breaking news
comments
-
కాంగ్రెస్ ఎంపీలపై కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలపై మంత్రి కిరణ్ రిజిజు సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ స్పీకర్ చాంబర్లో కాంగ్రెస్ ఎంపీలు అత్యంత అనుచితంగా ప్రవర్తించారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన సుమారు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్లోకి చొరబడి, ఆయనను దూషించారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, స్పీకర్ ఎంతో సంయమనం పాటించారని రిజిజు తెలిపారు. స్పీకర్ మృదుస్వభావి కనుకనే సరిపోయిందని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేవారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ వివాదం వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉందంటూ రిజిజు విమర్శలు గుప్పించారు. ఎంపీలు స్పీకర్ను దూషిస్తున్న సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నేతలు కూడా ఛాంబర్లోనే ఉన్నారని ఆయన తెలిపారు. ఎంపీలను వారించాల్సింది పోయి, స్పీకర్తో వాదనకు దిగాలని, గొడవ చేయాలని వారు ప్రోత్సహించారని రిజిజు ఆరోపించారు. ఈ ఘటన పార్లమెంటరీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ నిబంధనల ప్రకారం ఈ నోటీసును సమర్పించారు. 118 మంది ఎంపీల మద్దతుతో ఈ తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. #WATCH | Delhi: Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "... At least 20-25 Congress MPs entered the Lok Sabha Speaker's chamber and abused him. I was also there. The Speaker is a very soft person, otherwise strict actions would have been taken. Senior Congress… pic.twitter.com/4SQ8eGEZ3X— ANI (@ANI) February 11, 2026 -
శివనామస్మరణ వినాల్సిన చోట కాపాడండి అంటూ ఆర్తనాదాలు
-
‘మెత్తబడిన అప్పడం.. కాదు ఫైన్ తందూరీ’
లండన్: భారత్ - బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఆసక్తికర చర్చ జరిగింది. బ్రిటీష్ ఎంపీలు పలు చమత్కారాలను జోడిస్తూ, ఈ ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. షాడో ట్రేడ్ సెక్రటరీ ఆండ్రూ గ్రిఫిత్ ఈ ఒప్పందాన్ని విమర్శిస్తూ ఇది ‘సొగ్గీ పాప్పడమ్స్’ (మెత్తబడిన అప్పడాలు) మూటలా ఉందని ఎద్దేవా చేశారు. బ్రిటన్ సేవల రంగాన్ని ఈ ఒప్పందంలో చేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా వాణిజ్య శాఖ మంత్రి క్రిస్ బ్రయంట్ స్పందిస్తూ, బ్రిటీష్ వ్యాపారవేత్తలు ఈ ఒప్పందాన్ని ‘ఫైన్ తందూరీ’లా భావిస్తున్నారని సమర్థించారు.ఈ చర్చ సందర్భంగా కీర్ స్టార్మర్ ప్రభుత్వంపై పలువురు ఎంపీలు విమర్శలు గుప్పించారు. బ్రిటన్ సేవా రంగం, న్యాయ సేవలకు సంబంధించిన నిబంధనలు లేకపోవడాన్ని వారు తప్పుబట్టారు. భారతీయ కార్మికులు, వారి యజమానులు మూడు సంవత్సరాల పాటు నేషనల్ ఇన్సూరెన్స్ చెల్లించకుండా మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వస్తువుల ఎగుమతిదారులకు సుంకాల తగ్గింపు లభించడానికి ఐదు నుండి 10 ఏళ్లు పడుతుందని, కానీ భారత ఎగుమతిదారులకు తక్షణమే ప్రయోజనం కలుగుతున్నదని గ్రిఫిత్ విమర్శించారు.అమెరికాలో ఇలాంటి నమూనా కారణంగానే తక్కువ వేతనాలకే లభించే భారతీయ కార్మికులు పెరిగిపోయి, స్థానిక కార్మికులకు నష్టం కలిగిందని కన్జర్వేటివ్ ఎంపీ కేటీ లామ్ హెచ్చరించారు. మరోవైపు ఈ ఒప్పందం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనదని మంత్రి క్రిస్ బ్రయంట్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుండి విడిపోయిన తర్వాత బ్రిటన్ కుదుర్చుకున్న అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక ఒప్పందం ఇదేనని ఆయన తెలిపారు. హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ చార్టర్డ్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ ఒప్పందాన్ని సమర్థిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 2050 నాటికి భారతదేశంలో 25 కోట్ల మందికి పైగా అధిక ఆదాయం కలిగిన వినియోగదారులు ఉంటారని, ఇది బ్రిటన్ ఎగుమతిదారులకు భారీ మార్కెట్ అని ఆయన వివరించారు.ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మకమైనదిగా లేబర్ ఎంపీ డగ్లస్ మెకాలిస్టర్ అభివర్ణించారు. జీ20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని, 2028 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో భారత్తో సంబంధాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో భారీ పెట్టుబడులను తీసుకువస్తుందని, బ్రిటన్ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది ఒక కీలక అడుగు అని మెకాలిస్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: Canada: స్కూల్లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి -
మా ప్రభుత్వం ఫెయిల్.. నిజం ఒప్పుకున్న కొలికపూడి
-
‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘అన్పబ్లిష్డ్ మెమోయిర్’ పుస్తకం చుట్టూ నెలకొన్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఈ పుస్తక ప్రచురణ కర్త పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన వివరణను ఆయన తప్పుబట్టారు. ఢిల్లీ పోలీసులు ఈ పుస్తక ప్రతుల చలామణిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదన్న పెంగ్విన్ సంస్థ వాదనలో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయని ఆరోపించారు.జనరల్ నరవణే గతంలో చేసిన ఒక ట్వీట్ను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ‘తన పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ను అనుసరించండి’ అని నరవణే స్వయంగా ట్వీట్ చేశారని ఆయన గుర్తు చేశారు. తాను చెప్పదలుచుకున్న పాయింట్ ఒక్కటేనని, అయితే నరవణే అబద్ధం చెబుతున్నారు లేదా పెంగ్విన్ సంస్థ అబద్ధం చెబుతోంది.. అయితే దేశ మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని తాను అనుకోవడం లేదన్నారు. నరవణే మాటలకే తాను ప్రాధాన్యత ఇస్తానని రాహుల్ స్పష్టం చేశారు.ఈ పుస్తకం గతంలో ‘అమెజాన్’లో అందుబాటులో ఉందని, 2023లోనే దీనిని కొనమని నరవణే కోరారని రాహుల్ పేర్కొన్నారు. ఈ మెమోయిర్లో ఉన్న కొన్ని అంశాలు భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఇబ్బందికరంగా మారాయని, అందుకే వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా దీనిపై స్పందిస్తూ.. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తక ప్రచురణ హక్కులు తమకే ఉన్నాయని, అయితే దానిని తాము ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఏవైనా డిజిటల్ లేదా ప్రింట్ కాపీలు కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు! -
ఇలాగైతే కంపెనీలు రావు.. TDPలో దుమారం రేపుతున్న లోకేష్ వీడియో
-
ప్రధాని మోదీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. నిజమెంత?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను తలుచుకుంటే నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయగలనని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఉన్న ఈ క్లిప్ భారతీయ నెటిజన్లలో తీవ్ర గందరగోళాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ట్రంప్ రెండవమారు అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా సంబంధాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్న తరుణంలో ఈ వైరల్ క్లిప్ దుమారం రేపుతోంది.అయితే ఈ వైరల్ వీడియో ప్రచారంలో వాస్తవం లేదని ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో 2025 అక్టోబర్లో వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో మాట్లాడిన సందర్భానికి సంబంధించినదని తేలింది. ఆ సమయంలో ఆయన మోదీని ప్రశంసిస్తూ, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీకి తనపై ఎంతో ప్రేమ ఉందని చెబుతూ, ఆ ‘ప్రేమ’ అనే పదాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ట్రంప్ చమత్కరించారు. ఆ సందర్భంలోనే ఆయన తాను ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 🚨 Breaking NewsDonald Trump's statement is making headlines.“I could end Narendra Modi’s political career, but I don’t want to.”One Statement, Many Questions.Is this just a Political statement, or is there a Deeper Meaning Behind It?In Global Politics, Words Carry… pic.twitter.com/my42g7J6r2— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) February 8, 2026కొందరు సోషల్ మీడియా యూజర్స్ ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. ‘నేను మోదీ కెరీర్ను అంతం చేయగలను.. కానీ నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ బెదిరించినట్లుగా క్యాప్షన్లు పెట్టి షేర్ చేస్తున్నారు. కాగా అధికారిక వైట్ హౌస్ నివేదికలు గానీ, అంతర్జాతీయ మీడియా సంస్థలు గానీ ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్లు తెలియజేయలేదు. అసలు క్లిప్లో ట్రంప్ ఎంతో స్నేహపూర్వకంగా మోదీని ‘గ్రేట్ మ్యాన్’ అని కొనియాడారు.కొందరు కేవలం ఒక చిన్న పదాన్ని పట్టుకుని, అప్పటి సందర్భాన్ని తొలగించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమయ్యింది. నాడు ట్రంప్ భారతదేశంపై, మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తూ, గతంలో భారత్ పదే పదే నాయకత్వ మార్పులను చూసేదని, కానీ మోదీ వచ్చాక రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. మోదీని కాలపరీక్షకు నిలబడిన నాయకుడు అని ట్రంప్ కొనియాడారు. ఇది కూడా చదవండి: ‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల -
ఇక్కడితో ఆపేయ్.. తప్పు అయ్యిందని లెంపలేసుకోని..
-
కూటమి పాలనపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
వెనుక ఒక పిలకేసుకుని.. సినిమా అనుకున్నావా?
-
తూచ్.. మనసు మార్చుకున్నా..
