి రాదని పేర్కొన్నారు. రోజంతా సూర్యకాంతి లేకుండా గదిలో ఉండటం వల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సూర్యకాంతి లేకపోవడం వల్ల విటమిన్ డీ లోపం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చని చాలామంది వైద్యులు చెబుతుంటారు.అంతేకాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ తన లైఫ్ స్టైల్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు. పని స్టార్ట్ చేయడానికి ముందు మాత్రమే నిద్ర లేవడం, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఎక్కువగా AI టూల్స్ ఉపయోగించి కోడింగ్ చేయడం వల్ల శారీరక కదలికలు తగ్గిపోయాయని చెప్పారు. ముందులా తీవ్రంగా ఆలోచిస్తూ.. కోడింగ్ చేసే అనుభూతి కూడా లేకపోవడంతో పని పట్ల ఆసక్తి తగ్గుతోందని తెలిపారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ముందుగా విటమిన్ డీ, ఐరన్ లెవెల్స్ టెస్ట్ చేసుకోమని సూచించారు. మరికొందరు గదిలో సూర్యకాంతి, తాజా గాలి లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. వ్యాయామం చేయడం, జిమ్కు వెళ్లడం, సరైన ఆహారం తీసుకోవడం, అలాగే కిటికీలు ఉన్న గదిలో పని చేయడం మంచిదని సలహా ఇచ్చారు.కొంతమంది నెటిజన్లు “వర్క్ ఫ్రం హోమ్ నిజానికి శక్తిని ఆదా చేస్తుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోవడం ఒక పెద్ద ప్రయోజనం. కానీ సరైన జీవనశైలి లేకపోతే అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది” అని పేర్కొన్నారు. మరికొందరు తీవ్రమైన అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే! -
కృత్రిమ గర్భధారణకు కృత్రిమ మేధోసాయం!
కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడ్పడుతోంది. మునుపు దాదాపు పరిశోధనల్లో లేదా మరికొన్ని అంశాల్లో సహాయకారిగా ఉండే ఏఐ ఇప్పుడు వైద్యరంగంలోని చాలా విషయాల్లో తన సహాయం అందించడం పరిపాటి అయ్యింది. ఐవీఎఫ్ ప్రక్రియకు మరింత చేయూత ఇచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం...పిల్లలు లేనివారు ఓ బిడ్డకోసం తాపత్రయపడటం మన సమాజంలో ఉన్నదే. ఇందుకు సహాయపడే కృత్రిమ గర్భధారణ ప్రక్రియల్లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఒకటి.ఐవీఎఫ్ అంటే... ఐవీఎఫ్ ప్రక్రియలో మొదట మహిళ అండాశయాల నుంచి అండాలను సేకరించి వీర్యకణంతో కృత్రిమంగా ఫలదీకరణం జరిగేలా చూస్తారు. దంపతులు కలిసినప్పుడు ఏదైనా కారణాలతో మహిళలో నేచురల్గా ఫలదీకరణం జరగనప్పుడు డాక్టర్లు ఇలా బయటే ఫలదీకరణ జరిగేందుకు సహాయపడుతుండటంతో దీన్ని ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ (ఏఆర్టీ) అంటారు. ఫలదీకరణ లోపలే జరగకపోవడానికి కారణాలంటే... మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకు΄ోవడం, ఎండోమెట్రియాసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) లేదా ఓవరీ తాలూకు సమస్యలుండటం, నిర్దిష్టంగా ఇదీ సమస్య అని తెలియని కారణాలు ఉండటం. అదే పురుషుల విషయంలో వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం. ఈ సమస్యలున్నప్పుడు ఫలదీకరణ జరిగేందుకు బయటే ఐవీఎఫ్ జరిగేలా చూస్తారు.ఎలా చేస్తారంటే... సంక్లిష్టమైన ప్రక్రియ అయి ఐవీఎఫ్ను అనేక అంచెల్లో చేయాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మహిళలో అండాలు పెరిగేలా చూస్తారు. మామూలుగానైతే మహిళలో నెలకు ఒక అండమే పెరుగుతుంది. ఇలా అనేక అండాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని ‘కంటెయిల్డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్’ అంటారు. ఇలా అండాలు పెరిగాక ఒక సూదిలాంటి పరికరంతో ‘ఫాలికిల్’ నుంచి వాటిని బయటకు తెస్తారు. అటు తర్వాత ఆ అండాలను ఓ ఇంక్యుబేటర్లోకి ప్రవేశపెడతారు. ఆపైన ఆ అండాల్లోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడాన్ని ‘ఇంట్రా సైటో΄్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఐసీఎస్ఐ) అంటారు. ఫలదీకరణం అయిన అండం ఇక ‘పిండం’ (ఎంబ్రియో)గా మారుతుంది. బయట కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేశాక... ఇక ఆ పిండాన్ని (ఎంబ్రియోను) గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. తాజా పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంబ్రియో’ అంటారు. కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన ఎంబ్రియోలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడితే దాన్ని ‘ఫ్రోజెన్ ట్రాన్స్ఫర్’ అని అంటారు. ఇలా మహిళలోకి ప్రవేశపెట్టిన పిండాన్ని గర్భసంచి ఆమోదించి, తనలో నేచురల్గా పెరిగేందుకు అనుమతిస్తే ఇక ఆ ప్రెగ్నెన్సీ మామూలు గర్భవతిలోలాగే పెరుగుతుంది. ఐవీఎఫ్లో జరిగేది ఇదే.ఏఐ సహాయం ఎక్కడెక్కడ...ఇప్పుడు ఐవీఎఫ్లోని అనేక దశల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) సహాయం చేస్తోంది. అదెలాగంటే... ∙హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవేవి ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడం కృత్రిమంగా పెరిగిన అనేక అండాలలో నాణ్యమైన వాటి ఎంపిక పార్టనర్ వీర్యకణాల్లోనూ నాణ్యమైన వాటి ఎంపిక టైమ్–లాప్స్ ఎంబ్రియో ఇమేజింగ్ సిస్టమ్స్... అంటే ఇందులో పిండం (ఎంబ్రియో) డిస్టర్బ్ కాకుండా ఉండేలా చూస్తూ... కొన్ని అడ్వాన్స్డ్ కెమెరాల సహాయంతో... ఆ ప్రక్రియ ఎలాంటి అంతరాయాలూ లేకుండా జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం. ఈ డేటా సహాయంతో నాణ్యమైన ఎంబ్రియోను సూచించడం.భవిష్యత్తులో మరింత పురోగతి... ఏఐ పరిజ్ఞానాన్ని మరిన్ని అంశాల్లో మరింత లోతుగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని... ∙గర్భధారణ ఏ మేరకు విజయవంతం కాగలదనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ∙ల్యాబ్లలో జరిగే ప్రక్రియలు మరింత తేలిగ్గా / సులువుగా జరిగేందుకు తగిన సాంకేతికతను అభివృధ్ధి చేసుకోవడం (ఎంబ్రియాలజీ ల్యాబ్ ఆటోమేషన్) మహిళ దేహంలో జరుగుతున్న హార్మోనల్ మార్పులను పరిశీలించడం (డిజిటల్ పేషెంట్ మానిటరింగ్) ∙రోబోటిక్స్ సహాయంతో ప్రక్రియలు మరింత సునిశితంగా / ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం ∙తనకు డాక్టర్ ఇచ్చిన సూచనలను మహిళ ఖచ్చితంగా పాటిస్తోందా లేదా అన్నది పరిశీలించడం (రియల్ టైమ్ అప్డేట్) ∙అండాలు/పిండాల నిల్వలో (క్రయోప్రిజర్వేషన్)లో గణనీయమైన మెరుగుదల.ఏఐ సహాయంతో ఇవీ ప్రయోజనాలు...మెరుగైన గర్భధారణ ఫలితాలు: నాణ్యమైన ఎంబ్రియో ఎంపికతో గర్భధారణకు మెరుగైన అవకాశాలు ప్రమాదాలు / ముప్పులు తగ్గడం : దేహానికి కోత / గాటు పెద్దగా లేకపోవడంతో (అతి తక్కువ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల) తక్కువ నొప్పి, తక్కువ ముప్పు (రిస్క్) సునిశితత్వం / ఖచ్చితత్వం: ల్యాబ్ ప్రక్రియలన్నీ సమర్థంగా జరిగేలా చూడటం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించడం. చివరగా... ఐవీఎఫ్ అన్నది ఇప్పటికీ కొంత ఖరీదైన ప్రక్రియే. ఈ ప్రక్రియలో వేగాన్నీ, సునిశితత్వాన్ని, ఖచ్చితత్త్వాన్ని పెంచడం ద్వారా ఫలదీకరణ అవకాశాలు మరింత మెరుగుపరచడం, తద్వారా ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇలా ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఐవీఎఫ్ మరింత ఫలవంతంగా రూపొందే అవకాశముంది.నిర్వహణ : యాసీన్ (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?) -
పండ్లు ఎప్పుడు తినాలి?.. భోజనం తరువాత? ముందా?
పండ్లు, కాయగూరలు నిత్యం తినడం ఆరోగ్యానికి మంచిదని వింటూనే ఉంటాం. మనలో చాలామంది ఆరోగ్య సంరక్షణ కోసం తింటూ ఉంటారు కూడా. అయితే సాధారణంగా భోజనం తరువాత పండ్లు తింటూంటాం మనం. ఇది ఆరోగ్యానికి మేలు చేయదంటోంది తాజా అధ్యయనాలు. ఇలా ఎందుకు? ఎప్పుడు తినాలి? అన్నది బెంగళూరులోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ మాటల్లో...చీకటిపడగానే నిద్ర... కడుపు ఖాళీ అవుతూండగానే ఆకలి అన్నది ప్రకృతి ద్వారా మనకు సహజసిద్ధంగా అందిన లక్షణాలు.. ఇలా కాకుండా.. పగలు నిద్రపోయినా.. ఇష్టానుసారం తిన్నా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. ఇది పండ్ల విషయంలోనూ వర్తిస్తుంది. భోజనం తరువాత లేదా భోజనంతో కలిపి తినడం వల్ల పండ్లు ఆరోగ్యాన్ని ఇవ్వవు. ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పండ్లలో మనకు ఉపయోగపడే ఎంజైమ్లు.. బొప్పాయిలోని పపెయిన్, అనాసలోని బ్రోమలీన్ వంటివి ఖాళీ కడుపులోనే బాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థలో ఇతర ఆహార పదార్థాలు ఏవి ఉన్నా.. ఈ ఎంజైమ్లు శరీరానికి ఒంటబట్టడం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం తరువాత పండ్లు తింటే.. ఈ ఎంజైమ్లు వెనుకబడిపోతాయి. తేలికగా జీర్ణమయ్యే చక్కెరలు మాత్రమే శరీరానికి ముందుగా అందుతాయి. అందుకే కడుపారా భోంచేసిన తరువాత రక్తంలోని చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరిగిపోవడం. ఈ క్రమంలో ప్రొటీన్లు, కొవ్వుల తరువాత మాత్రమే ఎంజైమ్లు జీర్ణమవుతాయి. ఫలితంగా ఇవి చిన్న పేవుల్లోకి చేరే ముందే (పోషకాలన్నీ శరీరానిక అందేది ఇక్కడి నుంచే) పులిసిపోయి పనికి రాకుండా పోతాయి.తరుణోపాయం...భోజనం తరువాత పండ్లు తీసుకోవడం సరికాదన్నది స్పష్టం. మరి ఎప్పుడు తీసుకోవాలి? ఉదయాన్నే పరగడుపున మంచిది అంటోంది యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం. ఇలా చేస్తే... రక్తంలో చెక్కర మోతాదు కూడా ఎక్కువగా పెరగలేదని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే ఒక పండును ఉదయం తిన్నప్పుడు రక్తంలో విటమిన్ సి, కరొటనాయిడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నాయని, అదే పండు సాయంకాలం తిన్నప్పుడు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ అధ్యయనం తెలిపింది.ఇంకోలా చెప్పాలంటే నిద్రకు సమయం ఉన్నట్టే పండ్లు తినేందుకు మంచి సమయం ఒకటి ఉందన్నమాట. ఉదయం పూట తిన్నప్పుడు పండ్లలోని ఫ్రక్టోస్ (ఒకరకమైన చక్కెర) మెరుగ్గా జీర్ణమవుతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు గ్లైకోజెన్ గురించి అర్థం చేసుకోవాలి. కాలేయంలో ఉంటుంది ఈ పదార్థం. రాత్రిపూట బాగా తగ్గిపోతుంది. శరీరానికి అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోవాలి. ఉదయం పూట తినే పండ్లతో లభించే ఫ్రక్టోస్ను నేరుగా గ్లైకోజెన్గా మార్చేస్తుంది కాలేయం. కావాల్సినంత గ్లైకోజెన్ ఉంటే మాత్రం కాలేయం ఫ్రక్టోస్ను కొవ్వుగా మార్చేస్తుంది. అదన్నమాట విషయం. కాబట్టి ఇకపై పరగడుపునే కాసిన్న పండ్లు మీ పొట్టలోకి పడేశారనుకోండి... చక్కటి ఆరోగ్యం మీ సొంతమయ్యే అవకాశం ఎక్కువవుతుంది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..?
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రక్తపోటు(బీపీ). దీనితో ముడిపడి చాలా రకాల ప్రమాదకర వ్యాధులు ఉన్నాయి. అందువల్ల వైద్యులు ప్లీజ్ బీపీని నియంత్రణలో ఉంచుకోండి, ‘ఉప్పు తక్కువ తినండి’ అని సదా చెబుతుంటారు. నిజానికి ఈ ఒక్క సాధారణ సలహా అన్ని వేళలా సముచితం కాదు. మందుల తోపాటు జీవనశైలిని ప్రభావితం చేసే ఈ 3-3-3 రూల్ని అనుసరిస్తే బీపీ దెబ్బకు నియంత్రణ ఉంటుందని నమ్మకంగా చెబుతున్న ఆరోగ్య నిపుణులు. మరి అదెలాగో సవివరంగా చూద్దామా.!.చాలామంది రోగులు ఎక్కువగా మందులపై ఆధారపడుతుంటారు. దానికంటే అర్థవంతమైన జీవన మార్పులతో ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జీవనశైలిని మంచిగా ప్రభావితం చేసే ఈ 3-3-3 రూల్ రక్తపోటుని చాలా సులభంగా నియంత్రణలో పెట్టగలదని అంటున్నారు. మరి ఈ రూల్ ఎలా సహాయపడుతుందంటే..సాధారణంగా ఉప్పు తక్కువ, వ్యాయమాలు అధికం వంటి సలహాలను రోగులు నిలకడగా పాటించాలంటే కష్టం. అలగే కేవలం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్లే అధిక రక్తపోటుకి దారితీయడం లేదంటున్నారు. ఇన్సులిన్ నిరోధకత, జీవక్రియ లోపాలు వంటి కారకాలతో కూడా ముడిపడి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జీవక్రియ లోపం కారణంగా శరీరంలోని కణాలు ఇన్సులిన్కి సరిగ్గా స్పందించడం మానేస్తాయి. దాని ఫలితంగా శరీరం సోడియం నీటిని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో రక్తనాళాలు గట్టిపడి, శరీరంలోని సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ చురుకుగా మారుతుంది. అంటే అంతర్లీనంగా ఉన్న జీవక్రియ లోపానికి చికిత్స తీసుకోకుండా కేవలం ఉప్పు తగ్గస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు నిపుణులు.‘3-3-3’ రూల్ అంటే..ఇందులో మొదటిది ఆహారం, రెండోది, రోజువారీ అలవాట్లు, మూడోది ఆరగ్యో తనిఖీలుగా విభజించి ఆరోగ్యంగా ఉండేలే చేసే హెల్దీ సూత్రం ఇది.1. మొదటి ‘3’ ఆహారపు అలవాట్లు(1) కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించడం..తెల్ల రొట్టె, బిస్కెట్లు, నమ్కీన్, స్వీట్లు, చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన తృణధాన్యాలు - ఇవి రోజంతా పదేపదే ఇన్సులిన్ను పెంచుతాయి. ఇలా ఇన్సులిన్ అధికంగా ఉండటం అనేది అధిక రక్తపోటుకు దారితీసే కారణాలో ఒకటి. వీటికి దూరం చేసే ఒక్క మార్పు రక్తపోటును గణనీయంగా తగ్గించడంలో అత్యంత ప్రభావంతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.(2) ప్రతి భోజనంలో ప్రోటీన్ తీసుకోండిప్రతి భోజనంలో గుడ్లు, పనీర్, చికెన్ లేదా చేపల నుండి 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. తగినంత ప్రోటీన్ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లపై కోరికలను తగ్గిస్తుంది, అలాగే శరీరాన్ని ఇన్సులిన్-సెన్సిటివ్గా మార్చే కండర ద్రవ్యరాశికి మద్దతు ఇస్తుంది.వాస్తవానికి చాలా మంది భారతీయ అల్పాహారాలు మరియు మధ్యాహ్న భోజనాలలో ప్రోటీన్ ప్రమాదకరంగా తక్కువగా ఉంటుంది.(3) ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడందేశీ నెయ్యి, వెన్న, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, ఇవి రక్తపోటును పెంచవు. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది.2. రెండో ‘3’ డైలీ దినచర్య..(1) రోజువారీ అలవాట్లుకేవలం కార్డియో మాత్రమే కాకుండా, రెసిస్టెన్స్తో కదలండిఇవి వారానికి మూడు సెషన్లు, ఒక్కోసారి 30-40 నిమిషాలు చేయడం, కేవలం నడవడం కంటే రక్తనాళాలకు ఎక్కువ మేలు చేస్తుంది.(2) కూర్చోవడాన్ని తగ్గించడంఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా కూర్చోవడాన్ని సాయంత్రం నడకతో సరిచేయలేము.ప్రతి గంటకు 2-3 నిమిషాలు నిలబడి కదలండి.(3) శ్వాసపై ఫోకస్ప్రతిరోజూ 5-10 నిమిషాల పాటు నెమ్మదిగా శ్వాస తీసుకోండి.నిమిషానికి ఆరుసార్లు, ముక్కు ద్వారా గాలి లోపలికి పీల్చి, నెమ్మదిగా బయటకు వదలండి.క్రమబద్ధమైన శ్వాస సిస్టోలిక్ బీపీని తగ్గిస్తుంది.3. మూడో ‘3’ వారంతపు తనిఖీలేప్రతి వారం తనిఖీ చేయవలసిన 3 విషయాలు(1) బీపీ చెకింగ్వారానికి కనీసం రెండుసార్లు ఇంట్లోనే బీపీ చెక్ చేయడంఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత, ఒకే చేతికి, ఒకే సమయంలో కొలవండి.(2) నడుము కొలతముఖ్యంగా దక్షిణాసియా వ్యక్తుల శరీరాల BMI కంటే నడుము-ఎత్తు నిష్పత్తి జీవక్రియ ప్రమాదాన్ని స్పష్టంగా అంచనా వేస్తుంది. మీ నడుమును మీ ఎత్తులో సగం కంటే తక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.(3) మంచి నిద్ర..కనీసం ఏడు గంటలు నిద్ర ఉండేలా చేసుకోవాలి. లేదంటే నిద్రలేమితో బాధపడే వారి శరీరాలు కార్టిసాల్పై ఆధారపడి పనిచేస్తాయి, ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచి, బీపీని అధికం చేస్తాయి.ఈ ‘3-3-3’ రూల్ మందులకు ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు వైద్యులు. మందుల తోపాటు..జీవనశైలిలో ఈ రూల్ని అప్లై చేస్తే..సమర్థవంతంగా బీపీ నియంత్రణలో ఉండటమే గాక వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?) -
ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్వాదీ ర్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. నిత్యం జిమ్ చేస్తూ ఉండటంతోపాటు లక్నోలో అనేక హై ఎండ్ వ్యాయామశాలలను ప్రారంభించాడు. కండలు తిరిగి, కమ్మెచ్చులు తేలి అత్యంత ఫిట్గా ఉండే తన దేహంతో రాష్ట్రవ్యాప్తంగా జిమ్ కల్చర్ ప్రమోషన్కు కారణమయ్యాడు. ఈనెల 13న ప్రతీక్ యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడం చాలామందిని విషాదంతో పాటు ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరణించే నాటికి అతడి వయసు కేవలం 38 ఏళ్లు మాత్రమే. అటాప్సీ రిపోర్టులో అతడి దేహ స్వభావంలో రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉందనీ... దాంతో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అనే ఆరోగ్య సమస్య కారణంగా పల్మునరీ ఎంబాలిజమ్ అనే కండిషన్ ఏర్పడి... అది అతడికి మరణం సంభవించిందనే నివేదిక వచ్చింది. డీవీటీ అంటే... దేహంలోని రక్తనాళాల్లో... ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకమైన పరిస్థితి. దేహంలోని రక్తనాళాలన్నింటిలోనూ ఇది కనిపించే అవకాశం ఉన్నప్పటికీ కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి 20 మందిలో ఒకరికి... తమ జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది. పల్మునరీ థ్రాంబో ఎంబోలిజమ్లో ఏం జరుగుతుందంటే... రక్తనాళంలో ఏర్పడ్డ గడ్డ (క్లాట్) లేదా రక్తపు ఉండ... కొన్నిసార్లు అలా రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ... పంపింగ్ కోసం గుండెలోని కుడి భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి ఆక్సిజన్ను నింపుకోడానికి పల్మునరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు రక్తం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో పల్మునరీ ఆర్టరీలో రక్తపు ఉండ ఇరుక్కుపోవడం జరిగితే... బ్లడ్ సర్క్యులేషన్ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. దీన్ని పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు తక్షణం మరణం కూడా సంభవించవచ్చు. డీవీటీ లక్షణాలు... డీప్ వీన్ థ్రాంబోసిస్తో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్కరిలోనూ అవే లక్షణాలు కనిపించక΄ోవచ్చు. పైగా లక్షణాల తీవ్రతలోనూ (మరీ ముఖ్యంగా డీవీటీ తొలి దశల్లో) మార్పులుంటాయి. రక్తపుగడ్డ చాలా చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. కొందరిలో సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా. అయితే కొందరిలో కనిపించే లక్షణాలివి... రక్తం గడ్డ కట్టిన చోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, పాదం వంటివి) చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం డీవీటీ కాల్లో ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం రక్తనాళాలు గట్టిబారడం నివారణ: ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. అంటే మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టుతీయని కాయధాన్యాలూ (హోల్గ్రెయిన్స్), ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం. క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం. (రోజుకు కనీసం 30 – 45 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడటం తగ్గుతుంది). తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ దేహాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండటం. దీంతో రక్తం పలుచబారి ఉండలు అడ్డుపడకుండా సాఫీగా సాగి΄ోయే అవకాశాలు ఎక్కువ. ఒకేచోట కుదురుగా కూర్చుని ఉండకుండా, చురుగ్గా కదులుతుండటం. ఇలా కదులుతున్నప్పుడు కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం. దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకుంటూ ఉండటం. ∙రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం. చికిత్స : డీప్ వీన్ థ్రాంబోసిస్ చికిత్సలో... దాంతో పాటు నివారణ చర్యలూ తప్పనిసరి. ఈ చికిత్స తీవ్రతను బట్టి ఉంటుంది. డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు తొలిదశల్లో సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం.బ్లడ్ థిన్నర్స్ వాడటం : యాంటీ కోయాగ్యులెంట్స్ అని పిలిచే రక్తాన్ని పలచబార్చే మందులు వాడటం. క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే ఈ ఔషధాల్ని వాడటం.ఇప్పుడు తాజాగా సక్షన్ ను ఉపయోగించి రక్తపు గడ్డను బయటకు లాగేసి, రక్తపు ఉండను తొలగించడం ద్వారా కూడా చికిత్స అందిస్తున్నారు. ఈ డీవీటీ ముప్పు ఉన్నప్పుడు రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉన్నవారు నిరంతరం డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ వైద్యులు చెప్పిన విధంగా ఫాలో అప్లో ఉండటం చాలా ముఖ్యం. – యాసీన్ (చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
రోజుకి రెండు పెగ్గులు పడాల్సిందే..కంట్రోల్ చేయడం ఎలా?
