ఆమెలో అందం, అభినయం రెండూ..! మిస్‌ ఇండియా సైతం.. | Nikita Porwal: Actor From Ujjain Representing India At Miss World 2026 | Sakshi
Sakshi News home page

Miss World 2026: సర్వాంగ సుందరీ మాత్రమేకాదు..అద్భుతమైన నటి..! మిస్‌ ఇండియా సైతం..

Sep 2 2026 12:18 PM | Updated on Sep 2 2026 12:21 PM

Nikita Porwal: Actor From Ujjain Representing India At Miss World 2026

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మిస్‌వరల్డ్‌ అందాల పోటీల గ్రాండ్‌ ఫినాలో సెప్టెంబర్‌ 5, 2026న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల భామ ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్‌పైనే అందరి ఆశాలు, ఆకాంక్షలు. ఈ బ్యూటీ కేవలం అందగత్తె మాత్రం కాదు తనలో నటి కూడా ఉందంటూ వెండితెరపై మెరిసింది కూడా. 

ఆమె సంజీవ్ సింగ్ పర్మార్ నిర్మించి, దర్శకత్వం వహించిన బ్రిజ్ భాషా చలనచిత్రం 'చంబల్ పార్'లో నటించింది. నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా సందర్భంగా అరాలూయెన్ సెంటర్‌లో ఈ చిత్రం ప్రీమియర్‌ ప్రదర్శన జరుపుకుంది. ఇది త్వరలో భారత్‌లో కూడా విడుదలకానుంది. అందాల పోటీల్లో పాల్గొనేవారు కేవలం గ్లామర్‌కే పరిమితం కాదని, అభినయంలో కూడా సత్తా చాటగలరని చూపించడమే తన ధ్యేయమని అంటోంది నికితా. ఆ విషయంలో తనకు ప్రియాంక చోప్రా ఆదర్శం అని చెబుతోంది. 

ఎందుకుంటే ఆమె బరేలి నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి గాడ్‌ఫాదర్స్‌ అండ దండ లేకుండా అంచలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసిందని అన్నారామె. ఇక నికితా కూడా త్వరలో కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయనున్నారు. అంతేగాదు ఆమెకు కథలు చెప్పడంలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఆమె ఇటీవలే కృష్ణ లీల' అనే పేరుతో 250 పేజీల రచన  చేసినట్లు సమాచారం ఇక మిస్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ సైతం నికితాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. ఫెమినా మిస్ ఇండియా వేదిక నుంచి అత్యున్నత ప్రపంచ వేదిక వరకు నికితాపోర్వాల్‌ తన మిస్‌ వరల్డ్‌ ప్రయాణంలో ప్రతి అడుగులో భారతదేశ స్ఫూర్తిని, బలాన్ని, కథను ముందుకు తీసుకువెళ్లారు. 

ఈ 75వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ప్రపంచ వేదికపై లక్షలాది ఆశలు, ఆశీస్సులు, అభినందనలను స్వదేశం నుంచి వియత్నాం వరకు ఆమెతోపాటు వస్తాయని పేర్కొంది.  కాగా నిఖితా పోర్వాల్‌ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మోడల్‌. ఆమె 18 ఏళ్ల వయసులో మీడియా రంగంలో కెరీర్‌ను ప్రారంభించారు. కొన్నాళ్లపాటు ఆమె టీవీ యాంకర్‌గా పనిచేశారు. అలాగే ఆరేళ్లపాటు నటనలో శిక్షణ తీసుకున్నారామె. ఇక ఇప్పటికే ప్రారంభమైన ఈ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో నికితా ఇండియా శాష్‌ను అందుకున్నారు. 

నిజంగా ఇది చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే తండ్రి లేదా తల్లి పేరుతో కాకుండా నాదేశం పేరుతో వచ్చే ఐడెంటిటీ అంటే ఆ ఫీలే వేరేలెవెల్‌ అని అంటోంది నికితా. కాగా ఈ ఫైనలిస్ట్‌ జాబితాలో ఇండోనేషియా, లావోస్, మలేషియా, న్యూజిలాండ్, థాయ్‌లాండ్‌, ఆసియా, ఓషియానియ మల్టిమీడియా చోటు దక్కించుకోగా భారత్‌ ఇంకా బెర్త్‌ ఖరారు చేసుకోలేదు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement