breaking news
Health
-
109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్ డాక్టర్..!
సుదీర్ఘ పనిగంటలు, ఒత్తిడి, వర్కౌట్ల లేమి తదితరాల వల్ల బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు స్థిరమైన అలవాట్లతోనే బరువుకి చెక్పెట్టగలరు. శాశ్వత ఫలితాలు కావాలనుకుంటే క్రమశిక్షణతో కూడిన స్థిరత్వం అత్యంత ప్రధానం అని చెబుతున్నారు నిపుణుల. ఇక్కడ వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఈ డయాబెటిస్ డాక్టర్ కూడా..సుదీర్ఘ పనిగంటలతో బిజీగా ఉంటూ..వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుక్నుఆడు. ఎందరో రోగులకు బరువు తగ్గడంపై శిక్షణ ఇస్తూ..వారికి ఆరోగ్య సూచనలిచ్చే వ్యక్తి వ్యక్తిగత హెల్త్, జీవనశైలి సవ్యంగా లేదు. ఫలితంగా ఊబకాయం బారినపడి ఇబ్బందిపడ్డాడు. విచిత్నం ఏంటంటే తన క్లినికల్ అనుభవంతో సాధ్యమైనంత తొందరగానే ఆ సమస్య నుంచి బయటపడి వెయిట్లాస్ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడు ఈ అధిక బరువుని ఎలా జయించాడంటే..ఆ డాక్టరే న్యూఢిల్లీ చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరా. వృత్తిరీత్యా అత్యంత బిజీగా ఉండటం, లేట్నైట్ మీటింగ్స్ తదితరాల కారణంగా సరైన ఆహారపు అలవాట్లు ఉండేవి కావు. మద్యం సేవించడం, బయట తినడం, తీపి పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. శారీరక శ్రమ అన్నదే అతని దైనందిన జీవితంలో దాదాపుగా లేదని చెప్పొచ్చు. దాంతో అతడు దాదాపు 109 కిలోల బరువుకి చేరుకున్నాడు. అది ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసింది కూడా. దాంతో అరోరా ఎలాగైనా స్లిమ్గా మారాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. అయితే వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతుల జోలికిపోకుండా..వ్యాయామం, సక్రమమైన జీవినశైలిపై దృష్టి పెట్టాడు. ఈ పద్ధతులు అతడి బాడీలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే గాక, కండర ద్రవ్యరాశిని రక్షించడం, తగినంత నిద్ర పోవడం వంటి అలవాట్లతో మెరుగైన ఫలితాలు అందుకున్నారు. ప్రభావవంతమైన మార్పుతో కొద్దికాలంలోనే స్లిమ్గా మారిపోయాడు. అలా 72 కిలోల ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాడు. ఇలా బరువు తగ్గడంతో ఏ పనైనా సునాయాసంగా చేసేలా యాక్టివ్గా మారింది శరీరం. ఈ వెయిట్లాస్ జర్నీలో కడరాలు కోల్పోకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకున్నానని, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరిచానని అన్నారు. అన్నీట్లకంటే ఏ మార్పు అయినా స్వీకరించేందుకు ముందుకు వచ్చినప్పడూ..స్థిరత్వంతో కూడిన సహనం, క్రమశిక్షణ చాలా అవసరమని, అప్పుడే అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలమంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు అరోరా. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!) -
మోజ్తాబా ఆరోగ్యంపై పెదవి విరిచిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం మెుజ్తాబా ఖమేనీ సైతం అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై తొలిసారిగా స్పందించారు.ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు తెలిసి ఆయన గాయపడ్డాడు. ఎదో ఒక రూపంలో బ్రతికే ఉన్నాడని అనుకుంటున్నాను’ అని అన్నారు. అయితే మెుజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్లు కథనాలు పేర్కొంటున్నాయి. టెహ్రాన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతను ఓ కాలు పూర్తిగా కోల్పోయాడని, లివర్ డ్యామేజ్ జరిగిందని ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఇరాన్ సుప్రీంలీడర్గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ దేశానికి చెందిన 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబాను ఎన్నుకుంది. ఈ ఎన్నికపై ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకుంటే వారే తమ లక్ష్యమని హెచ్చరించింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు.కాగా పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు కొరత ఏర్పడింది. హార్మూజ్ను ఎట్టిపరిస్థితుల్లో తెరిసేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే వారి అనుమతి లేకుండా ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై దాడి చేస్తుంది. -
ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
యాపిల్ వాచ్లను ఇష్టపడని వారుండదరు. ఇవి మన ఆరోగ్యం, జిమ్కి సంబంధించి కేలరీల ఖర్చు, ఆరోగ్య సమాచారం వరకు అన్ని అందించే ఆధునిక పరికరం. చెప్పాలంటే గడియారానికి మించినది. మన బాడీలోని అతిముఖ్యమైన పార్ట్లా బాగమైపోయింది. కానీ ఈ యాపిల్ వాచ్లను ఆ విధంగా అస్సలు చూడొద్దని అంటున్నారు అమెరికా ఆరోగ్య నిపుణులు. మిమ్మల్ని ఆరోగ్యపరంగా అలర్ట్ చేసే గొప్ప సాధనమే అయినా..కేర్ఫుల్గా ఉండకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఎందువల్ల ఇలా అంటున్నారంటే..జేబులో ఉండే స్మార్ట్ఫోన్ లేదా డెస్క్పై ఉపయోగించే ల్యాప్టాప్లా కాకుండా..స్మార్ట్వాచ్ చాలా ప్రత్యేకమైనది. ఇది 24/7 మన సంరక్షణ కోసం రూపొందించిన సాధనంగా అందరికీ అత్యంత ప్రీతీపాత్రమైనది. ఈ వాచ్లపై ఉండే మక్కువతో దాని భద్రత గురించి పెద్దగా అస్సలు పట్టించుకోరు కూడా. కానీ ఈ పరికరం గంటల తరబడి రేడియోఫ్రీక్వెన్సీ(RF) సంకేతాలను నేరుగా మన కణజాలంలోకి పంపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఫ్రీక్వెన్సీలను గ్రేడ్ 2B కార్సినోజెన్లుగా పేర్కొంది. ఆయా సంస్థలు ఈ వాచ్లో ఉద్గారాలు పరిమితుల్లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. దీని పరిమితులు మనం నిద్రిస్తున్నపుడూ కూడా చేతికే ధరించేంత సురక్షితంగా రూపొందించింది మాత్రం కాదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇది కేవలం రేడియేషన్ మాత్రమే కాదు..దాని చుట్టూ ఉండే హై-ఎండ్ 'ఫ్లోరోఎలాస్టోమర్' బ్యాండ్లు తరుచుగా PFAS లేదా ఎక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రకారం, ఫ్లోరినేటెడ్ సింథటిక్ రబ్బరుతో తయారు చేసిన ఖరీదైన రిస్ట్బ్యాండ్లు ముఖ్యంగా అధిక స్థాయిలో రసాయనాలు ఉంటాయని 2024 జరిపిన అధ్యయనాల్లో తేలింది. దీనిలో PFAS సమస్య ఉందనేది వాస్తవమే అని నిరూపితమైంది. అందువల్ల దీన్ని గనుక దీర్ఘకాలంపాటు మణికట్టు వద్ద ధరిస్తే..ఈ రసాయనాలు చర్మం, రక్తప్రవాహంలోకి చొచ్చుకుపోతాయని అంటున్నారు నిపుణులు. ఈ PFAS విచ్ఛిన్నం కానందున, అవి కాలక్రమేణా అవయవాలలో పేరుకుపోతాయి. అవి కాస్తా కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడిని కలుగజేసి అనారోగ్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేగాదు హార్మోన్లు ఇన్బ్యాలెన్సింగ్కి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు పరీక్షించిన 22 ప్రముఖ బ్యాండ్లలో 15 ఈ విషపదార్థాలను కలిగి ఉన్నాయని, అందులోనూ అధిక ధర కలిగిన ప్రీమియం బ్యాండ్లలో ఈ సమస్య మరింత ఎక్కువని అంటున్నారు.ఇది అవగాహన..సంరక్షణ కోసమే..ఇది లేనిపోని భయాలు కలుగజేసందుకు కాదని అవగాహన కల్పించేందుకేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఆపిల్ వాచ్ శక్తిమంతమైన సాధనమే కానీ..దాన్ని మన శరీరంలోని సహజ భాగంగా పరిగణించొద్దని హెచ్చరిస్తున్నారు. సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే.. సాంకేతిక ప్రయోజనాలు పొందేలా సురక్షితంగా ఎలా ఉపయోగిస్తే మంచిదంటే..సింథటిక్ ఫ్లోరోఎలాస్టోమర్ బ్యాండ్లను సేంద్రీయ తోలు, స్టెయిన్లెస్ స్టీల్ లేదా జనపనార వంటి సహజ పదార్థాలతో ఉపయోగించేందుకు ప్రయత్నించండివర్కింగ్ టైంలో లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాచ్ను తీసివేయండిపడుకునే ముందు వాచ్ ధరించడం మానేయండి. నిద్ర అంటే శరీరం నిర్విషీకరణపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ సమయంలో ఇతర రసాయనాలకు గురికావడం వల్ల సహజమైన నిద్ర ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Zib - Ayus Wellness - Health Optimisation | Mindset | Longevity (@ayuswellnessuk) (చదవండి: జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర) -
జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర
దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య అధిక బరువు అందర్నీ వేధిస్తున్న సమస్యగా మారింది. గంటల తరబడి కూర్చొని చేసే డెస్క్ ఉద్యోగాలు, కదలికలు లేకపోవడం, వీటికి తోడు జంక్ ఫుడ్ ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవాలని ఎంతో ప్రయాసపడి కఠిన డైట్లు అనసరించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఈ మిరాకిల్ పద్ధతిని అనుసరించి త్వరితగతిన బరువు తగ్గొచ్చని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ జెసికా ఆర్ట్వానీ. అదెలాగో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తాను ఆ పద్ధతిలోనే దాదాపు 26 కిలోలు బరువు తగ్గినట్లు తెలిపారు కూడా. మరి ఆ మిరాకిల్ టెక్నిక్ గురించి సవివరంగా తెలుసుకుందామా..!.చాలామంది బరువు తగ్గేందుకు షార్ట్కట్లు, తీవ్రమైన దినచర్యలు అనుసరిస్తుంంటారు. నిజానికి బరువు తగ్గడం అనేది సాధారణంగా స్థిరంగా చేసే చిన్న అలవాట్ల వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. గతేడాది నుంచి తాను చిన్ని చిన్న సాధారణ అలవాట్లపై దృష్టిపెట్టి 26 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. తనకు ఈ 26 కిలోలు బరువు తగ్గడానికి ఆ ఐదు సాధారణ అలవాట్లు హెల్ప్ అయ్యాయని చెబుతోంంది. త్వరితగతిన బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఓ అద్భుతమైన పద్ధతని అభివర్ణిస్తోంది. తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్లు, ఖరీదైన ఫిట్నెస్ ప్రోగ్రామ్లు పాటించలేదని చెబుతోంది జెసికా. తన వెయిట్లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను బరువు తగ్గడానికి స్థిరంగా ఈ ఐదు పనులు చేశానని తెలిపింది. ఎలాంటి ఫ్యాన్సీ హ్యాక్స్, షార్ట్కట్లు లేవని అంటోంది. సహాయపడిన ఆ ఐదు అలవాట్లు..వీలైనంత ఎక్కువగా నడవడం: నడక తన దినచర్యలో అతిపెద్ద మార్పులలో ఒకటి. సాధ్యమైనప్పుడల్లా తన రోజులో కదలికను ఒక భాగంగా చేసుకున్నానని జెసికా చెప్పింది. ఆమె మార్నింగ్ వాకింగ్, భోజనం తర్వాత రాత్రి తప్పనిసరిగా కొద్దిసేపు నడక చేసినానని వివరించారామె.ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తగ్గించడం: ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తొలగించానని తెలిపింది. అంటే అప్పుడప్పుడూ కనీసం దాని జోలికి పోలేదని, పూర్తిగా దూరం పెట్టానని చెప్పుకొచ్చింది. ఎక్కువ నీరు త్రాగడం: ఆమె దృష్టి సారించిన మరో అలవాటు హైడ్రేషన్. కానీ తగినంత నీరు త్రాగడం చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఇది చాలా శక్తిమంతమైన మార్పుకి నాంది అని అంటోంది. ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం: ప్రోటీన్ తన భోజనంలో కీలక పాత్ర పోషించిందని చెబుతోంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి పైగా అనవసరమైన చిరుతిండిని తగ్గిస్తాయి. ఇక్కడ ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినందించి, ఆకలి కోరికలను నియంత్రిస్తుంది.ఒక సవాలు పెట్టుకోవడం: తాను అనుకున్నట్లుగా అన్ని పాటించానా లేదా అనే సెల్ఫ్ చెకింగ్ లేదా జవాబుదారితనం తనకు బరువు తగ్గాలనే ఆకాంక్షను రెట్టింపు చేసేదట. దాంతో చాలా కేర్ఫుల్గా ఉండటమే గాక తనను తాను ప్రశ్నించుకునేటప్పడూ..దోషిలా ఉండకూదన్న భయం సదా వెయిట్లాస్ అయ్యేందుకు ప్రేరేపించేదట.ఇక్కడ జెసికా వెయిట్లాస్ జర్నీలో ..బరువు తగ్గాలంటే తీవ్రమైన మార్పులు, అతి వర్కౌట్లు అవసరం లేదు. కేవలం చిన్న అలవాట్లే స్థిరంగా.. కంటిన్యూటీ మిస్ కాకుండా చేస్తే చాలు బరువు తగ్గడం చాలా సులభమని తెలుస్తోంది కదూ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో.. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మన శరీరంలోని అంతర్గత అవయవాలను దెబ్బతీస్తాయి. అయితే, వీటిలో అన్నింటికంటే ప్రమాదకరమైన అలవాటు ఏది? అనే ప్రశ్నకు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రముఖ వైద్యుడు సమాధానమిచ్చారు. అమెరికాకు చెందిన బోర్డ్-సర్టిఫైడ్ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ ప్రపంచంలోని చాలామందిని పట్టిపీడిస్తున్న ఆ అలవాటు గురించి హెచ్చరించారు.అవయవాల విధ్వంసకారిప్రముఖ పాడ్కాస్టర్ మెల్ రాబిన్స్తో నిర్వహించిన చర్చలో డాక్టర్ జెరెమీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక హృద్రోగ నిపుణునిగా మనిషి తప్పనిసరిగా దూరంగా ఉంచాల్సిన అలవాటు ఏది? అని అడిగినప్పుడు ఆయన ఏమాత్రం తడుముకోకుండా ‘ధూమపానం’ అని సమాధానమిచ్చారు. ‘సిగరెట్ తాగడం వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దీనికి మించిన ప్రమాదకరమైన అలవాటు మరొకటి లేదని స్పష్టంగా చెప్పగలను’ అని ఆయన పేర్కొన్నారు.ఎందుకు అంత ప్రమాదకరంధూమపానం అనేది కేవలం ఊపిరితిత్తులను మాత్రమే దెబ్బతీసే అనారోగ్య సమస్య కాదని, ఇది ఒక 'మల్టీ-ఆర్గాన్ కిల్లర్' అని డాక్టర్ జెరెమీ అభివర్ణించారు. ఆయన విశ్లేషణ ప్రకారం:రక్తనాళాలు దెబ్బతినడం: సిగరెట్లలోని రసాయనాలు రక్తనాళాల లోపలి పొరలను నాశనం చేస్తాయి.ఆక్సిజన్ కొరత: రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గించి, గుండెపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతాయి.క్యాన్సర్ కారకం: ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం ధూమపానం. ఇది ఇతర రకాల క్యాన్సర్లకు కూడా పునాది వేస్తుంది.‘నా 25 ఏళ్ల కెరీర్లో ఎంతోమంది రోగులను చూశాను. నికోటిన్ వ్యసనం నుండి బయటపడటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇది ప్రాణాలను హరిస్తుందనే నిజాన్ని ఎవరూ ఎంతమాత్రం విస్మరించకూడదు. నా దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన అలవాట్ల జాబితాలో మొదటి మూడు స్థానాలు ధూమపానానివే’ అని ఆయన హెచ్చరించారు.శాస్త్రీయ ఆధారాలుకేవలం డాక్టర్ జెరెమీ అనుభవమే కాకుండా, అంతర్జాతీయ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ‘క్యురియస్’ (Cureus) జర్నల్లో 2023లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం అనేది శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, సంతానోత్పత్తి లోపాలు, మరెన్నో దీర్ఘకాలిక వ్యాధులకు ఇది మూలకారణంగా నిలుస్తుంది. ముఖ్యంగా 'ప్యాసివ్ స్మోకింగ్' (పక్కన ఉన్నవారు వదిలిన పొగను పీల్చడం) కూడా అంతే ప్రమాదకరమని ఈ నివేదిక వెల్లడించింది.ఆరోగ్యకరమైన భవిష్యత్తు..ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ధూమపానాన్ని వదిలిపెట్టడం అనేది తప్పనిసరి అని ఈ అలవాటు కలిగినవారు గుర్తించాలి. ఇటువంటి నిర్ణయం కేవలం గుండెను మాత్రమే కాకుండా, శరీరంలోని ప్రతి అణువును కాపాడుతుంది. డాక్టర్ జెరెమీ లాంటి నిపుణుల హెచ్చరికలను గమనించి, ధూమపానం అలవాటు కలిగినవారు తక్షణమే మేల్కొనడం అవసరం.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్’ చెప్పింది చేయాల్సిందే! -
ఆ నిర్ణయం ఆ జంటను హెల్దీగా మార్చింది..! ఏం చేశారంటే..
ఆరోగ్యం, వ్యాయామాలు సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది అన్నమాటలు ఎన్నోసార్లు విని ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లకు, యువతకు మాత్రమే సాధ్యం అనేది చాలామంది భావన. వాళ్లకు ఏ బాధ్యతలు, బరువులు అంతగా ఉండవు కాబట్టి హాయిగా చేయగలరని అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యతరగతి జంట గురించి విన్నాక ఆ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. 50లలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మేల్కొని విజయం సాధించడమే గాక..ఇతరులకు స్వచ్ఛందంగా ఆరోగ్యస్పృహ కలిగిస్తున్నారు. మరి ఆ జంట ఫిట్నెస్ ప్రయాణం ఎలా సాగిందంటే..చాలామందికి ఫిట్నెస్ అనేది యువతకు చెందినదిగా అనిపిస్తుంది. పెద్దలకు సుదీర్ఘ పనిదినాలు, కుటుంబ బాధ్యతలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేలా చేస్తాయి. కనీసం శరీరం చెప్పే సంకేతాలను కూడా పట్టించుకోరు. తమ ఆరోగ్యం కంటే..కుటుంబ బరువు బాధ్యతలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలానే భావించారు డెహ్రాడూన్కు చెందిన తారా థాపా ఆయన భార్య సుశీలా. తార ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ రిపేర్ షాపుని నడుపుతుండగా, సుశీల బీమా సలహాదారుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరి ఫోకస్ కుటుంబ బాధ్యతలపైనే ఉంది. తమ ఇద్దరు కుమారులను పెంచడం, ఓ చక్కటి ఇంటిని నిర్మించుకోవడం ఇవే తమ ఆశయలు, జీవితం అన్నట్లుగా బతికారిద్దురు. అనుకున్నట్లుగా కుమారులు చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ఒకరు సోలార్ పర్మిట్ డిజైనర్గా, మరొకరు కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్నారు. కానీ అప్పటికే ఆ జంటను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తారాకి తీవ్రమైన వెన్నునొప్పి, సుశీల నిరంతర అలసట, పునరావృతమయ్యే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారు ఇద్దరూ. అప్పుడే ఇరువురికి తమ శారీరక పరిమితులను అంగీకరిస్తూ ఆగిపోకూడదని అనిపించింది. ఆ అనారోగ్య సమస్యలను సవాలు చేసేలా.. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. 2017లో, తార ఫిట్నెస్పై తీవ్రంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసి భార్య సుశీల రెండేళ్ల తర్వాత 2019లో ఆయన బాటలోనే నడిచింది. అలా ఈ జంట రోజు సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ఉదయం ఐదు గంటలకల్లా..వ్యాయామాలు చేయడానికి, వాకింగ్కి రెడి అయిపోతారు. కొండలలో నివసించడం వల్ల వారు ప్రకృతిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మారింది. తరచుగా డెహ్రాడూన్ చుట్టూ ఉన్న పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదిస్తుంటారు. భోజనంలో కూడా పప్పులు, కూరగాయలు, కాలనుగుణ పండ్లను భాగం చేసుకునేవారు. పండుగల సమయంలో కూడా, వారు అతిగా తినడం కంటే సమతుల్యతపే పాటిస్తూ.. మితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయాణం తమ సొంత ఇంటిని దాటి ప్రేరేపించడం మొదలైంది. మూడేళ్ల క్రితం సుశీల పింక్ పాంథర్ అనే మహిళా సమూహాన్ని ప్రారంభించారు. ఈ బృందంలో మహిళలు సౌకర్యవంతమైన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి ఫిట్నెస్ను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి కూడా సంకోచించిన చాలా మంది సభ్యులు ఇప్పుడు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుండటం విశేషం. అంతేగాదు ఈ జంట తమ ఫిట్నెస్ ప్రయాణాన్ని ఆన్లైన్లో పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి కథ చాలమందికి కనెక్ట్ అయ్యి..ఎందరినో ప్రేరేపించింది. ఈ జంట వ్యక్తిగత వృద్ధి వాయిదాగా మారకూడదని, వయసు ఎప్పుడూ సాకుగా మారకూడదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు కదూ. నెటిజన్లు సైతం చాలా స్ఫూర్తిదాయకం అని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికే. అనుసరించే ముందు వ్యక్తిగత సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలి, అలాగే వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!) -
Women's Day: 20, 30, 40, 50ల్లో ఇవి తప్పనిసరి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నారీ శక్తి గురించి చర్చలు జరుగుతున్నాయి. వయసు మారుతున్న కొద్దీ మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ‘ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్’ కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ వయసులో ఏయే పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.20 ఏళ్ల ప్రాయంలో వ్యాక్సినేషన్జీవితంలో అత్యంత చురుగ్గా ఉండే 20 ఏళ్ల వయసులో మహిళలు తమ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. ఈ దశలో ప్రధానంగా గర్భాశయ క్యాన్సర్ నివారణకు పాప్ స్మియర్ పరీక్షతో పాటు, హెచ్ పీవీ (HPV) వ్యాక్సినేషన్ తీసుకోవడం ఉత్తమం. వీటితో పాటు రక్తహీనతను గుర్తించే హిమోగ్లోబిన్ పరీక్ష, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. నెలసరిలో ఏవైనా అసాధారణ మార్పులు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం తప్పనిసరి.30 ఏళ్లలో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ముప్పై ఏళ్లలో అడుగుపెట్టిన తర్వాత సంతానోత్పత్తి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు మెటబాలిక్ సమస్యలపై మహిళలు దృష్టి పెట్టాలి. ప్రతి 3 నుంచి 5 ఏళ్లకోసారి పాప్ స్మియర్ పరీక్షను కొనసాగించాలి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు, విటమిన్ లోపాలను గుర్తించే పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే, ముందస్తుగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మేలు.40 ఏళ్లలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్నలభై ఏళ్లు దాటిన మహిళల్లో 'పెరీ మెనోపాజ్' (మెనోపాజ్ ముందు దశ) లక్షణాలు మొదలవుతాయి. ఈ వయసులో ప్రతి రెండేళ్లకోసారి మమోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు. రక్తపోటు, థైరాయిడ్, హార్మోన్ల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే ఎముక సాంద్రతను తెలిపే 'బోన్ డెన్సిటీ' పరీక్షను కూడా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.50 ఏళ్లలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీయాభై ఏళ్ల వయసులో మెనోపాజ్ కారణంగా ఎముకలు బలహీనపడటం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ దశలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, కార్డియాక్ రిస్క్ అసెస్మెంట్, కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. హాట్ ఫ్లాషెస్, నిద్రలేమి తదితర సమస్యలు తీవ్రంగా ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT)పై వైద్యుల సలహా తీసుకోవాలి.60 ఏళ్ల పైబడిన తర్వాత..అరవై ఏళ్లు దాటిన తర్వాత కిడ్నీ (RFT), లివర్ (LFT) ఫంక్షన్ టెస్టులతో పాటు జ్ఞాపకశక్తికి సంబంధించిన 'కాగ్నిటివ్ హెల్త్' పరీక్షలు చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాత అకస్మాత్తుగా రక్తస్రావం కావడం లేదా పొత్తికడుపులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును కలవాలి.ముందస్తుగా చేయించుకునే ఇటువంటి ఆరోగ్య పరీక్షలు ప్రాణాంతక వ్యాధులను ప్రారంభంలోనే అడ్డుకునేందుకు సహకరిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవడం వల్ల చికిత్స ఖర్చు తగ్గడమే కాకుండా, ఆయుష్షు కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ -
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
‘మీరు నలభై ఏళ్ల మైలురాయిని దాటేశారా? అయితే మీ శరీరం లోపల ఒక నిశ్శబ్ద మార్పు మొదలైందని గుర్తించండి. మనం కేవలం వినడానికి మాత్రమే చెవులను వాడుతామని అనుకుంటాం.. కానీ మనల్ని భూమి మీద నిలబెట్టే అసలైన ‘బ్యాలెన్సింగ్ రిమోట్’ మన లోపలి చెవిలోనే ఉంది. అది ఒక్కసారి రిపేరుకు వస్తే, సోఫాలో నుంచి లేచి నిలబడాలన్నా ప్రపంచమంతా గిర్రున తిరుగుతుంది. ఈ ముప్పు గురించి ఆరోగ్య నిపుణులు ఇస్తున్న హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.లోపలి చెవిలో ఏం జరుగుతోంది? మన లోపలి చెవిలో 'వెస్టిబ్యులర్ వ్యవస్థ' అనే ఒక అత్యంత సంక్లిష్టమైన నెట్వర్క్ ఉంటుంది. ఇది ఒక జీపీఎస్ (GPS) లాగా పనిచేస్తూ, మనం ఎటు తిరుగుతున్నాం, ఎలా నిలబడాలి అనే సమాచారాన్ని సెకనులో వందో వంతు కాలంలో మెదడుకు పంపిస్తుంది. అయితే, 40 ఏళ్లు దాటాక ఈ వ్యవస్థలోని సూక్ష్మమైన ‘హెయిర్ సెల్స్’ (Hair Cells) చనిపోవడం మొదలవుతాయి. అంటే మీ బాడీ బ్యాలెన్సింగ్ సిస్టమ్ తన పట్టును కోల్పోతోంది. ఫలితంగా నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పక్కకు వాలిపోవడం లేదా కళ్లు బైర్లు కమ్మడం లాంటివి జరుగుతాయి.నడక కూడా కష్టమే!లోపలి చెవిలో రెండు విభాగాలు ఉంటాయి: ఒకటి శబ్దాలను వినే 'కోక్లియా', రెండోది బ్యాలెన్స్ను చూసే 'వెస్టిబ్యులర్'. విచిత్రమేమిటంటే ఈ రెండింటికీ మెదడుకు చేరే దారి (Nerve) ఒక్కటే.. అందుకే మీ చెవిలో ఏ చిన్న సమస్య వచ్చినా అది కేవలం వినికిడి లోపంతో ఆగదు. వినికిడి తగ్గడంతో పాటు తీవ్రమైన తల తిరగడం (Vertigo), చెవిలో జోరీగ రొద పెట్టినట్లు శబ్దాలు రావడం (Tinnitus) లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో శాశ్వతంగా నడవలేని స్థితికి చేరుకునే పరిస్థతి ఏర్పడుతుంది.ఈ మూడు ‘సైలెంట్ కిల్లర్స్’ గురించి తెలుసా?బీపీపీవీ: మీరు పడుకుని అటు ఇటు తిరిగినా లేదా పైనున్న వస్తువు కోసం తల ఎత్తినా సెకన్ల పాటు ప్రపంచమంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది లోపలి చెవిలోని కాల్షియం కణాలు స్థానభ్రంశం చెందడం వల్ల వస్తుంది.మెనియర్స్ వ్యాధి: చెవిలో నీరు చేరినట్లు ఇబ్బందిగా అనిపించడం. వినికిడి మందగించడం దీని ప్రధాన లక్షణం.వెస్టిబ్యులర్ మైగ్రేన్: విపరీతమైన తలనొప్పితో పాటు కళ్లు తిరగడం. ఇది మీ దైనందిన జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.ఆందోళన కలిగించేలా..శరీర సమతుల్యత కోల్పోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు. ఎక్కడ పడిపోతామో అన్న భయం మనిషిని మానసిక రోగిగా మారుస్తుంది. ఒంటరిగా బయటకు వెళ్లడానికి భయపడటం, మెట్లు ఎక్కాలంటే వణుకు రావడం వల్ల చాలామంది సామాజికంగా ఒంటరి అయిపోతారు. ఇది తీవ్రమైన ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression)కు దారితీస్తుంది. ఒకప్పుడు ధైర్యంగా నడిచిన వ్యక్తి, తన ఇంట్లోనే తాను నడవడానికి ఇతరుల సాయం కోరాల్సి రావడం అత్యంత బాధాకరంగా పరిణమిస్తుంది.ఇప్పటికైనా మించిపోయింది లేదు!మీకు తల తిరుగుతున్నట్లు అనిపించినా, వినికిడిలో మార్పు వచ్చినా అది వయసు రీత్యా వచ్చే నీరసం అని భ్రమపడకండి. వెస్టిబ్యులర్ రీహాబిలిటేషన్ వంటి ప్రత్యేక వ్యాయామాలు, ఆహార నియమాల ద్వారా ఈ ముప్పును తప్పించుకోవచ్చు. మీ లోపలి చెవి ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను ఇప్పుడే గుర్తించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే (చెవుల్లోనే) ఉంది!గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించండి.ఇది కూడా చదవండి: Women’s Day: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకూ.. -
నడుము పెరిగిందా? ఆయుష్షు తగ్గినట్లే!
నడుము చుట్టూ కొంచెంగానైనా కొవ్వు పెరిగితే అది వయసుతో పాటు వచ్చేదేగా.. అని సరిపెట్టుకుంటున్నారా? అయితే నిలువునా ప్రమాదంలో పడినట్లే! పెరిగే పొట్ట కేవలం బట్టల సైజును మాత్రమే మార్చదు.. అది మనిషి ఆయుష్షును కూడా హరిస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఏం జరుగుతుంది?బీఎంఐ బాగున్నా.. కొవ్వు కాటేయవచ్చు!చాలామంది తమ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) సరిగానే ఉందని, బరువు అదుపులోనే ఉందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నిపుణులు డాక్టర్ పంకజ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం.. బయటకు సన్నగా కనిపిస్తూ, కేవలం నడుము వద్ద కొవ్వు పేరుకుపోయిన వారు (Skinny Fat) మరింత జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల బాహ్యంగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా, లోపలి అవయవాలు ప్రమదకరమైన కొవ్వులో మునిగిపోయి ఉంటాయని ఆయన హెచ్చరించారు.ప్రాణాంతక ‘విసెరల్ ఫ్యాట్’ అంటే..చర్మం కింద కనిపించే మెత్తటి కొవ్వు కంటే, కంటికి కనిపించకుండా అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే ‘విసెరల్ ఫ్యాట్’ అత్యంత ప్రమాదకరమైనది. ఇది కాలేయం, గుండె, క్లోమం తదితర కీలక అవయవాలను చుట్టుముట్టి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఇది కేవలం కొవ్వు మాత్రమే కాదు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ (మంట) కలిగించే హానికరమైన రసాయనాలను నిరంతరం విడుదల చేసే ఒక ‘టాక్సిక్ సెంటర్’.కాలేయంపై నిశ్శబ్ద దాడినడుము చుట్టూ చేరే ఈ కొవ్వు నేరుగా కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ‘మెటబాలిక్ అసోసియేటెడ్ స్టెటోటిక్ లివర్ డిసీజ్’ (MASLD) లేదా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా కాలేయ వాపునకు, తద్వారా సిర్రోసిస్ వంటి ప్రాణాంతక స్థితికి దారితీస్తుంది. అందుకే నడుము చుట్టూ కొవ్వు పెరగడం అంటే కాలేయానికి ముప్పు మొదలైనట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.గుండెకు గండం.. పెరిగిన నడుము చుట్టుకొలతకు, గుండె జబ్బులకు విడదీయలేని సంబంధం ఉంది. విసెరల్ ఫ్యాట్ వల్ల రక్తపోటు పెరగడం, చెడు కొలెస్ట్రాల్ అధికం కావడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం జరుగుతుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్కు దారితీసి, అకస్మాత్తుగా గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని ఈ కొవ్వు నెమ్మదింపజేస్తుంది.ప్రమాదాన్ని ఇలా కొలుచుకోండిప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం.. నడుము-తుంటి నిష్పత్తి (Waist-to-hip ratio) ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మహిళల్లో ఈ నిష్పత్తి 0.85 దాటితే అది అధిక ముప్పుగా భావించాలి. పురుషుల్లో 1.0 దాటితే గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. రిబ్స్ దిగువన, నడుము ఎముక పైభాగంలో టేపుతో కచ్చితమైన కొలత తీసుకోవడం ద్వారా నడుము స్థితిని తెలుసుకోవచ్చు.పరిష్కారం మీ చేతుల్లోనే!నడుము చుట్టూ కొవ్వు పెరుగుతున్నట్లు గమనిస్తే దానిని నిర్లక్ష్యం చేయకండి. ఆహార నియమాలు పాటించడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ విసెరల్ ఫ్యాట్ను కరిగించవచ్చు. బరువు తగ్గడం అనేది కేవలం అందం కోసం కాదు, మీ గుండె, కాలేయాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం అని గుర్తించండి.ఇది కూడా చదవండి: ‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు -
అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..
కొందరు వయసు గడుస్తున్న కొద్దీ.. వృద్ధుల్లా కనిపించరు. యంగ్లుక్లో యువకుల మాదిరిగా ప్రకాశవంతంగాకనిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అస్సలు అదెలా సాధ్యం అనిపిస్తుంది కూడా. వయసు రీత్యా అంత ఏజ్ ఉన్నా కూడా.. ఏ మాత్రం వృద్ధాప్య ఛాయలు కనుచూపు మేరలో కూడా కానరావు. ఇక్కడ ఈ మోడల్ కూడా అదే కోవకు చెందినవాడు. ఎవరతను అంటే..సింగపూర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, మోడల్ చువాండో టాన్కి మార్చి 03, 2026న అధికారికంగా 60 ఏళ్లు నిండాయి. కానీ దశాబ్దాలుగా టీనేజ్ యువకుడిలా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అతడి యంగ్లుక్ అందర్నీ విస్మయపరుస్తుంటుంది. కనీసం మచ్చుకైనా వృద్ధాప్య ఛాయలు ఎక్కడ కానరావు. అంతలా మెయింటైన్ చేస్తున్నా అతడి గ్లామర్ రహస్యం ఏంటో తెలసుకోవాలన్న కుతుహలం అందరిలోనే రేకెత్తిస్తుంటుంది. మరి అంతలా యవ్వనంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా..!?.లైఫ్స్టైల్ ఎలా ఉంటుందంటే..ఎలాంటి బ్యూటీ చికిత్సలు తీసుకోడు. దీర్ఘకాలిక క్రమశిక్షణయుత జీవనమే మేలుబ్రేక్ఫాస్ట్: గుడ్లు, తేనె, అవకాడోతో ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్మీల్ అల్పాహారాన్ని తీసుకుంటానని తెలిపాడు. లంచ్ లేదా డిన్నర్:భోజనంలో సాధారణంగా ఉడకబెట్టిన లేదా కాల్చిన చికెన్ లేదా చేప, రసం విత్ రైస్ ఉంటాయి. తప్పనిసరిగా వర్కౌట్లు. ఇవి కేలరీలు బర్న్ చేయడానికి సమతుల్యతను బ్యాలెన్స్ చేసేలా డైట్ అత్యంత ముఖ్యమని చెబుతున్నాడు. పగటిపూట చేసే కార్యకలాపాలు ఆ రోజుల్లో మీరు బర్న్ చేసే కేలరీలకు సమానంగా ఉండాలని చెబుతున్నాడు. నాణ్యమైన నిద్ర తప్పనిసరి. ఒత్తిడిలేని సానుకూల మనస్తత్వం అత్యంత ముఖ్యం. ఆరోగ్యమైన వృద్ధాప్యానికి ఇవి అత్యంత కీలకమని చెబుతున్నాడు టాన్. అయితే తాను మద్యం, కాఫీ, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడట. వారానికి మూడు నుంచి ఐదు సార్లు బల శిక్షణ, కార్డియో వ్యాయామాలు, ఈత తదితరాలు ఉంటాయట. కాగా, టాన్ ఇటీవల కొద్దికొద్దిగా వృద్ధాప్యంలో దరిచేరే కొద్దిపాటి శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. సహజంగా కాలంతో వచ్చే వృద్ధాప్యాన్ని ఆపలేమని, కాకపోతే దాన్ని హెల్దీగా మార్చుకుంటే..ఆరోగ్యకరమైన వార్దక్య జీవితాన్ని గడపొచ్చని టాన్ చెబతున్నాడు. అంతేగాదు అతడి పోస్ట్ల్లో సైతం ఆసక్తికరమైన సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటాడు. వాటిని చూస్తే అవగతమవుతోంది ఫిట్నెస్ పట్ల ఎంత కేర్గా ఉంటాడనేది. కాగా, టాన్ తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. సమయాన్ని నిజమైన సంపదగా పేర్కొన్నాడు. ప్రతి సూర్యోదయం చూసేలా, అనుభవించేలా చేస్తున్నందుకు, ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నందకు సదా కృతజ్ఞుడును. ప్రతి రోజు ప్రకృతిలో గడపడం, సూర్యకాంతిలో గడపడం మిస్ చేసుకోవద్దు అని రాసుకొచ్చాడు పోస్ట్లో. సింపుల్గా చెప్పాలంటే సమయం, ఆరోగ్యం అత్యంత విలువైనవని, వాటిని నిర్లక్ష్యం చేస్తే.. అన్ని దూరమైపోతాయని చెప్పకనే చెప్పాడు టాన్. View this post on Instagram A post shared by CHUANDO TAN 陈传多 (@chuando_chuandoandfrey) (చదవండి: ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!) -
మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం, కానీ ఒక్కోసారి అది మనకే విరుద్ధంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే, మన మనసు వాస్తవాలను వక్రీకరించి మనకు అబద్ధాలు చెప్తుంది. దీన్నే సైకాలజీలో "Cognitive Distortions" (ఆలోచనా వైకల్యాలు) అంటారు. వీటిని గుర్తించి, అదుపులో ఉంచుకోవడం అంటే.. మీ మెదడులో సాగుతున్న 'తప్పుడు కోడింగ్'ను సరిచేయడమే.చాలామందికి ఒక అలవాటు ఉంటుంది—ఒక చిన్న తప్పు జరిగితే, "నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను" అని అనుకుంటారు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని పలకరించకపోతే, "అతనికి నా మీద కోపం, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు" అని భ్రమపడతారు. ఇవన్నీ నిజాలు కావు, ఇవన్నీ మీ మెదడు సృష్టించిన భ్రమలు. ఆరోన్ బెక్ (Aaron Beck) అనే సైకాలజిస్ట్ ఈ Cognitive Distortions అనే కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేశారు.1. మన మెదడు ఆడుతున్న 3 పెద్ద అబద్ధాలుమీ మెదడు రోజువారీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:All-or-Nothing Thinking: "నేను ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే నేను ఫెయిల్యూర్" అని అనుకోవడం. అంటే, మధ్యేమార్గం (Grey area) ఉండదు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.Catastrophizing: చిన్న సమస్య జరిగినా.. "ఇక నా జీవితం అయిపోయింది, అంతా నాశనం" అని అతిగా ఊహించుకోవడం.Mind Reading: "ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు" అని భ్రమపడటం. వాస్తవానికి, వారు మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు.2. ఈ అబద్ధాలు మీ పర్సనాలిటీని ఎలా నాశనం చేస్తాయి?ఈ 'డిస్టార్షన్స్' వల్ల మీరు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు.మీరు ఎప్పుడూ తప్పు చేస్తానేమోనని భయపడుతుంటారు (Anxiety).ఎదుటివారి గురించి తప్పుడు అభిప్రాయాలు పెంచుకుని రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు.అతిగా ఆలోచించి (Overthinking) మీ శక్తిని కోల్పోతారు.3. పాజిటివ్గా ఉంటే సరిపోదుట్రైనర్స్ "అన్నీ పాజిటివ్గానే చూడు" అని చెప్తారు. కానీ, అబద్ధం చెప్పే మెదడుకు 'పాజిటివ్ థింకింగ్' కేవలం ఒక ప్లాస్టర్ లాంటిది. మార్కెట్ పాజిటివిటీని నమ్మమంటుంది.సైకాలజీ (CBT - Cognitive Behavioral Therapy) మీ మెదడు అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకుని, "ఇది నిజమేనా? దీనికి ఆధారం ఏంటి?" అని లాజిక్తో ప్రశ్నించమంటుంది. దీన్నే 'Reality Testing' అంటారు.4. మీ మైండ్ ని రీ-సెట్ చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ డిస్టార్షన్స్ ని ఎలా అదుపు చేయాలో చూద్దాం.Step 1: అబద్ధాన్ని పట్టుకోండిమీ మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచనలను ఇస్తుందో, వెంటనే 'STOP' అని అనుకోండి. "నేను నా మెదడు చెప్పే అబద్ధాన్ని నమ్మను" అని గట్టిగా చెప్పండి. ఇది ఒక చిన్న 'Break'.Step 2: లాజికల్ ఛాలెంజ్మీ మైండ్ చెప్పిన నెగటివ్ ఆలోచనకు ఒక కోర్టు విచారణ పెట్టండి.* "నేను ఫెయిల్యూర్" అని మీ మెదడు చెప్తే.. "గతంలో నేను సాధించిన విజయాలు ఏంటి?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాక్ష్యాలతో మీ మెదడు అబద్ధాన్ని ఖండించండి.Step 3: క్లారిటీ ఒక్కసారి మీ మెదడు అబద్ధాలు చెప్తోందని మీకు తెలిస్తే, మీరు ఇక వాటికి భయపడరు. మీ మైండ్ ఒక అద్దంలా మారుతుంది—అక్కడ వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయి, అపోహలు కాదు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మైండ్ చెప్పే అబద్ధాల లిస్ట్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.ఈ రోజు మీకు వచ్చిన అతి పెద్ద నెగటివ్ ఆలోచనను రాసుకోండి.ఆ ఆలోచన 'Distortion' (అబద్ధం) అని మీకు అనిపిస్తోందా?ఆ ఆలోచన నిజం కాదని నిరూపించే 3 వాస్తవాలను రాయండి.మీ మెదడుకి మీరు యజమాని!బ్రో, మీ మైండ్ ఒక సర్వెంట్ లాంటిది. కానీ అది ఒక్కోసారి యజమానిలా ప్రవర్తిస్తూ మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది. దాన్ని నమ్మడం మానేసి, దాని మీద నిఘా పెట్టండి. మీ మెదడు చెప్పే ప్రతిదీ నిజం కాదు, అది కేవలం ఒక ఆలోచన (Thought) మాత్రమే.గుర్తుంచుకోండి, "Don't believe everything you think."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు
అది.. చీకటి గది.. నిశ్శబ్ద వాతావరణం.. కానీ మీ కళ్లపై స్మార్ట్ఫోన్ వెలుగు పడుతోంది. ఒక్క నిమిషం రీల్స్ చూసి పడుకుందాం అనుకుంటే, అది కాస్తా తెల్లవారుజామున రెండు గంటలవుతోంది. చేతిలో ఫోన్ ఉన్నంత సేపు సమయం తెలియదు.. అయితే మరుసటి రోజు ఉదయం నీరసం, తలనొప్పి, చిరాకు వెంటాడుతుంటాయి. దీనినే నిపుణులు ‘డూమ్ స్క్రోలింగ్’ వ్యసనం అంటున్నారు. ఈ మాయలో పడి కోట్లాది మంది తమ విలువైన నిద్రను, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘డిజిటల్ సన్ సెట్’ మంత్రం వైరల్ అవుతోంది.‘డిజిటల్ సన్ సెట్’ అంటే?ప్రకృతిలో సూర్యుడు అస్తమించినట్లే, మన ఇంట్లో కూడా డిజిటల్ పరికరాలకు ‘సూర్యాస్తమయం’ ప్రకటించడమే ఈ పద్ధతి. అంటే రాత్రి పడుకోవడానికి కనీసం ఒకటి లేదా రెండు గంటల ముందే ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలకు స్వస్తి పలకాలి. వినడానికి ఇది కొత్తగా అనిపించినా, దీని వెనుక ఒక బలమైన కథనం ఉంది. 2018లో అన్నా ఫిర్త్, లిండెన్ కెమ్కరాన్ అనే ఇద్దరు మహిళలు తమ పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ అడిక్షన్ను తగ్గించడానికి ‘డిజిటల్ సన్ సెట్ ఛాలెంజ్’ ప్రారంభించారు. నేడు అది అందరికీ ఒక సంజీవనిలా మారింది.61 శాతం భారతీయుల నిద్ర గల్లంతుభారతదేశంలో నిద్రలేమి సమస్య భయంకరంగా ఉంది. గణాంకాల ప్రకారం సుమారు 61 శాతం మంది భారతీయులు కనీసం ఆరు గంటల ప్రశాంతమైన నిద్రకు కూడా దూరమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం స్క్రీన్ల నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ (నీలి కాంతి). మనం నిద్రపోయేందుకు మన మెదడు 'మెలటోనిన్' అనే హార్మోన్ను విడుదల చేయాలి. అయితే అర్ధరాత్రి ఫోన్ వెలుగును చూడగానే, మన మెదడు అది ఇంకా పగలే అనుకుని భ్రమపడుతుంది. ఫలితంగా మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోయి, నిద్ర కరువవుతుంది. నైట్ మోడ్ లేదా ఫిల్టర్లు వాడినా మెదడుపై ఒత్తిడి తగ్గదని, కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పరిష్కార మిదే..కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని డాక్టర్లు సూచిస్తుంటారు. రాత్రివేళ అధిక సమయంపాటు ఫోన్ చూసే అలవాటు క్రమంగా డిప్రెషన్కు దారితీస్తుందని క్లినికల్ న్యూరో సైకాలజిస్ట్ నైనా శర్మ తెలిపారు. బెంగళూరులోని డాక్టర్ సుమలత వాసుదేవ పర్యవేక్షణలో.. ఆన్లైన్ షాపింగ్కు బానిసైన యువత నుంచి, టీవీ సీరియల్స్ చూస్తూ గడిపే వృద్ధుల వరకు ‘డిజిటల్ సన్ సెట్’ పాటించి అద్భుతమైన మార్పులు సాధించారు. వారిలో ఏకాగ్రత పెరగడమే కాకుండా చిరాకు కూడా తగ్గింది. ముఖ్యంగా నేటి తరం పిల్లల విద్యాబుద్ధులు మెరుగుపడాలంటే తల్లిదండ్రులే ముందుగా ఫోన్ పక్కన పెట్టి, ఆదర్శంగా నిలవాలని డాక్టర్ పూజా కపూర్ సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. పెను విపత్తులో పాక్? -
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.టీనేజ్ దశలో...యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా వేయించాలి. సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.పునరుత్పాదక వయస్సులో...20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్ఫాక్స్, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ ప్లానింగ్కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.మెనోపాజ్ దశలో...నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!) -
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్ క్రీములతో జర భద్రం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ కనిపించడంలో సర్వత్రా రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్ అనారోగ్యం పాలయ్యారా? అని యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ వివరణ ఇచ్చింది కూడా. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అది సాధారణ చర్మక్రీమ్ని ఉపయోగించడం వల్ల వచ్చిన అలెర్జీగా పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు ఇలా ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా మనం సాధారణంగా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి అలెర్జీకి దారితీస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..మనం రెగ్యులర్గా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అదిగాక డీ హైడ్రేషన్ వల్ల, చర్మం పైపొర దెబ్బతిని ఇలా సమస్యలు ఉత్పన్నమవుతాయట. మనం రెగ్యులర్ రాసే ఈ క్రీమ్ సున్నితత్వానికి అలవాటుపడి కూడా ఇలా దద్దుర్లతో కూడిన ఇరిటేషన్ వస్తుంటుందని చెబుతున్నారు. కొందరి సున్నితమైన వ్యక్తుల్లో ఈ అలెర్జీ మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా అన్నారు. ఒక్కోసారి ఏజ్ పైబడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినా..ఇలా ఎప్పుడూ రాసే స్కిన్ క్రీమ్ ప్రతిచర్య చూపించి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. కొందరికి వెంటనే ఈ సమస్య చూపించగా, మరికొందరికి కనీసం 24 నుంచి 72 గంటల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అందుకే మన శరీరానికి సరిపడే క్రీమ్ అయినా ప్రతిచర్య చూపిన వెంటనే కడిగేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమస్య తగ్గేంత వరకు ఆయా క్రీమ్లు వినియోగించకపోవడమే మేలు అని అంటున్నారు. ఇది అందరికీ ఒకేలా ఉండదు..కొందరికీ తక్కువ రియాక్టివ్ చర్మం ఉంటుంది.పదే పదే అదే క్రీమ్ వాడటం వల్ల ఆ సంరక్షణకు మించి చర్మానికి ఎఫెక్టివ్ క్రీమ్ అవసరమై ఇలా ప్రతిచర్య చూపించొచ్చు కూడా. అంతేగాదు కొందరికీ ఆ క్షణం అలెర్జీ వచ్చినా..ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. అందువల్ల మన శరీరాని పడిన క్రీమ్ అని గుడ్డిగా అదే పనిగా రాసేయొద్దు..ఒక్కోసారి మనం వేరే ప్రాంతంలో ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా స్కిన్క్రీమ్ మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తెరగండి అని చెబుతున్నారు. అలాగే ఏ మాత్రం దురదగా..ఇబ్బందిగా అనిపించినా తక్షణమే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రపరుచుకుని ఆయా క్రీమ్లను కొద్దిరోజులపాటు వినియోగించకుండా ఉండటమే బెస్ట్ అని చెబుతున్నారు. ఒకరకంగా ఈ ఘటన స్కిన్క్రీమ్ల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో హైలెట్ చేసిందని చెబుతున్నారు చర్మ నిపుణులు.(చదవండి: బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..) -
మీ కలలు చెప్పే నిజాలు
మన నిద్రలో వచ్చే కలలు కేవలం పిచ్చి ఊహలు కావు, అవి మన Subconscious Mind మనతో మాట్లాడుతున్న భాష. సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటిని Wish Fulfillment అని పిలిస్తే, కార్ల్ యుంగ్ Messages from the Psyche అని చెప్పారు.మనం మేల్కొని ఉన్నప్పుడు సమాజం కోసం ఒక ముసుగు (Mask) వేసుకుంటాం. కానీ నిద్రపోయినప్పుడు, ఆ ముసుగు తొలగిపోయి మన అసలైన భయాలు, కోరికలు, మరియు పరిష్కారం కాని సమస్యలు బయటకు వస్తాయి. మీ కలలు మీ పర్సనాలిటీకి ఒక 'రిఫ్లెక్షన్' లాంటివి. మీరు పదే పదే ఒకే రకమైన కలలు కంటున్నారంటే, మీ మనసు ఏదో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.1. ఫ్రాయిడ్ vs యుంగ్: కలల వెనుక ఉన్న సైకాలజీSigmund Freud ప్రకారం, మన కలలో వచ్చే ప్రతిదీ మన లోపల అణిచిపెట్టబడిన కోరికల ప్రతిరూపం. మనం పగలు బయటపెట్టలేని కోపాలు, ఆశలు అన్నీ కలల రూపంలో బయటపడతాయి.Carl Jung దీనిని ఇంకా లోతుగా చూశారు. కలలు మనలోని లోపాలను, మనం మర్చిపోయిన మన 'Shadow Self' (చీకటి కోణం) ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాయి. ఒక వ్యక్తికి పదే పదే ఎత్తు నుండి పడిపోతున్నట్లు కల వస్తుందంటే, అది అతను తన జీవితంలో నియంత్రణ (Control) కోల్పోతున్నాడని అర్థం.2. కలల్లో కనిపించే సింబల్స్ మీరు కలలను విశ్లేషించడం ద్వారా మీ పర్సనాలిటీలో ఉన్న బలాలు, బలహీనతలను తెలుసుకోవచ్చు.పారిపోవడం: ఇది మీ జీవితంలోని సమస్యల నుండి లేదా ఒక బాధ్యత నుండి మీరు పారిపోవాలని చూస్తున్నారని అర్థం. ఇది మీ 'Avoidant Personality' కి సంకేతం.పరీక్షలో ఫెయిల్ అవ్వడం: మీ పర్సనాలిటీలో మీకు 'పర్ఫెక్షనిస్ట్' భయం ఎక్కువగా ఉందని, ఎక్కడ తప్పు చేస్తానో అన్న ఆందోళన ఉందని అర్థం.నీటిలో మునిగిపోవడం: మీ ఎమోషన్స్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారని అర్థం. మీ Emotional Intelligence తక్కువగా ఉందని ఇది సూచిస్తుంది.3. "కలలు కనండి.. విజయం మీదే"మోటివేషనల్ స్పీకర్లు 'కలలు' అంటే కేవలం 'గోల్స్' అని చెప్తారు. కానీ సైకాలజీలో కలలు అంటే 'సెల్ఫ్-రిఫ్లెక్షన్'. కలలను కేవలం విజయం కోసం మెట్లుగా కాకుండా, మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దే 'గైడ్' లా చూడండి.4. కలలను మీ పర్సనాలిటీకి అద్దంగా మార్చుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కలల నుండి మీరు నేర్చుకోవాల్సింది ఇదే.Step 1: కలల డైరీ రాయండిప్రతిరోజూ ఉదయం లేవగానే మీరు కన్న కలలను ఒక డైరీలో రాయండి. అది ఎంత పిచ్చిగా ఉన్నా సరే. ఆ కలలో మీకు కలిగిన 'ఎమోషన్' (భయమా? ఆనందమా? కోపమా?) ఏంటో గుర్తించండి. కలలోని సంఘటనల కంటే ఆ 'ఎమోషన్' చాలా ముఖ్యం. ఇది మీ పాత ప్రోగ్రామింగ్ను 'Break' చేసి, నిజమైన మీరు ఎవరో చూపిస్తుంది.Step 2: కలల వెనుక ఉన్న మూలాన్ని వెతకండిఆ కల మీ పగటిపూట జీవితానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉందో విశ్లేషించండి. మీరు పగలు దేని గురించి భయపడుతున్నారో, అదే కలగా వస్తుంది. అక్కడ మీరు ఎక్కడ తగ్గుతున్నారో, దాన్ని మీ పర్సనాలిటీలో 'Build' చేయండి.Step 3: మాస్టరీఒక్కసారి మీ కలల భాష (Dream Language) మీకు అర్థమైతే, మీరు మీ సబ్-కాన్షియస్ మైండ్ను కూడా కంట్రోల్ చేయగలరు. అదే Lucid Dreaming కి పునాది. మీరు మీ అంతరాత్మతో నేరుగా సంభాషిస్తున్నప్పుడు, మీ వ్యక్తిత్వం ఒక 'హైయర్ లెవెల్' కి చేరుకుంటుంది.5. కలల విశ్లేషణఈ రోజు ఒక చిన్న పని చేయండి:* ఈ వారం మీకు వచ్చిన అతి ముఖ్యమైన కలని రాసుకోండి.* ఆ కలలో మీరు ఏ పాత్ర పోషించారు? (బాధపడేవారా? పోరాడేవారా? పారిపోయేవారా?)* మీ నిజ జీవితంలో మీరు కూడా ఆ పాత్రనే పోషిస్తున్నారా?కలలు మీ అంతరాత్మ ప్రతిబింబాలు!బ్రో, కలలు మనకు భవిష్యత్తును చెప్పవు, కానీ అవి మన వర్తమానాన్ని, మన అస్తిత్వాన్ని మనకు చూపిస్తాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేయకండి. మీరు ఎవరో తెలుసుకోవాలంటే, మీరు నిద్రపోయినప్పుడు మీ మనసు ఏం చెప్తుందో వినండి."The dream is the small hidden door in the deepest and most intimate sanctum of the soul."-Carl Jungసైకాలజిస్ట్ విశేష్Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?) -
93 ఏళ్ల వయసులోనూ చలాకీగా విదేశీ బామ్మ..! ఆమె హెల్త్ సీక్రెట్ ఇదే..
ఆ బామ్మ చూస్తే తొమ్మిది పదుల వయసు అనిపించదు. వృద్ధాప్యాన్నే తిప్పికొట్టేలా ఆరోగ్యంగా,చలాకీగా ఉంటుందా బామ్మ. స్వతహాగా అమెరికన్ అయినా ఆమె మన భారత్ని మెచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంది. పైగా మన ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి..మన భారతీయత ఉట్టిపడేలా ఆహార్యం, సంస్కృతిని మార్చేస్తుకుందామె. పైగా ఈ గడ్డపైనే ఓ సామాన్య భక్తురాలిలా జీవిస్తోందామె. ఎవరామె అంటే..ఆ బామ్మే అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాకు చెందిన సుషుమ్న. దీర్ఘాయువు అనేది ఎక్కడ నుంచో కాదని, మన సంతోషం, జీవనవిధానం నుంచే వస్తుందని చెప్పలా జీవిస్తోంది ఈ బామ్మ. యాంటీ ఏజింగ్ ట్రెండ్కి సరిగ్గా సరిపోతుంది ఆమె జీవన విధానం. ఇప్పటికీ రెండు పూటల సైక్లింగ్ చేస్తుందట. తనకు ఎలాంటి వైద్య మస్యలు లేవని అంటోంది. బుద్దిపూర్వకంగా తినడం, శరీరానికి సరిపడ వ్యాయామాలు, స్నేహితులతో కలివిడిగా ఉండటం ఇవే తనను ఆరోగ్యంగా ఉంచుతున్నాయని చెబుతోంది. తొంభైఏళ్ల వయసులో కూడా తన పనులు తానే చలాకీగా చేసుకుంటానని అంటోంది. తనకు ఆర్థరైటిస్ తప్ప మరే సమస్యలు లేవని చెబుతోంది. వ్యవస్థాపకురాలు కమెల్ జాబర్ ఈ విదేశీ బామ్మ హెల్దీ లైఫ్ సీక్రెట్ గురించి నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆమె ప్రతి విషయాన్ని సానుకూలత దృక్పథంతో చూసే తీరే ఆమె దీర్ఘాయువుకి కారణం అంటూ ఆమె జీవిన విధానం గురించి పోస్ట్లో తెలిపారు. పైగా ఈ బామ్మ తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం మెడిసిన్స్ మానేయడమేనని హాస్యస్పదంగా చెబుతుంటుందని అన్నారు. ఆమె ఇప్పుడు కాలిఫోర్నియా, తమిళనాడులలోని ఆధ్యాత్మిక కమ్యునిటీలో సభ్యురాలు కూడా. 2001 నుంచి ఈ కమ్యూనిటిలో సభ్యురాలిగా అంకితభావంతో సేవలందిస్తోంది. ఒకప్పుడు ప్రముఖ సంస్థలో విజయవంతమైన సేల్స్ మేనేజర్ పనిచేసిన తదనంతరం ఈ జీవనశైలికి మారిపోయిందని చెప్పుకొచ్చారు పోస్ట్లో. నెటిజన్లు కూడా ఈ బామ్మ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టిన సూపర్బామ్మ అంటూ పోస్టులు పెట్టారు. విదేశాల్లో హైఫై లైఫ్ని పక్కన పెట్టి మన సంస్కృతి, వేషధారణను నేర్చుకుని ఆధ్యాత్మికవేత్తగా జీవించడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం అంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Kamel Jaber (@i__kamel) (చదవండి: నడక చాలు...జిమ్కు వీడ్కోలు...!) -
నడక చాలు...జిమ్కు వీడ్కోలు...!
‘‘నడక చాలు, మీకు జిమ్ అవసరం లేదు’’ అని ఎవరైనా చెప్పడం మనలో చాలా మంది విని ఉండొచ్చు. సాధారణంగా జిమ్కు వెళ్లలేకపోతున్న వారికి ఇది ఓదార్పుగా అనిపించవచ్చు. జిమ్కు డుమ్మా కొట్టడం దానికి బదులుగా నడకను ఎంచుకోవడం అంటే అది అంత సులువైన విషయం కాదు అలాగని అసాధ్యం కూడా కాదు. జిమ్ మానడం వల్ల కలిగే నష్టాలను నడకతో భర్తీ చేయడం సాధ్యమే అంటున్నారు వ్యాయామ నిపుణులు. వారు చెబుతున్న ప్రకారం...అలా చేస్తే లాభం లేదు...కారు దిగి ఆఫీసు వరకు నడవడం, షాపింగ్ మాల్లో తిరగడం, ఫోన్లో మాట్లాడుతూనో, చాట్ చేస్తూనో నడవడం, పార్క్లో రిలాక్స్డ్గా నెమ్మదిగా వాక్ చేయడం... వంటి వాటివల్ల జిమ్ సెషన్ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అవి వ్యక్తి శరీరంపై నిర్మాణాత్మక ఒత్తిడిని కలిగించవు. కార్డియో పేరిట ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్...వగైరాలు జిమ్లో అందుబాటులో ఉంటాయి. అటువంటి వ్యాయామాలతో కూడిన జిమ్ సెషన్ వదిలేస్తూ, ఆ నష్టం భర్తీ కావాలంటే ఏదో ఒక పని మీద కాకుండా నడవడం అనే పని మీద బయటకు వెళ్లాలి. అప్పుడే మన చేతులు సరిగ్గా కదులుతాయి. చూపు ముందుకు ఉంటుంది. ఒక్కో అడుగు సాధారణం కంటే ఎక్కువ దూరం పడుతుంటుంది. ఇలా నడిస్తే...భళా...స్మార్ట్వాచ్ లేదా ఫోన్ ఉంటే, ఒక సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. స్థిరమైన రీతిలో గంటకు 5 కి.మీ వేగంతో 30 నిమిషాల పాటు నిర్విరామంగా నడవాలి. అంటే దాని ద్వారా మనం 2.50 కి.మీ నడుస్తామన్నమాట. ఆ వేగంతో, చాలా మంది సాధారణ నడక నుంచి బయటపడి తేలికపాటి కార్డియో శైలిలోకి వెళతారు. శ్వాస కొంచెం లోతుగా మారుతుంది. కండరాలు సాధారణ ప్రయాణ వేగం కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేయడానికి తగ్గట్టుగా వేడెక్కుతాయి. అలా 30 నిమిషాలు నాన్–స్టాప్ గా నడిస్తే గుండె, ఊపిరితిత్తులు రక్త నాళాలు గట్టి ప్రభావాన్ని ఎదుర్కొంటాయి.దీనికి రోజువారీ తప్పక చేయాల్సిన అవసరం కూడా లేదు. వారంలో నాలుగు రోజులు సరిపోతుంది. ‘‘దానిని ఒకేలా పరిగణించినప్పుడు మాత్రమే. నడక ఒక వ్యాయామం అవుతుంది. తొలుత 5 నిమిషాల పాటు సున్నితమైన వేగంతో ప్రారంభించి ఆపై తగిన వేగంలో స్థిరంగా నడవడం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా చేతులను వెనక్కి కట్టేయడం లాంటివి చేయకూడదు. చేతులను దాదాపు 90 డిగ్రీల వద్ద వంచి సహజంగా ఊగుతూ ఉండేలాచూడాలి. చదునైన నేలపై 30 నిమిషాల్లో 2.3–2.7 కి.మీ. లక్ష్యంగా పెట్టుకోవాలి. వేగాన్ని తగ్గించకుండా ఉండటానికి అవసరమయితే సంగీతం లేదా పాడ్కాస్ట్లను ఉపయోగించవచ్చు. వాక్ ముగిసే సమయంలో హృదయ స్పందన రేటు తగ్గడానికి 2–3 నిమిషాల పాటు నెమ్మదించిన నడకతో ముగించాలి.(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?) -
ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎవరికైనా సరే ఒక పెద్ద సవాలుగా మారింది. బరువు తగ్గాలని ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు వచ్చేస్తుంటాయి. అటువంటి వారి కోసం ‘జెఫింగ్’ అనే సరికొత్త వ్యాయామ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం పరుగు మాత్రమే కాదు, అలాగని కేవలం నడక కూడా కాదు.. ఈ రెండింటి కలయికతో కూడిన ఒక అద్భుతమైన ఫిట్నెస్ సూత్రం... అద్భుత మంత్రం..ఎలా మొదలయ్యింది?ఒలింపిక్ రన్నర్ జెఫ్ గాల్లోవే ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ విధానానికి ఆయన పేరు మీదనే ‘జెఫింగ్’ అని పేరు వచ్చింది. ఇటీవలే తన 80 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాల్లోవే.. ఫిట్నెస్ ప్రపంచానికి అందించిన అతిపెద్ద కానుక ఇది. నిర్ణీత సమయం పాటు పరిగెత్తడం, ఆ వెంటనే కొంత సమయం వేగంగా నడవడం అనే ప్రక్రియ ద్వారా శరీర సత్తువను పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. బరువు తగ్గాలని ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అలసట, కండరాల నొప్పులను చూసి నీరసించిపోయే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి వారి కోసం ‘జెఫింగ్’ అనే సరికొత్త వ్యాయామ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.‘30-30’ మ్యాజిక్ ఫార్ములానిర్ణీత సమయం పాటు పరిగెత్తడం, ఆ వెంటనే కొంత సమయం వేగంగా నడవడం అనే ప్రక్రియ ద్వారా శరీర సత్తువను పెంచడమే ‘జెఫింగ్’ ప్రధాన ఉద్దేశ్యం. జెఫింగ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సూత్రం ‘30-30’ ఫార్ములా. అంటే 30 సెకన్ల పాటు పరుగు, ఆ వెంటనే 30 సెకన్ల పాటు చురుకైన నడక. ఇలా చేయడం వల్ల కండరాలు పూర్తిగా అలసిపోకముందే వాటికి స్వల్ప విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల సాధారణంగా పరిగెత్తే దూరం కంటే ఎక్కువ దూరం సులువుగా పరుగెత్తగలుగుతారు.సామర్థ్యం అనుసరించి మూడు స్థాయిలుఈ వ్యాయామాన్ని ప్రారంభించే వారు తమ శారీరక స్థితిని అనుసరించి మూడు స్థాయిలలో సాధన చేయవచ్చు. కొత్తగా మొదలుపెట్టే వారు 30 సెకన్ల పరుగు-నడక విరామాలను పాటించవచ్చు. మధ్యస్థ స్థాయి వారు 3 నిమిషాల పరుగుకు ఒక నిమిషం నడకను, నిష్ణాతులు 9 నిమిషాల పరుగుకు ఒక నిమిషం నడకను అనుసరించవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. పూర్తిగా అలసిపోయేంత వరకు వేచి చూడకుండా, మొదటి నుంచే ఈ విరామాలను పాటించడం వల్ల కండరాల ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు.నడక అంటే అదొక స్ట్రాటజీజెఫింగ్లో ‘నడక’ అంటే విశ్రాంతి అని భావించకూడదు. గుండె కొట్టుకునే వేగం తగ్గకుండా చురుకుగా సాగాలి. పరుగు తీసే సమయంలో వీపు, భుజాలు నిటారుగా ఉంచి, చేతులను 90 డిగ్రీల కోణంలో ఉంచుతూ పక్కవారిలో సులువుగా మాట్లాడగలిగే వేగంతో సాగాలి. ఒకవేళ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తే ‘హఫ్ అండ్ పఫ్’ నిబంధన ప్రకారం పరుగు సమయాన్ని తగ్గించి, నడక సమయాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గాయాల ముప్పు తక్కువఈ క్రమబద్ధమైన విధానం వల్ల కీళ్ల మీద పడే ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. బరువు తగ్గడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. సాధారణ పరుగులో ఎదురయ్యే గాయాల బారిన పడకుండా, ఎక్కువ కాలం ఫిట్నెస్ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ‘జెఫింగ్’ తోడ్పడుతుంది.కండరాల నొప్పులను తగ్గించి..ఈ వ్యాయామ విధానం కండరాల నొప్పులను తగ్గించి, శరీరం త్వరగా కోలుకునేందుకు అద్భుతంగా పని చేస్తుంది. పరుగును ఒక శిక్షగా కాకుండా ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక సరైన మార్గం. అందుకే మీరు కూడా ఈరోజే మీ ‘జెఫింగ్’ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేయండి. ఇది కూడా చదవండి: చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్ -
ఆ కమెడియన్కి వెయిట్లాస్ మందులు ఎందుకు పనిచేయలేదంటే..!
ఇటీవల కాలంలో చాలామంది స్లిమ్గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోనూ కొందరు సహజపద్ధతిలో ఆరోగ్యంగా బరువు తగ్గితే..ఇంకొందరు ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులు మాత్రం బరువు తగ్గించే టైప్2 డయాబెటిస్ మందులపై ఆధారపడుతున్నారు. అది కూడా వైద్యుల పర్యవేక్షణలో.. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గుతుండటం విశేషం. అయితే కొందరిలో ఈ డ్రగ్ పనిచేయడం లేదనే విషయం అందరిలోనూ తీవ్ర ఆందోళనలను లేవనెత్తింది. ఎందుకంటే యూట్యూబర్, హాస్యనటుడు, రచయిత తన్మయ్ భట్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. నిజంగానే ఈ మెడిసిన్ అందరికి ప్రభావవంతంగా పనిచేయదా..? అందుకు గల కారణాల ఏంటి..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హాస్యనటుడు తన్మయ్ భట్ టైప్2 డయాబెటస్ నిర్వహించడానికి ఎఫ్డీఏ ఆమోదించిన GLP-1 మందులతో బరువు తగ్గే ప్రయత్నం చేసినట్లు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఈ సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి GLP-1 మందులు టైప్ 2 డయాబెటిస్ను నిర్వహించడానికి FDA-ఆమోదించిన చికిత్సలు. వీటిని బరువు నిర్వహణకు కూడా వినియోగిస్తారు. తాను GLP-1 మందుల సాయంతో ఆకలి తగ్గించుకోవాలనుకున్నా..కానీ తనకు అంతగా పనిచేయలేదని అన్నారు. తనకు ఆ మందు వినియోగించడంవల్ల ఆకలికి సంబంధించి..బలహీన సంతృప్తి సంకేతాలనే అందించిందని అన్నారు. అంతేగాదు తన్మయ్ తాను ఈ మందులు వాడక మునుపే నేచురల్గా 75 కిలోలుల తగ్గానని అన్నారు. అయితే తనకు కొంగొత్త సాంకేతిక వైద్య విధానాన్ని తెలుసుకోవడం, ప్రయత్నించడం ఇష్టమని ఆ నేపథ్యంలోనే ఈ మెడిసిన్ని ప్రయత్నించినట్లు తెలిపారు. ఎందుకు తనకు ఈ మెడిసిన్ పనిచేయలేదు ఎవరైన వైద్యులు లేదా నిపుణులు వివరించాలని కూడా కోరారు పోస్ట్లో.నిపుణులు ఏమంటున్నారంటే..కొందిరిలో ఈ డయాబెటిస్ మెడిసిన్ బరువు తగ్గడానికి పనిచేయకపోవడానికి పలు విధాల కారణాలు ఉంటాయని అంటున్నారు. అవన్నీ బేరీజు వేసుకుని గానీ నిర్థారించలేమని చెబుతున్నారు నిపుణులు. తక్కువ మోతాదు..కొన్నిసార్లు వ్యక్తులు GLP-1 మందులతో ఆకలి నియంత్రణలో ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ప్రారంభంలో తక్కువ మోతాదు ఉంటుంది కాబట్టి. ఈ మందులు పనిచేయడానికి కొంత సమయం అవసరం. ఒక్కోసారి నెలల సమయం కూడా పడుతుందని అన్నారు.ఒక్కోసారి శరీరం స్పందించదు..కొందరిలో అస్సలు ఈ మెడిసిన్ పనిచేయదట. ఎందుకుంటే వారి వారి జన్యు సంబంధిత పరిస్థితతులు, అంతర్లీన జీవక్రియ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందట. అలాగే కొందరు హెల్త్ దృష్ట్యా వాడే ఇతర మందుల వల్ల కూడా ఈ మెడిసిన్ ప్రభావవంతంగా పనిచేయదని చెబుతున్నారు వైద్యులు.జీవనశైలి కారణంగా..అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు బాగా తీసుకునే వారిలో ఈ మందుల ప్రభావాన్ని అధిగమిస్తాయట. అలాంటి వారికి అధిక ప్రోటీన్, అధిక ఫైబర్తో కూడిన ఆహారాన్ని జత చేస్తేనే ఈ GLP-1 మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు వైద్యులు .ఇక్కడ తన్మయ్ భట్ అనుభవం బరువు తగ్గడానికి ఏ విధంగా ఆయన ఈ మెడిసిన్ని ఏవిధంగా విరియోగించారనేది అత్యంత ముఖ్యం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది. అందువల్ల ఈ వెయిట్లాస్ మందులు వాడాలనుకునేవారు వైద్యులు లేదా నిపుణులు పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు ఉపయోగించటమే మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో హైలెట్గా నీతా అంబానీ స్పీచ్..!) -
మీకూ ప్రోటీన్ కావాలండోయ్!
ప్రోటీన్.. కణాల పునరుద్ధరణకు ఈ సూక్ష్మపోషకం ప్రధాన వనరు. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆక్సిజన్ సరఫరాలో (హిమోగ్లోబిన్ ద్వారా) కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రోటీన్ పోషించే పాత్ర గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. ప్రోటీన్లపై అవగాహన, వినియోగంపై కంట్రీ డిలైట్ భాగస్వామ్యంతో ‘కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్’దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 25 మెట్రో, నగరాలకు చెందిన 2.07 లక్షల మంది ఇందులో పాలుపంచుకున్నారు. నగరాల్లో నివసించే భారతీయులలో దాదాపు 60 శాతం మంది ప్రతిరోజూ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం లేదని ఈ సర్వేలో తేలింది. జనంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్నా, విభిన్న ఆహారోత్పత్తులు లభిస్తున్నా ఈ పరిస్థితి నెలకొంది. ధర అందుబాటులో లేకపోవడమే పెద్ద అడ్డంకి అన్నది అత్యధికుల మాట. చవక ప్రోటీన్ ప్రత్యామ్నాయాలు లభిస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని 71% మంది తెలిపారు.సమతుల ఆహారమని.. సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాలలో 10 మందిలో నలుగురు మాత్రమే తమ రోజువారీ భోజనంలో కొవ్వు తక్కువగా ఉండే మాంసం, పప్పులు, గుడ్లు, పాలు, పనీర్, చేపలు, గింజలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. ఫిట్నెస్, వెల్నెస్, ముందస్తు వ్యాధి నివారణ గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ ప్రోటీన్ తీసుకోవడంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. దాదాపు నాలుగింట మూడొంతుల మందికి రోజూ ఎంత ప్రోటీన్ అవసరమో తెలియదు. 85% మంది రోజూ తమకు ఎంత ప్రోటీన్ అందుతుందో కొలవడం లేదు. ఎంత అవసరమో అన్న విషయం అవగాహన లేకపోవడంతో ప్రోటీన్ తక్కువగా తీసుకుంటున్నారు. అంతేకాదు చాలా మంది తాము సమతుల ఆహారం స్వీకరిస్తున్నామని నమ్ముతున్నారు. పొంచి ఉన్న ముప్పు.. సగం మందికి పైగా ప్రజలు తమకు ఎదురయ్యే నీరసం, జుట్టు రాలడం, తరచుగా అనారోగ్యానికి గురవ్వడం వంటి సమస్యలు ప్రోటీన్ లోపం వల్ల వస్తున్నాయని గుర్తించడం లేదు. ప్రోటీన్ లేమితో కండరాల క్షీణత మాత్రమే కాకుండా జీవక్రియ సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ముసలితనాన్ని గడపడానికి, వ్యాధులను నిరోధించడానికి ప్రోటీన్ ఒక పునాది వంటిదని అంటున్నారు.ఐసీఎంఆర్ ప్రకారం.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనాల ప్రకారం భారత్లో దాదాపు అన్ని రకాల ఆదాయ వర్గాలు తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదు. ముఖ్యంగా పట్టణ భారత్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన పెద్దలకు రోజుకు కిలోగ్రాము శరీర బరువుకు 0.66–0.83 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.పోషక వనరు ఇలా.. ∙ప్రోటీన్ ఫుడ్ అనేది శరీరానికి అత్యవసరమైన పోషకాలు కలిగిన వనరులు. ∙కండరాలు, చర్మం, ఎముకల వంటి శరీర కణజాలాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి అవసరమైన అమైనో ఆమ్లాలను ప్రోటీన్స్ అందిస్తాయి. ∙జీవక్రియ పనితీరు, రోగనిరోధక శక్తి, హార్మోన్ల ఉత్పత్తి, ఆకలిని నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అవగాహన లోపం.. ప్రోటీన్ అంటే కేవలం బాడీ బిల్డింగ్ కోసమే అని చాలా మంది భావిస్తారు. కానీ రోగనిరోధక శక్తి, చర్మం, జుట్టు ఆరోగ్యం, వయసు పెరిగే కొద్దీ కండరాలు క్షీణించకుండా ఉండటానికి ప్రోటీన్ ఎంతో అవసరం. ఒక చిన్న కప్పు నిండా పప్పు లేదా ఒక గ్లాసు పాలు తాగితే సరిపోతుందని అనుకుంటారు. కిలో శరీర బరువుకు 0.83 గ్రాముల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఏమాత్రం సరిపోదు. అన్నం, చపాతీలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు అందక అంతర్గతంగా శరీరం బలహీనపడుతుంది. లోపిస్తే సమస్యలే.. రోగనిరోధక శక్తి బలహీనపడటం, తీవ్రమైన అలసట కలుగుతాయి. జుట్టు రాలడం, పెళుసుగా మారడం, గోర్లు విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రోటీన్ లోపం దీర్ఘకాలం కొనసాగితే శరీర కణజాలాలలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల కలిగే వాపు (ఎడెమా) వస్తుంది. గాయాలు త్వరగా మానవు. మూడ్ స్వింగ్స్, మానసిక స్థితిలో మార్పులు రావొచ్చు. ఫ్యాటీ లివర్, పిల్లల్లో పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలూ ఎదురుపడవచ్చు. -
IQ Vs EQ: ఏది మిమ్మల్ని గెలిపిస్తుంది?
మన సమాజంలో తెలివితేటలు (IQ) ఉన్నవారిని మేధావులు అని తలకెత్తుకుంటాం. కానీ, విపరీతమైన కోపంతో ఎదుటివారిని తిట్టే మేధావిని, ఒత్తిడి తట్టుకోలేక కుంగిపోయే టాపర్ను మనం ఏమనాలి?ఇక్కడే Emotional Intelligence (భావోద్వేగ ప్రజ్ఞ) ప్రాముఖ్యత తెలుస్తుంది. IQ అనేది మీ తల (Head) కి సంబంధించింది అయితే, EQ అనేది మీ హృదయానికి (Heart) కి సంబంధించింది.IQ, EQ మధ్య తేడా ఏంటి?IQ (Intelligence Quotient): ఇది మీ లాజిక్, మెమరీ, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్. ఇది చాలా వరకు పుట్టుకతో వచ్చేది, పెద్దగా మార్చలేం.EQ (Emotional Quotient): ఇది మీ ఎమోషన్స్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎదుటివారి ఎమోషన్స్ కి ఎలా స్పందిస్తున్నారు అనే సామర్థ్యం. ఇది నేర్చుకోగలిగే స్కిల్.చాలా మంది సక్సెస్ ఫుల్ పీపుల్ లైఫ్ లో మనం గమనించే అతి ముఖ్యమైన అంశం EQ. స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్లందరూ జీవితంలో ఫస్ట్ రాకపోవడానికి, యావరేజ్ స్టూడెంట్స్ ప్రపంచాన్ని ఏలడానికి ప్రధాన కారణం ఈ EQ.The 5 Pillars of EQడేనియల్ గోల్మన్ (Daniel Goleman) ఈ కాన్సెప్ట్ను ప్రాచుర్యంలోకి తెస్తూ ఒక మాట చెప్పారు: "IQ మిమ్మల్ని ఉద్యోగంలో చేర్పించవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఆ ఉద్యోగంలో ఎదిగేలా చేస్తుంది."గోల్మన్ ప్రకారం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఐదు ముఖ్యాంశాలు ఉంటాయి.Self-Awareness (స్వయం స్పృహ): మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎప్పుడు భయం వేస్తుంది? ఆ సమయంలో మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? అని గమనించడం.Self-Regulation (స్వయం నియంత్రణ): ఎమోషన్స్ కలగడం సహజం, కానీ వాటికి బానిస అవ్వకూడదు. కోపం వచ్చినప్పుడు వెంటనే అరవకుండా, ఒక్క క్షణం ఆగి స్పందించడం.Motivation (ప్రేరణ): డబ్బు లేదా పొగడ్తల కోసం కాకుండా, మీలోని తృప్తి కోసం పని చేయడం. ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించే మొండితనం.Empathy (సహానుభూతి): ఎదుటివారి కళ్ళతో ప్రపంచాన్ని చూడటం. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వారి కోణంలో అర్థం చేసుకోవడం.Social Skills (సామాజిక నైపుణ్యం): గొడవలను పరిష్కరించడం, టీమ్ ని నడిపించడం, మనుషులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం.మోటివేషనల్ స్పీకర్ల పొరపాటుట్రైనర్స్ మనకు "కోపాన్ని అణచుకో, ఎప్పుడూ నవ్వుతూ ఉండు" అని పైపైన చిట్కాలు ఇస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, ఎమోషన్ ని అణచివేయడం (Suppression) అంటే ప్రెషర్ కుక్కర్ విజిల్ ఆపేసినట్లే—అది ఎప్పుడో ఒకప్పుడు పేలుతుంది.మార్కెట్ ఎమోషన్స్ ని దాచమంటుంది.సైకాలజీ ఎమోషన్స్ ని ఛానలైజ్ (Channelize) చేయమంటుంది.EQని ఎలా పెంచుకోవాలి?Genius Matrix మోడల్ ఉపయోగించి ఈ ఎమోషనల్ స్ట్రెంత్ ని బిల్డ్ చేద్దాం.Step 1: Break (రియాక్షన్ ని బ్రేక్ చేయండి)మీరు ఒక సంఘటనకు స్పందించే లోపు ఒక 'Gap' క్రియేట్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు వెంటనే తిరిగి తిట్టడం మీ పాత ప్రోగ్రామింగ్. ఆ ఆటోమేటిక్ రియాక్షన్ ని 'Break' చేసి, "నేను ఇప్పుడు ఎలా స్పందించాలి?" అని ఆలోచించండి.Step 2: Build (ఎమోషనల్ వొకాబులరీ)చాలామందికి తమకు ఏం అనిపిస్తుందో చెప్పడం రాదు. "నాకు బాధగా ఉంది" అనడానికి బదులు "నాకు కోపంగా ఉంది" అంటారు. మీ ఎమోషన్ కి సరైన పేరు పెట్టడం నేర్చుకోండి. మీ లోపల ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫౌండేషన్ ని 'Build' చేయండి.Step 3: Beyond (స్టాయిక్ మైండ్సెట్)పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ప్రశాంతతను ఎవరు చెడగొట్టలేనప్పుడు మీరు 'Beyond' స్టేజ్ లో ఉన్నట్లు. ఇతరుల ప్రవర్తన మీ మూడ్ ని శాసించకూడదు. అదే నిజమైన పర్సనాలిటీ గ్రోత్.మీ ఎమోషనల్ చెకప్ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి.గత వారంలో మీరు ఎవరిపైనైనా విపరీతంగా అరిచారా? ఆ తర్వాత బాధపడ్డారా? (అక్కడ మీ EQ తక్కువగా ఉందని అర్థం).ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు అతిగా తింటారా? లేక అందరిపై విసుక్కుంటారా?ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మీరు నిజంగా వారి బాధను ఫీలవుతున్నారా?స్మార్ట్ అవ్వడం కంటే స్ట్రాంగ్ అవ్వడం ముఖ్యం!బ్రో, IQ మిమ్మల్ని ఒక మంచి ఇంజనీర్ లేదా డాక్టర్ ని చేయవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఒక మంచి లీడర్ ని, మంచి భర్తని/భార్యని, ఒక గొప్ప మనిషిని చేస్తుంది. తెలివితేటలు ఉన్నవాడు గెలుస్తాడేమో కానీ, భావోద్వేగ స్థిరత్వం ఉన్నవాడు మాత్రమే ఆ గెలుపును నిలబెట్టుకోగలడు.గుర్తుంచుకోండి, "Life is 10% what happens to you and 90% how you react to it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం) -
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేయనున్న ఏడేళ్ల బాలుడు.. ఎందుకంటే?
బీజింగ్: చైనాలోని తూర్పు ప్రాంతానికి చెందిన ఏడేళ్ల టాంగ్డౌ తన బరువు తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వయస్సుకు మించి బరువు పెరిగిన టాంగ్డౌకు అతని తండ్రి ‘హే’ స్కిప్పింగ్ చేయమని సలహా ఇచ్చాడు. తండ్రి వీడియో తీస్తుండగా..‘సమ్మర్ హాలిడేస్లో నువ్వు చెప్పినట్లే చేస్తాను నాన్న’ అని మాట ఇచ్చాడు.అంతేకాకుండా..‘నువ్వు పోస్టు చేసే వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే, అన్ని సార్లు స్కిప్పింగ్ చేస్తా’అని సరదాగా చెప్పాడు. చెప్పినట్లుగా తండ్రి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తొలి రోజు ఆ వీడియోకి 150 లైక్స్ వచ్చాడు. లైక్స్కు అనుగుణంగా స్కిప్పింగ్ చేశాడు. రోజులు గడిచేకొద్దీ విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం ఆ వీడియోకు 18 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో,‘టాంగ్డౌ నిజంగా 18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా?’ అన్నది చైనా సోషల్ మీడియాలో చర్చాంశమైంది.ప్రపంచ దేశాల్లో ఊబకాయం సమస్యతో బాధపడుతున్న దేశాల్లో చైనా ఒకటి. పెద్దల్లో 35 శాతం, పిల్లల్లో 12 శాతం మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టాంగ్డౌ వీడియో చైనాలో పేరెంటింగ్ ట్రెండ్గా మారింది. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తల్లిదండ్రులు కొత్త పద్ధతులను ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో స్కిప్పింగ్ చేయడం శారీరకంగా సాధ్యం కాదని, ఇది కేవలం సోషల్ మీడియా వినియోగదారుల సరదా ప్రతిస్పందనగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. Tangdou just discovered that the internet can be a very scary place lolpic.twitter.com/O83uFVcUYQ— China Scroll (@TheChinaScroll) February 12, 2026 -
అకస్మాత్తుగా బరువు తగ్గారా? గుండె దడ పెరుగుతోందా?
మన శరీరంలో చోటుచేసుకునే చిన్నపాటి మార్పులే భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరికలు కావచ్చు. హఠాత్తుగా శరీరం బరువు తగ్గినా, దానికి తోడు.. కూర్చున్నా, పడుకున్నా గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించినా.. వీటిని అలసటగా భావించి, నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా బరువు తగ్గడం, అసాధారణంగా గుండె వేగం పెరగడం అనేవి ‘హైపర్ థైరాయిడిజం’నకు సంకేతాలు కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ‘హైపర్ థైరాయిడిజం’ అంటే ఏమిటి? అది ఎంత ప్రమాదకరం?మన మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి.. శరీర జీవక్రియలను నియంత్రించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం మెడకు సంబంధించిన గ్రంథి మాత్రమే కాకుండా శరీర ఉష్ణోగ్రత, శక్తి ఉత్పత్తి, గుండె కొట్టుకోవడాన్ని క్రమబద్ధీకరిస్తుంది. హెల్థియన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సోహిని సేన్ గుప్తా వివరణ ప్రకారం థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం ప్రారంభించినప్పుడు శరీరంలోని మొత్తం వ్యవస్థ వేగవంతమవుతుంది. దీనివల్ల జీవక్రియల వేగం పెరిగి, కేలరీలు త్వరగా కరిగిపోతాయి. ఫలితంగా గుండె సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి మితిమీరి, శరీరం ఒక్కసారిగా ‘ఓవర్ డ్రైవ్’ మోడ్లోకి వెళ్తుంది.హైపర్ థైరాయిడిజం లక్షణాలు ప్రారంభంలో చాలా స్వల్పంగా ఉండటం వల్ల వీటిని గుర్తించడం కష్టమవుతుంది. సాధారణం కంటే ఎక్కువగా ఆకలి వేసినా లేదా ఆహారం బాగానే తీసుకుంటున్నా బరువు తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. దీనికి తోడు చేతులు వణకడం, విపరీతమైన ఆందోళన, చిరాకు, నిద్రలేమి, చెమటలు పట్టడం, ఎండను ఏమాత్రం తట్టుకోలేకపోవడం లాంటి మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా విడివిడిగా కనిపిస్తుండటంతో, చాలామంది వీటిని సాధారణ సమస్యలుగా భావించి, వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తుంటారు.స్టెరిస్ హెల్త్కేర్ ఛైర్మన్ జీవన్ కాస్రా అభిప్రాయం ప్రకారం, బరువు తగ్గడం, గుండె వేగం పెరగడం ఒకేసారి జరుగుతుంటే ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. జీవక్రియలు మితిమీరిన వేగంతో సాగడం వల్ల గుండెతో పాటు ఇతర అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ లక్షణాలు కేవలం థైరాయిడ్ వల్లనే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కూడా వచ్చే అవకాశం ఉన్నందున వైద్య పరీక్షలు తప్పనిసరి అవుతాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే, దీర్ఘకాలిక హృద్రోగ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.అయితే థైరాయిడ్ సమస్యను గుర్తించడం చాలా సులభమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా రక్తంలోని హార్మోన్ల స్థాయిలను కొలిచి, థైరాయిడ్ పనితీరును నిర్ధారించవచ్చు. వ్యాధి ముదరకముందే గుర్తిస్తే మందులు, జీవనశైలి మార్పులు, తగిన చికిత్స ద్వారా హార్మోన్ల ఉత్పత్తిని అదుపులోకి తెచ్చి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో చోటుచేసుకునే చిన్న మార్పులైనా అవి నిరంతరంగా కొనసాగుతుంటే, వాటిని విస్మరించకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడమే ఉత్తమం. ప్రారంభ దశలోనే స్పందించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడమే కాకుండా, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఐరాసలో భారత్ తటస్థం -
నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!
ఓ చిన్నారి పుట్టినప్పటి నుంచి అతడు / ఆమె నేర్చుకునే మొత్తం జీవన నైపుణ్యాల్లో దాదాపు 80 శాతానికి పైగా కంటిచూపు వల్లనే సాధ్యమవుతుంది. పైగా ఈ యుగంలోని చిత్రవిచిత్రాలన్నీ చూడాలంటే కన్నుంటేనే సాధ్యం. అందుకే ‘కన్నుంటేనే కలికాలం’ అన్న నానుడి స్థిరపడింది. జనసామాన్యంలోని ఈ మాటే ఈరోజుల్లో కంటికి ఉన్న ప్రాముఖ్యతనూ, ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతుంది. మరి ఇంతటి విలువైన కంటిచూపును ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు నేత్రదానం తర్వాత కంటి చూపు పొందడం సాధ్యమవుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పైగా ఈ కంటిదానం సమయంలో మొత్తం కనుగుడ్డును స్వీకరిస్తారనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. నిజానికి కార్నియా అనే పారదర్శకమైన పొర దెబ్బతినడం వల్ల వచ్చిన దృష్టిలోపాన్ని మాత్రమే నేత్రదానంతో సరిచేయడం సాధ్యమవుతుంది. పైగా ఇలా నేత్రదానం చేసిన కేసుల్లో కనుగుడ్డు మొత్తం కాకుండా కేవలం ‘కార్నియా’ అనే నల్లగుడ్డుపై ఉండే పోరనే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నేత్రదానమనేది ఎప్పుడెప్పుడు ఎంతమేరకు సాధ్యం? ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కంటి చూపును పొందడం ఏయే సందర్భాల్లో సాధ్యమవుతుంది? ఏయే సందర్భాల్లో అది సాధ్యం కాదు... అలా సాధ్యం కాక΄ోవడానికి కారణాలేమిటి... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం... ఈ కథనం. కంటితో చూడటాన్ని సాధ్యం చేసే కంటి నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను ‘కార్నియా’ అంటారు. నిజానికి నేత్రదానం చేసిన వారి నుంచి కంటిని తీసుకునే సమయంలో కనుగుడ్డునంతా స్వీకరించరు. కేవలం కార్నియా అని పిలిచే ఈ నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను మాత్రమే తీసుకుంటారు.కార్నియా అంటే..?ఇది కంట్లో ఉండే ఒక పారదర్శకమైన పొర. కంటిలోని నల్లగుడ్డుపై ఉండటం వల్ల... ఇది పారదర్శకమైన పొర కావడంతో ఇది కూడా నల్లగా కనిపిస్తుంది. ఇది కంట్లోని ఐరిస్ అనే భాగాన్ని, ప్యూపిల్నూ, యాంటీరియర్ ఛేంబర్ను కప్పి ఉంచుతుంది. ఇది బయటి నుంచి వచ్చే కాంతికిరణాలను కంటిపై పడేలా చూస్తూ... మొదట కంట్లోకి ప్రవేశించేలా... అటు పిమ్మట కంటి వెనక ఉండే పొర రెటీనాపై ప్రతిబింబించేలా చేస్తుంది. ఇది పారదర్శకంగా ఉంటేనే చూపు ఉంటుంది. ఇది పారదర్శకత కోల్పోవడం వల్ల చూపునూ కోల్పోవడం జరుగుతుంది. కార్నియా మార్పిడి చికిత్స అంటే..?కార్నియా గాయపడటం లేదా దెబ్బతినడం వల్ల కలిగిన అంధత్వాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. కార్నియా దెబ్బతినడం వల్ల ఎవరైనా కంటి చూపు కోల్పోతే... అలాంటి వారికి దెబ్బతిన్న కార్నియా స్థానంలో మంచి కార్నియాను అమర్చడం ద్వారా వారు కోల్పోయిన చూపును తిరిగి తెప్పించడం సాధ్యమే. అంటే కార్నియా దెబ్బతినడం వల్ల వచ్చిన అంధత్వానికి మాత్రమే కార్నియా ద్వారా చూపు తెప్పించవచ్చు. ప్రస్తుతానికి కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ఈ ప్రక్రియ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇప్పటికి ఇది మాత్రమే సాధ్యం. ఇంకా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటిచూపును ΄పొందేందుకు పెద్దగా అవకాశాలేమీ లేవు. అయితే కేవలం కార్నియల్ బ్లైండ్నెస్నే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ప్రయత్నాలూ, పరిశోధనలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.తొలిసారి కార్నియా మార్పిడి చికిత్స నేపథ్యమిలా... తొలిసారిగా కార్నియా మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ ఎడ్వర్డ్ జిమ్ అనే వైద్య నిపుణుడు 1905లో చేశారు. కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమయ్యే అవకాశాలు దాదాపు 90 శాతానికి పైగా ఉంటాయి. అయితే ఎవరైనా కళ్లు దానం చేసిన వ్యక్తి మరణించాక ఆరుగంటలలోపే అతడి నుంచి కార్నియాను స్వీకరించి, ఐ–బ్యాంక్లో భద్రపరచాల్సి ఉంటుంది. అటు తర్వాత సేకరించినప్పటికీ అది కార్నియా మార్పిడికి ఉపయోగపడదు.కార్నియల్ బ్లైండ్నెస్కు దారితీసే పరిస్థితులు కంటికి అయ్యే గాయాల కారణంగా కార్నియా దెబ్బతినడం రసాయన ప్రమాదాలకు గురికావడంతో కార్నియా గాయపడటం లేదా కాలి΄ోవడం (కార్నియల్ బర్న్) పోషకాహార లోపం వల్ల కార్నియా దెబ్బతినడం (మరీ ముఖ్యంగా చిన్న వయసులో వైటమిన్ ఏ లోపం వల్ల) కంటికి... మరీ ముఖ్యంగా కార్నియాకు వచ్చే ఇన్ఫెక్షన్స్ (కార్నియల్ అల్సర్స్ – నిజానికి మిగతా కారణాల కంటే కార్నియల్ ఇన్ఫెక్షన్తోనే అంధత్వాలు వచ్చే అవకాశం ఎక్కువ) పుట్టుకతో లేదా జన్యుపరంగా వచ్చే కొన్ని రకాల సమస్యలు ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్లతో ఒకవేళ పైన పేర్కొన్న కారణాలతో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తే దాన్ని కార్నియా మార్పిడి (కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్) చికిత్సతో బాధితులకు చూపు తెప్పించవచ్చు.కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడెప్పుడంటే... కంటి చూపునకు సంబంధించిన కొన్ని సమస్యలున్నప్పుడు (ఆప్టికల్) : సూడోఫేకిక్ బుల్లోస్ కెరటోపతి, కార్నియల్ డీజనరేషన్, కెరటోకోనస్, కెరటోగ్లోబస్, కార్నియల్ డిస్ట్రఫీ వంటి కొన్ని కంటి సమస్యలు ఉన్నప్పుడు కంటిచూపును మెరుగుపరచడానికి. కంటిలోని భాగాలను సమీకృతంగా (ఇంటెగ్రల్గా) ఉంచడానికి (టెక్టానిక్) : ‘స్ట్రోమల్ థిన్నింగ్ డెస్మాటోసీల్’ అనే సమస్యలున్నప్పుడు కంటిలోని భాగాలను బయటికి రాకుండా నియంత్రించి వాటిని ఏకీకృతంగా లోపలే కలిపి ఉంచడానికి. చికిత్సలో భాగంగా చేసే ట్రాన్స్ప్లాంట్స్లో (థెరటిక్) : ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చికిత్సకు ఎంతమాత్రమూ సహకరించకుండా ఉండే కార్నియల్ భాగాన్ని తొలగించి, ఆ ప్రదేశంలో కొత్త కార్నియా ఉంచి చూపు తెప్పించడానికి. అందం కోసం (కాస్మటిక్): కంటి నల్లగుడ్డు భాగంలో తెల్లమచ్చలు ఉన్నప్పుడు...ఆ కార్నియల్ స్కార్స్ను తొలగించి, అందాన్ని ఇనుమడింపజేయడం కోసం.ఎవరెవరిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యం కాదంటే... కొందరిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చూపు తెప్పించడం సాధ్యం కాదు. అది ఎవరిలోనంటే... ∙రెటీనా లోపం లేదా ఆప్టిక్ నర్వ్ లోపంతో అంధత్వం వచ్చినవారు రెటినైటిస్ పిగ్మెంటోజా అనే కండిషన్ కారణంగా చూపు కోల్పోయిన వారు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చిన మాక్యులార్ డీజనరేషన్ అనే సమస్య కారణంగా చూపు పోగొట్టుకున్నవారు ∙ఆప్టిక్ అట్రోఫీతో బాధపడుతున్నవారు రాడ్ అండ్ కోన్ డిస్ట్రఫీ అనే జబ్బుల కారణంగా చూపు కోల్పోయిన వారు ∙నీటికాసుల (అడ్వాన్స్డ్ గ్లకోమా)తో కంటిచూపు కోల్పోయినవారు, కాంతికి స్పందించని (లైట్ పర్సెప్షన్ లేని) కళ్లలో ఈ చికిత్స సాధ్యం కాదు. ఇక్కడ పేర్కొన్న అన్ని సందర్భాల్లోనూ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఏమాత్రం ప్రయోజనం చేకూరదు.నేత్రదానం ఎందుకు చేయాలి? భారతదేశంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల మంది కార్నియల్ బ్లైండ్నెస్ కారణంగా అంధులుగా మారుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పైగా ప్రతి సంవత్సరమూ ఈ కార్నియల్ బ్లైండ్నెస్ కారణంగా ఏడాదికి 25,000 నుంచి 30,000 వరకు కొత్త కేసులు ఈ అంధుల జాబితాకు జత అవుతున్నాయన్నది మరో అంచనా. నేత్రదానం అంటే కార్నియాను ఇవ్వడం వల్ల వీళ్లకు అంధత్వాన్ని దూరం చేసి, కంటిచూపు ప్రసాదించవచ్చు. నిజానికి మన దేహంలోని కొన్ని కణజాలాలను కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. ఒకరి నుంచి దానంగా స్వీకరించిన కణజాలాన్ని వేరే చోట అమర్చగలగడం సాధ్యమవుతుంది. అందువల్ల అలాంటి కణజాలాలు అవసరమైనప్పుడు వాటిని దాత ఇచ్చినప్పుడే స్వీకరించడం సాధ్యమవుతుంది. అలాంటివాటిల్లో కార్నియా ఒకటి. ఒకవేళ పిల్లల్లో ఇలా కార్నియా లోపం వల్ల అంధత్వం వస్తే... ఆ పిల్లలకు తెలిసే ఒకే ఒక రంగు... నలుపు! ఈ రంగురంగుల ప్రపంచాన్ని వాళ్లు చూడటమే సాధ్యం కాదు. ఆ చిన్నారి జీవితాల్లోంచి ఆ నలుపును తొలగించి, వాళ్ల జీవితాలను రంగుల మయం చేయడానికి కార్నియాలు లభ్యం కావడమన్నది ఎంతగానో అవసరం. అందువల్ల వ్యక్తులంతా తమ మరణానంతరం కార్నియాను నిరుపయోగంగా మట్టిలో కలిసి΄ోయేలా చేయడానికి బదులు, వాటిని దానంగా ఇవ్వడం ద్వారా ప్రతి వ్యక్తీ మరో ఇద్దరికి చూపును తెప్పించే అవకాశం ఉంటుంది. అందుకే అలా కంటిచూపునకు దూరమైన వ్యక్తులకు ఈ లోకం చూపించడానికి నేత్రదానాలు పెరగడం ఎంతగానో అవసరం.నేత్రదానం చేయడానికి ఎవరెవరు అర్హులు ? ఏడాది వయసుకు పైగా ఉన్నవారెవరైనా తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి అర్హులవుతారు. అలాంటి వారిలో ఈ కింద పేర్కొన్న సమస్యలునప్పటికీ వారు తమ మరణానంతరం నేత్రదానం చేయవచ్చు. అవి... పాక్షికంగానే కనుచూపు ఉన్నవారు (పూర్ సైట్), ∙కళ్లజోడు వాడేవారు డయాబెటిస్తో బాధపడేవారు రక్తపోటుతో బాధపడేవారు (చక్కెర వ్యాధి, హైబీపీ ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు. ఇలాంటి రుగ్మతలు ఉన్నప్పటికీ నేత్రదానానికి వారు పూర్తిగా అర్హులే) రెటీనా లేదా ఆప్టిక్ నర్వ్ లోపం వల్ల అంధత్వం వచ్చినవారూ... వీరంతా ఎంతగా వయసుపైబడ్డవారైనప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు.కార్నియాల లభ్యత అవసరమైన మేరకు ఎందుకు ఉండటం లేదంటే? నేత్రదానం అని చెప్పే ఈ కార్నియా దానాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా జరగడం లేదనే చె΄్పాలి. దాంతో బాధితులకు అవసరమైనన్ని కార్నియాలు లభ్యం కావడం లేదు. చాలా అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని ఇవే... నేత్రదానం విషయంలో అవగాహనలోపం ∙నేత్రదానం తర్వాత కార్నియాలను నిలువ చేయడానికి అవసరమైననన్ని కేంద్రాలు (ఐ బ్యాంకులు) లేకపోవడం, నేత్రదానాన్ని ్ర΄ోత్సహించే వారి సంఖ్య అంతగా లేక΄ోవడం (మోటివేషన్ లేక΄ోవడం) సామాజిక, మతపరమైన కారణాలతో నేత్రదానానికి ముందుకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండటం.కార్నియా సేకరణ ఎలా జరుగుతుందంటే..? నేత్రదానం చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి మరణించిన వెన్వెంటనే... బంధుమిత్రులు ‘ఐ బ్యాంక్’కు సమాచారమివ్వాలి. ఎందుకంటే... మరణించాక ఆరు గంటలలోపే దాత నుంచి కార్నియాను సేకరించాలి. లేకపోతే ఆ కార్నియా నిరుపయోగంగా మారిపోతుంది. ఈలోపు ఐ–బ్యాంక్ నుంచి సిబ్బంది వచ్చే లోపు మరణించిన వ్యక్తి కళ్లపైన తడి దూదిని ఉంచాలి. ఆ గదిలో ఉన్న ఫ్యాన్ను స్విచ్–ఆఫ్ చేయాలి. మరణించిన వ్యక్తి తల భాగం మిగతా శరీరానికి ఆరు అంగుళాల ఎత్తుండేలా మృతుడి తలకింద తలగడ అమర్చాలి. ఐ–బ్యాంక్ సిబ్బంది వచ్చాక... ఇక్కడ పేర్కొన్నట్లుగా ఉంచిన మృతుడి పార్థివ శరీరంలోని కళ్లలోని కార్నియాతోపాటు 10 సి.సి.ల రక్తపు నమూనానూ సేకరిస్తారు. కార్నియా తొలగింపు తర్వాత ఐ–బ్యాంక్ సిబ్బంది ఆ ప్రదేశంలో కృత్రిమ కార్నియాను అమర్చి కంటి ఆకృతిలో ఎలాంటి తేడా కనిపించకుండా చూస్తారు.చూపు పొందడానికే అవకాశాలెక్కువ... కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కాకసోవడానికి అవకాశాలు చాలా తక్కువ. శస్త్రచికిత్స విజయవంతమై చూపు పొందడానికే అవకాశాలెక్కువ. ఈ మాట చె΄్పాల్సిన అవసరమేమిటంటే... సాధారణంగా మిగతా అవయావాల మార్పిడి తాలూకు శస్త్రచికిత్స చేసినప్పుడు శరీరం ఆ అవయవాలను అంత తేలిగ్గా తనవిగా ఆమోదించదు. తనది కాని బయటి పదార్థం (ఫారిన్బాడీ) పరిగణించి, దాన్ని రిజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లో అలాంటి అవకాశాలు చాలా తక్కువ. అందుకే దాదాపు 90 శాతం కేసులకు పైగా విజయవంతం అవుతాయి. పైగా పైన పేర్కొన్న రిస్క్ ఉన్నందున మిగతా అవయవ మార్పిడి శస్త్రచికిత్స కేసుల్లో శరీరానికి రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) తగ్గించడానికి ఇమ్యూనోసప్రెసెంట్ ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కార్నియాకు అలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది నేత్రదానం విషయంలో ఉన్న మంచి సౌకర్యం. కంటి ఆపరేషన్ అయినవాళ్లు కూడా నేత్రదానానికి అర్హులే.ఏయే సందర్భాల్లో రిస్క్ ఉంటుందంటే... కార్నియాను అమర్చే సమయంలో స్వీకర్త శరీరం దాన్ని స్వీకరించక΄ోవడం అన్న రిస్క్ చాలా తక్కువ. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రమాదం ఉండవచ్చు. అదెప్పుడంటే...అంటించిన గ్రాఫ్ట్ ఊడిపోవడం లేదా కదిలిపోవడం గ్రాఫ్ట్ తర్వాత కంటికి ఇన్ఫెక్షన్ రావడం కంటిలోని గుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల (గ్లకోమా) కుట్లు వేయడంలో కొన్ని సమస్యల కారణంగా కార్నియా వాపు వచ్చినప్పుడు.కార్నియా నిరుపయోగమని తేలితే...? కొందరు పెద్దమనసుతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ వాళ్ల కార్నియా నిరుపయోగం అని తేలితే... అప్పుడూ దాతల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు ఎయిడ్స్ రోగులు, హెపటైటిస్ బీ లేదా సీ ఉన్నవారి కార్నియాలు దానంగా స్వీకరించడానికి ఉపయోగపడవు. అయితే కొన్ని సందర్భాల్లో వారి నుంచి స్ల్కెరా వంటి కొన్ని కంటి భాగాలను గ్రాఫ్టింగ్ కోసం వాడుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో మానవాళికి ఉపయోగపడే కొన్ని పరిశోధనల కోసం కూడా ఆ కార్నియాలను ఉపయోగించుకోవచ్చు. అందుకే మరో బాధితుడికి అమర్చడానికి వీల్లేనంత మాత్రాన కార్నియా నిరుపయోగం అవుతుందనే అభి్ర΄ాయానికి రావద్దు. చివరగా... మరణానంతరం వృథాగా మట్టిలో కలసిపోవడం వల్లగానీ లేదా కట్టెపై కాలిపోవడం ద్వారాగానీ వృథాగా పోయే కార్నియాలను వీలైనంత ఎక్కవ మంది దానం చేస్తే... ఎంతోమంది చిన్నారులూ, పెద్దవారూ చూపు పొందేలా చేయవచ్చు. అందుకే కార్నియా దానాల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహనను పెంచుకోవడం ఎంతైనా అవసరమని గుర్తించాలి. ఎవరు నేత్రదానం చేయడానికి అర్హులు కారంటే... కొందరి నుంచి మరణానంతరం కార్నియా స్వీకరించడం కుదరకపోవచ్చు. వారు ఎవరంటే... నిర్దిష్టంగా ఏ కారణం వల్ల చనిపోయారో చెప్పలేని వారు రేబిస్, సిఫిలిస్, హెపటైటిస్, సెప్టిసీమియా, ఎయిడ్స్ వంటి జబ్బులతో చనిపోయిన వారి నుంచి కంటికి వచ్చే ఆక్యులార్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు... ఈ అందరి నుంచి కార్నియా స్వీకరించడం కుదరదు. అంటే వీళ్లు నేత్రదానానికి అర్హులు కాదు. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డిసీనియర్ కంటి వైద్య నిపుణులు నిర్వహణ: యాసీన్ (చదవండి: -
బతుకు తెరువుకు చదువొక్కటే ముఖ్యం కాదు!
మా అక్కయ్య వాళ్ళ బాబుకు 12 సంవత్సరాలు. అన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉంటాడు. బొత్తిగా లోకజ్ఞానం లేదు. చూడటానికి కూడా చాలా అమాయకంగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మొహంలో కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అయితే ఆ బాబుకు ఎలా వచ్చిందో కాని, సంగీతంలో చాలా మంచి నైపుణ్యం వచ్చింది. రకరకాల రాగాలు పలికిస్తుంటాడు, పాడుతూ ఉంటాడు. టి.వి.లో, రేడియోలో సంగీత కార్యక్రమాలంటే చాలా ఇష్టంగా వింటూ ఉంటాడు.వీడి టాలెంట్ చూసి మాకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసులు వారి కచేరీలకు వీడిని కూడా తీసుకుని తమ బృందంలో ఒక సభ్యుడిగా పెట్టుకుంటున్నారు. చదువులో పైకి రాలేదు కాని, ఇలా సంగీత వేదికల మీద పేరు తెచ్చుకుంటున్నాడు. అన్నింటిలో వెనుకబడిన మా బాబుకు ఇలాంటి సంగీత నైపుణ్యం ఎలా అబ్బిందో అర్థం కావడం లేదు! వీడి భవిష్యత్తును ఎలా మలచాలో తెలియక ఆందోళనలో ఉన్నాము. మీరే మంచి సలహా చెప్పగలరు.– రమణి, శ్రీకాకుళంరమణి గారూ! మానసిక శాస్త్రంలో చాలా అరుదైన ఒక విషయాన్ని బయట పెట్టినందుకు, మీకు నా ధన్యవాదాలు. ఇడియాట్ సావంట్ (IDIOT SAVANT) అనే అత్యంత అరుదైన, వ్యక్తులు కొందరు ఎక్కడో ఒక చోట మనకు కనబడుతారు. మీ అబ్బాయి కూడా ఈ కోవకు చెందినవాడే. బుద్ధిలో, లోకజ్ఞానంలో, చదువులో, లౌకిక విషయాల్లో మానవ సంబంధాల విషయాల్లో వీరు బాగా వెనుకబడే ఉంటారు. అయితే ఇలా ఏదో ఒక ప్రత్యేక విషయంలో, మిగిలిన వారికంటే చాలా ఎక్కువ నైపుణ్యం కలవారై ఉంటారు. ఇలాంటి పిల్లలలో కొందరు గణితంలో అద్భుత ప్రజ్ఞ ప్రదర్శిస్తే, మరికొందరు చిత్రకళలో, కొందరు సంగీతంలో మీ బాబు లాగా, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ఎవ్వరూ ఊహించలేనంత నైపుణ్యం ప్రదర్శిస్తారు. వీరి మెదడు పూర్తిగా వృద్ధి చెందక పోయినా, ఏదో ఒక భాగం, మామూలు కంటే అతి తక్కువగా వృద్ధి చెంది, ఆయా మెదడు భాగాల పనితీరునుబట్టి, అటు గణితం, సంగీతం, చిత్రలేఖనం, ఇలాంటి విషయాల్లో అత్యద్భుతమైన నైపుణ్యం కలిగేటట్లు చేస్తుంది. చరిత్రలో కిమ్ పీక్ (జ్ఞాపక శక్తి) స్టీఫెన్ విల్ట్ షైర్ (చిత్రలేఖనం), దెరెక్ (సంగీతం) లాంటి వీరు ఈ కోవకు చెందినవారే! ‘ఆటిజమ్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనయిన పిల్లలలో ఇలాంటి ప్రత్యేకమైన నైపుణ్యాలు కనపడే అవకాశముంది. ఇటీవలే ‘ఇడియాటిక్ సావంట్’ పేరు అభ్యంతరకరంగా ఉందని, దీనిని ‘సావంట్ సిండ్రోమ్’గా (savant syndrome) పేరు మార్చారు. ఇకపోతే, బతుకుదెరువుకు, జీవితంలో పైకి రావడానికి కేవలం చదువొక్కటే ముఖ్యం కాదు. సమాజంలో చదువు తక్కువైన చాలామంది ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నారో మనకు తెలిసిందే! మీ అక్కయ్య వాళ్లను అధైర్యపడ వద్దని చెప్పండి. ఆ బాబును, తననకు అబ్బిన సంగీతం విషయంలోనే, మరింత శిక్షణ ఇప్పిస్తే, అతడు భవిష్యత్తులో మంచిపేరు తీసుకురాగలడని నా నమ్మకం! ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
రంజాన్.... ఆరోగ్యం రీసెట్కు అద్భుత అవకాశం!
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ వచ్చేసింది. రోజంతా పచ్చినీళ్లు కూడా ముట్టకుండా నెల రోజులపాటు ఉపవాసం! మన జీర్ణ వ్యవస్థకు సుదీర్ఘమైన విశ్రాంతినిచ్చి...పునరుజ్జీవం కల్పించేందుకు అద్భుత అవకాశమిది. కానీ...ముస్లిం సోదరులు ఉపవాస దీక్షకు ముందు.. ఇలా ఆహారం తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసకుందామా..!.సమోసాలు, పకోడి, లస్సీ, చక్కెర దట్టించిన మసాలా టీ, బిర్యానీ, రోటీ, పరాటా.. హలీమ్ వంటివి రంజాన్ సమయంలో బాగా పాప్యులర్ అవుతూంటాయి. పండ్లు, ఖర్జురాలు తినేవాళ్లు ఉంటారు కానీ చాలామంది బిర్యానీల వంటివాటికి అదనంగా వీటిని స్వీకరిస్తూంటారు. ఫలితంగా రోజంతా ఉండే ఉపవాసంతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కాస్తా దెబ్బతింటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏడాది మొత్తమ్మీద పేరుకుపోయిన మలినాలను శరీరం పగలు మొత్తం శుభ్రం చేసుకుంటే... రాత్రికాగానే మళ్లీ అవే అనారోగ్య కారకాలను లోపలికి పంపిస్తున్నామన్నట. వీటన్నింటినీ జీర్ణం చేసేందుకు కాలేయం కాస్తా కష్టపడాలి. ఫలితంగా నిద్ర చెడిపోతుంది. నెలరోజులపాటు సాగే ఈ తంతు కారణంగా మలినాలను మొత్తం వదిలించుకునే బదులు కాలేయం మరింత ఎక్కువ శ్రమ పడుతుంది. రక్తంలో చక్కెర మోతాదులు తరచూ మారిపోతూండటం వల్ల నాడీ వ్యవస్థపై ఒత్తిడికి గురవుతుంది. ఉపవాసం పుణ్యమా అని పొట్ట తేలిక అయ్యే బదులు వేయించిన తిండి, చక్కెరలతో నిండిపోతూంటుంది.ఇలా చేస్తే మేలు...ఇఫ్తార్...ఖర్జూరం, నీళ్లళ్లతో మీ దీక్ష విరమణ చేపట్టండి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఖర్చూరాల్లో మెండు. డీహైడ్రైషన్ నుంచి కాపాడతాయి. వీటితోపాటు వేడి వేడి సూప్, ప్రొటీన్ కోసం కొంచెం మాంసం/చేప/కోడిగుడ్లు తీసుకోవడం మేలు. అలాగే.. ఉడికించిన కాయగూరలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కొంత మోతాదులో తినడం శరీరంలో మంట/వాపులను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మేలు చేస్తుంది. అవకాడో, ఆలివ్ ఆయిల్, బాదాం. జీడిపప్పు, వాల్నట్స్ వంటివి లేదంటే, గుమ్మడి/సూర్యకాంతి, అవిశ గింజల వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, ప్రొటీన్, ఫైబర్లు లభిస్తాయి.షుహూర్ (తెల్లవారుఝాము)ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యమివ్వండి. రోజంతా శక్తిని అందించేందుకు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మేలు. బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలు, చిలగడదుంపలు, క్యారెట్స్లు మాత్రమే కాదు... ఆపిల్స్, ఆరటిపండ్లు, నారింజ వంటి పండ్లు మేలు. చిటికెడు ఉప్పు కలుపుకుని నీళ్లు తాగాలి. ఉప్పు ఎక్కువగా ఉన్న, బాగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వల్ల దాహం ఎక్కువ అవుతుంది.రెండింటి మధ్య...నిద్రకు ప్రాధాన్యమివ్వండి. రాత్రి ఎక్కువ సేపు మేలుకుని ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగిపోయి మంట/వాపులు పెచ్చరిల్లుతాయి. ఇఫ్తార్ విందు తరువాత కాసేపు అటు ఇటు కదలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అద్భుతమైన అవకాశం...రంజాన్ మాసం... దైవిక సేవతోపాటు మీకు మీరు సేవ చేసుకునేందుకు ఉపయోగించుకునే అద్భుత అవకాశం. అయితే ఉపవాసం ఒక్కటే సరిపోదు. శరీర హీలింగ్కు అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది అంతే. ఇక్కడ ఉపవాసాన్ని మీరెలా చేస్తున్నారనే దానిపై శరీరానికి కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ముస్లిం సోదరులు ఏటా ఒక నెల రోజులపాటు పైన చెప్పుకున్న ఆహార నియమాలను పాటిస్తే.. మిగిలిన 11 నెలలూ శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. ముస్లిం సోదరులు ఒక్కరే కాదు... మిగిలిన వారు కూడా అప్పుడప్పుడు కొంత కాలం పాటు ఉపవాసం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. - మైక్ ఎన్డీగ్వా, నేచురల్ హెల్త్ గైడ్ -
సింకోప్.. పడి లేచే ప్రమాదం
ఫెయింట్ అయిపోవడం అనే మాట చాలామంది వినే ఉంటారు. తెలుగులో చెప్పాలంటే స్వాధీనం తప్పిపోవడం. ఇది స్పహతప్పి అలాగే ఉండిపోవడం కాదు...కాసేపట్లో మళ్లీ మామూలైపోవడం. ఇలా స్వాధినం తప్పిపోయి... కొద్దిక్షణాల్లోనే మళ్లీ మామూలైపోవడాన్ని వైద్యపరిభాషలో ‘సింకోప్’ అంటారు. అయితే కొద్దిసేపట్లోనే మళ్లీ మామూలైపోయినప్పటికీ ఇలా జరగడం కొన్నిసార్లు ప్రమాదాలకూ దారితీయవచ్చు. ఉదాహరణకు ఏ వాహనం నడుపుతున్నప్పుడో ఇలా జరిగితే అది పెను ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. ఈ సమస్యకు చాలా కారణాలుంటాయి. సింపుల్గా దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గిపోవడం (డీహైడ్రేషన్) మొదలుకొని వేగస్ నరం అతిగా స్పందించడం వరకు అనేక కారణాలతో వచ్చే ఈ ‘సింకోప్’ సమస్యపై అవగాహనతో పాటు దీనికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం.కొందరు ఏదైనా తట్టుకోలేని దృశ్యం చూడగానే స్పృహ తప్పినట్లుగా అయిపోతారు. మరికొందరిలో వారి ఆందోళన స్థాయి మితిమీరిపోతే వెంటనే స్వాధీనం తప్పి పడిపోతారు. ఎందుకిలా అవుతుంది. ఎందుకంటే... గుండె స్పందనల లయ (రిథమ్)లో ఏమాత్రం తేడా రాకూడదు. స్పందన పెరిగినా, తగ్గినా అది ప్రమాదకరమే. గుండె స్పందనలు తగ్గడంతో... మన దేహంలో అత్యంత కీలక అవయవమైన మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు స్పృహ తప్పి పడిపోయే కండిషన్ను సింకోప్ అంటారు. ఇది సాధారణంగా చాలాసార్లు నిరపాయకరమే అయినప్పటికీ... కొన్నిసార్లు మాత్రం అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. సింకోప్ లక్షణాలు, నివారణ, చికిత్సలేమిటో చూద్దాం.సింకోప్లో రకాలున్యూరల్లీ మీడియేటెడ్ : బాగా తీవ్రమైన నొప్పి రావడం లేదా చాలా ఎక్కువగా భావోద్వేగాలకు గురికావడం, అత్యంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల. సింకోప్ కండిషన్ రావచ్చు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ : దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గడం వల్లగానీ లేదా ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి వల్ల అకస్మాత్తుగా ఒక్కసారిగా రక్తపోటు (బ్లడ్ప్రెషర్) తగ్గిపోవడం వల్ల. కార్డియాక్ సింకోప్ : గుండె రిథమ్లో తేడా రావడం వల్ల (అరిథ్మియా అనే కండిషన్లో) గుండెవేగం పెరగడమో లేదా తగ్గడమో జరిగినప్పుడు. సిచ్చువేషనల్ సింకోప్ : గట్టిగా దగ్గడం లేదా మింగడం లేదా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్వాధీనం తప్పిపోవడం.సింకోప్ కారణమయ్యే మెకానిజమ్ 1) మెదడుకు గుండెనుంచి తగినంత రక్తం అందకపోవడం / గుండె తగినంత రక్తాన్ని మెదడుకు అందించలేకపోవడం.2) గుండె పంపింగ్ సరిగా ఉన్నప్పటికీ మెదడుకు ఆ రక్తం అందడానికి అవసరమైన బ్లడ్ప్రెషర్ను మెయిన్టెయిన్ చేయడానికి సదరు రక్తనాళానికి తగినంత సామర్థ్యం లేకపోవడం.3) రక్తనాళానికి సామర్థ్యం ఉన్నప్పటికీ రక్తనాళంలో తగినంత రక్తం లేకపోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటిగానీ, లేదా ఒకటి కంటే ఎక్కువగా అంటే... ఏవైనా రెండు కారణాల వల్ల గానీ ఇలా జరగవచ్చు.ఎందుకిలా జరుగుతుందంటే... గుండె ఒక కండర నిర్మితమైన ఒక ఎలక్ట్రిక్ పంపు లాంటి అవయవం అన్న విషయం తెలిసిందే. ఎస్ఏ నోడ్ (సైనో ఏట్రియల్ నోడ్) అనే ఒక కీలకమైన చోటి నుంచి గుండె స్పందించడానికి అవసరమైన కరెంటు మన శరీరంలోనే నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ సరఫరాలో తేడాల వల్ల ఒక్కోసారి గుండె కండరాలు వేగంగానైనా కొట్టుకోవచ్చు లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా స్పందనలు తగ్గవచ్చు. కార్డియాక్ సింకోప్లో ఇలా జరుగుతుంది.వేగం పెరిగితే... కొన్ని సార్లు గుండె స్పందనల్లో వేగం బాగా పెరిగిపోయి ‘టాకికార్డియా’ అనే కండిషన్ ఏర్పడుతుంది. దీని వల్ల గుండె పై గదుల్లోగాని, కింది గదుల్లోగాని వేగం పెరుగుతుంది. అంటే గుండెలో పంప్ చేయడానికి అవసరమైన రక్తం చేరుకోకముందే గుండె ముడుచుకోవడం... అంటే గుండె స్పందన జరుగుతుందన్నమాట. దాంతో గుండె నుంచి కీలకమైన అవయవాలకు అందాల్సినంత రక్తం రక్తనాళాల్లోకి వెలువడదు. ఈ టాకికార్డియా అనే కండిషన్ ఏ వయసు వారికైనా రావచ్చు.వేగం తగ్గితే... గుండె స్పందనల్లో వేగం తగ్గితే ఆ కండిషన్ను బ్రాడికార్డియా అంటారు. బ్రాడి... అంటే నెమ్మదించడం (స్లో కావడం). ఇక ‘కార్డియా’ అంటే గుండె అని అర్థం. గుండె స్పందనల వేగం తగ్గడం వల్ల కూడా కీలకమైన అవయవాలకు రక్తసరఫరా తగ్గుతుంది. మనుషుల్లో తమ వయసు పెరుగుతున్న కొద్దీ వారి గుండె స్పందనలకు అవసరమైన ఎలక్ట్రికల్ సరఫరాల్లో తేడాలు వస్తుండవచ్చు. లేదా కొందరిలో పుట్టుకతోనే గుండెలో బ్లాక్స్ ఉండవచ్చు. గుండెకు అవసరమైన ఎలక్ట్రిసిటీలో తేడాలు రావడం వల్ల వచ్చే సమస్య అన్నది గుండెలో బ్లాక్స్ ఉండటం వల్ల వచ్చే సమస్య కంటే వేరుగా ఉంటుంది.సింకోప్కు కారణాలుగుండె నిర్మాణపరమైనవి : కొన్నిసార్లు గుండెలో నిర్మాణపరంగా ఏవైనా తేడాలు ఉండటం వల్ల మెదడులాంటి కీలక అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవచ్చు. ఉదాహరణకు గుండె కండరాలు బలహీనంగా మారడంవల్లనో, లేదా కార్డియోమయోపతి అన్న కండిషన్లో సింకోప్ రావచ్చు.గుండె కవాటాల్లో మార్పులు : గుండె కవాటాలు రక్తాన్ని నిర్దిష్టంగా ఒకే దిశలో ప్రవహించేలా చూస్తుంటాయి. కొన్నిసార్లు గుండె కవాటాలు సన్నబడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్టెనోసిస్’ అంటారు. కొన్నిసార్లు అవి లీక్ కావచ్చు. ఇలా జరగడాన్ని ‘ఇన్సఫిషియెన్సీ’ లేదా ‘రీ–గర్జిటేషన్’ అంటారు. ఈ కండిషన్స్లో దేనివల్లనైనా సింకోప్ రావచ్చు.మితిమీరిన వ్యాయామం : కొందరు వ్యక్తుల్లో... అంటే మరీ ముఖ్యంగా క్రీడాకారులు / అథ్లెట్లలో గుండె కండరాలు మందం కావడం వల్ల కూడా సింకోప్ రావచ్చు. అతి వ్యాయామంతో గుండెపై విపరీతమైన భారం పడేలా పనిచేయించడం వల్ల ఈ కండిషన్ ఏర్పడే అవకాశముంది.పోష్చురల్ హైపోటెన్షన్ : కొన్ని సందర్భాల్లో పక్క మీద పడుకున్న వ్యక్తి స్థిమితంగా కాకుండా హాడావుడిగా లేదా అకస్మాత్తుగా నిల్చునప్పుడు... అతడి కదలికలకు తగ్గట్లుగా గుండె తన స్పందనలను అంతే వేగంగా పెంచుకోలేదు. దాంతో వేగంగా జరిగే శరీర కదలికకు అనుగుణంగా గుండె స్పందనవేగం పెరగకపోవడంతో... కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇలా జరగడాన్ని పోష్చురల్ హైపోటెన్షన్’ అంటారు.వేసోవేగల్ సింకోప్ : నరాల పనితీరు వ్యవస్థలో మన సంకల్పం లేకుండా దానంతట అవే జరిగేపోయేవి, మన సంకల్పంతో జరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండిటికీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ‘సింకోప్’ కండిషన్ వస్తుంది. వేగస్ అనే నరం గుండె వేగాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అది ఒక్కోసారి గుండె వేగాన్ని బాగా తగ్గిస్తుంది. ఇలా వేగస్ నరం వల్ల గుండె వేగం మందగిస్తే దాన్ని వేసోవేగల్ సింకోప్ అంటారు.తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ విపరీతమైన నొప్పి వేగస్ నరాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన / విపరీతమైన ఒత్తిడులు (సివియర్ స్ట్రెస్) కూడా వేగస్ నరాన్ని ప్రేరేపిస్తాయి. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు కొందరు స్పృహ తప్పడానికి కారణం కూడా ఈ సింకోపే. కొందరు రక్తం చూసినప్పుడు లేదా కత్తులు– కటార్ల వంటి మారణాయుధాలు చూసినప్పుడు కూడా ఇలా స్పృహ తప్పడం దీనివల్లనే.పేగుల కదలికలు తగ్గడం : కొందరిలో జీర్ణక్రియలో జరుగుతుండే పేగుల కదలికలు (బవెల్ మూవ్మెంట్స్), విపరీతంగా తగ్గడం కూడా వేగస్ నరం మీద ఒత్తిడి కలిగింవచ్చు. అప్పుడు కూడా సింకోప్ కండిషన్ వస్తుంది.అకస్మాత్తుగా తల తిప్పడం వల్ల...కొందరు అకస్మాత్తుగా తలతిప్పడం వల్ల వేగస్ సరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ వెంటనే అది మళ్లీ సింకోప్ కండిషన్కు దారితీస్తుంది.రక్తహీనత.. అనీమియా అనే రక్తహీనత కండిషన్ కూడా సింకోప్కు కారణం. అనిమియా కండిషన్లో రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో కూడా సింకోప్ రావచ్చు. శరీరంలో నీరు / ద్రవాలు తగ్గడం : ఒక్కోసారి దేహంలో నీరు / ద్రవాలు తగ్గడం (డీ–హైడ్రేషన్) వల్ల కూడా సింకోప్ రావచ్చు. కొందరిలో చాలా ఎక్కువగా వాంతులు కావడం వల్లగానీ లేదా నీళ్ల విరేచనాల (డయేరియా) వల్ల గానీ లేదా విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలో దేహంలో నీటి / ద్రవాల మోతాదులు తగ్గవచ్చు. డయాబెటిస్ సమస్య ఉన్న కొందరిలో వారు మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సిరావడం వల్ల కూడా వాళ్ల శరీరం డీ హైడ్రేషన్కు లోనుకావచ్చు. ఈ కండిషన్లు కొందరిలో సింకోప్కు దారితీసేందుకు అవకాశముంది. చికిత్ససింకోప్ అన్న కండిషన్ నిజానికి అంత సీరియస్ కాదు. కానీ ఇలా ఫెయింట్ కావడం తరచూ జరుగుతుంటే మాత్రం సింకోప్ను నిర్లక్ష్యం చేయడమన్నది ఏమాత్రం తగదు. ఏవైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యల (అండర్లైయింగ్ కాజెస్) వల్ల ఇలా జరుగుతుందేమో చూసేందుకు అవసరమైన వైద్యపరీక్షలు జరపాలి. ఇందుకోసం తొలుత డాక్టర్ సలహా తీసుకుని, బాధితుడికి చికిత్స అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇతరత్రా సమస్యలతో (అండర్లైయింగ్ కాజెస్తో) ఇలా జరుగుతుంటే మాత్రం బాధితుడికి అవసరమైన చికిత్స అందించాలి. సింకోప్ అన్నది ఒకసారి స్వల్పంగా వచ్చి, దాని వల్ల ఎలాంటి గాయాలు జరగకపోతే ప్రైమరీ మెడికల్ కేర్ సెంటర్లో డాక్టర్లు కూడా సాధారణ చికిత్స అందించవచ్చు. అయితే సరిగ్గా నాడిగానీ, శ్వాసగానీ అందని పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి పరిగణించి వెంటనే పెద్ద హాస్పిటల్స్కు (టెరిషియరీ హెల్త్ కేర్ సెంటర్కు) తరలించాల్సి ఉంటుంది.గుండె స్పందనల లయ (రిథమ్)లో మార్పులు వచ్చిన వారికి, గుండె స్పందనల వేగం తగ్గిన వారిలో కొందరికి పేస్ మేకర్ అమర్చాల్సి రావచ్చు. ఈ పేస్మేకర్ అనేది గుండె స్పందనల వేగం తగ్గడాన్ని... అంటే ‘బ్రాడీకార్డియా’ను ముందుగానే పసిగట్టి... గుండె స్పందనల వేగం తగ్గిపోకుండా చూస్తుంది. ఇలా పేస్ మేకర్ అన్నది తగ్గిపోయే గుండె స్పందనలను మళ్లీ మామూలయ్యేలా (నార్మల్గా స్పందించేలా) చేసేందుకు వాడే ఒక ఉపకరణం. అలాగే టాకీకార్డియా కండిషన్లో ఒక షాక్ ద్వారా గుండె స్పందనలు మళ్లీ నార్మల్ అయ్యేలా చూడటం; అలాగే ఇది గుండెలో పైన, కింద ఉండే గదులు కదలికలు సమన్వయంతో జరిగేలా చూడటం; గుండెలోని ఎడమ, కుడి భాగాలు స్పందనల్లో సమన్వయం ఉండేలా చూడటం వంటి పనులనూ చేస్తుంది.చదవండి: గుండె జబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?ఈ పనులన్నింటినీ పేస్ మేకర్ సహాయంతో జరిగేలా చూసే/ చేసే చికిత్సను ‘కార్డియాక్ రీ–సింక్రనైజేషన్ థెరపీ’ (సీఆర్టీ) అని అంటారు. గుండె లయలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడానికి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ మేకర్లలో కూడా తాత్కాలికంగా అమర్చేవి, శాశ్వతంగా అమర్చేవి అని రెండు రకాలుగా ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు అవసరమైనవారు (సాధారణంగా ‘బ్రాడీ–కార్డియా’ సమస్య ఉన్నవారు) దీన్ని వాడాల్సి ఉంటుంది. పేస్మేకర్ అమర్చాక పేషెంట్స్ తాము అంతకుమునుపు చేసే రోజువారీ పనులన్నింటినీ నార్మల్గానే చేసుకోవచ్చు.తక్షణం అందించాల్సిన సపర్యలు∙సింకోప్కు గురైన వ్యక్తిని కాస్తంత చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి సౌకర్యంగా పడుకోబెట్టాలి. లేదా అతడి తల రెండు మోకాళ్ల మధ్య ఉండేలా చూస్తూ రిలాక్స్డ్గా కూర్చోబెట్టాలి.∙అలా పడుకోబెట్టడం / కూర్చోబెట్టడం జరిగాక... అతడు స్పృహలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కాస్తంత ఉప్పు కలిపిన ద్రవాన్నిగానీ లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని గానీ నెమ్మదిగా తాగించాలి. ఒకవేళ రక్తపోటు పడిపోవడం (హైపోటెన్షన్) వల్ల సింకోప్ ఏర్పడితే... ఇలా చేయడం వల్ల బాధితుడు మామూలుగా మారిపోతాడు.నివారణ : నిజానికి సింకోప్కు దారితీసే అసలు కారణాలను కనుగొంటే అందుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవచ్చు. ఉదాహరణకు... వేసోవేగల్ నరం అతి స్పందన వల్ల ఈ సమస్య వస్తుంటే దానికి కారణాలు కనుగొని చికిత్స అందించడం వల్ల ఆ తర్వాత వచ్చే సింకోప్లను నివారించవచ్చు. అకస్మాత్తుగా లేవడం, అకస్మాత్తు కదలికల వల్ల వచ్చే పోష్చురల్ హైపోటెన్షన్ సింకోప్ను అకస్మాత్తు కదలికలు లేకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఉదాహరణకు పక్క మీద నుంచి లేచేప్పుడు మెల్లగా లేవడం, వెంటనే నిలబడకుండా కొద్ది సేపు కూర్చోవడం.. ఇలా కదలికలు క్రమంగా ఉండేలా చూసుకోవడంతో ఈ తరహా సింకోప్ రాకుండా చూసుకోవచ్చు. ఇది డీ హైడ్రేషన్ సమస్య వల్ల వస్తే తగినన్ని ద్రవాలు అందేలా చూసుకోవడం వల్ల కూడా సింకోప్ను నివారించవచ్చు.చివరగా...ప్రతినిత్యం తగినన్ని నీళ్లు తాగుతూ, అన్ని రకాల పోషకాలనూ తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నవారిలో సింకోప్ సమస్య చాలా అరుదు. అందుకే అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఉండటం అన్నది కేవలం సింకోప్ నివారణకు మాత్రమే కాకుండా అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండటానికీ దోహదపడుతుందని గుర్తుంచుకోవాలి.నిర్వహణ: యాసీన్ -
చిత్తూరు జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య
చిత్తూరు నగరానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు ధనవంతుడు. కార్లల్లో షికారు చేసినవాడు. ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవారు. అలా దర్జాగా బతికిన ఆ వ్యక్తి చివరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక కష్టాలను అధిగమించలేక.. మత్తుకు బానిసయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. కుటుంబసభ్యులు వైద్యం చేయించినా నయం కాకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగి తాగి మతిపోగొట్టుకున్నాడు. ప్రవర్తనలో మార్పులు చూసిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా మందులు, మాత్రలు వాడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నిలకడగా ఉంటూ సొంత పనులు చేసుకుంటున్నాడని, మళ్లీ మద్యం జోలికెళితే, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.చిత్తూరు జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశి్చతి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. ఆత్మహత్యలు... చివరి ఫలితం ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు. తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. నిద్రలేమి సమస్యలు మనిíÙని తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మద్యానికి బానిసవుతున్నారు. సెల్ఫోన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది . ఆర్థికంగా రాణించకపోవడం వంటి సమస్యలు మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి మనిషిని చంపేసేంతగా పనిచేస్తున్నాయి. ఇటీవల కొన్ని ఘటనలను ఆధారంగా తీసుకుని ప్రజలు మేల్కొవాలి. మానసిక సమస్యలుంటే.. వెంటనే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోండి. – దినేష్, మానసిక వైద్య నిపుణులు, -
14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..
వెయిట్లాస్ జర్నీలో అనేది శారీరక, భావోద్వేగ ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం అని అంటోంది ఓ డాక్టర్. తాను ప్రెగ్నెన్సీ అనతరం ఎంతలా బరువు పెరిగిందో సవివరంగా తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఎంతలా శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కుందో తెలిపింది. ఆఖరికి వెయిట్లాస్ మందులు సైతం పెద్దగా ఫలితం ఇవ్వకపోగా..చివరికి దుష్ప్రభావాల బారినపడి ఎంతలా ఇబ్బందిపడిందో పేర్కొంది. అయితే బరువు తగ్గాలంటే అచంచలమైన ఓపిక, స్థిరత్వం అత్యంత ముఖ్యమని అంటున్నారామె. అలా అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ..ఒకటిన్న ఏడాదిలోపు చాలా బరువు తగ్గగలిగానని అంటోంది. ఎవరా డాక్టర్..? ఆమె వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..చెన్నైకి చెందిన వైద్యురాలు ప్రీతి మృణాళిని తన వెయిట్లాస్ జర్నీ గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన లాపరోస్కోపిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళినికి వైద్యురాలిగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె ప్రసవం తర్వాత తన బాడీ ఎలా మారిపోయిందో వివరించారు. 2021లో గర్భందాల్చినప్పుడు తన బరువు 78 కిలోలని పేర్కొంది. అయితే 2022లో ప్రసవం అనంతరం 79 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులోనూ సీ సెక్షన్ కారణంగా ఒక నెలపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడంతో విపరీతమైన ఆకలి విపరీతంగే వేసేదని, దాంతో 92 కిలోలు దాక పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఉయం మేల్కొని వ్యాయామాలు చేస్తూ ఉండేదాన్ని..అయితే బరువులో మార్పు లేకపోగా..మరింత అధికమైంది. ఈ అధిక బరువు తన రూపంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అంటోంది. అప్పుడే జీఎల్పీ 1 అనే బరువు తగ్గించే మందులను వాడినట్లు తెలిపారు. దాంతో మార్పు కనబడటం మొదలైది కానీ ఒక కిలోనే తగ్గానని అన్నారు. అయితే ఈ డ్రగ్ కారణంగా జుట్టు రాలిపోవడం, నోరు పొడిబారడం, వ్యాయమం సమయలో కండరాల అలసట తదితర సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే చాలా ఓపికతో తన జీవనశైలిని మార్చుకుని..బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టి సుమారు 14 కిలోలు తగ్గినట్టు తెలిపారు. సమారు ఏడాదిన్నరకి మంచి ఫలితాన్ని అందుకోగలిగానని అన్నారు. డాక్టర్ మృణాలిని చెబుతోంది ఒకటే..బరువు తగ్గడంలో కావాల్సింది, ఓపిక, భావోద్వేగాన్ని నియంత్రించేలా స్థిరతత్వం అత్యంత ప్రధానమని అంటోంది. కాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..జీఎల్పీ 1 మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కడుపు నిండిపోయిన అనుభూతిని, జీర్ణక్రియను నెమ్మదింపచేసేలా సహజ హర్మోన్లా అనుకరించే మందు. కానీ ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో వాడాల్సి ఉందనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
గోధుమ/జొన్న/రాగులతో రోటీలు,దోసెలు.. లాభాలేమిటి? ఏ సీజన్లో ఏవి తినాలి?
పుల్కా కావచ్చు, చపాతీ కావచ్చు...ప్రస్తుతం ప్రతి రోజూ రోటీలను తినడం చాలా మంది ఆరోగ్యార్ధులకు అలవాటుగా మారింది. నిజానికి సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్ల స్థానంలో రోటీలు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా స్థిరపడుతున్న పరిస్థితుల్లో గోధుమలతో పాటు మరికొన్ని కూడా రోటీలు, దోసెల తయారీలో వినియోగిస్తున్నారు. అలాంటి వాటిలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను కూడా చేరుస్తున్నారు. సహజ ఆహారాన్ని ప్రోత్సహించే వైద్యులు కల్పిస్తున్న అవగాహన కూడా వీటి వినియోగాన్ని పెంచుతోంది.అయితే ఇప్పుడున్న అవగాహన ప్రకారం.. ఇవి కేవలం కేలరీలు లేదా ఫైబర్ గురించి మాత్రమే అనుకోకూడదు. నిజానికి శతాబ్దాల క్రితమే ఇవి మనకు ఆహారంలో భాగంగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి ముందు, వాతావరణానికి తగ్గట్టుగాస్థానికంగా భూమి ఏమి అందించింది? అనేదానిపైనా, శరీరానికి ఏమి అవసరమో దానిపైనా మాత్రమే ఆహారపు అలవాట్లు ఆధారపడి ఉండేవి. ఆ తర్వాత తర్వాత వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఆహారం అందుబాటులోకి రావడంతో... కాలానుగుణంగా తినడం అనే అలవాటు తగ్గిపోయింది.మరోవైపు గోధుమలు చిరుధాన్యాలు (బజ్రా, రాగి, జొన్న, మక్కీ) వంటి తృణ ధాన్యాలు పోషకాలతో నిండి ఉంటాయి పరిశోధనల ప్రకారం ఈ ధాన్యాలు ఫైబర్, విటమిన్లు తదితర ఆరోగ్యకరమైన సమ్మేళనాలను అందిస్తాయి, ఇవి మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వీటిని వినియోగించడంలో సీజన్లను దృష్టిలో పెట్టుకుంటేనే సంపూర్ణ ప్రయోజనాలు సిద్ధిస్తాయని సంప్రదాయ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ఈ ధాన్యాలను తీసుకుంటనే శరీరానికి మేలు చేస్తాయని అంటున్నారు.మన శరీరాలు వేడి సీజన్లో లేదా చలి కాలంలో ఆహారాన్ని వేర్వేరుగా జీర్ణం చేసుకుంటాయని ఆయుర్వేదం సహా సంప్రదాయ వైవ్య విధానాలు చెబుతున్నాయి. వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా...ఇలా జీర్ణక్రియ మార్పు చేర్పులతో శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ద్వారా, వాతావరణానికి సరిపోయే ధాన్యాలను మనం ఎంచుకోవచ్చు.గోధుమలు...మనం నిత్యం ఇష్టపడేవి గోధుమలతో చేసిన ఆహారం. ఇది వెచ్చదనం జీర్ణ ప్రక్రియలను సమతుల్యం చేస్తుంది. వసంతకాలంలో లేదా శీతాకాలం ప్రారంభంలో జీర్ణక్రియ నెమ్మదించినప్పుడు, గోధుమ రోటిలు కడుపుపై భారం పడకుండా శక్తిని, ఫైబర్, బి–విటమిన్లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అందిస్తాయి, బరువు పెంచకుండా రోజువారీ కార్యకలాపాలను కొనసాగించేలా చేస్తాయి.సజ్జలు...సజ్జలు ఆరోగ్యకరమైన ధాన్యరకమే కానీ దీనిది వేడెక్కించే స్వభావం దీని అధిక పోషక సాంద్రత, ఇనుము, మెగ్నీషియం, ప్రోటీన్ ఫైబర్ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. వెచ్చదనం శక్తిని అందిస్తాయి కాబట్టి చల్లని వాతావరణంలోనే వీటిని వినియోగిస్తారు.రాగులుప్రస్తుతం ఇడ్లీల నుంచి రోటీలు, దోసెల దాకా చేసేందుకు వాడే రాగులు (ఫింగర్ మిల్లెట్) కాల్షియం సూక్ష్మపోషకాలతో సమృద్ధికర ఆహారం. వేడి సీజన్లో ఉదరంలో తేలికగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి సీజన్లలో జీర్ణ మందగమనాన్ని నివారిస్తుంది. అనేక దక్షిణ భారత ప్రాంతాలు రాగులను వేసవిలో ప్రధాన ఆహారంగా చేయడానికి కారణం దాని చల్లబరిచే గుణమే.జొన్నలు..మక్కీ లేదా మొక్కజోన్న, జొన్న (జోవర్) రోటీలు తక్కువ గ్లైసెమిక్ ప్రభావాలు చూపిస్తూ బలమైన ఫైబర్ లను కలిగి ఉంటాయి. అవి బలమైన జీర్ణక్రియ, అధిక శ్రమ కలిగిన జీవనశైలులకు సరిపోతాయి, కానీ వాటిని కొవ్వులు లేదా కూరగాయలతో జాగ్రత్తగా జతచేయడం అవసరం. వేసవిలో చల్లదనాన్ని అందించే జొన్నలు.. శీతాకాలంలో కూడా ఉపయుక్తమైనవే.సంవత్సరమంతా ఒకే ధాన్యాన్ని తినడానికి బదులుగా, రుతువులకు అనుగుణంగా ధాన్యాలను ఆరగించడం శరీరానికి మంచిదని సంప్రదాయ వైద్య విజ్ఞానం స్పష్టం చేస్తోంది. -
గుండెజబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?
హార్ట్ఎటాక్ అంటే చాలామందికి ఆందోళన. కుటుంబంలో ఎవరికైనా లేదా చుట్టుపక్కల వాళ్లలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చి... నిన్నటి వరకూ తమతోనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మిస్ అయిపోవడం ఎందరికో విషాదంతో కూడిన ఆశ్చర్యకరమైన అంశం. అందుకే... గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటే బాగుండు అనే భావన. మరికొందరిలో... రక్తాన్ని పలచబార్చేవీ, గుండెనొప్పి అనిపించగానే నాలుక కింద పెట్టుకోమ్మని డాక్టర్లు చెప్పేవాటి గురించి విని... అలాంటి ఏవైనా మందులున్నాయనే అభిప్రాయం కూడా ఉంటుంది. నిజంగా గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటాయా అన్న విషయం గురించి అసలు వాస్తవాలేమిటో చూద్దాం.ఓ కేస్ స్టడీ... శ్రీధర్ వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే హార్ట్ ఎటాక్తో పోయారు. ఇటీవలే వాళ్ల చిన్నాన్నకు కూడా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకేమీ కాలేదుగానీ... ఒకటోసారీ, రెండోసారి హార్ట్ ఎటాక్ ఉపేక్షిస్తుందేమోగానీ మూడోసారి వచ్చిందంటే మాత్రం తప్పక ప్రాణాపాయం కలుగుతుందంటూ చుట్టుపక్కలవారు చెబుతుండటంతో అతడిలో ఆందోళన ఇంకా పెరిగిపోతోంది. అయితే శ్రీధర్కు ఇప్పటికైతే ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే అతడి వయసు నలభై ప్లస్. కుటుంబంలో చాలామందికి హార్ట్ ఎటాక్ రావడం, పైగా నాన్నగారు హార్ట్ ఎటాక్తో పోవడంతో వంశపారంపర్యంగా తనకూ హార్ట్ ఎటాక్ వస్తుందేమోనన్న ఆందోళన అతడిని నిలువనీయడం లేదు. దాంతో తమకు తెలిసిన కార్డియాలజిస్ట్ను సంప్రదించి... ‘‘మా నాన్నకూ, చిన్నాన్నకూ వచ్చినట్టుగా నాకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు మందులివ్వండం’’టూ డాక్టర్ను అడగసాగాడు.శ్రీధర్కు వచ్చిన సందేహమే చాలామందిలో ఉంటుంది. ‘‘గుండెపోటు వచ్చాక కొన్ని రకాల మందులు తీసుకోవడం తప్పదు కదా. అయితే... అసలది రాకుండానే నివారించుకునేందుకు మొదట్నుంచీ ఆ మందులు తీసుకోవచ్చా?... ఇలాంటి నివారణ మందులేమైనా ఉన్నాయా?’’ అనే సందేహం కొందరిలో మెదులుతుంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో గుండెపోటు వచ్చినవారుండటం... వారేవో కొన్ని రకాల మందులు వాడుతుండటంతో... అవే మందులు తామూ వాడితే గుండెపోటు రాదేమో అనే ఆలోచనా ఉంటుంది. ఎందుకంటే... ఒకసారి గుండెపోటుకు గురైనవారికి మళ్లీ అది రాకుండా ఉండేందుకు డాక్టర్లు కొన్ని మందులు సూచిస్తుంటారు. ఉదాహరణకు... అలాంటి పేషెంట్లు ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, రామిప్రిల్ వంటి మందులతో పాటు, బీటాబ్లాకర్, స్టాటిన్స్ వంటి మందుల్ని వాడుతుంటారు. దాంతో అవే మందుల్ని మనమూ తీసుకుంటూ ఉంటుంటే గుండెపోటును నివారించవచ్చు కదా అనే సందేహం రావడం చాలా సాధారణం.గుండెపోటు / గుండెజబ్బులకు అవకాశమున్నది ఎవరికంటే... కొందరిలో స్వాభావికంగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. కొన్ని అంశాలు గుండెజబ్బులు / గుండెపోటుకు ఆస్కారమిస్తాయి. వాటిని రిస్క్ఫ్యాక్టర్స్గా చెప్పవచ్చు. అవేమిటంటే... ఇవీ ఆ రిస్క్ఫ్యాక్టర్స్...వయసు : నలభై ఏళ్ల వయసు దాటాక గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. డయాబెటిస్ : చక్కెర వ్యాధి (మధుమేహం) ఉన్నవారిలో గుండె జబ్బులకు అవకాశాలెక్కువ. రక్తపోటు : అధికరక్తపోటు (హై–బీపీ) ఎక్కువగా ఉన్నవారిలో... కొలెస్ట్రాల్ : రక్తంలో చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వు పదార్థాలు నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా ఉన్నవారిలో. స్మోకింగ్ : పొగతాగే అలవాటు ఉన్నవారిలో. స్థూలకాయం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో గుండెజబ్బులూ / గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, నిద్ర సరిగా పోకపోవడం, తల్లిదండ్రులు లేదా తోడబుట్టినవాళ్లులో తక్కువ వయసులో హార్ట్ ఎటాక్ రావడం వంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్లే.పురుషుల్లో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ... మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులకు ముప్పు ఎక్కువ. మహిళల్లో రుతుస్రావం కొనసాగుతున్నంత వరకూ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా వాళ్లకు ఓ స్వాభావిక రక్షణ ఉంటుంది. అయితే మహిళల్లో రుతుస్రావం ఆగాక (మెనోపాజ్ తర్వాత) ఈస్ట్రోజెన్ స్రావాలు తగ్గుతాయి కాబట్టి.. ఆ దశ తర్వాత పురుషులకూ, మహిళలకూ గుండెపోటు వచ్చే అవకాశాలు సమానంగా ఉంటాయి.రామిప్రిల్ : ఈ మందు హైబీపీని (రక్తపోటును) తగ్గించి... తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత రామిప్రిల్గానీ... అలాంటి మరికొన్ని మందులుగానీ డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ముందుజాగ్రత్తగా ఆహారంలో ఉప్పు మోతాదు, కొవ్వు పదార్థాలు తగ్గించడం, మద్యపానం మానివేయడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, పచ్చికూరలు తీసుకోవడం వంటి సూచనలనూ ఈ మందు తీసుకుంటూ పాటిస్తుండాలి. బీటాబ్లాకర్స్ : ఒకసారి గుండెపోటు (Heart attack) వచ్చిన తర్వాత గుండె పంపింగ్ తగ్గినవారికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అయితే బీటాబ్లాకర్స్ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే... ఇవి వాడినప్పుడు రక్తపోటు (బీపీ) తగ్గే అవకాశముంటుంది. కాబట్టి బీపీని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ మందులతో నివారణ ఎప్పడూ... ఎలాగంటే... హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే : ఇవి సెకండరీ ప్రివెన్షన్ కోసం మాత్రమే. ఆస్పిరిన్ను సాధారణంగా... ఒకసారి గుండెజబ్బులు కనిపించిన వారికి మాత్రమే ఉపయోగిస్తారు. మునుపు డయాబెటిస్ ఉండి, గుండెజబ్బు లేనివారికి కూడా ప్రైమరీ ప్రివెన్షన్ కోసం ఆస్పిరిన్ను వాడేవారు. అయితే కొత్త పరిశోధనల ఆధారంగా ఇప్పుడు ఆస్పిరిన్ను కేవలం సెకండరీ ప్రివెన్షన్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. పై అంశాలు లేకపోతే ఆస్పిరిన్ వాడటం వల్ల ప్రయోజనం కంటే రిస్కే ఎక్కువ.మందులెప్పుడూ సెకండరీ ప్రిపెన్షన్గానే... ఆరోగ్య సమస్య ఏదీ లేనప్పుడు... అది రాకుండా చూసుకునేందుకు పాటించే నివారణ చర్యలను ప్రాథమిక నివారణ’ (ప్రైమరీ ప్రివెన్షన్) అంటారు. అయితే గుండెపోటుగాని, బ్రెయిన్స్ట్రోక్గాని ఒకసారి వచ్చాక... అది మళ్లీ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు తీసుకోవడం, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ మందులు తీసుకోవడాన్ని, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే పద్ధతిని ‘సెకండరీ ప్రివెన్షన్’గా చెబుతారు. సాధారణంగా మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైబీపీ) ఉందని బయటపడ్డ తర్వాత అది గుండెపోటుకు లేదా గుండెజబ్బులకు దారితీయకుండా కొన్ని రకాల మందులు వాడటం లేదా కొన్ని ఆరోగ్య నియమాలు పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చేస్తుంటారు. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్గా చెప్పవచ్చు. అసలు డయాబెటిస్గానీ లేదా రక్తపోటు (హైబీపీ)గానీ రాకుండా ముందుగానే జాగ్రత్త పడటం ‘ప్రైమార్డియల్ ప్రివెన్షన్’ అవుతుంది. ఈ ప్రివెన్షన్ ప్రైమరీ ప్రివెన్షన్ కంటే ఇంకా ముందు దశ. అంటే రిస్క్ ఫ్యాక్టర్లు కనిపించకముందే... నివారణ చర్యలు చేపట్టడం అన్నమాట. అంతేతప్ప... సెకండరీ ప్రివెన్షన్లో వాడే మందులను ముందునుంచే గుండెపోటు రాకుండా ఉండేందుకు వాడే మందులుగా పొరబడకూడదు.సెకండరీ ప్రివెన్షన్గా వాడే మందులివి... ఆస్పిరిన్: సాధారణంగా నొప్పుల నివారణకు వాడే ఆస్పిరిన్ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా సమర్థంగా ఉపయోగపడుతుంది. అలా పరచబార్చడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలుగా పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. అందుకే ఒకసారి గుండె΄ోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్ మాత్ర క్రమం తప్పకుండా వాడుతూనే ఉండాలి.అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... గుండెజబ్బు లేకుండానే ఆస్పిరిన్ వాడటం వల్ల అంతగా ఫలితమేమీ కనిపించదు. పైగా ముందునుంచే మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం పలచబారిపోవడం వల్ల ఏ చిన్నదెబ్బ లేదా చిన్నగాయానికైనా ఆగకుండా రక్తస్రావమై... ఆ కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొంతకాలం క్రితం డయాబెటిస్ ఉన్నవాళ్లకు గుండెజబ్బులు ఉన్నా లేకపోయినా ఆస్పిరిన్ ఇచ్చేవారు. కానీ... ఆ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని కొన్ని శాస్త్రపరిశోధనల్లో వెల్లడయ్యాక డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ కాకుండా కేవలం హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే ఆస్పిరిన్ సూచిస్తున్నారు.స్టాటిన్స్ : రక్తంలోని కొవ్వుల మోతాదులను తగ్గించే మందులివి. మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అయిన లో–డెన్సిటీ లైప్రొటీన్ (ఎల్డీఎల్) అనే కొవ్వులను తగ్గిస్తాయి. అందుకే గుండెపోటు వచ్చిన ప్రతివారికీ ఈ మందును జీవితాంతం సూచిస్తారు. అంతేకాదు... డయాబెటిస్ ఉన్నవారికి గుండెజబ్బుల ముప్పు కూడా పెరగడం వల్ల చక్కెర వ్యాధి ఉన్నవారు స్టాటిన్లు కూడా వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. చదవండి: ఫిట్స్తో ఎవరైనా పడిపోతే ఇలా చేయకండిఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... కేవలం రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాక... తక్కువ రిస్క్ ఉన్నవారికి సైతం స్టాటిన్స్ వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని తేలింది. దాంతో రక్త పరీక్షల్లో ‘హెచ్ఎస్ సిఆర్పీ’ విలువ – 2 ఎంజీ కంటే ఎక్కువగా ఉంటే గుండె΄ోటు లేనివాళ్లకూ గుండెజబ్బులను నివారించవచ్చని తేలింది. ‘సీటీ స్కాన్’తో చూసే ‘కరొనరీ క్యాల్షియమ్ స్కోర్’ ఎక్కువ ఉన్నప్పుడు కూడా డాక్టర్లు స్టాటిన్స్ను సూచిస్తారు. అందుకే స్టాటిన్స్ వాడాలంటే ముందుగా డాక్టర్ సూచనల మేరకు తగిన పరీక్షలు చేసి అవి తీసుకోవాలా లేదా అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.వ్యాయామంతో గుండెజబ్బులు దూరం ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం గుండెజబ్బులు / గుండెపోటుకు మంచి నివారణ అని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ వ్యాయామం కేవలం మొక్కుబడిగా కాకుండా... ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. కాకపోతే మరీ ఎక్కువగా శ్రమ కలిగించేలా ఉండకూడదు. అలాగని మరీ విశ్రాంతిగా కూడా ఉండకూడదు. శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలగని రీతిలో ఉండే బ్రిస్క్వాకింగ్, ఈత లేదా ఏదైనా స్పోర్ట్ వంటి వ్యాయామాలు మంచివి. మరీ ఎక్కువగా శ్రమ కలిగించేవి అకస్మాత్తుగా మొదలుపెట్టకూడదు. తీవ్రతను క్రమంగా పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఏయే కొలతలు ఎంతెంత ఉండాలంటే... గుండెజబ్బులు ఉన్నవారిలో రక్తపోటు విలువ 130/80 కంతే తక్కువగా ఉండాలి. కొలెస్ట్రాల్ మోతాదులు : రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్ మోతాదులు... 200 కంటే తక్కువ ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) మోతాదులు... 100 కంటే తక్కువ ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారికి 70 కంటే తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) మోతాదులు... 40 కంటే ఎక్కువగా ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ అనే రకం కొవ్వుల మోతాదులు... 200 కంటే తక్కువగా ఉండాలి. -
షుగర్ లెవల్స్ తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ తప్పనిసరి
మధుమేహ రోగులకు HbA1c పరీక్ష ప్రామాణికం. రక్తంలో చక్కెర స్థాయుల సగటు ఎంత ఉందో ఈ పరీక్షలో కచ్చితంగా తెలుస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఈ పరీక్ష ఫలితాలపై ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు... ప్రపంచవ్యాప్త వైద్యవిశేషాలతో ప్రచురితమయ్యే ప్రముఖ పత్రిక లాన్సెట్! భారతీయులు HbA1c పరీక్ష బదులుగా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గత కొద్ది నెలలుగా గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉన్న మధుమేహ రోగుల విషయంలో సాధారణంగా చేసే HbA1c పరీక్ష అత్యంత కచ్చితమైన పద్ధతి కాదనేది దేశంలోని పలువురు సుప్రసిద్ధ డయాబెటాలజిస్టుల తాజా వాదన. లాన్సెట్ పత్రికలో ‘ప్రాంతీయ ఆరోగ్యం: ఆగ్నేయాసియా (రీజినల్ హెల్త్: సౌత్ ఈస్ట్ ఆసియా) పేరిట ఈ అధ్యయన ఫలితాలు ఈ నెల 9న ప్రచురితమయ్యాయి. చక్కెర వ్యాధికి భారత్ రాజధాని. మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య దాదాపు 10.10 కోట్లు. వీరిలో చాలామంది తమ గ్లూకోజ్ స్థాయులు తెలుసుకోవడానికి HbA1c పరీక్ష చేయించుకుంటుంటారు. అయితే ఇండియాలో ఈ పరీక్ష స్పష్టమైన వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించడం లేదనే మరో కథనం కూడా ఇటీవల ‘లాన్సెట్’లో వచ్చింది.HbA1c పరీక్ష ఎందుకు?ఎర్ర రక్తకణాలు సుమారు మూడు మాసాలు జీవిస్తాయి. కనుక HbA1c లేదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్షను గత రెండు నెలలు లేదా మూడు నెలల కాలానికి రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తెలుసుకోవడానికి చేస్తారు. హీమోగ్లోబిన్ అనేది రక్తంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లే ప్రోటీన్. ఇది గ్లూకోజును అతుక్కుని ఉంటుంది. HbA1c టెస్టులో హీమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షిస్తారు. HbA1c స్థాయి 5.7 శాతం కంటే తక్కువ ఉంటే డయాబెటిస్ లేనట్టు. అది 5.7-6.4 శాతం మధ్య ఉంటే ప్రీ-డయబెటిస్ కింద లెక్క. 6.5 శాతాన్ని మించితే సుగర్ వ్యాధి ఉన్నట్టు పరిగణిస్తారు. రక్తంలో చక్కెర నియంత్రణ, HbA1c లెవల్స్ మధ్య గల లింకు గురించి 1976లో తెలిసినప్పట్నుంచి ‘గ్లైసెమిక్ కంట్రోల్’ పరిశీలనకు సంబంధించి HbA1c అనేది ‘స్వర్ణ ప్రామాణిక పరీక్ష’ తరహాలో ఓ గీటురాయిగా మారింది. ఇది ఓ స్థిరమైన ముందస్తు విశ్లేషణతో కూడిన పరీక్ష. 2010లో దీన్ని ఓ డయాగ్నొస్టిక్ విధానంగా కూడా ప్రతిపాదించారు. పరగడుపున సేకరించే రక్త నమూనా కోసం సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా HbA1c విధానంలో రోగి ఏమీ తినకుండా ‘ఉపవాసం’ పాటించాల్సిన అవసరం లేదు.HbA1cలో కచ్చితత్వం ఉండదా?పరిశోధకులు ఈ సందర్భంగా వివిధ పద్ధతుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను కొలిచి, వాటిని పోల్చుతూ పలు అధ్యయనాలతో సమీక్షించారు. దక్షిణ భారత దేశంలో ఇటీవల 1,120 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో HbA1c పరీక్ష (45.4%)తో పోలిస్తే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (87.8%) (OGTT)లో ఎక్కువ ప్రీ-డయాబెటిస్ కేసులు నమోదయ్యాయి. (ప్రీ-డయాబెటిస్ అంటే మధుమేహం త్వరలో రాబోతోందని తెలిపే ఓ ముందస్తు సూచిక. ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, మద్యం- ధూమపానం మానివేయడం, జీవన శైలిని మార్చుకోవడం వంటివి పాటించకపోతే అనతి కాలంలోనే వారికి అతిదాహం-అతిమూత్ర వ్యాధి ఖాయం!). పుణెలో 116 మంది యువతపై నిర్వహించిన ఓ స్టడీలో 23.3% ప్రీ-డయాబెటిస్ కేసుల్ని HbA1c పరీక్ష గుర్తించగా, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) మాత్రం 7.8% కేసుల్లో మాత్రమే ప్రీ-డయాబెటిస్ ఉన్నట్టు తేల్చింది. ఆయా వ్యక్తుల్లో ఎర్ర రక్తకణాల స్థాయులు, వాటి జీవితకాలం, అవి గ్లూకోజుతో అంటిపెట్టుకొని ఉండే అంశాల కారణంగానే ఈ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. “HbA1c స్థాయులపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఐరన్ (ఇనుము) కొరతతో తలెత్తే రక్తహీనత (అనీమియా) లేదా జీ6పీడీ (ఎర్ర రక్తకణం ఎంజైమ్) కొరత వల్ల రక్తకణాలు విచ్ఛిన్నమవుతాయి. ఇటువంటి పరిస్థితులు హీమోగ్లిబిన్ లెవల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా HbA1c లెవల్స్ మారతాయి” అని ఫోర్టిస్ సి-డాక్ సెంటర్ ఫర్ డయాబెటిస్ ఛైర్మన్, పరిశోధన పత్రం రూపకల్పనలో పాలుపంచుకున్న రచయితల్లో ఒకరైన డాక్టర్ అనూప్ మిశ్రా వ్యాఖ్యానించారు.దేశంలో అనీమియా వ్యాప్తి అధికంగా ఉందని, దీంతోపాటు కొన్ని జన సమూహాల్లో తలసేమియా (దేహంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తయ్యే అనువంశిక రక్తసంబంధ రుగ్మత), సికిల్ సెల్ (హీమోగ్లోబిన్ సంబంధిత వంశపారంపర్య రుగ్మత) వంటి హీమోగ్లోబినోపతీస్ (జన్యుపరమైన అనువంశిక వ్యాధులు) ఉన్నాయని లీలావతి ఆస్పత్రి వైద్యుడు, అధ్యయనకర్తల్లో ఒకరైన శశాంక్ జోషి తెలిపారు. అలాగే మలేరియా కేసులు కూడా వ్యాప్తిలో ఉన్నాయని, ఇవన్నీ హీమోగ్లోబిన్ స్థాయులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇటువంటి స్థితిలో HbA1c లెవల్స్ కచ్చితమైన ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. నిపుణుల సలహా ఏమిటంటే... మధుమేహ రోగులకు HbA1c పరీక్ష కంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ ఉత్తమం. HbA1c పరీక్ష అక్కర్లేదని, వారంలో రెండు లేదా మూడు సార్లు వంతున కొంతకాలం పాటు రక్తపరీక్ష చేయించుకుంటే షుగర్ లెవల్స్ సంగతి ఇట్టే తెలిసిపోతుందని డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో HbA1c పరీక్ష రుసుము సుమారు రూ.600గా ఉంది. - జమ్ముల శ్రీకాంత్(Credits: The Lancet, The Indian Express, Hindustan Times, The Economic Times, ET Health World, NDTV) -
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్లాస్ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు. ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్ష్ త్రిపాఠి కొలెస్ట్రాల్ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్ చేసుకున్నాడు. తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. ప్రధాన నియమం..కొలెస్ట్రాల్ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..? అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్ అవ్వకూడదు. ఆహారంలో ఉండాల్సినవి..తప్పనిసరిగా సగం కూరగాయల్లో 1/4 వంతు ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.ప్రోటీన్ తప్పనిసరి..ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .కూరగాయలు తప్పనిసరి..ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయికార్బోహైడ్రేట్ నియంత్రణ నియమంమన ఆహారంలో కార్బోహైడ్రేట్లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. కొవ్వు/నూనె నియమండైట్ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.గుర్తించుకోవాల్సిన విషయాలుశాఖాహారుల కోసం, కొవ్వు తగ్గింపు ప్లేట్లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు, 1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.అలాగే నాన్-వెజ్ ప్లేట్లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.అల్పాహారం ప్లేట్లలో తక్కువ కార్బోహైడ్రేట్లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు.చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్ చేసుకోండి. ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్ని ముగించాడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ త్రిపాఠి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!) -
ఫిట్స్ వస్తే.. ఏం చేయాలి?
ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధిని చాలా సాధారణ సమస్యగా పరిగణించాలి. చికిత్సతో పూర్తిగా తగ్గే సమస్య ఇది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 9) ఎపిలెప్సీ డే (International Epilepsy Day) సందర్భంగా ఫిట్స్పై అవగాహన కోసమే ఈ కథనం. 90 శాతంలో పూర్తి తగ్గుదల 10 శాతంలోనే మాటిమాటికీ... తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయిస్తారు. దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలో... అంటే మరో 10 శాతం బాధితులకు రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి రావచ్చు. దాదాపు 70 శాతం మంది బాధితులు రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇక ఆపేయవచ్చనే నిర్ణయానికి వస్తారు. కానీ మరో 10 శాతం మందికి నాలుగు రకాల మందులు వాడినా కూడా ఫిట్స్ పదే పదే వస్తుండవచ్చు.6.5 కోట్ల మందిప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఫిట్స్తో బాధపడుతుండగా మనదేశంలో దాదాపు కోటి నుంచి 1.2 కోట్ల మంది బాధితులున్నారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 50 లక్షల మంది కొత్త పేషెంట్స్ ఈ జాబితాలో చేరుతున్నారు. 26 మందిలో ఒకరికి... చూడ్డానికి ఎంతో భయంకరంగా, ఆందోళన గొలిపేలా ఉండే లక్షణాలూ, అపోహల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రతి 26 మందిలో ఒకరికి ఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 80% అల్పాదాయ, మధ్యతరగతివారే. ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. అంటువ్యాధి కానే కాదు. చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోయే నిరపాయకరమైన వ్యాధి. అనేక అపోహల కారణంగా దేశంలోని 50% పైగా బాధితులు ఇంకా చికిత్సకు దూరంగా ఉన్నారు.70% మందిలో.. ఫిట్స్ / ఎపిలెప్సీ వచ్చినవాళ్లలో దాదాపు 70 శాతం మందిలో కారణాలు తెలియవు. మిగతా 30 శాతం మందిలో ఏవైనా నిర్దిష్టమైన కారణాలతో ఫిట్స్ వస్తుంటాయి. ఉదాహరణకు... కొందరిలో వంశపారంపర్యంగా, తలకు దెబ్బతగలడం, పక్షవాతం, మెదడులో గడ్డలుగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ రావడం వల్ల అలాగే మరికొందరిలో పక్షవాతం (స్ట్రోక్) కారణంగా రావచ్చు.ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు బాధితుల బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయిస్తారు. ఫిట్స్ మళ్లీ మాటిమాటికీ రాకుండా ఉండాలంటే పూర్తి కోర్సు వాడాల్సిందే.మరికొన్ని మార్గాలు ఫిట్స్ తగ్గించేందుకు కొన్ని మార్గాలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో... శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ఫిట్స్ ఆవిర్భావ కేంద్రాన్ని గుర్తించినట్లయితే... దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని, శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ మరొకటి. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్ను అదుపు చేయవచ్చ. మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కూడా ఫిట్స్ను అదుపుచేయవచ్చు.ఫిట్స్ వచ్చినప్పుడు... ఫిట్స్ వచ్చినవారికి తాళం చేతులు అందించడం, ఏదైనా లోహపు వస్తువును చేతిలో పెట్టడం చేస్తుంటారు. వాస్తవానికి ఇవేవీ చేయకూడదు. ఫిట్స్రాగానే ఆ వ్యక్తిని.. ∙సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువగా కదిలించకూడదు. ∙నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. ∙ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. ∙కాళ్లూ, చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో అతడు తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.చదవండి: అవాంఛిత రోమాలకు పరిష్కారంచివరగా... ఎపిలెప్సీ అనేది ఉన్నతికి ఏమాత్రం ప్రతిబంధకం కాదు.మహిళల్లో ఎపిలెప్సీ వచ్చినా అది సాధారణ జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదు. అందరిలానే వీళ్లూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనవచ్చు. -
ఆరోగ్య ఖర్చుల కోసం ఎన్పీఎస్ ‘స్వస్థ్య’
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఇప్పుడు ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ‘ఎన్పీఎస్ స్వస్థ్య’ అనే కొత్త పెన్షన్ స్కీమ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది పూర్తిస్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కానప్పటికీ వైద్య ఖర్చుల కోసం ఒక ప్రత్యేక వాలెట్లా పనిచేస్తుంది.ప్రస్తుతం ఈ పథకాన్ని ‘రెగ్యులేటరీ సాండ్బాక్స్’ విధానంలో పరిశీలిస్తున్నారు. అంటే, ఈ పథకం క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమవుతుందో టెక్నాలజీ, కస్టమర్ రక్షణ పరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఈ ట్రయల్ ద్వారా పర్యవేక్షిస్తారు.ఎలా పనిచేస్తుంది?ఎన్పీఎస్ స్వస్థ్య అనేది సాధారణ ఎన్పీఎస్ ఖాతాకు అనుబంధంగా ఉండే ఒక ప్రత్యేక ఖాతా. ఈ ఖాతా తెరవాలంటే సభ్యుడికి కనీసం ఒక సాధారణ ఎన్పీఎస్ ఖాతా ఉండాలి. సభ్యులు తమ ఇష్టానుసారం ఇందులో నగదు జమ చేయవచ్చు. ఈ నిధులను పెన్షన్ ఫండ్ మేనేజర్లు వివిధ పథకాల్లో పెట్టుబడిగా పెడతారు. ఓపీడీ ఖర్చులు, ఆసుపత్రిలో చేరి చికిత్సల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు.40 ఏళ్లు దాటిన వారికి..ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన ప్రభుత్వేతర ఉద్యోగులకు ఈ పథకం కీలకమని చెప్పవచ్చు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తమ సాధారణ ఎన్పీఎస్ ఖాతాలోని కార్పస్ నుంచి 30 శాతం వరకు నిధులను ‘స్వస్థ్య’ ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల అదనపు పొదుపు చేయకపోయినా పాత పొదుపునే ఆరోగ్య అవసరాలకు మళ్లించుకోవచ్చు.ఉపసంహరణ నిబంధనలుమొదటిసారి ఉపసంహరణ చేయాలంటే ఖాతాలో కనీసం రూ.50,000 ఉండాలి. ఉపసంహరణల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ ఆసుపత్రి బిల్లులు మొత్తం నిధిలో 70 శాతం దాటితే సభ్యుడు పూర్తి మొత్తాన్ని ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో బిల్లుల చెల్లింపు నేరుగా సభ్యుడికి కాకుండా హెల్త్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్ (హెచ్బీఏ) లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) ద్వారా జరుగుతుంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుంది.సవాళ్లు.. నిపుణుల అభిప్రాయంఈ పథకం క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహిస్తున్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్పీఎస్లో రూ.50,000 కనీస నిధి ఉండాలనే నిబంధన సామాన్యులకు ఇబ్బందిగా మారవచ్చు. క్లెయిమ్ ప్రాసెసింగ్ ఫీజులు, ఉపసంహరణలపై పన్ను విధింపు విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇది మార్కెట్ ఆధారిత పథకం కావడంతో వైద్య ద్రవ్యోల్బణంకు తగ్గట్టుగా రాబడులు వస్తాయా లేదా అన్నది సందేహమే.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
ఫ్యాటీలివర్తో బీకేర్ఫుల్..!
ఆల్కహాల్తో ఫ్యాటీలివర్ ముప్పు ఉందన్న విషయం తెలిసిందే. అయితే నిత్యం తాగేవారిలోనే ఈ ఫ్యాటీ లివర్ ముప్పు ఎక్కువ అనే అ΄ోహ గతంలో ఉండేది. తాజా తార్కాణాలూ, అనేక అధ్యయనాల ప్రకారం ఎప్పుడో ఒకసారి (అకేషనల్గా) తాగేవారికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు మగవాళ్లకు దీటుగా తాము ఆల్కహాల్కు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువ అంటూ పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. సోషల్ డ్రింకింగ్, వీకెండ్ కాక్టెయిల్ పార్టీస్ అంటూనో లేదా ఇంట్లోనైనా ఎప్పుడో ఒకసారి అంటూ తాగేవారికి సైతం ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దాం...చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... చాలా కొద్దిమోతాదులో అంటే ప్రతిరోజూ 30 మి.లీ.కు మించకుండా ఆల్కహాల్... అందులోనూ రెడ్వైన్ తీసుకునేవారిలో గుండెజబ్బులు నివారితమవుతాయనీ, రక్తనాళాల్లోని కొవ్వు కొట్టుకు΄ోతుందనీ, అంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే అది ఫ్యాటీలివర్కు దారితీయదనీ... ఇలాంటి అ΄ోహలు ఎక్కువే ఉన్నాయి. అవన్నీ వాస్తవం కాదంటూ ఇటీవలి అనేక అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తాగినా... అది కూడా చాలా అడపాదడపా(అకేషనల్గా) తీసుకున్నప్పటికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఇటీవలే మన దేశంలోని మహిళలూ ఆల్కహాల్కు దగ్గరవుతున్న నేపథ్యంలో వాళ్లలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్యాటీలివర్ అంటే?మన రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తి కోసం రక్తంలోని చక్కెర ఉపయోగపడుతుంది. అటు తర్వాత మిగతా చక్కెర కొవ్వురూపంలో కాలేయంలో నిల్వ అవుతుంటుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం కంటే మన రోజువారీ కార్యకలాపాలు తగ్గుతూ పోతున్న కొద్దీ ఈ కొవ్వు నిల్వలు అలా పేరుకుపోతూ ఉండటంతో పాటు కాలేయ కణాలూ కొవ్వు కణాల్లా మారుతూ ఉంటాయి. ఇలా కాలేయ కణాల్లో కొవ్వు మోతాదులు పెరుగుతూ పోవడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతాయి. అందులో మొదటిది ఆల్కహాల్ వినియోగం. రెండోది ఆల్కహాల్ కాకుండా ఇతరత్రా అంశాలు ఫ్యాటీలివర్కు కారణం కావడం. ఈ కారణాలను బట్టి ఫ్యాటీలివర్లోని రకాలివి... ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఏఎఫ్ఎల్డీ) : ఆల్కహాల్ వినియోగం వల్ల కాలేయంలో కొవ్వు చేరి ‘ఫ్యాటీలివర్’కు దారితీయడం. నాన్ ఆల్కహాలివ్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) : దీనికి ఆల్కహాలిక్ ప్రధాన కారణం కాదు. అయితే జీవక్రియల తేడా కారణంగా వచ్చే వ్యాధులు (మెటబాలిక్ సిండ్రోమ్స్), స్థూలకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి కారణాల వల్ల ఈ ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది.నిర్ధారణ బాధితుల స్థూలకాయం, పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) చూసి డాక్టర్లు పరిస్థితిని కొంత తెలుసుకోగలరు. కొన్ని రక్తపరీక్షలు, వాటితోపాటు డయాబెటిస్, కొలెస్ట్రాల్ మోతాదులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు పెరిగాయా అన్నది చూడాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్లో ఫ్యాటీలివర్ కండిషన్ బయటపడుతుంది. కొందరిలో లివర్ బయాప్సీ (అంటే కాలేయం తాలూకు చిన్న ముక్కను సేకరించి చేసే) పరీక్ష అవసరం. లివర్ బయాప్సీతో ఎన్ఏఎఫ్ఎల్డీలో అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ (ఎన్ఏఎఎఫ్ఎల్) కండిషనా, లేక నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపాటిక్ (నాశ్) కండిషనా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్’ అనే వైద్యపరీక్ష ద్వారా లివర్లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయా, తగ్గాయా కూడా తెలుసుకోవచ్చు. మహిళల్లో మరింత ఎక్కువ ముప్పు ఎందుకంటే... ఆల్కహాలిక్ ఫాటీలివర్ ముప్పు మహిళల్లో మరింత ఎక్కువ. ఎందుకంటే వీళ్లలో పురుషులతో ΄ోలిస్తే వాళ్ల కాలేయం సైజు తక్కువ. అలాగే వాళ్ల ఒంట్లోని నీటి మోతాదులు కూడా తక్కువే. ఇక మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా ఆల్కహాల్ వాళ్ల రక్తంలో చాలా ఎక్కువగా గాఢతతో చాలాసేపు ఉంటుంది. అలా అరుదుగానే అప్పుడప్పుడూ తాగినా ఆ ఇంటర్మిట్టెంట్ ఆల్కహాల్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, కొవ్వులు పేరుకుపోవడంతో పాటు ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కూడా పెరుగుతుందని ఈ అంశాలన్నీ మహిళల్లో ఫ్యాటీలివర్ను పెంచడంతోపాటు లివర్ ఫైబ్రోసిస్ ముప్పునూ చాలా ఎక్కువగా పెంచేస్తాయి. అందుకే 20 – 35 ఏళ్లున్న మహిళల్లో వాళ్ల ఆల్కహాల్ తీసుకునే మోతాదు ఎంత తక్కువైనప్పటికీ లివర్ ఫైబ్రోసిస్ రేటు చాలా పెరిగి΄ోతోంది. అందుకే పురుషులూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లలో ΄ోలిస్తే మహిళలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ దుష్ప్రభావాలు మహిళల్లో కేవలం కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ల రుతుక్రమం దెబ్బతినడం, హార్మోనల్ బ్యాలెన్స్ అతలా కుతలం కావడం, సంతానలేమి వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చు.లక్షణాలు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో పొట్ట బాగా పెరిగిపోతుంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఇలా కొద్దిమేరకు లక్షణాలు కనిపించవచ్చేమోగానీ...నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో చాలావరకు లక్షణాలు కనిపించవు.అయితే కొన్ని అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ను సూచిస్తాయి. ఉదాహరణకు వీళ్లలోనూ పొట్ట బాగా పెరిగి, సెంట్రల్ ఒబేసిటీతో ముందుకు వచ్చి కనిపిస్తుంది. ∙ కొద్దిమందిలో కుడివైపు పొట్ట పైభాగంలో (ఉరఃపంజరం / రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. క్రమంగా కాలేయం పెరుగుతుండటం వల్ల ఇలా జరుగుతుంటుంది. నివారణ / చికిత్సఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయడం. డైట్ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం. ఇందులో చక్కెర, కొవ్వుల మోతాదులను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం, షుగర్–స్వీటెన్డ్ డ్రింక్స్ వంటి కూల్డ్రింక్స్ దూరంగా ఉండటం. అలాగే పొట్టుతో ఉండే ధాన్యాలూ (హోల్గ్రెయిన్స్), తాజా పండ్లు, కూరగాయల వంటి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. వ్యాయామం : రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. దేహానికి వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామాన్ని ఇవ్వడం. నివారణ నియమాలు పాటించడంతో పాటు ఫ్యాటీ లివర్ దశను బట్టి డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలతోపాటు క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు (అల్ట్రా సౌండ్, మెటబాలిక్ మార్కర్ పరీక్షలు) చేయించుకుంటూ ఉండటం. చివరగా... సోషల్ డ్రింకింగ్ లేదా వీకెండ్ పార్టీస్ అంటూ పార్టీ కల్చర్ పేరిట పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దేహానికి అత్యంత కీలకమైన భాగమైన కాలేయంపై పడే దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్కహాల్కు దూరంగా ఉండటం, ఈ అవగాహనను అందరిలోనూ కల్పించడం అన్నది ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతైన అవసరమని గుర్తించాలి. డాక్టర్ పవన్ కె. అడ్డాల, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!) -
ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు
ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్ మ్యూకోజల్) కేన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్జే గ్లోబల్ హెల్త్’ జర్నల్ ప్రచురించింది. ఆ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ 1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.(చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..) -
70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు
ఓ వృద్ధ మహిళ దీర్ఘకాలికంగా విపరీతమైన తలతిరగడం సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్ప్రతులు, పలు స్కానింగ్ పరీక్షలు చేసినా..ఎందువల్ల ఈ సమస్య అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. వెద్యులకే అంతుపట్టని మిస్టరీ వైద్య సమస్యలా మారింది ఆమె బాధ. అయితే చివరికి న్యూరాలజిస్ట్లు ఎందువల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందో తెలిసి విస్తుపోయారు. పైగా ఆ వైద్యుడు ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 70 ఏళ్ల మహిళకు విపరీతమైన తలతిరడం సమస్యతో బాధపడుతుంది. ఒంటిరిగా వెళ్లాలన్నా..కాసేపు నుంచొన్న పడిపోతానేమో అనే భయంతో విలవిలలాడింది. ఆ సమస్యతో తాళ్లలేక పలు ఆస్పత్రులు సందర్శించినా..ఎలాంటి సమస్యల లేదని తేల్చి చెప్పారు. ఎమ్మారై నుంచి ప్రతి స్కాన్లో రిపోర్టు నార్మల్గానే రావడంతో వైద్యలు సైతం ఇదొక అంతుపట్టని మిస్టరీ సమస్యగా పేర్కొన్నారు. బ్రెయిన్లో కణితి లేక స్ట్రోక్ వల్ల వస్తుందేమోనని బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్లు చేసినా..ఫలితం శూన్యం. దాంతో చివరికి ఆమె న్యూరోలజిస్ట్ని సంప్రదించగా..ఆయన ఆమె సమస్యను క్షణ్ణంగా పరిశీలించారు. ఆయన ఆమె ఎదుర్కొంటుంది సాధారణ తలతిరుగుడు సమస్య కాదని గుర్తించారు. దాంతో ఆమెను లేచి నిలబడి ఉండమని చెప్పినప్పుడూ..కొంచెం సేపు నుంచోలేకపోవడం గమనించారు. ఆ తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు గురించి విచారించగా..అసలు సమస్య ఎక్కడ ఉందో ఆయన గుర్తించి సవివరంగా చెప్పారు. పైగా ఇలాంటి సమస్యను చాలామది ఫేస్ చేస్తున్నారని. అయితే వాళ్లే తేలిగ్గా తీసుకోవడంతోనే వెలుగులోకి రాలేదన్నారు. ఎందువల్ల అంటే..ఆ మహిళ దీర్ఘకాలం పాటు పూర్తిగా శాకాహారం, పాల ఉత్పత్తులను నివారించడంతోనే పోషకాహారం లోపం ఏర్పడి.. నరాలు, కీళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఆమె నుంచొన్నప్పుడు కాలి వేళ్ల స్పర్శను అనుభూతి పొందలేకపోయిందని చెప్పారు. కాలి చీలమండలం దాక ఎలాంటి సెన్సేషన్ లేకపోవడం గుర్తించారు వైద్యులు. నిలబడుతున్నప్పుడూ ఆ మహిళ బ్యాలెన్స్ చేసుకోలేనట్టుగా ఊగిపోవడం గమనించారు. అది సాధారణ తలతిరగడం సమస్య కిందకు రాదని అన్నారు న్యూరాలజిస్ట్ వైద్యులు. కఠిన శాకాహారిగా తక్కువ పాల ఉత్పత్తులు తీసుకోవడంతో వచ్చిన సమస్యగా వెల్లడించారు. అంతేగాదు దీన్ని బీ12 లోపంగా పేర్కొన్నారాయన. బీ12 లోపం అంటే..నరాలను రక్షించే మైలిన్ తొడుగును నిర్వహించడానికి బీ12 చాలా అవసరం. అది లేకపోతే మెదడుకి సంకేతాలు పంపే పెద్ద ఫైబర్ నరాలు పనిచేయడం మానేస్తాయి. సదరు మహిళకు శరీరంలో బీ12 స్థాయిలు 153 pg/mL ఉన్నాయి . అంటే సాధారణ మనిషికి ఉండాల్సిన దానికంటే అత్యంత తక్కువ. దాంతో వైద్యులు ఆమెకు కండరాల ద్వారా బీ12 ఇంజెక్షన్లు అందించినట్లు తెలిపారు. దాంతో ఆమెకు కొన్ని వారాల్లోనే నడక బ్యాలెన్స్ అయ్యిందని, అలాగే పడిపోతాననే భయం మాయమైందని చెప్పారు. ఆమెకు ఇదివరకటిలా గోడలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను రోగ నిర్థారణ స్కాన్లతో గుర్తించలేమని చెప్పారు. అంతేగాదు పాల ఉత్పత్తులు, లేదా సప్లిమెంట్లు లేకుండా దీర్ఘకాలం పాటు శాకాహారం తీసుకుంటే బీ12 విటమిన్ లోపం వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇలాంటి సమస్యని(బీ12 లోపం) ముందుగా గుర్తిస్తేనే నయం చేయగలమని లేదంటే శాశ్వత వైకల్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు న్యూరాలజిస్ట్లు.When the Brain Was Blamed; but the Nerves Told the TruthShe was 70, soft-spoken, and deeply worried.For six weeks, she had been feeling dizzy and unsteady, especially while walking. She described it as “the ground moving under my feet.” At times, she felt she might fall if… pic.twitter.com/do925kj2OZ— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 4, 2026 (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..
స్ట్రాబెర్రీలు ఈ సీజన్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యం, అందాన్నివ్వడంలోనూ మేలు చేస్తాయి. వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.వయస్సు తోపాటు వచ్చే కంటి సమస్యలను నివారించడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగించే స్ట్రాబెర్రీ గుజ్జును ముఖానికి ప్యాక్లా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులోని ఎల్లాజిక్ యాసిడ్ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందిస్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్ యాసిడ్ దంతాలపై ఉండే పసుపు రంగు మరకలను తొలగించి, దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్ సి శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. (చదవండి: ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!) -
ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!
శీతల పానీయాలు తాగొద్దని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫ్యాటీ లివర్, కిడ్నీ సంబంధిత అనారోగాల బారిన పడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణుల సదా హెచ్చరిస్తుంటారు. అయినాసరే ఏం కాదులే అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తూ..తాగేస్తుంటారు చాలామంది. అయితే అది ఎలా ఆరోగ్యాన్ని సమస్యల కోరల్లో చిక్కుకునేలా చేస్తోంది అస్సలు గ్రహించం అంటూ ఇక్కడొక వ్యక్తి కన్నీరుమున్నీరు విలపిస్తున్న కథ వింటే కచ్చితంగా విస్తుపోతారు. అంతేగాదు ఈ కూల్డ్రింక్స్ తాగాలా వద్దా అనే సందేహం కచ్చితంగా ఎదురవ్వుతుంది. ఎందుకంటే..నెట్టింట వైరల్ అవ్వుతున్న ఓ వీడియో అందర్నీ ఆలోచింపచేశాలా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శీతల పానీయాలు తాగడం మానేయండి అంటూ వేడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన తముమ్మడు అలాంటి పానీయాలు తాగే ఆరోగ్యం పాడుచేసుకున్నాడంటూ భావోద్వేగం మాట్లాడటం చూడొచ్చు. అతడి ఆరోగ్యం దారుణంగా పాడైందని, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపాడు. దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని పేర్కొన్నాడు. తన తమ్ముడిలా ఎవ్వరూ ఆరోగ్యం పాడుచేసుకోకండి అని కోరడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేగాదు ఈ శీతల పానీయాన్ని విషంగా పేర్కొన్నాడు. దీని కారణంగా తన సోదరుడు జీవితం పాడైందంటూ కన్నీరుమున్నీరు విలపించాడు ఆ వ్యక్తి వీడియోలో. చాలామంది నెటిజన్లు అవును ఇది మంచిది కాదని తెలిసి విషాన్ని తాగుతున్నామని అంగీకరించారు. ఈ ఘటన అందరికి కనువిప్పు అని పేర్కొంటూ కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు మాత్రం అతను రోజు కూల్డ్రింక్స్ తాగుతున్నాడని తెలిసినప్పుడూ ఎందుకు అదుపుచేయలేకపోయారు అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Updated Bharat.in™ | Latest News (@updatedbharat.in) (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
అవాంఛిత రోమాలు ఎందుకు పెరుగుతాయి?
తలపై జుట్టు బాగా పెరగాలని మహిళలు కోరుకోవడం ఎంతో సాధారణమో... దేహంలోని కొన్ని భాగాల్లో అంటే... పైపెదవీ, గదమ మీద జుట్టు పెరగకూడదని కోరుకోవడం కూడా అంతే సహజం. అలా జుట్టు పెదవులపైనా గడ్డంపైనా పెరగడాన్ని వారు ఎంతమాత్రమూ ఇష్టపడరు. అలాంటి అవాంఛిత రోమాలను అనేక విధాల తొలగించుకోడానికి మహిళలు ప్రయత్నిస్తుంటారు. ఇలా వారు కోరుకోని ప్రదేశాల్లో వెంట్రుకలు పెరగడాన్ని అవాంఛిత రోమాలు అనీ... అదే వైద్యపరిభాషలో హిర్సుటిజమ్ (Hirsutism) అని చెబుతారు. అవాంఛిత రోమాలు వచ్చేందుకు కారణాలు, వాటికి పరిష్కారాలేమిటన్నది తెలుసుకుందాం...సాధారణంగా మానవుల శరీరమంతటా రోమాలు ఉండనే ఉంటాయి. మనం క్షీరదాల కోవకు చెందినవాళ్లం కావడం వల్ల... క్షీరదాల్లో ఇలా ఒళ్లంతా వెంట్రుకలు ఉండటం ఒక లక్షణం కావడం వల్ల ఒంటి నిండా రోమాలు ఉండటం సహజం. కాకపోతే దేహంలోని కొన్ని చోట్ల అవి అవి ఉండాల్సినట్టుగా ఉండకుండా పెరగడాన్ని అవాంఛిత రోమాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు పురుషుల్లో గడ్డం, మీసం ఉండటం సహజం. కానీ మహిళల్లో అవి ఉండవు. ఉన్నప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించకుండా... నూగుగా... ఉండీ ఉండకుండా కనిపిస్తుంటాయి. అయితే కొందరిలో అవి పురుషుల్లో మాదిరిగా పెరుగుతూ స్పష్టంగా కనిపించే అవకాశముంటుంది. అవాంఛిత రోమాలంటే... మహిళల్లో చెంపలూ, చుబుకం, పై పెదవుల వంటి చోట్ల కూడా కనీ కనిపించకుండా రోమాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం అంత సులభం కాదు. సాధారణంగా మహిళలందరి విషయంలోలా కాకుండా భిన్నంగా కనిపించేవాటిని అసహజమైన వెంట్రుకలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు గదమ, చెంపలు, పెదవులపైన వెంట్రుకలు పెరుగుతూ... అవి మరీ గుబురుగా పెరుగుతుంటే వాటిని అవాంఛిత రోమాలుగా పేర్కొనవచ్చు. ఒక అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది శాతం మహిళల్లో... పురుషుల్లో మాదిరిగానే గడ్డంపైనా, పెదవులపైనా వెంట్రుకలు కనిపిస్తాయన్నది వైద్య నిపుణుల మాట.హిర్సుటిజం, హైపర్ట్రైకోసిస్ అంటే...?మహిళల్లో కనిపించే ఈ అవాంఛిత రోమాలను హిర్సుటిజమ్ అనీ అలాగే హైపర్ట్రైకోసిస్ (Hypertrichosis) అని రెండు రకాలుగా చెప్పవచ్చు. స్త్రీలలోనూ పురుషుల మాదిరిగానే వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజమ్’గా చెప్పవచ్చు.అయితే హైపర్ట్రైకోసిస్ కండిషన్లోనూ వెంట్రుకలు పెరిగినప్పటికీ... అవి పురుషుల్లోలాగా ఉండవు. ఉదాహరణకు మహిళల హార్మోన్లలో ఏవైనా తేడాలు వచ్చి పురుషుల్లోలా వెంట్రుకలు పెరగడాన్ని హిర్సుటిజమ్గా చెప్పవచ్చు. కానీ వాళ్ల దేహంపైనా వెంట్రుకలు ఉన్నప్పటికీ అవి ఉండాల్సినంతగా కాకుండా చాలా ఎక్కువగా పెరగడాన్ని ‘హైపర్ ట్రైకోసిస్’ అంటారు. జన్యుపరమైన కారణాలతో ఇలా జరుగుతుంది. ఇక కొందరిలో అంతకుముందు లేకపోయినా... కొన్ని రకాల మందులు వాడాక దేహంపైన రోమాలు రావచ్చు. అలా మునుపు లేనివీ... అటు తర్వాత ఏదైనా కారణాలతో రోమాలు పెరగడాన్ని కూడా ‘హైపర్ ట్రైకోసిస్’గా చెప్పవచ్చు.కారణాలు మహిళల్లో అవాంఛిత రోమాలు పెరగడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... హార్మోన్లలో తేడాలు...మహిళల్లో స్రవించే హార్మోన్లలో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ అవసరమైన మోతాదు కంటే మించి స్రవించినప్పుడు... ఆ అంశం మహిళల్లో అవాంఛిత రోమాలకు దారితీయవచ్చు.పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్... మహిళల్లో పురుషుల్లోలా వెంట్రుకలు పెరిగేందుకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ (పీసీవోడీ) కూడా ఒక కారణం. హిర్సుటిజమ్ ఉన్న మహిళలలో వైద్యపరీక్షలు చేసినప్పుడు వాళ్లలో చాలామందికి (దాదాపు 70% మందిలో) పీసీవోఎస్ ఉన్నట్లుగా ఫలితాలు రావడం చాలా సహజం. పీసీఓఎస్ ఉన్న మహిళల అండాశయాలు (ఓవరీస్) పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఆ హార్మోన్ మహిళల్లో సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు పెరగడం కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లలో మొటిమలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. యుక్తవయసు దాటి΄ోయాక కూడా మొటిమలు రావడం, అవాంఛితమైన రోమాలు ఉంటే పీసీవోఎస్ ఉందేమో అని అనుమానించాలి.పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీవోడీ) సమస్య ఉన్నప్పుడు నిపుణులైన గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా నెలసరి సమస్యలు సరయ్యేలా చూసుకోవడం, చికిత్సను మధ్యలో ఆపకుండా సమస్య పరిష్కారమయ్యేవరకు / పూర్తిగా తగ్గేవరకు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ను కొనసాగించాలి.కొన్ని రకాల గ్రంథుల సమస్య ఉన్నప్పుడు... కొందరు మహిళల్లో థైరాయిడ్ గ్రంథి సమస్యగానీ, పిట్యూటరీ గ్రంథి సమస్య ఉన్నప్పుడు కూడా వారిలో పురుషుల్లోలాగానే వెంట్రుకలు పెరగవచ్చు. అందుకే... అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు నిపుణులను సంప్రదించి దానికి అసలు కారణాలు తెలుసుకుని చికిత్స తీసుకోవడం అవసరం.ఇడియోపథిక్ హిర్సుటిజమ్ అంటే...కొద్దిమంది మహిళల్లో పురుషహార్మోన్ స్రావాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ... వెంట్రుకల పెరుగుదల మాత్రం అసాధారణంగా ఉండవచ్చు. ఇలాంటి కండిషన్ను ‘ఇడియోపథిక్ హిర్సుటిజమ్’గా చెబుతారు. వీళ్లలో రుతుక్రమం మామూలుగానే ఉంటుంది. గర్భం రావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాకపోతే వెంట్రుకల పెరుగుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. సాధారణంగా వీళ్లు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటారు. అంటే స్థూలకాయం / ఊబకాయంతో ఉండవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం. మెడ దగ్గర ప్రధానంగా మెడ వెనక భాగంలోనూ, చర్మం ముడతలు పడే ప్రదేశాల్లో చర్మం మరింతగా నల్లగా, మందంగా కనిపించవచ్చు. ఇలా చర్మం మందంగా, నల్లగా కనిపించే కండిషన్ను ‘ఎకాంథోసిస్ నైగ్రికాన్స్’ అంటారు.డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువ... అవాంఛిత రోమాల సమస్యతో బాధపడేవాళ్ల రక్తంలో సాధారణంగా చక్కెర మోతాదులను అదుపులో పెట్టేందుకు మరింత ఎక్కువగా ‘ఇన్సులిన్’ హార్మోను అవసరమవుతుంది. అందుకే ఇలాంటి వాళ్లు చాలాకాలం పాటు ఎలాంటి చికిత్సా తీసుకోకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, అది క్రమంగా డయాబెటిస్ సమస్యకు దారితీసేందుకు అవకాశాలెక్కువ.ఈ వైద్యనిపుణుల సహాయంతో... అవాంఛిత రోమాలు వచ్చే మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదు. అంటే వీళ్లలో నెలసరి (పీరియడ్స్) సక్రమంగా రావు. బరువు ఎక్కువగా పెరగడం, చర్మంలో ముడతలు ఉండే మెడ, బాహుమూలాలు వంటి చోట్ల చర్మం దళసరిగా మారడం, మొటిమలు ఎక్కువగా వస్తుండటం వంటి లక్షణాలతో పాటు ఒకవేళ మాడుపై తగినన్ని వెంట్రుకలు లేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆ బాధితులు.. ఎండోక్రైనాలజిస్ట్ (హార్మోన్ల నిపుణులు)ను, డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధుల నిపుణుల)ను సంప్రదించాలి. ఈ లక్షణాలున్నవారు తాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు గైనకాలజిస్ట్ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఎండోక్రైనాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్... ఈ ముగ్గురూ ఒక టీమ్గా చికిత్స అందిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో బాధపడుతున్న మహిళలైతే వారు తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లను కొనసాగించాలి. ఇవి చేస్తూ తమ బరువును తగ్గించుకోవడం లేదా నియంత్రణలో ఉంచుకోవడం చేస్తూ... వాటితో పాటు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి తాత్కాలిక ప్రక్రియలనో లేదా శాశ్వత పద్ధతులనో అవలంబించాలి.అవాంఛిత రోమాల తొలగింపునకు తాత్కాలిక ప్రక్రియలుథ్రైడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ ...సాధారణంగా చాలామంది మహిళలు తమ అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి ముఖ్యంగా థ్రెడింగ్, వ్యాక్సింగ్ లాంటి తాత్కాలిక ప్రక్రియలను అనుసరిస్తుంటారు. ఇవి తరచూ చేస్తున్న క్రమంలో కొందరిలో వెంట్రుకమూలంలో/ రోమం అంకురంలో ఇన్ఫెక్షన్స్ రావడం (ఫాలిక్యులైటిస్) వంటి ముప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అప్పుడక్కడ రోమం కుదురు దగ్గర ఒక గడ్డలా మారి అక్కడ చీమూ పట్టే అవకాశాలెక్కువ. అలాంటి సందర్భాల్లో నొప్పి కూడా రావచ్చు. ఈ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ ప్రక్రియలను అనురించేవారి చర్మం నల్లబడవచ్చు. తగినంత పరిశుభ్రత పాటించకపోతే థ్రెడ్డింగ్తో ఒక్కోసారి పులిపిరులతో కూడిన వైరల్ వార్ట్స్ రావచ్చు. కొందరు మహిళలు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. వాటిని ఉపయోగించేప్పుడు అలర్జీలు రాకపోతే వాటిని సురక్షితమైనవిగా భావించి, వాటిని వాడుకోవచ్చు. అయితే హెయిర్ రిమూవల్ క్రీమ్ను ఉపయోగించే ముందు అది సురక్షితమా, కాదా అని తెలుసుకోడానికి చర్మంపై ఎక్కడైనా కొద్దిగా ఉపయోగించి చూడటం (ప్యాచ్ టెస్ట్) అవసరం.షేవింగ్... అపోహలు... అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి సాధారణంగా భారతీయ మహిళలు షేవింగ్ను అంతగా ఇష్టపడరు. షేవింగ్ తర్వాత మరింత గుబురుగా వెంట్రుకలు వస్తాయన్న అపోహ ఉండటం, షేవింగ్ (Shaving) వల్ల చర్మం మరింత గరుగ్గా, మందంగా మారుతుందనే అభిప్రాయాలు ఉండటంతో తమ లుక్స్ను కాపాడుకునే క్రమంలో దాన్ని ఒక సురక్షితమైన, నమ్మదగిన ప్రక్రియ అనుకోరు. అయితే అవి అపోహలే. అయినప్పటికీ షేవ్ చేసిన మర్నాడో లేదా వెంటవెంటనో వెంట్రుకలు పెరుగుతుండటం మామూలే కావడం, షేవ్ చేసిన మేర చర్మం రంగు ఒకింత మారడం వంటి కారణాల వల్ల ఇలా అపోహ పడటానికి అవకాశముంది.చదవండి: నిద్ర పట్టడం లేదా.. ఇదిగో పరిష్కారంఇవిగాక... అవాంఛితమైన రోమాలను తొలగించుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల వైద్యప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు లేజర్ ప్రక్రియలూ, ఎలక్ట్రోలైసిస్ (electrolysis) మార్గాల వంటి అధునాతన చికిత్సలూ ఉన్నాయి. అయితే వైద్య సంబంధితమైన ఎలాంటి విద్యార్హతలు లేకుండా తమను తాము బ్యూటీషియన్లు, కాస్మటాలజిస్టులమని చెప్పుకునే వారి దగ్గరకు వెళ్లడం కంటే... వైద్యపరమైన విద్యార్హతలు (క్వాలిఫైడ్) వైద్యనిపుణులై డర్మటాలజిస్టులు /ట్రైకాలజిస్టులను సంప్రదించడం చాలా మంచిది. ఇక ఇలాంటివారైతే... మహిళల్లో ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు (అండర్లైయింగ్ కాజెస్) ఉండటం వల్ల అవాంఛిత రోమాలు వస్తే... తగిన మందులు ఇవ్వడం లేదా సమస్య మూలాలను తెలుసుకుని సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించమంటూ సలహా ఇవ్వడం వంటివి చేస్తారు.కొందరు మహిళల్లో వెంట్రుకలు పలుచబడటం కూడా...మహిళల్లో అవాంఛిత రోమాలు ఎంత సహజమో... అలాగే కొంతమంది స్త్రీలలో వెంట్రుకలు పలచబారడమూ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా పాపిట తీసే చోట కనిపించడం చాలా సాధారణం. అక్కడ వెంట్రుకలు మరింతగా పలచబారిపోయి పాపిట ఉండాల్సిన దానికంటే చాలా వెడల్పుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడాన్ని ‘ఫిమేల్ ప్యాటరన్ హెయిర్ లాస్’’ అంటారు. కొందరిలో ఈ సమస్యను గుర్తించాక... వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే (సాధారణంగా ఆర్నెల్లలోపు) ఈ సమస్యను మందులతో అధిగమించవచ్చు. అంటే కోల్పోయిన వెంట్రుకలను తిరిగి పొందవచ్చు. అది కుదరకపోయినా మరిన్ని వెంట్రుకలు రాలిపోకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే వెంట్రుకలు మరింతగా రాలిపోయి పూర్తిగా పలచబడితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే ప్రత్యామ్నాయమవుతుంది. నిర్వహణ: యాసీన్ -
హైదరాబాద్లో అపోలో అంతర్జాతీయ హెల్త్ డైలాగ్–2026
హైదరాబాద్: అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ హెల్త్ డైలాగ్ (IHD–2026) ఈ నెల 30, 31 తేదీల్లో హెచ్ఐసీసీ–నోవోటెల్, హైదరాబాద్ వేదికగా జరగనుంది. ‘గ్లోబల్ వాయిసెస్.. వన్ విజన్’ అనే థీమ్తో నిర్వహించే ఈ సదస్సులో రోగి భద్రత, డిజిటల్ హెల్త్, ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్ ఫలితాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీతా రెడ్డి మాట్లాడుతూ, “ఏఐ, డేటా, డిజిటల్ టెక్నాలజీలను మానవీయత, సహకారంతో మేళవిస్తే భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ మరింత సమగ్రమవుతుంది. ఈ వేదిక గ్లోబల్ స్థాయిలో ఆలోచనలు, ఆవిష్కరణలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది,” అన్నారు.ఈ సదస్సులో నైజర్, పాపువా న్యూగినియా, కాంగో దేశాల ఆరోగ్య మంత్రులు సహా అంతర్జాతీయ నిపుణులు పాల్గొననుండగా, రెండో రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కూడా హాజరై ప్రసంగించనున్నారు. -
యాలకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..!?
యాలకులను సువాసన కోసం వాడే వంట దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. తిన్న ఆహారం త్వరగా అరగడానికి యాలకులు బాగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి వాటిని తగ్గిస్తాయి. భోజనానంతరం ఒక యాలక్కాయను నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి, నోరు తాజాగా ఉంటుంది.తల తిరుగుతున్నప్పుడు యాలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది.యాలకులు రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతాయి.గొంతు నొప్పి, దగ్గు ఉన్నపుడు యాలకులతో చేసిన కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది. -
నన్ను ఎలా గుర్తుంచుకుంటారో.. ట్రంప్ అంతర్గత మథనం?
గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా లేదంటూ పుకార్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆయనకు వయసైందని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ట్రంప్ వీటన్నిటిని కొట్టిపడేసి ఐయామ్ ఆల్రైట్ అన్నారు. అయితే తన వృద్ధాప్యం నేపథ్యంలో ట్రంప్ మనసులోని మాటపై న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఒక ఆసక్తికర కథనం ప్రచురించిందిన్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రచురించిన కథనంలో డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో ప్రజలు తనను ఏఅంశంలో గుర్తుంచుకుంటారో అనే విషయంపై అధికంగా ఆలోచిస్తున్నారని ప్రచురించింది.అయితే ట్రంప్ తన జుట్టుకు గోల్డ్ కలర్ వేయడానికి ఇష్టపడట్లేదని దానిని నేచురల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారని పేర్కొంది. ఆయన మనస్సులో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారని తెలిపిందిఅయితే ట్రంప్ వ్యక్తిత్వంపై ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ మాట్లాడుతూ "ట్రంప్ మూఢనమ్మకం గల వ్యక్తి, ఆయనమరణం గురించి ఆలోచించడానికి ఇష్టపడడు. అతను భవిష్యత్తు కంటే వర్తమానంలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఎదో విధంగా ఆయన అందరి మనస్సులో ఉన్నారు. ఆయనకు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి". అన్నారు.అయితే ఇటీవల వైట్ హౌస్ ఆయనను అత్యంత శక్తివంతమైన అధ్యక్షుఽడిగా అభివర్ణించింది. ఆయనకు సగటు మనిషికంటే ఎక్కుువ ఓర్పు,శక్తి ఉన్నాయి. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంది. ఆయన ప్రస్తుతం మరింతగా కష్టపడి పనిచేయగలరు. అని డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ట్రంప్ ఆయన వైద్యులు సూచించిన దాని కంటే అధిక మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటానన్నారు. తనకు 81 మి.గ్రా సూచించగా తాను మాత్రం రోజుకు 325 మి.గ్రా. ఆస్పిరిన్ తీసుకుంటానని వెల్లడించాడు, క్యాబినెట్ సమావేశాల్లో నిద్రపోతున్నట్లు వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అంతర్గత మథనంపై టైమ్స్ మ్యాగజైన్ ఆసక్తికర నివేదిక ప్రచురించింది. -
నిద్ర... సమస్యలు- పరిష్కారాలు
నిద్ర... దాన్ని అనుభవించి, ఆస్వాదించి తెలుసుకోవాలేగానీ అక్షరాల్లో నిర్వచించడం కష్టం. నిర్వచనమే ఇవ్వలేని ఓ అద్భుతం. దేహం, మనసూ ప్రశాంతంగా సేదదీరే అనిర్వచనీయమైన ప్రక్రియ. అందుకే నిద్ర తాలూకు ప్రశాంతత లోపించినవారు ఆ నిద్రాసుఖం కోసం పరితపిస్తారు. ఆ సుఖానుభూతి కోసం తాపత్రయపడతారు. సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు అనుభవించే ఆ అనుభవం కోసం ప్రతి వ్యక్తీ తన జీవితంలోని దాదాపు మూడో వంతు వెచ్చిస్తాడు. అయితే కొందరిని ఆ నిద్రదేవత కరుణించదు.మరికొందరిలో నిద్రపరమైన కొన్ని సమస్యలుంటాయి. ఆ సమస్యలు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడతాయి. నిద్రలో నడవడం వంటి కొన్ని రకాల నిద్రకు సంబంధించిన సమస్యలు ఒక్కోసారి కొన్ని ప్రమాదాలకూ కారణమవుతాయి. నిద్ర గురించి ఇలాంటి ఎన్నో విషయాలను తెలిపే ఈ కథనంలో స్లీప్కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం...ఎవరిలోనైనా నిద్ర (Sleep) తక్కువైతే దాని తాలూకు ప్రతికూల ప్రభావాలు దేహంపైనా, మనసుపైనా... ఇలా రెండింటిపైనా ఉంటాయి. చిత్రంగా ఇంకొందరిలో నిద్ర ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్యలూ కనిపిస్తుంటాయి. ప్రధానంగా నిద్ర తాలూకు సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... ’నిద్రలేమి (ఇన్సామ్నియా) ’అతి నిద్ర (హైపర్సామ్నియా) ’ నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం (పారాసామ్నియా).నిద్రలేమి (ఇన్సామ్నియా)...సాధారణంగా ప్రతి ఒక్కరూ దాదాపు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోతుంటారు. ఇది సాధారణం. అంతకంటే తక్కువగా నిద్రపోతే... దాన్ని నిద్రలేమి (ఇన్సామ్నియా) అని చెప్పవచ్చు. సాధారణ నిద్ర ఆరు నుంచి ఎనిమిది గంటల పాటే అయినా... జనాభాలోని 2 శాతం నుంచి 4 శాతం ప్రజల్లో ఇది కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ల శరీర తత్వాన్ని బట్టి అది వాళ్లకు ఎలాంటి సమస్యను తెచ్చిపెట్టకపోవచ్చు. అలా కొద్దిసేపు నిద్రే అయినప్పటికీ వాళ్లలో ఎలాంటి అలసటా, నీరసం, నిస్సత్తువ లేదా ఇలాంటి సమస్యలేవీ లేకుండా ఉంటే వాళ్ల శరీర తత్వాన్ని బట్టి వాళ్లకు ఆ నిద్ర సరిపోతుందన్నమాట. అయితే చాలామందిలో నిద్రలేమి వల్ల అనేక సమస్యలు వస్తాయి. అవి...∙ఏకాగ్రత, దృష్టిని కేంద్రీకరించే శక్తి లోపించడం. ∙రాత్రి నిద్రలేమి వల్ల పగటివేళ కునికిపాట్లు పడుతూ ఉండటం. ∙జ్ఞాపకశక్తి తగ్గడం. ∙పనిలో తగినంత సామర్థ్యం చూపలేకపోవడం. నిద్రలేమి సమస్య కేవలం ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఉంటే అదో సమస్య కాబోదుగాని... అదే నెలల పాటు కొనసాగితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఇలా నిద్రలేమితో బాధపడేవాళ్లలో రక్తపోటు హై–బీపీ, మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, బ్రెయిన్స్ట్రోక్, భరించలేనంతగా తలనొప్పులు, హైపర్ ఎసిడిటీ, కడుపులో పుండ్లు (గ్యాస్ట్రిక్ అల్సర్స్), ఉద్విగ్నత (యాంగ్జైటీ), నరాల సమస్య (న్యూరోసిస్), కుంగుబాటు (డిప్రెషన్) లాంటి కొన్ని మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.నిద్రలేమికి కారణాలు... ∙వేళకు నిద్రపోక పోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్) ∙వేళకు తినకపోవడం (ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్) ∙నిద్రకు ముందు పొగతాగడం ∙కాఫీ, టీ, కెఫిన్ ఉండే కాఫీ అలాగే కూల్డ్రింక్స్ తాగడం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్, యాంగ్జైటీ)కి గురికావడం ∙ఆస్తమా, గుండెజబ్బులకు సంబంధించిన కొన్ని రకాల మందులు వాడటం వల్ల. ∙కొన్ని రకాల జబ్బుల కారణంగా... అందునా ముఖ్యంగా ఆస్తమా, కంజెస్టివ్ హార్ట్ డిసీజెస్, మూత్రపిండాల సమస్యలు (కిడ్నీలో వ్యర్థాలు మిగిలిపోవడం వల్ల), కొన్ని లివర్ సమస్యలు ∙థైరాయిడ్ సమస్యలు ∙స్థూలకాయం / ఊబకాయం ∙తీవ్రమైన నొప్పుల కారణంగా (అంటే విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, మెడనొప్పి, తిమ్మిర్లు, మంటలు ఉండటం)నిద్ర లేమి – నివారణ చర్యలు...నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి గాఢమైన నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ.∙బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. వురీ చల్లగానూ, వురీ వేడిగా ఉండకూడదు. ∙నిద్రపోతున్న గదిలో మరీ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ∙పొగతాగడం పూర్తిగా మానేయాలి. ∙సాయంత్రం నుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్డ్రింక్స్ తీసుకోకూడదు. ∙రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం.∙ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రకు ఉపక్రమించడం. ∙పగటి పూట ఎక్కువసేపు నిద్రపోకపోవడం. ∙నిద్రకు వుుందర టీవీలో తీవ్రమైన ఉద్విగ్నత, ఉద్రిక్తత, ఉద్వేగపూరితమైన దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు, వెబ్సిరీస్లూ చూడకపోవడం.∙రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో (డే లైట్) గడపడం ఓ మంచి సూచన. (పగలంతా వుసకమసగ్గా ఉండే వెలుగు తక్కువ గదుల్లో గడపడం వల్ల రాత్రిపూట మంచి నిద్రపట్టకపోవచ్చు). ∙నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ను వినడం.∙అలాగే పెద్దపెద్ద చప్పుళ్లు ఉండే రణగొణధ్వని ల్లాంటి వు్యూజిక్కు దూరంగా ఉండటం. ∙రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగడం. (పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్తో మంచి నిద్ర పట్టే అవకాశముంటుంది).∙నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి సరికాదు. నిజానికి పుస్తకం చదివితే నిద్ర వస్తుందని చాలావుంది అంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో పుస్తకంలో ఆసక్తికరమైన అంశాలుండటం, పుస్తకంలోని కంటెంట్లో ఉద్విగ్నతకు గురిచేసే సన్నివేశాలుంటే అవి నిద్రను దూరం చేయడానికి అవకాశాలెక్కువ.∙నిద్రకు ముందర టీవీ లేదా మొబైల్ చూడటం కూడా సరికాదు. ఇది రెండు రకాలుగా నిద్రకు దూరం చేస్తుంది. స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా నిద్ర పట్టదు. అలాగే మొబైల్ చూస్తున్నప్పుడు అందులో కనిపించే ఆసక్తికరమైన అంశాలూ, ఉద్విగ్నతకూ, ఎక్సైట్మెంట్కు గురిచేసే అంశాలు నిద్రను దూరం చేయవచ్చు.∙నిద్రపోవడాన్ని ఓ పనిలా అనుకొని దానిపైనే దృష్టిపెట్టి నిద్రకు ఉపక్రమించాలి. ఆ సమయంలో వేరే విషయాలు ఆలోచించడం సరికాదు.∙ఆల్కహాల్కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఒక్కోసారి ఆల్కహాల్ తీసుకున్న రాత్రి పూర్తిగా నిద్రపట్టకపోవచ్చు. లేదా ఆ నిద్ర నాణ్యత (స్లీప్ క్వాలిటీ) చక్కగా ఉండకపోవచ్చు. ఆల్కహాల్తో పట్టిన నిద్ర తర్వాత మనసు చికాగ్గానూ, నిద్రలేచాక పూర్తిగా అలసట తీరిన భావన లేకపోవడానికి స్లీప్ క్వాలిటీ చక్కగా లేకపోవడమే కారణం. ∙బెడ్రూమ్లో ఆహ్లాదకరమైన లైట్ మ్యూజిక్ వినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అయితే నిద్రకు ఉపక్రమించాక ఆ మ్యూజిక్ ఆపాలన్న స్పృహ కారణంగా నిద్ర ఆపుకోవాల్సి రావచ్చు.∙ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులతో బాధపడేవారు తాము వాడే కొన్ని రకాల మందుల వల్ల సరిగా నిద్రపట్టకపోవచ్చు. ఉదాహరణకు ఆస్తమాకు వాడే కొన్ని రకాల ఇన్హేలర్స్తో కొందరికి సరిగా నిద్రపట్టకపోవచ్చు. అందుకే లంగ్స్, కిడ్నీ జబ్బులతో బాధపడేవారు తాము ఉపయోగించే మందులను డాక్టర్లకు చూపించి, వారి సలహామేరకు మందులు వాడటం లేదా వాటిని పగటిపూట వాడేలాగా వేళల్లో మార్పు చేసుకోవచ్చు. ఇక తీవ్రమైన నొప్పుల సమస్యలతో బాధపడేవారు (పెయిన్ డిజార్డర్స్ ఉన్నవారు) తమ డాక్టర్ను సంప్రదించి తమకు నిద్రాభంగం కలిగించని విధంగా తమ సమస్యలకు తగిన మందులు సూచించాల్సిందిగా కోరాలి. హైపర్సామ్నియాసాధారణంగా సగటున నిద్రపోయే వ్యవధి అయిన ఎనిమిది గంటలకంటే కూడా చాలా ఎక్కువ సేపు నిద్రపోవడాన్ని ‘హైపర్సామ్నియా’గా (hypersomnia) చెప్పవచ్చుహైపర్సామ్నియాకు కారణాలు...∙హైపోథైరాయిడిజం అనే రుగ్మత ఉన్నవాళ్లూ, అలాగే దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడేవారు... రాత్రివేళల్లో వారికి సరైన నిద్రలేకపోవడం వల్ల పగలు ఎక్కువగా నిద్రపోతుంటారు. అలాగే నిద్రలో ఊపిరి అందకపోవడం (స్లీప్ ఆప్నియా), రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్, నార్కొలెప్సీ వంటి సమస్యలున్నవాళ్ల లోనూ నిద్ర ఎక్కువగా వస్తుంటుంది.∙స్లీప్ ఆప్నియా సమస్య : నిద్ర సమస్యల్లో ప్రధానమైనది నిద్రపోతున్నప్పుడు వచ్చే గురక కారణంగా ఊపిరి అందకపోవడం. దీన్నే స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అంటారు. శ్వాసప్రక్రియ 10 సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఆగిపోతే దాన్ని ‘ఆప్నియా’గా చెబుతారు. కొందరు తమది చాలా చిన్నపాటి గురక అని, దాంతో పెద్దగా ప్రమాదం లేదని అనుకుంటుంటారు. గురక చిన్నదైనా, పెద్దదైనా వుుక్కు నుంచి గొంతు వరకు గాలి తీసుకెళ్తే అవయవాల్లో అడ్డంకి వల్లనే ఆ గురక వస్తుంటుంది. ఆ అడ్డంకి వల్ల ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్ మోతాదు తగ్గి శరీరంలో కార్బన్–డై–ఆక్సైడ్ మోతాదులు పెరిగిపోతుంటాయి. దాంతో మెదడుకు అందాల్సినంత ఆక్సిజన్ అందక చాలాసార్లు తమకు తెలియకుండానే వాళ్లలో నిద్రాభంగమవుతుంటుంది. ఫలితంగా స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి నాణ్యమైన నిద్ర (క్వాలిటీ స్లీప్) ఉండదు. ఫలితంగా రాత్రివేళ సరిగా నిద్రలేకపోవడంతో ఆ నిద్రలేమిని (ఇంగ్లిష్లో స్లీప్ డెబిట్)ను ఉదయం వేళల్లో భర్తీ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఇలా గురక కారణంగా తరచూ నిద్రభాగం అవుతుండేవారు తరచూ ఉదయం వేళల్లో నిద్రతో తూగుతూ (నిద్రలో జోగుతూ) ఉంటారు. ఇలా తూగడం / జోగడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు జరిగే అవకాశముంది. డ్రైవింగ్ చేసేప్పుడు ఇలా తూగడం / జోగడం ఎంతో ప్రమాదకరం. అదీగాక ఇలా రాత్రివేళ నిద్రలేమి (స్లీప్ డెఫిసిట్) వల్ల ఉదయంవేళల్లో మందకొడిగా (డల్గా) ఉంటుంటారు.∙సమస్యలను పరిష్కరించడం (ప్రాబ్లమ్ సాల్వింగ్), ఏకాగ్రతా అలాగే సవుస్యపై దృష్టికేంద్రీకరణ (కాన్సంట్రేషన్)... ఇలాంటి అన్ని విషయాల్లోనూ సవుస్యలుంటాయి.∙తీవ్రమైన తలనొప్పులు : కొందరిలో ఉదయం వేళల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. నిద్రసమస్య కారణంగా రాత్రివేళల్లో నోటితో గాలిపీల్చుకోవడం వల్ల నోరెండిపోయిన ఫీలింగ్ కొనసాగుతుంది. పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ మోతాదులు తగ్గడంతో మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రస్థానమైన ‘వూమిల్లరీ బాడీ’ అనే అవయవం తాలుకు పరిమాణం (సైజ్) 20 శాతం వరకు తగ్గిపోతుంది. శరీరంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గడం వల్ల... దాని తాలూకు దుష్ప్రభావం గుండెపై పడుతుంది. హార్ట్ ఎటాక్స్తో అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ల ఆరోగ్య చరిత్ర (కేస్ హిస్టరీ) పరిశీలిస్తే... ముఖ్యంగా ‘స్లీప్ ఆప్నియా’ సమస్య ఉన్నవాళ్లలో 30 శాతం వుంది గుండెపోట్లకు గురవుతున్నట్లు అనేక పరిశీలనల్లో తేలింది. ∙‘రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్’ : ఈ సమస్యతో బాధపడేవారు పదే పదే తమ కాళ్లను కదిలిస్తూ, ఆ చర్య వల్ల రిలీఫ్ పొందుతుంటారు. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో పగలు చాలాసేపు నిద్రపోతూ ఉంటారు.∙‘నార్కోలెప్సీ’ : మెదడుకు సంబంధించిన ఈ జబ్బుతో బాధపడేవారు రాత్రి మామూలుగా నిద్రపోయినప్పటికీ... మళ్లీ పగటివేళ అలా కునుకులోకి జారిపోయి నిద్రలోకి వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటివారు మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోతూ ఉంటారు.∙కెటాప్లెక్సీ : ఈ సమస్య ఉన్నప్పుడు వాళ్లకు... నిద్రలేవగానే కాళ్లూ, చేతులు రెండూ కాసేపు పనిచేయకుండాపోతాయి. ఈ కండిషన్నే ‘స్లీప్ పెరాలిసిస్’ అని కూడా అంటారు.∙క్లీన్ లెవిన్ సిండ్రోమ్ : వీళ్లు నెలల తరబడి నిద్రపోతూనే ఉంటారు. వీళ్లకు ఆకలి కూడా ఎక్కువ. ఇలా ఎక్కువగా తినడాన్ని హైపర్ బులీమియా అంటారు. ఇక్కడ పేర్కొన్న ఇలాంటి అతినిద్ర (హైపర్సామ్నియా)కు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ను సంప్రదించి తగిన సూచనలూ, సలహాలు, తగిన చికిత్సలు తీసుకోవాలి.పారాసామ్నియా సమస్యలునిద్రలో వింతగా ప్రవర్తించడాన్ని ‘పారాసామ్నియా’ అంటారు. ఈ పారాసామ్నియాలో చిత్రవిచిత్రమైన చాలా రకాల సమస్యలను చూడవచ్చు.∙నిద్రలో నడవడం(స్లీప్ వాకింగ్) : ఇది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎమ్) స్టేజ్–4లో వచ్చే సమస్య. కొందరు తలుపులు తెరుచుకుని కూడా నిద్రలో నడుస్తూ వెళ్తారు. మర్నాడు ఉదయం నిద్ర లేచాక వాళ్లకు తాము చేసిందేమీ గుర్తుండదు. ఇలాంటివాళ్లు మేడ మీది నుంచి పోవడం లేదా ఇతరత్రా ప్రమాదాలకు (యాక్సిడెంట్స్కు) గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.∙నిద్రలో భయంతో ఉలిక్కిపడిలేవడం (స్లీప్ టెర్రర్స్) : ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో డాక్టర్లు ఈ సమస్యను ఎక్కువగా చూస్తుండటం చాలా సాధారణం. పెద్దగా అరుస్తూ నిద్రలోంచి లేవడం, లేచాక భయంకరంగా ప్రవర్తించడం, టీవీ లేదా మొబైల్ వంటి వస్తువులను విసిరేవేయడం లేదా బద్దలు కొట్టడం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చేసే పిల్లల్ని అదుపు చేయడమూ చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య ఎన్ఆర్ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4 లలో వస్తుంది. కాబట్టి ఆ దశల్లో వాళ్లేం చేస్తున్నారన్నది వాళ్లకు ఏమాత్రం తెలియదు.∙నిద్రలో పీడకలలు రావడం (నైట్మేర్) : ఈ సమస్యలో భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. ఇది కూడా ఎన్ఆర్ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4లో వచ్చే సమస్య. నిద్రలేచాక ఏమాత్రం గుర్తుకురాని భయంకరమైన కలలు వస్తుండటం ఈ జబ్బు విషయంలో జరుగుతుంటుంది.∙నిద్రలో కలవరింతలు, పొంతనలేని మాటలు (స్లీప్ టాకింగ్) : ఈ సమస్యతో బాధపడేవారు నిద్రలో ఏదేదో కలవరిస్తుంటారు. ఏమాత్రం పొంతన లేకుండా మాట్లాడుతుంటారు. ఇది కూడా ఎన్ఆర్ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4లో వచ్చే సమస్యే. ఆ దశలో వచ్చే సమస్య కావడంతో వాళ్లు మాట్లాడుతున్నదేమిటో వాళ్లకే తెలియదు. నిద్రలేపి అడిగినా వాళ్లేమీ చెప్పలేరు. అందుకే వాళ్లనేదైనా ప్రశ్నించినా పొంతనలేని సమాధానాలు చెబుతుంటారు.∙కన్ఫ్యూజనల్ అరోజల్స్ : నిద్రలోంచి లేచి ఏవేవో పొంతన లేని విషయాలను ప్రస్తావిస్తుంటారు.∙స్లీప్ అన్యురోసిస్ : చిన్నారులు నిద్రలో పక్క తడపటం మామూలే. కానీ సాధారణంగా ఈ అలవాటు మూడునుంచి ఐదేళ్ల లోపు పిల్లలప్పుడే ఆగిపోతుంది. అయితే అరుదుగా కొందరిలో పది పదిహేనేళ్లవరకు కొనసాగుతూ వారిని చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సామాజికంగా నలుగురిలో కలవడం, ఫంక్షన్లలో పాల్గొనడం, రాత్రుళ్లు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు వెనకాడటం, ఆత్మవిశ్వాసం, తమపట్ల తమకు గౌరవం (సెల్ఫ్ ఎస్టీమ్)తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. నిద్రకు సంబంధించి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. సమస్య నిర్ధారణ కోసం కొందరిలో వాటికి అవసరమైన కొన్ని రకాల పరీక్షలూ చేయాల్సి రావచ్చు. ఇక చికిత్సల విషయానికి వస్తే నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్లను సంప్రదిస్తే చాలావరకు కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైన కొందరికి కొన్ని రకాల ఉపకరణాలు వాడటం (సీ–ప్యాప్ లాంటివి), చాలా అవసరమైన మరికొందరికి తగిన మందులు వాడటం ద్వారా వైద్యనిపుణులు ఈ సమస్యలను పరిష్కరిస్తారు. స్లీప్ వాకింగ్ లాంటి నిద్రకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలు ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నందున నిద్రసమస్యలను తేలిగ్గా తీసుకోకుండా, బిడియం వదిలి డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించడం అవసరం.నిద్ర అంటే ఏమిటన్నది ఇంకా ఇప్పటికీ పూర్తిగా తెలియని రహస్యమే. ఆ కలల ప్రపంచమంటే ఏమిటన్నది ఇంకా పూర్తిగా పరిష్కరానికి నోచుకోని ప్రహేళికే. అందుకే నిద్ర గురించిన అధ్యయనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ నిద్ర తాలూకు అనేక దశలూ, స్లీప్కు సంబంధించిన అనేక సమస్యలూ, వాటికి పరిష్కారాలూ, ప్రశాంతమైన నిద్రకోసం పాటించాల్సిన సూచనలేమిటన్నది చూద్దాం...నిద్ర... దశలునిద్రలో ప్రధానంగా రెండు దశలుంటాయి. అందులో మొదటిది ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’గా చెప్పే ‘ఎన్ఆర్ఈఎమ్’ దశ. రెండోది ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’గా పిలిచే ‘ఆర్ఈఎమ్’ దశ. ఇందులో మొదట పేర్కొన్న దానిలో కనురెప్పల కింద కనుపాప కదలదు కాబట్టి దాన్ని ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’గానూ... అలాగే దాని తాలూకు మొదటి అక్షరాలతో సంక్షిప్తంగా ‘ఎన్ఆర్ఈఎమ్’గా చెబుతారు. ఇక రెండో దాంటో కనుపాప వేగంగా కదులుతుంటుంది కాబట్టి దాన్ని ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’గానూ సంక్షిప్తంగా ‘ఆర్ఈఎమ్’గా పిలుస్తారు.నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎమ్)లోని ఉపదశలు... కంటిపాప కదలికలు, కాళ్లూ చేతుల కదలికలు ఉండని మొదటి దశ ‘ఎన్ఆర్ఈఎమ్’ (నాన్ ర్యాపిడ్ ఐ వుూవ్మెంట్)లో మళ్లీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని నాలుగు ఉపదశలుంటాయి.ఇందులో...స్టేజ్–1 అనేది 10–15 నిమిషాల పాటు స్టేజ్–2 అన్నది 10–15 నిమిషాలు పాటు స్టేజ్–3 అన్నది 20–25 నిమిషాల పాటు స్టేజ్–4 అన్నది 20–30 నిమిషాల పాటుకొనసాగుతుంటుందని ఓ అంచనా.నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్లోని ఈ నాలుగు ఉప–దశలు దాటగానే... నిద్ర అనేది కంటిపాపలు వేగంగా కదిలే ఆర్ఈఎమ్ (ర్యాపిడ్ ఐ వుూవ్మెంట్) దశలోకి వెళ్తుంది. దీన్ని ఐదో దశ పరిగణిస్తే... ఇలా ఈ ఐదు దశలూ ఒక వరసలో కొనసాగడాన్ని ఒక ‘స్లీప్ సైకిల్’ అంటారు. ఇక్కడ పేర్కొన్న దశలవారీగా... ఒక రాత్రి నిద్రలో ఇలాంటి స్లీప్ సైకిల్స్ ఐదు నుంచి ఆరు వరకు నడుస్తాయి.ఏ అర్ధరాత్రో అకస్మాత్తుగా నిద్రలేచామంటే... మనం ఏ దశ తాలూకు నిద్ర నుంచి లేచామో తెలుసుకోడానికి ఓ బండగుర్తు ఉంటుంది. నిద్ర లేచీ లేవగానే చాలా వుత్తుగా ఉంటూ... వెంటనే తేరుకోలేనట్లుగా ఉంటే అప్పుడు వునం ‘ఎన్ఆర్ఈఎమ్’ దశ నుంచి లేచావున్నవూట. అదే ‘ఆర్ఈఎమ్’ దశలోంచి నిద్రలేస్తే రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. కనుపాపలు కదులుతుండే ‘ఆర్ఈఎమ్’ నిద్రలోనే కలలు వస్తుంటాయి. ఆ దశలోని కలలే చాలావరకు గుర్తుంటాయి. డాక్టర్ రమణ ప్రసాద్సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్ – పల్మునాలజిస్ట్నిర్వహణయాసీన్ -
'డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్'..! జస్ట్ 60 రోజుల్లో దాదాపు 15 కిలోల బరువు
బరువు తగ్గడం ఇటీవల ట్రెండీగా మారింది. స్మార్ట్గా వయసు తక్కువగా కనిపిస్తే ఏదో ఘనకార్యం సాధించిన ఫీలింగ్ చాలామందిలో. ఆ క్రమంలో ఆరోగ్యకరమైన పద్ధతుల వైపుకి కాకుండా షార్ట్కట్ల జోలికి వెళ్లి అనారోగ్యం పాలు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఎలాగైతేనేం వెయిట్లాస్ అయ్యితే చాలు అనుకునేవాళ్లు ఉన్నారు. ఆ వింత ధోరణిలోంచి పుట్టుకొచ్చిందే ఈ డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్. దెయ్యం పేరుతో పిలిచే ఈ డైట్ప్లాన్ ఆరోగ్యానికి అసలు మంచిదేనా..? ఎవ్వరైనా పాటించారా..అంటే..చైనాలోని హాంగ్జౌకు చెందిన 26 ఏళ్ల జియావోయు అనే మహిళ తన ప్రాణ స్నేహితురాలి వివాహం సమయానికి తగ్గడానికి ఈ డెవిల్ వెయిట్లాస్ ప్లాన్ ప్రయత్నించింది. జస్ట్ రెండు నెలల్లో దాదాపు 15 కిలోలు తగ్గాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రయత్నించింది. అయితే ప్రీడయాబెటిస్ బారినపడి ఇబ్బందులు కొనితెచ్చుకుంది. నిజానికి ఈ డైట్ వల్ల పోషకాహార లోపం, హర్మోన్ల అమసతుల్యత, పిత్తాశయ రాళ్లు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవ్వుతాయినేది ఆరోగ్య నిపుణుల వాదన. ఇక్కడ ఈ చైనా మహిళ జియావోయు ఈ వెయిట్లాస్ ప్లాన్తో తన స్నేహితురాలి వివాహానికి సరిగ్గా 50 కిలోల బరువు లక్ష్యానికి చేరుకుంది. అయితే తర్వితగతిన అలసట, తీవ్ర దాహం, ఆకలి, తలతిరగడం, గుండె దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆ వెయిట్లాస్ ప్లాన్లో భాగంగా చేసిన ఉపవాసల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో తేలింది. అధిక తీవ్రత వ్యాయామాలు చేస్తూ..పూర్తిగా కార్బోహైడ్రేట్లను తొలగించిది. దాంతో ఇన్సులిన్పై ఎఫెక్ట్పడి ప్రీ డయాబెటిస్ని ఎదుర్కొనక తప్పలేదామెకు. త్వరితగతిన బరువు తగ్గే వెయిట్లాస్ ప్లాన్ కండరాలు నష్టం, డీ హైడ్రషన్కి దారితీసి..చివరికి జీవక్రియను పూర్తిగా దెబ్బతీసింది. దెబ్బతో ఆ మహిళ వెంటనే ఆ డైట్ ప్లాన్కి స్వస్తి చెప్పి..తన జీవనశైలిలో మంచి మార్పులు చేసుకుంది. సమతుల్య ఆహారాన్ని స్వీకరించి, పరిమిత అధిక తీవ్రత వ్యాయామాలు లేదా ఏరోబిక్ వ్యాయమలు చేయడం ప్రారంభించింది. ఈ మార్పులతో ఆమె మూడు నెలల్లో 52.5 కిలోలు తగ్గింది. ఈ విధానంతో ఆమె మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు రావడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. 'డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్' అంటే..ఇది సరైన డైట్ ప్లాన్ మాత్రం కాదు. స్వీయంగా రూపొందించిన డైట్ ప్లాన్. తీవ్రమైన వ్యాయామాలు, డైట్, పరిమిత కేలరీలతో కూడిన డైట్. అలాగే వేగంగా బరువు తగ్గడమే ధ్యేయంగా రూపొందించిన అనారోగ్యకరమైన డైట్. ఇందులో ప్రధానమైన ఆహారాన్ని నివారించి, తీవ్రమైన వ్యాయమాలు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటంటారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి వాటి వల్ల బరువు తగ్గడం ఎలా ఉన్నా..జీవక్రియ నష్టం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమే ఎక్కుగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: భారతీయ అవుట్ఫిట్లో ఈయూ చీఫ్ ఉర్సులా ..!) -
పరిశోధనలూ చెబుతున్నాయ్... పెద్దల మాట చద్దిమూట!
రాత్రంతా మట్టి కుండలో పున్నీళ్లతో పులియబెట్టిన చద్దన్నం పొద్దున్నే తింటే మంచిదని అమ్మమ్మలు, నానమ్మలు తరతరాలుగా మనకు చెబుతూ, తినిపిస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈఅమృతాహారాన్నే ఉదయపు అల్పాహారంగా తిన్నవారే.ఇదంతా ఇప్పుడెందుకు? అంటే.. చెన్నైకి చెందిన స్టాన్లీ ఆసుపత్రి దీనిపై ఇటీవల పరిశోధన చేసి.. పులిసిన అన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రీయ వివరణ ఇచ్చింది. చద్దన్నం అని అందరూ పిలుచుకునే ఈ ఆహారానికి తెలుగునాట సద్దన్నం, సద్దికూడు, చల్దన్నం, పున్నీళ్లన్నం అని రకరకాల పేర్లు ఉన్నాయి. చద్దికుండలో పులిసిన నీళ్లను ‘తరవాణి’ అంటారు. ఈ పురాతన ఆహారం ఆరోగ్యానికి అమృతం లాంటిదని పెద్దలు చెప్పేవారు. చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజ్, అనుబంధ ఆసుపత్రి వైద్యులు దీనికి ఇటీవల శాస్త్రీయ ఆమోదం తెలిపారు. మట్టి కుండల్లో వరి అన్నాన్ని మజ్జిగ, గంజితో కలిపి పులి యబెడితే ప్రోబయో టిక్స్, పోస్ట్బ యోటిక్స్తో సహా ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయని వైద్యులు గుర్తించారు.పొట్టలో రోగాలు మాయం!2022లో పులిసిన అన్నంపై పరిశోధనలు చేశారు. లాక్టోబాసిల్లస్, లాక్టోకాకస్ లాక్టిస్ వంటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను; యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, న్యూరోప్రొటెక్టివ్, కార్డియో ప్రొటెక్టివ్ గుణాలు కలిగిన 200కు పైగా ప్రయోజనకరమైన మెటాబోలైట్లను పరిశోధకులు కనుగొన్నారు. ‘పులియబెట్టిన అన్నం తిన్న రోగుల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు మేం గమనించాం. ఖాళీ కడుపుతో కంజిని పరగడుపున 6 నెలలపాటు తిన్న 55 మంది రోగుల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. 13% మందికి ఉదర సంబంధ వ్యాధులు పూర్తిగా తగ్గాయి. ఒక మోస్తరు సమస్య ఉన్న వారి సంఖ్య 49% నుంచి 9%కి తగ్గింది’ అని వైద్యులు వివరించారు.ఏయే వ్యాధులకు ఉపశమనం?‘చద్దన్నంలోని సూక్ష్మజీవులు జీర్ణకోశ ఆరోగ్యానికి సహాయ పడ తాయి. కడుపునొప్పి, విరేచనాలు వంటివి కలిగించే ఇరిటబుల్ బౌల్ డిసీజ్, అల్సరేటివ్ కొలిటిస్ లాంటి వ్యాధుల నియంత్రణలో సహాయపడతాయి. రోజువారీ అవసరం మేరకు ఇనుము తదితర సూక్ష్మపోషకాలను అందిస్తాయి’ అని స్టాన్లీ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. కౌమార బాలికలు, గర్భిణుల్లో రక్తహీనతను నివారించడానికి చద్దాన్నాన్ని ఉదయపు అల్పాహారంగా ఇవ్వటం మేలని వీరు ప్రతిపాదిస్తున్నారు.21 రెట్లు పెరిగిన ఇనుము!పులియబెట్టిన అన్నం తిన్న వారిలో ఇనుము శాతం పెరిగినట్టు ఈ పరిశోధనలో తేలింది. ‘100గ్రా. అన్నంలో ఇనుప ధాతువు 3.4 మి.గ్రా. ఉంటుంది. పెరుగు, రొట్టెల తయారీలో జరిగే ప్రధా నమైన కిణ్వ ప్రక్రియ.. చద్దన్నంలోనూ జరుగుతుంది. ఆ ప్రక్రి య తర్వాత చద్దన్నంలో ఇనుము 73.91 మి.గ్రా.కు అంటే 21 రెట్లు పెరిగింది. ఇది గర్భవతులకు రోజువారీ కావాల్సిన ఇను ము కన్నా రెండింతలు అధికం’ అని వైద్యులు తెలిపారు.ప్రయోజనాలు∙ జీర్ణకోశ సమస్యలను తగ్గిస్తుంది∙కడుపు నొప్పిని తగ్గిస్తుంది ∙బాలికలు, గర్భిణుల్లో రక్తహీనతను పారదోలుతుంది ∙శరీరానికి బలాన్నిస్తుంది.ప్రోబయోటిక్స్ మ్యాజిక్∙తరవాణి తయారుచేయాలంటే.. అన్నాన్ని మట్టి పాత్రలో మజ్జిగ, గంజితో కలిపి రాత్రంతా పులియబెట్టాలి. వేసవిలో 8–10 గంటలు లేదా శీతాకాలంలో 14 గంటల వరకు నానబెట్టాలి. ∙అన్నాన్ని రాత్రి పూట పులియ బెట్టటం వల్ల ఫైటిక్ ఆమ్లాన్ని విచ్ఛిన్నం చేయటంతో పాటు ఇనుము, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలను పెంచే మంచి బ్యాక్టీరియా సంఖ్యను వృద్ధి చేస్తుంది. ∙లాక్టిక్ ఆమ్లం, 200+ మెటాబొలైట్లు శరీర అంతర్గత వాపు (ఇన్ఫ్లమేషన్)తో పోరాడతాయి. యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. గుండె, మెదడును రక్షిస్తాయి.ఇష్టంగా తాగేవారుచద్దన్నం, తరవాణి ఆరోగ్యానికి మంచిదని తరతరాలుగా మన పెద్దలు చెబుతున్న విషయమే. అందుకే మన వాళ్లు తరవాణి పొద్దున్నే పరగడుపున ఇష్టంగా తీసుకునేవారు. పొట్ట ఆరోగ్యానికి ఇది చక్కని ఔషధం.– డా.జి.వి.పూర్ణచందు, ఆయుర్వేద వైద్య నిపుణులు -
ఫైబర్ ఎక్కువ తీసుకుంటే, ఏమవుతుందో తెలుసా?
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్కు చెక్ పెట్టాలన్నా, జీర్ణక్రియ మెరుగుపడాలన్నా పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అందరూ భావిస్తుంటారు. అయితే అతి అనర్థ దాయకం అన్నట్లుగా గట్ ఆరోగ్యం కోసం అతిగా ఫైబర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అసలు రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలో తెలుసు కుందాం.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, వయస్సును బట్టి మనం తీసుకునే ఫైబర్ పరిమాణం మారుతుండాలి. పెద్దలు రోజువారీ ఆహారంలో సుమారు 30 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. 15 ఏళ్లలోపు పిల్లలకు 20 గ్రాములు, మూడేళ్లలోపు వారికి15 గ్రాముల ఫైబర్ సరి పోతుంది. అతిగా పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల పేగుల్లో చికాకు కలగడం, కడుపు బిగుతుగా ఉండటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువైనప్పుడు తగినంత నీరు తాగకపోతే మలబద్ధకం సమస్య మరింత జటిలమవుతుంది. అంతేకాకుండా, ఆహారంలోని క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి కీలకపోషకాలను శరీరం గ్రహించకుండా ఈ ఫైబర్ అడ్డుకుంటుంది. దీనివల్ల బరువు విపరీతంగా తగ్గడంతో పాటు పేగుల్లో అడ్డంకులు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఫైబర్ మాక్సింగ్ డైట్ పాటించేవారు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం అవసరం. ఒకేసారి కాకుండా ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అప్పుడే జీర్ణాశయం ఆ మార్పుకు అలవాటు పడుతుంది. పీచు పదార్థాలు తీసుకున్నప్పుడు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే కడుపు బిగదీసినట్టుగానూ...తిప్పుతున్నట్టు గానూ ఉండే ప్రమాదం ఉంటుంది.కృత్రిమ ఫైబర్ పైడర్లకు బదులుగా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలను ఎంచుకోవాలి. విభిన్న రకాల ఫైబర్లు అందాలంటే మొక్కల ఆధారిత ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పెరుగు లో గింజలు వేసుకోవడం లేదా సలాడ్స్ తీసుకోవడం మంచి పద్ధతి. పీచు పదార్థాలు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే వాటిని పరిమితికి లోబడి తీసుకున్నప్పుడే ఆ ప్రయోజనాలు లభిస్తాయని మరువ కూడదు. -
90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!
చాలామంది భారతీయ యువత డ్రీమ్ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్ అంటూ బాధపడుతున్నాడు. అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్ విజయ వర్గియాకు ఐస్ స్కేటింగ్ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్ కొద్దిపాటి ట్రీట్మెంట్కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్ ఇన్సురెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Parth Vijayvergiya (@parthvijayvergiya) (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!) -
రూ. 30 కోట్ల సంపద కంటే అతి విలువైనది పోగొట్టుకున్నా..!
జీవితంలో ఏం పోగొట్టుకున్నా..ఏదో ఒక సమయానికి తిరిగి దాన్ని సంపాదించుకోగలం. కానీ పాడైన ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి పూడ్చలేని నష్టం వాటిల్లచ్చు కూడా. అందుకే భూమ్మీద నూకలు ఉంటే ఏమైనా చేయగలం..అదే పోతే ఎన్ని ఉన్నా..నిరూపయోగమే అని మన పెద్దలు ఊరికే అనలేదు కాబోలు. ఇప్పుడు ఆ విషయాన్ని ఓ వ్యవస్థాపకుడు నెట్టింట షేర్చేస్తూ..తాను కూడా అదే తప్పిదం చేశానంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడుని వెళ్లదీసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రతిఒక్కర్నీ ఆలోచించేలా చేయడమే గాక 'ఆరోగ్యమే అన్నికంటే ముఖ్యం' అనే విషయాన్ని అందరికి గర్తు చేసేలా అమితంగా ఆకర్షిస్తోంది. ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశాడు. తాను వ్యాపార సంస్థలో సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టపోయానని చెప్పారు. దానిఫలితం తన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని నిజాయితీగా వివరించారు. తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ..బరువు పెరుగుతూనే వస్తున్నానని వాపోయారు. వ్యాపారం నష్టం తట్టుకోవడం సులువే..ఎప్పటికైన పోగొట్టుకున్నది సంపాదించేయొచ్చు. కానీ పాడైన ఆరోగ్యం బాగవ్వడం దాదాపు అసాధ్యం అని బాధగా చెప్పుకొచ్చారు. అంతేగాదు వ్యాపార నష్టం ఎప్పటికీ వ్యక్తిగత నష్టానికి దారితీయకూడదని గట్టిగా హెచ్చరించారు కూడా. తాను వ్యాపారంలో కేవలం రూ. 30 కోట్లే పోగొట్టుకున్నానని, దానికంటే విలువైన ఆరోగ్యంకోల్పోయానని ఆవేదనగా చెప్పుకొచ్చారు ఎవర్స్టోన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేశాయ్. కాగా, 2017లో దేశాయ్ భారతీయ స్పోర్ట్స్ బ్రాండ్ని దేశాయ్ D: FYని ప్రారంభించారు. అయితే ఈ వెంచర్ భారీ నష్టాలను చవిచూసింది. కేవలం 30 నెలల్లో ఆయన దాచుకున్న పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అంతా తాను 30 కోట్లు ఎలా కోల్పోయానో ఆరా తీశారే గానీ..ఈ 30 నెలలలో ఎంత టెన్షన్, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాననేది అడగలేదని అన్నారు. నిద్రలేమి అదిక బరువుకి దారితీస్తుంది..ఆ టైంలో ఒత్తిడితో రాత్రి ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రపోయానని, తనకు తెలియికుండానే చాలా ఒత్తిడిని అనుభవించానని అన్నారు దేశాయ్. వారానికి నాలుగుసార్లు వాకింగ్, జాగింగ్ వంటివి అన్ని చేసినా..తన శరీరంలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. ఎంత కష్టపడి వర్కౌట్లు చేసినా..నాణ్యమైన నిద్ర మాత్రం తిరిగి పొందలేకపోయానన్నారు. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేసుకోలేకపోయానని చెప్పారు. ఒత్తిడి, నిద్రలేమి శరీరాన్ని చిత్తు చేస్తాయ్..తన పోస్ట్లో ఒత్తిడి, నిద్ర లేమి ఏవిధంగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయో వివరించారు. ఆరుగంటల కంటే తక్కువ నిద్ర లేమి ఇన్సులిన్ని ప్రభావితం చేసి, టెస్టోస్టిరాన్ను దెబ్బతీస్తుంది.ఎక్కువైన కార్టిసాల్ (ఒత్తిడి ) క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ కొవ్వు తగ్గడాన్ని నిరోధిస్తుందిఎంతలా ప్రయత్నించినా నిద్ర లేమిని తరిమికొట్టలేరుచివరగా ఆయన తాను కోల్పోయిన సంపదను తిరిగి పొందగలిగినప్పటికీ..ఆరోగ్యపరంగా పూర్తిస్థాయిలో కోలుకోలేదని అన్నారు. అంతేగాదు. తాను సుమారు ఏడేళ్లలోనే కోల్పోయినదంతా సంపాదించానని, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందలేకపోయానని అన్నారు. అలాగే దేశాయ్ తన పోస్ట్ని ముగిస్తూ..తన తోటి వ్యవస్థాపకులందర్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునివ్వడం విశేషం. View this post on Instagram A post shared by Prashant Desai (@itsprashantdesai) (చదవండి: మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..) -
జస్ట్ 90 రోజుల్లో 12 కిలోల బరువు..! వెయిట్లాస్ ప్లాన్ ఎలా ఉండాలంటే..