-
నారా బాబా 9 దొంగలు..! పుణ్యశీల అదిరిపోయే సెటైర్లు
-
జన సునామిని చూసి కూటమికి ప్యాంటు తడిసిపోతుంది
-
చచ్చినా జగనే.. బతికినా జగనే.. తుక్కు రేగొట్టిన లాయర్లు
-
బాబుని ఇమిటేట్ చేస్తూ.. ఉతికారేసిన పేర్ని నాని
-
ఒక్కరి ముఖంలో నవ్వు లేదు.. పాపం చేసామన్న భయం తప్ప
-
దేవునికి ఉరేస్తా.. నాగబాబు పచ్చి బూతులు
-
చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
-
ఉత్తరాదిపై పన్నీర్సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాట మరోమారు భాషా వివాదం రాజుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కె పన్నీర్సెల్వం భాషా వివాదాన్ని తట్టి లేపారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి వలస వచ్చే కార్మికులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ఉత్తరాది వారికి కేవలం హిందీ మాత్రమే తెలియడం వల్ల వారికి తక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, అందుకే వారు తమిళనాడుకు వచ్చి టేబుళ్లు శుభ్రం చేయడం, నిర్మాణ రంగంలో పని చేయడం లేదా పానీపూరీ అమ్ముకోవడం వంటి పనులు చేసుకుంటున్నారని పన్నీర్సెల్వం వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్విభాషా విధానంతో కలిగే ప్రయోజనాలను మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు విద్యార్థులు తమ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల లండన్, అమెరికా తదితర దేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని అన్నారు.ఇదే సమయంలో పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా స్పందిస్తూ రాష్ట్రంలో హిందీ మాట్లాడటాన్ని ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదని, జర్మన్, జపనీస్ వంటి విదేశీయులే ఇక్కడ సంతోషంగా ఉంటున్నప్పుడు, హిందీ మిత్రులకు ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘భాష’ ప్రధానాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుండగా, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి దీనిని సవాలు చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1930లు, 1960ల కాలంలో జరిగిన భాషా ఉద్యమాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఇది కూడా చదవండి: రంజాన్ 2026: సౌదీ అరేబియా కీలక ప్రకటన -
రాహుల్ వ్యాఖ్యలతో పార్లమెంట్లో కలకలం
న్యూఢిల్లీ: బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తన మాజీ అనుచరుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూపై విమర్శలు గుప్పించారు. విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.2024 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి, బీజేపీలో చేరిన బిట్టూను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. నిరసన తెలుపుతున్న ఎంపీల మధ్య నుండి బిట్టూ వెళ్తుండగా, రాహుల్ గాంధీ ఆయనను చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇదిగోండి.. ఒక ద్రోహి ఇటుగానే వెళ్తున్నారు.. అతని ముఖం చూడండి’ అని ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా, బిట్టూ వైపు చేయి చాపి ‘హలో బ్రదర్, నా ద్రోహి మిత్రమా.. కంగారు పడకు, నువ్వు మళ్లీ తిరిగి కాంగ్రెస్లోకే వస్తావు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.రాహుల్ గాంధీ కరచాలనం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, రవనీత్ బిట్టూ తిరస్కరించారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బిట్టూ ఆయనను దేశ శత్రువు అని అభివర్ణించారు. కాంగ్రెస్ దేశాన్ని అమ్మేస్తోందని ఆయన ఆరోపించగా, దానికి బదులుగా బీజేపీయే దేశాన్ని విక్రయిస్తోందని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య కొద్దిసేపు వాడీవేడీ చర్చ జరిగింది.రవనీత్ బిట్టూ-రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఈనాటివి కావు. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలపై బిట్టూ తీవ్రంగా మండిపడ్డారు. అప్పట్లో రాహుల్ను ‘దేశంలోనే నంబర్ వన్ ఉగ్రవాది’ అని బిట్టూ విమర్శించడం పెను దుమారం రేపింది. తాజాగా పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ పరిణామం, గత కొంతకాలంగా వీరి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరాన్ని మరోసారి బహిర్గతం చేసింది. -
భోలేబాబాను తెచ్చింది నారా బాబా.. తెలుసుకో పయ్యావులా !
-
హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై హరీష్ రావు ఫైర్
-
ఒక మహిళ అంత ఘోరంగా మాట్లాడుతుంటే.. అనితకు ఆ మాటలు వినపడలేదా
-
ఖమేనీ హెచ్చరికలు.. ట్రంప్ బేఖాతర్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ముందుకు వస్తుందనే ఆశ తనలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన హెచ్చరికలను కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికా గనుక దాడులకు దిగితే అది తీవ్రమైన ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ఖమేనీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.వాషింగ్టన్తో ఇరాన్ చర్చలు ఒకవేళ విఫలమైతే ఖమేనీ చేసిన హెచ్చరిక ఎంతవరకు నిజమో తేలిపోతుందని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో నివాసంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ సమీపంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపారు. అయితే సైనిక చర్య కంటే దౌత్యపరమైన పరిష్కారానికే తాము మొగ్గు చూపుతున్నామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నామని, అది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు.ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సోషల్ మీడియా వేదికగా అమెరికాను హెచ్చరిస్తూ వరుస పోస్టులు చేశారు. అమెరికా గనుక యుద్ధాన్ని ప్రారంభిస్తే, అది కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాదని, ఈ ప్రాంతాన్నంతా చుట్టుముట్టే యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. యుద్ధ నౌకలు లేదా విమానాలతో చేసే బెదిరింపులకు ఇరాన్ భయపడదని అన్నారు. గతంలోనూ అమెరికా ఇలాంటి ప్రకటనలు చేసిందని, వీటివల్ల తమ దేశ ప్రయోజనాలకు భంగం కలగదని ఖమేనీ అన్నారు.తాము ఏ దేశంతోనూ యుద్ధాన్ని కాంక్షించడం లేదని, అయితే ఎవరైనా దాడికి దిగితే నిర్ణయాత్మకమైన దెబ్బ కొడతామని ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న సహజ వనరులు, వ్యూహాత్మక భౌగోళిక స్థానంపై పట్టు సాధించేందుకే అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: పొద్దున్నే వణికించిన భూకంపం -
హైకోర్టుకైనా వెళతాం.. అంబటిని బయటకు తీసుకొస్తాం..
-
ఈ దాడి దేశం మొత్తం తెలిసేలా చేస్తా.. గెట్ రెడీ..
-
బడ్జెట్ 2026: ఎవరు ఏమన్నారు?
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ వెలువడిన అనంతరం రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ప్రతిపక్ష నేతలు ఈ బడ్జెట్ను వాస్తవాలకు దూరం అని విమర్శించారు. నిరుద్యోగంతో పాటు సామాన్యుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.వాస్తవాలకు దూరం‘సమాజ్వాదీ’ నేత అఖిలేష్ యాదవ్ : ఈ బడ్జెట్ క్షేత్రస్థాయి వాస్తవాలకు చాలా దూరంగా ఉందని, ప్రజలకు ఇది ఎలాంటి ఆశను కల్పించలేకపోయిందని విమర్శించారు.నిరుద్యోగాన్ని విస్మరించారుశశి థరూర్ (కాంగ్రెస్): దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నిరుద్యోగమని, బడ్జెట్లోని వృద్ధి చర్యలు నిజంగా ఉద్యోగాలను సృష్టిస్తాయా అనే విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.వికసిత్ భారత్ వైపు అడుగులుప్రభుత్వ ప్రతినిధులు ఈ బడ్జెట్ను దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా అభివర్ణించారు.నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి): ఆర్థిక క్రమశిక్షణను కాపాడుతూనే మౌలిక సదుపాయాల కల్పన, ఏఐ-ఆధారిత పాలన ద్వారా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.పరిశ్రమలు - వ్యాపార వర్గాల స్పందనపారిశ్రామిక రంగానికి సంబంధించి బడ్జెట్ కొన్ని రంగాలకు ఊరటనిచ్చింది.బ్యాంకింగ్ రంగం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు తమ అంచనాలను కొంత తగ్గించుకున్నప్పటికీ, ఎంఎస్ఎంఈల కోసం తీసుకున్న ప్రత్యేక చర్యలను సానుకూల అంశంగా గుర్తించాయి.ఎగుమతిదారులు - వ్యాపారులు: విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ (టీసీఎస్) తగ్గించడం, విద్యా సంబంధిత లావాదేవీలపై టీడీఎస్ (టీడీఎస్) సడలించడాన్ని ప్రశంసించారు. ఇది ఖర్చులను తగ్గించి వ్యాపారాలకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.టెక్ - ఏఐ స్టార్టప్లు: ‘ఇండియా ఏఐ’ మిషన్ విస్తరణను స్వాగతించినప్పటికీ, కంప్యూట్ వనరుల కేటాయింపులను రూ. 2,000 కోట్ల నుంచి ₹5,000 కోట్లకు పెంచి ఉంటే బాగుండేదని సూచించారు.ఆర్థికవేత్తలు - విశ్లేషకులుబడ్జెట్లోని లోతుపాతులను ఆర్థిక నిపుణులు ఈ విధంగా విశ్లేషించారు..సానుకూల అంశాలు: కొత్త పన్ను విధానంలో పన్ను రహిత పరిమితిని రూ.12–12.75 లక్షలకు పెంచడాన్ని మధ్యతరగతికి గొప్ప వరంగా పేర్కొన్నారు. అలాగే మౌలిక సదుపాయాలకు రూ. 12.2 లక్షల కోట్ల కేటాయింపులను ప్రశంసించారు.హెచ్చరిక: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. బడ్జెట్ లక్ష్యాలు యువతకు తగినన్ని ఉద్యోగాలను ఇస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకమని అభిప్రాయపడ్డారు. -
24 గంటలు డెడ్ లైన్! పెమ్మసాని వ్యాఖ్యలకు మిథున్ రెడ్డి స్టాంగ్ కౌంటర్
-
అంబటిని ఏం చేయాలో..! లోకేష్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్
-
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. బీజేపీకి సంబంధం ఉంది..
-
బరితెగించిన కూటమి ప్రభుత్వం.. దేవుడితోనే రాజకీయాలు..
-
ఆరోజు వచ్చింది 4 కాదు 8 నెయ్యి ట్యాంకర్లు ఇవిగో ఆధారాలు
-
దారితప్పిన గొర్రె.. షర్మిలకు సెన్స్ ఉందా ? మళ్లీ చంద్రబాబుకు సపోర్ట్..