మా నాన్న గారికి 64 ఏళ్లు. చిన్న వయసు నుంచే మందుకు బాగా అలవాటు పడ్డారు. ఆయనకు బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ మందు మానడు. ఏమంటారంటే డాక్టర్లే చెబుతారు కదా... రోజుకి రెండు పెగ్గులు తీసుకోమని అని వాదిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో మేము గమనించింది ఏమిటంటే ఆయన చెప్పే వాటిలో చాలా వరకు అబద్ధాలు ఉంటున్నాయి, కానీ ఆయనకి ఆ విషయం అర్థం కావట్లేదు. ఆయన బాగా తూలుతున్నారు. మాటిమాటికి పడిపోవడం, దెబ్బలు తగిలించుకోవడం జరుగుతోంది. మూత్రంపై అదుపు ఉండట్లేదు. గత ఆరు నెలల నుంచి నిద్ర సరిగ్గా పోవట్లేదు. ఇట్లా ఉండి కూడా మందు మాత్రం మానలేదు. మేము దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్కి, న్యూరాలజిస్ట్కి కూడా చూపించాము. వాళ్లు మందులు రాసిస్తున్నారు కానీ ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మీరు దీని గురించి ఏమైనా సలహా ఇవ్వగలరా?– రమేష్, యానాం మీ సమస్య విన్నాక చాలా బాధగా ఉంది. ముందుగా ఈ డాక్టర్లు రెండు పెగ్గుల గురించి చెప్పుకునే విషయం ఎలా వచ్చిందంటే, దీనికి ఒక ‘మెడిటెరేనియన్స్ డైట్’ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ డైట్లో ΄పాశ్చాత్యదేశాల్లో ప్రజలు ఎక్కువగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకుంటారు. అంటే తాజాపండ్లు, ఆకుకూరలు, సముద్రపు చేపలు లాంటివి. వీటిలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు కొందరు రోజుకు 30 నుంచి 60 ఎం.ఎల్. వరకు మాత్రమే వైన్ తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ కాదు. అలాగే రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. ఈ మొత్తం జీవనశైలిని కలిపి ‘మెడిటేరియన్స్ డైట్’ అంటారు. దీనివల్ల గుండెజబ్బులు తగ్గుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కానీ మన దగ్గర చాలామంది ఈ మొత్తం విషయాన్ని పక్కన పెట్టేసి ‘‘రోజుకి రెండు పెగ్గులు మంచిదట’’ అన్న ఒక్క మాటనే పట్టుకుంటారు. దీనినే సైకాలజీలో ‘సెలక్టివ్ అబ్స్ట్రాక్షన్’ అంటారు. నిజానికి మన దగ్గర చాలామంది ఒకటి లేదా రెండు పెగ్గులతో ఆగరు. సరైన డైట్ కూడా తీసుకోరు. తాగిన తర్వాత భోజనం మానేస్తారు. దాంతో శరీరంలో విటమిన్ బీ1 లోపం వస్తుంది. అలా వచ్చినప్పుడు మొదట్లో అయోమయం, నడకలో తేడా, తూలడం లాంటివి వస్తాయి. ఇవన్నీ మీ నాన్నగారిలో కనిపిస్తున్న లక్షణాలే. ఈ దశలోనే మందు పూర్తిగా ఆపి సరైన వైద్యం తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. కానీ చాలామంది ఆల్కహాల్ తాగుతూనే ఉంటారు, మందులు సరిగా వాడరు. దానివల్ల మెదడుకి శాశ్వతంగా నష్టం కలుగుతుంది. మెదడులో జ్ఞాపకశక్తి , సమతుల్యతకి సంబంధించిన భాగాలు దెబ్బ తింటాయి. దీనివల్ల మతిమరపు వస్తుంది. గుర్తు లేక΄ోయినా, ఖాళీలను నింపడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవి కావాలనే చెప్పే అబద్ధాలు కాదు. ప్రస్తుతం దీనిని తగ్గించేందుకు ప్రత్యేకించి మందేం లేదు కానీ అధిక మోతాదులో విటమిన్లు ముఖ్యంగా విటమిన్ బీ1 ఇవ్వాలి. నిద్ర కోసం కూడా కొంతవరకు మందులు అవసరం కావచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. ఇవన్నీ చేస్తే కొంతవరకు రికవరీ కనిపిస్తుంది. ఇంటి దగ్గర ఆయన్ని ఆపడం కష్టమైతే, మంచి రీహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించండి. అక్కడ క్రమపద్ధతిలో చికిత్స ఉంటుంది కాబట్టి ఆయన బాగుపడే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.సమస్య నుంచి రిలీఫ్కని కొందరు; సంతోషాన్ని సెలబ్రేట్ చేసేందుకని కొందరు ఏదో ఒక వంకతో డ్రింక్ తీసుకోవటం తరచుగా మనందరం చూసే విషయమే! వారందరికీ తాగటం ముఖ్యం. దానికోసం ఏదో ఒక కారణం వెతుక్కుంటారు కాబట్టి ఆల్కహాల్ ఏ రూపంలోనూ తీసుకోకుండా పూర్తిగా దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com )(చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
బీపీ చిక్కును తట్టుకునేది ఇలా!
బీపీ ఎక్కువగా ఉంది అని తెలియడం ఆలస్యం. ఉప్పు తగ్గించండి అనేస్తూంటారు డాక్టర్లు. ఏళ్లుగా వింటున్నామీ సలహాను. సరైందే కానీ... ఈ ఒక్క చర్యతోనే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుందా? ఊహూ సాధ్యం కాదంటున్నారు... డాక్టర్ ఎరం రావు, డాక్టర్ జమునా ప్రకాశ్లు! .మరి... ఏం చేయాలి? ఏది సరైన మార్గం?... ప్రపంచ హైపర్టెన్షన్ డే (మే-17) నేపథ్యంలో ఈ విషయాలు తెలుసుకోవడం మీకు ఎంతైనా అవసరం.. దేశంలో రక్తపోటు బాధితుల సంఖ్య ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు ఇందుకు ముఖ్య కారణం. చాలామందికి చిన్నప్పుడే ఏర్పడే రుచి, అభిరుచులు సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం పెద్దలైతే రోజుకు రెండు వేల మిల్లీగ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి. అంటే సుమారు ఐదు గ్రాముల ఉప్పు. అంతే. కానీ మన దేశంలో సగటు వినియోగం ఎనిమిది గ్రాముల వరకూ ఉన్నట్లు ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. కొందరిలో ఇది మరింత ఎక్కువగానూ ఉండే అవకాశం ఉంది. అయితే “ఉప్పు తగ్గించండి” అనే సలహా ఎందుకు రక్తపోటును తగ్గించడంలో పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు?ఇంటి వంటతోనూ చిక్కే...భారతీయులు తీసుకునే సోడియంలో 80 శాతం కంటే ఎక్కువ వంట లేదా భోంచేసేటప్పుడు వేసే అదనపు ఉప్పుతోనే వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ బయట తినే అలవాట్లు పెరుగుతున్నప్పటికీ, ఇంటి వంట ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ద్వారా సోడియం ఎక్కువగా అందుతున్న దేశాల్లో ఉప్పు మోతాదును నియంత్రించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు కానీ... దేశంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కుటుంబ సభ్యుల రుచులు, వయసు, అలవాట్లు అన్నీ కలిసి ఉంటాయి. అందుకే కేవలం “ఉప్పు తగ్గించండి” అనే సలహా సరిపోదు.అవగాహన పెరగాలి..ప్రజారోగ్య ప్రచారాలు సాధారణంగా ప్రజలకు ప్రమాదం తెలుసు, గుర్తు చేస్తే మార్పు వస్తుందని భావిస్తాయి. కానీ వాస్తవం అంత సులభం కాదు. ఒక జాతీయ సర్వే ప్రకారం, అధిక ఉప్పు ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన పెద్దలు మూడో వంతు కన్నా తక్కువ. అవగాహన తక్కువగా ఉన్నప్పుడు “ఉప్పు తగ్గించండి” అనే సందేశం పట్టించుకునేలా ఉండటం లేదు. కారణం పూర్తిగా అర్థం కాకపోతే అలవాట్లను మార్చడం కష్టం.రుచిని పట్టించుకోవడం లేదు...రక్తపోటును నియంత్రించేందుకు ఉప్పు తగ్గించాలని చాలామంది చెబుతారు. ఏమేం తినకూడదో కూడా చెబుతూంటారు. కానీ... రుచిని మాత్రం పట్టించుకోరు. ఉప్పు తక్కువగా ఉన్న చప్పిడి ఆహారం చాలామందికి రుచిగా అనిపించదు. అందుకే వారు తక్షణ సంతృప్తినిచ్చేందుకు మనకు బాగా పరిచయమైన ఉప్పును మళ్లీ మళ్లీ వాడుతూంటారు. అందుకే... ఉప్పు వాడుతూనే రుచిని కాపాడటం ఎలా? అన్నదానిపై దృష్టి పెట్టి... క్రమేపీ సోడియం మోతాదును తగ్గించాల్సి ఉంటుంది. అంటే.. ఆహారం రుచిగా ఉండేలా చూసుకుంటూ, సోడియాన్ని నెమ్మదిగా తగ్గించడం.ఇక మనం ఏమి చేయాలి?1) దేశీ వ్యూహం... WHO లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి భారతదేశం ప్రజల సోడియం వినియోగాన్ని 30% తగ్గించేందుకు వంటగదులు, పాఠశాలలు, మార్కెట్ వ్యవస్థలు — అన్నింటినీ కలిపే సమగ్ర ప్రణాళిక అవసరం. ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉప్పు తగ్గించడం మాత్రమే కాకుండా, కుటుంబాలకు ఉపయోగపడే ఆచరణాత్మక మార్గదర్శకాలు కూడా అవసరం.2) సంస్థలతో ప్రారంభించాలి...పాఠశాలలు, హాస్టళ్లు, కాంటీన్లు, ప్రభుత్వ ఆహార పథకాలు వంటి సంస్థల ద్వారా అందించే ఆహారాన్ని ఒకేరకమైన మార్గదర్శకాల ద్వారా తయారు చేసి పంపిణీ చేయాల్సిన అవసరముంది. తద్వారా ఇక్కడ ఉప్పును క్రమంగా తగ్గిస్తే, ప్రజల “సాధారణ రుచి” భావన కూడా మారుతుంది. అప్పుడు ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం తగ్గుతుంది.3) తక్కువ ఉప్పుతో కూడా రుచిగా ఉండే పరిష్కారాలు ఇవ్వాలిఈ సందర్భంలో MSG (మోనోసోడియం గ్లూటామేట్) గురించి శాస్త్రీయంగా చర్చించాలి. MSGలో సుమారు 12% సోడియం మాత్రమే ఉంటుంది, కానీ సాధారణ ఉప్పులో 39% సోడియం ఉంటుంది. MSG “ఉమామి” అనే రుచిని ఇస్తుంది. తక్కువ ఉప్పుతో పాటు MSG వాడితే రుచి తగ్గకుండా సోడియాన్ని 40% వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. CSIR–CFTRI నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, ఉప్పు–MSG మిశ్రమాలను ఉపయోగించడం ద్వారా వెజ్ బిర్యానీ, దాల్ సాంబార్, పనీర్ కర్రీ, మురుకు, సేవ్, ఆలూ భుజియా, బ్రెడ్, బన్స్, బిస్కెట్లు వంటి భారతీయ ఆహారాల్లో సోడియం ను 22–32% వరకు తగ్గించవచ్చు. బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే, MSG వాడకం ఫుడ్ ఇండస్ట్రీకి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది.4) సోడియం గురించి చెప్పే విధానాన్ని మార్చాలి“ఉప్పు తగ్గించండి” అన్నదాని బదులుగా, “నెమ్మదిగా తగ్గించండి, రుచి అలాగే ఉంచండి” అనే సందేశం ఇవ్వాలి. చిన్నచిన్న మార్పులు ఎలా చేయాలి? ఉప్పు మళ్లీ వేసే ముందు రుచి చూసే అలవాటు ఎలా చేసుకోవాలి? సహజమైన రుచులను ఎలా పెంచుకోవాలి? ఇలాంటి ఆచరణాత్మక సూచనలు ఎక్కువకాలం కొనసాగుతాయి.5) అయోడైజ్డ్ ఉప్పు వాడకం.. భారతదేశంలో అయోడైజ్డ్ ఉప్పు వినియోగం చాలా విజయవంతమైంది. 2020–21 గణాంకాల ప్రకారం, 94.3% కుటుంబాలు సరైన అయోడిన్ కలిగిన ఉప్పును వాడుతున్నాయి. కాబట్టి లక్ష్యం- మొత్తం ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, కానీ అయోడిన్ లోపం రాకుండా చూసుకోవడం. మొత్తమ్మీద... రక్తపోటును నివారించాలంటే, సోడియం తగ్గింపును చూసే విధానాన్ని మార్చాలి. “ఉప్పు తగ్గించండి” అనే సాధారణ సలహాను దాటి, ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రజలకు సులభంగా అనుసరించగల విధంగా చేయాలి. దానికి నెమ్మదిగా ఉప్పు తగ్గించే విధానాలు, సంస్థల ద్వారా మార్పుకు నాయకత్వం, రుచిని కాపాడే పరిష్కారాలు. ఈ చర్యలతోనే సోడియం తగ్గింపు అనేది సంవత్సరానికొకసారి వినిపించే సలహాగా కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య మార్పుగా మారుతుంది. -
ఎప్పటికీ యంగ్ గా ఉండాలా? ఈ విషపూరిత ఆహారాలను మానేయండి!
-
టీ ఇలా చేయాలి.. అలా కాదు!
అనగనగా ఒక ఊరు.రచ్చబండ దగ్గరే రోజూ ఉదయాన్నే...జనంతో కిక్కిరిసే టీకొట్టు!కొట్టు యజమాని అనయ చేతి టీ తాగితే...గుండె గట్టిపడుతుందని కొందరు... మెదడు చురుకుగా మారుతుందని ఇంకొకరు..ఇలా అందరూ కలిసి ఆ కొట్టు.. అక్కడ దొరికే టీని వైరల్ చేసేశారు.మరి... ఇదంతా నిజమేనా? టీకి... గుండెకు లింకేమిటి?..అనయ కథతోనే ముందుకెళదాం.. టీ కొట్టు బ్రహ్మాండంగా నడుస్తూండగానే రవి అనే కొత్త కుర్రాడు పనోడిలా చేరాడక్కడ. అందరూ అక్క చేతి టీ ఆరోగ్యానికి మంచిదంటున్నారు కదా... దాన్ని మరింత స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నాడీ కుర్రాడు. అక్క రెండు నిమిషాలు మాత్రమే కాస్తోంది. నేను ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ ఉడకబెడతా అని ప్రయోగం మొదలుపెట్టాడు. అలాగే ఉడికించాడు కూడా. ఈ టీ తాగినవాళ్లు.... వాసన కమ్మగా ఉందని మెచ్చుకున్నారు కానీ... కొంచెం చేదుగా ఉందని ఫిర్యాదు కూడా చేశారు. ఒకట్రెండు రోజులు అంతా బాగానే ఉండింది కానీ.. ఆ తరువాత ఊళ్లో చాలామంది నీరసంగా ఉందని, తలనొప్పి దంచేస్తోందని అనడం మొదలుపెట్టారు. ఇంకొందరు కడుపులో గడబిడగా ఉందంటే.. మరికొందరు నిద్రపట్టడం లేదని వాపోవడం మొదలుపెట్టారు. వీళ్లందరూ అనయ కొట్టులో టీ తాగే వాళ్లే. ఊళ్లో జరిగే విషయాలు తెలిసిన అనయ కించిత్ ఆశ్చర్యపోయింది. ఏమై ఉంటుందా? అని ఆలోచించింది. రవితో మాటలు కలిపింది. విషయం వెంటనే అర్థమైపోయింది..‘‘బాబూ రవి... మనం కాచే టీ మందులా పనిచేస్తుంది. కాకపోతే అది మనం దాన్ని సక్రమంగా ఎలా తయారు చేయాలో తెలిసినంత వరకే. మంచి వాసన వస్తోంది కదా అని ఎక్కువ సేపు ఉడికించావనుకో.. అంతే సంగతులు. మందు కాస్తా విషమైపోతుంది’’ అని అసలు విషయాన్ని బయటపెట్టింది...మరగిస్తే విషమే..టీని మరిగించిన కొద్దీ అందులోని పాలిఫినాల్స్ ముక్కలు ముక్కలైపోతాయి. ఫలితంగా వాటితో మనకు మంచి జరక్కపోగా... హాని జరిగే అవకాశాలు పెరిగిపోతాయి. టీని ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మరిగించడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అప్పుడు రుచి, పోషకాలు రెండూ సమతౌల్యతతో ఉండి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా కాకుండా... మూడు నుంచి ఐదు నిమిషాలపాటు ఉడికించినా సరే... పాలిఫినాల్స్ తాలూకూ లాభాలు తగ్గిపోతాయి. పది నిమిషాలపాటు ఉడికిస్తే... ప్రయోజనం మరింత తగ్గిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మరిగించిన టీతో మేలు జరగదు. తలనొప్పి, కడుపులో గడబిడ, నిస్సత్తువ వంటి అసౌకర్యాలు మొదలవుతాయి. అంతేకాదు... టీ ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుని తాగాలని, చల్లారిందని టీని పదే పదే ఉడికించడమూ మంచిది కాదని అనయ రవికి వివరించింది. ఉదయాన్నే తాగే టీ శరీరానికి శక్తినిచ్చి ఫోకస్న పెంచితే.. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో తాగే టీ ఒత్తిడిని దూరం చేసే మనల్ని రిఫ్రెష్ చేస్తుందని రవికి తెలిపింది. సాయంత్రం ఆరు గంటల తరువాత తాగే టీ నిద్రను పాడు చేసే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేసింది.టీ లవర్స్ మాత్రమే కాదు.. ‘‘మేము రోజూ గ్రీన్ టీ తాగుతామండి.. కానీ ఎందుకో మాకేమీ ఆరోగ్య లాభం లభించడం లేదు’’ అని చెప్పే వారు కూడా టీని ఎంత సేపు మరగిస్తున్నారో ఒకసారి గమనిస్తే మేలని అనయ సూచిస్తోంది. ‘‘అక్క చెప్పిన మాటల్లో లాజిక్కు ఉంది’’ అని తెలుసుకున్న రవి కూడా టీని రెండు కంటే ఎక్కువ నిమిషాలు మరగించకపోవడంతో ఇప్పుడు ఊళ్లో అందరూ హ్యాపి!టీని పద్ధతిగా చేస్తే... 1. శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 2. చురుకుదనాన్ని పెంచుతుంది. 3. గుండెకు మంచిది.4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఎక్కువగా మరిగిస్తే...1. టానిన్లు ఎక్కువవుతాయి. అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి, తలనొప్పిలాంటివి వస్తాయి.2. శరీరం ఇనుమును శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడవచ్చు.3. పొట్ట లోపలి పొరను చీకాకు పెడుతుంది. ఇది కాస్తా గ్యాస్ ఏర్పడేందుకు, అసౌకర్యానికి దారితీయవచ్చు.4. జీర్ణ సమస్యలతోపాటు కేన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది.5. మనకు మేలు చేసే ఆంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు నశించిపోతాయి.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..
ఓ మహిళ అనారోగ్యంలో సైతం తన భర్త ఎలా అండగా నిలబడ్డాడో వివరిస్తూ షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసులను అమితంగా గెలుచుకుంది. నిజానికి మనకిష్టమైన వాళ్ల కోసం చాలా వాటిని షేర్ చేసుకోగలమేమో గానీ కొన్నింటిని మాత్రం షేర్ చేసుకోవడానికి చాలా పెద్ద మనసు కావాలి. అదే ఈ మహిళ వివరిస్తూ తన కథను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నమర్తా నితిన్ గోయెల్ తన వైద్య ప్రయాణంతో తనకు మద్దతుగా నిలిచి గుండు చేయించుకుంటున్న భర్త వీడియోని షేర్ చేశారు. ఆమె తాను కేన్సర్ బాధితురాలిననని, కీమో ధెరపీ కారణంగా తన జుట్టుని కోల్పోవడంతో తనకు సంఘీభావం తెలిపేలా తన భర్త గుండు చేయించుకున్న వీడియోని షేర్ చేషింది. కష్టకాలంలో సైతం తమ మధ్య బలమైన బంధం ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ భావోద్వేగం చెందింది. ఆ వీడియోలో కీమోథెరపీ తర్వాత జుట్టు రాలిపోవడంతో తాను అనుభవించిన బాధ గురించి ఆమె మాట్లాడింది. తన రెండవ కీమోథెరపీ సెషన్ తర్వాత, జుట్టు విపరీతంగా రాలిపోవడం ప్రారంభమైందని, తన తల చర్మం చాలా సున్నితంగా, బాధాకరంగా మారిందని ఆమె చెప్పింది. జుట్టు రాలినప్పుడల్లా నొప్పి మరింత తీవ్రమయ్యేదని కూడా చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని ఆయనకు చెప్పడంతో ఆ బాధను తాను కూడా పంచుకుంటానంటూ ఆమె భర్త ట్రిమ్మర్తో గుండు చేయించుకున్నారని తెలిపింది. ఆ క్రమంలో ట్రిమ్మర్ తలపైన సున్నిత చర్మానికి తగిలినప్పుడల్లా ఆయనకు గాయమవ్వడం తాను చూశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి కేన్సర్ చికిత్సలో భాగం జుట్టు ఊడిపోతుందని తెలుసు కానీ అందుకు తాను సిద్ధంగా లేనని వివరించింది. తన బాధను చూసే ఆమె భర్త ఇలా చేసినట్లు పేర్కొంది. నెటిజన్లే ఈ వీడియోని చూసి..భాగస్వాముల మధ్యలో ఉండాల్సిన శ్రద్ధను ఈ ఘట్టం తెలుపుతోందని, మరికొందరు..'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటే మీ దంపుతులే అంటూ ప్రశంసలు, ఆశీస్తులు అందిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Namarta Nitin Goel (@goelnamarta) (చదవండి: ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!) -
తెలంగాణ పురుషుల్లో జుట్టుతో పాటు జీర్ణశక్తి కూడా క్షీణిస్తోంది..!
1.6 లక్షల మంది భారతీయ పురుషుల పై నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జీర్ణఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న రాష్ట్రంగా తెలంగాణతొ లిస్థానంలో నిలిచింది. పురుషుల్లో జుట్టురాలడం మరియు జీర్ణఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. దేశంలో జుట్టు రాలుదల సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్న ప్రముఖ బ్రాండ్ త్రాయ హెల్త్ నిర్వహించిన జాతీయ గట్-హెయిర్హెల్త్ అధ్యయనం తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్యసం క్షోభాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దేశంలోని పది ప్రధాన ప్రాంతాలపై 2024డిసెంబర్ నుంచి 2025డిసెంబర్ వరకుసేకరించిన 1.6లక్షల మందికి పైగా భారతీయ పురుషుల స్వీయ ఆరోగ్య వివరాలను ఈ అధ్యయనం పోల్చింది. జీర్ణ వ్యవస్థ పని తీరును అంచనా వేయడానికి మలబద్ధకం తరచుదల్ని ప్రధానసూచికగా తీసుకుని, పురుషుల్లో జుట్టు రాలుదలతో సంబంధం ఉన్న మార్పులను విశ్లేషించింది. అధ్యయనంలో భాగమైన పది రాష్ట్రాల్లో తెలంగాణలోనే జీర్ణఆరోగ్యం అత్యధికంగా క్షీణించినట్లు తేలింది.తెలంగాణ పరిస్థితిరోగ్యకరమైన జీర్ణ క్రియకు సూచికగా భావించే “మలబద్ధకం తక్కువగా లేదా లేకపోవడం” తెలిపిన తెలంగాణ పురుషుల శాతం 2024 డిసెంబర్లో 19.13% ఉండగా, 2025 డిసెంబర్కు 15.03%కు పడిపోయింది. ఏడాదిలోనే 4.10 శాతం పాయింట్ల పడిపోవడం నమోదైంది. అధ్యయనంలో ఇది రాష్ట్రస్థాయిలో నమోదైన అతి పెద్ద క్షీణత. రాష్ట్ర జనాభా పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ తగ్గుదల వేలాది మంది పురుషులు తెలియకుండానే దీర్ఘకాలిక జీర్ణ సమస్యల వైపు జారుతున్నారనే సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.దేశంలో అత్యంత పట్టణీకరణ, విద్యావంతులశాతం, ఆర్థిక చురుకుదనం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. హైదరాబాద్ దేశ ఐటీ రంగానికి కేంద్రంగా నిలుస్తోంది. ఇదే సమస్యకు ప్రధాన కారణమవుతోందని త్రాయ హెల్త్పేర్కొంది.ఆధునిక పట్టణ జీవనశైలి కారణాలు జీర్ణ ఆరోగ్య క్షీణతకు దారితీస్తున్న ప్రధాన అంశాలుగా గుర్తించింది:10 నిమిషాల డెలివరీ ప్లాట్ఫారమ్ల వల్ల సులభంగా అందుబాటులోకి వచ్చిన అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారంఐటీ, సర్వీ సెస్రంగాల్లో నిరంతర పని సంస్కృతి కారణంగా అసమయ భోజనాలువరుస పనులతో నీరుతాగడంలో నిర్లక్ష్యంఒత్తిడిని తగ్గించుకోవడానికి అలవాటైన స్ట్రెస్ ఈటింగ్జీర్ణ క్రియ–జుట్టు సంబంధం మన జీర్ణ వ్యవస్థనే జుట్టుకు అవసరమైన పోషకాల సరఫరా గొలుసుగా నిపుణులు వివరిస్తున్నారు. జుట్టు ప్రధానంగా ప్రోటీన్తో తయారవుతుంది. ఐరన్, జింక్, విటమిన్లు వంటి పోషకాలు జుట్టు మూలాలకు చేరాలంటే ముందుగా అవి పేగుల ద్వారా శోషించబడాలి. జీర్ణ క్రియ బలహీనపడితే శరీరం అవసరమైన పోషకాలను ముఖ్య అవయవాలకు మళ్లిస్తుంది. జుట్టుకు మిగిలినదే అందుతుంది. దీని ప్రభావం కాలక్రమేణా జుట్టు రాలుదలగా కనిపిస్తుంది.అలాగే బలహీనమైన జీర్ణ వ్యవస్థ శరీరంలో అల్ప స్థాయి వాపును (ఇన్ఫ్లమేషన్) పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదల చక్రాన్ని దెబ్బతీసి, జుట్టు ముందుగానే విశ్రాంతి దశలోకి వెళ్లేలా చేస్తుంది. కొత్త జుట్టు పెరుగుదల తగ్గి, పాత జుట్టు రాలడం పెరుగుతుంది.ఈ సమస్యలను షాంపూలు లేదా ఆయిల్స్ ద్వారా పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రాంతీయ స్థాయి పరిశీలనలు తెలంగాణ వినియోగదారుల పై త్రాయహెల్త్ సేకరించిన డేటా కూడా ఇదే పరిస్థితిని చూపిస్తోంది. జుట్టు రాలుదలతో వచ్చే పురుషుల్లో జీర్ణ సమస్యలు, పోషకాల శోషణలోపం, అసమయ జీర్ణ క్రియ, అంతర్గత వాపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించింది.త్రాయ హెల్త్ సహ వ్యవస్థాపకురాలు సలోని ఆనంద్ మాట్లాడుతూ…“తెలంగాణ గణాంకాలు నిర్లక్ష్యం చేయలేని హెచ్చరిక. ఇవి ఆరోగ్యస మస్యలతో బాధపడుతున్న వ్యక్తుల గణాంకాలు కావు; దేశంలోని అత్యంత చురుకైన నగరంలో పని చేస్తున్న వృత్తి పరులవి. కానీ అదే జీవనశైలి జీర్ణ వ్యవస్థను నెమ్మదిగా దెబ్బతీస్తోంది. జీర్ణ క్రియ దెబ్బతింటే మొదట కనిపించే ప్రభావం జుట్టు రాలుదల ”అని పేర్కొన్నారు. -
నేను ఆరోగ్యంగానే ఉన్నాను
‘‘నేను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను. నా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం... వాటిని నమ్మకండి’’ అని సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తెలిపారు. శక్తి కపూర్ మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ వార్తలపై ఆయన స్పందించి, ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మృతి గురించి వస్తున్న వార్తలు అబద్ధం. ఇలాంటి పుకార్లను నమ్మకండి. ఇలాంటి తప్పుడు వార్తలను అందరం ఖండించాలి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’’ అని పేర్కొన్నారాయన. విలన్గా, కమెడియన్గా దాదాపు 700 చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు శక్తి కపూర్. ఆయన కుమార్తె శ్రద్ధా కపూర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ ద్వారా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జస్ట్ రెండు నెలల్లో 20 కిలోలు తగ్గాలంటే..!
ఎలాంటి షార్ట్కట్లు లేకుండా త్వరిగతిన కిలోల కొద్ది బరువు తగ్గాలనుకునే వారికి ఈ కంటెంట్ క్రియేటర్ చెప్పే సలహాలు, సూచనలు ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఆమె తనకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటూనే..సరైన జీవనశైలిని నిలకడగా పాటిస్తూ తగ్గానని చెబుతున్నారామె. అదెలాగో సోషల్ మీడియా వేదికగా ఆమెనే స్వయంగా వివరించారు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా..!.ఇటీవలకాలంలో అందరూ సంక్లిష్టమైన డిటాక్స్ ప్లాన్లు లేదా ఫ్యాన్సీ హెల్త్ ఫుడ్స్కు బదులుగా, చాలా మంది ఎక్కువ ప్రోటీన్ తినడం, ఎక్కువగా నడవడం, చక్కెర తగ్గించడం, నిలకడగా ఉండటం వంటి సాధారణ మార్పులపై దృష్టిసారిస్తున్నారు. బహుశా అందుకే ఈ కంటెంట్ క్రియేటర్ అంజలి సచిన్ తన వెయిట్ జర్నీ అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆమె చెప్పే ఆహారపు అలవాట్లు సైతం అందరు సులభంగా పాటించగలిగేవే కావడం విశేషం. ఆమె కేవలం రెండు నెలల్లోనే 20 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేశారో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆమె కేలరీ డెఫిసిట్ ప్రాధాన్యంగా తీసుకుని డైట్ని పాటించినట్లు పేర్కొన్నారు. అంటే శరీరం ఒక రోజులో ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువగా తీసుకోవడం. ఇక ఆమె తన దినచర్యలో అధిక ప్రోటీన, అధిక ఫైబర్ ఉన్న భోజనం, కార్బోహైడ్రేట్లు, చక్కెరను పూర్తిగా మానుకోవడం తోపాటు స్వీట్లు, శీతల పానీయాలు, చిరుతిళ్లను రాత్రిపూట తీసుకోకుండా దూరంగా ఉండటం వంటివి చేసినట్లు తెలిపారు. ఆ క్రియేటర్ క్రమం తప్పకుండా పాటించిన 12 కఠినమైన అలవాట్లు..అధిక ప్రోటీన్ + అధిక ఫైబర్ ఉన్న భోజనంతక్కువ కార్బోహైడ్రేట్ల విధానంచక్కెర వద్దు (స్వీట్లు, శీతల పానీయాలు వద్దు)తక్కువ నూనె + తక్కువ ఉప్పురోజుకు 15,000 అడుగులుఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్)వెయిట్ ట్రైనింగ్/వెయిట్లిఫ్టింగ్సమయానికి నిద్రపోవడంకొన్నిసార్లు రోజుకు ఒక పూట భోజనం (అవసరమైనప్పుడు)సాయంత్రం 6 గంటల తర్వాత డిన్నర్ వద్దుచిరుతిళ్లు తినవద్దు / అనవసరమైన చిరుతిళ్లు వద్దునెలకు 8-10 కిలోలు తగ్గాలనుకుంటే, ఈ నియమాలను క్రమశిక్షణతో పాటించండి. నిలకడ = పరివర్తన, అన్నింటకంటే ముఖ్యం అని అని అంజలి సచన్ పోస్ట్లో రాశారు. ఈ అలవాట్లతో పాటు, ఆమె శాకాహార, మాంసాహార భోజన ప్రణాళికలతో కూడిన 7-రోజుల తక్కువ కార్బోహైడ్రేట్, అధిక ప్రోటీన్ డైట్ చార్ట్ను కూడా పంచుకున్నారు.శాకాహార ప్రణాళికలో పనీర్ భుర్జీ, టోఫు, సోయా చంక్స్, మొలకలు సలాడ్, గ్రీక్ పెరుగు, మూంగ్ దాల్ చిల్లా, బెసన్ చిల్లా, రాజ్మా, వెజిటబుల్ సూప్, సలాడ్లు వంటి ఆహారాలు ఉన్నాయి. మాంసాహార వెర్షన్లో గుడ్లు, చికెన్, చేపలు, వే ప్రోటీన్తో కూడిన ఓట్స్, చికెన్ సలాడ్, ఎగ్ బుర్జీలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఈ ప్లాన్లో చాలా మందికి నచ్చిన అంశం ఏమిటంటే, ఇది ఖరీదైన “డైట్” ఉత్పత్తులకు బదులుగా సాధారణ ఇంటి వంటకాలను ఉపయోగించడం. ఈ భోజనాలు సరళంగా, ప్రోటీన్కు ప్రాధాన్యతనిస్తూ, తయారుచేయడానికి సులభంగా ఉంటాయి.అదే సమయంలో, వేగంగా బరువు తగ్గడం అనేది అందరిపై ఒకే విధంగా పనిచేయకపోవచ్చని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఒక వ్యక్తి శరీరాకృతి, జీవనశైలి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆహారం, వ్యాయామ దినచర్యలను ఎల్లప్పుడూ వేరుగా ఉంటాయనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్కు ముగింపు..! ఆ కారణంతోనే..) -
ఎఫ్డీఐలతో బీమాకు మేలే..
బీమా రంగంలోకి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించడమనేది పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆరోగ్య బీమా రంగ దిగ్గజం స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో మరిన్ని పెట్టుబడులు, మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తాయని, ఇన్సూరెన్స్ రంగ విస్తృతి మరింత పెరుగుతుందని మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,000 కోట్ల మేర స్థూల రిటెన్ ప్రీమియం (జీడబ్ల్యూపీ) సాధించాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాది ఇది సుమారు రూ.20,400 కోట్లుగా ఉండగా, 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.30,000 కోట్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయ్ వివరించారు. చిన్న పట్టణాల్లో మరింతగా విస్తరించడం ద్వారా దీన్ని సాధించనున్నట్లు చెప్పారు. బీమాను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చే దిశగా చిన్న పట్టణాల్లోని వారి కోసం తక్కువ ప్రీమియంలతో ఈ ఆర్థిక సంవత్సరం కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 15 శాతం వాటా లక్ష్యంసంస్థ వ్యాపారంలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా దాదాపు 10 శాతంగా ఉన్నట్లు రాయ్ చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో దీన్ని 12–15 శాతానికి పెంచుకోనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,254 కోట్లు విలువ చేసే 1.8 లక్షల క్లెయిమ్లను పరిష్కరించామని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 24 శాతం అధికమని రాయ్ వివరించారు. జాతీయ స్థాయిలో 30.6 లక్షల క్లెయిమ్లకు సంబంధించి రూ. 11,903 కోట్లు సెటిల్ చేసినట్లు చెప్పారు. టెక్నాలజీపై ఏటా రూ. 200–250 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. బీమా ప్రీమియంలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
కాలేయ సమస్య? విశ్రాంతి మాత్రమే మార్గమా?
కాలేయ వ్యాధి నివారణకు విశ్రాంతి మాత్రమే ఏకైక మార్గం అనేది ఒక సాధారణ అపోహ. కానీ అధ్యయనాలు,ఆధారాలు అందుకు విరుద్ధంగా చెబుతున్నాయి. సిర్రోసిస్ ఉన్నవారిలో, ఏరోబిక్,స్ట్రెంగ్త్ ట్రైనింగ్లను కలిపి చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు తగ్గుతాయి జీవన నాణ్యత అవకాశాలు మెరుగుపడతాయి. ఇది వ్యాధి పురోగతికి ఒక ప్రధాన కారణమైన కండరాల క్షీణత నుంచి కూడా రక్షిస్తుంది.కాలేయ పనితీరుకు తీవ్రమైన వర్కవుట్స్ అవసరం లేదు. నడవడం, బరువులు ఎత్తడం, శరీరాన్ని సాగదీయడం చిన్నపాటి శ్రమ వంటివి అన్నీ అది కోలుకోవడానికి సహాయపడే సంకేతాలను పంపుతాయి. అయితే తీవ్రత కంటే నిలకడ ముఖ్యం. ఒక వారం పాటు మాత్రమే సాగే పరిపూర్ణ ప్రణాళిక కంటే, నెలల తరబడి పాటించగలిగే దినచర్య ఎల్లప్పుడూ ఉత్తమమైనది.ఆహారాన్ని జీర్ణం చేయడం, రక్తం వడపోతతో పాటు కాలేయం మరెన్నో పనులు చేస్తుంది. అది శరీరంలోని ఇతర భాగాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా నిరంతరం సర్దుబాటు చేసుకుంటుంది. దానికి అత్యంత సన్నిహిత భాగస్వాములలో ఒకటైన కండరాలు క్రమం తప్పకుండా సంకోచించినప్పుడు, అవి కొన్ని సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఇవి కాలేయం కొవ్వును సరైన విధంగా నిర్వహించడానికి వాపును నియంత్రించడానికి సహాయపడతాయి. కండరాల కదలిక తగ్గినప్పుడు, ఆ మద్దతు కూడా తగ్గిపోతుంది, కాలేయంపై పనిభారం పెరిగి దాని విధుల నిర్వహణ కష్టమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ హెపటాలజిస్ట్, ‘ది లివర్ డాక్టర్గా పేరొందిన సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఒక వివరణాత్మక పోస్ట్లో తెలియజేశారు. వివిధ రకాల వ్యాయామాలు కాలేయానికి నిర్దిష్ట సంకేతాలను ఎలా పంపుతాయో, ప్రతి వ్యాయామానికి క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపితమైన ప్రయోజనాలు ఏవేం ఉంటాయో ఆయన వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం... మనం ప్రతిరోజూ కండరాలను ఉపయోగించే విధానమే, కాలక్రమేణా కాలేయం పనితీరును తీర్చిదిద్దుతుంది. కండరాలు కేవలం బలం లేదా అందం కోసం మాత్రమే కాదు. అవి జీవక్రియకు యంత్రంలా పనిచేస్తాయి. అవి సంకోచించినప్పుడు, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే కాలేయంలో కొవ్వు నిల్వను తగ్గించే అణువులను విడుదల చేస్తాయి. ఒకే బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులకు కాలేయ ఆరోగ్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఇద్దరిలో బలమైన, చురుకైన కండరాలు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యకరమైన కాలేయం ఉంటుంది. రోజువారీ కదలిక పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం బాగా తగ్గుతుందని యూకేలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం దృవీకరిస్తోంది.నడక: అత్యంత సులభమైన ఔషధం. వేగంగా నడవడం ఒక మంచి అలవాటు. వారానికి సుమారు 150 నిమిషాలు అలా నడిస్తే, కాలేయంలోని కొవ్వును దాదాపు మూడింట ఒక వంతు తగ్గించవచ్చుననేది ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. చిన్న మార్పులు కూడా ముఖ్యమైనవే. రోజుకు 1,000 అదనపు అడుగులు వేయడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం సుమారు 12 శాతం తగ్గుతుంది. దీనికి జిమ్ అవసరం లేదు, పరికరాలు అవసరం లేదు. కేవలం నిలకడ ఉంటే చాలు.కార్డియో...కూడా...స్థిరమైన వేగంతో జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి కార్డియోలో ఉంటాయి. మనం సరైన వేగంతో చేస్తున్నామా లేదా అనేది తెలుసుకునేందుకు ఓ సులభమైన పరీక్ష ఏమిటంటే... చేసే సయమంలో మాట్లాడటం సులభంగా అనిపించాలి, పాడటం మాత్రం కష్టంగా అనిపించాలి.వారానికి కొన్ని రోజులు, 30–45 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల కాలేయంలోని కొవ్వును తగ్గించి, కాలేయ ఎంజైమ్ల స్థాయిలను మెరుగుపరచవచ్చు. బరువు తగ్గకపోయినా ఈ ఆరోగ్య ప్రయోజనాలు కనిపించడం గమనార్హం. ఇది మన ఆలోచనల్ని కేవలం బరువు తగ్గడం నుంచి అత్యంత కీలకమైన జీవక్రియ ఆరోగ్యం వైపు మళ్లిస్తుంది.స్ప్రింట్ ఇంటర్వెల్స్స్ప్రింట్ ఇంటర్వెల్ శిక్షణ సెష¯Œ లు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టవచ్చు. కేవలం ఆరు వారాల పాటు దీనిని చేయడం వల్ల, ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారిలో, కాలేయ కొవ్వు అంతర్గత అవయవాల కొవ్వును గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. సమయం దొరక్క ఇబ్బందిపడేవారికి, అలాగే కఠిన శ్రమను తట్టుకోగలవారికి ఇది సరిపోతుంది.హై–ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, (హెచ్ఐఐటి) అంటే చిన్న విరామాలలో తీవ్రమైన శ్రమ చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం. సుమారు 12 వారాలలో ఈ పద్ధతి కాలేయంలోని కొవ్వును 37 శాతం వరకు తగ్గించగలదు. ఇది గుండెను కూడా బలపరుస్తుంది కార్డియోతో సమానమైన ప్రయోజనాలు, దానికి పట్టే సమయంతో పోలిస్తే దాదాపు సగం సమయంలోనే లభిస్తాయి.స్ట్రెంగ్త్ ట్రైనింగ్బరువులు ఎత్తడం లేదా బాడీవెయిట్ వ్యాయామాలు చేయడం కండరాలను పెంచుతాయి, అది నేరుగా కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.శరీర బరువు మారకపోయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కాలేయంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది కాలేయ ఎంజైమ్ల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ముఖ్యమైనది. ఇది కండరాల క్షీణతను నివారించడంలో సహాయపడుతుంది,రెండింటినీ కలపడం ఓ చక్కని విజయ సూత్రంకార్డియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్లను కలపడం ఉత్తమమైన మార్గం. ఈ కలయిక, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది కాలేయం కోలుకోవడానికి మరింత బాగా తోడ్పడుతుంది. ఇది గుండె, కండరాలు కాలేయం అన్నీ కలిసి మెరుగుపడే సంపూర్ణ పరిస్థితిని శరీరంలో కల్పిస్తుంది.యోగా...సూర్య నమస్కారం మరికొన్ని యోగా పద్ధతులు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో యోగా ద్వారా కాలేయ కొవ్వును తగ్గించవచ్చు. అయితే, కేవలం తేలికపాటి స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు ఏరోబిక్ వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదు. హార్ట్ బీట్ను పెంచే కదలికలు ఎప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తాయి -
హంటావైరస్ అంటే..? ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందంటే..
అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ నౌక అర్జెంటీనా నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ద్వీపాల సమూహమైన కేప్ వెర్డేకు ప్రయాణిస్తోంది. దీంతో ఆ నౌకలోని ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దాంతో ఒక్కసారిగా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలేంటి హంటా వైరస్, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హంటావైరస్ అంటే..హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసి పల్మనరీ సిండ్రోమ్ వంటి పలు అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎలా వ్యాపిస్తుందంటే..వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే గాలి చొరవని ప్రదేశాల్లో నివశించే ప్రజలుకు ఈ వ్యాధి సోకే అవకాశం అని చెబుతున్నారు.మానువుల ద్వారా సంక్రమణ అనేది..అనేక వైరల్ ఇన్ఫెక్షన్ల వలె ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. చాలామటుకు ఎలుకల కారణంగా నమోదవ్వుతాయని చెబుతున్నారు. లక్షణాలు..ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయని అన్నారు. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటాయని చెప్పారు. అందువల్లే ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టతరం అని పేర్కొన్నారు వైద్యులు.తక్కువ సమయంలోనే తీవ్రతరం అవ్వొచ్చు..వ్యాధి ముదిరే కొద్దీ, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ ముఖ్య లక్షణం.మరణాల రేటు కూడా ఎక్కువే..ఇది అత్యంత అరుదైనదే అయినా..ఈ హంటావైరస్ ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల వెంటనే వైద్య సంరక్షణ పొందడం అత్యంత కీలకం.నిర్దిష్ట నివారణ లేదుహంటావైరస్కు నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. తీవ్రమైన సందర్భాలలో, ఆక్సిజన్ చికిత్స, ఆస్పత్రిలో చేరడం వంటి సహాయక చికిత్సలు తరచుగా అవసరమవుతాయ్. -
మామిడిపండ్లను నేరుగా తినేస్తున్నారా..? హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
పండ్లలో రారాజుగా కీర్తించే మామిడపండ్లు వచ్చే కాలమే ఈ వేసవి. ఈ సమయంలో ఎటుచూసినా..ఈ పండ్ల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ పండ్లను తినేమందు నీటిలో నానబెట్టడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతి. ఇది కేవలం మామిడి పండ్లను శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదని..అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలందించే విధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా నీటిలో నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడటమే గాక శరీర ఉష్ణోగ్రతన నియంత్రించి, జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుందని అంటున్నారు. ఈ మామిడిలో విటమిన్లు ఏ,సీల తోపాటు, పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి శక్తి కేంద్రం అయినప్పటికీ..పచ్చి రూపంలో కొన్ని జీవరసాయన సమ్మేళనాలు ఉంటాయి. అయితే ఈ పండు మన జీర్ణక్రియకు సురక్షితమైనదిగా ఉండాలంటే..ఈ సమ్మేళనాల ప్రభావాన్ని తగ్గించేలా నీటిలో అరగంటపాటు నానబెట్టక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా చూద్దామా..!.ఫైటిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడం: మామిడి పండ్లను నానబెట్టమని సిఫార్సు చేయడానికి ప్రాథమిక శాస్త్రీయ కారణం ఫైటిక్ ఆమ్లం ఉండటమే. ఫైటిక్ ఆమ్లం అనేది వివిధ మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే ఒక సహజ పదార్ధం. ఇది ఫాస్ఫరస్ను నిల్వ చేసే రూపంగా పనిచేస్తుంది. పోషకాహార శాస్త్ర ప్రకారం..ఖనిజాల జీవ లభ్యతపై దాని ప్రభావం కారణంగా దీనిని తరచుగా "పోషక విరోధి"గా వర్గీకరిస్తారు.జీర్ణవ్యవస్థలో కాల్షియం, ఇనుము, జింక్ వంటి అవసరమైన ఖనిజాలతో బంధం ఏర్పరచుకోవడానికి ఫైటిక్ ఆమ్లానికి అధిక అనుబంధం ఉంటుంది. ఈ ఖనిజాలు ఫైటిక్ ఆమ్లంతో బంధం ఏర్పరచుకున్నప్పుడు, అవి కరగని అవక్షేపాలను ఏర్పరుస్తాయి. అయితే వీటిని మానవ శరీరంలోని చిన్న ప్రేగు గ్రహించలేదు. అందువల్ల ఈ మామిడి పండ్లను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల, వాటిలోని అదనపు ఫైటిక్ ఆమ్లం కరిగిపోవడం లేదా విచ్ఛిన్నం కావడం జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ "యాక్టివేషన్" ప్రక్రియ కారణంగా పండులోని సూక్ష్మపోషకాల పూర్తి పోషక విలువను సులభంగా పొందగలమని చెబుతున్నారు.మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం..జీర్ణవ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ పద్ధతి చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మామిడి పండ్లలో ఉండే అధికంగా ఉండే ఫైటిక్ యాసిడ్ ఇనుము, జింక్, కాల్షియం వంటి ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎప్పుడైతే సుమారు 30 నిమిసాలు నానబెడతామో అప్పుడు ఈ పోషక వ్యతిరేక పదార్థ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా పండు మంచి పోషకవంతమైనదిగా, అలాగే జీర్ణవ్యవస్థకు సులభంగా జీర్ణమయ్యేదిగా మారుతుంది.ఉష్ణోత్పత్తిని తగ్గించి శరీరానికి చలువ చేసేలా..మామిడిలో కేలరీలు అధికం, సహజ చక్కెరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఇది నానబెట్టకుండా నేరుగా తీసుకుంటే జీవక్రియ వేడిని పెంచడానికి దారితీస్తుంది. శరీరంలో అంతర్గత వేడి చర్మంపై ప్రభావం చూపి దద్దుర్లు, మొటిమలు లేదా వేడి కురుపులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి పండ్ల సీజన్లో ఇవి సాధారణంగా కనిపించే సమస్యలు. ఈ వేడి కారణంగా కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అంటున్నారు. మనం ఎప్పుడైతే మామిడి పండుని నీటిలో నానబెడతామో అప్పుడు దానిలోని సహజ వేడి ఆవిరైపోతుంది. మానవ శరీర అంతర్గత వాతావరణానికి అనుగుణంగా మారిపోతుంది. అలాగే పేగులు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతాయి కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.రసాయన అవశేషాల నిర్మూలనఈ మామిడి పండ్లు పండించేందుకు కృత్రిమ పురుగుల మందులు, శిలీంధ్రనాశకాలు వంటివి అధికంగా వినియోగిస్తారు రైతులు. అంతేగాక పండు ఉపరితలంపై కాల్షియం కార్బైడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలను చల్లుతారు. ఫలితంగా రవాణ సమయంలో పండు డ్రై అయిపోకుండా తేమతో ఉండేలా చేయడమేగాక, నిల్వ కాలాన్ని పొడిగిస్తాయి. అలాగే వాణిజ్య మామిడి పండ్డు అందంగా కనిపించేలా పలుచటి మైనపు పొరను పూస్తారు కూడా. అందువల్ల ఇలాంటి మామిడిపండ్లను పారే నీటి కింద త్వరగా కడగడం, 30 నిమిషాలపాటు నానబెట్టడం వంటి వాటి వల్ల ఆయా రసాయనాల అవశేషాలు సమర్థవంతంగా తొలిగిపోవడమే గాక సురక్షితమైన ఆహారంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇలా నానబెట్టడం వల్ల మామిడి కాండం వద్ద ఉండే జిగురు లేదా లేటెక్స్ అనే రసం ఘాటు తొలిగిపోతుందట. ఈ రసం గనుక నోటిలోకి వెళ్తే నోటి చుట్టూ వాపు, దురద, బొబ్బలు వంటి చర్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!) -
కేవలం 2 నిమిషాల్లో శరీర వేడిని తగ్గించే అద్భుతమైన డ్రింక్
-
ఆహారాన్ని ఇలా తింటే.. జిమ్ తో పనిలేకుండానే బరువు తగ్గొచ్చు..
-
ఇప్పుడు మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల మీ ఫ్యూచర్లో..
వాషింగ్టన్ డీసీ: బాధ, కోపం, నిరాశ లాంటి భావాలను బయటకు వ్యక్తం చేయకుండా లోపలే దాచుకుంటారు కొందరు. తమ సమస్యల గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తుంటారు. వారిలోని ఇలాంటి ఒత్తిడి బయటకు కనిపించదు.. కానీ, లోపల మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో ఇది జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. రట్గర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్, హెల్త్ కేర్ పాలసీ అండ్ ఏజింగ్ రీసెర్చ్ పరిశోధకుల అధ్యయనంలో ఇందుకు సంబంధించిన విషయాలు తేలాయి. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను “జర్నల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఆల్జీమర్స్ డిసీజ్”లో ప్రచురించారు. ఈ అధ్యయనాన్ని ప్రత్యేకంగా చైనీస్ అమెరికన్లపై నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన చైనీస్ అమెరికన్లలో జ్ఞాపకశక్తి తగ్గుదల, ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు వారిని ఎంపిక చేసి ఈ పరిశోధన చేశారు. ఒత్తిడిని బయటకు చెప్పకుండా తమలోనే దాచుకునే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతోందని తేల్చారు. కొన్ని సమాజాల్లో “బలంగా ఉండాలి”, ఒత్తిడి గురించి “బయటకు చెప్పకూడదు” అనే భావనలు ఉంటాయి. ఈ కారణంగా వాళ్లు తమ బాధ, ఒత్తిడిని బయటకు చెప్పరు. దాంతో ఆ సమస్యలను ఎవరూ గుర్తించరు, చికిత్స కూడా జరగదు.ఈ అధ్యయనం చెబుతున్నది ఏమిటంటే.. అలాంటి సంస్కృతి, పరిస్థితులను అర్థం చేసుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఒత్తిడి తగ్గించే పద్ధతులతో వృద్ధుల్లో మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని కాపాడవచ్చు. వ్యక్తి సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని వారికి సాయం చేస్తేనే ఒత్తిడిని తగ్గించడంలో మంచి ఫలితాలు వస్తాయి.‘ఆసియన్ అమెరికన్ వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కానీ ఈ వర్గంపై జ్ఞాపకశక్తి తగ్గుదల గురించి ఎక్కువగా పరిశోధనలు జరగలేదు. కాబట్టి, ఈ వృద్ధుల్లో జ్ఞాపకశక్తి ఎందుకు తగ్గుతుంది? దానికి కారణాలు ఏమిటి అన్నది బాగా అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా అవసరం’ అని రట్గర్స్ సెంటర్ ఫర్ హెల్తీ ఏజింగ్ రీసెర్చ్ సభ్యురాలు, అధ్యయన ప్రధాన రచయిత మిషెల్ చెన్ తెలిపారు. ఆ వర్గంపై డేటా తక్కువగా ఉంది, కానీ వారి సంఖ్య పెరుగుతోంది కాబట్టి మరింత అధ్యయనం అవసరమని వివరించారు.వృద్ధాప్యంలో ఉన్నవాళ్లలో ఒత్తిడి, నిరాశ వంటి భావనలు బయటకు కనిపించకపోవచ్చు. కానీ, అవి మెదడు ఎలా పనిచేస్తుందో, వయస్సుతో అది ఎలా మారుతుందో అనే విషయంపై చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, ఈ భావాలను తగ్గించడం సాధ్యమే. అందుకే వ్యక్తుల సంస్కృతి, నేపథ్యాన్ని అర్థం చేసుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఒత్తిడి తగ్గింపు పద్ధతులు రూపొందించాలనేది ఈ పరిశోధన లక్ష్యం. -
వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?