బరువు తగ్గే జర్నీ నిబద్ధతతో కూడిన స్థిర ప్రయాణం. దీనికి ఎలాంటి షార్ట్కట్లు ఉండవు. కేవలం సరైన ఆహారం, చక్కటి వ్యాయామాల కలయికతోటే బరువు తగ్గడం అనేది సాధ్యం. చాలామంది ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్పే మాట ఇది. అదే నిజం అని నిరూపితమైంది కృష్ణ ఇంగ్లే రోగి విషయంలో. ఎన్నో ఏళ్లుగా అధిక బరువుతో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డ ఈ వ్యక్తి..జస్ట్ 90 రోజుల్లో ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడు. తనకు అదేలా సాధ్యమైందో కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. మరి అతడి వెయిట్లాస్ సీక్రెట్ ఏంటో సవివరంగా చూద్దామా..!.మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన కృష్ణ ఇంగ్లే ఎక్స్లో తాను అధిక బరువు సంబధిత సమస్యలతో బాధపడుతున్నానని, వెయిట్లాస్ కోసం యూట్యూబ్లో అనేక వీడియోలతో సహా ఏఐ హెల్ప్ కూడా తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అవేమి తన బరువుని తగ్గించలేకపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. ఏ చిట్కాలు, సూచనలు పనిచేయకపోవడంతో..కొల్హాపూర్కు చెందిన డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ను సంప్రదించినట్లు తెలిపాడు. ఆయన మంచి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార ప్రణాళికను సూచించారు. అదే సమయంలో భోజనంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకున్నారు. ప్రతి రోజు కనీసం 90 నుంచి 120 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకున్నాడు. స్వీట్స్కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. వారానికి ఒకసారి మాత్రమే 10 నుంచి 12 గ్రాముల చక్కెరను పెరుగులో కలుపుకుని తినేవాడు. అలాగే కృష్ణ రోజుకు రెండు పూటలా భోజనం చేయడం, భోజనం తర్వాత 10 నిమిషాల నడక తప్పనిసరిగా పాటించేవాడు. అయితే పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం చేసేలా చూసుకున్నాడు. అంతేకాకుండా వారానికి కనీసం నాలుగు రోజులు బీచ్లో 4 నుంచి 5 కిలోమీటర్లు నడిచేవాడు. ఈ విధమైన ప్రణాళికతో అంతకుమునుపు ఉన్న అధిక బరువు సంబంధిత సమస్యలన్నీ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా తీవ్రమైన ఎసిడిటీ సమస్య చాలమటుకు నార్మల్ అయ్యింది. అలా కృష్ణ 78 నుంచి 80 కిలోల బరువుకి చేరుకోగానే మొత్తం అనారోగ్య సమస్యలన్నీ చాలావరకు క్యూర్ అయ్యాయని పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు తాను డైట్లో ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా తెలిపాడు. కృష్ణ తన భోజనంలో గుడ్లు, చికెన్, పెరుగు, పప్పులు, సోయా చంక్స్ వాటితోపాటు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు, పండ్లు, సలాడ్లు ఉండేలా చూసుకునేవాడనని వివరించాడు. ఇక కృష్ణ విషయంలో బరువు తగ్గడంలో కీలకంగా మారినవి ఏంటో డాక్టర్ సాయాజరివు గైక్వాడ్ ఇలా పంచుకున్నారు.బాగా నిద్రపోవడంఆకలిని అదుపులో ఉంచుకోవడంమనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం తదితరాలే బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యాయని అన్నారు. అందువల్లే ఎసిడిటీ సమస్య తగ్గి, అతనిలో శక్తి స్థాయిలు మెరుగుపడ్డాయని అన్నారు. చివరగా ఆయన.. శరీరానికి పోషణవంతమైన ఆహారాన్ని అందేలా దినచర్యలో భాగం చేసుకోవడం అనేది స్థిరంగా ఉంటే..బరువు తగ్గడం అత్యంత సహజసిద్ధంగానే జరుగుతుందని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.A follower DM’d me this 👇 (shared with identity hidden)“Your posts changed my mindset about diet.”84–85 kg → 72–73 kg in 90 days.No extremes.Just clarity and consistency. 🙏 pic.twitter.com/7XFgOdP98y— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) January 17, 2026 (చదవండి: Republic Day 2026: గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రిక స్పెషాల్టీ ఇదే..! అష్టలక్ష్మి రాష్ట్రాల..) -
షాకింగ్ రిపోర్ట్: ఆ వ్యాధితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
న్యూఢిల్లీ: భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంతోనే కాకుండా, పెను ఆర్థిక సంక్షోభంతోనూ కొట్టుమిట్టాడుతోంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఒక వ్యాధి ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. అదే మధుమేహం (డయాబెటిస్). దీని కారణంగా భారత్ ఎదుర్కొంటున్న ఆర్థిక భారం అక్షరాలా 11.4 ట్రిలియన్ డాలర్లకు(ఒక వెయ్యి ఇరవై ఎనిమిది లక్షల కోట్లు) చేరుకుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.మధుమేహం కారణంగా అమెరికా తర్వాత అత్యధిక ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్న దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉంది. కేవలం ఇది ఒక ఆరోగ్య సమస్యగానే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యగా రూపాంతరం చెందిందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 828 మిలియన్ల(82 కోట్ల 80 లక్షలు) మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది భారత్లోనే ఉన్నారని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది.2022 నాటికి ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిస్ బాధితులు ఉన్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. పైగా భారత్లో మధుమేహంతో బాధపడుతున్న వారిలో దాదాపు 62 శాతం మందికి ఎటువంటి వైద్య చికిత్స అందకపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి దేశ ప్రజల ఆరోగ్యంపైననే కాకుండా, దీర్ఘకాలికంగా దేశ ఉత్పాదకతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మధుమేహం వల్ల కలిగే ఆర్థిక నష్టం కేవలం ఆసుపత్రి ఖర్చులకే పరిమితం కాదని ‘నేచర్ మెడిసిన్’ తన పరిశోధన వెల్లడించింది. రోగికి తోడుగా ఉండే వారు తమ ఉపాధిని వదులుకోవడం వల్ల దేశ జీడీపీలో దాదాపు 1.7 శాతం మేర నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. మధుమేహం వల్ల కలిగే ఆర్థిక భారంలో దాదాపు 90 శాతం లెక్కకు అందని ఖర్చులకే అవుతున్నదని వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.అభివృద్ధి చెందిన దేశాల్లో చికిత్స ఖర్చులు అధికంగా ఉంటే, భారత్ వంటి దేశాల్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక భారం పెరుగుతోంది. క్యాన్సర్ లేదా అల్జీమర్స్ వంటి వ్యాధుల కంటే కూడా మధుమేహం వల్ల కలిగే ఆర్థిక నష్టం అత్యధికమని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బరువు నియంత్రణ ద్వారా ఈ వ్యాధిని అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే, భారీ ఖర్చులను నివారించవచ్చని, దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టాన్ని తగ్గించవచ్చని ఈ అధ్యయనం తెలియజేస్తోంది.ఇది కూడా చదవండి: వృద్దాప్యంలో యవ్వనం.. జపాన్ బామ్మల సరికొత్త రికార్డు -
స్కిన్ చికెన్ తింటున్నారా? ఇది మీ కోసమే..
ఆదివారం రాగానే.. నాన్ వెజ్ కోసం ఉరుకులు పెడుతుంటారు. రేటు బోర్డు వంక ఒక చూపు చూసి.. కావాల్సిన క్వాంటిటీని ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో చికెన్లో స్కిన్ కోడికి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు లేకపోలేదు. తోలుతో కూడిన కోడిని.. అందునా కరెంట్.. గ్యాస్ స్టౌలపై కాల్పించుకుని మరీ ముక్కలు కొట్టిస్తుంటారు. అయితే ఏరికోరి పట్టుకెళ్లే ఇలాంటి చికెన్ నిజంగానే ఒంటికి మంచిదేనా?..స్కిన్ చికెన్ తినడం మంచిదా? కాదా? అని చాలామందికి అనుమానాలు, అనేక అపోహలు ఉన్నాయి. రుచి కోసం తహతహలాడే వాళ్లు కొందరైతే.. తింటే ఏదైనా జరగొచ్చని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు మరికొందరు. అయితే కోడి చర్మం చెడ్డదేం కాదు. అలాగని పూర్తిగా మంచిది కూడా కాదు. ఈ విషయంలో నిపుణులు చెబుతోంది కూడా ఇదే..చికెన్ స్కిన్లో ఎక్కువగా (unsaturated fatty acids-UFAs) ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగకరమైనవి. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. పైగా ఇవి ఆలివ్ ఆయిల్లో ఉండే ఏక అసంతృప్త కొవ్వులు(monounsaturated fats) లాంటివే. కాబట్టి గుండెకు చాలా మంచిది. అలాగే.. కోడి చర్మంలో కొంత ప్రోటీన్, కొంత కాలజెన్ కూడా ఉంటుంది. ఇవి చర్మం, కండరాలు, కీళ్లకు బలాన్ని ఇస్తాయి. ఈ ప్రయోజనాల గురించి తెలియకుండానే చాలామంది ఉత్త రుచి కోసమే స్కిన్ కోడి వైపు మొగ్గు చూపుతుంటారు.అదే సమయంలో కోడి చర్మం అధిక కేలరీలు, కొవ్వు కలిగిన భాగం కూడా. ఒక ఔన్స్ చికెన్ స్కిన్లో సుమారు 90–128 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తిన్నా.. హృదయ సంబంధ సమస్యలు, బరువు పెరగడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి స్కిన్ చికెన్ మితంగా.. వారానికి ఒకసారి లేదంటే నెలలో నాలుగైదుసార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. అప్పుడే గుండెకు..ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.కాల్చే పద్ధతులపైనా..కాల్చిన కోడికి ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. అందునా కట్టెల పొయ్యి అయితే బాగుంటుందని ఫీలవుతుంటారు. కానీ.. టౌన్లు, సిటీల్లో గ్యాస్ పొయ్యిలు, ఎలక్ట్రిక్ స్టౌలే కనిపిస్తుంటాయి. అయితే..రుచి బాగుంటుందని కట్టెల పొయ్యి ప్రిపర్ చేసేవాళ్లకు అలర్ట్. అలాంటి పొగలో హానికారక రసాయనాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వెలువడే పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్స్(PAHs), హెటిరోసైక్లిక్ అమెన్స్ (HCAs) వంటి రసాయనాలు క్యాన్సర్కు దారి తీయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి కూడా. కాబట్టి.. గాలి సరైన విధంగా బయటకు వెళ్లే రీతిలో ఉన్న గ్యాస్ స్టౌ, అసలు పొగ వెలువడని ఎలక్ట్రిక్ స్టౌలతోనే మంచిదని గుర్తించాలి.స్కిన్లెస్లో బ్రెస్టే బెస్ట్స్కిన్ లెస్ చికెన్లో బ్రెస్ట్ పీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. లెగ్ పీస్లతో పోలిస్తే.. పై భాగంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గుండెకు మంచిది. సంతృప్త కొవ్వు(Saturated fat) తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మతుకు సాయపడే అధిక ప్రొటీన్ లభిస్తుంది. అలాగే స్కిన్ లేకుండా వాడితే కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. వీటికి తోడు.. బ్రెస్ట్ పీస్లోని లీన్ మీట్(తక్కువ కొవ్వు (fat) కలిగిన మాంసం).. సులభంగా జీర్ణం అవుతుంది.సరిగ్గా ఉడకకపోయినా..స్కిన్ లేదంటే స్కిన్లెస్..ఏదైనా సరే చికెన్ తినడం శరీరానికి లాభాలు ఉన్నాయి. చికెన్లో అదనంగా విటమిన్లు B6, B12, నియాసిన్, సెలనియం, పాస్పరస్.. పోషకాలు ఉంటాయి. ఇవి మెటబాలిజంతో పాటు రక్తకణాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెంపు కోసం అవసరంపడేవే. అయితే వండే విధానం, తీసుకునే పరిమాణం ఆధారంగానే ఫలితం డిసైడ్ అవుతుంది. తాజా చికెన్కే ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. చికెన్ను ఉడికించడం, గ్రిల్, బేక్ చేయడం మంచిది. సరైన వేడిలో.. సరిగ్గా ఉడకకపోతే బాక్టీరియాల వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అలాగే డీప్ఫ్రైలు, స్కిన్ చికెన్ అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు తప్పవు. -
శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్లు..!
శీతాకాలంలో చాలామంది చర్మం పొడిబారి నిగారింపు లేకుండా ఉంటుంది. ఎంత తెల్లటి ముఖమైన చలిగాలికి పెళుసుగా జీవం లేనట్టుగా అయిపోతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ల ముఖం సైతం కళాహీనంగా ఉంటుంది. అందుకోసం ముఖానికి పూసే మాయిశ్చర్లు, క్రీమ్ వంటింటి చిట్కాలే ఉయోగిస్తే సరిపోదు. ఈ వణికించే చలిలో చర్మం ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఈ ఆరు సూప్లను మన డైట్లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. వీటితో అందం, ఆరోగ్యం రెండిటిని సొంతం చేసుకోవచ్చు. చర్మం మెరిసేలా పోషకాలందించే ఆరోగ్యకరమైన ఆ సూప్లు ఏంటో సవివరంగా చూద్ధామా..!.హైడ్రేషన్ని తోడ్పడేలా చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేసే ఈ సూప్లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చట. మాయిశ్చరైజర్లు, సీరమ్లు వంటివి బాహ్యంగా చర్మానికి మద్దతు ఇవ్వగా అంతరంగంగా హెల్ప్ అయ్యే ఆ సూప్లు ఏంటంటే..క్యారెట్, అల్లం సూప్లు: క్యారెట్లో బీటా కెరోటిన్ తోపాటు, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మం మరమత్తుకు, హైడ్రేషన్కీ కీలకమైనది. అల్లం యాంటిబయోటిక్ల పనిచేసి..ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తంఉది. ఈ వింటర్ సీజన్లో ఆరోగ్యానికి శక్తిమంతమైన సూప్గా చెప్పుకోవచ్చు.టమోటా తులసి సూప్: టమోటాలలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మం పాడవ్వకుండా కాపాడుతుంది, మృదువుగా ఉంచుతుంది. తులసిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రిఫ్రెషింగ్ ట్విస్ట్ను అందిస్తుంది. ఇది రుచిగా ఉండటమే గాక చర్మానికి సహజ మెరుపుని అందిస్తుంది కూడా.పాలకూర, కాయధాన్యాల సూప్: పాలకూరలో ఉండే ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఇక కాయధాన్యాలలోని ప్రోటీన్ చర్మ మరమత్తుకు హెల్ఫ అవుతుంది. పైగా చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది.గుమ్మడికాయ సూప్: గుమ్మడికాయలో విటమిన్లు ఏ,సీలు ఉంటాయి. ఇవి తేమను పునురుద్ధరించి చర్మం పొడిబారకుండా చూస్తుంది.దీని క్రీమీ టెక్స్చర్ చర్మ ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. దీనిలోని గుమ్మడి గింజలను కూడా డైట్లో చేర్చుకుంటే..చర్మానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.చికెన్ అండ్ వెజిటబుల్ సూప్: చర్మాన్ని ఆరోగ్యవంతంగా, తాజాగా ఉండేలా చేస్తుంది. అంతర్లీనంగా మంఇచ ఓదార్పుని, మృదుత్వాన్ని అందిస్తుంది.చిలగడదుంప, కొబ్బరి సూప్: చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి పాలు తేమను నిలుపుకునే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది. ఈ సూప్లు అంతర్లీనంగా చర్మ ఆరోగ్యాన్ని రిపేర్ చేసి అందంగా ఉండేలా చేయడమే కాకుండా ఆరోగ్యపరంగాను ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్లు. -
అమ్మ పాలకు ఇంకా అడ్డంకులా?
పట్నాల్లో, నగరాల్లో బిడ్డలకు పాలివ్వడానికి తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాజా నివేదిక తెలియచేస్తోంది. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో పాలిచ్చే తల్లులను ఇతరులు చూసే విధానం వారిని తీవ్రంగా అసౌకర్యం పాలు చేస్తోంది. దాంతో తల్లులు బయటకు రావడమే లేదని ఇప్పుడు కావాల్సింది ప్రతిచోటా బ్రెస్ట్ఫీడ్ రూమ్ల కంటే ‘పాలివ్వడాన్ని’ మామూలుగా చూసేలా సమాజంలో మార్పు రావాలని ఈ నివేదిక చెబుతోంది.తల్లిపాలే బిడ్డకు తొలి ఆహారం. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టిస్తే వారి ఆరోగ్యానికీ తల్లుల ఆరోగ్యానికీ ఎంతో మేలు. పాలు ఇవ్వలేని సమస్యలున్న తల్లులను మినహాయిస్తే మిగిలిన తల్లులందరికీ బిడ్డకు పాలివ్వడం అనిర్వచనీయమైన అనుభూతి. అయితే పల్లెలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఈ పని అత్యంత అసౌకర్యంగా మారుతోందని ‘ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్ అండ్ రివ్యూస్’ అకడమిక్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడి చేసింది. ప్రభుత్వం ఒకవైపు తల్లి పాలు ఇమ్మని ప్రచారం చేస్తున్నా అనేక అడ్డంకుల వల్ల బాలింతలు పసిబిడ్డలతో బహిరంగ ప్రదేశాలకు రావడాన్ని పరిమితం చేసుకుంటున్నారని ఈ అధ్యయనం చెప్పింది.కారణాలు→ పాలిచ్చే అవయవాన్ని లైంగిక దృష్టితో చూసే ధోరణి→ పురుషులతో పాటు స్త్రీలకూ ఉన్న అభ్యంతర దృష్టి→ వస్త్రధారణలో పరిమితులు→ కూడని పని చేస్తున్నట్టుగామాటిమాటికి సర్దుకోవాల్సి రావడం మన దేశంలో 88.6 శాతం ప్రసవాలు వ్యవస్థాగతంగా అంటే వైద్యకేంద్రాల్లో జరుగుతుంటే వీరిలో 63.7 శాతం మంది తల్లులు మాత్రమే ఏడాది వరకూ తమ పిల్లలకు తల్లిపాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే తల్లులకు కూడా బయట సౌకర్యమైన స్థితి లేదని అధ్యయనం చెబుతోంది.భయంతో తల్లిపాలకు దూరం‘బిడ్డకు తల్లి పాలివ్వడం అత్యంత సహజమైన, అవసరమైన ప్రకియ. కానీ ఆమె చుట్టూ అటువంటి వాతావరణం ఏర్పాటు చేయడంలో సమాజం విఫలమైంది’ అంటున్నారు బ్రెస్ట్ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బీపీఎన్ఐ) సంస్థ కేంద్ర సమన్వయకర్త డాక్టర్ బిడ్లా. ‘ఇతరులు చూస్తారనో, ఎవరైనా తప్పుగా అనుకుంటారనో భయంతో చాలామంది బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు బిడ్డకు పాలివ్వడం మానేస్తున్నారు. మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతోపాటు సమాజంలో నెలకొన్న దురభి్రపాయాలను దూరం చేయాలి’ అని ఆమె అంటున్నారు.దుస్తులది కీలకపాత్రబహిరంగ ప్రదేశాలలో చంటి పిల్లలకు పాలివ్వడంలో మన దేశంలో దుస్తులది కీలకపాత్ర అని అధ్యయనం తెలిపింది. చీర కొంగు, దుపట్టా లేదా ప్రత్యేకంగా కుట్టించుకున్న దుస్తులు ఉన్నప్పుడు చాటుచేసి తల్లులు సౌకర్యంగా పాలు ఇవ్వగలుగుతున్నారని, ఇతర దుస్తుల్లో ఉంటే పాలివ్వడం సమస్యగా మారుతుందని ఈ అధ్యయనం చెప్పింది. బ్రెస్ట్ఫీడింగ్ రూమ్ల ఏర్పాటు కంటే కూడా నిస్సంకోచంగా పాలు ఇచ్చే విధంగా సమాజ భావజాలం మారాలని అధ్యయనం చెప్పింది. స్పష్టంగా చె΄్పాలంటే బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు తల్లి ఏదైనా తినిపిస్తుంటే కలగని అసౌకర్యం పాలు ఇస్తుంటే ఎందుకు వస్తుందనేది సమాజం ఆలోచించాలని తెలిపింది.పరిమితం... అనవసరంబహిరంగ ప్రదేశాల్లో పాలు ఇచ్చే స్థితి లేకపోవడం వల్ల పాలిచ్చే తల్లులు తమ కదలికలను పరిమితం చేసుకుంటున్నారు. లేదా బయటకు వచ్చే ముందు అవసరం లేకున్నా చంటిబిడ్డకు పాలు తాగించి వస్తున్నారు. తల్లులు తమ ఉపాధి, పనుల కోసం బయటకు రాకుండా ఉండటం ఎంత సరికాదో అవసరం లేకపోయినా వేళగాని వేళలో పాలు తాగించడమూ సరికాదు. ఈ ఆటంకాలన్నింటి గురించి ఆలోచించే నగరాల్లో, పట్టణాల్లోని తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే పోత పాలు పట్టించక తప్పని నిర్ణయానికి వస్తున్నారనేది ఒక పరిశీలన.బ్రెస్ట్ ఫీడింగ్ రూంలు ఏవీ?గతంలో మహిళలు వాష్రూంలు లేక చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం చాలాచోట్ల మహిళల కోసం వాష్రూంలు ఏర్పాటు చేశారు. అయితే బ్రెస్ట్ ఫీడింగ్ రూంల ఏర్పాటు మాత్రం ఆ స్థాయిలో జరగలేదు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసినా తగ్గ ప్రచారం లేదు. కొన్నిచోట్ల నిర్వహణ సరిగా లేక వాటిని ఇతరులు వినియోగిస్తున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య బిడ్డలకు పాలివ్వడం తల్లులకు సంకటంగా మారింది.మారాల్సింది సమాజమే!బిడ్డలకు పాలిచ్చేందుకు తల్లులను సంసిద్ధం చేయాల్సిన అవసరం సమాజంలోని అందరిపైనా ఉందని నిపుణులు అంటున్నారు. వారికి తగిన స్థలం చూపించడం, సౌకర్యంగా భావించేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, గోప్యత భంగం రాకుండా చూసుకోవడం అవసరం అంటున్నారు. ఇటీవల కాలంలో బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెరగడం కూడా తల్లుల్లో భయాన్ని పెంచుతోంది. ఈ భయాన్ని పోగొట్టేలా వారి కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు. -
కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్గా మార్చేద్దాం ఇలా..!
పేరుకు న్యూ ఇయరే గానీ తెల్లారిలేస్తే మళ్లీ అదే తిండి. అవే సరదాలు. అవే సినిమాలు. అందుకే దాదాపుగా అందరికీ తెలిసినవే అయినా అవే ఆరోగ్య సూత్రాల్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అవే జాగ్రత్తల్ని చెబుతూ హెచ్చరిస్తున్నారు. కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా ఎప్పట్లాగే రెజల్యూషన్స్ తీసుకుంటూ మనం మాత్రం మళ్లీ వాటిని మరుసటి ఏడాదికి వాయిదా వేయడం లేదా? కాకపోతే ఒకసారి చెబితే కొందరైనా సీరియస్గా తీసుకుని ఆచరిస్తారనీ, దాంతో వాళ్లు ఆరోగ్యంగా, ఫిట్గా, ఆయుర్దాయం మరింతగా పెంచుకుని హెల్దీగా మారకపోతారా... కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్గా మార్చుకోకపోతారా అనే ఆకాంక్షతో ప్రముఖ హాస్పిటళ్లకు చెందిన పెద్ద డాక్టర్లంతా మరోమారు మనకు సుద్దులు చెబుతున్నారు. కొందరైనా ఆచరించి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటే... ఈ ఏడాదికి ఈ ఆరోగ్యవచనాల లక్ష్యాలూ, ప్రయోజనాలూ నెరవేరినట్టే! ఐదు ప్రముఖ హాస్పిటల్స్ నుంచి ఐదుగురు పెద్ద డాక్టర్లతో కొత్త ఏడాదిని హెల్దీగా మార్చుకునేందుకు సూచనలతో ప్రత్యేక కథనం...ఆహార పరమైన సూచనలు...వేళకు తినండి. ఆహారం తక్కువ మోతాదుల్లో తీసుకుంటూ రోజులో ఎక్కువసార్లు తినండి. దీనివల్ల జీర్ణవ్యవస్థపై భారం పడదు. దాంతో అది చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి భోజనం మితంగా ఉండాలి. ఓ ఆంగ్ల నానుడి ప్రకారం ఉదయం భోజనం రాజభోజనంలా, మధ్యానం మధ్యస్తంగా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండాలన్నది ఒక సూక్తి. తినే సమయంలో మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)ని పరిగణనలోకి తీసుకోండి. బీఎమ్ఐ అంటే ఒకరి బరువు డివైడెడ్ బై వాళ్ల ఎత్తు స్క్వేర్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి బరువు 80 కిలోలు అనుకుందాం. అతడి ఎత్తు 1.8 మీటర్లు అయితే 80 డివైడెడ్ బై 1.8 స్క్వేర్. ఫలితంగా దాదాపు 24.69గా వచ్చే ఆ విలువను బీఎమ్ఐ పట్టికతో సరి΄ోల్చుకుని ఎవరికి వారు తాము ఏ స్థూలకాయం పరిధిలో ఉన్నరన్నది తెలుసుకోవచ్చు. ఒకవేళ తమ బీఎమ్ఐ ప్రకారం ఎక్కువ ఊబకాయ పరిధిలోకి వచ్చేవారు బరువు తగ్గాలనుకున్నవారు డాక్టర్ సలహా మేరకు ఎలాంటి జీవనశైలి నియమాలు పాటించాలో, బరువు తగ్గడానికి ఏయే ఆరోగ్యకరమైన పద్ధతులు అవలంబించాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అదనపు బరువు ఉన్నవారు తమ కండరాలను (మజిల్ మాస్ను) కాకుండా అదనపు కొవ్వును మాత్రమే కరిగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శాకాహారం తీసుకునేవారు అన్ని రకాల తాజా ఆకుకూరలూ, కాయగూరల వెరైటీలు తీసుకోవాలి. అదే మాంసాహారం తినేవారైతే రెడ్మీట్కు బదులు... ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు తీసుకోవడం మంచిది. వాటితోపాటు తాజా పండ్లూ తీసుకోవాలి.డాక్టర్ సోనిక రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ఒత్తిడి నియంత్రణ కోసం... తీవ్రమైన ఒత్తిడితో పోలిస్తే పరిమితమైన ఒత్తిడి వల్ల పనులు సమయానికి పూర్తయ్యేలా చేయడం వల్ల కాస్తంత ప్రయోజనం ఉంటుంది. కానీ మితిమీరిన ఒత్తిడి ఆరోగ్యానికి ఎప్పటికీ హానిచేసేదే. మానసిక ఒత్తిడి పురుషుల కంటే మహిళలకే ప్రమాదకరం. ఒత్తిడి విషయానికి వస్తే పని ప్రదేశంలో ఒత్తిడి ఎదురైనప్పుడు మనం తప్ప ఇతరులైతే అంత పర్ఫెక్ట్గా చేయలేరనే భావనను వదిలిపెట్టి కొలీగ్స్తో పని షేర్ చేసుకుని ఓ టీమ్వర్క్లా చేసే పని ఒత్తిడిని తగ్గిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. పెంపుడు జంతువులో ఆడుకునేవారికీ, అక్వేరియమ్లో చేపలను చూస్తూ ఉండేవారికి, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తుండేవారికి ఒత్తిడి తగ్గి, గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ప్రకృతిసిద్ధమైన నీటి ప్రవాహం వంటి ధ్వనులూ... సంగీతం వంటివి ఒత్తిడిని తగ్గించే స్వాభావికమైన మందులు అనుకోవచ్చు. కోపం, విచారం వంటి ఫీలింగ్స్ను అణిచేయకుండా ఇతరులను ఆటంకపరచని రీతిలో వ్యక్తం చేయడమే మంచిది. మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఒప్పుకోవడం మంచిది. ఈగో కారణంగా ఒప్పుకోలేక΄ోతే అది మరింత ఒత్తిడి పెంచుతుంది. ఇంకా హాని చేస్తుంది. చక్కటి హాస్యంతో కూడిన సినిమాలు చూస్తూ, ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉండేవారికి రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులు రావడం తక్కువ. తమ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కారణంగా ఇలాంటివారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన హాస్యానురక్తిని పెంచుకోండి.డాక్టర్ మంజుల రావు, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్చెడు అలవాట్లకు దూరంగా...సిగరెట్, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్ పొగలో కనీసం 6000 హానికరమైన వ్యర్థ పదార్థాలుంటాయి. అందులో క్యాన్సర్కు కారణమయ్యేవి కనీసం 60 పదార్థాలుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్ల వ్యవధిలో ఒకరు సిగరెట్ కారణంగానే ్ర΄ాణాలు వదులుతున్నారని అంచనా. గుండెకు సంబంధించిన వ్యాధులతో చని΄ోయేవారిని పరిశీలించినప్పుడు వారిలో కనీసం 40 శాతం మంది తమ పొగతాగే అలవాటు కారణంగా తమ గుండెకు చేటు తెచ్చుకున్నవారేనని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే ఊపిరితిత్తులు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వచ్చినవారిలో దాదాపు 80 శాతం మంది తమ పొగతాగడం అలవాటు కారణంగా ప్రాణాంతకమైన ఆ జబ్బును తమ చేజేతులారా తెచ్చుకున్నవారే. పొగతాగే అలవాటు వల్ల రక్త΄ోటు పెరుగుతుంది. అది గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ సిగరెట్ పొగవల్ల దేహంలో పేరుకునే కార్బన్ మోనాక్సైడ్ వల్ల దేహం తనకు ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ను అంతగా తీసుకోలేక΄ోవడం, ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతాయి.ఇవన్నీ ఆరోగ్యానికి చేటు చేసే పరిణామాలే. పరిమితంగా రెడ్ వైన్ వంటి మద్యం తీసుకుంటే అది గుండెకు మేలు చేస్తుందనీ, రెండు పెగ్గులకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే మాటలన్నీ కేవలం అ΄ోహ మాత్రమే. ఎంత పరిమితంగా తీసుకున్నా మద్యం చేసే చేటు మాత్రం అపరిమితం. కాలేయం మొదలుకొని, రక్తనాళాలూ, రక్తప్రసరణ వ్యవస్థ, గుండె, కిడ్నీలు... అన్నిటికంటే ముఖ్యంగా కీలకమైన మెదడు... ఇలా దేహంలోని అన్ని అవయవాలనూ, సంబంధిత వ్యవస్థలను మద్యం దెబ్బతీస్తుంది. పైన పేర్కొన్న కారణాల నేపథ్యంలో పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ అలవాట్లు ఉన్నవారు క్రమక్రమంగా కాదు... తక్షణం వాటిని మానేయాలి. మంచి ఆరోగ్యం కోసం ఇలా మానేయడం అవసరం కూడా.డాక్టర్ పి. కిరణ్మయి, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజీ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ వ్యాయామం తప్పనిసరి... ఒకేచోట కదలకుండా చాలాసేపు కుదురుగా కూర్చొని ఉండటం గానీ, ఏ పనీ చేకుండా బద్ధకంగా కాలం గడపడం గానీ దేహానికి చేటు చేస్తాయని చాలా అధ్యయనాల్లో తేలిన విషయమే. పొగతాగే అలవాటు వల్ల దేహానికీ, దేహంలోని అవయవాలూ, వాటి వ్యవస్థలకు ఎలాంటి హాని చేకూరుతుందో, శారీరక శ్రమలేకుండా ఉండటం, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అలాంటి అనర్థాలే వస్తాయంటూ అనేక అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం... క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల గుండె బలంగా తయారవుతుంది. దాంతో రక్తపోటు అదుపులో ఉండటం, రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో ప్రతి కణానికీ తగినంత ఆహారం, ఆక్సిజన్ అందడం, గుండె కొట్టుకునే లయ (రిథమ్) క్రమం తప్పకుండా కొనసాగడం, ఎముకలకు తగిన న్యూట్రిషన్ అందడం, కండరాలు బలిష్టంగా ఉండటం, వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో కొలాజెన్ తగ్గడం వల్ల చర్మం వదులవుతూ వృద్ధాప్యం తాలూకు చిహ్నాలు కనిపించడంవంటి ఏజింగ్ అనర్థాలు నివారితమై చాలాకాలం పాటు యౌవనంగా ఉండటం వంటి అనేక ప్రయోజనాలూ చేకూరతాయి. నడక లేదా ఇతరత్రా తేలికపాటి వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్రలేమి వంటివి నివారితం కావడం, ఫలితంగా మంచి గాఢమైన నిద్రపట్టడం, రోజంతా ఉల్లాసంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతుంది. వ్యాయామం చేయడం అన్నది బోరుగా అనిపిస్తే ఆరుబయట ఉల్లాసంగా ఆటలాడటం, ఈదడం, ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకుండా నడవడం వంటి ప్రక్రియల ద్వారా దేహానికి వ్యాయామాన్ని సమకూర్చడం చాలా ఆహ్లాదకరమైన, సంతోషదాయకమైన మార్గాలు. దేహానికి ఆహారం ఎంత అవసరమయో, వ్యాయామమూ అంతే అవసరమని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అందుకే జిమ్లో చేరేందుకూ.. కుదరక΄ోతే కనీసం ఆటలాడేందుకైనా షూలేస్లు కట్టుకోవడం మొదలుపెట్టండి.డాక్టర్ ఆరతీ బెల్లారీ,సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్రిలాక్సేషన్, విశ్రాంతి, నిద్ర విషయంలో... రోజంతా పని చేస్తూనే ఉండకుండా, మధ్యమధ్య చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం.ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక అలసట తగ్గి, పని మీద ఏకాగ్రత, సామర్థ్యం మెరుగవుతాయి.వారంలో కనీసం ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ముఖ్యం. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతిలో నడక, తోటలో గడపడం, పనుల్లో బాగా బిజీగా ఉండేవారు... ఒకవేళ వాళ్లు మంచి యుక్తవయసులో ఉన్న యువత అయితే ట్రెక్కింగ్ లేదా హైకింగ్ వంటివి తమ ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వీళ్లంతా ఒక స్నేహబృందంగా ఏర్పడి వెళ్లడం ఒత్తిడిని తగ్గించి మంచి ప్రయోజనాన్నిస్తుంది. శరీరానికి తగినంత నిద్ర తప్పనిసరి. ఎలాంటి అంతరాయం లేని 6 నుంచి 8 గంటల రాత్రి నిద్ర అవసరం. నిద్ర అనేది శరీరంలో, మెదడులో, కండరాల్లో పునరుత్తేజం తెచ్చే సహజ ప్రక్రియ.నిద్రలోనే మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. తగినంత నిద్రలేక΄ోతే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఉంటాయని ఎన్నో అధ్యయనాలలో తేలింది. తగిన నిద్ర వలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతాయి.తక్కువగా నిద్ర ΄ోయేవారిలో రక్త΄ోటు, షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు, మైగ్రేన్ వంటి ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి.ప్రతిరోజూ రాత్రిఒకే సమయానికి పడుకోవడం (సాధారణంగా రాత్రి 9 తర్వాత), ఉదయం ఒకే సమయానికి (సాధారణంగా ఉదయం 6 గంటలకు) నిద్రలేవడం చాలా ముఖ్యం. దీనివల్ల మన శరీర గడియారం (సర్కేడియన్ రిథమ్) సరిగ్గా పనిచేస్తుంది, నిద్ర నాణ్యత మెరుగవుతుంది.చాలా తక్కువ నిద్ర (నాలుగు గంటల వ్యవధి కంటే తక్కువ నిద్రించడం) కూడా మంచిది కాదు, అలాగే అవసరానికి మించిన నిద్ర (ఎనిమిది గంటల కంటే ఎక్కువగా నిద్ర΄ోవడం) కూడా సమస్యలకు సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అధిక నిద్రకు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సంబంధం ఉండవచ్చు.ప్రతి వ్యక్తికి అవసరమైన నిద్ర కొంత భిన్నంగా ఉండవచ్చు. అయితే సాధారణంగా పెద్దలలో రోజుకు 7–9 గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరమని నిద్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ శరీరం సూచించే అవసరాన్ని గమనిస్తూ, క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడమే మంచి ఆరోగ్యానికి మార్గం. డాక్టర్ ఎల్.సునందిని, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ (చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా) -
ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా
ఇటీవల కాలంలో వేగనిజం అత్యంత ప్రజాదరణ పొందుతోంది. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు వేగన్గా మారుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటి, ప్రముఖ బాలీవుడ్ హీరో భార్య జెనీలియి డిసౌజా కూడా పూర్తిగా శాకాహారిగా మారినట్లు వెల్లడించారు. అయితే తాను మొదట్లో పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, తర్వాత పూర్తిగా వేగన్గా మారిపోయానని అన్నారు. ఎందువల్ల ఈ మార్పు, దానికి గల కారణాలను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. చాలామంది ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలోకి తాజాగా జెనీలియా డిసౌజా కూడా చేరారు. ఆమె 2020 నుంచి వేగన్గా మారారట. సోహా అలీఖాన్ యూట్యూబ్ ఛానెల్లో జరిగిన సంభాషణలో జెనీలియా తాను 2017లో మాంసాహారం నుంచి పూర్తిగా శాకాహారానికి మారినట్లు చెప్పారు. తాను 2017 నుంచి మాంసం తినడం మానేసినట్లు తెలిపింది. అయితే పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, కొద్దిగా పాల ఉత్పత్తులు, చీజ్, గుడ్లు వంటివి తీసుకునేదాన్ని అని అన్నారు. చాలామంది కూరగాయలు తినడం మొదలు పెడితే ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటారని తరుచుగా చాలామంది చెబుతుండే వారు. తనకు కూడా అలాంటి అనుభూతే కలిగిందని అంటోంది జెనీలియా. ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశ్యంతోనే ఈ రకమైన జీవనశైలిని అవలంభించానని అన్నారామె. తాను మాంసం తినే కుటుంబంలో జన్మించానని, తనకు పెద్దగా శాకాహారం అంటే ఏంటో తెలియదని అన్నారు. తాను బఠానీలు, బంగాళదుంపలు, పనీర్ మాత్రమే శాకాహారం అనుకునేదాన్ని, ఆ తర్వాత తెలిసింది అంతకుమంచి మంచి ప్రోటీన్ మాంసకృత్తులు ఉన్నా ఆహారాలు శాకాహారంలో కూడా ఉన్నాయని. అయితే తాను జంతు ప్రేమికురాలినే అయినప్పటికీ..అప్పుడు మాత్రం మాంసాన్ని ఇష్టంగా ఆస్వాదించేదాన్ని అని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే మాంసాహారాన్ని పరిమితం చేయడం మొదలు పెడతామో..అప్పుడు..ప్రతిది హాయిగా ఆస్వాదించగలుగుతాం, చాలా తేలికగా కూడా ఉంటుందన్నారామె. ఎలా మొదలైందంటే..మహమ్మారి సమయంలో 2020లో తాను పూర్తిగా వేగన్గా మారానని జెనీలియా పేర్కొన్నారు. తన భర్త రితేష్ కారణంగా ఇదంతా జరిగిందన్నారు. 2016లో ఆయన మాంసం తింటుంటే ఏదో బాగోలేని అనుభూతి కలుగుతోందని మానేశారు..అయితే అప్పటికీ తాను మాంసహారిగానే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. అలా జనవరి 1, 2017న తాము దీన్ని పూర్తిగా మానేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. అయితే అప్పటికీ తాము గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకునేవాళ్లం. కరోనా మహమ్మారి సమయం ప్రతిఒక్కరూ బిక్కుబిక్కుమంటున్న టైంలో రితేష్ ఎందుకు జంతు ఉత్పత్తులను కూడా మానేయకూడదు అని అడిగారు. దాంతో తాను సరే ఈ మార్పు ప్రయత్నించి చూద్దాం అన్నాను. రాను రాను అది అద్భుతంగా అనిపించడం ప్రారంభించింది, మా రోటీలో కొద్దిగా పాలు, లేదా వెన్న తినిన ప్రతిసారి కడుపు నిండిన అనుభూతి కలిగింది. ఇలా మారడం అంత ఈజీ కాదు, అలానే పూర్తిస్థాయిలో శాకాహారిగా మారలేరు కూడా. రోజులు గడుస్తున్న కొద్దిపూర్తిగా వేగన్గా మారడం ఎలా అనేది అవగతమవుతుంటుందని, ఇంకా ఇప్పటికీ తాను నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు జెనీలియా. పూర్తి శాకాహారంతో ఆరోగ్యంగా ఉండగలమా..?శాకాహారులుగా ఉన్న చాలామంది పోషకాహార లోపాలు ఎదుర్కొంటున్నారు కదా, మరి అలాంటప్పుడూ ఇది ఏవిధంగా ఆరోగ్యానికి మంచిది అనేది అందరిలోనూ ఎదురయ్యే సందేహం. అయితే పోషకాహార నిపుణులు ప్రాథమికంగా ఏ ఆహారమైన తీసుకునే విధానం బట్టే అన్ని ప్రోటీన్లు పుష్కలంగా తీసుకోవడం సాధ్యమవుతుందంటున్నారు. మాంసం తినేవారికి సైతం బీ12 లోపం ఉంటుందనేది గుర్తెరగాలి. అందువల్ల ఇలా శాకాహారిగా మారాలనుకునే వాళ్లు..అన్ని విటమిన్లు, ప్రోటీన్లు అందేలా సవ్వంగా మార్పులు చేసుకోవాలి. అలాగే మొక్కల ఆధారిత ఆహారాలు మన శరీరానికి అన్నింటిని అందించలేకపోవచ్చు గానీ..ఆ లోపాన్ని ఆయా సప్లిమెంట్స్తో ఈజీగా భర్తీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. (చదవండి: ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్స్టాక్ డెవలపర్ రేంజ్కి..!) -
ఆరోగ్యంపై ట్రంప్ కీలక అప్డేట్
వాషింగ్టన్: అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉందన్నారు. అయితే డాక్టర్లు చెప్పిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నానని వాల్స్ట్రీట్ జర్నల్స్కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ తన హెల్త్ సీక్రెట్స్ బయిటపెట్టారు.డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన కొద్దిరోజులు కనబడపోవడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన చేతిపై, కాళ్లపై గాయాలుండడం వాటిని కవర్ చేస్తూ ట్రంప్ మేకప్ వేసుకున్న చిత్రాలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ట్రంప్ స్పందించారు. "నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను" అని వివరణ ఇవ్వడంతో అప్పట్లో అంతా సైలంట్ అయ్యారు.అయితే తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " నా ఆరోగ్యంపై మాట్లాడడం ఇది 25వసారి. గత 25 ఏళ్లుగా ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నా. డాక్టర్లు 81mg తీసుకోమని చెబితే, నేను 325mg తీసుకుంటున్నాను. రక్తాన్ని పలుచగా చేయడంలో అంది ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నా గుండెలో చిక్కటి రక్తం వెళ్లడం నాకు ఇష్టం లేదు" అని ట్రంప్ అన్నారు. వైట్హౌస్లో ఇటీవల జరిగిన కార్యక్రమాలలో తాను వినడానికి ఇబ్బందులు పడుతున్నానని, తరచుగా నిద్రపోతున్నానని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ట్రంప్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి చర్చించడం తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తోందదన్నారు.. అయితే తనకు వ్యాయామం అంటే అస్సలు నచ్చదని ట్రెడ్మిల్పై నడవడం, పరిగెత్తడం చాలా బోరింగ్గా ఉంటుందని తెలిపారు. తన చేతులపై ఇప్పుడు కొన్ని గాయాలున్నాయని వాటికి 10 నిమిషాలు మేకప్ వేసుకుంటే సరిపోతుందని వాల్ స్ట్రీట్స్ జనరల్కిచ్చిన ఇంటర్వూలో తెలిపారు.ట్రంప్ వయస్సు ప్రస్తుతం 79 సంవత్సరాలు. ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకూ అదే పెద్దవయస్సు, అయితే 78 సంవత్సరాల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జో బైడెన్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. -
అక్కడ కాఫీ షాప్కి వెళ్లాలంటే హెల్మెట్ ధరించాల్సిందే..! ఎందుకో తెలుసా?
సాహసమే చేయ్రా డింభకా. అన్నది కదరా పాతాళభైరవి. చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది అన్న పాట పాడుకుంటూ సాహసం చేయాల్సిందే అక్కడ కాఫీ కోసం. హాయిగా ఆస్వాదించే కమ్మటి కాఫీ కోసం అంత కష్టపడటం ఏంటి అనుకోకండి. ఎందకంటే ఇక్కడ కాఫీ షాపు వెళ్లడం అంటే డేరింగ్ టూర్ లాంటిది. నిజానికి ఇక్కడకు కాఫీ కోసం వెళ్తున్నట్లు ఉండదు..ఏదో పర్యాటకానికి వచ్చామా..అన్నట్లు ట్రెక్కింగ్లు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ పోవాలి. అలా అని వాళ్లేమి మనకు టాస్క్లు, సరదా గేమ్లు పెట్టడం లేదు. ఆ కాఫీ షాపుకు వెళ్లే వే అలా సాహసానికి కేరాఫ్గా ఉంటుంది. ఇంతకీ ఆ కాఫీ షాపు ఎక్కడుందంటే..చైనాలోని యాంగ్షువో కౌంటీలోఈ వింతైన షాపు ఉంది. దీనిని 'ఎర్త్కోర్ ఎక్స్ప్లోరేషన్' అని పిలుస్తారు. ఒక గుహ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలా అని అంత ఈజీగా అది మనకు కనిపించదు. సాహసాలంటే ఇష్టపడే పర్యాటక ఔత్సాహికులకు ఈ కాఫీ షాప్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడకు వెళ్లాలంటే అడుగడుగున ఓ సాహాసం చేయాలి, కొన్ని క్లిష్టమైన టాస్క్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వెళ్తునప్పుడూ మన కాఫీ కోసం వెళ్తున్నామా..లేక ఏదైనా ట్రెక్కింగ్ లేదా టూర్కి వచ్చామా అనే సందేహం కలుగకమానదు. అంతేకాదండోయ్ ఈ గుహ గుండా వెళ్లేటప్పుడూ హెల్మెట్, సురక్షితమైన బూట్లు తప్పనిసరి. గుహ గట్లు, ఇరుకైన మార్గాలు, లోతుగా ఉండే ప్రదేశాలు, కొన్నిచోట్ల తాళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరికొన్ని చోట్ల..నిర్జన చీకటి ప్రదేశం గుండా వెళ్లి..అక్కడ వంతెనలు ఎక్కాల్సి ఉంటుంది. అలా చివరికి కాఫీ కేఫ్కి చేరుకుంటాం. అక్కడ సున్నపురాయి నిర్మాణాలు, స్టాలక్టైట్లు(మంచులా కనిపించే కాల్షియం కార్బొనేట్ అవపాతం), పైకప్పులు, చక్కటి లైటింగ్తో మరో ప్రపంచంలోకి అగుడుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అరకరడ ఉన్న శ్వేత నేపథ్యానికి తగ్గట్టు ఉండే తెల్టి కుర్చీలు మొత్తం సెటప్ అదరహో అనిపిస్తుంది. భూగర్భ శాస్త్రాన్ని కాఫీ సంస్కృతితో కలుపుతున్నట్లుగా ఉంటుంది అక్కడి వాతావరణం. ఈ కాఫీ కోసం ఎంతో శ్రమపడి వెళ్లి హాయిగా టేస్టీ కాఫీని ఆస్వాదించాల్సి ఉంటుంది మరి. మాములుగా కాఫీ తాగేస్తే మజా ఏం ఉంది..ఇలా డేరింగ్ ఫీట్లు చేస్తూ వెళ్లి కాఫీ తాగడంలోని కిక్కే వేరబ్బా..!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Jérôme Poirier (@jerometraveller) (చదవండి: Fast Track Immigration: ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..) -
భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా..
దేశవ్యాప్తంగా భావోద్వేగ మద్దతుకు డిమాండ్ పెరుగుతోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలు ఈ ఏడాది ఎక్కువగా వినిపించాయి. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల సమస్యలు, చదువుపై ఒత్తిడి, ఉద్యోగ భారం, గుర్తింపు సంక్షోభం, సామాజిక ముద్ర వంటి అంశాలతో బాధపడుతున్నవారి నుంచి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మానసిక ఆరోగ్య అవగాహన, ఆత్మహత్య నివారణ హెల్ప్లైన్ 1లైఫ్ (www.1life.org.in – 7893078930)కు నిరంతరంగా, భారీగా కాల్స్ వచ్చాయి. మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన పెరగంతో పాటు భావోద్వేగ సమస్యల తీవ్రత, సంక్లిష్టత కూడా పెరిగినట్టు ఇది స్పష్టం చేసింది. 2025లో జనవరి నుంచి డిసెంబర్ మధ్య వరకు 1లైఫ్కు మొత్తం 38,437 కాల్స్ వచ్చాయి. ఈ సంఖ్య అవసరం ఎంత పెద్దదో తెలియజేయడమే కాకుండా, సాధారణ బాధలు సంక్షోభం స్థాయికి చేరకముందే వాటిని అడ్డుకునే విషయంలో అనుభూతితో వినడం, సమయానికి స్పందించడం ఎంత కీలకమో స్పష్టం చేసింది. సంవత్సరం మొత్తం కాల్స్ సంఖ్య క్రమంగా పెరిగింది. జనవరిలో 2,224గా ఉన్న నెలవారీ కాల్స్ సెప్టెంబరులో గరిష్ఠంగా 4,135కు చేరాయి. ఈ పెరుగుదల 86%. జులై నుంచి అక్టోబర్ వరకు నెలకు దాదాపు 4,000 కాల్స్ వచ్చాయి. ఈ పెరుగుదల సీజనల్ కాదని, భావోద్వేగ, మానసిక ఆరోగ్య సమస్యలు నిరంతరంగా పెరుగుతున్నాయని ఈ గణాంకాలు సూచించాయి. ఏడాది మొత్తం వాలంటీర్లు కాలర్లకు మద్దతు ఇవ్వడానికి 1,838 గంటలు కేటాయించారు. సగటు కాల్ వ్యవధి కూడా పెరిగింది. ఈ సేవల గురించి 1లైఫ్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ రెబెక్కా మారియా మాట్లాడుతూ, “ప్రతి కాల్ వెనుక బాధ, అయోమయం, ఒంటరితనం కథలుంటాయి. ఆ బాధను ఇతరులతో పంచుకోవడానికి చాలామందికి భద్రత అనిపించదు. మేము చూస్తున్నది సంఖ్యల పెరుగుదల కాదు, బాధ తీవ్రత పెరుగుదల. చాలామంది కాలర్లు సమయం, సహనం, తమ భావాలకు విలువ ఉందన్న భరోసా కోరుతున్నారు. సంక్షోభ తరుణం దాటిన తర్వాత కూడా మద్దతు ఉంటుందన్న నమ్మకాన్ని వారు ఆశిస్తున్నారు” అని తెలిపారు. 1లైఫ్కు వచ్చిన కాల్స్ స్వరూపం కాలర్ల సవాళ్ల విస్తృతి, లోతును ప్రతిబింబించింది. ఆర్థిక ఒత్తిడి, సంబంధాలు చెడిపోవడం, చదువు, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ర్యాగింగ్, వ్యాపార నష్టాలు తదితర కారణాలతో ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నవారి నుంచి భారీగా కాల్స్ వచ్చాయి. ఇటీవల దక్షిణ, ఉత్తర భారతదేశాల నుంచి కూడా కాల్స్ పెరిగాయి. “నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భావోద్వేగ సహాయానికి పెరుగుతున్న డిమాండ్ అదే విషయాన్ని తెలియజేస్తోంది. ఎవరికీ వినేవారు లేరన్న భావన రాకుండా చూడడానికే 1లైఫ్ పనిచేస్తోంది. కాల్స్ సంఖ్య పెరుగుతుండటం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య అవగాహన, వాలంటీర్ శిక్షణ, అందుబాటులో ఉండే మద్దతు వ్యవస్థలపై మరింత పెట్టుబడి అవసరమని స్పష్టం చేస్తోంది” అని 1లైఫ్ డైరెక్టర్ టి.శ్రీకర్ రెడ్డి తెలిపారు. ఇటీవలి పలు సంఘటనలు ఈ గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాయి. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల యువకుడు ఆన్లైన్ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీగా నష్టపోయిన తర్వాత 1లైఫ్ను సంప్రదించాడు. అతడు ఇంటిని, భార్య ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అతడిని తీవ్ర నిరాశకు, ఆత్మహత్య ఆలోచనలకు నెట్టింది. 1లైఫ్ సానుభూతితో వినడం ద్వారా అతడికి తన బాధను చెప్పుకొనే అవకాశం కల్పించింది. సహాయం అందుబాటులో ఉందన్న భావనను అతడిలో మళ్లీ తీసుకొచ్చింది. మరో ఘటనలో ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల మహిళ ఆరేళ్ల బంధం ముగిసిన తర్వాత 1లైఫ్ను సంప్రదించారు. తామిద్దరం దూరంగా ఉన్నప్పుడు తన భాగస్వామి సహోద్యోగితో సంబంధం పెట్టుకున్నట్టు ఆమెకు తెలిసింది. ఆ మోసం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. మానసికంగా కుంగిపోయిన ఆ క్షణంలో ఆమె మద్దతు కోరారు. వివక్షను ఎదుర్కొంటున్నవారి నుంచి కూడా 1లైఫ్కు కాల్స్ వస్తున్నాయి. పశ్చిమబెంగాల్కు చెందిన 23 ఏళ్ల ట్రాన్స్జెండర్.. సమాజధోరణి తనను ఒంటరిగా, నిరుత్సాహంగా మార్చిందని చెప్పారు. ఎంబీఏ పూర్తిచేసి ఐటీ రంగంలో పనిచేస్తున్నా, తరచూ అవహేళన, దూరం పెట్టడం ఎదురయ్యాయి. అవి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. సంభాషణలో తీర్పు ఏమీ ఇవ్వకుండా ఆమె అనుభవాలను గుర్తించి, అంగీకరించారు. 2025 గణాంకాలు, అనుభవాలు దేశవ్యాప్తంగా వేలమందికి 1లైఫ్ కీలక జీవనాధారంగా నిలుస్తున్నట్టు స్పష్టం చేశాయి. అదే సమయంలో పెరుగుతున్న డిమాండ్ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అవి సూచించాయి. సామాజిక, ఆర్థిక, వృత్తిరంగాల్లో మానసిక ఆరోగ్య సవాళ్లు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాలంటీర్ల నియామకం, శిక్షణ, నిర్వహణ మద్దతుపై నిరంతర పెట్టుబడి అత్యవసరమని ఈ అనుభవాలు తెలియజేశాయి. (చదవండి: సెరిబ్రల్ పాల్సీ బాధితుడి సక్సెస్ స్టోరీ..తొలి ప్రయత్నంలోనే ఇంజనీరింగ్ సర్వీస్ సత్తా చాటి..) -
ఎక్కువమంది ఫాలో అయిన ఫిట్నెస్ సూత్రాలివే
2025వ సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం మనం. ఈ సందర్భంగా వివిధ రంగాలలో జీవన శైలి పరంగా ముఖ్యంగా ఫిట్నెస్ కోసం అత్యధికులు అనుసరించిన ట్రెండ్స్ ఏమిటో తెలుసుకుందాం..ఫిట్గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఫిట్గా ఉండేందుకు ఎంచుకునే విధానాలే రకరకాలుగా ఉంటాయి. కొందరు జిమ్ మెంబర్షిప్ తీసుకుని ఫిట్ అవుతారు. మరికొందరు యోగా చేయడాన్ని ఇష్టపడతారు. ఇంకొంతమంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ఫిట్గా ఉండేందుకు ఎక్కువమంది దేనిని అనుసరించారో ఓసారి రివైండ్ చేసుకుందాం.మొబైల్ ఫిట్నెస్ యాప్స్ఈ సంవత్సరంలో ప్రజలు తమ ఫిట్నెస్ను (Fitness) ట్రాక్ చేయడానికి ట్రాకింగ్ యాప్స్ను విస్తృతంగా ఉపయోగించారు. ధరించే పరికరాలు, ఆటోమేటెడ్ అలర్ట్లు ఇచ్చే ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచ్లు, హార్ట్ రేట్ మానిటర్ల వంటి పరికరాలు ఈ సంవత్సరం బాగా చర్చలో నిలిచాయి. పర్సనల్ ట్రైనర్ను నియమించుకోవడం కంటే ప్రజలు ఈ సంవత్సరం తమ ఫిట్నెస్ను సొంతంగా ట్రాక్ చేసుకున్నారు.మితంగా తినే మినిమల్ ఈటింగ్ హ్యాబిట్ఈ సంవత్సరంలో ఎక్కువమంది సమతుల్య ఆహారం (Balanced Diet) ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. రోజూ ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ రీల్స్ చూసి చూసీ చూసీ ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించి, తమ డైట్లో మంచి మార్పులు చేసుకున్నారు.ఔట్డోర్ యోగా2025లో అధిక సంఖ్యాకులు ఫిట్నెస్ను సీరియస్గా తీసుకుని ఔట్డోర్ యాక్టివిటీస్పైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఔట్డోర్ యోగా చేయడం ద్వారా తమను తాము ఫిట్గా ఉంచుకున్నారు. వీటితో పాటు వాకింగ్ చేయడం, పరుగెత్తడం, హైకింగ్, స్కీయింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ప్రజల ఫిట్నెస్ రొటీన్లో భాగమయ్యాయి.చదవండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?మార్నింగ్ వర్కవుట్స్సాయంత్రం సమయాన్ని బయట తిరగడానికి కేటాయించడం కోసం చాలామంది తమ ఉదయం రొటీన్లో వ్యాయామాన్ని చేర్చుకున్నారు. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా యోగా లేదా వాక్ చేయడానికి కూడా ఉదయం సమయం సరైనదిగా నిలిచింది.కలిసి మెలిసి..2025లో వైరల్ అయిన వాటిలో గ్రూప్ ట్రైనింగ్ యాక్టివిటీ ఒకటి. అదేంటంటే... ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం మరింత మెరుగ్గా ఉంటుందనిపించి చాలామంది తమకు తోడుగా ఎవరైనా ఉంటే జిమ్కి వెళ్లడం లేదా వర్కవుట్ చేయడంలో మునిగిపోయారు. -
మానసిక స్వస్థతపై దృష్టి
మానసిక స్వస్థతపై దృష్టిమన దేశంలో ప్రభుత్వాలకూ, సమాజానికీ, కుటుంబానికీ – ఎవరికీ పట్టని అత్యంత కీలకమైన సమస్యల్లో మానసిక అనారోగ్యం ఒకటి. ఆ రోగులకు కూడా హక్కులుంటా యనీ, వాటినీ పరిరక్షించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి చెప్పి రెండు దశాబ్దా లవుతోంది. మానసిక అస్వస్థుల కోసం ప్రత్యేక చట్టం చేయాలని 2007లోనే సూచించింది. వేరే దేశాల మాట అటుంచి పదేళ్లపాటు మన దేశమే ఆ సంగతి పట్టించుకోలేదు. 75 ఏళ్లుగా కొనసాగుతున్న కాలం చెల్లిన చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి2017లో పార్లమెంటు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఏం లాభం? అటుతర్వాత నుంచి దేశంలో మానసిక అస్వస్థతకు లోనవుతున్నవారి స్థితిగతులేమిటో, వారికి అందించాల్సిన సహాయ సహకారాలేమిటో కేంద్రానికీ, రాష్ట్రాలకూ కూడా అక్కర లేకపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బెంగళూరులోని నిమ్హాన్స్ ఆధ్వర్యాన ద్వితీయ సర్వే జరగబోతోంది. 2015–16లో జరిగిన తొలి సర్వే వయోజ నుల్లో మానసిక అస్వస్థతపై దృష్టి పెట్టగా, ఈసారి పిల్లలు, మహిళలు, వలసదారులతో పాటు వృద్ధుల్లో సైతం మానసిక స్థితిగతులెలా ఉన్నాయో ఆరా తీయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యం గురించి ఇచ్చిన నిర్వచనం సమగ్రమైనది. ఒక మనిషి తనకున్న శక్తి సామర్థ్యాలను సాకారం చేసుకోగల స్థితిలో ఉండి, జీవితంలో ఎదురయ్యే సాధారణ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తన ఉత్పాదకతతో సమాజ పురోగతికి దోహదం చేయగల శ్రేయోస్థితిని మానసిక ఆరోగ్యంగా ఆ సంస్థ నిర్వచించింది. కేవలం మానసిక వైకల్యం లేదా అస్వస్థత లేకపోవటం మాత్రమే ఆరోగ్యకరమైన మానసిక స్థితిగా చూడలేమని ఈ నిర్వచనం చెబుతోంది. ఒక అంచనా ప్రకారం మన వయోజ నుల్లో 15 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికం. అక్కడ 13.5 శాతం మందికి మానసిక సమస్యలు, ఒత్తిళ్లు ఉండగా... పల్లెసీమల్లో ఇది 6.9 శాతం. శరవేగంతో సాగే పట్టణీకరణ, ఉద్యోగ అభద్రత, జీవన వ్యయం పెరగటం, వృత్తిలో నానాటికీ అధికమయ్యే పోటీ, సామాజిక మాధ్యమాలను అతిగా చూడటం, ఫోన్తో అధిక సమయం గడపటం, ఆన్లైన్ వేధింపులు వగైరాలు సమస్యకు కారణమవుతున్నాయి. దురదృష్టమేమంటే ఇతర సమస్యల్లా మానసిక అనారోగ్యాన్ని వెనువెంటనే గుర్తించటం సాధ్యం కాదు. తమను చిన్నచూపు చూస్తారనే భయంతో ఆ స్థితిలోకెళ్లినవారు ఎవరికీ చెప్పుకోరు. తొలి దశలో వారిని గుర్తించటం కూడా కష్టం. అలాంటివారు అప్పుడప్పుడు అస్వాభావికంగా, అసహజంగా లేదా విచిత్రంగా ప్రవర్తించినా అది ఆ క్షణంలో వచ్చిపడిన సమస్యకు తక్షణ స్పందనగా పరిగణిస్తారు. తీరా గుర్తించేసరికి అప్పటికే చేతులు దాటిపోయిన స్థితి ఏర్పడవచ్చు. అందుకే ఈసారి సర్వే మానసిక అనారోగ్యం విస్తృతి ఎలావుందో, దాని పర్యవసానంగా వచ్చే వైకల్యం, అందువల్ల సామాజికార్థిక స్థితిగతుల్లో మార్పు, అలాంటివారి సంరక్షణకు తోడ్పడే మార్గాలు, సేవల లభ్యత వగైరాలను కూడా పరిశీలించబోతోంది. సమాజంలో ఎక్కువగా ఏయే గ్రూపులు ఇలాంటి అనారోగ్య స్థితికి లోనవుతున్నాయో, వాతావరణ పరిస్థితుల ప్రభావం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మన దేశంలో జనాభాకు తగినట్టు వైద్యులు లేరు. ఇక మానసిక అనారోగ్యానికి చికిత్స చేసేవారైతే చాలా అరుదు. లక్షమందికి కనీసం ముగ్గురు మానసిక వైద్యులుండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన. కానీ మనకు లక్షమందికి 0.75 శాతం మందే ఉన్నారు! 2022లో కేంద్రం టెలీ–మానస్ పేరుతో మానసిక ఆరోగ్య కార్యక్రమం మొదలుపెట్టింది. దానికి రోజుకు సగటున 2,500 ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే ఈ సమస్య ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇకనైనా సమగ్ర విధాన రూపకల్పనపై దృష్టి సారించాలి. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకూ కౌన్సెలర్లు తగినంత మంది అందుబాటులో ఉండేలా, ప్రజల్లో దీనిపై అవగాహన పెరిగేలా చూడాలి. ఈ సమస్య వల్ల మన ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టంతో పోలిస్తే దానికి కేటాయించే నిధులు పెద్ద ఎక్కువేం కాదు. -
2 వేల మందితో కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్
హైదరాబాద్: ఆరోగ్యం, ఫిట్నెస్పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2025కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ రన్నర్స్ సంస్థలో భాగంగా ఏర్పడిన ఎల్బీనగర్ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక వార్షిక రన్నింగ్ ఈవెంట్ ఈ నెల డిసెంబర్ 28న ఘనంగా జరగనుంది.ఈ మారథాన్కు సంబంధించిన టీషర్టులు, మెడళ్ల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి ఇందిరా ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కామినేని ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డా.గోకుల్ రఘురామ్, ఆస్పత్రి మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఏఆర్ఎస్ సత్యనారాయణలు పాల్గొని అధికారికంగా టీషర్టులు, మెడళ్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎల్బీ నగర్ రన్నర్స్కు చెందిన సుమారు 30 మంది రన్నర్లు, అలాగే కామినేని ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఈ ఈవెంట్కు తమ మద్దతు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వార్షిక రన్నింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతీ సంవత్సరం పాల్గొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం విశేషం. హైదరాబాద్ నగరంతో పాటు నగరం వెలుపల ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజూ నడక, పరుగులపై ఆసక్తి ఉన్న అనేక మంది ఈ మారథాన్లో పాల్గొంటున్నారు.ఈ సంవత్సరం నిర్వహించనున్న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2025లో మొత్తం నాలుగు విభాగాలు ఉన్నాయి. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు), 10 మైళ్లు (16.1 కిలో మీటర్లు), 10 కిలో మీటర్లు, 5 కిలోమీటర్లు. ఈ నాలుగు విభాగాల్లో కలిపి సుమారు 2,000 మంది రన్నర్లు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 28న ఆదివారం ఉదయం నిర్వహించనున్న ఈ రన్నింగ్ ఈవెంట్లో ఆరోగ్యం, ఫిట్నెస్పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్బీనగర్ రన్నర్స్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. -
చలికాలం... ఫుడ్ విషయంలో జాగ్రత్త!
గజగజలాడించే చలికాలంలో... ఎప్పుడూ వేడివేడిగా, మసాలాలు బాగా దట్టించిన ఫుడ్ తినాలని అనిపిస్తూంటుంది. చలి కాబట్టి దాహం కూడా అనిపించదు. చాలామంది వేడివేడి కాఫీ, టీలతోనే గడిపేస్తూంటారు. అయితే చలికాలంలో ఇలాంటి అలవాట్లు అస్సలు మంచివి కావంటున్నారు వైద్యులు. గరం గరం ఆహారం, కాఫీ, టీలు.. జిహ్వ రుచికి హాయినిచ్చినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు సరిపడవని అంటున్నారు. అందుకే ఈ వింటర్ సీజన్లో ఫుడ్ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో చూద్దామా..ఈ చలికాలంలో సమతుల్య ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ కాలంలో తీసుకునే ఆహారం, రోగనిరోధక వ్యవస్థను, జీర్ణక్రియ, చర్మపరిస్థితి, శక్తిస్థాయిలు, హార్మోన్ సమతుల్యతకు అనుగుణమైన పోషకవంతమైన ఆహారమే తీసుకోవాలని చెబుతున్నారు. తప్పనిసరిగా తినాల్సినవి..ఈ కాలంలో సూప్లు, కిచిడి, పప్పులు, తృణధాన్యాల గంజి, తదితరాలు శరీరాన్ని వెచ్చగా ఉండచడమే కాకుండా, తగిన ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు. అల్లం, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధద్రవ్యాలు పోషకవిలువను తగ్గించవు, వణికించే చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తాయి కూడా. చలికాలం అని చాలామంది పండ్లు, కూరగాయల వినియోగాన్ని పరిమితం చేస్తారు. ఇది మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పోషకాల కొరతకు దారితీస్తుందట. నిజానికి ఈ కాలంలో లభించే పళ్లను తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందటతేలికగా వేయించిన ఆకుకూరలు, కాల్చిన దుంపలు, పండ్లు తదితరాల్లో ఫైబర్లు, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అంతేకాకుండా ఈ కాలంలో సిట్రస్ పండ్లు, ఆపిల్స్, జామ వంటవి రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో హెల్ప్ అవుతాయటఇక 30 ఏళ్ల దాటిన మహిళలు, పెద్దల్లో కండరాల అలసట, ఆకలి పెరగడం, జుట్టు రాలడం, జీర్ణక్రియ నెమ్మదించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి తీసుకునే ఆహారం కచ్చింగా పోషకవంతమైనేద తీసుకుంటే మేలు. పప్పులు, పన్నీర్, గుడ్లు, టోఫు, పెరుగు, నట్స, చేపలు, లీన్ మాంసాలు తదితరాలు ఆరోగ్యానికి మంచివే కాకుండా పోషక స్థిరత్వాన్ని అందించి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా చేస్తాయట. ఈ కాలంలో హైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఈ కాలంలో దాహం వేయదు, అందులోనూ చలికాలం కావడంతో పరిమితంగానే నీటిని తీసుకుంటారు అందువల్ల ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు. ఈ సీజన్లో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు, మానసిక స్థితిపై గట్టి ప్రభావం చూపిస్తాయట. స్వీట్స్కి ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే తియ్యటి పండ్లు, ఖర్జురం, బెల్లం లేదా డార్క్ చాక్లెట్లు తీసుకుంటే మేలుచాలామంది కొవ్వులను అనారోగ్యకమరని తప్పుగా అపోహపడుతుంటారు. అయితే వింటర్లో ఆరోగ్యకరమైన కొవ్వలు హార్మోన్ల ఉత్పత్తికి, చర్మపరిస్థితికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రకు ముఖ్యమైనవట. ఈ సమయంలో నెయ్యి, ఆలివ్ నూనె, నట్స్, అవకాడోలు, కొవ్వుచేపలను పరిమిత క్వాంటిటీలో తీసుకుంటే మంచిదట. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Best Brain Boosting Foods: బ్రెయిన్కు మేలు చేసే ఆహారాలు..!) -
డయాబెటిస్?... ఈ పరీక్షలు మేలు చేస్తాయి!
మీరు మధుమేహులా? రోజూ మాత్రలు లేదంటే ఇంజెక్షన్లు వేసుకుంటున్నారా. అయితే ఈ కథనం మీ కోసమే. మీలో కొన్ని విటమిన్, సూక్ష్మ పోషకాల లోపం ఉండవచ్చు. వాటిని సరిచేసుకుంటే రక్తంలో చక్కర మోతాదులు కూడా మెరుగు అవుతాయి అని బ్రిటిష్ మెడికల్ జర్నల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఏ విటమిన్లు తక్కువ ఉంటే గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది? వాటికీ మధుమేహానికి సంబంధం ఏమిటీ?మన శరీరం ఒక సంక్లిష్ట యంత్రం అన్నది అందరికి తెలిసిన విషయమే. ఇది సక్రమంగా నడవాలంటే కనీసం 13 విటమిన్లు, మరెన్నో సూక్ష్మ పోషకాలు అవసరం. ఇవన్నీ మనం తినే ఆహారం ద్వారా లభించడం కష్టం. పైగా వయసు పెరిగే కొద్దీ తిన్న ఆహారం నుంచి విటమిన్లు, పోషకాలను శోషించుకోవడం కూడా కష్టం అవుతుంది. ఈ సమస్యకు మరికొన్ని కారణాలు కూడా చేరడం వల్ల మనం వ్యాధుల బారిన పడుతూంటాము. మధుమేహం విషయానికి వస్తే... ఈ వ్యాధి బారిన పడ్డ వారు ఆధికుల్లో విటమిన్ డి, బీ 12 లు తక్కువగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొంచెం కచ్చితంగా చెప్పాలంటే 60 శతం మధుమేహుల్లో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. అలాగే 29 శతం మంది ఆంటే నలుగురిలో ఒకరికి ఉండాల్సినంత బీ 12 ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాదు. 42 శాతం మధుమేహుల్లో మెగ్నీషియం లోపం ఉంటె 28 శాతం మందిలో ఐరన్ తక్కువగా ఉంటోంది. క్రోమియం, జింక్ లు కూడా తక్కువగా ఉంటాయని గుర్తించారు. ఈ లోపాలను సరిదిద్దుకుంటే మధుమేహం కూడా కంట్రోల్ లూకి వచ్చే అవకాశం ఉంటుంది.ఒక్కో దానిది ఒక్కో పాత్ర...విటమిన్ డి, బీ 12, మెగ్నీషియం, ఐరన్, జింక్, క్రోమియం లు మధుమేహ నియంత్రణలో తమదైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి విషయం తీసుకుందాం. ఇన్సులిన్ మెరుగ్గా పని చేసేందుకు, సరిగ్గా స్రవించేందుకు అవసరం. తక్కువ అయితే హెచ్ బీ 1ఏసీ ఎక్కువ అవుతుంది. నరాలు బాగా పని చేసేందుకు కావాల్సిన బీ 12 తక్కువ అయినా పరోక్షంగా మధుమేహాన్ని ప్రభావితం చేస్తుంది.రెండు పద్ధతులు..విటమిన్, పోషక లోపాలను సరిదిద్దుకునేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. ఆకుకూరలు, నట్స్ (వేరుశెనగలు, కాజు, బాదాం, పప్పులు వంటివి) గుమ్మడి, దోస లేదా ఇతర విత్తనాలు తీసుకోవడం. సహజ సిద్దమైన పద్దతి. కుదరదు, వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ విటమిన్లు, పోషకాల మాత్రలు తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ రకమైన మాత్రా అయినా సరే డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. మధుమేహుల విషయంలో ఇది మరీ ముఖ్యం. అన్నింటి కంటే ముందు.. మీరు విటమిన్, పోషకాల లోపాలను గుర్తించేందుకు పరీక్షలు చేసుకోవాలి. లోపాలను గుర్తిస్తే వాటిని సప్లిమెంట్ల ద్వారా భర్తీ చేసుకుంటే మధుమేహం నియంత్రణలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. వైద్యుల సలహా, సూచనల మేరకు ఒకసారి ప్రయత్నించి చూడండి. -
నకిలీ ఉత్పత్తులపై అవగాహన.. ఇదిగో
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి. -
ధ్యానం ఎందుకు చేయాలంటే..?
ధ్యానం ఇవాళ ఉరుకులు పరుగుల జీవితానికి అత్యంత అవసరం. పురాతన కాలంలో రుషులు ధ్యానాన్ని జ్ఞానోదయం కోసం ఒక సాధనంగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు జీవితంలో ఎదురవ్వుతున్న ఒత్తిడి, ఆందోళన వంటి సవాళ్లను అధిగమించి మనశ్శాంతిని పొందే మార్గంగా మారింది. సమయం తక్కువగా ఉండి, చేయవలిసిన పని చాలా ఎక్కువగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. అటువంటి సమయంలో మన శరీరంలో శక్తి అంతా హరించుకుపోతుంది. ఒత్తిడిని ప్రేరేపించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అమాంతం పెరగకుండా తగ్గించడానికి ధ్యానం సమర్ధవంతంగా ఉంటుంది. పైగా శక్తివంతంగా చేస్తుంది. ఇది మన మానసిస్థితిని మెరుగుపరిచి, జీవితాన్ని ఆనందమయంగా చేస్తుంది. జీవితంలో ఎంత ఎక్కువ బాధ్యతలు ఉంటే అంత ఎక్కువ ధ్యానం అవసరం ఉంటుందని ధ్యాన నిపుణులు చెబుతున్నారు. మన లక్ష్యాలు, ఆశయాలు ఎంత ఎక్కువ ఉంటే ధ్యానం చేయాల్సిన అవసరం అంత ఎక్కువగా ఉంటుందట. ఒత్తిడికి చక్కటి ఉపశమనం ధ్యానం. ధ్యానం అనేది శరీరానికి జీవననాడి, అలాగే మనసుకు మంచి శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా అప్రమత్తత, అవగాహన అంతగా మెరుగవ్వుతాయట. అంతేగాదు మనలో సృజనాత్మక శక్తి పెంచుతుందట. అందరిలోనూ నిస్తేజంగా ఉన్న ఈ క్రియేటివిటీ మేల్కోంటుందట. సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం అందిస్తుందట. అంతరంగంలో శాంతి లేకపోతే బాహ్య ప్రపంచం ప్రశాంతంగా ఉండదు. ధ్యానం అంతర్గత శక్తిని సుస్థిరం చేస్తుంది. తత్ఫలితంగా మనం స్ట్రాంగ్గా తయావ్వడమే కాకుండా ప్రతి పనిలో విజయాన్ని సునాయాసంగా అందుకోగలుగుతామని నమ్మకంగా చెబుతున్నారుని నిపుణులు. ఇది మానవ సంబంధాలను కూడా మెరుగుపరస్తుందట. సమాయానుసారంగా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందట. గందరగోళంతో సతమతమవుతున్న మనసుకు ఊరట, అలాగే దుఃఖాన్ని అధిమించగలిగే శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసే శక్తి ఒక్క ధ్యానంతోనే సాధ్యమని నొక్కి చెబుతున్నారు యోగా గురుశ్రీశ్రీ రవిశంకర్, పలువురు యోగా నిపుణులు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అవసరంమని వక్కాణిస్తున్నారు.(చదవండి: ప్రపంచ శాంతి కోసం ధ్యానం..ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ ప్రసంగం) -
డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ మెడిసిన్ సదస్సులో హాట్టాపిక్గా అశ్వగంధ..!
డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషన్ మెడిసిన్ సమ్మిట్లో అశ్వగంధ ప్రయోజనాలు చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదంలో అత్యంత అగ్రభాగాన ఉండే మూలికల్లో ఒకటైన అశ్వగంధ ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండొవ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025కి భారత్ వేదికగా మారింది. సాంప్రదాయ వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్లేలా భారత్ నాయకత్వం వహించడంతో అశ్వగంధ ప్రధాన టాపిక్గా మారింది. అంతేగాదు 'అశ్వగంధ: ట్రెడిషనల్ విజ్డమ్ టు గ్లోబల్ ఇంపాక్ట్ - పెర్స్పెక్టివ్స్ ఫ్రమ్ లీడింగ్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్' అనే సెషన్ను ఆయుష్ మంత్రిత్వ సహకారంతో భారత్లో ఈ వేడుకను నిర్వహించింది. ఈ అశ్వగంధలో అడాప్టోజెనిక్, న్యూరోప్రొటెక్టివ్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలకుగానూ అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న తరుణంలో శాస్త్రీయ సమకాలిన వైద్యం బలోపేతం చేసే దిశగా చర్చలపై దృష్టి సారించింది. యావత్తు ప్రపంచం క్లినికల్ మద్దతు ఇచ్చేలా దాని ప్రామాణికత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది భారత్. అందరూ వినియోగించేలా భద్రత, నాణ్యత, చికిత్స అనువర్తనాలను హైలెట్ చేసింది. అయితే మిస్సీసిపీ విద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఇఖ్లాస్ ఖాన్ అందరూ వినియోగించేలా చేయడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా దీనిపై శాస్త్రీయ పరిశోధనలకు పిలుపునివ్వడమే కాకుండా వినియోగించేలా చేయాలనే చర్చలకు వేదికైంది భారత్ అశ్వగంధతో కలిగే లాభలు..ఆధునిక కాలంలో అంటువ్యాధులులా మారిన ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది "ఆయుర్వేద మూలికల రాజు" అశ్వగంధ.నిద్రలేమిని నివారిస్తుంది. దీనిలో ప్రధాన ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను నియంత్రించే సామర్థ్యం ఉందటకండరాల ద్రవ్యరాశి, బలాన్ని పెంచి శారీరక పనితీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి మెరగవ్వుతుంది, మెదుడు ఆరోగ్యం బాగుంటుందిరోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిరక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుందిటెస్టోస్టీరాన్ ఉత్పత్తిని పెంచుతుంది, ప్రోటీన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది.ఉపయోగించే విధానం..కనీసం 60 రోజుల పాటు వినియోగిస్తే.. మంచి సత్ఫలితాలను పొందగలమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు వెచ్చని పాలలో 1/4 నుంచి 1/2 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మంచి పలితం ఉంటుందటదీన్ని ఆవునెయ్యిలో కలిపి మాత్రల మాదిరిగా కూడా తీసుకోవచ్చట. ఉయదం బ్రేక్ ఫాస్ట్ స్మూతీ లేదా ఓట్ మీల్కు ఈ పొడిని జోడించి తీసుకోవచ్చట.వాళ్లకి మాత్రం మంచిది కాదు..గర్భిణీ స్త్రీలు హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ఈ అశ్వగంధని వినియోగించపోవడమే మేలుథైరాయిడ్ రుగ్మతలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వాడటమే మంచిది. ఆటోఇమ్యూన్ పరిస్థితులు ఉన్నవారు కూడా వైద్యుల సూచనలు మేరకు తీసుకోవడం మంచిది.గమనిక: ఇది కేవలం అవగాహన మన సంప్రదాయ వైద్య విధానం గొప్పతనం తెలియజేయడం గురించే ఇచ్చాం ఈ కథనం. ఈ మూలికను వినియోగించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణును సంప్రదించడం ఉత్తమం. చదవండి: ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే.. -
తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..!
ఓ అరవై ఏళ్లు రాగానే..మనలో శక్తి సన్నిగిల్లుతుంది, ఆటోమెటిగ్గా చేసే వ్యాయామాల జోరు తగ్గుతుంది. వయసులో ఉన్నంత సులభంగా వృధాప్యంలో వ్యాయమాలు చేయలేం. ఫిట్నెస్ నిపుణులు పర్యవేక్షణలో ఈజీగా చేయగలిగే వర్కౌట్లనే ఆశ్రయిస్తాం. అలాంటిది 92 ఏళ్ల తాత 20 ఏళ్ల యువకుడిలా ఎన్నిపుష్ అప్లు చేస్తాడో తెలిస్తే కంగుతింటారు. చెప్పాలంటే అతడు ముసలి తాతలా కనిపించే యువకుడిలా ఉంటుంది.. వ్యాయమాలు చేసే తీరు. అతనెవరు, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.బ్రిస్టల్లోని స్పైక్ ద్వీపంలో నివసించే కెన్ అనే తాతకు 92 ఏళ్లు. కానీ అతడు 20 ఏళ్ల యుకుడి మాదిరిగా ఎలాంటి ఆయాసం లేకుండా అలవోకగా పుష్ అప్లు చేస్తుంటాడు. మాజీ కాంకోర్డ్ ఇంజనీర్ అయిన ఈ తాత ఫిట్నెస్ పరంగా అందరికీ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అతడు రోజుకి దగ్గర దగ్గర 400 నుంచి 600దాక పుష్ అప్లు చేయగలడట. అక్కడితో వర్కౌట్లు ఆపేయడు. దీని తర్వాత కోర్ వ్యాయామాలు చేస్తాడు, బరువుల ఎత్తుతాడు కూడా. దాంతోపాటు సుమారు 5 నుంచి 10 కి.మీ నడక కూడా తప్పనిసరిగా ఉంటుందట. చాలామంది ఇన్ని ఎందుకు చాలా తేలిగ్గా చేసే వాటిపై దృష్టిసారించమని హితబోధ చేసిన పట్టించుకోడట. ఎందుకిలా అంటే.. తాను చాలా ఏళ్ల నుంచి దినచర్యను ఇంట్రస్టింగ్ ఉండేలా చేసుకుంటానని చెబుతుంటాడు ఈ కెన్ తాత. ఎందుకంటే రొటీన్గా ఎప్పుడూ చేసే వ్యాయామాలు చేయడం అనేది చాలా బోరింగ్గా మారిపోతుందట. అందుకే..పుష్ అప్లు తర్వాత కడుపుని సాగదీసేలా హామ్ స్ట్రింగ్లు, పరుగు, తదితరాలు చేస్తూ..ఆసక్తికరంగా మార్చుకుంటాడట. కేవలం తాను క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలనే డెడీకేషన్, యాక్టివ్గా ఉండటంపై నిరంతర ఫోకసే ఇంతలా ఈ వయసులో ఫిట్నెస్గా ఉండటానికి కారణమని అంటాడు కెన్. మరి అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడంటే..డైట్..కెన్ తన రోజుని జంబో ఓట్స్, గోధుమలు, చియా గింజలతో కూడిన బ్రేక్ఫాస్ట్తో ప్రారంభిస్తాడట. వాటితోపాటు అరటిపండు, ఎండుద్రాక్ష, పాలు తదితరాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు.కెన్లా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..పెద్దయ్యే కొద్ది సిక్స్ప్యాకలు, మంచి శరీరాకృతి వంటి వాటిపై ఫోకస్ తగ్గి..ఆరోగ్యంగా జీవించాలనే కాంక్ష పెరుగుతుందట. అలా అనుకునేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారానికి పెద్ద పీటవేయడం వంటివి చేయాలట. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే..నడక, ఈత, సైక్లింగ్ తప్పనిసరి అట. ఇవి శరీరానికి తేలికపాటి శక్తి శక్షణ నిచ్చి..రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయట. అంతేగాదు మానసిక ఆరోగ్యం మెరుగగ్గా ఉండి.. ఒంటరితనం, ఆందోళన, నిరాశతో పోరాడగలిగేలా ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇ క్కడ కెన్లా అంతలా వ్యాయామాలు చేయలేకపోయినా..కనీసం నడక, చిన్నపాటి కండరాల కదలికల కోసం కాస్త తేలికపాటి వర్కౌట్లు చేసినా.. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా) -
కొద్ది సేపు బ్రేక్ ఇచ్చే కిక్ వేరేలెవెల్..!
పని చేయటం, విశ్రాంతి తీసుకోవటం అనేవి జీవితంలో రెండు అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటిలో సమతుల్యత కలిగి ఉండటం అనేది నైపుణ్యతకు సంబంధించినది. ఈ రెండింటిపై సరైన పట్టు తెలిసి ఉండటమే జ్ఞానం. పనిచేయడంలో విశ్రాంతి, విశ్రాంతిలో కార్యచరణతను చూడటం అనేది అంతులేని స్వేచ్ఛని అందిస్తుంది.బ్రేక్ ప్రాముఖ్యత...కాలం అనేది ప్రవహించే నది లాంటిది. ఆనందంగా ఉన్న సమయాన్ని సైతం తన ప్రవాహంలో తీసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రవాహంలో ముక్కుపుటాలవరకు మునిగిపోతాం. ఆ తర్వాత నది ఒరవడి తగ్గాక లేదా వరద ఉద్ధృతి తగ్గాక ఒడ్డుకి చేరుకుంటారు. అలేగా జీవితంలో కూడా ఒక్కోసారి సంపూర్ణంగా కాలంతో ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒడ్డుకు చేరి కూర్చొని గమనించాలి కూడా. అలాగే జీవితంలో కూడా ఇలాంటి సమతుల్యతను పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.సరైన కార్యాచరణే విశ్రాంతికి పునాది..!ఎంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్నా దానికి సరైన పునాది లోతుగా ఉండాల్సిందే. వింటినారిని ఎంత భాగా వెనక్కు లాగితే అంతవరకు బాణం దూరంగా వెళ్తుంది. అలాగే మన పనులు ఫలవంతమై, విజయం సాధించాలంటే. మనకు సరైన సమయంలో తగిన విశ్రాంతి అంత అవసరం. ధ్యానం అంటే..ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండే ఓ అద్భుత కళ. ఇది గాఢ నిద్రలో పొందే విశ్రాంతి కంటే విలువైనది. శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ సుదర్శన క్రియ. మెదడులోని ఆల్ఫా, బీటా తరంగాలు రెండింటిని పెంచి, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ను నియంత్రిస్తుంది. ఫలితం విశ్రాంతిగా ఉంటూనే అప్రమత్తంగా(ఎరుకగా) ఉంటాం. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా పనిచేయగలుగుతాం.బ్యాలెన్సింగ్ లైఫ్ కోసం..ధ్యానం వెనుకకు లాగిపట్టి లోలోపలకు తీసుకువెళ్లి..పరిస్థితుల నుంచి పారిపోనివ్వకుండా చేస్తుంది. ఇది సమతత్వాన్నిసాధించేందుకు చేసే అభ్యాసం. అంతరంగంలో ప్రశాంతత, బాహ్యంగా చైతన్యంగా ఉండేలా చేస్తుంది.ఇది అందరికి తప్పక అవసరమైనది. మనలో కలిగే సంఘర్షణలకు పరిష్కారం తోపాటు అంతరంగ శాంతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఎప్పుడైతే అంతరంగంలో ప్రశాంతత ఏర్పడుతుందో..సానూకూలంగా స్పందించగలుగుతాం. సున్నితంగా ఉంటూ సానకూలంగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఎందుకంటే సున్నిత మనస్కులు చిన్న విషయాలకే ఆవేశ పడిపోతారు. అతిగా స్పందించేవారు ఇతరులు ఏమనుకుంటారనేది అనవసరం, తమ వైఖరే సరైనదనేది వారి నమ్మకం. అందువల్ల సున్నతత్తం స్పందించే మనసు రెండూ అవసరమే మనిషికి. ఈ నాగరిక సమాజంలో మనగలగాలంటే..సంబంధాలు, సమతుల్యత రెండూ అవసరం. ముఖ్యంగా మన భావ ప్రకటన సవ్యంగా ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదు.విరామపు శక్తని ఎలా పెంపొందించుకోవాలంటే..మొదటగా విరామం అవసరం అన్న ఆలోచనే మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనివ్వదు. బాగా కష్టపడి పనిచేయాలన్న ఆలోచన అలసట తెప్పిస్తుంది.తక్కువ సమయమైనా విశ్రాంతి పునరుత్తేజాన్ని అందిస్తుంది. ధ్యానం చేసేందుకు నాకు ఏం అక్కర్లేదు, నేను ఏం కాను, ఏమి చేయడం లేదు అనే వాటిని వదిలేయండి. మూడు కాలం మిమ్మల్ని నియంత్రించేలా చేయకండి, సమయం సరిపోవటం లేదన్న ఆలోచనే వద్దు. చివరగా చేసే పనిలో తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించండి. ఇక్కవ విశ్రాంతి తీసుకున్నప్పుడు శక్తిపొందుతారు, పనిచేసినప్పుడూ శక్తిని వ్యక్తపరుస్తారు. ఈ రెండిటి కలయికే జీవితం.సృజనాత్మకత, చైతన్యానికి మూలం ధ్యానం..చివరగా ధ్యానం చేయండి, అది మిమ్మల్ని, మీ మనసుని శుభ్రపరిచి, పనిభారాన్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తుంది. మనసు విశ్రాంతి పొందినప్పుడే బుద్ధి పదునెక్కుతుంది.ప్రశాంతమైన, స్థిరమైన మనసు మందకోడిగా ఉంటుంది. అది ఉత్సాహానికి, సృజనాత్మకతకు నెలవుగా మారి, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటన్నింటిని పొందగలిగేలా చేస్తుంది. -
సరికొత్త టెక్నాలజీతో మోకాళ్ల నొప్పులకు ఉపశమనం..! నాగార్జున సైతం..
