లండన్: రాజకీయ కారణాలతో కేంద్రం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణకు సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడతానని తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాలపై ఈ రోజు (ఆదివారం) క్లుప్తంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనకు మద్దతు తెలిపిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
లండన్లో తన సమావేశాలు, కార్యక్రమాలు పూర్తయ్యాయని గత మూడు రోజులుగా తనకు లభించిన అపూర్వమైన మద్దతుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం మునుపటి షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి అమెరికా బోస్టన్ వెళ్లాల్సి ఉంది. అయితే కేంద్రం తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్ ఈ రోజు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.