జార్ఖండ్లో జరిగిన విషాద ఘటన అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.దాంతో సమ్మర్లో ఎలాంటి చిరుతిండ్లు మంచివనే చర్చలు లేవనెత్తాయి. అందులోనూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా అందరు మెచ్చే పానీపూరి విషయంలో మరింత కేర్ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.జార్ఖండ్ గిరిడిహ్ జిల్లాలోని లేడా బజ్తో గ్రామంలో, శనివారం సాయంత్రం ఒక వీధి వ్యాపారి అమ్మిన పానీపూరీలు తిని చాలామంది వాంతులు, నీరసం వంటి అనారోగ్యం బారిన పడ్డారు. సుమారుగా 18 మందికి పైగా ఆసుపత్రిలో చేరగా, ఏడేళ్ల చిన్నారి మరణించింది. ఒక సాధారణ వీధి ఆహారం ఇంత మందికి ప్రాణాంతకంగా ఎలా మారిందన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణంగా దానిలో ఉపయోగించే నీరేనని వైద్యులు చెబుతున్నారు. పానీపూరీ అనగానే నీరు ప్రధానం. ఈ నీరు కలుషితం కాకుండా మంచి పరిశుభ్రమైనది వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అదే నీరు కలుషితమైతే దానిలో కోలి లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందన్నారు. వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురవ్వుతామని అన్నారు. అలాగే అందులో ఉపయోగించే కూరలోని బంగాళదుంపలు, శనగులు తాజాగా ఉంటే పర్లేదు గానీ, అవి కూడా అసురక్షితమైనవి అయితే ఈ బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుతుందన్నారు. అలాగే దుకాణం వద్ద కూడా పరిశుభ్రత అనేది అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమ్మకందారులు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, పాత పాత్రలనే వాడటం, ఈగలు, దుమ్ముకు గురికావడం, తదితరాల వల్లే ఫుడ్పాయిజనింగ్ అయ్యి అనారోగ్యం బారిన పడతారని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు, హాని కలిగించేవి కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, అవి వదిలిపెట్టే విషపదార్థాలు కూడా అనారోగ్య సమస్యలు వస్తయాన్నారు. ఆ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే విషపదార్థాల కారణంగా డీహైడ్రేషన్, అవయవాలపై ఒత్తిడి, చివరికి ప్రాణాంతకంగా కూడా మారుతుందని అంటున్నారు. వేసవిలో వేడి కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగవంతంగా ఉంటుందట. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగ ఫుడ్పాయిజన్ కేసులు నమోదవుతాయని అంటున్నారు నిపుణులు. దకాణాదారుడు పరిశుభ్రతను పాటిస్తూ..నాణ్యమైన పదార్థాలనే ఉపయోగిస్తే ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా తినొచ్చని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?) -
భోజనం తర్వాత పుచ్చకాయ తినకూడదా..?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న ఘటన తీవ్ర ఆందోళన, అనుమానాలను రేకెత్తించింది. భోజనం తర్వాత సర్వసాధారణంగా పండ్లు తీసుకుంటాం. అలా.. సమ్మర్ ఫ్రూట్గా చెప్పే పుచ్చకాయను మాత్రం అలా తీసుకోకూడదా అంటే..పోషకాహార నిపుణులు ఔననే చెబుతున్నారు. అసలు దీన్ని ఎలా తినాలి?, ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది? వంటి విషయాలు గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.!.పుచ్చకాయ పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. అయితే చాలామంది ఈ పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందంటూ ఫిర్యాదులు చేస్తుంటారు. ఎందుకిలా అంటే..రీజన్ ఏంటంటే..సర్వసాధారణంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే భారీ భోజనం తర్వాత ఎప్పుడైతే పుచ్చకాయ తింటారో ఆ క్షణమే ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా పుచ్చకాయ వినయోగం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అందువల్ల ఇలా వేసవిలోనే ఈ సమస్య తీవ్రమవుతుందా? లేక ప్రతిసారి ఇలానే జరుగుతుందా అంటే..నిజనానికి వేసవిలో కడుపు ఉబ్బరం సర్వసాధారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అధిక వేడి కారణంగా శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇబ్బంది పడుతుండటంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని చెబుతున్నారు. తత్ఫలితంగా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ కాలంలో అధిక నీటి శాతం ఉన్న పండ్లు, తినే భోజనం రెండూ సమతుల్యంగా ఉంటే ఈ సమస్య రాదని అంటున్నారు. అంతేగాదు మనం పుచ్చకాయలను తీసుకునే విధానం కారణంగానే ఈ కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య వస్తుందని చెబుతున్నారు. అంతేగాదు అలాంటి సమయంలోనే జీర్ణవ్యస్థపై పుచ్చకాయ ప్రభావం చూపిస్తుంది. అదీగాక ఈ పుచ్చకాయలో అధికంగా ప్రక్టోజ్ ఉండటం వల్ల పెద్దప్రేగుల్లో ఇది పులిసి, గ్యాస్ ఉత్పత్తి అవ్వడానికి దారితీసి కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటివి కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదీగాక మనం తినే భోజనంతో పోలిస్తే పుచ్చకాయ వంటి పండ్లు జీర్ణాశయం గుండా వేగంగా ప్రయాణిస్తాయట. ఎప్పుడైతే ఈ రెండిటిని కలిపి తీసుకుంటామో దాని ఫలితం ఈ పుచ్చకాయ ముక్కలు జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది, దాంతో పులియబెట్టడం, గ్యాస్ ఏర్పడటం వంటివి జరుగుతాయని అన్నారు. అందువల్ల జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు సాధారణంగా భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవడమే మేలని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ సమస్యతో ఉన్నవారు కూడా భోజనం తిన్న వెంటనే లేదా పుచ్చకాయ తిన్న వెంటనే భోజనం వంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.ఎప్పుడు తింటే మంచిదంటే..వైద్యులు మెరుగైన ఫలితాలు పొందాలంటే.. పుచ్చకాయను తీసుకునే సమయం కీలకమైనదని అంటున్నారు. అది తీసుకునే ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలమని అన్నారు. అంటే పూర్తి స్నాక్ ఐటెంగా లేక భోజనానికి చాలా సమయం ఉందనగా తీసుకోవడం మంచిదని అన్నారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో తీసకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా వద్దనే చెబుతున్నారు వైద్యులు. సరైన సమయం ఉదయం 11 నుంచి 3 గంటల లోపు భారీ బోజనం తీసుకోక మునుపు అయితే మంచిదని చెబుతున్నారు. రాత్రి ఏడు తర్వాత తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది, పైగా రాత్రి సమయంలో తేలకపాటి ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏదైనా సరే తగిన మోతాదులో తీసుకోవడం మంచిదనేది గుర్తురెగాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అన్న నానుడి గుర్తించుకుని ఏదైన మితంగా సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నం కావని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?) -
పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న వార్త కొత్త ఆందోళనలకు దారి తీసింది. సీజన్తో సంబంధం లేకుండా చాలామందికి బిర్యానీ ఫేవరెట్ ఫుడ్. అలాగే వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. అలాంటివి ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు ఆ అపోహలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ముంబైలో జరిగిందేంటి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు శనివారం రాత్రి 10.30గం. ప్రాంతంలో మొదట బిర్యానీ తిన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న పుచ్చకాయ (వాటర్మెలన్)ను తిన్నారు. కొన్ని గంటల్లోనే వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలోనే ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.ట్రీట్మెంట్ సమయంలో ఆ నలుగురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ జరిగిందనడానికి నిదర్శనమని వైద్యులు ప్రకటించారు. పోలీసులు మాత్రం దీన్నొక యాక్సిడెంటల్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు తినగా మిగిలిన బిర్యానీ, పుచ్చకాయ ముక్కలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. పోస్ట్మార్టం.. హిస్టోపాథాలజీ రిపోర్టులు వచ్చాకే వాళ్లు ఎలా చనిపోయారన్న దానిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈలోపే.. బిర్యానీ తిన్న మిగతా బంధువులు బాగానే ఉండడంతో.. పుచ్చకాయనే ఈ మరణాలకు కారణమై ఉంటుందనే చర్చ(సోషల్ మీడియా రచ్చ) మొదలైంది. నిపుణులు చెబుతోంది ఏంటంటే.. పుచ్చకాయకు త్వరగా కలుషితమయ్యే గుణం ఉంటుందని. పుచ్చకాయ వేసవిలో తినడానికి అత్యంత ఆరోగ్యకరమైన పండు. ఇది 90% పైగా నీటితో నిండి ఉండి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, విటమిన్ A, C, లైకోపిన్, పొటాషియం వంటి పోషకాలు అందిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మం, కళ్లకు మేలు చేస్తుందని డైటీషియన్ డాక్టర్ అర్చనా బాత్రా అంటున్నారు. అయితే ముంబై కేసుపై ఆమె స్పందిస్తూ.. పుచ్చకాయలో సాల్మొనెల్లా, లిస్టీరియా, ఎస్టరేషియా కొలై లాంటి హానికరమైన పాథోజెన్లు చేరితే కలుషితం అవుతుందని.. అప్పుడు అది ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతుందని చెబుతున్నారు. ‘‘ఈ ప్రభావంతో తిన్న వ్యక్తులు తీవ్రమైన డీహైడ్రేషన్కు గురవుతారు. ఇన్ఫెక్షన్ సోకి అవయవాలపై ప్రభావం చూపవచ్చు. ట్రీట్మెంట్ ఆలస్యమైతే ప్రాణాల మీదకు రావొచ్చు’’ అని ఆమె అంటున్నారు. పుచ్చకాయలో అధిక నీరు, సహజ చక్కెర ఉండడం కూడా బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి కారణమని ప్రముఖ న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా అంటున్నారు. కొన్నిసార్లు పుచ్చకాయల్లో తీపి పెంచడానికి గ్లూకోజ్ నీరు లేదంటే చక్కెర నీరు ఇంజెక్ట్ చేస్తారని.. ఆ సమయంలోనూ కలుషితం కావొచ్చని.. అలాంటివి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.అలాగని పుచ్చకాయ ప్రాణం తీస్తుందని కాదు. పండ్లు కలుషితం కావడం, సరిగా నిల్వ చేయకపోవడంతో కచ్చితంగా ప్రమాదకరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి తొక్కతో సహా బాగా కడగాలి.. చాలా మంది ఈ జాగ్రత్త పాటించరుపుచ్చకాయను కోయడానికి శుభ్రమైన కత్తులు, బోర్డులు వాడాలి.కట్ చేసిన పుచ్చకాయ గది ఉష్ణోగ్రత వద్ద త్వరగా చెడిపోతుంది పుచ్చకాయను కట్ చేశాక 2 గంటలకు మించి బయట ఉంచకూడదుకట్ చేసి ఫ్రిజ్లో ఉంచిన పుచ్చకాయను తింటే ప్రమాదమేం కాదని న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా చెబుతున్నారుఅయితే ఫ్రిజ్లో ఎక్కువ కాలం నిల్వ చేస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి కట్ చేసి ఫ్రిజ్లో పెట్టిన పుచ్చకాయను రెండు, మూడు రోజులకు మించి ఉంచకూడదని ఆమె సూచిస్తున్నారు.. సరైన పుచ్చకాయను ఎంచుకోవడం ఎలా..?1.తొక్క రంగు చూసుకోవాలిగాఢమైన ఆకుపచ్చ రంగులో ఉండి, గీతలు స్పష్టంగా కనిపిస్తే అది పండిన పుచ్చకాయ.చాలా మెరిసే తొక్క ఉంటే ఇంకా పండలేదని అర్థం.2. ఫీల్డ్ స్పాట్ (పసుపు మచ్చ) చూడాలినేలపై పెరిగిన చోట పసుపు లేదంటే క్రీమ్ రంగు మచ్చ ఉంటుంది. అది గాఢంగా ఉంటే పుచ్చకాయ బాగా పండింది.తెల్లగా లేదంటే లేతగా ఉంటే ఇంకా పండలేదు.3. తట్టి చూడాలిపుచ్చకాయను తట్టి చూసినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్టుగా “తక్కువ శబ్దం” వస్తే అది పండింది.ఎక్కువగా ఘనంగా శబ్దం వస్తే ఇంకా పండలేదని అర్థం.4. బరువు చూసుకోవాలిపరిమాణానికి తగినంత బరువుగా ఉంటే అది రసంతో నిండిన పుచ్చకాయ.తేలికగా ఉంటే లోపల నీరు తక్కువగా ఉంటుంది.5. ఆకారం గమనించాలిగుండ్రంగా, సమంగా ఉన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయి.పొడవుగా లేదంటే అసమంగా ఉన్నవి తక్కువ తీపి కలిగి ఉండే అవకాశం ఉంది.పుచ్చకాయ మాత్రమే కాదు.. రాత్రి ఆలస్యంగా ఏ పండ్లు తినడం జీర్ణక్రియను కష్టతరం చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదంటే మధ్యాహ్నా సమయంలోనే పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు. -
డయాబెటిస్ ఉంటే చేయాల్సిన వ్యాయామాలు..!
డయాబెటిస్ ఉన్నవారి చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా మరింత శక్తిని పొందేలా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లు సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయడం అత్యంత ముఖ్యం.ఎందుకంటే..ఇన్సులిన్ సమస్యను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందితక్షణ కండర శక్తిని పెంచుతుందిబరువు నియంత్రణకు సహాయపడుతుందిచేయాల్సినవి..1. ఏరోబిక్ వ్యాయామంవేగంగా నడవడంసైక్లింగ్ఈతవ్యవధి: 30–45 నిమిషాలువారానికి కనీసం 5 రోజులు2. శక్తి శిక్షణతేలికపాటి బరువులు / రెసిస్టెన్స్ బ్యాండ్లుశరీర బరువు వ్యాయామాలు (స్క్వాట్లు, వాల్ పుష్-అప్లు)వారానికి 2–3 సార్లుకండరాలను పెంచుతుందిm గ్లూకోజ్ వినియోగం మెరుగుపడుతుంది. పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయి3. ఫ్లెక్సిబిలిటీ, చలనశీలతస్ట్రెచింగ్యోగాప్రతిరోజూ (10–15 నిమిషాలు)బిగుతును తగ్గిస్తుంది, కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఎప్పుడు చేయాలంటే..భోజనం తర్వాత (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత)భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుందిఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా తీవ్రమైన వ్యాయామం చేయవద్దువ్యాయామానికి ముందు ..ముందుగా ఒక చిన్న స్నాక్ తీసుకోండితీవ్రమైన వ్యాయామం చేయవద్దు, జాగ్రత్తగా ఉండండివ్యాయామానికి ముందు తినదగిన స్నాక్స్ (అవసరమైతే)కొన్ని నట్స్సగం పండుపెరుగుఇది వ్యాయామం చేసేటప్పుడు చక్కెర స్థాయిలు తగ్గకుండా నివారిస్తుందితీసుకోవాల్సిన జాగ్రత్తలు..తల తిరగడంఅధికంగా చెమట పట్టడంనీరసంగుండె దడతక్షణమే వ్యాయమాలు ఆపేసి విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే చక్కెర స్థాయిలను తనిఖీ చేయడం తదితరాలు చేయాలి.వ్యాయామం తర్వాత పాటించాల్సిన చిట్కాలు:అప్పుడప్పుడు షుగర్ స్థాయిలను తనిఖీ చేసుకోవడంనీళ్ళను బాగా తాగండివ్యాయామం తర్వాత అతిగా తినడం మానుకోండిచేసే తప్పిదాలు..క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంకేవలం నడవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకపోవడంవార్మ్-అప్ మానేయడంఅకస్మాత్తుగా వ్యాయామాన్ని అతిగా చేయడంషుగర్ తక్కువగా/ఎక్కువగా ఉన్న లక్షణాలను పట్టించుకోకపోవడంవారంలో వర్కౌట్ల ప్లాన్..సోమవారం–శుక్రవారం:30 నిమిషాల వేగవంతమైన నడక10 నిమిషాల స్ట్రెచింగ్మంగళవారం నుంచి శనివారం:15–20 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జోడించండిఆదివారం:తేలికపాటి కార్యకలాపాలు (నడక/యోగా)అప్పుడప్పుడు చేసే కఠినమైన వ్యాయామాల కంటే, క్రమం తప్పకుండా చేసే మితమైన వ్యాయామం మరింత ఉత్తమంగా పనిచేస్తుంది.చివరగా డయాబెటిస్కు వ్యాయామం అత్యంత శక్తిమంతమైన "మందులలో" ఒకటి. అయితే దానిని సరిగ్గా, క్రమం తప్పకుండా చేసినప్పుడు మాత్రమే ఫలితం అందుకోగలం అని చెబుతున్నారు నిపుణులు.డా. ఆదర్శ గౌడ, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్) సీఈవో, బెంగళూరు(చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు
బరువు తగ్గడం అనేది తరుచుగా కఠినమైన డైట్లు, డిటాక్స్ పద్ధతులు, తీవ్రమైన వ్యాయామాలతో ముడిపడి ఉంటుంది. కొందరు తక్కువ వ్యవధిలో బరువు తగ్గించే షార్ట్కట్లు వెతుక్కుంటారు. కానీ ఇలాంటివి ఏవి అవసరం లేకుండానే స్థిరమైన మార్పులతో బరువు తగ్గగలరని చెబుతున్నారు పుణెకు చెందిన క్లినికల్ ఫార్మసిస్ట్ అండ్ ఆరోగ్య విద్యావేత్త డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా తన రోగులలో ఒకరు ఎలాంటి తీవ్రమైన డైట్ లేదా డిటాక్స్ కార్యక్రమాన్ని పాటించకుండా 8 కిలోలు ఎలా తగ్గగలిగారో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ పేషెంట్ రక్త పరీక్షల్లో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంది. అతడు చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నా ఇలా ఈ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం అతనిలో భయాన్ని రేకెత్తించి తన వద్దకు వచ్చినట్లు తెలిపారు. అయితే డాక్టర్ దవాయివాలా సమస్య అతను ఎంత తిన్నాడు అనే దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదని అంటున్నారు. శరీరమే దీనికి కారణం అన్నారు.అదెలా అంటే..మన శరీరమే కొంత కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఇది మన జీవనానికి ముఖ్యమైన పదార్థం. ఇది కణ త్వచాలు, హార్మోన్లు, విటమిన్ డి కొవ్వును జీర్ణం చేసే పైత్యరస ఆమ్లాలకు ఒక కీలకమైన నిర్మాణ మూలకం. శరీరం సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగినప్పుడు సాధారణంగా అదనపు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అందుకు గల కారణాలు ఏవంటే..సరిగా నిద్రపోకపోవడంవిటమిన్ డి లోపంఇన్సులిన్ నిరోధకతక్రమరహిత భోజనంకనీస శారీరక శ్రమఅందువల్ల సమస్య కొలెస్ట్రాల్ కాదు. ఇది దెబ్బతిన్న జీవనశైలి చక్రానికి సంబంధించిన ఒక లక్షణంకొలెస్ట్రాల్, బరువు తగ్గేలా ఏం చేయాలంటే..అదనపు ఫైబర్ (అవిసె, చియా, నానబెట్టిన ఓట్స్)ఒమేగా-3లుసమతుల్యమైన ఆహారం, ఏదీ మానకూడదుప్రతిరోజూ ఉదయం సూర్యరశ్మి, మెగ్నీషియంవిటమిన్ డి సప్లిమెంట్లుఈ మార్గదర్శక జీవనశైలి మార్పుల ద్వారా, రోగి మొత్తం కొలెస్ట్రాల్ 248 mg/dL నుంయి 187 mg/dLకి తగ్గింది. అతను 8 కిలోల బరువు తగ్గాడు, అతని విటమిన్ డి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. పైగా అతని నిద్ర మెరుగుపడింది, అతిగా తినడం కూడా ఆపగలిగాడు.ఇందులో ఎలాంటి తీవ్రమైన డైట్లు లేదా జిమ్మిక్కులు లేవు. కేవలం స్థిరమైన, మార్గదర్శక ప్రయత్నం మాత్రమే. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని లేదా బరువును అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణులు లేదా ఫిట్స్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు డాక్టర్ దవాయివాలా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Idris Dawaiwala | AHealthyBeat (@ahealthybeat) (చదవండి: గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..) -
ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!
చాలామంది మహిళలు అటుఇటుగా మధ్యవయసుకు చేరుతుండగానే కాస్త లావెక్కుతుంటారు. ఈ దశలో వాళ్లకు ఒక సందేహం కూడా వేధిస్తుంటుందీ... ‘మేమేమీ ఎక్కువగా తినడంలేదు. మా ఆహార అలవాట్లలో మార్పులూ లేవు. అయినా ఇలా ఎందుకు బరువు పెరుగుతున్నామం’టూ బాధపడుతుంటారు. ఇలా జరగడానికి కారణాలేమిటో చూద్దాం. నిజానికి మధ్యవయసుకు చేరుతూ... రుతుక్రమం ఆగిపోయేందుకు తొలి దశ అయిన పెరీ–మెనోపాజ్, రుతుస్రావం పూర్తిగా ఆగిపోయే మెనోజ్కూ దగ్గరపడుతున్న సమయంలో అప్పటివరకూ వాళ్లలో స్రవిస్తున్న ఈస్ట్రోజెన్ మోతాదుల్లో తగ్గుదల మొదలవుతుంది. ఈ ఈస్ట్రోజెన్ మోతాదుల్లో తగ్గుదల జీవక్రియలూ (మెటబాలిజమ్), కొవ్వు నిల్వలూ, ఎనర్జీ వెలువడటాలనే పలు అంశాలలో మరికొన్ని మార్పులకు కారణమవుతుంది. మెనోపాజ్ దశలో స్థూలకాయం రావడానికి కారణాలేమిటి?నిజానికి ఈస్ట్రోజెన్ అనే హార్మోన్.... ఇన్సులిన్ చేసే పనిలోనూ, అది వివిధ కణాలకు చేరే తీరుతెన్నులు, జీవక్రియల వేగం రేటు... ఈ అన్ని విషయాల్లోనూ కీలక భూమిక ΄ోషిస్తుంది. ఈస్ట్రోజెన్ క్రమబద్ధంగా వెలువడుతున్న రోజుల్లో అది దేహంలోని గ్లూకోజ్ సమంగా నిర్వహితమవుతూ, కండరాలన్నీ (మజిల్ మాస్) సమానంగా ఉండేలా చూస్తుంది. దాంతో దేహం దాదాపుగా సన్నగానే కనిపిస్తుంటుంది. కానీ ఈస్ట్రోజెన్ స్రావాలు మోతాదులు తగ్గుతున్న కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో అది దేహంలో కొవ్వు పేరుకునే ప్రక్రియకు దారితీస్తుంది. ఈ క్రమంలో మొదట మహిళల పొట్టలో కొవ్వుపెరగడం దగ్గర్నుంచి మొదలై క్రమంగా ఒళ్లు లావెక్కడం కొనసాగుతుంది. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం అంతే ఉన్నప్పటికీ... ఈ మధ్యవయసు దశలో మహిళలు తాము తీసుకునే ఆహారమూ, చేస్తుండే వ్యాయామంలో మార్పులు లేనప్పటికీ... జీవక్రియల్లో వచ్చిన పై మార్పు కారణంగా వాళ్ల దేహం బరువు పెరగడం మొదలువుతుంది. పెరీ–మెనోపాజ్ దశల్లో ఈస్ట్రోజెన్ హార్మోనల్ మార్పులు క్రమంగా మజిల్ మాస్ తగ్గిస్తూ పోవడంతో పాటు దేహంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతూ పోతాయి. కండరాల్లో ఏదైనా గాయమైనప్పుడు దాని నుంచి కోలుకునే వేగాన్ని కూడా తగ్గిస్తాయి. మనం చేసే రోజువారీ పనులతో కండరాల్లో అయ్యే చిన్నపాటి గాయాలు తగ్గే వేగం కూడా మందగిస్తుంది. ఇలా ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం అనే అంశం... మహిళలు తీసుకునే ఆహారాలు ఒంటికి పట్టడమూ (అబ్జార్బింగ్ ద న్యూట్రియెంట్స్), కండరాల నిర్మాణమూ, ఒత్తిడిని మేనేజ్ చేయడం (స్ట్రెస్ మేనేజ్మెంట్), నిద్ర... వీటన్నింటినీ ప్రభావితం చేస్తూ... బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడి పెరగడంతో దేహంలో కార్టిసోల్ అనే హార్మోన్లు స్రవించడానికి కారణం కావడమూ... దాంతో నిద్ర బాగా తగ్గడం... ఇలా కంటినిండా నిద్రలేనప్పుడు రెస్టింగ్ మెటబాలిజమ్ కూడా తగ్గడం వల్ల ఒళ్లు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. అంటే... ఆహార అలవాట్లలో మార్పులు లేక΄ోయినప్పటికీ, ఇక్కడ పేర్కొన్న ఈ మార్పుల కారణంగా మధ్యవయసు రాగానే మహిళల్లో స్థూలకాయం పెరుగుతుంది. మెనోపాజ్ అనేది నివారించలేని దశ. అయితే ఈ ప్రక్రియల ద్వారా ఈస్ట్రోజెన్ తగ్గుదల వేగాన్ని నియంత్రించి, తద్వారా బరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తూ ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడుతుంది. ఇక ఈస్ట్రోజెన్ తగ్గుదలతో వచ్చే పరిణామాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే... డాక్టర్ను సంప్రదించి అందుకోసం హార్మోన్ రీ–ప్లేస్మెంట్ చికిత్స (హెచ్ఆర్టీ) వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.ఈ సమస్యను అధిగమించడం ఎలా... ఏజింగ్ లేదా వయసు పెరుగుతుండటం వల్ల వచ్చే మార్పుల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ, అలా జరిగే తీరు మెల్లగా జరిగేలా చేయడం ద్వారా ఈ ప్రక్రియలను సాధ్యమైనంత ఆలస్యంగా జరిగేలా చేయడంతో పాటు దీనివల్ల కలిగే దుష్పరిణామాలను వీలైనంతగా నివారించవచ్చు. అందుకు ఆరోగ్యకరమైన మంచి జీవనశైలి (లైఫ్స్టైల్) బాగా ఉపయోగపడుతుంది.మంచి పోషకాహారాలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే మితిమీరిన వ్యాయామాలూ చేయకూడదు. దేహానికి మరీ శ్రమకలిగించని విధంగా కేవలం ఒళ్లు అలిసిపోయేలా మాత్రమే ఈ వ్యాయామాలు ఉండాలి. ఇందుకు వాకింగ్, ఈత వంటి వ్యాయామాలు మంచివి. ఒత్తిడిని (స్ట్రెస్ను) వీలైనంతగా తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియలను అనుసరించవచ్చు. మందకొడిగా కాకుండా ఎప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కనీసం 7, 8 గంటలకు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి. రూమా సిన్హా, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!) -
బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
శరీరం సంక్రమంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. నిజానికి శరీరం వివిధ భాగాలతో కూడిన ఒక జట్టులా పనిచేస్తుంది. ప్రతి అవయవానికి దానికంటూ ఒక పాత్ర, సొంత అవసరాలు, ఇష్టమైన పోషకాలు ఉండాయి. జీర్ణవ్యవస్థకు సహాయపడేది ఊపిరితిత్తులకు లేదా కళ్లకు సరిపడకపోవచ్చు. అందుకే తెలివిగా తినడం అంటే కేవలం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు అది బలవర్ధకమైనదై ఉండాలి కూడా అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు లాన్విత్ బాత్ర. అవయవాలు సక్రమంగా పనిచేసేలా, ఏకాగ్రత, శ్వాస బాగుండేలా ఎలాంటి పోషకాహారం తినాలో, జీవనశైలిలో అందుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పుల చోటు చేసుకోవాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు.శరీరంలోని ప్రతి భాగానికి సరైన ఆహారాలు1. ఊపిరితిత్తులు: వాపు నివారణపై (Anti-Inflammation) దృష్టి సారించండిమెరుగైన శ్వాస, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసంఅల్లం, పసుపు, సిట్రస్ పండ్లను (పుల్లని పండ్లు) ప్రత్యేకంగా సూచించారు. వీటిలో జింజెరోల్, కర్కుమిన్, విటమిన్ సీ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అందుకోసం ఉదయపు టీ లేదా జ్యూస్లో తాజా అల్లం, పసుపును చేర్చుకోండి.2 కాలేయం (Liver): విషతుల్యాల నిర్మూలనకు (Detox), కొలెస్ట్రాల్ జీవక్రియకు మద్దతునివ్వండి. శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడానికి (detox) కాలేయం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. బ్రకోలి (సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉండేది), గ్రీన్ టీ, ఆలివ్ నూనె వంటి ఆహారాలు ఈ ప్రక్రియకు మద్దతునివ్వడానికి, కొవ్వు పేరుకుపోకుండా రక్షించడానికి సహాయపడతాయి. అంతేగాదు కొన్ని సులభమైన మార్పులతో, రోజువారీ ఆహారం ద్వారా వాటికి మద్దతు ఇవ్వవచ్చు.3. పేగు ఆరోగ్యం: మంచి బ్యాక్టీరియా కోసం.. ఆరోగ్యకరమైన పేగుకు ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ రెండూ అవసరం. పెరుగు మీకు సజీవ మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. అయితే అరటిపండ్లు, చియా గింజలు వాటికి ఆహారం అందించే ఫైబర్ను అందిస్తాయి.సులభమైన, జీర్ణవ్యవస్థకు మేలు చేసే చిరుతిండి కోసం పెరుగు, చియా గింజలను కలిపి ప్రయత్నించండి.4. కళ్ళు: ఒత్తిడి నుంచి రక్షణస్క్రీన్ సమయం పెరగడంతో, కంటి ఆరోగ్యం మునుపెన్నడూ లేనంతగా ముఖ్యమైంది. క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ) పుష్కలంగా ఉంటుంది, అదే సమయంలో ఉసిరి రెటీనాను రక్షించడానికి విటమిన్ సీ ని అందిస్తుంది. రోజువారీ భోజనంలో కనీసం ఒక నారింజ రంగు కూరగాయను చేర్చుకోండి.చిన్న చిన్న ఆహార ఎంపికలు శరీరంలోని వివిధ భాగాలకు వివిధ రకాలుగా సహాయపడతాయి. అందువల్ల ఏమి తింటున్నారు, ఎందుకు తింటున్నారు అనే దానిపై కాస్త శ్రద్ధ పెట్టి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు పోషకాహారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే కాదు. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: పాద' సేవలను గుర్తించండి!) -
'పాద' సేవలను గుర్తించండి!