మోకాళ్లు నొప్పులు ఎంతలా వేధిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. బాధితులు తాళలేక ఎంతలా ఇబ్బంది పడతారనేది మాటలకందనిది. టాలీవుడ్ నటుడు నాగార్జున సైతం తానుకూడా ఆ సమస్యతో 15 ఏళ్లుగా బాధపడుతున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.వాళ్ల అమ్మ కూడా ఆ సమస్యతో బాధపడేదని, తన బాధను చూడలేపోయేవాడినని అన్నారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీతో తనకు కొంత ఉపశమనం లభించిందని అన్నారు. అదెలాగో నటుడు నాగార్జున మాటల్లోనే తెలుసుకుందామా..!.మా అమ్మకు మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉండేవి. దీంతో అప్పట్లో ఆమె బాధ చూడలేకపోయేవాడిని.. నొప్పులతో ఓ వైపు అమ్మ బాధ పడుతుంటే.. ఆమెను చూసిన నాకు ప్రాణం విలవిలలాడిపోయేది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం నన్ను బాధించింది.. ప్రస్తుతం నగరంలో ఈ మోకాళ్ల నొప్పులకు స్కైవాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.. అని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. భాగ్య నగరంలోని గచ్చిబౌలిలో ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన స్కైవాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ టెక్నాలజీని బంజారాహిల్స్లోని లీలా గ్రాండ్లో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ‘రోజులు మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. శరీరంలో కృత్రిమ అవయువాలు అమర్చడం, అవయవ మార్పిడి వంటి చికిత్సలు విజయవంతంగా చేపడుతున్నారు. గతంలో ఇటువంటి వైద్య సేవలు అందుటులో ఉండేవి కావు. దీంతో బాధితుల కష్టాలు వర్ణణాతీతం. ఇందుకు మా అమ్మే ఉదాహరణ. నా కళ్ల ముందు అమ్మ బాధపడుతుంటే చూడలేకపోయేవాడిని. ఆర్టిఫిషియల్ అవయవాలు అందుబాటులోకి వచ్చిన తరువాత పెయిన్ ఫ్రీ లైఫ్ చూస్తున్నాం. ప్రయాణ సమయంలో, ఎయిర్ పోర్టులు, ఇతర ప్రదేశాల్లో మోకాళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు. నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొత్త టెక్నాలజీ గౌరవంగా బతకడానికి ఎంతో ఉపయోగకరంగా మారింది.. ప్రస్తుత పరిస్థితుల్లో శరీరానికి ఫిట్నెస్ అవసరం. అదే మంచి జీవితాన్ని అందిస్తుంది. కులూమనాలీ షూటింగ్ సమయంలో నీ పెయిన్ సివియర్గా బాధించింది. కుంటుకుంటూ వెళ్లాను. అమ్మను చూసిన తరువాత నాకు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదనిపించింది. నా స్నేహితులు డా.ప్రభాకర్ గురించి చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక ఐదేళ్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేదు’అని నాగార్జున తెలిపారు. అక్కడి నుంచి ఏదైనా కొత్తగా మందులు, టెక్నాలజీ వస్తే పరస్పరం షేర్ చేసుకుంటాం. స్కైవాకర్ బిగ్ హీల్ ఫర్ మీ అని పేర్కొన్నారు నాగార్జున . కార్యక్రమంలో ఆరిట్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: వెయిట్ లిఫ్టింగ్తో కంటి చూపుకే ముప్పు..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!
ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంత కాలం జీవించగలం అనేది జెనెటిక్ అంశాలతో పాటు, జీవనశైలి, రోజువారీ అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. దీర్ఘాయుష్కులుగా 90 అంతకంటే ఎక్కువ కాలం జీవించ గలమా లేదా అనేది తెలుసుకోవాలంటే 5 అద్భుతమైన పరీక్షలున్నాయి, వీటిల్లో చాలామంది మూడు పరీక్షల్లోనే ఫెయిలవుతున్నారు అంటూ డాన్ గో అనే ఫిట్నెస్ కోచ్ ఇన్స్టా పోస్ట్ నెట్టింట ఇంట్రిస్టింగ్ మారింది. మరి ఆ పరీక్షలేంటో ఒకసారి చూసేద్దామా?సాధారణంగా సుదీర్ఘం కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఒత్తిడి లేని జీవితం, సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, ఒక వయసుదాటిన తరువాత కొన్ని ఆరోగ్య పరీక్షలు (ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఏమీ లేనివారు) చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మరి 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ అయిదు పరీక్షలు చాలా కీలకమంటూ ఆరోగ్య కోచ్ షేర్ చేశారు. View this post on Instagram A post shared by Dan Go | Fitness Coach (@coachdango)నడక వేగంఎంత వేగంగా నడవ గలరు అనేదాని మీద కూడా మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్ చేసుకోవాలి. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం. 1 మీ/సె (2.2 మైళ్ల) కంటే ఎక్కువ వేగం ఎక్కువ ఆయుర్దాయం కలిగిస్తుందని అంచనా. . 2.7 మైళ్ల కంటే ఎక్కువ వేగంగా నడవ గలిగితే మరణం ముప్పు తగ్గుతుందట. వేగంగా నడిచేవారిలో వృద్ధాప్యం లక్షణాలు తొందరగా కనిపించవు.విశ్రాంతి హృదయ స్పందన రేటులో రెస్టింగ్ హాట్ బీట్ రేట్ (ఏ పనీలేదా వ్యాయామం చేయకుండా విశ్రాంతిగా ఉన్నపుడు) మన గండెప నితీరుకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి నిదర్శనం.నిమిషానికి 70 బీట్స్ (బిపిఎం) కంటే తక్కువ కొట్టుకుంటే సాలిడ్గా ఉన్నట్టు. 60 బిపిఎం కంటే తక్కువ అంటే ఎలైట్ దీర్ఘాయువు ప్రాంతం.అదే విశ్రాంతి సమయంలో 80-90 బిపిఎం కంటే ఎక్కువ గుండె స్పందన ఉంటే గుండె దృఢత్వానికి సంబందించిన వ్యాయామాలు మొదలు పెట్టాల్సిందే అని సూచన.కూర్చుని పైకి లేచే ( Sit and Rise) పరీక్షడాన్ చెప్పిన దాని ప్రకారం 87 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారట.ఇది చాలా సులభం అనుకుంటారుగానీ, నేలపై కూర్చుని,చేతుల సాయం లేకుండా తిరిగి నిలబడటం అనేది వయస్సు పెరిగే కొద్దీ బలం, సమతుల్యత, చలనశీలత, సమన్వయానికి నిదర్శనం. 85 సంవత్సరాల వయస్సులో, గాయాలకు సంబంధించిన అన్ని మరణాలలో దాదాపు 2/3 వంతు పడిపోవడంవల్లే సంభవిస్తాయి. 8 మంది పెద్దవారిలో ఒకరు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేయగలరు.బార్ హ్యాంగ్స్ (గ్రిప్ స్ట్రెంత్)దీనికి ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేదు.బలమైన పట్టు గుండె ఆరోగ్యం, కండరాల బలం, ,ఎముక సాంద్రతకు సూచిక. గ్రిప్ స్ట్రెంత్ దీర్ఘాయువును అంచనా వేస్తుంది. అందుకే పరిశోధకులు దీనిని ఆరో ముఖ్యమైన సంకేతం అంటారు. 90 సెకన్లలో బార్ పట్టుకుని వేలాడితే సాధారణం కంటే బెటర్గా ఉన్నట్టు.ఒక మైలు పరుగు సమయంఏ వయసులోనైనా 10 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తగలిగితే, హృదయనాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయమైతే దీర్ఘాయుష్షు-అథ్లెట్ స్థాయి ఫిట్నెస్తో ఉన్నట్టు అర్థం. ఇది ఫిట్నెస్ స్థాయికి స్నాప్షాట్ లాంటిది. ఎంత ఫిట్గా ఉన్నారో అంచనా వేయడానికి శరీర ప్రతిస్పందనలే సూచిక అని డాన్ వెల్లడించారు.నోట్ : ఆరోగ్య , ఫిట్నెస్కు సంబంధించి ఇది ఒక సలహా మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం సరియైన మార్గం. -
పీల్చేగాలి.. ధనికులకే సొంతమా?
భారత్.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అలాంటి దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. శీతాకాలం మరింత విషాన్నికలిపి, గాలి నాణ్యతను మరింత దిగజార్చుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పీల్చే గాలి కూడా ధనికులకే సొంతమా? కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఊపిరి ఆడని పరిస్థితిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఆస్పత్రిలో పడకలకోసం సామాన్యులు నానా ఇబ్బందులూ పడుతూ.. ఆక్సిజన్ లేక రోడ్లపైనే చనిపోతున్న సమయంలో.. ధనికులు ఆక్సిజన్ సిలిండర్కు ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో ప్రాణాలు నిలుపుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ వాసులు నాటి కోవిడ్-19 పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విశ్లేషణలో తేలింది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. వాయు కాలుష్య కారకాలను తగ్గించడం, కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని వేళల తగ్గించడం,కార్యాలయాల్లో 50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని (ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు) కల్పించడం, అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించడం, ఐదవ తరగతిలోపు ఉన్న అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల మూసివేయడం, రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు, రక్షణ రంగాలకు సంబంధించిన నిర్మాణాలు మినహా ఇతర నిర్మాణాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కానీ అప్పటికే విషవాయువుల ప్రభావం అక్కడి ప్రజలపై ప్రతాపం చూపించింది. నగర ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్ల మంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితిని చాలా తీవ్రమైనదిగా అభివర్ణించింది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది.ఢిల్లీ నగరంలో గాలి విషపూరితమై, జీవనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో ధనికులు తమ ఇళ్లను ‘క్లీన్ ఎయిర్ బబుల్స్’గా మార్చుకుంటున్నారు. ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలు, పదుల సంఖ్యలో ఎయిర్ ప్యూరిఫయర్లు, డీహ్యూమిడిఫయర్లు ఇలా లగ్జరీ సీల్డ్ హోమ్స్లో వారు తమకోసమే ఒక మైక్రో క్లైమేట్ సృష్టించుకున్నారు. బయట గాలి ఎంత విషపూరితమైనా.. ఇంటి లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చేలా వాతావారణాన్ని కల్పించుకుంటుకున్నారు.క్లీన్ ఎయిర్ బుడగలుసంపన్న కుటుంబాలు తమ ఇళ్లలోకి ప్రవేశించే ముందు బయట గాలిని ఫిల్టర్ చేసే ప్రత్యేక వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలు ఇంటి లోపల శుభ్రమైన గాలిని ఉంచి, కలుషిత గాలి లోపలికి చొరబడకుండా అడ్డుకుంటాయి.ఎయిర్ ప్యూరిఫయర్లుకొన్ని అపార్ట్మెంట్లలో యజమానులు 10–12 ఎయిర్ ప్యూరిఫయర్లను ఉపయోగిస్తున్నారు. లోపలి గాలి శ్వాసించదగిన స్థాయిలో ఉండేందుకు ఫిల్టర్లను సంవత్సరంలో అనేకసార్లు మార్చుతున్నారు.డీహ్యూమిడిఫయర్లుఇళ్లను పూర్తిగా సీల్ చేయించుకున్న వారు తలుపులు, కిటికీలను మూసివేసి ఉంచుతారు. తేమ పెరగకుండా, గాలి కలుషితం కాకుండా ఉండేందుకు డీహ్యూమిడిఫయర్లను కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు.లగ్జరీ సీల్డ్ ఇళ్లుఢిల్లీలోని పలువురు ధనికులు బయట గాలి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విధంగా వారు నియంత్రిత మైక్రోక్లైమేట్లను సృష్టించి, బయట వాతావరణం కంటే లోపల గాలి నాణ్యతను చాలా మెరుగ్గా ఉంచుతున్నారు.కానీ ఈ సౌకర్యం పేదలకు మాత్రం అందని ద్రాక్షాల మారింది. ఖరీదైన పరికరాలు, నిర్వహణ ఖర్చులు.. మధ్యతరగతి,పేద కుటుంబాలకు దూరమైంది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోకపోవడంతో విషపూరిత గాలిని పీల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. అదే సమయంలో ధనికులు, పేదల మధ్య అంతరం మరింత పెరిగిపోతుంది. ధనికులు శుభ్రమైన గాలిని పీలుస్తుంటే.. సాధారణ ప్రజలు విష వాయుల్ని పీల్చి దినదినగండంగా కాలం వెళ్లదీయడం ప్రశ్నార్ధకంగా మారింది.ఢిల్లీలో గాలి సంక్షోభం ఇప్పుడు సామాజిక అసమానతకు ప్రతీకగా మారింది. ధనికులు తమ ఇళ్లలో బబుల్స్ సృష్టించుకుంటే, పేదలు విషవాయువులను పీల్చి జీవించాల్సి వస్తోంది. గాలి పీల్చడం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో కాకుండా..దీర్ఘకాలిక పరిష్కారాలు తీసుకురావాలి. లేకపోతే ఢిల్లీ గాలి సంక్షోభం, అసమానత సంక్షోభంగా మారిపోతుంది. -
ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ తగ్గిపోతుందా..?
చాలామందిని వేధించే సమస్య డయాబెటిస్. గణాంకాలు సైతం రానున్న రోజుల్లో భారత డయాబెటిస్ కేరాఫ్గా మారనుందంటూ హెచ్చరిస్తున్నాయి కూడా. కొందరికి అధిక బరువుతో మొదలై డయాబెటిస్ బారినపడి ఇబ్బందులు పడుతున్నవారెందరో. కానీ కొందరూ ఆ వ్యాధి రావడంతోనే మేల్కొని ఆరోగ్య స్పృహ తెచ్చుకుని మరి బరువు తగ్గడమే కాదు డయాబెటిస్ని ితిప్పుకొడుతున్నారు. ఆ కోవలో ఈ కామెడీ హీరో కూడా చేరిపోయి ప్రేరణ కలిగిస్తున్నారు. ఏకంగా 78 ికిలోలు వరకు బరువు ఉండే ఆయన అంతలా ఎలా బరువు తగ్గారో సవివరంగా తెలుసకుందామా...!.అమెరికా హాస్య నటడు 'మైక్ అండ్ మోలీ' స్టార్ బిల్లీ గార్డెల్ టైప్ 2 అధికబరువుతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డయాబెటిస్ నిర్ధారణ అయ్యేటప్పటికీ సుమారు 172 కిలోలు పైనే బరువు పెరిగిపోయాడు. సరిగ్గా 2020లో రక్తంలో చక్కెర స్థాయిలు అధికమయ్యేంత వరకు మేల్కొలేదు. అదీగాక ఆ టైంలో మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బిల్లీ గార్డెల్ అధిక బరువు, స్లీప్ అప్నియా, ధూమపానం చేసేవాడు, టైప్ 2 డయాబెటిస్, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుండేవాడు. ఓపక్క కరోనా మహమ్మారి,మరోవైపు అనారోగ్యా జాబితాతో భయాందోళనలకు లోనై ఆరోగ్య స్పృహపై ఫోకస్ పెట్టాడు. కానీ తగ్గుదామని ఉపక్రమించిన ప్రతిసారి పెరిగిపోవడంతో లాభం లేదనుకుని..తన వ్యక్తిగత వైద్యులతో చర్చించి మరి బరువు తగ్గించే సర్జరీలకు ప్లాన్ చేశాడు.మార్పు వచ్చిందా అంటే..ఈ 53 ఏళ్ల గార్డెల్ జూలై 2021లో బారియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇది అతడి పరివర్తనలో తొలి అడుగు. ఆహారం విషయంలో తీసుకున్న జాగురకత..మంచి మార్పుకి శ్రీకారం చుట్టింది. కడుపు ఫుల్గా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో ఓదార్పునిచ్చే ఆహారం తీసుకుంటూ..ఆకలిని నియంత్రించగలిగాడు. అలా 78 కిలోల వరకు అధిక బరువుని తగ్గించుకుని స్లిమ్గా హీరోలా మారిపోయాడు. అంతేగాదు డయాబెటిస్ కూడా నయం అయిపోయింది.ఇది మంచిదేనా అంటే..నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు గణనీయమైన బరువు తగ్గడం వల్ల టైప్ 2 డయాబెటిస్ను తిప్పికొట్టగలరని చెబుతున్నారు. ఇక్కడ హాస్య నటుడు కాలేయం , క్లోమంలో కొవ్వును తగ్గించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచాడు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి వీలు కల్పించి డయాబెటిస్ నుంచి ఉపశమనం అందిస్తుంది. అయితే బరువు పెరిగితే మాత్రం మళ్లీ డయాబెటిస్ తిరగబెట్టొచ్చు. అందువల్ల ఇలా సర్జరీ చేయించుకున్నవాళ్లు ఆ బరువుని మెయింటైన్ చేసేలా..జీవనశైలిలో మార్పులు, వ్యాయామం తదితరాల విషయాల్లో కేర్ తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇక్కడ బరువు తగ్గించే సర్జరీతో కేవలం ఐదు నుంచి పది శాతమే బరువు తగ్గుతారని, ఆ తర్వాత అంతా ఫిజికల్గా మనం కష్టపడి స్లిమ్గా మారాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: భారత్ గుర్తింపును "మధురంగా" మార్చిన మహిళ..!ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
తస్మాత్ జాగ్రత్త..! బాడీబిల్డర్లు కండలు ముఖ్యమే కానీ..
‘జిమ్కు వెళ్లేవారు స్టెరాయిడ్లు వాడుతున్నారు’ అనే మాట వినిపించినప్పుడు కళ్ల ముందు కండలు తిరిగిన పురుషుడి చిత్రం ఆవిష్కృతం అవుతుంది. అయితే సీన్ మారుతోంది. పురుషులే కాదు స్టెరాయిడ్లు వాడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి...ప్రపంచవ్యాప్తంగా మహిళలలో అనబాలిక్ స్టెరాయిడ్ల వాడకం పెరిగిందని చెబుతోంది ఇంటర్నేషనల్ స్టడీస్ సిస్టమేటిక్ రివ్యూ. 2014లో స్టెరాయిడ్లు వాడిన మహిళలు 1.6 శాతం ఉండగా, 2024 రివ్యూ ప్రకారం 4 శాతం మంది మహిళలు స్టెరాయిడ్లు ఉపయోగిస్తున్నారు. మహిళా బాడీబిల్డర్లలో దాదాపు 17 శాతం మంది, ప్రతి ఆరుగురిలో ఒకరు స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారని నివేదిక చెబుతోంది. ఈ పెరుగుదలకు సోషల్ మీడియాలోని ‘ఫిట్ఫ్లూయెన్సర్స్’ ప్రభావమే కారణం అనే విమర్శ ఉంది.స్టెరాయిడ్లు వాడుతున్న వారిలో ఎక్కువమంది మహిళలకు దీర్ఘకాలంలో వాటి దుష్ప్రభావం గురించి అవగాహన లేదు. వీటిని వాడుతున్న క్రమంలో అనారోగ్య సమస్యలు ఎదురైనా వైద్యులను సంప్రదించడం లేదు.గతంతో పోల్చితే పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీబిల్డింగ్లలో మహిళల సంఖ్య వేగంగా పెరిగింది. ‘ఆటతీరు మెరుగు పడాలి. ప్రత్యర్థిపై పైచేయి ఉండాలంటే మాదకద్రవ్యాలు వాడాలి’ అనే భావన వల్ల కొందరు వాటికి దగ్గరవుతున్నారు.ఆస్ట్రేలియా, స్కాండినేవియాలలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం...పురుష స్నేహితులు, కోచ్ల వల్ల స్టెరాయిడ్లను ఉపయోగించడం మొదలుపెడతారు. ఇవి హానికరం అనే భావన కంటే పోటీకి అనివార్యమనే భావనే వారిలో ఉంటుంది. స్టెరాయిడ్లు ఆటకు ఎంత మేలు చేస్తాయనేది పక్కన పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయి.వాటిలో కొన్ని...ముఖంపై వెంట్రుకలు పెరగడం స్వరంలో మార్పులు రుతుక్రమంలో మార్పులు, సంతానలేమి రొమ్ము కణజాలం తగ్గడం మొటిమలు రావడం, వెంట్రుకలు రాలడం ఆందోళన, చిరాకు, తీవ్రమైన మానసిక స్థితిస్టెరాయిడ్లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియంలాంటి ప్రమాదకరమైన విషపూరితాలు ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులకు కారణమయ్యే విషాలు.‘ఈ ప్రమాదాలను నివారించాలంటే స్టెరాయిడ్ల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయడమే మార్గం’ అంటున్నారు నిపుణులు. (చదవండి: అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?) -
రాగులు ఆరోగ్యానికి ఇంత మంచిదా..? అందుకే ఉపాసన అలా..
ఇటీవల కాలంలో ప్రజలలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా పోషకాహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను తీసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ చిరుధాన్యాలలో ఒకటి ఈ రాగులు. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో రామ్చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన సైతం ఇది డైట్లో తప్పనిసరని ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా చెప్పడం విశేషం. అంతలా అందిరి మదిని దోచిన ఈ చిరుధాన్యం రాగులతో కలిటే లాభాలు, ఎలా తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.ఉపాసన కూడా క్రమశిక్షణతో కూడిన డైట్కే ప్రాధాన్యత ఇస్తారామె. 36 ఏళ్ల ఆమె ప్రతి రోజు ఆరోగ్యకరమైన పోషకాహారాన్నే తీసుకోవాలనే విశ్వసిస్తానంటోంది. చిరుధాన్యాల్లో తనకు బాగా నచ్చింద రాగులని పేర్కొంది. అంతేగాదు తనకు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన సలహాలను గుర్తు చేసుకుంటూ..ఉపాసన రాగులను ఏదోరూపంలో మీ డైట్ బాగంగా చేసుకోండని సూచించినట్లు వెల్లడించింది. అలాగే ఆయన కుమార్తే రాధా జగ్గీతో జరిగిన సంభాషణను కూడా షేర్ చేసుకున్నారామె. భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమెకు సద్గురువే స్వయంగా రాగి గంజిని చేసి ఇచ్చేవారని, అదే తనను ఇంతలా ఫిట్గా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోందని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు ఉపాసన. అందుకే దీన్ని తన కుమార్తె డైట్లో కూడా భాగం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తన కూతురు ఈ రాగులను ఇష్టపడిందా అని అడిగితే మాత్రం..ఆరోగ్యం కోసం తప్పదు, తనకు మరో ఛాయిస్ లేదని నవ్వేశారామె. మరి నిజంగానే రాగులు అంత పోషకవంతమైనదా అంటే..ఎముకలకు బలం..రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. చిన్నారులు, వృద్ధులు రాగులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. పాలిచ్చే తల్లులు కూడా రాగును తింటే శిశువుకు ఎంతో మేలు జరుగుతుంది. శిశువు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. చక్కగా ఎదుగుతారు.మధుమేహం రోగులకు..డయాబెటిస్ ఉన్నవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రాగుల్లో అధికంగా ఉండే ఫైబర్, పాలిఫినాల్స్ షుగర్ లెవల్స్ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. అధికంగా బరువు ఉన్నవారు బరువును తగ్గించుకునేందుకు గాను రాగులు సహాయం చేస్తాయి.రక్తహీనతకు..రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధంగా మనకు లభిస్తుంది. అందువల్ల రాగులను తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులలో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. రాగుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు సైతం ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.మితంగానే మంచిది..ఇన్నిప్రయోజనాలు కలిగించే రాగులున తగు మోతాదులోనే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణుల. న్యూట్రిషన్ల ప్రకారం..రాగులను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మరీ అధికంగా తింటే శరీరంలో ఆగ్జాలిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కలగజేస్తుంది -
జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
హైదరాబాద్: చలికాలంలో చల్లని వాతావరణం గుండెను బలహీనం చేస్తుందని, రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుందని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి కాథ్ల్యాబ్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా అపోలో ఆసుపత్రి సహకారంతో కార్డియాక్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. క్యాపులో 200 మంది జర్నలిస్టులు బీపీ, ఈసీజీ, 2డి ఎకో, బీఎంఐ, డెంటల్ టెస్టులు చేయించుకున్నారు. చాలామంది జర్నలిస్టులకు బిపీ, షుగర్ కంట్రోల్లో ఉండటం లేదని, మందులు సరిగ్గా వాడటం లేదని, ఈ విషయంలో జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ శ్రీనివాస్ కుమార్ అన్నారు. అవసరమైతే అపోలో తరఫున జర్నలిస్టులకు 50 శాతం రాయితీ కూడా ఇస్తామని తెలిపారు. కార్డియాలజిస్ట్ రామకృష్ణ మాట్లాడుతూ చాలామంది జర్నలిస్టులకు చాతిలో నొప్పి, ఎడమచెయ్యి లాగడం, నడిస్తే ఆయాసం రావడం వంటి లక్షణాలు ఇలాంటి హెల్త్ క్యాంపుల్లో బయటపడుతున్నాయని అన్నారు. వైద్యులను ప్రెస్క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల సత్కరించారు. -
మిసెస్ మామ్ గ్రాండ్ ఫినాలె..!
ఇటీవలి కాలంలో ప్రసవం అంటేనే సిజేరియన్ అంటున్నారని, వాటి కంటే సురక్షిత, సాధారణ ప్రసవాలే ఎప్పుడూ శ్రేయస్కరమని కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఈఓ డాక్టర్ అభినయ్ తెలిపారు. సాధారణ ప్రసవాల మీద అవగాహన పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేషన్, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించిన మిసెస్ మామ్ తొమ్మిదో సీజన్ గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్. శిల్పిరెడ్డి, డా. శిల్పిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. తొమ్మిదో సీజన్కు మొత్తం 220 జంటలు పేర్లు నమోదుచేసుకోగా వారిలో 57 జంటలు గ్రాండ్ ఫినాలెకు అర్హత సాధించారు. వారందరినీ డాక్టర్ అభినయ్ అభినందించారు. మాతృత్వం అనేది ఒక మధురానుభవం అని, అందులోని ప్రతి దశనూ తల్లిదండ్రులు ఇద్దరూ ఆస్వాదించాలని తెలిపారు. గర్భిణి అయిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటు, పుట్టబోయే బిడ్డ సంరక్షణ విషయంలో కూడా తండ్రులది చాలా కీలక పాత్ర అని ఆయన చెప్పారు. భర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య తన మాతృత్వాన్ని మరింత ఆస్వాదించగలదని వివరించారు. సాధారణ లేదా సిజేరియన్ సురక్షిత ప్రసవాలు మంచివని డాక్టర్ అభినయ్ అన్నారు. గ్రాండ్ ఫినాలెకు హాజరైన అతిథులు, జంటలను ఉద్దేశించి కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ.. “సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు కుటుంబం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. తల్లిదండ్రులు ఏం తినాలి, పిల్లలకు ఏం పెట్టాలనే అంశాలను వారికి వివరించాం. 70-80 రకాల అంశాలను ఈ తల్లిదండ్రులకు పరిచయం చేశాం. ఇంతమందికి ఒకేచోట అవగాహన కల్పించగలిగితే వాళ్లు సమాజంలో ఈ సందేశాన్ని పంచుతారు. సాధారణ ప్రసవం అనగానే నొప్పులు భరించలేం అన్నట్లుగా చెబుతున్నారు. ఇది తప్పు. గతంలో అన్నీ సాధారణ ప్రసవాలే ఉండేవి. తర్వాత క్రమంగా వివిధ కారణాలతో సిజేరియన్లు పెరిగాయి. ప్రసవం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని అలాగే జరగనివ్వాలి. ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్నవారిలో 85% మందికి సాధారణ ప్రసవాలే జరిగాయి. వక్రీకరణలు చాలా జరుగుతున్నాయి కాబట్టి, వీరికి అవగాహన పెంచాలి. ఇక్కడ పాల్గొన్నవారు తమ బంధువులు, స్నేహితులకు చెప్పినా నెమ్మదిగా సమాజం మొత్తం మారుతుంది” అని చెప్పారు. గర్భధారణ సంరక్షణ తోపాటు భవిష్యత్తు తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించారు. చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..! -
మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!
బిడ్డ పుట్టగానే చుట్టాలూ పక్కాలూ అందరి ముఖాల్లో సంతోషమే. బిడ్డ కాళ్లూ వేళ్లూ... ఇలా అవయవాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి అంతా బాగుంటే పండంటి బిడ్డ అంటూ ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎదుగుతున్నకొద్దీ ఆ చిన్నారి కనబరుస్తున్న తెలివితేటలను చూసి ఇంకాస్త మురిసిపోతుంటారు. కానీ ఇలా ఎదిగే సమయంలో ఏవైనా మానసిక సమస్యలు కనిపిస్తే మాత్రం ఆ తల్లిదండ్రుల వేదన చెప్పనలవి కాదు. ఆ బాధను మాటల్లో వర్ణించడానికి వీలు కాదు. సాధారణంగా ఇలాంటి శారీరక వైకల్యాలూ, లేదా మానసికమైన ఎదుగుదల లోపాలూ కనిపించే పిల్లలు మేనరికపు వివాహాల్లోని జంటలకే పుట్టడం ఎక్కువ. అందుకే డాక్టర్లు కూడా దగ్గరి సంబంధాలు వద్దనే సూచిస్తుంటారు. ఎందుకు? మేనరికపు వివాహాల్లో ఇలా ఎందుకిలా జరుగుతుంది, ఒకవేళ మేనరికపు పెళ్లిళ్లు తప్పనప్పుడు బిడ్డ పుట్టకముందూ, కడుపున పడ్డ తర్వాత చేయించుకోవాల్సిన పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటనే పలు అంశాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే కథనమిది.ఓ బిడ్డలో లోపం వచ్చిందంటే ... తల్లిదండ్రులిద్దరిలోంచి వచ్చిన జన్యువులే (జీన్స్) సాధారణంగా ఇందుకు కారణం. తల్లిదండ్రులకు చెందిన ఆ జన్యువుల్లో ఏ లోపాలూ లేకపోతే ఆరోగ్యకరమైన అవయవాలే బిడ్డలకు వస్తాయి. సాధారణంగా ఒక లోపం వచ్చిదంటే... తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరి జీన్ లోపభూయిష్టంగా ఉండవచ్చు. అయితే ఆ లోపం తల్లిదండ్రుల్లో ఎవరినుంచి వచ్చిందో చెప్పడం కష్టం. ఇది ఎలా జరుగుతుందంటే... ఓ అవయవానికి సంబంధించి తల్లిదండ్రులిద్దరి నుంచీ జీన్స్ బిడ్డకు వస్తాయి. ఈ రెండింటిలో ఒకదాంట్లో లోపం ఉందనుకోండి. అప్పుడు అదే అవయవానికి సంబంధించిన మంచి జీన్... లోపమున్న జీన్ను డామినేట్ చేసి... ఆ లోపం రాకుండా నివారిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ లోపం ఉంటే...? అప్పుడు ఆ బిడ్డకు ఆ అవయవానికి సంబంధించిన లోపం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి దగ్గరి సంబంధాలూ లేని వేర్వేరు కుటుంబాలకు చెందిన వారనుకుందాం. అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరిలో జన్యులోపం ఉంటే లోపం లేని మరో జన్యువు దాన్ని డామినేట్ చేసి లోపాన్ని నివారిస్తుంది. అయితే ఒకే కుటుంబాల వారిలో (మేనరికాల్లో అదే కుటుంబాల వారి మధ్య పెళ్లి అవుతుంది కాబట్టి) ఇద్దరి జన్యువులూ లోపంతోనే ఉండే అవకాశముంటుంది కాబట్టి ఆ లోపం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దగ్గరి సంతతికి చెందిన... దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య పెళ్లిళ్లను ఆధునిక వైద్యశాస్త్రం అంతగా ప్రోత్సహించదు. మరి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేనప్పుడు ఇలాంటి అవకరాలకు అవకాశం లేదా? ఉంటుంది. కానీ... దూరపు సంబంధాల్లో ప్రతి 400 జంటల్లో ఒకరికి లోపమున్న బిడ్డ పుట్టే అవకాశం ఉంటే... దగ్గరి సంబంధాల విషయంలో కేవలం 200 జంటల్లోనే లోపమున్న బిడ్డ పుట్టేందుకు ఛాన్సులెక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలనూ, వీలైతే అసలు రక్తసంబంధాలే లేని ఇతర కుటుంబాల వారితో వివాహాలను ఆధునిక వైద్యశాస్త్రం ప్రోత్సహిస్తోంది. కానీ... దగ్గరి సంబంధాల వివాహాలతో పుట్టబోయే బిడ్డలకు ముప్పు పొంచి ఉంటుందిలా... దగ్గరి వివాహాలను వైద్య పరిభాషలో కన్సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అంటే ఉదాహరణకు అక్కకూతుర్ని... అంటే కోడలు వరసయ్యే అమ్మాయి తన మామను చేసుకోవడం, లేదా మేనమామ, మేనత్త పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో అనేక రకాల అవయవలోపాల నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో రకాల రుగ్మతలు, సిండ్రోమ్స్ వచ్చే అవకాశం పొంచి ఉంటుంది.పేరెంట్స్ నుంచి బిడ్డలకు పోలికలూ, గుణాలూ లక్షణాలెలా వస్తాయంటే... బిడ్డ పుట్టగానే బంధువులందరూ చుట్టూ చేరి మురిపెంగా చూసుకుంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ‘‘అరె... వీడి ముక్కు చూడండి. అచ్చం వాళ్ల నాన్నదే. వాడి కళ్లు చూడండి. అచ్చం వాళ్ల అమ్మవే’’ అంటూ మురిపెంగా పోలికలు చూస్తూ మురిసిపోతుంటారు. బిడ్డలో ఎలా వస్తాయి ఈ పోలికలు? ఎలాగంటే... మనిషి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలన్నీ మొదట ఒకే ఒక తొలికణంతో మొదలైన జైగోట్ నుంచి అనేకానేక కణవిభజనల తర్వాత ఏర్పడతాయి. ఇక మానవుని ప్రతి కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలు. వీటిలో ఈ జతలో... 23 మహిళ నుంచి, మరో 23 పురుషుడి నుంచి వచ్చి కలిసి... తొలి కణం ఏర్పడుతుంది. దీన్నే మనం పిండం అంటాం. ఈ పిండంలోని 23 జతల క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. జన్యువు అంటే ఏమిటంటే... దేహంలోని ప్రతి అంశానికీ, ప్రతి అవయవానికీ, ఎదుగుదలకూ, బిడ్డ అవయవాల షేపుకూ, సైజ్కూ, పెరిగే ఒడ్డూ పొడవునకు సంబంధించిన ప్రతి సమాచారమూ ఈ జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యువులన్నీ క్రోమోజోములపై ఉంటాయి. ఈ క్రోమోజోముల 23 జతలు ఒకదానితో మరొకటి కలిసి ఒక కణంగా రూపొందే సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు ΄ోలికలు, తల్లిదండ్రుల లక్షణాలూ, శరీరాకృతి, రంగు వంటి అనేక అంశాలు సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి.దగ్గరివాళ్లలో పెళ్లిళ్లతో లోపాలు ఎందుకంటే... క్రోమోజోములపై లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులు తండ్రి నుంచి ఒకటీ, తల్లి నుంచి మరొకటి కలిసి సంపూర్ణమవుతాయన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు... ఒక మహిళలో (కాబోయే తల్లిలోని) ఒక జన్యువు కాస్త చెడి΄ోయి... బిడ్డలో అది ఆస్తమా వ్యాధిని కలగజేసే అవకాశం ఉందనుకుందాం. ఆ మహిళ తన కుటుంబంలోని దగ్గరి వారిని కాకుండా అసలు ఏ సంబంధమూ లేనివారిని పెళ్లి చేసుకుందని అనుకుందాం. ఆ పురుషుడిలోని అదే రకమైన జన్యువు ఆరోగ్యంగా ఉందనుకుందాం. ఈ ఆరోగ్యకరమైన పురుషుడి జన్యువు, అనారోగ్యకరమైన ఆ స్త్రీ జన్యువును అధిగమిస్తుంది. అంటే ఇంగ్లిష్లో చెప్పాలంటే డామినేట్ చేస్తుంది. ఇలా లొంగి ఉండే అనారోగ్యకరమైన జన్యువును ‘రెసెసివ్’ జీన్ అంటారు. అలాగే డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్’ జీన్ అంటారు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లోని దగ్గరి సంబంధంలోనే పెళ్లి జరిగిందనుకోండి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు కాబట్టి వారిద్దరిలోనూ ఆ జన్యువులు ఒకేలా ఉంటాయి. దాంతో ఇద్దరి జన్యువుల్లోనూ ఏదీ మరొకదాన్ని డామినేట్ చేయక΄ోవడం, రెండూ లోపంతోనే ఉండటంతో పుట్టబోయే బిడ్డలో ఆస్తమా బయటపడుతుంది. ఇది ఒక జన్యువు ఉదాహరణ మాత్రమే. ఇలా తల్లిదండ్రుల లక్షణాలను మోసుకెళ్లే జన్యువులు ఒక్క క్రోమోజోమ్పై దాదాపు 20,000 వరకూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆ పుట్టబోయే బిడ్డ ప్రతి లక్షణమూ ముందే ప్రోగ్రామ్ అయి΄ోయి జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దంపతులిద్దరూ అపరిచిత కుటుంబాల నుంచి పెళ్లిళ్లు చేసుకుంటే ఒకరిలో అనారోగ్యకరమైన జన్యువు (ఫాల్టీ జీన్) ఉన్నా... దాన్ని దంపతుల్లోని మరో ఆరోగ్యకరమైన జన్యువు డామినేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పేర్కొన్న ఆస్తమా ఉదాహరణలా ఇది అన్నివేళలా ఇలాగే బిడ్డలో వ్యక్తమవ్వాలనే నిబంధన ఏదీ ఉండదు. కొన్ని ఫాల్టీ జీన్స్... ఇలా ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే క్రమంలో మరింతగా చెడిపోతూ.... చెడిపోతూ... అకస్మాత్తుగా ఒక పెద్ద లోపంగా బిడ్డలో వ్యక్తం (ఎగ్జిబిట్) కావచ్చు. అందువల్లనే మేనరికాల్లో దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతోఫాల్టీ జీన్స్ అనేవి దంపతులిద్దరిలోనూ ఒకేలా ఉండి అవయవ లోపాలూ లేదా జబ్బులూ వ్యక్తమవుతాయి. ఎలాంటి జబ్బులకు ఆస్కారం ఉంది? మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో అవయవలోపాలూ, పుట్టుకతో వచ్చే జబ్బులు (కంజెనిటల్ డిసీజెస్), రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, సిస్టిక్ ఫైబ్రోసిస్, మూత్రపిండాల వ్యాధులు (కంజెనిటల్ యురెట్రో పెల్విక్ అబ్స్ట్రక్షన్), కండరాల, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు (అనే జబ్బుల లక్షణాల మిశ్రమంతో ప్రయుక్తమయ్యే జబ్బులన్నింటినీ కలుపుకుని ఒకే ఒక మాటరూపంలో ‘సిండ్రోమ్’ అని పిలుస్తారు), బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు (గుండెలో రంధ్రాలు, వాటి ధమనుల్లో లోపాలు), చిన్నప్పుడే వచ్చే డయాబెటిస్, జన్యుపరమైన సమస్యలు రావచ్చు. ఇక కాబోయే తల్లిలో మాటిమాటికీ జరిగే గర్భస్రావాలు, బిడ్డ పుట్టగానే చనిపోవడం, బిడ్డకు శ్వాససంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్) సమస్యలు ఇలా అనేక వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన సమస్యలూ – రకాలు సాధారణంగా జన్యుపరమైన సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 1) ఆటోజోమల్ డామినెంట్ : ఇలాంటి జీన్స్ వచ్చిన పిల్లల్లో సమస్య బయటకు కనిపిస్తూ ఉంటుంది. పైగా లోపంతో ఉన్న జీన్ డామినెంట్గా ఉంటుంది. దాంతో ఒక్క జీన్ సంక్రమించినా పిల్లల్లో సమస్య బయటపడుతుంది. 2) ఆటోజోమల్ రెసెసివ్ : వీటిలో సమస్య బయటపడదుగానీ... సమస్యను / వ్యాధిని కలగజేసే జన్యువులు తల్లిదండ్రులిద్దరిలోనూ నిశ్శబ్దంగా లోపలే ఉంటాయి. వీళ్లు తర్వాత తరానికి సమస్యను మోసుకెళ్తారు. కాబట్టి వీరిని ‘క్యారియర్స్’ అంటారు. ఇద్దరు ‘క్యారియర్స్’ పెళ్లాడితే... రెండు రెసెసివ్ జీన్స్ కలిసి... పుట్టబోయే బిడ్డలో సమస్య తప్పక బయటపడుతుంది. 3) ఎక్స్ లింక్డ్ సమస్యలు : ఇలాంటి సమస్యలు ‘ఎక్స్’ క్రోమోజోమ్పై నిక్షిప్తమై ఉంటాయి. దాంతో ఈ జీన్ కలిగిన ఆడపిల్లలు సమస్యకు ‘క్యారియర్స్’గా ఉంటారు. సమస్య మగపిల్లల్లో బయటపడుతుంది.పెళ్లి తప్పదనుకుంటే... ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే చాలావరకు మంచిది. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలియక నిశ్చితార్థమో, వివాహమో చేసుకుంటే... అప్పుడు ఆ జంట చేయాల్సిన పనులివి... వివాహానికంటే ముందుగా : పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయి... ఈ ఇద్దరినీ ప్రీ–మేరిటల్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం నిపుణులను కలవాలి. అప్పుడా నిపుణులు కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిగణనలో తీసుకుంటారు. అంటే వీరి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, తాతలు, ముత్తాతల్లో ఏవైనా దగ్గరి సంబంధం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఉంటే... వీరికి పుట్టే పిల్లలకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో విశ్లేషణాత్మకంగా అంచనావేస్తారు. వాటి ఆధారంగా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే ఆ జంటకు కొన్ని రక్తపరీక్షలూ చేయించే అవకాశమూ ఉంటుంది. సాధారణంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను తెచ్చే జీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోడానికి ఇద్దరికీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఎన్ని పరీక్షలు చేసినా వారికి ఏ సమస్యా రాదనో, వస్తుందనో నిర్ధారణగా చెప్పడం కష్టం. ఒకవేళ ఆటోజోమల్ డామినెంట్ సమస్యలు వస్తాయని తెలిస్తే వీలైనంతవరకు ఆ పెళ్లి వద్దనుకోవడమే మంచిది. పెళ్లి తర్వాత : పెళ్లి తర్వాత కూడా జెనెటిక్ కౌన్సెలింగ్కు వెళ్లి పైన పేర్కొన్నవన్నీ పాటించవచ్చు. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్యాసిడ్ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవాలి. గర్భం వచ్చాక : ఇక్కడ పేర్కొంటున్న సమస్యలన్నీ జన్యుపరమైనవి కావడంతో పుట్టబోయే పిల్లల్లో ఏ సమస్యా రాకుండా చేయడమన్నది ఏ నిపుణులకూ సాధ్యం కాదు. కాక΄ోతే కొన్ని గుర్తించదగిన సమస్యలను ముందుగానే పసిగట్టడం వల్ల, పుట్టిన తర్వాత వెంటనే చెయ్యగలిగిన చికిత్సలేవైనా ఉంటే వాటికోసం తక్షణమే సన్నద్ధమయ్యేలా జాగ్రత్త తీసుకోవడం చేయవచ్చు. లేదా లోపల ఉన్న సమస్యను తెలుసుకోవడం... ఒకవేళ అది మెదడుకు సంబంధించినదీ లేదా ఎప్పటికీ సరిచేయలేనిదని తెలిస్తే గర్భస్రావం (ఐదు నెలల లోపల) అవకాశాల గురించి ఆలోచించడం లేదా బిడ్డను కనడం... ఈ రెండింటిలో వారికి అనువైన / తగిన నిర్ణయం తీసుకోవచ్చు. చివరగా... మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు వచ్చే అవయవ లోపాలను రాకుండా చేసేందుకు గర్భంతో ఉన్నప్పుడే ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అలాంటి ఇంజెక్షన్లుగానీ మందులు గానీ ఉండవు. ఇక మేనరికపు వివాహాల వల్ల పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్తి కోసమో లేదా ఇతరత్రా కుటుంబ భద్రతల దృష్ట్యా అలాంటి వాటిని చేసుకుని... ఆర్థికంగా, మానసికంగాబాధపడటం కంటే... ఆరోగ్యకరమైన బిడ్డల కోసం కాస్తంత మంచి సంబంధాలు వెదికి బయటి సంబంధాలు చేసుకోవడమే మేలు అని గుర్తుంచుకోవాలి. అయితే ఇది వారి వారి వ్యక్తిగతమైన కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రక్తసంబంధాల్లోనే వివాహాలకు కారణాలివి... ఆర్థిక కారణాలూ, తెలిసినవారి కుటుంబంలో అయితే బిడ్డ బాగోగులు తెలుస్తాయనే ఈ రెండు అంశాలే దగ్గరి బంధుత్వాల్లో పెళ్లిళ్లకు కారణం. అందునా... ప్రధానంగా ఆర్థిక అంశాలే బాగా దగ్గరి సంబంధాలు చేసుకునేలా చాలావరకు ఆ కుటంబాలవారిని ప్రభావితం చేస్తుంటాయి. మేనత్త / మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తి బయటివారికి చెందకుండా... ఆస్తిలో ఆస్తి కలుస్తుందనే అంశమే చాలా సందర్భాల్లో ఇలాంటి పెళ్లిళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం... ఉద్వేగపూరిత బంధం. అంటే ఎమోషనల్ రిలేషన్షిప్. మనం ప్రాణప్రదంగా పెంచుకున్న మన బిడ్డను ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే... వారెలా చూసుకుంటారో, బాగా చూసుకుంటాఓ లేక ఆరళ్లు పెడుతూ బాధలకు గురిచేస్తారో? అదే... బిడ్డ మన కళ్లెదురుగా ఉంటే మనమూ కూతురి బాగోగులు కళ్లారా చూస్తూ ఉండవచ్చు. ఈ రెండు అంశాల కారణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. దాంతో తమ జీవనశైలుల్లోనూ, తమ సాంస్కృతిక విధానంలో దంపతులిద్దరూ తేలిగ్గా ఇమిడిపోతారు... దాంతో దంపతులకు ఇబ్బందులు రావనే భావన ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంది.మేనరికపు పెళ్లిళ్లు... దంపతులు చేయించుకోవాల్సిన పరీక్షలు :గర్భందాల్చిన మూడో నెలలో (12 వారాల్లో) డబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ట్రైజోమ్ 18, 13 వంటి కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి వేరే పరీక్షలు అవసరమా కాదా అని తెలుస్తుంది. మూడో నెలలో (12వారాలప్పుడు) న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ స్కాన్ (ఎన్టీ స్కాన్) చేయించుకుంటే, ఆ సమయానికి బయటపడే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. పై పరీక్షల్లో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి ‘కోరియా విల్లస్ బయాప్సీ’ అనే పరీక్ష చేస్తారు. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల ముప్పు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఫలితాలు వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేయించాలి. ఇందులో గర్భంలోని బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు లోంచి 10 – 20 ఎమ్ఎల్ తీసి జన్యువుల పరీక్షకు (క్యారియోటైపింగ్కు) పంపించి సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష వల్ల ఒక శాతం మందిలో గర్భస్రావమయ్యే అవకాశం ఉంటుంది. ఐదో నెల చివరిలో 18–22 వారాలప్పుడు ‘టిఫ్ఫా’ అనే స్కానింగ్ చేయడం వల్ల బిడ్డలో వచ్చే అవయవలోపాలను ముందుగానే గుర్తించవచ్చు. దీనితో ΄ాటు జెనెటిక్ సోనోగ్రామ్ చేయించుకుంటే కొన్ని జన్యుసంబంధిత వ్యాధులను సూచించే సాఫ్ట్ మార్కర్లను గుర్తించి, దానికి తగినట్లుగా తర్వాతి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరో నెలలో 22–24 వారాల్లో 2డీ ఫీటల్ ఎకో కూడా చేయించుకుంటే గుండెకు సంబంధించిన లోపాలను తెలుసుకోవచ్చు. స్కానింగ్లో నూటికి నూరు శాతం లోపాలను కనుక్కోలేకపోవచ్చు. కొందరిలో బిడ్డ పొజిషన్, ఉమ్మనీటి శాతం, తల్లి పొట్ట మీద అధికకొవ్వు వంటి అంశాలను బట్టి కూడా కొన్ని లోపాలను కనుగొనడం మిస్సయ్యే అవకాశం ఉంది. బిడ్డ పుట్టాక : బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. బిడ్డ మూడో నెలలో వినికిడి లోపాలను గుర్తించే పరీక్షలు చేయించి, ఒకవేళ ఉంటే వాటిని చాలావరకు సరిదిద్దవచ్చు.డాక్టర్ శ్రీజ గుర్రాల, సీనియర్ కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్ (చదవండి: హార్న్బిల్ ఫెస్టివల్ ..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!) -
మలబద్ధకం నివారణ కోసం...
మలబద్ధకం చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఫ్రీ మోషన్ కాకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యతో దీర్ఘకాలంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈ సమస్యను నివారించుకోవడం ఎంతోముఖ్యం. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలుఫైబర్ (పీచు) సమృద్ధిగా ఉండే ఆహారాలతో మలబద్ధకాన్ని నివారించుకోవడం తేలికే. వాటివల్ల జీర్ణాశయమార్గం శుభ్రమవ్వడమే కాకుండా తేలిగ్గా విరేచనం అయ్యేందుకు ఆ పీచు సహాయపడుతుంది. ఫైబర్ వల్ల దేహంలో మనం తీసుకున్న పిండిపదార్థాల నుంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదులు ఒకేసారి పెరగవు. పొట్టుతో కూడిన అన్ని రకాల ధాన్యాల్లోనూ ఈ పీచు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు మోతాదులు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. చిక్కుళ్లలో ప్రోటీన్ తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతోపాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతూ ఒకేసారి రెండు ప్రయోజనాలనిస్తాయి. తాజాపండ్లలోనూ పీచు ఎక్కువగానే ఉంటుంది. అందుకే అతిగా తీపి ఉండని తాజాపండ్లు డయాబెటిస్ ఉన్నవారికీ మేలు చేస్తాయి. బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లలో పీచు మోతాదు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. పండ్లను పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మంచిది. (చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం) -
ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయిన ఇనుప రాడ్లు
భాగ్యనగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మూడో అంతస్తు నుంచి నవీన్ కుమార్ అనే ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడి ఊపిరితిత్తుల్లోకి ఇనుప రాడ్లు గుచ్చుకుపోయి, వాటికి రంధ్రం పడింది. అయినా సరే.. ఆ కార్మికుడికి అమోర్ ఆస్పత్రి వైద్యులు రికార్డు సమయంలో అత్యవసర శస్త్రచికిత్స చేసి, అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..42 ఏళ్ల వయసున్న నవీన్ కుమార్ను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి అతడి శరీరం నుంచి రెండు ఇనుప రాడ్లను తొలగించాల్సి ఉంది. అప్పటికే అతడు స్పృహ కోల్పోయాడు, అతడి రక్తపోటు కేవలం 50/30 మాత్రమే ఉంది. ఇక ఆక్సిజన్ శాచ్యురేషన్ అయితే కనీసం లెక్కలకు కూడా అందనంత తక్కువగా ఉంది. అతడి హృదయం వద్ద పెద్ద గాయం ఉండడం, అందులోంచి గుండె, ఊపిరితిత్తులు కూడా కనిపిస్తుండడం, దాదాపు 2-3 లీటర్ల వరకు రక్తం పోవడం, ఊపిరితిత్తులకు-ఛాతీ గోడకు మధ్య రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులకు రంధ్రం పడడం... ఇన్ని సమస్యలు అతడికి ఉన్నాయి.ముందు అత్యవసరంగా అతడిని వెంటిలేటర్ మీద పెట్టారు. శరవేగంగా రక్తం ఎక్కించి, రీససిటేషన్ చేశారు. గాయం చాలా పెద్దగా ఉన్నట్లు సీటీ స్కానింగ్లో తెలిసింది. దాంతో వెనువెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించారు. వైద్యులు అతడికి అత్యవసరంగా థొరకాటమీ శస్త్రచికిత్స చేశారు. అతడి ఎడమ ఊపిరితిత్తిలోని శ్వాసకోశం పూర్తిగా ధ్వంసమైపోయింది. దాంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది. కానీ రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండడంతో నవీన్ రక్తపోటు మరింతగా పడిపోసాగింది. ఫలితంగా రక్తం మరింత ఎక్కించారు. ఒక ఊపిరితిత్తి మాత్రమే పనిచేస్తుండడంతో దాన్ని రక్షించేందుకు వెంటిలేషన్ వ్యూహాలను అమలుచేశారు. అతడికి ఆక్సిజన్ ఏమాత్రం అందకపోతున్నా కూడా మెదడు, ఇతర కీలక అవయవాలు ఏవీ దెబ్బతినకుండా వైద్యబృందం చాలా కష్టపడింది.ఈ కేసు సంక్లిష్టత గురించి అమోఆర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థో ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, “మేం చికిత్స చేసిన వాటిలో ఇది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ట్రామా కేసు. నవీన్కు తగిలిన గాయాలన్నీ ప్రాణాంతకమే. ప్రతి నిమిషం చాలా విలువైనది. దాంతో మా అత్యవసర, సర్జికల్, ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల్లోని వైద్యులందరూ అద్భుతమైన సమన్వయంతో పనిచేసి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రపంచస్థాయి ట్రామాకేర్ సదుపాయాలు, సరైన సమయానికి చికిత్స అందించాం అనడానికి అతడి ప్రాణాలు నిలబడడమే నిదర్శనం. ఇప్పుడతడు కోలుకుని సాధారణ జీవితం గడపడం మాకెంతో ఆనందాన్నిస్తోంది” అని తెలిపారు.నవీన్ చాలా అద్భుతంగా కోలుకోవడంతో, 48 గంటల్లోనే వెంటిలేటర్ తొలగించారు. కాసేపటి తర్వాత అతడు ఒకరి సాయంతో నడవగలిగాడు. వారం రోజుల్లోపే అతడు ఎలాంటి సాయం అవసరం లేకుండా తన కాళ్ల మీద తాను నడుస్తూ కోలుకోవడంతో డిశ్చార్జి చేశాం.అతడికి చికిత్స చేసిన వైద్యబృందంలో శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ పూజిత, ఎమర్జెన్సీ బృందానికి చెందిన డాక్టర్ నందీప్, డాక్టర్ అశోక్, క్రిటికల్ కేర్ విభాగ నిపుణులు డాక్టర్ ప్రత్యూష, ఎనస్థీషియా నిపుణులు డాక్టర్ జగదీష్ కీలకంగా వ్యవహరించారు.(చదవండి: మాంజా మెడకు చుట్టుకుని తెగిన రక్తనాళాలు..హెల్మెట్ పెట్టుకున్నా..!) -
ఊపిరి కోసం యుద్ధం.. రెండు లక్షల మందికి అస్వస్థత!
న్యూఢిల్లీ: దేశంలోని పలు మహానగరాలను వాయు కాలుష్యం వెంటాడుతూ, ప్రజలను తీవ్ర అనారోగ్యం బారినపడేలా చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ నిత్యం పీల్చే గాలి ఎంత ప్రమాదకరంగా మారిందంటే, జనం ప్రతీరోజూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఆస్పత్రులను సందర్శించేలా చేస్తోంది.అత్యవసర కేసులు అధికం2022-2024 మధ్య కాలంలో ఢిల్లీలో రెండు లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ఏఆర్ఐ)సంబంధిత అత్యవసర కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వెలువడ్దాయి. ఈ రెండు సంవత్సరాల కాలంలో లక్షల మంది ప్రజలు ఆస్పత్రులలో చేరాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం అందించిన డేటా వాయు కాలుష్య పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది.దీర్ఘకాలిక వ్యాధులుగా..ఢిల్లీలోని ఆరు కేంద్ర ఆసుపత్రులు ఇచ్చిన నివేదిక ప్రకారం 2022లో 67,054 ఏఆర్ఐ అత్యవసర కేసులు ఉంటే, 2024లో ఈ సంఖ్య 68,411కి పెరిగింది. అత్యవసర కేసుల సంఖ్యతో పాటు, ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇదే కాలంలో ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య 9,878 నుండి 10,819కి పెరిగింది. ఇది కేవలం అత్యవసర చికిత్సతో తగ్గిపోయే సమస్య కాదని, చాలా మందికి దీర్ఘకాలిక సంరక్షణ అవసరమవుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుదల వాయు కాలుష్య స్థాయిల పెరుగుదలతో ముడిపడి ఉందని నిపుణులు అంటున్నారు.ముంబై, చెన్నైలలో కూడా..రాజ్యసభలో డాక్టర్ విక్రమ్జిత్ సింగ్ సాహ్నే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆరోగ్య మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. కలుషితమైన గాలి శ్వాసకోశ వ్యాధులను ప్రేరేపించే ఒక అంశం అని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగానే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అంగీకరించింది. పట్టణ కేంద్రాలలో గాలి నాణ్యత క్షీణతను పర్యవేక్షించడానికి జాతీయ నిఘా వ్యవస్థను విస్తరిస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ ఆరోగ్య సంక్షోభం ఢిల్లీకే పరిమితం కాలేదు. భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ముంబై, చెన్నైలలో కూడా ఇదే విధమైన పెరుగుదల నమోదైంది. ఈ నగరాల్లో తీవ్రమైన కాలుష్యం ఏర్పడినప్పుడు వేలాది మంది జనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడి, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రులను ఆశ్రయించారు. ఈ ఉదాహరణలు దేశవ్యాప్తంగా పట్టణ కాలుష్యం ఒక సామాన్య ఆరోగ్య ముప్పుగా మారుతోందని నిరూపిస్తున్నాయి.వీరికి మరింత హాని..ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కలుషితమైన గాలి ప్రభావం వ్యక్తిపై పడటానికి అనేక కారకాలు కారణమవుతాయి. ఆహారపు అలవాట్లు, వృత్తి, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, రోగనిరోధక శక్తి, మునుపటి వైద్య చరిత్ర వంటి అంశాలు కొందరిని ఇతరులకన్నా మరింత హానికి గురిచేస్తాయి. ఈ సంక్లిష్ట నమూనాలను నిర్ఱారించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 230కి పైగా సెంటినెల్ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆగస్టు 2023లో ప్రారంభమైన డిజిటల్ ఏఆర్ఐ నిఘా కూడా సమాచారాన్ని సేకరిస్తోంది.తక్షణ చర్యలు అవసరంఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కూడా దీనిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఐదు ఆసుపత్రులలో శ్వాసకోశ లక్షణాలతో వచ్చిన 33,213 అత్యవసర రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. కాలుష్య స్థాయిలు పెరిగినప్పుడు, శ్వాసకోశ సమస్యలకు అత్యవసర చికిత్స కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచ పరిశోధనలకు అనుగుణంగా ఈ ఫలితాలు ఉన్నప్పటికీ, ఈ అధ్యయనం అధికారికంగా కారణాన్ని నిరూపించలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ డేటా ప్రభుత్వానికి వాయు కాలుష్యం నివారణపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.ఇది కూడా చదవండి: షాకిస్తున్న కేరళ ‘హెచ్ఐవీ’.. నెలకు 100 కొత్త కేసులు -
వైద్యచరిత్రను మలుపు తిప్పిన రోజు.. తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇదే
నేడు ప్రపంచ వైద్య చరిత్రను మలుపు తిప్పిన రోజు. మొదటి సారిగా ఒక మనిషి గుండెను మరో మనిషికి అమర్చిన దినం! మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ చికిత్స దక్షిణా ఫ్రికాలోని కేప్టౌన్లో జరిగింది. ఆపరేషన్ నిర్వహించింది అమె రికాలో శిక్షణ పొందిన డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. రోడ్డు ప్రమాదంలో తలకు గాయం తగిలి బ్రెయిన్ డెడ్ అయిన డెనిస్ డెర్వల్ అనే 25 ఏళ్ళ యువతి గుండెను లూయిస్ వాష్కా¯Œ స్కీ అనే 53 ఏళ్ళ వ్యాపారికి అమర్చారు. అతనికి గుండె జబ్బు తీవ్రంగా ఉండి, ఏ మందులతోనూ బతక లేడని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది (1967 డిసెంబర్ 3). ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కానీ 18 రోజులకే పేషెంట్ మరణించాడు. రోగ నిరోధక వ్యవస్థను అణచడానికి ఇచ్చిన మందులు సరిగా పని చేయకపోవడంతో న్యుమోనియా వచ్చి అతడు మరణించాడు. ఈ ఘటన తర్వాత ప్రపంచం మొత్తం హార్ట్ సర్జరీ, అవయవ మార్పిడి, వైద్యపరమైన నైతికత, మరణానికి నిర్వచనం, రోగుల హక్కుల వంటి అనేక విషయాలను కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. 1960వ దశకంలో గుండె శస్త్రచికిత్సలు చాలా అభివృద్ధి చెందాయి. హార్ట్–లంగ్ మెషీన్, బైపాస్ టెక్నిక్, మూత్రపిండ మార్పిడి అనుభవాలు గుండె మార్పిడి దిశగా వైద్య రంగాన్ని తీసు కెళ్లాయి. అయినా కూడా ‘మనిషి గుండెను తీసి మరొకరి గుండె పెట్టడం’ అనేది ఆశ్చర్యకరమైన, ధైర్యంతో కూడిన, భయానక మైన ఆలోచన. గుండెను ఒక మనిషి ప్రాణంగా; భావాలు, వ్యక్తిత్వం వంటివాటికి ప్రతిరూపంగా చూడటం వల్ల గుండె మార్పిడి పెద్ద సవాలుగా మారింది. ఈ సర్జరీ మానవ వైద్య చరిత్రలో విప్లవం అనడం అతిశ యోక్తి కాదు. జంతువులపై చేసిన ప్రయోగాలన్నీ మానవ శరీరంపై కూడా చేసి విజయం సాధించవచ్చని స్పష్టం అయింది. ఇమ్యూనాలజీని అభివృద్ధి చేయడం, అవయవ నిరాకరణ వంటివి ఆనాటి పెద్ద సమస్యలు. వాష్కాన్స్కీ కేసు తర్వాత మంచి ఇమ్యూ నోసప్రెషన్ మందుల అవసరం పెరిగింది. ఇది తర్వాత సైక్లోస్పో రిన్ వంటి శక్తిమంతమైన మందుల అభివృద్ధికి దారితీసింది. ఈ కేసు తర్వాత బ్రెయిన్ డెత్ను లీగల్గా అంగీకరించడం ప్రారంభ మైంది. ఇది అవయవ దానం అభివృద్ధికి కీలకంగా మారింది. ఈ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ హృదయ మార్పిడి ప్రయత్నాలు జరిగాయి. వైద్య కళాశాలల్లో ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్కు ప్రత్యేక శిక్షణ మొదలైంది. అయితే నైతికపరమైన ప్రశ్నలు కొన్ని తలెత్తాయి. అప్పట్లో ‘బ్రెయిన్ డెడ్’ అనే నిర్వచనం ఇప్పటిలా లేదు. వెంటిలేటర్ తీసేసి, పొటాషియం ఇంజెక్షన్ ఇచ్చి డెనిస్ గుండెను ఆపేశారు. ఇది చాలా మంది డాక్టర్లకు ‘దాతను చంపి గుండె తీసినట్టు’ అని పించింది. రోగి, దాత కుటుంబాలకు శస్త్రచికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేదనే విమర్శ ఉంది. ముఖ్యంగా రోగికి ‘మీరు బతికే ఛాన్స్ చాలా తక్కువ’ అని స్పష్టంగా చెప్పలేదనీ అంటారు. ప్రచారం కోసం రోగి జీవితంతో ఆటలాడారనీ అన్నారు. అమెరికా కంటే తామే ముందు ఇటువంటి శస్త్రచికిత్స చేశామనే ప్రచారం కోసం అప్పట్లో జాతి వివక్ష అమలులో ఉన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ సర్జరీని వాడుకోవడమూ గమనార్హమే. విమర్శలు ఎన్ని వచ్చినా, గుండెమార్పిడి శస్త్ర చికిత్సలో అద్భుత మైన ప్రగతి సాధించడానికి బర్నార్డ్ ధైర్యంగా నిర్వహించిన సర్జరీ పునాదిగా నిలిచింది. ఇప్పుడు ఈ చికిత్స చేయించుకున్నవారు 20 నుంచి 30 ఏళ్లు బతకడం ఇందుకు నిదర్శనం. -
అసలు నిజమేంటి?.. ఎందుకిలా జరుగుతుంది?
నిద్రలో కాళ్లు చేతుల ఆడవు.. మెడను నొక్కస్తున్నట్లు ఉంటుంది అది దెయ్యం పనేనా..??? అర్ధరాత్రి..! గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి ఎవరో మంచం పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది..! క్రమంగా గుండెలపైకెక్కి కూర్చున్నట్లు.. గొంతు నులుముతున్నట్లు అనిపిస్తుంది..! మనం అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగా ఒక్క తోపు తోసేయాలనుకుంటాం.కానీ, చేతులు కదలవు..! కాళ్లను కదపలేం..! ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతిఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు..! కొందరికి ఈ స్థితి ఒకరెండ్రుసార్లు ఎదురైతే.. మరికొందరికి నిద్రలో ఇదో నిత్యకృత్యం..! ఇందుకు కారణాలేంటి? కొందరైతే దెయ్యమే ఆ పని చేస్తోందంటారు. మరికొందరైతే.. గిట్టనివారు చేతబడి చేయడం వల్ల ఇలా జరిగిందంటారు..! అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలని ఉందా..!ఏ సమయంలో ఇలా జరుగుతుంది??అర్ధరాత్రి సరిగ్గా 12.30 గంటలు దాటాకే చాలా మంది ఇలాంటి ఫీలింగ్ను ఎదుర్కొన్నట్లు పలు పరిశోధనలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 3.30 వరకు ఎప్పుడైనా ఈ పరిస్థితి రావొచ్చని పేర్కొంటున్నాయి. ఎవరో గుండెలమీద కూర్చుని, పీక నొక్కుతున్నట్లు.. గుండెలపై బరువు అంతకంతకూ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాళ్లు, చేతులను కదిలించలేని స్థితిలో.. ఏమీ చేయలేని దుస్థితి ఎదురవుతుంది. అంతేకాదు.. గట్టిగా అరవాలనిపించినా.. అరవలేరు. కళ్లు కూడా తెరవలేరు. దాంతో.. గుండెలో దడ మొదలవుతుంది. మదినిండా ఆందోళనలతోకూడిన ఆలోచనలు వస్తుంటాయి. కళ్లు మూసుకుని ఉన్నా.. బెడ్రూంలో పరిసరాలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎదురుగా వింతవింత ఆకారాలు ఉన్నట్లు అనిపిస్తుంది.అంతా ట్రాష్ అంటున్న సైంటిస్టులుఈ పరిస్థితి కలలాంటిదే అని చాలా మందికి తెలియదు. కాస్త మెలకువ వచ్చేముందు.. భయంతో దేవుడి నామస్మరణ చేసుకుంటారు. ఆ తర్వాత నిద్ర లేస్తారు. దాంతో.. దేవుడి పేరు చెప్పగానే దెయ్యం పారిపోయిందనుకుంటారు. కానీ.. ఇదంతా దెయ్యం పనో.. చేతబడుల ఫలితమో కాదని, అవన్నీ ట్రాష్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి పరిస్థితులకు శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు. నిద్రకు సంబంధించిన మానసిక రుగ్మతలైన స్లీప్ టెర్రర్, నైట్ మేర్ డిజార్డర్, స్లీప్ వాకింగ్ మాదిరిగానే.. స్లీప్ పెరాలసీస్ అనే రుగ్మత కారణంగా ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. అంటే.. ఈ పరిస్థితిని నిద్రలో పక్షవాతం అని అనవచ్చు. ఇలా అందరికీ జరుగుతందా? అంటే.. చెప్పలేం..! స్లీప్ పెరాలసిస్ అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది క్షణాలు శరీరమంతా లాక్ అవుతుంది.స్లీప్ పెరాలసిస్ అంటే..అసలు స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా పెరాలసిస్.. అదే పక్షవాతం వస్తే.. పూర్తిగానో.. పాక్షికంగానో కాలు, చేయి చచ్చుబడిపోయి.. నోరు ఓవైపునకు జారిపోతుంది. స్లీప్ పెరాలసిస్ మాత్రం కొన్ని క్షణాలే ఉంటుంది. అయితే.. పక్షవాతానికి మెదడుకు సంబంధం ఉన్నట్లుగానే.. స్లీప్ పెరాలసిస్కు కూడా మెదడు నుంచి విడుదలయ్యే కమాండ్స్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే.. అంతకు ముందు విన్న విషయాలో.. హారర్ స్టోరీలో మెదడులో స్టోర్ అయిపోతాయి. నిద్రలో జాగ్రత్, స్వప్న, సుశుప్త దశలుంటాయి. వీటినే.. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, స్లీప్, డీప్ స్లీప్ అంటారు.స్లీప్ క్వాలిటీ కోసం స్మార్ట్ వాచ్లు పెట్టుకుని, నిద్రపోయేవారికి ఈ విషయాలు బాగా తెలుసు. మనం నిద్రిస్తున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు వెన్నెపూస మెదడులా పనిచేస్తుంది. అందుకే.. నిద్రలో దోమలు కుట్టినప్పుడు మనం అది కుట్టిన చోట తెలియకుండానే గట్టిగా చరుస్తాం. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం.ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో మెదడులో నిక్షిప్తమైన పాత జ్ఞాపకాలు స్లీప్ పెరాలసిస్కు కారణాలవుతాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు.. ఎప్పుడైతే ఎవరో పక్కన కూర్చున్నారనే భావన వస్తుందో.. గుండె దడ పెరగడం వల్ల ఛాతీపై ఎవరో కూర్చున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి పాత జ్ఞాపకాలు కలిసి.. భయం పెరుగుతుంది. అంతే.. కొన్ని సెకన్లపాటు స్లీప్ పెరాలసిస్ వస్తుంది. ఇది కనీసం 30 సెకన్లు ఉంటుంది. గరిష్ఠంగా ఇంత సమయం అని చెప్పలేం.కంటినిండా నిద్ర లేకపోవడమే కారణం..స్లీప్ పెరాలసిస్ అంటే తెలుసుకున్నారు కదా? నిద్ర నుంచి మెలకువ రాగానే స్లీప్ పెరాలసిస్ దశ నుంచి బయట పడతారు. కాసేపు ఆందోళన చెందుతారు. అంతా భ్రాంతి అని అర్థం చేసుకుని, మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా స్లీప్ పెరాలసిస్ రావడానికి దెయ్యాలో, చేతబడులో కారణం కాదు. కంటి నిండా నిద్ర లేకపోవడం, సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించకపోవడం, నిద్ర షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వడం ప్రధాన కారణాలు. ఒత్తిడి, నిరాశ, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, కలత వంటివి ఇతర కారణాలు అని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నవారు ఎక్కువగా స్లీప్ పెరాలసిస్కు గురవుతుంటారు. రోజులో ఎనిమిది గంటల నిద్ర మాత్రమే స్లీప్ పెరాలసిస్కు చెక్ పెట్టగలదని పేర్కొంటున్నారు.-హెచ్. కమలాపతిరావు(చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
నో జిమ్ నో ఫ్యాన్సీ డైట్..! 22 కిలోలు తగ్గిన వెయిట్లాస్ కోచ్
సాధారణంగా బరువు తగ్గడం అంటే సరైన డైట్ ప్లాన్, ఖరీదైన సప్లిమెంట్లు, జిమ్లో ఎక్కువ గంటలు గడపడం అని అనుకుంటుంటారు. సత్వరమే మంచి ఫలితం రావాలంటే మొత్తం లైఫ్స్టైల్నే మార్చితే చాలని కొందరు అనుకుంటారు. కానీ అసలైన వాస్తవం ఏంటంటే..రోజువారి అలవాట్ల నుంచి వస్తుందనేది విస్మరిస్తారని చెబుతోంది కంటెంట్ క్రియేటర్, వెయిట్ లాస్ కోచ్ అయిన నేహా పరిహార్. మనం అంతగా పట్టించుకోని చాలా చిన్న చిన్న బేసిక్ విషయాలతోనే అద్భుతం చేయొచ్చని అంటోందామె. మరి అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!వెయిట్లాస్ కోచ్ నవంబ్కి సుమారు 22 కిలోలు బరువు తగ్గినట్లు నెట్టింట షేర్ చేశారు. అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీని కూడా షేర్ చేసుకుంది. తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి కొలెస్ట్రాల్ బర్నర్లు, డీటాక్స్ పానీయాలను ఉపయోగించలేదని, అలాగే కఠినమైన కేలరీల లెక్కింపు వంటివి ఏమిలేవని స్పష్టం చేసింది. జస్ట్ కామెన్సెన్స్తో స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గే ప్రయంత్నం చేశానని పేర్కొంది. అదెలాగంటే..ఎక్కువ లాగిస్తూనే..నేహా తనను తాను ఆకలితో అలమటించే ప్రయత్నం చేయలేదని వెల్లడించింది. తాను అక్షరాల రోజుకు 3 ఫుల్ మీల్స్ + 1 స్నాక్ తినడం ప్రారంభించానని తెలిపింది. భోజనం దాటవేయడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకు బదులుగా ఆమె తన ప్లేట్లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా కేర్ తీసుకుంది.ప్రతిరోజూ వాకింగ్పదివేల అడుగులు నవడవ లేదు, అలాగే ట్రెడ్మిల్ సెషన్లు కూడా చేయలేదు. జస్ట్ రాత్రి భోజనం తర్వాత 30 నిమిషాల వాక్ మాత్రమే. దీంతోనే నేహ జీర్ణక్రియను, బొడ్డుకొవ్వుని మెరుగుపరిచింది. ఇది ఒకరకంగా వ్యాయామ ఒత్తిడిని దూరం చేసింది.నూటికి నూరు శాతం హెల్దీగా తినడం మానేసింది..ఎల్లప్పుడూ హెల్దీకి ప్రాధాన్యత ఇస్తే వారాంతంలో నచ్చిన ఐటెమ్స్ లాగించాలనే కోరిక కలుగుతుందట. అందుకు నేహా 80:20 రూల్ని పాటించిందట. అంటే 80% నిజమైన ఆహారం, 20% స్మార్ట్గా తినటం. అంటే అప్పడప్పుడు నచ్చిన రిలాక్స్డ్ భోజనం అది కూడా పరిమితంగా తీసుకునేదాన్ని అంటోందితేలికపాటి విందులురాత్రి 7:30 గంటలకు చీలా, క్వినోవా దోస, పప్పు-సబ్జీ వంటివి తీసుకునేది. ఇలా తేలికగా తినడం వల్ల ఆమె జీర్ణక్రియ, నిద్ర, మానసిక స్థితి మెరుగుపడటమే కాకుండా బొడ్డు కొవ్వు కూడా తగ్గింది.బరువు తగ్గే ఖరీదైన సప్లిమెంట్లు, సంక్లిష్ట ఆహారాలను తీసుకోవాల్సిన పనిలేదని నేహా వెయిట్ లాస్ స్టోరీ చెబుతోంది. చాలా చిన్న చిన్న విషయాల్లో కేర్ తీసుకుంటే చాలు. ముఖ్యంగా వేళకు భోజనం, నిద్ర, కాస్త కదలిక ఉంటే చాలు. దీంతో పాటు టెన్షన్ లేని ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకుంటే బరువు తగ్గడం సులభమని చాలా సింపుల్గా చేసి చూపించారామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!) -
చలి... చర్మ సమస్యలూ, జాగ్రత్తలు..!
శీతకాలంలోని చల్లటి వాతావరణంలో చలి ప్రభావం నేరుగా చర్మం మీదే పడుతుంది. అందుకే ఆ చలి బాధను మొదట అనుభవించేది చర్మమే. పైగా ఈ సీజన్లో వాతావరణంలో తేమ బాగా తగ్గి΄ోవడంతో... దాన్ని మళ్లీ భర్తీ చేయడానికి మన చర్మం నుంచే తేమను అప్పుడున్న వాతావరణం లాగేస్తుంటుంది. ఈ కారణంగానే ఈ సీజన్లో చర్మం పొడిబారిపోయి కనిపిస్తుంటుంది. ఫలితంగా ఈ సీజన్లో చర్మంపై గోటితో గీరగానే గీతలు పడుతుంటాయి. అంతేకాదు.. ఈ సీజన్లో ఇతర అలర్జీలతో పాటు చర్మ–అలర్జీలూ పెరుగుతాయి. ఫలితంగా చర్మం పగలడం, కాళ్లు పగుళ్లు ప్రస్ఫుటంగా కనిపించే ఎగ్జిమా వంటి కేసులు పెరుగుతాయి. అందువల్ల మరీ ముఖ్యంగా మడమలు పగలడం కూడా ఈ సీజన్లోనే చాలా ఎక్కువ. ఇలా మడమల పగుళ్లు కనిపించడమన్నది యువతులు, మహిళల్లో మరికాస్త ఎక్కువ.ఎగ్జిమా : కాళ్లూ, చేతులు పగుళ్లబారి కనిపించడం ఎగ్జిమా తాలూకు ప్రధాన లక్షణం. ఈ సీజన్లో చలి కారణంగా పెరిగి΄ోయి కనిపించే కేసుల్లో ఎగ్జిమానే ఎక్కువ. అందుకే దాని నివారణ, చికిత్సల గురించి తెలుసుకుందాం.నివారణ, చికిత్స : ఎగ్జిమా నివారణ/చికిత్సలు ఇవి... ∙దురద అంతగా లేనివారు సువాసన లేని, మామూలు హై΄ో అలర్జిక్ మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ చర్మాన్ని సంరక్షించుకోవాలి. ∙ఒకవేళ దురద ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు వాటిని తగ్గించే పూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడాలి.హౌజ్వైఫ్ డర్మటైటిస్ : పేరునుబట్టి ఇది గృహిణులకు మాత్రమే వచ్చే సమస్యగా అనిపించవచ్చు గానీ అది నిజం కాదు. కొన్నిసార్లు మధ్యవయస్కులతో ΄ాటు, యువతుల్లోనూ కనిపిస్తుంది. అంటే ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు ‘హౌజ్వైఫ్ డర్మటైటిస్’ ముప్పు ఎక్కువ. ఈ వయసు మహిళలు... తాము ముఖం కడుక్కోవడానికి వాడే సబ్బులు, బట్టలు ఉతకడం కోసం వాడే డిటర్జెంటు సబ్బులు, ΄ûడర్లు; అలాగే కొన్ని సందర్భాల్లో వారు ముఖానికి పసుపు, కుంకుమ రాసుకోవడం కారణంగా ముఖం బాగా ΄÷డిబారి΄ోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫలితంగా చర్మంపై పగుళ్లు, దురదలు వస్తాయి. ఈ సమస్యనే ‘హౌజ్వైఫ్ డర్మటైటిస్’ అంటారు. నివారణ : ∙తమకు అలర్జీ కలిగించే అన్ని రకాల పదార్థాలను గుర్తించి, వాటి నుంచి దూరంగా ఉండటం. ∙మడమలు పగలినవారు శాల్సిలిక్ యాసిడ్ ఉండే కాంబినేషన్ క్రీములు వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది. కాళ్లు పగిలిన వారు రాత్రి వేళ సాక్స్ ధరించి పడుకోవడం వల్ల మడమల పగుళ్లు చాలావరకు తగ్గుతాయి.చలికాలంలో పూర్తిస్థాయి చర్మ సంరక్షణ కోసం... చలికాలంలో బాగా పొగలుగక్కే వేణ్ణీళ్లు మంచివి అని కొందరు పొరబడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. నిజానికి ఈ సీజన్లోని వాతావరణం మన చర్మం నుంచి తేమను లాగేస్తుంటుంది. ఫలితంగా వేడినీళ్లతో స్నానం చర్మాన్ని మరింత పొడిబార్చే ప్రమాదం ఉంది. అందుకే స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడటమే మేలు స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడటం కూడా మంచిదే చల్లటి వాతావరణంలో దాహం వేయక΄ోవడంతో నీరు తాగడం తగ్గించడం సరికాదు. రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగడమే మంచిది అరచేతులు, పాదాలు పగిలినవాళ్లు పాదాలకూ సాక్స్, చేతులకూ కాటన్ గ్లౌజ్ ధరించడం మంచిది పెదవులు పగలకుండా పెట్రోలియమ్ జెల్లీగానీ లేదా లిప్ బామ్గానీ పెదవులపై తరచూ రాసుకుంటూ ఉండటం మంచిది చలికాలమే అయినప్పటికీ తగినంత ఎస్పీఎఫ్ ఉండే సన్స్క్రీన్ లోషన్ను రాసుకుంటూ ఉండటం మంచిది. (చదవండి: -
హెల్త్ మాట 'వింటరు' కదా..?
చలికాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు సాధారణంగా కాస్తంత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఈ సీజన్లో కీళ్లకు సంబంధించిన నొప్పులు పెరుగుతుంటాయి. కండరాల నొప్పులు కనిపిస్తుంటాయి. ఇక ఒళ్లంతా పగుళ్లతో, ముఖం, పెదవులూ, మడమలపై పగుళ్లు కనిపిస్తూ బాధిస్తుంటాయి. ఇలా చర్మసంబంధిత సమస్యలూ వస్తాయి. ఇక వైరస్ల వ్యాప్తికి అనువైన కాలం కావడంతో జలుబుతో ముక్కుకారడం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పెరగడమూ కనిపిస్తుంది. ఈ చలికాలంలో కనిపించే సాధారణసమస్యలూ, వాటి పరిష్కారాలకుఅనుసరించాల్సిన సూచనలేమిటో చూద్దాం...చలికాలంలో అన్నిటికంటే ఎక్కువగా బాధించే సమస్య కండరాలూ, కీళ్లనొప్పులు. పైగామామూలుగానే ఈ సమస్యతో బాధపడేవాళ్లలో ఈ సీజన్లో ఆ బాధలు కాస్తంత ఎక్కువగా బాధిస్తూ వేధిస్తాయి. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.చలికాలంలో కండరాలూ, కీళ్లనొప్పులు పెరగడం ఎందుకంటే... ఈ సీజన్లో చలివల్ల చర్మం చాలా త్వరగా తన వేడిని కోల్పోతుంది. దాంతో చర్మం పైభాగంలో ఉండే రక్తనాళాలు కొద్దిగా కుంచించుకు΄ోతాయి. ఇలా కుంచించుకుపోవడాన్ని ‘వాసో కన్స్ట్రిక్షన్’ అంటారు. ఇలా కుంచించుకు΄ోవడంతో ఆ ప్రాంతాలకు రక్తప్రసరణ కూడా కాస్త తగ్గుతుంది. దాంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలైన ‘పెయిన్ సెన్సార్స్’ మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ పెయిన్ సెన్సర్స్ ఈ సీజన్లో ఇంకాస్త చురుగ్గా పనిచేయాల్సిరావడంతో చిన్న దెబ్బకే ఎక్కువ నొప్పి తెలుస్తుంటుంది. అందుకే చలికాలంలో ఒంటికి గాయాలైతే... దెబ్బ చిన్నదే అయినా, నొప్పి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ సీజన్లో కండరాలూ, కీళ్ల నొప్పులు పెరగడానికి దోహదం చేసే ఒక అంశం. ఇక మరో అంశమేమిటంటే... చాలామందిలో ఈ సీజన్లో నొప్పిని భరించే సామర్థ్యం (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. అందుకే బాధితులు మామూలు రోజుల్లోని నొప్పులూ కూడా ఈ కాలంలో మరింత పెరిగినట్లుగా అనిపిస్తాయి. ఈ సీజన్లో చలికి కీళ్లు బిగుసుకు΄ోతుంటాయి. దాంతో వాటిలో మామూలుగా ఉండాల్సిన కదలికలు కూడా బాగా తగ్గిపోతాయి. కీళ్లలో ఈ కదలికల తగ్గుదల కారణంగా మన రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసే ఒళ్లు కదల్చడం, నడక వంటివి తగ్గిపోవడంతో దేహానికి ఒనగూరే వ్యాయామమూ, శారీరక శ్రమ కూడా తగ్గుతాయి. ఈ కారణం చేత కూడా కీళ్ల నొప్పులు బాగా పెరిగిపోతాయి. సాధారణంగా ఎముకలకు అందాల్సిన పోషకాలు దేహపు కదలికల వల్లనే వాటికి అందుతుంటాయి. ఈ కదలికలు తగినంతగా లేక΄ోవడంతో కీళ్లూ, ఎముకలకు అందాల్సిన పోషకాలూ సరిగా అందవు. మామూలుగా ఇతర సీజన్లలో కంటే... వింటర్ సీజన్లో సూర్యుడు చాలా తక్కువ సేపు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే చలికాలంలో పగటి నిడివి బాగా తక్కువగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. ఫలితంగా మన దేహాలు, చర్మం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్లో మన ఎముకలకు అవసరమైన విటమిన్–డి పాళ్లూ తగ్గుతాయి. అంతేకాదు... ఈ కారణం వల్ల మరో అనర్థమూ పొంచి ఉంటుంది. అదేమిటంటే... ఏవైనా కారణాలతో ఈ సీజన్లో ఎముకలు ఫ్రాక్చర్ అయితే అవి అతుక్కోడానికి పట్టే వ్యవధి మిగతా కాలాలలో ΄ోలిస్తే ఈ సీజన్లో మరింత ఎక్కువగా ఉంటుంది.ఒళ్లూ, కండరాల నొప్పులు తగ్గుదల కోసం ఇవీ కొన్ని పరిష్కారాలూ, సూచనలుఈ సీజన్లో వీలైనంత మేరకు గాయాల΄ాలు కాకుండా అలాగే వాహనాలు నడిపేటప్పుడు లేదా వ్యాయామాల సమయంలో దెబ్బలు తగలకుండా తమను తాము జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఆరుబయట నడుస్తున్నప్పుడు తాకుడురాళ్లు / ఎదుర్రాళ్లు తగలకుండా పాదం అంతా కప్పి ఉంచేలా మంచి షూస్ ధరించాలి. వేళ్లు బయటకు కనపడేలా ఉండే పూర్తిగా కవర్ చేయని చెప్పులూ, స్లిప్పర్స్ ధరించినప్పుడు కాలివేళ్లకు ఎదుర్రాయి తగిలి, చిన్న దెబ్బ తగిలినా, జివ్వుమనడం, చాలా బాధగా అనిపించడం, నొప్పి బాగా తెలుస్తుండటం జరుగుతుంది. షూస్ వల్ల కాళ్ల నుంచి వేడిమి కోల్పోకుండా ఉండటంతోపాటు, పాదాలకూ, కాలివేళ్ల చివరలకు పూర్తి రక్షణ కలుగుతుంది. అలాగే... వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్, నీ క్యాప్స్ వంటివి ధరించడం వల్ల గాయాలను / దెబ్బలను వీలైనంతగా నివారించుకోవచ్చు. ఆరుబయట చలిగా ఉన్నప్పుడు దేహానికి తగినంత వేడిని ఇచ్చేలా ఫుల్ స్లీవ్స్ ఉండే దుస్తులూ, ఊలు దుస్తులూ, ఉన్ని దుస్తుల వంటివి ధరించాలి. ఇవి దేహం నుంచి ఉష్ణోగ్రత బయటకు వెళ్లనివ్వకుండా దేహం వెచ్చగా ఉండేలా చూస్తాయి. అలాగే చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం, కాళ్లకు సాక్స్ ధరించడం వంటి జాగ్రత్తలూ మేలు చేస్తాయి. ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైనంత మేరకు ఇన్డోర్ ఎక్సర్సైజ్లు చేయాలి. ఈ వ్యాయామాల ఫలితంగా ఈ సీజన్లో మామూలుగానే కాస్తంత మందకొడిగా జరిగే రక్త సరఫరా ఉత్తేజితమై నార్మల్ స్థాయికి వస్తుంది. దాంతో నొప్పిని తెలిపే సెన్సర్స్ కూడా మామూలుగానే పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. చాలామంది చలి కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కాఫీ, టీ వంటి పానియాలను ఎక్కువగా తాగుతారు. దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీటిని కోల్పోతాం. వాటిని భర్తీ చేసేంతగా నీళ్లు తాగం. ఇలా నీరు తక్కువ తాగడం, చెమట కారణంగా మనకు తెలియకుండానే దేహం డీహైడ్రేషన్కు లోనయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల శరీరంలో నీళ్లు, లవణాల మోతాదులు బాగా తగ్గి΄ోతాయి. అందుకే ఈ సీజన్లో తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్కు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్లు విటమిన్–డి సప్లిమెంట్స్ వాడాలని సూచించినవారు ఆ మేరకు వాటిని వాడాలి. సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులకు ఈ సీజన్లో వారి నొప్పుల బాధలు మరింత పెరుగుతాయి. అందుకే ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులు ఈ సీజన్లో తమ డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్లు తప్పక వాడాల్సిందే. చలికాలంలో ఈ సూచనలూ, జాగ్రత్తలతో కీళ్ల, కండరాల నొప్పులను చాలావరకు నివారించుకోవచ్చు. తమ ఒళ్లునొప్పుల వంటి బాధల నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చు. ఈ సూచనలు పాటించాక కూడా కండరాల నొప్పులూ, కీళ్ల నొప్పులూ, ఒళ్లునొప్పులూ తగ్గకపోతే ఒకసారి డాక్టర్ను కలిసి తగిన పరీక్షలు, వాటి ఫలితాలను బట్టి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.జలుబులూ... ఇతర వైరల్ జ్వరాలు మనలో జలుబు రావడానికి రెండువందల రకాలకు వైరస్లు కారణమవుతాయి. ఈ రెండు వందలకు పైగా వైరస్లనూ, వాటిలో కనిపించే కొన్ని సమాన లక్షణాలను బట్టి గ్రూపులుగా విభజిస్తే... అందులో ఆరు రకాల గ్రూపులతో జలుబు వస్తుంటుందన్నది వైద్య నిపుణుల మాట. ఆ వైరస్లు ఏమిటంటే... 1) ఇన్ఫ్లుయెంజా, 2) పారాఇన్ఫ్లుయెంజా, 3) రైనోవైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్ రెస్పిరేటరీ నిన్సీషియల్ వైరస్ 6) బీఎఫ్–7 వేరియెంట్ అనేవి. గత కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ బాధించిన కరోనా వైరస్ కూడా ఈ బీఎఫ్ వేరియెంట్ కిందకే వస్తుంది. కాక΄ోతే ఇప్పుడు కరోనా వైరస్ మునపటి తీవ్రత కోల్పోయిన కారణంగా అప్పుడప్పుడు అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ జలుబులో ఉండే మామూలు లక్షణాలనే ప్రదర్శిస్తోంది. లక్షణాలు... జలుబు వచ్చినప్పుడు కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, గొంతులో గరగర, ముక్కు నుంచి లేదా ముక్కుతోపాటు కళ్ల నుంచి నీరు కారుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైరస్ సోకిన 5 నుంచి 7 రోజుల్లో ఈ లక్షణాలన్నీ తగ్గి΄ోతాయి. అయితే అరుదుగా కొన్ని సార్లు మాత్రం ఈ వైరస్లు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి నిమోనియా అనే ప్రమాకరమైన కండిషన్కు కారణమవుతాయి. మామూలు నిమోనియాతో పోలిస్తే... ఇలా ఒక వైరస్ కారణంగా వచ్చే సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారిగా పరిణమిస్తుంది. జలుబుగానీ లేదా ఇతరత్రా వైరస్ల వల్లగానీ సమస్య శ్వాసవ్యవస్థలోని పైభాగంలో అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉంటే... అది చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఒకవేళ పైన పేర్కొన్న వైరస్లు శ్వాస వ్యవస్థలో మరికాస్త లోతుకు వెళ్లి... అక్కడి కింది భాగాలకు అంటే... లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు వ్యాపిస్తే అది నిమోనియాకు దారితీస్తుంది. అప్పుడు సమస్య ఇంకాస్త తీవ్రమవుతుంది. కొన్నిసార్లు ముక్కు, శ్వాసకోశ వ్యవస్థల్లోని సన్నని ఎపిథీలియల్ పొర దెబ్బతినడం వల్ల అక్కడికి బ్యాక్టీరియా చేరి సైనుసైటిస్, ఫ్యారింజైటిస్ వంటి ఇతర సమస్యలూ వచ్చే అవకాశాలూ ఉంటాయి. నివారణ... మంచి పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ సీజన్లో ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఇమ్యూన్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. దీనివల్ల జలుబుతోపాటు... ఇతరత్రా జబ్బులనుంచీ దేహానికి మంచి రక్షణ దొరుకుతుంది జలుబు వచ్చినవారు నేరుగా ఇతర వ్యక్తులపై తుమ్మడం, దగ్గడం చేయకూడదు. తుమ్మే సమయంలో లేదా దగ్గేటప్పుడు చేతిరుమాళ్లు, టిష్యుపేపర్లు వంటివాటిని అడ్డు పెట్టుకోవడం అవసరం. అవి లేనప్పుడు కనీసం మోచేతి మడతలో తుమ్మడం, దగ్గడం చేయాలి. ఇక తరచూ చేతులు కడుక్కోవడం లేదా శానిటైజ్ చేసుకోవడం, ఇతరులనుంచి భౌతిక దూరాన్ని పాటించడం, గుంపుల్లోకి (క్రౌడ్స్లోకి) వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సీజన్లో జలుబు మాత్రమే కాకుండా అనేక ఇతర వైరస్ల కారణంగా వచ్చే వైరస్ జబ్బులను నివారించుకోవచ్చు. ఆస్తమా వంటి సీజనల్ సమస్యలు...ఇక ఈ సీజన్లోని చలి వాతావరణంలో ఆస్తమా వంటి సీజనల్ సమస్యలూ పెచ్చరిల్లుతాయి. మందకొడి వాతావరణంలోని అలర్జెన్స్ వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకుపోయే గాలిగొట్టాలు కుంచించుకుపోవడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే ఈ సీజన్లో మనకు సరిపడని అలర్జెన్స్నుంచి దూరంగా ఉంటూ ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యను నివారించుకోవాలి. తమకు ఈ సమస్య ఉందని తెలిసినవారు ఇన్హేలర్స్ వంటి ఫస్ట్లైన్ చికిత్సలతో సమస్య తీవ్రతరం కాకుండా నివారించుకోవాలి. అప్పటికీ తగ్గక΄ోతే డాక్టర్ను సంప్రదించి... ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్ల వంటి మందులు, ఇన్హేలర్లు వాడటం మంచిది.చికిత్స:జలుబు లేదా జలుబు వంటి వైరస్లతో వచ్చే సమస్యలన్నీ తమంతట తామే (సెల్ఫ్ లిమిటింగ్) సమస్యలు. వీటికి చికిత్స అందుబాటులో లేదు. కేవలం ఉపశమనం కోసమే లక్షణాలను బట్టి (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్గా) కొన్ని మందులు ఇస్తుంటారు. లక్షణాలను తగ్గించడం కోసం జ్వరానికి పారాసిటమాల్, ముక్కులు పట్టేసినప్పుడు నాసల్ డీ–కంజెస్టెంట్స్ వంటి వాటిని డాక్టర్లు సూచిస్తారు. వాటితో తగినంత ఉపశమనం కలుగుతుంది.గొంతునొప్పి, గొంతులో గరగర ఉన్నవారు లోజెంజెస్ వాడవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గరగరా పుక్కిలించడం (థ్రోట్ గార్గలింగ్) చేయవచ్చు.జలుబు, దాని వల్ల వచ్చే జ్వరం తగ్గిపోయాక కూడా చాలామందిలో నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి కనిపిస్తూ ఉంటాయి. దాన్నే పోస్ట్ పైరెక్సియల్ డెబిలిటీ’ అంటారు. ఇది తగ్గడానికి అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉండే పుష్టికరమైన సమతులాహారం; జింక్ వంటి న్యూట్రియెంట్స్తోపాటు విటమిన్–సి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.చల్లగా ఉండే వాతావరణం కారణంగా చాలామంది చలికాలంలో ఎక్కువగా నీళ్లు తాగరు. జలుబు చేసినప్పుడు నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి... దేహానికి జలుబును ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుంది.డాక్టర్ వెంకట్ నాని కుమార్ .బి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ (చదవండి: పెళ్లిపై నటి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు..! అది పాతబడిన వ్యవస్థ) -
రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం
జాతీయ భద్రత, ప్రజారోగ్య రంగాల కోసం అదనపు నిధులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ‘ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లు-2025’ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.ఈ ప్రతిపాదిత సెస్ అనేది నిర్దిష్ట వస్తువుల ఉత్పత్తి, తయారీ యంత్రాలకు వర్తిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. త్వరలో ముగియనున్న పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ను ఈ కొత్త సెస్ భర్తీ చేయనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా పొగాకు ఉత్పత్తులపై ఉన్నత స్థాయి జీఎస్టీ రేటును కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని సమాచారం.ఈ సెస్ను అమల్లోకి తీసుకువచ్చేందుకు జాతీయ భద్రత, ప్రజారోగ్యం అనే రెండు ప్రధాన అంశాలు కారణంగా ఉన్నాయి. ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ స్థాయి ప్యానెల్ ‘ఫ్యూచర్ వార్ఫేర్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ నిధిని సాయుధ దళాల్లో భవిష్యత్ యుద్ధ సాంకేతికతల అధ్యయనం కోసం ఉపయోగించాలని సూచించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ కేటాయింపులు ఇప్పటికే రూ.6.18 లక్షల కోట్లు దాటాయి. ఈ సెస్ అమల్లోకి వస్తే మరింత నిధులు చేరే అవకాశం ఉంటుంది.ప్రజారోగ్యం, పథకాల విస్తరణఆయుష్మాన్ భారత్ వంటి కీలక ఆరోగ్య పథకాల విస్తరణకు అదనపు వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం దేశ జనాభాలోని 40 శాతం ప్రజలకు చెందిన సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు అంటే దాదాపు 12.37 కోట్ల కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తోందని ప్రభుత్వ చెబుతుంది. 2025-26లో ఆరోగ్య రంగానికి సుమారు రూ.1 లక్ష కోట్ల వ్యయం అంచనా వేయగా, జాతీయ ఆరోగ్య విధానం ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని సిఫారసు చేస్తోంది. దాంతో ఈ సెస్ ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.సెంట్రల్ ఎక్సైజ్ చట్టం సవరణఈ కొత్త సెస్ బిల్లుతో పాటు, 1944కి చెందిన వలస పాలన కాలం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ను కూడా ప్రభుత్వం సవరించనుంది. సవరణ అనంతరం ఎక్సైజ్ సుంకం కేవలం ముడి పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్, సహజ వాయువు, పొగాకు ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుందనే అంచనాలున్నాయి. దీనికి సంబంధించి ఇంకా సమగ్ర వివరాలు తెలియాల్సి ఉంది. పన్ను పరిధిని విస్తరించే ఉద్దేశం లేకపోయినా సమకాలీన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పాత చట్టాన్ని ఆధునీకరించడమే ఈ సవరణ లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.ఇప్పటికే అమలవుతున్న సెస్లుఆదాయపు పన్నుపై 4% హెల్త్, ఎడ్యుకేషన్ సెస్.పెట్రోల్, డీజిల్పై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్, రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్.పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్.సాధారణంగా ఈ సెస్ల నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తరచూ విమర్శలు వస్తున్నాయి.సరిహద్దు ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆరోగ్య డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ రెండు కీలక రంగాలను సమానంగా బలోపేతం చేయాలని చూస్తోంది. అయితే సెస్లపై అధికంగా ఆధారపడటం వల్ల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధాలు, వినియోగదారులపై అదనపు భారం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రధాన చర్చాంశంగా మారనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ -
AIDS Day: హెచ్ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో..
‘హెచ్ఐవీ’ నేటికీ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని బారిన పడినవారు నిరంతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. నేడు డిసెంబర్ ఒకటి.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఈ సందర్భంగా హెచ్ఐవీ నివారణకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఏం వెల్లడించాయి? ఎటువంటి పరిష్కారాలను సూచిస్తున్నాయనే వివరాల్లోకి వెళితే..ఆశాజనకమే.. కానీ..హెచ్ఐవీ అంటువ్యాధిని నివారించడంలో సైన్స్ అద్భుతమైన పురోగతిని సాధించింది. ఇప్పుడు యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)తో హెచ్ఐవీ బాధితులు సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఈ వైరస్ను శాశ్వతంగా తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు క్లినికల్ పరీక్షలలో ఆశాజనకమైన ప్రారంభ ఫలితాలను సాధిస్తున్నప్పటికీ, హెచ్ఐవీ నిజంగా నయం అవుతుందా? అనేది ఇంకా పూర్తిగా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది.స్టెమ్ సెల్స్ సాయంతో..ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగించగల హెచ్ఐవీ చికిత్స అందుబాటులో లేదని ROPAN హెల్త్కేర్ వ్యవస్థాపకురాలు, యూఎన్ సలహాదారు డాక్టర్ సబీన్ కపాసి తెలిపారు. అయితే బెర్లిన్, లండన్కు చెందిన పలువురు రోగులు స్టెమ్ సెల్ మార్పిడి తర్వాత దీర్ఘకాలిక ఉపశమనాన్ని (functional cure) పొందారు. ఈ వ్యక్తులు సీసీఆర్ఎస్ మ్యుటేషన్ కలిగిన దాతల నుండి స్టెమ్ సెల్స్ను స్వీకరించారు. ఇది వైరస్ను కణాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఈ కేసులు చికిత్స జీవశాస్త్రపరంగా సాధ్యమే అని నిరూపించినప్పటికీ, స్టెమ్ సెల్ మార్పిడిలో ప్రాణాంతక ప్రమాదాలు ఉన్నందున, ఇది కేవలం తీవ్రమైన క్యాన్సర్లకు చికిత్స చేయడానికి మాత్రమే పరిమితమై ఉంది. అందువల్ల దీనిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి ఆచరణీయమైన మార్గం కాదని వెల్లడయ్యింది.సవాల్ విసురుతున్న వైరల్ రిజర్వాయర్లు హెచ్ఐవీ చికిత్సకు సంబంధించి కొత్త పరిశోధనలు విస్తృత స్థాయిలో సురక్షితంగా ఉపయోగించగల విధానాలపై దృష్టి సారించాయి. పరిశోధకులు సీసీఆర్ఎస్ గ్రాహకాన్ని నిలిపివేయడానికి లేదా వైరస్ను లక్ష్యంగా చేసుకోవడానికి సీఆర్ఐఎస్పీఆర్ వంటి జన్యు-ఎడిటింగ్ సాధనాలను పరీక్షించడం సహా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అధ్యయనాల నుండి లభ్యమైన ప్రారంభ క్లినికల్ డేటా ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, హెచ్ఐవీకి చెందిన దాగి ఉన్న వైరల్ రిజర్వాయర్లు (latent reservoirs) ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయాయి. ఈ రిజర్వాయర్లు వైరస్ను కణజాలాలలో దాచి ఉంచుతాయి. చికిత్సను నిలిపివేసిన తర్వాత వైరస్ తిరిగి పెరగడానికి కారణమవుతాయి.ఇప్పటికింతే..ఈ అడ్డంకిని అధిగమించడానికి పరిశోధకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్ఐవీ నివారణ దశగా పురోగతి కనిపిస్తున్నప్పటికీ, ఔషధాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయనే హామీని ఎవరూ ఇవ్వడంలేదు. ప్రస్తుతానికి హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించడానికి అత్యంత శక్తివంతమైన విధానం యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ). దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే, అది వైరల్ లోడ్ను కనీస స్థాయికి తీసుకువస్తుంది. బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. సంక్రమణ ముప్పును నివారిస్తుంది. అసురక్షిత లైంగిక సంపర్కం హెచ్ఐవీకి ప్రధాని కారణమని, దీనికి సురక్షిత విధానాలే పరిష్కార మార్గమని వైద్యులు చెబుతుంటారు.ఈ ఏడాది థీమ్.. కార్యక్రమాలుప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం’ అనే థీమ్తో 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకునేందుకు పిలుపునిచ్చింది. సమాజంలో ఎయిడ్స్ బాధితులను చిన్నచూపు చూడటం లాంటి అంతరాలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధమైన పిలుపునిచ్చింది. 2030 నాటికి ఎయిడ్స్ అంతం చేసే లక్ష్యాన్ని చేరుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో అందరి సహకారం అవసరమని తెలిపింది. హెచ్ఐవిపై అవగాహన పెంచేందుకు, బాధితులపై వివక్షను రూపుమాపేందుకు, నేడు పలుచోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా, గోప్యంగా హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే బాధితులకు ఏఆర్టీ మందులు పంపిణీ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్నార్లు నిర్వహిస్తోంది. ఈ రోజున హెచ్ఐవి బాధితులకు మద్దతుగా పలుచోట్ల ప్రజలు రెడ్ రిబ్బన్లు ధరిస్తారు. ఈ వ్యాధితో మరణించిన వారి జ్ఞాపకార్థం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: మళ్లీ శశిథరూర్ లొల్లి.. ఈసారి అమ్మ కారణం? -
ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్ స్కాన్ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?– సుశీల, రాజమండ్రి. మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్ సమస్యలు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. డాక్టర్ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్ తరచుగా గ్రోత్ స్కాన్లు సూచిస్తారు. ఈ స్కాన్లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. డాప్లర్ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ప్రోటీన్ లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. అల్ట్రాసౌండ్ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్ చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. డాక్టర్ కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ (చదవండి: ‘ఎగ్’సలెంట్ లుక్, గోళ్ల ఆరోగ్యం కోసం!) -
చలికాలంలో వేధించే గొంతు గరగర, దగ్గు తగ్గాలంటే..!
-
ఇమ్రాన్ ఆరోగ్యంపై అడియాలా జైలు ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అడియాలా జైలు అధికారులు ఖండించారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య సంరక్షణ, పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో పలు వదంతులు వ్యాపిస్తున్న నేపధ్యంలో అడియాలా జైలు అధికారులు ఈ ప్రకటన చేశారు.తన సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ జైలు సమీపంలో ధర్నా నిర్వహించారు. తన సోదరుడిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కారణంగా అడియాలా జైలు రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు వచ్చే మంగళవారం అతనిని కలిసేందుకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.ఇదేవిధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకు ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రమ్ రాజా తదితరులు జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలుసుకోనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను జైలు అధికారులు ఖండించినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా కుటుంబ సభ్యులపై జైలు అధికారుల ఆంక్షలు విధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: కర్ణాటక: డిసెంబర్ ఒకటి లోగా కొత్త సీఎం? -
కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను!
నాకు చిన్నప్పటి నుంచి ఏ కొత్త వస్తువు చూసినా, కొనాలన్న ఆశ ఎక్కువ. స్కూలు రోజుల్లో రకరకాల పెన్నులు, ప్రతీ సంవత్సరం రెండు మూడు స్కూల్ బ్యాగులు, చెప్పులు, షూస్ కొనేవాడిని. తర్వాత నా ఆసక్తి బట్టలు మీదకు మళ్ళింది. మార్కెట్లోకి కొత్త రకం డ్రెస్లు వచ్చినప్పుడల్లా కొనమని పట్టుబట్టేవాణ్ణి. కొనక΄ోతే అలిగి అన్నం తినడం మానేసేవాడిని. తర్వాత నా మోజు సైకిళ్ళ మీకికి తిరిగింది. టీవీలో కొత్త మోడల్ సైకిల్ కనిపించగానే పాత సైకిల్ అమ్మేసి కొత్తదాన్ని కొనేవాడిని. కాలేజి రోజుల్లో ప్రతి నెలా ఫోన్ మార్చేవాడిని, డిగ్రీ పూర్తయ్యాక బైకులు నాకొత్త వ్యసనం అయ్యాయి. మార్కెట్ లో కొత్త బైక్ విడుదలయితే నా పాత బైక్ తక్కువ ధరకే అమ్మేసి అప్పు తీసుకొని మరీ కొత్త బైక్ కొనేవాడిని. ప్రస్తుతం ఆన్లైన్లో ఆఫర్స్, డీల్స్ కోసం వెతకడం, నియంత్రణ లేకుండా ఖర్చు చేయడం చేస్తున్నాను. ఇలా కొన్న వాటిని తక్కువ ధరకు అమ్మి మళ్లీ కొత్త వస్తువులు కౌంటున్నాను. దీనివలన డబ్బులు కోల్పోతున్నాను. ఇంట్లో భార్యతో గొడవలు, మనశ్శాంతి కూడా ఉండడం లేదు. ఈ అలవాటుని ఎలా మార్చుకోవాలి? – శ్యామ్ సుందర్, గోదావరిఖనిమీరు చెప్పిన లక్షణాలన్నీ ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’ అనే మానసిక సమస్యకు దగ్గరలో ఉన్నాయి. ఇది ‘ఇంపల్సివ్ కంట్రోల్ డిజార్డర్’అనే మానసిక వ్యాధుల కేటగిరీలోకి వస్తుంది. దీనిలో ఏదో ఒక విషయం మీద విపరీతమైన తపన ఉంటుంది. ఆ పని చేసేదాకా మనసులో నిలకడ ఉండదు. ఎప్పుడూ అనే ఆలోచనలే ఉంటాయి. ఆ పని చేయగానే ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. దీనివలన నష్టం జరిగినప్పుడు తర్వాత బాధపడుతూ ఉంటాము. అది షాపింగ్ అవ్వొచ్చు, జూదం అనొచ్చు, ఎక్కువగా సెక్స్ ఆలోచనలు రావడం కావచ్చు లేదా అతిగాని తినాలనే ఆరాటం కావచ్చు. వీటన్నింటిలో ‘డోపమైన్‘ అనే రసాయనం స్థాయి పెరుగుతుంది. దానివలన తాత్కాలికంగా చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కసారి డోపమైన్ స్థాయి తగ్గితే మళ్ళీ ఆ పని చేస్తేనే ఆ రసాయనం పెరిగి ఆనందం కలుగుతుంది. క్రమేణా ఇదొక వ్యసనం లాగా మారుతుంది. చాలా మంది ఆల్కహాల్, ఇతర డ్రగ్స్ కి బానిసలా అవడం వెనుక కూడా ఇదే మెకానిజం ఉంటుంది. ఇక మీ సమస్య విషయానికి వస్తే ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్కు ఖచ్చిత మైన మందులు లేనప్పటికీ ‘యాంటీ డిప్రెసెంట్‘ ‘యాంటీ క్రేవింగ్’ మందులు వాడి కొంత వరకు మీ ప్రవర్తనని అదుపు చేయవచ్చు. దానితోపాటు సైకోథెరపీ, మారైటల్ థెరపీ కూడా ఉపయోగ పడుతుంది. ఎవరో చెప్పినట్లు ఆఫర్లో కొంటే 50 శాతం డబ్బులు మిగులుతాయి. అసలు ఆఫర్లకి దూరంగా ఉంటే 100 శాతం మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కదా... మీరు దిగులు చెందకుండా వెంటనే మంచి సైకియాట్రిస్టుని కలవండి. అన్నీ కుదుట పడతాయి.(డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: సమయం ఆసన్నమైంది మిత్రమా..) -
ఎనిమిదేళ్ల బాలుడికి కిడ్నీ నిండా రాళ్లు
ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో, ఇంకా చెప్పాలంటే చివరకు నవజాత శిశువుల్లో కూడా కిడ్నీ రాళ్ల సమస్య కనిపిస్తోంది. ప్రధానంగా కొంత పెద్ద పిల్లలు తగినంత నీళ్లు తాగకపోవడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకోవడం లాంటివి ఇందుకు కారణాలవుతున్నాయి. మరీ చిన్నపిల్లల్లో అయితే మెటబాలిక్ కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, ఊబకాయం, పర్యావరణ కారణాల వల్ల కూడా ఇవి ఏర్పడుతున్నాయి. ఆహారంలో ఉప్పు వాడకం, తీపి పానీయాలు తగ్గించాలి. తాజాగా వరంగల్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి ఎడమవైపు కిడ్నీ నిండా రాళ్లు ఏర్పడడంతో అతడిని హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు ఆ బాలుడిని తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు విజయవంతంగా మొత్తం రాళ్లన్నింటినీ తొలగించి, బాలుడికి ఊరట కల్పించారు. తొలుత ఆ అబ్బాయికి విపరీతమైన కడుపునొప్పి, జ్వరం ఉండడంతో అది కిడ్నీలో రాళ్ల సమస్యేనని గుర్తించి ఈ చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, పిల్లల్లో కిడ్నీ రాళ్ల సమస్యల గురించి ఏఐఎన్యూకు చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్, ట్రాన్సిషనల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి.అశ్విన్ శేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “బాలుడిని ఇక్కడకు తీసుకురాగానే సమస్యను గుర్తించి, పెర్క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (పీసీఎన్ఎల్) చేయాలని నిర్ణయించాం. ఇందులోభాగంగా వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి, నెఫ్రోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్లి ఎక్కువ నొప్పి లేకుండా రాళ్లను తొలగించాం. సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఇందులో త్వరగా కోలుకుంటారు. దీనివల్ల ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుంది.కిడ్నీలో రాళ్ల సమస్య ఇంతకుముందు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తోంది. ఎవరైనా సరే రోజూ తగినంత నీళ్లు తాగాలి. ఎన్ని తాగాం అన్నదాని కంటే, ఎంత మూత్రం వస్తోందన్నది ముఖ్యం. రోజుకు కనీసం లీటరున్నర మూత్రం పోయేలా నీళ్లు తాగాలి. అలా తాగకపోతే మూత్రం చిక్కబడుతుంది. అదే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి సూచిక. పిల్లల్లో కిడ్నీరాళ్ల తొలగింపు చాలా జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాలి. అత్యాధునిక టెక్నిక్లు ఉపయోగించడం ద్వారా ఈ కేసులో విజయం సాధించాం. ఇందులో ఒక పెద్దరాయి, మరికొన్ని చిన్నరాళ్లు అన్నింటినీ ఒకే సిటింగ్లో తొలగించాం. సాధారణంగా పెద్దరాళ్ల తొలగింపునకు 2-3 సిటింగ్లు అవసరం అవుతాయి. కానీ పీసీఎన్ఎల్ తరహాలో అయితే పెద్ద, సంక్లిష్టమైన రాళ్లనూ తొలగించగలం.తెలంగాణలో కిడ్నీ రాళ్లు, కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఇది ప్రమాదకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీళ్లు తాగినా చెమటరూపంలో పోవడంతో తగినంత మూత్రం విడుదల కాక ఈ సమస్య వస్తోంది. మన దేశంలోనే అత్యధికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేసులు తెలంగాణలో 6.2% ఉన్నాయి. గడిచిన 15-20 ఏళ్లలో పిల్లలకు కిడ్నీల్లో రాళ్ల సమస్య రెట్టింపు నుంచి నాలుగు రెట్లు అయ్యింది. పిల్లల్లో కిడ్నీ రాళ్లు ఏర్పడినప్పుడు.. నెల, రెండు నెలల తర్వాత మెటబాలిక్ సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందుకు 24 గంటల యూరిన్ మెటబాలిక్ పరీక్షలు, సీరం కెమిస్ట్రీలు చూసుకోవాలి. కొన్ని కేసుల్లో జన్యుపరమైన సమస్యల వల్ల ఇవి వస్తున్నాయి. చాలా వరకు మాత్రం నివారించదగ్గ కారణాలే ఉంటున్నందున మన జాగ్రత్తలు చాలాముఖ్యం” అని డాక్టర్ అశ్విన్ శేఖర్ వివరించారు.(చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
లోపం ఐరన్.. అదే సైరన్..
నగరవాసుల్లో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కలంగా ఐరన్ అందించే ఉత్పత్తులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) హెల్త్ లిమిటెడ్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ పాపన అన్నారు. ఐరన్ లోపానికి పరిష్కారం అందించే లివోజెన్ ఐరన్ గమ్మీస్ నగర మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల అలసట, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు భారీగా పెరిగాయని, వీటి నివారణకు వీలుగా మహిళల రోజువారీ ఐరన్ అవసరాలు తీర్చే విధంగా ఈ గమ్మీస్ రూపొందించినట్లు వివరించారు. (చదవండి: Smriti Mandhanas Father: ఆ లక్షణాలు గుండెపోటుకి సంకేతమా..? యాంజియోప్లాస్టీ ఎందుకు?) -
ప్రెషర్..టెన్షన్! మానసిక భాషలో భాగమైన ఒత్తిడి
హైదరాబాద్ మహా నగరం.. టెక్ సిటీ, ఫుడ్ హబ్, కల్చర్ సెంటర్ మాత్రమే కాదు ఈ జనరేషన్ మెంటల్ హెల్త్ను అత్యంత సీరియస్గా తీసుకుంటున్న నగరం కూడా. వేగంగా మారుతున్న లైఫ్స్టైల్, టార్గెట్స్, హడావిడిగా నడిచే టైమ్లైన్.. ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో ఒత్తిడిని అందరికీ దగ్గర చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు నేటి ఆధునికుల్లో సర్వసాధారణం అవుతున్నాయి. ఇది మానసిక, శారీరక ఒత్తిడిని సూచించే మానసిక భాషల్లో ఒక భాగం. అయితే ఇది మోతాదుకు మించి ఉంటే ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో తరచూ వినిపించే ‘డెడ్లైన్’, ‘రోలౌట్’, ‘క్లయింట్ ప్రెషర్’ వంటి మాటలు ఈ తరానికి అలవాటైపోతున్నాయి. దీంతో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. ఆయా సమస్యల నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుత తరంలో ఉరుకుల పరుగుల జీవితం మామూలే. మరీ ముఖ్యంగా నిమిషాలను, సెకన్లను లెక్కబెట్టుకుంటూ.. డెడ్లైన్ పేరుతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరం ఒత్తిడిని అర్థం చేసుకోడానికి, వారికి బాసటగా నిలవడానికి, సరైన క్రమంలో గైడ్ చేయడానికి వ్యక్తులు లేదా వ్వవస్థలు వంటి సాంకేతిక వేదికల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి తరుణంలో మెంటల్ హెల్త్ కోసం సపోర్ట్ సిస్టమ్లు వినూత్న సాంకేతిక వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) అనే టెక్నికల్ ప్లాట్ఫాం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల ఇంటర్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ వీక్ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో ఐదువేల మంది యువత, విద్యార్థులపై ఒత్తిడి ప్రభావంపై సర్వే నిర్వహించింది. ఈ ఒత్తిడి సమస్యల పరిష్కారానికి జీఎం–5 టెక్నాలజీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.పలు నగరాల్లో అధ్యయనం.. హైదరాబాద్ వంటి నగరాల్లో యువతలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) బృందం తెలంగాణ, కర్ణాటకలోని ఐదువేల మంది యువత, విద్యార్థులపై ప్రత్యేక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక మెంటల్ హెల్త్ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఇలాంటి వారిలో నిద్రలేమి, పరీక్షల ఒత్తిడి, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ వంటి కారణాలతో చదువులపై ఇతర అంశాలపై దృష్టి సారించలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రతి నగరంలోనూ యువతలో ఇలాంటి ఒత్తిడి సమస్యల సర్వసాధారణం అయిపోయింది. థెరపీల కోసం విదేశాలకు.. ప్రస్తుత తరం, మరీ ముఖ్యంగా నగరవాసుల్లో ఒత్తిడికి లోనయ్యేవారు బ్రెజిల్ వంటి కొన్ని విదేశాల్లో థెరపీలకు వెళ్లడం సాధారణ విషయం. అంతేకాకుండా వ్యక్తిగత స్పేస్కు ప్రాధాన్యం ఎక్కువ. కానీ దేశంలో మానసిక ఆరోగ్యంలో కుటుంబం, సమాజం, అంచనాలు, బాధ్యతలు వంటి పలు అంశాలు భాగమేనని ఈ బృందం చెబుతోంది. ఇది మనల్ని బలంగా నిలబెట్టినా, కొన్నిసార్లు ఒత్తిడిని తెచ్చిపెడుతుంది. ఈ మిక్స్డ్ ఎకోసిస్టమ్లో టెక్నాలజీ ఆధారిత ఫ్యామిలీ–ఇన్క్లూజివ్ సొల్యూషన్ చాలా అవసరమని వారు పేర్కొన్నారు. అదే సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రోగ్రెసివ్ దారి ఎంచుకుంటున్న నగరం హైదరాబాద్. కాస్తో కూస్తో వెల్నెస్ మీద శ్రద్ధ పెరుగుతుంది. సైకిల్ ట్రాక్స్, మారి్నంగ్ వాక్స్, హెల్దీ కెఫేలు, మెంటల్ హెల్త్ ఔట్రీచ్ ప్రోగ్రామ్లు వంటివి ప్రస్తుతం యువతలో ట్రెండ్ అవుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఫలితాలను అందించట్లేదనేది వాస్తవ సత్యం. భావోద్వేగాలను ట్రాక్ చేస్తుంది.. టెక్నాలజీ – వెల్నెస్ కలిసిన అద్భుత స్థలం భాగ్యనగరం. ఇందులో భాగంగానే గివ్ మీ ఫైవ్ యాప్ భారత బీటా లాంచ్ కోసం హైదరాబాద్ను ఎంచుకుంది. ఇక్కడి కుటుంబ బంధాలు, ఆతీ్మయత బాగుంటాయి. ఇదే మెంటల్ హెల్త్కు పెద్ద సపోర్ట్ సిస్టమ్. నర్వేలో భాగంగా రూపొందించిన ఈ యాప్ వచ్చే యేడాది జనవరి–ఫిబ్రవరిలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. 10 నుంచి 50 ఏళ్ల వరకూం అందుబాటులో ఉంటుంది. రోజూ ఐదు సులభమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారి సోషల్ గ్రాఫ్ను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఫీచర్గా కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్ ‘కంపానియన్’లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంట్లో, ఆఫీసులో, ఫ్రెండ్స్ మధ్య ఒక సెన్స్ ఆఫ్ కేర్, రెగ్యులర్ చెక్కిన్కు దోహదపడుతుంది. సమాధానాల ఆధారంగా భావోద్వేగాలను అర్థం చేసుకుని పరిష్కారాలను సూచిస్తుంది. ఏఐ ఆధారిత సూచనలు, ఫ్యామిలీ–ఫ్రెండ్స్తో కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తుంది. – డాక్టర్.లీసా ఫాహే, సైకాలజిస్ట్ ఆస్ట్రేలియా పర్సనల్ స్పేస్ తప్పనిసరి.. ఒత్తిడిని జయించాలంటే ప్రతిఒక్కరికీ పర్సనల్ స్పేస్ తప్పనిసరి అని, ఇది మానసకి, శారీరక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో యువత చాట్ జీపీటీ వంటి ప్లాట్ఫామ్స్లో తమ భావాలను పంచుకుంటున్న తరుణంలో మెంటల్ హెల్త్కు ఒక సేఫ్ డిజిటల్ స్పేస్ ఉండటం ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ తరుణంలో ఓఏఎమ్ (ఓమ్) రూపొందించిన గివ్ మీ ఫైవ్ (జీఎం–5) యాప్ ఒత్తిడి నియంత్రణకు దోహదపడనుందని భావిస్తున్నారు. భావోద్వేగాలు వ్యక్తం చేయలేనివారు, గిల్టీ ఫీల్ ఉన్నవారు.. బిజీగా ఉండి వ్యక్తిగత, మానసిక స్థిరత్వంపై చొరవ చూపని వారికి ఈ యాప్ కొత్త సపోరి్టవ్ స్పేస్ అందించనుందని భావిస్తున్నారు. (చదవండి: హై రిస్క్ ప్రెగ్నెన్సీస్..ఇవీ జాగ్రత్తలు..!) -
హై రిస్క్ ప్రెగ్నెన్సీస్..ఇవీ జాగ్రత్తలు..!
ఒక్కమాటలో చెప్పాలంటే కాబోయే ప్రతి మాతృమూర్తి తాలూకు గర్భధారణా అలాగే ప్రసవంలో ఎంతోకొంత రిస్క్ ఉండనే ఉండవచ్చు.అయితే కొందరి గర్భధారణలు (ప్రెగ్నెన్సీలు) చాలా రిస్క్తో కూడుకున్నవే అవుతాయి. ఉదాహరణ ఒక మహిళకు హైబీపీ, డయాబెటిస్ లేదా గుండెజబ్బులు ఉండటం... ఒకవేళ ఆమె 35 ఏళ్లు దాటాక లేట్గా గర్భవతి కావడం... ఇలాంటి సందర్భాల్లో ఆమె గర్భధారణ అన్నది ప్రసవం వరకూ చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన సందర్భం అవుతుంది. ఇటీవల దాదాపు ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతుండటంతో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతుండటంతో) రిస్క్ అనేది చాలావరకు తగ్గినప్పటికీ... కొన్ని గర్భధారణల్లో ఏ సందర్భంలో ఎటుపోయి ఎటువస్తుందో చెప్పలేని పరిస్థితీ, ఎలాంటి ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయో తెలియని అనిశ్చితి ఉండనే ఉంటుంది. ఇలాంటివాటినే హై రిస్క్ ప్రెగ్నెన్సీలుగా చెప్పవచ్చు. ఏయే సందర్భాలను ‘హై రిస్క్ ప్రెగ్నెన్సీలు’గా పరిగణిస్తారో, ఆ సందర్భాల్లో చేయించాల్సిన వైద్యపరీక్షలు, స్కాన్లతో సాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.ఇటీవల వైద్యవిజ్ఞానశాస్త్రాల్లో చాలా అభివృద్ధి చోటుచేసుకుంది. ఇంత పురోభివృద్ధి తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం గర్భం ఎంత మేర నిలుస్తుందో చెప్పలేని సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి. అది తల్లీ బిడ్డా ఇద్దరికీ కాస్తంత ప్రమాదకరంగా మారే అవకాశాలూ పొంచి ఉంటాయి. అలా తల్లికి గానీ లేదా కడుపులోని బిడ్డకుగానీ... ఒక్కోసారి ఈ ఇద్దరికీ సురక్షితమని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎన్నో రకాల కాంప్లికేషన్లు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి గర్భధారణను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు.ఎవరెవరిలో హైరిస్క్ ముప్పు ఉంటుందంటే... ప్రధానంగా ఈ కింద పేర్కొన్న మహిళలు ‘హై–రిస్క్ ప్రెగ్నెన్సీ’ కిందికి వస్తారని చెప్పవచ్చుదాదాపు 35 ఏళ్లు దాటాక (35 – 40 ఏళ్ల మధ్య వయసులో) గర్భవతులైనవారు.ఇప్పుడు గర్భవతిగా ఉన్న ఆ మహిళకు గతంలో వరసగా అబార్షన్లు కావడం లేదా పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడం వంటి వైద్యచరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. మహిళలకు తాము గర్భందాల్చక ముందే అధిక రక్త΄ోటు(హైబీపీ), మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, ధైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, మూర్ఛ (ఎపిలెప్సీ) వంటి ఆరోగ్య సవస్యలు ఉన్నవారు. ముందుగా డయాబెటిస్ లేనప్పటికీ గర్భధారణ తర్వాత మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), హైబీపీ కనిపించిన మహిళలు.గర్భధారణకు సంబంధించిన సమస్యలు... అంటే... గర్భంలో కవలలు లేదా ట్రిప్లెట్స్ ఉండటం, స్కాన్ చేసినప్పుడు బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలుగానీ లేదా లోపాలుగానీ ఉన్నట్లు తెలిసిన సందర్భాల్లో, కడుపులో బిడ్డకు ఎదుగుదల సమస్యలు ఉండటం, బిడ్డలో జన్యుపరమైన లోపాలుండటం... వంటి సందర్భాల్లో. సాధారణ మహిళలతో పోలిస్తే... ఈ తరహా వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీలు) ఉన్నవాళ్లను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’ కేటగిరీలోకి వస్తారని చెప్పవచ్చు.హై రిస్క్ ప్రెగ్నెన్సీ...తెలుసుకోవడం ఇలా...ఒక మహిళ హైరిస్క్ గ్రూప్ కిందికి వచ్చే వస్తుందా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి ఈ కింద పేర్కొన్న అంశాలు సహాయపడతాయి. వీటి సహాయంతో ఒక మహిళ తాను హైరిస్క్ ప్రెగ్నెన్సీ జాబితాలోకి వస్తుందా రాదా అన్నది తనకు తానే తెలుసుకోవచ్చు. గర్భధారణ నాటికి 35 ఏళ్ల వయసు మించి ఉండటం. దీనివల్ల సాధారణ మహిళలతో ΄ోలిస్తే... ఇలా లేట్గా గర్భధారణ జరగడంతో పుట్టే పిల్లల్లో క్రోమోజోమ్స్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కేవలం బాగా ఆలస్యంగా జరిగిన గర్భధారణలోనే కాకుండా... ఒకవేళ ఓ అమ్మాయి 18 ఏళ్ల లోపు చిన్నవయసు బాలిక కావడం, చిన్న వయసులోనే ఆమెకు గర్భధారణ జరిగినప్పుడు కూడా పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపించే అవకాశాలుండటంతో దీన్నీ హైరిస్క్గానే పరిగణించాలి. ఒకవేళ గర్భంలో ఒకరికంటే మించి (అంటే... కవలలు లేదా ట్రిప్లెట్స్) ఉండటం వల్ల హైబీపీ రావడం లేదా నెలలు నిండకముందే ప్రసవం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. గర్భంలోని బిడ్డకు ఎదుగుదల లోపాలు ఉన్నప్పుడు. గర్భధారణ జరిగిన మహిళలకు హైబీపీ, చక్కెరవ్యాధి (డయాబెటిస్), గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ సమస్యలు, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు. ఇప్పటికే ఓసారి ఒక మహిళకు జన్యుపరమైన సమస్యలున్న బిడ్డ ఉండటం లేదా... ఆ బిడ్డకు గుండెజబ్బుగానీ, లోపంతో కూడిన ఎముకల కారణంగా బిడ్డకు వైకల్యం రావడం వంటి ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. మహిళకు గర్భధారణ వ్యవస్థలో పెద్ద గడ్డలు (ఫైబ్రాయిడ్స్) వంటివి వచ్చిన వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. గతంలో తరచూ అబార్షన్లు కావడం, మునుపు పిండం గర్భసంచిలో కాక... బయట ట్యూబుల్లోనే పెరగడం, గతంలో నెలలు పూర్తిగా నిండకముందే ప్రసవం జరగడం (ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ బర్త్), గతంలో బిడ్డ లోపలే చనిపోవడం వంటి మెడికల్ హిస్టరీ ఉంటే... హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల అవి బిడ్డకు సోకే అవకాశాలున్నప్పుడు. పిల్లలు కలగడానికి చాలాకాలం చికిత్స తీసుకున్న తర్వాత గర్భం రావడం... ఇక్కడ పేర్కొన్న సందర్భాల్లో ఒక మహిళ గర్భందాల్చితే దాన్ని ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు. ఇలాంటి మహిళలకు గర్భధారణ సమయంలోనూ లేదా ప్రసవం సమయంలోనూ అనేక రకాల కాంప్లికేషన్లు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఈ కాంప్లికేషన్లను రెండు రకాలుగా నివారించవచ్చు. మొదటిది మహిళ తానంతట తానే కొన్ని జాగ్రత్తలూ, సూచనలు పాటించి కాంప్లికేషన్లను నివారించుకోవడం, రెండోది వైద్యనిపుణుల సహాయంతో కాంప్లికేషన్లు నివారించుకోవడం. మహిళలు తమకు తాముగా ప్రెగ్నెన్సీ రిస్క్ల తాలూకు కాంప్లికేషన్ల నివారించుకోవడమిలా...హైరిస్క్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే ఒకసారి ‘ప్రీ– కన్సెప్షనల్ కౌన్సెలింగ్’ కోసం డాక్టర్ను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు... దాదాపు మూడు నెలల ముందునుంచే కనీసం రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం... (ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రను గర్భం దాల్చాక కూడా పూర్తి గర్భధారణ టైమ్ మొత్తం వాడాలి. గర్భం ధరించిన సమయంలో వీలైనంతవరకు ఎలాంటి మందులూ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే... ప్రతి మందునూ తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు వాళ్లకు తెలిసి మాత్రమే తీసుకోవాలి. కొందరు మహిళలకు మూర్ఛ (ఎపిలెప్సీ), హైబీపీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే... గర్భం వచ్చినట్లు తెలియగానే కొందరు మహిళలు తాము వాడే మందుల్ని తమంతట తామే ఆపేస్తారు. అది తల్లీ, బిడ్డా ఇద్దరికీ ప్రమాదకరం. కాబట్టి తామేవైనా మందులు వాడాలన్నా లేదా అంతకుముందునుంచి వాడుతున్న మందులు ఆపేయాలన్నీ డాక్టర్ను సంప్రదించాకే ఆ పని చేయాలి. ఎందుకంటే హైబీపీ, మూర్చ (ఎపిలెప్సీ) వంటి వ్యాధులున్న మహిళలకు డాక్టర్లు వారి గర్భధారణ తసమయంలో వాడుతున్న మందులను గానీ లేదా వాటి మోతాదులనుగానీ మారుస్తారు. గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా డాక్టర్తో నిత్యం డాక్టర్లు సూచించిన పరీక్షలు చేయిస్తూ ఉండాలి. కనీసం నెలలో ఒకసారైనా లేదా పరిస్థితి తీవ్రతను బట్టి డాక్టర్లు సూచించిన వ్యవధిలో డాక్టర్ను కలిసి అవసరమైన పరీక్షలు చేయిస్తుండాలి. ఏడో నెల దాటాక ఈ పరీక్షలు మరింత తరచుగా చేయించాల్సి రావచ్చు. సరైన టైముల్లో సరైన టీకాలు (ప్రాపర్ ఇమ్యూనైజేషన్) తీసుకోవాలి. మహిళలు తమ ఎత్తుకు తగినట్లుగా తమ ఆరోగ్య నిర్వహణకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం, ఇందుకు సరైన ఆహార నియమాలు పాటించడం, అవసరమైన శారీరక వ్యాయామాలను చేయడం అవసరం. ఈ వ్యాయామాలు మరింత శ్రమ కలిగించేలా ఉండకూడదు. కొన్నిరకాల హైరిస్క్ ప్రెగ్నెన్సీల్లో డాక్టర్ బెడ్రెస్ట్ తీసుకోమని అంటే... దాన్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే బెడ్రెస్ట్ అంటే పూర్తిగా మంచానికే పరిమితం కావడం కాదు. డాక్టర్ సలహా మేరకు కాబోయే తల్లి ఏమేరకు శారీరక శ్రమ చేయాలో... అలాగే ఏ మేరకు విశ్రాంతి తీసుకోవాలో చెబుతారు. దాన్ని అక్షరాలా పాటించాలి.వైద్యనిపుణులూ, సిబ్బంది సహాయంతో కాంప్లికేషన్ల నివారణ ఇలా... హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల ప్రసవ సమయంలో కలిగే దుష్పరిణామాలు, ప్రమాదకర పరిస్థితుల (కాంప్లికేషన్స్)ను నివారించడమన్నది ఈ రోజుల్లో చాలావరకు సాధ్యమే. ఇలాంటి రిస్క్లు ఉన్న మహిళలు... ఫిజీషియన్, ఎండోక్రినాలజిస్ట్, గుండెజబ్బుల నిపుణుడు, రుమటాలజిస్ట్, నరాల నిపుణుడు అందుబాటులో ఉండే హయ్యర్ మెడికల్ సెంటర్లలో తమ ప్రసవం జరిగేలా చూసుకోవడం మంచిది. ఫలితంగా ఆ మహిళకు అవసరం ఉన్న వైద్య చికిత్సలను బట్టి ఆ ప్రసవాన్నీ ఎలా ΄్లాన్ చేయాలో అన్నది వైద్యనిపుణులు చర్చించుకుని ఆ మేరకు సురక్షిత ప్రసవం జరగడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోడానికి, వాటిని అమలు చేయడానికి వీలవుతుంది. గర్భిణుల్లో రొటీన్ రక్తపరీక్షలకు తోడుగా... ఆమెకు తన రెండో నెలలోనే రక్తంలో చక్కెర మోతాదులను నిర్ధారణ చేసే పరీక్ష, థైరాయిడ్ పరీక్ష వంటివి నిర్వహిస్తే... పుట్టబోయే బిడ్డ, కాబోయే తల్లి తాలూకు ఆరోగ్య పరిస్థితిని ముందునుంచే తెలుసుకుంటూ ముందస్తు చికిత్స చేయడం... తద్వారా తర్వాతి కాంప్లికేషన్లను నిరోధించడమన్నది చాలావరకు సాధ్యమవుతుంది. ఇక మూత్రపిండాల (కిడ్నీ) సమస్య ఉన్న మహిళలు, హైబీపీ ఉన్నవాళ్లు, థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు, తరచూ అబార్షన్లు అయినవారు గర్భధారణకు ముందే కొన్ని రక్త పరీక్షలు చేయించడం అవసరం, ప్రెగ్నెన్సీ సమయంలో 7–8 వారాలప్పుడే కొన్ని ఇంజెక్షన్లు వాడటం ద్వారా మున్ముందు చోటుచేసుకోబోయే చాలా రకాల ప్రమాదాలను (కాంప్లికేషన్లను) నివారించవచ్చు. స్కాన్ల సహాయంతో... అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయంతో ముందుగానే గర్భంలోపల ఉన్న పరిస్థితిని తెలుసుకుని తగిన చికిత్స చేయడంతో టు... లోపాలు సరిదిద్దడానికీ ఆ స్కాన్లు ఉపయోగపడతాయి. బిడ్డలోని వైకల్యాలను, అసా«ధారణ పరిస్థితులనూ, లో΄ాలను తెలుసుకునేందుకు స్కాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.అల్ట్రాసౌండ్ స్కాన్తో 11–14 వారాల సమయంతో గర్భధారణ నిర్దిష్టంగా ఎప్పుడు జరిగింది, గర్భంలోపల ఉన్న బిడ్డ ఒకరా, కవలలా, ఒకవేళ కవలలైతే ఒక వాళ్లు ఒకే అండం నుంచా లేక రెండు వేర్వేరు అండాల నుంచా అన్నది తెలుస్తుంది. న్యూకల్ ట్రాన్సు్యలెన్సీ స్కాన్ వల్ల చిన్నారిలో క్రోమోజోమ్కు సంబంధించిన లోపాలు ఏవైనా ఉంటే అవి పిండ దశలోనే తెలిసి΄ోతాయి. బిడ్డ స్వరూపం (స్ట్రక్చర్) ఎలా ఉందో కూడా కొంతవరకు తెలుస్తుంది. ఇది ఒక రకమైన స్క్రీనింగ్ పరీక్ష. ఇక 20–22 వారాలప్పుడు చేసే రొటీన్ స్కాన్ వల్ల చిన్నారి పూర్తి స్వరూపం (స్ట్రక్చర్) తెలుస్తుంది. అన్ని అవయవాలూ సక్రమంగా రూ΄÷ందాయో లేదో కూడా తెలిసిపోతుంది. క్రమం తప్పకుండా చేయించే స్కాన్ల వల్ల బిడ్డ మెదడు వంటి అత్యంత ప్రధాన అవయవాల్లో రక్తప్రసరణ వంటి కీలక అంశాలు తెలుస్తాయి. ఫలితంగా పిండదశలోనే ఏవైనా లో΄ాలు ఉంటే వాటిని చక్కదిద్దే అవకాశాలుంటాయి. ఇలాంటి పలు రకాల స్కాన్ల కాంబినేషన్లతో ఒక ప్రెగ్నెన్సీలో రిస్క్ మోతాదు ఎంత అన్నది నిర్థారణ చేస్తారు. దాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీది హైరిస్కా, తక్కువ రిస్కా, లేదా రిస్కేమీ లేదా అన్నది దాదాపు 90 శాతం వరకు చెప్పగలుగుతారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ చికిత్సలూ అందుబాటులో... గర్భధారణ సమయంలో ఎదురయ్యే రిస్క్లకు ఇప్పుడు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో నియోనేటల్ చికిత్స ప్రక్రియలు చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల ఇలాంటి బేబీస్కు ఇప్పుడు అన్ని రకాల చికిత్సలు అందిస్తూ వాళ్లు మామూలుగానే మనుగడ సాధించేలా చేయవచ్చు. గతంలో వాళ్లకు న్యూరలాజికల్ సమస్యలు వస్తాయనే భావన ఉండేది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో అలాంటి సమస్యలనూ చాలావరకు అధిగమించవచ్చు. అలాంటి పిల్లల్లో కొన్ని అవయవాలు అంటే ఉదాహరణకు ఊపిరితిత్తులు అభివృద్ధి కావు. అప్పుడు కొన్ని ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తులను పూర్తిగా అభివృద్ధి చెందేలా చేయవచ్చు. అయితే ఇలాంటి చికిత్సలు– అన్ని అధునాతన సదు΄ాయాలు ఉన్న చికిత్స కేంద్రాల్లో ఉంచి తగిన పరిచర్యలు చేయడం ద్వారా బిడ్డనూ, తల్లినీ సంరక్షించవచ్చు. అలాగే బిడ్డ మానసిక ఎదుగుదలకు, తెలివితేటలకూ థైరాయిడ్ హార్మోన్లు అవసరం. అలాంటప్పుడు తల్లిలో థైరాయిడ్ లోపాలుంటే వాటిని సరైన సమయంలో పసిగట్టి చికిత్స అందించడం ద్వారా మంచి మానసిక ఆరోగ్యం, తెలివితేటలు ఉండే బిడ్డను కనేలా చేయవచ్చు. కాబోయే తల్లికి బీపీ, షుగర్ వంటివి ఉన్నట్లయితే వాటిని సమర్థంగా నియంత్రణలో పెట్టి తల్లినీ, బిడ్డనూ సంరక్షించవచ్చు. అందుకే... హైరిస్క్ ప్రెగ్నెన్సీలలో తల్లినీ, బిడ్డనూ సురక్షితంగా ఉంచాలంటే... ముందునుంచే మంచి వైద్యపర్యవేక్షణతో పాటు... కాబోయే తల్లికీ కొంత ప్రాథమిక పరిజ్ఞానం, కొన్ని అంశాలపై అవగాహన, పరిజ్ఞానం ఉండటం అవసరం. అలాంటివి వైద్య నిపుణులు తమ కౌన్సెలింగ్ సమయంలో చెబుతూ ఆమెకూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. డాక్టర్ శ్రుతి రెడ్డి పొద్దుటూరు కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్ (చదవండి: Farah Khan: వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..) -
ఆ లక్షణాలు గుండెపోటుకి సంకేతమా..? యాంజియోప్లాస్టీ ఎందుకు?
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రికి అస్వస్థతగా ఉండటంతో ఉన్నపళంగా పెళ్లిని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైద్యులు ఆమె తండ్రి శ్రీనివాస్ మంధానాకు గుండెపోటుని పోలిన లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఎడమ వైపు ఛాతీ నొప్పి, రక్త పోటుపెరగడం వంటివి గుండెపోటుకి సంకేతమని, తక్షణమే యాంజియోగ్రఫీ అవసరమని వైద్యులు భావిస్తున్నారు. అసలు ఇలా ఆకస్మికంగా ఈ లక్షణాలు ఎలా వస్తాయి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, యాంజియోగ్రఫీ అంటే..వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు ఎడమవైపు ఛాతినొప్పి వచ్చిన తర్వాత ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గుండెపోటు లక్షణాలు కనిపించాయి. వెంటనే కుటుంబసభ్యులు సాంగ్లిలోని సరవిత్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ శ్రీనివాస్కి కార్డియాక్ ఎంజైమ్లు కొద్దిగా పెరిగినప్పటికీ పూర్తి వైద్య బృందం పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు వైద్యులు. ఆయనకు రక్తపోటు పెరుగుతోందని, అందువల్ల నిరంతన ఈసీజీ పర్యవేక్షణ తోపాటు యాంజియోగ్రపీ కూడా అవసరం అవ్వొచ్చని చెప్పారు. ఇది శారీరక లేదా మానసిక ఒత్తిడి వల్ల కావొచ్చని అన్నారు. అందులోనే వివాహం అనగానే ఒకవిధమైన ఆందోళన సహజంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఓ కారణం కావోచ్చని అన్నారు.అధిక రక్తపోటు అంటే..ధమని గోడలపై రక్తం నెట్టడం వల్ల కలిగే శక్తి స్థిరంగా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. దీనిని 130/80 mm Hg లేదా అంతకంటే ఎక్కువ స్థిరంగా చూపించడంగా పేర్కొనవచ్చు. ఈ పరిస్థితి వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసేందుకు కష్టపడాల్సి వస్తుంటుంది. తగిన సమయంలో చికిత్స అందించకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా అధిక రక్తపోటుకు ఎలాంటి లక్షణాలు ఉండవట. అందువల్లే చాలామంది వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఏళ్ల తరబడి దాంతో గడిపేస్తుంటారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. 46 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలకు తమకు అధిక రక్తపోటు ఉందని కూడా తెలియదని చెబుతున్నారు నిపుణులు. బీపీ ఎక్కువగా ఉంటే ఈ లక్షణాలు తప్పనిసరి..మానసిక పనితీరులో మార్పులుఛాతీ నొప్పిమైకముశరీరంలో ఎడెమా లేదా వాపుగుండె దడసాధారణం కంటే తక్కువ మూత్ర విసర్జనమూర్ఛలుతీవ్రమైన తలనొప్పిఆకస్మికంగా ముఖం వంగిపోవడం, అస్పష్టమైన ప్రసంగం లేదా చేయి లేదా కాలులో స్ట్రోక్ సంకేతాలుకంటి నొప్పి, దృష్టి కోల్పోవడం లేదా ఆకస్మిక అస్పష్టమైన దృష్టి లోపంకారణాలు..అందరికీ అధిక రక్తపోటుకు ఇందువల్లే రాగలదని ఒకే కారణాన్ని చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. దీనికి అనేక రకాల అంశాలు కారణమవుతాయని, వాటివల్లే ఈ పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. వాటిలో కొన్ని:55 ఏళ్లు పైబడిన వారుకుటుంబంలో చరిత్రలో ఎవరికైన ఈ పరిస్థితి ఉంటేధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడంఅధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటంసోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినడంతగినంత శారీరక శ్రమ లేకపోవడం.అధికంగా మద్యం సేవించడంచాలా సందర్భాలలో అధిక రక్తపోటుకు ఎందువల్ల వచ్చిందనేది గుర్తించగలరట. ఇందులో అంతర్లీన పరిస్థితి, మందులు లేదా పదార్ధం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, మూత్రపిండ ధమని స్టెనోసిస్, ప్రాథమిక ఆల్డోస్టెరోనిజం, థైరాయిడ్ వ్యాధి వంటి వాటి వల్ల కూడా కావొచ్చట.యాంజియోప్లాస్టీ ఎందుకు చేస్తారు?ఇరుకైన లేదా మూసుకుపోయిన ధమనిలో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి వైద్యులు యాంజియోప్లాస్టీ చేస్తారు. ముఖ్యంగా గుండెపోటు సమయంలో లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధి (కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ధమనులు ఇరుకుగా మారడం) వల్ల వచ్చే తీవ్రమైన ఛాతీ నొప్పి (ఆంజినా) వంటి పరిస్థితులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ధమనిని తెరిచి, గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తారు. దీన్ని మెడ, కాళ్ళు లేదా మూత్రపిండాలు వంటి శరీరంలోని ఇతర భాగాలలోని ధమనులపై కూడా ఆయా ప్రాంతాలలో అడ్డంకులను చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. అంతేగాదు హృదయ ధమనిలో అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చు. కాబట్టి, ధమనిని త్వరగా తెరవడానికి, రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి, గుండె కండరాలకు నష్టం జరగకుండా నిరోధించడానికి యాంజియోప్లాస్టీని అత్యవసర ప్రక్రియగా చేస్తారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Farah Khan: వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..) -
Delhi: మోగిన ప్రమాద ఘంటికలు..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈరోజు (సోమవారం) ఉదయం గాలి నాణ్యత (ఏక్యూఐ)కనిష్ట స్థాయికి క్షీణించింది. రాజధాని నగరమే కాకుండా దాని పొరుగు ప్రాంతాలు కూడా తీవ్రమైన కాలుష్య వర్గం అంచునకు చేరాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీలో సగటు ఏక్యూఐ 397 వద్ద ఉంది. ఇది తీవ్ర వర్గానికి చేరుకునేందుకు కొద్ది దూరంలోనే ఉంది. ఢిల్లీ మహానగరంలోని 39 పర్యవేక్షణ కేంద్రాలలో 20 కేంద్రాలు ఇప్పటికే తీవ్రమైన కాలుష్యాన్ని నమోదు చేశాయి. రోహిణి (458), జహంగీర్పురి (455), ఆనంద్ విహార్ (442) తదితర ప్రాంతాలు వాయు కాలుష్యానికి హాట్స్పాట్లుగా నిలిచాయి.ఢిల్లీలోని అత్యధిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న దృష్ట్యా.. ప్రజారోగ్యం ప్రమాదంలో పడినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది.ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నోయిడా ఏక్యూఐ 413కు చేరి, తీవ్రమైన (Severe) వర్గంలోకి చేరింది. ఘజియాబాద్లో 432 ఏక్యూఐ నమోదై అత్యంత విషపూరితమైన గాలి తాండవిస్తోంది. ఈ ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలు ఆదివారం నాటి నివేదికలతో పోలిస్తే మరింత క్షీణించించాయనే విషయం స్పష్టమవుతోంది. గ్రేటర్ నోయిదాలో 399 ఏక్యూఐ నమోదయ్యింది. ఇది తీవ్ర కాలుష్య స్థాయిని సూచిస్తోంది.కాగా గురుగ్రామ్ (291), ఫరీదాబాద్ (239)లలో కాలి నాణ్యత పేలవమైన (Poor) కేటగిరీలో ఉంటూ, తమ పొరుగున ఉన్న ప్రాంతాల కంటే కొంత మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య పలువురు నిరసనకారులు ఇండియా గేట్ వద్ద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే వారిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు పోలీసులు వారిపై చిల్లీ స్ప్రేను ఉపయోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిరసనను నిర్వహించిన ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్.. ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర విమర్శలు గుప్పించింది.గాలి నాణ్యత స్థిరంగా తీవ్రమైన వర్గంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం కాలుష్యానికి కారణాలను పరిష్కరించడంలో విఫలమైందని వారు ఆరోపించారు. నీటి స్ప్రింక్లర్లు, క్లౌడ్ సీడింగ్ లాంటి దీర్ఘకాలిక, పరిష్కారం లేని విధానాలను అమలు చేస్తోందని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు.ఇది కూడా చదవండి: చలి చంపేస్తోంది.. అక్కడ ‘0’ డిగ్రీలు -
సెలబ్రిటీల ఫిట్నెస్ సీక్రెట్..ఇలా చేస్తే..!
ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే రకరకాల కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఫిట్ నెస్, ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నారు. కొంతమంది సినిమా సెలబ్రిటీలు మాత్రం తమ ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. వారెవరో, వారి ఆరోగ్య రహస్యాలేమిటో తెలుసుకుందాం. దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి వంటి సినీ తారలు తమ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సెలబ్రిటీలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోడానికి, ఆరోగ్యాన్ని కా΄ాడుకోడానికి అసలు ఏం తింటారు, ఏం చేస్తారో తెలుసుకుందాం. శిల్పాశెట్టి.. ఒకప్పుడు భారత సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి శిల్పాశెట్టి. ఈ మంగుళూరు భామ తరచు తన ఫిట్ నెస్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. శిల్పా శెట్టి ఆహారపు అలవాట్లు, వ్యాయామ నియమాలు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నాయి. దాదాపుగా ఐదుపదుల వయస్సులో కూడా శిల్పాశెట్టి ఫిట్ గా ఉండటానికి ఆమె ఆహారపుటలవాట్లే కారణం. ఉదయాన్నే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగే శిల్పాశెట్టి.. బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్, పోహా, పప్పు చీలా వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది. లంచ్లో బ్రౌన్ రైస్, కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు వంటివి తీసుకుంటుంది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటానంటుంది శిల్పాశెట్టి.శిల్పాశెట్టి ఆరోగ్య యోగం: రెగ్యులర్గా యోగా చేయడంతోపాటు వెయిట్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు కూడా చేస్తూ చురుగ్గా ఉండటమే ఆమె ఆరోగ్య రహస్యం. అక్షయ్ కుమార్.. ఆరుపదల వయస్సుకు చేరువ అవుతున్నా కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ బాలీవుడ్ హీరోని మించినవాళ్లు లేరంటే అతిశయోక్తి లేదు. క్రమశిక్షణకు మారుపేరైన అక్షయ్ కుమార్వ్యాయామం, యోగా, కార్డియోలకు ప్రాధాన్యతనిస్తారు. ఇవి ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్గా, టోన్గా ఉంచుతాయి. ఆహారం విషయానికొస్తే అక్షయ్ కుమార్.. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను, శక్తిని అందించేలా ఉదయాన్నే పాలు, పరాటాలు తీసుకుంటారు. దీపికా పదుకోన్.. భారత సినీ పరిశ్రమలోనే కాకుండా విదేశాల్లో కూగా తన నటనతో అద్భుతమైన ప్రశంసలు,ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన దీపికా పదుకొణె ఫిట్ నెస్ విషయంలో అసలేమాత్రం రాజీపడదు. త్వరలోనే నాలుగవ పదిలోకి అడుగు పెట్టనున్న దీపికా పదుకోన్ ఫిట్ నెస్, అందం వెనుక ఆరోగ్యకరమైన ఆహారమే అసలు రహస్యం.దీపికా పదుకొణె ఉదయం ఆహారంలో గ్రీన్ టీ, ఓట్ మీల్ తీసుకుంటుంది. దీపికాకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడే దీపికా బ్రేక్ ఫాస్ట్ లోకి దక్షిణ భారతీయ వంటకాలైన ఇడ్లీ, దోసెలను తీసుకుంటుంటుంది. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తుంది. రణ్వీర్ సింగ్.. తన డిఫరెంట్ లుక్స్, స్టైల్, స్మైల్తో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్.. తన రోజును వ్యాయామం, కార్డియోతో ప్రారంభిస్తాడు, ఇది అతని శరీరాన్ని ఎల్లప్పుడూ చురుగ్గా, ఫిట్గా ఉంచడంలో తోడ్పడతాయి. ఉదయాన్నే ఎనర్జీ డ్రింక్స్ తాగుతాడు. ఆ తర్వాత అల్ఫాహారంలోకి ఓట్స్, డ్రై ఫ్రూట్స్, స్మూతీలు తీసుకుంటానంటున్నాడు. నిజానికి వీరు అనుసరించేవన్నీ చాలా చిన్న చిన్న ఆరోగ్య నియమాలే. అయితే వాటినే మనం ఫాలో కాము అసలు. ఇక్కడే వచ్చింది అసలు తేడా. -
పార్కిన్సన్ రోగులకు హెల్ప్ అయ్యే 'ఆన్క్యూ'
వయస్సు, అనుభవం ఆవిష్కరణకు అడ్డు కాదని నిరూపించింది ఇరవై రెండు సంవత్సరాల అలెశాండ్రా గలీ. పా΄ర్కిన్సన్ వ్యాధిగ్రస్తులపై ఆమె సానుభూతి కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ఉపకరించే ఆవిష్కరణ ఇది. నెదర్లాండ్స్లోని డెలప్స్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న రోజుల్లో అలెశాండ్రా గలీ, పార్కిన్సన్ రోగులు ఎదుర్కొంటున్న రోజువారి ఇబ్బందులను చూసి చలించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పార్కిన్సన్ రోగులు ఉన్నారు, వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి అధ్యయనం చేసింది. కీబోర్డ్ను ఉపయోగించడంలో వారు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలని గట్టిగా అనుకుంది. ఆధునిక గేమింగ్ బోర్డ్ల నుంచి ప్రేరణ పొంది ‘ఆన్క్యూ’ అనే కీబోర్డ్ను రూదిపొందించింది. పార్కిన్సన్ రోగులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టైప్ చేయడానికి ‘ఆన్క్యూ’ కీబోర్డ్ ఉపయోగపడుతుంది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా వైబ్రేషన్, లైట్ సిగ్నల్స్ తీవ్రతను సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ ఆవిష్కరణకు జేమ్స్ డైసన్ అవార్డు అందుకుంది అలెశాండ్రా. ‘ఆన్క్యూ అనేది ఆవిష్కరణ మాత్రమే కాదు. ఇందులో తత్వం కూడా ఉంది. సాంకేతికతను సామాజిక సేవకు ఉపయోగించాలనేది ఆ తత్వం’ అంటుంది అలెశాండ్రా. (చదవండి: దటీజ్ ఫాతిమా బాష్..! వివాదాలు, హేళనలే ఆమె బలం..) -
పెద్దల్లోనూ యువతలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులు
తెలంగాణలో దీర్ఘకాలిక రుగ్మతలు (NCDs) రెండు వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయోవృద్ధుల్లోనే కాకుండా, ఇప్పుడిప్పుడే యువతలోనూ ఇవే వ్యాధులు వేగంగా పెరుగుతున్నట్టుగా తాజా అధ్యయనాలు చూపిస్తున్నాయని డా. జీషాన్ అలీ తెలిపారు.హైదరాబాద్లో తాజా సర్వే వివరాల ప్రకారం:60 ఏళ్లు దాటినవారిలో దాదాపు సగం మంది రక్తపోటుతో బాధపడుతున్నారునలుగురిలో ఒకరికి డయాబెటిస్తో బాధపడుతున్నారు సుమారు 44% శాతం మందికి ఊబకాయం సమస్యఇలా డయాబెటిస్, బీపీతో 30 నుంచి 40 ఏళ్ల పాటు జీవించడం ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. పెద్దవారు సులభంగా తట్టుకునే కొన్ని మందులు, చిన్న వయసు నుంచే ప్రారంభిస్తే.. పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.యువతలో పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలుగతంలో 50 నుంచి 60 ఏళ్ల తర్వాత కనిపించే జీవనశైలి వ్యాధులు డయాబెటిస్, హైపర్టెన్షన్, హార్ట్ సమస్యలు ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్లకే నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు తెలిపారు. చిన్న వయసులోనే ఈ రుగ్మతలతో 30–40 ఏళ్లు జీవించడం భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంహైదరాబాద్ ప్రజల ఆహారపు అలవాట్లలో అధిక కొవ్వు, తక్కువ ఫైబర్ ఉండటం, పైగా రోజురోజుకూ పెరుగుతున్న కూర్చునే జీవనశైలి ఇవే యువతలోనే దీర్ఘకాలిక రుగ్మతలు వేగంగా పెరగడానికి కారణం అఅని అమెరికాలోని Physicians Committee for Responsible Medicine (PCRM)కు చెందిన పోషకాహార నిపుణుడు డా. జీషాన్ అలీ తెలిపారు.ఇటీవల ఎం. ఎన్. ఆర్. మెడికల్ కాలేజీలో జరిగిన హెల్త్ సైన్స్ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులతో డాక్టర్ జీషాన్ అలీ మాట్లాడుతూ.. తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లపై ఆధారపడిన ప్లాంట్-బేస్డ్ ఆహారం భుజించడం, జీవనశైలిలో మార్పులు తదితరాలు మెటాబాలిక్ రిస్క్లను గణనీయంగా తగ్గించగలదని పేర్కొన్నారు. అంతేగాదు ఇటీవల 48 మంది హృదయ రోగులపై నిర్వహించిన ఐదేళ్ల అధ్యయన వివరాలను కూడా వెల్లడించారు.తక్కువ కొవ్వు ఉన్న శాకాహారాన్ని పాటిస్తూ, తేలికపాటి కార్డియో వ్యాయామం చేసిన వారిలో రక్తనాళాల ఇరుకుదనం స్పష్టంగా తగ్గిందని చెప్పారు. మొదటి ఏడాదిలో 1.75 శాతం మెరుగుదల కనిపించగా, ఐదేళ్లకు ఇది 3.1 శాతానికి చేరిందన్నారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకుండా కేవలం సాధారణ వైద్య చికిత్స మాత్రమే తీసుకున్న రోగుల్లో వ్యాధి మరింతగా పెరిగినట్టు అధ్యయనం వెల్లడించిందని తెలిపారు.(చదవండి: కొత్తిమీర పంటతో జస్ట్ 30 రోజుల్లోనే రూ.లక్ష లాభం!.. శెభాష్) -
కెరీర్, వివాహం రెండు వేర్వేరు కాదు..! మరోసారి ఉపాసన పోస్ట్ దుమారం..
రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెనుదూమరం రేపుతున్నాయి. రోజురోజుకి ఆ వ్యాఖ్యలపై చర్చ తారస్థాయికి చేరిపోతోంది. సర్వత్రా తీవ్రస్థాయిలో ఆమె మాటల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె మహిళలు కూడా తమ కెరీర్లో దూసుకుపోవాలి, అదే ప్రగతి శీల అన్న కోణంలో చేసిన వ్యాఖ్యలు..నిపుణులు, వైద్యులను కలవరపరిచాయి. ఆమె యువతకు ఇచ్చిన సందేశం..అవాస్తవం, హానికరం అంటూ ఫైర్ అవుతున్నారు. మొన్న దీనిపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ..యుంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చిన సందేశం చూశాం. అది మరువక మునుపే తాజాగా వైద్య నిపుణులు, ఐఐటీ-ఐఐఎం గ్రాడ్యుయేట్లు సైతం ఉపాసన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇంతకీ నిపుణులు, గ్రాడ్యుయేట్లు ఏం అంటున్నారంటే..ఢిల్లీ ఎయిమ్స్ వైద్యురాలు దత్తా వివాహం ఆశయానికి అడ్డంకి కాదని నొక్కి చెప్పారు. అన్ని విధాల మద్దతు ఇచ్చే భాగస్వామి ఉంటే..కెరీర్, పిల్లలు రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చని, అదేమంతా కష్టం కాదని అన్నారామె. ఉపాసన వ్యాఖ్యలు యువతను పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని ఫైర్ అయ్యారు. యుక్త వయసుని వృధా చేసుకునే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అంతేగాదు తగిన వయసులో పెళ్లి చేసుకుంటే..పేరెంట్స్గా మారేందుకు, అలాగే తాతమామలకు కూడా సంతోషాన్ని అందిస్తుందని అన్నారు. తమ మనవళ్లు లేదా మనవడితో స్పెండ్ చేసే సమయం వారికి దొరుకుతుందని అన్నారు. అంతేగాదు ఉపాసన చిన్న వయసులో పెళ్లిచేసుకుందని, తర్వాత కెరీర్ని నిర్మించుకుందని అన్నారు. అందువల్ల ఆమె చెప్పిన సందేశం..సగటు యువతికి అత్యంత భినమైనదని అన్నారు. అయిన ధనవంతుల ఆలోచనలను ఎవ్వరూ గుడ్డిగా నమ్మోద్దని అన్నారు. అసలు మహిళలను సంపాదనకు ప్రాధాన్యత ఇవ్వమని, వివాహం, మాృతత్వం వంటి వాటిని వాయిదా వేయమని సూచించకూడదు. కెరీర్లో బాగా సెటిల్ అవ్వడం..అంటే ఓపక్క వయసు దాటిపోయాక పిల్లలు కనాలనుకోడం కాదని, అలా చేస్తే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. అలాగే ఎగ్స్ను ఫ్రీజ్ చేసుకున్నంత మాత్రన కచ్చితంగా బిడ్డలు పుట్టేస్తారన్న గ్యారంటీ లేదని చాలా మంది వైద్యలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాదు ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లు, పలువురు వైద్యులు ఉపాసన వ్యాఖ్యలు తప్పుడు సందేశాన్ని ఇస్తున్నాయని, ఇవి యువతకు ప్రమాదకరం అంటూ మండిపడ్డారు. మరికొందరు నిపుణులు నిజానికి వివాహం, కెరీర్ రెండిటిని డిఫరెంట్ ఛాయిస్లుగా చూడోద్దని సూచించారు. ఇది భార్యభర్తల బలోపేతమైన భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న అంశమని, ఆ విషయాన్ని ఉపాసన తెలుసుకోలేకపోయిందంటూ విమర్శించారు. ఇక ఉపాసన సైతం ఈ పోస్ట్లపై స్పందించారు. సరైన భాగస్వామి దొరికే వరకు వేచి చూడటం, పిల్లలను ఎప్పుడు కనాలి అనేదానిపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఎలా తప్పువుతుందని ప్రశ్నించారామె. I too advise people to marry early—not out of duty or anything like that.Having kids early makes life easier and gives your parents as much time as possible to enjoy their grandchildren. https://t.co/Cjmead5UhA— Deepan Shanmugasundaram (@deepan_civileng) November 19, 2025 తన ఉద్దేశ్యం మరింతమంది మహిళలను శ్రామికశక్తిలోకి తీసుకురావాలని యజమానులకు పిలుపునిచ్చానే తప్ప ఇందులో ఎలాంటి అనుచిత సందేశం లేదని వివరణ ఇచ్చింది. అలాగే తన వ్యక్తిగత కారణాల వల్లే 29 ఏళ్ల వయసులో తన ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకున్నట్లు వివరించింది. తాను కేవలం వివాహానికి ముందు కెరీర్పై మహిళలు దృష్టిపెట్టి..ఆర్థిక స్వేచ్ఛ పొందాలనేది తన అభిప్రాయమని నర్మగర్భంగా చెప్పారామె. ఏదిఏమైన ఉపాసన వ్యాఖ్యలు సదుద్దేశ్యంతో చేసినప్పటికీ..అటు వైద్యనిపుణులు, ఇటు ఐఐటీ గ్రాడ్యుయేట్లు నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవ్వడం గమనార్హం.(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్) -
జరగబోయేవన్నీ చెప్పగలనంటాడు!
