breaking news
USA
-
ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్హౌస్!
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న హార్ముజ్ జలసంధి పేరును మార్చే అంశం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై వైట్హౌస్ ఏకంగా మ్యాప్నే మార్చి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా చూపించింది. అంతేకాదు.. దానికి ‘It’s got a nice ring to it’ అంటూ క్యాప్షన్ పెట్టింది. అంటే.. ‘పేరు వినడానికి బాగానే ఉంది’ అన్నట్టుగా స్పందించింది. దీంతో, అమెరికా చర్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో హార్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా పేరు మార్చాలా? అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఇది అమెరికా నియంత్రణలో ఉంది కాబట్టి.. హార్ముజ్ స్ట్రెయిట్ పేరును ట్రంప్ స్ట్రెయిట్గా మార్చాలా? అమెరికా మాదిరిగానే ఇది కూడా మునుపెన్నడూ లేనంత ‘హాట్’గా ఉంటుంది!’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన కొద్దిసేపటికే వైట్హౌస్ అధికారిక సోషల్ మీడియా ఖాతా స్పందించింది. హార్ముజ్ జలసంధిని ‘Trump Strait’గా పేర్కొంటూ ఓ మ్యాప్ను పోస్టు చేసి.. ‘It’s got a nice ring to it’ అని రాసుకొచ్చి అందరికీ షాకిచ్చింది. దీంతో అధ్యక్షుడి వ్యాఖ్యను వైట్హౌస్ కూడా సరదాగా స్వీకరించినట్టు స్పష్టమైంది.నిజంగానే పేరు మారుస్తారా?అయితే ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధికి అధికారికంగా ‘ట్రంప్ స్ట్రెయిట్’ అనే పేరు పెట్టినట్లు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఇది ట్రంప్ చేసిన ప్రతిపాదన, దానికి వైట్హౌస్ ఇచ్చిన వ్యంగ్యాత్మక స్పందన మాత్రమే. అంతర్జాతీయ జలమార్గమైన హార్ముజ్ పేరును అమెరికా ఒక్కపక్షంగా మార్చడం అంత సులభం కాదు. అంతేకాదు.. ట్రంప్ తర్వాత తన ప్రతిపాదనను కొంత తేలికగా తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పేరు మార్చడం గురించి తాను సీరియస్గా అన్నారా అని ప్రశ్నించగా, ‘అది అలా సరదాగా చెప్పాను’ అన్నట్టుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ట్రంప్ గతంలో సరదాగా ప్రస్తావించిన కొన్ని పేరు మార్పులు తర్వాత అధికారిక చర్యలుగా మారడంతో ఈ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.ఇది మొదటిసారి కాదు..ట్రంప్ భౌగోళిక పేర్ల మార్పుపై ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. 2025లో ఆయన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా పిలవాలని ఆదేశించారు. ఇటీవల కెనడాతో వాణిజ్య వివాదం మధ్య లేక్ ఒంటారియోకు ‘లేక్ అమెరికా’ అనే పేరు ప్రతిపాదించి, దానిపై అధికారిక చర్యలు కూడా చేపట్టారు.ఇదీ చదవండి: ఇరాన్పై ఇజ్రాయెల్ మిషెన్ ఇంకా పూర్తి కాలేదు: నెతన్యాహు -
ఇరాన్కు సహకరిస్తే ఊరుకునేది లేదు!
ఇరాన్ తమ ఆంక్షల నుంచి తప్పించుకునే అవకాశమే లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంటున్నారు. ఆ దేశానికి ఆదాయం సమకూర్చేలా ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంలోనూ ఇతర దేశాలు సహకరించకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే ఆయా దేశాలపైనా అమెరికా ఆంక్షలు విధించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో బిష్కెక్లో భేటీ అయిన తరుణంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్తో సంబంధాలు కొనసాగించే హక్కు ప్రతి దేశానికీ ఉందని రూబియో పేర్కొన్నారు. అమెరికా కూడా గతంలో ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిందని గుర్తుచేశారు. అయితే ఆర్థికంగా ఇరాన్కు సహకరించడం, అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు మార్గాలు సృష్టించడం మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇరాన్ ఆంక్షలను తప్పించుకుని ఆదాయం సంపాదించేలా ఏ దేశమైనా సహకరిస్తే.. ఆ దేశంపైనా అమెరికా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్ సంపాదించే ఆదాయాన్ని ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి, అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే అవకాశం ఉందని రూబియో ఆరోపించారు.భారత్–ఇరాన్ వాణిజ్యంపై కామెంట్..మోదీ–పెజెష్కియాన్ భేటీపై స్పందించిన మార్కో రూబియో.. భారత్, ఇరాన్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం గురించి తనకు తెలియదని అన్నారు. ఇరాన్తో సంబంధాలు పెట్టుకోవడం ఆయా దేశాల విదేశాంగ విధానానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. అయితే అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్కు సహకరించడం వేరు అని స్పష్టం చేశారు. వాణిజ్య సంబంధాల ద్వారా ఇరాన్కు నిధులు సమకూరేలా చేసి.. వాటిని అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే పరిస్థితిని తాము అంగీకరించబోమని రూబియో వ్యాఖ్యల సారాంశం.మోదీ–పెజెష్కియాన్ భేటీలో..షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సమావేశమయ్యారు. భారత్–ఇరాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అదే సమయంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ పరిస్థితులపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. శాశ్వత శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు.వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళనపశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం సముద్ర రవాణాపైనా పడుతున్న నేపథ్యంలో.. వాణిజ్య నౌకలు, నావికుల భద్రత అంశం కూడా ఇరువురు నేతల చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య నౌకాయానం, స్వేచ్ఛాయుత రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని భారత్ స్పష్టం చేసింది. పౌరులు, పౌర మౌలిక వసతులు, వాణిజ్య నౌకలు, నావికులను దాడుల పరిధిలోకి తీసుకురావొద్దని న్యూఢిల్లీ తన వైఖరిని పునరుద్ఘాటించింది.దౌత్యపరమైన పాత్రకు పిలుపుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తన దౌత్య సంబంధాలను ఉపయోగించాలని కోరారు. సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్నది తమ ప్రభుత్వ విధానమని చెప్పారు.అమెరికా మాత్రం దౌత్య మార్గాన్ని పక్కనపెట్టి బలప్రయోగం, యుద్ధం, ఆంక్షల బాట పట్టిందని ఆయన విమర్శించారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ప్రజల రక్షణతో పాటు శాంతి, స్థిరత్వానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్న అమెరికాట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలు, సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూబియో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్తో సంబంధాలు కొనసాగించడాన్ని పూర్తిగా నిషేధించడం లేదని చెబుతూనే.. ఆంక్షలను తప్పించుకునేలా ఆర్థిక సహకారం అందించే దేశాలను మాత్రం అమెరికా ఉపేక్షించబోదన్న సంకేతాన్ని వాషింగ్టన్ ఇచ్చింది.భారత్కు సవాల్ఇరాన్తో భారత్కు దీర్ఘకాలిక చారిత్రక, వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతోనూ భారత్ కీలక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. దీంతో ఇరాన్తో వాణిజ్య సంబంధాలను విస్తరించడంతో పాటు అమెరికా ఆంక్షలను ఉల్లంఘించకుండా ఉండటం న్యూఢిల్లీకి కీలకంగా మారింది.మోదీ–పెజెష్కియాన్ భేటీ తర్వాత రూబియో చేసిన తాజా హెచ్చరిక.. ఇరాన్ విషయంలో భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా నిఘా, ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ తర్వాత యాపిల్ అదే పని చేసిందిగా! -
ఆపిల్ మ్యాప్స్లో మారిన లేక్ ఆంటారియో పేరు
షికాగో: అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ వెంటనే అమలుచేసింది. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న సరస్సు ‘లేక్ ఆంటారియో’పేరును ఇటీవల ట్రంప్ ‘లేక్ అమెరికా’గా మార్చిన విషయం తెల్సిందే. ఈ మేరకు యాపిల్ తన ‘మ్యాప్స్’ యాప్లోనూ కొత్త పేరుకు తగ్గట్లు మార్పులు చేసింది. ఇకపై అమెరికాలోని యాపిల్ సంస్థ యూజర్లు తమ స్మార్ట్ఫోన్లు, ఐప్యాడ్లలో లేక్ ఆంటారియోను వెతికితే ‘లేక్ అమెరికా’ అని మాత్రమే చూపిస్తుంది. ఇతర దేశాల్లోని యూజర్లకు మాత్రం పాత పేరు కన్పించేలా సెట్టింగ్లను మార్చేసింది. కెనడాతో అమెరికా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదరకపోవడంతో కోపంతో ట్రంప్ ఈ పేర్ల మార్పు ప్రక్రియ చేపట్టడం తెల్సిందే. -
ట్రంప్ చిత్రంతో డాలర్ నాణెం
వాషింగ్టన్: అమెరికా 250వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టంకశాల ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖం కనిపించే ఈ ఒక డాలర్ నాణెం విక్రయానికి సిద్ధంగా ఉందని యూఎస్ మింట్ ప్రకటించింది. నాణెంపై ఒక వైపు ట్రంప్ ముఖచిత్రం, లిబర్టీ, 1776 అని ముద్రించారు. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక ముద్ర ఉండేలా డిజైన్ చేశారు. దీనికి ఈ ఏడాది యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆమోదం తెలియజేసింది. ఈ కమిషన్ సభ్యులను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నియమించారు. నాణెంపై తన ముఖచిత్రాన్ని ముద్రించాలనే ఆలోచన చాలా అసాధారణమైనదని, ఇది గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని అమెరికా కరెన్సీపై ముద్రించడాన్ని నిషేధించే సమాఖ్య చట్టం అమల్లో ఉంది. కానీ, కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేక నాణేలను ముద్రించడానికి, జారీ చేయడానికి ట్రెజరీ సెక్రటరీకి అధికారం ఉంటుంది. 25 నాణేలున్న ఒక రోల్ ధర 61 అమెరికన్ డాలర్లు, అలాగే 100 నాణేలున్న ఒక బ్యాగ్ ధర 154.50 అమెరికన్ డాలర్లు ఉంటుంది. .. -
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెచ్చరిల్లాయి. ఇరుపక్షాల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. మంగళవారం ఇరాన్లో ఓ పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటితో సహా పలు లక్ష్యాలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పెళ్లి జరుగుతున్న ఇంటిలో నాలుగేళ్ల చిన్నారి సహా కనీసం నలుగురు మరణించారని, పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. అమెరికా దాడుల్లో మొత్తం 12 మంది మృతిచెందారని పేర్కొన్నారు. మరో 68 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా తెలియజేసింది. అమెరికా సైన్యం ప్రధానంగా ఇరాన్ దక్షిణ తీరాన్ని టార్గెట్ చేసింది. అమెరికా దుశ్చర్య పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా, ఇరాన్ మధ్య ఈ స్థాయిలో ఉద్రిక్తతలు పెరగడం జూలై తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికా జవాన్లను తరిమికొడతాం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు, మారిటైమ్ మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది. హార్మూజ్ జలసంధి సమీపంలోనూ అమెరికా దాడులకు పాల్పడినట్లు ఇరాన్ ఆరోపించింది. అమెరికాకు బుద్ధి చెప్పడానికి బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ప్రతి దాడులు చేశామని పేర్కొంది. పశ్చిమాసియా నుంచి అమెరికా సైనికులను తరిమికొట్టడమే తమ ధ్యేయమని తేలి్చచెప్పారు. పరాయి దేశం సైనిక స్థావరాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ ప్రాంతంలో అమెరికాకు ఆశ్రయం ఇచ్చే దేశాలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. జోర్డాన్తోపాటు ఉత్తర ఇరాక్లో తమ దాడుల్లో పలువురు అమెరికా జవాన్లు మరణించారని ఇరాన్ మిలటరీ కమాండ్ ప్రకటించింది. అయితే, దీన్ని అమెరికా సైన్యం ఖండించింది. తమకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఇరాన్ డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశామని బహ్రెయిన్లోని అమెరికా నావికాదళం వెల్లడించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై, ఆ ప్రాంతంలోని అమెరికా సైనికులపై దాడి చేయడానికి ఇరాన్ ప్రయతి్నంచిన నేపథ్యంలోనే తాము రంగంలోకి దిగాల్సి వచి్చందని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టంచేసింది. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక ఇరాన్ గనక ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన భీకర స్థాయిలో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ‘‘ఇరాన్ మరింత తీవ్రంగా, భారీ స్థాయిలో మళ్లీ దాడి జరుగుతుంది. కానీ, అది అన్నింటికంటే పెద్ద దాడి మాత్రం కాదు. అసలైన అతిపెద్ద దాడి ఇంకా జరగాల్సి ఉంది’’అని పేర్కొన్నారు. పశ్చిమాసియా మళ్లీ అగి్నగుండంగా మారుతుండడంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమాసియా ప్రాంతం అంతటా వర్తించే ప్రయాణ హెచ్చరికను పునరుద్ధరించింది. అక్కడ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలియజేసింది. పశ్చిమాసియాలో అమెరికన్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఇరాన్పై ఇజ్రాయెల్ మిషన్ ఇంకా పూర్తికాలేదు: నెతన్యాహు
ఇరాన్పై తమ లక్ష్యం ఇంకా పూర్తికాలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇజ్రాయెల్లోని అన్ని వ్యవస్థలు కలిసి పనిచేస్తున్నాయి స్పష్టం చేశారు. తాజాగా అమెరికా ఇరాన్పై దాడులు ప్రారంభించిన నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇజ్రాయెల్ మునుపటిలా అమెరికాతో కలిస్తే ఇరాన్కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నెతన్యాహు వ్యాఖ్యలను బట్టి చూస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది.కాగా, ఇరాన్పై యుద్దాన్ని తొలుత ఇజ్రాయెలే ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్పై భారీ సైనిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడం, ఇరాన్ పాలక వ్యవస్థపై ఒత్తిడి పెంచడం ప్రధాన లక్ష్యాలుగా Operation Epic Fury (అమెరికా), Operation Roaring Lion (ఇజ్రాయెల్) జరిగాయి. ఈ ఆపరేషన్స్లో ఇరాన్ తమ సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోగా.. ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్కు కూడా నష్టం సంభవించింది.శాంతి చర్చల పేరుతో ఈ యుద్దానికి పాక్షికంగా బ్రేక్ పడినప్పటికీ.. నిన్నటి నుంచి మళ్లీ మొదలైంది. ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా తొలుత దాడులు చేయగా.. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది.చదవండి: ‘ట్రంపిజం’ ప్రపంచాన్ని ఎలా మారుస్తోంది? మనపై ప్రభావం ఇలా.. -
అమెరికా ఘోర తప్పిదం
గత నెల రోజులుగా ప్రశాంతంగా వున్న పశ్చిమాసియాలో మళ్లీ చిచ్చురేగింది. తాజాగా అమెరికా మొదలెట్టిన క్షిపణి దాడులు, ఇరాన్ సాగిస్తున్న ప్రతిదాడులతో అది భగ్గున మండుతోంది. దక్షిణ ఇరాన్లోని సిరిక్ ప్రాంతంలో పెళ్లి వేడుకలు జరుగుతున్న ఇంటిపై అమెరికా క్షిపణి పడి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. వేరేచోట జరిగిన దాడిలో నలుగురు ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు చనిపోయారు. ఈ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్తో కలిసి అకారణంగా తానే ప్రారంభించిన ఈ యుద్ధంలో అమెరికా సర్వభ్రష్టమైంది. దీన్నుంచి బయటపడటానికి చేసిన యత్నాలన్నీ విఫలంకాగా... ప్రపంచ దేశాలతో ఇరాన్ ఆర్థిక లావాదేవీలన్నిటినీ ‘కనీవినీ ఎరుగని రీతిలో’ దెబ్బతీసే ఆర్థిక దిగ్బంధం ప్రారంభించామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి వారం రోజులవుతుండగా తాజా దాడులు మొదలయ్యాయి. రోజులు మారాయని, తన ఆధిపత్య విధానాలకు కాలం చెల్లిందని అమెరికా గ్రహించుకోలేక ఈ నిరర్థక యుద్ధానికి తెరలేపింది. ఇది సోవియెట్తో పోటీపడుతూ ఆధిక్యత సాధించటానికి ప్రయత్నించిన ’60ల, ’70ల కాలం కాదు. సోవియెట్ పతనం తర్వాత కొన్నాళ్లపాటు సాగిన ఏకధ్రువ ప్రపంచం కూడా కాదు. కనీసం ట్రంప్ తొలి ఏలుబడినాటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. ఇరాన్ ఆర్థిక దిగ్బంధం గురించి గత నెల 25న ట్రంప్ ప్రకటన చేసిన వెనువెంటనే చైనా, ఖతార్లు ఈ చట్టవిరుద్ధ, ఏకపక్ష ఆంక్షల్ని గుర్తించదల్చుకోలేదని చెప్పడాన్ని బట్టే వర్తమాన పరిస్థితులేమిటో అర్థమవుతాయి. ఉక్రెయిన్ యుద్ధంలో పీకల్లోతు మునిగిన రష్యా కూడా ఈ ఆంక్షల్ని పాటించే స్థితిలో లేదు. అమెరికా ఆంక్షల వల్ల 2018లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొంతమేర దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ దాన్ని పూర్తిస్థాయిలో ధ్వంసం చేయటం, చమురు ఎగుమతుల్ని సంపూ ర్ణంగా నిలిపేయటం అమెరికాకు సాధ్యం కాలేదు. కనీసం అప్పుడున్న అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులు ఏదోమేర ఆంక్షలు అమలుకు దోహదపడ్డాయి. అప్పట్లో సౌదీ, యూఏఈ, బహ్రైన్, ఈజిప్టులు ఖతార్తో సంబంధాలు తెంచుకున్నాయి. కువైట్, ఒమన్లు మాత్రం దానితోనే కలిసి నడిచాయి. కానీ 2021 తర్వాత ఈ పరిస్థితి మారింది. ఎడమొహం, పెడమొహంగా ఉండే సౌదీ, ఇరాన్లు సంబంధాలు పునరుద్ధరించు కున్నాయి. ప్రాంతీయంగా గల్ఫ్ దేశాలన్నిటిమధ్యా ఇప్పుడు అవగాహన కుదిరింది. నిరుడు సెప్టెంబర్ 9న దోహాపై ఇజ్రాయెల్ సాగించిన దాడి వీటి కళ్లు తెరిపించింది. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్పై మొదలెట్టిన యుద్ధాన్ని గల్ఫ్ దేశాలు వ్యతిరేకించక పోవచ్చుగానీ... పాలస్తీనా ఏర్పాటుకు అనువైన రాజకీయ పరిష్కారం దొరికే వరకూ ఇజ్రాయెల్తో సాధారణ సంబంధాలు అసాధ్యమని సౌదీ స్పష్టంగా తేల్చిచెప్పింది. ఈలోగా ఆంక్షల్ని అధిగమించటానికి అంతర్జాతీయంగా ఇరాన్ ఇప్పటికే ఏర్పర్చుకున్న నెట్వర్క్ అమెరికా ఆటల్ని సాగనివ్వటంలేదు. తాజా పరిణామాలన్నీ గల్ఫ్ దేశాల కళ్లు తెరిపించాయి. అమెరికాకు స్వప్రయోజనాలు తప్ప తమ భద్రత గురించి పట్టదని వాటికి అర్థమైంది. సైనిక స్థావరాలకు అమెరికాను అనుమతించినప్పుడు గల్ఫ్ దేశాల ఆలోచన వేరు. ఆ స్థావరాలుంటే ఎవరూ తమవైపు కన్నెత్తిచూడబోరని అవి అమాయకంగా విశ్వసించాయి. కానీ తనపై దాడి జరిగినప్పుడల్లా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో ఆ స్థావరాల సంగతటుంచి, తమ మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయని గల్ఫ్ దేశాలు లబోదిబోమంటున్నాయి. ఈమధ్య మూడు సౌదీ కంపెనీలు షేర్ల జారీకి ప్రయత్నించి, తాజా దాడులతో ఆ ప్రతిపాదనను పక్కనబెట్టాయి. యూఏఈ శాఖను ప్రారంభించదల్చుకున్న ప్రముఖ సంస్థ విన్ రిసార్ట్స్ ఆ ఆలోచనకు స్వస్తి చెప్పింది. వివిధ ప్రభుత్వ విభాగాలకు ఖతార్ నిధులు కత్తిరించింది. ఎఫ్ 1 రేసులు, పలు సదస్సులు, వేలాదిమంది హాజరయ్యే దోహా ఫోరం, క్రిప్టో సదస్సు వంటివన్నీ ఆర్నెల్లుగా మూలనబడ్డాయి. రియల్ ఎస్టేట్ స్తంభించింది. వేలాదిమంది అమెరికన్లు వీటన్నిటా పెట్టుబడులు పెట్టి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ ఆర్థికవ్యవస్థల గురించి లేశమాత్రమైనా ఆలోచించకుండా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు గల్ఫ్ దేశాలను కలవరపరుస్తోంది. అందుకే ఇప్పటికైనా ట్రంప్ తన పోకడలకు స్వస్తిచెప్పాలి. -
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. యూఏఈ విమాన సర్వీసులపై భారీ ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యూఏఈ నుంచి నడిచే విమాన సర్వీసులపై భారీ ప్రభావం చూపుతున్నాయి. Emirates, Etihad Airways, flydubai, Air Arabia వంటి ప్రాంతీయ విమానయాన సంస్థలు కొన్ని కీలక సర్వీసులను కొనసాగిస్తున్నప్పటికీ, పలు మార్గాల్లో విమానాలు రద్దు, ఆలస్యం లేదా దారి మళ్లింపులకు గురవుతున్నాయి.సెప్టెంబర్ 1న అమెరికా బలగాలు ఇరాన్లోని సైనిక స్థావరాలపై దాడులు చేయగా, అనంతరం ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలోని గగనతల పరిస్థితులు మరింత అనిశ్చితంగా మారాయి.నిలిచిపోయిన అంతర్జాతీయ సర్వీసులుAir Canada, British Airways, Cathay Pacific, Singapore Airlines, ITA Airways, Finnair, Philippine Airlines, AirBaltic, Korean Air, Pegasus, Virgin Atlantic, Lufthansa, Eurowings, SWISS తదితర అంతర్జాతీయ సంస్థలు దుబాయ్ లేదా అబుదాబికి సంబంధించిన కొన్ని సర్వీసులను వివిధ తేదీల వరకు నిలిపివేశాయి.ప్రస్తుత పరిస్థితుల్లో విమానం బుక్ అయినా, విమానాశ్రయానికి బయలుదేరే ముందు తప్పనిసరిగా విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని యూఏఈ విమానాయాన సంస్థలు ప్రయాణికులకు సూచిస్తున్నాయి.చదవండి: "ట్రంప్ స్ట్రయిట్"గా మార్చాలా..? అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు -
"ట్రంప్ స్ట్రయిట్"గా మార్చాలా..? అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతకొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన స్ట్రయిట్ ఆఫ్ హార్ముజ్ను తన పేరుతో "ట్రంప్ స్ట్రయిట్"గా మార్చాలా..? అని ట్రూత్ వేదికగా పోస్ట్ చేశాడు. అమెరికా మాదిరిగానే ఇది కూడా గతంలో కంటే మరింత 'హాట్'గా ఉంటుందని వ్యాఖ్యానించాడు.ఇటీవల కెనడాతో వివాదం కొనసాగుతున్న సమయంలో లేక్ ఒంటారియో పేరును 'లేక్ అమెరికా'గా మార్చేందుకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. అంతకుముందు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ పేర్ల మార్పులను సంబంధిత దేశాలు వ్యతిరేకించాయి. ఒకవేళ హర్మూజ్ను ట్రంప్ తన పేరుతో మార్చాలని ప్రయత్నించినా, అదే జరిగే అవకాశం ఉంది.కాగా, ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో స్ట్రయిట్ ఆఫ్ హర్మూజ్పై అమెరికా నియంత్రణ ఉందని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. అయితే ఈ నియంత్రణపై ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.హర్మూజ్ ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటి. పెర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్తో కలిపే ఈ జలమార్గం ద్వారా భారీగా చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది.అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు ఐదో వంతు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యేది. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి.చదవండి: ‘ట్రంపిజం’ ప్రపంచాన్ని ఎలా మారుస్తోంది? మనపై ప్రభావం ఇలా.. -
‘ట్రంపిజం’ ప్రపంచాన్ని ఎలా మారుస్తోంది? మనపై ప్రభావం ఇలా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ పాలనా వ్యవస్థలోని పాత నియమాలను మార్చి, అంతర్జాతీయ రాజకీయాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయని అల్జజీరా అభిప్రాయ కథనం పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన బహుపాక్షిక సంస్థలు, పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని పాలనా విధానాలకు భిన్నంగా ట్రంప్ విధానం ఏకపక్ష నిర్ణయాలు, లావాదేవీ ఆధారిత జాతీయవాదం, సంప్రదాయ మైత్రి సంబంధాల పునఃసమీక్షపై ఆధారపడిందని తెలిపింది. ఈ మార్పును ‘ట్రంపిజం’గా అభివర్ణించింది.ట్రంపిజం ప్రధానంగా దేశ ప్రయోజనాలు, ఆర్థిక శక్తిని విదేశాంగ విధానంలో ముందుకు తెస్తోందని కథనం పేర్కొంది. అమెరికాలో పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడం, రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడం, ఇంధన రంగంలో ఆధిపత్యం, వాణిజ్య సమతుల్యత, ఆర్థిక రంగంలో నాయకత్వం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపింది. బహుళ దేశాల ఒప్పందాలకు బదులుగా ద్వైపాక్షిక ఒప్పందాలపై దృష్టి పెట్టడంతో పాటు సుంకాలు, వాణిజ్య ఆంక్షలు, ఆంక్షలను ప్రభుత్వ శక్తికి ప్రధాన సాధనాలుగా ఉపయోగిస్తోందని పేర్కొంది.విస్తృత ఆంక్షలు, ఇతర దేశాలపై అమెరికా చట్టాల అమలు అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమత్వం, జాతీయ పరిధి వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారితీశాయని కథనం తెలిపింది. ‘శక్తి ద్వారా శాంతి’ విధానంలో చట్టపరమైన, ఆర్థిక, భద్రతా వ్యవస్థలను ఉపయోగిస్తూ మిత్రదేశాలు, ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నట్లు వివరించింది. నాటోలో రక్షణ వ్యయ భారాన్ని పంచుకునే విధానంపైనా ట్రంప్ వైఖరి ప్రశ్నలు లేవనెత్తిందని పేర్కొంది.బహుపాక్షిక సంస్థల నుంచి అమెరికా వైఖరిలో అనిశ్చితి, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం వంటి పరిణామాలు ప్రపంచ పాలనా వ్యవస్థను మరింత విభజిస్తున్నాయని కథనం విశ్లేషించింది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సామర్థ్యం, ప్రాతినిధ్యం, విశ్వసనీయతపై ఇప్పటికే ఉన్న ప్రశ్నలు మరింత తీవ్రమయ్యాయని తెలిపింది.అమెరికా ప్రపంచ నాయకత్వం నుంచి వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో మధ్యస్థాయి శక్తులు, ప్రాంతీయ కూటములు ముందుకు వస్తున్నాయని కథనం పేర్కొంది. ఇవి ప్రాంతీయ భద్రత, ఆర్థిక సమన్వయం కోసం కొత్త వ్యవస్థలను నిర్మిస్తున్నాయని తెలిపింది. కొందరు దీనిని మరింత బహుళ ధ్రువ, సమగ్ర ప్రపంచ వ్యవస్థకు దారితీసే మార్పుగా చూస్తుండగా, మరికొందరు సామూహిక భద్రత బలహీనపడి ప్రాంతీయ అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.ట్రంప్ విదేశాంగ విధానం తాత్కాలిక మార్పు కాదని, అంతర్జాతీయ రాజకీయాల్లో పునరావృతం చేయగల ప్రత్యేక విధానంగా ‘ట్రంపిజం’ స్థిరపడిందని కథనం తేల్చింది. భవిష్యత్తులో ఇది అధికార వికేంద్రీకరణ, ప్రాంతీయత పెరుగుదల, కొత్త ప్రపంచ పాలనా నమూనాల అన్వేషణకు దారితీస్తుందని విశ్లేషించింది.భారత్పై ప్రభావం ఎలా?ట్రంపిజం ప్రభావం భారత్పై ప్రధానంగా వాణిజ్యం, విదేశాంగ విధానం, వ్యూహాత్మక సంబంధాలపై కనిపించే అవకాశం ఉంది. ‘అమెరికా ఫస్ట్’ విధానంలో భాగంగా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచడం భారత ఎగుమతులపై ఒత్తిడి పెంచవచ్చు. 2026 ఫిబ్రవరిలో భారత్పై పరస్పర సుంకంపై ఒప్పందం కుదిరినా, అమెరికా వాణిజ్య విధానంలో మార్పులు భారత ఎగుమతిదారులకు అనిశ్చితిని కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా మార్కెట్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ యూరప్, ఆసియా, ఇతర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించాల్సిన అవసరం పెరుగుతోంది. విదేశాంగపరంగా కూడా భారత్ అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే రష్యా, చైనా, యూరప్తో సంబంధాలను సమతుల్యం చేసే విధానాన్ని మరింత జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుంది. -
డోర్బెల్ కెమెరాలో భయానక దృశ్యాలు.. షాక్ అవ్వాల్సిందే!
ఇంటికి అడుగుల దూరంలోనే.. ఒక్కసారిగా పిడుగు పడి ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ భయానక క్షణాలు ఇంటి డోర్బెల్ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూయార్క్లో జరిగిన ఈ ఘటనలో థామస్ ఫహ్మీ ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన శరీరమంతా ఒక్కసారిగా తీవ్రమైన విద్యుత్ షాక్ వ్యాపించినట్లు అనిపించిందని.. మొద్దుబారడం, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించాయని ఆయన తెలిపారు.స్టాటెన్ ఐలాండ్లో నివసించే థామస్ ఫహ్మీ గత గురువారం దంత వైద్యుడి వద్దకు వెళ్లేందుకు తన ఇంటి నుంచి కారువైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. విండ్సర్ రోడ్ సమీపంలో తన కారుకు సుమారు 15 నుంచి 25 అడుగుల దూరంలో ఉండగా ఒక్కసారిగా ఆయన పాదానికి పిడుగు తాకింది. డోర్బెల్ కెమెరాలో నమోదైన వీడియోలో పిడుగు తాకిన వెంటనే ఫహ్మీ నేలపై పడిపోవడం కనిపించింది. అయితే ఆయన స్పృహ కోల్పోలేదు. తన శరీరమంతా తీవ్రమైన షాక్కు గురైనట్లు, ముఖ్యంగా రెండు పాదాల్లో తీవ్రమైన నొప్పి, మంట మొద్దుబారినట్లు ఫహ్మీ చెప్పారు.Doorbell camera captures dramatic moments when a New York man is struck by lightning pic.twitter.com/QJ4lTyiSkQ— Interesting things (@awkwardgoogle) September 2, 2026పిడుగు ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత ఫహ్మీ తిరిగి లేచి.. సహాయం కోసం సమీపంలోని ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లారు. నాకు సాయం చేయండనే అరుపు వినిపించింది. వెంటనే నా తలుపు దగ్గరకు వెళ్లి చూస్తే ఆయన నేలపై పడి ఉన్నారని పొరుగింటి మహిళ స్టెఫానీ హోమన్ తెలిపారు. అనంతరం ఫహ్మీని నార్త్వెల్ స్టాటెన్ ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరుసటి రోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆశ్చర్యకరంగా.. ఆయనకు ఎలాంటి కాలిన గాయాలు లేవని వైద్యులు గుర్తించారు. -
‘పురుషత్వం’ చుట్టూ తిరుగుతున్న రాజకీయ పోరు
అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ, పన్నులు, సుంకాలు, వలసలు, ఇరాన్లో యుద్ధం వంటి ప్రధాన అంశాలతో పాటు ‘నిజమైన పురుషుడు అంటే ఎవరు?’ అనే ప్రశ్న కూడా కీలకంగా మారుతోంది. ఈ ధోరణికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ శైలి ప్రభావమే కారణం.ట్రంప్ దూకుడైన పురుషత్వాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రత్యర్థులను అవమానించేలా వారికి పేర్లు పెట్టేవారు. ఇప్పుడు అధికారాన్ని తిరిగి సాధించాలని చూస్తున్న కొందరు డెమొక్రటిక్ అభ్యర్థులు కూడా తమదైన పురుషత్వ భావనను ముందుకు తెస్తున్నారు. లింగం, రాజకీయాలపై పరిశోధన చేసే ఎమరీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ బెత్ రీన్గోల్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. డెమొక్రటిక్ ఓటర్లు పోరాడే స్వభావం ఉన్న అభ్యర్థిని కోరుకుంటున్నారు.మిషిగన్లో డెమొక్రటిక్ సెనెట్ అభ్యర్థి అబ్దుల్ ఎనల్ సయీద్, రిపబ్లికన్ ప్రత్యర్థి మైక్ రోజర్స్ మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం సాగింది. రోజర్స్ తన పాఠశాల ఫుట్బాల్ నేపథ్యాన్ని ప్రస్తావించగా, ఎల్ సయీద్ ఆయనను ‘బీటా ఎనర్జీ’ అంటూ విమర్శించారు. రోజర్స్ తిరిగి ఎల్ సయీద్ను పాఠశాల రోజుల్లో తన ప్రాచుర్యాన్ని గుర్తుచేసుకుంటున్న వ్యక్తిగా ఎద్దేవా చేశారు.Low T అంటే? టెక్సాస్లో డెమొక్రటిక్ సెనెట్ అభ్యర్థి జేమ్స్ టలారికోను రిపబ్లికన్ వర్గాలు ‘లో టి టలారికో’ అంటూ విమర్శిస్తున్నాయి. ‘లో టి’ (Low T) అంటే తక్కువ టెస్టోస్టెరాన్ అనే సూచన. 37 ఏళ్ల టలారికో ఈ విమర్శను తేలిగ్గా తీసుకుంటూ, తన వయసు వారికి ఇలాంటి విషయాలపై పెద్దగా ఆందోళన ఉండదని అన్నారు. సెనెటర్ టెడ్ క్రూజ్ కూడా టలారికో పురుషత్వాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారు.ఎల్ సయీద్ మాత్రం పురుషత్వం వ్యాయామశాలలో శారీరక బలం చూపించడంలో లేదని, కుటుంబం, సమాజం పట్ల ఎలా బాధ్యత వహిస్తారనేదే ముఖ్యమని అన్నారు. టలారికో కూడా తన దత్తత తండ్రి ప్రతి శనివారం తన ఇంటితో పాటు పక్కింటి వృద్ధ మహిళ ఇంటి పచ్చికను కూడా కోసేవారని చెబుతూ, “నిజమైన పురుషుడు బాధ్యత తీసుకుంటాడు” అని ఓటర్లకు వివరిస్తున్నారు. ఈ విధంగా వ్యక్తిగత దూషణలుగా మొదలైన పురుషత్వ రాజకీయాలు ఎన్నికల ప్రచారంలో విస్తృత సాంస్కృతిక చర్చగా మారే అవకాశం ఉంది. -
సిక్కు కథక్ నర్తకుడు..! నటి రేఖ మూవీ..
శాస్త్రీయ నృత్యం అనగానే సర్వసాధారణంగా అమ్మాయిలే ఎక్కువగా నేర్చుకుంటారు. ఒకప్పుడు నాటకాల్లో అది అబ్బాయిలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం జనరేషన్లో అబ్బాయిలు శాస్త్రీయ నృత్యం నేర్చుకునే వాళ్లు అరుదు. పైగా వేళ్ల మీద లెక్కించి చెప్పొచ్చు కూడా. కానీ ఒక సిక్కు అబ్బాయి కాళ్లకు గజ్జెలు కట్టుకుని శాస్త్రీయ నృత్యం అంటే..కచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వేళ నేర్చుకున్నా.. అతడిపై ఎన్నో ఆంక్షలు, అవమానాలు తప్పవు. ముందుగా ఈ సవాళ్లని తట్టుకుని నేర్చుకుని మంచి నర్తకుడి అనిపించుకోవం మాటులు కాదు. కానీ సిక్కు అబ్బాయ్ నృత్యం ఎంత ముగ్ధమనోహరంగా ఉంటుందంటే..కనులు ఆర్పడమే మర్చిపోతాం. అతడే ఆసా విల్లోబీ. భారతీయ శాస్త్రీయ నృత్యానికి లింగ భేదం లేదు. పైగా నటరాజుకి అంకితమిచ్చేలా మగవాళ్లు కూడా ఆ కాలంలో నృత్యం చేసేవారు. అయితే ప్రస్తుతం మాత్రమే ఆ శాస్త్రీయ నృత్యం కేవలం స్తీలకే పరిమితం అనేలా ఉంది అందరి ధోరణి. అలాంటి కాలంలో ఇంగ్లాండ్కి చెందిన ఆసా విలేబీ అనే సిక్కు కథక్ నేర్చుకోవాలని ఆశపడ్డాడు. అది కూడా బాలీవుడ్ ప్రసిద్ద నటి రేఖ నటించిన 'ఉమ్రావ్ జాన్' మూవీ అతడిని కథక్ భంగిమల పట్ల ఆకర్షితుడయ్యేలా చేసింది. అలా 17 ఏళ్ల వయసులో ఆ కథక్ నృత్యం నేర్చుకోవాలని తరగతులకు వెళ్తే..అక్కడంతా స్త్రీలే..తనొక్కడే మగవాడు. అంతేగాదు సిక్కు మతస్థుడిగా 21 ఏళ్ల వయసు నుంచి తలపాగా ధరించడం మొదలయ్యాక..ఇది నీకు అవసరమా అన్నట్లు చూసే చూపులు, ఈసడింపులు ఎక్కువయ్యాయి. అసలు అతడు మగవాడేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేసి ఇబ్బంది పెట్టేవారు. ఆ క్రమంలో అతడికి తన అమ్మే వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించింది. స్టేజ్పై ప్రదర్శనలిచ్చేటప్పుడు కూడా ఆమె ఎంతో మద్దతిచ్చారామె. అంతేగాదు మగవాళ్లకు ఇది హుందాతన కాదు అంటూ ఎగతాళి మాటలు కూడా ఎక్కువయ్యాయి. కానీ ఆసా హుందాతనం అనేది లింగ భేధం ద్వారా వచ్చేది కాదని, మనల్ని మనం ఎలా ప్రదర్శించుకుంటున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. అంతేగాదు ఆశా భరత నాట్యం, కథక్లో మంచి ప్రావిణ్యం ఉన్న నర్తకుడు. ప్రస్తుతం ఆసా సోషల్ మీడియాలో ఒక డాన్స్ పేజీని ప్రారంభించి భారతీయ శాస్త్రీయ నృత్యానికి లింగభేదం లేదా సరిహద్దులు లేవని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే తానే యూకే నుంచి యూఎస్కి రావడంతోనే తన దృక్పథం మారిందని చెబుతున్నాడు. ఇక్కడకు వచ్చాక దేవాలయాలు, ఉత్సవాల బుకింగ్ల నుంచి ఆహ్వానాలు అందయాని ఆనందంగా చెబుతున్నాడు. కాగా, కథక్ని యూకేకి చెందిన అనురాధ చతుర్వేది శిష్యుడు సుజాతా బానర్జీ వద్ద శిక్షణ తీసుకున్నాడు . అలాగే భరతనాట్యం అనన్య ఛటర్జీ, తంగమణి కుట్టి, మార్సియా మాధవి మైల వద్ద నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన యూఎస్లో పీహెచ్ చేస్తున్నారు. సమాజపు మూస పద్ధతులను సవాలు చేస్తూ తన కళతోటే నిశబ్దంగా మాట్లాడుతున్నాడు ఆశా విల్లోబీ. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)(చదవండి: క్లౌడ్ కిచెన్తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!) -
అమెరికా–ఇరాన్ యుద్ధం: గల్ఫ్లో హైటెన్షన్.. తాజా పరిణామాలు ఇవే
దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమాసియా భగ్గుమంటోంది. కాల్పుల విరమణను తుంగలో తొక్కి.. శాంతి చర్చలను పక్కన పెట్టి.. అమెరికా-ఇరాన్ను పరస్పర దాడులు జరుపుతున్నాయి. తాజాగా అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వరుస క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. మరోవైపు అమెరికా బలగాలు హర్ముజ్ జలసంధిపై దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఇవిగో..US-Iran War Live Updatesఅరబ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్అమెరికా బలగాలను పంపించేయండి.. లేదంటే దాడులే అంటూ అరబ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. తమ భూభాగాల్లోని అమెరికా బలగాలను, సైనిక స్థావరాలను తొలగించాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) పొలిటికల్ వింగ్ డిప్యూటీ జనరల్ యదొల్లా జవానీ హెచ్చరించారు. అమెరికా దాడులకు తమ దేశాల నుంచి ఏదైనా వేదికగా మారితే ‘తీవ్రమైన’ ప్రతీకారం తప్పదన్నారు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.బెత్లహెమ్లో పాలస్తీనా ఇంటి కూల్చివేతవెస్ట్ బెత్లహెమ్లోని నహాలిన్ పట్టణంలో పాలస్తీనాకు చెందిన ఓ ఇంటిని ఇజ్రాయెల్ బలగాలు కూల్చివేశాయి. సైనిక వాహనాలు, బుల్డోజర్లతో పట్టణంలోకి ప్రవేశించిన బలగాలు.. 15 ఏళ్లకు పైగా నివాసంగా ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్పై ఇరాన్ డ్రోన్ దాడులు?బహ్రెయిన్లోని అమెరికా స్థావరాన్ని ఇరాన్ భారీ డ్రోన్ దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ దాడిపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో బహ్రెయిన్ రక్షణ దళాలు తమ గగనతలంలోకి వచ్చిన పలు ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి.జోర్డాన్లోకి 13 బాలిస్టిక్ మిసైళ్లుఇరాన్ నుంచి వచ్చిన 13 బాలిస్టిక్ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎదుర్కొన్నట్లు జోర్డాన్ ప్రకటించింది. అయితే ఈ క్షిపణుల వల్ల నష్టం జరిగిందా?.. ఎక్కడ పడ్డాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.మష్హద్లో విషాదంఇరాన్లోని ఈశాన్య నగరం మష్హద్లో ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతుగా జరుగుతున్న కార్యక్రమంలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 10 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది రోడ్డు ప్రమాదమేనని, రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడిజోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్పై భారీ బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ IRGC ప్రకటించింది. అక్కడ RQ-4, MQ-9 డ్రోన్లను ఉంచిన హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. పలు డ్రోన్లు ధ్వంసమయ్యాయని, అమెరికా సిబ్బందిలో కొందరు మరణించారని, మౌలిక వసతుల్లో మంటలు చెలరేగాయని పేర్కొంది. అయితే దీనిపై అమెరికాగానీ, జోర్డాన్గానీ ఇంకా స్పందించలేదు. లవాన్ ద్వీపంపై అమెరికా దాడులుఇరాన్లోని లవాన్ ద్వీపంపై అమెరికా జరిపిన తాజా దాడుల్లో ముగ్గురు బసీజ్ పారామిలటరీ సభ్యులు మరణించినట్లు ఇరాన్ సెమీ అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.పెళ్లి వేడుకపై దాడి.. ఘోరంఇరాన్లోని సిరిక్ సమీపంలో జరిగిన పెళ్లి వేడుకపై అమెరికా దాడి జరిగిందని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించగా.. మరో 50 మంది గాయపడినట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.హర్ముజ్లో షిప్పింగ్ ట్రాఫిక్ డౌన్హర్ముజ్ జలసంధి మీదుగా మంగళవారం కేవలం నాలుగు వాణిజ్య నౌకలు మాత్రమే ప్రయాణించాయి. సాధారణంగా 10 రోజుల సగటు రోజుకు సుమారు 13 నౌకలుగా ఉండగా.. తాజా సంఖ్య దాని కంటే గణనీయంగా తక్కువగా ఉంది. కేప్లర్ ప్రాథమిక షిప్పింగ్ డేటా ప్రకారం నాలుగు నౌకల్లో ఒకటి భారీ క్రూడ్ ఆయిల్ క్యారియర్, మిగిలినవి వివిధ రకాల సరకు/చమురు రవాణా నౌకలు. అయితే సోమవారం హర్ముజ్ జలసంధి మీదుగా 17 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. యుద్ధం కారణంగా రాకపోకలు తగ్గిన తర్వాత ఒక్కరోజులో నమోదైన అత్యధిక చమురు రవాణా ఇదేనని పేర్కొన్నారు.బహ్రెయిన్లో వరుస అలర్ట్లుబహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరు గంటల వ్యవధిలో మూడోసారి ‘పొంచి ఉన్న ముప్పు’పై అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరింది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధిపై అమెరికా బలగాలు దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్నదని పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా దాడులు, ఆ తర్వాత టెహ్రాన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్ ప్రతీకార దాడులుఅమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు IRGC ప్రకటించింది. అమెరికా దాడులను ‘నిరాశతో కూడిన దాడులు’గా అభివర్ణించింది. ప్రతీకార చర్యల్లో పెద్ద సంఖ్యలో అమెరికా బలగాలను హతమార్చినట్లు పేర్కొన్నప్పటికీ.. ఈ వాదనపై అమెరికా నుంచి తక్షణ ధ్రువీకరణ రాలేదు.ఇరాన్ ప్రతీకార దాడుల పరిధి కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్లోని ఎర్బిల్ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, చమురు రవాణాపై యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికుల రాక.. సెక్స్వర్కర్ల వేట! -
అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని, పురస్కరించుకొని నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది.వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, మిషిగన్, మిన్నెసోటా, మిస్సోరీ, న్యూ జెర్సీ, ఒక్లాహోమా, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా తదితర రాష్ట్రాలలోని సుమారు 25 ప్రాంతాల నుంచి మూడువేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి అందించాలనే లక్ష్యంతో మనబడి భాషా సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ‘తెలుగుకు పరుగు’లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకులు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ, మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతుల గురించి వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను తెలియజేస్తూ, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని గుర్తుచేశారు. అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాలలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు తరగతులు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన మనబడి అధ్యక్షులు, కులపతి చమర్తి రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుకు పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు. Run4Telugu పోటీలను రెండు విభాగాలలో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి మెడల్స్తో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనబడి ధృవపత్రాలను అందజేశారు. ఆయా ప్రాంతాలలో పాల్గొన్న వారికి అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు. అంతేగాదు “తెలుగు నేర్చుకుందాం… తెలుగు మాట్లాడుదాం… తెలుగు భాషను భావితరాలకు అందిద్దాం” అనే మనబడి సందేశాన్ని అమెరికా వ్యాప్తంగా ధ్వనింపచేసేలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు) -
పెళ్లి వేడుకపై అమెరికా వైమానిక దాడి.. భారీగా మరణాలు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండగా అమెరికా వైమానిక దాడి జరిగినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా కనీసం ఐదుగురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై ప్రజలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్ముజ్ జలసంధికి సమీపంలోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ సిరిక్ కౌంటీలోని కుహెస్తాక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న నివాస భవనంపై అమెరికా సైన్యం దాడి చేసినట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై వేర్వేరు వివరాలు వెలువడుతున్నాయి. రాయిటర్స్ ప్రకారం గాయపడిన వారి సంఖ్య 68 వరకు ఉండొచ్చని సమాచారం.🇺🇸🇮🇷Watch: Footage of the MOMENT U.S. Struck the Wedding in IranIt was a DOUBLE TAP. Multiple Missiles SO MANY KIDS got hurt and reports say at least five people, including two children were killed.#iran #usa #breaking #war #trump pic.twitter.com/ksEgOS89F3— pradhyumn sharma (@pradhyu78651514) September 2, 2026ఈ దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పౌరులపై జరుగుతున్న వరుస దాడుల్లో ఇది మరో ఘోర ఘటన అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మండిపడింది. ఇరాన్లోని అమెరికా దౌత్యపరమైన చర్యలను కూడా తీవ్రంగా విమర్శించింది. మరోవైపు.. ఇరాన్పై అమెరికా కొత్తగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు చెందిన లక్ష్యాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, సముద్ర సంబంధిత వ్యవస్థలు, మైన్లు ఏర్పాటు చేసే సామర్థ్యాలు, కమ్యూనికేషన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది.అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు సమాచారం. జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించిన 13 బాలిస్టిక్ క్షిపణుల్లో 10 క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు జోర్డాన్ తెలిపింది. బహ్రెయిన్ కూడా ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించింది. కొన్ని వారాలుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ యుద్ధ వాతావరణంగా మారడంతో అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఘర్షణలు ఇటీవలి వారాల్లోనే అత్యంత తీవ్రమైనవిగా మారాయి. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో కీలక భాగం జరుగుతున్న నేపథ్యంలో తాజా దాడులు అంతర్జాతీయ చమురు మార్కెట్లపైనా ప్రభావం చూపుతున్నాయి.#BREAKING: 🇺🇸 US strike hits wedding house in Kuhestak. Officials report 5 dead others wounded #Iran #USStrike #IranWar https://t.co/dJWCTViR4S pic.twitter.com/yRaszGuoEF— Twilight (@TwilightDewy) September 1, 2026 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’
తన ప్రాణాలకు ముప్పు లేదని తరచూ చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రత విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడరు. అలాంటిది ప్రాణభయంతో ప్రయాణిస్తున్న విమానాన్ని రహస్యంగా మార్చడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ విషయాలు ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సదస్సు కోసం జూలై 8న టర్కీలోని అంకారాకు వెళ్లారు. సదస్సు ముగించుకుని అమెరికాకు తిరుగు ప్రయాణంలో.. భద్రతా కారణాలతో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి రహస్యంగా మరో సైనిక విమానంలోకి మార్చారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనను.. ‘ఇన్స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’ పేరుతో నెట్ఫ్లిక్స్ రూపొందించింది. ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సెప్టెంబర్ 4(ఎల్లుండి) నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇందులో ఏం చూపించబోతున్నారు? ఇది ఎన్ని వివాదాలు.. అభ్యంతరాలకు దారి తీస్తుందో ? అనే ఆసక్తి నెలకొంది.డీకాయ్ ప్లేన్ అంటే.. ట్రంప్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోనే ప్రయాణిస్తున్నారని బయటకు కనిపించేలా చేస్తూనే.. వాస్తవంగా ఆయనను మరో సైనిక విమానంలోకి తరలించడమే డీకాయ్ ప్లేన్. అసలు ట్రంప్ ఏ విమానంలో ఉన్నారో గుర్తించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలోనే అమెరికా భద్రతా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ముప్పును నిర్ధారించుకోకుండానే అమెరికా బలగాలు ఈ సీక్రెట్ జర్నీ ఆపరేషన్ నిర్వహించినట్లు తర్వాత తేలింది.క్యాటరింగ్ ట్రక్కులో..ఈ రహస్య ఆపరేషన్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ట్రంప్ విమానం మారిన విధానం. ఒక విమానం నుంచి మరో సైనిక విమానానికి ఆయనను సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాలు తరలించే క్యాటరింగ్ ట్రక్కులో తీసుకెళ్లినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఈ రహస్య బదిలీ గురించి ట్రంప్ వెంట ఉన్న మీడియా ప్రతినిధుల్లో చాలామందికి కూడా సమాచారం లేదని కథనాలు పేర్కొన్నాయి.కొందరు మాత్రమే వెంట..ట్రంప్తో పాటు ఈ రహస్య బదిలీలో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. వైట్హౌస్ సిబ్బంది, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తదితరులు ఆయనతో వెళ్లినట్లు కథనాలు తెలిపాయి. మరోవైపు అప్పటి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, స్టీఫెన్ మిల్లర్, అప్పటి వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తదితరులు డీకాయ్గా ఉన్న విమానంలోనే కొనసాగారు.బ్రిటన్లో మళ్లీ విమానం మార్పు?టర్కీ నుంచి ట్రంప్ ప్రయాణించిన సైనిక విమానం బ్రిటన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ మిల్డెన్హాల్ స్థావరానికి చేరినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అక్కడ ఆయన మరోసారి విమానం మార్చి.. ఖతార్ నుంచి అందిన బోయింగ్ 747లో అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం.ట్రంప్ ఏమన్నారు?ఈ వ్యవహారం బయటకు రావడంతో ట్రంప్ విమానం ఎందుకు మార్చారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఊహాగానాలు వెల్లువెత్తాయి. అనంతరం ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. తనకు ఇలాంటి ముప్పు పొంచి ఉండడం సహజమేనని, భయపడే రకం తాను కాదని.. అయితే సీక్రెట్ సర్వీస్, మిలిటరీ అధికారులు సురక్షితమైన మార్గమని సూచించడంతో తాను వారి ఆదేశాలను పాటించినట్లు చెప్పారు. ట్రంప్ మాత్రమే కాదు గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు, ఆ మాటకొస్తే పలువురు ప్రపంచ అధినేతల కోసం ఇలాంటి సీక్రెట్ జర్నీలు ఏర్పాటు చేశారు.ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కథనం..ఇప్పటివరకు వార్తలు, ఊహాగానాలకే పరిమితమైన ఈ రహస్య ప్రయాణం వెనుక కథను Instadocs: The Decoy Plane పేరిట నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఘటనను తొలిసారి రిపోర్ట్ చేసిన జర్నలిస్టులతో పాటు వైట్హౌస్, విమానయాన రంగానికి చెందినవారు, మాజీ సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో చేసిన ఇంటర్వ్యూలను ఇందులో చూపించనున్నారు. సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో.. ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’ మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికులొస్తున్నారు.. అలర్ట్This July, while flying back from a NATO summit in Turkey, President Trump slipped off Air Force One in a catering truck and secretly boarded a different aircraft — leaving traveling reporters to fly on, unaware the president was no longer with them.Instadocs: The Decoy Plane,… pic.twitter.com/iuADnXxMoV— Netflix (@netflix) September 1, 2026 -
అమెరికా రక్షణ శాఖలో తీవ్ర కలకలం!