పాదం ఓ సంక్లిష్టమైన అవయవం. నడక సరిగా సాగుతున్నంత సేపూ దాని గొప్పదనం తెలియదు. నిర్మాణపరంగా (అనటామికల్గా) చూస్తే అదొక అబ్బురపరచే అవయవం. పాదం ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం.పాదం గురించి తెలుసుకునే ముందు అసలు పాదం నిర్మాణాన్నీ, దాని పనితీరేమిటన్నది చూద్దాం.26 ఎముకలు / 107 లిగమెంట్లు / 19 కండరాలు మొత్తం కాలిలో 30 ఎముకలు ఉంటే... సైలెంట్గా తనపని తాను చేసుకుపోయే పాదంలో 26 ఎముకలు ఉంటాయి. అంటే కాలితో పోల్చి చూసినప్పుడు 90 శాతం ఎముకలు పాదంలోనే ఉంటాయి. ఇందులో నడవడానికి ఉపయోగపడేలా 107 లిగమెంట్లు, 19 కండరాలు కూడా ఉంటాయి. ఓ వ్యక్తి బరువు 70కిలోలు అనుకుంటే... అతడి బరువును బ్యాలెన్స్ చేసేందుకు దేహంలోని పొడవైన ఎముక ‘ఫీమర్’ తొడలో ఉంటుంది. దీన్నే తెలుగులో తొడ ఎముక అని పేరు.నడక... 70 కిలోల షాక్ తీసుకునే... సంక్లిష్ట ప్రక్రియ మనం మనకు తెలియకుండా యాంత్రికంగా నడుస్తుంటాంగానీ... నిజానికి నడక చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పాదం నేల మీద మోపగానే 70 కిలోల బరువుతో మొదటి షాక్ పాదం పైనే పడుతుంది. కానీ ఆ షాక్ను పాదానికి అంతటా సమంగా విస్తరింపజేస్తూ... ఆ షాక్ను తట్టుకునే షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది పాదం. ఇక ఆ పాదాన్ని వెనక్కుతోస్తూ తన గరిమనాభి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) ముందుకు పడేలా చేస్తూ నడక సాగిస్తున్న వ్యక్తి కదులుతాడు. ఇలా గ్రావిటీవల్ల ముందుకుపడిపోయే లోపే... మరో కాలు ముందుకు పడి ఆ 70 కిలోల షాక్ను ఆ కాలు తీసుకుని మనిషి పడిపోవడం నుంచి ఆపుతుంది. ముందుకు పడిపోయేలా కదులుతూ... అలా పడిపోయే లోపు మరో కాలిని ఆనిస్తూ నడక సాగుతుంది. ఇలా నడక సాగించడాన్ని ‘బైపెడల్’ మూవ్మెంట్ అంటారు. రోజులో 7,500 సగటు అడుగుల నడకలో జరిగేదేమిటంటే... ఓ వ్యక్తి నడవడం మొదలుపెట్టాక ప్రతి నిమిషానికి ఉజ్జాయింపుగా 100 అడుగులు వేస్తుంటాడని అంచనా. అంటే అతడి రెండు కాళ్ల మీద ప్రతి నిమిషానికీ 70 కిలోల బరువు పడుతూ... ఒక్కో ΄ాదం మీదా ఇలా 50 సార్లు పడుతుంది. మొదట పాదం మోపగానే బరువంతా మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలోని ఎముకలైన ఐదు మెటాటార్సల్స్పై పడుతుంది. వాటి సాయంతో పాదం నేలను వెనక్కుతోస్తుంది. కానీ నేల కదలదు కాబట్టి... అలా వెనక్కు నెట్టడం వల్ల ఆ వ్యక్తే ముందుకెళ్తుంటాడు. ఇలా ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తి రోజుకు 7,500 అడుగులు వేస్తాడని ఉజ్జాయింపుగా ఓ అంచనా.ఏడాదికి 27,37,500 అడుగులూ... జీవితకాలంలో 22 కోట్ల అడుగులుఈ లెక్కన అతడు ఏడాదికి 27,37,500 అడుగులూ... ఒకవేళ అతడు ఆరోగ్యకరంగా 80 ఏళ్లు బతకగలిగితే... అతడి జీవితకాలంలో మొత్తం 21,90,00,000 అడుగులు (అంటే దాదాపుగా 22 కోట్ల అడుగులు) వేస్తాడు. అలా ఓ వ్యక్తి తన జీవిత కాలంలో లక్షా అరవై వేల కిలోమీటర్ల (లక్ష మైళ్ల) దూరాన్ని నడుస్తాడని ఒక అంచనా. (పుట్టిన ఐదేళ్ల వరకు పెద్దగా నడవడు కదా అనుకుని 75 ఏళ్లకే లెక్కవేస్తే... 20,53,12,500 అడుగులు వేస్తాడు. అంటే కనీసం 20 కోట్ల అడుగులైనా వేస్తాడు. ఆ నడిచే దూరాన్ని భూమ్మీద భూమధ్య రేఖ వెంట ఇలా నడుస్తూపోతే భూమిని నాలుగుసార్లు చుట్టి వస్తాడు. ఒకవేళ భూమి నుంచి చంద్రుడివరకూ నడవగలిగేట్లయితే... భూమికీ చంద్రుడికీ మధ్యనున్న దూరం 3,84,400 కిలోమీటర్ల దూరంలో అటుఇటుగా దాదాపు నాలుగో వంతు నడుస్తాడు. ఈ లెక్కలను బట్టి చూస్తే ఓ జీవితకాలంలో పాదాలపై పడే బరువూ, భారమూ ఎంత అన్నది ఆలోచిస్తే... మన పాదాలు చేసే కష్టమెంతో అర్థమవుతుంది. గచ్చు గట్టిదనంతో మరిన్ని గాయాలు... ఒకప్పుడు మనమందరం దాదాపు పాదరక్షలేమీ లేకుండానే మట్టిపై నడిచేవాళ్లం కానీ... ఇప్పుడు సిమెంట్తో రూపొందిన కఠినమైన పేవ్మెంట్లు లేదా అలాంటి ఉపరితలాల మీద నడవాల్సి వస్తుంది. నిజానికి ఇలాంటి కఠినమైన ఉపరితలాల మీద నడిస్తే పాదాలకు నష్టం. దీనికి బదులు నడిచే సమయాల్లో మెత్తటి నేల, లేదా కాస్తంత బౌన్స్ ఇచ్చేలాంటి గడ్డి మీద నడవటం వల్ల పాదాలకు రక్షణ దొరుకుతుంది. అందుకే కఠినమైన ఉపరితలాల మీద వాకింగ్ అంతగా సిఫార్సు చేయదగినది కాదు. అయితే ఇప్పుడు చాలావరకు ప్రతిచోటా రోడ్లతో హార్డ్ సర్ఫేస్లు ఉంటున్నందున మెత్తగా ఉండే షూస్ ఎంపిక చేసుకోడం వల్ల పాదానికి తగిన రక్షణ దొరుకుతుంది. పాదాలకు వచ్చే కొన్ని సమస్యలూ... పరిష్కారాలు...ఇటీవల అందరూ షూస్ / బూట్లు తొడుగుతున్నారు. అందునా స్కూల్ పిల్లల వయసు నుంచే ఇది జరుగుతోంది. అయితే ఇలా షూస్, బూట్లతో చాలాసేపు పాదాల్ని బంధించి ఉంచడం సరికాదు. ఇది పూర్తిగా ఎదగని చిన్నారుల పాదాల ఎదుగుదలను దెబ్బతీయవచ్చు. అందుకే పాద సంరక్షణ కోసం కాస్తంత వదులుగానూ, తొడిగాక పాదం ముందర కాస్త ఖాళీ ఎక్కువగానూ ఉండేలా షూ ఎంచుకోవాలి. షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమస్యను ‘బ్యూనియన్’ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్కు చూపించాలి.. చిన్నారులు స్కూల్ నుంచి రాగానే పిల్లలు షూస్ వదిలేసి... ఫ్రీగా ఉండే చెప్పులు, స్లిప్పర్స్ వంటి వాటిని తొడగాలి. ఇక మహిళల్లో విషయానికి వస్తే... వారు ధరించే హైహీల్స్ వల్ల పాదాలకు జరిగే ప్రమాదవకాశాలు పురుషులతో పొలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. కొందరిలో బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంటుంది. ఇలా జరగకూడదంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లోంచి మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకోవాలి. ఇక డయాబెటిస్ వంటి సమస్య ఉన్నవారు పాదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలతో పాదాలను చాలావరకు సంరక్షించుకోవచ్చు. షూ తొడిగినప్పుడు ఒకేచోట అదేపనిగా ఒత్తిడి పడుతుండటం వల్ల ఆనెకాయలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని కొందరు బ్లేడ్తో కోస్తుండటం, మరికొందరు యాసిడ్ చుక్కలతో మాడ్చటానికి ప్రయత్నిస్తుంటారు. అది సరికాదు. డాక్టర్కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. ∙కొందరిలో పాదాలకు కాయకాచి అందులో పగుళ్లు ఏర్పడతుంటాయి. ఇలా జరిగినప్పుడు పాదాల డాక్టర్కు చూపించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి.కొందరిలో ఫంగస్ కారణంగా అథ్లెట్స్ ఫుట్ అనే సమస్య వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ పాదాలపై ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే పాదం ఎప్పుడూ తేమ, తడిలో ఉండటంతో అక్కడ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథులు స్రావాలతో పాదం తడిసినప్పుడూ ఈ సమస్య మరింత త్వరగా రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ బేస్డ్ వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు.డా. సుధీర్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్.నిర్వహణ: యాసీన్ -
అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..
వ్యాయామాలు కూడా ఎలా పడితే అలా చేసేయకూడదు అనే చెప్పే ఘటన ఇది. బరువు తగ్గడం కోసం లేదా ఫిట్నెస్ గురించి అయినా..నిపుణులు సలహాలు సూచనలతో చేయడమే మేలు. ఎందుకంటే అతి వేగవంతంగా చేసే వ్యాయామాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయి కూడా. అందుకు ఈ అనూహ్య ఘటనే ఉదాహరణ.ఇది నాగ్పూర్లోని ఒక జిమ్లో చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఓం భోయార్ జిమ్లో నాలుగు గంటల పాటు వ్యాయామం చేశాడు. అక్కడ డెడ్లిఫ్ట్ చేయడానికి తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఒక రీల్ను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే క్షణాల్లో కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. వృత్తిరీత్యా నర్సు అయిన అతడి తల్లి ఆర్తి భోయార్ గోల్డెన్ అవర్గా చెప్పే తొలి 3-4 గంటల సమయం అవసరమయ్యే వైద్య పరిస్థితిని వృధా కానివ్వకుండా హుటాహుటినా ఆస్ప్రతికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు రోగ నిర్థారణ పరీక్షలలో అతని మెదడులో రక్తం గడ్డకట్టినట్లు కనుగొన్నారు. దానిని మెకానికల్ థ్రాంబెక్టమీ విధానం ద్వారా తొలగించారు. తత్ఫలితంగా దీనివల్ల అతని మెదడుకు రక్త ప్రసరణ సజావుగా జరిగి, త్వరితగతిన కోలుకోవడానికి సహాయపడింది. ఈ ఘటనలో అతని తల్లి సకాలంలో స్పందించడం వల్లే ఓం భోయార్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. అంతేగాదు ఆరోగ్య నిపుణులు శారీరక సామర్థ్యానికి మించి మితిమీరి వ్యాయామాలు చేసేవాళ్లందరకీ ఇదొక హెచ్చరికని అని చెబుతున్నారు. ఇక్కడ హెమరేజిక్ స్ట్రోక్లో, మెదడులోని రక్తనాళం చిట్లి, రక్తం చుట్టుపక్కల కణజాలంలోకి లీక్ అవుతుంది. ఇది మెదడులోని సంబంధిత భాగాలకు, వాటికి అనుసంధానించబడిన శరీర భాగాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుఉంది. దాంతో శరీర భాగాలు పక్షవాతానికి గురవుతాయని చెబుతున్నారు వైద్యులు. సకాలంలో శస్త్ర చికిత్స అందించి మెదడులో పేరుకుపోయిన రక్తాన్ని తొలగించి, పక్షవాతం ప్రభావాలను తగ్గించి, కోలుకునే అవకాశాలను పెంచవచ్చు.(చదవండి: సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్లో టాపర్గా!) -
ముందస్తు పరీక్షలతోనే కిడ్నీ కేన్సర్కు చెక్!
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రాణాలను కాపాడుతుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు నిరూపించారు. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకపోయినప్పటికీ, సాధారణ హెల్త్ చెకప్తో ఓ వ్యక్తికి ప్రాణాంతక కిడ్నీ కేర్ను గుర్తించి విజయవంతంగా చికిత్స అందించారు.నగరానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు (బీపీ, షుగర్ వంటివి) లేవు. ధూమపానం అలవాటు కూడా లేదు. అయితే, ఇటీవల ఆయన చేయించుకున్న సాధారణ మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా చేసిన అబ్డామినల్ అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎడమ కిడ్నీలో సుమారు 8 సెంటీమీటర్ల మేర పెరిగిన గడ్డ (మాస్) బయటపడింది. వెంటనే సీటీ స్కాన్ నిర్వహించగా అది కిడ్నీ కేన్సర్గా నిర్ధారణ అయింది.AINU యూరాలజీ హెచ్ఓడి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస నారాయణం నేతృత్వంలోని బృందం ఆ రోగికి రాడికల్ నెఫ్రెక్టమీ (సర్జరీ ద్వారా కిడ్నీ తొలగింపు) నిర్వహించింది. పరీక్షల్లో అది 'క్లియర్ సెల్ రీనల్ సెల్ కార్సినోమా'గా తేలింది. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస నారాయణం మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 4.3 లక్షల కొత్త కిడ్నీ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. 70 నుంచి 80 శాతం కిడ్నీ కణితులు ఎటువంటి లక్షణాలు లేకుండానే పెరుగుతాయి. మూత్రంలో రక్తం రావడం, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అది వ్యాధి ముదిరినట్లు లెక్క. అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం" అని వివరించారు. ధూమపానం, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారికి ముప్పు ఎక్కువ. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు.చిన్న గడ్డలను 'పార్షియల్ నెఫ్రెక్టమీ' ద్వారా కిడ్నీని కాపాడుతూనే తొలగించవచ్చు. పెద్ద గడ్డలకు మొత్తం కిడ్నీ తొలగించాల్సి ఉంటుంది. ఏడాదికి ఒకసారి కనీసం అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా స్కానింగ్లో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే నిపుణులైన యూరాలజిస్టులను సంప్రదించాలని AINU యాజమాన్యం కోరింది. డాక్టర్ శ్రీనివాస నారాయణం,AINU సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్(చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!) -
జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!
సృష్టిలో ప్రతి జీవరాశి తన మనుగడను కొనసాగించడానికి శక్తి అత్యవసరం. ఈ శక్తి ప్రధానంగా ఆహారం ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా మానవాళికి అవసరమైన పోషకాలు పంటలు, పశుసంపద ద్వారా లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. పశువైద్యులు కేవలం జంతువులకు చికిత్స చేసే వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. ‘పశు వైద్యులు– ఆహార ఆరోగ్య సంరక్షకులు’ అనే థీమ్తో ఈ సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవటం అత్యంత సముచితం.పశు సంపద ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోషక అవసరాల నేపథ్యంలో పశు వైద్య రంగం ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. మన పూర్వీకులు పశువులను, ప్రకృతిని సమానంగా గౌరవించి, పర్యావరణహితమైన విధానాలతో వ్యవసాయం, జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ సమతుల్య జీవన విధానాన్ని మళ్లీ ఆచరిస్తే, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన జీవితం అందించవచ్చు.ఆరోగ్యంపై సమగ్ర దృక్పథంపశువైద్యం కేవలం జంతువుల వైద్యంతో పరిమితం కాకుండా.. మనుషుల ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు అంతా ఒక్కటే (వన్ హెల్త్) అనే సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. ఈ మూడూ పరస్పరం అనుసంధానమైనవి. పశువైద్యులు పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడటమే కాకుండా పరోక్షంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే పశువులకు చికిత్స ఇచ్చేటప్పుడు మందుల అవశేషాలు పాలు, మాంసం, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం.సంక్రమిత వ్యాధుల నియంత్రణపశువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఉదాహరణకు: రేబీస్, బ్రూసెల్లోసిస్, టీవీ వంటివి. ప్రస్తుతం గుర్తించిన సంక్రమిత వ్యాధులలో సుమారు 60% జంతువుల ద్వారా వ్యాపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 5 కొత్త వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వస్తున్నాయని అంచనా. అరణ్య ప్రాంతాలలో మానవ జోక్యం పెరగటం ఈ వ్యాధుల వ్యాప్తికి ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో పశువైద్యులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రపంచ ఆరోగ్యానికి అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటి. అనవసరంగా, అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ఆహారంలో అవశేషాలు చేరి ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పశువైద్యులు బాధ్యతాయుతమైన ఔషధ వినియోగాన్ని ప్రోత్సహించాలి. పశుసంపద సుస్థిర ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంచనాలప్రకారం, ప్రపంచానికి అవసరమైన ప్రోటీన్లో సుమారు 30–40% జంతువుల నుంచి లభిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం సుమారు 20% ఆహారం పశువ్యాధుల వల్ల కోల్పోతున్నాం. పశువుల విసర్జితాల పునర్వినియోగం ద్వారా సేంద్రియ వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం వర్థిల్లుతుంది. తద్వారా పర్యావరణం, పశువులు, మనుషుల మధ్య సమన్వయంతో ఆహార గొలుసును కాపాడుకోవచ్చు.14.5% వరకు పశువుల ఉద్గారాలుప్రస్తుతం పశువైద్య రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు వాతావరణ మార్పు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 14.5% హరిత గృహ ఉద్గార వాయువులు పశుసంపద నుంచి వెలువడుతున్నాయని అంచనా. దీర్ఘకాలిక సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే 10–15% వరకు పశువుల పెరుగుదల, వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. అయితే, పశుసంపద మనకు ముఖ్యమైన ప్రోటీన్ వనరుగా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పశువైద్యులు మీథేన్ ఉద్గారాలను తగ్గించే పద్ధతులు, సుస్థిర పశుసంవర్ధన విధానాలు, కార్బన్ క్రెడిట్ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే విధంగా కార్బన్ మార్కెట్లో భాగస్వామ్యం కల్పించడం కూడా ఒక ముఖ్య లక్ష్యం.మీథేన్ ఉద్గారాలుప్రపంచంలో అత్యధిక పశుసంపద కలిగిన దేశం మనదే. ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం హరిత గృహ వాయువు ఉద్గారాల్లో సుమారు 14–16% వ్యవసాయం నుంచి వెలువడుతుంటే, అందులో పశుసంపద ఉద్గారాల వాటా 55–60%. పాల ఉత్పత్తిలో దేశంలోనే ముఖ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో వ్యవసాయ ఉద్గారాల్లో పశుసంపద వాటా 30–35%గా ఉంది. ముఖ్యంగా డెయిరీ రంగంలో గేదెల ద్వారా ఎక్కువ మీథేన్ వెలువడుతోందని అంచనా. నెమరు వేసేటప్పుడు జీర్ణప్రక్రియ వల్ల వెలువడే మీథేన్ పశు ఉద్గారాల్లో 85%ను ఆక్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే వ్యవసాయ ఉద్గారాలలో పశుసంపద ఉద్గారాల వాటా 25–30%. తెలంగాణలో గొర్రెలు, మేకల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఉద్గారాల తీరు భిన్నంగాఉంటుంది. తెలంగాణ ఎస్ఏపీసీసీ చెబుతున్న దాని ప్రకారం మీథేన్ ఉద్గారాలు పశువుల నుండే ఎక్కువ వెలువడుతున్నాయి.ముఖ్యమైన విశేషాలుప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలో పశుసంపద ఎక్కువ. కానీ తక్కువ. కానీ, ముఖ్యంగా ఒక్కో పశువు తలసరి ఉత్పాదకత తక్కువ. ప్రపంచంలోని గేదెల సంఖ్యలో 50% మన దేశంలోనే ఉంది. ఈ కారణంగా మొత్తం ఉద్గారాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి క్రమంలో వెలువడే ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. పశువైద్యులు కేవలం జంతువుల వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. పర్యావరణ సమతుల్యతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వన్ హెల్త్ దృక్పథంతో పశువైద్యులు సమగ్ర సుస్థిర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పశు వైద్యులు– ఆహార, ఆరోగ్య సంరక్షకులు’ అనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. – డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు (99122 92229), అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్), ఏరియా వెటర్నరీ ఆసుపత్రి, జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా. saii@doctor.com(చదవండి: World Banana Day: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!) -
వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్ వెల్నెస్ మంత్ర
బరువు తగ్గడంలో పలువురు పలు విధానాలతో తగ్గించుకునే యత్నం చేస్తూ..ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నో వెల్నెస్ మంత్రాలు పుట్టుకొస్తున్నాయి. అలా కాంకుండా వైద్యం అందించే ఓ డాక్టరే వ్యాయామం లేకుండా 12 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సర్వసాధారణంగా డాక్టర్లు ఎంతకాదన్న చిన్నపాటి వర్కౌట్లు లేదా వాకింగ్ అన్న చేస్తుంటారు. కానీ ఈ డాక్టర్ కేలరీల బేరీజు, వ్యాయమాలతో పనిలేకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఎలా తగ్గారో తెలిపారు. అంతేగాదు అందుకోసం ఎలాంటి ఫిట్నెస్ రూల్ పాటిస్తే మంచిదో కూడా సవివరంగా వివరించారు. బరువు తగ్గడానికి సంబంధించి..డైటింగ్ నుంచి వర్కౌట్ల వరకు పలు టిప్స్ ట్రెండ్ అవుతున్న తరుణంలో పూణెకు చెందిన డాక్టర్ మల్హర్ గన్లా అద్భుతమైన వెల్నెస్ మంత్ర గురించి తెలిపారు. తాను ఆ రూల్ని పాటించి ఎలా 12 కిలోలు తగ్గారో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆయన తన వెయిట్లాస్ జర్నీని రక్తపరీక్షతో ప్రారంభించినట్లు తెలిపారు. తనకు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే తనకు B12, డీ3 చాలా తక్కువగా ఉన్నాయనేది గుర్తించారు. తనకు అధికంగా ఆకలిగా ఎందుకో అనిపిస్తోంది అర్థం చేసుకోవడానికి ఈ బ్లెడ్ టెస్ట్ ఉపయోగింపడిందని చెప్పారు. ఆ వైద్యుడి మార్గదర్శకత్వంలో పోషకాహార లోపాలను సరిదిద్దుకోవడానికి సప్లిమెంట్లు, స్మూతీలు, సలాడ్లతో డైట్ని ప్రారంభించినట్లు తెలిపారు. వెయిట్లాస్ ప్లాన్..జంక్ ఫుడ్ నియంత్రణ)ఆయన పోషకాలు మెరుగుపడటం మొదలయ్యాక, ఆయన క్రమంగా ఉప్పు, చక్కెర,నూనెను మానేసినట్లు తెలిపారు. అయితే వీటన్నింటిని రాత్రికి రాత్రే మానేయలేదని, నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు బయటి భోజనంపై ఇష్టం పోవడానికి తనకు సుమారు ఒక నెల సమయం పట్టిందని కూడా అన్నారు.కార్బోహైడ్రేట్లను తగ్గించడంతర్వాత కార్బోహైడ్రేట్లను తగ్గించడం మొదలుపెట్టారు. ఆయన కార్బోహైడ్రేట్లను రోజుకు ఒక పూటకు (రాత్రి భోజనానికి) మాత్రమే పరిమితం చేశారు.అల్పాహారం: ప్రోటీన్ ఆధారితం (గుడ్ల వంటివి)మధ్యాహ్న భోజనం: పప్పు, కూర, సలాడ్ (రోటీ లేదా అన్నం వద్దు)తాను పాటించిన డైటింగ్ విధానాన్ని "23-1" రూల్గా పిలిచారు. ఈ విధానంలో శరీరం కొలెస్ట్రాల్పై ఆధారపడి పనిచేస్తుందట, అలాగే ఒక గంటపాటు కార్బోహైడ్రేట్లను తీసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత తాను తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. అది కూడా స్వేచ్ఛయుతం, ఆరోగ్యప్రదంగా చేసినట్లు తెలిపారు. శరీరాన్ని కష్టపెట్టలా కాకుండా పండ్లు, ద్రవపదార్థాలపై ఆధారపడుతూ చేసినట్లు పేర్కొన్నారు. ఇది ఆయనకు మరింత బరువు తగ్గడానికి ఉపయోగపడిందన్నారు. కాలక్రమేణ తన ఆకలిలో పెద్ద మార్పును గమనించారు. దెబ్బకు తన నడుము చుట్టుకొలత సుమారు 29 అంగుళాలకు తగ్గిందని అన్నారు. ఇది సామాన్యులు సైతం సులభంగా అనుసరించగలిగేదని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వేడివేడిగా వడ్డించాలని ఎంత పనిచేశావ్ అమ్మ..!) -
కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుని స్నానం చేస్తున్నారా..? పాపం ఆ మహిళ..
చాలామంది కళ్లద్దాల కంటే కాంటాక్ట్ లెన్స్లే ధరిస్తుంటారు. ఎందుకంటే కళ్లజోడు అయితే ముఖంపై ఆనవాలు పడిపోవడం, లేది ఇబ్బందిగా ఉంటుంది. అదే కాంటక్ట్ లెన్స్లు కంఫర్ట్ తోపాటు చూపు మెరుగ్గా ఉంటుంది. అదే టైంలో ముఖానికి సరికొత్త లుక్ని అందిస్తుంది కూడా. అందుకే చాలామంది కాంటాక్ట్ లెన్స్ ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఇక్కడ ఈ యువత కూడా కాంటాక్స్ లెన్సులు ఉపయోగించేది. అయితే వాటిని ఉపయోగించే విషయంలో చూపిన చిన్న అజాగ్రత్త ఆమె కంటి చూపునే కోల్పోయే పరిస్థితికి దారితీసింది. అసలేం జరిగిందంటే.. అమెరికాకు చెందిన 20 ఏళ్ల గ్రేస్ జేమిసన్ కాంటాక్ట్ లెన్స్ ధరించే ప్రతి ఒక్కరికి ఇదొక పాఠంగా, హెచ్చరికగా ఉంటుందంటూ తన కథను షేర్ చేసుకుంది. సరదాగా సాగిన టూర్ ప్రయాణం నెలల తరబడి చీకటి, రోగ నిర్థారణతో ముగిసింది. ఆమె సరదాగా రిపబ్లిక్ పర్యటనకు వెళ్లడమే కష్టాలు తెచ్చిపెట్టింది. అమెరికాలో తన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఆ కష్టాలు పడింది. అక్కడ సరదాగా స్నాన చేస్తున్నప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ ధరించే ఉంది. లెన్స్లు ఉపయోగించే వాళ్లు తరుచుగా చేసే పెద్ద తప్పిదమే ఇది. అలా స్నానం చేయడంతో జేమిసన్ కళ్లు అకాంతమీబా అనే సూక్ష్మజీవికి గురయ్యాయి. ఈ సూక్ష్మజీవి నీటిలో నివశిస్తుంది. అయితే నేత్ర వేద్యుడు ఆమె పరిస్థితిని తప్పుగా నిర్థారించి స్టెరాయిడ్ చుక్కల మందును సూచించాడు. ఆ మందులు తనకు సహాయపడకపోగా, ఇన్ఫెక్షన్ను మరింత తీవ్రతరం చేశాయి. కేవలం ఒక వారంలోనే అకాంతమీబా కెరటైటిస్ కారణంగా తన దృష్టిని పూర్తిగా కోల్పోయింది. ఒక్కసారిగా జేమిసన్కి జీవితం తలకిందులైనట్లుగా అనిపించింది. సరైన రోగనిర్ధారణ ఆలస్యం కారణంగా ఆ కంటి ఇన్ఫెక్షన్ తనను రెండు నెలలపాటు అంధురాలిగా గడిపేలా చేసిందని వాపోయింది. తాను ఇప్పుడు పక్కల నుంచి చూడగలను తప్ప ముందు నుంచి చూడలేనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ముందువైపు కనుపాపపై ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన మచ్చ పూర్తిగా కప్పివేయడం వల్ల చూడలేనని పేర్కొంది. అది మడ్డులాంటి తెల్లదనాన్ని మాత్రమే చూపిస్తుందని తెలిపింది. అందువల్ల దయచేసి తనలా నీటిలో ఉన్నప్పుడు కాంటాక్స్ లెన్స్లను ధరించొద్దని హెచ్చరిస్తోందామె. ప్రస్తుతం తాను కొనసాగుతున్న చికిత్సల వల్ల కొంత దృష్టిని పొందగలిగినప్పటికీ..మన కళ్లు మునపటిలా పనిచేయవని అంటోంది. తాను తన చూపుని మరింత మెరుగుపరుచుకునేలా భవిష్యత్తులో మరిన్ని శస్త్ర చికత్సలు చేయించుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. సో ఫ్రెండ్స్ స్నానం చేసేటప్పుడూ, ఈత కొట్టేటప్పుడూ, షవర్బాత్ సమయంలో కాంటాక్ట్ లెన్స్లను ధరించొద్దని అన్నారామె. ఎందుకంటే నీటిలో గనుక హానికరమైన సూక్ష్మజీవులు ఉంటే లెన్స్లకు అంటిపెట్టుకుని ఇలాంటిఇన్ఫెక్షన్ను కలిగించే అవకాశం ఉటుందని హెచ్చరిస్తోంది జేమిసన్.(చదవండి: ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్) -
ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్
బరువు తగ్గడం ఇటీవల కాలంలో ఓ క్రేజీ ట్రెండ్గా మారింది. అందులోనూ క్రాష్ డైట్లు, బరువు తగ్గే మందులు జోలి పోకుండా ఆరోగ్యకరంగా తగ్గడం అనేది అందర్నీ ఆకర్షిస్తున్న ఫిట్నెస్ మంత్రలా మారింది. పైగా అందరు ఆరోగ్య స్పృహతో బరువు తగ్గే ప్రయత్నమే చేస్తుండటం విశేషం. ఈసారి అలానే 40 ఏళ్ల తల్లి చాలా సింపుల్ డైట్ప్లాన్తో కేవలంలో ఏడు రోజుల్లో 5 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారంలోనే ఇంతలా బరువు తగ్గేందుకు సమతుల్య ఆహారంపైనే ఆధారపడ్డానని చెబుతోందామె. మరి ఆమె ఎలాంటి డైట్ప్లాన్తో తగ్గిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.40 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి కంటెంట్ క్రియేటర్ రత్న చందు కేవలం ఏడు రోజుల్లోనే ఐదు కిలోలు బరువు తగ్గేందుకు ఆ డైట్ ప్లాన్ సహాయపడిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తాను సమతుల్య ఆహారంపైనే ఫోకస్ పెట్టి బరువు తగ్గినట్లు వెల్లడించింది. మీ ఉదయాన్ని గోరువెచ్చని నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణంతో ప్రారంభించాలని సిఫార్సు చేశారు. ఆ తర్వాత జీలకర్ర, వాము, సోంపు గింజలతో ఇంట్లో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్ను తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల అల్పాహారానికి ముందు జీర్ణక్రియను నెమ్మదిగా యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. ఇక బ్రేక్ఫాస్ట్గా గిన్నెడు పండ్ల మిశ్రమం, నానబెట్టిన గింజలు, ఒక మిల్లెట్ దోస, బుల్లెట్ కాఫీ ఉంటాయి. ఉదయంపూట మిమ్మలని చురుకుగా ఉంచే శక్తివంతమైన ఆహారాల మిశ్రమం ఇది.ఉదయంపూట శక్తి కోసం..పాలకూర, దోసకాయ, అల్లంతో చేసిన గ్రీన్ జ్యూస్ తాగమని సూచించారు. కానీ వర్షాకాలంలో కడుపు సమస్యలను నివారించడానికి పచ్చి పదార్థాలను తినవద్దని కూడా ఆ కంటెంట్ క్రియేటర్ పేర్కొన్నారు.సమతుల్యమైన మధ్యాహ్న భోజనం ముఖ్యంమధ్యాహ్న భోజనం చాలా తేలిగ్గా ఉండాలని చెప్పారు. రోటీలు, వండిన కూరగాయలు, పప్పు, పనీర్, చోలే, గ్రీక్ యోగర్ట్, వంటి ప్రోటీన్ మూలం తీసుకునేలా చూసుకున్నట్లు తెలిపారామె. ఇందులో తగినన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్తో కూడిన శక్తిమంతమైన భోజనం.స్నాక్స్..ప్రాసెస్ చేసిన స్నాక్స్కు బదులుగా, వేయించిన శనగలు, మఖానా, వేరుశెనగలు, గ్రీన్ టీ తినమని తెలిపారు.తేలికపాటి రాత్రి భోజనం, త్వరగారాత్రి భోజనానికి కూరగాయల సూప్, కిచిడీ, లేదా పనీర్తో వేయించిన కూరగాయల వంటి వాటిని ఎంచుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భోజనం తప్పకుండా సాయంత్రం ఏడు గంటలకల్లా తీసుకోవాలని అన్నారు.నిద్రపోయే ముందు అది తప్పనిసరి..పంచదార, పాలు కాకుండా ఒక కప్పు మునగ టీతో రోజును ముగించమని చెబుతోంది. ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం, యోగా వంటి వర్కౌట్లు చేయాలని నొక్కి చెప్పింది. కచ్చితంగా జంక్ఫుడ్కి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండాలని సూచించింది. చివరగా ఇన్ఫ్లుయెన్సర్ ఒక వారంలో 5 కిలోలు తగ్గడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని చెబుతుండటం గమనార్హం. ఈ డైట్ప్లాన్ని చిన్నగా మొదలుపెడితేనే మొత్తం ఆరోగ్యంపై ప్రభావంతమైన మెరుగుదలను తప్పక చూస్తారని అంటోంది ఇద్దరు పిల్లల తల్లి రత్న చందు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ చిట్కాలను పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ratna Chandu (@glow_fit_mom)(చదవండి: ఇప్పటికీ ఆ దృశ్యం నీలినీడలా వెంటాడుతోంది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ) -
పీసీఓఎస్ ఉన్నా..బరువు తగ్గొచ్చు ఇలా..!