నమస్తే డాక్టర్ గారు! నాకు 3 నెలల క్రితమే వివాహం అయింది. నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. ఆయన ప్రవర్తన, మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. ఎప్పుడూ తన ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంటాడు. ఎవరినీ నమ్మకూడదు అంటాడు. బయటకు వెళ్ళడానికి ఇష్టపడడు, ఇంట్లో కూడా వింతగా మాట్లాడుతుంటాడు. మొక్కలు, జంతువులు, పక్షుల భాషలు తనకు తెలుసని వాటితో ఏవేవో శబ్దాలతో మాట్లాడుతుంటాడు. ఇంటికి ఎవరైనా వస్తే వారి మొహం చూసి, కళ్ళు మూసుకొని, మీకిలా జరుగుతుంది అని అందరికీ భవిష్యత్తు గురించి చెబుతున్నాడు. నన్ను బాగానే చూసుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళదామంటే ‘నీకేమైనా పిచ్చా’ అని అందరినీ దబాయిస్తున్నాడు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను! మీరు వివరించిన లక్షణాల ప్రకారం మీ భర్తకు కనిపిస్తున్న ప్రవర్తన ‘స్కిజో టైపల్ పర్సనాలిటీ డిజార్డర్ ‘ అనే ఒక మానసిక భ్రాంతికి దగ్గరగా ఉంది. ఈ సమస్యతో బాధపడే వ్యక్తుల ఆలోచనలు, నమ్మకాలు, ప్రవర్తన ఇతరులకు చాలా విచిత్రంగా, అసాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, విపరీతమైన మూఢనమ్మకాలు, వాళ్ళకి ప్రత్యేక శక్తులు ఉన్నాయనుకోవడం, అందరిపై అనుమానం, మీరు చెప్పినట్లు, జంతువులు, మొక్కలతో మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. మిగిలిన వారికి సాధారణంగా అనిపించే విషయాలలో కూడా వీళ్ళు నిగూఢ అర్థాలు వెతుకుతారు. వీరు ప్రపంచాన్ని చూసే విధానమే వేరుగా ఉంటుంది. ఎక్కువగా ఊహా ప్రపంచంలో బ్రతుకుతారు. అయితే వీరు తమ పనిని చేసుకోగలరు. లిమిటెడ్గా కుటుంబం వరకు బాగానే ఉన్నా బయట సామాజిక సంబంధాలు మాత్రం కలిగి ఉండలేరు. తమకి ఉన్నది ఒక సమస్య అని వారు గుర్తించలేరు. ఇది స్కిజోఫ్రీనియా అనే తీవ్రమైన మానసిక జబ్బు కాదు, కానీ దాని తేలికపాటి రూపం ఇది అని చెప్పవచ్చు. అనేక పరిశోధనల ప్రకారం స్కిజోఫ్రీనియా ఉన్న వారి కుటుంబ సభ్యులలో ఈ సమస్య ఎక్కువగా కనపడినట్లు నిరూపణలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ సమస్య తరువాతి కాలంలో పూర్తిస్థాయి ‘స్కిజోఫ్రేనియా’ లేదా ‘ఓసీడీ’ జబ్బు లాగా రూపాంతరం చెందవచ్చు కూడా. ఇదొక అరుదైన సమస్య కాబట్టి పూర్తిగా మార్చడం కూడా కష్టం, అయినా, సహనంతో, ప్రేమతో, మానసిక నిపుణుల సహాయంతో అతని ప్రవర్తనను చాలా వరకు మెరుగు పరచవచ్చు. మీరు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్ని సంప్రదించండి. కొన్ని లక్షణాలు మందులతో తగ్గించవచ్చు, అతని ఆలోచనలు మార్చడం కోసం, సామాజిక వైపుణ్యాల అభివృద్ధి కోసం ‘సైకో థెరపీ’ చాలావరకు ఉపయోగపడుతుంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్(విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: PM Narendra Modi's Watch: రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్..! ధర ఎంత ఉంటుందంటే..) -
మచ్చ'లిక' మాయం
ఒంటిపైన తెల్లటి మచ్చలతో కనిపించే బొల్లి వల్ల ప్రాణహాని ఉండదు. కానీ ఒంటిపై తెల్లటి పొడలు మచ్చలు మచ్చలుగా కనిపిస్తుండటం వల్ల బాధితులు నలుగురిలోకి రావడానికి సామాజికంగా ఇబ్బంది పడతారు. అది అంటువ్యాధి కాదని తెలియక చాలామంది వాళ్ల పట్ల వివక్ష చూపుతారు. ఒక రకంగా చూస్తే మన సొంత వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) అన్నది మన సొంతకణాలపైనే దాడి చేసే ఆటో ఇమ్యూన్ సమస్య కూడా ఒక అంశం కావడంతో ఒకప్పుడు దీనికి అంతగా చికిత్స ఉండేది కాదు. అయితే ఇటీవల దీనికి మంచి మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్లో విటిలిగో అని పిలిచే ఈ బొల్లి వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం.ప్రాణహాని కలిగించకపోయినా వివక్షకు కారణమయ్యే ఈ వ్యాధి విస్తృతి మన జనాభాలోని దాదాపు 0.5 శాతం మందిలో కనిపిస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మచ్చలు... పాటర్న్స్ బట్టి వాటిల్లో రకాలు... ఈ బొల్లి మచ్చలు రకరకాల పాటర్న్స్లో కనిపిస్తాయి. ఉదాహరణకు కొందరిలో ఈ తెల్లమచ్చలు కొద్దిపాటి పొడల్లాగా వస్తాయి. అయితే వాటి సైజు పెరగదు. ఎప్పటికీ అవి చిన్నవిగానే కనిపిస్తుంటాయి. మరికొందరిలో మాత్రం ఇవి పెద్దవిగా విస్తరిస్తూ ఒక తెల్లమచ్చతో మరొకటి కలిసివపోడం వల్ల శరీరమంతా తెల్లబారి΄ోతుంది. ఆ పాటర్న్స్ కనిపించే తీరును బట్టి వీటిని మూడు రకాలుగా వర్ణించవచ్చు. ఫోకల్ పాటర్న్... ఈ తెల్లని మచ్చలు చర్మంలో ఏదో ఒకచోటికి మాత్రమే పరిమితం అవుతాయి.సెగ్మెంటల్ పాటర్న్... ఈ మచ్చలు శరీరమంతటా కాకుండా ఏదో ఒక వైపునకే... అంటే ముందువైపునకుగానీ లేదా వెనకవైపునకే పరిమితం కావడం. జనరలైజ్డ్ పాటర్న్... ఒక చోటికి మాత్రమే పరిమితం కాకుండా చర్మంపై అనేక ప్రాంతాలకు విస్తరించడం. అలాగే ఏదో ఒక వైపునకు మాత్రమే ఉండకుండా శరీరమంతటా కనిపించడం. ఈ తెల్లటి మచ్చలు సాధారణంగా చేతులు, వేళ్ల చివరలు, పాదాలు, భుజాలు, ముఖం, పెదవులు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. కొందరిలో బాహుమూలాలు, పొత్తికడుపు కింది భాగం, నోటి చుట్టూ, కంటి చుట్టూ, మర్మావయవాల ప్రాంతంలో ఉంటాయి. ఈ మచ్చలకు తోడు... విటిలిగో ఉన్నవారిలో ఆ తెల్ల మచ్చలు విస్తరించిన ప్రాంతంలో ఉండే వెంట్రుకలు (ఉదాహరణకు మాడు, కనురెప్పలు, కనుబొమలు, గడ్డంలోని ప్రాంతాల్లోనివి) తెల్లగా మారిపోతాయి. నల్లటి మేనిఛాయ ఉండే వారిలో ఈ తెల్లమచ్చలు / రంగు కోల్పోయిన ప్రాంతాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు... శరీరంపై ఉండే ఆ మచ్చల పరిమాణం, అవి వచ్చిన చోటు, అక్కడ అవి ఎంతమేర విస్తరించాయి... లాంటి అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అలాగే చికిత్స ప్రక్రియలు కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇక చికిత్సా ఫలితాలు కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో ఫలితం చాలా వేగంగా కనిపిస్తే, మరికొందరిలో చాలా ఆలస్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలివి... మెలనిన్ కణాలు మరింత నాశనం కాకుండా చూడటం : ఈ ప్రక్రియలో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ కణాలు మరింతగా నాశనమై΄ోకుండా చేస్తారు. అంతేకాదు... రంగు కోల్పోయిన శరీర భాగానికి మునుపటి రంగు వచ్చేలా చేస్తారు. స్టెరాయిడ్ క్రీములు : కొన్ని రకాల స్టెరాయిడ్ క్రీముల్ని పైపూతగా (టాపికల్ మెడిసిన్స్గా) వాడాల్సి ఉంటుంది. అవి చర్మానికి సాధారణ రంగు వచ్చేలా చేయడంతో పాటు మచ్చలు మరింత విస్తరించకుండా సహాయపడతాయి. అయితే అవి స్టెరాయిడ్స్ అయినందున వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను దృష్టిలో పెట్టుకుని వాటిని కచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. లేదంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఫొటో థెరపీ : ట్యాబ్లెట్లు, లోషన్ రూపంలోని సోరాలెన్స్ అనేవి ఈ తరహా చికిత్సలో ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యాబ్లెట్లు లేదా క్రీములను సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ వాడాలి. అయితే సూర్మరశ్మికి బదులుగా హానికరం కాని మోతాదులో అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ అయ్యేలా కూడా చేయవచ్చు. దీన్ని ‘పూవా’ థెరపీ అంటారు. మరికొంతమందికి న్యారో బ్యాండ్ అల్ట్రా వయొలెట్ – బి కిరణాలతోనూ, ఎక్సైమర్ లేజర్ అనే ఫొటో థెరపీ ప్రత్యామ్నాయాలూ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎక్సైమర్ లేజర్ను కొన్ని నిర్దిష్టమైన ప్యాచ్ల దగ్గరే ఉపయోగించడాని వీలుంది. ఈ ఫొటో థెరపీ ప్రక్రియల కోసం హాస్పిటల్కు రాలేని వారికి ఇంట్లోనే ఉపయోగించుకునేలా హోమ్ బేస్డ్ ఫొటో థెరపీ పరికరాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటిని డాక్టర్ చెప్పిన విధంగా మాత్రమే వాడాల్సి ఉంటుంది. డి–పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ : కొంతమందిలో దాదాపు 80 శాతం పైగా శరీరం తెల్లబడిపోతుంది. ఇలాంటివారిలో నల్లగా ఉన్న మిగతా ప్రాంతాన్ని కూడా తెల్లగా చేస్తారు. ఇతర ప్రక్రియలు : జింక్గో బైలోబా, లీవామీసోల్... లాంటివి ఇమ్యూన్ మాడ్యులేటర్స్. అంటే ఇవి బాధితుల్లో ఇమ్యూనిటీని పెంచడం ద్వారా విటిలిగోతో పోరాడతాయి. ఇవి టాబ్లెట్ల రూపంలోనూ లభ్యమవుతాయి. శస్త్రచికిత్స (సర్జికల్ ట్రీట్మెంట్): వీటిల్లో పంచ్ గ్రాఫ్టింగ్, స్ప్లింట్ స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి రకరకాల సర్జరీ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఇతరచోట్లలో ఉన్న రంగునిచ్చే పిగ్మెంట్ కణాలను (మెలనోసైట్స్ను)... అవి కోల్పోయిన ప్రాంతంల్లోకి బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇతరత్రా సాధారణ చికిత్సల వల్ల ఎలాంటి ఫలితాలూ రాని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స పద్ధతిని అవలంబిస్తారు. శరీరంలోని కొన్ని భాగాల్లో (అంటే... పెదవులు, చేతుల వేళ్ల చివరి భాగాలు, కాళ్ల చివరన ఉండే భాగాలకు) వచ్చిన మచ్చల విషయంలో సాధారణ చికిత్స ప్రక్రియలు అంతగా సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. అయితే పక్కలకు విస్తరించని విటిలిగో మచ్చలతో బాధపడే పేషెంట్ల విషయంలోనే ఈ శస్త్రచికిత్స విధానాన్ని ఆలోచిస్తారు. వ్యాప్తి చెందక΄ోవడం అంటే... ఒక ఏడాది వ్యవధిలో మచ్చ సైజు విస్తరించక΄ోవడం, కొత్త ప్రాంతాల్లో మచ్చలు రాకపోవడాన్ని మచ్చలు వ్యాప్తిచెందని పేషంట్లుగా పరిగణిస్తారు. ఈ సర్జికల్ ప్రక్రియలో ఇతర చోట్ల నుంచి చర్మాన్ని తీసుకుని గ్రాఫ్ట్ చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన ఆధునిక శాస్త్రవిజ్ఞాన ప్రక్రియల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మెంట్ వచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకుగాను... సర్జరీ తర్వాత సాధారణ వైద్యచికిత్స కూడా అవసరం కావచ్చు. చివరగా... ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల వల్ల విటిలిగో రోగులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరంగాని, బాధపడాల్సిన పరిస్థితిగాని లేదు. అనేక వినూత్న చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందున వాటి సాయంతో మళ్లీ మేని రంగును మామూలుగా మార్చుకునేందుకు చాలా అవకాశాలున్నాయి. బొల్లి వ్యాధి కారణాలు ఏమిటంటే... మానవ చర్మంలోని మెలనోసైట్స్ అనే కణాల్లో రంగును ఇచ్చే పిగ్మెంట్ను కలిగి ఉంటాయి. ఈ రంగునిచ్చే పిగ్మెంట్ వల్లనే పదార్థం వల్ల మేనికి రంగు సమకూరుతుంది. ఉదాహరణకు ఒకరి చర్మంలో మెలనోసైట్స్లో పిగ్మెంట్ మోతాదులు ఎక్కువగా ఉంటే వాళ్ల చర్మం నలుపు మొదలుకొని, తక్కువగా ఉన్నవారి చర్మం తెల్ల రంగు (ఫెయిర్) వరకు రకరకాల షేడ్స్లో మేని రంగు ఉంటుంది. ఈ మెలనోసైట్స్ అన్నీ ఒకేచోట కుప్పగా ఉన్నప్పుడు అక్కడ నల్లటిరంగు పుట్టుమచ్చ వస్తుంది. ఏదైనా కారణాల వల్ల ఒకరి చర్మంలో ఈ మెలనోసైట్స్ దెబ్బతినడం వల్ల అక్కడి పిగ్మెంట్ లోపించినప్పుడు అక్కడి చర్మం తన సహజమైన రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. ఇలా చర్మపు రంగు లోపించడానికి... రంగును ఇచ్చే పదార్థమైన పిగ్మెంట్లోని కణాలను సొంత వ్యాధి నిరోధకత దెబ్బతీయడం (ఆటోఇమ్యూన్ అంశం) కూడా ఒక కారణం కావచ్చు.ఈ వ్యాధిగ్రస్తుల్లోని చాలామందిలో ఇది జన్యుపరంగా వచ్చే అవకాశాలెక్కువ. ఇక మరికొందరిలో ఏ కారణమూ లేకుండానే ఇది కనిపించవచ్చు. కారణం ఏదైనా బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచులు ప్యాచులుగా కనిపిస్తాయి. ఇంగ్లిష్లో దీన్ని విటిలిగో అని పిలుస్తారు. వైద్య పరిభాషలో దీన్ని ‘ల్యూకోడెర్మా’ అంటారు.ఈ మచ్చలు హాని కలిగించవు కానీ... ఈ విటిలిగో మచ్చల్లో ఎలాంటి నొప్పీ ఉండదు. వీటి కారణంగా ఆరోగ్యానికి సైతం హాని కూడా ఏదీ ఉండదు. కానీ చూడటానికి (లుక్స్ పరంగా) ఇది ఏమాత్రం బాగుండదు. కాబట్టి ఎంతగా హానికరం కాక΄ోయినప్పటికీ ఈ వ్యాధి కారణంగా బాధితులు వివక్షకు ఆత్మన్యూనతకూ లోనయ్యే అవకాశాలూ ఎక్కువే.డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ (చదవండి: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..?)డా‘‘ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ -
గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?
నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా?– రమ్య, చిత్తూరు. గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్ సమయానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవదు. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్గా ఉంటాయి?– బింధు, హైదరాబాద్. ఇప్పుడున్న ‘ఎల్ఏఆర్సీ’ అంటే (లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్లోనే ఎల్ఏఆర్సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. నార్మల్ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు డెలివరీ రూమ్లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యేలోపే చెక్ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్ ఛాన్స్ 1% కన్నా తక్కువ. ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
పిల్లల్ని కనాలంటే ఆ మందులు వాడకూడదా?
దాంపత్య జీవితంలో ప్రతీ జంటకు తల్లిదండ్రులవ్వడం అనేది ఓ వరం. అయితే రకరకాల సమస్యలతో ఆ ప్రయత్నంలో ఇబ్బందులు పడే వాళ్లున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ పెషేంట్లలో ఇది అధికంగా ఉంటోందనే ప్రచారం ఒకటి ఉంది. డయాబెటిక్ మహిళా పేషెంట్లు అసలు గర్భమే ధరించలేరని తరచూ కొందరు చెబుతుండడమూ చూస్తుంటాం. మరి అందులో నిజమెంత?.. ఇలాంటి ప్రచారాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?.. ఓసారి పరిశీలిద్దాం.. ప్రచారం 1: డయాబెటీస్ ఉన్న మహిళలు సహజంగా గర్భం ధరించలేరు!!వాస్తవం: డయాబెటిస్ సహజంగా గర్భం ధరించడాన్ని ఆపదు. షుగర్ను కంట్రోల్లో ఉంచుకుంటూ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటిస్తూ చాలా మంది మహిళలు గర్భం దాల్చడమే కాదు.. ఆరోగ్యవంతమైన పిల్లల్నీ కనగలరు. షుగర్ నియంత్రణలో లేనప్పుడు మాత్రం అండం ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పుడు గర్భం దాల్చడం కష్టతరమవుతుంది. ప్రచారం2: డయాబెటీస్ మహిళల ఫెర్టిలిటీని మాత్రమే ప్రభావితం చేస్తుందివాస్తవం: మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకూ ఇది వర్తిస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకపోతే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) లెవెల్స్ తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యతతో పాటు కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. ప్రచారం 3: ఆ టైంలో మందులు వాడకూడదు!వాస్తవం: గర్భధారణ ప్లాన్ చేస్తున్నప్పుడు షుగర్ పేషెంట్లు మందులు మావేస్తుంటారు. అలాంటి సమయంలో భాగస్వాములు ఆరోగ్యకరమైన గ్లూకోస్ లెవెల్స్ కలిగి ఉండడం అత్యంత అవసరం. అందుకే మధుమేహ మందులను అకస్మాత్తుగా ఆపడం సరైంది కాదు. రక్తంలో గ్లూకోజ్ సరైన మోతాదులో ఉంచుకునేందుకు.. కొన్ని మందులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అయితే అది కేవలం వైద్యుల సూచనలతోనే జరగాలి. సొంత వైద్యం అస్సలు మంచిది కాదు. ప్రచారం 4: రక్తంలో అధిక గ్లూకోజ్ లెవల్స్తో ఏం కాదు వాస్తవం: ఇది చాలా తప్పు. గర్భంతో ఉన్న టైంలో షుగర్ పేషెంట్ల షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అది బీపీ పెరగడం, ప్రీఎక్లాంప్షియా సమస్యలకు దారితీయొచ్చు ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదకరంగానూ మారొచ్చు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ నుంచే షుగర్ లెవల్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రచారం 5: డయాబెటిస్ ఉంటే ఫెర్టిలిటీ చికిత్సలు పనిచేయవువాస్తవం: డయాబెటిస్ పేషెంట్లు ఐవీఎఫ్, ఐసీఎస్ఐ లాంటి ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా గర్భం దాల్చొచ్చు కూడా. డయాబెటిస్ ఉన్నదని ఈ చికిత్సలు పనిచేయవని భావించడం అపోహ మాత్రమే. అయితే ఈ చికిత్సలు విజయవంతంగా జరిగేందుకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండడం చాలా ముఖ్యం. -డా. ప్రశాంత కుమార్ నాయక్, ఎంబీబీఎస్, ఎండీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఒయాసిస్ ఫెర్టిలిటీ -
వెంటిలేటర్పై సీనియర్ నటుడు ధర్మేంద్ర.. స్పందించిన టీమ్!
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవలే ఆయన ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్రపై వస్తున్న కథనాలపై ఆయన టీమ్ స్పందించింది.అయితే ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారన్న వార్తలు నిజం కాదని టీమ్ స్పష్టం చేసింది. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా ఆస్పత్రికి వెళ్లి వచ్చారని వెల్లడించింది. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే అతని కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఉండేదని పేర్కొంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ తెలిపింది.కాగా.. ధర్మేంద్ర అక్టోబర్ 31న సాధారణ చెకప్ కోసం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అతని భార్య హేమ మాలిని కూడా ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే ధర్మేంద్ర చివరిసారిగా 2024లో విడుదలైన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన నటించిన అగస్త్య నందా ఇక్కిస్ చిత్రం ఉంది ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
మ్యాడ్ హనీ: ఒక్క చుక్క సిప్ చేశారో..ప్రాణాలకే ముప్పు!
పూలమకరందాన్ని సేవించి తేనెటీగలు ఉత్పత్తి చేసే తియ్యటి తేనె ఎన్ని ఔషధ ప్రయోజనాలు కలిగి ఉందో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పబోయే తేనె మాత్రం అత్యంత విషపూరితమైనది. అయితే దీన్ని కూడా పలు చికిత్సల్లో ఉపయోగిస్తారు. అలాగని నేరుగా సిప్ చేశారో అంతే పరిస్థితి. ఆ మధువే..మ్యాడ్ తేనే. ఇది మాదకద్రవ్య ప్రభావాలు కలిగిన తేనె అట. ఇది కేవలం నేపాల్, టర్కీలలో ఉత్పత్తి అవుతుందట. హిమాలయ ప్రాంతాలలో జెయింట్ అనే తేనెటీగలు రోడోడెండ్రాన్ అనే పువ్వుల నుంచి ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో మాదక ద్రవ్య ప్రభావం తోపాటు, విషపూరితమైన గ్రేయానోటాక్సిన్లను కూడా కలిగి ఉంటుందట. ప్రాచీన గ్రీసులు ఈ మ్యాడ్ హానీని బయో వెపన్గా ఉపయోగించేవారట. పురాతన గ్రీకు గ్రంథాల్లో గ్రీకు సైనిక నాయకుడు జెనోఫోన్ దీని గురించి రాశాడని చెబుతున్నాయి. అంతేగాదు క్రీస్తూ పూర్వం జనరల్ పాంపే ఆధ్వర్యంలో రోమన్ సైనికులపై జరిగిన మూడవ మిథ్రిడాటిక్ యుద్ధంలో రాజు మిథ్రిడేట్స్ మ్యాడ్ హనీని బయో వెపన్గా ఉపయోగించినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తేనె కామోద్దీపన కోరికలను పెంచుతుందట కూడా.ఎలా సేకరిస్తారంటే..మధ్య నేపాల్, ఉత్తర భారతదేశంతో సహా హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో వసంతకాలంలో లోయలలో రోడోడెండ్రాన్లు వికసించినప్పుడు తేనెటీగగలు ఈ బంగారు రంగు తేనెను ఉత్పత్తి చేస్తాయట. చెట్టుకొమ్మలపై సుమారు 1200 నుంచి, 4 వేల మీటర్ల ఎత్తులో కనిపిస్తాయట. నేపాల్లోని గురుంగ్ అనే తెగ వారు ఈ మ్యాడ్ తేనెని సేకరిస్తారట. ఒకప్పడూ ఎక్కడపడితే అక్కడ దర్శనమిచ్చే ఈ తేనెతుట్టలు..ఇప్పుడు ఆనకట్ట నిర్మాణాల కారణంగా కనుమరుగవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.ప్రయోజనం, ప్రమాదం రెండూ ఉన్నాయి..దీన్ని కామోద్దీపనంగా, జీర్ణశయాంతర రుగ్మతలకు(పెప్టిక్ అల్సర్ వ్యాధి, డిస్స్పెప్సియా, గ్యాస్ట్రిటిస్, రక్తపోటు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేగాదు గొంతునొప్పి, ఫ్లూ, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. అలాగని ఆ తేనెని సిప్ చేశారో ఇక అంతే..టెక్సాస్ ఇన్స్టిట్యూట్ జర్నల్లో ప్రచురితమైన ఒక కేసులో.. ఓ భార్యభర్తలు తమ దాంపత్యం మరింత బాగుండాలని ఈ తేనెని ఒక వారం పాటు తీసుకున్నారు. ఫలితంగా రెండు గంటల్లోనే తీవ్రమైన ఇన్ఫీరియర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (రక్త ప్రవాహంలో ఆకస్మిక అడ్డంకి వల్ల కలిగే గుండెపోటు)తో ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఇది రక్తపోటుని పడిపోయేలా చేసి, శాసకోశ సమస్యలు, తలతిరగడం, వంటి ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కోసారి కండరాల పక్షవాతం, అట్రియోవెంట్రిక్యులర్ బ్లాక్లు, స్పృహ కోల్పోవడం వంటివి సంభవిస్తాయి కూడా. అందువల్లే ఈ తేనెని టేస్ట్ చేయాలంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో, వారి సలహాలు సూచనల మేరకు ట్రై చేయాలే తప్ప..నేరుగా సిప్ చేసే సాహసం చేశారో.. ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే. View this post on Instagram A post shared by Medicinal Mad Honey® | Mad Honey Nepal (@medicinal.madhoney) (చదవండి: మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..) -
అత్యంత అరుదైన వ్యాధి: కంటి రెప్పల్లో పేలు..!
తల్లో పేలు గురించి విన్నాం కానీ, కనురెప్పల్లో పేలు ఉండటం గురించి వినలేదు కదా..!. కనురెప్పల్లో చుండ్రు ఉంటుందని తెలుసగానీ ఇదేంటీ..పేలు ఉండటం అని విస్తుపోకండి. ఎందుకంటే..నిజంగానే ఓ మహిళ కంట్లో ఏకంగా 250 పేలను గుర్తించారు వైద్యులు. తొలుత వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మరి చికిత్స అందించి ఆమెకు చక్కటి ఉపశమనం అందించారు. అసలేంటి ఈ సమస్య? ఎందుకు వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!గుజరాత్లోని ఆమ్రేలి జిల్లా సావర్ కుండ్ల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 66 ఏల్ల గీతాబెన్ కంటిలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. సూరత్కు చెందిన గీతాబెన్కు ఈ సమస్య గత రెండున్నర నెలలుగా వేధిస్తోంది. కళ్లు ఎర్రబారిపోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమైంది. దీంతో కంటి డాక్టర్ మృగాంక్ పటేల్ ఆమె కళ్లను పరీక్షించగా.. రెప్పల్లో ఏకంగా పేలు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఆయన కూడా ఇదేంటని విస్తుపోయారు. ఆ తర్వాత వివిధ అధ్యయన పత్రాలను శోధించి.. ఇలాంటి వింత కేసు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారని చెప్పారు. తాము మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు గుర్తించామని అన్నారు. వాటి తోపాటు గుండ్రని పేను గుడ్లను కూడా కనిపించాయని వెల్లడించారు. వీటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుందని ముందుగానే బాధిత మహిళకు తెలియజేసి మరి ఆపరేషన్కి సిద్ధం చేశారామెను. అయితే ఆమెకున్నవైద్య పరిస్థితుల రీత్యా ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకుండా ఒక్కొక్కపేనుని ఓపికగా తొలగించారు వైద్యులు. ఈ పరాన్న జీవి కంటి రెప్ప మూయగానే అమాంతం రక్తం తాగేస్తుందట. ఎందుకంటే అక్కడ కణజాలాం చాలా పల్చగా ఉండి, సులభంగా రక్తాన్ని పీల్చేయగలదని అన్నారు. పైగా అక్కడ కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయట. దీని కారణంగా పేషెంట్కి దురద, మంట వస్తుందట. అదీగాక ఇవి తొలగించాలనుకున్నా..అంత తేలిగ్గా రావట కూడా. ప్రత్యేక పరికరంతో తొలగింపు ప్రక్రియ..ఈ పేలు వెలుతురు పడినప్పుడూ కదులుతుంటాయట. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి ప్రతీ పేనుని పట్టుకుని బయటకు తీసినట్లు వివరించారు. అలాగే ఆ మహిళకు నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చాం అని వైద్యుడు మృగాంక్ వెల్లడించారు. తన 21 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని, అస్సలు ఎప్పుడూ ఇలాంటి కేసు ఎదురవ్వలేదని అన్నారు. బాధిత మహిళ కంటి రెప్పల్లోంచి ఏకంగా 250 పేలు, 85 గుడ్లు(లార్వా)లు తొలగించినట్లు తెలిపారు.ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే..యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి. దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి. దాంతో తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్కానందున నిర్థారించడం కష్టమని అన్నారు. వీటి లార్వాలు అచ్చం దోమ లార్వాలనే ఉంటాయని చెప్పారు.ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..ఇన్ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు. ఈ వ్యాధి మనుషులతోపాటు పశువుల్లో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అడవుల్లో తిరిగే వాళ్లకు, పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు ఇవి వెంటనే అటాక్ అవుతాయట. వెంటనే కనురెప్పలకు చేరి అక్కడ తిష్టవేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి కాంతి పడినప్పుడూ పారిపోతాయి కాబట్టి లైట్ లేకుండా తొలగించాలని చెబుతున్నారు వైద్యులు. పైగా ఈ పరాన్నజీవి లార్వాలను ఏ ఔషధం చంపలేదని అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకుని కంటి నుంచి తొలగించడం ఒక్కటే మార్గం అని అన్నారు.'తలలో ఉండే పేలు కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు డాక్టర్ మృగాంక్. లక్షణాలు కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.(చదవండి: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?) -
చక్కెర బాధితులు తినదగ్గ దుంప... చిలగడదుంప!
భూమిలో పండే దుంపలు షుగర్ బాధితులకు మంచివి కావనీ, ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి డయాబెటిస్ బాధితుల్లో చక్కెర మోతాదులను పెంచేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలామంది షుగర్ బాధితులు ఆలుగడ్డలు (బంగాళదుంపలు) తినడానికి వెనకాడుతుంటారు. అయితే మిగతా దుంపల విషయం ఎలా ఉన్నా... చిలగడదుంపలతో మాత్రం ఆ ప్రమాదం లేదంటున్నారు ఆహార నిపుణులు. దీని నుంచి విడుదల అయ్యే చక్కెర మోతాదులు చాలా తక్కువ. అంటే ఇవి తిన్నప్పుడు వీటిలోంచి వెలువడే చక్కెర తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (లో– గ్లైసిమిక్ ఇండెక్స్) ఉండటం వల్ల దీనితో అంతగా ప్రమాదం ఉండదనీ, పైగా ఇందులో విటమిన్–ఏ కూడా ఎక్కువగా ఉన్నందున చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ దుంపను తినవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది. (చదవండి: ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..) -
'వంట నూనె వాడకం తగ్గించండి': వరల్డ్కప్ విజేతలతో ప్రధాని మోదీ
భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమవంతు సాయం అందించాలని కోరారు. జాతీయ ఆరోగ్య చొరవలో భాగంగా నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియ ఉద్యమం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నిజానికి మోదీ ప్రతి భారతీయుడు దైనందిన జీవితంలో ఫిట్నెస్ను అంతర్భాగం చేయడానికి 2019 నుంచి ఈ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మన దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ఫిట్ ఇండియా ఒక్కటే పరిష్కారమని నొక్కి చెబుతున్నారు. దయచేసి అంతా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తే, పైగా కొనుగోలు చేసే సమయం కూడా తగ్గుతుందని అన్నారు. అలాగే భారత మహిళా జట్టుని ఉద్దేశించి..తమ పాఠశాలలను సందర్శించి యువతరాలకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కాగా, గట్టి భద్రతా చర్యల మధ్య ప్రదానమంత్రితో సమావేశం కావడానికి భారత జట్టు మంగళవారమే న్యూఢిల్లీకి చేరుకుంది. అలాగే భాతర జట్టు అద్భుతమైన విజయ సాధించిన వెంటనే మోదీ సోషల్ మీడియా పోస్ట్లో "టోర్నమెంట్ అంతటా భారత జట్టు అసాధారణమైన కృషిని, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారులందరికి అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు చాంపియన్ క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తుంది." అని పోస్ట్లో పేర్కొన్నారు మోదీ.(చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..) -
మెరుగ్గా రిటైర్మెంట్ సన్నద్ధత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా రిటైర్మెంట్ సన్నద్ధతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్కోరు 2022లో 44గా ఉండగా 2025లో 48కి పెరగడం దీనికి నిదర్శనం. భారతీయుల్లో ఆరోగ్యం, ఆర్థికాంశాలపై అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణంగా నిలుస్తోంది. డేటా అనలిటిక్స్ కంపెనీ కాంటార్తో కలిసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని సగం మంది ప్రజలు రిటైర్మెంట్ ప్లానింగ్ను సాధ్యమైనంత ముందుగా, 35 ఏళ్ల లోపు నుంచే ప్రారంభించాలని విశ్వసిస్తున్నారు. ఇందుకోసం ఫిట్నెస్ అలవాట్లను పెంపొందించుకోవడం, తరచుగా హెల్త్ చెకప్లు చేయించుకోవడం వంటివి చేస్తున్నారు. సర్వే ప్రకారం ఆరోగ్య బీమాను తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే, సరిపోయేంత స్థాయిలో ఆర్థికంగా బలంగా ఉండే విషయంలోనే సవాళ్లు ఉంటున్నాయి. తాము దాచుకున్న సొమ్ము రిటైర్మెంట్ తర్వాత పదేళ్ల లోపే అయిపోవచ్చేమోనని 63 శాతం మంది భావిస్తున్నారు. 37 శాతం మంది మాత్రమే రిటైర్మెంట్ పొదుపు లక్ష్యాల్లో కనీసం 25 శాతాన్ని సాధించారు. ముందు వరుసలో మహిళలు.. రిటైర్మెంట్ సన్నద్ధతలో మహిళలు, గిగ్ వర్కర్లు ముందువరుసలో ఉంటున్నారు. అయితే, ఒంటరితనం, కుటుంబంపై ఆర్థికంగా ఆధారపడాల్సి రావడంలాంటి విషయాల్లో ప్రజల్లో ఆందోళన ఉంటోంది. ఈ అంశాలపై వరుసగా 71 శాతం, 72 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా చూస్తే పూర్తి స్థాయి సన్నద్ధతలో తూర్పు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండగా, కోవిడ్ తర్వాత ఆరోగ్యపరమైన రికవరీలో ఉత్తరాది మెరుగ్గా ఉంది. ఆర్థిక విషయాల్లో పశి్చమ రాష్ట్రాలు పటిష్టంగా ఉన్నాయి. అవగాహన పెరుగుతున్నప్పటికీ, సన్నద్ధత విషయంలో మాత్రం వెనుకబాటుతనం ఉంటోందని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లు, మహిళలు, తిరిగి వచ్చిన వలసదార్లలాంటి వివిధ వర్గాల కోసం తగిన విధమైన రిటైర్మెంట్ సొల్యూషన్స్, సలహా సేవలు అవసరమని సర్వే పేర్కొంది. -
బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?
మార్కెట్ నుంచి మన ఇంటికి ఉల్లిపాయలను తీసుకువచ్చినప్పుడు, చాలా సార్లు ఉల్లిపాయలో నల్లటి పొర కనిపిస్తుంది. సాధారణంగా ఈ పొర తొక్క లోపల కనిపిస్తుంది. మనం దీనిని ఏదో దుమ్ముగా భావించి, కడిగి వాడుకుంటాం. కానీ ఇది నల్లటి ఫంగస్. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలు తినడం వల్ల అది మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో, అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ ఉల్లిపాయల జోలికి పోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇలాంటి వాటిని తినడం వల్ల మ్యూకోర్మైకోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఇన్ఫెక్షన్ చాలా హాని కలిగిస్తుంది. వివిధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఉల్లిపాయల్ని తినకపోవడమే మేలు.ఉల్లిపాయ నుంచి ఆ భాగాన్ని తీసివేసి తింటే అది ప్రాణాపాయం కలిగించదు. కానీ, ఇది కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అలెర్జీలు ఉన్నవారు ఇలాంటి ఉల్లిపాయల్ని తినకూడదు. అదేవిధంగా, ఉబ్బసం ఉన్నవారికి ఇది హానికరం. ఈ ఫంగస్ గాలిలో వ్యాపించి, ఉబ్బసం ఉన్న వ్యక్తి దానిని పీల్చినప్పుడు, అది హాని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయను ఒకటి లేదా రెండు పొరలను తీసివేసిన తర్వాత మాత్రమే వాడండి లేదా ఉల్లిపాయలు కొనేటప్పుడు, తొక్క నల్లగా ఉండకుండా చూసుకోండి.మరో ముఖ్య విషయం... ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచకూడదు. ఒకవేళ మీరు ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచాలనుకుంటే దానిపై ఎటువంటి నల్లటి ఫంగస్ ఉండకూడదు. అలా ఉంటే అది ఇతర ఆహార పదార్థాలతో కలిసిపోయి విషంగా మారుతుంది. అందుకే ఇలాంటి తప్పులు చేయకండి.చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
జిమ్ లేకున్నా హోమ్ చాలు
ఈ రోజుల్లో మహిళల బాధ్యతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంట్లో గృహిణిగా, ఆఫీసుల్లో ఉద్యోగినిగా మల్టీ టాస్కింగ్గా పనులను చక్కబెట్టాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకు రోజువారీ వ్యాయామాలు చేయాలి. జిమ్కు వెళ్లలేం అనుకునేవారు ఇంట్లోనే పాటించదగిన ఫిట్నెస్ కేర్ గురించి తెలుసుకుని ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ యాస్మిన్ చెబుతున్న జిమ్ ఫిట్నెస్΄పాఠాలు ఇవి... దీపికా పదుకొనే, అలియాభట్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ మహిళల దినచర్యలకు తగిన విధంగా ఇంట్లోనే చేసుకోదగిన ఫిట్నెస్కు మార్గనిర్దేశం చేస్తుంది. పోషకాహారంపైనా దృష్టి పెడుతుంది. మహిళల ఫిట్నెస్ కోసం కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కూడిన బ్యాలెన్స్ను గట్టిగా చెబుతుంది. అంతేకాదు, మెనోపాజ్ వంటి దశలలో మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి సరైన సూచనలనూ అందిస్తుంది.స్థిరత్వం ముఖ్యంచాలా మందిలో ఫిట్నెస్ విషయంలో తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి. ఎక్కువ సమయం, వేగంగా వ్యాయామాలు చేయడం కంటే సరైన సమయంలో సరైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ సాధించడం ముఖ్యం. సమతుల ఆహారం : ప్రాసెస్ చేసి, చక్కెర ఉన్న ఆహారాలను నివారించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఫిట్నెస్ లక్ష్యాలలో చాలా ముఖ్యమైనది.అనుకూలమైన వ్యాయామాలు: ఇంట్లో, జిమ్లో ఎక్కడైనా చేయడానికి ఎన్నో రకాల వ్యాయామాలు ఉన్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలమైనవి ఎంచుకొని చేయవచ్చు.ఇంట్లోనే చేయదగిన కొన్ని వ్యాయామాలుట్రైసెప్ డిప్స్: మీ ట్రైసెప్స్ కోసం డిప్స్ చేయడానికి బలమైన కుర్చీని ఉపయోగించవచ్చు. అప్పర్కట్, పంచ్: చేతులను బలోపేతం చేసేలా బాక్సింగ్ విధానంలో కదలికలు ఉండాలి.∙డబుల్ లెగ్ స్ట్రెచ్: నేలపైన పడుకొని, మోకాళ్ళను ఛాతీ వద్దకు తీసుకురావడం, తిరిగి చేతులు, కాళ్లను యధాస్థానానికి తీసుకువెళ్లడం.. ఇలా పదే పదే చేయడం ద్వారా ఉదర కండరాలలో మార్పులు తీసుకురావచ్చు.స్ట్రెయిట్ లెగ్ లిఫ్ట్లు : నేలమీద వీపుపై పడుకుని, కాళ్లను సమాంతరంగా చాపుతూ పైకి ఎత్తాలి. తర్వాత తిరిగి కిందకు చేర్చాలి. మడమ స్పర్శ: నేలమీద పడుకొని, మోకాళ్ల దగ్గర కాళ్లను వంచి, చేతులతో మడమలను తాకడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస లయను కూడా ఒక రిథమ్గా నిర్వహించడం ముఖ్యం. ఎటువంటి గాయం కాకుండా మరొకరి పర్యవేక్షణలో సాధన చేయడం ఉత్తమం.నిటారుగా నిల్చొని, ఒక చేతిని తలకిందుగా పట్టుకుని, నెమ్మదిగా వంగిపాదాన్ని మరొక చేతితో తాకండి. అలాగే రెండో చేతితో చేయాలి. తక్కువ పరికరాలతో వ్యాయామాలుహాలో డంబెల్: పాదాలను, భుజాలను వెడల్పుగా ఉంచి భుజాలు, ట్రైసెప్స్, వీపును లక్ష్యంగా చేసుకోవడానికి రెండు చేతులతో డంబెల్ను పట్టుకొని, దానిని తల చుట్టూ తిప్పాలి. బ్యాండ్ ట్విస్ట్: మార్కెట్లో జిమ్ బ్యాండ్స్ లభిస్తాయి. కాళ్లు, చేతులతో ఈ బ్యాండ్ పట్టుకుంటూ ఎగువ, దిగువ వీపు కండరాలపై నిమగ్నం చేయాలి.కెటిల్బెల్ : ఇది సైడ్ బెండ్ చేయడానికి బాగా ఉపయోగపడే మరొక పరికరం. ఈ కెటిల్బెల్ తో మోచేయి నుండి మోకాలికి ఒక డైనమిక్ కదలిక ఉంటుంది. దీనివల్ల నడుము టోన్ అవ్వడమే కాకుండా, కోర్ కో ఆర్డినేషన్ కూడా మెరుగుపడుతుంది. చేతితో కెటిల్బెల్ తీసుకొని, బరువు ఉన్న వైపు పక్కకు వంగి, రెండో మోకాలిని మోచేయి కలిసే విధంగా పైకి ఎత్తాలి. ఇలా పది నుంచి పన్నెండు సార్లు చేయాలి.మెడిసిన్ బాల్ ట్విస్ట్ దీనితో వ్యాయామం చేస్తే పక్కలు బలోపేతం అవుతాయి. ఇందులో ఛాతీ స్థాయిలో మెడిసిన్ బాల్ పట్టుకుని, తల కింద నుంచి ఒక వైపు నుండి మరొక వైపుకు కదలించాల్సి ఉంటుంది.రోజులో ఖాళీ కడుపుతో కొంత సమయం ఈ వ్యాయామాలు చేస్తే మైండ్కు–బాడీకీ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. పనులకు తగినట్టు శక్తిని పుంజుకోవడానికి, శారీరక చురుకుదనం పెంపొందించుకోవడానికి, పోషకాహారంపై దృష్టి పెట్టడానికి ఈ పై వ్యాయమాలు పనిచేస్తాయి. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు
ఒకే తల్లికి పుట్టిన పిల్లలకు ఒకే విధమైన సమస్య రావడం చూస్తుంటాం. అలా కాకుండా..ఆఖరి పిల్లవాడిలో చూసిన రుగ్మత పెద్దపిల్లల్లో ఒకరి తర్వాత ఒకరూ బారినపడితే..అదొక మెడికల్ మిస్టరీలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఆవిష్కృతమైంది. వైద్యులు సైతం ఇదెలా సాధ్యం అని విస్తుపోతున్నారు.అసలేం జరిగిందంటే..అమెరికాలోని వెస్ట్ వర్జినియాకు చెందిన ఒక కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఒకరు తర్వాత ఒకరు ఒకే విధమైన మెదడు సంబంధిత రుగ్మత బారినపడ్డారు. తొలుత చిన్న కుమార్తెకు 18 నెలల వయసు ఉండగా ఈ సమస్యను గుర్తించారు. అదీగా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్చుకోవడం ఆలస్యం కావడంతో..ఆ చిన్నారి విషయంలోనే ఆందోళ చెందేవారు. ఇప్పుడూ పెద్దవాళ్లైన ముగ్గురు పిల్లలు అదే రుగ్మత బారినపడ్డారని తెలిసి తల్లడిల్లిపోయారు. ఏంటా వ్యాధి అంటే..మెదడుకి సంబంధించిన చియారీ వైకల్యం. వైద్యానికి సవాలు విసిరేలా నలుగురు ఒకేసారి ఈ వ్యాధిని ఎదుర్కొవడం అంతుచిక్కని మిస్టరీలా అనిపించింది వైద్యులకు. చియారీ వైకల్యం అంటే..పుర్రె వెనుకభాగం మెదడు కణజాలం వెన్నెముకలోకి ప్రవేశించే పరిస్థితి. ఫలితంగా ఇది మెదడుపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో తలనొప్పి, మైకము, మెడ నొప్పి, బ్యాలెన్సింగ్కి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. సింపుల్గా చెప్పాలంటే మెదడు యొక్క దిగువ భాగం పుర్రె దాటి విస్తరించి, పుర్రె వెన్నుపాముతో కలిసే ద్వారం పొడుచుకు వచ్చే పరిస్థితి. ఇది సాధారణంగా పుట్టుకకు ముందు అభివృద్ధి చెందుతుందని వైద్యులు. ఈ సమస్యల ప్రతి 2,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే పెద్దవాళ్లైన ముగ్గురు ఆడపిల్లలు అమేలియా, ఆబ్రే, అడాలీలకి పీడియాట్రిక్ న్యూరో సర్జన్ శస్త్ర చికిత్స చేసి సమస్య నుంచి మెరుగయ్యేలా చేశారు. ఇక్కడ వైద్యులు ఈ పరిస్థితికి..మెదడుతో కుదించి ముడిపడి ఉన్న వెన్నుపాములను కోసి సెరెబ్రోస్పానియల్ ద్రవ ప్రవాహాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా శస్త్రచికిత్స చేస్తారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఈ సమస్య నుంచి విజయవంతంగా బయటపడ్డారు. కానీ ఇలా ఈ చియారీ వైకల్యం బారిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఒకేసారిపడటం అనేది అత్యంత అసాధారణం, అరుదుగా పేర్కొన్నారు వైద్యులు. ఈ సమస్య సుమారు 10% వరకు వంశపారంపర్యంగా వస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ..జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుందనేది మరికొందరు నిపుణులు వాదన. చివరగా.. ఈ సమస్యకు గనుక సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవయవాల బలహీనత, శ్వాస సమస్యలు, పార్శ్వగూని, తలనొప్పి, నరాల నొప్పికి దారితీసి పక్షవాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: రోబోటిక్తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ) -
రోబోటిక్తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ
పక్షవాతం(స్ట్రోక్)కు గురైన రోగి శరవేగంగా కోలుకునేందుకు రోబోటిక్ ప్రక్రియ అద్భుతంగా తోడ్పడుతుందని హెల్త్ కేర్ ఎట్ హోమ్(హెచ్సీఏహెచ్) ఇండియా సహ వ్యవస్థాపకుడు ఢిల్లీకి చెందిన డాక్టర్ గౌరవ్ తుక్రాల్ అన్నారు. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని సోమాజిగూడలోని సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ బుధవారం ప్రారంభించింది. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఇది స్ట్రోక్ న్యూరో రిహాబిలిటేషన్లో కీలకమైన ముందడుగని, రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మిళితం చేయడం ద్వారా రోగులకు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రికవరీని అందించగలమన్నారు. నడక సహా పలు అవయవాల కదలికలకు శిక్షణ అందించే ఈ సరికొత్త రోబోటిక్ గైటర్ పూర్తి మేడ్ ఇన్ ఇండియా కాగా రోగులు ఇప్పుడు ఎక్సోస్కెలిటన్–సహాయక నడక వ్యవస్థలను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో వెయ్యి గైడెడ్ స్టెప్స్ తీసుకోవచ్చన్నారు. హెచ్సీఏహెచ్కు చెందిన అంకిత్ గోయెల్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన.. గిన్నిస్ బుక్లో చోటు..) -
బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన.. గిన్నిస్ బుక్లో చోటు..
మహిళల్లో రొమ్ము కేన్సర్పై ప్రముఖ ప్రైవేటు రంగ బీమా సంస్థ ఎస్బీఐ లైఫ్ చేపట్టిన అవగాహన ప్రచారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. బ్రెస్ట్ హెల్త్ను ప్రతి ఇంటా చర్చించుకోవాల్సిన విషయం అనే అవగాహన పెంపొందించడం లక్ష్యంగా 1,191 ‘హగ్ ఆఫ్ లైఫ్’ హాట్ వాటర్ బ్యాగ్లను ఉపయోగించి, ‘టేక్ ఎ బ్రెస్ట్ సెల్ఫ్–ఎగ్జామ్ విత్ థాంక్స్–ఎ–డాట్’ అనే సందేశాన్ని ప్రదర్శించే అతి పెద్ద మొజాయిక్ను రూపొందించడం ద్వారా ఈ ఘనత సాధించామన్నారు. 2023లోనే మహిళలు స్వయంగా సెల్ఫ్–బ్రెస్ట్ పరీక్షను సురక్షితంగా నిర్వహించుకునేందుకు తోడ్పడేలా ప్రపంచంలోనే తొలిసారిగా తమ సంస్థ ‘హగ్ ఆఫ్ లైఫ్’ హాట్ వాటర్ బ్యాగ్ను ప్రవేశపెట్టిందని వివరించారు. (చదవండి: ఈ తరం వైబ్స్.. దేశీ టూన్స్..) -
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్చేస్తే..!
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు. ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్కి మరో ఛాన్స్లేదు. పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.అద్భుతం చేసిన ప్రేమ..మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు. దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..! మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
పోస్ట్పార్టమ్..బాధలు, పరిష్కారాలు.
ప్రసవం తర్వాత కొత్తగా తల్లిగా మారిన మహిళలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. తొమ్మిది నెలలపాటు కడుపులో బిడ్డను మోసిన అమ్మ మళ్లీ మునపటి దశకు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతుంది. మళ్లీ ఎప్పట్లాగే అమ్మ శారీరక స్థితి... గర్భం దాల్చడానికి ముందున్న ఆ స్థితికి వెళ్లాలంటే కనీసం ఆరు వారాలు పడుతుంది. ప్రసవం అయ్యాక జరిగే ఆ ఆరువారాల వ్యవధిని ‘పోస్ట్ పార్టమ్’ అంటారు. అంటే పోస్ట్ పార్టమ్’(post partum )ను తెలుగులో చెప్పాలంటే ప్రసవానంతర స్థితి అనుకోవచ్చు. ఈ దశ చాలా కీలకమైనది. నిర్లక్ష్యం చేస్తే కొత్త తల్లి ఈ దశలో కొన్ని ఇన్ఫెక్షన్లకు గురికావచ్చు. ఫలితంగా చాలాకాలం పాటు శారీరకంగా, మానసికంగా ప్రభావం పడవచ్చు. ప్రసవానంతరం తల్లి, కుటుంబం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసమే ఈ కథనం. ప్రసవానంతరం తల్లిలో శారీరకంగా ఎన్నో రకాల మార్పులు కనిపిస్తాయి. ఉదాహరణకు... తల్లి కడుపులో మరో జీవి ఉన్నందున దానికీ కావాల్సిన రక్తప్రసరణ కోసం గుండె దాదాపుగా రెండింతలు పనిచేస్తుంది. అలా రెట్టింపు పనిచేసే ఆ గుండె క్రమంగా తన మామూలు పనికి వస్తుంది. ప్రసవం తర్వాత ఐదు నుంచి ఆరు వారాలకు క్రమంగా ఆ పరిస్థితి వస్తుంది. ప్రసవం సమయానికి ఉబ్బి ఉండే యోని గోడలు మళ్లీ ఐదు నుంచి ఆరు వారాలకు మామూలు స్థితికి వస్తాయి. గర్భసంచి వెంటనే మొదటి స్థితికి వెళ్లలేదు కాబట్టి... ప్రసవం అయిన వెంటనే... 20 వారాలప్పుడు ఎంత పరిమాణంలో ఉంటాయో అంతటి పరిమాణంలో ఉంటాయి. ఆ సమయంలో కడుపుపై నుంచి కూడా డాక్టర్లు వాటి ఉనికిని గుర్తించగలరు. అయితే... ప్రసవమైన 45 వ రోజు నాటికి అవి... తమ ఉనికి కడుపు పైనుంచి పసిగట్టలేనంతగా కుంచించుకుపోతాయి. ప్రసవం తర్వాత మూడు నాలుగు వారాలపాటు సాధారణంగా అంతో ఇంతో రక్తస్రావం అవుతూనే ఉంటుంది. అయితే అదీ మరీ ఎక్కువగా ఉండదు. ఉండకూడదు.ప్రసవం తర్వాత మళ్లీ మునపటి ఆరోగ్యం కోసం... మాతృమూర్తికి వ్యాయామాలు : తల్లి అయిన మహిళ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా సిజేరియన్ అయిన మహిళలూ, పాలు పట్టే తల్లులు ఇలా విశ్రాంతి తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. మరీ అలసిపోయేంత తీవ్రంగా కాకపోయినప్పటికీ... ప్రసవానంతరం తల్లి తన పనులు తాను చేసుకుంటూ ఉండటం... అంటే టాయెలెట్కు తనంతట తానే నడుస్తూ వెళ్లడం వంటివి చేస్తుంటే చాలా త్వరగా మామూలు మనిషి అవుతారు. ప్రసవం తర్వాత వారం రోజుల తర్వాత మామూలుగా నడక మొదలుపెట్టవచ్చు. నాలుగో వారం తర్వాత రోజువారీ పనులు చేసుకోవచ్చు. జిమ్కు వెళ్లేవారైతే... సిజేరియన్ అయితే 2 నెలల తర్వాత నుంచి, మామూలు ప్రసవం అయితే నెల తర్వాత నుంచి జిమ్కు వెళ్లి ఎక్సర్సైజ్ చేయవచ్చు.బరువు తగ్గించుకోవడం : గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలల వ్యవధిలో తాము పెరిగిన బరువును తగ్గించుకోవడం ఎంతైనా మేలు. అయితే ఈ బరువు అకస్మాత్తుగా త్వరత్వరగా కాకుండా... దాదాపు ఏడాది వ్యవధిలో క్రమంగా తగ్గించుకోవడం అన్నది ఆరోగ్యదాయకం. పాలు పట్టే సమయంలో ఆహారం : మన సంస్కృతీ, సంప్రదాయాల్లో ఉన్న నమ్మకాల ప్రకారం కొందరు పెద్దలు పాలిచ్చే తల్లులు చాలా రకాల ఆహారాన్ని తినకుండా చేస్తారు. కానీ బిడ్డకు తగినట్లుగాపాలు బాగా ఊరడానికి తల్లికి పాలూ, ఓట్స్, ఆకుపచ్చని ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, ఎక్కువ మోతాదుల్లో ద్రవాహారం (మజ్జిగ, కొబ్బరినీళ్లవంటివి), తాజా పండ్లు ఎక్కువగా అవసరం. అయితే బలం పట్టడానికి అంటూ కొందరు పెద్దలు ఎక్కువగా వరి అన్నం, నెయ్యి ఇస్తుంటారు. దీని వల్ల పాలు పడకపోగా... తల్లులు మరింత బరువు పెరుగుతారు. అందుకే అన్నిపోషకాలు సమంగా అందేలా సమతులాహారం ఇవ్వడం మంచిది.పాలుపట్టడం : కొత్తగా తల్లి అయిన మహిళకు మొదటి రెండు వారాల పాటు అనుభవజ్ఞులు అనేక విషయాల్లో సరైన సలహాలు ఇస్తూ, బిడ్డ పెంపకం విషయంలో ప్రోత్సాహం అందిస్తుండటం అవసరం. అయితే ఈ సలహాలు మంచివీ, శాస్త్రీయమైనవీ (సైంటిఫిక్గా ఉండేవి) ఇవ్వాలి తప్ప మూఢవిశ్వాస్వాలతో కూడినవి అయి ఉండకూడదదు. పెరిగే రొమ్ముల పరిమాణం : రొమ్ములో పాలుపడుతూ ఉండటం వల్ల వాటి పరిమాణం పెరగడం కొందరిలో అది మరీ ఇబ్బందిగా పరిణమించవచ్చు. రొమ్ముతో పాలు పట్టడం ఎలా, సీసాతో పాలు పట్టడం ఎలా, సీసాతో పాలు పట్టాల్సివస్తే... సూక్ష్మజీవులన్నీ నశించిపోయేలా బాటిల్స్ను పూర్తిగా స్టెరిలైజ్ చేయడం ఎలా అన్న విషయాలపై మాతృమూర్తికి అవగాహన కల్పించాలి. గర్భం రాకుండా చూసుకోవడం : పాలిచ్చే సమయంలో గర్భం రాదనే అభిప్రాయంతో చాలామంది తల్లులు మామూలుగానే సంసార జీవితంలో పాల్గొంటుంటారు. ఇది కొందరిలో కొంతవరకు వాస్తవమే అయినప్పటికీ... పాలు పడుతున్నప్పుడు సంసారజీవితంలో పాల్గొన్నవారిలో చాలామందికి త్వరగానే మళ్లీ గర్భధారణ జరిగిన ఉదంతాలు లేకపోలేదు. అందుకే బిడ్డకుపాలిచ్చే సమయంలో మళ్లీ వెంటనే గర్భధారణ జరగకుండా చూసుకోవడం మంచిది. ఈ విషయంలో డాక్టర్ సలహా మేరకు కాపర్–టీ, మరీనా వంటి సాధనాలు అమర్చుకోవడం లేదా ప్రతి మూడు నెలలకోమారు తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ వంటి వాటి గురించి తెలుసుకోవడం మంచిది. ప్రసవానంతర బాధలిలా.. నొప్పి : ప్రసవమైన కొందరిలో సాధారణ ప్రసవం కోసం పెట్టే చిన్నపాటి గాటు మానడానికి వేసే కుట్ల వల్లగాని లేదా శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీయడానికి చేసే సిజేరియన్ తర్వాత వేసే కుట్ల వల్ల కొద్దిపాటి నొప్పి ఉండవచ్చు. ఇది తగ్గడానికి అవసరమైన మోతాదుల్లో నొప్పి నివారణ మందులు ఇస్తారు. లేదా అక్కడ చన్నీళ్ల కాపడం పెడతారు. ఈ నొప్పి కనీసం దాదాపు వారంపాటు ఉంటుంది. ఒకవేళ వారం తర్వాత కూడా నొప్పి ఉన్నా, లేదా అది పెరుగుతున్నా, వాపు వచ్చినా లేదా ఎర్రగా మారి చీము వంటి స్రావాలు ఏవైనా స్రవిస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మూత్రసంబంధమైన సమస్యలు : ప్రసవం తర్వాత కొందరిలో మూత్రసంబంధ సమస్యలు మామూలే. గర్భధారణ సమయంలో బాగా పెరిగిపోయి ఉన్న పొట్ట... మునపటిలా మామూలు స్థితికి రావాలనే ఉద్దేశంతో చాలామంది తల్లులు మళ్లీ పొట్ట ఉబ్బుతుందనే భయం వల్ల ప్రసవం తర్వాత నీళ్లు ఎక్కువగా తాగరు. దాంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఒక్కోసారి యోని ప్రాంతంలో ఉన్న నొప్పి వల్ల కూడా మూత్రవిసర్జనకు వెళ్లడానికి జంకుతుంటారు. మూత్రం చుక్కలుగా కారడం : కొందరిలో ప్రసవం తర్వాత అక్కడి కండరాలు ఇంకా బలహీనంగానే ఉన్నందున మూత్రాన్ని బిగుతుగా పట్టి ఉంచాల్సిన స్ఫింక్టర్ కండరాలు అలా ఉంచలేకపోవచ్చు. దాంతో కొందరిలో తమ ప్రమేయం లేకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా రాలవచ్చు. దీన్నే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఈ సమస్యను నివారించడానికి తల్లులకు ప్రసవం తర్వాత పెల్విస్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ల గురించి వివరించడం మంచిది. ఇవి పొత్తికడుపు కింది (పెల్విస్) భాగంలోని కండరాలకు శక్తిని చేకూర్చి, మూత్రం చుక్కలుగా రాలే అనర్థాలను నివారిస్తాయి. (Saudi Arabia Sky Stadium: మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియం)బ్లాడర్ కండరాలు బిగుతుగా మారడం : కొందరు తల్లులు బిడ్డకు రొమ్ముపాలు పడుతున్నప్పుడు బ్లాడర్ కండరాలు బిగుతుగా మారే అవకాశముంటుంది. దీంతో పాలు పట్టే సమయంలో తల్లులు నొప్పితో తల్లడిల్లుతుంటారు. ఇలాంటి వారికి కొన్ని నొప్పినివారణ మందులు, మజిల్ రిలాక్సెంట్స్ వాడాల్సి రావచ్చు.మలవిసర్జనకు సంబంధించిన సమస్యలు : ప్రసవం తర్వాత చాలామంది తల్లుల్లో మలబద్దకం అన్నది చాలా సాధారణమైన సమస్య. పైగా మన వద్ద పాటించే కొన్ని సంప్రదాయాలు, మూఢనమ్మకాల కారణంగా తల్లులకు తాజా పండ్లు, కూరగాయలు ఇవ్వరు. దాంతో వాళ్లకు తగినన్ని పీచుపదార్థాలు అందక మలబద్ధకం రావచ్చు. ఫలితంగా కొందరిలో మొలల వంటి దుష్పరిణామాలకూ అవకాశముంది. రొమ్ము సమస్యలు : ప్రసవం తర్వాత కొంతమంది తల్లుల్లో రొమ్ము నుంచి పాలు బయటికి రాక ఇబ్బంది కలగవచ్చు. ఇలాంటి సమస్యను చన్నీళ్ల కాపడంతో సరిదిద్దవచ్చు. అయితే కొందరిలో రొమ్ము భాగంలో స్టెఫలోకోకస్ ఆరెశ్యాండ్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. సాధారణ యాంటీబయాటిక్స్తో ఆ సమస్యను నయం చేయవచ్చు. ఇక తరచూ కొందరిలో పాలిచ్చే భాగంలో చిన్నపాటి చీలికలు కనిపించ వచ్చు. ఇలాంటి సమస్య కనిపిస్తే డాక్టర్ను సంప్రదించాలి. (బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!)వెన్నునొప్పి: గర్భవతిగా ఉన్నప్పుడు పెరుగుతున్న పొట్టబరువు వెన్నుపై పడుతుండటం వల్ల గర్భవతుల్లో వెన్ను నొప్పి రావడం చాలా సాధారణం. అయితే ప్రసవం తర్వాత పాలిచ్చే సమయంలో సరైన భంగిమ పాటించకపోవడం వల్ల అదే తరహా వెన్నునొప్పి కనిపించవచ్చు. కొన్ని సాధారణ ఫిజియో వ్యాయామాలతో ఈ నొప్పి తగ్గుతుంది. ఇలాంటి అనేక జాగ్రత్తలతో కొత్తగా తల్లి అయిన మహిళ చాలా సులభంగా ప్రసవానంతర (పోస్ట్ పార్టమ్) పరిణామాలనూ, సమస్యలనూ అధిగమించి పూర్తిగా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చు. -డాక్టర్ విమీ బింద్రా, సీనియర్ గైనకాలజిస్ట్ నిర్వహణ: యాసీన్ -
సన్నజాజిలా స్లిమ్గా అవ్వాలంటే..!
బరువు తగ్గే టాస్క్ని చాలా సింపుల్గా స్మార్ట్గా చేయాలంటే నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఏదో భారంగా కాకుండా చాలా తెలివిగా తింటూ..వేగంగా బరువు తగ్గితే ఆ ఫీలే వేరు. మన సన్నిహితులు, స్నేహితులు హేయ్..! అంతలా ఎలా సన్నగా మారిపోయావు అంటే..పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ టెక్నిక్స్ పాలో అయితే సరి..ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ ఎంతలా బొద్దుగా ఉండేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి అమ్మాయి చాలా సన్నగా నాజుగ్గా అయిపోయింది. మాములు మార్పు కాదు..నమ్మశక్యం కానంత సన్నగా మారింది. అలాగని ఆమె ఏమి షార్ట్కట్స్ ఫాలో అవ్వలేదు. పైగా ఎలాంటి కఠినమైన డైట్, బరువు తగ్గిపోయే మందలు ఉపయోగించలేదు. కాస్త తెలివిగా స్మార్ట్గా తిని జస్ట్ ఆరు నెలల్లో 27 కిలోలు పైనే బరువు తగ్గిందామె. అందుకోసం డెడికేషన్తో దినచర్యను అనుసరిస్తే చాలంటోంది. దాంతోపాటు జంక్ఫుడ్ని పూర్తిగా మానేయకపోయినా..పరిమితం చేస్తే సరిపోతుందంటోంది. పోషకాహారాన్నితీసుకునేలా ప్లాన్ చేస్తే చాలట. అందుకోసం తాను ఎలాంటి టిప్స్ని ఫాలో అయ్యిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సిమర్. నేచురల్గా సన్నగా మారడం కోసం..సంపూర్ణ ఆహారాలు: ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, చేపలు, గుడ్లు వంటి లీన్ ప్రోటీన్లు తీసుకోవాలట. ఇవి కడుపు నిండిన అనుభూతినిచ్చే అధికంగా తినాలనే కోరికను నివారిస్తాయట. మంచి నిద్ర: శరీరం బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అని నొక్కి చెప్పిందామె. భోజనం తర్వాత వాకింగ్: మెరుగైన జీర్ణక్రియ కోసం ప్రతి భోజనం తర్వాత కనీసం పదినిమిషాలు నడవాలని సూచించిందామె. చీట్ మీల్స్: ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటిస్తున్నప్పటికీ..వారాంతాల్లో చీట్మీల్స్ కూడా ఉంటాయని చెప్పింది సిమర్. అయితే దాన్ని సర్దుబాటు చేసుకునే భోజనాన్ని సిద్ధం చేసుకుంటానని అంటోంది. అన్నింట్లకంటే ఏర్పరుచుకున్న టార్గెట్ని బ్రేక్ చేయకుండా..స్థిరంగా సాగితే..సత్వరమే మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది. అలాగే కార్బో హైడ్రేట్స్ కోసం మైదా, బ్రెడ్, ఉడికించిన బియ్యానికి దూరంగా ఉండేదట. అలాగే బయటకు వెళ్తే..కేలరీలు ఉండే పానీయాలను తీసుకుంటుందట. ఎందుకంటే అవి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయట. అంతేగాదు బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడే మరో నాలుగు టెక్నిక్ కూడా చెప్పారామె. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) అవేంటంటే..అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్కృత్రిమ చక్కెరవారానికి మూడు నుంచి నాలుగుసార్లు కోర్ శిక్షణప్రతి రోజు 8 వేలకు పైగా అడుగులు తప్పనిసరి అంటోంది. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి స్మార్ట్ టెక్నిక్స్తో బరువు తగ్గించే జర్నీని తక్షణమే ప్రారంభించండి అంటోంది సిమర్. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్గా రూబీ డైమండ్ నెక్లెస్..) -
రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీ కార్డియాలజిస్ట్ "అనారోగ్యకరమైన ఆఫీస్ స్నాక్స్ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు వైద్యులు. ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి.. యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం. అదేనండి స్టంట్ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్. అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు. Office canteen samosa: ₹20Angioplasty: ₹3 lakhsSamosas per year: 300Years of eating: 15Total samosa cost: ₹90,000You're not saving money on unhealthy food.You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025 వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్లో రోటీన్గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..) -
ప్రసవ వేదన తర్వాత అంతటి వేదన..!
ముద్దుమురిపాలతో మురిపించే ఓ చిన్నారి కొత్త సభ్యుడిగా / సభ్యురాలిలా ఇంట్లోకి రావడం ఎంతో సంతోషదాయకమైన విషయం. అయితే అప్పటివరకూ ప్రసవవేదన అనుభవించిన ఆ తొలిచూలు తల్లుల్లో కొందరికి మాత్రం అదో భయానకమైన అనుభవం. ప్రసవం అయ్యాక కొంతమంది తల్లుల్లో ఆ అనుభవం కొంత కుంగుబాటు (డిప్రెషన్) రూపంలో కనిపిస్తుంది. కొత్తగా అమ్మ అయిన చాలామందిలో కనిపించే ఆ డిప్రెషన్ ప్రభావాలు చాలామందిలో తక్కువగానే ఉన్నా మరికొందరిలో మాత్రం... చిన్నారి పట్ల తల్లి చూపాల్సిన కేర్కు అడ్డంకిగా మారేంత పెద్దవిగానూ ఉండవచ్చు. ఇలా ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ (పీపీడీ) అంటారు. ఒక అంచనా ప్రకారం ప్రసవం తర్వాత తల్లికి డిప్రెషన్ వచ్చే కేసులు చాలావరకు గుర్తింపునకు కూడా నోచుకోకపోవడంతో ఆ తల్లులు తమ వేదనను నిశ్శబ్దంగా అనుభవిస్తూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, పర్యవసానాలూ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. బిడ్డపైనా ప్రభావం... తల్లి తన బిడ్డను దగ్గరికి తీసుకోకపోవడం, తన పాలు పట్టించడానికి సుముఖంగా లేకపోవడం, బిడ్డ పట్ల విముఖతతో సమయానికి పీడియాట్రీషియన్ దగ్గరికి తీసుకెళ్లకపోవడం వంటి అంశాలతో తల్లి తాలూకు డిప్రెషన్ ప్రభావం బిడ్డపైనా పడేందుకు అవకాశం లేకపోలేదు.కొత్తగా పాపాయి పుట్టిన సంతోషం కూడా ఆ తల్లుల్లో కనిపించకుండా చేసే ఈ పోస్ట్పార్టమ్ డిప్రెషన్కు చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు గర్భధారణ ప్రక్రియలో అప్పటివరకు వారు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న సవాళ్లూ, ప్రసవం తర్వాతి ఉద్వేగపూరితమైన వెల్లువ, హార్మోన్లపరంగా దేహంలో వేగంగా జరుగుతున్న మార్పులు, కొన్నిసార్లు వాళ్ల సామాజిక, ఆర్థిక అంశాలూ ఇవన్నీ ‘పోస్ట్పార్టమ్ డిప్రెషన్’కు కారణాలవుతాయి. అయితే అది తమ తప్పు కాదనీ, తమకు తెలియని కారణాల వల్ల అలా జరుగుతోందోని తెలియని తల్లులు అపరాధభావనకు లోనవుతూ మరింతగా కుంగి΄ోతుంటారు.కారణాలు... హార్మోన్ల తగ్గుదల : గర్భధారణ సమయంలో మునపటి కంటే దాదాపు పదింతలు పెరిగిన ఈస్ట్రోజెన్, పప్రొజెస్టెరాన్ హార్మోన్లు ప్రసవం కాగానే ఒకేసారి తగ్గి΄ోవడం. ప్రసవం జరిగిన మూడోరోజుకే అవి పదింతలు (ప్రీ–ప్రెగ్నెన్సీ స్థాయులకు) తగ్గి΄ోవడం ∙ప్రసవం సమయంలోని శారీరక శ్రమ, నిద్రలేమి, భవిష్యత్తులో పేరెంటింగ్ గురించి బెంగ... ఈ అంశాలన్నీ ΄ోస్ట్΄ార్టమ్ డిప్రెషన్కు కారణమవుతాయి.పోస్ట్పార్టమ్ డిప్రెషన్లో రకాలు... తల్లులుఎదుర్కొనే భావోద్వేగాల తీవ్రతలను బట్టి వీటిని ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. 1) పోస్ట్పార్టమ్ బ్లూస్ / బేబీ బ్లూస్ : పోస్ట్పార్టమ్ డిప్రెషన్లో 50% నుంచి 75% వరకు ఈ రకమైనవే ఎక్కువ. ఈ రకం డిప్రెషన్ సాధారణంగా ప్రసవం తర్వాత మొదటివారంలో (మరీ ముఖ్యంగా మొదటిరోజు నుంచి మొదలుకొని నాలుగు రోజుల్లో) కనిపిస్తుంది. మొదట్లో కొత్త తల్లిని బాధించే లక్షణాలు చికిత్స తీసుకోకపోయినప్పటికీ రెండువారాల్లో తగ్గిపోతాయి. తల్లిలో ఈ డిప్రెషన్ కనిపించినప్పుడు భర్త, కుటుంబసభ్యులు సపోర్ట్ ఇస్తే చాలు. 2) పోస్ట్పార్టమ్ డిప్రెషన్ : ఇది మొదటిదానికంటే కాస్త ఎక్కువ తీవ్రతతో కనిపిస్తుంది. మొదటిసారి పోస్ట్పార్టమ్ బ్లూస్ కనిపించిన తల్లికి అటు తర్వాతి ప్రసవాల్లోనూ (దాదాపు 30% కేసుల్లో) ఇది రావచ్చు. సాధారణంగా కొన్ని నెలలు మొదలుకొని, ఏడాది వరకూ లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. కొద్దిపాటి సైకోథెరపీ అవసరమవుతుంది. 3) పోస్ట్పార్టమ్ సైకోసిస్ : పోస్ట్పార్టమ్ డిప్రెషన్లో అత్యంత తీవ్రమైన దశ ఇది. ప్రతి వెయ్యి ప్రసవాల్లో ఒకరిలో కనిపిస్తుంది. ఇది కూడా కొన్ని నెలలు మొదలుకొని ఏడాది వరకూ తల్లిలో దీని తాలూకు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. నిద్రలేమి, విపరీతమైన కోపం, అయోమయం లాంటివి అత్యంత తీవ్రంగా ఉంటాయి.చివరగా... కేవలం ప్రసవం తర్వాతనే కాకుండా కొంతమంది మహిళల్లో ప్రసవం ముందు... అంటే గర్భధారణ సమయంలోనూ డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని గమనించిన కుటుంబ సభ్యులు ఫాలో అప్ సమయంలో ఆ విషయాన్ని డాక్టర్కు తెలపాలి. లేదా ఒక్కోసారి పేషెంట్ మాటలను బట్టి డాక్టర్లే ఆ విషయాన్ని పసిగడతారు. అలాంటప్పుడపు అవసరాన్ని బట్టి ఆ పేషెంట్కు సైకియాట్రీ చికిత్స లేదా కౌన్సెలింగ్ను డాక్టర్లు సూచిస్తారు. లక్షణాలు... పై మూడు రకాల డిప్రెషన్లలోనూ కొత్త తల్లి కనబరిచే లక్షణాలు స్వల్పమైనవిగా మొదలుకొని, రకాన్ని బట్టి ఓ మోస్తరు నుంచి చాలా తీవ్రంగా కూడా ఉండవచ్చు. అవి... కారణం లేకుండానే తీవ్రమైన దుఃఖం, చాలా ఎక్కువగా ఏడ్వటం పాపాయి మీద ఏమాత్రం ఆసక్తికరబరచకపోవడం. (కొన్ని సందర్భాల్లో చిన్నారిపైనా ఉద్రిక్తంగా వ్యవహరించడం, డిప్రెషన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కొందరు పాపాయిపై దాడి చేయడం, గాయపరచడానికి ప్రయత్నించడం) ∙చాలా విచారంగా ఉండటం దేనిపైనా ఆసక్తి లేక΄ోవడం, గతంలో తనకు సంతోషాన్ని ఇచ్చిన వ్యాపకాలపైనా ఆసక్తి ఉండక΄ోవడంఅతి చురుకుగా లేదా అతిగా ఉండే ప్రవర్తన ఆకలి తగ్గడం నిద్రపట్టడంలో ఇబ్బంది / నిద్రలేమి (కొద్దిగా మొదలుకొని తీవ్రంగా) మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం ఎప్పుడూ నిస్పృహతోనూ విచారంగా ఉండటం, అపరాధభావన (గిల్ట్) దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఏకాగ్రత లోపించడం పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న కొందరు ఆత్మహత్యకూ యత్నించడం. నిర్ధారణ... ఈ సమస్య నిర్ధారణకు నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షా లేదు. అయితే బాధితురాలిని క్షుణ్ణంగా పరిశీలించడం, లక్షణాల గురించి బాధితురాలి భర్త, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.చికిత్స... బాధితురాలి సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ప్రధానంగా కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తారు. ఇలాంటి చికిత్సలో కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ లాంటి వారి భూమిక చాలా కీలకం. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారికి తప్పనిసరి అయితే యాంటీ యాంగ్జైటీ మందులు లేదా యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులను సూచిస్తారు. ఎంతకీ తగ్గనంత తీవ్రత ఉన్నప్పుడు కొందరికి ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ) అని పిలిచే షాక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అయితే కొందరు సాధారణ ప్రజల్లో దీని పట్ల అ΄ోహలు ఉన్నప్పటికీ ఇది ఏమాత్రం హాని కలిగించనిదీ, చాలా సురక్షితమైనదని అందరూ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరముంది. (చదవండి: నవ్విస్తూ కొనేలా చేశాడు!'యాడ్ గురు'..) -
డయాబెటిస్ని తిప్పికొట్టి.. 30 కిలోల బరువు తగ్గింది!
బరువు తగ్గడం అందరూ చాలా కష్టమనే భావిస్తారు. ఎందుకంటే అంత ఈజీగా కొలెస్ట్రాల్ని తగ్గించుకుని స్లిమ్గా మారడం సాధ్యం కాదు. కానీ ఈ అమ్మాయి అధిక బరువుతో మధుమేహం బారినపడ్డప్పటికీ అధైర్యపడకుండా బరువు తగ్గింది. డయాబెటిస్ నుంచి కూడా బయటపడింది. అలాగని కఠినమైన ఆహారనియమాలేం పాటించలేదు, చిన్ని చిన్న ఆహారపు అలవాట్లతోనే ఇదంతా సాధ్యం చేసిందామె. మరి అదెలాగో ఆమె మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!.డైటీషియన్ జాకీ(Dietitian Jackie) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలా రాశారు. తనకు 20 ఏళ్ల వయసులో ఉండగా ప్రీ డయాబెటిక్(pre-diabetic) నిర్థారణ అయ్యిందని తెలిపింది. దాంతో ఇక ఇప్పుడైనా ఆరోగ్యంపై దృష్టిసారించక తప్పదని ఫిక్స్ అయ్యానని చెప్పింది. అదీగాక పేరెంట్స్ కూడా బరువు తగ్గేలా ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోమని సూచించడంతో..తన ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. 30 కిలోలు ఎలా తగ్గిందంటే..సరైన ఆహారం: తన డైట్లో మంచి పుడ్ని తీసుకునేలా పోషకాహార నిపుణుడి సలహాలను తీసుకున్నట్లు తెలిపారు. నారింజ రసం వంటి చక్కెర పానీయాలను, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలను దూరంగా ఉంచి, గోధుమ రొట్టెలను ఆహారంలో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించి, పోషకవంతమైన ఆహారాన్ని ఎక్కువగా తినేలా చూసుకునేదట.ఫుడ్ తయారైన విధానం: వ్యాయామాలు చేసినంత మాత్రమే బరువు తగ్గరు. తీసుకునే అల్పాహారం, ఆరోగ్యకరమైనదా లేదా అని నిర్థారించుకునేదట. ముఖ్యంగా పోషకాహారం ఎంత మేర ఉందో తెలసుకుని మరి తీసుకునేదట. అలానే సమతుల్య ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. వ్యాయామం..చిన్న వామ్-అప్ వ్యాయామాలతో మొదలు పెట్టి..ట్రెడ్మిల్, ఆరు నుంచి ఏడు మైళ్లు పరుగుపెట్టడం వంటి వ్యాయామాలని పట్టుదలతో చేసి లక్ష్యానికి చేరుకున్నట్లు తెలిపారామె. అలా బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్ని క్యూర్ చేసుకున్నట్లు కూడా వివరించింది. అయితే తనకు వెయిట్లాస్ అవ్వడం కష్టమైన పని కాదని, అదొక నిర్వహణ దశ అని అంటోందామె. ఇప్పటికీ తాను ఆ అలవాట్లను కొనసాగిస్తున్నట్లు వివరించింది. తగ్గిన ఆ బరువుని నిర్వహిస్తే హెల్దీగా ఉంటామని..కేవలం జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలని చెబుతోంది డైటీషియన్ జాకీ. (చదవండి: Idli For Breakfast: ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?) View this post on Instagram A post shared by Jackie, MS, RD | Weight Loss Coach & Mindful Eating Dietitian (@the.mindful.nutritionist) -
ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?
ఇడ్లీ అనేది చాలా మంది భారతీయులకు అలవాటైన అల్పాహారం. దక్షిణాదిలో అయితే ఇడ్లీ ఇంటింటి వంటగానే చెప్పొచ్చు. అల్పాహారానికి అసలైన అర్ధంలా తేలికగా అనిపించడంతో పాటు ఇంట్లోనే ఇడ్లీని సులభంగా రుచిగా తయారు చేసుకోగలిగే వీలు దీని ప్రాధాన్యాన్ని పెంచుతోంది.అంతేకాక ఇది అన్నిరకాల జీవనశైలికి అనుకూలంగా ఉంటుంది. మరి ప్రతి రోజూ ఉదయం ఇడ్లీ తినడం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? దీని గురించి పోషకాహార నిపుణులు ఏమంటున్నారు..?జీర్ణక్రియకు మేలు..ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహారాలు మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, ఇది సజావుగా జీర్ణక్రియ జరిగేందుకు దారితీస్తుంది. ఇది ఆవిరిలో ఉడికించబడి ఉంటుంది కాబట్టి విచ్ఛిన్నం కావడం సులభం అందువల్ల దానిని ప్రాసెస్ చేయడానికి మన కడుపు అతిగా కష్టపడాల్సిన అవసరం రాదు. ఇది ఆమ్లత్వం, బరువు లేదా తరచుగా కడుపు ఉబ్బరంతో పోరాడుతున్న వారికి మేలైన ఎంపికగా ఉంటుంది. సాంబారుతో తినడం వల్ల ప్రేవుల ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఫైబర్ను కూడా జోడించినట్టు అవుతుంది.దీర్ఘకాల శక్తిఇడ్లీలో సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి శక్తిని నెమ్మదిగా దశలవారీగా విడుదల చేస్తాయి, దాంతో ఎక్కువసేపు మనల్ని చురుగ్గా ఉంచుతాయి. ఇది ఆకస్మిక ఆకలి పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది బిజీగా ఉండే ఉదయం సమయంలో పనులపై దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. ప్రోటీన్ కూరగాయలతో జత చేసినప్పుడు, ఇడ్లీ తినే ఆలోచనను నియంత్రించే సమతుల్య ప్రారంభాన్ని అందిస్తుంది. స్థిరమైన శక్తి విడుదల తో మధ్యాహ్నం పూట స్నాక్స్గా జంక్ ఫుడ్ తీసుకునే అవసరాన్ని నివారిస్తుంది.గుండె ఆరోగ్యానికి మద్దతుఇడ్లీని ఆవిరిలో ఉడికించినందున, సహజంగానే కొవ్వు తక్కువగా ఉంటుంది గుండెపై భారం కలిగించే అదనపు నూనె లేకుండా ఉంటుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2018లో జరిపిన ఒక అధ్యయనంలో అధిక కొవ్వు గల బ్రేక్ఫాస్ట్లను తక్కువ కొవ్వు ఎంపికలతో భర్తీ చేయడం గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుందని కనుగొంది. ఇడ్లీని సాంబార్తో జత చేసినప్పుడు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లు గుండె పనితీరును మెరుగ్గా నిర్వహించడానికి మరింత సహాయపడతాయి.అధిక బరువుకు చెక్...ఒక మీడియం ఇడ్లీలో దాదాపు 35 నుంచి 50 కేలరీలు ఉంటాయి, అందుకే ఇది తక్కువ కేలరీలు కోరుకునేవారికి సరైన అల్పాహారం ఎంపికగా మారుతుంది. దీని తేలికపాటి రూపం.. కడుపును మాత్రం నిండుగా ఉంచుతుంది. ఇడ్లీని సాంబార్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీతో కలిపినప్పుడు, రుచితో పాటు సంతృప్తి స్థాయి పెరుగుతుంది ఆకలి తగ్గుతుందిరోగనిరోధక శక్తిపులియబెట్టిన ఆహారాలు పేగుకు మేలు చేస్తాయని అంటారు పేగు ఆరోగ్యం రోగనిరోధక శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇడ్లీ జీర్ణం కావడం సులభం పేగు బాక్టీరియా వృద్ధికి అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మెరుగైన మొత్తం శ్రేయస్సు, మెరుగైన పోషక శోషణ బలమైన సహజ రక్షణ వ్యవస్థకు దారితీస్తుంది. సమతుల్య ఉదరం ప్రశాంతమైన మానసిక స్థితి, కాంతివంతమైన చర్మం రోగనిరోధక శక్తిని అందిస్తుంది.ఇడ్లీ కొంత ప్రోటీన్ కలిగి ఉంటుంది, కానీ సాంబార్, వేరుశెనగ వంటి పప్పులతో కూడిన చట్నీలు జోడించడం వల్ల ప్రోటీన్ పరిమాణం మరింత పెరుగుతుంది.బియ్యంతో తయారైన ఇడ్లీ పులియబెట్టినది కావడం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది, అదే సమయంలో రవ్వ ఇడ్లీ తక్కువ ప్రోబయోటిక్ ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి సాంబార్ ఫైబర్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీలతో దీన్ని జత చేయడం మేలు.మరిన్ని పోషకాల కోసం రాగులు, ఓట్స్ లేదా మల్టీగ్రెయిన్ ఇడ్లీ పిండిని కూడా ప్రయత్నించవచ్చు.(చదవండి: Young Talent: వయసు 19 భాషలు 400..! జస్ట్ ఒక్క గంటలో 20 భాషల్లో..) -
శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..
వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్నెస్తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!. కానీ ఈ శతాధిక వృద్ధుడు ఇప్పటికీ అదే ఫిట్నెస్తో ఉండటమే కాదు..వందేళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు యువకుడిగా ఉండగా ఆర్మీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు పాత్రను పోషించి అజేయమైన ధైర్య సాహాసాలు కనబర్చాడు. పైగా ఈ వయసులో కూడా హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ.. ఫిట్నెస్ టిప్స్ కూడా చెబుతున్నారు. చెప్పాలంటే తరతరాలకు ఆయనొక స్ఫూర్తి..ఆయనే అమెరికాకు చెందిన అత్యంత వృద్ధ బాడీబిల్డర్ ఆండీ బోస్టింటో. ఆయన బాడీబిల్డింగ్లో ప్రపంచ ఛాంపియన్ కూడా. అంతేగాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు అంతర్జాతీయ రోల్ మోడల్. ఇటీవలే వందేళ్ల వయసులో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని అరుదైన ఘనతను సృష్టించాడు. ఈ వయసులో కాలు కదిపేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఆయన బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అంతేగాదు ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్ రెండో ప్రపంచ యుద్ధంలో 101వ రెజిమెంట్గా అసామాన్య పరాక్రమాన్ని చూపించినందుకు గానూ ఆండీని కాంస్య నక్షత్రంతో గౌరవించింది.బాల్యం మొదలైంది అలా..ప్రపంచ ప్రఖ్యాత బాడీబిల్డర్గా పేరుగాంచిన ఆండీ ప్రస్థానం న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది. 1925 జనవరి 11న ఇటాలియన్ కుటుంబంలో జన్మించిన అతను తల్లి, సోదరడుతో కలిసి పెరిగాడు. క్రిస్మెస్ చెట్టు బహుమతులిస్తుందని అమాయకంగా నమ్మిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ..తన ఆశను ఒమ్ము చేయకుండా విశాల హృదయంతో పొరుగింటివారు తనకందించిన బహుమతులను మర్చిపోనంటాడు. అదే తనకు దాతృత్వం విలువను నేర్పించిందని చెబుతుంటాడు. ఇక ఆండీకి చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల మక్కువ ఎక్కువ. 12 ఏళ్లకే అందులో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 16 ఏళ్లకు బాడీబిల్డింగ్ మ్యాగ్జైన్ల కోసం ఫోటోలు తీయబడ్డాడు కూడా. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసి..తిరస్కరణకు గురయ్యాడు. చివరికి పట్టుదలతో తనకిష్టమైన రంగంలో చేరి అక్కడి అధికారులచే ప్రశంసలందుకున్నాడు. అయితే తనకిష్టమైన బాడీబిల్డింగ్ని మాత్రం వదులుకోలేదాయన. అలా 1977లో సీనియర్ మిస్టర్ అమెరికా టైటిల్ను అందుకున్నాడు. ఆ తర్వాత తన భార్య ఫ్రాన్సిస్తో కలిసి నేషనల్ జిమ్ అసోసియేషన్ను స్థాపించాడు. అక్కడ హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుంటాడు ఆండీ. ఆండి యువతరానికి ఇచ్చే సలహా..దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఫిట్నెస్ ఔత్సాహికులను తన అనుభవాన్ని షేర్ చేయడమే గాక సలహాలు సూచనలు షేర్ చేసుకుంటుంటారు. అందులో కొన్ని..శారీరక శిక్షణలాంటిది మానసికంగా సిద్ధంకావడం. ఇది మన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కాదు మన సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అవసరం అనుకుంటే సర్దబాటుని కూడా స్వీకరించండిఇక్కడ ఆండీ రెండు ప్రపంచయుద్ధం కాలికి గాయం, స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆండీ తన పరిమితులపై ఫోకస్ పెట్టకుండా కేవలం శిక్షణపైనే దృష్టి పెట్టి తన సామార్థ్యానికి అనుగుణంగా మార్చుకుంటానని చెబుతున్నాడు. అన్నింట్లకంటే అప్లికబుల్ లేదా పాటించటం అనేది అత్యంత కీలకం. ఇంట్లో లేదా జిమ్లో అయినా.. సరైన టెక్నీక్స్ పాటించాలి. అప్పుడే సత్ఫలితాలు అందుకోగలరని చెబుతున్నారు ఆండీ బోస్టింటో. (చదవండి: weight loss journey: 15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..) -
దీపావళి జోష్..తర్వాత రోజు తలెత్తే హ్యాంగోవర్ని హ్యాండిల్ చేద్దాం ఇలా..!