-
బాబు, పవన్ రాక్షసుల కంటే నీచం: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను దెబ్బతీయడానికే చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నదని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారికి సేవ చేయాలనే తపనతో జగన్ అడుగులు వేశారని, అయితే తిరుమల లడ్డూలో వాడే నెయ్యి మీద మీద వారు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. వైఎస్ జగన్ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు రక్తం పోస్తున్నారని భూమన పేర్కొన్నారు. తమ మీద ఆరోపణలు చేయడం తప్ప ఏమి చేశారని నిలదీశారు. చంద్రబాబు, పవన్ రాక్షసుల కంటే నీచమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు దేశంలోని హిందువులు మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రలు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సిట్ తన నివేదికలో యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టం చేసింది. అధికారులు, డెయిరీ నిర్వాహకులు కుమ్మక్కు అయి కల్తీ చేశారు అని నివేదిక పేర్కొన్నదన్నారు. 2019-24 వరకు సిబిఐ విచారణ చేయాలని సుప్రీం కోర్టు కు వెళ్లింది మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అని భూమన పేర్కొన్నారు.చంద్రబాబు సిట్ నివేదిక ఇచ్చి ఉంటే152 దేశ ద్రోహం కింద కేసు పెట్టారు. సుబ్బారెడ్డి సుప్రీం కోర్టు లో వాస్తవాలు వెలికి తీసేందుకే వెళ్ళారు. మీకు ధైర్యం ఉంటే 2014 -19 సీబీఐ విచారణ కోరే దమ్ము ఉందా అని భూమన ప్రశ్నించారు. 2013 నుంచి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ నే టిటిడి కు నెయ్యి సరఫరా చేసింది.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. 2021 లో కేంద్రం ఆదేశాలు మేరకే టెండర్ నిబంధనలు మార్పులు చేశాం. స్టార్ అప్ కంపెనీలు ప్రోత్సహించాలని కేంద్రం కోరిందన్నారు. సీబీఐ నివేదికలో చాలా స్పష్టంగా తేలిపోయిందని, అధికారులు, డైరీ యజమానులు లాలూచీ పడటం వల్ల జరిగింది అని సీబీఐ తేల్చిందని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు చేప కొవ్వు, పంది కొవ్వు ఎక్కడ వాడలేదు అని సీబీఐ తెలిపిందన్నారు. ఒక ఆవుకూడా లేని సంస్థ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోంది. ఎడీడీబీ చైర్మన్ ను పిలిపించి 50 కోట్ల నిధులతో , గిర్,సాహివాల్ ఆవులు ద్వారా పెయ్యా దూడలు పెంచే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ఎన్డిడిబి ద్వారా బీటా స్టెరాలసిస్ టెస్టు లకు అత్యాధునిక మెషీన్లు మా హయాం లో కొనుగోలు చేశాం. నెయ్యి ప్రామాణికత మెరుగు పర్చడానికి 5.కోట్ల50 లక్షలు నూతన యంత్రాలు మేము కొనుగోలు చేశాం. విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర 2013 నుంచి సాంకేతిక నిపుణులు గా ఉన్నారు..వీళ్లు దోషులు అని సీబీఐ తేల్చిందని భూమన తెలిపారు.యజ్ఞం చేస్తున్నది జగన్ మోహన్ రెడ్డి, రక్తం పోస్తున్నది పవన్ కళ్యాణ్, చంద్రబాబు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌరవ్ బోరా అనే బోర్డు సభ్యుడు నెయ్యి సరఫరా చేస్తున్నారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తమ స్వార్థం కోసం 140 కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. నాలుడుట్యాంకర్ లు తిరస్కరించినవి మళ్ళీ కొండకు వస్తె, తిరిగి మళ్ళీ కల్తీ నెయ్యి ను లడ్డూ తయారీకి వాడారు..దీనికి సమాధానం చెప్పాలని భూమన నిలదీశారు. మా పాలనలో 18 ట్యాంకర్ లు రిజెక్ట్ అయ్యాయి. మీ హయంలో 14 ట్యాంకర్ లు రిజెక్ట్ అయ్యాయి. 2024 సెప్టెంబర్ 24 మళ్ళీ అదే నెయ్యి కల్తీ అయ్యిందని చంద్రబాబు ప్రచారం చేశారు. ఏడాదిన్నర గా నెయ్యి కల్తీ చేశారని, మతం రెచ్చగొట్టి, హిందువులు రెచ్చ గొట్టారు. పదవి పొందడం కోసం పాతాళం కన్నా కిందికి దిగజారారు. పవన్ కళ్యాణ్ పాప పరిహారం కోసం అమరావతి నుంచి తిరుపతి వరకురోడ్లు కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకోవాలని భూమన డిమాండ్ చేశారు. -
మొత్తం 500 వీడియోలు.. నువ్వసలు ఎమ్మెల్యేవేనా ?
-
ఇది జనసేన పతనం.. పవన్ కళ్యాణ్ ఒక డమ్మీ.. అందుకే నో యాక్షన్
-
నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాలమరణంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ తరుణంలో ఈ విషాదం మహారాష్ట్రకు తీరని లోటని ఎక్స్లో నివాళి అర్పించారు. అజిత్ పవార్ చాలా నిష్కపటమైన వ్యక్తి అని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడం ఆయన నైజం కాదని థాకరే అన్నారు. అంతేకాదు రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషాద సమయంలో తన కుటుంబం, పవార్ కుటుంబం దుఃఖంలో పాలుపంచుకుటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన తరపున అజిత్ పవార్కి హృదయపూర్వక నివాళులంటూ ట్వీట్ చేశారు. "నా స్నేహితుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. మహారాష్ట్ర రాజకీయాలు ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయాయి. అజిత్ పవార్, నేను దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మా పరిచయం చాలాకాలం తర్వాత ఏర్పడింది. అపారమైన అభిరుచి, బలంతో, అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయ రంగంలో గొప్ప పురోగతి సాధించారు. ఆయన పవార్ సాహెబ్ స్ఫూర్తితోఎదిగిన నాయకుడైనప్పటికీ, తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకుని,. మహారాష్ట్ర నలుమూలలా తనదైన ముద్ర వేసుకున్నారు’’ అని ట్వీట్ చేశారు."1990వ దశకంలో మహారాష్ట్రలో పట్టణీకరణ ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాలు పాక్షిక పట్టణీకరణ వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి, అయినప్పటికీ అక్కడి రాజకీయాల తీరు గ్రామీణంగానే ఉంది, అయితే వారి సమస్యల స్వభావం కొంతవరకు పట్టణంగా మారడం ప్రారంభమైంది. ఈ రకమైన రాజకీయాలపై అజిత్ పవార్కు పూర్తి అవగాహన, నేర్పుగా నిర్వహించే నైపుణ్యం కూడా ఉంది. దీనికి పింప్రి చించ్వాడ్ , బారామతి దానికి రెండు అద్భుతమైన ఉదాహరణలు. అది పింప్రి చించ్వాడ్ అయినా లేదా బారామతి అయినా, అజిత్ దాదా ఈ ప్రాంతాలను తన రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరించే విధంగా మార్చారు అంటూ థాకరే ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.ఇదీ చదవండి: అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలుపరిపాలనపై అజిత్ పవార్కు కచ్చితమైన పట్టు ఉందని, నిలిచిపోయిన ఫైళ్లను ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసని ఎంఎన్ఎస్ అధినేత అన్నారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ యుగంలో, మహారాష్ట్ర అటువంటి నాయకుడిని కోల్పోవడం అత్యంత విషాదకరం అని ఆయన నివాళి అర్పించారు. ఆయన కల్మషం లేని వ్యక్తి. ఆయనలో కుల పక్షపాతం ఏమాత్రం లేదు, ఆయన రాజకీయాల్లో కులానికి అస్సలు చోటు లేదు. నేటి రాజకీయాల్లో, కులంతో సంబంధం లేకుండా వ్యవహరించే ధైర్యం చూపే నాయకులు తగ్గిపోతున్న తరుణంలో నిస్సందేహంగా అజిత్ పవార్ వారిలో అగ్రగామిగా ఉన్నారు. రాజకీయాల్లో నిష్కపటత్వానికి, నిజాయితీకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో విరోధం అనేది రాజకీయపరమైందే త ప్ప వ్యక్తిగతమైనది కాదు. అందుకే మహారాష్ట్రలో ఒకరిపై ఒకరు చేసుకునే తీవ్ర విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకూడదని గుర్తుంచుకునే నాయకులు తగ్గిపోతున్నారు. ఉదార స్వభావం గల ప్రత్యర్థులు రాజకీయాల నుండి వరుసగా వైదొలగడం మహారాష్ట్ర ఉన్నత రాజకీయ సంప్రదాయానికి తీరని లోటనిపేర్కొన్నారు.ఇదీ చదవండి: Ajit Pawar jet crash : హాట్ టాపిక్గా ఆ ఇద్దరు పైలట్లు78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! -
జాతీయ మీడియా ముందు ఏపీ పరువు తీస్తున్నారు!
-
మరుగుదొడ్లపై ఫోటోలు వేసుకునే మీరా జగన్ గురించి మాట్లాడేది
-
‘తగ్గేదే లే..’.. అదే మాటపై శశి థరూర్
కోజికోడ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరిని పార్లమెంటులో ఏనాడూ ఉల్లంఘించలేదని, అయితే ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని బలంగా వినిపించానని శశి థరూర్ స్పష్టం చేశారు. పహల్గామ్ ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఆ ఒక్క విషయంలో మాత్రమే పార్టీతో బహిరంగంగా విభేదించాల్సి వచ్చిందని, దానికి తాను ఏమాత్రం విచారించడం లేదని థరూర్ తేల్చిచెప్పారు.శనివారం కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడిన శశి థరూర్, పార్టీ నాయకత్వంతో విభేదాలు ఉన్నాయన్న వార్తలపై స్పందించారు. పార్లమెంటులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలకు, విధానాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో మాత్రం తాను భిన్నమైన వైఖరిని అవలంబించినట్లు అంగీకరించారు. ఆ సమయంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను తీసుకున్న కఠినమైన వైఖరికి కట్టుబడి ఉన్నానని, దానిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ధరూర్ తేల్చి చెప్పారు.పహల్గామ్ ఘటన తర్వాత తాను ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన కాలమ్ను థరూర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ పరిమిత సైనిక చర్య చేపట్టాలని తాను ఆనాడే సూచించానన్నారు. భారత్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న దేశమని, పాకిస్తాన్తో సుదీర్ఘ యుద్ధానికి దిగకుండానే ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని తాను భావించానన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తాను సూచించిన తరహాలోనే చర్యలు తీసుకుందని, ఈ విషయంలో తన వైఖరి సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశాలకు గైర్హాజరు కావడంపై వస్తున్న ఊహాగానాలపైన కూడా థరూర్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలు ఉన్నాయని అన్నారు. తాను హాజరుకాలేనని పార్టీకి ముందుగానే సమాచారం ఇచ్చానని, ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే పార్టీ వేదికలపైనే చర్చిస్తానన్నారు. మరోవైపు కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, థరూర్ గైర్హాజరును వివాదంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇది కూడా చదవండి: ముంబై మేయర్ ఎన్నికపై మరింత ఉత్కంఠ -
ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి భట్టి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వంపై తప్పుడు కథనాలు రాసిన ఎబీఎన్ రాధాకృష్ణపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వీకెండ్ స్టోరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి టెండర్ల విషయంలో అనేక అపోహలు సృష్టించారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే ఆ టెంటర్లు రద్దు చేశామన్నారు.ఏబీఎన్ రాధాకృష్ణ తెలంగాణ ఆత్మ సింగరేణిపై కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. పెట్టుబడులు - కట్టుకథలు - విషపు రాతలతో రాధాకృష్ణ రేపిన తప్పుడు ప్రచారంతో మొదలయింది. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు రాతలు- విషపు రాతలు రాశారన్నారు. ఏ రాబందులు- గద్దలు- దోపిడీ దారుల ప్రయోజనాల కోసం కథనాలు వస్తున్నాయని ప్రశ్నించారు. తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలన్నారు.ప్రభుత్వంపై నిందలు మోపి రాష్ట్రానికి- సింగరేణికి నష్టం చేస్తున్నారని, రాధాకృష్ణ ఊహగాన కథనాలు రాశారన్నారు. కథనం రాగానే ఒకాయన లేఖ రాశారు! ఇంకోగాయన స్పందించారన్నారు. వరుస ఎపిసోడ్స్ వెనుక ఆంతర్యం ఏంటి? అని భట్టి ప్రశ్నించారు. సింగరేణి నుంచి ఏ నిర్ణయంపై మంత్రి వద్దకు ఫైల్స్ రావని, సింగరేణి స్వతంత్ర బాడీ అని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుదన్నారు. కనీస ఇంగితజ్ఞానం లేకుండా కథనం రాశారని భట్టి పేర్కొన్నారు. దీనిపై హరీశ్రావు లేఖ రాయడం, కిషన్ రెడ్డి విచారణ మొదలు పెట్టడం మంచిదయ్యిందన్నారు. కిషన్ రెడ్డి విచారణను తాను స్వాగతిస్తున్నానన్నారు. కొందరి ప్రయోజనాల కోసం పని చేసే వాళ్ల అన్ని విషయాలు బయటకు రావాలని భట్టి అన్నారు. సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ తప్పనిసరి నిబంధన 2018లో కేంద్ర ప్రభుత్వమే పెట్టిందని, 2021లో సింగరేణి - కోల్ ఇండియా ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లెకముందే సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాత పద్ధతి ప్రకారమే టెండర్లు పిలిచారు. ఎన్ఎండీసీ 2021లో సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారని భట్టి తెలిపారు.బిడ్డర్లు సైట్ విజిట్ చేయాలని నిబంధనలు ఉన్నాయి. హిందూస్తాన్ కాపర్స్ లిమిట్ ఆధ్వర్యంలో సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారు. జీఐసీపీఎల్ సైట్ విజిట్ తప్పని అంటూ టెండర్లు పిలిచారు.గుజరాత్ లో సైట్ విజిట్ చేసినట్లు సర్టిఫికెట్ సబ్మిట్ చేసినట్లు సంతకాలు ఉన్నాయి. తమిళ నాడులో నవరత్న కంపెనీ సైట్ విజిట్ సర్టిఫికెట్ లతోనే టెండర్లు పిలిచారు. ఉత్తరాఖండ్లో సైనిక్ స్కూల్ టెండర్లలో సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ డిఫెన్సె శాఖ లేఖలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు.కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన టెండర్లలో సైట్ విజిట్ తప్పనిసరి చేసిందని, మహారాష్ట్రలో డిపార్ట్మెంట్ ఎకనామిక్స్లో సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ టెండర్లు పిలిచారని, దీన దయాళ్ పోర్ట్ లో సైట్ విజిట్ అథారిటీ టెండర్లు పిలిచారని భట్టి తెలిపారు. జమ్ముకశ్మీర్ లో అక్కడి ప్రభుత్వం సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ టెండర్లు పిలిచిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. -
లోపల స్వెటర్ తో దొరికిపోయిన దావోస్ మ్యాన్.. కారుమూరి సెటైర్లు
-
కప్పు టీ కంటే తక్కువ రేటుకు విశాఖలో భూములు
-
ఏకంగా 15000 వేల గ్రామ సచివాలయాలు.. మన రికార్డును ఎవరూ టచ్ చెయ్యలేరు!