-
200 రోజుల తర్వాత ఒడ్డుకు.. పట్టాయాలో హైఅలర్ట్!
థాయ్లాండ్లోని ప్రముఖ పర్యాటక నగరం పట్టాయాలో ఈ వారం భారీ సందడి నెలకొననుంది. అమెరికా నేవీకి చెందిన దాదాపు 5,000 మంది సైనికులు లామ్ చబాంగ్ పోర్టుకు చేరుకోనున్నారు. సెలవులు ముగిసే వరకు వాళ్లు అక్కడే గడపబోతున్నారు. అయితే ఇంతకాలం కుటుంబాలకు దూరంగా ఉన్న వీళ్లు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం, ప్రలోభాలకు లొంగిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే అక్కడి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టాయా.. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామం. వియత్నాం యుద్ధ సమయంలో థాయ్లాండ్లో విధులు నిర్వర్తించిన అమెరికా సైనికులు విశ్రాంతి కోసం ఇక్కడికి రావడంతో.. క్రమంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ప్రస్తుతం అక్కడి అందాలను వీక్షించేందుకు పలు దేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇటు చాలాకాలంగా సెక్స్ టూరిజంతో ముడిపడిన నగరంగానూ పట్టాయా గుర్తింపు పొందింది.అయితే ఇరాన్ యుద్ధం కారణంగా 200 రోజులకు పైగా సముద్రంలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకలో వేల మంది అమెరికన్ సైనికులు గడిపారు. కుటుంబాలకు దూరంగా ఉండడంతో ఆ సమయంలో వాళ్లు మానసికంగా కుంగిపోయారని.. సూసైడ్లు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ తరుణంలో వాటిని ఖండించిన అమెరికా రక్షణ శాఖ.. వాళ్లకు విశ్రాంతి ఇస్తూ వాషింగ్టన్ నౌకలో ఫ్రెష్ బ్యాచ్ సైనికులు అక్కడికి పంపింది. దీంతో లింకన్తో పాటు మరో రెండు నేవీ నౌకలు అక్కడికి రానున్నాయి. అయితే వాళ్ల సైనికుల రాకకు ముందే పట్టాయా పోలీసులు బీచ్, నైట్లైఫ్ ప్రాంతాల్లో నిఘా పెంచారు. సెక్స్ వర్కర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. వారాంతంలో నిర్వహించిన దాడుల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నారనే అనుమానంతో సుమారు 40 నుంచి 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సైనికులు వచ్చే లోపు సెక్స్ ట్రేడ్ను పూర్తిగా అరికట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టాయా పోలీస్ చీఫ్ అనెక్ స్రాథోంగ్యూ మాట్లాడుతూ.. ఇక్కడ వ్యభిచార కార్యకలాపాల్ని నియంత్రించడం అంత సులభం కాదు. వాళ్ల నెట్వర్క్లు చాలా పెద్దగా ఉంటాయి. మసాజ్ ముసుగులో చేస్తారని భావించినా.. అలా ఎన్నడూ ఏ రాకెట్ దొరకలేదు. అందుకే వాళ్ల కార్యకలాపాన్ని గుర్తించడం కష్టమవుతోంది. అయితే ఒకేసారి వేల మంది వస్తుండడంతో.. బహిరంగ ప్రదేశాల్లోనే అమెరికన్ సైనికులను కొందరు సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. పట్టాయాకు భారీగా ఆదాయంఅమెరికా సైనికుల రాకతో పట్టాయా ఆర్థిక వ్యవస్థకు కాస్త ఊతం లభిస్తుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, దుకాణాలు తదితర వ్యాపారాలకు ప్రయోజనం కలగనుందని భావిస్తున్నారు. ఒక్కో అమెరికా సైనికుడు రోజుకు సుమారు 1,000 నుంచి 3,000 థాయ్ బాత్(రూ.2,800 నుంచి రూ.8,500 వరకు) ఖర్చు చేసే అవకాశం ఉందని పట్టాయా మేయర్ పొరమాస్ న్గాంపిచెస్ అంచనా వేశారు. అయితే సిబ్బంది మొత్తం ఒకేసారి నగరంలోకి రాకుండా విడతల వారీగా.. అక్కడికి వెళ్లే అవకాశం ఉండటంతో ఈ ప్రభావం కొన్ని రోజుల పాటు కొనసాగనుంది.అటు అమెరికా కూడా అలర్ట్.. అటు అమెరికా కూడా తమ సైనికులకు హెచ్చరికలు జారీ చేసింది. పట్టాయాలో షోర్ లీవ్ సందర్భంగా అపరిచిత వ్యక్తులు లేదంటే సెక్స్ వర్కర్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని లేదా సున్నితమైన సైనిక వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని రక్షణ అధికారులు సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఖల్లాస్.. ఇక హర్ముజ్ మాదే! -
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఆకస్మిక వరదలతో అతలాకుతలం అయిన నేపాల్ సరికొత్త డిమాండ్ను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. భారత్ సహా పలు దేశాలు పాలు పంచుకుంటున్నాయి. అయితే తమకు సాయంతో పాటు న్యాయం కూడా జరగాలని నేపాల్ వాదిస్తోంది. చేయని తప్పులకు శిక్ష తామెందుకు అనుభవించాలని.. భారత్, చైనా, అమెరికాలు తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ చెబుతోంది.హిమాలయ దేశం నేపాల్.. ఇప్పుడు క్లైమేట్ జస్టిస్ పేరిట ప్రపంచం ముందు ఓ ప్రశ్న ఉంచింది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే తాము భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్ తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ చెబుతున్నారు. తాము తక్కువ స్థాయిలోనే కార్బన్ ఉద్గారాలు చేస్తున్నా.. వాతావరణ మార్పుల ప్రభావంతో భారీ విపత్తులను ఎదుర్కొంటున్నామని శిశిర్ అంటున్నారు. తమ దేశం సృష్టించని సంక్షోభానికి తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘ఇది పర్వత సునామీ’చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. హిమనదీ ప్రాంతంలో మంచు, శిలలు కూలిపోవడంతో భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో వెయ్యి మందికి పైనే ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. సాధారణ వర్షపాతం లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బాధిత ప్రాంతాల ప్రజలకు తగినంత ముందస్తు హెచ్చరిక అందలేదు. దీంతో ఈ విపత్తును నేపాల్ విదేశాంగ మంత్రి ‘క్యాటస్ట్రాఫిక్ మౌంటెన్ సునామీ’గా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతమవుతోందని.. దాని ప్రభావంతో హిమనదులు, పర్వత వాలులు ఆందోళనకరంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మా తప్పు లేకుండా మూల్యం చెల్లిస్తున్నాం’వాతావరణంలోకి నేపాల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు వాస్తవంగా చాలా తక్కువ. అయినప్పటికీ మేం సృష్టించని ప్రపంచ సంక్షోభానికి అంతిమ మూల్యం చెల్లిస్తున్నాం’’ మంత్రి ఖనాల్ అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుదల, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వరదలతో నేపాల్లో కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కూడా గణనీయమైన భాగం దెబ్బతిందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారాయన.‘సాయం కాదు.. న్యాయం’ఇది నాగరికత మనుగడకు సంబంధించిన విషయం. ఇకపై వాతావరణ విపత్తుల విషయంలో మా దౌత్య విధానాన్ని ‘సాయం’గా కాకుండా.. ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్లిస్తాం. ఇది దాతృత్వం కాదు.. చట్టపరమైన, నైతిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు నేపాల్ క్లెయిమ్ పంపిందని మంత్రి వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు.కాలుష్యంలో ఎవరి వాటా ఎంత?వాతావరణ మార్పులపై నేపాల్ చేస్తున్న వాదనలో ప్రధానంగా కార్బన్ ఉద్గారాల అసమానతను ప్రస్తావిస్తోంది. గ్లోబల్ కార్బన్ బడ్జెట్ (Global Carbon Budget 2025) గణాంకాల ప్రకారం.. కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల్లో చైనా వాటా సుమారు 32 శాతం. అమెరికా వాటా 13 శాతం, భారత్ వాటా 8 శాతం. అంటే ఈ మూడు దేశాలే కలిపి ప్రపంచ ఫాసిల్ కార్బన్ ఉద్గారాల్లో దాదాపు 53 శాతం రిలీజ్ చేశాయన్నమాట. అయితే.. అయితే నేపాల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2024 గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి రిలీజ్ అయిన కర్బన ఉద్గారాలు సుమారు 1.59 కోట్ల టన్నులు మాత్రమే. అంటే ప్రపంచ దేశాల్లో ఆ వాటా 0.04 శాతం మాత్రమే. అలాగే యావరేజ్గా ఒక దేశం 0.5 టన్నులు రిలీజ్ చేస్తుంటే.. నేపాల్ అంతకంటే తక్కువగా ఉందన్నమాట. అలాగని..చైనా, అమెరికా, భారత్ వంటి దేశాలు నేపాల్కు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలనే రూల్గానీ, చట్టంగానీ లేదు. ఇది కేవలం నేపాల్ తెర మీదకు తెచ్చిన ‘క్లైమేట్ జస్టిస్–లాస్ అండ్ డ్యామేజ్’ వాదన మాత్రమే. అయితే తక్కువ ఉద్గారాలు చేసే దేశాలే వాతావరణ విపత్తులతో ఎక్కువగా నష్టపోతున్న నేపథ్యంలో.. ఎక్కువ కార్బన్ను రిలీజ్ చేస్తున్న చేసిన దేశాలు ఆర్థిక బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: కాల్చరు.. పూడుస్తారు! ఎందుకో తెలుసా? -
హార్ముజ్పై ట్రంప్ సంచలన కామెంట్స్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిపై అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలుతున్నదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రెండు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ట్రూత్ సోషల్లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ను మళ్లీ చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి తాను ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరినా తనకు పెద్దగా పట్టింపు లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిపై అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉండటం, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉండటమే తనకు సరైన పరిస్థితి అన్నట్లుగా వ్యాఖ్యానించారు.మరోవైపు.. ఇరాన్పై అమెరికా తాజాగా భారీ వైమానిక దాడులు చేసింది. హార్ముజ్ సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, సముద్ర సంబంధిత లక్ష్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ సముద్రంలో మైన్లు ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలు, అమెరికా బలగాలు, వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.ఇదీ చదవండి: పెద్దన్నా.. ఏంటీ కన్ఫ్యూజన్? ఆంక్షలా.. దాడులా? అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ హెచ్చరించింది.చమురు ధరలకు సెగహార్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ జలసంధి మీదుగా సాగుతుంది. తాజా దాడుల నేపథ్యంలో బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 95.52 డాలర్లకు, WTI ధర 91.02 డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా.. అమెరికా నౌకాదళ దిగ్బంధం కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. మార్చిలో రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్లుగా ఉన్న ఇరాన్ క్రూడ్ లోడింగ్స్ ఆగస్టులో కేవలం 2.2–2.55 లక్షల బ్యారెళ్లకు పడిపోయినట్లు రాయిటర్స్ తెలిపింది. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.మొత్తంగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఆరు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణ మరో కీలక మలుపు తిరిగింది. హార్ముజ్పై నియంత్రణ, చమురు ఎగుమతులు, అమెరికా సైనిక చర్యలే ఇప్పుడు ఇరుదేశాల మధ్య ప్రధాన పోరాటంగా మారాయి. తాజా పరిణామాలతో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి -
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా తాజా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.ఇరాన్ మంగళవారం రాత్రి జోర్డాన్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. జోర్డాన్లో సైరన్లు మోగగా, ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించిన 13 ఇరాన్ క్షిపణుల్లో పదింటిని వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మిగిలిన మూడు క్షిపణులు జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పడినట్లు జోర్డాన్ సాయుధ దళాలు వెల్లడించాయి.జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఇరాన్కు చెందిన IRGC మాత్రం జోర్డాన్లోని క్యాంప్ టిటిన్పై దాడి చేసి భారీ సంఖ్యలో అమెరికా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది.మరోవైపు బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్ బేస్ వద్ద అమెరికా సైనికులు, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని కామికేజ్ డ్రోన్లతో భారీ దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే ఈ దాడిపై బహ్రెయిన్ లేదా అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు.బహ్రెయిన్, కువైట్కు హెచ్చరికలుఅమెరికా దాడులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి తీవ్ర హెచ్చరికలు చేశారు. బహ్రెయిన్, కువైట్ విషయంలో ఇకపై ఇరాన్ సంయమనం పాటించబోదని తెలిపారు. “బహుమతులు దారిలో ఉన్నాయి” అంటూ హెచ్చరించారు.అమెరికా దాడులకు ఇదే కారణంఇరాన్పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లు అమర్చేందుకు ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా సైనిక స్థావరంపై ఎనిమిది క్షిపణులు ప్రయోగించడం తమ దాడులకు కారణమని ట్రంప్ తెలిపారు.చదవండి: ఇరాన్పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా -
ఇరాన్పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా
ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడులు ప్రారంభించాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లు అమెరికా వెల్లడించింది.Today at 12 p.m. ET, U.S. forces began striking Islamic Revolutionary Guard Corps (IRGC) targets in Iran. The strikes follow recent attempted attacks by the IRGC against commercial shipping in the Strait of Hormuz and against American service members deployed to the region.— U.S. Central Command (@CENTCOM) September 1, 2026హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని IRGC ఇటీవల దాడులకు ప్రయత్నించిందని అమెరికా పేర్కొంది. అలాగే ఈ ప్రాంతంలో మోహరించిన అమెరికా సైనికులపై కూడా IRGC దాడులకు ప్రయత్నించినట్లు తెలిపింది.ఈ పరిణామాల నేపథ్యంలోనే IRGC లక్ష్యాలపై అమెరికా సైనిక చర్య చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోని కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి చుట్టూ ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు తాజా దాడులతో మరింత పెరిగే అవకాశం ఉంది.కాగా, అమెరికా-ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత ఈ ఆదివారం మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్ జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్ననే తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.చదవండి: ఉత్తరకొరియా బిగ్ వార్నింగ్.. ఇలాగైతే ప్రపంచం.. -
పెద్దన్నా.. ఏంటీ కన్ఫ్యూజన్?? ఆంక్షలా.. దాడులా?
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఒకవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న ట్రంప్.. మరోవైపు అవసరమైతే ఇరాన్పై భారీ సైనిక దాడులు తప్పవంటూ బెదిరిస్తున్నారు. ఆ వెంటనే అదో చిన్న యుద్ధమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో పెద్దన్న వైఖరిలో స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అంటే ఆర్నెలు పూర్తయ్యిందన్నమాట. అయితే ఇరాన్పై అమెరికా తాజాగా మరోసారి సైనిక చర్యకు దిగింది. దాదాపు నెల రోజుల తర్వాత జరిగిన దాడి ఇది. హర్ముజ్ జలసంధిలో సముద్ర గనులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ అమెరికా సైన్యం.. ఇరాన్ రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ కీలక ఇంధన కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ‘తునాతునకలు చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఏఐ వీడియోతో హెచ్చరించారు.అయితే దీనికి కొద్ది రోజుల ముందే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మరో వ్యూహాన్ని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేలా కొత్త ఆంక్షలను అమలు చేయనున్నామని.. దీనిని ఆయన ‘ఆర్థిక డీ-డే’గా అభివర్ణించారు. ఈ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్ను చర్చల బాట పట్టించవచ్చని.. తద్వారా మరోసారి సైనిక ఉద్రిక్తతకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన సంకేతాలిచ్చారు. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ పట్ల ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ అటు ప్రత్యర్థి డెమోక్రట్లే కాదు.. ఇటు సొంత పార్టీ రిపబ్లికన్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘ఏ వ్యూహమో ఏమో.. ఏమీ అర్థం కావడం లేదు’ఆరు వారాల్లో ముగుస్తుందని ట్రంప్ గతంలో చెప్పిన యుద్ధం.. ఆరు నెలలు దాటినా కొనసాగుతుండటం కూడా ప్రశ్నలకు తావిస్తోంది. ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు పలుమార్లు ఈ యుద్ధం ముగిసిందని, అమెరికా విజయం సాధించిందని ప్రకటించినప్పటికీ.. ఇరాన్తో ఉద్రిక్తతలు మాత్రం పూర్తిగా చల్లారలేదు. ట్రంప్ వైఖరిలో తరచూ కనిపిస్తున్న ఈ మార్పులపై అమెరికా రాజకీయ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ట్రంప్ పాలనలోని విధానాలపై అవగాహన ఉన్న మాజీ భద్రతా అధికారి ఒకరు.. ఇరాన్పై యుద్ధం స్పష్టమైన ప్రణాళిక లేకుండానే ప్రారంభమైందని, ఇప్పటికీ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్తో ఎవ్వరూ సంతృప్తిగా లేరా?రిపబ్లికన్ పార్టీలో ఇరాన్ ఉద్రిక్తతలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. యుద్ధం మరింత పొడిగితే చమురు ధరలు పెరిగి.. అమెరికన్లపై భారం పడుతుందని, వచ్చే మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా యుద్ధంపై అప్రమత్తంగా ఉన్న వర్గాలు సైతం సంఘర్షణ త్వరగా ముగియాలని కోరుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్పై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుకునే హార్డ్లైన్ వర్గం కూడా ట్రంప్ తీరుపై పూర్తిగా సంతృప్తిగా లేదు.ట్రంప్ ప్రచార బృందంలో పని చేసిన ఓ మాజీ అధికారి మాట్లాడుతూ.. ఇరాన్ను అదుపులోకి తీసుకురావాలన్న ట్రంప్ లక్ష్యాన్ని సమర్థించే రిపబ్లికన్లు కూడా ప్రస్తుత పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మరో రిపబ్లికన్ వ్యూహకర్త ఈ పరిస్థితిని సరదాగా ‘ఫ్రెండ్లీ జోన్లో చిక్కుకున్నట్లుంది’ అంటూ అభివర్ణించారు. అంటే.. ట్రంప్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా పూర్తిగా ఏ వర్గాన్నీ సంతృప్తిపరచడం లేదన్నమాట.మధ్యంతర ఎన్నికల వేళ పెరుగుతున్న ఒత్తిడిఅమెరికాలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా సవాలుగా మారుతోంది. ఇప్పటికే అధిక ధరలతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్న సమయంలో.. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రభావం చూపితే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా గతంలో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు రవాణా జరిగేది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి.‘ఇది వ్యూహంలో భాగమే’అయితే ట్రంప్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారు మాత్రం ఈ పరిణామాలను మరోలా చూస్తున్నారు. ఇరాన్పై సైనిక, ఆర్థిక ఒత్తిడిని ఒకేసారి కొనసాగించడం ఉద్దేశపూర్వక వ్యూహమేనని వారు చెబుతున్నారు. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోకుండా ఒత్తిడి కొనసాగిస్తూ.. మరోవైపు ఆంక్షల ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై పడే వరకు వేచి చూడాలన్నది ట్రంప్ వ్యూహంగా వారు పేర్కొంటున్నారు.మాజీ అమెరికా రాయబారి జేమ్స్ జెఫ్రీ కూడా తాజా పరిణామాలను ఇరువైపులా జరుగుతున్న ప్రతిచర్యలుగానే అభివర్ణించారు. ఇరాన్, అమెరికా రెండూ పూర్తిస్థాయి దాడులకు తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.యుద్ధం త్వరగా ముగిస్తే మంచిదిఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగంలోనే యుద్ధాన్ని ముగించాలన్న అభిప్రాయం బలపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. చమురు పరిశ్రమకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రకారం.. ఘర్షణలను ముగించాలన్న ఒత్తిడి భారీగా ఉంది. ఇరాన్ పూర్తిగా బలహీనపడే వరకు ఒత్తిడి కొనసాగించాలని భావించే అధికారులు కూడా ఉన్నారు. ఇరాన్ను తీవ్ర ఆర్థిక, సైనిక ఒత్తిడిలోకి నెట్టినప్పుడే అది అమెరికాతో తమకు అనుకూలమైన ఒప్పందానికి వస్తుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదుఅమెరికా విధిస్తున్న ఆంక్షలు తమను చర్చల బాట పట్టిస్తాయన్న వాదనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా వాదనలు అబద్ధాలంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘలీబాఫ్ విమర్శించారు. అమెరికా ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా ఇరాన్కు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసే చైనా.. అంతర్జాతీయ చట్టాలకు ఆధారం లేని ఏకపక్ష అమెరికా ఆంక్షలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.మొత్తంగా.. ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆర్థిక ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేయాలా? సైనిక దాడులతో లొంగదీసుకోవాలా? లేక ఒత్తిడితోనే చర్చల బాట పట్టించాలా? అన్నది మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ఒకవైపు యుద్ధం ముగిసిందంటూనే.. మరోవైపు దాడుల హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత మళ్లీ చర్చలకు సంకేతాలివ్వడం అమెరికా వ్యూహంపై సందేహాలకు తావిస్తోంది. ఇరాన్ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ట్రంప్ నిర్ణయం ఏదైనా కావొచ్చు.. కానీ యుద్ధాన్ని ఎప్పుడు, ఎలా ముగించాలన్నదే ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాలు!. ఇదీ చదవండి: ఈసారి కాస్త గట్టిగానే కొడతాం -
అమెరికా హెచ్-1బీ వీసా వ్యవస్థలో, భారత్ కేంద్రంగా బయటపడ్డ మహా కుంభకోణం
-
ఒకవైపు తలతిక్క నిర్ణయాలు..మరోవైపు యుద్ధోన్మాదం
-
అమెరికా: కత్తితో మహిళ వీరంగం: ఒకరి మృతి.. నిందితురాలి కాల్చివేత!
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో సోమవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో 32 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా, 68 ఏళ్ల వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం నిందితురాలిని పోలీసులు ఘటనా స్థలంలోనే కాల్చిచంపారు.పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్వీన్స్కు చెందిన 49 ఏళ్ల మహిళ తన షాపింగ్ బ్యాగ్లోంచి రెండు పెద్ద కత్తులను బయటకు తీసి ఈ ఘాతుకానికి పాల్పడింది. సబ్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి, రోడ్డు దాటేందుకు భార్యతో కలిసి వేచి చూస్తున్న 68 ఏళ్ల వ్యక్తి పొట్ట భాగంలో ఆమె మొదట కత్తితో పొడిచింది. ఆ వెంటనే మరో 32 ఏళ్ల మహిళపై దాడి చేసింది. బాధితులిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 32 ఏళ్ల మహిళ మరణించింది. గాయపడిన వృద్ధుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని చుట్టుముట్టారు. చేతిలోని కత్తులను కింద పడేయాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆమె నిరాకరించింది. ‘నేను దేన్నీ వదలను, మీ ఇద్దరినీ చంపడానికైనా సిద్ధమే’ అంటూ వారి వైపు దూసుకురావడంతో పోలీసులు తొలుత టేజర్ ప్రయోగించి, అనంతరం కాల్పులు జరిపారు. బుల్లెట్ తగలడంతో నిందితురాలు అక్కడికక్కడే కుప్పకూలింది. నిందితురాలికి మానసిక సమస్యలు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు 7వ అవెన్యూలోని కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి! -
హెచ్–4 వీసాదారులకు ట్రంప్ ఝలక్..!
సాక్షి, అమరావతి: అమెరికాలో విదేశీయుల ఉద్యోగ అవకాశాలపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కొరడా ఝుళిపించేందుకు సిద్ధపడుతున్నారు. హెచ్–4 వీసాలపై అమెరికాలో ఉన్నవారు ఆ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు కల్పిస్తున్న నిబంధనను తొలగించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆర్ఐఎన్ 1615–ఏడీ–14 ప్రతిపాదనలను రూపొందించింది. ఇది దీర్ఘకాలంగా ప్రతిపాదనలో ఉన్న అంశమని కూడా పేర్కొంది. ఈఏడీ కేటగిరీ 26 అంటే... అమెరికాలో హెచ్–1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు హెచ్–4 వీసాలను మంజూరు చేస్తారు. డిపెండెంట్ జీవిత భాగస్వాములుగా హెచ్–4 వీసా పొందినవారు అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు 2015 నుంచి అనుమతిస్తున్నారు. ఇందుకు కొన్ని షరతులతో అనుమతిస్తూ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)లోని కేటగిరీ 26 కింద ఈ అవకాశం కల్పించారు. దీనిప్రకారం హెచ్–1 బీ వీసాదారు ఆమోదిత ఎంప్లాయింట్ ఆధారిత ఇమ్మిగ్రెంట్ అయ్యుండాలి.ఆ వీసాదారుకు సాధారణంగా అనుమతి ఉండే ఆరేళ్ల గడువు కంటే పొడిగింపు లభించి ఉండాలి. ఆ విధమైన హెచ్–1 బీ వీసాదారు జీవిత భాగస్వామి (హెచ్–4 వీసాదారు) దరఖాస్తు చేసుకుంటే అమెరికాలో ఉద్యోగం చేసేందుకు, ఉద్యోగం మారేందుకు, స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందేందుకు, సొంతంగా ఏదైనా కెరీర్ను కొనసాగించేందుకు ఈఏడీ కేటగిరీ 26 కింద అనుమతిస్తారు. భారతీయులపై ఎఫెక్ట్ హెచ్–4 వీసా ప్రయోజనం పొందుతున్న వారిలో పెద్ద సంఖ్యలో భారతీయులే ఉండటంతో ప్రస్తుతం అమెరికాలోని భారతీయుల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈఏడీ హెచ్–4 వీసాదారులు దాదాపు 1.50 కోట్ల మంది ఉండడం గమనార్హం. వారిలో భారత మూలాలు ఉన్నవారు 50 లక్షలకుపైగా ఉన్నట్టు అంచనా. ఇక ఈఏడీ కేటగిరీ 26 కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు, భవిష్యత్లో దరఖాస్తు చేసుకునేవారిలో అత్యధికులు భారతీయ అమెరికన్లే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈఏడీ కేటగిరీ 26 రద్దు చేస్తే అత్యధికంగా నష్టపోయేది భారతీయ అమెరికన్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఇరాన్పై మరింత తీవ్ర దాడులు తప్పవు.. ట్రంప్ వార్నింగ్
అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత (ఆదివారం) మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్ జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మరోసారి తారాస్థాయికి చేరినట్లైంది.ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. ఇరాన్పై మరింత తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.ఇరాన్ ప్రతిదాడుల తర్వాత ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ఇరాన్లోని కీలక చమురు కేంద్రం 'ఖార్గ్ ద్వీపం' పేలిపోతున్నట్లు ఓ ఏఐ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే దీనిపై అమెరికాకు చెందిన ఓ కీలక అధికారి భిన్నంగా స్పందించాడు. అమెరికా ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకోలేదని ఆయన తెలిపాడు.ఖార్గ్ ద్వీపం యుద్ధానికి ముందు ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం నిర్వహించేది. ఒకవేళ అక్కడ దాడి జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.ఇరాన్ అధ్యక్షుడి శాంతి స్వరంజోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ శాంతి స్వరం వినిపించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కిర్గిజిస్థాన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ ఇంకా చర్చల ద్వారా ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని అన్నాడు. యుద్ధం కొనసాగడం ఎవరికీ ప్రయోజనం కలిగించదని పేర్కొన్నాడు.చదవండి: అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ! -
ఏషనాగుల సాంగ్.. నాని, అనిరుధ్ వీడియో వైరల్
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్'. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఆయా షేర్ సాంగ్ ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.ఇటీవలే ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఏషనాగుల కట్టమీద అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ సైతం ఊహించని విధంగా యూట్యూబ్లో దూసుకెళ్తోంది. రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్తో అదరగొడుతోంది.తాజాగా ఈ పాటకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హీరో నాని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కలిసి చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నాని, అనిరుధ్ న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద లైట్లతో ఓ రిక్షాలో సందడి చేశారు. ఈ క్రమంలో ఏషనాగుల పాట బీట్కు దరువు వేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. NANI & ANI are us. Vibing to #YeshaNagula everywhere and anywhere 🔥🔥#TheParadise second single is TRENDING #1 on YouTube ▶️ https://t.co/ffTvysQUod pic.twitter.com/9jIf1NfADQ— THE PARADISE (@TheParadiseOffl) August 31, 2026 -
హర్ముజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా యుద్ధ జ్వాలలు
-
తీహార్ జైల్లో అమెరికన్ సైనికుడు.. విడుదలకు కుటుంబ సభ్యుల అభ్యర్థన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరుడు, మాజీ సైనికుడు మాథ్యూ వాన్డైక్కు ప్రాథమిక ఖైదీ హక్కులు లభించడం లేదని, అతని ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని, అతడిని స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. మార్చిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాన్డైక్ను అరెస్టు చేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సెక్షన్ 18 కింద ఉగ్రవాద కుట్ర అభియోగాలు నమోదు చేసింది.అనుమతి లేకుండా మిజోరంలో ప్రవేశించి, అక్రమంగా మయన్మార్కు వెళ్లినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మయన్మార్లోని సాయుధ గ్రూపులకు డ్రోన్ల అసెంబ్లింగ్, ఆపరేషన్, జామర్ల వినియోగం వంటి యుద్ధ శిక్షణ అందించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ గ్రూపులు ఐరోపా నుంచి డ్రోన్లు తెప్పించి, ఈశాన్య భారత నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు చేరవేసేందుకు ప్రణాళిక రచించినట్లు ఆరోపించింది.ప్రస్తుతం తీహార్లోని జైలు నంబర్ 8/9లో ఉన్న వాన్డైక్ కంటిచూపు మందగించిందని, కాలి గాయంతో నడవలేక వీల్చైర్కే పరిమితమయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు, కుటుంబంతో మాట్లాడేందుకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జైలులోని ఆహారం పడక 14 కిలోల బరువు తగ్గాడని, ప్రత్యేక ఆహారం కోసం ఆయన గతంలో కోర్టును ఆశ్రయించారని తెలిపారు. బాల్టిమోర్కు చెందిన వాన్డైక్ ‘సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకుడిగా లిబియా, సిరియా, ఉక్రెయిన్ వంటి యుద్ధ క్షేత్రాల్లో పనిచేశారు. ఆయనకు సీఐఏతో సంబంధాలున్నట్లు ప్రచారం ఉన్నప్పటికీ, బహిరంగ ఆధారాలు లేవని తేలింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 8 వరకు పొడిగించారు.ఇది కూడా చదవండి: వరద మిగిల్చిన బురద.. కుదుటపడేదెన్నడో.. -
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కేవలం అరగంటలో కురిసిన భారీ వర్షంతో ఉప్పొంగిన వరద ప్రవాహానికి భారీ బండరాళ్లు, ఇనుప నిర్మాణాలు, ఇతర శిథిలాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు బ్రైట్ ఏంజెల్ క్రీక్లో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఆ నీరు కొలరాడో నదిలోకి దూసుకెళ్లడంతో మార్గంలోని ఫుట్బ్రిడ్జ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా అక్కడి భౌగోళిక స్వరూపమే మారిపోయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని వీడియోల్లో కొత్తగా నదీ ప్రవాహం ఏర్పడినట్లు కనిపిస్తోంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. కేవలం 30 నిమిషాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గ్రాండ్ కేనియన్ ప్రాంతంలో భూభాగం చాలా నిటారుగా ఉండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. దీంతో వరద వేగం అనూహ్యంగా పెరిగింది.62 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపువరదల అనంతరం ఫాంటమ్ రాంచ్ నుంచి ఇప్పటివరకు 62 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా గాయాలు నమోదైనట్లు అధికారులు చెప్పలేదు. అయితే 20 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది.UGC videos show hikers and campers scrambling for cover as heavy rain and strong winds hit the Phantom Ranch area of #GrandCanyon National Park, with swollen waterways and debris seen floating on the Colorado River. Other footage shows people awaiting rescue and a helicopter… pic.twitter.com/x2lu0ZkFMb— ShanghaiEye🚀official (@ShanghaiEye) August 31, 2026ఒక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్గ్రౌండ్లో ఉన్న సమయంలో వర్షం ప్రారంభమైంది. సుమారు 50 మంది హైకర్లు క్రీక్లో నీటి మట్టం క్రమంగా పెరగడాన్ని చూశారు. అనంతరం భారీ శిథిలాలు, నిర్మాణాలు వరదలో కొట్టుకురావడంతో వారిని హెలికాప్టర్ల ద్వారా అక్కడి నుంచి తరలించారని అన్నారు. మరోవైపు.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్, నార్త్ కైబాబ్ ట్రైల్లోని కొన్ని ప్రాంతాలను అధికారులు మూసివేశారు. కొలరాడో నదిపై రాఫ్టింగ్ కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సోమవారం వరకు మరిన్ని ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరోసారి ఆకస్మిక వరదలు, శిథిలాల ప్రవాహం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.FLOOD DANGER 🚨: Dozens of hikers were evacuated from Grand Canyon National Park after parts of the canyon were hit by devastating flooding. Officials say the flooding caused significant damage throughout parts of the park.#flood #arizona #monsoon #grandcanyon pic.twitter.com/SqA0XWkGrC— FOX Weather (@foxweather) August 30, 2026 -
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా.. ప్రతీకారంగా ఇరాన్ అమెరికా బలగాలపై క్షిపణి దాడులకు దిగింది. లారక్ దీవిలో ఇరాన్ రాకెట్ లాంచర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చింది.హర్ముజ్ జలసంధిలోని లారక్ దీవిపై అమెరికా బలగాలు రెండు ఇరానియన్ లాంచర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సిబ్బంది సముద్రంలో నౌకా విధ్వంసక మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలోనే ఈ దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లారక్పై జరిగిన దాడి.. జూలై చివరి తర్వాత ఇరాన్ భూభాగంపై అమెరికా చేసిన తొలి దాడిగా తెలుస్తోంది.అమెరికా అధికారుల ప్రకారం.. లారక్లోని లాంచర్లు హర్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ జలమార్గంలో మైన్లను అమర్చడం ద్వారా అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా దాడి చేసినట్లు వాషింగ్టన్ చెబుతోంది.‘ప్రతీకారం తప్పదు’.. ఇరాన్ హెచ్చరికఅమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. లారక్ దాడిలో తమ సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మరణించినట్లు, గాయపడినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్(IRGC) హెచ్చరించింది. అమెరికా దాడికి ‘ప్రతిస్పందన, శిక్ష’ ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.ఆ హెచ్చరికకు అనుగుణంగానే ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. జోర్డాన్లో అమెరికా బలగాలు ఉన్న కింగ్ హుస్సేన్, అల్ అజ్రాక్ స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. ఇరాన్ దాడిలో రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.8 క్షిపణులను అడ్డుకున్న జోర్డాన్ఇరాన్ దాడులను జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. మొత్తం ఎనిమిది క్షిపణులను తమ గగనతలంలోనే కూల్చివేసినట్లు తెలిపింది. దీంతో ఇరాన్–అమెరికా ఘర్షణ ప్రభావం ప్రాంతంలోని ఇతర దేశాలపై కూడా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.హర్ముజ్ జలసంధే అసలు కేంద్రంఈ మొత్తం పరిణామాలకు హర్ముజ్ జలసంధే కీలక కేంద్రంగా మారింది. ఇరాన్కు చెందిన లారక్ దీవి హార్ముజ్ దీవికి దక్షిణంగా, ఖేష్మ్ దీవికి తూర్పున ఉంది. సుమారు 49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన సముద్ర మార్గానికి సమీపంలో ఉండటంతో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. లారక్లో IRGC నేవీ స్థావరం కూడా ఉంది.ప్రపంచ ఇంధన సరఫరాకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. దీంతో ఈ జలమార్గంలో మైన్లు వేయాలన్న ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.ఒమన్ వైపు మారిన నౌకలుహర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల నేపథ్యంలో కొన్ని నౌకలు ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే ఆ మార్గంలోనూ ఇరాన్ మైన్లు అమర్చే సామర్థ్యం కలిగి ఉంటే.. అంతర్జాతీయ నౌకాయానానికి మరింత ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ రంగ మాజీ అధికారి డేవిడ్ డెస్ రోచెస్ విశ్లేషించారు.ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ హెచ్చరికహర్ముజ్లో మైన్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే తీవ్రంగా హెచ్చరించారు. మైన్లను అమర్చే ఏ నౌక లేదంటే పడవనైనా ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. మైన్ల ఏర్పాటు విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానం అమల్లో ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.పెరిగిన చమురు ధరలు.. ముదిరిన ఆందోళనఅమెరికా లారక్ దాడి వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో నౌకాయానం మరింత దెబ్బతింటే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో మార్కెట్లు అప్రమత్తమయ్యాయి.అమెరికా–ఇరాన్ మధ్య తాజా దాడులు ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణను మరింత ప్రమాదకర దశలోకి తీసుకెళ్లే అవకాశముంది. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఆ మార్గంపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. లారక్పై అమెరికా దాడి, దానికి ప్రతీకారంగా జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం.. ఈ పోరాటం మళ్లీ నేరుగా ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణగా మారుతున్న సంకేతాలను ఇస్తోంది. ఇదీ చదవండి: 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా -
అమెరికా: సౌత్ కరోలినాలో కాల్పుల కలకలం
అమెరికాలోని సౌత్ కరోనాలిలో కాల్పుల కలకలం రేగింది. దుండగుడి కాల్పుల్లో పోలీస్ అధికారి మృతి చెందారు. మరో పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. నిందితుడికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన పోలీస్ అధికారి.. రెండు సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.శనివారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. ఓ వ్యక్తి తన ఇంటి వద్ద ఆస్తులను ధ్వంసం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు అధికారి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అనుమానితుడు ఇంటి నుంచి పరారయ్యాడు.ఆ మహిళ అనుమానితుడి రూపురేఖలు.. అతని వాహనం వివరాలను అధికారికి ఇచ్చింది. అయితే, కొద్ది నిమిషాల తర్వాత, ఆ మహిళ చెప్పిన వివరాలకు సరిపోలే వాహనం సమీపంలో ఒక వ్యక్తిని గమనించారు. దీంతో అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు, నిందితుడికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. -
ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్ ఉక్కిరిబిక్కిరి..!
బాంబులు, క్షిపణులతోనే కాదు.. ఇప్పుడు డాలర్తో ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని అమెరికా వ్యూహం రచిస్తోంది. ఇరాన్కు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయన్న ఆరోపణలతో ఈజిప్ట్కు చెందిన బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై అమెరికా ట్రెజరీ కొరడా ఝళిపించింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థతో ఆ బ్యాంక్ శాఖలకు ఉన్న డాలర్ లావాదేవీల మార్గాన్ని కట్ చేసే ప్రతిపాదన చేసింది. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చర్యతో ఇరాన్కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసే ప్రయత్నం మరింత ముదిరింది. 2024 జనవరి నుంచి 2026 జూన్ వరకు బాంక్ మిసర్ యూఏఈ సుమారు 1.8 బిలియన్ డాలర్ల లావాదేవీలను ఇరాన్ షాడో బ్యాంకింగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న 103 సంస్థల కోసం ప్రాసెస్ చేసిందని అమెరికా ఆరోపిస్తోంది.అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు సహకరించే సంస్థలు అమెరికా డాలర్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం కోల్పోతాయని ఆయన తేల్చి చెప్పారు. ఈ చర్య ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’లో భాగంగా చేపట్టినట్లు అమెరికా తెలిపింది. అయితే బాంక్ మిసర్పై చర్య ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో అమల్లోకి రాదు. ప్రతిపాదిత నిబంధనపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.ఈజిప్ట్కు షాక్..అమెరికా నిర్ణయంపై ఈజిప్ట్ స్పందించింది. ఈ చర్య యూఏఈలోని బాంక్ మిసర్ శాఖలు, వాటి డాలర్ లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. ఈజిప్ట్లోని బ్యాంక్ కార్యకలాపాలకు ఇది వర్తించదని తెలిపింది. మరోవైపు, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ బాంక్ మిసర్ శాఖల లావాదేవీలపై ప్రత్యేక, అత్యవసర పరిశీలన ప్రారంభించింది.కాగా, ఇరాన్పై అమెరికా ఒత్తిడి ఇప్పుడు సరికొత్త దశకు చేరుకుంది. ఇరాన్కు డబ్బు చేరే మార్గాలను కట్ చేయడం.. డాలర్ వ్యవస్థ నుంచి దూరం చేయడం.. దాని ఆర్థిక భాగస్వాములపై కూడా ఒత్తిడి పెంచడం ద్వారా టెహ్రాన్ను ఆర్థికంగా ఏకాకిని చేయాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది. బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై తాజా చర్య అందులో భాగమే. మొత్తంగా.. ఇరాన్పై అమెరికా యుద్ధం ఇప్పుడు మరో ఫ్రంట్కు చేరింది. ఆయుధాలతో యుద్ధం చేస్తూనే.. మరోవైపు డాలర్ను ఆయుధంగా మార్చుకుని ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది.చదవండి: చమురు మంట.. సామాన్యుడికి మరింత భారం.. -
విశ్వ వీక్షణకు మూడో కన్ను!
విశ్వరహస్యాలను ఛేదించేందుకు మరో మహా ప్రయత్నం మొదలు కానుంది! హబుల్, జేమ్స్ వెబ్ టెలిస్కోపులకు వందరెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూడగల టెలిస్కోపు ప్రయోగానికి నాసా, స్పేస్ఎక్స్లు సిద్ధమవుతుండటం దీనికి కారణం. అన్నీ సవ్యంగా సాగితే నేడు అమెరికాలోని ఫ్లారిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్–ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్పై ఈ టెలిస్కోపు భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరానికి పయనం కానుంది. లగ్రాంజ్ పాయింట్–2గా పిలిచే చోటు నుంచి విశ్వంపై ఓ కన్నేయనుంది ఈ టెలిస్కోపు. ఈ ప్రాంతంలో సూర్యుడు, భూముల గురుత్వ శక్తి దాదాపు సమానంగా ఉండటం వల్ల టెలిస్కోపు స్థిరంగా ఒకే చోటులో ఉండగలదు. కెన్నెడీ స్పేస్ సెంటర్లోని 39ఏ లాంచ్ కాంప్లెక్స్లో ఆదివారం ఉదయం 7.26 గంటలకు జరగనున్న ఈ ప్రయోగానికి సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. నాసా మొట్టమొదటి ప్రధాన ఖగోళ శాస్త్రవేత్త ‘నాన్సీ గ్రేస్ రోమన్’పేరు ఈ టెలిస్కోపునకు పెట్టారు. ‘మదర్ ఆఫ్ హబుల్’గా నాన్సీ గ్రేస్ రోమన్కు పేరు. విశాల విశ్వం రహస్యాలను ఛేదించేందుకు నాసా ఉపయోగిస్తున్న టెలిస్కోపుల్లో నాన్సీ గ్రేస్ రోమన్ మూడోది. హబుల్ టెలిస్కోపు సుమారు 36 ఏళ్లుగా భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోంచి విశ్వ గవాక్షంగా పనిచేస్తోంది. సుమారు 2.4 మీటర్ల వెడల్పుతో ఉన్న దర్పణం (లెన్స్)తో సుదూర పాలపుంతలు, నక్షత్ర మండలాలు (నెబ్యులే), గ్రహాలను దృశ్య, పరారుణ కాంతుల్లో చూస్తూ ఫొటోలు పంపుతోంది. నాసా 2021లో ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్–2 నుంచి విశ్వం ఏర్పడిన తొలినాళ్ల నాటి పాలపుంతలు, సౌర కుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలు (ఎక్సోప్లానెట్లు), వాటి వాతావరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. తాజాగా ప్రయోగిస్తున్న నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోపు దృశ్యకాంతితోపాటు పరారుణ కాంతిలోనూ విశ్వాన్ని చూడగలదు. హబుల్, జేమ్స్ వెబ్లతో పోలిస్తే ఇది వంద రెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూడగలదు. ఎక్సోప్లానెట్ల లెక్కలు, కృష్ణ శక్తి, కృష్ణ పదార్థం (డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్) రహస్యాలను తేల్చడం దీని లక్ష్యాల్లో కొన్ని. ప్రయోగ లక్ష్యాలు → కృష్ణ పదార్థం, విశ్వ వ్యాపనానికి కారణమైన కృష్ణ శక్తిపై పరిశీలన (మహా విస్ఫోటం తరువాత విశ్వం అంతకంతకూ విస్తరిస్తోంది. దీన్నే విశ్వవ్యాపనం అంటాం) → ఎక్సోప్లానెట్ల లెక్కలు, చిత్రాలు. → వందల కోట్ల పాలపుంతలను గుర్తించి విశ్వం ఆకారానికి ఒక రూపు? ప్రధాన పరికరాలు1. వైడ్ ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ 300 మెగాపిక్సెళ్ల డిజిటల్ కెమెరాలా పనిచేస్తుంది ఇది. హబుల్ కంటే వందరెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూసేందుకు అవకాశం కలి్పస్తుంది. అదే సమయంలో రెజల్యూషన్లో పెద్ద మార్పు ఉండదు. పాలపుంతల సర్వేకు, కృష్ణ శక్తి, వందలకోట్ల నక్షత్రాలు, పాలపుంతల అధ్యయనానికి ఉపయోగిస్తారు. 2. కరోనాగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ బలహీనమైన కాంతితో ప్రకాశించే ఎక్సోప్లానెట్ల ఫొటోలు తీసే సమయంలో నక్షత్ర కాంతిని నిరోధిస్తుంది. ఎక్సోప్లానెట్లపైన వాతావరణాన్ని, వెలుతురు కారణంగా కనిపించని గ్రహాలను గుర్తించేందుకూ సాయపడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్రలోనే మెగా డీల్ ఇది.. వెనెజువెలా చమురుకు ట్రంప్ స్కెచ్!
ప్రపంచ చమురు రంగంలో సంచలనం రేపే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాకు చెందిన 65 బిలియన్ బ్యారెళ్లకు చమురు నిల్వలపై దాదాపు నియంత్రణ లభించేలా.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో భారీ ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. దీన్ని ‘ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం’గా ఆయన అభివర్ణించారు.వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్తో కలిసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ ఒప్పందం కోసం చర్చలు జరిపినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారాలపాటు కొనసాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరిందని చెప్పారు. అమెరికా పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం లేకుండానే ఈ ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం వెనెజువెలా అధికారులు పలు కంపెనీలకు, ముఖ్యంగా అమెరికా సంస్థలకు, చమురు అన్వేషణ, ఉత్పత్తి హక్కులు కల్పించే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం.అమెరికా లక్ష్యం ఇదే..వెనెజువెలా వద్ద ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. మొత్తం 303 బిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇది ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 17 శాతానికి సమానం. అయినప్పటికీ అక్కడి చమురు పరిశ్రమ సంవత్సరాల తరబడి పెట్టుబడుల కొరత, నిర్వహణ లోపాలు, ఆంక్షల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. దీంతో భారీ నిల్వలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు సుమారు 12.5 లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.ఈ పరిస్థితిని మార్చి వెనెజువెలా చమురు ఉత్పత్తిని పెంచడం, అమెరికా రిఫైనరీలకు అదనపు ముడి చమురును అందుబాటులోకి తీసుకురావడం ట్రంప్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా సంస్థలకు వెనెజువెలా చమురు క్షేత్రాల్లో దీర్ఘకాలిక ప్రాప్యత కల్పించడం ద్వారా ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.దాదాపు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు?ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రూబియో పేర్కొన్నారు. అమెరికాకు స్థిరమైన, తక్కువ ధరకు ముడి చమురు లభించే అవకాశం ఉంటుందని, తద్వారా పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు వెనెజువెలాలో దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర ప్రైవేటు పెట్టుబడులు రావచ్చని, వేలాది అధిక వేతన ఉద్యోగాలు ఏర్పడటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.పెట్రోల్ ధరలు వెంటనే తగ్గుతాయా?అయితే అమెరికా ప్రజలకు తక్షణమే చమురు ధరల రూపంలో ప్రయోజనం దక్కుతుందా అన్నదానిపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెనెజువెలాలోని చమురు మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టి చమురు ఉత్పత్తిని పెంచడం, దాన్ని రవాణా చేయడం, భారీ ముడి చమురును శుద్ధి చేయడానికి అవసరమైన రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడం వంటి పనులకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఒప్పందం వల్ల అమెరికాలో పెట్రోల్ ధరలు స్వల్పకాలంలోనే గణనీయంగా తగ్గుతాయని చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్పత్తి పెరిగి, సరఫరా స్థిరపడిన తర్వాతే దాని ప్రభావం వినియోగదారులపై కనిపించే అవకాశం ఉంది.చట్టపరమైన చిక్కులు కూడా..అసలు ఈ ఒప్పందం ఏ రూపంలో అమలు కానుందనే దానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఏ చమురు క్షేత్రాలు ఇందులో భాగం కానున్నాయి? ఏ కంపెనీలు పాల్గొంటాయి? అమెరికా మెజారిటీ నియంత్రణను ఎలా చేపడుతుంది? వంటి కీలక అంశాలను ఆయన వెల్లడించలేదు.ఇదే సమయంలో వెనెజువెలా చట్టాల ప్రకారం చమురు పరిశ్రమలో కీలక కార్యకలాపాలపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతోంది. అందువల్ల అమెరికా ప్రభుత్వం నేరుగా లీజు విధానంలో చమురు క్షేత్రాలను నిర్వహించేలా ఒప్పందం చేసుకుంటే దానికి వెనెజువెలా రాజ్యాంగం, హైడ్రోకార్బన్స్ చట్టాల ప్రకారం చట్టబద్ధత ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి విధానానికి గతంలో స్పష్టమైన ఉదాహరణ లేదని నిపుణులు చెబుతున్నారు.అడ్డంకులెన్నో..చమురు నిల్వలు అపారంగా ఉన్నప్పటికీ వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాజకీయ అనిశ్చితి, బలహీనమైన విద్యుత్ వ్యవస్థ, పరిమిత ఎగుమతి సామర్థ్యం, చమురు రంగంపై ప్రభుత్వ నియంత్రణ వంటి అంశాలు గతంలో పెట్టుబడిదారులను వెనక్కి తగ్గించాయి. కేవలం ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే భారీ స్థాయిలో పెట్టుబడులు వెంటనే రావడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.చమురు జాతీయీకరణ నుంచి..వెనెజువెలా చమురు పరిశ్రమకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1970లలో ఆ దేశం చమురు పరిశ్రమను జాతీయీకరించి ప్రభుత్వ ఆధీనంలోని పీడీవీఎస్ఏను (PDVSA) కేంద్రంగా మార్చింది. ఆ తర్వాత హ్యూగో చావెజ్ పాలనలో విదేశీ చమురు సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరిగింది. విదేశీ కంపెనీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్లలోకి తీసుకురావడంతోపాటు కొన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అమెరికా చమురు సంస్థల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి.మదురో తొలగింపు తర్వాత వేగం..నికొలస్ మదురోను అమెరికా సైనిక చర్య అధ్యక్ష ద్వారా పదవి నుంచి తొలగించిన తర్వాత వెనెజువెలా చమురు రంగంపై వాషింగ్టన్ దృష్టి మరింత పెరిగింది. అమెరికా రిఫైనరీలకు వెనెజువెలా నుంచి స్థిరమైన ముడి చమురు సరఫరా ఉండేలా చూడటంతోపాటు అమెరికా కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మదురోను అమెరికాకు తరలించి నార్కోటెర్రరిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై కేసులు ఎదుర్కొనేలా చేసిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత తాజా చమురు ఒప్పంద ప్రకటన రావడం గమనార్హం.అమెరికాకు మరో అవసరం..అమెరికాలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడం కీలకంగా మారింది. ఇప్పటికే అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి భారీగా చమురును విడుదల చేసింది. ఆగస్టు ప్రారంభంలో ఆ నిల్వలు 30 కోట్ల బ్యారెళ్ల కంటే దిగువకు పడిపోయాయి. 2026 ప్రారంభంతో పోలిస్తే 10 కోట్ల బ్యారెళ్లకు పైగా తగ్గాయి.ఈ నేపథ్యంలో వెనెజువెలా నుంచి అదనపు చమురు సరఫరాను పొందడం అమెరికాకు రెండు విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకవైపు రిఫైనరీలకు ముడి చమురు సరఫరా పెరుగుతుంది. మరోవైపు భవిష్యత్తులో వ్యూహాత్మక చమురు నిల్వలను తిరిగి నింపేందుకు కూడా ప్రత్యామ్నాయాలు లభిస్తాయి.ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు, చట్టపరమైన నిర్మాణం, పెట్టుబడుల విధానం, చమురు క్షేత్రాల ఎంపిక వంటి అంశాలు స్పష్టమైన తర్వాతే ఈ డీల్ అసలు ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేయగలమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగిన వెనెజువెలా.. వాటిని వెలికితీసే సామర్థ్యాన్ని తిరిగి సాధిస్తే ప్రపంచ ఇంధన మార్కెట్పై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ట్రంప్కు బిగ్ షాక్ -
యుద్ధం ఇంకా ఉంది!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి ఆరు నెలలవుతోంది. ఇప్పటికే వందలాది మంది మరణించారు. దాడులకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని, పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని మొదట్లో పదేపదే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు మాట మార్చేశారు. ఇరాన్పై దాడులను ఆపే విషయంలో తొందరపడడం లేదని అంటున్నారు. వైమానిక దాడులు, దిగ్బంధనం ద్వారా ఇరాన్ నాయకత్వాన్ని, సైన్యాన్ని, ఆర్థిక వ్యవస్థను చాలావరకు నాశనం చేశానని ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఇరాన్ను తమ దారికి తెచ్చేందుకు సైనిక చర్యకు బదులుగా, ఆర్థికంగా ఒత్తిడిని పెంచడంపైనే దృష్టి సారిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్తో వ్యాపారం కొనసాగించే ఏ దేశమైనా లేదా సంస్థ అయినా కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆంక్షలను ప్రధాన ఆయుధంగా ఉపయోగించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ నాయకత్వం ఇప్ప టికే చాలావరకు బల హీన పడిందని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. వారు (ఇరాన్) సైని కులకు జీతాలు చెల్లించడం లేదని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ఇరాన్ సామర్థ్యం చాలా తక్కువగా ఉందన్నారు. ఇరాన్తో ఇప్పటికిప్పుడు చర్చలు ప్రారంభించాలన్న ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశారు. అందుకు సమయం ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇరాన్పై యుద్ధం వల్ల అమెరికాకు 37.5 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. పశ్చిమాసియా సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనిపెట్టేందుకు ఖతార్, పాకిస్తాన్లు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. త్వరగా చర్చలు ప్రారంభించాలని అమెరికా, ఇరాన్లను కోరుతున్నాయి. మొత్తం సమస్యకు హార్మూజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై పట్టుకోసం అమెరికా, ఇరాన్లు ఆరాటపడుతున్నాయి. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా జూన్లో కుదిరిన ప్రాథమిక ఒప్పందంపై ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
అమెరికా నుంచి జావెలిన్ గైడెడ్ మిస్సైళ్లు
న్యూఢిల్లీ: సైనిక పోరాట సామర్థ్యాన్ని పెంచుకొనే దిశగా భారత్ మరో కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా నుంచి జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొను గోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం భారత్, అమెరికా మధ్య మరింత గాఢంగా, ప్రభావవంతంగా మారుతున్న ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. అమెరికా నుంచి భారత్ ఎన్ని జావెల్ యాంటీ–ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్స్ను కొనుగోలు చేస్తుందన్నది ఇంకా తెలియరాలేదు. ఈ కొనుగోలు మొత్తం వ్యయం ఎంత అనేది కూడా స్పష్టత లేదు. అమెరికా విదేశీ సైనిక అమ్మకాల ప్రక్రియ ద్వారా జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ‘ఆఫర్, అంగీకార పత్రం’పై సంతకం చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు అమెరికా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పరిణామం అమెరికా, భారత సాయుధ దళాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని, అలాగే ఇరుదేశాల రక్షణ పరిశ్రమల మధ్య భవిష్యత్ సహకారానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. -
ట్రంప్కు ఎదురుగాలి!