దీపావళి వేడుకలతో రాత్రంతా ఆహ్లాదంగా ఆడిపాడి గడుపుతారు అందరు. ముఖ్యంగా ఈ వేడుక పుణ్యామా అని రకరకాల స్వీట్లు, విందులతో పొట్టపగిలేలా ఆరగించేస్తాం. మరోవైపు బంధు మిత్రులతో కలిసి టపాసులు కాల్చి..ఆడిపాడి ఎప్పుడో పడుకుంటాం. పొద్దున లేచాక..ఏదో నిద్ర లేనట్లుగా పొట్టంతా ఉబ్బరంగా, ఒకటే తలనొప్పిగా భారంగా ఉంటుంది. శరీరమంతా ఏదో తెలియని బరువులా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పండుగ హ్యాంగోవర్తో ఇబ్బంది పడుతుంటాం. నార్మల్ స్థితికి వచ్చి యథావిధిగా యాక్టివ్గా ఉండాలంటే ఈ నేచురల్ పానీయమే మేలంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత ఉత్సాహంగా ఉండటానికి ఇది అల్టిమేట్ రికవరీ పానీయంగా చెబుతున్నారు. మరి అదెంటో చూసేద్దామా..!.హ్యాంగోవర్ ఎందుకు వస్తుందంటే..దీపావలి పండుగ పేరుతో అతిగా తిని, బాగా ఎంజాయ్ చేస్తాం. పైగా శరీరం అలిసిపోతున్న బంధు మిత్రులను చూసి ఎక్కడలేని ఉత్సాహాన్ని కొనితెచ్చుకుంటాం. దాంతో మరుసటి రోజు డీహైడ్రేషన్కి గురయ్యే నీరసంతో విలవిలాడుతుంటాం. దీన్నే దీపావళి హ్యాంగోవర్ లేదా పండుగ హ్యాంగోవర్ అంటారు. దీన్నుంచి తక్షణమే రీలిఫ్ ఇచ్చే అద్భుత పానీయం నిమ్మ కొబ్బరి నీరు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సహజసిద్ధమైన డిటాక్స్లా పనిచేస్తుందట. ఏవిధంగా అంటే..రీహైడ్రేట్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేస్తుందట. అలాగే కొబ్బరి నీరులో 94% నీరు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనికి నిమ్మకాయను జోడించడంతో రుచిపెరగడమే కాకుండా ఖనిజ శోషణ కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ప్రేగుకి ఉపశమనం అందించి, జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. కొబ్బరినీళ్లల్లో ఉండే మెగ్నీషియం జీర్ణకండరాలను సడలించి.. ఆమ్లత్వం, మలబద్ధకం, అసౌకర్యాన్ని నివారిస్తుంది. అలాగే జలుబు, అలసట వంటి వాటిని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని అందించి..యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ వంటి వాటిని అందించి శరీరం తక్షణమే కోలుకునేలా చేస్తుంది. వేయించి పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే పేగువాపుని తగ్గిస్తుందట. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చూస్తుందట. దీంతోపాటు చర్మాన్ని గ్లో అప్ చేసి, హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుందట. ఈ నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుందట. అలాగే కొబ్బరిలో ఉండే సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందించి, ఆకస్మికంగా చక్కెర లెవల్స్ పడిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులుతయారీ విధానం:ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలంటే..కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీరు (240 మి.లీ)2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం 1 టీస్పూన్ తేనె లేదా బెల్లం సిరప్చిటికెడు నల్ల ఉప్పు లేదా కొన్ని పుదీనా ఆకులు తయారీ: కొబ్బరి నీటిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్, పుదీనా రెమ్మతో సర్వ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల కోసం 1/2 టీస్పూన్ తురిమిన అల్లం కూడా జోడించొచ్చు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందులు వాడాల్సిందేనా..?
నా వయసు 32 సంవత్సరాలు. నేను ప్రస్తుతం గర్భం కోసం ప్లాన్ చేస్తున్నాను. డాక్టర్ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు వాడమన్నారు. ఇవి నిజంగా అవసరమా? ఎప్పుడు మొదలు పెట్టాలి? దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?– దీప్తి, హైదరాబాద్ . గర్భం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి మహిళ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. గర్భధారణ మొదటి కొన్ని వారాల్లోనే బిడ్డ మెదడు, వెన్నెముక వంటి ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే, బిడ్డలో ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్’ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వెన్నెముక లేదా మెదడు అభివృద్ధి సరిగా జరగకపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. గర్భధారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ లోపాలను చాలా వరకు నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ గ్రూపుకు చెందిన నీటిలో కరిగే విటమిన్లు. సాధారణంగా శరీరానికి అవసరమైన మోతాదులో తీసుకోవడం పూర్తిగా సురక్షితం. అదనంగా తీసుకున్న ఫోలిక్ యాసిడ్ శరీరంలో నిల్వ కాకుండా మూత్రం ద్వారా బయటకు వెళుతుంది కాబట్టి, ఎక్కువ మోతాదులో తీసుకున్నా హానికరం కాదు. రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ గర్భధారణకు ముందు నుంచే మొదలు పెట్టి, గర్భం వచ్చిన తర్వాత కనీసం మొదటి మూడు నెలలు వాడటం ఉత్తమం. ఫోలిక్ యాసిడ్తో పాటు ఐరన్ , విటమిన్ బి12, విటమిన్ డీ, క్యాల్షియం వంటి పోషకాలు కలిగిన మల్టీవిటమిన్ మాత్రలు కూడా వాడితే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఇవి సాధారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఇవ్వవు. కొందరికి స్వల్పంగా వాంతులు లేదా మలబద్ధకం అనిపించవచ్చు, అలాంటప్పుడు వైద్యుడి సలహాతో మాత్రలను మార్చుకోవచ్చు. మొత్తానికి, మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ వాడడం ప్రారంభించండి.నా వయసు 38 సంవత్సరాలు. ఇటీవలి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా వింటున్నాను. ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు?– శ్వేత, విజయనగరం. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్. బ్రెస్ట్ కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ట్యూమర్ ఏర్పడుతుంది. ఇది చికిత్స చేయకపోతే ఇతర అవయవాలకు వ్యాపించవచ్చు. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు, అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. దీని లక్ష్యం మహిళల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడం. వయసు పెరగడం, వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, అధిక బరువు, శారీరక వ్యాయామం తగ్గడం, మద్యం సేవించడం, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తల్లి, అక్క, చెల్లెలు లేదా పిన్ని వంటి బంధువులలో ఎవరికైనా బ్రెస్ట్ లేదా ఓవరీ క్యాన్సర్ ఉన్నట్లయితే, మీకు కూడా ఆ ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వైద్యుల సూచనతో హెరిడిటరీ జీన్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇవి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి మహిళా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. మొదట అల్ట్రాసౌండ్, తర్వాత మామోగ్రఫీ చేయించడం ఉత్తమం. ఇంట్లో నెలకు ఒకసారి స్వయంగా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే బ్రెస్ట్లో ఏదైనా గడ్డ, చర్మం మార్పు, నిపుల్ నుంచి స్రావం, నొప్పి లాంటివి ఉన్నాయా అని గమనించడం. ఏ మార్పు గమనించినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్ లేదా సర్జన్ను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామం, బరువు నియంత్రణ, ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, పాలిచ్చే తల్లిగా ఉండటం. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముందస్తు జాగ్రత్తలే ఆరోగ్యానికి ఉత్తమ రక్షణ.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!) -
చిమ్మ చీకటిలో ఢిల్లీ..!
చీకటి.. ఢిల్లీ నగరానికి బాగా అలవాటైపోయింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఢిల్లీలో ‘చీకటి’ని తగ్గించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. దీనికి కారణం గాలి కాలుష్య తీవ్రత అదుపులో లేకపోవడమే. దాంతో మరొకసారి ఢిల్లీని చిమ్మ చీకటి అల్లేసింది. దీపాల పండుగ దీపావళి రాకముందే దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి దిజారిపోవడంలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) వ్యాప్తంగా వాయు కాలుష్యం 'చాలా ప్రమాదకరం' కేటగిరీకి చేరింది. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాయు కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దానిని ‘చాలా ప్రమాదకరం’గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 మార్కును దాటేసింది. ఘజియాబాద్లోని లోనిలో అత్యధికంగా 339గా నమోదయ్యింది. నోయిడా సెక్టార్ 125లో 358కి చేరింది. అలాగే ఆనంద్ విహార్ (335), వజీర్పూర్ (337) ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) తొలి దశను అమలులోకి తెచ్చారు. ఈ దశలో నిర్మాణ, కూల్చివేతల పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం లాంటి ఆంక్షలు విధించారు. కాలుష్యం మరింత పెరిగిన పక్షంలో రెండో దశ కింద అధికారులు మరిన్ని కఠినమైన చర్యలను చేపట్టనున్నారు.#WATCH | Delhi | The Air Quality Index (AQI) around Akshardham was recorded at 369 this morning, in the 'Very Poor' category in Delhi as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/aPVJ2SZ9ID— ANI (@ANI) October 17, 2025 ఓజోన్, పీఎం10 రేణువుల సాంద్రత వాతావరణంలో పెరగడమే ఈ కాలుష్యానికి ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. గాలి వేగం తక్కువగా ఉండటానికి తోడు ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని వారు చెబుతున్నారు. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం వల్ల చిన్నారులు, వృద్ధులతో పాటు శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్రమైన ఆనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదని, ఒకవేళ తప్పని సరిగా వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాలని చెబుతున్నారు. -
ఆయుష్మాన్ భవ.. ! కాలుష్యాన్ని జయిస్తున్న జీవన విధానం..
ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. కల్తీ ఆహారం.. అనారోగ్య కారకాలు వంటివి మనిషి సగటు జీవన ప్రమాణాలను ఆయుర్దాయాన్ని దెబ్బతీస్తున్నాయి.. మరోవైపు ఆశ్చర్యకరమైన ఫలితాలను అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే దీనికీ ఓ లెక్కుందండోయ్..? అదే ఆరోగ్యకరమైన జీవన విధానం.. అందుకు కావాల్సిన సౌకర్యాలు.. ప్రామాణికాలు.. గతంతో పోలిస్తే మెట్రో నగరాల్లో పలు వనరులు కాలుష్యానికి గురైనా.. మరోవైపు ప్రజల్లో పెరిగిన అవగాహన, విజ్ఞానం, వైద్య సౌకర్యాలు వాటిని అధిగమిస్తూ కొత్త అడుగులు వేయిస్తున్నాయి. ఫలితంగా మానవుని ఆయుఃప్రమాణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. హైదరాబాద్తోపాటు దేశంలోని పదికి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి పెరుగుతూనే ఉన్నాయి. ఇది 3 నుంచి 4 శాతం సగటును నమోదు చేసుకుంటున్నాయి. అయితే అదే సమయంలో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన సగటున ఆయుర్దాయాన్ని(Life Expectancy)పెంచడానికి దోహదం చేస్తున్నాయని, దీని వల్ల నగరాల్లో జీవన కాలాన్ని సగటున 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచిందని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ వంటి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ అధ్యయన ఫలితాలు మాత్రం ఇది వాస్తవమని చెబుతున్నాయి. పూర్తి భిన్నంగా.. మహానగరాలు గాలి, నీరు, ఆహారం, శబ్ద కాలుష్యంతో నిండిపోయాయి. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే నగర ప్రజల ఆయుః ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధనలే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజా అధ్యయనాలు పరిశోధకులను, ఆరోగ్య నిపుణులను విస్తుపోయేలా చేస్తున్నాయి. పట్టణాల కంటే మెరుగైన వాతావరణ పరిస్థితులు పల్లెల్లో ఉంటాయనేది అందరికీ తెలిసిన వాస్తవం.. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ.. ఈ ఫలితాలు ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.. అయితే ఫలితాలు చెప్పే వాస్తవాలను ఓ సారి పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న నాణ్యత అవగాహనే కారణమని తెలుస్తోంది. సర్వే చెబుతోన్నదేంటి!? గతేడాది ప్రచురితమైన బీఎమ్సీ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. దేశంలో అధిక ఆదాయం ఉన్న నగర ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రజలకంటే సగటున 7.5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారని తేలి్చంది. మెరుగైన ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యపై పెరుగుతున్న చైతన్యం, ఆరోగ్య బీమా, మెరుతైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలే కారణాలు ఇందుకు కారణాలుగా పరిశోధనలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, వంటి ఇతర సరీ్వస్ రంగాల ఉద్యోగాలు మధ్యతరగతి ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితోపాటు నగరంలో ప్రభుత్వాలు చేపట్టే ‘క్లీన్ ఎయిర్ ప్లాన్’, ‘హరిత హైదరాబాద్’ వంటి ప్రాజెక్టులు కూడా ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నాయని, దీంతో పాటు ప్రజల్లోనూ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరిగిందని, వ్యాయామం, నిద్ర, ఆహార నియమాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. అవగాహన లేమి.. నగరాలతో పోలిస్తే గామీణ ప్రాంతాలు వెనుకబడడానికి అసలు కారణం అవగాహనా లేమి.. మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, ఆదాయ వనరులు, వ్యక్తి శుభ్రత ప్రభావం చూపుతున్నాయని తెలిసింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. సరైన అవగాహన లేక, సదుపాయాలు లేక, ఆయా సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను సరైన సమయంలో గుర్తించక ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని, పల్లెతో పోలిస్తే వైద్యు సేవలు, డిజిటల్ కన్సల్టేషన్, టెక్నాలజీ, టెలీమెడిసిన్, ఫిట్నెస్ సెంటర్లు, యోగా వంటివి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజలకు తెలిసిన వాస్తవ కోణం.. పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డు తాజా గణాంకాల ప్రకారం హైదరాబద్ నగర గాలిలో నాణ్యత ‘మోస్తరు నుంచి హానికర స్థాయికి’ మధ్యలో ఊగిసలాడిందని తెలిపింది. జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, ముసీ నది కాలుష్యానికి గురవుతున్నాయని ఎమ్ఏఎన్యూయూ పరిశోధకులు వెల్లడించారు. పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు, రసాయన అవశేషాల వల్ల భూగర్భజలాలు కూడా కలుషితమౌతున్న విషయం తెలిసిందే. ఆహార విషయంలోనూ హానికర రసాయనాలు నగర మార్కెట్లో మితిమీరిన స్థాయిలో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపింది. వ్యక్తిగత భద్రత ముఖ్యం.. విజ్ఞానం, సాంకేతికత ద్వారా అందే ఫలాలను అందరూ అందుకోగలగాలి. అప్పుడే జీవిత కాలం పెరగడంతో పాటు, ఒక మెరుగైన జీవితాన్ని అనుభవించగలరు. ఇందుకు విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన, పరిసరాల–వ్యక్తిగత పరిశుభ్రత వంటివి చాలా ముఖ్యం.! అందుకే కాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల కంటే గ్రామాల్లో ఆయుఃప్రమాణాలు తక్కువ.! పట్టణాల్లో కాలుష్యం తగ్గించే ప్రయత్నాలతో పాటు, గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే, గ్రామ ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. – డా.ప్రతిభా లక్ష్మి, జనరల్ మెడిసిన్ – ప్రొఫెసర్ -
ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..
చలం, అంబేద్కర్ల నుంచి నటి, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) జెండర్ ఈక్వాలిటీకి ఈ దేశపు రాయబారి కృతిసనన్ దాకా అందరి మాటా ఒకటే స్త్రీ ఆరోగ్యమే దేశ భవిష్యత్ భాగ్యం అని!నిజానికి మహిళా ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేక సందర్భం అక్కర్లేదు.. అయినా ఈ ప్రస్తావనకు ప్రత్యేక సందర్భమూ ఉంది. అదే బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025. ఇందులో ఆమె మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఇలా వరల్డ్ హెల్త్ సమ్మిట్లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కీర్తి గడించారు. ఆ ప్రసంగంలో కీర్తి సనన్ ఏం మాట్లాడారంటే.. ‘మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన లేదా పక్కన పెట్టాల్సిన విషయం కాదు. తక్షణమే దృష్టిపెట్టాల్సిన అత్యంత అవసరమైన అంశం. ఆమె ఆరోగ్యం.. మానవాళి ప్రగతికి, భవిష్యత్కు మూలస్తంభం. అందుకే మహిళా ఆరోగ్యానికి సంబంధించి సుస్థిరమైన పెట్టుబడులు కావాలి. ఆవిష్కరణలు జరగాలి. ఇందుకోసం చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ఆర్థిక, సామాజిక మార్పులుగా ప్రతిఫలిస్తుంది. ఏటా ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందల కోట్ల రాబడి కనిపిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది రెట్ల లాభం. ఈ ఇన్వెస్ట్మెంట్ నైతికావసరమే కాదు మన మూకుమ్మడి భవిష్యత్కు భరోసా కూడా! ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం.. ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థికసుస్థిరతకు చిహ్నం. కానీ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళల ఆరోగ్యం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. యూఎన్ఎఫ్పీఏ జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్గా చాలా ప్రాంతాలు తిరిగాను. అవన్నీ కూడా బాల్యవివాహాలకు సాక్ష్యంగా కనపడ్డాయి. అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి కనీసం శారీరక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నాయి. వీళ్ల జీవితాలు మారాలంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించి దృష్టి పెరగాలి. తక్షణమే ఆ దిశగా కార్యాచరణ నిర్ణయాలు జరగాలి’ అన్నారు కృతిసనన్. (చదవండి: 'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
Anesthesiologist: తెర వెనుక డాక్టర్..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..
పేషెంట్కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయడం వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. శరీరంలోని ప్రతీ అవయవానికి చేసే సర్జరీకి ముందుగా మత్తుమందు(అనస్థీషియా)ఇస్తారు. దీంతో నొప్పి బావన ఉండదు. క్లిష్టమైన, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు అనస్థీషియా నిపుణులు చేస్తున్న సేవలు అత్యంత ముఖ్యమైనవి. తెరవెనుక డాక్టర్ అనస్థీషియా. వీరికోసం ఏటా అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1846 అక్టోబర్ 16న తొలిసారి విలియం టీజీ మోర్టన్ అనే వైద్యుడు ఈథర్ అనస్థీషియాను విజయవంతంగా ప్రదర్శించారు. మత్తుమందు లేని రోజుల్లో.. అనెస్తీషియా అమలులోకి రానిరోజుల్లో పేషెంట్కు శస్త్రచికిత్స చేయాలంటే, మత్తు రావడానికి తలపై గట్టిగా కొట్టడం, పాములతో కరిపించడం, వివిధ రకాల మత్తు పదార్థాలు తినిపించడం, గట్టిగా చేతులతో పట్టుకుని ఆపరేషన్లు చేసేవారని చెబుతున్నారు. అనస్థీషియాను కనిపెట్టాక చిన్న సూదితో శరీరంలో మత్తు ఎక్కించేసి పేషెంట్కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తున్నారు. జీజీహెచ్లో 13 మంది అనస్థీషియాలు.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనస్థీషియాల సహకారంతో ప్రతీనెల వేలాది ఆపరేషన్లు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ సిమ్స్ అనుబంధ జీజీహెచ్లో అనెస్తీషియా విభాగం ప్రత్యేకంగా ఉంది. ఇందులోని ఇద్దరు ప్రొఫెసర్లు, 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఎస్ఆర్ సేవలు అందిస్తున్నారు. పేషెంట్ కోలుకునే వరకు.. పేషెంట్కు మత్తుమందు ఇచ్చేది అనస్థీషియాలే అయినా.. శస్త్రచికిత్స పూర్తయి, కోలుకునే వరకూ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. పేషెంట్ త్వరగా కోలుకున్నాడంటే అందులో అనస్థీషియా పాత్రకీలకంగా ఉంటుంది.వైద్యరంగంలో కీలకం వైద్యరంగంలో అనస్థీషియా చాలా కీలకమైనది. ప్రస్తుత వైద్య విధానంలో మత్తుమందు లేకపోతే అనే ఊహనే కష్టంగా ఉంటుంది. మత్తుమందు అందుబాటులోకి రావడంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.– దండె రాజు, ఆర్ఎంవో, జీజీహెచ్ తెరవెనుక వైద్యుడు తెరవెనుక వైద్యుడు అనస్థీషియా. ఆపరేషన్ చేయడానికి సర్జన్తోపాటు అనస్థీషియా కూడా కీలకమే. పేషెంట్ కోలుకునే వరకు పర్యవేక్షిస్తుంటాడు. జీజీహెచ్లో చాలా హైరిస్క్ కేసులు కూడా అనెస్తీషియాల సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం. – అరుణ, గైనిక్ హెచ్వోడీ, జీజీహెచ్(చదవండి: -
World Food Day: టన్నుల ఆహారం చెత్తకుప్పల్లోకి!
గాలి, నీరు తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది ఆహారం. ప్రతి ఒక్కరికీ తగిన ఆహారం తీసుకునే హక్కు ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆహారం, జీవితం, స్వేచ్ఛ, పని, విద్య తదితర హక్కులు ఉండాల్సిందే. వైవిధ్యం, పోషణ, స్థోమత, అందుబాటు, భద్రతతో కూడిన పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలి. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ నిర్వహిస్తోంది.ఎలా మొదలయ్యింది?ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ)1945, అక్టోబర్ 16న స్థాపితమయ్యింది. దీనికి గుర్తుగా ఇదే రోజున ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి తదితర సంస్థలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ ఏడాది జరుపుకునే ప్రపంచ ఆహార దినోత్సవం థీమ్ ‘మెరుగైన ఆహారాలు, మెరుగైన భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం’. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. పేదరికం, యుద్ధ సంఘర్షణలు, వాతావరణ మార్పుల కారణంగా లక్షలాది మంది ఆహార అభద్రతతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఆకలిని అంతం చేయాలనే లక్ష్యంతో ఎఫ్ఏఓ పనిచేస్తోంది.ఆందోళన కలిగిస్తున్న ఆహార వ్యర్థాలుప్రపంచంలో ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో మూడింట ఒక వంతు వృథా అవుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఉత్పత్తయిన ఆహారంలో 19 శాతం వృథా అయినట్లు ఒక నివేదిక తెలిపింది. దీని పరిమాణం 105 కోట్ల టన్నులుగా లెక్కగట్టారు. ప్రతి మనిషి ప్రతి ఏటా 79కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు నివేదిక వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానం అని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2019లో 17శాతం ఉన్న ఆహార వృథా 2021కి వచ్చేసరికి రెండు శాతం పెరిగి 19శాతాని కి చేరినట్లు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆహార వృథా 60 శాతం గృహాల్లో జరుగుతుండగా, హోటళ్లు, ఇతర ఆహార సేవా సంస్థల్లో 28శాతం ఉన్నట్లు తెలిపింది. మిగిలిన 12 శాతం ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తేలింది. భారతదేశంలో ఏటా 68 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఆహార వృథాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి.ఆకలితో కోట్లాదిమంది విలవిలఆహార వృథా పరిస్థితి సంగతి అలా ఉంటే.. నేటికీ కనీసం తీనేందుకు గుప్పెడు అన్నం లేక కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. రోజంతా పస్తులుండే వారు కొందరైతే, ఒక పూట మాత్రమే తినే స్థితిలో అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 78.3కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఓ మోస్తరు ఆకలి బాధను అనుభవిస్తున్నారు. 2022లో 240కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. తెలిపింది. 78.3కోట్ల మంది ఆకలితో అలమటించగా, 14.8కోట్ల మంది పిల్లల్లో పోషహాకార లోపం కనిపించినట్లు తేలింది. తిండి లేక అల్లాడుతున్న ప్రజల్లో 25శాతం ఇండియాలోనే ఉన్నారన్నది గమనార్హం. భారత దేశ జనాభాలో 14.5శాతం మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలో మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని ఐసీఎంఆర్ హెచ్చరించింది.వాతావరణ మార్పులతో కుంగుబాటుప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న వాతావరణ మార్పులు, జీవన ప్రమాణాల కారణంగా క్రమంగా వ్యవపాయ సాగుబడి తగ్గిపోతుంది. పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు పట్టణీకరణ కారణంగా వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం గణనీయంగా కుంచించుకపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆహార వృథాను అరికట్టడం ఎంతో అవసరం. ఇందుకోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలూ బాధ్యతాయుతంగా మెలగాలి. గృహ అవసరాల కోసం సరైన ప్రణాళికతో ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. మరోవైపు ఆహార వ్యర్థాలు వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి. పల్లపు ప్రదేశాలలో ఆహారం కుళ్లిపోవడం కారణంగా గ్రీన్హౌస్ వాయువు మీథేన్ విడుదలవుతుంది. ఇది హానికారకంగా మారుతుంది. ఆకలిని పరిష్కరించడం అంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదని, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు నూతన విధానాలు అవలంబించాలనే విషయాన్ని ప్రపంచ ఆహార దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. -
పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?
శ్రీ మహావిష్ణువు అవతారంగా, దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేద వైద్యానికి ఆది వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన ధన్వంతరి క్షీర సాగర మథన సమయాన ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. చతుర్భుజుడైన ధన్వంతరి నాలుగు చేతులలో శంఖం, చక్రం, జలౌకం (జలగ) అమృత తుల్యమైన పునరుజ్జీవన తేనె భాండం దర్శనమిస్తాయి.ధన్వంతరిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజిస్తున్నప్పటికీ, ధన్వంతరికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. ఆ ఉన్న కొద్ది ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే దర్శనమిస్తాయి ఉత్తర భారతాన న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఒక విగ్రహం, హరిద్వార్లోని ఒక ఆశ్రమంలో మరొక విగ్రహం తప్ప ఉత్తర భారతాన ధన్వంతరికి ఆలయాలంటూ అసలేం లేవనే చెప్పాల్సి ఉంటుంది.రంగనాథస్వామి ఆలయం వద్ద ధన్వంతరి ఆలయంతమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన పురాతన మందిరం ఉంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఆరోగ్యాభిలాషులైన భక్తులకు ‘ప్రసాదం’గా మూలికలను అందిస్తారు.కోయంబత్తూరు శ్రీ ధన్వంతరి ఆలయంకోయంబత్తూరులోని శ్రీ ధన్వంతరి ఆలయం తమిళనాడులోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. కోయంబత్తూరు నగర నడిబొడ్డున ఆర్య వైద్య చికిత్సాలయం, పరిశోధనా సంస్థలో ఉన్న శ్రీ ధన్వంతరి మందిరం, జీవానికి, వైద్యానికి దేవుడు, ధన్వంతరిని ప్రధాన దేవతగా ప్రతిష్టించింది.నెల్లువాయ భగవాన్ ధన్వంతరి ఆలయంగురువాయూర్, త్రిసూర్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయ వద్ద ఉన్న లార్డ్ ధన్వంతరి ఆలయం కేరళలోని ముఖ్యమైన ధన్వంతరి ఆలయాలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు వైద్యం ్ర΄ారంభించే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.మలప్పురంలో రుద్ర ధన్వంతరి ఆలయంమలప్పురంలోని పులమంథోల్ మధ్యలో ఉన్న శ్రీ రుద్ర ధన్వంతరి ఆలయం కేరళలోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ అష్టవైద్య పులమంథోల్ మూస్ కుటుంబానికి చెందినది, అయితే అన్ని వర్ణాలకు చెందిన హిందువులు ఆలయంలో పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంది.శ్రీ ధన్వంతరి ఆలయం, పెరింగవుకేరళలోని త్రిస్సూర్ పట్టణ శివార్లలో ఉన్న మరొక పురాతన ధన్వంతరి ఆలయం పెరింగావులోని శ్రీ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయ గర్భగుడి రెండు అంతస్తులతో గుండ్రని ఆకారంలో నిర్మించబడింది, ఇది ఇతర కేరళ శైలి నిర్మాణ శైలికి భిన్నంగా అరుదైన డిజైన్. గణపతి, లక్ష్మీదేవి, అయ్యప్పన్ ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన ఇతర దేవతలు.వడక్కంచెరి ధన్వంతరి ఆలయంవడక్కంచెరి ఆయుర్వేద ప్రభువుకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్కు ఉత్తరాన 18 కి.మీ దూరంలో వడక్కంచెరి నుండి 8 కి.మీ దూరంలో కున్నంకుళం – వడక్కంచెరి రహదారిపై ఉంది. (అక్టోబర్ 18, శనివారం ధన్వంతరి జయంతి) -
Dharmana: వైద్య రంగంలో వైఎస్ జగన్ చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే
-
ఎస్బీఐ నుంచి కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
బీమా రంగ దిగ్గజం ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ ఫ్లాగ్షిప్ ఆరోగ్య బీమా పథకం హెల్త్ ఆల్ఫాను ఆవిష్కరించింది. జీవన విధానాలు, ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గట్లు 50 పైగా కవరేజీ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. సమ్ ఇన్సూర్డ్ రూ. 5 లక్షల నుంచి ఉంటుంది. దీర్ఘకాలికంగా 5 ఏళ్ల వరకు పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు.క్లెయిమ్స్ చేయకపోతే ఏటా పది రెట్లు క్యుములేటివ్ బోనస్, జిమ్.. స్పోర్ట్స్ గాయాలకు కవరేజీ, కోట్ జనరేట్ చేసిన అయిదు రోజుల్లోగా కొత్త పాలసీని కొనుగోలు చేస్తే 5 శాతం వెల్కం డిస్కౌంటు, డే కేర్ ట్రీట్మెంట్ మొదలైన ఫీచర్లు ఈ పాలసీలో ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణల తర్వాత పరిశ్రమలో తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకం ఇదని సంస్థ డిప్యూటీ సీఈవో మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ తెలిపారు.ప్లాన్ పూర్తి ఫీచర్లు10 రెట్ల వరకు క్యూమ్యులేటివ్ బోనస్: ఇది ఒక అదనపు కవర్. పాలసీ కింద ఏదైనా క్లెయిమ్ చేయకపోతే ప్రతి సంవత్సరం గరిష్ఠంగా 10 రెట్లు క్యూమ్యులేటివ్ బోనస్ అందిస్తుంది.అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్: ఈ పాలసీ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ పరిమితి లేకుండా ఉంటుంది. పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం, ఎంత మొత్తం క్లెయిమ్ అయినా చెల్లిస్తారు.ఎండ్లెస్ సమ్ ఇన్ష్యూర్డ్: ఒకే క్లెయిమ్లో బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ దాటి ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ ప్రయోజనాన్ని పాలసీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వినియోగించవచ్చు.జిమ్ & స్పోర్ట్స్ ఇంజురీ కవర్: ఇది ఇండస్ట్రీలోనే మొదటిసారిగా అందిస్తున్న ప్రత్యేక అదనపు కవర్. హాబీ స్పోర్ట్స్ లేదా డైలీ ఫిట్నెస్ కార్యకలాపాలలో గాయపడిన సందర్భాలలో ఓపీడీ ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, డయాగ్నస్టిక్ పరీక్షలు, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్లు, ఫిజికల్ థెరపీ కవర్ అవుతాయి.ప్లాన్ అహెడ్: ఈ ప్రత్యేక అదనపు ప్రయోజనం వల్ల పాలసీదారు సంపాదించిన వెయిటింగ్ పీరియడ్ కంటిన్యూయిటీని కొత్తగా పెళ్లి అయిన జీవిత భాగస్వామికి (గరిష్ఠంగా 35 ఏళ్ల వయస్సు వరకు), నవజాత శిశువులకు (గరిష్ఠంగా 2 మంది పిల్లలు) వర్తింపజేయవచ్చు. అయితే వారు వివాహం లేదా పుట్టిన తేదీ నుండి 120 రోజులలోపు పాలసీలో చేరాల్సి ఉంటుంది.వెల్కమ్ డిస్కౌంట్: కోటేషన్ రూపొందించిన 5 రోజులలోపుగా పాలసీ కొనుగోలు చేసినట్లయితే 5శాం ప్రత్యేక "వెల్కమ్ డిస్కౌంట్" ఇస్తారు. -
హాస్టళ్లా.. నరక కూపాలా.. పిల్లలకు మురుగు నీరు.. సార్లకు మినరల్ నీరు
-
ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?– మాలిని, గుంటూరు. గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి. హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా? – సుగుణ, మిరియాలగూడ. గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి. మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి. (చదవండి: సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!) -
ఆన్లైన్ ఒత్తిడికి విరుగుడుగా..
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం(అక్టోబర్ 10)ని పురస్కరించుకుని యువజన మీడియా ప్లాట్ఫామ్ ‘యువ’ భాగస్వామ్యంతో ‘స్నాప్ ఇంక్’ ఆధ్వర్యంలో ‘కేర్ నాట్ కంట్రోల్’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సోషల్ మీడియా, అభద్రత, ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం టీనేజర్ల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణలను పెంపొందించడమే ప్రధానంగా దీని ఉద్ధేశ్యమన్నారు. భారతీయ స్నాప్చాటర్ల డిజిటల్ శ్రేయస్సుకు ఇది మద్దతు అందిస్తుందని వివరించారు. ఈ వీడియో ప్రచారం ఈ నెల 10 వరకూ కొనసాగుతుందన్నారు. చిన్నపాటి చిట్కాలు..అలాగే బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడువెంటనే అమ్మకు ఫోన్ చేసి ఆమె గొంతు వినండి... చిన్నప్పుడు అమ్మ పాడే జోలపాట వింటూ హాయిగా నిద్దురలోకి జారినంత తేలిగ్గా మీరు ఒత్తిడి నుంచి బయట పడతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: Custard Apple: సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'! జ్యూస్, ఐస్క్రీమ్స్, స్వీట్స్ నుంచి..) -
సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'
మామిడి, స్ట్రాబెర్రీ ఇలా ఏదైనా కావొచ్చు.. ప్రతి సీజనల్ పండుని పండుగలా ఎలా జరుపుకోవాలో నగరవాసులకు తెలుసు. ప్రస్తుతం సీతాఫల్(కస్టర్డ్ ఆపిల్) సీజన్ ప్రారంభమైంది. దాంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్ డెజర్ట్ మెనూలకు ఈ క్రీమీ ఫ్రూట్ కొత్త రుచులను అద్దుతోంది. సీతాఫలం సీజన్లో నేరుగా పండ్లను తీసుకోవడం మాత్రమే కాకుండా భాగ్యనగరవాసులు దానిని అనేక రూపాల్లో ఆస్వాదిస్తున్నారు. అన్ని పండ్ల మాదిరిగానే సీతాఫల్ జ్యూస్లు సరే.. అయితే.. కూలింగ్ మిల్క్షేక్ల నుంచి రుచికరమైన ఐస్క్రీముల వరకు, స్వీట్లు, పేస్ట్రీలు.. వివిధ రకాల వంటకాలలో ఇవి మేళవించడం విశేషం. వీలైనన్ని రూపాల్లో వెరైటీ డిష్లను తయారు చేసేందుకు ఉపయోగించ గల ఏకైక పండుగా సీతాఫలాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా సీతాఫల్ రబ్డీ అనేది సిటీ రెస్టారెంట్స్లో బాగా ఫేమస్. ఈ నేపథ్యంలో నగరంలో సీతాఫల్ రుచులు అందుబాటులో ఉన్న కొన్ని ప్రదేశాల గురించి.. అబిడ్స్లోని సుల్తాన్ బజార్లో ఉన్న మయూర్ జ్యూస్ సెంటర్ సీతాఫలం రుచులకు ఫేమస్. ముఖ్యంగా నిండుగా గుజ్జుతో ఉన్న సీతాఫల్ జ్యూస్ ఇక్కడ క్రీమీగా రుచికరంగా ఉంటుందనేది ఫ్రూట్ లవర్స్ మాట. సికింద్రాబాద్, బండ్లగూడ, టోలిచౌకిలలో ఉన్న నైస్ జ్యూస్ సెంటర్ కూడా సీతాఫల వెరైటీలకు పేరొందింది. భిన్న రకాల పండ్ల పేరిట మలాయ్లను అందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ సెంటర్ సీతాఫల్ మలైని కూడా అందిస్తోంది.సీతాఫల్.. వైరల్.. ఇటీవలే సీతాఫలం రుచి, దాని ఆకారంలో రుచికరమైన వంటకాన్ని ప్రముఖ భారతీయ పేస్ట్రీ చెఫ్ తేజస్వి చందేలా రూపొందించారు. ఈ వంటకం తయారీ వీడియో ఇన్స్ట్రాగామ్ రీల్ ఆన్లైన్లో అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ విషయంలో తనకు ఫ్రెంచ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ ప్రేరణగా పేర్కొంది. అతడు పండ్లను పోలి ఉండే డెజర్ట్ల తయారీకి ప్రసిద్ధి చెందాడు. పలువురు హోమ్ మేడ్ సీతాఫల్ బర్ఫీ, హల్వా, ఖలాఖండ్ కూడా తయారు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లపై అందిస్తున్నారు. జూబ్లీహిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నేచురల్ ఐస్క్రీమ్స్ కూడా చవులూరించే కస్టర్డ్ యాపిల్ రుచులకు కేరాఫ్. సీజనల్ స్పెషల్ సీతాఫల్ ఐస్ క్రీం ఇక్కడ ఫేమస్. బంజారాహిల్స్లోని రోడ్ నెం.13లో ఉన్న లె టెసోరోలో ఓ ప్రత్యేక సీతాఫల్ రుచి అందుబాటులో ఉంది. సీతాఫల్ సోఫుల్ జార్ పేరిట అందించే ఈ డిసర్ట్.. వావ్ అనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో రోడ్ నం.36లో ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్కి సీతాఫల్ లవర్స్ ఓ రౌండ్ కొట్టొచ్చు. ఇక్కడి కస్టర్డ్ యాపిల్ డిలైట్ కృష్ణపట్నం డిలైట్గా పేరొందింది. కొండాపూర్ లోని తారా– సౌత్ ఇండియన్ కిచెన్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్ని వడ్డిస్తోంది. ఈ సీజన్లో తారాస్ సీతాఫల్ రబ్డీని రుచి చూడటం సిటీలోని ఫుడ్ లవర్స్కి ఓ అలవాటు. బంజారాహిల్స్లో ఉన్న సీతాఫల్ ఫ్రెష్ జ్యూస్ తన పేరులోనే ఈ ఫలాన్ని ఇముడ్చుకోవడంతో పాటు పలు రకాల మిల్క్ షేక్స్లోనూ మేళవిస్తోంది. సీతాఫలాన్ని ఇష్టపడేవారి కోసం మిల్క్ షేక్లతో సహా వివిధ రకాల కస్టర్డ్ యాపిల్ డెజర్ట్లను అందిస్తోంది. -
జీఎస్ఎల్-ఇంపల్స్ భాగస్వామ్యంతో ఉజ్బెకిస్థాన్లో వైద్య విద్య
రాజమండ్రికి చెందిన జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థ ఉజ్బెకిస్థాన్లోని ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్తో కలిసి సంయుక్తంగా వైద్యవిద్య కోర్సు అందిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు పూర్తిగా కట్టుబడుతూ ఇలాంటి కోర్సు చేపట్టడం ఇదే మొట్టమొదటి సారి. ఉజ్బెకిస్థాన్లో వైద్యవిద్య చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఈ భాగస్వామ్యం ఎంతో మేలుచేస్తుంది. దీనివల్ల వారు తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ విజయవంతంగా ప్రాక్టీసు చేయొచ్చు.ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్లోని కోర్సులు ఎన్ఎంసీ మార్గదర్శకాలు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ (ఎస్ఎస్ఎంఎల్ఈ) ప్రమాణాలు రెండింటికీ అనుగుణంగా ఉన్నాయి. కరిక్యులంను భారత్, ఉజ్బెకిస్థాన్లకు చెందిన విద్యారంగ నిపుణులు కలిసి రూపొందించారు. ఇది భారతీయ ఎంబీబీఎస్ సిలబస్, అంతర్జాతీయ వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూ, సీబీఎంఈ (భారత వైద్యకళాశాలల కరిక్యులం)ను పాటిస్తుంది. దీనివల్ల ఇండియా, అమెరికా, ఇంగ్లండ్, లేదా ప్రపంచంలోని మరేదేశంలోనైనా ప్రాక్టీసు చేసుకోవడానికి వీలుగా విదేశాల్లో చదివేందుకు ఇది సరైన ఆప్షన్గా విద్యార్థులకు ఉంటోంది.ఈ సందర్భంగా జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ గోగినేని మాట్లాడుతూ, ‘‘విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించే విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ (ఎఫ్ఎంజీఎల్) 2021 నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఎన్ఎంసీ సూచించింది. ఈ ప్రమాణాలు పాటించని సంస్థల్లో చదివినవారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) లాంటి లైసెన్సింగ్ పరీక్షలకు అర్హులు కారు. ఇందుకు బాధ్యత పూర్తిగా విద్యార్థులదే అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ), ఈసీఎఫ్ఎంజీల నుంచి ఎక్రెడిటేషన్, రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్కు చెందిన విద్య, సైన్స్, ఇన్నోవేషన్ మంత్రిత్వశాఖ నుంచి గుర్తింపు ఉన్న ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్తో చేతులు కలపడం ద్వారా, జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులకు సురక్షితమైన, నమ్మదగిన మార్గాన్ని జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ చూపిస్తోంది’’ అన్నారు.2021 నాటి ఎఫ్ఎంజీఎల్ నిబంధనల ప్రకారం విదేశాల్లో కనీసం 54 నెలల వైద్యవిద్య, 12 నెలల ఇంటర్న్షిప్ ఉండాలి. కొత్త జీఎస్ఎల్ ఇంపల్స్ వైద్యవిద్యలో భాగంగా ఉజ్బెకిస్థాన్లోని 43కు పైగా భాగస్వామ్య ఆస్పత్రులలో 12 నెలల ఇంటర్న్షిప్ కూడా ఉంది. దీంతో విద్యార్థులు రోగులకు చికిత్సలు చేస్తూ శిక్షణ పొందగలరు.ఈ రెండు సంస్థల భాగస్వామ్యం గురించి ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బఖ్తినూర్ ఒయ్బుటేవిచ్ ఖుదనొవ్ మాట్లాడుతూ, ‘‘ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్, నమన్గన్ ప్రాంతాల్లో ఉన్న ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అంతర్జాతీయ వైద్యవిద్యకు ప్రతిష్ఠాత్మక కేంద్రంగా నిలిచింది. అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన బోధకులు, ఇంగ్లిషు మీడియం కరిక్యులం, అందుబాటులో ఫీజులతో విద్యార్థులకు నిజమైన అంతర్జాతీయ అభ్యసన వాతావరణాన్నిఅందిస్తుంది. జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్తో భాగస్వామ్యం ద్వారా మా విద్యార్థులు భారతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ నుంచి పాఠాలు వింటారు. ఇండియా వెళ్లి లైసెన్సింగ్ పరీక్షలకు హాజరవ్వగలరు’’ అని తెలిపారు.ఈ సందర్భంగా రోహిత్ గా , సీఓఓ, నియో & జీఎస్సెల్ అంతర్జాతీయ అవుట్రీచ్ హెడ్, మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం వల్ల భారతీయ విద్యార్థులకు స్వదేశంలో ఉండే సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్య లభిస్తాయి. అసలైన మృతదేహాల డిసెక్షన్లతో పాటు భారతీయ ఎంబీబీఎస్కు అనుగుణంగా ఉండే కరిక్యులం, అత్యాదునిక హాస్టళ్లలో అసలైన భారతీయ ఆహారం.. ఇవన్నీ భారతీయ విద్యార్థులకు చాలా సుఖంగా, సురక్షితంగా ఉండేలా అనిపిస్తాయి. అదే సమయంలో తిరిగి రాగానే కెరీర్కు వారు సిద్దం కావచ్చు’’ అని వివరించారు.జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ మధ్య ఈ భాగస్వామ్యంతో భారతీయ విద్యార్థులు స్వదేశంలో కెరీర్ అవకాశాలను రక్షించుకుంటూనే విదేశాల్లో వైద్యవిద్య చదవగలరు. ఇది భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక విద్యా సంబంధాలనూ బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా చేయడం ద్వారా ఈ భాగస్వామ్యం విద్యార్థులు స్వదేశంలో తమ వృత్తిపరమైన భవిష్యత్తు విషయంలో రాజీ పడకుండానే తమ కలలు నెరవేర్చుకోగలరు. -
ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!
ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే అనేక అంశాలు పనిచేస్తాయి. సమతులం ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర చాలా అవసరం. దీంతోపాటు మన శరీరంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని అవయవం ఒకటి ఉంది. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ దీనికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ ప్రకారం, ఆరోగ్యం విషయంలో చాలామంది చేసే అతి పెద్ద తప్పు వారి బ్రెయిన్ గురించి పట్టుకోకవడం. మెదడు ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మనిషి ఆయుష్షుమీద ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిర్ణయాలు , దీర్ఘాయువును కూడా నియంత్రించే అవయవం అయినా , మెదడు ఆరోగ్యం తరచుగా రోజువారీ జీవితంలో దాని గురించి విస్మరిస్తున్నారు అంటారాయన. తాజాగా దీర్ఘాయువు పరిశోధకుడు డాన్ బ్యూట్నర్తో ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాడ్కాస్ట్ లైవ్ టు 100 లో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన కెరీర్లో 2 లక్షలకు పైగా మెదడు స్కాన్లను అధ్యయనం చేసిన డాక్టర్ అమెన్, మెదడుతో సంబంధాన్ని పెంచుకోవడం దాని కనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం అన్నారు.తన సొంత మెదడు స్కాన్ నుండి మేల్కొలుపు కాల్డాక్టర్ అమెన్ ఒక అగ్రశ్రేణి న్యూరోసైన్స్ విద్యార్థిగా మరియు బోర్డు-సర్టిఫైడ్ మనోరోగ వైద్యుడిగా కూడా, 1990ల ప్రారంభం వరకు తాను మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని ఒప్పుకున్నారు. తన క్లినిక్లలో బ్రెయిన్ ఇమేజింగ్ను ప్రవేశపెట్టి, 1991లో తన సొంత మెదడును స్కాన్ చేసినప్పుడు, దిగ్భ్రాంతికర ఫలితాలు చూశానని చెప్పుకొచ్చారు.1990 కి ముందు తనకు అధిక బరువు రాత్రిపూట నాలుగు గంటలు మాత్రమే నిద్రపోవడం లాంటి చెడు అలవాట్లు ఉండేవని , తన బ్రెయన్ హెల్త్ గురించి ఎపుడూ ఆలోచించలేదని గుర్తు చేసుకున్నారు. కానీ పరిశోధనలకు ఒక మేల్కొలుపుగా పనిచేశాయని, తన జీవనశైలిని కరెక్ట్ నిద్ర, ఆహారం,రోజువారీ అలవాట్లను మార్చుకున్నట్టు వెల్లడించారు.మెదడు ఆరోగ్యం- దీర్ఘాయువు, "బ్లూ జోన్స్" (ప్రజలు అసాధారణంగా ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలు) ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చిన డాన్ బ్యూట్నర్, మంచి జీవనశైలి అనేది గుండె, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్టుగానే, మెదడు ఆరోగ్యం అనేది దీర్ఘాయువులో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రోజువారీ అలవాట్లు అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే మెదడును ముందుగానే రక్షించడం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సులో చాలా కీలకమన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ అమెన్ రాసిన "చేంజ్ యువర్ బ్రెయిన్, చేంజ్ యువర్ పెయిన్" అనే పుస్తకంలో మరిన్ని విషయాలను పొందుపర్చారు.మెదడు ఆరోగ్యం, డా. అమెన్ సలహాలుక్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ను సరఫరాను పెంచుతుంది. వ్యాయామంలో పట్టిన చెమట హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందిమెదడు చురుగ్గా ఉండేలా, చాలెంజింగ్ ఫజిల్స్ పరిష్కరించాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు, వాల్నట్లు, అవిసె గింజలు . కొవ్వు చేపలు మెదడు కణాలకు మేలు ఇస్తాయిచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. కుటుంబంలో అల్జీమర్స్ వంటి పరిస్థితులు ఉంటే ముందుగానే అప్రమత్తం కావాలి.7–8 గంటలు ల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెదడు తనను తాను శుభ్రపరుచుకునే సమయం నిద్ర.తల గాయాల నుండి రక్షించుకోవడం.మద్యం ,మాదకద్రవ్యాలకు దూరండా ఉండాలి.ఘీ టాక్సిన్స్ న్యూరాన్లను దెబ్బతీస్తాయినెగిటివ్ ఆలోచనలు మెడదుకు హాని చేస్తాయి. విటమిన్ డి , హార్మోన్ స్థాయిలను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మెదడు పట్ల లవ్ అండ్ కేర్ గా ఉండాలి. దానికి కీడు చేసే పనులు మానుకోవాలి అంటారు డా. అమెన్. -
ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టు
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే శ్రమతో కూడిన పనులో, వ్యాయామమో చేయాలి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది విస్మరిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవితం, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చునే ఉద్యోగాలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు.. ఇలా ఎన్నో కారణాలు. మరి దీనికి పరిష్కారం? సింపుల్... వ్యాయామం చేయడం వీలు కాకపోతే, మెట్లు ఎక్కి, దిగండి! సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాల్లో ఇది ఒకటని అధ్యయనాలుచెబుతున్నాయి.క్రమంతప్పకుండా రోజుకు మూడు అంతస్తులు.. అలా ఆడుతూ పాడుతూ ఎక్కి దిగేస్తుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! దీంతో శారీరక స్థిరత్వం పెరుగుతుంది. హృద్రోగాల ప్రమాదం తగ్గుతుంది. యూఎస్లోని టూలేన్ విశ్వవిద్యాలయం 2023లో జరిపిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ కనీసం 50 అడుగులు మెట్లు ఎక్కడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తేలింది. ‘కండరాలకు ఆక్సిజన్ ను అందించే సామర్థ్యం పెరుగుతుంది. చెడుకొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), ట్రైగ్లిజరైడ్స్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్)పెరిగేందుకు దోహదం చేస్తుంది’ అని ఈ అధ్యయనం వివరించింది.నడకను మించిన కేలరీలు మెట్లు ఎక్కి, దిగడం వల్ల జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పటికంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం 70 కిలోల బరువున్న వ్యక్తి 30 నిమిషాల పాటు మెట్లుఎక్కడం వల్ల దాదాపు 223 కేలరీలు బర్న్ అవుతాయి.కాళ్లు పటిష్టంగా.. కాళ్ళు బలంగా మారతాయి. ప్రతి అడుగులో కాళ్ళుగురుత్వాకర్షణకు వ్యతిరేకంగాశరీరాన్ని ఎత్తుతాయి. దీంతో కాళ్ళు, పిరుదులు, ఉదరకండరాలపై ప్రభావం పడుతుంది. వాటి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.మానసిక ఆరోగ్యం.. వ్యాయామం శరీరాన్ని ఫిట్గా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ పెంచుతుంది. ఏ రకమైన వ్యాయామం అయినా ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక శ్రమతో ఎండార్ఫిన్ విడుదలై మానసిక స్థితి మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల ఆరోగ్యం: మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు ఎముకల ఆరోగ్యానికిఅద్భుతమైనవి. ఎముక బలంగా పెరుగుతుంది. బోలు ఎముకలవ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. ఇప్పటికే కాళ్ల సమస్యలు ఉన్నవారు, వృద్ధులు వైద్యులనుసంప్రదించి తగు వ్యాయామాలు చేయాలి.ఆ ప్రమాదం తక్కువ.. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఇటీవలిసమావేశంలో సమర్పించిన విశ్లేషణ ప్రకారం.. మెట్లు ఎక్కని వారితో పోలిస్తే మెట్లు ఎక్కేవారు గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం 39% తక్కువగా ఉంది. వారిలో గుండెపోటు, స్ట్రోక్ల ప్రమాదం కూడా తక్కువగా ఉందట.సులభ వ్యాయామం జిమ్ వంటి దినచర్యల మాదిరిగా కాకుండా మెట్ల నడకకు ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఖర్చూ ఉండదు. తీరిక లేనివారికి ఇది సులభమైన వ్యాయామం.రక్తంలో చక్కెర నియంత్రణ..చిన్న మొత్తంలో చేసే శారీరక శ్రమ సైతం ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తుంది. మెట్లు ఎక్కడం.. సమతల నేలపై నడవడంతో పోలిస్తే రక్తంలో చక్కెరను మరింత సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఎన్ని మెట్లు ఎక్కాలి?రోజుకు 3 అంతస్తులు ఎక్కి, దిగడం ద్వారా రోజువారీ దినచర్యలకు సరిపోయే స్థిరమైన ఫిట్నెస్ అందుకోవచ్చు. వ్యక్తుల ఫిట్నెస్ స్థాయినిబట్టి మెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. » బిగినర్ అయితే 1–2 అంతస్తులు.. అంటే 20–40 మెట్లతో ప్రారంభించండి. ∙సీనియర్ అయితే ఫిట్నెస్ను బట్టి 5–10 అంతస్తులు లక్ష్యంగా పెట్టుకోవచ్చు.వైద్యుల సలహాతోనే..మెట్లు ఎక్కడం చాలా మందికి సురక్షితం. కానీ ఈ కింది జాబితాలో ఉన్నవారు, ఇవి కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో వ్యాయామం చేయాలి.1. ఊబకాయం 2. కీళ్ల వ్యాధి 3. తూలిపడే సమస్య ఉన్నవారు4. వృద్ధులు, బలహీనమైన వ్యక్తులు 5. గుండె, ఊపిరితిత్తుల వ్యాధి6. ఇటీవలి కాలంలో శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు. -
నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..
అందరు బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. రకరకాల మార్గాల్లో తగ్గడంపై దృష్టిపెట్టి మరి ఆరోగ్య స్ప్రుహ పెంచుకుంటున్నారు. అయితే హాయిగా ఉన్నప్పుడే మన బాడీ మీద ఫోకస్ పెట్టడం, ఆరోగ్యంపై ధ్యాస వంటివి చేయగలం. కానీ ఈ తల్లికి కూతురు అనారోగ్యమే బరువు తగ్గేందుకు దారితీసింది. డైట్పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మర్చేసింది. అలాంటి కష్ట సమయాల్లో ఎవ్వరైనా..తమ ఉనికిని కోల్పోయేంతగా బాధలో ఉండిపోతారు..కానీ అదే ఆమెకు ఆరోగ్యంపై అటెన్షన్ పెట్టేలా చేసింది. పైగా కిలోల కొద్ది బరువు తగ్గి, స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె వెయిట్లాస్ స్టోరీ గురించి తన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మే 40 ఏళ్ల కింబర్లీ పావెల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె పీసీఓఎస్తో ఇబ్బంది పడుతుండేది. బిజీ జీవితం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యం చేసుకుంటూ సూమారు 68 కిలోలు మేర బరువు తగ్గింది. వాస్తవానికి కింబర్లీ దాదాపు 136 కిలోల అధిక బరువుతో బాధపడుతుండేది. తన సోషల్ మీడియా ఫాలోవర్లను ప్రేరేపించేలా బరువు తగ్గేందుకు శ్రీకారం చుట్టింది. అంతలో అనుహ్యంగా ఆరేళ్ల కూతురు కేన్సర్ బారిన పడటంతో డైట్పై ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయింది కింబర్లీకి. తాను ఆరోగ్య విషయంలో చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని..సరైన మార్గంలో బరువు తగ్గాలని భావించింది. ఆ నేపథ్యంలో ఎక్కువగా చేసే సాధారణ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. అంతేగాదు ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోకపోతే ఎలా విషంగా మారుతుందో అర్థం చేసుకుంది. తనకెదురైన సవాళ్లే పూర్తిగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టేలా చేశాయని చెబుతోంది. అయితే తాను 68 కిలోల మేర బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలేమి పాటించలేదని, సింపుల్ చిట్కాలనే అనుసరించానని చెప్పుకొచ్చింది. బరువు తగ్గిన విధానం..నిలకడగా ఉండాలి...బరువు తగ్గాలనే ఫోకస్ని మధ్యలో వదిలేయకుండా స్ట్రాంగ్ ఉండే మనస్సుని డెవలప్ చేసుకోవడం. ఈ రోజు కంటే మరింతగా భిన్నంగా కనిపించాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి.పోషకాహారంపై ఫోకస్..ప్రోటీన్, ఫైబర్ ఉండేవి తీసుకుంటున్నామో లేదో కేర్ తీసుకోవాలి. రోజువారీగా 130 నుంచి 150 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చురుకుగా ఉండటం..ప్రతి రోజు వర్కౌట్లపై దృష్టి పెట్టడం. కనీసం 40 నిమిషాలు వాకింగ్, వ్యాయమాలు చేసేలా చూసుకోవడం. అవి భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి.అతి ఆకలిని నివారించటంఎక్కువ ఆకలి వేసేంత వరకు కాకుండా..బ్యాలెన్స్గా తినేలా చూసుకోవాలి. బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే అతిగా తినే ప్రమాదం ఉంది. ఆకలి అనిపించిన వెంటనే..సంతృప్తి కలిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. చక్కెరకు దూరం..స్వీట్స్ తినాలనిపించినప్పుడూ తెలివిగా తినాలి. ఎలాగంటే ఈ రోజు స్వీట్స్ ఎక్కువ తింటే మిగతా సమయంలో తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ తగ్గించి, వర్కౌట్ల సమయం పెంచాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు..ప్రోటీన్తోపాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి, ఎక్కువసే కడుపు నిండిన అనుభూతిని అందివ్వడాని ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సమతుల్యంగా తినేందుకు ప్రాముఖ్యత నివ్వడం.కాఫీ అలవాట్లను మానుకోవడం..కాఫీ తాగే అలవాటుని తగ్గించుకునేలా..ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి.మైండ్ఫుల్గా తినటం..మైండ్ఫుల్గా తినేలా చూసుకోవాలి. తగిన కేలరీలు, ప్రోటీన్లు శరీరానిక అందేలా చూసుకోవాలి. చివరగా మితిమీరిన వ్యాయామాలు, అతి కఠినమైన ఆహార నియమాలు మొదటికే ప్రమాదం తెచ్చిపెడతాయని, నిధానంగా ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడమే అన్ని విధాల శ్రేయస్కరమని చెప్పుకొచ్చింది కింబర్లీ పావెల్. View this post on Instagram A post shared by Kimberly Powell (@loving_lessofme_more) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు) -
కెమెరా కాలింగ్
మలయాళ స్టార్ మమ్ముట్టి కొంత గ్యాప్ తర్వాత తిరిగి సినిమా సెట్స్లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది జూన్లో ముమ్ముట్టి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ మమ్ముట్టి ఆరోగ్య సమస్య స్వల్పమైనదేనని, ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని దర్శకుడు మహేశ్ నారాయణన్ పేర్కొన్నారు. మమ్ముట్టి, మోహన్లాల్ ప్రధాన పాత్రధారులుగా ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో నటిస్తున్న మలయాళ చిత్రం ‘పేట్రియాట్’.ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మమ్ముట్టి అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేడు హైదరాబాద్లో ప్రారంభం కానుందని తెలిసింది. ‘‘జీవితంలో నాకు ఎంతో ఇష్టమైన పనిని (సినిమా షూటింగ్ని ఉద్దేశించి) తిరిగి ప్రారంభిస్తున్నాను. నా ఆబ్సెన్స్లో నా గురించి తెలుసుకోవాలనుకున్న అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి మాటలు సరిపోవు.ది కెమెరా ఈజ్ కాలింగ్’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు మమ్ముట్టి. అలాగే ఈ విషయంపై మహేశ్ నారాయణన్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు తిరిగి సినిమా సెట్స్లోకి వస్తున్నందుకు థ్రిల్లింగ్గా ఉంది. రాబోయే షూటింగ్ షెడ్యూల్లో మమ్ముట్టి, మోహన్లాల్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇన్ని రోజులు మమ్ముట్టిగారు సెట్స్కు రాకపోవడం వల్ల నష్టం వాటిల్లకుండా ఆయన లేని సీన్స్ చిత్రీకరించాం’’ అని పేర్కొన్నారు. -
రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!
వంటను రుచికరంగా వండటం కూడా ఓ ఆర్ట్. అయితే పోషకాలు కోల్పోకుండా, రుచికరంగా వండటం అంటే.. అది అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ విటమిన్లు పోకూడదన్న ఆత్రుతలో తక్కువగా ఉడకిస్తే..టేస్ట్ లేదనిపిస్తుంది. అలా కాకుండా అన్ని సరిపడేలా టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా వండాలంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా ఈ రూల్లో వంట చేస్తే..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయలా చూసేద్దామా మరి..!.రుచికంగా రెస్టారెంట్లో కనిపించినట్లుగా కలర్ఫుల్గా వండాలంటే ఈ పద్ధతే మేలంటున్నారు నిపుణులు కూడా. పైగా ఈ విధానం ఎక్కువసేపు ఉడకించడాన్ని నివారించడం తోపాటు, విటమిన్లు కూడా పోవని చెబుతున్నారు. అందుకోసం వండేటప్పుడూ 3-3-2-2 రూల్ని అనుసరించడం మేలని చెబుతున్నారు నిపుణులు. ఆహార ప్రియులు రుచికరమైన భోజనంతోపాటు, పోషకాలని కూడా కోల్పోరట. మరి ఈ రూల్లో ఎలా వండాలంటే..ఆ రూల్లోని మ్యాజిక్..ఒక గిన్నెలో రెండు స్పూన్ల నూనెని పోసి వండాల్సిన కూరగాయలు లేదా నాన్వెజ్ని వేయాలి. ఆ తర్వాత ఒక వైపు మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఒకసారి గరిటతో తిప్పి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. ఇంకోసారి తిప్పి ఓ నిమిషాలు ఉడికించాలి. చివరగా ఇంకొక్కసారి తిప్పి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే చాలట, రుచి కోల్పోకుండా పోషకవంతంగా ఉంటుందంట. అతిగా ఉడికించడాన్ని నిరోధించడం అనే సమస్య ఈ పద్ధతితో నివారించగలుగుతామట. ఇలా గ్రిల్ చేసేవాటికి, మంటపై గిన్ని పెట్టి కూర వండే వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందట. పైగా రెస్టారెంట్లో కనిపించినట్లు ముక్కలనేవి వడలిపోవు, చూసేందుకు అందంగానూ, రుచికరంగానూ ఉంటుందట. ఇది మంచిదేనా..?ఈ పద్ధతిలో తక్కువ సమయంలోనే వంట పూర్తి అయిపోవడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వండేయొచ్చట. అలాగే ముక్కలు లేదా మాంసం ముక్కల్లోని మృదుత్వం పోకుండా రుచికరంగా ఉంటుందట. పైగా కొత్తగా వంట చేసేవారికి మరింత హెల్ప్ అవుతుందట. అదీగాక ఇలా వండితే సమయానికి సమయం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ.. -
ఇకనైనా కళ్లు తెరవకపోతే....నిలువునా మింగేస్తుంది!
నిజం చెప్పాలంటే మనమిప్పుడు ప్లాస్టిక్ మహాసముద్రం మధ్యలో జీవిస్తున్నాం. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చుగానీ... మన రోజువారీ కార్యకలాపాల్లో చూసుకుంటే పొద్దున్నే బ్రష్, స్నానంలో మగ్, రుద్దుకునే సబ్బు తాలూకు సోప్కేస్ అన్నీ ప్లాస్టిక్వే. ఇక ఆఫీసుకు వచ్చాక తాగే మొదటిచాయ్ నుంచి బయటకువెళ్లినప్పుడు చాయ్ అమ్మే వ్యక్తి ఇచ్చే టీ వరకు చాలావరకు ప్లాస్టిక్కే. గతంలోని స్టీల్ క్యారియర్ స్థానంలో ఇప్పుడు చాలా లంచ్బాక్సులు ప్లాస్టిక్వే. ఇలా చూసుకుంటే మనం వాడే నిత్యజీవిత ఉపకరణాల్లో ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ప్లాస్టిక్వే ఉంటాయి. కానీ ఈ ప్లాస్టిక్ సముద్రమిప్పుడు సునామీగా మారి మన ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది. అది ఏయే విధంగా మన ఆరోగ్యాలను కబళిస్తోందీ, ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించలేక పోయినా కనీసం దాన్ని రీ–సైకిల్ చేసేందుకు వీలుగా ఉండే వాటిని వాడాలనే అవగాహన కోసమే ఈ కథనం. మన ఇళ్లలో చెత్త ఊడ్చాక దాన్ని ఎత్తడానికీ ప్లాస్టిక్ చేటనే వాడతాం. అయితే ఇలాంటి ఉపకరణాలతో అప్పటికప్పుడు ఆరోగ్యానికి వచ్చే ప్రమాదమేమీ పెద్దగా లేకపోయినప్పటికీ... వేడి వేడి ఆహారాన్నినిల్వ చేయడానికి ఉపయోగించేప్లాస్టిక్ ఉపకరణాలతో మాత్రం ఆరోగ్యాలకు ఎంతో నష్టం చేకూరుతుంది. ఆ ప్లాస్టిక్ల కారణంగా ఆరోగ్యానికి జరిగే చేటు ఏమిటో, దాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... అందునా మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. అందువల్ల వీలైనంత మేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది.ప్లాస్టిక్తో ఆరోగ్యానికి హాని ఎందుకు..? ఇందుకు ఓ ఉదాహరణగా... ఆహారం పెట్టుకోడానికి గతంలో వాడే స్టీలుకు బదులు ప్లాస్టిక్ ఉపకరణాలను వాడుతున్నప్పుడు మన ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటో తెలుసుకుందాం. ఆహారం ప్లాస్టిక్ బాక్స్లలో నిల్వ ఉంచి తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని తిన్నప్పుడల్లా బాక్స్ తాలూకు ΄్లాస్టిక్ పదార్థాలూ కొద్దికొద్ది మోతాదుల్లో ఆహారంతోపాటు మన దేహంలోకి వెళ్తుంటాయి. ఆహారంతో పాటు ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లి, మన దేహంలోకి ఇంకిపోయే ప్రక్రియను ‘లీచింగ్’ అంటారు. చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!ఈ ప్రక్రియ ఎక్కువగా ఉండేదెప్పుడు..? లీచింగ్ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్న పరిస్థితులివే... ఆహారం ఎంత వేడిగా ఉంటే... అంతగా ప్లాస్టిక్ మన కడుపులోకి ప్రవేశిస్తుంది. ∙అదే ఆహారంలో కొవ్వులు, ఉప్పు ఉన్నప్పుడు లీచింగ్ మరింత పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో అసిడిక్ వస్తువులు అంటే చింతపండు, సాంబార్ వంటి పులుపు వస్తువులు ఉంటే... మన ప్లాస్టిక్ కంటెయినర్ నుంచి మన దేహంలోకి ప్లాస్టిక్ ఎక్కువ మోతాదుల్లో కలుస్తుంటుంది.ప్లాస్టిక్ బౌల్లో ఆహారాలు ఎందుకు పెట్టకూడదంటే...?! ఈ మధ్యకాలంలో మనం అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్లో కూరలూ, వేడి వేడి పులుసు వంటి ఆహారాలను ఉంచి, వాటిని డైనింగ్ టేబుల్ మీద అలంకరించి వాటిల్లోంచే అన్నం, కూరలు వడ్డించడాన్ని చూస్తున్నాం.సాధారణంగా ఈ కూరలు పెట్టుకునే బౌల్స్ను ‘మెలమెన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తమారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ఆ ప్లాస్టిక్లోని మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇలా దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్లోనూ ప్రచురిత మైంది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. దీంతో వారిలో కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ముప్పుతో పాటు... క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్ బౌల్లో పెట్టి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్లోఉంచి వేడిచేయకూడదని అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ కూడా గట్టిగా సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలోనూ తేలింది.స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారి΄ోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్ వంటివి కూడా ఎక్కువగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్లాస్టిక్ ఉపయోగం కారణంగా ఇలా పలు రకాలుగా ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు పడుతున్నాయి. అందుకే కూరలు, పులుసులు నిల్వ చేసుకునేందుకు ప్లాస్టిక్ బౌల్స్లో కాకుండా పింగాణీ బౌల్స్ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు.మరో సరికొత్త అధ్యయన ఫలితమిలా... పిల్లలు పాలు తాగడానికి ఉపయోగించే పాలపీకలు మొదలుకొని, వాళ్లు ఆడుకునే ఆటవస్తువుల వరకు ప్లాస్టిక్తో తయారైనవి కాస్తా... చాలాకాలం తర్వాత... అంటే ఆ చిన్నారులే పెరిగి కాస్త పెద్దయ్యాక (అంటే పెద్దపిల్లలుగా ఉన్నప్పుడూ, వాళ్ల కౌమార ప్రాయంలో/అడాలసెంట్ వయసులో) వాళ్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయంటూ వేలాది తల్లులూ, పిల్లలపై నిర్వహించిన ఓ అధ్యయనం తెలుపుతోంది. అలా ఆ ప్లాస్టిక్ వస్తువులు వాడిన ఆ పిల్లల పాటు తల్లుల్లో సైతం మొదట స్థూలకాయం... దాని ప్రభావంతో గుండె జబ్బులు, ఆస్తమా, సంతానలేమి వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయంటూ ఆ అధ్యయనం పేర్కొంటోంది. ఈ ఫలితాలు ప్రముఖ హెల్త్ జర్నల్ ‘ల్యాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.ప్లాస్టిక్ బాటిలో ఉంచిన నీళ్లు తాగచ్చా..?మరో పరిశోధన తాలూకు ఫలితాలివి. ఇటీవల చాలామంది నీళ్లబాటిల్ కొని దాన్ని వాడుతూ ఉంటారు. ఇలా ఓ బాటిల్లో వారం పాటు ఉంచిన నీళ్లు తాగవచ్చా అనే అంశంపై ఇటీవల కొందరు పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో తేలిన అంశమేమిటంటే... ఇలా నీళ్లు నిల్వ ఉంచినప్పుడు ప్లాస్టిక్ కొద్దికొద్ది మోతాదుల్లో కలవడం (లీచ్ కావడం) వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందనీ, అలాగే వారం పాటు ఉంచి నీళ్లలో బ్యాక్టీరియా పెరగడంతో కడుపులో ఇబ్బందిగా ఉండటం, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు రావడమేగాక...కాస్త అరుదుగా అలాంటి కొందరిలో అది ప్రాణాపాయానికీ దారి తీయవచ్చంటూ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలా బ్యాక్టీరియా పెరగడమన్నది కేవలం నీళ్లలో జరిగినా, జరగకపోయినా... బాటిల్ తాలూకు మూతలో సైతం బ్యాక్టీరియా/మౌల్డ్ (నాచు వంటి పెరుగుదల) పెరగవచ్చంటూ వారు హెచ్చరిస్తున్నారు. అసలు ప్లాస్టిక్ అంటే ఏమిటంటే...? ప్లాస్టిక్ వస్తువులు, ఉపకరణాలు ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) అనే పదార్థంతో తయారవుతాయి. ∙కొన్ని సందర్భాల్లో థాలేట్ అనే పదార్థంలోనూ ప్లాస్టిక్ ఉపకరణాలను తయారుచేస్తారు. మనం ఆహారం, తిను బండారాలూ, ఇతరత్రా ద్రవపదార్థాలను నిల్వ ఉంచేందుకు మనం రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్తో తయారైన ఉపకరణాలన్నీ (యుటెన్సిల్స్) ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లేదా థాలేట్తోనే తయారవుతాయి.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!బీపీఏలతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు... ప్లాస్టిక్ బాక్స్లలో ఉంచే ఆహారం వల్ల మన ఆరోగ్యంపై చాలా రకాల దుష్ప్రభావాలు పడతాయి. వాటిలో కొన్ని... ప్లాస్టిక్ కలిసిన ఆహారంతో హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ హార్మోన్పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చిగర్భధారణ సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం.వైద్యపరీక్షల్లో మూత్రంలో ప్లాస్టిక్ పాళ్లు పెరిగినట్లుగా రిపోర్టులు వచ్చిన చాలామందిలో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ యుటెన్సిల్స్లో ఆహారం తీసుకునేవారిలో స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ కంటెయినర్లలో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటివి కూడా ఎక్కువగా పెరుగుతోంది.బీపీఏలతో తయారయ్యే ఉపకరణాలివి... పిల్లలకు ఉపయోగించే పాలపీకలు,వాటర్బాటిళ్లు, ∙లంచ్బాక్స్లు,సీడీలు, డీవీడీలు,కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు.ప్లాస్టిక్తో అనర్థాల నివారణకు కొన్ని సూచనల గురించి తెలుసుకోవాలంటే చదవండి బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్ -
జంక్ ఫుడ్ మానేసి.. వ్యాయామం చేయండి..
జంక్ ఫుడ్ మానేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని అర్జున అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు వద్ద ఆదివారం వాకథాన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోపీచంద్ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ నడకకు సమయం కేటాయించాలని సూచించారు. శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, అవసరం లేని ఆహారం ఆరోగ్యానికి చేటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గోకల్రెడ్డి, రామకృష్ణ జనపాటి, సందీప్ పాల్గొన్నారు. రెయిన్ బో ఆస్పత్రిలో.. బంజారాహిల్స్ రెయిన్ బో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్ హార్ట్ క్లినిక్ను పుల్లెల గోపీచంద్ ఆదివారం ప్రారంభించారు. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల తెలిపారు. అత్యాధునిక ప్రమాణాలతో, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సెంటర్ కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుందని గోపీచంద్ అన్నారు. జాతీయ ఉత్తమ బాల పురస్కార గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి పాల్గొన్నారు. -
ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను!
నా వయసు 32 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు పని ఉంటుంది. ఇంటికి వచ్చాక వంట, పిల్లాడి హోంవర్కు, ఇల్లు చూసుకోవడం అన్నీ నామీదే పడతాయి. నా భర్త కూడా ఇంకో ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగి. ఇంటి పనుల్లో అసలు సహాయం చేయడు. దీనివల్ల నాకు ఎప్పుడూ అలసటగా, చిరాకుగా అనిపిస్తుంటుంది. దీనికితోడు నాభర్త, అత్తమామలు ఇప్పుడు ఇంకో బిడ్డ కావాలని ఒత్తిడి చేస్తున్నారు. బ్యాంక్ పనిలో వత్తిడి, అత్త మామల విమర్శలు, భర్త సపోర్ట్ లేకపోవడం... ఇలా వీటన్నిటి మధ్య చాలా అశాంతికి లోనవుతున్నాను. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. – దీపిక, నిజామాబాద్ మీది మన సమాజంలో చాలామంది మహిళలు ఎదుర్కొనే పరిస్థితే! పని, ఇల్లు రెండూ ఒంటరిగా మేనేజ్ చేయడం వల్ల అలసట, చిరాకు రావడం సహజం. అందుకే ముందుగా మీ భర్తతో ఓపిగ్గా మాట్లాడి అతను కూడా ఇంటి పనులు పంచుకోవడం అవసరమని చెప్పండి. చిన్న చిన్న పనులలో అయినా సరే అతను చేసే సహాయం మీ అలసటను తగ్గించడమే కాకుండా మీ మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తుందని అతనికి అర్థం అయ్యేలా వివరించండి. మీ అత్తమామలు, భర్త, ఇంకో పిల్లాడు కావాలని వత్తిడి తెస్తున్నారని చెప్పారు. పిల్లల విషయం అనేది మీరు, మీ భర్త కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప మీ అత్తమామలు నిర్ణయించే విషయం కాదని మీ ఆయనకి నచ్చ చెప్పండి. మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సిద్దం కాకతే కేవలం వాళ్ళ వత్తిడి మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం మీ అత్త మామలని మీ ఇంట్లోనే ఉండమని మీ బాబును చూసుకోవడంలో, ఇంట్లో పనుల్లో సహాయం చేయమని అడగండి. వాళ్ళు అందుకు ఒప్పుకుంటే అప్పుడు రెండో పిల్లాడి గురించి ఆలోచించవచ్చు. ఉద్యోగం, కుటుంబం రెండూ కలిపి నడపడం కష్టం అయినా, అసాధ్యం అయితే కాదు! ఇంట్లో పనుల కోసం పని వాళ్ళని ఏర్పాటు చేసుకోండి. ఆఫీస్ లో కూడా అన్ని పనులు మీ నెత్తిమీద వేసుకోకుండా మిగిలిన మీ వారికి కూడా డెలిగేట్ చేయడం నేర్చుకోండి. అలాగే మీకోసం రోజుకు కొంచెం సమయం కేటాయించండి.. కాసేపు నడక, ధ్యానం, సంగీతం, లేదా మీకు ఇష్టమైన పనులు చేస్తూ రిలాక్స్ అవ్వండి. వర్క్, పర్సనల్, ఫ్యామిలీ లైఫ్ను, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే, మీ వత్తిడి క్రమేణా తగ్గుతుంది. కావాలంటే మీ దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఒకసారి కౌన్సెలింగ్కి వెళ్తే కౌన్సిలర్స్ మీకు సరైన నిర్ణయం తీసుకునేందుకు సహాయం చేస్తారు. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: డిప్యూటీ కలెక్టర్గా స్విగ్గీ డెలివరీ బాయ్..! తండ్రి మేస్త్రీ, డ్రీమ్ ఆకాశమంత..) -
మెరిసిందని మురిసిపోవద్దు...ఈ జాగ్రత్తలు మస్ట్
చాలామంది హెయిర్–డై లను జుట్టు నలుపు చేసుకోడానికే ఉపయోగిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం జుట్టు నలుపు రంగులోనే ఉన్నప్పటికీ దాన్ని మరింత ఫ్యాషనబుల్గా తీర్చిదిద్దుకోవడం కోసం రంగులు వేసుకుంటారు. ఇలా ఫ్యాషనబుల్గా గ్రూమింగ్ చేసుకునే సమయంలో వారు వెంట్రుకల చివర్లను ఎర్రగా మార్చుకునేందుకూ, మరికొందరు మధ్యమధ్యన యూనిఫామ్గా కొన్ని పాయలు ఆకర్షణీయమైన రంగులూ, రకరకాల షేడ్స్లో కనిపించేలా... ఇలా హెయిర్–డైని వేర్వేరు ప్రయోజనాలకోసం వాడుతుంటారు.ఇటీవల చాలా చిన్నవయసులోనే హెయిర్ డై వాడాల్సిన అవసరం వస్తోంది. మరికొందరికైతే పాతికేళ్లు, ముప్ఫై ఏళ్లకే జుట్టు తెల్లబడుతోంది. ఇంకొందరి విషయంలో జుట్టు తెల్లబడకపోయినా... వెంట్రుకలను మరింత ఆకర్షణీయం చేసుకునేందుకు... వెంట్రుక చివర్లలోగానీ లేదా జుట్టు పాయల్లో అక్కడక్కడా ఎరుపు లేదా ఇతర రంగుల షేడ్స్ను పార్లర్లలోవాడటం జరుగుతోంది. హెయిర్ డై లు కొనేప్పుడు ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి, వాటితో వచ్చే సాధారణ ప్రమాదాలు, ఆ ముప్పునుతప్పించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పాటించాల్సిన కొన్ని సాధారణసూచనలు... ఇలాంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం...తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలర్జీలుసరిపడుతోందా అనే అంశాన్ని పరిశీలించుకోవడం : మొదటిసారి హెయిర్–డై వాడేవారు అది తమకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకోవాలి. కొద్దిపాటి రంగు పూసుకుని, 48 గంటల పాటు వేచిచూశాక ఏ ముప్పూ లేదా ప్రతికూల పరిణామాలు కనిపించకపోతే దాన్ని సురక్షితంగా వాడుకోవచ్చు. ఒకవేళ ఆ బ్రాండ్ హెయిర్–డై కారణంగా ఏవైనా అలర్జిక్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం దానికి దూరంగా ఉండటమే మేలు. ఎవరు ఎలాంటి హెయిర్–డై వాడుతున్నప్పటికీ, వీలైనంతలో మన బడ్జెట్లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడమే మేలురంగు వేసుకునే సమయంలో హెయిర్–డైను ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకూడదు. బాగా పలచగా ఉండే కొన్ని రకాల హెయిర్–డైలతో ఈ తరహా ముప్పు ఎక్కువగా ఉంటుంది. పలచగా ఉండే హెయిర్డైల విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఈ జాగ్రత్తను తప్పక పాటించాలి. హెయిర్–డై తాలూకు ఘాటైన వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం గానీ లేదా ఆయాసం రావడంగానీ జరుగుతుంటే... దాని వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోవాలి లేదా మందపాటి మాస్క్ ధరించడం మేలు. హెయిర్–డై పూయడాన్ని కేవలం తలకు మాత్రమే పరిమితం చేయాలి. కనుబొమలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్డై వాడకూడదు, కనురెప్పల వరకు దాన్ని జారనివ్వకూడదు.గిన్నెలో కలుపుకున్న హెయిర్ డైలోకి మనం ఎంచుకున్న బ్రష్ను పైపైనే ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లోనే బ్రష్కు రంగు అంటేలా హెయిర్డైను తీసుకుంటూ జుట్టుకు జాగ్రత్తగా రాయాలి. పెద్దమొత్తంలో హెయిర్డైను బ్రష్ మీదకు తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకోవడం వల్ల అది పక్కలకూ లేదా కంటిలోకి కారే ప్రమాదం ఉంది. పక్కలకు కారిన రంగు కాస్త ఇబ్బందికరంగా కనిపించవచ్చు. కానీ అది కంటిలోకి జారితే ప్రమాదం. కొన్ని రకాల హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేసే అవకాశముంటుంది. హెయిర్డై కళ్లలోకి స్రవించినప్పుడు కళ్లు విపరీతంగా మండటం, కళ్లు ఎర్రబారడం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడమూ జరగవచ్చు. హెయిర్ డైలోని రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోయి, వెంట్రుకతో ఒక రకమైన రసాయనిక చర్య జరపడం ద్వారా జుట్టును నల్లబారుస్తాయి. అవే రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలాగా చేస్తాయి కూడా. అందుకే చాలాకాలంగా హెయిర్–డై వాడేవాళ్ల వెంట్రుకలు కాస్తంత రఫ్గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) ఉండటం గమనించవచ్చు. కొందరు మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవాళ్లుంటారు. అలాంటి వాళ్లలో ఈ తరహా ముప్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది.కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ తారు (కోల్తార్), పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాల కారణంగా చాలా చాలా అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పునకు అవకాశం ఉంది. కాబట్టి రసాయనాలు కలిగి ఉండే హెయిర్–డై లకు బదులుగా వెజిటబుల్ హెయిర్ కలర్స్గానీ, మెడికేటెడ్ హెయిర్ కలర్స్ గానీ వాడుకోవడం సురక్షితం. హెయిర్ డైతో కనిపించే కొన్ని సాధారణ ముప్పులు... అలర్జీ కారణంగా: హెయిర్ డైలో ఉండే రసాయనాలల్లోని కొన్ని కెమికల్స్ కొందరి చర్మానికీ లేదా వాళ్ల జుట్టుకు సరిపడక పోవచ్చు. దాంతో ఆ హెయిర్ డై వాడకం వల్ల వాళ్లలో అలర్జీ వంటి దుష్పరిణామాలు కలగవచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిపాటి వాపు, మంట వంటివి కనిపించవచ్చు.కళ్లూ, పెదవులకూ లేదా దేహమంతటా వాపురావడం : కొన్ని సందర్భాల్లో రంగు తలకు మాత్రమే పెట్టుకున్నప్పటికీ కళ్లవాపు, పెదవులు ఉబ్బినట్లుగా వాచడం లేదా మొత్తం దేహమంతటికీ వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే బాధితులను వీలైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్లి డర్మటాలజిస్ట్కు చూపించాలి.రసాయనాల కారణంగా కళ్లమంట : కొన్ని సందర్భాల్లో హెయిర్డైలో ఉండే రసాయనాల కారణంగా కళ్లు విపరీతంగా మండటం, కళ్ల నుంచి నీరుకారడం, గొంతులో గీరుతున్నట్లుగా ఇబ్బంది కలగడం, ముక్కు నుంచి నీళ్లు కారడం, విపరీతంగా తుమ్ములు రావడం వంటి ఇబ్బందులు కలగవచ్చు.చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుశ్వాస తీసుకోవడంలో ఇబ్బంది / ఆస్తమా : పై లక్షణాలు కనిపించిన కొందరిలో ఆ సమస్యల తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, శ్వాసతీసుకోవడంలో వాళ్లకు తీవ్రమైన ఇబ్బంది కలగవచ్చు. కొందరిలో ఇది ఒక్కోసారి ఆస్తమాకు సైతం దారితీయవచ్చు.అవే రసాయనాలుమరో సందర్భంలో ప్రతికూలంగా... మొదట్లో చాలాసార్లు సురక్షితంగా వాడిన ఆ రసాయనాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా ఇతర సందర్భాల్లో చాలా ప్రమాదకరంగా, అలర్జిక్గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి.డై వేసుకునే సమయంలో గోళ్లకు అంటనివ్వవద్దుజుట్టుకు హెయిర్ డై వేసుకునే సమయంలో ఆ రంగు గోళ్లకు అంటకుండా వీలైనంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అది వెంట్రుక అయినా, గోరు అయినా కెరొటిన్ అనే పదార్థంతోనే తయారవుతుంది. అంటే వెంట్రుక, గోరు... ఈ రెండూ హెయిర్–డైలోని కెమికల్తో ఒకేలా రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల పొరబాటున గోళ్లకు రంగు అంటుకుంటే... జుట్టులాగే గోరు కూడా నల్లగా మారుతుంది. అంటుకున్న రంగు అలాగే ఉండిపోతుంది. ఇదీ చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!అయితే పొరబాటున గోళ్లకు అంటుకున్నప్పటికీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరుగుతున్న వెంట్రుకలు తమ మొదళ్లనుంచి తెల్లగా కనిపిస్తున్నట్టే... గోరు పెరుగుతున్న కొద్దీ రంగు అంటని భాగం తెల్లగా పెరుగుతూ వస్తుంది. దాంతో పెరిగిన భాగాన్ని కట్ చేస్తున్న క్రమంలో దాదాపు మూడు నెలల వ్యవధిలో నల్లగా మారిన గోరు పూర్తిగా తొలగిపోతుంది. పై కారణాల వల్ల జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ అంటుకు΄ోయే ప్రమాదం ఉన్నందున గోళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం అవసరం.గర్భవతుల విషయంలో : మంచి పేరున్న, నాణ్యమైన హెయిర్–డైతో చాలావరకు కడుపులో ఉన్న పిండంపై గానీ లేదా తల్లికి గానీ చాలావరకు ఎలాంటి ప్రమాదమూ, ముప్పూ లేకపోయినప్పటికీ... వీలైనంతవరకు ప్రసవం వరకు హెయిర్ డై ఉపయోగించకపోవడమే మంచిది. చివరగా... హెయిర్ డైతో అందం ఇనుమడిస్తుంది. ఫ్యాషనబుల్ లుక్ వస్తుంది. అయితే వాటికోసం ఆరోగ్యానికీ, కళ్లకూ ముప్పు కలిగించేంత మూల్యం చెల్లించడం సరికాదని గుర్తించాలి. హెయిర్–డైని వీలైనంత ప్రమాదరహితంగా ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్, హైదరాబాద్.నిర్వహణ: యాసీన్