-
మేనిఫెస్టో కాపీని చూపిస్తూ.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్రలో వచ్చింది..
-
క్రెడిట్ చోరీ చేయడంలో బాబు తర్వాతే ఎవరైనా !
-
దావోస్ హీరోలు.. తెచ్చింది జీరో.. చంద్రబాబు, లోకేష్ బేతాళ కథలు
-
టీమ్ 11 తో జగన్ గేమ్.. లోకేష్ లో భయం స్టార్ట్
-
లోకేష్ రెడ్ బుక్ లోని మిగిలిన 97 పేజీలు మడిచి ఎక్కడైనా పెట్టుకో..
-
నమ్మరేంట్రా బాబు.. దావోస్ మ్యాన్.. కారుమూరి వెంకట్ రెడ్డి సెటైర్లే సెటైర్లు
-
మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు.. ఏం పీక్కుంటారో పీక్కోండి? రెచ్చిపోతున్న లోకేష్
-
నారా లోకేష్ అరెస్ట్ ఖాయం.!
-
ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బాలీవుడ్
-
ముంబై ఫలితాలు.. శివసేనపై కత్తి దూసిన కంగనా
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలపై హిమాచల్ ప్రదేశ్లోని మండి ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. 2020లో అవిభక్త శివసేన అధికారంలో ఉన్నప్పుడు బాంద్రా వెస్ట్లోని తన బంగ్లాను బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన ఘటనను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ‘మహిళా ద్వేషులు, రౌడీలు, నెపోటిజం మాఫియా’కు ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పారని కంగనా వ్యాఖ్యానించారు.ముంబైలో శివసేన (ఠాక్రే వర్గం) ప్రాబల్యం తగ్గి, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంపై కంగనా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనవిజయానికి కారకులైన ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నన్ను దూషించి, నా ఇల్లు కూల్చివేసి, మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని రాష్ట్ర ప్రజలే బహిష్కరించారు. అహంకారులు, మహిళా వ్యతిరేకులకు ‘జనతా జనార్దనులే’ వారి స్థానం ఏమిటో చూపించారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.గతంలో ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని కంగనా రనౌత్ కార్యాలయంలో కొంత భాగాన్ని నిబంధనల పేరుతో బీఎంసీ కూల్చివేసింది. దీనిపై కంగనా.. బాంబే హైకోర్టును ఆశ్రయించగా, నాడు న్యాయస్థానం బీఎంసీ చర్యను తప్పుబడుతూ, అది పూర్తిగా దురుద్దేశంతో కూడినదని స్పష్టం చేసింది. ముంబై పోలీసులపై, ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యల కారణంగానే నాడు బీఎంసీ కక్షపూరితంగా వ్యవహరించిందని కంగనా ఆరోపించారు. నాటి అవమానానికి ఈనాటి ఎన్నికల ఫలితాలే సరైన సమాధానమని ఆమె అన్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఎన్నికల్లో బీజేపీ 11,79,273 ఓట్లతో (21.58 శాతం) ఏకంగా 89 స్థానాలను కైవసం చేసుకుని బీఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల విజయం సాధించింది. ముంబైతో పాటు పూణే, పింప్రి-చించ్వాడ్, థానే, నాసిక్, నవీ ముంబై వంటి కీలక నగరాల్లోనూ బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. ఇది కూడా చదవండి:అమెరికా ‘కస్టడీ’లో ఇద్దరు భారత విద్యార్థులు -
యువతులు దుస్తులు విప్పి డాన్సులు చేయిస్తుంటే..! పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ?
-
పోలీసులు కొడతారు.. టీడీపీ వాళ్లు చంపుతారు
-
15 సంవత్సరాలు అధికారంలో ఉంటాడంటా.. పవన్ పై రోజా సెటైర్లు
-
అయ్యా ABN మెంటల్ కృష్ణ.. రాధా కృష్ణ తుక్కు రేగొట్టిన నాగమల్లేశ్వరి
-
మిగిలేది ఆవకాయ తొక్కే.. బాబు, పవన్ పై బైరెడ్డి సెటైర్లే సెటైర్లు
-
జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది
-
మైసూరు బోండంలో మైసూరు ఉండదు.. మన రాజధానిలో అమరావతి ఉండదు
-
నలుగురు ముసలోళ్లని డిబేట్ లో కూర్చోబెట్టి జగన్ ను తిట్టిస్తావా?
-
సభ అట్టర్ ఫ్లాప్.. పాస్ బుక్ ఇవ్వడం కోసం హెలికాప్టర్.. పేర్నినాని సెటైర్లు
-
జగన్ పేరు వింటే మూడు సార్లు బాత్రూం కి వెళ్లే మీరు..
-
కరెంటు చార్జీలు తగ్గించడం వెనుక బయటపడ్డ బాబు మోసం
-
భోగాపురం అసలు కథ ఇది.. క్రెడిట్ దొంగ చంద్రబాబు
-
టీడీపీ నేతల మైకుల్లో మారుమోగిన జగన్ మంచితనం
-
ప్రజలకు సంజీవని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
సొంత రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర హీనుడు చంద్రబాబు
-
ఇంట్లో దోమలను చంపలేడు కానీ పొలుసు పురుగును డ్రోన్ తో చంపుతాడు అంట
-
వసూలు రాజా.. బాబు అపాయింట్మెంట్ కావాలంటే ముందు లోకేష్ కు..
-
మిమ్మల్ని నమ్మం సార్.. అగ్రిమెంట్ రాసి ఇస్తారా?
-
రాయలసీమ ప్రాజెక్ట్ పై అసలు కథ.. బాబును అడ్డంగా బుక్ చేసిన మంత్రి నిమ్మల..
-
రాయలసీమకు మరణశాసనం రాసింది చంద్రబాబే: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి తాడేపల్లి: ప్రాజెక్టుల విషయంలో క్యూసెక్కులు, టీఎంసీలకు మధ్య కనీస తేడా సైతం తెలియని వ్యక్తి మంత్రి నిమ్మల రామనాయుడని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి రాయలసీమ ఎత్తిపోతల పథకం విలువ ఏలా తెలుస్తుందని ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ లిప్టుతో ఎన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయన్న విషయం మంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు.రాయలసీమను ఎడారిగా మార్చబోతే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ తెచ్చి ఊపిరి పోశారన్నారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోతిరెడ్డిపాడును అడ్డుకునేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ప్రభుత్వానికి రాయలసీమ మీద ఎందుకంత కోపమో తెలియదన్నారు. చంద్రబాబే రాయలసీమకు మరణ శాసనం రాశారని తెలిపారు.1995లో ఆల్మట్టి డ్యాం నిర్మాణాన్ని ఆపలేదు. అప్పటినుంచే చంద్రబాబు రాయలసీమ విషయంలో కుట్రలు జరుపుతున్నారని తెలిపారు.ఇప్పుడు రాయలసీమ లిఫ్టుపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు సహించరన్నారు. ఆల్మట్టి నుండి జూరాలకు నీరు వచ్చేసరికే వాటిని పక్క రాష్ట్రాలు దోచేస్తున్నాయి. శ్రీశైలంలో 800 అడుగులకు నీరు రాకముందే తెలంగాణకు జలాలు వెళుతున్నాయి. ఇక వీటన్నిటిని దాటి ఇక రాయలసీమకు నీరు ఏప్పుడు వస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం డేడ్ స్టోరేజీ వాటర్ కూడా ఉండడం లేదు. చంద్రబాబు నిర్లక్ష్యం వలనే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు.బ్రహ్మం సాగర్, గండికోట ప్రాజెక్టులను మాజీ సీఎం జగన్ పూర్తి చేశారని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమకు చేసిందేంటని ప్రశ్నించారు. మంత్రి నిమ్మలతో చంద్రబాబు మాట్లాడించిన మాటలను వెంటనే వెనక్కు తీసుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంవత్సరంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకోవాలని తెలిపారు. -
బీజేపీ నేత నవనీత్ కౌర్కు అసదుద్దీన్ కౌంటర్
ముంబై: బీజేపీ నేతలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ నేత నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ కౌంటరిచ్చారు. కుటుంబంలో పిల్లల్ని కనడం అనే అంశంపై ఇరు నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగింది. మీకు నచ్చిన విధంగా పిల్లల్ని కనండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అని ఒవైసీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతకుముందు బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొంతమంది అధికంగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ హిందుస్థాన్ని పాకిస్థాన్లా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకోవాలంటే హిందువులు సైతం తప్పనిసరిగా ముగ్గురు, నలుగురు పిల్లలని కనాలి. నేను అందరు హిందువులకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్లంతా నలుగురు భార్యలు,19 మంది పిల్లలు అని బహిరంగంగా చెప్పుకుంటారు. వారంతా మౌలానానా, మరోకరా అనేది నాకు తెలియదు. కానీ వారంతా అధికమంది పిల్లలను కనడం ద్వారా హిందుస్థాన్ని పాకిస్థాన్లా మార్చాలనుకుంటున్నారు. కనుక మనం కూడా ఒక్కరితో సంతృప్తి చెందకూడదు. తప్పనిసరిగా ఎక్కువ మంది పిల్లలని కనాలి" అని ఆమె అన్నారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలపై ఎంపీ అసుదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో అసద్ మాట్లాడుతూ.. ఆమె వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటరిస్తూ మాట్లాడారు. "మహారాష్ట్రలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఇదివరకూ ఈ నియమం తెలంగాణలో కూడా ఉండేది కాని ఇప్పుడు రద్దు చేశారు. నాకు ఇప్పుడు ఆరుగురు పిల్లలున్నారు. మీరు కూడా నలుగురిని కనండి మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు" అని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. -
కొబ్బరి కాయ కొట్టడం తప్ప.. నువ్వు చేసిందేమీ లేదు బాబూ
-
చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత
-
ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు
-
'వెనిజులా నేనే పాలిస్తా' ఇది సాధ్యమేనా? ట్రంప్ తప్పుకు భారీ శిక్ష?