రెండో దఫా అధికార పీఠం అధిరోహించి కూడా రెండేళ్లు కావస్తున్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్కు దౌత్యనీతి ఒంటబట్టలేదు. తాను నిర్దేశించినదాన్ని అంగీకరించటమే తప్ప మరోవిధంగా మాట్లాడే హక్కు, అధికారం ఏ దేశానికీ లేదని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆయన దృష్టిలో కేవలం అదే దౌత్యం. భారత్ నుంచి కెనడా వరకూ... ఇరాన్ నుంచి వెనిజులా వరకూ ఆయనది ఇదే బాణీ. ట్రంప్ను నేరుగా ప్రతిఘటించే వారుండొచ్చు, పరోక్షంగా చెప్పిచూద్దామనుకునే వారుండొచ్చు... మార్గాలు వేరైనా ట్రంప్ షరతులకు తలొగ్గబోమని చెప్పడమే వీరందరి సారాంశం. చాన్నాళ్లుగా విసుగెత్తి ఉన్నారేమో... కెనడా ప్రధాని మార్క్ కెర్నీ చాలా కరకుగానే వ్యవహరించారు. ఒకదాని వెంబడి మరో గొంతెమ్మ కోర్కెతో చీకాకుపరుస్తున్న అమెరికా తీరును నిరసిస్తూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న తమ ప్రతినిధి బృందాన్ని వెనక్కురావాలని ఆదేశించారు. ఒప్పందం దాదాపు ఖరారై సంతకాలు జరపడమే తరువాయి అనుకునే దశలో ఎదురైన ఈ ఊహించని పరిణామం అమెరికాను అయోమయంలోకి నెట్టింది. ఇలాంటి భంగపాట్లే ఇరాన్ దగ్గర ఎదురయ్యాయి. మన దేశంతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని అమెరికా అనేకమార్లు ప్రకటించింది. కానీ అదేమీ జరగలేదు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ తన సైన్య బలంతో ఈ ఏడాది మొదట్లో అపహరించి, అమెరికాలో ఆయనపై విచారణ తంతు సాగిస్తున్నారు. ఇకపై అది తమ భూభాగమని అమెరికా చెప్పడం ఆ దేశ ప్రజల్ని మాత్రమే కాదు... అత్యధిక దేశాలను ఆగ్రహోదగ్రుల్ని చేస్తోంది. ఇక ఇరాన్ సంగతి చెప్పనవసరం లేదు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపేశామని చెప్పటం నుంచి హార్మూజ్ తమదేనని ప్రకటించటం వరకూ ట్రంప్ ఎన్ని చేసినా ఇరాన్ నిబ్బరంగా ‘నీ లెక్కేమిట’న్నట్టే వ్యవహరిస్తోంది. మిత్ర దేశమైన దక్షిణ కొరియాదీ అదే వైఖరి. ఏటా 11 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుపుతాయి. ఈసారి అయిదో రోజుకల్లా అమెరికా సైనికులు తట్టా బుట్టా సర్దుకుని తిరుగుముఖం పట్టారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్తో చెలిమి కోసం ట్రంప్ తహతహలాడటంపై ఆగ్రహించి దక్షిణ కొరియా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఈ విన్యాసాల ఉద్దేశం ఉత్తర కొరియాను భయపెట్టడం. తీరా ఆ దేశంతోనే అమెరికా చేతులు కలుపుతుంటే... ఈ విన్యాసాలకు అర్థమేమిటన్నది దక్షిణ కొరియా ప్రశ్న. వాస్తవానికి ఉత్తర కొరియా పూర్తి స్థాయి అణ్వస్త్ర దేశంగా మారింది. ఆ దేశం దగ్గర ‘చాలా శక్తిమంతమైన’ ఆయుధా లున్నాయని ట్రంపే కొద్దికాలం క్రితం ప్రకటించారు. దాన్ని మరిచి కొత్త చుట్టరికాలు కలుపుకుందామని ట్రంప్ ప్రయత్నించినంత మాత్రాన ఆ దేశం నమ్మే అవకాశమేమీ లేదు. ఇరాన్తోసహా అన్ని దేశాలతోనూ దౌత్యపరంగా వరస వైఫల్యాలు తప్పడం లేదు గనుక ఉత్తర కొరియాకు దగ్గరై అమెరికా జనాన్ని ఆశ్చర్యపరచాలని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ వేరే దేశాలతో పెంచుకున్న వైరం వికటిస్తున్న విధంగానే ఉత్తర కొరియాతో చెలిమి సైతం బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. చివరకు ఉత్తర కొరియాఏం చేస్తుందన్నది అలావుంచితే... ఆసియా–పసిఫిక్ దేశాలన్నిటా ట్రంప్ అంతరంగంపై ఇప్పటికే ఉన్న సందేహాల్ని మరింతగా పెంచింది. ఈ దేశాలన్నీ చైనా దూకుడువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచి, చైనాకు కళ్లెం వేయాల్సిన అమెరికా ఆడుతున్న వింతనాటకాలు వాటికి మింగుడుపడటం లేదు.అందుకే దక్షిణ కొరియా, జపాన్ ఇటీవల సాన్నిహిత్యమవుతున్నాయి. ఆ రెండింటిమధ్యా ఇబ్బందికర చరిత్రవున్నా ట్రంప్ వింత చేష్టలు వారిని సన్నిహితం చేశాయి. కెనడా ఉత్పత్తులపై 50 శాతం అదనపు సుంకాలు వేయాల్సివస్తుందని ట్రంప్ ప్రకటించగా, దానికి ప్రతిగా వచ్చే నెల 8 నుంచి అమెరికా ఉత్పత్తులపై 15 నుంచి 50 శాతం వరకూ సుంకాలు విధిస్తామని కెర్నీ ప్రకటించారు. అమెరికా అదనపు సుంకాల విలువ 2,000 కోట్ల డాలర్లయితే, కెనడా సుంకాలు 2,760 కోట్ల డాలర్లు. ఈ ప్రపంచం తనకు భయపడటం మాట అటుంచి... జాలి కూడా చూపబోదని ట్రంప్కు ఎంత త్వరగా తెలిస్తే అమెరికా ప్రజలకు అంత మేలు. -
జన్మహక్కు పౌరసత్వం.. ట్రంప్కు మరో షాక్?
అమెరికాలో జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు తీసుకొచ్చిన కొత్త ఆదేశానికి వెంటనే అడ్డుకట్ట వేయడానికి ఫెడరల్ జడ్జి డెబోరా బోర్డ్మన్ నిరాకరించారు. అయితే.. డొనాల్డ్ ట్రంప్ ఆదేశం చెల్లుబాటు అవుతుందని చెప్పలేదు. కొత్త ఆదేశాన్ని ప్రస్తుత పిటిషన్లో ప్రస్తావించకపోవడం వల్ల, దానిపై తక్షణమే స్టే ఇవ్వలేనని స్పష్టం చేశారు. అదే సమయంలో.. పిటిషనర్లు తమ కేసులో కొత్త ఆదేశాన్ని చేర్చుకునేందుకు అనుమతించారు. దీంతో ఈ వ్యవహారంపై త్వరగా విచారణ జరిగే అవకాశం ఉంది.ట్రంప్ తొలిసారి 2025లో జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లల తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, చట్టబద్ధ శాశ్వత నివాసితులు కాకపోయినా వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం రాకుండా చేయడం ఈ ఆదేశం ఉద్దేశం.దీనిపై కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యాయి. చివరకు జూన్ 30న అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ తొలి ప్రయత్నాన్ని తిరస్కరించింది. 14వ రాజ్యాంగ సవరణలోని పౌరసత్వ నిబంధనలకు ఈ ఆదేశం విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. దీంతో.. ట్రంప్ ఆగస్టు 6న మరో కొత్త ఆదేశాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా అమెరికాకు ప్రసవం కోసం వచ్చే 'బర్త్ టూరిజం'ను లక్ష్యంగా చేసుకుని, కొన్ని సందర్భాల్లో పిల్లలకు పౌరసత్వం నిరాకరించేలా ఈ ఆదేశంలో నిబంధనలు పెట్టారు.ఈ కొత్త ఆదేశంపైనే ఇప్పుడు మరోసారి న్యాయపోరు మొదలైంది. ప్రభుత్వ న్యాయవాదులు సెప్టెంబర్ 5లోగా దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై ఫెడరల్ ఏజెన్సీలు మార్గదర్శకాలు జారీ చేస్తాయని కోర్టుకు తెలిపారు. కానీ.. జడ్జి బోర్డ్మన్ ఈ విషయంలో వేచి చూడాల్సిన అవసరం ఉందా?, అన్న దానిపై సందేహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో 'బర్త్ టూరిజం'కు జన్మహక్కు పౌరసత్వం నుంచి మినహాయింపు ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. దీంతో ట్రంప్ కొత్త ఆదేశం కూడా కోర్టులో నిలబడుతుందా?.. లేదా?, అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
అమెరికాలో నిఖిత హత్య కేసులో సాఫ్ట్ వేర్ అర్జున్ అరెస్ట్
-
అమెరికాలో తెలుగు యువతి కేసులో కీలక పరిణామం
అమెరికా తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రియురాలి హత్య కేసులో సాప్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఓ అపార్ట్మెంట్లో దాక్కున్న అర్జున్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అర్జున్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో శంకర్ గ్రీన్ రెసిడెన్షియల్ సొసైటీలో అరెస్ట్ చేశారు.అమెరికా-భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 2025 డిసెంబర్ 31న డబ్బు తిరిగి ఇస్తానంటూ నిఖితను పిలిచి హత్య చేశాడు. ఆర్థిక వివాదమే హత్యకు కారణమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసించే నిఖిత జనవరి 2న కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మేరీల్యాండ్లోని కొలంబియాలో ఉన్న ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోనే ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నిఖిత శరీరంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. నిఖిత నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడనే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్లో తెలంగాణలో అర్జున్పై మోసం కేసు నమోదైంది.దర్యాప్తులో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఆగ్రాకు పంపించాం. అక్కడ ఓ ఫ్లాట్లో అర్జున్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. మోసం కేసుకు సంబంధించి అతడికి నోటీసులు జారీ చేశాం. అదే సమయంలో అమెరికాలో అతడిపై కేసు ఉండటంతోపాటు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) పెండింగ్లో ఉన్న విషయం గుర్తించాం. దీంతో కేంద్ర అధికారులకు సమాచారం అందించాం’’ అని హైదరాబాద్ పోలీసు అధికారి తెలిపారు. అర్జున్ను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిఖిత గత నాలుగేళ్లు అమెరికాలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేసింది. -
సరస్సు పేరునూ మార్చేసిన ట్రంప్.. భగ్గుమన్న కెనడా!
వాషింగ్టన్/ఒట్టావా: అమెరికా, కెనడాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇరు దేశాల సరిహద్దులో విస్తరించి ఉన్న ప్రసిద్ధ ‘లేక్ అంటారియో’ సరస్సు పేరును ‘లేక్ అమెరికా’గా మారుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) సంతకం చేశారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కెనడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సరస్సు పేరు ఎప్పటికీ లేక్ అంటారియోగానే కొనసాగుతుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు.అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ అధికారిక భౌగోళిక రికార్డుల్లో 30 రోజుల్లోగా ఈ మార్పును చేర్చాలని, ఫెడరల్ ఏజెన్సీలన్నీ ‘లేక్ అమెరికా’ అనే పేరునే ఉపయోగించాలని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరస్సులో అత్యంత లోతైన భాగం అమెరికా వైపే ఉందని, అందువల్ల ఎక్కువ నీటి పరిమాణం తమకే చెందుతుందని ఆయన వాదించారు. గతంలో ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చిన తరహాలోనే తాజా నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల పేర్లను కూడా మార్చవచ్చంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.మరోవైపు కెనడా ప్రధాని కార్నీ స్పందిస్తూ.. అమెరికా, కెనడా దేశాలు ఏర్పడటానికి ముందే, సుమారు 400 ఏళ్ల కిందటే స్థానిక తెగల భాష ఆధారంగా ఈ సరస్సుకు ‘అంటారియో’ (అందమైన లేదా పెద్ద సరస్సు) అనే పేరు వచ్చిందని గుర్తుచేశారు. వాస్తవాలను మార్చలేమని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన తేల్చిచెప్పారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలమై, పరస్పరం సుంకాలు విధించుకోవడంతో సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ఉత్తర్వులు వివాదాన్ని మరింత పెంచాయి.ఇది కూడా చదవండి: రైతుల్లో గుబులు: సెప్టెంబర్లోనూ వర్షాలు అనుమానమే.. -
పేట్రియాట్ల కొరత తీవ్రం
వాషింగ్టన్: అమెరికా సైన్యం పశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధంలో మునిగిపోయింది. తరచుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇరాన్ సైన్యం ప్రయోగించే ఆయుధాల నుంచి రక్షించుకోవడానికి అధునాతన క్షిపణి నిరోధకాలను (పేట్రియాట్లు) మోహరించింది. పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాలకు వీటిని అందజేస్తోంది. మరోవైపు యూరప్లో అధునాతన క్షిపణి నిరోధకాల కొరత అత్యంత తీవ్రస్థాయిలో ఉందని అమెరికా రక్షణ అధికారి, నాటో అధికారి తెలియజేశారు. ఒకవేళ రష్యా సైన్యం యూరప్పై దాడి చేస్తే తాము రక్షించలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యా క్షిపణులను అడ్డుకొనే ఇంటర్సెప్టర్లు లేవని పేర్కొన్నారు. రష్యాకు చెందిన అత్యంత వేగవంతమైన బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగల పేట్రియాట్ క్షిపణి నిరోధకాల కొరత వేధిస్తుండడం అత్యంత ఆందోళనకరమని అమెరికా రక్షణ అధికారి తెలిపారు. ఐరోపా ఖండంలో అమెరికన్, నాటో దళాల వద్ద పేట్రియాట్ల నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ధ్రువీకరించారు. సైనిక ప్రధాన కార్యాలయం లేదా విద్యుత్ కేంద్రంపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగిన పక్షంలో, పేట్రియాట్ క్షిపణుల కొరతతో బాధపడుతున్న ఉక్రెయిన్ మాదిరిగానే నాటో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొని, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్పై యుద్ధం ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ వల్ల అమెరికా సైన్యం ఇతర ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా–ఇరాన్ యుద్ధానికి దాదాపు ఆరు నెలలు పూర్తయ్యాయి. యూరప్లోని అమెరికా క్షిపణి నిల్వలను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించారు. అక్కడ ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా, గల్ఫ్ మిత్రదేశాలు పేట్రియాట్లతో సహా గణనీయమైన సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాయి. మరోవైపు సాధ్యమైనంత త్వరగా మిస్సైల్ ఇంటర్సెప్టర్లు అందజేయాలని తమ ప్రభుత్వాన్ని యూరప్లోని అమెరికా సైన్యం కోరుతోంది. -
భాగవత్ కార్యక్రమ నిర్వాహకుల ఎక్స్ ఖాతా బ్లాక్
న్యూఢిల్లీ: అమెరికాలోని న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఎక్స్ ఖాతా గురువారం కొన్ని గంటలపాటు పనిచేయకుండా నిలిచిపోయింది. ఈ విషయాన్ని అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్(ఎహెడ్) ఫోరమ్ స్వయంగా తెలిపింది. కొందరు తప్పుదోవపట్టిన వ్యతిరేకులే ఇందుకు కారణమని ఆరోపించింది. యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్ గురించిన సమాచారం కొంతసేపు అందుబాటులో లేకుండా పోయిందని, ఎక్స్ జోక్యంతో తిరిగి పనిచేయడం ప్రారంభించిందని ‘ఎహెడ్’వివరించింది. తమ ఫిర్యాదుపై తక్షణమే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించిన ఎక్స్కు ధన్యవాదాలు తెలియజేసింది. ఆగస్ట్ 29వ తేదీన న్యూయార్క్ని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లోని ఇన్ఫోసిస్ థియేటర్లో భాగవత్ పాల్గొనే కార్యక్రమ వివరాలను ఎహెడ్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోంది. ఈ కార్యక్రమంలో భాగవత్తోపాటు వివిధ మతాలు, సంస్కృతులకు చెందిన ప్రముఖులంతా హాజరవుతున్నారు. యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ మద్దతిచ్చే 200కు పైగా సంస్థల్లో ఎహెడ్ ఒకటి. -
అప్పుల ఊబిలో అమెరికా?.. కియోసాకి చెప్పిన సంచలన నిజం
ప్రముఖ రచయిత, పెట్టుబడుల నిపుణుడు 'రాబర్ట్ కియోసాకి' చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికీ అప్పులు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్స్, భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా భారీ అప్పులను కలిగి ఉన్నాయి. అయితే.. ఒక దేశం ఎంత అప్పు తీసుకుంది అనేదాని కంటే, ఆ అప్పుపై ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తోంది? దాన్ని భరించే సామర్థ్యం ఎంత ఉంది? అనేదే అసలు విషయమని కియోసాకి చెబుతున్నారు.అమెరికా పరిస్థితి ఎందుకు భిన్నం?అమెరికా ప్రస్తుతం భారీగా అప్పులు కలిగి ఉంది. ఈ అప్పులపై ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన వడ్డీ కూడా భారీగా పెరుగుతోంది. కియోసాకి చెప్పిన లెక్కల ప్రకారం అమెరికా ఏడాదికి సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లను వడ్డీగా చెల్లిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తగా తీసుకునే అప్పుల ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుంది. అంటే పాత అప్పుల వడ్డీ చెల్లించేందుకే భారీ మొత్తంలో డబ్బు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అప్పు పెరిగితే ఏం జరుగుతుంది?అధిక రేట్లు అంటే అధిక వడ్డీ చెల్లింపులుఅధిక చెల్లింపులు అంటే పెద్ద లోటు అని అర్థంపెద్ద లోటు అంటే ఎక్కువ అప్పు చేయాల్సి రావడంఎక్కువ అప్పు అంటే ఎక్కువ రుణంఎక్కువ అప్పు అంటే ఎక్కువ వడ్డీకియోసాకి ప్రకారం.. ఒక రకమైన అప్పు చక్రంలా మారుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే ప్రభుత్వ వడ్డీ భారం పెరుగుతుంది. వడ్డీ చెల్లింపులు పెరగడంతో బడ్జెట్ లోటు ఎక్కువవుతుంది. ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం మరింత అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కొత్త అప్పు పెరిగితే భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీ కూడా పెరుగుతుంది. ఇలా అప్పు.. వడ్డీ.. మరింత అప్పు.. మరింత వడ్డీ అనే చక్రం కొనసాగుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. -
మూడో ప్రపంచ యుద్ధ ముప్పున్నదా?
ఒకవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండగానే అనూహ్యంగా కొత్త సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో శాంతి ఎండమావిగా తోస్తున్నది. ఇజ్రాయెల్ అనూహ్యంగా సిరియాను, తద్వారా టర్కీని కూడా యుద్ధంలోనికి లాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై సైనిక దాడికి దిగిన ట్రంప్ సరికొత్తగా ఆ దేశంపై ఆర్థిక యుద్ధం పల్లవి అందుకున్నాడు. ఇరాన్తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దేశాలపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ విధానం అమలైతే తీవ్రంగా నష్టపోయేది చైనా. ఇరాన్ చమురులో 90 శాతం చైనా కొనుగోలు చేస్తున్నది. ఈ రకంగా ఇరాన్ యుద్ధంలోనికి ప్రత్యక్షంగా చైనాను లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతున్నది. మరొకవైపు ఇజ్రాయెల్ ప్రధాని, ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పల్లవిని అందుకున్నాడు. ఇంకొకవైపు సౌదీ– పాకిస్తాన్–టర్కీ ‘మక్కా ఒప్పందం’తో నాటో తరహా సైనిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్ ప్రధాని మక్కా ఒప్పందంలోనికి చేరటానికి సంకేతాలివ్వటం భారత్ను ఒత్తిడిలోనికి నెట్టింది. వేగంగా మారుతున్న సమీకరణాలు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధంవైపు తీసుకెళ్తున్నాయా అనే సందేహాన్ని కలిగించక మానవు.ప్రపంచ యుద్ధాల నేపథ్యంమొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపా రెండు రాజకీయ /సైనిక కూటములుగా చీలిపోయింది. బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ సవాలు చేసింది. పాన్ జర్మనిక్, పాన్ స్లావిక్, బాల్కన్ జాతీయవాద ధోరణులు బలంగా వ్యాపించి ఉన్నాయి. జూన్ 1914లో ఆస్ట్రియా– హంగరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంక్ ఫెర్డినాండ్ హత్యతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించింది. కూటమి ధర్మంలో భాగంగా సెర్బియాకు మద్దతుగా రష్యా, ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ యుద్ధంలో చేరాయి. జర్మన్ సైనికాధికారి ‘షెఫర్’ యుద్ధ తంత్రంలో భాగంగా తటస్థ దేశమైన బెల్జియంపై దాడి చేయాల్సి వచ్చింది. ఈ రకంగా యుద్ధం ఐరోపా మొత్తం విస్తరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కుదిరిన వెర్సెయిల్స్ ఒప్పందంలో భాగంగా జర్మనీపై విధించిన యుద్ధనష్ట పరిహారం, ఇతర అంశాలను అమలు చేసే యంత్రాంగం లేకపోవడం, ఆర్థిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్), పునరుత్థానం చెందుతున్న జర్మనీ/ జపాన్ వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని పునఃస్థాపించటానికి సరి హద్దుల వ్యాప్తి (లెబెన్స్రామ్), లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఫాసిజం, కమ్యూనిజం, లిబరల్ డెమోక్రసీ వంటి సిద్ధాంతాల వైరుధ్యం అగ్నికి ఆజ్యంపోశాయి.ఈ సందర్భంలో ‘తూసిడైడీస్ ట్రాప్’ సిద్ధాంతాన్ని చర్చించు కోవాలి. ప్రాచీన చరిత్రకారుడైన తూసిడైడీస్... ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల ప్రస్తుత రాజకీయ శక్తిలో సందేహాన్ని, భయాన్ని కలిగించినప్పుడు... ఇరు శక్తులు ఆయుధ సమీకరణ చేస్తాయనీ, అప్పుడు యుద్ధం అనివార్యమనీ సిద్ధాంతీకరించాడు. ప్రాచీన గ్రీక్ ప్రాంతంలో ఏథెన్స్ ఎదుగుదల స్పార్టాలో భయానికి కారణమై యుద్ధానికి దారితీసింది. 2017లో రాజకీయ శాస్త్రజ్ఞుడు గ్రాహమ్ ఆలిసన్ తన ‘డెస్టైన్డ్ ఫర్ వార్: కెన్ అమెరికా అండ్ చైనా ఎస్కేప్ తూసిడైడీస్స్ ట్రాప్?’ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని విస్తృతంగా పరిశీ లించాడు. గత 500 ఏళ్ల చరిత్రలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించిన 16 సందర్భాల్లో 12 సార్లు యుద్ధం జరిగిందని పేర్కొన్నాడు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా?1914, 1939 సంవత్సరాలలో మాదిరిగానే ఇప్పుడూ ఒక కొత్త రాజకీయ శక్తి చైనా ప్రపంచ ఆధిపత్య రేసులోనికి వచ్చింది. ట్రంప్ ట్యారిఫ్ వార్లో చైనా, అమెరికాపై ప్రతిసుంకాలను విధించింది. ఇటీవల ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని జిన్పింగ్ హెచ్చరించాడు. సెమికండక్టర్స్, చిప్స్, కృత్రిమ మేధ, క్రిటికల్ మినరల్స్ రంగాలలో అమెరికాకు, ఐరోపాకు చైనా నేరుగా సవాలు విసిరింది. 2020 నుండి రష్యా తిరిగి బలం పుంజుకొని నాటో ఆధిప త్యాన్ని సవాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఐక్యరాజ్యసమితి బలహీనపడటంతో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు కూడా యుద్ధాన్ని నిలువరించే వ్యవస్థలు లేవు. కోవిడ్ అనంతరం ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించడం, గల్ఫ్ యుద్ధం, వాతావరణ మార్పుల వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధరంగంలోనికి అణ్వస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాన రాజకీయ శక్తులన్నీ అణ్వస్త్ర దేశాలే. వీటిమధ్య ప్రత్యక్ష యుద్ధం సంభవిస్తే, పరస్పర వినాశం అనివార్యం. అందువలన ఏ అణ్వస్త్ర దేశం ఇంకో అణ్వస్త్ర దేశంపైన దాడికి సాహసించే అవకాశం లేదు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. అందువలన మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఏ రాజకీయ శక్తి కూడా ఈ దుస్సాహసానికి పాల్పడలేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు స్పష్టమైన పరస్పర, వైరుధ్య శత్రు కూటములు కూడా లేవు. కొత్త కూటములుఅయితే కూటములు ఏర్పడే అవకాశాలూ కనపడుతున్నాయి. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా (క్రింక్) ఒక కొత్త సైనిక కూట మిగా ఏర్పడి నాటోను నేరుగా సవాలు చేయవచ్చు. మక్కా ఒప్పందంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కొత్త సైనిక కూటమిగా ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాలను వెదకాల్సి వస్తుంది. బహుశా దీనికి విరుగు డుగా భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – ఇజ్రాయెల్ – జపాన్ కూటమి అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్లో భాగంగా నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు లేదా, కనీసం జోర్డాన్ నది నుండి మద్యధరా సముద్రం వరకు ఇజ్రాయెల్ విస్తరణకు పూనుకుంటే గల్ఫ్ యుద్ధక్షేత్రం మరింత విస్తరిస్తుంది. ఇరాన్పై అమెరికా ఆర్థిక యుద్ధాన్ని తీవ్ర తరం చేస్తే నష్టపోయే చైనా... ఇరాన్కు ప్రత్యక్షంగా మద్దతు తెలప వచ్చు. దీంతో ఇరాన్... ఐరోపా దేశాలపై దాడులు చేయవచ్చు. ఇదే అదనుగా రష్యా ఇతర ఐరోపా దేశాలపై (ముఖ్యంగా బాల్టిక్ దేశాలపై) దాడులు చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవచ్చు. శత్రువును నిలువరించటానికి ఇదే అనువైన సమయంగా భావించి తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోవటానికి ఉపక్రమించవచ్చు. రష్యా, చైనాలకు మద్దతుగా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడి ప్రారంభించవచ్చు. ఇదే అదనుగా పాక్–చైనా కలిపి భారత్పై దాడి చేయవచ్చు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం... దేశాలను, భూభాగాలను ఆక్రమించుకోవటానికి కాకుండా శత్రుదేశాల సామర్థ్యాన్ని ధ్వంసం చేసే దిశగా ఉంటుంది. నగరాలు, పౌరులు లక్ష్యంగా ఉండదు. రేవుల దిగ్బంధనం, రవాణా మార్గాల దిగ్బంధనం, ఆర్థిక విధ్వంసం, సైబర్, అంతరిక్ష దాడులు, ప్రాక్సీ వార్ఫేర్ రూపంలో ఉండవచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు
వాషింగ్టన్: పాకిస్థాన్కు చెందిన క్రైస్తవ మహిళను అపహరించి, ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు రావడంతో ఆమె ప్రాథమిక హక్కులను కాపాడాలని 11 మంది అమెరికా చట్టసభ సభ్యులతో కూడిన ద్వైపాక్షిక బృందం ఇస్లామాబాద్ను కోరింది. 18 ఏళ్ల పాకిస్థానీ క్రైస్తవ మహిళ నెహా ఫకీర్ను మార్చిలో అపహరించినట్లు, ఆ తర్వాత ఆమెను ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. టామ్ లాంటోస్ మానవ హక్కుల కమిషన్ సహాధ్యక్షుడు, కాంగ్రెస్ సభ్యుడు క్రిస్ స్మిత్.. ఫకీర్ భద్రత, ప్రాథమిక హక్కులను పాకిస్థాన్ ప్రభుత్వం కాపాడాలని కోరారు.“నెహా ఫకీర్ అదృశ్యం కావడం, ఆ తర్వాత ఆమె మతం మార్చుకోవడం వెనుక ఉన్న పరిస్థితులు ఆమె భద్రత, మత స్వేచ్ఛ, బలవంతం లేదా బెదిరింపులు లేకుండా తన హక్కులను వినియోగించుకునే సామర్థ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి” అని స్మిత్ అన్నారు.కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?క్రైస్తవ సాలిడారిటీ ఇంటర్నేషనల్ జూన్ 10న ఫకీర్ కేసుపై ఆందోళన వ్యక్తం చేయడంతో అమెరికా స్పందన వచ్చింది. మార్చి 24న ఓ శిక్షణ తరగతికి హాజరైన తర్వాత ఆమె కనిపించకుండా పోయినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత ఫకీర్ లాహోర్లోని ఒక మదర్సాలో కనిపించారు. అక్కడ ఆమెను ఇస్లాంలోకి మార్చినట్లు తెలిసింది. అయితే, ఆమెను తిరిగి తమ వద్దకు పంపించాలని కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ను పాకిస్థాన్ కోర్టు తిరస్కరించింది.అమెరికా చట్టసభ సభ్యులు లేఖలో ఏమన్నారు?స్మిత్తో పాటు అమెరికా కాంగ్రెస్కు చెందిన మరో 10 మంది సభ్యులు ఆగస్టు 20న పాకిస్థాన్ ఫెడరల్ న్యాయ, న్యాయవ్యవహారాల మంత్రి ఆజమ్ నజీర్ తారర్కు లేఖ రాశారు. ఫకీర్ కేసుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ విషయంలో పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. స్మిత్తో పాటు ప్రతినిధులు జేమ్స్ పి. మెక్గవర్న్, ఫ్రెంచ్ హిల్, గస్ బిలిరాకిస్, ఆండీ హారిస్, మారియా ఎల్విరా సలాజర్, రిలే మూర్, రాండీ వెబర్, మైఖేల్ క్లౌడ్, బ్రాడ్ షెర్మన్, బ్లేక్ మూర్ లేఖపై సంతకాలు చేశారు.ఫకీర్ శారీరక భద్రత, ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు పాకిస్థాన్ అధికారులు తమ న్యాయ వ్యవస్థ పరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్వతంత్ర న్యాయవాదిని గోప్యంగా సంప్రదించే అవకాశం ఆమెకు కల్పించాలని చట్టసభ సభ్యులు కోరారు.ఫకీర్ తన కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా, వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా వారు కోరారు. భవిష్యత్తులో జరిగే ఏదైనా న్యాయపరమైన విచారణలో ఆమె తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా, బెదిరింపులు లేదా అనుచిత ప్రభావానికి గురికాకుండా పరిస్థితులు ఉండేలా పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.పాకిస్థాన్ రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణలను కూడా సభ్యులు ప్రస్తావించారు. ఇందులో మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసే స్వేచ్ఛకు హామీ ఇచ్చే ఆర్టికల్ 20, చట్టం ముందు సమానత్వానికి హామీ ఇచ్చే ఆర్టికల్ 25 ఉన్నాయి.“పాకిస్థాన్ రాజ్యాంగం మత స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వానికి రక్షణ కల్పిస్తోంది. అయితే ఒక యువతి తన విశ్వాసాలను సురక్షితంగా, స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతే దీనికి అర్థం ఉండదు” అని స్మిత్ అన్నారు. పాకిస్థాన్లోని మతపరమైన మైనారిటీలకు ఈ కేసు ఎంతో ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. “ఈ కేసు పాకిస్థాన్లోని మతపరమైన మైనారిటీలకు ప్రత్యేకంగా ముఖ్యమైనది. వారు అపహరణ, బలవంతపు మతమార్పిడి, బలవంతపు వివాహాలకు గురవుతున్నారు” అని స్మిత్ అన్నారు.మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో ప్రముఖంగా పనిచేస్తున్న స్మిత్.. మతపరమైన మైనారిటీ మహిళలు, బాలికలను అపహరించడం, బలవంతంగా మతం మార్చడం, అలాగే నిందితులను బాధ్యులుగా చేయడంలో అధికారులు విఫలమవుతున్న అంశాలపై చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
అమెరికా ఉద్యోగాన్ని కాదని వ్యవసాయం..! ఏకంగా ఆరుసార్లుకు పైగా..
చాలామంది పెద్ద పెద్ద రిస్క్లు తీసుకుని అలవోకగా విజయాలందుకుంటుంటారు. హాయిగా మంచి పొజిషనల్ ఉన్న లైఫ్ని కొందరు కిక్ కోసం.. కష్టాల్లోకి వెళ్లి మరి.. సక్సెస్ని పట్టుకునేందుకు వెంపర్లాడుతుంటారు. అయితే ఆ క్రమంలో వచ్చే అపజయాలకు ఆగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగితేనే గెలుపు పిలుపు వినిపిస్తుంది. అచ్చం అలానే చేశాడు ఈ వ్యక్తి. ఒకటి, రెండు సార్లు కాదు..ఏకంగా ఎన్నిసార్లు ఓటమి పలకరించి భయపెట్టిందో తెలిస్తే విస్తుపోతారు. మరి చివరికి సక్సెస్ అందుకున్నాడా అంటే..అతడే శశికుమార్ అనే పారిశ్రామికవేత్త. అతడి స్ఫూర్తిదాయక కథ నిజంగా యువతకు పెద్ద పాఠం, కనువిప్పు కలిగించే స్టోరీ కూడా. ఈ టెకీ అమెరికాలోని విప్రోలో హాయిగా ఐటీ ఉద్యోగిగా బిందాస్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. అయినా సరే ఏదో వెలితి వెంటాడుతూ ఉండటంతో..ఉన్న సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని కాదని వ్యవసాయం చేయాలని అగ్రికల్చర్ రంగంలోకి దిగాడు. ఇది అలాంటి ఇలాంటి భారీ రిస్క్ కాదు. ఎందుకుంటే ప్రస్తుతం వ్యవసాయం ఏ పరిస్థితుల్లో ఉందో తెలియంది కాదు. పంటలు పండినా..గిట్టుబాటు ధరలేక విలవిలలాడుతున్నారు రైతన్నలు. అలాంటి టైంలో ఈ టెకీ అతిపెద్ద సాహసం చేసి మరి వ్యవసాయంలోకి దిగాడు. తను తీసుకున్న ఈ అనుహ్య నిర్ణయం ఎన్నిసార్లు అగ్నిపరీక్ష పెట్టిందో తెలిస్తే కంగుతింటారు. మొదట్లో రైతులకు తన వంతుగా సాయం చేద్దామని అక్షయకల్ప పేరుతో వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అందుకోసం కార్పొరేట్ జీవితానికి స్వస్తి పలికి మరి పూర్తిస్థాయిలో ఇందులో కొనసాగాలని భావించాడు. అయితే శశికుమార్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదిసార్లు దివాళ పరిస్థితికి వచ్చేశాడు. మరొకరు ఎవరైనా తక్షణమే ఇది తనకు సరైనది కాదని వెనుదిరిగేవారేమో..కానీ శశి కుమార్ అదుకు ససేమిరా అంటూ మొండిగా ముందుకుసాగాడు. భార్య అండ దండతో ఆమె దాచిన రూ. 30 లక్ష పొదుపు సాయంతో కష్టాల్లో ఉన్న కంపెనీనిని నిలదొక్కుకునేలా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండేవాడు. అతడు స్థాపించిన అక్షయకల్ప అనేది సర్టిఫైడ్ ఆర్గానిక్ డైరీ సంస్థ. రసాయనాలు లేని పాలు, పాల ఉత్పత్తులు, ఆర్గానిక్ ఆహారాలను అందించే సంస్థ. అయితే అతడు చివరికి చాలా కష్టాలు పడి విజయవంతంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడం ప్రారంభించాడు. అంతేగాదు రైతులకు ప్రతి నెలరూ. 1.28 లక్షలు చొప్పున వార్షికంగా రూ. 480 కోట్లు పైనే చెల్లిస్తున్నాడు. ఈ రోజు అక్షయకల్పలో 2800 మంది రైతులు ఉన్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రతి నెల ఏకంగా రూ. 60 కోట్ల లాభం చొప్పున ఏడాదికి దాదాపుగా రూ. 600 కోట్లుపైనే ఆర్జిస్తుండటం విశేషం. అంతేగాదు అతడు తీసుకున్న నిర్ణయాన్ని తండ్రి గట్టిగా వ్యతిరేకించాడట కూడా. పైగా తాను చేసిన వ్యవసాయ కష్టాన్నే తన కొడుకు ఎంచుకోవడం అస్సలు నచ్చలేదట. అమెరికాలో మంచి ఉద్యోగాన్ని కాదనుకున్నాడనే కోపంతో కుమారుడితో దాదాపు ఎనిమిదేళ్లు మాట్లాడటమే మానేశాడట. చివరికి స్వయంగా తండ్రే మెచ్చుకునేలా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు..రైతులకు అండదండగా నిలిచాడు. నెటిజన్లు అతడి అపారమైన పట్టుదలకు పిదా అవ్వుతూ గ్రేట్ సార్ మీరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో కూడా దీన్ని ప్రారంభించొచ్చు కదా అంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: 16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..) -
సరే.. మమ్మీ నువ్వే కాల్ చెయ్
నిజామాబాద్అర్బన్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన రాహుల్ చివరి సారిగా తన తల్లితో ఫోన్లో ఈనెల 24వ తేదీన ఉదయం 9గంటలకు మాట్లాడాడు. తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలోనే స్నేహితులు క్యాబ్లో రావడంతో ‘‘ఆఫీస్కు వెళ్తున్నానని, రేపు ఉదయం నువ్వే కాల్ చెయ్ మమ్మీ..’’ అంటూ ఫోన్ కట్చేశాడు. అవే రాహుల్ చివరి మాటలు అంటూ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. నవీపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నాగమణి, హరిబాబు జిల్లా కేంద్రంలోని గూపన్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాగమణి గృహిణి కాగా, హరిబాబు రైల్వేలో ఏఎస్సైగా పని చేసి రిటైర్ అయ్యారు. కొడుకు రాహుల్ నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న రాహుల్ అక్కడే పీహెచ్డీ పూర్తి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. మే 5వ తేదీన తన చెల్లె పెళ్లికి ఇంటికొచ్చిన రాహుల్ అదే నెలలో 18వ తేదీన తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. తన తల్లితో సోమవారం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే రాహుల్ దుర్మరణం పాలయ్యాడు. చేతికొచ్చిన కొడుకు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుంబెలుబాదుకుంటున్నారు. తన కొడుకు మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని తండ్రి హరిబాబు రోదిస్తూ వేడుకుంటున్నాడు. -
సంచలనం.. అమెరికాలో భారీ సైబర్ దాడుల కుట్ర భగ్నం
అమెరికాలో భారీ సైబర్ దాడి కలకలం రేపింది. ఆ దేశపు అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలపై హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. సెనెట్తో పాటు న్యాయశాఖ, అంతరిక్ష సంస్థ నాసా, ఫెడరల్ రిజర్వ్ లాంటి కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ ఆపరేషన్ను అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటించింది.అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యూస్కాన్(QScan), క్యూటీరూటర్( QTRouter) అనే రెండు హ్యాకింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన డొమైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ వేదికల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు నెట్వర్క్లలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. అయితే డాటా సురక్షితమేనా?.. కీలక సమాచారం ఏదైనా బయటకు పొక్కిందా? అనే వివరాలను మాత్రం ధృవీకరించలేదు.చైనా హ్యాకర్లపై ఆరోపణలుఈ సైబర్ దాడుల వెనుక చైనా కేంద్రంగా పనిచేసే సంస్థ ఉందని అమెరికా ఆరోపించింది. చైనాకు చెందిన నాన్జింగ్ జిన్జియువీ నెట్వర్క్ టెక్నాలజీ కంపెనీ నిర్వహించిన ఈ వ్యవస్థలను చైనా గూఢచార సంస్థలు, సైన్యానికి సంబంధించిన వర్గాలు ఉపయోగించినట్లు అమెరికా దర్యాప్తు పత్రాల్లో పేర్కొంది. 2018 నుంచే దాడుల ప్రయత్నాలు?ఈ హ్యాకింగ్ కార్యకలాపాలు 2018 నుంచే కొనసాగుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. కీలక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ నెట్వర్క్లు, అంతర్జాతీయ సంస్థల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తెలిపారు. 2019లో నాసా నెట్వర్క్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం జరిగినా.. అది విఫలమైందని అధికారులు తెలిపారు. 2024లో ఎనర్జీ డిపార్ట్మెంట్ ల్యాబ్లు, ఆరోగ్య శాఖకు చెందిన సంస్థలు, ఇతర సున్నితమైన నెట్వర్క్లపై చొరబాట్లు జరిగినట్లు వెల్లడించారు. డాటా చోరీపై ఆందోళనసైబర్ దాడితో అమెరికా రక్షణ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి సమాచారం దొంగిలించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు సైబర్ భద్రతా సంస్థలు తెలిపాయి. సెనెట్, ఆసుపత్రి నెట్వర్క్లను కూడా హ్యాకర్లు పరిశీలించినట్లు దర్యాప్తులో తేలింది. చైనా రియాక్షన్అమెరికా ఆరోపణలపై చైనా స్పందిస్తూ.. సైబర్ దాడులను తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపింది. సైబర్ భద్రత అంశాలను ఉపయోగించుకుని చైనాను అపఖ్యాతి పాలుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. అయితే తాజా నివేదికలపై మాత్రం డ్రాగన్ దేశం స్పందించాల్సి ఉంది. సైబర్ యుద్ధం ఇలా..అమెరికా-చైనా మధ్య ఇప్పటికే వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైబర్ నిపుణుల ప్రకారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పనిచేసే హ్యాకింగ్ నెట్వర్క్లు ప్రపంచవ్యాప్తంగా కీలక సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ఆ మధ్య ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అత్యంత జాగ్రత్తగా అమెరికా భద్రతా బలగాలు వ్యవహరించాయి. తాజాగా జరిగిన సైబర్ దాడుల వ్యవహారం రెండు దేశాల మధ్య డిజిటల్ భద్రతపై కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కళ్లెదుటే కల్లోలం.. ఈ షాకింగ్ దృశ్యాలు చూశారా? -
మోజ్తాబా ఖమేనీపై ఇరాన్ కపట నాటకం.. బయటపెట్టిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణించారనే ప్రచారం అప్పట్లో జోరందుకుంది. తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు గైర్హాజరు కావడంతో ఆ ప్రచారానికి ఊతం ఇచ్చినట్లైంది.ఈ క్రమంలో మోజ్తాబా తన అనుచరులతో మాట మంతి నిర్వహించడం, ఆయనే స్వయంగా మాట్లాడిన వీడియోలను ఇరాన్ విడుదల చేసింది. దీంతో మోజ్తాబా మరణంపై కొనసాగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఖమేనీ ఆచూకీపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు గ్లెన్ బెక్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఖమేనీ కనిపించకపోవడంపై వస్తున్న వార్తలను ఆయన ప్రస్తావించారు. ‘ఖమేనీ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. కానీ వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన ఎడమ వైపు శరీరం, చేయి, కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.. కానీ ప్రాణాలతోనే ఉన్నారు’ అని ట్రంప్ స్పష్టం చేశారు.ఒకవేళ మొజ్తాబా ఖమేనీ పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్ళినా, మరణించినా.. ఇరాన్ ప్రభుత్వం ఆ నిజాన్ని దాచిపెడుతోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచాన్ని, ఇరాన్ ప్రజలను నమ్మించడానికి ఇరాన్ రహస్య నాటకం ఆడుతోందన్నారు. గత కొన్ని నెలలుగా మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం వెనుక ఇస్రాయెల్ క్షిపణి దాడుల ప్రభావం ఉందనే అనుమానాలకు ట్రంప్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇరాన్ తన దేశాధినేత పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని చూపిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఆ దేశ నాయకత్వం ఎంతటి బలహీన స్థితిలో ఉందో ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.అవన్నీ పాత వీడియోలేనాఇరాన్ అత్యున్నత నాయకుడికి సంబంధించిన పాత వీడియో దృశ్యాలను ఇరాన్కు చెందిన ‘ఫార్స్ న్యూస్’ విడుదల చేసిందని ‘అల్ అరబియా’ నివేదించింది. అల్ అరబియా కథనం ప్రకారం, ఆయన అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఆరోపించిందిఎవరి మాటలు నమ్మాలిప్రపంచానికి తమ సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు ఇరాన్ మీడియా ఈ వీడియోలను విడుదల చేసింది. ఆగస్టు నెలలో ఇరాన్ మీడియా ఈ వీడియోను విడుదల చేయడానికి ముందు, ఇరాన్ అత్యున్నత నాయకుడి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'మెహర్ న్యూస్' ఒక వీడియోను విడుదల చేసింది. తేదీ లేని ఆ వీడియోలో సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు.అంతకుముందు, ఖమేనీ అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ అంతర్గత వర్గాలు, అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ యంత్రాంగానికి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘ది జెరూసలేం పోస్ట్’ ప్రచురించిన కథనాల ప్రకారం, ఇరాన్ నాయకత్వంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.అవన్నీ ఊహాగానాలే ఆ తర్వాత కొద్దిసేపటికే, అత్యున్నత నాయకుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పేర్కొన్నారు. ఆయన శారీరక పరిస్థితికి సంబంధించిన ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ఏడు నుండి ఎనిమిది గంటల పాటు కూర్చుని చర్చించగలిగే వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అని అధ్యక్షుడు అన్నారు. ఆగస్టు ప్రారంభంలో తాను ఆయనతో మంచి సమావేశాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులలో తన తండ్రి, మాజీ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మొజ్తాబా ఖమేనీ ఆ పదవిని చేపట్టారు. ఆ పదవిని చేపట్టినప్పటి నుండి, మొజ్తాబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించకుండా కేవలం లిఖితపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే వ్యవహరిస్తున్నారు.👉ఇదీ చదవండి: ‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం -
హాలీవుడ్ స్టైల్లో రష్యా, అమెరికా సీక్రెట్ చర్చలు
ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా రష్యాల మధ్య తాజా పరిణామాలు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. వేర్వేరు వార్తా సంస్థలు, అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చీఫ్ తాజాగా మాస్కో వెళ్లి రష్యన్ ఇంటెలిజెన్స్ విభాగం క్రెమ్లిన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఇటీవలి కాలంలో అమెరికా – రష్యా దౌత్య సంబంధాలు కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకోవడం.. అది కూడా అత్యంత రహస్యంగా జరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ రష్యా వచ్చారని, అధ్యక్షుడు పుతిన్ను కలవకపోయినప్పటికీ చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం చెప్పలేదు. మరోవైపు ఈ చర్చలపై కానీ, డైరెక్టర్ రష్యా పర్యటనపై కానీ సీఐఏ కూడా నోరు మెదపడం లేదు. వైట్హౌస్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అమెరికా మిలిటరీ విమానం మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో మంగళవారం ల్యాండ్ అయిందని, అదే రోజు తిరిగి వెళ్లిపోయిందని రష్యా అధికార వార్తా సంస్థలు తెలిపాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ‘‘ప్రతినిధి బృందం ఒకటి రష్య రాజధానికి వెళుతోంది. ఆ బృందం రష్యా నుంచి వెళ్లిపోయేదాకా దాడులకు విరామం ఇవ్వాలి’’అంటూ వాషింగ్టన్ నుంచి ఉక్రెయిన్కు ఆదేశాలు వెళ్లినట్లు ఉక్రెయిన్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారని సమాచారం. రష్యా మొత్తమ్మీద దాడులు ఆపాల్సిందిగా చెప్పలేదని, మాస్కో, సెయింట్ పీటర్స్బెర్గ్, రష్యా ఉత్తర ప్రాంతాల్లో మాత్రం జరక్కూడదని అమెరికా స్పష్టంగా చెప్పిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. సీఐఏ డైరెక్టర్ రష్యా పర్యటన వివరాలను మొట్టమొదట సీబీఎస్ ఛానెల్ బయటపెట్టింది. సంక్షోభంలోనే దౌత్య సంబంధాలు... నిఘా వర్గాల స్థాయిలో ఇరు దేశాల మధ్య కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ రష్యా, అమెరికా మధ్య దౌత్య సంబంధాల్లో మాత్రం సంక్షోభం కొనసాగుతోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ చెబుతున్నారు. సీఐఏ డైరెక్టర్ పర్యటన ప్రభావం ఇరుదేశాల సంబంధాలపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే సీఐఏ డైరెక్టర్ రష్యా రావడం చాలా అరుదైన విషయమని రష్యా భద్రతాదళాల విషయంలో నిపుణుడైన అండ్రే సోల్డటోవ్ చెబుతున్నారు. సాధారణంగా ఈ స్థాయి సమావేశాలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఏదైనా దెబ్బ తగులుతోందన్న సందర్భంలోనే జరుగుతాయని చెప్పారు. -
బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం!
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. పసిడి ధరలు భారీగా పెరిగి మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నప్పటికీ, బుధవారం మాత్రం ధరల తగ్గుదల నమోదైంది. దీనికి తోడు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలపడటం వంటి అంశాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపాయి.అమెరికా ద్రవ్యోల్బణంఅమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితిని అంచనా వేయడానికి ఫెడరల్ రిజర్వ్ ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో పీసీఈ ప్రైస్ ఇండెక్స్ ఒకటి. జూలై వరకు 12 నెలల్లో పీసీఈ ద్రవ్యోల్బణం 3.7 శాతంగా నమోదైంది. అయితే.. మార్కెట్ నిపుణులు దీనిని 3.6 శాతంగా అంచనా వేశారు. అంటే.. ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కొంత బలపడ్డాయి.వడ్డీ రేట్లు పెరిగితేబంగారం ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. అందువల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ వచ్చే బాండ్లు, ఇతర ఆర్థిక సాధనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. అయితే వచ్చే నెలలో రేట్లు పెరిగే అవకాశం 38 శాతంగా ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది.డాలర్ బలపడటంబంగారం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలోనే ధర నిర్ణయించబడుతుంది. బుధవారం డాలర్ విలువ 0.3 శాతం పెరిగింది. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలు ఉపయోగించే వారికి బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో బంగారం కొనుగోళ్లపై కొంత ప్రభావం పడుతుంది. అందుకే డాలర్ పెరుగుదల కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణం అని తెలుస్తోంది.బంగారం ధర ఎంత తగ్గింది?బుధవారం స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం తగ్గి ఔన్సుకు 4,594.84 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.9 శాతం తగ్గి 4,650.90 డాలర్లకు చేరాయి. అయితే దీనిని చూసి బంగారం భారీగా పతనమవుతోందని భావించాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ధరలు బాగా పెరగడంతో పెట్టుబడిదారులు తమ లాభాలను కొంతవరకు తీసుకోవడం కూడా ఈ తగ్గుదలకు కారణం.మళ్లీ 5,000 డాలర్లకు బంగారంధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ, బంగారం దీర్ఘకాలికంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.పీటర్ గ్రాంట్ ప్రకారం.. ప్రస్తుత తగ్గుదల ఒక తాత్కాలిక స్థిరీకరణ మాత్రమే కావచ్చు. బంగారం మళ్లీ 5,000 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఈ ఏడాదిలోనే ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే 2027 రెండో త్రైమాసికం నాటికి బంగారం కొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు.ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంబంగారం ధరను కేవలం అమెరికా వడ్డీ రేట్లు మాత్రమే నిర్ణయించవు. ప్రపంచంలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా ప్రభావం చూపుతాయి. ఇరాన్, ఒమన్ మధ్య 'హర్ముజ్'కు సంబంధించిన ఆదాయ పంపకంపై ఒప్పందం కుదిరినప్పటికీ, అమెరికా తమ షరతులను అంగీకరించకపోతే ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి తెరవబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొన్నాయి.ఇలాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. కాబట్టి ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో బంగారం ధరకు మద్దతు ఇవ్వవచ్చు.ఇతర లోహాల పరిస్థితివెండి: 1.1 శాతం తగ్గి 67.91 డాలర్లకు చేరిందిప్లాటినం: 1.2 శాతం తగ్గి 1,837.78 డాలర్లకు చేరిందిపల్లాడియం: 0.1 శాతం తగ్గి 1,325.10 డాలర్లకు చేరింది -
సౌదీతో అణు ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ మెలిక.. ఇజ్రాయెల్ ససేమిరా
వాషింగ్టన్: సౌదీ అరేబియాతో పౌర అణు కార్యక్రమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్ష కోసం కాంగ్రెస్కు సమర్పించారు. అయితే, సౌదీ దేశం ఇజ్రాయెల్తో సంబంధాలను సమన్వయం చేసుకోకపోతే ఈ ప్రక్రియ ముందుకు సాగదని ఆయన పట్టుబడుతున్నట్లు ట్రంప్ పరిపాలనా యంత్రాంగ అధికారి ఒకరు తెలిపారు.అణు శక్తి చట్టం ప్రకారం సంబంధిత పత్రాలను సోమవారం క్యాపిటల్ హిల్కు సమర్పించినట్లు సదరు అధికారి, అమెరికన్ కాంగ్రెస్ ముఖ్య అధికారులు వెల్లడించారు.ఈ ఒప్పందంపై గత నెల అమెరికా రాజధాని వాషింగ్టన్లో అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్, సౌదీ అరేబియా తరఫున ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేశారు. మరుసటి రోజే ‘అబ్రహం ఒప్పందాల’ ద్వారా ఇజ్రాయెల్తో మెరుగైన సంబంధాలను కొనసాగించాలని తాను సౌదీలను కోరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చుతుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ట్రంప్ పట్టుదల, పౌర అణుకార్యక్రమంపై తుది ఆమోదం పొందే ప్రక్రియను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.2020లో కుదిరిన ‘అబ్రహం ఒప్పందాలు’ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఉన్న అరబ్, ముస్లిం మెజారిటీ దేశాల సంఖ్యను పెంచాయి. అయితే, సౌదీ అరేబియాతో కుదుర్చుకోబోయే పౌర అణు ఒప్పందం పూర్తిగా అమలు కావాలంటే.. రియాద్ (సౌదీ రాజధాని) కూడా ఈ ‘అబ్రహం ఒప్పందాల్లో’ చేరి ఇజ్రాయెల్ను అధికారికంగా అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షరతు పెట్టారు. ఈ మెలిక పెట్టడం సౌదీ అరేబియా నాయకులకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొంతమంది చట్టసభ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఒప్పందం ఏమిటి?సౌదీ అరేబియాతో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి అమెరికా కుదుర్చుకున్న 30 ఏళ్ల ఒప్పందం. దీనిపై అమెరికా, సౌదీ ఇంధన మంత్రులు గత నెలలో సంతకాలు చేశారు. దీన్ని ఇప్పుడు ట్రంప్ ఆమోదం కోసం అమెరికా కాంగ్రెస్కు పంపారు.ట్రంప్ షరతు సౌదీ అరేబియాకు అణు సాంకేతికత అందాలంటే.. వారు ముందుగా ‘అబ్రహం ఒప్పందాలు’ ద్వారా ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలకు అంగీకరించాలని ట్రంప్ మెలిక పెట్టారు.సౌదీ వైఖరి ఏమిటి?ఇజ్రాయెల్తో సంబంధాలు కలుపుకోవాలంటే ముందుగా ‘పాలస్తీనా దేశం’ ఏర్పాటుకు మార్గం చూపాలని సౌదీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.అమెరికాలో విమర్శలు ఇదిలా ఉంటే, సౌదీలకు పౌర అణు సాంకేతికత అందిస్తే, వారు సొంతంగా యురేనియంను శుద్ధి చేసుకుని అణు ఆయుధాల తయారీకి దారితీస్తుందని అమెరికాలోని కొందరు చట్టసభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయాల నడుమ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
అమెరికాలో తెలంగాణ యువకుల దుర్మరణం
ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్లో ప్రకృతి విలయ తాండవం -
భారత్ విషయంలో మమ్దానీ క్లారిటీ.. భగవత్ సభపై సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 29న న్యూయార్క్లోని ప్రతిష్ఠాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు. అయితే అది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం నగర పాలక సంస్థకు ఉందో లేదో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ప్రపంచవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు వచ్చారు. న్యూయార్క్లో ఆయన ‘యూనివర్సల్ వన్నెస్’ కార్యక్రమంలో పాల్గొని, సుమారు 5,000 మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యూయార్క్ మేయర్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన స్పందిస్తూ.. ‘నేను ఈ ర్యాలీకి మద్దతు ఇవ్వను. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి దాన్ని రద్దు చేసే అధికార పరిధి నగరానికి ఉందో లేదో నాకు తెలియదు’ అంటూ వ్యాఖ్యానించారు.అలాగే, తాను న్యూయార్క్ చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మేయర్నని మమ్దానీ గుర్తుచేశారు. తన తల్లి కుటుంబ సభ్యులు ఇప్పటికీ భారత్లోనే ఉన్నారని తెలిపారు. భారత్ అంటే బహుళత్వాన్ని గౌరవించే సమాజం, లౌకిక గణతంత్రం, ప్రతి ఒక్కరికీ సమానంగా చోటు కల్పించే దేశమనే భావనతో తాను పెరిగానని చెప్పారు. అలాంటి దేశంలో మినహాయింపు, విభజన ఆధారిత భావజాలం పెరుగుతుండటం తనను తీవ్రంగా కలవరపెడుతోందని అన్నారు. ఏ దేశమైనా సరే ప్రజలను మినహాయించే, విభజించే ఆలోచనలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. భారతీయ అమెరికన్గా మాత్రమే కాకుండా.. ప్రతీ ఒక్కరికీ చోటు కల్పించాలనే విలువలను నమ్మే నగర మేయర్గా కూడా తాను ఈ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద నిరసనలుమోహన్ భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్లోని పలు మతాంతర, పౌరహక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. న్యూయార్క్ సిటీ హాల్ వెలుపల మీడియా సమావేశం నిర్వహించిన ఆయా సంస్థలు కార్యక్రమాన్ని రద్దు చేయాలని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యాన్ని కోరాయి. మరోవైపు మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ‘AHEAD Forum’ సోషల్ మీడియా వేదికగా కార్యక్రమ వివరాలను వెల్లడించింది. ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్’ పేరుతో జరిగే ఈ కార్యక్రమం ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే సందేశాన్ని చాటుతుందని నిర్వాహకులు తెలిపారు.చదవండి: భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్ -
సి-17లో వచ్చిందెవరో తెలుసా?.. ఆయనే!
మాస్కోలో అర్ధరాత్రి అమెరికా సైనిక విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఆగిపోయాయి! అసలు ఆ విమానంలో ఉన్నదెవరు? ఎందుకు ఇంత రహస్యంగా మాస్కోకు వచ్చారు? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఇప్పుడు ఆ మిస్టరీ దాదాపు వీడినట్లే కనిపిస్తోంది. అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్క్లిఫ్ రష్యా అధికారులతో రహస్య చర్చల కోసం మాస్కో వచ్చినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ జాన్ ర్యాట్క్లిఫ్ రహస్యంగా రష్యా వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఎవరిని కలిశారు? ఎలాంటి అంశాలపై చర్చలు జరిపారు? అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం ఆయన రష్యా అధికారులతో సమావేశమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అమెరికా సీఐఏ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా మీడియా ముందు ఈ పర్యటనను ధ్రువీకరించలేదు. మాస్కోకు సి-17 గ్లోబ్మాస్టర్మంగళవారం అమెరికా సైన్యానికి చెందిన భారీ రవాణా విమానం సి-17 గ్లోబ్మాస్టర్-3 మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో దిగింది. విమానాల ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ఈ విమానం తొలుత లాత్వియా రాజధాని రిగాకు చేరుకుని, అక్కడి నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా సైన్యానికి చెందిన ఈ విమానం సైనికులు, వాహనాలు, భారీ కార్గో రవాణాకు ఉపయోగిస్తారు.అయితే విమానంలో ఎవరు ప్రయాణించారనే విషయాన్ని అమెరికా అధికారికంగా వెల్లడించలేదు. లాత్వియా రక్షణ శాఖ మాత్రం ఈ విమానానికి తమ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, అవసరమైన సమన్వయం పూర్తయినట్లు తెలిపింది. ఆ వెంటనే విమానంలో సీఐఏ డైరెక్టర్ ర్యాట్క్లిఫ్ ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. U.S. Air Force Boeing C-17A Globemaster III strategic airlifter descending to land at the Vnukovo International Airport in Moscow on Tuesday morning.The cameraman, likely sarcastically, comments: "we are under attack!" https://t.co/7EfvANBScW pic.twitter.com/dVItO5nAjn— Status-6 (War & Military News) (@Archer83Able) August 25, 2026ఉక్రెయిన్కు అమెరికా కీలక సూచనర్యాట్క్లిఫ్ పర్యటనకు ముందు అమెరికా.. ఉక్రెయిన్కు కీలక సూచన చేసినట్లు సమాచారం. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్తో పాటు రష్యాలోని ఉత్తర ప్రాంతాలపై సోమవారం నుంచి బుధవారం వరకు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయవద్దని కోరినట్లు తెలుస్తోంది. రష్యా రాజధానికి ఓ సీనియర్ అమెరికా అధికారి ప్రయాణిస్తున్నారని కూడా కీవ్కు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఈ పరిణామం అమెరికా–ఉక్రెయిన్ సంబంధాలపైనా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్న ఉక్రెయిన్ను అమెరికా బహిరంగంగా సమర్థిస్తున్న సమయంలోనే.. సీనియర్ అమెరికా గూఢచార అధికారి మాస్కోకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నాలుగేళ్ల తర్వాత మళ్లీ సీఐఏ చీఫ్ రాకర్యాట్క్లిఫ్ పర్యటన నిజమైతే.. 2021 తర్వాత రష్యా రాజధానికి అమెరికా గూఢచార సంస్థ అధిపతి వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ 2021 నవంబర్లో మాస్కో వెళ్లి అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపారు. ఆ భేటీ జరిగిన మూడు నెలలకే రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగింది. ప్రస్తుతం కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, మరోవైపు అమెరికా–రష్యా మధ్య సంబంధాలు సున్నితంగా ఉండటంతో ర్యాట్క్లిఫ్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.రష్యా–ఇరాన్ బంధం కూడా కీలకమే..ర్యాట్క్లిఫ్ మాస్కో పర్యటన సమయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. ఇరాన్తో రష్యాకు ఉన్న సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇటీవల కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.రష్యా మాత్రం ఇరాన్తో సైనిక, ఆర్థిక, దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఇరాన్ డ్రోన్లు అందించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రష్యా.. ఇరాన్కు అమెరికా లక్ష్యాలపై దాడులకు ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలను అందించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మాస్కో ఈ ఆరోపణలను ఖండించింది.ఖైదీల మార్పిడిలోనూ కీలక పాత్రఅమెరికా–రష్యా మధ్య ఖైదీల మార్పిడి వ్యవహారాల్లోనూ సీఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. ర్యాట్క్లిఫ్ స్వయంగా 2025 ఏప్రిల్లో అమెరికా–రష్యా ద్వంద్వ పౌరురాలు క్సేనియా కరేలినా విడుదలకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. 2024లో వాల్స్ట్రీట్ జర్నల్ విలేకరి ఇవాన్ గెర్ష్కోవిచ్, మాజీ అమెరికా మెరైన్ పాల్ వీలన్ విడుదలకు దారితీసిన ఖైదీల మార్పిడిలోనూ సీఐఏ ప్రమేయం ఉంది.పుతిన్తో భేటీ ఉంటుందేమో!ర్యాట్క్లిఫ్ మాస్కో పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాతో సంబంధాలు, ఇరాన్ అంశం, ఖైదీల మార్పిడి వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.ఇదీ చదవండి: ఇరాన్పై కోపం.. భారత కంపెనీలకూ షాక్! -
భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్..
ఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతుల్లో భాగస్వామ్యం ఉన్నాయన్న ఆరోపణలతో భారత్కు చెందిన నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. మొత్తం సుమారు 119 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా) విలువైన ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’లో భాగంగా ఈ ఆంక్షలు అమెరికా ప్రకటించింది.ఆంక్షలు విధించిన కంపెనీలు ఇవే.. PP Softtech Private Limited, Sadashiva Overseas Limited, Prakrutees Infra Impex India Private Limited, Portease Partners LLP కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.ఇక, వీటిలో మొదటి మూడు సంస్థలు ఇరాన్ మూలం కలిగిన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని అమెరికా ఆరోపించింది. నాలుగో సంస్థ అయిన Portease Partners ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల పలు షిప్మెంట్లను భారత్కు తీసుకురావడంలో కస్టమ్స్ బ్రోకర్గా సహకరించిందని పేర్కొంది. 2023 మే నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. ఈ మూడు సంస్థలకు సంబంధించి అమెరికా పేర్కొన్న దిగుమతుల విలువే దాదాపు 119 మిలియన్ డాలర్లు. Portease Partners ద్వారా నిర్వహించబడిన షిప్మెంట్ల విలువను ఇందులో చేర్చలేదు.ముగ్గురు భారతీయులపైనా ఆంక్షలుఇదిలా ఉండగా.. కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయులపై కూడా అమెరికా చర్యలు తీసుకుంది. PP Softtech డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్తో పాటు Portease Partners భాగస్వాములు ఇంద్రిస్మియా అషరఫ్మియా షేఖ్, హరీశ్ రామచంద్ర రంగిలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. అయితే, అమెరికా ఆంక్షలు కేవలం నాలుగు భారత కంపెనీలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్ ఆదాయ మార్గాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’ పేరుతో విస్తృత ఆంక్షల కార్యక్రమాన్ని వాషింగ్టన్ ప్రారంభించింది. దాదాపు 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై తాజాగా చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా, హాంకాంగ్కు చెందిన పలు సంస్థలు, వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఇది కూడా చదవండి: అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్ఈ నేపథ్యంలో ఆంక్షల విధింపుపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వ ఆర్థిక సంబంధాలపై ఒత్తిడిని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే సంస్థలు కూడా భవిష్యత్తులో అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. అమెరికా ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాజా చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించే ప్రయత్నమని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనిజాదెహ్ స్పందిస్తూ.. తమ దేశం ఈ ఆంక్షలను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందుకోసం రెండేళ్ల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.భారత్పై ప్రభావం?ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి భారత కంపెనీలపై అమెరికా వరుసగా చర్యలు తీసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఇరాన్తో చమురు సంబంధాల ఆరోపణలపై భారత సంస్థలు, వ్యక్తులను అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా చర్యలతో ఇరాన్తో వాణిజ్యం చేసే భారతీయ సంస్థలపై అమెరికా నిఘా మరింత కఠినమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
అమెరికా ఆశలు తగ్గుముఖం!
వాషింగ్టన్: అమెరికా చదువుల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే 2025–26లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లలో 15 శాతం తగ్గుదల నమోదైనట్లు ‘కామన్ ఆప్’అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ద్వారా స్పష్టమైంది. ఈ సంస్థ సుమారు 1100 అమెరికన్ వర్శిటీల్లో అడ్మిషన్ల వ్యవహారాన్ని పరిశీలించిన తరువాత ఈ నివేదిక విడుదల చేసింది. 2026–27లో మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లలో పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది. ఇదే మయంలో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు మార్చి ఒకటి తరువాత పది శాతం పడిపోయినట్లు తెలిసింది. భారత్ నుంచి చదువుల కోసం ఏటా అమెరికాకు వెళ్లే వారు లక్షల్లో ఉంటారన్నది మనకు తెలిసిన విషయమే. 2024–25లో ఈ సంఖ్య 3.63 లక్షలు. స్వచ్ఛంద సంస్థ కామన్ ఆప్ నివేదిక ప్రకారం 2025–26లో విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించిన తోడ్పాటు విలువ ఏకంగా 4177 కోట్ల డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 3837 కోట్ల డాలర్లకు పడిపోనుంది. వీసా నియమ నిబంధనలు కఠినతరం కావడం, ట్రంప్ ప్రభుత్వ విధానాల్లో అస్థిరతల కారణంగా ఈ ఏడాది అమెరికా చదువుల కోసం విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులు 1.1 లక్షలు తగ్గిపోతాయని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్, జేబీ ఇంటర్నేషనల్లు ఇటీవలే ప్రకటించాయి. వీరి అంచనాల ప్రకారం 2025–26 ఫాల్ అడ్మిషన్లకు 11.69 లక్షల దరఖాస్తులు అందితే.. ఈ ఏడాది అది 10.57 లక్షలకు పడిపోనుంది. చదువు తరువాత అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పించిన విధానాలను అమెరికా ఈ ఏడాది జూలైలోనే సవరించింది. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. అంతేకాకుండా.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు వసూలు చేసేందుకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి. విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చి గ్రాడ్యుయేషన్ తరువాత అక్కడే కొంతకాలం పనిచేసేందుకు ఓపీటీ అవకాశమిస్తుంది. ఓపీటీలో భాగంగా పన్నెండు నుంచి 24 నెలలపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. కంపెనీలు విద్యార్థి వీసాలపై పనిచేస్తున్న వారి హెచ్1–బీ వీసాలకు స్పాన్సర్ చేయడం ద్వారా శాశ్వత ఉద్యోగులుగా మార్చుకునేందుకూ ఓపీటీ వీలు కల్పిస్తుంది. ఈ హెచ్1–బీ వీసాలపైనే భారతీయు టెకీలు చాలామంది తమ అమెరికా కలను నెరవేర్చుకుంటూంటారు. -
అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అమెరికా విధించిన భారీ టారిఫ్లకు కెనడా కూడా గట్టిగా స్పందించింది. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన 700 అమెరికా వస్తువులపై 15 నుంచి 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ టారిఫ్లు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.స్టీల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు..కెనడా విధించే కొత్త సుంకాల ప్రభావం అమెరికాకు చెందిన పలు కీలక రంగాలపై పడనుంది. ముఖ్యంగా స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఈ టారిఫ్ల పరిధిలోకి రానున్నాయి. అమెరికా ఏ స్థాయిలో సుంకాలు విధించిందో, దానికి అనుగుణంగానే తమ టారిఫ్లు ఉంటాయని కెనడా అధికారులు స్పష్టం చేశారు.కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ మాట్లాడుతూ.. తమ దేశానికి ఇది ఎన్నడూ ఎదురుకాని సవాలని, అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా చర్యకు ప్రతిస్పందించే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు.చర్చల నుంచి కెనడా వైదొలగింపుఅమెరికా, కెనడా మధ్య టారిఫ్లపై జరిగిన చర్చలు సఫలం కాలేదు. అమెరికా ప్రతిపాదించిన కొత్త వాణిజ్య నిబంధనలు కెనడాకు అనుకూలంగా లేవని ప్రధాని మార్క్ కార్నీ అభిప్రాయపడ్డారు.ఆ ప్రతిపాదనలు ఆర్థికంగా అన్యాయంగా ఉండటంతో పాటు కెనడాకు దక్కాల్సిన ప్రయోజనాలను తగ్గించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం వంటి తమ ప్రధాన పరిశ్రమలను దెబ్బతీసే విధంగా అమెరికా ప్రతిపాదనలు ఉన్నాయని కార్నీ అన్నారు. అందుకే అమెరికా ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించకుండా చర్చల నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు.ట్రంప్ హెచ్చరికమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడాపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కెనడా అమెరికా నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేకపోతే ఇప్పటికే విధించిన టారిఫ్ల కంటే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా.. కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై వచ్చే ఏడాది నుంచి మరిన్ని టారిఫ్లు విధించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు.కెనడా ఎన్నో సంవత్సరాలుగా అమెరికాను వాణిజ్యపరంగా నష్టపరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న అధిక సుంకాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకదానిపై మరొకటి టారిఫ్లు విధించుకుంటుండటంతో స్టీల్, ఆటోమొబైల్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య టారిఫ్ల పోరు మరింత తీవ్రంగా మారింది. అమెరికా విధించిన సుంకాలకు కెనడా ప్రతీకార చర్యలు తీసుకోవడం, మరోవైపు ట్రంప్ మరిన్ని టారిఫ్ల హెచ్చరికలు చేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయా?, లేక టారిఫ్ల పోరు మరింత పెరుగుతుందా?, అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వాణిజ్య యుద్ధం కొనసాగితే చివరికి దాని ప్రభావం రెండు దేశాల పరిశ్రమలతో పాటు వినియోగదారులపైనా పడే అవకాశం ఉంది. -
మాస్కోలో అమెరికా సైనిక విమానం!
మాస్కో: అమెరికా, రష్యా మధ్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్పై దాడితో పాటు ప్రస్తుతం ఇరాన్కు సైతం అమెరికా సహకరిస్తోందని ఆరోపణలున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏమాత్రం మెరుగ్గా లేవు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైమానిక దళానికి చెందిన ఓ రవాణా విమానం మాస్కోలోని వ్నుకోవో విమానాశ్రయంలో ల్యాండ్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఈ విమానం రాక గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ తెలపడం గమనార్హం.అమెరికాకు చెందిన విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 వివరాల ప్రకారం, ఈ విమానం మంగళవారం సుమారు 0700 GMT సమయంలో లాట్వియా రాజధాని రిగా నుంచి మాస్కోకు చేరుకుంది. అయితే ఈ పరిణామంపై క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ను మీడియా ప్రశ్నించగా, ఈ వారం అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో ఎలాంటి సమావేశాలు జరగాల్సిన ప్రణాళిక లేదని ఆయన చెప్పారు. విమానం రాకకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం, ఈ విమానం ఆదివారం సాయంత్రం అమెరికా తూర్పు కాలమానం ప్రకారం సుమారు 5 గంటలకు ముందు ఈ విమానం మేరీల్యాండ్లోని అమెరికా వైమానిక దళానికి చెందిన జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి బయలుదేరింది. వాషింగ్టన్ డీసీ సమీపంలోని క్యాంప్ స్ప్రింగ్స్ ఎయిర్బేస్ నుంచి రిగాకు చేరుకుంది. అనంతరం రిగా నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా అధ్యక్షుడు, ఉన్నతస్థాయి అధికారులు అధికారిక విమాన ప్రయాణాల కోసం ఉపయోగించే ప్రధాన సైనిక స్థావరాల్లో జాయింట్ బేస్ ఆండ్రూస్ ఒకటి.యూరప్ నుంచి రష్యాకు నేరుగా వచ్చిన అమెరికా ఉన్న విమానం ఇదే మొదటిది కాదు. చివరిసారిగా జనవరిలో ఇలాంటి విమానం రష్యాకు వచ్చింది. అప్పట్లో ఉక్రెయిన్పై శాంతి చర్చల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవెన్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోకు వెళ్లి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు.విమానం రాకపై ఊహాగానాలుఈ విమానం సీ-17 గ్లోబ్మాస్టర్. భారీ మొత్తంలో సైనిక సామగ్రి, సిబ్బందిని సుదూర ప్రాంతాలకు తరలించేందుకు ఈ విమానాలను ఉపయోగిస్తారు. ఇలాంటి విమానం అకస్మాత్తుగా మాస్కోలో ల్యాండ్ కావడంతో దాని రాక వెనుక కారణంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది దౌత్యపరమైన వ్యవహారానికి సంబంధించినదై ఉండొచ్చని, లేదా ఖైదీల మార్పిడి కోసం విమానం వచ్చి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.కాగా ఇటీవలే మాజీ అమెరికా మెరైన్ రాబర్ట్ గిల్మన్ను ఆగస్టు 2026లో రష్యా విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఈ ఏడాది ప్రారంభంలోనూ అమెరికా, రష్యా మధ్య ఖైదీల మార్పిడి జరిగింది.అయితే, మాస్కోలో అమెరికా సైనిక రవాణా విమానం ల్యాండ్ కావడానికి అసలు కారణం ఏమిటన్నది మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడి కాలేదు. -
ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల నుంచి ఆ దేశం పేరు తొలగింపు
వాషింగ్టన్: సిరియాను అమెరికా సోమవారం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల జాబితా నుంచి తొలగించింది. 1979 నుంచి అమల్లో ఉన్న ఈ గుర్తింపునకు ముగింపు పలకడంతో సిరియాతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ఉన్న కీలక ఆంక్షలు తొలగిపోయాయి. 45 రోజుల కాంగ్రెస్ సమీక్ష అనంతరం తీసుకున్న ఈ నిర్ణయం.. అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా నేతృత్వంలోని సిరియా కొత్త ప్రభుత్వంతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగుగా నిలిచింది.హయత్ తహ్రీర్ అల్-షామ్ సంస్థపై ఉన్న ప్రత్యేకంగా గుర్తించిన ప్రపంచ ఉగ్రవాద సంస్థ హోదాను కూడా రద్దు చేసింది. దీనికి అనుగుణంగా ఆర్థిక శాఖ ఆంక్షల సడలింపును ప్రకటించింది.“అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా నేతృత్వంలోని సిరియా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాద చర్యలకు సిరియాను పూర్తిగా దూరం చేసేందుకు తీసుకున్న సానుకూల చర్యలు, చేసిన తదుపరి హామీలను గుర్తిస్తూ ఈ చర్యలన్నీ తీసుకున్నాం” అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటనలో తెలిపారు.ఈ చర్యలు పెట్టుబడులను ప్రోత్సహించి సిరియా ఆర్థిక పునరుద్ధరణకు మద్దతు ఇస్తాయని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. “సిరియాలో అదనపు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు నేటి నిర్ణయం దోహదపడుతుంది. తద్వారా రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు” అని ఆయన అన్నారు.ఎన్నో ప్రయోజనాలు ఈ మార్పులు సిరియాపై ఆంక్షల సడలింపు కల్పిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉన్నాయని అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. ఆంక్షల తొలగింపు “ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఆర్థిక శాఖ వైఖరిని మార్చదు. సిరియాలోని చెడు చర్యలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలను బాధ్యులను చేయాలనే మా నిబద్ధత కొనసాగుతుంది” అని పేర్కొంది. 2025 జూలైలో అమెరికా సిరియాపై అమలు చేసిన విస్తృత ఆంక్షల కార్యక్రమాన్ని ముగించిన తరువాత కూడా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశం అనే గుర్తింపు కొనసాగింది. సిరియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వ్యాపార సంస్థలు, ఆర్థిక సంస్థలకు ఇది ప్రధాన అడ్డంకిగా నిలిచింది. ఈ గుర్తింపు కారణంగా అమెరికా విదేశీ సహాయం, రక్షణ రంగ ఎగుమతులు, విక్రయాలు, కొన్ని ద్వంద్వ వినియోగ వస్తువులు, ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు ఉండేవి.అప్పటి నుంచి అమెరికా ఆర్థిక సంస్థలు సిరియాకు సేవలు అందించవచ్చని, సిరియా బ్యాంకులకు సంబంధించిన చెల్లింపులను నిర్వహించవచ్చని, సిరియా బ్యాంకులతో ప్రతినిధి బ్యాంకింగ్ సంబంధాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే ఆంక్షలకు లోబడి ఉన్న సంస్థలు ఇందులో భాగం కాకూడదు.సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని సిరియా ప్రభుత్వం స్వాగతించింది. దాదాపు 14 ఏళ్ల యుద్ధం తరువాత దేశ పునర్నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో తిరిగి అనుసంధానం కావడానికి ఇది ఒక అవకాశమని పేర్కొంది.ఉగ్రవాద సంస్థగా ఉన్న గుర్తింపును ఆర్థిక సంబంధాల పునర్నిర్మాణానికి చివరి అడ్డంకిగా సిరియా విదేశాంగ మంత్రి అసద్ అల్ షిబానీ గతంలో పేర్కొన్నారు. “ఇక సిరియాలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం, ఆర్థిక జీవితాన్ని పునర్నిర్మించడం కోసం ఎలాంటి అడ్డంకి లేదు” అని ఆయన అన్నారు. 1979లో అప్పటి అధ్యక్షుడు హఫీజ్ అల్-అసాద్ ప్రభుత్వం మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించిన సమయంలో సిరియాకు ఈ గుర్తింపు విధించింది. ఆయన కుమారుడు బషర్ అల్-అసాద్ పాలనలో కూడా ఇది కొనసాగింది. 2024 డిసెంబరులో షరా నేతృత్వంలోని తిరుగుబాటుదారులు అసాద్ను అధికారం నుంచి తొలగించారు.ఒకప్పుడు అల్-ఖైదాతో అనుబంధంగా గతంలో నుస్రా ఫ్రంట్గా పిలిచిన హెచ్టీఎస్ ఒకప్పుడు సిరియాలో అల్-ఖైదాతో అనుబంధంగా ఉండేది. 2016లో ఆ సంస్థతో సంబంధాలను తెంచుకుంది. అనంతరం షరా తిరుగుబాటు కూటమికి నాయకత్వం వహించి అసాద్ను అధికారం నుంచి తొలగించారు. ఆ తరువాత ఆయన అధ్యక్షుడయ్యారు.సిరియాను తొలగించడంతో అమెరికా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల జాబితాలో ప్రస్తుతం క్యూబా, ఇరాన్, ఉత్తర కొరియా అనే 3 దేశాలు మాత్రమే మిగిలాయి. వాషింగ్టన్, డమాస్కస్ మధ్య విస్తృత సాన్నిహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిరియాపై ఆంక్షల సడలింపుకు మద్దతు ఇచ్చారు. టర్కీ పర్యటన సందర్భంగా షరాతో సమావేశమయ్యారు. కొత్త సిరియా ప్రభుత్వం ఆర్థిక పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరుతోంది.సిరియా అధికారులు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కంపెనీలతో సన్నిహిత సంబంధాల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. సిరియా ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపింది. మాస్టర్కార్డ్ సంస్థ అంతర్జాతీయ కార్డు చెల్లింపులకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం క్యూఎన్బీ గ్రూప్, సిరియా కేంద్ర బ్యాంకుతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: ‘పాక్’ అసిమ్ మునీర్కి ట్రంప్ ఫోన్.. ఇరాన్ వెళ్లిన మునీర్సిరియాలో స్థిరీకరణ, ఆర్థిక పునరుద్ధరణ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి భాగస్వామ్యం కావడానికి మద్దతు ఇవ్వడమే డమాస్కస్తో తమ సంబంధాల లక్ష్యమని వాషింగ్టన్ తెలిపింది. అదే సమయంలో ఉగ్రవాదం, ఇతర ఆంక్షలకు లోబడి ఉన్న వ్యక్తులు, సంస్థలపై లక్ష్యిత చర్యలను కొనసాగిస్తామని పేర్కొంది. -
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్కు కటీఫ్ చెప్పాల్సిందేనా?
ఇరాన్పై అమెరికా ఆంక్షల ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు వెంటనే వాటిని తగ్గించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇరాన్ను ఆర్థికంగా ఒంటరిని చేసి.. చివరకు అమెరికాతో చర్చలు, ఒప్పందానికి దిగేలా ఒత్తిడి చేయడమే వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ హెచ్చరికలకు ఇరాన్ ప్రధాన భాగస్వాములైన చైనా, రష్యా ఎంతవరకు తలొగ్గుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో ఈ పరిణామం భారత్కు మాత్రం కొత్త చిక్కును తెచ్చిపెట్టింది.ఒకవైపు అమెరికాతో వేగంగా బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం.. మరోవైపు ఇరాన్తో భారత్కు ఉన్న చారిత్రక, వాణిజ్య, వ్యూహాత్మక బంధం. ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ఢిల్లీకి సవాల్గా మారింది. ముఖ్యంగా ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న హెచ్చరిక నేపథ్యంలో.. భారత్ ఎంతవరకు అమెరికా ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇది భారత్కు పూర్తిగా కొత్త పరిస్థితి కాదు.రష్యా విషయంలో వెనక్కి తగ్గని ఢిల్లీఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాస్కోతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీగా క్రూడ్ కొనుగోళ్లను కొనసాగించింది. 2026 జూన్లో రష్యా చమురు భారత్ మొత్తం క్రూడ్ దిగుమతుల్లో సగానికి పైగా వాటా సాధించినట్లు రాయిటర్స్ డేటా పేర్కొంది. అంటే అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ కొనసాగించింది. అయితే ఇరాన్ విషయంలో సమీకరణాలు కొంత భిన్నంగా ఉన్నాయి.ఇప్పటికే భారీగా తగ్గిన వాణిజ్యంభారత్–ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2018–19లో దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం.. 2025–26లో సుమారు 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ప్రధానంగా ఇరాన్కు బియ్యం, టీ, ఔషధాలు తదితర వస్తువులను ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం కావడం, యూఏఈ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు, రీ-ఎగుమతులపై ఆంక్షల ప్రభావం పెరగడం భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతి, టీ, ఫార్మా రంగాలపై ప్రభావం పడొచ్చు. అయితే ఇరాన్తో వాణిజ్యం ఇప్పటికే పరిమిత స్థాయికి చేరినందున.. భారత్ మొత్తంగా ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ కంటే, కొన్ని రంగాల్లోని ఎగుమతిదారులపై ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చు.చమురు కంటే పెద్ద ముప్పు.. హర్ముజ్భారత్కు ఇరాన్ విషయంలో అసలు ఆందోళన కేవలం ఆ దేశం నుంచి ఎంత చమురు కొనుగోలు చేస్తున్నామన్నది కాదు.. హర్ముజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్లో దీనివల్ల దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగొచ్చు.అయితే తాజా అమెరికా ఆంక్షల ప్రకటన తర్వాత వెంటనే చమురు ధరలు పెరగలేదు. ఆంక్షలు ఇరాన్పై ఒత్తిడిని పెంచి, చివరకు దౌత్యపరమైన పరిష్కారానికి దారితీయవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లలో కనిపించాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర 2.35 శాతం తగ్గి 92.17 డాలర్ల వద్ద ముగిసింది.ఇదీ చదవండి: జింగ్పిన్ రాక.. భారత్తో బంధం బలపడేనా?చాబహార్ను వదులుకోవడం అంత సులభమా?ఇరాన్తో భారత్ సంబంధాల్లో చాబహార్ పోర్టు మరో కీలక అంశం. పాకిస్థాన్ను దాటకుండా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు చేరుకునే మార్గంగా ఇది భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చాబహార్లో భారత కార్యకలాపాలు కొనసాగించడం సవాల్గా మారుతున్నప్పటికీ.. ఇరాన్తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటే ఈ కీలక కనెక్టివిటీ మార్గంపై భారత్ తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్ భారత్కు కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో వ్యూహాత్మక భాగస్వామి కూడా.మరి మోదీ సర్కార్ ఏం చేస్తుంది?ప్రస్తుతానికి భారత్పై అమెరికా నేరుగా ఆంక్షలు విధించలేదు. తాజా చర్యల్లో భారత్ను లక్ష్యంగా చేసుకున్న నిర్ణయం కూడా కనిపించలేదు. దీంతో ఢిల్లీకి ఇంకా కొంత దౌత్యపరమైన వెసులుబాటు ఉంది. అమెరికాతో సంబంధాలను దెబ్బతీయకుండా.. అదే సమయంలో ఇరాన్తో అవసరమైన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం భారత్ ముందున్న వాస్తవిక మార్గంగా కనిపిస్తోంది. రష్యా విషయంలో అనుసరించినట్టుగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆంక్షల పరిధిలోకి వెళ్లకుండా సంబంధాలను పరిమిత స్థాయిలో కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు.కటీఫ్ కాదు.. కత్తిమీద సాము!కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో “ఇరాన్కు భారత్ కటీఫ్ చెబుతుంది” అనుకోవడం తొందరపాటు అంచనా. అదే సమయంలో అమెరికా హెచ్చరికలను పూర్తిగా విస్మరించి ఇరాన్తో యథావిధిగా ఆర్థిక సంబంధాలు కొనసాగించడం కూడా ఢిల్లీకి అంత సులభం కాదు. వాణిజ్యం ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. చమురు విషయంలో భారత్కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలున్నాయి. కానీ చాబహార్, మధ్య ఆసియా కనెక్టివిటీ, పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రయోజనాలు, హర్ముజ్ భద్రత వంటి అంశాలను ఒక్కసారిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే భారత్ ముందున్న మార్గం ‘ఇరాన్కు కటీఫ్’ కంటే.. ‘అమెరికా ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్తో అవసరమైన సంబంధాలను కొనసాగించడం’ అయ్యే అవకాశమే ఎక్కువ.రష్యా విషయంలో అమెరికా ఒత్తిడిని తట్టుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడుకున్న భారత్.. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా? లేక అమెరికాతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తుందా? ఈ సమతుల్యమే మోదీ సర్కార్కు అసలు పరీక్ష.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
ట్రంప్ సర్కార్ కొత్త ప్లాన్.. భారతీయులకు భారీ షాక్ ?
-
మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్
ఇరాన్పై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించడంతో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. అయితే ఈ చర్యలకు తాము భయపడబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు ‘పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించడంతోపాటు.. అవసరమైతే అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించింది.అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న ఆంక్షల బెదిరింపులనుOperation Economic Outcast ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గబోరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. అమెరికా మరిన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకునే స్థితిలో లేదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న దేశాలు అమెరికా హెచ్చరికలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తమకు సమాచారం అందుతోందన్నారు. దీంతో ఆంక్షల విషయంలో అమెరికా ఒత్తిడికి దీటుగా దౌత్య, ఆర్థిక మార్గాల్లో ప్రతిఘటనకు ఇరాన్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.‘పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అమెరికాకు మరింత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ‘పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగితే.. తమ వద్ద కూడా ప్రతిస్పందించేందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘ఇక మేం కేవలం రక్షణాత్మక చర్యల కోసమే పరిమితం కాబోం. శత్రువులు మా నుంచి దాడిని ఎదురుచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చైనా, రష్యాలు అమెరికా తాజా చర్యలను అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గకపోవచ్చని మదానిజాదే పేర్కొన్నారు.అమెరికా ప్రయోజనాలే టార్గెట్?ఆర్థిక ఆంక్షల విషయంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బీ కూడా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా కీలక ప్రయోజనాలు, ఇంధన రవాణా మార్గాలపై భారీ దెబ్బలు తప్పవని హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అంతేకాదు.. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను మరింత తగ్గించే అవకాశం ఉందని కూడా ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. అదే జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.60 మందిపై అమెరికా ఆంక్షలుఇరాన్కు వచ్చే ప్రతి కీలక ఆదాయ మార్గాన్ని అడ్డుకునే లక్ష్యంతో అమెరికా తాజా చర్యలకు దిగింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బెసెంట్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.అయితే ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనా ఆర్థిక సంస్థలను తాజా ఆంక్షల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలు అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వెలేస్తామని బెసెంట్ ఇప్పటికే హెచ్చరించారు.ఆరు నెలలుగా యుద్ధం.. తగ్గని వేడిఅమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా.. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఇటీవలి వారాల్లో పెద్దస్థాయి దాడులు కొంత తగ్గినా.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సాంప్రదాయిక సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ.. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే సామర్థ్యం మాత్రం ఆ దేశానికి మిగిలి ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, చమురు నౌకలు, కీలక ఇంధన మార్గాలపై ముప్పు కొనసాగుతోంది.ఆర్థిక దెబ్బకు.. సైనిక కౌంటర్?ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుండగా.. వాటికి తలొగ్గకుండా ఎదురుదాడికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేయడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఒకవైపు **చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానంపై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హర్ముజ్ జలసంధి, ఇంధన సరఫరా మార్గాలను ఇరాన్ ప్రతీకార చర్యలకు ఉపయోగించే అవకాశం ఆందోళన కలిగిస్తోంది.డొనాల్డ్ ట్రంప్ గనుక ఆర్థిక యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తే.. ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ను లొంగదీసుకోవాలని అమెరికా చూస్తుంటే.. ‘‘ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు.. అవసరమైతే ఎదురుదాడికి దిగుతాం’’ అనే సంకేతాలను టెహ్రాన్ స్పష్టంగా ఇస్తోంది. దీంతో ఇరాన్-అమెరికా ఘర్షణ మరోసారి ఆర్థిక రంగం నుంచి సైనిక చర్యల దిశగా మళ్లుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట -
ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్పై ‘ఎకనామిక్ డీ-డే’!
వాషింగ్టన్: ఆంక్షలు, సైనిక చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడింది. మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశానికి వచ్చే ప్రతి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలకూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.ఇరాన్కు ఆర్థికంగా సహకరిస్తే అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. సంస్థలు, దేశాలపై ఇక ఉపేక్ష ఉండదని బెసెంట్ తేల్చిచెప్పారు. ఇరాన్ తరఫున మనీలాండరింగ్కు పాల్పడే ఏ సంస్థ అయినా అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి తొలగించబడుతుందని హెచ్చరించారు. ‘‘గడియారం తిరగడం ఇప్పుడే మొదలైంది’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ పాలక వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలిచే వారెవరైనా అమెరికా శక్తిని పరీక్షించేందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా-ఇరాన్లలో ఎవరితో సంబంధాలు కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.‘గ్రే ఏరియాల్లో’ ఇక వ్యాపారాలు కుదరవుఇరాన్తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ అమెరికా ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నాలను ఇక సహించబోమని బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు, లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలపై కూడా చర్యలు తప్పవన్నారు. ‘‘ఇరాన్తో ఎలాంటి ఆర్థిక సంబంధమైనా కొనసాగించడం.. బాధ్యత వహించే వారిని అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకువస్తుంది’’ అని హెచ్చరించారు.ఐదు కీలక రంగాలే లక్ష్యంఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్న ఐదు కీలక రంగాలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారించింది. డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, నౌకాయానం రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటితోపాటు ఇరాన్ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశానికి సహకరిస్తున్న సంస్థలు, నౌకలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక మూలాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.తాజా చర్యల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 60 సంస్థలు, నౌకలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్కు కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.దేశాధినేతలకు ట్రంప్ ఫోన్లుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఇరాన్తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని కోరుతున్నారని బెసెంట్ తెలిపారు. అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు భాగస్వామ్య ప్రయోజనాలను పొందుతాయని, ఇరాన్తో సంబంధాలు కొనసాగించే దేశాలు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే ఈ చర్యల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని అమెరికా వర్గాలు అంగీకరిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, తప్పిదాలను సరిదిద్దుకునేందుకు దేశాలకు అవకాశం ఇస్తున్నామని బెసెంట్ పేర్కొన్నారు.‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్’ఇరాన్పై చేపట్టిన తాజా ఆర్థిక ఒత్తిడి కార్యక్రమాన్ని అమెరికా ‘‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్’’Operation Economic Outcastగా పేర్కొంది. దీనిని బెసెంట్ ‘‘ఎకనామిక్ డీ-డే’’గా అభివర్ణించారు. ఇరాన్కు వచ్చే అన్ని ఆర్థిక మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.వెనక్కి తగ్గేదేలేఅమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా వద్ద ఇరాన్ను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలు లేకపోవడంతోనే పాత ఆంక్షలను పదేపదే అమలు చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ విమర్శించారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ-జాదే కూడా అమెరికా ప్రకటించిన కొత్త ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంపై స్పందించారు. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇరాన్కు కొత్తేమీ కాదని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందనే సంకేతాలు ఇచ్చారు.రియాల్ పతనం.. రికార్డు కనిష్ఠానికిమరోవైపు అమెరికా ఆంక్షలతోపాటు యుద్ధ ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. ఒక డాలర్కు సుమారు 20.2 లక్షల రియాల్స్ వరకు పడిపోయింది.యుద్ధానికి ముందే అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధితో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు దాదాపు 60 శాతం పెరగగా.. గొడ్డు మాంసం ధరలు 150 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 5 శాతానికి పైగా సంకోచం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.‘ఇరాన్ పూర్తిగా కుప్పకూలుతోంది’ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఆర్థిక, సైనిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ‘‘పూర్తిగా కుప్పకూలుతోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ దేశం ఆర్థిక, సైనిక పరంగా ‘డెత్ స్పైరల్’లోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు.చమురు.. హర్ముజ్పైనే అసలు పోరుఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి వెనుక ప్రధాన లక్ష్యం చమురు ఆదాయాన్ని అడ్డుకోవడమే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడ నౌకాయానం అంతరాయానికి గురికావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, గ్యాస్ ధరలపై ఒత్తిడి పెరిగింది.ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ఇరాన్పై ఒత్తిడి పెంచినా.. రాజకీయంగా ఆశించిన ఫలితాన్ని పూర్తిగా సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చర్చల టేబుల్పైకి రావాల్సిందే: హెగ్సెత్అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్ ఆర్థిక ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. చివరకు అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడం తప్ప ఇరాన్కు మరో మార్గం ఉండదని అన్నారు. అవసరమైతే అమెరికా సైనిక చర్యలకు కూడా వెనుకాడబోదని హెచ్చరించారు.దీంతో ఇరాన్పై అమెరికా వ్యూహం సైనిక చర్యల నుంచి ఆర్థిక యుద్ధం వైపు మరింతగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానం, బంగారం, సాంకేతిక రంగాలను లక్ష్యంగా చేసుకున్న తాజా ఆంక్షలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు అమెరికా ఒత్తిడికి ఎలా స్పందిస్తాయన్నదే తదుపరి కీలక పరిణామంగా మారనుంది.ఇదీ చదవండి: మేం రెడీ.. రెండేళ్లకు సరిపడా!: ఇరాన్ -
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. రెండేళ్ల ప్లాన్ రెడీ!
అమెరికా విధిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం ముందుగానే సిద్ధమైందని.. ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదె వెల్లడించారు. అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరాన్ ప్రజల సంకల్పాన్ని, దేశ అధికారుల నిర్ణయాన్ని మార్చలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా చర్యలు మరోసారి విఫలమయ్యే అవకాశముందని, ఇరాన్ మరో ఓటమిని అమెరికాకు ఇవ్వబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.రెండేళ్ల ప్రణాళిక సిద్ధం!కొత్త ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం రెండేళ్ల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిందని మదానిజాదె తెలిపారు. అమెరికా నుంచి ఇలాంటి చర్యలు వస్తాయని తమకు చాలాకాలంగా తెలుసని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందని చెప్పారు. ఆంక్షల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగినా, పరిస్థితులను నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన వెల్లడించారు.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలుఅమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, ఆదాయ మార్గాలపై ప్రభావం చూపించే లక్ష్యంతో ఉంటాయి. అయితే.. ఇరాన్ మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అమలు చేస్తామని చెబుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ట్రంప్ సర్కార్ కొత్త ప్లాన్.. భారతీయులకు భారీ షాక్?
అమెరికాలో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసా, F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్లపై భారీ ఫీజులు విధించే ప్రతిపాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నిబంధన ప్రకారం.. H-1B వీసా ఫీజు ఏకంగా 1,03,265 డాలర్లకు (దాదాపు రూ.98.91 లక్షలు) పెరిగే అవకాశం ఉంది. గతంలో 1 లక్ష డాలర్ల ఫీజును ప్రతిపాదించినప్పటికీ, ఆ నిర్ణయంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది.భారతీయులపై ప్రభావంఈ ప్రతిపాదనలు భారతీయులకు చాలా కీలకం. ఎందుకంటే.. అమెరికా H-1B వీసా లబ్ధిదారుల్లో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. 2024లో అమెరికా USCIS సుమారు 3,99,402 H-1B పిటిషన్లను ఆమోదించగా, అందులో ఇండియాలో జన్మించిన వారికి సంబంధించిన లబ్ధిదారుల వాటా దాదాపు 71 శాతంగా ఉంది. అందువల్ల H-1B ఫీజు భారీగా పెరిగితే అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ నిపుణులు, వారిని స్పాన్సర్ చేసే కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరగవచ్చు.OPTపై కూడా భారీ ఫీజు?H-1Bతో పాటు F-1 విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగించే ఓపీటీ కార్యక్రమంపైనా కొత్త ఫీజు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ ఫీజు సుమారు 1 లక్ష డాలర్ల వరకు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే అసలు ఫీజు ఎంత, ఎవరికి వర్తిస్తుంది వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలన దశలో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ సంస్థలు చెబుతున్నాయి.H-1B ఉద్యోగులకు కొత్త రూల్కొత్త ఫీజులతో పాటు H-1B ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే ప్రతిపాదనను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం H-1B ఉద్యోగం కోల్పోయినవారు కొన్ని పరిస్థితుల్లో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధన తొలగిస్తే.. ఉద్యోగం ముగిసిన వెంటనే కొత్త మార్గం చూసుకోవాల్సి రావచ్చు. లేదంటే అమెరికాలో ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగులపై మాత్రమే కాకుండా వారి డిపెండెంట్లపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.అయితే..ఈ నిబంధనలన్నీ ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా అమలు చేసే వరకు ఫీజులు లేదా నిబంధనలు ఖరారైనట్లుగా చెప్పలేం. అయినప్పటికీ H-1Bపై ఆధారపడుతున్న భారతీయ టెక్ నిపుణులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీల్లో ఈ ప్రతిపాదనలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో భారతీయ మూలాలున్న వారి సంఖ్య 52 లక్షలకు పైగా ఉండటంతో, ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వచ్చే మార్పులు భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే! -
‘పాక్’ అసిమ్ మునీర్కి ట్రంప్ ఫోన్.. ఇరాన్ వెళ్లిన మునీర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో మాట్లాడినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్తో చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, పాకిస్థాన్ తనకున్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్ను మళ్లీ అమెరికాతో చర్చల టేబుల్ వద్దకు తీసుకురావాలని ట్రంప్ కోరినట్లు పాకిస్థాన్కు చెందిన 3 వర్గాలు తెలిపాయి.ట్రంప్ ప్రారంభించిన ఈ ఫోన్ సంభాషణ మునీర్ ఇరాన్ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరిగింది. అయితే ఆ సంభాషణలోని పూర్తి వివరాలు బయటకు రాలేదు. వైట్హౌస్ కూడా దీనిపై స్పందించలేదు.ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మునీర్ సోమవారం టెహ్రాన్ చేరుకున్నారు. ఆయనతో పాటు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా వెళ్లారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పర్యటన లక్ష్యమని పాకిస్థాన్ సైన్యం తెలిపింది.ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకునే చర్యలకు దిగుతామని హెచ్చరిస్తుండగా, ఇరాన్కు ఆర్థికంగా సహకరించే దేశాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించింది. గతంలోనూ పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య చర్చలకు సహకరించి జూన్లో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంలో పాత్ర పోషించింది. అయితే ఆ ఒప్పందం తర్వాత విఫలమైంది.ఇరాన్-అమెరికా మధ్య చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ట్రంప్ కోరుతున్నారు. అందుకోసం ఇరాన్పై ప్రభావం ఉన్న పాకిస్థాన్ను రంగంలోకి దించి, అసిమ్ మునీర్ ద్వారా టెహ్రాన్ను చర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. -
ఈ పాప మెదడును ఇది తినేసింది.. మీ పిల్లలు జాగ్రత్త!