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తోంది. దీనికారణంగా మహిళలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటుంటారు. సంతానోత్పత్తి వయసు ఉన్న ప్రతి ఐదుగురి అమ్మాయిల్లోఓ ఒకరు ఈ సమస్య బారినపడతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అని చెబుతున్నారు నిపుణులు. ఈ సమస్యను చక్కటి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో చక్కదిద్దొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నమహిళలు తీసుకోవాల్సిన ఆహారాలు గురించి వెల్లడించారు. అవేంటంటే..వాటిలో గుడ్లు మంచి ఆహారమని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండుగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అవకాడోలు హార్మోన్ల నియంత్రణకు సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయట. అలాగే బెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా, తీపి తినాలనే కోరికను నివారించేలా తక్కువ చక్కెర, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.చియా గింజలు మెరుగైన జీర్ణక్రియకు, మంచి ఫైబర్కు ఉపయోగపడతాయని అన్నారు. అలాగే పెరుగు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక జీవక్రియకు మద్దతిస్తుందని అన్నారు. దీంతోపాటు ఈ సమస్యను తీవ్రతరం చేసే ఆహారాలకు దూరంగా ఉండేలా కేర్ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తరచుగా శక్తిని కోల్పోయేలా చేస్తాయి. అలాగే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని చెప్పారు. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటిని పరిమితం చేయాలని అన్నారు. ఆహారం తోపాటు చక్కటి జీవనశైలిని పాటించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ..సమతుల్య భోజనం చేసేలా స్థిరత్వాన్ని పాటించాలన్నారు. చిన్నచిన్నగా పాటిస్తే..మెత్తం ఆరోగ్యంలో పెద్ద మార్పులోను, మెరుగుదలను చూడగలమని అన్నారు. డాక్టర్ ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ICAR-నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్ -
తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఇలా క్లీన్ చేయొచ్చని శాస్త్రవేత్తల గుర్తింపు
మునగ భారతదేశానికి చెందిన మొక్క. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. దీని ఆకులు, గింజల పోషక విలువల కారణంగా ఆహారంగా బాగా వినియోగిస్తారు. నీటి శుద్ధిలో ఇది ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా ఈ గింజలపై పరిశోధనలు చేస్తున్నారు.మునగ గింజలు నీటిలోని మైక్రోప్లాస్టిక్స్ను బయటకు తీయడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి సాధారణ రసాయన చికిత్సలతో సమానంగా పనిచేస్తున్నాయని తెలిపారు. మొక్క ఆధారిత సారం ప్లాస్టిక్ కణాలను ఒకదానికొకటి అంటుకునేలా చేసి వడపోతలో సులభంగా తొలగించేలా చేస్తుంది.కొన్ని పరిస్థితుల్లో ఇది సంప్రదాయ రసాయనాల కంటే మెరుగ్గా పనిచేసింది. తక్కువ ఖర్చుతో సహజ పద్ధతిలో పరిష్కారం దొరుకుతుంది. తాగునీటి శుద్ధి విషయంలో ఇది పెద్ద మార్పు తీసుకురావచ్చు. బ్రెజిల్ సావో పాలో స్టేట్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఐసీటీ యునెస్ప్ సావో జోసే డోస్ కాంపోస్లో పరిశోధకులు మోరింగా ఒలీఫెరా (సాధారణంగా మునగ లేదా వైట్ అకేషియా అని పిలిచే మొక్క) నీటిలోని మైక్రోప్లాస్టిక్స్ను తొలగించడంలో సహాయపడుతుందని గుర్తించారు. ఈ ఫలితాలు అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఏసీఎస్ ఒమెగాలో ప్రచురితమయ్యాయి.రసాయన చికిత్సలా మునగ గింజల సారం ‘ఈ గింజల ఉప్పు సారం అల్యూమినియం సల్ఫేట్ లాగా పనిచేస్తుంది. ఇది మైక్రోప్లాస్టిక్స్ ఉన్న నీటిని గడ్డకట్టేలా చేస్తుంది క్షార స్వభావం ఎక్కువగా ఉన్న నీటిలో ఇది రసాయన ఉత్పత్తి కంటే మెరుగ్గా పనిచేసింది’ అని శాస్త్రవేత్త గాబ్రియెల్లే బాటిస్టా తెలిపారు. ఆమె పీజీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ పీపీజీఈసీఏలో మాస్టర్స్ సమయంలో ఈ పరిశోధన చేశారు.ఈ పరిశోధనకు ఐసీటీ యునెస్ప్ ప్రొఫెసర్ ఆడ్రియానో గోన్కాల్వెస్ డోస్ రైస్ నాయకత్వం వహించారు. ఆయన మైక్రోప్లాస్టిక్స్ తొలగింపు ప్రాజెక్ట్కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇది ఫాపెస్ప్ మద్దతుతో నడుస్తోంది.అల్యూమినియం సల్ఫేట్లో ప్రధాన లోపం కరిగిన సేంద్రీయ పదార్థం పెరగడం. దీన్ని తొలగించే ప్రక్రియ ఖర్చును పెంచుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని తక్కువ ఖర్చుతో సమర్థంగా ఉపయోగించవచ్చని రైస్ తెలిపారు.మైక్రోప్లాస్టిక్స్ తొలగింపులో కోగ్యులేషన్ కీలకంకోగ్యులేషన్ అంటే చిన్న చిన్న కణాలు ఒకదానికొకటి అతుక్కుని పెద్ద గుంపులుగా మారే ప్రక్రియ. సరళంగా చెప్పాలంటే నీటిలో తేలియాడే సూక్ష్మ కణాలు విడిగా ఉండకుండా ఒకచోట చేరేలా చేయడం. నీటి శుద్ధిలో ఇది ముఖ్యమైన దశ. ఈ ప్రక్రియలో కణాలపై ఉన్న విద్యుత్ ఛార్జ్ తగ్గించి వాటిని కలిసేలా చేస్తారు. దీంతో అవి పెద్ద ముద్దలుగా మారి సులభంగా వడపోతలో తొలగించవచ్చుమైక్రోప్లాస్టిక్స్ ఇతర కాలుష్య కణాలకు నెగటివ్ విద్యుత్ ఛార్జ్ ఉంటుంది. అందువల్ల అవి ఒకదానిని మరొకటి తోసుకుంటాయి. వడపోతలో వాటిని పట్టడం కష్టమవుతుంది. కోగ్యులెంట్లు మునగ ఉప్పు సారం అల్యూమినియం సల్ఫేట్ ఈ ఛార్జ్ను తటస్థం చేస్తాయి. దీంతో కణాలు పెద్ద గుంపులుగా మారతాయి.. సులభంగా తొలగించవచ్చు. గత పరిశోధనలో మునగ గింజలు ఫ్లోక్యులేషన్ సెడిమెంటేషన్ ఫిల్ట్రేషన్ వంటి పూర్తి శుద్ధి ప్రక్రియలో సమర్థంగా పనిచేస్తాయని నిరూపించాయి.ప్రయోగశాల పరీక్షలుపరిశీలన కోసం బృందం ట్యాప్ నీటిలో పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ మైక్రోప్లాస్టిక్స్ కలిపింది. పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ ఇది. జన్యు మార్పులకు క్యాన్సర్కు కారణమయ్యే లక్షణాలు ఉంటాయి. ఇది నీటి ఉపరితలాల్లో సాధారణంగా కనిపిస్తుంది. సంప్రదాయంగా మనం చేసే నీటి శుద్ధి తర్వాత కూడా మిగిలి ఉండవచ్చు. పీవీసీపై అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రయోగించారు. తర్వాత కలుషిత నీటిని జార్ టెస్ట్ విధానంతో కోగ్యులేషన్ ఫిల్ట్రేషన్ చేశారు. ఇది చిన్న స్థాయి నీటి శుద్ధి ప్రక్రియ. ఫలితాలను కొలవడానికి స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఎస్ఈఎం ఉపయోగించారు. ఇది సూక్ష్మ కణాలను పెద్దగా చూపించే సాంకేతిక పద్ధతి. కణాల పరిమాణం గుంపులను హై స్పీడ్ కెమెరా లేజర్ కొలతలతో విశ్లేషించారు. రెండు విధానాలు సమానంగా మైక్రోప్లాస్టిక్స్ తొలగించాయి. -
మరో సంచలన పోరుకు డా. శివరంజని : ప్రజారోగ్యం కోసం సంతకం చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ పరిచయం అవసరం లేని పేరు. ఓఆర్ఎస్ (Oral Rehydration Solution-ORS) పేరుతో, హై షుగర్ ఉన్న ఫేక్ ఓఆర్ఎస్ విక్రయాలకు వ్యతిరేకంగా 8 ఏళ్లపాటు అలుపెరగని పోరు సల్పి, వాటి అమ్మకాలను నిలిపివేయించిన వైద్యురాలిగా అందరికీ సుపరిచితం. చిన్న పిల్లల వైద్యురాలిగా వృత్తిపరమైన నిబద్ధతను, చిన్నపిల్లల ఆరోగ్యంపై తనకున్న ప్రేమను చాటుకున్న తీరు అందరి మనసులను దోచుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై గుర్రుగా ఉన్న కొన్ని ప్రధానమైన ఫార్మా కంపెనీలు ఇటీవల డాక్టర్ శివరంజని సంతోష్కు లీగల్ నోటీసులు ఇచ్చాయి. ఈ విషయంలో ఆమె మరోసారి ఉద్యమానికి దిగారు. కార్పొరేట్ కంపెనీల తప్పుడు మార్కెటింగ్కు వ్యతిరేకంగా వైద్యులు, ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫార్మసీలలో eRZLను ORSLకు కొనసాగింపుగా లేదా ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ ,ప్రచారం చేస్తున్న తీరుపై డా. శివరంజని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఆందోళనలను లేవనెత్తినిందుకు తనకు జాన్సన్ & జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ , కెన్వ్యూ నుండి ఒక లీగల్ నోటీసు అందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. తన ఈ పిటిషన్ ఎవరితోనో గొడవ పడటానికి కాదు; ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. eRZL అనేది ORSLకు కొత్త రూపం తప్ప మరొకటి కాదని ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఈ పోరాటం eRZL సురక్షితమైనదా కాదా అనే దాని గురించి మాత్రమే కాదు. ఇది ఆ ఉత్పత్తిని మార్కెట్లో ఎలా ప్రదర్శిస్తున్నారు, ప్రజలు దానిని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దాని గురించి కూడా అన్నారామె.ఈ పిటిషన్ దేనికి అనేదానిపై ఆమె వివరణఆరోగ్య సంరక్షణ సమాచారంలో స్పష్టతవినియోగదారులలో గందరగోళాన్ని నివారించడంబాధ్యతాయుతమైన బ్రాండింగ్ , ప్రకటనలను నిర్ధారించడంప్రజారోగ్య సమస్యలను వైద్యులు సంకోచం లేకుండా లేవనెత్తడానికి అనుమతించడం ఆమె లేవనెత్తిన ప్రధాన అంశాలుeRZL తన ప్రచారంలో ORSL పేరును ప్రస్తావించకూడదు. ఎందుకంటే ORSL అనేది అసలైన వైద్య సిఫార్సు చేయబడిన ORS కాదు.eRZLను ORSL కు కొనసాగింపుగా చూపడం వల్ల, తల్లిదండ్రులు దీనిని వైద్యపరమైన ORS అని పొరబడే అవకాశం ఉంది. ఇది నియంత్రణ సంస్థల చర్యల ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తుంది.ఒత్తిడిలో ఉన్న తల్లిదండ్రులు ఫార్మసీలలో తెలిసిన పేర్లను చూసి త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. eRZL బ్రాండింగ్ వల్ల అది ఒక మెడికల్ సొల్యూషన్ అని వారు నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆ పాత పేరుతో ఎలాంటి సంబంధం లేకుండా దీనిని రీబ్రాండ్ చేయాలి.మెడికల్ షాపుల్లో వీటి అమ్మకాలపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలి.అలాగే వైద్యులు సిఫార్సు చేసే ORS కు, ఈ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్కు మధ్య స్పష్టమైన తేడాను ప్రజలకు తెలియజేయాలి.ప్రజారోగ్యం కోసం గొంతెత్తే ఆరోగ్య నిపుణులకు రక్షణ కల్పించాలి.వైద్యరంగంలో చిన్న గందరగోళం కూడా పెద్ద పరిణామాలకు దారి తీస్తుంది. సరైన సమాచారం ప్రాణాలను కాపాడుతుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, పిల్లలలో 'సుక్రలోజ్' (sucralose) వంటి పదార్థాల వాడకంపై ఆందోళనలు ఉన్నాయి. అందుకే స్పష్టమైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.ప్రజారోగ్యం కోసం అండగా నిలవండి. క్లిష్ట సమయాల్లో ప్రతి కుటుంబం సరైన నిర్ణయం తీసుకునేలా చూడటానికి ఈ పిటిషన్పై సంతకం చేయండి దీనిని అందరికీ షేర్ చేయండి అంటూ ఆమె ఎక్స్లో లింక్ను షేర్ చేశారు. ప్రజారోగ్యం కోసం సంతకం పెట్టడానికి ఇక్కడ క్లిక్ చేయండి I am Dr. Sivaranjani, a pediatrician , raising concerns about how eRZL is being marketed and positioned in pharmacies, and the risk it creates for consumers making critical decisions during dehydration.This issue is not about whether eRZL is safe in isolation.⁰It is about how…— Dr.Sivaranjini (@dr_sivaranjani) April 21, 2026 -
ఎండతో గుండెకు ముప్పు.. తప్పేదెలా?
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతోంది. అధిక వేడి, డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు గుండెపై అదనపు ఒత్తిడి తెచ్చి ప్రాణాల మీదకు తేవొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, హై బీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. శరీరం చల్లబడేందుకు గుండె ఎక్కువగా పని చేసే క్రమంలో అలసిపోతుంది. అదే సమయంలో డీహైడ్రేషన్ కారణంగా నీరు, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మాగ్నీషియం) కోల్పోవడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వేడి కారణంగా రక్తనాళాలు విస్తరించి బ్లడ్ ప్రెషర్(రక్తపోటు) పడిపోవడం కూడా జరగొచ్చు. వీటితో పాటు..వేసవిలో అధిక ఉప్పు, కొవ్వు, మద్యం తీసుకోవడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. అవుట్సైడ్ ఫ్యాకర్లుగా.. కాలుష్యం కూడా ఓ ముప్పుగా మారుతోంది.ఎవరికీ ఎక్కువ ప్రమాదం?వృద్ధుల్లో.. చెమట పట్టే సామర్థ్యం తగ్గిపోవడం వల్లే ఎక్కువ రిస్క్ ఉంటుంది. హైబీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లకు.. గుండెపై అదనపు ఒత్తిడి పడొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవా ఇప్పటికే బలహీనమైన గుండె మరింత ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. డయూరెటిక్స్(వాటర్ పిల్స్), బీటా బ్లాకర్స్(గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తాయి). NSAIDs మెడిసిన్స్ వాడేవాళ్లలో డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను పెంచుతాయి. ఈ మందులు వేసవిలో వాడేవారు నీరు ఎక్కువగా తాగడం, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం, డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.వేసవిలో గుండెపోటు నివారణకు జాగ్రత్తలుతగినంత నీరు తాగండి.. రోజుకు కనీసం 8 గ్లాసులు, బయటకు వెళ్లేవాళ్లు మరింత ఎక్కువగాకాఫీ, మద్యం, అధిక చక్కెర పానీయాలు తగ్గించండి – ఇవి డీహైడ్రేషన్ను పెంచుతాయి.ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో (10 AM – 4 PM) బయటకు వెళ్లకండి.తేలికపాటి, గాలి చొరబడే దుస్తులు ధరించండి.. కాటన్, లినెన్ ఉత్తమం.తీవ్రమైన వ్యాయామం వేసవిలో మధ్యాహ్నం చేయకండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయడం మంచిది.ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు.. వేడి నుంచి రక్షణ కోసం ఏదైనా ఉపయోగించండి.వేసవిలో ఆహారం నియంత్రించండి – ఉప్పు, కొవ్వు, మద్యం తగ్గించండి.హీట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి అప్రమత్తం కావాలి. అధిక చెమట, తల తిరగడం, గందరగోళం, వేడి చర్మం, అధిక జ్వరం. ఇవి ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. -
ఎండాకాలం.. జర భద్రం..!
ఎండా కాలంలో వడదెబ్బ (సన్స్ట్రోక్), డీ హైడ్రేషన్ వంటి వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. వీటికి సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ సీజన్లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకుందాం. తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఎండలు ఉండే సమయంలో ఎక్కువగా తిరగరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకోవాలి. రోడ్లమీద అమ్మే రంగు రంగుల డ్రింక్స్ సేవించకూడదు. వీటిలో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. జంక్ఫుడ్ తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవడం మంచిది ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కనుక ఎప్పటికప్పుడు నీరు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగడం ఈ సీజన్లో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తేలికైన కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఎండాకాలం రాత్రివేళల్లో చాలా మంది ఆరుబయట పడుకుంటుంటారు. ఇటువంటి సందర్భాల్లో దోమతెరల వంటివి ఉపయోగించాలి ఎండలు అధికంగా ఉండే సమయంలో ఇంటి దగ్గరే ఉండాలి. మరీ అత్యవసరమైతే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లాలి.వడదెబ్బతో జాగ్రత్త ఎండ వేడిమికి ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వడదెబ్బ (సన్స్ట్రోక్). ఎండలో బయటికి వెళ్లడం వలన శరీరంలో నీరు తరిగిపోవడం వల్ల వెంటనే శరీరం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో మళ్లీ శరీరం మామూలు స్థితికి వచ్చే వరకు కొన్ని ప్రాథమిక విషయాలు పాటించాలి. వడదెబ్బ తగిలినట్లయితే అటువంటి వ్యక్తిని వెంటనే నీడ గల ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో తడిపిన గుడ్డతో శరీరం తుడవాలని, శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే వరకు అలా చేస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి తగిలే చోట వారిని పడుకోబెట్టాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తాగించాలి వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.వేసవిలో పానీయాలే రక్షిస్తాయి వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. మరీ అవసరమైతే ఉదయం 7లోపు పనులు ముగించుకోవాలి. ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా మన ఇంట్లోనే దొరికే సహజమైన మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. పుచ్చకాయ, కీరదోసకాయ, తాటిముంజలు, సబ్జాగింజలు, రాగి అంబలి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. వేసవిలో మనం తీసుకునే పానీయాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు మంచినీరు తాగాలి. – డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వర్రావు, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్త్వరగా నిద్ర పోవాలివేసవిలో సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యంగా పడుకోవడం వల్ల ఆలస్యంగా లేచి ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తుంది. త్వరగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి. ఈ సీజన్లో వాకింగ్, జాగింగ్కు వెళ్లే వారు ముందుగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొంచెం నీరు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తాగుతుండాలి. ఏమీ తాగకుండా నడవడం, పరిగెత్తడం వల్ల త్వరగా నీరసం వస్తుంది. ఎండలో ప్రయాణించేవారు, ఉద్యోగాల నిమిత్తం బయట పనులు చేసుకునే వారు తమతో పాటు మంచినీరు తీసుకువెళ్లడం మంచిది. గంటకు కనీసం ఒకసారి నీరు తాగడం వల్ల అలసట తగ్గుతుంది. – డాక్టర్ శైలేష్ మోడి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, సీతమ్మధారపిల్లలు, వృద్ధులు జాగ్రత్తవేసవిలో పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీరు త్వరగా రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలను ఎక్కువ సేపు ఎండలో తిరగనీయకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పిల్లలను బయట ఆటలకు అనుమతించాలి. సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో ఇంట్లోనే ఉండి ఆడుకునే చెస్, క్యారమ్స్, లూడో వంటి ఇండోర్ గేమ్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వంటివి అలవాటు చేస్తే మంచిది. వీటి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత కూడా మెరుగవుతుంది. ఎక్కువగా మొబైల్, టీవీలకు అతుక్కుపోకుండా పిల్లలను వేరే సమ్మర్కోచింగ్ వంటి వాటిలో చేరి్పంచినా మంచిది. – శంకర్ నీలు భాగవతుల, రచయిత, పరిశోధకుడు -
'లివర్' అనే నేను..! జస్ట్ ఏడంగుళాల్లో..
లివర్ చాలా కీలకం. ఇది పనిచేయకపోతే మాత్రం ఏ పరికరాలూ, ఉపకరణాలూ రక్షించలేవు. అయితే లివర్ (కాలేయం) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. లివర్ దెబ్బతిన్నప్పుడల్లా ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుంటూ ఉండడంతో పాటు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేడు వరల్డ్ లివర్ డే. ఈ సందర్భంగా కాలేయం ఎంత కీలకమైనదో, ఎంతటి వైవిధ్యమైన పనులు చేస్తుందో చెప్పడంతోపాటు ఈ ఏడాది థీమ్... సాలిడ్ హ్యాబిట్స్ – స్ట్రాంగ్ లివర్ అంటే ‘దృఢమైన అలవాట్లతో – బలమైన కాలేయ రక్షణ’ పొందడం ఎలాగో తెలుసుకుందాం.లివర్ పని సైలెంట్. కానీ దాని యాక్టివిటీస్ వైబ్రెంట్. ఎందుకంటే ఓ వ్యక్తి గోల్ఫ్ ఆడాలన్నా, బాల్ కొట్టాలన్నా, కాలు కదపాలన్నా, చెయ్యి కదిలించాలన్నా, తిన్నది అరగాలన్నా, పరుగులు తీయాలన్నా అది కాలేయం చేసే జీవక్రియల వల్లనే సాధ్యమవుతుంది. వాటిలో కొన్నింటిని చూద్దాం.ఉన్నది ఏడంగుళాల స్థలంలోనే... కానీ ఎకరాల కొద్దీ కెమికల్ ఫ్యాక్టరీలంత పని... లివర్.. జస్ట్... ఏడంగుళాల విస్తీర్ణంలోనే... ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే కెమికల్ ఫ్యాక్టరీలంత సంక్లిష్టమైన పనులు చేస్తుంటుంది. చాలామంది అపోహ ఏమిటంటే... లివర్ జీర్ణక్రియలకు పనికివచ్చే ఎంజైములు విడుదల చేసి... అన్నం అరుగుదలకే పరిమితమవుతుందని. కానీ పొరబాటున ఓ వ్యక్తి వేలు తెగిందనుకోండి. అతడి రక్తస్రావం ఆగడానికి అవసరమైన రక్తం గడ్డకట్టించే ‘బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ వరకు అదే ఉత్పత్తి చేస్తుంది. వ్యాధులను ఎదుర్కోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ పుట్టేందుకు తోడ్పడుతుంది. టాబ్లెట్ వేసుకుంటే వచ్చే సైడ్ఎఫెక్ట్లు ఇచ్చే చిరు విషాలను విరిచేయడం దగ్గర్నుంచి... మద్యం తాగేప్పుడు పుట్టే పెను విషాలను నిర్వీర్యం చేస్తుంది. గుండెకు ఓ సేఫ్టీ వాల్వ్లా పనిచేస్తూ... హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం వెళ్లేటప్పుడు ఆరు నుంచి పది సెకండ్ల పాటు ఆ రక్తపు వేగాన్ని తగ్గించి, ఎక్సెస్ రక్తంతో గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా కానాడుతుంది.దేహంలో తగినన్ని లవణాలు ఉంచేందుకు కిడ్నీపైనుండే అడ్రినల్ గ్రంథులు ప్రయత్నిస్తున్నప్పుడు... అవి పరిమితికి మించి ఉండకుండా చూసేది లివరే. ప్రతి ఒక్కరి ఒంట్లో ప్రతి సెకండ్కూ లక్షలాది ఎర్ర రక్తకణాలు పుడతాయీ, చనిపోతుంటాయి. వాటిని పుట్టించడం, గిట్టించడం కాలేయం పనే! ఎవరూ ఊహించడానికి కూడా వీల్లేని ఇలాంటి పనులెన్నో లివర్ చేస్తుంటుంది.ఆ శక్తే వరమూ... శాపం కూడా! కాలేయంలోని 75 శాతం పనిచేయక పోయినా అది మళ్లీ రిపేర్ చేసుకుని మామూలుగా కాగలదు. ఇంకా అంతకంటే మించితే అది ప్రమాదకరం. అంటే కాలేయం సామర్థ్యం 25 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు ప్రమాదం ఎక్కువ. లివర్లో క్యాన్సర్గడ్డ ఏదైనా వస్తే చుట్టూ చాలావరకు తొలగించాక మనిషి మళ్లీ మామూలైనొతాడు. తీసేసిన లివర్ భాగం మళ్లీ పెరుగుతుంది. కానీ అంత ఎక్కువ సామర్థ్యం ఉన్నందున ఏదైనా ప్రమాదవశాత్తూ లివర్కు సిర్రోసిస్ అనే సమస్య వచ్చి పనిచేయడం మందగిస్తుంటే, లక్షణాలేవీ కనిపించవు కాబట్టి అది ఎక్కువగా పాడయ్యేవరకూ ఆ విషయమే తెలియదు. ఇది ఒకరకంగా శాపం. లివర్లో కొవ్వుకణాలు పేరుకుపోవడం వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, బాగా మద్యం తీసుకోవడం వల్ల వచ్చే ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, సిర్రోసిస్ వంటి సమస్యలు లివర్కు వస్తుంటాయి. బాగా బరువు పెరుగుతుంటే, దాన్ని అదుపు చేసుకోవాలి. దేహంపైన రక్తనాళాలు సాలీడు ఆకృతిలో కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా నీరు పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్రరావు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ –లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ (చదవండి: Summer Health tips: సమ్మర్లో హైడ్రేషన్ కోసం..! కానీ ఈ పొరపాట్లు చెయ్యొద్దు..) -
హెచ్చరిక! మీరు తినే గుడ్డుతో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
-
మందులు లేకుండా BP, Sugar కంట్రోల్ చేయడం ఎలా?
-
మీకు తినేటప్పుడు చెమటలు పడితే దేనికి సంకేతమో తెలుసా?