-
లైవ్ లో రేవంత్ అబద్ధాలు.. బట్టబయలు చేసి పరువు తీసిన హరీష్
-
రాయలసీమ హక్కుల తాకట్టు! మీ రేవంతే చెప్పాడు.. ఇప్పుడు ఏమంటావ్ బాబూ..?
-
ఈసారి అధికారం రాదు.. ఇప్పుడే సంపాదించుకోండి.. బాబు బంపర్ ఆఫర్
-
మా సీఎం ఎక్కడ ఉన్నారో కనిపెట్టండయ్యా DGP గారూ..!!
-
రెహ్మాన్ తొలగింపుపై శశిథరూర్ కామెంట్స్
క్రీడల విషయంలో రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కోల్కతా నైట్రైడర్స్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ని తొలగించడంపై ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఈ విధంగా స్పందించడం సరికాదన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ని జట్టు నుంచి విడుదల చేయాలని డిమాండ్లు పెరిగాయి. దీంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఆయనను జట్టు నుంచి విడుదల చేసింది. అయితే ఇది సరైన చర్య కాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.శశిథరూర్ మాట్లాడుతూ " క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం బుద్ధిహీనమైన చర్య ఒకవేళ ఆస్థానంలో బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్ లిట్టన్ దాస్, సౌమ్యాసర్కార్ ఉంటే ఈ విధంగానే చేసేవారా మీరు ఎవరిని శిక్షిస్తున్నారు, దేశాన్నా? మతాన్నా? వ్యక్తులనా? అని శశిథరూర్ అన్నారు. మైనార్టీలపై దాడులను మోయడానికి క్రికెట్ను వాడకూడదు. బంగ్లాదేశ్ క్రికెటర్ రహ్మన్ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయలేదు. ఎవరిపైనా దాడి చేయలేదు. ఈ ఘటనలతో ఎటువంటి సంబంధం లేదు" అని అన్నారు. ఆయన కేవలం ఒక ఆటగాడని అతనిని ఈ ఘర్షణలతో ముడిపెట్టడం సరికాదన్నారు. అంతేకాకుండా పొరుగుదేశాలతో ఏ దేశం క్రీడలు ఆడకుండా ఏకాకి చేయడం సరికాదని ఈ విషయంలో భారత్కు పెద్ద హృదయం ఉండాలని సూచించారు. అయితే బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను భారత్ తప్పనిసరిగా ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు. -
అమరావతి రైతులకు నీళ్లలో, స్మశానంలో ఇల్లు.. బాబు బండారం బయటపెట్టిన నాగార్జున యాదవ్
-
2 లక్షల పుస్తకాలు చదివి సైన్స్ చదవడం మర్చిపోయాడు
-
నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?
-
ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన
-
విదేశీ రహస్య ట్రిప్.. బాబు, లోకేష్ లో టెన్షన్..
-
న్యూ ఇయర్ వేళ లోకేష్ మిస్సింగ్..!
-
జగన్ చేతికి బ్రహ్మాస్త్రం.. చంద్రబాబు రాజకీయ పతనానికి ఇదే ఆయుధం
-
ఆపరేషన్ సిందూర్.. మరోసారి గెలికిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటం అంతా ఇంతా కాదు అందుకోసం ఏదైనా దేశాల మధ్య పంచాయితీ ఉంటే హడావుడిగా వెళ్లి అందులో వేలు పెట్టడం తర్వాత వారి మధ్య పంచాయితీ తానే తెగ్గొట్టానని క్రెడిట్ కొట్టేయడం ట్రంప్కు చాలా కామన్గా మారింది. ఇప్పటి వరకూ తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని అయినా తనను ఎవరూ గుర్తించరని తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆ మధ్య కస్సుబుస్సులాడారు.ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఇండియా-పాక్ల మధ్య తానే ఆపానని వార్ ఆపకుంటే అధిక పన్నులు విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని తెలిపారు. ఇలా యుద్ధం ఆపాననే ప్రకటనను ట్రంప్ ఇదివరకూ దాదాపు 70 సార్లు పలికాడంటే ఈ విషయంలో ఆయన భారత్ను ఎంతగా రెచ్చగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్ అంశం తెరమీదకొచ్చింది.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రస్థావన తెరమీదకు తెచ్చారు. "ఇదివరకూ నేను ఎనిమిది యుద్ధాలను నియంత్రించాను. ఇండియా, పాకిస్థాన్ విషయంలోనూ అంతే కానీ ఆ క్రెడిట్ నాకు ఇవ్వరూ. . నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. తాను గత పదేళ్లుగా ప్రయత్నిస్తూన్నా ఇది చేయలేకపోయానన్నారు. నేను మాత్రం ఒక్కరోజులో ఈ యుద్ధాలను ఆపా" అని ట్రంప్ బింకాలు పలికారు.ట్రంప్ మధ్యవర్తిత్వం అంశంపై భారత్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ అంశంలో ఏవరూ మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో ఈ అంశంపై ప్రకటన చేశారు. ఏ ప్రపంచ నాయకుడు ఆపరేషన్ సిందూర్ను ఆపమని భారత్ను అడగలేదని ఈ నిర్ణయం భారత్ స్వతంత్ర్యంగా తీసుకుందని స్పష్టం చేశారు. పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను వారి దేశంలోనే ధ్వంసం చేసింది. -
"సీఎం రేవంత్ తీరని ద్రోహం చేస్తున్నారు"
సాక్షి హైదరాబాద్: రాష్ట్రానికి సీఎం రేవంత్ తీరని జలద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్ల విషయంలో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తామే లేపామన్నారు. బీఆర్ఎస్ చెప్పినాకే ఆ అంశంపై ప్రభుత్వం స్పందించింది అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని హరీశ్రావు విమర్శించారు.అయితే అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీశ్ రావు విరుచుకపడ్డారు. జలమంత్రిగా పనిచేస్తూ రెండేళ్లయినా ఇంకా ఆ శాఖపై అవగాహన రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఇచ్చిన జీఓలో 90TMCల నీటి కేటాయింపు అంశం అస్పష్టంగా ఉందని ప్రస్తుత ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరిస్తూ లేఖ రాసిందని హరీశ్ రావు విమర్శించారు. -
అమిత్ షా ఆరోపణలకు దీదీ ఘాటు కౌంటర్
ఉగ్రవాద నెట్వర్క్లకు పశ్చిమ బెంగాల్ అడ్డాగా మారిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అలాంటప్పుడు పహల్గాం దాడిని కేంద్రమే జరిపించిందా? అని నిలదీశారామె. మంగళవారం బంకురా బిర్సింగ్పూర్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని, ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ఆ లెక్కన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు లేరంటే.. పహల్గాం దాడి ఎలా జరిగింది? దాన్ని మీరే చేయించారా?.. దేశ రాజధానిలో జరిగిన దాడికి కారణం ఎవరు?(ఎర్రకోట దాడిని ఉద్దేశించి..) అని ప్రశ్నించారామె. ప్రధాని మోదీని మహాభారతంలో దుర్యోధనుడిగా.. అమిత్ షాను దుశ్శాసనుడితో ఆమె పోల్చారు. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు.. ఇక్కడి నుంచి సమాచారం సేకరించేందుకు వచ్చారు. ఎన్నికల సమయంలోనే ఆ దుర్యోధన దుశ్వాసనలకు బెంగాల్ గుర్తుకు వస్తుంది. ఓట్ల కోసం ఎగబడి వచ్చేస్తుంటారు అని మండిపడ్డారామె. ఇక తీవ్ర చర్చనీయాంశమైన ఎన్నికల జాబితా వివాదం (SIR) ప్రస్తావిస్తూ కేంద్రంపై టీఎంసీ అధినేత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ ప్రజలను కేంద్రం ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తోంది. కోటిన్నర ఓట్లను తొలగించే యత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో.. రాజ్బన్షీలు, మటువాలు, ఆదివాసీలు లక్ష్యంగా మారతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఎస్ఐఆర్ నిర్వహించడం పెద్ద మోసం. ఇది ఇలాగే కొనసాగితే చివరికి మీరు (అమిత్ షా) మరియు మీ కుమారుడు మాత్రమే మిగిలిపోతారు అని మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్రంపై దృష్టిసారించింది. ఈ నెల 20న బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించారు. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం మరో అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని ఆరోపించారు. అలాగే.. మమత పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని.. ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందకుండా టీఎంసీ సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలను కోరారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని.. అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని హామీ ఇచ్చారు. -
"కృష్ణానది ఎక్కడ ఉందో తెలియదు"
సాక్షి హైదరాబాద్: కృష్ణానది ఎక్కడ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అడగడం హస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉన్న సంగతి కూడా సీఎంకు తెలియకపోవడం బాధాకరమన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తినే ఈ రోజు ప్రభుత్వం నీటి పారుదల శాఖ సలహాదారుగా నియమించిందని తెలిపారు.అసెంబ్లీలో నీటి సమస్యలపై దేనిమీద చర్చపెట్టాలో సైతం కనీసం ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. కేసీఆర్ చర్చకు వస్తున్నారని మంత్రులంతా ప్రిపరేషన్ మెుదలు పెట్టారని రాష్ట్ర మంత్రులను కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అయితే సభా కార్య కలాపాలపై ఈ రోజు బీఎసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు జరపాలని సమావేశంలో నిర్ణయించారు.అయితే అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నడపాలని బీఆర్ఎస్, 20 రోజులు నడపాలని బీజేపీ పార్టీలు పట్టుబట్టాయి. ఈ అంశంపై తదుపరి నిర్వహించే బీఎసీ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని స్వీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. -
పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!