మెదడును తినే అమీబా కారణంగా ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. అమెరికాలోని లూసియానాలో ఓ సరస్సులో ఈత కొడుతున్న సమయంలో ఆ బాలికకు అమీబా సోకినట్లు భావిస్తున్నారు. బాలిక పేరు లిలియన్ స్మార్ట్. వేడి, స్వచ్ఛమైన నీటి వనరుల్లో వృద్ధి చెందే నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా ఆమెకు సోకింది.అనారోగ్యంతో ఆమె చేసిన పోరాటానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు ‘లవ్ ఫర్ లిలియన్’ ఫేస్బుక్ పేజీలో ఆమె మృతిని ధ్రువీకరించారు. “నిన్న రాత్రి లిలియన్ మా చేతుల నుంచి యేసు చేతుల్లోకి వెళ్లింది. ఆమె మెదడుకు జరిగిన గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో ఆమె చిన్న శరీరం కోలుకోలేకపోయింది. ఆమెను ఇక్కడే ఉంచేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినదంతా చేశారు. మా హృదయం ద్రవీభవించిపోతోంది. ఇక ఏం చేయాలో నిజంగా తెలియడం లేదు. మా అమ్మాయి లేకుండా అడుగు ఎలా వేయాలి?” అని ఆ బాలిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.లిలియన్ పేరు ప్రస్తావించకుండా.. లూసియానా ఆరోగ్య శాఖ ఆగస్టు 19న నేగ్లేరియా ఫౌలెరి సోకిన ఒక కేసును ధ్రువీకరించింది. ఇది ఎక్కువగా క్లైబోర్న్ సరస్సులో సోకి ఉంటుందని తెలిపింది. లూసియానా ఆరోగ్య శాఖ ప్రకారం, నేగ్లేరియా ఫౌలెరి ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్కు కారణమవుతుంది. నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సంభవించవచ్చు. అమీబా అక్కడి నుంచి మెదడుకు చేరుతుంది.నేగ్లేరియా ఫౌలెరి సోకిన బాధితులకు తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు ఏర్పడవచ్చని, ఆ తర్వాత మెడ బిగుసుకుపోవడం, మూర్ఛలు, కోమాకు దారితీయవచ్చని లూసియానా ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది అరుదైన వ్యాధి అయినప్పటికీ, ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ ప్రాణాంతకమే.ఆగస్టు ప్రారంభంలో ఫేస్బుక్లో చేసిన పోస్టులో లిలియన్ తల్లి.. జ్వరం రావడంతో తన చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించామని, ఆ తర్వాత ఆమెకు రెండు కళ్లతో ఒక వస్తువు రెండుగా కనిపించే సమస్య ఏర్పడిందని తెలిపారు. ‘లవ్ ఫర్ లిలియన్’ పేజీ ప్రకారం, తన పుట్టినరోజు జరిగిన మరుసటి రోజే లిలియన్ మృతి చెందింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడిన వాపు చాలా తీవ్రంగా ఉందని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో ‘సీజేపీ’ సౌరవ్ దాస్ అడ్రస్.. వారికి సమన్లు -
ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాదీ యువకుడి ఆత్మహత్య
కోటి కలలతో రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయిన ఒక యువకుడి జీవితం విషాదంతమైంది. ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాద్కు చెందిన సాయిప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న దిగ్బ్రాంతి రేపింది. హైదరాబాద్లోని దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీ చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం, సాయి ప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లారు. ఇటీవల 'యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో'లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అతనికి సప్లై చైన్ అనలిస్ట్గా 5 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఫలితం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనాడు. దీంతో ఈ డిప్రెషన్తో ఆగస్టు 21న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని భారతదేశానికి రప్పించడానికి మరియు అంత్యక్రియల ఖర్చులను భరించడానికి అతని కుటుంబం నిధుల సేకరణను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా అమెరికా కఠినమైన వలస విధానాలలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం, ఎన్నారైలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ అనిశ్చితి కెరీర్ కలలు, ఆర్థిక ఒత్తిడి వేలాది మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు -
హర్ముజ్పై పట్టు కోసం ఇరాన్ కొత్త ఎత్తుగడ
హర్ముజ్.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ఈ కీలక సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. జలసంధిపై ఇరాన్ ప్రభావం, అమెరికా ఒత్తిడి మధ్య నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా ఈ పోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో జలసంధిపై తన పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య.. ఇరాన్ కొత్త వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది.గత కొంతకాలంగా హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ సూచించే మార్గం కంటే.. ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ సంస్థల సమాచారం ప్రకారం.. ఇటీవల హర్ముజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ భద్రతతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో హర్ముజ్పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో.. నౌకల నుంచి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది.టెహ్రాన్ కొత్త ప్లాన్ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ‘హర్ముజ్ జలసంధి భద్రత, అభివృద్ధి కోసం వ్యూహాత్మక చర్యలు’ ప్రణాళికలోని ఆర్టికల్-3కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఇరాన్ అందించే సముద్ర భద్రత, పర్యావరణ సేవలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధన సరఫరా, బీమా తదితర సేవలకు రుసుములు వసూలు చేయనుంది. ఈ ఫీజులను హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే వసూలు చేస్తామని ఇరాన్ తెలిపింది. చెల్లింపులు ఇరాన్ కరెన్సీ రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండవచ్చని వెల్లడించింది.అమెరికా మద్దతుదారులకూ వార్నింగ్ఓవైపు ట్రంప్ ఇరాన్ మద్దతుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంక్షల మోతకు సిద్ధపడాలంటూ చెబుతున్నారు. అయితే ఇటు అమెరికా ఆంక్షలపై ఇరాన్ మరింత ఘాటుగా స్పందిస్తోంది. ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హర్ముజ్ నుంచే కాదు.. పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించారు. అమెరికా చర్యలకు మద్దతిచ్చే దేశాలను కూడా ఇరాన్ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. చమురు రవాణా విషయంలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ సంకేతాలు ఇస్తోంది.నౌకలకు ఇరాన్ హెచ్చరికలుహర్ముజ్ నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించే నౌకలకు జరిమానాలు, భవిష్యత్ ప్రయాణాలపై ఆంక్షలు, అవసరమైతే స్వాధీనం వంటి చర్యలు ఉంటాయని తెలిపింది. ఉల్లంఘన చేసే నౌకలకు సహకరించే షిప్పింగ్ సంస్థలు, సరుకు యజమానులను కూడా సమస్యాత్మక జాబితాలో చేర్చుతామని పేర్కొంది.ఇంకా రూట్లోనే..ఇరాన్ బెదిరింపులు పెద్దగా పని చేయడం లేదా? అనే చర్చా నడుస్తోంది. మరోవైపు హర్ముజ్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒమన్ మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, ప్రపంచ చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరే భారీ క్రూడాయిల్ ట్యాంకర్లు హర్ముజ్పైనే ఎక్కువగా ఆధారపడతాయి. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఇరాన్కు సవాల్గా మారింది.ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావం?ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 80 శాతం నౌకలు ప్రత్యామ్నాయ మార్గం పట్టినా.. హర్ముజ్పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇరాన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రుసుముల ప్రతిపాదన నుంచి కఠిన హెచ్చరికల వరకు.. చమురు మార్గంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోంది.ఇదీ చదవండి: శత్రువులు చేతులు కలుపుతారా?.. సర్కత్రా ఉత్కంఠ! -
దూసుకెళ్తున్న రేటు.. వచ్చేవారం బంగారం ధరలు ఇలా!
బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్న వేళ.. నిపుణులు కొత్త అంచనాలు వెల్లడించారు. వచ్చే వారం కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే.. ఇప్పటికే ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను తీసుకునే అవకాశం ఉంది.దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్క వారంలోనే సుమారు రూ.7,900 పెరిగి 10 గ్రాములకు రూ.1.63 లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు 5.13 శాతం పెరిగింది. వెండి కూడా అంతే జోరుగా పెరిగింది. కేజీ రేటు రూ.2.70 లక్షలకు చేరుకుంది.బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, అమెరికా బాండ్ యీల్డ్స్ తగ్గడం, మార్కెట్లో నగదు లభ్యత మెరుగుపడటం వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికా మార్కెట్లో బంగారం ధర సుమారు 5.5 శాతం, వెండి ధర దాదాపు 7 శాతం పెరిగాయి.అయితే.. వచ్చే వారం బంగారం ధరల దిశను నిర్ణయించడంలో అమెరికా ఆర్థిక గణాంకాలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యంగా అమెరికా కోర్ పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్, జీడీపీ డేటాపై మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఆధారంగా.. వడ్డీ రేట్లపై పెట్టుబడిదారులు తమ అంచనాలను మార్చుకోవచ్చు. దీని ప్రభావం డాలర్, బాండ్ యీల్డ్స్తో పాటు బంగారం ధరలపైనా పడుతుంది.పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు, హర్ముజ్ పరిస్థితి మార్కెట్లకు చాలా కీలకం. ప్రపంచంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి పసిడి ధరలు పెరిగే అవకాలు మెండుగా ఉన్నాయి.ఇక ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగే జాక్సన్ హోల్ సమావేశంపైనా మార్కెట్ దృష్టి ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ అక్కడ చేసే ప్రసంగంలో అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ఏమైనా సంకేతాలు ఇస్తే.. వాటిని పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇది బంగారం ధరలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు -
ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు
అమెరికన్ స్టాక్ బ్రోకర్, ఆర్థిక వ్యాఖ్యాత, యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ సీఈఓ 'పీటర్ షిఫ్' (Peter Schiff) తన ట్వీట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ (Fed)పై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న అనుమానాల గురించి పేర్కొన్నారు. బంగారం, వెండి, చమురు, బిట్కాయిన్ ధరలను ఉదాహరణగా తీసుకుని.. ప్రజలు తమ డబ్బును ద్రవ్యోల్బణం నుంచి కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు వెళ్తున్నారని ఆయన చెబుతున్నారు.సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుందనే ఆందోళనతో కొంతమంది బంగారం వంటి ఆస్తులను సురక్షితమైన ఆస్తులుగా ఎంచుకుంటారు. ఇందులోనే పెట్టుబడులు పెడుతుంటారు.షిఫ్ అభిప్రాయం ప్రకారం.. ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వ భారీ రుణభారం, అధిక వడ్డీ రేట్ల ప్రభావం వంటి కారణాల వల్ల అది కష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే ఫెడ్ చివరికి ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అణచివేయడం కంటే కొంత ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని సహించాల్సి రావచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే ఇది ఫెడ్ అధికారిక ప్రకటన కాదు.. షిఫ్ చేసిన ఆర్థిక విశ్లేషణ మాత్రమే.పెట్టుబడిదారులు తమ డబ్బును కాపాడుకునేందుకు తమకు నచ్చిన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. కొందరు బంగారం, వెండి వైపు వెళ్తే, మరికొందరు బిట్కాయిన్ ఎంచుకోవచ్చు. మొత్తం మీద.. ఫెడ్ మీద నమ్మకం తగ్గుతున్న కొద్దీ, ద్రవ్యోల్బణం నుంచి తమ సంపదను కాపాడుకోవడానికి పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ ఆస్తుల వైపు చూస్తున్నారని షిఫ్ స్పష్టం చేశారు.Gold hitting $4,600, silver near $70, oil over $87, and Bitcoin's earlier spike above $79K show the Fed has lost all credibility on its commitment to returning inflation to 2%. Treasury made it clear the Fed will choose inflation, so investors are choosing their preferred hedge.— Peter Schiff (@PeterSchiff) August 21, 2026 -
రాజకీయ కారణాలతోనే.. అమెరికా పర్యటన రద్దుపై రేవంత్ స్పందన
లండన్: రాజకీయ కారణాలతో కేంద్రం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణకు సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడతానని తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాలపై ఈ రోజు (ఆదివారం) క్లుప్తంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనకు మద్దతు తెలిపిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.లండన్లో తన సమావేశాలు, కార్యక్రమాలు పూర్తయ్యాయని గత మూడు రోజులుగా తనకు లభించిన అపూర్వమైన మద్దతుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం మునుపటి షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి అమెరికా బోస్టన్ వెళ్లాల్సి ఉంది. అయితే కేంద్రం తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్ ఈ రోజు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. -
డాలర్లు వస్తున్నాయ్.. జాగ్రత్త!
అమెరికా మరోసారి క్వాంటిటేటివ్ ఈజింగ్ (QE) పేరుతో డాలర్లను ముద్రించేందుకు సిద్ధమవుతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా ట్రెజరీ తీసుకునే ఇలాంటి చర్యలతో డాలర్ కొనుగోలు శక్తిని సూచించే డీఎక్స్వై (DXY) సూచీ పడిపోతుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.డాలర్లలో పొదుపు చేసుకునే వారే అధికంగా నష్టపోతారని కియోసాకి హెచ్చరించారు. ఆర్థికంగా అవగాహన ఉన్న పెట్టుబడిదారులు విలువ పెరిగే బంగారం, వెండి, బిట్కాయిన్, కొంత రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటారని చెప్పారు. ఆర్థిక పరిజ్ఞానం లేని వారు విలువ కోల్పోయే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్‘ఆర్థిక విద్య ఖరీదైనదని మీరు భావిస్తే.. ఆర్థిక అజ్ఞానానికి చెల్లించే మూల్యం ఎంత?’ అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కియోసాకి గుర్తుచేశారు. ఆర్థిక విద్య కోసం వెచ్చించే సమయం, డబ్బు కంటే.. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల సంపాదించలేని డబ్బే అతిపెద్ద ఖర్చు అని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.PRINTING MORE FAKE $US Treasury announces another round of QE (Quantatative Easing) aka printing fake $.DXY (index of purchasing power of dollars) CRASHES, which means INFLATION Booms….which means savers of fake $ are the biggest losers.Don’t be a Loser.As stated in my…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 22, 2026 -
మరోసారి తెరపైకి అమెరికా ‘51వ’ రాష్ట్రంగా కెనడా
వాషింగ్టన్: అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కెనడాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెనడా అతిగా డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తూ.. గతంలో తాను చేసిన ‘51వ రాష్ట్రం’ వ్యాఖ్యలను ట్రంప్ మరోసారి తెరపైకి తెచ్చారు.కెనడా అమెరికా రాష్ట్ర అయ్యేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ అమెరికాలోని రాష్ట్రాలు పొందుతున్న ప్రయోజనాలన్నింటినీ తాను పొందాలని కోరుకుంటోంది. అంతేకాకుండా వారు అమెరికా రైతులపై గత అనేక సంవత్సరాలుగా భారీ మొత్తంలో సుంకాలు విధిస్తున్నారు. ఇకపై అది కుదరదు. అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లకు ప్రతిగా తాము కూడా డాలర్కు డాలర్ పద్ధతిలో దీటుగా స్పందిస్తామని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ప్రకటించారు. టారిఫ్ల విధింపు అనేది కెనడాపై జరిగిన దాడిగా అభివర్ణించిన మార్క్ కార్నీ, దేశ ఆర్థిక వ్యవస్థను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలమవడంతో అమెరికా ప్రభుత్వం కెనడా దిగుమతులపై 50 శాతం టారిఫ్ను ప్రకటించింది. ముందస్తుగా కుదిరిన ఒప్పంద నిబంధనల ప్రకారం వాణిజ్య వ్యాపారాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించిందని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. ఉక్కు, అల్యూమినియం వంటి రంగాలపై సుంకాలు తగ్గించేందుకు అమెరికా ముందుకు వచ్చినప్పటికీ కెనడా వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు.అయితే, అమెరికా చివరి నిమిషంలో నిబంధనలను మార్చడం అన్యాయమని, ఆర్థికంగా అవి సరిపడేలా లేవని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తిప్పికొట్టారు. అమెరికా చర్యల వల్ల ఏ ఒప్పందంపైనైనా నమ్మకం సడలిపోతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు నెలకొన్న ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. కెనడా తన చర్చల బృందాన్ని వెనక్కి పిలవగా, అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా కెనడా కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. -
‘న్యూ యూఎస్ టెరిటరీ’.. ట్రంప్ పోస్టుతో ముదిరిన మంటలు!
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి హార్ముజ్ జలసంధి వద్దకు చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని ‘NEW US Territory’గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో మరోసారి పోస్టు చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఆగస్టు 18న ఇదే చిత్రాన్ని తొలిసారి షేర్ చేసిన ట్రంప్.. తాజాగా మళ్లీ దాన్ని పంచుకోవడం ద్వారా హార్ముజ్పై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న సంకేతం ఇచ్చారు.అంతకుముందు ఆగస్టు 14న లాంగ్ ఐలాండ్లోని పోలీస్ అకాడమీలో మాట్లాడిన ట్రంప్.. ‘త్వరలోనే హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో పోస్టు చేయడం లేదా అధ్యక్షుడి ప్రకటనతోనే హార్ముజ్పై అమెరికాకు చట్టపరమైన సార్వభౌమాధికారం ఏర్పడదు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తుతానికి రాజకీయ, వ్యూహాత్మక ఒత్తిడిలో భాగంగానే చూడాల్సి ఉంటుంది.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవలేని అమెరికా అసమర్థతకు, అదే జలసంధిని సొంతం చేసుకుంటామన్న వాదనకు మధ్య ఉన్న అంతరం.. వాషింగ్టన్ నుంచి హార్ముజ్ వరకు ఉన్న 7,000 మైళ్ల దూరం కంటే ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా అనంతర వ్యవస్థకు స్వాగతం అంటూ అమెరికాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.🔴President Trump just posted a map labeling the Strait of Hormuz as “NEW U.S. Territory.” The critical waterway is clearly circled and claimed. This follows his repeated statements that America now controls the Strait. Iran’s ability to threaten global oil shipping is being… pic.twitter.com/4TbQoFMNWC— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) August 22, 2026ఇదే సమయంలో ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్పై ఇప్పటివరకు లేనంత కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ముఖ్యంగా ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న చైనాపై కూడా వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్ చమురు ఎగుమతులకు సహకరించే దేశాలు, సంస్థలపై ద్వితీయ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్ విధించబోయే ద్వితీయ ఆంక్షలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి ఆధారం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా ఆర్థిక యుద్ధంలో తమతో చుట్టుపక్కల దేశాలు చేరితే వాటిని శత్రువులుగా పరిగణిస్తామని రెజాయీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ఎల్నినో సెగ.. ప్రపంచ వాణిజ్య మార్గాలకు గండం!ప్రస్తుతం అసలు సమస్య అంతా హార్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతోంది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ఈ మార్గంలో చమురు, ఎల్ఎన్జీ రవాణా భారీగా దెబ్బతింది. కొద్దిమంది వాణిజ్య నౌకలు మాత్రమే జలసంధిని దాటుతుండగా.. పెద్ద సంఖ్యలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ఎల్ఎన్జీ నౌకలు రాకపోకలకు దూరంగా ఉంటున్నాయి. ఇరాక్ విజ్ఞప్తి మేరకు కొన్ని ఇరాకీ చమురు నౌకలకు మాత్రం హార్ముజ్ గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించినట్లు సమాచారం. హార్ముజ్ సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే దాని ప్రభావం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాకపోవచ్చు. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, పరిశ్రమల వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. -
పర్షియన్ గల్ఫ్లో ‘మంటలు’.. యూఎస్ వైఖరిపై ధ్వజం
టెహ్రాన్: అమెరికా తన వైఖరిని మార్చుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ‘హార్ముజ్ జలసంధి’ మూసివేసే ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని, ఆ దేశం తన ప్రవర్తనను సరిదిద్దుకునేంత వరకు ఈ జలమార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఐఆర్ఐబీ ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు.వాషింగ్టన్ ప్రత్యక్ష సైనిక దాడులకు స్వస్తి చెప్పి, ఆర్థిక ఆంక్షల వైపు మళ్లిందని రెజాయ్ పేర్కొన్నారు. ఇరాన్పై ఆర్థిక దిగ్బంధం విధిస్తే లొంగిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భరోసా ఇచ్చారని ఆయన విమర్శించారు. అయితే ఆంక్షలను అధిగమించి చమురు ఎగుమతులు కొనసాగించే మార్గాలను తాము ఎప్పటినుంచో నేర్చుకున్నామని తెలిపారు. పర్షియన్ గల్ఫ్ తీరంలో 50 శాతానికి పైగా భూభాగం ఇరాన్దేనని, హార్ముజ్ నిర్వహణ బాధ్యత తమదేనని తేల్చిచెప్పారు.ఈ జలసంధి అమెరికా భూభాగమంటూ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఆర్థిక దిగ్బంధం ముగింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, చమురు ఆంక్షల ఎత్తివేతతో కూడిన 14 అంశాల ఒప్పందాన్ని అమెరికా నెరవేరిస్తేనే జలసంధిని తెరుస్తామని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. మరోవైపు, యూఎస్ నౌకాదళ భద్రతతో చమురు రవాణా నిరాటంకంగా సాగుతోందని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: బుల్లెట్ప్రూఫ్ జాకెట్ సీక్రెట్ హిస్టరీ ఇదే! -
ఆ నిర్ణయం చెల్లదు!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్, ఇరాన్, రష్యా, సోమాలియాతో సహా 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యూయార్క్లోని యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి జెనెట్ వర్గాస్ శుక్రవారం రద్దు చేశారు. ట్రంప్ సర్కార్ వైఖరి చట్ట విరుద్ధంగా, శాసనాధికారాన్ని ధిక్కరించేలా ఉందని తేల్చిచెప్పారు. జడ్జి జెనెట్ వర్గాస్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన న్యాయమూర్తి కావడం విశేషం. ఏ వీసా నిర్ణయంలోనైనా కాన్సులర్ అధికారులకే అగ్రస్థానం ఇవ్వాలన్న కాంగ్రెస్ నిబంధనను కూడా ఈ విధానం బలహీనపరుస్తుందని వర్గాస్ అన్నారు. ఒక వలసదారుడు వీసాకు అర్హుడా కాదా అని నిర్ణయించే ప్రత్యేక అధికారాన్ని, విచక్షణాధికారాన్ని కాంగ్రెస్ కాన్సులర్ అధికారులకు కల్పించిందని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి జాతీయత ఆధారంగా ఇమ్మిగ్రేషన్ వీసాల జారీని నిషేధించే ఈ విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అర్హులైన దరఖాస్తుదారులకు వీసాలను నిరాకరించాలని ఆదేశించడం ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని వ్యతిరేకించడమే అవుతుందని పేర్కొన్నారు. 75 దేశాల పౌరులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ వీసాలు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ రెండు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, 11 మంది వ్యక్తులు కోర్టులో సవాలు చేశారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జడ్జి జెనెట్ వర్గాస్ విచారణ చేపట్టారు. 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను నిలిపివేయడం చెల్లదని తీర్పు వెలువరించారు. -
120 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా బతికాడు..
వాషింగ్టన్: ఓ వ్యక్తి 120 అడుగుల ఎత్తు నుంచి వాగులో పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని మోంటానా జాతీయ ఉద్యానవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్త్ కరోలినాలో నివసించే కెన్ నర్స్ తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్లేసియర్ జాతీయ ఉద్యానవనానికి వెళ్లాడు. అక్కడ ఓ ప్రదేశం నుంచి మెక్డొనాల్డ్ వాగులోకి పడిపోయినట్లు నాన్స్టాప్ లోకల్ మోంటానా తెలిపింది.హెలికాప్టర్ శోధన, రక్షణ సంస్థ టూ బేర్ ఎయిర్ రెస్క్యూ ఫేస్బుక్లో చేసిన పోస్టు ప్రకారం.. కెన్ జలపాతాల వరుస మీదుగా జారిపడి నీటిలో ముఖం కిందకు పెట్టుకుని కనిపించాడు. కెన్, అతడి కుటుంబ సభ్యులు ఫొటోలు తీసుకుంటున్నారని అతడి భార్య రీనే నర్స్ నాన్స్టాప్ లోకల్ మోంటానాకు తెలిపింది. అయితే చలి నుంచి బయటపడేందుకు ఆమె కారులోకి వెళ్లిన సమయంలో మెరుగైన దృశ్యం కోసం కెన్ అంచుకు దగ్గరగా వెళ్లాడు. ఒక్కసారిగా నేల కుంగిపోవడంతో అతడు సుమారు 120 అడుగుల లోతులోని వాగులో పడిపోయాడు.కెన్ నీటిలో ముఖం కిందకు పెట్టుకుని ఉండటాన్ని గుర్తించిన ఆ వ్యక్తి వాగులోకి దిగి అతడిని లోతు తక్కువగా ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చాడు. అక్కడ అతడికి గుండె స్పందనను తిరిగి తీసుకురావడానికి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం కెన్లో స్వయంగా రక్త ప్రసరణ, గుండె స్పందన తిరిగి ప్రారంభమైనట్లు టూ బేర్ ఎయిర్ రెస్క్యూ తెలిపింది.గ్లేసియర్ జాతీయ ఉద్యానవన రక్షణ సిబ్బంది కెన్కు చికిత్స అందిస్తుండగా టూ బేర్ ఎయిర్ రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. సంస్థ విడుదల చేసిన వీడియోలో సిబ్బంది కెన్ను భద్రపరిచి నీటి నుంచి పైకి తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత కెన్ను వైద్య హెలికాప్టర్లోకి తరలించి పరిస్థితిని స్థిరపరిచారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఇదీ చదవండి: 15 ఏళ్లుగా గాలించి.. వృద్ధుడిని అరెస్ట్ చేసిన పోలీసులుఆ వ్యక్తి వేగంగా స్పందించిన తీరును టూ బేర్ ఎయిర్ రెస్క్యూ ప్రశంసించింది. అతడి చర్యలే బాధితుడి ప్రాణాలను కాపాడాయని తెలిపింది. నాన్స్టాప్ లోకల్ మోంటానా ప్రకారం, కెన్ 2 రోజులు వెంటిలేటర్పై ఉన్నాడు. మెలకువ వచ్చిన తర్వాత అతడికి ఆక్సిజన్ అందించారు. అతడికి పలు పక్కటెముకలు పగిలాయి. మోచేయికి తీవ్రమైన ఎముక విరుగు గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఊపిరితిత్తుల్లో ద్రవం కూడా చేరింది. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు దక్కాలని కెన్ కోరుకున్నాడు. -
‘బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి’
అమెరికా భారీగా పెరుగుతున్న ప్రభుత్వ రుణభారం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని బిలియనీర్ ఇన్వెస్టర్, బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక విధానాల్లో మార్పు రాకపోతే అమెరికా రుణ సంక్షోభం మరో మూడు సంవత్సరాల్లో ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లలో తమ పెట్టుబడులను తగ్గించి, పోర్ట్ఫోలియోలో 10–15 శాతం వరకు బంగారానికి కేటాయించాలని సూచించారు. అలాగే కొంతమేర బిట్కాయిన్ను కూడా కలిగి ఉండటం ద్వారా పెట్టుబడుల రిస్క్ను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.శుక్రవారం లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో డాలియో.. బలమైన ఆర్థిక స్థితి ఉన్న దేశాలు, వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడులను విస్తరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ బాండ్లపై అధికంగా ఆధారపడటం కంటే బంగారం, ఇతర ప్రత్యామ్నాయ ఆస్తులను కలిగి ఉండటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.మూడు సంవత్సరాల్లో సంక్షోభం?అమెరికా రుణభారం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారమూ భారీగా పెరుగుతోంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నికర వడ్డీ వ్యయం 2026లోనే సుమారు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం (CBO) అంచనా వేసింది. 2026లో ప్రభుత్వ ఆదాయం సుమారు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని CBO అంచనా వేస్తోంది.డాలియో దృష్టిలో ఇది సాధారణ రుణ సమస్య మాత్రమే కాదు. ప్రభుత్వ రుణాన్ని తీర్చేందుకు చెల్లించాల్సిన వడ్డీ వ్యయం పెరుగుతూనే ఉండటం, అదే సమయంలో భారీగా కొత్త రుణాలు సమీకరించాల్సి రావడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని ఆయన చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ రుణానికి తగినంత డిమాండ్ లేకపోతే అధిక వడ్డీ రేట్లను అంగీకరించాల్సి రావచ్చు లేదా కేంద్ర బ్యాంకు ద్వారా మరింత డబ్బు సృష్టించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయం. అటువంటి పరిణామాలు కరెన్సీపై ఒత్తిడి, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పెంచే అవకాశం ఉందనేది ఆయన విశ్లేషణ.బాండ్ల మార్కెట్లో ఒత్తిడిడాలియో వ్యాఖ్యలు వెలువడుతున్న సమయంలోనే అమెరికా ట్రెజరీ బాండ్ మార్కెట్లో ఒత్తిడి పెరిగింది. ఆగస్టు 21న 30 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5.27 శాతానికి చేరగా, వారంలో అది 2007 తర్వాతి అత్యధిక స్థాయిలకు సమీపించింది. అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్లను దాటడం కూడా పెట్టుబడిదారుల ఆందోళనకు కారణమవుతోంది.పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్లను పెంచే ప్రణాళికను ప్రకటించారు. అయితే ఈ చర్యతో ఈల్డ్స్లో వచ్చిన ప్రారంభ తగ్గుదల నిలవలేదు. దీంతో మార్కెట్లో ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, అమెరికా ద్రవ్య లోటు, రుణభారం వంటి మూల సమస్యలను పరిష్కరించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బంగారం, బిట్కాయిన్కు డిమాండ్అమెరికా రుణభారం, డాలర్పై ఆందోళనలు పెరగడంతో ఈ వారం మదుపరులు బంగారం, బిట్కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులవైపు మొగ్గుచూపారు. ఆగస్టు 21న స్పాట్ గోల్డ్ ఔన్స్కు 4,623.94 డాలర్ల వరకు పెరిగి మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. ఈ వారంలో పసిడి ధర 5 శాతానికి పైగా పెరిగింది.ఇదే సమయంలో బిట్కాయిన్ 79,000 డాలర్లకు సమీపంలోకి వెళ్లి, అనంతరం 77,000 డాలర్ల ప్రాంతంలో ట్రేడైంది. ఈ వారంలో క్రిప్టోకరెన్సీ సుమారు 23 శాతం వరకు లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.లోటును తగ్గించాలిఅమెరికా బడ్జెట్ లోటును స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సుమారు 3 శాతానికి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని డాలియో సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ వ్యయాల్లో కోతలు, అధిక పన్ను ఆదాయం, తక్కువ వడ్డీ రేట్లు వంటి చర్యల కలయిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే తరహా రుణ, ఆర్థిక ఒత్తిళ్లు బ్రిటన్, చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
అమెరికా వీసా రూల్స్ దెబ్బకు భారతీయ జంట విలవిల
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని, ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం సాధించినప్పటికీ వీసా అనిశ్చితి కారణంగా జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని భారతీయ టెక్కీ మధుర్ మెహతా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వ్యాపార వార్తా పోర్టల్ ‘బిజినెస్ ఇన్సైడర్’లో రాసిన కథనాన్ని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రచురించింది. మధుర్ మెహతా 2021 ఆగస్టులో మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ నుంచి 2023లో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, 2025లో అమెజాన్లో ప్రోగ్రామ్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు.ఆ సంస్థ ఆయన హెచ్-1బీ వీసా స్పాన్సర్షిప్ ప్రక్రియను ప్రారంభించింది. 2026 మార్చిలో నిర్వహించిన హెచ్-1బీ లాటరీలో ఆయన ఎంపిక కావడంతో మూడేళ్ల పాటు అక్కడ పనిచేసే అవకాశం లభించింది. హెచ్-1బీ లభించినా భవిష్యత్తుపై ఆందోళనలు తొలగిపోలేదని మెహతా తెలిపారు. ఆయన కాబోయే భార్యకు హెచ్-1బీ లాటరీలో చివరి అవకాశం మాత్రమే మిగిలి ఉందని, ఆమె ఎంపిక కాకపోతే ఉద్యోగ అనుమతి లేని హెచ్-4 డిపెండెంట్ వీసాపై ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.ఇద్దరి వీసా పరిస్థితులు స్థిరపడే వరకు ఇల్లు కొనడం, వివాహం చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించడం వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోలేకపోతున్నామని వివరించారు. భారత్లో ఉన్న తల్లిదండ్రులకు అత్యవసర పరిస్థితులు ఎదురైనా వీసా స్టాంపింగ్ నిబంధనల వల్ల ప్రయాణాలు సంక్లిష్టమవుతాయని మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనిశ్చితికి శాశ్వత పరిష్కారంగా ఈబీ-1ఏ (EB-1A) వీసా సాధించే మార్గాలను, అలాగే కెనడా, ఐరోపా దేశాల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ఇది కూడా చదవండి: సంక్షేమ పథకానికి తూట్లు.. అనర్హుల ఖాతాల్లోకి రూ. 9,605 కోట్లు! -
వాణిజ్య చర్చలు విఫలం.. ఇక ట్రేడ్ వార్
అమెరికా–కెనడా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మూడు రోజుల పాటు కొనసాగిన వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. చర్చలు విఫలం కావడంతో.. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు వెల్లడించారు.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ పరిణామంపై స్పందిస్తూ.. అమెరికా నిర్ణయానికి సమాన స్థాయిలో ప్రతీకార చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ప్రకారం.. శనివారం అర్ధర్రాతి నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. అయితే అమెరికా విధించే ప్రతి డాలర్ టారిఫ్కు ప్రతిగా కెనడా కూడా అంతే మొత్తంలో సుంకాలు విధిస్తుందని కార్నీ స్పష్టం చేశారు. చివరి దశలో విఫలమైన చర్చలుఅమెరికా–కెనడా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం మూడు రోజుల పాటు వాషింగ్టన్లో చర్చలు జరిగాయి. కెనడా వాణిజ్య మంత్రి డొమినిక్ లెబ్లాంక్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ చర్చల్లో పాల్గొన్నారు. ప్రారంభంలో ఇరు దేశాలు ఒప్పందానికి దగ్గరయ్యాయని భావించినా.. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు విఫలమైన తర్వాత కెనడా చర్చలను తాత్కాలికంగా నిలిపివేసి, తమ ప్రతినిధులను తిరిగి ఒట్టావాకు రావాలని ప్రధాని కార్నీ ఆదేశించారు.ఏ వస్తువులపై ప్రభావం?అమెరికా విధించనున్న 50 శాతం టారిఫ్లు దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.7 లక్షల కోట్లకు పైగా) విలువైన కెనడా ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఉక్కు, అల్యూమినియం, కలప వంటి రంగాలకు ఈ నిర్ణయం భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. అమెరికా అధికారులు మాత్రం కెనడా కోరిన కొన్ని రాయితీలకు అంగీకరించలేదని తెలిపారు. ముఖ్యంగా కార్ల తయారీ రంగం, స్టీల్, అల్యూమినియం, లంబర్ రంగాల్లో కెనడా డిమాండ్లపై విభేదాలు కొనసాగినట్లు వెల్లడించారు."కెనడా ప్రయోజనాల కోసం పోరాడతాం": కార్నీఅమెరికాతో ఒప్పందం కుదరకపోయినా.. తమ దేశ కార్మికులు, వ్యాపారాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మార్క్ కార్నీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసేందుకు ప్రయత్నించామని, అయితే కెనడా ప్రయోజనాలకు విరుద్ధమైన ఒప్పందాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు.ట్రంప్ హెచ్చరికకెనడా ప్రతీకార టారిఫ్లు విధిస్తే.. పరిస్థితిని సమతుల్యం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ పరిపాలన హెచ్చరించింది. "వాళ్ల చర్యను సమం చేసేందుకు.. మరోసారి కఠిన చర్యలు తీసుకుంటాం" అని అమెరికా అధికారి వ్యాఖ్యానించారు.రెండు దేశాలపై ప్రభావంఅమెరికా–కెనడా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాల్లో ఒకటి. ఇరు దేశాల మధ్య ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతుంది. తాజా టారిఫ్ల నిర్ణయం అమల్లోకి వస్తే.. వినియోగదారులపై ధరల భారం పెరగడం, పరిశ్రమల సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే అమెరికా ఇతర దేశాలపై టారిఫ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో.. కెనడాతో తాజా వివాదం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముంది.ఇదీ చదవండి: ట్రంప్.. కాస్కో, మా దాడి ఓ రేంజ్లోనే ఉంటుంది! -
రెండో ల్యాండింగ్లో.. రన్వేకు చేరువలోనే మృత్యుఘోష
అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్వేకు చేరువలోనే ఓ చార్టర్ విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా పైలట్లు రన్వేను చూడలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.ప్రమాదానికి గురైన సెస్నా 441 (Cessna 441 Conquest) విమానం.. అలాస్కాలోని యాంకరేజ్ నుంచి బయలుదేరి కేప్ న్యూవెన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్పోర్ట్కు వెళ్తోంది. గురువారం మధ్యాహ్నం ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానాన్ని యాంకరేజ్కు చెందిన సెక్యూరిటీ ఏవియేషన్ సంస్థ నిర్వహిస్తోంది.రెండోసారి ల్యాండింగ్.. క్షణాల్లో విషాదంవిమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు మొదట ప్రయత్నించినా.. దట్టమైన పొగమంచు కారణంగా రన్వే కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో విమానం రాడార్ సంబంధాలు కోల్పోయి కూలిపోయింది. రన్వేకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో శిథిలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు మాట్లాడుతూ.. పైలట్లు బయట పరిస్థితులను చూడలేని స్థాయిలో ఉండడంతో కేవలం విమాన పరికరాల ఆధారంగానే నడిపినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మూడు వైపులా కొండలతో ఉన్న క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతమని చెప్పారు.మృతుల్లో..ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో అమెరికా ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. మరో నలుగురు కాంట్రాక్టర్లు. వీరంతా రాడార్ కేంద్రానికి సంబంధించిన పనుల కోసం ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని సహాయక బృందాలు ధ్రువీకరించాయి. మృతుల వివరాలను కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. మారుమూల సైనిక రాడార్ కేంద్రం వద్ద ప్రమాదంప్రమాదం జరిగిన కేప్ న్యూవెన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ అలాస్కాలోని నైరుతి తీరంలో ఉంది. యాంకరేజ్ నగరానికి ఇది సుమారు 725 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రాడార్ కేంద్రం అలాస్కా గగనతలాన్ని, సరిహద్దు ప్రాంతాల్లోని విమానాల కదలికలను పర్యవేక్షించే నెట్వర్క్లో భాగంగా పనిచేస్తుంది. వేగంగా మారిన వాతావరణంప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారినట్లు అధికారులు తెలిపారు. మొదట కొంత దృశ్యమానత ఉన్నప్పటికీ.. కొద్ది సమయంలోనే దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ ప్రమాదంపై ఎన్టీఎస్బీ దర్యాప్తు ప్రారంభించింది. వాతావరణ పరిస్థితులు, పైలట్ల నిర్ణయాలు, విమానం సాంకేతిక పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అలాస్కా కమాండ్ అధికారులు మృతులను “కఠిన పరిస్థితుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అంకితభావం కలిగిన నిపుణులు”గా పేర్కొంటూ సంతాపం తెలిపారు.ఇదీ చదవండి: భారతీయుల కిడ్నాప్ కలకలం.. ఎక్కడో తెలుసా? -
గ్రీన్కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫారం
వాషింగ్టన్: అమెరికా గ్రీన్కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫారం వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. పాత వెర్షన్లను ఉపయోగించి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 18 తర్వాత తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. శాశ్వత నివాసాన్ని నమో దు చేసుకోవడానికి లేదా హోదాను మార్చుకోవడానికి ఉద్దేశించిన కొత్త ఫారం ఐ–485 అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇది సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పబ్లిక్ చార్జ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టంచేసింది. 2025 జనవరి 20 నాటి వెర్షన్ ఫారం ఐ–485ని తిరస్కరిస్తా మని పేర్కొంది. ఈ పాత వెర్షన్ను సెప్టెంబర్ 18కి ముందే పోస్ట్మార్క్ చేసినా లేదా ఎల్రక్టానిక్ పద్ధతిలో సమరి్పంచినా ఆమోదం పొందుతుందని తెలియజేసింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ‘పబ్లిక్ చార్జ్’నిర్వచనాన్ని విస్తరించింది. మెడికేడ్, ఫుడ్ స్టాంపులు, ప్రభుత్వం నుండి ఏదైనా ప్రయోజనాలను పొందుతున్న వారి వలసదార్ల గ్రీన్కార్డు దరఖాస్తులను తిరస్కరిస్తోంది. -
సీఎం టూర్కు కేంద్రం నో
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. రాజకీయ కారణాలతో అనుమతిని నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయన పర్యటన నిబంధనలకు అనుగుణంగా లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా, యూకే పర్యటనలకు విధివిధానాలు, ప్రొటోకాల్ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 16న కేంద్రం అనుమతి కోరారు. అయితే యూకే పర్యటనకు అనుమతిచ్చిన విదేశాంగశాఖ.. అమెరికా పర్యటనకు మాత్రం నిరాకరించింది. ‘ముఖ్యమంత్రులు లేదా ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనల కోసం రాజకీయ అనుమతులు ఇచ్చేందుకు విదేశాంగ శాఖ ఆయా పర్యటనలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది. అలాంటి వారి విదేశీ పర్యటనలు ఆయా రాజ్యాంగబద్ధ పదవులకు, పర్యటన ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలి. కానీ తెలంగాణ సీఎం అమెరికా పర్యటన అందుకు అనుగుణంగా లేదు.అందుకే సీఎం పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అయితే సీఎం యూకే పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చాం’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతంలో ఢిల్లీ సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ విదేశీ పర్యటనలకు సైతం విదేశాంగ శాఖ రాజకీయ అనుమతులు నిరాకరించడం గమనార్హం. కేంద్రం రాజకీయ అనుమతుల నిరాకరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.అయితే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందాన్ని అమెరికా వెళ్లాలని.. ఇది వరకే అక్కడి సంస్థలతో సంప్రదింపులు జరిపినందున హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకోవాలని సీఎం ఆదేశించారు. ఆయన మాత్రం ఈ నెల 23న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) ఏర్పాటు చేయనున్న ముఖాముఖి కార్యక్రమాన్ని షెడ్యూల్లో చేర్చడం వల్లే ఆయన పర్యటనకు కేంద్రం అనుమతించలేదని సమాచారం. కేంద్రం నిర్ణయంపై సీఎం విస్మయం.. తెలంగాణ అభివృద్ధి, విద్యారంగ పురోగతికి, వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడే తన అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతో కేంద్రం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్రం నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ‘ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలను భారత్కు, తెలంగాణకు, హైదరాబాద్కు తీసుకురావడం. అత్యుత్తమ ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవి. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ విశ్వసిస్తాను’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతా.. ‘హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హెచ్సీయూ, జేఎన్టీయూ తదితర విశ్వవిద్యాలయాల ఏర్పాటు హైదరాబాద్ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... ప్రపంచానికి నాయకత్వం వహించగలమని నిరూపించింది. అక్కడి నుంచి ప్రపంచంలోని గొప్ప టెక్ నాయకుల్లో కొందరు రూపుదిద్దుకున్నారు. ఐఐటీ, ఐఎస్బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ అగ్రశ్రేణి సంస్థలు, వాటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగింది.ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్ను కేంద్రంగా మార్చి 21వ శతాబ్దపు మన ప్రగతి ప్రయాణానికి శక్తినిస్తాం. హైదరాబాద్ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం, ప్రయత్నం. ఒక సాధారణ భారతీయుడు హైదరాబాద్లోనే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లేదా ఎంఐటీ, ఎల్బీఎస్, ఎల్ఎస్ఈ వంటి ప్రపంచస్థాయి సంస్థల నుంచి విద్య, సర్టీఫికేషన్ పొందగలగాలి. ఎందుకంటే చాలా మంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకున్నారు. కానీ నేను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్కు తీసుకురావాలని అభిలషిస్తున్నాను’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. -
‘‘అందుకే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుంది’’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్రం కావాలనే సీఎం పర్యటనను అడ్డుకుందని చెప్పారు. బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ దీనిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.సీఎం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణకు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను తీసుకురావడం, విద్యా రంగంలో పెట్టుబడులు, అత్యుత్తమ విద్యా సంస్థల భాగస్వామ్యాలను రాష్ట్రానికి తీసుకురావడం వంటి అంశాలపై చర్చించాలన్నది సీఎం లక్ష్యమని పేర్కొన్నారు.అమెరికా పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించినప్పటికీ, రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం దురదృష్టకరమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలను కూడా రాజకీయాలకు అతీతంగా చూడలేని స్థాయికి బీజేపీ దిగజారిందని విమర్శించారు.“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచస్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణలోని బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలు కల్పించేందుకు సీఎం వెళ్తే మాత్రం అడ్డంకులు సృష్టిస్తారా?” అని నిలదీశారు.బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ అవగాహన మరోసారి బహిర్గతమైందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణను చూసి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. -
సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దుపై ఎంఈఏ స్పందన
ఢిల్లీ: సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) స్పందించింది. ప్రముఖుల టూర్లను పొలిటికల్ క్లియరెన్స్ కోసం పరిశీలిస్తాం.. పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా కార్యక్రమం ఉండాలని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. యూఎస్ పర్యటన విషయంలో అలా లేదు కాబట్టి నిరాకరించామని ఎంఈఏ తెలిపింది.ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు వారి కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందన్న జైస్వాల్.. సంబంధిత పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా కార్యక్రమం ఉండాలని.. అయితే, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విషయంలో ఆ ప్రమాణానికి అనుగుణంగా కార్యక్రమం లేదని, అందుకే అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. యూకే పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఆ తర్వాత 24 నుంచి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పెట్టుబడులు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, చివరి నిమిషంలో విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి నిరాకరణ రావడంతో అమెరికా పర్యటనకు బ్రేక్ పడింది. దీంతో సీఎం పర్యటన రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
సీఎం రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కేంద్రం అనుమతి నిరాకరణ..!
-
సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. కారణం అదేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 24 నుంచి 29 వరకు అమెరికాలో పర్యటించేందుకు సీఎం షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఆ తర్వాత 24 నుంచి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పెట్టుబడులు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది.అయితే, చివరి నిమిషంలో విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి నిరాకరణ రావడంతో అమెరికా పర్యటనకు బ్రేక్ పడింది. దీంతో సీఎం పర్యటన రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే లండన్ పర్యటనలో ఉన్న సీఎం.. 23న హైదరాబాద్ చేరుకున్న తర్వాత రాష్ట్రంలో పలు కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. అమెరికా పర్యటన రద్దుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ పర్యటన రద్దు కావడంతో కేవలం అధికారులు మాత్రమే అమెరికా పర్యటనకు వెళ్లున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో విద్యాసంస్థలతో ఎంవోయూలు చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హార్వర్డ్, MIT, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్తో భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి..‘ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యం. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతాం. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రయోజనాలు రాజకీయాలకు అతీతం. విద్య, నైపుణ్యాలు, శిక్షణలో ప్రపంచ అత్యుత్తమ సంస్థలను తెలంగాణకు తీసుకొస్తాం. పిల్లలను విదేశాలకు పంపడం కాదు.. ప్రపంచ అత్యుత్తమ విద్యను తెలంగాణకు తీసుకురావాలి. తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా బ్రిటన్లోని ప్రముఖ విద్యాసంస్థలతో సీఎం భేటీ అయ్యారు. LSE, London Business School, University of London ప్రతినిధులతో సమావేశాలు జరిగాయి. బ్రిటన్లో ప్రముఖ స్పోర్ట్స్, స్కిల్లింగ్ సంస్థలతోనూ సీఎం చర్చలు జరిపినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు -
4 పాములు.. అప్పుడు ఒకదానికొకటి చుట్టుకుని..
అమెరికాలోని వ్యోమింగ్, వైట్ రివర్ ఫార్మేషన్లో శాస్త్రవేత్తలకు సుమారు 38 మిలియన్ సంవత్సరాల నాటి 4 పాముల శిలాజాలు లభించాయి. ఇవి ఒకదానికొకటి చుట్టుకుని, బొరియలాంటి ప్రదేశంలో కలిసి ఉన్న స్థితిలోనే శిలాజాలుగా మారాయి. ఈ కొత్త జాతికి హైబర్నోఫిస్ బ్రెయితాప్టి అని పేరు పెట్టారు.వైట్ రివర్ ఫార్మేషన్లో లభించిన ఈ శిలాజాలను అగ్నిపర్వత బూడిద, మట్టి, వరద నీరు కలిసి వేగంగా కప్పివేయడంతో ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా పాముల శిలాజాలు విడిపోయిన వెన్నెముక భాగాల రూపంలో మాత్రమే దొరుకుతాయి. కానీ ఇక్కడ పూర్తి అస్థిపంజరాలు లభించడం ప్రత్యేకత.మూడు పాములు ఒకే చోట కలిసి ఉండటం వల్ల అవి చలికాలంలో ఒకే బొరిలో ఆశ్రయం పొందేవని, బహుశా కలిసి నిద్రాణ స్థితిలో ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, పాములు నిజంగానే నిద్రాణ స్థితిలో ఉన్నాయని నిర్ధారించడానికి శిలాజ ఆధారాలు సరిపోవని వారు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా ప్రాచీన పాముల పరిణామక్రమంతో పాటు వాటి సామూహిక ప్రవర్తనపై కూడా కీలక సమాచారం లభించింది.పాముల శరీరంలో తల నుంచి తోక వరకు పొడవైన వెన్నెముక ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో వెన్నుపూసలు ఉంటాయి. పాముల వెన్నెముకలో సాధారణంగా వందలాది వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి వెన్నుపూసకు పక్కటెముకలు అనుసంధానమై ఉంటాయి. వెన్నెముక చాలా వంగేలా ఉండటం వల్ల పాములు మెలికలు తిరుగుతూ కదలగలుగుతాయి. పాములకు చేతులు, కాళ్లు లేకపోయినా వెన్నెముక మాత్రం ఉంటుంది.ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవి.. కాగా, ఈ పాములు ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ ద్వారా ఉత్తర అమెరికాలోని చిన్న బొరియల్లో నివసించే పాముల చరిత్రపై కొత్త సమాచారం లభించింది. ఈ పాముల సమూహం గురించి శాస్త్రవేత్తలు 1986లోనే తొలిసారి వివరించారు. ఈ శిలాజాలు పాములు కలిసి ఆశ్రయం పొందిన ప్రదేశానికి సంబంధించినవి కావచ్చని సూచించారు. శిలాజాల వెన్నుపూసలు, పుర్రెను నిశితంగా పరిశీలించిన తర్వాత ఇవి గతంలో తెలిసిన ఒగ్మోఫిస్, కలమాగ్రాస్ పాముల నుంచి భిన్నమైనవని తేలింది. పరిణామ విశ్లేషణలో ఈ కొత్త పాము ఇతర బోయిడ్ పాములన్నింటికీ సోదర సమూహంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇదీ చదవండి: యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని కుమారుడు -
అమెరికా ఆంక్షలకు తగ్గేదేలే అంటున్న టెహ్రాన్
-
ఇరాన్పై ట్రంప్ కొత్త గేమ్.. మద్దతుదారులకు మూడినట్లే!
ఇరాన్ను ఒంటరి చేసేందుకు అమెరికా ఇక నేరుగా రంగంలోకి దిగింది! టెహ్రాన్ను మాత్రమే కాదు.. దానికి అండగా నిలిచే దేశాలు, సంస్థలను కూడా టార్గెట్ చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్కు డబ్బు అందించినా.. వ్యాపారం చేసినా.. చమురు తరలింపులో సహకరించినా భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఇరాన్ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరుచేసేలా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో టెహ్రాన్కు అండగా నిలిచే దేశాలపై కూడా అమెరికా ఆంక్షల పిడుగు పడబోతోందా? అన్న ఉత్కంఠ మొదలైంది.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్టులో.. ఇరాన్కు ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థలు ఎలాంటి సహాయం చేసినా ఆయా దేశాలు “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇరాన్కు సహాయం చేసే మార్గాలపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, ఆర్థిక స్వాప్ ఒప్పందాలు, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్లు, నౌకల రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా టెహ్రాన్కు మద్దతు ఇచ్చినా అమెరికా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. అంటే ఇరాన్తో నేరుగా వ్యాపారం చేసే సంస్థలతో పాటు పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక చేయూత అందించే వ్యవస్థలపైనా అమెరికా కన్నేయనుంది.ఇరాన్తో ఒప్పందం చేసుకునేందుకు తన ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ టెహ్రాన్ వాటిని ఉపయోగించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఇరాన్పై అపూర్వ స్థాయిలో ఆర్థిక యుద్ధం, అంతర్జాతీయ ఒంటరితనం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అమెరికా మిత్రదేశాలు కూడా ఈ చర్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ అన్నారు. ఆ దేశ నౌకాదళం ధ్వంసమైందని, వైమానిక దళం బలహీనపడిందని, సైనిక కర్మాగారాలు భారీగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్న ఆయన.. కొత్త చర్యలతో టెహ్రాన్ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం మరింత తగ్గిపోతుందని అన్నారు.ఇరాన్ అణు కార్యక్రమంపైనా ట్రంప్ మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు” అంటూ తన పరిపాలన వైఖరిని పునరుద్ఘాటించారు. ట్రంప్ తాజా హెచ్చరికతో ఇప్పుడు అసలు ప్రశ్న ఇరాన్ గురించే కాదు.. ఇరాన్కు అండగా నిలిచే దేశాల సంగతేంటి? అన్నదే. టెహ్రాన్తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా చర్యలు మొదలుపెడితే అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ను ఒంటరి చేయాలన్న ట్రంప్ వ్యూహం.. ఇప్పుడు ఆ దేశానికి మద్దతిచ్చే వారిని కూడా చుట్టుముట్టే స్థాయికి చేరిందా? అన్న చర్చ మొదలైంది. -
కెన్యాలో తీవ్ర విషాదం.. హెలికాఫ్టర్ కూలి ఏడుగురి మృతి
కెన్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సఫారీ ప్రయాణంలో ఉన్న హెలికాప్టర్ కుప్పకూలడంతో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ దంపతులతో పాటు ఐదుగురు అమెరికన్లు కోల్పోయారు. ఉత్తర కెన్యాలోని మారుమూల ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.కెన్యా పౌర విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్యిరో ప్రాంతానికి వెళ్తుండగా ఉదయం 9.13 గంటలకు సాంబురు కౌంటీలోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు, ఒక పైలట్ ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే హెలికాప్టర్లో ఉన్నఅంతా మృతి చెందినట్లు సాంబురు పోలీసు కమాండర్ డేవిడ్ న్కోరోయ్ వెల్లడించారు.🇰🇪 Tragedy in Kenya.Seven people were killed in a helicopter crash in northern Kenya, according to authorities and local media.Among the victims were five Americans, including a Telemundo executive, as well as an Ecuadorian security official.No known cause yet. Writer:…— Mario Nawfal (@MarioNawfal) August 19, 2026మృతుల్లో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈక్వెడార్ నేషనల్ ఇంటెలిజెన్స్ సెంటర్ డైరెక్టర్ పేరు మిచెల్ సెన్సీ-కాంటూగి.. ఆయన సతీమణి స్టెఫనీ హోలిహాన్ కూడా మృతి చెందారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన అమెరికా రాయబార కార్యాలయం.. స్థానిక అధికారులతో కలిసి కాన్సులర్ సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది. BREAKING: An aircraft has crashed at Lolokwe Mountain in Samburu County, Kenya, the Kenya Civil Aviation Authority (KCAA) says.The Eurocopter EC130 B4, registration 5Y-GYM, was flying from Loisaba to Ewasonyiro when the accident occurred at around 9:13am on Wednesday, August… pic.twitter.com/hpCIgr7cXC— The New Times (Rwanda) (@NewTimesRwanda) August 19, 2026మృతుల వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఫ్లోరిడాకు చెందిన టెలిముండో మీడియా సంస్థ ఉన్నతాధికారి జోసే సువారెజ్ (55) మృతుల్లో ఒకరని స్థానిక మీడియా తెలిపింది. ఆయన టెలిముండో ఫ్లోరిడా స్టేషన్లకు అధ్యక్షుడు, జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రమాదానికి ముందు వాళ్లంతా సరదాగా గడిపిన చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.One of these photos captured a moment of joy before the flight. The other is a portrait of Michele Sensi-Contugi, Ecuador’s intelligence chief.Hours later, a helicopter carrying seven people crashed near Mt. Ololokwe in Samburu County, Kenya.More details of the tragedy 👇 pic.twitter.com/GcSaWzPL1R— LESAMBURUI (@hon_lesamburui) August 19, 2026It has now emerged that one of the American tourists who perished in the Eurocopter EC130 B4 aircraft at Mt Ololokwe near Kirish in Samburu County, Kenya while covering the route from Loisaba to Ewaso Nyiro is Jose Alberto Suarez, President and General Manager of Telemundo 31,… pic.twitter.com/UoJxWn4T6L— JaHomaBay (@HassanMcOjwang) August 19, 2026ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లేడీ లోరీ హెలికాఫ్టర్స్కు చెందినదిగా అధికారులు తెలిపారు. ఇది చార్టర్ ఫ్లైట్గా నడుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మౌంట్ ఒలోలోక్వే పర్వత పాద ప్రాంతంలోని క్లిష్టమైన భూభాగంలో హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు కెన్యా రెడ్క్రాస్, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.కెన్యాలో పర్యాటక రంగం విస్తృతంగా ఉండటంతో దూర ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు హెలికాప్టర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో దేశంలో హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ కెన్యాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓ ఎంపీ సహా ఆరుగురు మృతి చెందారు. తాజా ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. -
ట్రంప్ మ్యాప్ల సంబరం!
హార్మూజ్ జలసంధిని ‘చాలా త్వరలోనే’ అమెరికా భూభాగంగా మారుస్తానని గతవారం ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడు ఇరాన్పై మళ్లీ భీకర దాడులకు తెగబడొచ్చని కొందరు అనుమానించారు. తీరా మంగళవారం ఆయన చేసిందల్లా ‘అమెరికా కొత్త భూభాగం’ అని రాసివున్న హార్మూజ్ జలసంధి మ్యాప్ను విడుదల చేయటమే. దీంతో ఇరాన్ దౌత్యవేత్తలు ప్రతిదాడికి దిగారు. కాలిఫోర్నియాను ఇరాన్ భూభాగంగా చూపుతూ ఇరాన్ కాన్సులేట్ ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. వేరే దేశాల భూభాగాలు డిమాండ్ చేయటం, వాటిని అమెరికా భౌగోళిక చిత్రపటాల్లో భాగంగా చూపటం ట్రంప్కు కొత్తేం కాదు. రెండోసారి అధికారంలోకొచ్చిన వెంటనే గ్రీన్లాండ్పై ఆయన కన్నుపడింది. అలాగే కెనడాను అమెరికాలో విలీనం చేసుకుని 51వ రాష్ట్రంగా మారుస్తామనీ, పనామా కాల్వ ఇకపై తమదేననీ, గాజాను ‘సొంతం’ చేసుకుంటామనీ కూడా పలుమార్లు చెప్పారు. అందుకు సంబంధించి ఒక వీడియో రూపొందించి విడుదల చేశారు. వెనిజులా మ్యాప్లో అమెరికా జెండాను సూచించే రంగులు నింపారు. అలాగే ఇకపై గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతం మెక్సికోకు పశ్చిమ, దక్షిణ దిశల్లో, అమెరికాకు ఉత్తరంవైపు, క్యూబాకు ఆగ్నేయంవైపు ఉంది. పేరు మార్చినా ప్రాదేశిక జల పరిధులేమీ మారడంలేదు గనుక మెక్సికో, క్యూబాలు ఈ విషయంలో మౌనంగా ఉండిపోయాయి. ఇక పర్షియన్ గల్ఫ్ పేరును గల్ఫ్ ఆఫ్ అరేబియాగా మారుస్తామని తొలి ఏలుబడిలో 2017లో ప్రకటించారు. దాంతో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జాగ్రఫీ చదువుకోమని ట్రంప్కు సలహా ఇచ్చారు. నిరుడు మే నెలలో సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ పర్యటనకెళ్లే ముందు పేరు మార్పు ఉంటుందని ప్రకటించారు. అటు తర్వాత ఎందుకో దాని జోలికి పోలేదు. ఈ ‘భౌగోళిక చిత్రపట దురాక్రమణల్ని’ చూసి జనం కాలక్షేపానికి నవ్వుకోవచ్చు. ట్రంప్ ప్రదర్శిస్తున్న అమాయకత్వమో, అజ్ఞానమో చూసి జాలిపడే వారూ ఉండొచ్చు. కానీ అగ్ర రాజ్యాల చరిత్ర తెలిసినవారు దాన్నంత తేలిగ్గా వదిలేయరు. ఒక విశాల పాలస్తీనా భూభాగంలోకి కొన్ని దశాబ్దాల్లో భారీయెత్తున యూదుల్ని తరలించి, అక్కడ నరమేధాలకు పాల్పడి ఇజ్రాయెల్ను సృష్టించి, అందుకు ఐక్యరాజ్యసమితి ఆమోదాన్ని ‘రాబట్టిన’ చరిత్ర ఆ దేశాలది. కనుక ఇప్పుడు ఉబుసుపోక మాట్లాడే మాటల్లో వేరే అర్థాలు ఉండొచ్చన్న అనుమానాలు రావటం సహజం. రాజకీయావతారం ఎత్తి దాదాపు పదిహేనేళ్లవుతున్నా పూర్వాశ్రమంలో నిర్వహించిన రియలెస్టేట్ వ్యాపార ప్రభావంనుంచి ట్రంప్ బయటపడలేకపోతున్నారన్నది వాస్తవం. రియలెస్టేట్ యజమాని మాదిరే ఆయన భూదాహంతో అల్లాడిపోతున్నారు. ‘మళ్లీ అమెరికాను ఉన్నతంగా చేద్దాం’ అనే నినాదం సారాంశం ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ప్రాంతాలను అమెరికాలో విలీనం చేసుకోవటమేనన్న సందేశాన్ని ట్రంప్ పంపుతున్నారు. అందుకే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గ్రీన్లాండ్ సందర్శనకెళ్లినప్పుడు డెన్మార్క్, గ్రీన్లాండ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. దాంతో చేసేదిలేక ఆమె మధ్యలోనే ఆ పర్యటనను విరమించుకుని వెనక్కిపోవాల్సి వచ్చింది. జనం భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకొచ్చినవారు వాటిపైనే మనుగడ సాగించాలనుకోవటం సహజం. అలాగైతేనే వారి వైఫల్యాలు మరుగునపడతాయి మరి. ఈ బాపతు నేతలు అందరి దృష్టి తమపైనే ఉండాలన్న తపనతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ట్రంప్ దీనికి భూదాహాన్ని కూడా చేర్చారు. ఈ భౌగోళిక చిత్రపటాల్ని చూసిన ‘మాగా’ జనం నిజంగానే ట్రంప్ వాటిని జయించుకొస్తారన్న భ్రమల్లో ఉంటారు. ఒకపక్క అరేబియా సముద్రంలో లంగరేసిన విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్లో దుర్భర పరిస్థితులున్నాయనీ, కొందరు ఆత్మహత్యా యత్నం కూడా చేశారనీ వార్తలొస్తున్నాయి. అందులో పనిచేసే రక్షణ సిబ్బందిని వెనక్కు పిలిపించాలని వారి కుటుంబాలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అందుకే చవకబారు చిత్రపట వివాదాలు కట్టిపెట్టి ఇరాన్తో సంధికి ప్రయత్నించడం అమెరికా శ్రేయస్సుకు, రాజకీయంగా ట్రంప్కు మంచిది. -
పశ్చిమాసియానే కాదు యూరప్లోనూ దాడులకు ఇరాన్ భారీ స్కెచ్?
టెహ్రాన్: ఇప్పటివరకు పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతానికే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు.. ఇప్పుడు క్రమంగా యూరప్ (ఐరోపా) దేశాలకు విస్తరిస్తూ అంతర్జాతీయ యుద్ధ మేఘాలను అలుముకునేలా చేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తాము క్రమంగా పట్టు కోల్పోతున్నామనే నివేదికలు ఇరాన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇదే తరుణంలో, హర్మూజ్ జలసంధి తమదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ఒక కొత్త మ్యాప్ను విడుదల చేయడం ఇరాన్ ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది.ఈ పరిణామాలే ఇరాన్ను రక్షణాత్మక వైఖరి వీడి, యూరప్లోని అమెరికా సైనిక స్థావరాలపై పూర్తి స్థాయి దాడికి యోచించేలా చేశాయంటూ ‘ఫైనాన్షియల్ టైమ్స్’సంచలన నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో డ్రోన్ దాడికి గురైన సైప్రస్లోని బ్రిటిష్ వైమానిక స్థావరం కూడా ఇరాన్ దాడి చేసే లక్ష్యాల జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో బ్రిటిష్ సైనిక స్థావరంపై జరిగిన మొదటి దాడి ఇదే కావడంతో, ఇది అప్పట్లోనే ఇరు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రతరం కావడానికి నాంది పలికింది.అలాగే, గత నెలలో తన ‘బెజ్మర్ వైమానిక స్థావరం’ నుండి అమెరికాకు చెందిన 8 బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానాలకు, 250 మంది సైనిక సిబ్బందికి ఆశ్రయమిచ్చి, వారు పనిచేసేందుకు అనుమతించిన ఆగ్నేయ ఐరోపా దేశమైన బల్గేరియాను కూడా ఇరాన్ తన ప్రతీకార లక్ష్యంగా గుర్తించినట్లు ఈ నివేదిక పేర్కొంది.అమెరికాతో శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోవడంతో.. ఇరాన్ తన రక్షణాత్మక వైఖరిని వీడి పూర్తిగా దాడి చేసే సైనిక వ్యూహానికి మారాలని నిర్ణయించుకుందని సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ సుదీర్ఘ సంఘర్షణకు శాశ్వత ముగింపు పలకడానికి, అలాగే హర్మూజ్ జలసంధి నియంత్రణపై ఉన్న వివాదాలను పరిష్కరించడానికి జరుగుతున్న చర్చలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో ఇరాన్ ఈ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. -
జమ్ముకశ్మీర్పై అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్పై భారత్లోని అమెరికా రాయభారి కీలక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమని అమెరికా రాయబారి సెర్జియో గోర్ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు బుధవారం శ్రీనగర్కు వచ్చిన ఆయన జమ్మూకశ్మీర్, లద్దాఖ్లో పర్యటించారు. ఈ సందర్భంగా అమెరికా ట్రావెల్ అడ్వైజరీపై సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఒమర్ అబ్దుల్లాతో జరిగిన సమావేశంపై గోర్ మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్ భారత్లోని ముఖ్యమైన భాగం. నేను తొలిసారి ఇక్కడికి వచ్చాను. ఇది అద్భుతమైన అందమైన ప్రాంతం మా సమావేశం ఎంతో స్నేహపూర్వకంగా జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని తెలిపారు. గోర్తో జరిగిన భేటీపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. అమెరికా-భారత్ సంబంధాలపై, ముఖ్యంగా జమ్మూకశ్మీర్కు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ‘‘మాకు చాలా మంచి సమావేశం జరిగింది. ఇరు దేశాల సంబంధాలపై చర్చించే అవకాశం లభించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్కు అమెరికా ఏ విధంగా సహకరించగలదనే అంశంపై మాట్లాడాం. కొన్ని పాత సమస్యలు ఉన్నాయి. వాటిని కాలక్రమంలో పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.వాషింగ్టన్, న్యూఢిల్లీ, శ్రీనగర్ మధ్య ఈ చర్చలు కొనసాగుతాయని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ‘‘అమెరికా, జమ్మూకశ్మీర్ మధ్య సంబంధాలు రాబోయే సంవత్సరాల్లో మరింత విస్తరించి, బలోపేతం అవుతాయని మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం’’ అని తెలిపారు.అమెరికా ట్రావెల్ అడ్వైజరీపై కీలక వ్యాఖ్యలుగోర్ పర్యటనలో అత్యంత కీలకమైన అంశాల్లో అమెరికా జారీ చేసిన జమ్మూకశ్మీర్ ప్రయాణ హెచ్చరిక సైతం ఒకటి. అమెరికా తన పౌరులకు జారీ చేసే ట్రావెల్ అడ్వైజరీలను క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని గోర్ తెలిపారు. జమ్మూకశ్మీర్కు సంబంధించిన ప్రస్తుత ప్రయాణ హెచ్చరికను కూడా పునఃపరిశీలించే అవకాశం ఉందని ఆయన సూచించారు.కాశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రశంసించిన గోర్.. ట్రావెల్ అడ్వైజరీని మార్చడంపై తాను ప్రస్తుతం ఎలాంటి ‘‘పెద్ద ప్రకటన’’ చేయలేనని స్పష్టం చేశారు. అయితే దానిని తగ్గించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలించవచ్చని చెప్పారు.‘‘ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా మార్చేందుకు న్యూఢిల్లీ, ఇక్కడి ముఖ్యమంత్రి, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కొన్ని అద్భుతమైన చర్యలు తీసుకున్నాయని మేము భావిస్తున్నాం. అందువల్ల అమెరికా తన పౌరులకు జారీ చేసిన ప్రయాణ హెచ్చరికను తగ్గించాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని మేము పరిశీలిస్తాం’’ అని గోర్ తెలిపారు.‘‘ఇది ఎంతో అందమైన ప్రాంతం. చాలా మంది అమెరికన్లు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత అందాలను ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.ప్రస్తుతం అమెరికా ట్రావెల్ అడ్వైజరీలో ఎలాంటి మార్పును అధికారికంగా ప్రకటించలేదు. అయితే గోర్ వ్యాఖ్యలు మాత్రం ఈ అంశాన్ని వాషింగ్టన్ పరిశీలిస్తున్నట్లు సూచిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రయాణ హెచ్చరికను సడలిస్తే కాశ్మీర్ పర్యాటక రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.గతంలోనూ అమెరికా దౌత్యవేత్తలు జమ్మూకశ్మీర్ను సందర్శించారు. ముఖ్యంగా 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయపరమైన కార్యక్రమాల సందర్భంగా అమెరికా దౌత్యవర్గాలు ఈ ప్రాంతంలో పర్యటించాయి. అయితే గోర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జమ్మూకశ్మీర్ను ‘‘భారత్లో ముఖ్యమైన భాగం’’గా ఆయన పేర్కొనడం, అదే సమయంలో అమెరికా ట్రావెల్ అడ్వైజరీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం న్యూఢిల్లీతో పాటు శ్రీనగర్లోనూ చర్చనీయాంశంగా మారింది.ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్మూకశ్మీర్లో గోర్ పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన అమెరికా రాయబారిగా మాత్రమే కాకుండా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయంగా వ్యూహాత్మక పరిణామాలు వేగంగా మారుతున్న సమయంలో అమెరికా నుంచి జమ్మూకశ్మీర్కు ఉన్నతస్థాయి దౌత్యపరమైన పర్యటన జరగడం ప్రాధాన్యంగా మారింది.గతంలో పలుమార్లు వివాదాస్పదంగాకాగా గతంలో పలుమార్లు అమెరికా జమ్ముకశ్మీర్ విషయంలో వివాదాస్పదంగా వ్యాఖ్యానించింది. 2003లో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారిక మార్గదర్శకాల్లో కశ్మీర్ ప్రాంతం భారత్, పాకిస్థాన్, చైనా ఆధీనంలోని ప్రాంతాలతో కూడిన “disputed region” అని పేర్కొంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా అమెరికా తన విధానంలో ఎలాంటి మార్పు లేదని, భారత్, పాకిస్థాన్ కశ్మీర్పై నేరుగా చర్చించుకోవాలని చెప్పింది. 2021లోనూ బైడెన్ ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తూ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈనేపథ్యంలో ప్రస్తుతం సెర్గియో గోర్ ఈవిధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
ముందుచూపే ఇరాన్ను బతికించిందా?.. ఇక మీదట ఎలా?
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతులపై ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్పై మరిన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఇరాన్ ప్రభుత్వం.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? ఇక మీదట ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇరాన్పై అమెరికా ఇప్పటికే విస్తృతమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ఇరాన్కు చెందిన వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాను మరింత విస్తరించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు వ్యాపారానికి సహకరిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకు చైనా ప్రధాన కొనుగోలుదారు. దీంతో అక్కడి చిన్న రిఫైనరీలపై అమెరికా ఇప్పటికే ద్వితీయ ఆంక్షలు విధించింది. ఇరాన్తో లావాదేవీలు నిర్వహించే పెద్ద చైనా బ్యాంకులపైనా చర్యలు తీసుకునే అవకాశముందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ చమురు ఆదాయానికి మరింత గండి పడటమే కాకుండా అమెరికా–చైనా సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.హర్ముజ్ మూసుకుపోతే..ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మరో కీలక సమస్య హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో యుద్ధానికి ముందు దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ఇప్పుడు యుద్ధం, దిగ్బంధనం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇరాన్కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్కూ ఆందోళన మొదలైంది.అయితే హర్ముజ్ను తెరిచే విషయంలో ఇరాన్ కూడా తన షరతులను స్పష్టం చేస్తోంది. అమెరికా దిగ్బంధనం ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, చమురు ఆంక్షలు తొలగించడం, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి హామీలు లభించే వరకు జలసంధిని తెరవబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు.సముద్ర మార్గం దెబ్బతింటే..హర్ముజ్ సంక్షోభం సుదీర్ఘమైతే దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇరాన్ ముందుగానే గుర్తించింది. సముద్ర మార్గాల్లో సరుకుల రవాణా దెబ్బతిన్నా దేశంలో ఆహారం, వినియోగ వస్తువులు, పారిశ్రామిక ముడిసరుకుల కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది. పాకిస్థాన్, టర్కియే తదితర దేశాలతో ఉన్న భూ సరిహద్దుల ద్వారా సరుకులను దిగుమతి చేసుకుంటోంది. కాస్పియన్ సముద్రం మీదుగా రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి సరుకులను తీసుకొచ్చే మార్గాలపైనా దృష్టి పెట్టింది.యుద్ధానికి ముందే సరిహద్దు ప్రావిన్సులకు కొన్ని అధికారాలు అప్పగించి అత్యవసర వస్తువుల నిల్వలను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ ముందస్తు నిల్వలే సంక్షోభ సమయంలో ఇరాన్కు కొంత ఊరటనిస్తున్నాయి.చమురు ఆదాయం తగ్గితే..అయితే ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు ఉన్నప్పటికీ ఇరాన్కు అసలు సమస్య ఆదాయమే. దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం, ఆంక్షలు, రవాణా సమస్యల కారణంగా చమురు ఎగుమతులు దెబ్బతింటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. అదే సమయంలో యుద్ధంతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అదనపు ఖర్చులు అవసరమవుతాయి.ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. చమురు ఆదాయం మరింత పడిపోతే ఈ భారమంతా సామాన్య ప్రజలపై పడే ప్రమాదం ఉంది.ఇంధన కొరత ముంచుకొస్తుందా?చమురు ఎగుమతుల సమస్యకు తోడు ఇరాన్కు ఇంధన సరఫరా కూడా సవాలుగా మారుతోంది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వ్యవస్థలు యుద్ధానికి ముందే ఒత్తిడిలో ఉన్నాయి. దిగ్బంధనం మరింతకాలం కొనసాగితే ఈ రంగాల్లో సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉంది.శరదృతువు, చలికాలం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంధనం, విద్యుత్, గ్యాస్ కొరత ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా తగ్గించి.. గృహ అవసరాలకు సరఫరాను కాపాడాల్సిన పరిస్థితి రావచ్చని వియన్నా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ స్టడీస్కు చెందిన ఆర్థికవేత్త మహ్దీ ఘోద్సీ పేర్కొన్నారు.ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే సబ్సిడీ పెట్రోల్ కోటాలను తగ్గించింది. ఇంధన ధరలు పెంచే అంశాన్నీ పరిశీలిస్తోంది.యుద్ధానికి ముందే బలహీనంగా..ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత యుద్ధమే కారణం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒంటరితనం, దేశీయ అవినీతి, పాలనా వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. ఇప్పుడు వీటికి యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతుల అంతరాయం తోడయ్యాయి.అంటే ఇరాన్ ప్రస్తుతం ఒకేసారి రెండు యుద్ధాలు చేస్తోంది. బయట సైనిక పోరాటం కొనసాగుతుండగా.. లోపల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకునే పోరాటం సాగుతోంది.పెజెష్కియాన్ ప్రభుత్వం ఏం చేస్తోంది?ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం వచ్చే రెండేళ్లకు ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మార్కెట్లను స్థిరీకరించడం, ప్రజల జీవనోపాధిని రక్షించడం, దేశ ఆర్థిక స్థైర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. అయితే అత్యవసర చర్యలు కొంతకాలం మాత్రమే ఉపశమనం కల్పించగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు దేశీయంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.ఇక ముందు ఎలా?ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో రాజీకి వచ్చి ఆంక్షలు, దిగ్బంధనం నుంచి ఉపశమనం పొందడం ఒకటి. ఒత్తిడికి తలొగ్గకుండా సైనిక, ఆర్థిక ప్రతిఘటనను కొనసాగించడం రెండోది. ఇరాన్ ఇప్పటివరకు రెండో మార్గానికే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అయితే యుద్ధం, హర్ముజ్ సంక్షోభం, చమురు ఎగుమతుల అంతరాయం మరింతకాలం కొనసాగితే ఇరాన్ ముందస్తు ఏర్పాట్లకు కూడా పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, అత్యవసర నిల్వలు కొంతకాలం దేశాన్ని ఆదుకోగలిగినా.. చమురు ఆదాయం లేకుండా దీర్ఘకాలం ఆర్థిక వ్యవస్థను నడపడం మాత్రం కష్టమే.అదే సమయంలో హర్ముజ్ జలసంధి సంక్షోభం ఇరాన్ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయంగా ధరలు పెరగవచ్చు. ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది. -
ట్రంప్-కిమ్ స్నేహం.. విన్యాసాలకు ముందే ముగింపు
దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్’ (UFS) సంయుక్త సైనిక విన్యాసాలను వారం రోజుల ముందుగానే ముగించాలని యుఎస్ నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని పెంటగాన్ను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ కొరియా సైన్యం బుధవారం వెల్లడించింది. కాగా ట్రంప్ సైతం దీనిపై ప్రకటన చేశారు. ఈ విన్యాసాలు “అనుచితమైనవి, శత్రుత్వపూరితమైనవి” అంటూ వాటిని తగ్గించాలని అమెరికా రక్షణ శాఖను ఆదేశించారు.ఉత్తర కొరియా ఒకవేళ తమ దేశాలపై దాడి చేస్తే వాటిని ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా భాగంగా అమెరికా, దక్షిణ కొరియా ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తాయి. అయితే ఉత్తర కొరియా వీటిని చాలాకాలంగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమపై దాడికి దక్షిణ కొరియా, అమెరికాలు చేస్తున్న సన్నాహక చర్యలుగా ప్యాంగ్యాంగ్ వీటిని అభివర్ణిస్తోంది. తనకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో మంచి సంబంధాలు ఉన్నాయని, కిమ్ తన పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరకొరియాను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపించే సైనిక విన్యాసాలు నిర్వహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో ఉల్చి ఫ్రీడం షీల్డ్ విన్యాసాల వ్యవధిని దక్షిణ కొరియా సైన్యం కుదించింది. మొదట ఈ విన్యాసాలను ఆగస్టు 17 నుంచి ఆగస్టు 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు వీటిని ఆగస్టు 17 నుంచి 21 వరకు జరపాలని నిర్ణయించారు. అంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సైనిక విన్యాసాలు ముగియనున్నాయి.ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధికారిక మీడియా బుధవారం ఈ సైనిక విన్యాసాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అయితే ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని ఆదేశించిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఆధీనంలోని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ సైనిక విన్యాసాలను ఉత్తర కొరియాకు “అత్యంత తక్షణమైన, బహిరంగ ముప్పు”గా పేర్కొంది. ఇవి ఉత్తర కొరియాకు మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతీయ భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని ఆరోపించింది.ఉత్తర కొరియా చాలాకాలంగా అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవి తమ దేశంపై దాడి చేయడానికి నిర్వహించే “దాడి రిహార్సల్స్” అని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ సైనిక విన్యాసాలకు ఉత్తర కొరియాపై దాడి చేయాలన్న ఉద్దేశం లేదని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. ఈ విన్యాసాలు ఉత్తర కొరియాపై దాడి చేయాలన్న ఉద్దేశాన్ని లేదా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబించవని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం మంగళవారం తెలిపింది.1950–53 మధ్య జరిగిన కొరియా యుద్ధం అనంతరం అమెరికా దక్షిణ కొరియాకు భద్రతా పరంగా మద్దతు ఇస్తోంది. ఆ యుద్ధం పూర్తిస్థాయి శాంతి ఒప్పందంతో కాకుండా కాల్పుల విరమణ ఒప్పందంతోనే ముగిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో సుమారు 28,500 మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వీరు దక్షిణ కొరియాకు మద్దతుగా ఉన్నారు. అయితే అమెరికా సాంప్రదాయ మిత్రదేశాలతో ఉన్న భద్రతా ఒప్పందాలను ట్రంప్ పదేపదే ప్రశ్నించడం తూర్పు ఆసియాలో అమెరికా భద్రతా హామీలపై అనుమానాలకు కారణమవుతోంది. -
అమెరికా కాంగ్రెస్ పోరులో భారత సంతతి విద్యావేత్త రికార్డు!
వాషింగ్టన్: ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ డెమొక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన విద్యావేత్త పియా దాండియా ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ప్రైమరీ పోరులో న్యాయవాది కేసియా ఎర్లీని ఓడించి ఆమె డెమొక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, వ్యాపారవేత్త, మెరైన్ వెటరన్ అయిన కేసీ అస్కార్తో ఆమె తలపడనున్నారు. ఈ విజయం అనంతరం పియా దాండియా మాట్లాడుతూ.. ‘నా స్వరాష్ట్రమైన ఫ్లోరిడాలో యూఎస్ కాంగ్రెస్కు డెమొక్రాటిక్ నామినీగా నిలవడం చాలా గౌరవంగా ఉంది. శ్రామిక కుటుంబాల పక్షాన పోరాడేందుకు మా ప్రచారం తదుపరి దశలోకి ప్రవేశించింది’ అని అన్నారు. Here's my story. It is my dream to build a campaign worthy of my home state. Let's do better - together 🇺🇸#piaforcongress pic.twitter.com/ETHZYl857n— Pia Dandiya (@PiaforCongress) May 29, 2026ఎవరీ పియా దాండియా?పామ్ బీచ్ కౌంటీలో జన్మించిన పియా దండియా తొలి తరం అమెరికన్. ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, 28 ఏళ్ల వయస్సులోనే హార్లెమ్లో హైస్కూల్ను స్థాపించి దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రిన్సిపాల్స్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అనంతరం డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్, విద్యా శాఖల్లో వైట్ హౌస్ ఫెలోగా విధులు నిర్వర్తించారు. ఆపిల్ సంస్థలో విద్య, వైద్య సంబంధిత ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పనిచేశారు. కాంగ్రెస్కు ఎన్నికైతే ఫ్లోరిడా నుంచి యూఎస్ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించిన తొలి దక్షిణాసియా అమెరికన్గా రికార్డు సృష్టించినవారవుతారు.నియోజకవర్గ సమీకరణలుపునర్విభజన జరిగిన 22వ డిస్ట్రిక్ట్ బ్రొవార్డ్.. పామ్ బీచ్, హెండ్రీ, కొల్లియర్ కౌంటీలను కలుపుకుని విస్తరించింది. నిత్యావసరాల ధరల తగ్గింపు, పబ్లిక్ స్కూళ్ల బలోపేతం, వృత్తి విద్యా శిక్షణ, సోషల్ సెక్యూరిటీ రక్షణ ప్రధాన అజెండాగా ఆమె ప్రచారం సాగుతోంది. ఈ స్థానం ఫలితం యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఆధిపత్యాన్ని నిర్దేశించే కీలక పోరుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆఫ్రికాలో కూలిన బంగారు గని.. 30 మంది దుర్మరణం -
హర్ముజ్లో ఒక్కసారిగా మారిన సీన్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమదే పైచేయి అని ఇరాన్ చెప్పుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి తమ భూభాగంలోకే వస్తుందంటూ మ్యాప్ రిలీజ్ చేశారు. అయితే.. తాజా షిప్పింగ్ గణాంకాలు మాత్రం ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తోంది.గత రెండు వారాల్లో హర్ముజ్ గుండా ప్రయాణించిన నౌకల్లో అత్యధిక శాతం ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకున్నాయి. దీంతో హర్ముజ్పై ఇరాన్ గతంలో ఉన్నంత స్థాయిలో నియంత్రణ కొనసాగించడం కష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా నౌకాదళ బలగాల ఉనికి, ఇరాన్ నౌకలపై దాడుల భయం, చమురు రవాణా మార్గాల్లో మార్పులు.. ఈ జలసంధిలో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.షిప్పింగ్ డేటా సంస్థ కేప్లర్ గణాంకాల ప్రకారం.. గత రెండు వారాల్లో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఉపయోగించాయి. ఈ మార్గాన్ని ఐక్యరాజ్యసమితి అనుమతించినప్పటికీ.. ఇరాన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నెల రోజుల క్రితం వరకు ఈ మార్గంలో దాదాపు ఎలాంటి నౌకా రాకపోకలు లేవని కేప్లర్ తెలిపింది. ఇప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు ఇరాన్ అభ్యంతరాలను పక్కనబెట్టి ఒమన్ వైపు నుంచి ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ ఉత్తర ఒమన్ తీరానికి సమీపంలోని మార్గాలను ఉపయోగించే నౌకలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. అమెరికా నౌకాదళ రక్షణపై ఆధారపడుతూ కొన్ని నౌకలు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.కేప్లర్ క్రూడ్ ఆయిల్ విశ్లేషణ విభాగం అధిపతి హోమయూన్ ఫలక్షాహీ స్పందిస్తూ.. హర్ముజ్పై ఇరాన్ కొంతవరకు నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోంది అని అంటున్నారు.ఇరాన్ టోల్ వసూళ్లకూ బ్రేక్!హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి రవాణా రుసుములు వసూలు చేయాలని ఇరాన్ గతంలో ప్రయత్నించింది. అయితే నౌకలు ఇరాన్ ప్రాధాన్యమిస్తున్న మార్గాన్ని కాకుండా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకోవడంతో ఆ ప్రయత్నాలను అమలు చేయడం కష్టంగా మారింది. ఇరాన్ టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలు అంగీకరించడం లేదని పికరింగ్ ఎనర్జీ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు డాన్ పికరింగ్ పేర్కొన్నారు.అంటే.. నౌకల రాకపోకలను బెదిరించడం మాత్రమే కాకుండా వాటి నుంచి తన నిబంధనల ప్రకారం రుసుములు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రయత్నానికీ ఇప్పుడు పరిమితులు ఏర్పడుతున్నాయి.చమురు ట్యాంకర్లలో ‘డార్క్ ట్రాఫిక్’హర్ముజ్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు చమురు రవాణాలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలు వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్సీసీ)ను ఉపయోగించి పెర్షియన్ గల్ఫ్ నుంచి హర్ముజ్ మీదుగా చమురును తరలిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇతర ట్యాంకర్లకు చమురును బదిలీ చేస్తున్నట్లు సమాచారం.ఇరాన్ దాడుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని ట్యాంకర్లు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేస్తున్నాయి. కొన్ని నౌకలు వారాలపాటు తమ గుర్తింపు సంకేతాలను నిలిపివేస్తున్నాయి. దీంతో సాధారణ షిప్పింగ్ ట్రాకింగ్ వ్యవస్థలకు అవి కనిపించకుండా పోతున్నాయి. ఈ విధానాన్ని ‘డార్క్ ట్రాఫిక్’గా వ్యవహరిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలతో కొన్ని నౌకలను గుర్తించగలిగినా.. వాటి కదలికలను పూర్తిస్థాయిలో అంచనా వేయడం కష్టమవుతోంది.ట్రంప్.. అదే మాటమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హర్ముజ్పై అమెరికాదే పైచేయి అని స్పష్టం చేస్తున్నారు. అమెరికా నౌకాదళ బలగాలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హర్ముజ్పై తమకు పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు.మంగళవారం మరింత దూకుడుగా స్పందించిన ఆయన.. హర్ముజ్ను అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు.. జలసంధి మ్యాప్ను షేర్ చేస్తూ దానిని ‘కొత్త అమెరికా భూభాగం’గా అభివర్ణించారు. అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ స్పందిస్తూ.. హర్ముజ్ గుండా వెళ్తున్న చమురు, హర్ముజ్ను తప్పించి ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్న చమురు కలిపి ఒక వారంలో రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్లకు చేరుకుంది.యుద్ధానికి ముందు హర్ముజ్ ప్రాంతం గుండా రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగేది. ప్రస్తుత ప్రవాహం దానికి దగ్గరగా ఉండటాన్ని చూపిస్తూ.. ఇరాన్ హర్ముజ్ను పూర్తిగా మూసివేయడంలో విఫలమైందని అమెరికా వాదిస్తోంది.అరాఘ్చీ కౌంటర్ఇరాన్–అమెరికా మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రంగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, ప్రస్తుతం ఎలాంటి చర్చలు షెడ్యూల్ కాలేదని చెప్పారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతోందని, హర్ముజ్లోని సముద్రపు గనులను తొలగించినట్లు కూడా ఆయన ప్రకటించారు. దీనికి భిన్నంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోవడంతో ఇప్పుడు ఇరాన్ షరతులపై చర్చలు జరపాలని ‘వేడుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు.ఇరాన్–యూఏఈ మధ్యా ఉద్రిక్తత!హర్ముజ్ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్–యూఏఈ మధ్య కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. వాటిలో ఒక క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల్లో పడిందని.. మరో క్షిపణి ఆ జలాలకు వెలుపల సముద్రంలో పడిందని తెలిపింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. అవి నిరాధార ఆరోపణలని.. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసి ప్రాంతీయ నమ్మకాన్ని బలహీనపరుస్తాయని అన్నారు.మరోవైపు.. ఇరాన్తో వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలన్నింటినీ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.చమురు ధరలపై ప్రభావంహర్ముజ్ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్పైనా ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 59 సెంట్లు లేదా 0.7 శాతం పెరిగి బ్యారెల్కు 91.46 డాలర్లకు చేరాయి. మూడు వారాల తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చేరడం గమనార్హం. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర 75 సెంట్లు లేదా 0.9 శాతం పెరిగి 85.25 డాలర్లకు చేరింది. హర్ముజ్ మీదుగా చమురు రవాణాకు అంతరాయం కొనసాగితే.. సరఫరా భయాలు మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.ఇరాన్–ఒమన్ చర్చలపై ఆశలుహర్ముజ్లో నౌకాయానాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలకు జలసంధి తీర ప్రాంతాలు ఉండటంతో స్వేచ్ఛాయుత నౌకాయానంపై ఒక ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ఈ చర్చలు జరగడం ట్రంప్కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది.ఇరాన్–ఒమన్ మధ్య హర్ముజ్ రవాణా ఒప్పందం కుదిరిన తర్వాతే అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలను పునఃప్రారంభించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగశాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ తెలిపారు.‘షరతులు నెరవేర్చే వరకు క్లోజ్’ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మాత్రం తమ వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను అమెరికా నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో హర్ముజ్ కేవలం నౌకాయాన సమస్యగా కాకుండా.. ఇరాన్–అమెరికా మధ్య రాజకీయ, సైనిక, ఆర్థిక పోరాటానికి ప్రధాన వేదికగా మారింది.ఎవరి పట్టు ఎంత?ఇరాన్ దాడుల ముప్పుతో కొన్ని వాణిజ్య నౌకలు తమ కదలికలను గుర్తించే ట్రాన్స్పాండర్లను ఆపేస్తున్నాయి. మరికొన్ని నౌకలు ప్రమాదకర మార్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అదీ అమెరికా రక్షణ నడుమ. అయితే 80 శాతానికి పైగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఎంచుకోవడం మాత్రం హర్ముజ్పై ఇరాన్ సంప్రదాయ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారింది. అదే సమయంలో చమురు రవాణా యుద్ధానికి ముందు స్థాయికి ఇంకా చేరుకోకపోవడం అమెరికా పూర్తి నియంత్రణ వాదనకూ పరిమితులు ఉన్నాయని చెబుతోంది. అందుకే ప్రస్తుతం హర్ముజ్లో కనిపిస్తున్నది ఒకరి సంపూర్ణ విజయం కాదనేది విశ్లేషకుల మాట. -
ట్రంప్ రేటింగ్ ఢమాల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజా ఆమోద రేటింగ్ 33 శాతానికి పడిపోయింది. ఇది ఆయన ప్రస్తుత పదవీకాలంలో అత్యంత కనిష్ట స్థాయి. వలస విధానాలు, వాణిజ్య పరమైన సుంకాల ప్రభావం కూడా ఆయన రేటింగ్ పడిపోవడానికి కారణమయ్యాయి. కేవలం 33 శాతం మంది మాత్రమే ట్రంప్ పనితీరును ఆమోదించారు. ఇది ఆయన మొదటి పదవీకాలంలో, డిసెంబర్ 2017లో నమోదైన అత్యల్ప స్థాయికి సమానం. 2025లో దేశంలో దాదాపు సగం మంది అధ్యక్ష పదవికి ఆమోదం తెలిపారు. అయితే, ఇటీవల నాలుగు రోజుల పాటు నిర్వహించిన పోల్లో, 64 శాతం మంది అమెరికన్లు ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. ఆర్థిక విధానాలు.. వలసలు.. పెరుగుతున్న ధరలు, నిత్యావసరాల భారం, ద్రవ్యోల్బణం నియంత్రణలో ప్రభుత్వం విఫలమవ్వటం వలన ఆర్థిక విధానాల్లో ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహించగలరనడంలో ఓటర్లు అధికార రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడైంది. డెమొక్రాట్లే ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తారని 38 శాతం మంది భావిస్తుండగా, 35 శాతం మంది రిపబ్లికన్ల విధానాన్ని ఇష్టపడుతున్నారు. వలసల విషయంలో డెమొక్రాట్ల విధానం కంటే రిపబ్లికన్ల విధానానికే ఒకింత ఎక్కువ ప్రజాదరణ లభించింది. అయితే, ప్రాణాంతక ఘర్షణలు, పిల్లలతో సహా నిర్బంధంలో ఉన్నవారి సంఖ్య పెరగడంతో రిపబ్లికన్లు తమ పట్టును కోల్పోతున్నారు. వలస విధానంపై రిపబ్లికన్ల విధానమే మెరుగైనదని సుమారు 40 శాతం అంటుండగా.. 38 శాతం మంది డెమొక్రాట్లను ఎంచుకున్నారు. ఈ 2 శాతం పాయింట్ల వ్యత్యాసం ట్రంప్ పదవీకాలంలోనే అత్యల్పం. వీటికి తోడు అమెరికా–ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్తో కొనసాగుతున్న దీర్ఘకాలిక యుద్ధంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి ఐదుగురు అమెరికన్లలో ఒకరు, రిపబ్లికన్లలో సగం మంది మాత్రమే ఈ యుద్ధం విలువైనదని భావిస్తున్నారని పోల్ వెల్లడించింది. -
‘హర్మూజ్ జలసంధి మాదే’.. మ్యాప్ విడుదల చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గం హర్మూజ్ జలసంధి కొత్త అమెరికా భూభాగంగా పేర్కొంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఏఐ జనరేటెడ్ మ్యాప్ ఫొటోను పోస్ట్ చేశారు. ఇరాన్తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్ జలసంధి తమదేనని, అది తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ మాట్లాడుతూ.. హర్మూజ్ ‘ఇరాన్దే, ఇరాన్దిగానే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ను తిరిగి తెరవడం అమెరికా,ఇరాన్ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకాదళ చర్యలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా.. అమెరికా మాత్రం జలసంధి స్వేచ్ఛగా తెరవాలని ఒత్తిడి చేస్తోంది. ఇరువైపులా రాజీ కుదరకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చర్చలు ఎందుకు విఫలమవుతున్నాయి?అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల అవగాహన గడువు ఆగస్టు 17న ముగిసింది. అయితే, కీలక అంశాలపై పురోగతి లేకపోవడంతో ఆ ఒప్పందాన్ని పొడిగించబోమని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. హర్మూజ్ను తెరవడం,ఇరాన్పై అమెరికా ఆంక్షలు, అమెరికా నౌకాదళ చర్యలు, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా తన సైనిక ఒత్తిడిని తగ్గించి ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా మాత్రం ఇరాన్పై ఒత్తిడిని కొనసాగిస్తూ హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరవాలని కోరుతోంది.ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావంహర్మూజ్ జలసంధి మూసివేత లేదా రవాణాపై పరిమితులు కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ఉద్రిక్తతల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా చమురు ధరలు, రవాణా వ్యయాలు, బీమా ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. -
27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ!
అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్కార్డ్) ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతేకాదు.. ఆమెపై గతంలో కొనసాగిన డిపోర్టేషన్ కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఇప్పటికే కొట్టివేసినప్పటికీ ఈ అరెస్టు జరగడం చర్చనీయాంశంగా మారింది.వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే మహిళను ఆగస్టు 11న సాధారణ చెక్-ఇన్కు హాజరైన సమయంలో ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచినట్లు సమాచారం. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ (LPR) హోదా ఉంది.క్రిమినల్ రికార్డ్ లేదు..వాసంశెట్టి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ఆమె పనిచేసినట్లు ఆమె కుటుంబ న్యాయవాది వెల్లడించారు. ఆమెకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇద్దరు అమెరికా పౌరులైన పిల్లలు, ఇద్దరు అమెరికా పౌరులైన మనవళ్లు ఉన్నారని తెలిపారు.ఆమె ఇల్లు, ఉద్యోగం, కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉన్నాయని.. గ్రీన్కార్డ్ను వదులుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు.ఏడు నెలలు భారత్లో ఉన్నందుకేనా?వాసంశెట్టి 2022 జూలైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆమెకు కోవిడ్ సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని న్యాయవాదులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో దాదాపు రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. దీంతో ఆమె అమెరికాకు తిరిగి రావడం ఆలస్యమైంది. చివరకు 2023 ఫిబ్రవరిలో రాలీ-డర్హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అమెరికాకు చేరుకున్నారు. మొత్తం మీద ఆమె సుమారు ఏడు నెలలు భారత్లో ఉన్నారు. అయితే.. ఈ వ్యవధినే అమెరికా ప్రభుత్వం ఆమె గ్రీన్కార్డ్ హోదాను ప్రశ్నించడానికి ప్రధాన కారణంగా చూపినట్లు సమాచారం. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం వల్ల శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించవచ్చు.‘అమెరికాను వదిలే ఉద్దేశమే లేదు’అయితే వాసంశెట్టి మాత్రం అమెరికాలో తన జీవితాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించారు. భారత్కు వెళ్లిన సమయంలోనూ అమెరికాలో తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు వంటి సంబంధాలను కొనసాగించారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. భారత్లో ఉన్న సమయంలోనే నార్త్ కరోలినాలో తన ప్రధాన నివాసంగా ఉపయోగించుకునే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రుల అనారోగ్యం, తన ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన తాత్కాలిక ప్రయాణాన్ని అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే నిర్ణయంగా చూడలేమని వాదించారు.కోర్టు కేసు కొట్టేసినా.. మళ్లీ అరెస్టువాసంశెట్టిపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) డిపోర్టేషన్ చర్యలు ప్రారంభించింది. అయితే కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు కోర్టు విధించిన గడువులో DHS విఫలమైందని ఆమె న్యాయవాది తెలిపారు. దీంతో 2026 మే 19న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఆమెపై కొనసాగుతున్న డిపోర్టేషన్ ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత కూడా ఆమెకు విధించిన ICE చెక్-ఇన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. అలా ఆగస్టు 11న చెక్-ఇన్కు వెళ్లిన సమయంలోనే ICE అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.‘ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదు’వాసంశెట్టిని అదుపులోకి తీసుకున్న తర్వాత ICE మాత్రం ఆమె గ్రీన్కార్డ్ హోల్డర్ కాదని వాదిస్తున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆగస్టు 13న ఆమె తరఫు న్యాయ బృందం అత్యవసర హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఫెడరల్ న్యాయమూర్తి.. ఆమెను నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన ఆధారాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.తర్వాత ఏం జరగొచ్చు?తాజా కోర్టు పరిణామాల ప్రకారం.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశం వెలువడలేదు. అయితే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, వాసంశెట్టికి బెయిల్పై విడుదల కావచ్చా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట బాండ్ హియరింగ్ జరిగే అవకాశం ఉంది.27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ.. గ్రీన్కార్డ్ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఓ భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు అమెరికాలోనే కాకుండా భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువకాలం ఉండటం వల్ల గ్రీన్కార్డ్ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. -
భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు
-
ఇక ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్ మునుపటిలా ఉండవు!
సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు, రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా. ఏం జరిగింది?2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్ఫామ్లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు.. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి.నేటి నుంచే కీలక విచారణమెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు 6–8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రాలు మెటా యువతను ఎక్కువసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉండేలా డిజైన్ చేసిందని ఆరోపిస్తున్నాయి. దీంతో.. తీర్పు ఎలా రానుందా? అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.మెటా ఓడితే ఏం మారొచ్చు?ఈ కేసులో రాష్ట్రాలు కేవలం డబ్బు జరిమానా మాత్రమే కోరడం లేదు. పిల్లలు, టీనేజర్ల కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పనిచేసే విధానాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.అందులో ముఖ్యమైనవి..టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ తప్పనిసరి చేయడం.పిల్లలు, టీనేజర్లు అనేక ఖాతాలు సృష్టించకుండా నియంత్రణలు విధించడం.యువ వినియోగదారులకు కనిపించే లైక్ కౌంట్లను తొలగించడం.ఒక కంటెంట్ తర్వాత మరొకటి నిరంతరం చూపించే ఇన్ఫినిట్ స్క్రోల్ను నిలిపివేయడం.టీనేజర్లను ఎక్కువసేపు యాప్లో ఉంచేలా పనిచేస్తున్న రికమెండేషన్ అల్గారిథమ్లలో మార్పులు చేయడం.ముఖం, శరీర రూపాన్ని మార్చే కొన్ని ఇమేజ్ ఫిల్టర్లను తొలగించడం.వీడియోలు ఆటోమేటిక్గా ప్లే అయ్యే ఆటోప్లే ఫీచర్ను నిలిపివేయడం.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వంటి తాత్కాలికంగా కనిపించి మాయమయ్యే పోస్టులను పరిమితం చేయడం. ఇవన్నీ చూస్తే.. ఈ కేసు, మెటాకు రాబోయే తీర్పు ఎంతో కీలకమని స్పష్టమవుతోంది. వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ప్రాథమిక వినియోగ అనుభవమే మారిపోయే అవకాశం ఉంది.పిల్లలను ‘యూజర్లు’గా మార్చడమే లక్ష్యమా?ఇదే ఈ కేసులో ప్రధాన ఆరోపణ. పిల్లలు, టీనేజర్లు ప్లాట్ఫామ్లలో ఎక్కువసేపు ఉండేలా మెటా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫీచర్లను రూపొందించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఒక వీడియో పూర్తయిన వెంటనే మరొకటి మొదలవడం, స్క్రోల్ చేస్తూనే కొత్త కంటెంట్ రావడం, తరచూ నోటిఫికేషన్లు రావడం వంటి అంశాలు వినియోగదారులను మళ్లీ మళ్లీ యాప్లోకి తీసుకువస్తాయని వాటి వాదన. అంటే.. యూజర్ యాప్ను ఉపయోగిస్తున్నాడా? లేక యాప్ యూజర్ను ఉపయోగిస్తోందా? అనే పెద్ద ప్రశ్న ఈ కేసులో ముందుకు వస్తోంది.లైక్ బటనే కీలకం?సోషల్ మీడియాలో లైక్ అనేది సాధారణంగా కనిపించే చిన్న సంఖ్య. కానీ పిల్లలు, టీనేజర్లపై దాని ప్రభావం పెద్దదిగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎంతమంది లైక్ చేశారు? ఇతరుల పోస్టులకు తన పోస్టుకు వచ్చిన స్పందన ఎంత? ఇతరులతో పోలిస్తే తాను ఎలా ఉన్నాను? అనే ఆలోచనలు యువతలో సామాజిక పోలికలకు దారితీయొచ్చని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో మెటా స్వయంగా నిర్వహించిన పరిశోధనల నుంచి కూడా రాష్ట్రాల న్యాయవాదులు ఆధారాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. లైక్ కౌంట్లు సోషల్ కంపారిజన్*కు దారితీస్తాయని, ఇన్స్టాగ్రామ్లో అలాంటి పోలికలు ఒంటరితనం, శరీర రూపంపై ప్రతికూల భావన, నెగెటివ్ మూడ్తో సంబంధం కలిగి ఉన్నాయని మెటా అంతర్గత పరిశోధనలు సూచించినట్లు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మెటా వాదన ఏంటి?అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండిస్తోంది. యువతకు మద్దతు ఇవ్వడంలో తమ సంస్థకు దీర్ఘకాలిక నిబద్ధత ఉందని, కేసులోని ఆధారాలు తమ వైఖరిని సమర్థిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే మరో రాష్ట్రంలో మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూ మెక్సికోలోని ఒక కేసులో మెటాపై 942 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు యువ వినియోగదారులకు సంబంధించిన పలు మార్పులు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ కౌంట్లను తొలగించడం, నగ్న చిత్రాలకు సంబంధించిన మెసేజింగ్ను నిరోధించడం, పుష్ నోటిఫికేషన్లను నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. మెటా ఆ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసు చాలా పెద్దదే!న్యూ మెక్సికో కేసు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ తాజా కేసులో 30 రాష్ట్రాలు కలిసి మెటాను ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అమెరికా జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందువల్ల మెటా ఈ కేసులో ఓడిపోతే.. తీర్పు ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అమెరికా అంతటా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పిల్లలు, టీనేజర్ల అనుభవాన్ని మార్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా భవిష్యత్తుపై ప్రభావం?ఈ కేసు మరో అసలు ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. పిల్లలను ఆకర్షించడానికి రూపొందించిన సోషల్ మీడియా ఫీచర్లకు ఎంతవరకు పరిమితులు ఉండాలి? కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే చిన్నారుల మానసిక ఆరోగ్యం, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలా? తల్లిదండ్రుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి?. మెటా ఓడితే.. లైక్ల సంఖ్య కనిపించని ఇన్స్టాగ్రామ్, నిరంతర స్క్రోల్ లేని ఫేస్బుక్, తల్లిదండ్రుల అనుమతి అవసరమయ్యే టీనేజర్ ఖాతాలు, పరిమితమైన నోటిఫికేషన్లు వంటి కొత్త సోషల్ మీడియా అనుభవం మొదలయ్యే అవకాశం ఉంది. -
‘భారత్ను చూడండి’.. ఓటర్ ఐడీపై అమెరికాకు ట్రంప్ క్లాస్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల సంస్కరణల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికాలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్న ఆయన.. ఈసారి తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపించారు. అమెరికా కాంగ్రెస్ సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act)ను ఆమోదించాల్సిందేనని పట్టుబడుతూ.. భారత్లో ఓటర్ల గుర్తింపు కోసం అమలవుతున్న విధానాన్ని ప్రశంసించారు.భారత్లో ఎన్నికల సమయంలో ఓటర్లు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రంతో ఓటు వేస్తున్న విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో తనకు జరిగిన సంభాషణను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘ఎన్నికల నిర్వహణపై భారత సీఈసీ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమెరికాలో తగిన గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికల నిర్వహణను ఆయన తప్పుబట్టారు. 2024లో సుమారు 60 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్లో ప్రతీ ఓటర్ దగ్గర గుర్తింపు కార్డు ఉంది’’ అని ట్రంప్ అన్నారు. భారత్లో ఓటర్ల గుర్తింపునకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఇలాంటి విధానం ఉండాల్సిన అవసరం ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో అర్హత కలిగిన పౌరులు మాత్రమే ఓటు వేసేలా పౌరసత్వాన్ని నిర్ధారించడంతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని ఆయన కోరుతున్నారు.SAVE America Act అంటే..ట్రంప్ మద్దతు ఇస్తున్న SAVE America Act ప్రధానంగా అమెరికా ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం అవసరమయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించారు.ఓటర్ల జాబితాల్లో పౌరసత్వ అర్హత లేని వ్యక్తులు ఉంటే వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను కూడా కఠినతరం చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. మెయిల్ ద్వారా ఓటింగ్పైనా పరిమితులు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. వైద్య కారణాలు, వైకల్యం, సైనిక సేవ, ప్రయాణం వంటి కొన్ని పరిస్థితులకు మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించారు. తక్షణమే ఈ బిల్లును ప్రతిపాదించాలని ట్రంప్ కోరుతున్నారు.‘పౌరులే ఓటు వేయాలి’అమెరికా ఎన్నికల్లో పౌరసత్వం లేని వ్యక్తులు ఓటు వేస్తున్నారన్న ఆరోపణలను ట్రంప్ చాలాకాలంగా ప్రస్తావిస్తున్నారు. **‘అమెరికా ఎన్నికల్లో ఓటు హక్కు అమెరికా పౌరులకే ఉండాలి’** అన్నది ఆయన ప్రధాన వాదన. అందుకే ఓటరు నమోదు దశలోనే పౌరసత్వాన్ని నిర్ధారించాలని కోరుతున్నారు. అయితే అందుబాటులో ఉన్న పరిశోధనలు, ఎన్నికల డేటా ప్రకారం పౌరేతరుల అక్రమ ఓటింగ్ చాలా అరుదైన ఘటన అని విశ్లేషణలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని ట్రంప్ ఎన్నికల సంస్కరణల చర్చలో కీలకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.భారత్నే ఎందుకు ఉదాహరణగా చూపించారు?భారత్లో ఎన్నికల సమయంలో ఓటర్ల గుర్తింపు కోసం ఫొటో ఓటర్ ఐడీతో పాటు ఎన్నికల సంఘం ఆమోదించిన ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగిస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉండటంతో పాటు పోలింగ్ కేంద్రంలో గుర్తింపు నిర్ధారణకు ఈ పత్రాలు కీలకంగా ఉంటాయి. ఈ విధానాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలు, ఓటరు నమోదు విధానాలు, చట్టపరమైన నిబంధనలు ఒకేలా ఉండవు. కాబట్టి భారత్లోని విధానాన్ని అమెరికాలో యథాతథంగా అమలు చేయడం సాధ్యమా? అనేది వేరే ప్రశ్న.అమెరికాలో రాజకీయ దుమారంSAVE America Actపై అమెరికాలో తీవ్ర రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్, రిపబ్లికన్లు ఈ బిల్లును ‘ఎన్నికల సమగ్రతను కాపాడే కీలక సంస్కరణ’గా అభివర్ణిస్తున్నారు. మరోవైపు డెమొక్రాట్లు, పౌరహక్కుల సంస్థలు మాత్రం అదనపు గుర్తింపు, పౌరసత్వ పత్రాలను తప్పనిసరి చేయడం వల్ల అర్హత ఉన్న కొంతమంది ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పాస్పోర్టు, జనన ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలను సమర్పించడం తప్పనిసరి అయితే.. వాటిని సులభంగా పొందలేని ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని విమర్శకులు చెబుతున్నారు.మధ్యంతర ఎన్నికల వేళ మళ్లీ చర్చ2026 అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల భద్రత, ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణ అంశాలు మరోసారి రాజకీయ చర్చలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ SAVE America Actపై తన ఒత్తిడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో భారత్ ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన ఉదాహరణగా చూపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్లో అమలవుతున్న గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానాన్ని ప్రశంసిస్తూ.. అమెరికాలోనూ ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణకు కఠిన నిబంధనలు ఉండాలన్న తన వాదనకు ట్రంప్ మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఓటర్ ఐడీ విధానం ట్రంప్ రాజకీయ వాదనలో కొత్తగా ప్రస్తావనకు రావడం.. అమెరికా ఎన్నికల సంస్కరణలపై సాగుతున్న చర్చకు మరో కోణాన్ని జోడించింది. -
‘‘ఈ నెలాఖరుకు చంపేస్తా’’
మాజీ ప్రియురాలిని చంపేస్తానంటూ ఛాట్జీపీటీతో జరిపిన సంభాషణ అమెరికాకు చెందిన డారెన్ ఝా అనే వ్యక్తిని చిక్కుల్లో పడేసింది. బ్రేకప్ తరువాత మాజీ ప్రేయసిపై అక్కసునంతా ఛాట్జీపీటీలో వెళ్లగక్కుకున్న డారెన్ ‘‘ఈ నేలాఖరులోగా ఆమెను చంపేస్తా’’. ‘‘నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదు’’లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఆ సంభాషణ మొత్తాన్ని ఛాట్జీపీటీ యజమాని ఓపెన్ ఏఐ ఎఫ్బీఐకి ఇచ్చేసింది. దీంతో అతడిపై కేసు నమోదైంది. శిక్ష కూడా పడింది. వివరాలు... పాతికేళ్ల వయసున్న డారెన్ ఝూ అమెరికాలోని ఫ్లారిడా వాసి.నాలుగైదు నెలల క్రితం ఛాట్జీపీటీ వాడటం మొదలుపెట్టారు. గర్ల్ఫ్రెండ్తో తెగతెంపులై కొంత సమయమే అయ్యింది. మొదట్లో బ్రేకప్ గురించి, మాజీ ప్రేయసి ఇష్టాఇష్టాల గురించి ఛాట్జీపీటీపై వాకబు చేశాడు. ఆమె ఎక్కడెక్కడ తిరిగేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ప్రేమను మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు అనుకుందో ఏమో... ఛాట్జీపీటీ కూడా అతడి ప్రశ్నలకు తగ్గ సమాధానాలిచ్చింది. అయితే రాను రాను డారెన్ మాటలు దారితప్పడం మొదలైంది. మానభంగం, హత్య, ఆత్మహత్యలపైకి మళ్లింది. ఒక మెసేజ్లో డారెన్ టిపికల్ భగ్న ప్రేమికుడి టైప్లో... ‘‘ఆమె నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్క కూడదు’’, ‘‘ఈ నెలాఖరుకు ఆమెను చంపేస్తా’’అని ఛాట్జీపీటీతో చెప్పినట్లు అధికారులు గుర్తించారు. అక్కడితో ఆగిపోయినా బాగుండేది. కానీ ఆ అమ్మాయి వెళ్లే జిమ్ వద్ద తాను పూలబోకేతో వేచి చూశానని, నన్ను కాదంటే అంతే అంటూ బెదిరించేందుకు సిద్ధమయ్యానని కూడా డారెన్ ఛాట్జీపటీతో చెప్పుకున్నట్లు తెలిసింది. మరికొన్ని మెసేజీల్లోనైతే తుపాకితో బెదిరించి ఇంట్లోకి జొరబడాలని, ఆపై లైంగిక దాడికి పాల్పడాలని కూడా ప్లాన్ చేశాడట. తన వద్ద ఏఆర్–15 రకం రైఫిల్, గ్లాక్ హ్యాండ్ గన్, 12–గేజ్ షాట్గన్లు కూడా ఉన్నట్లు, వీటి ఫొటోలతోపాటు, రబ్బరు గ్లౌవ్స్, జిప్టైల ఫొటోలు కూడా మాజీ ప్రియురాలికి పంపినట్లు డారెన్ ఛాట్జీపీటీతో పంచుకున్నాడు. ‘‘ఆమెకు టెక్స్ట్ చేశా. ఈ రాత్రి మానభంగం చేస్తున్నా’’అని ప్రకటించాడు కూడా. అదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదు కానీ.. ఛాట్జీపీటీ యజమాని ఓపెన్ ఏఐలో కదలిక మొదలైంది. మొత్తం వ్యవహారాన్ని వారు నేరుగా ఎఫ్బీఐకి రిపోర్టు చేశారు. దీంతో మే నెలలో డారెన్ అరెస్ట్ కూడా జరిగింది. బెదిరింపులు, వెంటపడటం, సెల్ఫోన్ అక్రమ వినియోగం వంటి కేసులు దాఖలయ్యాయి. మూడు రోజుల క్రితం డారెన్ తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు కూడా. కేసు విచారించిన న్యాయమూర్తి స్కాట్ సాస్కేర్ డారెన్కు ఎనిమిదేళ్ల శిక్ష (జైలు శిక్ష కాదు) విధించారు. దీని ప్రకారం మొదటి రెండేళ్లు డారెన్ కాలికి ఒక ఎల్రక్టానిక్ పరికరాన్ని బిగించుకుని తిరగాల్సి ఉంటుంది. దాంతోపాటు మానసిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎక్స్ గర్ల్ఫ్రెండ్ను కలవడం కానీ, మత్తుమందులు, మద్యం సేవించడం కానీ, తుపాకులు కలిగి ఉండటం కానీ చేయకూడదు. నేరాలన్నీ ఒప్పుకున్నందుకు గాను డారెన్కు జైలుకెళ్లకుండా, ఎనిమిదేళ్ల పరిశీలనలో ఉండే అవకాశం దక్కింది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి విచిత్రమైన, భయంకరమైన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క ఏఐ టూల్స్ సాయంతో ఎన్నో క్రిమినల్ కేసులను పరిష్కరిస్తూండగా ఇంకో పక్క వీటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలూ ఎక్కువయ్యాయి. బెంగళూరులో ఇటీవల మూడు హత్యల కేసు నిందితుడు ఒకరు గూగుల్ జెమినీ ఏఐతో కొన్ని నెలలు సంభాషించి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న 'MAGA' అంతర్గత పోరు!
అమెరికా అధ్యక్ష పీఠం కోసం 2028లో జరగనున్న ప్రైమరీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది..! అయితే, అప్పుడే అమెరికా రాజకీయాల్లో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ 'MAGA' (Make America Great Again) ఉద్యమంలో ఒక పెద్ద సైద్ధాంతిక యుద్ధం రాజుకుంది. విదేశాంగ విధానం, ముఖ్యంగా ఇరాన్తో యుద్ధం, భవిష్యత్తులో అమెరికా సైనిక జోక్యం వంటి కీలక అంశాలపై ట్రంప్ పరిపాలనలో మరియు రిపబ్లికన్ పార్టీలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. దాంతో.. ట్రంప్ రాజకీయ వారసుడు ఎవరవుతారనే దానిపై ఈ పోరు కేంద్రంగా ఉంది.వాన్స్వైపు ట్రంప్ మొగ్గు..!తన తర్వాత ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ (JD Vance) తన వారసుడిగా రావాలని ట్రంప్ ప్రైవేట్గా డోనర్లకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ట్రంప్ వాన్స్ను అధికారికంగా ఎండార్స్ చేయకపోవడం వల్ల.. మితవాద రిపబ్లికన్లలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో(Marco Rubio) 2028లో ట్రంప్ వారసుడిగా నిలుస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.ఆన్లైన్ రైట్ ప్రభావం - కొత్త సమీకరణాలుఆన్లైన్ రైట్ వర్గాల ప్రభావం ఈ రాజకీయ సమీకరణాలను మరింత సంక్లిష్టం చేస్తోంది. ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ టక్కర్ కార్ల్సన్(Tucker Carlson) భవిష్యత్తులో మూడో పార్టీ తరఫున అధ్యక్ష బరిలోకి దిగే సూచనలు చేస్తున్నారు. మరోవైపు, నిక్ ఫ్యూంటెస్ వంటివారు కూడా యువతను ఆకట్టుకునేలా MAGA ఉద్యమానికి తమదైన తీవ్రరూపాన్ని ఇస్తున్నారు.రెండు వర్గాల పోరు2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి.. ట్రంప్ తర్వాత MAGA సిద్ధాంతాన్ని ఏది శాసించాలనే విషయంలో రిపబ్లికన్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇందులో ప్రధానంగా రెండు శిబిరాలు ఉన్నాయి:నియోకన్జర్వేటివ్ (Neoconservative) వర్గం: సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇజ్రాయెల్కు, ఉక్రెయిన్కు బలమైన మద్దతు ఇవ్వాలని, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికాలలో అమెరికా సైన్యాన్ని దూకుడుగా ఉపయోగించాలని వీరు కోరుకుంటారు.యాంటీ-ఇంటర్వెన్షనిస్ట్ (Anti-interventionist) వర్గం: ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. నాటో మిత్రదేశాలు, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లపై ఆధారపడటాన్ని తగ్గించాలని, ఇరాన్తో సైనిక చర్య కంటే దౌత్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారు.ట్రంప్ ఈ రెండు భిన్నమైన విదేశాంగ విధానాలను తన పాలనలో మిక్స్ చేసి అమలు చేయడానికి ప్రయత్నించారు. మార్కో రూబియోను వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడానికి అనుమతించడం ద్వారా నియోకాన్లకు ఒక విజయాన్ని అందించారు. అదే సమయంలో ఇరాన్తో యుద్ధానికి వెళ్లినప్పటికీ, జూన్ నుంచి ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరిపే బాధ్యతను జె.డి.వాన్స్కు అప్పగించారు. ఇలా రెండు వైపులా అవకాశాలు ఇవ్వడం వల్ల MAGA అధికారిక విధానం ఏమిటనే దానిపై పార్టీలో మరింత గందరగోళం పెరిగింది.ఓటర్లలో ‘తరాల’వారీగా చీలికఈ సైద్ధాంతిక విభేదాలు కేవలం నాయకుల మధ్యే కాకుండా ఓటర్లలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్యూ రీసెర్చ్ ప్రకారం.. 50 ఏళ్లు పైబడిన రిపబ్లికన్లలో 63% మంది విదేశాంగ విధానంలో అమెరికా మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. కానీ 50 ఏళ్ల లోపు యువ రిపబ్లికన్లలో కేవలం 38% మంది మాత్రమే దీనికి మద్దతు ఇస్తున్నారు. పెద్ద వయసు వారిలో నియోకన్జర్వేటివ్ ఆలోచనలు, యువతలో సైనిక జోక్య వ్యతిరేక (Anti-interventionist) భావనలు బలంగా ఉన్నాయని ఇది స్పష్టం చేస్తోంది.వాన్స్ ఎదుట ఉన్న సవాళ్లివే..!2028 ఎన్నికల్లో అధ్యక్ష రేసులో నిలవాలనుకుంటున్న జె.డి.వాన్స్కు టక్కర్ కార్ల్సన్, నిక్ ఫ్యూంటెస్ వంటి వారి ప్రభావం పెద్ద తలనొప్పిగా మారుతోంది.టక్కర్ కార్ల్సన్ మూడో పార్టీ ప్రయత్నాలు: కార్ల్సన్ యాంటీ-ఇంటర్వెన్షనిస్ట్ ఎజెండాతో ఒక కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల మార్జరీ టేలర్ గ్రీన్, థామస్ మాస్సీ వంటి మాజీ ట్రంప్ మద్దతుదారులతో సమావేశమై 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. కార్ల్సన్ ప్రత్యక్షంగా మూడో పార్టీ పెట్టినా పెట్టకపోయినా.. MAGA ఓటర్లను చీల్చడం ద్వారా వాన్స్ అవకాశాలను దెబ్బతీయగలరు.నిక్ ఫ్యూంటెస్ ప్రభావం: వైట్ నేషనలిస్ట్ అయిన నిక్ ఫ్యూంటెస్ యువ రిపబ్లికన్ స్టాఫ్పై ప్రభావం చూపుతున్నారు. కాంగ్రెస్ నుంచి థింక్ ట్యాంకుల వరకు అనేక మంది యువ ఉద్యోగులు ఫ్యూంటెస్ భావనలకు ఆకర్షితులవుతున్నారు. వాన్స్ తన భార్యపై జాతిపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఫ్యూంటెస్ను విమర్శించారు. అయితే.. పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం నియోకాన్లు, బెన్ షాపిరో వంటి వారి ఆగ్రహానికి కారణమవుతోంది.టక్కర్ కార్ల్సన్ రాజకీయ ఆకర్షణ కావచ్చు, లేదా నిక్ ఫ్యూంటెస్ వివాదాస్పద నేపథ్యం కావచ్చు.. అంతర్గత కుమ్ములాటలు 2028 అధ్యక్ష రేసుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఒకవైపు పార్టీని ఏకం చేస్తూనే, మరోవైపు మారుతున్న ఈ రాజకీయ సమీక్షలను జేడీ వాన్స్ ఎలా ఎదుర్కొంటారనేది రాబోయే కాలంలో అమెరికా రాజకీయాల గమనాన్ని నిర్దేశిస్తుందనేది నిర్వివాదాంశం..!-సాక్షి వెబ్ డెస్క్ -
‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం
అమెరికా–ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్లో అంతర్గత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. యుద్ధ మార్గమా? లేక దౌత్య మార్గమా? అనే ప్రశ్నపై దేశ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖటామీ చేసిన వ్యాఖ్యలు టెహ్రాన్లో కొత్త చర్చకు దారితీశాయి.‘‘యుద్ధంతో ఎప్పటికీ జీవించలేం.. సమస్యలను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలి’’ అని ఖటామీ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత ఇరాన్ విధానంపై పరోక్ష విమర్శలుగా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. దేశ అంతర్గత సమస్యలు, ప్రజల జీవన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.సంస్కరణవాద నేత ఖటామీ స్వరంమహ్మద్ ఖటామీ 1997 నుంచి 2005 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సంస్కరణవాద భావజాలానికి దగ్గరగా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాల మెరుగుదల, రాజకీయ సంస్కరణలు, పరిమిత దౌత్య విధానాలకు ఆయన మద్దతు ఇచ్చేవారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. ఇరాన్లో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం కారణంగా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో శాంతి, చర్చల ప్రస్తావన చేయడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది.‘‘ప్రజలు యుద్ధంలో జీవించలేరు’’యుద్ధం ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని ఖటామీ స్పష్టం చేశారు. విదేశీ శక్తుల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు, సాధారణ జీవనం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఉండాలని సూచించారు. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఘర్షణలు కొనసాగితే ప్రజలపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవైపు కఠిన వైఖరిలో అధికార వర్గంఅయితే ఇరాన్ అధికార వ్యవస్థలోని కీలక వర్గాలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. సుప్రీం లీడర్ వర్గం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్లో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ప్రతిఘటన విధానానికే మద్దతు ఇస్తోంది. భద్రత, విదేశాంగ విధానం, ప్రాంతీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే ఐఆర్జీసీ.. అమెరికా, ఇజ్రాయెల్పై వ్యతిరేకతను దేశ రక్షణలో భాగంగా చూస్తోంది.అధ్యక్షుడి పాత్ర పరిమితంప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గతంలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అనుకూలంగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయాధికారం సుప్రీం లీడర్, భద్రతా వ్యవస్థ చేతుల్లో ఉంటుంది. అందువల్ల అధ్యక్షుడి వైఖరి కంటే.. సుప్రీం లీడర్ వర్గం, సైనిక వ్యవస్థ నిర్ణయాలే కీలకంగా మారుతాయి.ఆర్థిక సమస్యలు.. ప్రజల్లో అసంతృప్తిఇరాన్లో యుద్ధ వాతావరణం, ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు, అంతర్జాతీయ అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం మరింత కొనసాగితే ఈ సమస్యలు తీవ్రం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దేశంలో కొంత వర్గం దౌత్యానికి అవకాశం ఇవ్వాలని కోరుతోంది.ముందున్న మార్గం ఏంటి?ఖటామీ వ్యాఖ్యలు వెంటనే ఇరాన్ విదేశాంగ విధానాన్ని మార్చే అవకాశం లేకపోయినా.. దేశంలో ఉన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను మాత్రం బయటపెట్టాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కఠినంగా ముందుకు వెళ్లాలనే వర్గం.. మరోవైపు దేశ ప్రయోజనాల కోసం చర్చలకు అవకాశం ఇవ్వాలనే వర్గం మధ్య ఇరాన్లో చర్చ కొనసాగుతోంది. యుద్ధం మరింత తీవ్రం అవుతుందా? లేదంటే దౌత్యానికి కొత్త మార్గం తెరుచుకుంటుందా? అనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది. ఖటామీ వ్యాఖ్యలు మాత్రం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపాయి. -
ఇన్ఫ్లుయెన్సర్ కావడం ఇక ఈజీ కాదు!
సోషల్ మీడియా స్టార్ కావడం.. ఇక సరదా వ్యవహారం కాదు. కంటెంట్ క్రియేషన్ను ఓ ప్రొఫెషన్గా గుర్తిస్తూ ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం ఏకంగా డిగ్రీ కోర్సును ప్రారంభించింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వేదికలపై కెరీర్ నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రొఫెనల్ డిగ్రీ మస్ట్ అంటే ఎలా? అనే చర్చ జోరందుకుంది.ఇంటర్నెట్ తెరిస్తే చాలూ.. కంటెంట్ పేరిట బోలెడంత క్రింజ్ కనిపిస్తుంటుంది. అయితే దానికి చెక్ పెట్టాలని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ASU) నిర్ణయించింది. స్వచ్ఛమైన కంటెంట్ క్రియేషన్లో భాగంగా బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. యూనివర్సిటీలోని వాల్టర్ క్రాంకైట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. కేవలం వీడియోలు చేయడం, వైరల్ కావడం కాకుండా.. కంటెంట్ రూపకల్పన, పాడ్కాస్టింగ్, స్టూడియో ప్రొడక్షన్, కెమెరా ముందు ప్రెజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.వైరల్ అయితే చాలు అనుకోవద్దు..ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ భారీగా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ‘క్రియేటర్ ఎకానమీ’ కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇన్ఫ్లుయెన్సర్ జీవితం బయటకు కనిపించినంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం కొత్త కంటెంట్ సృష్టించడం, ప్రేక్షకులతో అనుసంధానం కొనసాగించడం, బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోవడం, ఆదాయంలో అనిశ్చితిని ఎదుర్కోవడం వంటి సవాళ్లు ఉంటాయని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్లాట్ఫారమ్లు కంటెంట్ విషయంలో కొత్త(కఠిన) రూల్స్ తెస్తున్న సంగతి తెలిసిందే.డిగ్రీతో స్టార్ అవుతారా?కంటెంట్ క్రియేషన్లో డిగ్రీ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా స్టార్ కాలేరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరల్ కావడానికి ప్రతిభతో పాటు అదృష్టం, సరైన వ్యూహం, నిరంతర శ్రమ అవసరమని చెబుతున్నారు. అయితే ఈ కోర్సు ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మార్కెటింగ్, వ్యక్తిగత బ్రాండింగ్, నెట్వర్కింగ్ వంటి అంశాల్లో అవగాహన పెరుగుతుందని విశ్వవిద్యాలయం పేర్కొంది. సోషల్ మీడియా రంగంలోనే కాకుండా మీడియా, ప్రకటనలు, డిజిటల్ సంస్థల్లోనూ ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.క్రియేటర్ ఎకానమీకి కొత్త గుర్తింపుఅమెరికాలో కంటెంట్ క్రియేషన్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో బిలియన్ల డాలర్ల ఆదాయం చలామణి అవుతోంది. దీంతో ఇంతకాలం కేవలం ‘టైమ్పాస్’గా భావించిన సోషల్ మీడియా కంటెంట్ సృష్టి.. ఇప్పుడు ఓ అధికారిక కెరీర్ మార్గంగా గుర్తింపు పొందుతోంది. అందుకే ఇకపై ‘ఇన్ఫ్లుయెన్సర్ అవుతా’ అంటే చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఈ డిగ్రీ ఇస్తోంది. అయితే ఫాలోవర్ల సంఖ్య కంటే.. నాణ్యమైన కంటెంట్, సృజనాత్మకత, క్రమశిక్షణే విజయానికి అసలు ఆధారమని నిపుణులు గుర్తుచేస్తున్నారు. -
ఓ ఫేక్ న్యూస్.. అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో కలకలం
క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.ఆగస్టు 5న ‘ఎక్స్’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్ అయింది.భారత్ టు అమెరికా వయా ఇజ్రాయెల్.. సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్లోని ఓ టీవీ ఛానల్ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ జెరూసలేంలోని మౌంట్ హెర్జెల్ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఈ పోస్టును షేర్ చేస్తూ.. ఇరాన్ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ రిక్ స్కాట్ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్ వాల్ట్జ్ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.అణు చర్చలపై ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫేక్ న్యూస్ పవర్ అది!ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది. -
ఇరాన్ కొత్త వార్ ప్లాన్.. అమెరికా సైనికుడి ప్రాణానికి భారీ బౌంటీ!
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికుడిని హతమార్చినా, సజీవంగా పట్టుకుని అప్పగించినా 30 వేల డాలర్ల నజరానా అందిస్తామని ప్రకటించింది. ఈ చర్యకు పాల్పడేది మహిళ అయితే రివార్డును రెట్టింపు చేసి 60 వేల డాలర్లు ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది.ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ నజరానా పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. అమెరికాపై పోరాటానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు ఐఆర్ఎన్ఏ కథనాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే అమెరికా సైనికులను ఎక్కడ, ఎప్పుడు పట్టుకోవాలనే విషయంపై ఎలాంటి వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.హార్మూజ్ ప్రతిష్ఠంభన వేళ..హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాతో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో అమెరికా బలగాల పెద్దఎత్తున మోహరింపు లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్లో కూలిపోయిన అమెరికా యుద్ధ విమాన పైలట్ను రక్షించేందుకు చేపట్టిన చర్య మినహా ఇరాన్లో అమెరికా బలగాల ప్రత్యక్ష మోహరింపునకు సంబంధించిన ఘటనలు పరిమితంగానే ఉన్నట్లు సమాచారం.ట్రంప్పైనా గతంలో ముప్పు?ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కూడా ఇరాన్ వైపు నుంచి గతంలో హత్యా ముప్పులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లపై కూడా అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా అమెరికా సైనికులపై నేరుగా నజరానా ప్రకటించడం.. ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో ఉన్న అమెరికా-ఇరాన్ సంబంధాలను మరింత ప్రమాదకర దిశలోకి తీసుకెళ్లే పరిణామంగా మారింది. -
ట్రంప్కు మళ్లీ కోపమొచ్చింది! ఈసారి..
ఇరాన్పై యుద్ధ వ్యూహంలో తమతో కలిసిరాని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇప్పుడు మరో మిత్రదేశంపై గుర్రుగా ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చేపడుతున్న చర్యలకు మద్దతు ఇవ్వకపోవడంపై దక్షిణ కొరియాపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని పెంటగాన్ను ఆదేశించారు.ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను అణు ఆయుధాల నుంచి దూరం చేసే ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలా అని దక్షిణ కొరియా అధ్యక్షుడిని ఇటీవల అడిగానని.. అందుకు సియోల్ "వద్దు, ధన్యవాదాలు" అంటూ సమాధానం ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. సైనిక విన్యాసాలపై ట్రంప్ నిర్ణయందక్షిణ కొరియా నిర్ణయంతో అసంతృప్తి చెందిన ట్రంప్.. అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరిగే వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని రక్షణ శాఖకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది జరగనున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ (Ulchi Freedom Shield) విన్యాసాలను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోయిందని చెప్పారు. ముందుగానే ప్రణాళిక ఖరారైందని, అందుకే పూర్తిగా నిలిపివేయలేకపోతున్నామని స్వయంగా ట్రంపే తెలిపారు. ఈ సైనిక విన్యాసాలు ఆగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి.ఉత్తర కొరియాపై ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై తన అసంతృప్తికి మరో కారణంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న మంచి సంబంధాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ విన్యాసాలు భారీ ఖర్చుతో కూడుకున్నవని, ఉత్తర కొరియాకు అనవసరంగా శత్రుత్వ సంకేతాలు పంపుతున్నాయని ఆయన అన్నారు. తన అధ్యక్ష పదవీకాలంలో ఉత్తర కొరియా ఎలాంటి ముప్పు కలిగించకుండా గౌరవప్రదంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.మాంచి స్నేహంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పరస్పరం ఇద్దరు నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే 2018లో సింగపూర్లో జరిగిన చారిత్రక భేటీతో ట్రంప్–కిమ్ సంబంధాల్లో కీలక మలుపు వచ్చింది. ఆ తర్వాత కూడా కిమ్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.ఇరాన్పై అమెరికా ఒత్తిడి వ్యూహంఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ను అణు ఆయుధాల నుంచి దూరంగా ఉంచేందుకు మిత్రదేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే అమెరికా చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా వైఖరి, అమెరికా సైనిక నిర్ణయం రెండు దేశాల మధ్య భద్రతా సహకారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఉ.కొరియా సవాల్కు..ఇటు.. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గిస్తామని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆసియా భద్రతా వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా అమెరికా-దక్షిణ కొరియా నిర్వహించే ఈ డ్రిల్స్ ఉత్తర కొరియా క్షిపణి, అణు బెదిరింపులకు ప్రతిస్పందనగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, దాని మిత్రదేశాలకు సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో సంయుక్త సైనిక విన్యాసాల తీవ్రత తగ్గితే అది కిమ్ దేశానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే చర్చ మొదలైంది.అయితే ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో ముడిపెట్టలేదు. కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న సంబంధాలు, భారీ ఖర్చుతో కూడిన సైనిక విన్యాసాల అవసరంపై ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. మరోవైపు దక్షిణ కొరియాకు అమెరికా భద్రతా హామీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ.. డ్రిల్స్ తగ్గింపు ఉత్తర కొరియా వైఖరిపై ప్రభావం చూపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. -
న్యూయార్క్లో స్వాతంత్య్ర వేడుకల్లో గిన్నిస్
న్యూయార్క్: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అమెరికాలోని న్యూయార్క్ ట్రై–స్టేట్ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని పర్సిప్పనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ అవతరణ వార్షికోత్సవం సందర్భంగా అత్యధిక ఫ్లాగ్పోల్స్తో 250 ఆకారాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని భారత కాన్సులేట్ ఎక్స్లో ప్రకటించింది. కార్యక్రమంలో భాగంగా 1,300కు పైగా అమెరికా జెండాలను, వాటి చుట్టూ త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేశారు. న్యూయార్క్ సిటీ భారత సంతతి మేయర్ జొహ్రాన్ మమ్దానీ క్వీన్స్లోని ఫ్లోరల్ పార్క్లో జరిగిన ఇండియా డే పరేడ్లో పాల్గొన్నారు. అనంతరం, మమ్దానీ ఎక్స్లో తనను తాను మొట్టమొదటి భారత–అమెరికన్ న్యూయార్క్ నగర మేయర్గా చెప్పుకుంటూ..‘ఇదొక అద్భుత అనుభవం. ఎన్నటికీ మర్చిపోలేనిది’అని పేర్కొన్నారు. కాగా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సహా పలు ప్రముఖ కట్టడాలు త్రివర్ణ శోభతో మెరిసిపోయాయి. టైమ్స్ స్క్వేర్లో జరిగిన కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ
సాధారణంగా మనకు నచ్చిన వాళ్లు లేదా మనకు బాగా పరిచయం ఉన్న పొరుగింటి వాళ్లు శాశ్వతంగా వేరోచోటికి వెళ్లిపోతున్నారంటే బాధగా అనిపిస్తుంది. అది సహజం. పైగా ఒకే దేశం, ఒకే జాతికి సులభంగా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వెళ్లిపోతున్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్. కానీ దేశం కానీ దేశంలో భావోద్వేగంగా వీడ్కోలు చెప్పడం అసాధారణం. కానీ అలాంటి భావోద్వేగ సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాను విడిచివెళ్లిపోతున్న భారతీయ జంటకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది పొరగునే ఉండే అమెరికన్ మహిళ. ఒక్కక్షణం అది భావోద్వేగ వీడ్కోలుగా మారిపోయింది. విజయ్ కొక్కెరగడ్డ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోని పంచుకున్నారు. డెట్రాయిట్లో విమానాశ్రయానికి బయలుదేరుతుండగా ఈ దృశ్యం చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఆ వీడియోలో విజయ్ అమెరికాలోని తన ఇంటి బయట నిలబడి ఉండగా, పోరుగునే ఉండే అమెరికన్ మహిళ వాళ్లను పట్టుకుని భావోద్వగానికి గురవ్వుతుంది. ప్లీజ్ వెళ్లిపోకండి అని కన్నీటిపర్యంతమవుతుంది. అయితే విజయ్ నవ్వి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వీడియో రికార్డు చేయడం గురించి విజయ్కి తెలియదట. తన స్నేహితుడు తనకి చెప్పకుండానే ఈ వీడ్కోలుని చిత్రీకరించినట్లు వెల్లడించాడు. అతనే తనకు ఈ వీడియో పంపడంతో షేర్ చేసినట్లు తెలిపాడు. ఒక రకంగా ఈ వీడియో తన వద్ద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ఇది నిజమైన భావోద్వేగాలు, ప్రేమను చూపించిందని పేర్కొంటూ తన పోస్ట్ని ముగించాడు. నిజంగా గ్రేట్ కదూ..పరాయి దేశస్థులైనా..మనలానే వెళ్లిపోతుంటే భావోద్వేగానికి గురవ్వడం గ్రేట్ కదూ..!. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :(చదవండి: తొమ్మిది పదుల వయసులో అథ్లెటిక్గా బామ్మ..! ఆఖరికి వందేళ్ల తర్వాత కూడా..) -
మిషిగన్లో కాల్పులు ఆరుగురు మృతి
అమెరికా మిషిగన్ రాష్ట్రంలో కాల్పులు ఘటన తీవ్ర విషాదం నింపింది. మిస్సాకీ కౌంటీ వర్జీనియా స్టేట్ వర్సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాల్పులు వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పులు ఎందుకు జరిగాయి అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
అందుకే అమెరికా వదిలి వెళ్ళాను!: భారతీయ వ్యాపారవేత్త
చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేయడానికో చాలామంది అమెరికా వెళ్లాలనుకుంటారు. కానీ.. అమెరికాలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ భారతీయ వ్యాపారవేత్త యూరప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.సాధారణంగా.. విదేశాలకు వెళ్లాలంటే మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వ్యాపార అవకాశాలు వంటి కారణాలు ఉంటాయి. కానీ.. నంద్ జావియా విషయంలో మాత్రం కారణం పూర్తిగా భిన్నం. ప్రపంచాన్ని చూడాలనే కోరికతో యూరప్కు వెళ్లినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2022లో యూరప్తో పరిచయంనంద్ జావియాకు యూరప్తో మొదటి పరిచయం 2022లో ఏర్పడింది. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా తొలిసారి స్పెయిన్కు వెళ్లాడు. అప్పటి వరకు యూరప్ను ప్రత్యక్షంగా చూడకపోవడంతో అక్కడి జీవన విధానం, సంస్కృతి, వాతావరణం గురించి తెలియదు. స్పెయిన్ పర్యటన ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. యూరప్ తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఎక్కువ కాలం ఉండాలనే ఆలోచన అప్పుడే మొదలైందని ఆయన చెప్పారు. యూరప్తో పూర్తిగా ప్రేమలో పడిపోయాను అని అన్నారు.ఒక దేశానికే ఎందుకు పరిమితం కావాలి?విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లిన తర్వాత చాలామంది అక్కడే స్థిరపడిపోతారు. కానీ నంద్ జావియా మాత్రం అలా ఆలోచించలేదు. ఒక దేశానికి వెళ్లిన తర్వాత.. ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయని, ప్రతి దేశానికీ ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం, అనుభవాలు ఉంటాయని ఆయన గుర్తించారు.అవకాశం ఉంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని అనుభవించవచ్చని భావించారు. అందుకే.. స్పెయిన్ తర్వాత యూరప్లోని మరో దేశమైన చెక్ రిపబ్లిక్లోని ప్రాగ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదుఅయితే అమెరికాను వదిలి యూరప్కు వెళ్లడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని నంద్ జావియా చెప్పారు. దాదాపు నాలుగైదేళ్ల క్రితమే ఏదో ఒక సమయంలో యూరప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆయన కంపెనీ కూడా క్రమంగా ఎదిగింది. కంపెనీ కార్యకలాపాలను యూరప్లో ఉంటూనే నిర్వహించగల స్థాయికి వ్యాపారం చేరుకుంది. దీంతో తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సరైన సమయం వచ్చిందని భావించారు.డబ్బు కంటే అనుభవాలకే ప్రాధాన్యంనంద్ జావియా చెప్పిన మాటల్లో ఎక్కువగా ఆకట్టుకునే అంశం ఇదే. యూరప్కు వెళ్లడానికి డబ్బు ప్రధాన కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.తన జీవితంలో ప్రధాన లక్ష్యం మిలియనీర్ కావడం కాదని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడి ప్రజలను, సంస్కృతులను, జీవన విధానాలను తెలుసుకుని ‘గ్లోబల్ సిటిజన్’గా మారడం తన లక్ష్యమని చెప్పారు. అంటే.. ఒకే చోట ఉండి సంపాదించడం కంటే.. ప్రపంచాన్ని చుట్టి చూడటం, కొత్త అనుభవాలు పొందడం తనకు ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు.అమెరికాలో డబ్బు.. యూరప్లో జీవితం?అమెరికా, యూరప్లను పోల్చుతూ నంద్ జావియా చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.మిలియనీర్ కావాలంటే అమెరికా మంచి ప్రదేశం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. తన జీవిత లక్ష్యం కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదని చెప్పారు. యూరప్లో ఉంటే సంపాదించే విషయంలో కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అయితే దానికి బదులుగా తనకు కావాల్సిన జీవిత అనుభవాలు లభిస్తాయని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Nand Javia | Scaling Human Potential (@nand.javia) -
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని రూబియో అన్నారు.అమెరికా తరఫున భారత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహం, కుటుంబ సంబంధాలే భారత్-అమెరికా భాగస్వామ్యానికి బలమైన పునాది అని ఆయన వివరించారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్ష రంగం, వాణిజ్యం తదితర కీలక రంగాల్లో ఇరు దేశాల సహకారం కొనసాగుతోందని తెలిపారు. ఈ సహకారం భారత్, అమెరికాతో పాటు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, బలంగా, సుసంపన్నంగా మార్చేందుకు దోహదపడుతోందని అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి నిర్మించబోయే భాగస్వామ్యంపై అమెరికా ఆశాభావంతో ఉందని పేర్కొన్నారు.అమెరికాలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి. ఆగస్టు 15, 2026ను ‘ఇండియా డే’గా గుర్తిస్తూ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికాలోని భారతీయ ప్రవాసుల సేవలు, ఆ దేశ అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారాన్ని పలువురు అమెరికన్ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య బలపడుతున్న సంబంధాలు కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
హర్ముజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా!: ట్రంప్
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా కేవలం దాని నియంత్రణ మాత్రమే తమదేనంటూ ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్యం మోహరించామని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని మరో సంచలనానికి తెర తీశారు. “ఇరాన్ను ఓడించడం ఖాయం. ఆ తర్వాత.. అతి త్వరలో హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తారు? దీనికి అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతుండగా.. ఇరాన్పై మరింత కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.‘కొంత ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు’.. అమెరికన్లకు ట్రంప్ఇరాన్పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. “అమెరికన్లు పెట్రోల్ కోసం కొంచెం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. కానీ ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా అడ్డుకోవడం ప్రపంచానికి చేసే సేవ” అని అన్నారు.హర్ముజ్పై అధికారం మాదే: ఇరాన్ స్పష్టంట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. “ఒక ట్వీట్తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్ను స్వాధీనం చేసుకోలేరు. ఇరాన్ ఓటమిని అంగీకరించే వరకు ఈ మార్గంపై మా నియంత్రణ కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.ప్రపంచానికి చమురు షాకే!ప్రపంచ ఇంధన మార్కెట్లకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు 4 డాలర్ల స్థాయికి చేరింది.నిలిచిన చర్చలు.. పెరుగుతున్న ఉద్రిక్తతఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరు కొనసాగితే.. ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అమెరికాలో దారుణం.. తల్లి, తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్
-
చైనా గేమ్లో పావుగా భారత్?.. అమెరికా షాకింగ్ ఆరోపణలు
అమెరికా–చైనా వాణిజ్య పోరు మరో కీలక మలుపు తిరిగింది. చైనాపై అమెరికా విధించిన భారీ టారిఫ్లను తప్పించుకునేందుకు.. భారత్ సహా 40కిపైగా దేశాల మీదుగా చైనా తన వస్తువులను అమెరికా మార్కెట్లోకి పంపుతోందని అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ‘షాడో ట్రాన్స్షిప్మెంట్ నెట్వర్క్’గా అభివర్ణించారు. అంతేకాదు.. ఇక ఇలాంటి సరుకులను గుర్తించేందుకు అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను రంగంలోకి దింపబోతోంది. దీంతో అసలు చైనా ఏం చేస్తోంది? భారత్ పేరు ఈ వ్యవహారంలో ఎందుకు వచ్చింది? అమెరికా చెప్పే ‘ట్రాన్స్షిప్మెంట్’ అంటే ఏమిటి? అన్న ఆసక్తి మొదలైంది.‘ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్’ పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో తయారైన వస్తువులు నేరుగా అమెరికాకు వెళ్తే భారీ టారిఫ్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సరుకులను మూడో దేశాల మీదుగా అమెరికాకు పంపుతున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో వస్తువులను మరో దేశానికి పంపించి అక్కడ రీప్యాకేజింగ్, రీలేబెలింగ్, స్వల్ప స్థాయి ప్రాసెసింగ్, ఇన్వాయిస్ లేదా షిప్పింగ్ మార్గంలో మార్పులు చేస్తున్నారని అమెరికా పేర్కొంది. దీంతో అసలు వస్తువు చైనాలో తయారైనప్పటికీ.. పత్రాల్లో అది మరో దేశం నుంచి వచ్చినట్లుగా కనిపించే అవకాశం ఉంటుందని తెలిపింది.అంటే.. చైనా సరుకు.. మధ్యలో మరో దేశం.. చివరికి అమెరికా మార్కెట్! ఇదే అమెరికా ఆరోపిస్తున్న ట్రాన్స్షిప్మెంట్ విధానం. ఈ నెట్వర్క్లో భారత్తో పాటు మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల పేర్లను కూడా నవారో ప్రస్తావించారు. ఈ మార్గంలో అక్రమంగా మళ్లుతున్న వస్తువుల విలువ ఏటా 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా నివేదిక అంచనా వేసింది. అయితే ఈ అంచనా ఉపయోగించిన పద్ధతి, ట్రాన్స్షిప్మెంట్కు ఇచ్చే నిర్వచనాన్ని బట్టి మారుతుందని స్పష్టం చేసింది.టార్గెట్ భారత్..ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా నివేదికలో పుణే,గుజరాత్,చెన్నై ఉత్పత్తి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా తయారు చేసిన పంపులు, కంప్రెషర్లు భారత్ మీదుగా అమెరికాకు చేరుతున్నాయని నవారో ఉదాహరణగా చెప్పారు. ఇక్కడే ఒక కీలక విషయాన్ని గమనించాలి. అమెరికా నివేదికలో భారత్ పేరు రావడం అంటే భారతదేశం మొత్తం అక్రమంగా చైనాకు సహకరిస్తోందని అర్థం కాదు. నిజమైన భారతీయ తయారీ, చట్టబద్ధమైన ప్రాసెసింగ్, విదేశీ పెట్టుబడులు, సరఫరా గొలుసుల మార్పులను కూడా అక్రమ ట్రాన్స్షిప్మెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకే అమెరికా ఇప్పుడు తన తదుపరి ఆయుధంగా AIని ఉపయోగించబోతోంది.‘డిటెక్టివ్ బోర్డర్’గా పేర్కొన్న AI ఆధారిత వ్యవస్థ ద్వారా అమెరికా అధికారులు షిప్మెంట్లకు సంబంధించిన భారీ డేటాను విశ్లేషించనున్నారు. సరుకు ఎక్కడి నుంచి బయలుదేరింది? దాని గత రూట్ ఏంటి? తయారీదారు ఎవరు? కంపెనీల యాజమాన్య సంబంధాలు ఏంటి? ఒక దేశానికి అంత భారీగా ఆ వస్తువులను తయారు చేసే సామర్థ్యం ఉందా? ఉత్పత్తి వర్గీకరణలో ఏమైనా అనుమానాలున్నాయా? వంటి అంశాలను పరిశీలించనున్నారు. అనుమానం బలపడితే.. సరుకును అడ్డుకోవడం, అదనపు సుంకాలు వసూలు చేయడం, జరిమానాలు విధించడం లేదా అమెరికా మార్కెట్లోకి ప్రవేశాన్ని నిరోధించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదంతా ఎందుకు?2018లో చైనాపై అమెరికా సెక్షన్ 301 కింద టారిఫ్లు విధించిన తర్వాత.. చైనా ఎగుమతులు మూడో దేశాల ద్వారా మళ్లించే విధానం పెరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. భారీ సుంకాల నుంచి తప్పించుకునేందుకు మూడో దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని వాషింగ్టన్ వాదిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా వ్యూహం మారుతోంది. గతంలో ‘చైనా నుంచి నేరుగా వస్తోందా?’ అని చూసే స్థాయి నుంచి.. ఇక ‘చైనా నుంచి వచ్చి మధ్యలో ఏ దేశాల మీదుగా తిరిగి వచ్చింది?’ అనే స్థాయికి తనిఖీలు వెళ్లబోతున్నాయి.భారత్పై ఎఫెక్ట్?భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్న సమయంలో.. భారతదేశాన్ని చైనా టారిఫ్లను తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు పెరిగితే, కొన్ని భారతీయ ఎగుమతులపై అదనపు తనిఖీలు లేదా చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు.. అమెరికా ఆరోపణలకు తగిన ఆధారాలు, నిర్దిష్ట కేసులు, అధికారిక దర్యాప్తు ఫలితాలు బయటకు రావాల్సి ఉంది. కేవలం ఒక నివేదికలో దేశం పేరు ప్రస్తావించబడటాన్ని బట్టి మొత్తం భారత ఎగుమతి రంగంపై తీర్పు ఇవ్వడం సరికాదు. -
ఇరాన్ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..
తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్ ప్లాన్’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలునౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.హర్ముజ్ జలసంధే కేంద్రంగా పోరుఅణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.రెండు చమురు నౌకలపై దాడిహర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.నౌకల రాకపోకలకు బ్రేక్యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.ప్రపంచ చమురు మార్కెట్లో కలవరంఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.ట్రంప్పై దేశీయ ఒత్తిడిఇరాన్తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్ ఈ మధ్య హర్ముజ్పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?ఇరాన్పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్సెత్ తెలిపారు.అబ్రహం లింకన్ నౌకపై వదంతులుహర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్ వాషింగ్టన్ నౌకతో రిప్లేస్ చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. -
బర్త్ టూరిజంపై ట్రంప్ ఉక్కుపాదం.. అమెరికాలో బిడ్డను కంటే.. వీసా క్యాన్సిల్
-
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు.. రంగంలోకి జార్జ్ వాషింగ్టన్ నౌక
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎంతో కాలంగా సముద్రంలోనే ఉండి అమెరికాకు సేవలంధిస్తున్న అబ్రహం లింకన్ యుద్ధ నౌక స్థానంలో యుఎస్ మరో వార్షిప్ను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరొక శక్తివంతమైన నౌక యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ను మధ్యప్రాచ్యానికి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని, లింకన్ నౌక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలకు దీనికి సంబంధం లేదని అధికారులు తెలిపారు.ఎంతోకాలంగా అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌకలో సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ 21న శాన్ డియాగో నుంచి పసిఫిక్ ప్రాంతం కోసం బయలుదేరిన ఈ నౌక, ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావడంతో మధ్యప్రాచ్యానికి దారి మళ్లించబడింది. ఎలాంటి పోర్ట్ కాల్ (ఓడరేవు సందర్శన) లేకుండానే ఈ నౌక ఏకంగా 200 రోజులకు పైగా సముద్రంలోనే గడపడం సిబ్బందికి అత్యంత క్లిష్టమైన పరీక్షగా మారింది. గత 250 రోజులకు పైగా సాగుతున్న ఈ ప్రయాణంతో నావికుల్లో తీవ్రమైన అలసట, మానసిక క్షోభ నెలకొన్నాయి.సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్య ఆలోచనలు మరియు కొందరు సిబ్బంది ఓడ నుంచి దూకే ప్రయత్నాలు చేశారన్న వార్తలు కుటుంబ సభ్యులు, చట్టసభ సభ్యుల్లో ఆందోళన రేకెత్తించాయి. మరోవైపు, ఆహార కొరత, నీటి కాలుష్యం, మరుగుదొడ్ల సమస్యలు, బూజు పట్టడం, మెయిల్ వ్యవస్థ దెబ్బతినడం వంటి దుర్భర పరిస్థితులను కుటుంబ సభ్యులు ఎత్తిచూపారు. శాన్ డియాగోలో జరిగిన సమావేశంలో బాధ్యుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ ఆరోపణలను అమెరికా నావికాదళం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తోసిపుచ్చారు. ఆత్మహత్యాయత్నాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సిబ్బందికి కౌన్సెలర్లు, శుద్ధి చేసిన నీరు, భోజనం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే, యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా కేంద్రాలు దెబ్బతినడం వల్ల ఆహారం, పరిశుభ్రతా వస్తువుల అందజేతలో కొన్ని అంతరాయాలు ఏర్పడినట్లు నావీ అంగీకరించింది. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే స్పష్టత లేకపోవడం, నావికులు మానసికంగా మరింత కుంగిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం లింకన్కు విధుల నుంచి విరామం ఇవ్వడానికి జార్జ్ వాషింగ్టన్ను పంపుతున్నట్లు తెలుస్తోంది. జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం వియత్నాంలోని డానాంగ్ నుంచి బయలుదేరిన ఈ నౌక సింగపూర్ జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నట్లు యూఎస్ నావీ అధికారులు తెలిపారు. -
అమెరికాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా ఆయుధ సంపత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక దళంతో పాటు ఆధునిక యుద్ధ నౌకలు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల సైనిక స్థావరాలతో ఆ దేశం ఎంతో స్ట్రాంగ్గా ఉంది. అయితే శత్రుదుర్బేద్యంగా కనిపించే వాషింగ్టన్.. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం చేతిలో చతికిలపడాల్సి వచ్చింది. అవును ఇది అక్షరాల నిజం ఇటీవల జర్మనీలో జరిగిన "కంబైన్డ్ రిజాల్వ్" సైనిక విన్యాసంలో ఉక్రెయిన్ డ్రోన్లు అమెరికా దళాలను ముప్పుతిప్పలు పెట్టాయి. వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ప్రకారం.. జర్మనీలో జరిగిన 'కంబైన్డ్ రిజాల్వ్' సైనిక విన్యాసాలలో ఉక్రెయిన్ డ్రోన్ ఆపరేటర్లు అమెరికా బలగాలను, వారి సాయుధ వాహనాలను పదేపదే గుర్తించి మరీ 'నాశనం' చేశారని తెలిపింది. ఒక దశలో ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు ఏకంగా ఒక పూర్తి అమెరికన్ ఆర్మర్డ్ బ్రిగేడ్ (సాయుధ దళాన్ని) తుడిచిపెట్టేశాయని అమెరికా అధికారులే స్వయంగా వెల్లడించినట్లు పేర్కొంది. రష్యాతో గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న యుద్ధ అనుభవం ఉక్రెయిన్కు డ్రోన్ల వినియోగంలో అపారమైన నైపుణ్యాన్ని ఇచ్చింది. ఈ రకమైన ఆధునిక యుద్ధ పద్ధతులను నేర్చుకోవడానికి అమెరికా సైన్యం ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిపింది.అయితే ఈ విన్యాసంలో నేరుగా మందుగుండు సామాగ్రి ఉపయోగించరు. డ్రోన్లు వాహనాలపై నుండి లేదా వాటికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు, పరిశీలకులు ఆ వాహనం వర్చువల్గా 'నాశనమైంది' అని ప్రకటిస్తారు. ఉక్రెయిన్ దళాలు ఎంత వేగంగా అమెరికా వాహనాలను కూల్చేసాయంటే, కొన్ని వాహనాలను నాశనమైనట్లు ప్రకటించి మళ్లీ బతికించి కొత్త యూనిట్లుగా విన్యాసాల్లోకి పంపాల్సి వచ్చింది. అయితే రెండు వారాల పాటు సాగిన ఈ డ్రిల్ తర్వాత అమెరికా సైనికులు క్రమంగా పరిస్థితులకు అలవాటు పడ్డారు. వారు తమ దళాలను విడదీయడం, కదలికలను దాచడం మరియు శత్రువుల కంటికి పడకుండా ఉండటానికి 'ఎలక్ట్రానిక్ వార్ఫేర్' పద్ధతులను ఉపయోగించడం నేర్చుకున్నట్లు అధికారులు ప్రకటించారు.అనంతరం ఉక్రెయిన్ దళాలు అమెరికన్లకు డ్రోన్లను ఆఫెన్సివ్గా (దాడి చేయడానికి) ఎలా వాడాలో శిక్షణ కూడా ఇచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విధమైన శిక్షణ అమెరికాలో దొరకదని '"ఇలాంటి అద్భుతమైన శిక్షణ అమెరికాలో దొరకడం అసాధ్యం" అని నాటో సైనికదళం నాయకుడు ఎయిర్ ఫోర్స్ జనరల్ అలెక్సస్ గ్రింకెవిచ్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ దళాలతో శిక్షణ పొందిన తర్వాత నాటో సైన్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్ల వినియోగంలో ఉక్రెయిన్ ముందంజఉక్రెయిన్ కేవలం డ్రోన్లను ఎగరేయడమే కాకుండా, యుద్ధ రంగంలో అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవడం, వాటిని రిపేర్ చేయడం మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడంలో నైపుణ్యం సాధించింది. కానీ, అమెరికా సైనికులకు యుద్ధ రంగంలో దాడి జరుగుతున్నప్పుడు డ్రోన్లను రిపేర్ చేయడం లేదా ఆయుధాలను అమర్చడంలో అనుభవం చాలా తక్కువగా ఉంది. డ్రోన్ల కోసం అమెరికా బిలియన్ల ఖర్చు.. కానీ మారిన వ్యూహంసుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్ల సాంకేతికతను ఆధునిక యుద్ధాలలో చేర్చడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాయి.పెంటగాన్ కొత్త డ్రోన్లు మరియు కౌంటర్-డ్రోన్ వ్యవస్థల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేసింది. కానీ ప్రస్తుతం యుద్ధ రంగం మారిపోయింది. ఇప్పుడు సమస్యలు సృష్టిస్తోంది అమెరికా తయారు చేసిన ఖరీదైన, అధునాతన లాంగ్-రేంజ్ డ్రోన్లు కావు. చిన్నవి, చౌకైన ఫ్రంట్లైన్ డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతూ, యుద్ధ నిఘా సమాచారంతో కలిపితే ఎంతటి విధ్వంసం సృష్టించవచ్చో ఉక్రెయిన్ నిరూపించింది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టడానికి అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ దాడుల్లో అమెరికా సైనికులు మరణించడమే కాకుండా, ఆయుధాలు, విమానాలు కూడా ధ్వంసమయ్యాయి.కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. గత ఆరు నెలలుగా అమెరికా ఇరాన్పై దాడి చేస్తున్నా యుద్ధం కొలిక్కి రాలేదు. వారంలోనే యుద్ధాన్ని ముగిస్తానని బింకాలు పలికిన ట్రంప్ యుద్ధం ఎలా ముగించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా ఆధునాతన డ్రోన్ల వినియోగంలో అమెరికా వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది. ఈ ఆపరేషన్ ఏంటి?అమెరికా వాహనాలను ముప్పతిప్పలు పెట్టిన డ్రోన్లు'కంబైన్డ్ రిజాల్వ్' అనేది మైదాన ప్రాంత యుద్ధాలపై ఆధారపడిన భారీ స్థాయి ఆర్మీ విన్యాసం. ఇందులో అమెరికా దళాలు సాయుధ వాహనాలు, పదాతి దళం, హెలికాప్టర్లు మరియు డ్రోన్లతో పాల్గొంటాయి. అయితే, ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు చాలా వేగంగా వీటిని ముక్కలు ముక్కలుగా చేసి పారేశాయి. ఇలాంటి విన్యాసాల్లో నిజమైన మందుగుండు సామగ్రిని ఉపయోగించరు. ఈ విన్యాసాలు వాస్తవ యుద్ధ పరిస్థితులలో లోపాలను గుర్తించడానికి నిర్వహించబడ్డాయి. -
‘ఆయనకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్ఫోర్స్ వన్పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.ఇరాన్ మీడియా వ్యంగ్యంఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్ తాజా “స్కాండల్”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్ను కేటరింగ్ బాక్స్లో దాచినట్లు చూపించే మీమ్ను కూడా షేర్ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.He will be hidden in a trash can before long. pic.twitter.com/ZTkAahNIKw— Iran Embassy SA (@IraninSA) August 11, 2026Brave American hero, or a coward hiding in a catering truck? pic.twitter.com/t1vcmrdcHw— Iran Embassy SA (@IraninSA) August 12, 2026కేటరింగ్ వాహనంలో రహస్య తరలింపుజూలై 8న అంకారా నుంచి బ్రిటన్కు బయలుదేరే సమయంలో ట్రంప్, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్ అధికారులు, వైట్హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.ఈ ఆపరేషన్ వివరాలను తొలుత వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్ అంతస్తు వరకు ఇరాన్కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఘటనఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది. -
కృష్ణబిలం.. ఆపై నక్షత్రం!
భూమితోపాటు ఎనిమిది గ్రహాలున్న మన సౌర కుటుంబానికి వెలుగునిచ్చే అతి పెద్ద నక్షత్రం మన సూరీడు! ఈ సహజ నక్షత్రం సైజు ఎంతో తెలుసా? భూమిలాంటి గ్రహాలు సుమారు 13 లక్షలు కలిపితే ఉండేంత! అంతటి సూరీడికి లక్ష రెట్లు పెద్దదైన ఖగోళ వస్తువును ఒక్కసారి ఊహించుకోండి???? కొంచెం అటుఇటుగా సౌర కుటుంబం ఒకమూల నుంచి ఇంకో మూల వరకూ ఉన్న వంద అస్ట్రనామికల్ యూనిట్ల సైజు! అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త రోహన్ నాయుడు అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు సాయంతో మొట్టమొదటిసారి ఇలాంటి ఖగోళ వస్తువును గుర్తించారు. విశ్వ రహస్యాలు ఛేదించగల ఈ ఆవిష్కరణతో ఇప్పుడు ‘‘కృష్ణ బిల నక్షత్రం’’అన్న పదం ఖగోళ వస్తువుల జాబితాలోకి చేరింది!!! విశ్వం మొత్తం 13.5 కోట్ల ఏళ్ల క్రితంనాటి మహా విస్ఫోటనంతో మొదలైందని సైన్స్ చెబుతుంది. ఆ తరువాత క్రమేపీ విస్తరించే క్రమంలో గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణ బిలాలు ఏర్పడ్డాయి. ఈ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు, మరెన్నో రహస్యాలను ఛేదించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఎంఐటీ శాస్త్రవేత్త రోహన్ నాయుడు చేసిన ప్రయత్నాల్లోనే సౌర కుటుంబం సైజున్న భారీ ఖగోళ వస్తువు ఉనికి స్పష్టమైంది. విశ్వం ఏర్పడ్డ కొన్ని లక్షల సంవత్సరాల కాలంలోనే ఈ ‘ఎంఓఎం–బీహెచ్1’కూడా పుట్టుకొచి్చందని అంచనా. మన సూర్యుడి కంటే కోట్ల రెట్లు ఎక్కువ వెలుగునిస్తూండటంతో నక్షత్రమేమో అనుకున్నారు కానీ లక్షణాలను నిశితంగా పరిశీలిస్తే... మునుపెన్నడూ చూడనిదని తెలిసింది. పోనీ కృష్ణ బిలమని అనుకుందామా అంటే ఆ ఛాయలు కూడా లేవు. దీంతో రోహన్ నాయుడు దీనికో కొత్త పేరు పెట్టారు. కృష్ణ బిల నక్షత్రం అని! – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివాదంలో బిల్గేట్స్ కుమార్తె.. 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ కుమార్తె 'ఫీబీ గేట్స్' వివాదంలో చిక్కుకుంది. ఆమె స్థాపించిన స్టార్టప్ ఫియా (Phia) కుకీ స్టఫింగ్’కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి.ఫీబీ గేట్స్, సోఫియా కియానీ కలిసి ఫియా స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఏఐతో నడిచే డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూపన్లు వెతకడం, మంచి ధరలు చూపించడం, ఉత్పత్తుల వివరాలు అందించడం దీని పని. అయితే ఇప్పుడు ఈ కంపెనీ 'కుకీ స్టఫింగ్' అనే అనుమానాస్పద మార్కెటింగ్ పద్ధతిని ఉపయోగించిందనే ఆరోపణలు రావడంతో వార్తల్లో నిలిచింది.కుకీ స్టఫింగ్ అంటే ఏంటి?సాధారణంగా మనం ఒక కంపెనీ ఇచ్చిన కూపన్ లేదా లింక్ ద్వారా షాపింగ్ చేస్తే.. ఆ కొనుగోలు ఆ కంపెనీ ద్వారా జరిగిందని గుర్తించడానికి బ్రౌజర్లో ఒక చిన్న ట్రాకింగ్ ఫైల్ను కుకీగా ఉంచుతారు. దీని ద్వారా కంపెనీకి కొంత కమిషన్ వస్తుంది. కానీ.. మనం ఆ కంపెనీ కూపన్ ఉపయోగించకపోయినా.. ఆ లింక్పై క్లిక్ చేయకపోయినా సాఫ్ట్వేర్ మన బ్రౌజర్లో కుకీని పెట్టి, ఆ కొనుగోలు తమ వల్లే జరిగిందని చూపిస్తే దాన్ని 'కుకీ స్టఫింగ్' అంటారు. అంటే.. తాము చేయని అమ్మకానికి కూడా కమిషన్ తీసుకునే ప్రయత్నం అన్నమాట.20 ఏళ్లు జైలు శిక్ష?అమెరికాలో ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. కుకీ స్టఫింగ్ అనేది ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కిందికి వస్తుంది. కాబట్టి నేరం రుజువైతే ఏకంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.అయితే ఈ ఆరోపణలపైనా ఫియా సంస్థ స్పందిస్తూ.. ఈ సమస్యను తాము గుర్తించినట్లు పేర్కొంది. ఇది ఒక సాంకేతిక లోపమని స్పష్టం చేస్తూ.. దీనికి కారణమైన ఫీచర్లను తొలగించమని.. భాగస్వామ్య సంస్థలను నిధులను వెనక్కు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు చెప్పింది.నిజానికి ఈ కుకీ స్టఫింగ్ విషయం వ్యవస్థాపకులు ఏడు నెలలకు ముందే తెలుసని సమాచారం. ఇదే నిజమైతే ఫీబీ గేట్స్ చిక్కుల్లో పడ్డట్టే. అయితే ఈ ఫీచర్లను జులైలో నిలిపివేయడంతో.. కంపెనీ ఆదాయం భారీగా తగ్గిందని తెలుస్తోంది. అంటే ఫియా ఇప్పటికే భారీ లాభాలను గడించినట్లు స్పష్టమవుతోంది.Again, this is called cookie stuffing!On a simple level, it’s automatically injecting affiliate tracking cookies to claim commissions on sales you didn’t drive.It’s typically treated as federal wire fraud in US courts.There’s a possibility of a max penalty of up to 20 years… https://t.co/Oiz6PyJ0Qm— Ariel Givner (@GivnerAriel) August 11, 2026 -
ట్రంప్ విమాన ఎపిసోడ్లో భారీ ట్విస్ట్.. ఇజ్రాయెల్ వార్నింగ్పై కొత్త డౌట్?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ నుంచి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ ఇచ్చిన ఓ కీలక హెచ్చరిక అమెరికా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ నుంచి ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అమెరికా అధికారులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ను అసలు విమానం నుంచి రహస్యంగా దించి.. మరో చిన్న మిలిటరీ జెట్లోకి తరలించారు. అయితే, ఇజ్రాయెల్ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొత్త చర్చ ప్రారంభమైంది.టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ తొలుత ఎయిర్ఫోర్స్ వన్గా భావించిన విమానంలోకి ఎక్కారు. అదే విమానంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, వైట్హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెచ్చరిక నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ట్రంప్ను ఎవరికీ తెలియకుండా మరో చిన్న సైనిక విమానంలోకి మార్చినట్లు ది వాషింగ్టన్ పోస్ట్, NPR వంటి అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇందుకోసం క్యాటరింగ్ వాహనాన్ని ఉపయోగించినట్లు సమాచారం. దీంతో మీడియా, కొంతమంది వైట్హౌస్ సిబ్బందికి తెలియకుండానే ట్రంప్ మరో విమానంలో అమెరికా బయలుదేరారు.అయితే ఇజ్రాయెల్ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్క వర్గం నుంచే వచ్చిందని, దానికి బలమైన ఆధారాలు లేవని కొందరు అమెరికా అధికారులు భావించినట్లు కథనాలు చెబుతున్నాయి. CIA విశ్లేషకులు కూడా ఈ సమాచారాన్ని అధిక విశ్వసనీయత కలిగినదిగా పరిగణించలేదని సమాచారం. టర్కీ భద్రతా సంస్థలు కూడా ఈ అంశాన్ని పరిశీలించినప్పటికీ.. అంకారాలో ట్రంప్ను హత్య చేసేందుకు నిర్దిష్టమైన కుట్ర ఉన్నట్లు గుర్తించలేదని అమెరికా మీడియా పేర్కొంది. అయినప్పటికీ, ట్రంప్పై గతంలో జరిగిన హత్యాయత్నాలను దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ సర్వీస్ ఎలాంటి రిస్క్ తీసుకోలేదని తెలుస్తోంది.మరోవైపు ట్రంప్ రహస్యంగా విమానం మార్చినా.. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాత్రం మొదటి విమానంలోనే కొనసాగారు. ట్రంప్ విమానం మార్చిన విషయం రూబియోకు తెలుసని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇక ఈ ఘటన ఇజ్రాయెల్ నిఘా సమాచారంపై కూడా చర్చకు దారితీసింది. ముప్పుపై అమెరికా నిఘా వర్గాలకు సందేహాలు ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ హెచ్చరికను సీరియస్గా తీసుకుని ట్రంప్ ప్రయాణాన్నే మార్చడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఇరాన్ నుంచి నిజమైన ముప్పు ఉందా? లేక ముందుజాగ్రత్త చర్యగానే ఈ రహస్య ఆపరేషన్ చేపట్టారా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. -
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్వర్కింగ్కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. -
అమెరికా: కుటుంబ సభ్యుల హత్య.. భారత యువకుడు అరెస్ట్
మసాచుసెట్స్: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. మసాచుసెట్స్లోని యాక్టన్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తన తల్లి, తమ్ముడిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అర్జున్ అరవింద్ అనే యువకుడిపై అధికారులు హత్య కేసులు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత మంగళవారం మార్తా లేన్లోని వారి నివాసంలో సుధా వెంకటేశన్ (45), ఆమె చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ (14) ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆరోజు ఇంటికి వెళ్లాల్సిన ట్యూటర్ విషయాన్ని అర్జున్ తండ్రికి తెలిపారు. దీంతో ఆందోళన చెందిన అర్జున్ తండ్రి సాయంత్రం 6.37 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటి అంతస్తులో సిద్ధార్థ్, బేస్మెంట్లో సుధా మృతదేహాలను గుర్తించారు. ఇద్దరిపైనా తీవ్ర గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హత్య అనంతరం నిందితుడు అర్జున్ తన తల్లి కారులో పరారయ్యాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా, బుధవారం ఉదయం వేలాండ్ ప్రాంతంలోని ఒక పార్కింగ్ స్థలంలో కారుతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడే ముందు అర్జున్ అనుమానాస్పద రీతిలో ప్రవర్తించినట్లు మిడిల్సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. కుటుంబ సభ్యులను ఎలా అంతం చేయాలనే విషయాలపై అర్జున్ ఇంటర్నెట్, చాట్జీపీటీ ద్వారా శోధించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. -
ట్రంప్ బిగ్ వార్నింగ్: హర్ముజ్ మాదే.. ఇక వదులుకోం!
పశ్చిమాసియా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని.. ఇక మీదట దానిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఇరాన్ దీనిని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ‘‘ఉక్కు గోడ’’గా అభివర్ణించారు. అయితే తన పోస్ట్ చివర్లో ‘అల్లాహ్కు స్తుతి’ అంటూ ట్రంప్ ముగించారు. సాధారణంగా ఇస్లామిక్ సందర్భాల్లో వినిపించే ఈ పదబంధాన్ని ట్రంప్ ఇరాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య ధోరణిలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.వీక్ ఇరాన్!ఇరాన్కు నౌకాదళం, వైమానిక దళం బలహీనంగా ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ సైనికులకు జీతాలు కూడా అందడం లేదని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా దెబ్బతిన్నదని, వెనక్కి తగ్గుతోందని పేర్కొన్నారు.తగ్గమంటున్న ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందన్న వాదన వాస్తవాన్ని మార్చలేదని పేర్కొంది. హార్ముజ్ ఇంకా మూసివేసే ఉందని, ఇరాన్ పెట్టిన షరతులు అంగీకరించే వరకు దానిని తిరిగి తెరవబోమని పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (PGSA) స్పష్టం చేసింది. అమెరికా అధికారులు పదేపదే చేస్తున్న ప్రకటనలు పరిస్థితిని మార్చలేవని వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధం ఎత్తివేయడం, తమ ఆస్తులపై ఆంక్షలు తొలగించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ముందుకు తెస్తోంది. ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని చెబుతోంది.ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావంప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నౌకల రాకపోకలు తగ్గడం, భద్రతా భయాలు పెరగడంతో చమురు ధరలు, రవాణా వ్యయాలపై ప్రభావం కనిపిస్తోంది.చర్చలపై ట్రంప్ వ్యూహంఇరాన్తో చర్చల విషయంలో ట్రంప్ భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాము తక్కువ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, ఇది ఒక చెస్ ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాత్రం అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరుగుతోందని తెలిపారు. -
ట్రంప్ దిగిపోయేదాకా యుద్ధమే.. ఇరాన్ IRGC సంచలన వార్నింగ్!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం కొనసాగే అవకాశం ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ సలహాదారు వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ప్రతిష్టంభన ఇప్పట్లో ముగిసేలా లేదని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ పరిపాలన అనుసరిస్తున్న తీవ్రమైన ఒత్తిడి వ్యూహాలు, ఆంక్షలు, సైనిక బెదిరింపులకు ఇరాన్ లొంగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలో కొనసాగినంత కాలం వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ ఘర్షణ వాతావరణాన్ని దీర్ఘకాలం ఎదుర్కొనేందుకు ఇరాన్ సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలుఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి పరీక్షలు, పశ్చిమాసియాలో ప్రాక్సీ గ్రూపుల కార్యకలాపాలపై అమెరికా గట్టి నిఘా ఉంచడంతో పాటు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన సైనిక బలాన్ని, డ్రోన్, క్షిపణి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ అమెరికా స్థావరాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ముప్పు ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.చర్చలకు సిద్ధంగా లేని వాతావరణంఅమెరికా బెదిరింపుల కింద ఎలాంటి చర్చలు సాధ్యం కావని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని ఇరాన్ వర్గాలు పునరుద్ఘాటించాయి. ట్రంప్ పదవీకాలం ముగిసేంత వరకు ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగవచ్చని ఐఆర్జీసీ వర్గాలు స్పష్టం చేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
బంగారం భారీ ధరలకు అదే కారణం..
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు పసిడిపై ఆసక్తి చూపారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 1శాతానికిపైగా పెరిగింది.అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.1 శాతం పెరిగింది. జూన్లో ఇది 0.4 శాతం తగ్గింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఫెడ్ సెప్టెంబర్లో రేట్ల పెంపు చేసే అవకాశం తగ్గిందన్న అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.ఈ పరిణామానికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్ పైకి ఎగబాకింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపించింది. హైదరాబాద్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆగస్ట్ 12) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1040 పెరిగి రూ.1,54,860 లకు, 22 క్యారెట్ బంగారం రూ.950 ఎగిసి రూ.1,41,950 వద్దకు చేరింది.ఇదిలా ఉంటే, సెప్టెంబర్లో ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి కొనసాగుతోంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్మార్క్ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే కొనసాగించింది. అయితే ముగ్గురు ఫెడ్ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని సూచించింది.ఇక బంగారం తదుపరి కదలికకు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) కీలకం కానుంది. PPI అంచనాల కంటే ఎక్కువగా వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయన్న సంకేతాలు వెలువడి, ఫెడ్ రేట్లపై అంచనాలు మళ్లీ మారే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, చమురు ధరలు కూడా బంగారం ధరను ప్రభావితం చేయనున్నాయి. -
వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణంలో జరిగిన రహస్య మార్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటో సదస్సు తర్వాత అంకారా నుంచి బయలుదేరే సమయంలో ఆయన్ని ఎవరి కంటా పడకుండా మరో విమానంలో తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎయిర్ఫోర్స్ వన్లో ఎక్కినట్లు కనిపించేలా ఓ డమ్మీ ఆపరేషన్ నిర్వహించి.. అనంతరం ఓ క్యాటరింగ్ ట్రక్కు ద్వారా ట్రంప్ను మరో సైనిక విమానంలోకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ట్రంప్కు తాజాగా ప్రశ్న ఎదురైంది. భద్రతా కారణాలతో ఎయిర్ఫోర్స్ వన్ నుంచి మరో విమానానికి తనను తరలించారన్న ప్రచారాన్ని ట్రంప్ ధృవీకరించారు. ‘‘విమానం మార్చాలన్న నిర్ణయం పూర్తిగా సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులదే. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“నేను సీక్రెట్ సర్వీస్, మిలిటరీ చెప్పినట్లే చేస్తాను. వారు వేరే విమానంలో వెళ్లాలని చెప్పారు. అది కూడా అంతే భద్రత కలిగిన విమానమే. వారు కోరడంతో నేను అలా చేశాను. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అని ట్రంప్ అన్నారు. అయితే ఆ ముప్పు ఇరాన్ నుంచే ఉందా? అనే విషయంపై ఆయన ధాటవేత ధోరణి ప్రదర్శించారు. తనపై ఉన్న ముప్పు వివరాలను తాను సీక్రెట్ సర్వీస్ వాళ్లను ఎక్కువగా అడగలేదని ఆయన చెప్పారు. “నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి” అని పేర్కొన్నారు.“మీకు తెలియని చాలా బెదిరింపులు నాకు ఉన్నాయి. ప్రభావవంతమైన అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సహజమే. దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో నా కంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరూ లేరని నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దేని గురించి ఆందోళన చెందను. ఏదైనా సరే.. నా వైఖరి అదే” అని అన్నారు.ఇరాన్ను నమ్మను: ట్రంప్ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను ఇరాన్ను నమ్మను. వారు నాతో నిరంతరం అబద్ధాలు చెప్పారు. ఇరాన్ను నమ్మే చివరి వ్యక్తి నేనే” అని అన్నారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొంటూ.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.“ప్రస్తుతం హార్ముజ్ జలసంధిపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఎవరైనా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.ఆనాడు జరిగింది ఇదే..టర్కీలోని అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ తొలుత ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. అయితే కొద్దిసేపటికే భద్రతా వ్యూహాన్ని మార్చిన అధికారులు ఆయనను రహస్యంగా మరో విమానంలోకి తరలించారు. సాధారణంగా విమానాలకు ఆహారం, సరఫరాలు తరలించే క్యాటరింగ్ ట్రక్ను ఉపయోగించి ట్రంప్ను విమానాశ్రయంలో మరో ప్రాంతానికి తీసుకెళ్లి, ఎయిర్ఫోర్స్ C-32A విమానంలో ఎక్కించారు.అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ విమానం మాత్రం ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఆపరేషన్ను భద్రతా వర్గాలు ఒక “డీకాయ్ ఆపరేషన్”గా పరిగణిస్తున్నాయి. ఇరాన్కు చెందిన వర్గాల నుంచి ట్రంప్ను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ర దేశాధినేతల ప్రయాణాలు ఎప్పుడూ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే “దేనికీ భయపడను” అంటూ చెప్పుకునే ట్రంప్ విషయంలో ఇరాన్ ముప్పు నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ రహస్య విమాన మార్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా చెప్పుకునే ట్రంప్ ప్రయాణంలో జరిగిన ఈ “సీక్రెట్ స్విచ్” భవిష్యత్తులో అధ్యక్షుల రక్షణ వ్యూహాలకు మరో కొత్త అధ్యాయంగా మారుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక.. క్షిపణి ప్రయోగంతో షాక్!
పోగ్యాంగ్: దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్’ సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్న తరుణంలో ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించారు. ఇది సుమారు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, జపాన్ సముద్రంలో పడిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు.జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి ఈ ప్రయోగాన్ని ప్రాంతీయ శాంతికి ముప్పుగా అభివర్ణించడమే కాకుండా, దౌత్య మార్గాల ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా జాతీయ భద్రతా కార్యాలయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంటూ, ఉత్తర కొరియాను వెంటనే ఇలాంటి పరీక్షలు ఆపివేయాలని హెచ్చరించింది. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా దశాబ్దాలుగా దురాక్రమణకు సన్నాహాలుగా భావిస్తూ, ప్రతిసారీ ఇటువంటి క్షిపణి ప్రయోగాలతోనే తన నిరసనను తెలుపుతుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ నెలలో జరగనున్న 11 రోజుల ‘ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్’ విన్యాసాల్లో సుమారు 18,000 మంది దక్షిణ కొరియా సైనికులతో పాటు, అక్కడ మోహరించిన 28,500 మంది అమెరికా సైనికులు పాల్గొంటారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు పొందిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి సైనిక విన్యాసాలు మరింత పటిష్టంగా ఉంటాయని కంబైన్డ్ ఫోర్సెస్ కమాండ్ పేర్కొంది. ఈ పరిణామాలు కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరోసారి తారాస్థాయికి చేర్చాయి.ఇది కూడా చదవండి: సముద్రం నుంచి అంతరిక్షం వరకు చైనా సీక్రెట్ సెన్సార్లు! -
కన్నపిల్లలనే చంపిన తల్లి.. అమెరికా ఘోరం వెనుక ఉన్న ఆ ‘మానసిక జబ్బు’ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కేసుగా భావిస్తున్న లిండ్సే క్లాన్సీ (32) హత్య విచారణ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనవరి 2023లో తన ముగ్గురు పిల్లలను (8 నెలల కాలన్, 5 ఏళ్ల కోరా, 3 ఏళ్ల డాసన్) హత్య చేసిన కేసులో క్లాన్సీ కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ కేసు కేవలం ఒక నేర విచారణగా మాత్రమే కాకుండా, ఒక తల్లి పదేపదే సహాయం కోరినప్పటికీ వైద్యులు ఆమె మానసిక స్థితిని గుర్తించడంలో ఎలా విఫలమైందనే ప్రధాన ప్రశ్నను తెరపైకి తెచ్చింది.కోర్టు విచారణలో క్లాన్సీకి మద్దతుగా ఆమె మామ క్రిస్టోఫర్ క్లాన్సీ, అలాగే ఆమె బాల్య స్నేహితులు సాక్షాలను వెల్లడించారు. స్కూల్ టీచర్. పిల్లలను అమితంగా ప్రేమించే ఆదర్శ తల్లి. అయితే, పైకి సాధారణంగా కనిపించినప్పటికీ, క్లాన్సీ గత కొద్దికాలంగా తీవ్ర నిద్రలేమి, తీవ్రమైన ఆందోళన, తిమ్మిరి, ఆత్మహత్య ఆలోచనలతో నరకం అనుభవించినట్లు తెలిసింది. తనకు తాను 'జాంబీ'లా అనిపిస్తోందని ఆమె తన ఫ్యామిలీ థెరపిస్ట్ ఎదుట మొరపెట్టుకున్నారు. 13 రకాల మందులు.. ప్రసవానంతర సైకోసిస్ను గుర్తించని వైద్యులుహత్యలకు ముందు క్లాన్సీ వైద్య సహాయం కోరినప్పటికీ, వైద్యులు ఆమెకు ఏకంగా 13 రకాల మానసిక వైద్య ఔషధాలను (సైకియాట్రిక్ డ్రగ్స్) సూచించారు. క్లాన్సీకి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ అలియా గుడ్హార్ట్, డాక్టర్ జెన్నిఫర్ టఫ్ట్స్ కోర్టులో సాక్ష్యమిస్తూ.. తాము క్లాన్సీ ఆరోగ్య సమస్యను తీవ్రంగా పరిగణించలేదని, ఉన్మాద లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో క్లాన్సీ పరిస్థితిని సరిగ్గా గుర్తించడంలో వైద్యులు విఫలమయ్యారని, ఆమెకు అవసరానికి మించి మందులు ఇచ్చి అసలు సమస్యను పక్కదారి పట్టించారని డిఫెన్స్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై క్లాన్సీ కుటుంబం ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది.వైద్యుల వైఫల్యమేనా?ప్రసవానంతరం వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలపై ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ నికోల్ కుమి కోర్టుకు వివరిస్తూ.. ప్రసవానంతర కాలంలో తల్లులకు నిద్ర పట్టకపోవడం తీవ్రమైన మానసిక సంక్షోభానికి మొదటి హెచ్చరిక సంకేతం. ప్రసవానంతర సైకోసిస్ బారిన పడిన వ్యక్తులు కొన్ని సమయాల్లో బయటకు సాధారణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ వారి అంతరంగంలో తీవ్రమైన భ్రమలు నడుస్తుంటాయి. ఆమె ఇంట్లోనూ, వైద్యుల ఎదుట తన అనారోగ్య సమస్యల్ని నయం చేయాలని మొరపెట్టుకుంది. కానీ ఆమెకు కేవలం మందులు, సరిదిద్దలేని సలహాలు మాత్రమే లభించాయి’ అని వివరించారు.కోర్టులో వాదోపవాదాలుపిల్లల ప్రాణాలు తీసిన అనంతరం క్లాన్సీ తన మణికట్టు, మెడ కోసుకుని రెండో అంతస్తు కిటికీ నుండి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ఆమె నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. పిల్లలను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని, ఆత్మహత్యాయత్నం ఆమె ఉద్దేశపూర్వక చర్యకు నిదర్శనమని ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. తీవ్రమైన ప్రసవానంతర సైకోసిస్ వల్ల క్లాన్సీ వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయారని, కాబట్టి ఆమెను నేరపూరిత బాధ్యురాలిగా పరిగణించలేమని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ విచారణ, మానసిక ఆరోగ్య సంక్షోభం మరియు కొత్త తల్లుల పట్ల వైద్య వ్యవస్థ వ్యవహరించాల్సిన తీరుపై అమెరికా సమాజంలో సరికొత్త చర్చకు దారితీసింది. -
ఇరాన్ నుంచి ముప్పు.. ఏమార్చి కేటరింగ్ ట్రక్కులో ట్రంప్ ప్రయాణం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత చుట్టూ ఎప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన వలయం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో భద్రతా ముప్పులు, నిరసనలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన అనుకోని రీతుల్లో, అత్యంత గోప్యంగా ప్రయాణించాల్సి వచ్చింది. వెనుక ద్వారాల నుంచి దొంగచాటుగా వెళ్లడం, భూగర్భ బంకర్లోకి మారడం, బుల్లెట్ ప్రూఫ్ గోల్ఫ్ కార్ట్లలో తరలింపుతో పాటు.. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో తాజాగా ఎయిర్పోర్టులో కేటరింగ్ ట్రక్కులో ప్రయాణించిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.గత నెలలో టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్పై ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా సిబ్బంది వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. విలేకరుల సమక్షంలో ట్రంప్ పాత బోయింగ్ 747 విమానం ఎక్కారు. అయితే, విమానం లోపల నుంచి ఆయన్ను అత్యంత రహస్యంగా ఒక 'కేటరింగ్ ట్రక్'లోకి ఎక్కించి విమానాశ్రయం గుండా మరో చిన్న ఎయిర్ఫోర్స్ సీ-32ఏ విమానానికి తరలించారు.ట్రంప్ అందులోనే ఉన్నాడనే భ్రమ కల్పించడానికి బ్రిటన్కు వెళ్లింది. అందులోని రిపోర్టర్లు, సిబ్బందిని కూడా కిటికీల కర్టెన్లు మూసేయాలని ఆదేశించారు. ట్రంప్ వేరే విమానంలో సురక్షితంగా బ్రిటన్ చేరుకున్నారు. కొన్ని వారాల తర్వాత గానీ ఈ విషయం బయటకు రాలేదు.2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలోని హయత్ రీజెన్సీ హోటల్లో కాలిఫోర్నియా రిపబ్లికన్ సమావేశానికి ట్రంప్ హాజరుకావాల్సి వచ్చింది. వందలాది మంది నిరసనకారులు ప్రధాన మార్గాన్ని దిగ్బంధించడంతో ఆయన కాన్వాయ్ దారి మళ్లించారు. హైవే 101 నుంచి దిగి, హోటల్ వెనుక ఉన్న తక్కువ ఎత్తున్న రక్షణ గోడను ట్రంప్ స్వయంగా దూకి లోపలికి వెళ్లారు. వేదికపైకి చేరుకున్నాక నేను నా జీవితంలో ఇంత కష్టపడి ఎప్పుడూ వేదికపైకి రాలేదు అంటూ స్వయంగా ఆయనే చమత్కరించారు.జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత అమెరికా వ్యాప్తంగా చెలరేగిన నిరసనలు వైట్ హౌస్ సరిహద్దుల వరకు చేరాయి. ఆందోళనకారులు వైట్ హౌస్ బారికేడ్లపై వస్తువులు విసురుతుండటంతో సీక్రెట్ సర్వీస్ విభాగం ట్రంప్ను వైట్ హౌస్ కింద ఉన్న అత్యవసర భూగర్భ బంకర్లోకి తరలించింది. ఆయన దాదాపు గంటపాటు అక్కడే ఉన్నారు. విపక్షాలు ఆయన్ను బంకర్ బాయ్ అని ఎగతాళి చేయగా.. తాను దాక్కోవడానికి వెళ్లలేదని, కేవలం బంకర్ను పరిశీలించడానికే వెళ్లానని ట్రంప్ వివరణ ఇచ్చారు.సెప్టెంబర్ 15, 2024న వెస్ట్ పామ్ బీచ్లోని తన గోల్ఫ్ క్లబ్లో ట్రంప్ ఆడుతుండగా, ఫెన్సింగ్ పొదల్లోంచి తుపాకీ గురిపెట్టిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గుర్తించి కాల్పులు జరిపారు. వెంటనే ఏజెంట్లు ట్రంప్కు రక్షణ వలయంగా ఏర్పడి, స్టీల్ రీఇన్ఫోర్స్డ్తో తయారుచేసిన బుల్లెట్ ప్రూఫ్ 'ఫాస్ట్ గోల్ఫ్ కార్ట్'లోకి ఆయన్ను ఎక్కించి క్లబ్హౌస్కు సురక్షితంగా తరలించారు. ఈ సంఘటనపై స్పందించిన ట్రంప్, నాలుగైదు బుల్లెట్ శబ్దాలు వినిపించాయి.. చిట్టచివరి షాట్ కొట్టాలని ఉండేది కానీ, వెంటనే అక్కడి నుంచి సురక్షితంగా బయటపడటమే మంచిదనిపించిందిఅని సరదాగా పేర్కొన్నారు.అధ్యక్షుడిగా గెలిచిన వారం రోజులకే అంటే నవంబర్ 2016 భద్రతా ప్రెస్ బృందానికి సమాచారం ఇవ్వకుండా ట్రంప్ డిన్నర్కు వెళ్లారు. ఆ రాత్రి ఆయన బయటకు రారని అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆయన తన కుటుంబంతో కలిసి రహస్యంగా మాన్హట్టన్లోని '21 క్లబ్' రెస్టారెంట్కు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న రిపోర్టర్లు ఆయనను కవర్ చేయడానికి పరుగులు తీశారు. అధ్యక్షుడికి అత్యవసర రక్షణ కవరేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, వారికి తెలియకుండా డిన్నర్కు వెళ్లడం ఆ సమయంలో తీవ్ర చర్చకు దారితీసింది. -
రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్
-
రివర్స్ రీయింబర్స్మెంట్.. ట్రంప్ నయా గేమ్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు దౌత్యపరమైన ఆధిపత్య పోరుగా మారింది. ఐదు నెలలపాటు కొనసాగిన ఘర్షణల తర్వాత పరిస్థితులు కొంత చల్లబడతాయని భావిస్తున్న సమయంలో.. ఇరు దేశాలు పరస్పరం కొత్త డిమాండ్లు, ఆరోపణలతో ముందుకు రావడం అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతోంది.యుద్ధంలో తమకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డిమాండ్లను తిరస్కరించడమే కాకుండా.. గత ఘర్షణల్లో అమెరికా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి ఇరాన్ బాధ్యత వహించాలని, తమ నష్టాలకు టెహ్రాన్ నుంచే పరిహారం కోరుతామని స్పష్టం చేశారు.హర్ముజ్ తెరవాలంటే ఇరాన్ షరతులుహర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని కఠినంగా వెల్లడించింది. అమెరికా చర్యల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టాలను భర్తీ చేయాలని, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతోంది. యుద్ధ పరిస్థితుల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించాలని కూడా టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించే వరకు హర్ముజ్ విషయంలో తమ వైఖరిలో మార్పు ఉండకపోవచ్చనే సంకేతాలను ఇరాన్ ఇస్తోంది. హర్ముజ్ జలసంధి తమ భద్రత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని టెహ్రాన్ చెబుతోంది.ట్రంప్ ఎదురుదాడి.. ‘పరిహారం మాకే రావాలి’ఇరాన్ డిమాండ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యుద్ధంలో అమెరికన్ల ప్రాణ నష్టానికి, గత ఘర్షణల్లో జరిగిన నష్టాలకు ఇరాన్ బాధ్యత వహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నుంచి పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు అమెరికా పరిహారం చెల్లించాలన్న డిమాండ్ను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో ఇరాన్ చర్యల వల్ల అమెరికా ఎదుర్కొన్న నష్టాలను ప్రస్తావిస్తూ.. బాధ్యత టెహ్రాన్పైనే ఉందని వాదిస్తున్నారు.ఆంక్షలతో ఒత్తిడి పెంచాలన్న అమెరికా వ్యూహంప్రస్తుతం ఇరాన్పై సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడి పెంచడంపైనే అమెరికా దృష్టి పెట్టిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయితే ఇరాన్ చర్చలకు రావాల్సి వస్తుందని ట్రంప్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆంక్షలు తమను బలహీనపర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమని ఆరోపిస్తూ.. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేస్తోంది.ప్రపంచానికి ఎందుకు కీలకం హర్ముజ్?పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో కలిపే సన్నని సముద్ర మార్గమే హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. మధ్యప్రాచ్యం నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి ఇంధన సరఫరా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. హర్ముజ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంధన సరఫరాలో అనిశ్చితి ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్–అమెరికా వివాదంలో హర్ముజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది.ట్రంప్పై ఎన్నికల ఒత్తిడి.. ఇరాన్కు కలిసొస్తుందా?అమెరికాలో రాజకీయ పరిణామాలు కూడా ఈ సంక్షోభంపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్తో దీర్ఘకాలిక ఘర్షణ కొనసాగితే దేశీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ అమెరికా అధికారి చార్లెస్ కుప్చాన్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ఒత్తిడి కారణంగా చర్చల్లో ఇరాన్కు కొంత వ్యూహాత్మక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో టెహ్రాన్ చేస్తున్న డిమాండ్లు అమెరికాకు అంగీకరించలేని స్థాయిలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా వివాదం ప్రభావం పశ్చిమాసియాలో ఇతర ప్రాంతాలపైనా కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. యెమెన్లో హౌతీ దళాల చర్యలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. గాజా శాంతి ప్రయత్నాలపైనా అనిశ్చితి కొనసాగుతోంది.హర్ముజ్ తాళం ఎవరి చేతిలో?ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య అసలు పోరు కేవలం పరిహారం, ఆంక్షల అంశానికే పరిమితం కాలేదు. ఇది మిడిల్ఈస్ట్లో ఆధిపత్యం, భద్రత, ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే పెద్ద సంక్షోభంగా మారింది.ఇరాన్ తన డిమాండ్లపై పట్టుబడుతుండగా.. ట్రంప్ కూడా వెనక్కి తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా? లేదంటే హర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ సంక్షోభానికి కేంద్రంగా మారుతుందా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. -
లోకేశ్ మళ్లీ మాయం
సాక్షి, అమరావతి: సీఎం తనయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ మళ్లీ మాయమయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన రాష్ట్రాన్ని వీడి రహస్యంగా అమెరికా వెళ్లినట్లు తెలిసింది. డీఎస్సీలో మెగా కుంభకోణానికి పాల్పడిన కూటమి ప్రభుత్వంపైన, ఆ శాఖ మంత్రి లోకేశ్పైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం గమనార్హం. తన శాఖలో జరిగిన అతిపెద్ద కుంభకోణంపై ప్రజలకు జవాబు చెప్పాల్సిన మంత్రి, ఇలా వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు. లోకేశ్కు రహస్య విదేశీ పర్యటనలు కొత్తేమీ కాదు. నెలకోసారి ఆయన విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. అయితే దీనిపై పార్టీలో ముఖ్యులకూ సమాచారం ఉండడం లేదు. సాధారణంగా ప్రభుత్వ అధికారులు, మంత్రులు హెడ్ క్వార్టర్ వీడి పక్క రాష్ట్రం వెళ్లినా ప్రభుత్వం అధికారికంగా జీఓ జారీ చేస్తుంది. ముఖ్యమంత్రి అయినా సరే అన్ని పర్యటనల గురించి జీఓ జారీ చేయాల్సిందే. లోకేశ్ గత రెండేళ్లుగా ఇప్పటికి చాలాసార్లు అసలు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియకుండా అదృశ్యమైపోతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు రహస్యంగా చెక్కేస్తున్నారు. -
ప్రియురాలి హత్య, జర్మనీలో భారతీయ విద్యార్థి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలో ప్రియురాలి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఏళ్ల భారతీయ విద్యార్థిని పోలీసులు జర్మనీలో అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లే క్రమంలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేలోపే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... బచ్చిగారి వరుణ్ అనే విద్యార్థి అరిజోనా యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల ఆరవ తేదీ ప్రియురాలు ’జులిస్సా రూబీ సలజార్ (19)ను టక్సన్ సిటీలోని ఆమె అపార్ట్మెంట్లో హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు హత్య అనంతరం వరుణ్ టక్సన్ నుంచి జర్మనీ మీదుగా భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు టక్సన్ పోలీసులు తెలిపారు. అయితే టక్సన్ పోలీసులు, ఎఫ్బీఐలు సమన్వయంతో వ్యవహరించి జర్మనీలో విమానం దిగుతూండగానే వరుణ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ తన ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్, క్రెడిట్ కార్డులు తీసుకుని ఆమె తల్లికి మోసేజ్లు పెడుతూ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే ఆ మెసేజీలపై అనుమానంతో కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమె యోగక్షేమాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆగస్టు ఆరవ తేదీ సాయంత్రం టక్సన్ అగ్నిమాపక సిబ్బందికి గుండెపోటు ఘటనకు సంబంధించిన సమాచారం ఒకటి అందింది. వారు సలజార్ అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మెడవరకూ బ్లాంకెట్ ఒకటి కప్పి ఉన్నట్లు గుర్తించారు. సలాజర్ మెడపై గొంతు నులిమిన గుర్తులు, గీతలు ఉన్నట్లు తెలిసింది. గతంలో దాడి కేసు... వరుణ్పై గతంలోనే ఒక దాడి కేసు నమోదైనట్లు, దీనిపై అరిజోనా యూనివర్శిటీ పోలీసులు దర్యాప్తు చేసినట్లు అరెస్ట్ వారంట్ ద్వారా తెలిసింది. మనస్పర్ధల కారణంగా సలాజర్ గత ఏడాది ఆఖరు నుంచి వేరుగా ఉంటోందని, గృహ హింస ఆరోపణల నేపథ్యంలో అతడితో తెగతెంపులు చేసుకోవాలని తీర్మానించుకుందని ప్రత్యక్ష సాక్షుల విచారణలో తెలిసింది. పలు సందర్భాల్లో వరుణ్ హింసకు పాల్పడినట్లు కూడా సాక్షులు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో పిమా కౌంటీ కోర్టులో వరుణ్పై దాడి, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి ఆరోపణలపై ఒక కేసు నమోదైనట్లు న్యూయార్క్ పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఈ మధ్యే ఉద్యోగం కోల్పోయాడని, అద్దె చెల్లించే స్థితిలోనూ లేకపోవడంతో అతడి వీసా పరిస్థితి ప్రమాదంలో పడిందని కూడా పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఒకానొక హాలోవీన్ పారీ్టలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కానీ తాను ఆ విషయాన్ని పోలీసులకు తెలపలేదని ఒక సాక్షి విచారణ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. వరుణ్ తాలూకూ రికార్డులను పరిశీలించిన ఫాక్స్ న్యూస్ అతడు యూనివర్శిటీ నుంచి బహిష్కృతుడైనట్లు గుర్తించింది. అయితే హత్యారోపణలు వచ్చే నాటికి అతడి వీసా చెల్లుబాటులోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వరుణ్ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం అతడిని అరిజోనాకు తరలించి పిమా కౌంటీ అడల్ట్ డిటెన్షన్ కాంప్లెక్స్లో ఉంచనున్నారు. -
ఇరాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇక పరిహారం కూడా చెల్లించాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్లో జరిగే శాంతి చర్చల్లో భాగంగా.. దశాబ్దాలుగా ఇరాన్ మద్దతుతో జరిగిన దాడులు, ఘర్షణల్లో అమెరికన్లకు జరిగిన నష్టానికి ఇరాన్ నుంచి నష్టపరిహారం కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్కు జరిగిన నష్టానికి ఆ దేశం పరిహారం కోరుతున్న విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్.. అదే తరహాలో అమెరికా కూడా ఇరాన్ నుంచి పరిహారం కోరడం ‘ఆసక్తికరమైన ఆలోచన’ అని పేర్కొన్నారు. ఇరాన్ కోరుతున్న నష్టపరిహారం అంశం అమెరికాతో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు.దశాబ్దాల నాటి ఘటనల ప్రస్తావనతన నష్టపరిహారం డిమాండ్కు మద్దతుగా గతంలో జరిగిన పలు ఘటనలను ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ మద్దతుతో జరిగిన రోడ్డు పక్క బాంబు దాడులు, ఇతర ఘర్షణల్లో అమెరికా సైనికులు మరణించడం, తీవ్రంగా గాయపడటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇరాన్ మాజీ సైనిక కమాండర్ ఖాసిమ్ సొలైమానీ పేరు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.2000 అక్టోబర్లో యెమెన్లోని ఓడరేవులో అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ కోల్పై జరిగిన బాంబు దాడిని కూడా ట్రంప్ ఉదహరించారు. ఆ ఘటనలో 17 మంది అమెరికా నావికులు మరణించగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి అల్ఖైదానే కారణమని ఎఫ్బీఐ గతంలో పేర్కొంది.నిరసనకారుల కుటుంబాలకూ పరిహారం?గత ఐదు దశాబ్దాల్లో ఇరాన్లో జరిగిన ప్రజా ఉద్యమాలు, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందించాలని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఐదు నెలల యుద్ధంలో మరణించినట్లు తాను పేర్కొన్న సుమారు 52 వేల మందికి సంబంధించిన నష్టపరిహారం అంశాన్ని కూడా చర్చల్లో చేర్చాలని తన ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.హర్మూజ్పై ఇరాన్ కీలక డిమాండ్మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు.. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి, ఆర్థిక ఆంక్షలను తొలగించి, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసే వరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ చెబుతోంది.ప్రాంతీయ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య భవిష్యత్ శాంతి చర్చలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
బాల్టిమోర్లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
బాల్టిమోర్, అమెరికా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు (జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు) అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగిన కార్యక్రమాలకు ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజలతో బాల్టిమోర్ నగరం ఒక మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి , భావితరాల చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాసభలను హాజరైన ప్రతినిధులు ‘సూపర్ డూపర్ హిట్’గా అభివర్ణించారు. శోభాయమానమైన గ్రాండ్ బాంక్వెట్తో ప్రారంభమైన ఈ వేడుకలు ఆటా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయి.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత తెచ్చిన రాజకీయ దిగ్గజాలుఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక శోభను తెచ్చారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌర సేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకుంటూ.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని సూచించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ తన హైదరాబాద్ బాల్య జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను గుర్తుచేసుకుని ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు. అమెరికా సాయుధ దళాల్లో వీరోచితంగా సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను ఈ వేదికపై ఘనంగా సత్కరించడంతో సభ మొత్తం అత్యంత భావోద్వేగానికి గురవడమే కాదు, స్టాండింగ్ ఒవేషన్, కరతాల ధ్వనులతో వేదికను మార్మోగేలా చేశారు.వ్యాపార, సాంస్కృతిక వేడుకలుమూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో కన్వెన్షన్ సెంటర్ సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ వేదికలపై కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై లోతైన చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు విస్తృతంగా చర్చించారు. రెండవ, మూడవ తరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు,కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఉర్రూతలూగించిన జానపదాలుతెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు చప్పట్లతో మారుమోగించాయి.తారల సందడి.. కీరవాణి స్వర నీరాజనంతెలుగు సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖుల రాకతో వేడుకల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అడివి శేష్, హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పోలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్ లతో ప్రాంగణాన్ని నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాల ప్రదర్శనల అనంతరం... ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ మహాసభలకు 'గ్రాండ్ ఫినాలే'గా నిలిచింది.20వ మహాసభలు డాలస్లో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీష్ రెడ్డి రామసహాయం మరియు కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వందలాది మంది వాలంటీర్లు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి అతిథుల మెప్పు పొందారు.ఈ మహాసభల ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ, 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్) నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలు కేవలం సదస్సులు కాదు.. తెలుగువారి గుర్తింపునకు ఒక గొప్ప వేడుక.. కొత్త అవకాశాలకు వేదిక.. సంస్థలు, వృత్తులు, తరాలకు అతీతమైన ఐక్యతకు శక్తివంతమైన ప్రతీక.. అని తెలిపారు. -
వీడియో తీస్తుండగా చేతిపై పిడుగు.. షాకిస్తున్న వీడియో!
ఓహియో : అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక వ్యక్తి తుఫాను దృశ్యాలను వీడియో తీస్తుండగా ఆకాశం నుంచి పిడుగు నేరుగా అతనిపై పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భయానక దృశ్యం కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.సన్నిసినాటి నగరానికి సమీపంలోని ఒక గోల్ఫ్ కోర్టులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఒక వ్యక్తి భయానక వాతావరణాన్ని, ఆకాశంలో మెరుస్తున్న మెరుపులను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత శక్తివంతమైన పిడుగు నేరుగా అతనిపై పడింది. దీంతో ఆ వ్యక్తి క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోయాడు. One of the craziest videos I've ever seen. Man was struck by lightning while filming a storm on a golf course Friday in Cincinnati, Ohio. He was struck on the arm, but is recovering and tells me he is "unbelievably lucky." Remember, when thunder roars, go indoors! Credit: Chris S… pic.twitter.com/RrwuavQ5oa— Matt Devitt (@MattDevittWX) August 9, 2026మామూలుగా పిడుగుపాటుకు గురయ్యే ప్రక్రియ రెప్పపాటు కాలంలో జరుగుతుంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి చేతిపై పిడుగు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అమెరికా వాతావరణ నిపుణుడు మాట్ డెవిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన జీవితంలో చూసిన అత్యంత విస్మయకరమైన వీడియోల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ వ్యక్తి తాను ఎంతో అదృష్టవంతుడినని అన్నారు.వాతావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం.. ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను సమయంలో చెట్ల కింద గానీ, బహిరంగ మైదానాలలో గానీ ఉండకూడదు. నేషనల్ వెదర్ సర్వీస్ సమాచారం ప్రకారం.. ఉరుములు వచ్చే మేఘాల నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా పిడుగు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తుఫాను సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: జార్ఖండ్లో ఉద్రిక్తత: అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులు..