-
హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్
-
అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్
-
టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు
-
శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్
-
వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు
-
వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు
-
'మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి.. అంతే కానీ'.. శివాజీకి టాలీవుడ్ నిర్మాత కౌంటర్
టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హీరోయిన్ల డ్రెస్సులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ యావత్ మహిళా లోకం ఒక్కసారిగా విరుచుకుపడింది. సినీతారలతో పాటు సామాన్యులు సైతం శివాజీపై విమర్శలు చేశారు. ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై వల్గర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత తాను ఆ రెండు పదాలు మాత్రమే వాడకుండా ఉండాల్సిందని సారీ చెబుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇటీవల శివాజీ కామెంట్స్పై కేవలం మహిళలు మాత్రమే కాదు.. నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, నటుడు ప్రకాశ్ రాజ్ శివాజీ కామెంట్స్పై స్పందించారు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.తాజాగా శివాజీ కామెంట్స్పై నిర్మాత ఎస్కేఎన్ తనదైన స్టైల్లో పంచ్లు వేశారు. పతంగ్ మూవీ సక్సెస్ మీట్కు హాజరైన ఎస్కేఎన్ హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడే హీరోయిన్ను చూసి మామూలు డ్రెస్ వేసుకొచ్చారేంటి?..మన తెలుగు అమ్మాయి కాస్తా గ్లామర్గా రావాల్సిందన్నారు. మన తెలుగు హీరోయిన్స్, తెలుగమ్మాయిలు మీకు ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటే అదే వేసుకోండి.. ఏది కాన్ఫిడెంట్గా అదే వేసుకోండని అన్నారు. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన పని లేదన్నారు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే బాగుంటామని.. మన ఇంటెన్షన్ బాగుంటే అంతా మంచే జరుగుతుంది.. అంతే తప్ప మన డ్రెస్సుల్లో ఉండదని పరోక్షంగా శివాజీకి కౌంటరిచ్చారు ఎస్కేఎన్. #Counterఎ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటె వేసుకోండి ఎ డ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉంటే వేసుకోండి. ఎ బట్టల సతి గాడి మాట వినకండి!!- #SKN @ #Patang Event pic.twitter.com/ye0Knl85uQ— Telugu Bit (@Telugubit) December 27, 2025 -
వీళ్లకు బుద్ది రావాలంటే.. పవన్, చంద్రబాబులను ఏకిపారేసిన ప్రకాష్ రాజ్
-
మోదీని ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ కామెంట్స్
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఒకప్పడు సాధారణ కార్యకర్తలా పనిచేసిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎదిగారన్నారు. ప్రధాని మోదీ 1990 దశకంలో ఉన్న చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో జోడిస్తూ ఈ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ను ఇరుకున పడేశాయి.ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే పెనం లోంచి పొయ్యి మీద పడ్డ చందాన కనిపిస్తుంది. ఇప్పటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు తరచుగా ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తూ సంస్థాగత లోపాలను ప్రశ్నిస్తుంటే.. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు హస్తానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.దిగ్విజయ్ సింగ్, ప్రధాని మోదీకి సంబంధించిన 1990 దశకం చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ చిత్రంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘోలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంలో తీసింది. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఉన్నారు. ఇందులో ప్రధాని మోదీ సాధారణ కార్యకర్తలా అద్వానీ ముందు నేలపై కూర్చొని ఉన్నారు. ఆ చిత్రాన్ని ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేశారు."ఈ చిత్రాన్ని నేను కోరాలో చూశాను. ఇది చాలా ఇంపాక్ట్ పుల్ అనిపించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంటుందో ఈ చిత్రం తెలుపుతుంది. ఒకప్పుడు నాయకుల ముందు నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు దేశానికే ప్రధాని అయ్యారు. ఇది సంస్థ యెుక్క గొప్పతనానికి నిదర్శనం. జైశ్రీరామ్" అని దిగ్వీజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆ పోస్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ట్యాగ్ చేశారు.ఈ పోస్టుతో బీజేపీ కాంగ్రెస్పై అటాక్ స్టార్ట్ చేసింది. దిగ్విజయ్ సింగ్ పోస్టులకు రాహుల్ సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన దిగ్విజయ్ సింగ్ తాను ఆర్ఎస్ఎస్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తాను కేవలం ఆర్గనైజేషన్ సంస్థగత నిర్మాణాన్ని మాత్రమే తాను ప్రశంసించానని తెలిపారు.కాగా వారం రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలోని లోపాలను బహిరంగంగా ప్రశ్నించారు "రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్కు ఎలా సంస్కరణలు అవసరమో కాంగ్రెస్కు సైతం అదేవిధంగా సంస్కరణలు అవసరం. నాయకత్వ వికేంద్రీకరణ జరగాలి. మీరు అది చేయగలరని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని ఒప్పించడమే పెద్ద ప్రాబ్లం అని రాహుల్ని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలపై గతంలో దుమారం చెలరేగింది. -
ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్
-
తగ్గేదేలే.. అనసూయ గారూ.. తొందరలోనే నీ ఋణం తీర్చుకుంటా
-
బాబే ఒక చిల్లర..! లోకేష్, పురందేశ్వరి చిల్లర మర్చిపోయావా!
-
నిన్ను 53 రోజులు జైలుకు పంపింది అందుకే
-
తోలు తీస్తా, తొక్క తీస్తా.. చివరికి మీ వాడికే తోలు తీశారు
-
ఒక్కమాటలో శివాజీకి ఇచ్చిపడేసిన హెబ్బా
-
హైకమాండ్ను ఇబ్బంది పెట్టను
శివాజీనగర/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీకే బుధవారం కర్ణాటక భవన్లో మీడియాతో మాట్లా డుతూ, ‘సీఎం సిద్ధరామయ్య హైకమాండ్ కోర్టులో బంతి వేశారు. హైకమాండ్కు సమస్య కలిగించబోను. రాహుల్గాంధీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పార్టీ కార్యకర్తగానే ఉండేందుకు ఇష్టపడతాను’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో హైకమాండ్ నేతలు ఎవరితోనూ తాను సమావేశం కాలేదని కూడా స్పష్టం చేశారు. సీఎం మార్పుపై ఎలాంటి ఊహాగానాలు లేవని, అల్పాహార విందులు మా మూలు విషయాలేనని కూడా అన్నారు. మైసూరులో సీఎం సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన వర్గీయు లు బీసీ, దళిత (అహింద) సమావేశం జరపబో తున్నారన్న వార్తలను ప్రస్తావించగా, అదంత మంచిది కాదని సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ మార్పి డి వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య పట్టువీడకపోవడం.. హైకమాండ్ కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం.. స్థానికంగానే ఈ సమస్యను పరిష్కరించుకుంటారంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటన వంటి పరిణామాల నేపథ్యంలో శివకుమార్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంత రించుకుంది. దీనితో ఈ అంశంపై తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రం: మంత్రి జమీర్కాగా, సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రంగా ఉందని కర్ణాటక గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ బుధవారం విలేకరులతో అన్నారు. 2028 వరకు ఆయనే సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు. ‘హైకమాండ్ తప్ప వేరే ఎవరి వల్లా సీఎం సీటు నుంచి సిద్ధరామయ్యను తొలగించడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు. -
శివాజీ వల్గర్ కామెంట్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన రాజాసాబ్ బ్యూటీ..!
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్పై ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పందించింది. లులు మాల్లో జరిగిన సంఘటన తర్వాతే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పడంపై నిధి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. బాధితురాలిదే తప్పని నిందించడం మానిపులేషన్ అవుతుందని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇవాళ ప్రెస్ మీట్లో శివాజీ లులు మాల్లో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. నిధి అగర్వాల్కు అలా జరిగిన తర్వాతే తాను ఈ కామెంట్స్ చేశానని సమర్థించుకున్నారు.అంతకుముందు దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లను ఉద్దేశించి చీప్ కామెంట్స్ చేశారు. ఈవెంట్లకు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకోవద్దని.. అంతా బయటికి కనిపించేలా రావొద్దంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సినీతారలతో పాటు యావత్ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంకర్ అనసూయతో పాటు సింగర చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌంటరిచ్చారు. ఈ కామెంట్స్పై తెలంగాణ మహిళా కమిషన్ సైతం శివాజీకి నోటీసులు జారీ చేసింది.క్షమాపణలు చెప్పిన శివాజీ..తన కామెంట్స్పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో శివాజీ క్షమాపణలు కోరాడు. తాను ఆ రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందని.. అంతేకానీ నా ఉద్దేశం మాత్రం కరెక్ట్ అంటూ సమర్థించుకున్నారు. కేవలం ఆ రెండు పదాల వల్లే సారీ చెబుతున్నానంటూ వీడియోను రిలీజ్ చేశాడు. -
"లోకేశ్ దుర్యోధనుడిలా ప్రవర్తిస్తున్నాడు"
సాక్షి తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తుందని వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో గర్భిణిపై వైఎస్సార్సీపీ నేత దాడి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అయితే ఈ ఘటనతో తమ ఏలాంటి సంబంధం లేదనే విషయం ఇప్పటికే బయటపడిందని అన్నారు.‘‘కుటుంబ వివాదాలతో ఘర్షణ, తోపులాట జరిగితే దాన్ని అన్యాయంగా వైస్సార్సీపీకి అంటగడుతున్నారు. ఈ ఘటనలో అజయ్ అనే వ్యక్తిని రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్ళిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాలి. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందనే విషయం ముఖ్యమంత్రికి కూడా అర్థమయింది. చంద్రబాబు, లోకేష్ చర్యల వల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబుని పక్కన పెట్టి నారా లోకేష్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారు.... పై స్థాయిలో తండ్రీ కొడుకుల దోపిడీ జరిగితే కింద స్థాయిలో ఎమ్మెల్యేల దోపిడీ జరుగుతోందన్నారు. పవన్ వస్తే కాపులకు ఏదో గొప్పగా చేస్తారని అనుకున్నారు. కానీ, వైఎస్ జగన్ ఇచ్చిన కాపు నేస్తం పథకాన్ని కూడా ఎగొట్టేశారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులకు ముందుగా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాలి’’ అని సతీశ్ రెడ్డి అన్నారు. -
ఆంధ్రా కిమ్ నారా లోకేష్
-
ఆ సంఘటన చూశాకే మాట్లాడా.. అదే నేను చేసిన తప్పు: శివాజీ
దండోరా మూవీ ఈవెంట్లో తాను కామెంట్స్పై నటుడు శివాజీ మాట్లాడారు. మహిళల దుస్తులపై మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ రెండు పదాలు తాను వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. నా కంటే ఎంతోమంది నోరు జారారని.. కానీ వాళ్లెవరినీ ఇంతలా అడగడం లేదన్నారు. అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు రియాక్ట్ కావడంలో తప్పేం లేదన్నారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. టీవీలు చూస్తున్న ఆడపడచులందరికీ నమస్కారం. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన రెండు పదాల వల్ల సారీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది. దానికి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరిగితుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా. మీరు నామీద జాలి చూపించారు. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.మహిళల కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్ను చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఎవరినీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోండని ఎవరికీ చెప్పలేదని అన్నారు. సినిమా వల్లే యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే అలా చెప్పానని తెలిపారు. సమాజంలో ఏది జరిగినా సినిమాల వైపే వేలు చూపిస్తున్నారని అన్నారు. నేను వాడినా ఆ రెండు పదాలు తప్ప.. నా ఉద్దేశం అది కాదన్నారు. ఈ వివాదం తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు. దండోరా మూవీ రిలీజ్ అవుతున్నందుకు మూవీ ప్రమోషన్స్లో పాల్గొనాలనే ప్రెస్మీట్కు వచ్చానని శివాజీ తెలిపారు. ఈ సినిమా ఒక మంచి స్టోరీ అని.. కులాలు, అసమానతలపై వస్తోన్న ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. -
ఉస్మాన్ హాదీ హత్య అందుకే..?
బంగ్లాదేశ్ ప్రస్తుతం హింసతో అట్టుడుకిపోతుంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్గా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే హత్యకు గురైన ఉస్మాన్ హాదీ సోదరుడు అక్కడి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను ప్రక్కదోవ పట్టించేందుకు యూనస్ ప్రభుత్వమే ఉస్మాన్ని హత్య చేయించిందని ఆరోపించారు.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆ దేశంలోని మతతత్వ శక్తులు భారత్పై పగ పెంచుకున్నాయి. ఈ సందర్భంలోనే అక్కడ నివసిస్తున్న దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టిచంపారు. అనంతరం మరో హిందూ కుటుంబంపై దాడి చేయగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలతో భారత్లో నిరసనలు మిన్నంటాయు ఢిల్లీలోని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యలయాన్ని వీహెచ్పీ ఆధ్వర్యంలో ముట్టడించారు.అయితే ఇటీవల జరిగిన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన తమ్ముడు ఒమర్ హాది సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఎలక్షన్లని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఉస్మాన్ హాదీని హత్య చేయించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్లోని షాబాద్లో ఉస్మాన్ మృతి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు అందులో అతన సోదరుడు మాట్లాడుతూ. "మీరే ఉస్మాన్ హాదీని చంపించారు. ఇప్పుడు అతని చావు పేరుతో ఎన్నికలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.నా సోదరుడు ఎన్నికలు జరగాలని కోరుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని ఒమర్ తెలిపారు.ఉస్మాన్ హాదీ విదేశీ శక్తులకు తలొగ్గడానికి నిరాకరించాడని అందుకే ఆయనను కుట్రపన్ని హత్య చేయించారని తెలిపారు. అతని చావుకు కారణమైన వారు ఏదో ఒకరోజు దేశాన్ని వదిలి పారిపోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఉస్మాన్ హాదిని హత్య చేసిన వారిని గుర్తించడానికి ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇస్తున్నామని అంతలోపు వారిని అరెస్టు చేయకపోతే బంగ్లావ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని అక్కడి నాయకులు యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. -
పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!
-
శివాజీ కామెంట్స్ కి RGV ఘాటైన కౌంటర్!
-
5 కోట్ల ఆవకాయ.. బాబు వేస్ట్ అంటున్న పవన్
-
శివాజీకి బిగ్ షాక్.. సీరియస్ యాక్షన్ కు రంగం సిద్ధం
-
రఘురామపై 420 కేసులు.. డిప్యూటీ స్పీకర్ పదవి ఎలా ?
-
దెబ్బకు దిగొచ్చిన శివాజీ..!
-
పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై చర్చ జరుగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చుపకపోవడంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతల అంశంపై రాహుల్, ప్రియాంకలో మధ్య వారసత్వ పోరు నడుస్తోందని బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని, ప్రియాంకలో చూస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వారసత్వ పోరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రియాంక గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అయితే తనను ప్రధాని చేస్తే పాకిస్థాన్ భరతం పడుతుందని ఆమె ఇందిరా గాంధీ మనవరాలని తనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అధికార బీజేపీ ఈవ్యాఖ్యలపై కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన గురించి మాట్లాడారు.రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ "ప్రియాంకా చాలా కష్టపడుతుంది. ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. ప్రజల సమస్యలపై ఆమె నిరంతరం పోరాడుతుంది. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రజలంతా తనలో ఇందిరా గాంధీని చూస్తున్నారు.కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆమెను ప్రధానమంత్రిగా ఆమెదిస్తున్నారు". అని రాబర్ట్ వాద్రా అన్నారు.అదే సమయంలో "రాహుల్ గాంధీ కూడా చాలా కష్టపడుతున్నారు. వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయి. దేశం కోసం వారి ప్రియమైన వ్యక్తులను కోల్పోయారు" అని రాబర్డ్ వాద్రా తెలిపారు. అయితే తనను కూడా ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అయితే బీజేపీ నెపోటిజమ్ పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ సమయంలో తనపై ఈడీ రైడ్ జరుగుతుందన్నారు.అయితే తన పొలిటికల్ ఎంట్రీ అంశం భవిష్యత్తులో ఆలోచిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. -
హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీకి బిగ్ షాక్..!
టాలీవుడ్ సినీయర్ నటుడు శివాజీకి బిగ్ షాక్ తగిలింది. హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన కామెంట్స్పై వివరణ కోరుతూ శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. శివాజీ మాట్లాడిన మాటలను తెలంగాణ మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిందని చైర్పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించారు.శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు.సామాన్లు అంటూ కామెంట్స్.. కాగా.. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన శివాజీ హీరోయిన్లు డ్రెస్లను ఉద్దేశించి మాట్లాడారు. దుస్తుల విషయాన్ని చెబుతూ కొన్ని అసభ్యకరమైన పదాలు వాడారు. సామాన్లు అంటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. దీనిపై ఇప్పటికే అనసూయతో పాటు చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ కామెంట్స్పై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సైతం క్షమాపణలు చెప్పారు. ఈ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
సీఎం చిట్చాట్ల పేరుతో దాక్కోవద్దు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ల పేరుతో దాక్కోవడం కాదు దమ్ముంటే బయిటకొచ్చి కేసులపై మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం నల్గొండలో నిర్వహించిన బీర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా రోజుకో కేసు అంటూ లీకులిస్తుందని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ గర్జిస్తే కాంగ్రెస్ నేతలెవరూ సమాధానం చెప్పలేకపోయారని వారికి ఆ దమ్ములేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా కాంగ్రెస్కు లేదని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ఎన్నికలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సహకార ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యంగా చేసుకున్నట్లు, బీఆర్ఎస్ కార్యకర్తల దృష్టి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపైనే ఉండాలన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడకూడదని కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గత ఆదివారం జరిగిన బీఆర్ఎస్సీఎల్పీ భేటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారు గుర్తుతో స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు బీఆర్ఎస్కు మరింత అనుకూలంగా ఉండేవన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేటీఆర్కు నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. దానితో పాటు 2023లో బీఆర్ఎస్ హాయాంలో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా వన్ రేసు అవినీతి కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. -
ఏం పీకుతామా!.. జగన్ వచ్చాక తెలుస్తది
-
‘అర్థరాత్రి రోడ్లపై..’ శశి థరూర్ వ్యాఖ్యల కలకలం
పట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన బిహార్ మౌలిక సదుపాయాలపై చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. నలంద సాహిత్య ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రశంసించడం విశేషంగా మారింది.బిహార్లో గతంతో పోలిస్తే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా మొదలైన సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రజలు నిర్భయంగా రోడ్లపై తిరగగలుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బిహార్లో ప్రత్యర్థి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, ఇక్కడ జరిగిన అభివృద్ధిని గుర్తిస్తూ, థరూర్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో విలేకరులు థరూర్ను రాజకీయ అంశాలపై స్పందించమని కోరగా, ఆయన ‘నన్ను రాజకీయాల్లోకి లాగకండి, ఇక్కడి పురోగతిని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈ ప్రశంసలు బిహార్ ప్రజలకు, వారి ప్రతినిధులకు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. కాగా రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీలోని మంచిని గుర్తించాలనే తన ధోరణిని మరోసారి బయటపెట్టారు. అయితే ఇటీవల సీఎం నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలి హిజాబ్ విషయంలో ప్రవర్తించిన తీరును థరూర్ తప్పుబట్టారు.బిజెపి-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని థరూర్ ప్రశంసించడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను సమర్థించడం, పాకిస్తాన్పై సైనిక దాడుల నిర్వహణను మెచ్చుకోవడం తదితర అంశాల కారణంగా థరూర్కు, పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతున్నదనే వార్తలు వినిపించాయి. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకుంటూనే, తమ పార్టీ సిద్ధాంతాలకు భంగం కలిగినప్పుడు విమర్శించడంలో థరూర్ తన శైలిని బయటపెట్టారు. తాజాగా బిహార్ పర్యటనలో థరూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.ఇది కూడా చదవండి: నేటికీ శతాబ్దాల నాటి యుద్ధ వ్యూహాలు.. వీడియో వైరల్ -
దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు
-
ఆ MOU లు అంతా బోగస్.. నిజం బయటపెట్టిన KCR
-
బాబూ కళ్లు పెద్దవి చేసి చూడు.. దటీజ్ YS జగన్
-
వంట మనుషులతో MOUలు.. ఇదేం పాడుపని బాబు
-
హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు
-
దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: రేవంత్ సర్కార్ హానీమూన్ ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన వాళ్లు ఆదారాలతో సహాదొరికారని అయినప్పటికీ వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్కు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటాడో తనకు తెలియదు గానీ తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుతానని కేటీఆర్ అన్నారు. ఆయన ఇంట్లోని మహిళలు, పిల్లలు, మనమడి గురించి మాట్లాడి తన మాదిరి చిల్లర రాజకీయాలు చేయనని తెలిపారు. కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్మీట్ పెట్టి బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని అది పెద్ద కామెడీలా అనిపిస్తుందన్నారు. కొంతమంది తనను ఐరన్ లెగ్ అంటున్నారని తాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకే 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీ స్థానాలు గెలిచామన్నారు. రేవంత్ సీఎం అయ్యాక కనీసం సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేక పోయాడని కేటీఆర్ విమర్శించారు. కనుక తాను ఐరన్ లెగ్ కాదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఐరన్ లెగ్ అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ప్రజల్లోకి రానున్నారని ఆయన బహిరంగ సభలలో పాల్గొనే అంశం రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
జగన్ పై పవన్ వ్యాఖ్యలు.. సీదిరి అప్పలరాజు దిమ్మతిరిగే కౌంటర్
-
ముఖ్యమంత్రిగా నువ్వెందుకు.. PPPకి ఇచ్చేయ్.. పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్
-
పవన్ వీడియో వైరల్.. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా!
-
సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
కర్ణాటక రాజకీయాలు కొంతకాలం పాటు దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్గా నడిచాయి. ఆ రాష్ట్ర సీఎం మార్పు జరగనుందంటూ ఊహాగానాలు రేగడం దానిని బలపరూస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలు పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడంతో కొద్దికాలం పాటు నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఆ రాష్ట్రంపైనే ఉంది. అయితే సీఎం మార్పు అంశంలో తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రాష్ట్రంలో సీఎం షేరింగ్ ఒప్పందమే జరగలేదన్నారు.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య కొద్దికాలం పొలిటికల్ వార్ జోరుగానే సాగింది. ఐదేళ్లకు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని సిద్ధరామయ్య అనగా ఇచ్చిన మాట కంటే గొప్పది మరోటి లేదని శివకుమార్ పేర్కొన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎంట్రీతో ఇద్దరు నేతలు కొంత తగ్గి హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని తెలపడంతో సీఎం కుర్చీ వార్కు కొద్దిగా చల్లబడిందని పొలిటికల్ వర్గాలు భావించాయి.అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోకా సీఎం మార్పుపై అసెంబ్లీలో సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. "ప్రజలు మమ్మల్ని దీవించారు. అనంతరం ఎమ్మెల్యేలలంతా నన్ను నాయుకుడిగా ఎన్నుకున్నారు.ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని. హైకమాండ్ నిర్ణయిస్తే తదనంతరం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను" అని సిద్ధరామయ్య అన్నారు. అసలు తానేప్పుడు రెండున్నర సంవత్సరాల సీఎం ఒప్పందం గురించి చెప్పలేదని అసలు అలాంటి అగ్రిమెంటే జరలేదన్నారు.అయితే ఇటీవల సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తమ వర్గం నాయకులకు ప్రత్యేక వింధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్ర నాయకత్వంతో భేటీ అనంతరం కర్ణాటక సీఎం మార్పుపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. గత నెలతో రెండున్నరేళ్ల కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం మారనున్నారని జోరుగా ప్రచారం నడిచింది. -
లివింగ్ రిలేషన్ షిప్ తప్పు కాదన్న హైకోర్టు : ఆ 12మందికి భారీ ఊరట
సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. లివ్-ఇన్ రిలేషన్షిప్ను చట్టవిరుద్ధం అని పిలవ లేమని, పెళ్లి లేకుండా కలిసి జీవించడం నేరం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ప్రకారం ప్రతి పౌరుడిని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని, ఒక జంట అవివాహిత హోదా వారి ప్రాథమిక హక్కులను అడ్డుకోకూడదని కూడా స్పష్టం చేసింది. సహజీవనం చేస్తున్న 12 జంటలు తమకు రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. లివ్-ఇన్ సంబంధాలను 'చట్టవిరుద్ధం' అని పిలవలేమని, ఈ భావన అందరికీ ఆమోదయోగ్యం కాదు కాబట్టి, వివాహం కానంత మాత్రాన కలిసి జీవించడం జీవించడం నేరమని చెప్పలేమని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. ఎవరైనా వారి ప్రశాంతమైన జీవనానికి అంతరాయం కలిగిస్తే ఈ మహిళలకు తక్షణ రక్షణ కల్పించాలని కోర్టు సంబంధిత జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. పౌరుడు మైనర్ లేదా మేజర్, వివాహిత లేదా అవివాహిత అనే తేడా లేకుండా భారత రాజ్యాంగంలోని పౌరులుగా ప్రాథమిక జీవించే హక్కును ఉన్నతమైందిగా పరిగణించాలని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు.పిటిషనర్లు సంబంధిత జిల్లాల్లో పోలీసులను సంప్రదించారని, కానీ తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మొత్తం 12 రిట్ పిటిషన్లలో వివాదం ఒకేలా ఉన్నందున, వాటిని ఉమ్మడి తీర్పు ద్వారా నిర్ణయిస్తున్నామని కోర్టు పేర్కొంది. కేసు వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, పిటిషనర్లు శాంతియుతంగా కలిసి జీవించే స్వేచ్ఛ ఉంటుందని, వారి ప్రశాంతమైన జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అభిప్రాయపడింది. పిటిషనర్లు విద్యావంతులైతే, చట్టప్రకారం ఆమోదయోగ్యమైన విద్యా, ఇతర ధృవపత్రాలను సమర్పించినట్లయితే, వారు మేజర్లు అయితే, ఏ పోలీసు అధికారి కూడా వారిపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోకూడదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: బెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్! -
ప్రజా ఉద్యమంతో తగ్గిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సంచలన నిర్ణయం..
-
‘సెవెన్ సిస్టర్స్’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత్తో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు బంగ్లాదేశ్ వ్యవహరిస్తోంది. తాజాగా భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.ఢాకాలోని షహీద్ మినార్ వద్ద జరిగిన బహిరంగ సభలో అబ్దుల్లా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని తప్పుబట్టారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించని వారికి భారత్ అండగా నిలిస్తే, తాము కూడా భారత్కు వ్యతిరేకంగా పనిచేసే వేర్పాటువాద శక్తులకు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడితే, ఆ అగ్ని జ్వాలలు సరిహద్దులు దాటి భారతదేశానికి కూడా వ్యాపిస్తాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నరికివేసేలా (చికెన్ నెక్ కారిడార్ను ఉద్దేశించి) బంగ్లాదేశ్ తన వ్యూహాలను అమలు చేయగలదని అబ్దుల్లా పేర్కొనడం కలకలం రేపింది. అస్సాం, మేఘాలయ, త్రిపుర తదితర రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సుదీర్ఘ భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ వేర్పాటువాద శక్తులను ప్రోత్సహిస్తామనే బంగ్లాదేశ్ హెచ్చరికను భారత్ భద్రతా పరమైన ముప్పుగా భావిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా భారత్ తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని అబ్దుల్లా ఆరోపించారు.ఈ పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ పరిణామాలు, భారత్ పట్ల పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు పొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. అస్థిరతను సృష్టించే శక్తులకు చోటు ఇవ్వొద్దని, బాధ్యతాయుతమైన రీతిలో వ్యవహరించాలని భారత్ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ రాయబారికి స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: పుస్తకాల మధ్య ప్రాణవాయువు.. ‘అతుల్’ కష్టం ఎవరికీ వద్దు! -
ఒబెరాయ్ హోటల్ కి TTD భూములు.. చంద్రబాబు తీరని ద్రోహం..
-
పథకాలనే కాదు జగన్ స్టైల్ ని కూడా కాఫీ.. కారుమూరి వెంకట్ రెడ్డి సెటైర్లే సెటైర్లు
-
బూతులతో రెచ్చిపోయిన మంత్రి
-
కేరళలో బీజేపీ గ్రాండ్ విక్టరీ
కమ్యూనిస్టుల ఖిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడింది. 45 సంవత్సరాలుగా ఎల్డీఎప్ పాలిస్తున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజెపీ తొలిసారిగా సంచలన విజయం సాధించింది. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంపై ప్రధాని మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు ధన్యవాదాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.కేరళ ఈపేరు వింటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా చెబుతుంటారు. దేశవ్యాప్తంగా లెప్ట్ పార్టీల ప్రభావం క్షీణిస్తున్నా కేరళలో మాత్రం వారి ఉనికి కాపాడుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా తన ప్రభంజనం చూపిస్తూ ప్రతిచోట స్వయంగానో లేదా తన కూటమిద్వారానో అధికారం హస్తగతం చేసుకుంటున్న కాషాయదళం ఇంతకాలం కేరళలో మాత్రం తమ ప్రభావం చూపలేక పోయింది. గత లోక్సభ ఎన్నికల్లో బోణీకొట్టలేకపోయిన ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటుతో సరిపెట్టుకుంది. దీంతో కేరళలో బీజేపీ పోటీలోనే లేనట్లు భావించారు. అయితే ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయం సాధించింది.ఎన్డీఏ కూటమి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 101 స్థానాలున్న కార్పొరేషన్లో బీజేపీ ఒంటరిగా 50 స్థానాల్లో గెలుపొందింది. ఎల్డీఎఫ్ కూటమి 29 సీట్లు సాధించగా కాంగ్రెస్కు చెందిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అంతేకాకుండా బీజేపీ ఎర్నాకులం జిల్లాలోనిత్రిపునితురా మున్సిపాలిటితో పాటు పాలక్కడ్లోనూ జయకేతనం ఎగురవేసింది.అయితే ఈ విజయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు ఇది "కేరళలో ఇది అద్భుతమైన రోజు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. యూడీఎఫ్ కూటమికి హృదయపూర్వక శుభాకాంక్షలు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇది మంచి పరిణామం. కార్యకర్తల కష్టం, అవినీతిపై వ్యతిరేకత వీటన్నిటితో 2020 ఫలితాలతో పోల్చితే మరింత మెరుగయ్యాము. అదే విధంగా తిరువనంతపురంలో సంచలన విజయం సాధించిన బీజేపీకి కృతజ్ఞతలు. ఆ ప్రాంతంలో 45 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా నేను ప్రచారం నిర్వహించాను. కానీ ప్రజలు అక్కడ వేరే పార్టీని ఎన్నుకున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే" అని శశిథరూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు.తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో గత నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కూటమే విజయం సాధిస్తూ వస్తుంది. అటువంటి చోట ప్రస్తుతం కాషాయ జెండా ఎగరడం అక్కడ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా ఈ నెల 9,11 తేదీలలో కేరళలో స్థానికసంస్థలకు ఎన్నికలు జరిగాయి. -
మంత్రికి తెలియకుండా.. అఖండ-2 జీవో రిలీజ్
-
చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు.. ముందుంది ముసళ్ల పండగ
-
‘వారికి రూ. లక్ష ఇచ్చినా నాకు ఓటెయ్యరు’
అస్సాంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హిమాంత్ బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గం తనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయరన్నారు. వారికి ఓటుకు రూ.లక్ష ఇచ్చినా తనను ఎన్నుకోవడానికి మెుగ్గుచూపరన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శుక్రవారం జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు ఇటీవల బిహార్లో ఓటర్లను ఆకర్షించడానికి అక్కడి సీఎం నితీశ్ కుమార్ ప్రవేశ్ పెట్టిన విధంగా మీరెమైనా అస్సాంలో పథకాలు తీసుకొస్తారా అని సీఎంను ప్రశ్ని్ంచారు. దానికి సీఎం బదులిస్తూ "నేను రూ.10 వేలు కాదు రూ.లక్ష ఇచ్చినా ఆ రాష్ట్ర ముస్లింలు నాకు ఓటెయ్యరు. వారు కావాలంటే నా కిడ్నీని దానంగా ఇస్తా కానీ వారు నాకు ఓటెయ్యరు" అని అన్నారు. ప్రస్తుతం ఓట్లనేవి పథకాలు, అభివృద్ధి బట్టి కాకుండా ఐడీయాలజీ ప్రకారం వేస్తున్నారని హిమంత్ అన్నారు.అస్సాంలోకి చాలా మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారని హిమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 38 శాతం ఉన్న ముస్లింల జనాభా 2027 వరకూ 40 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. 1961 నుంచి ఆ కమ్యూనిటీ దశాబ్ధ జనాభా వృద్ధిరేటు 4-5శాతం నిరంతరాయంగా పెరుగుతూ ఉందని అన్నారు. ఒకవేళ ముస్లింల జనాభా రాష్ట్రంలో 50శాతం దాటితే వేరే మతాల ప్రజలు రాష్ట్రంలో నివసించలేరని హిమంత్ బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ముస్లిం ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. వారు కాంగ్రెస్కు సపోర్ట్ చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం అక్కడ విజయం సాధించిందన్నారు. -
అధికారంలో ఉండి కూడా భయపడ్డారు చూడు.. అది జగన్ అంటే
-
సింగపూర్, జపాన్, జర్మనీ ఎక్కడ.. అమరావతిని చూస్తే రక్తం మరిగిపోతుంది


