breaking news
comments
-
పుతిన్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు.. జెలెన్స్కీ
కీవ్:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీనికొరకే త్వరలో భారీ స్థాయిలో సైనికుల సమీకరణ చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్లో జరిగే రష్యా దిగువ సభ ఎన్నికల తర్వాత ఈ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నడుస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల వరుసగా డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ దాడులలో పెద్దఎత్తున పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఈ రోజు (సోమవారం) రష్యాలోని తతార్స్తాన్ ప్రాంతంపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో కనీసం 13 మంది మరణించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ జరిపిన అత్యంత ప్రాణాంతక దాడుల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా జరిపిన ఆర్టిలరీ దాడిలో ఐదుగురు మరణించారు. ఈ ఉద్రిక్తతల నడుమ జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందన్నారు. జెలెన్స్కీ మాట్లాడుతూ.. "రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం 5 లక్షల మంది కొత్త సైనికులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 21న జరిగే రష్యా డ్యూమా ఎన్నికల తర్వాత ఈ సమీకరణ చేపట్టాలని పుతిన్ భావిస్తున్నారు. రష్యా ప్రజల్లో వ్యతిరేకత భయంతో పుతిన్ ఈ ప్రక్రియను బహిరంగంగా చేపట్టకపోవచ్చు" అని జెలెన్స్కీ పేర్కొన్నారు.కాగా ఇటీవల టర్కీ విదేశాంగశాఖ మంత్రి హకాన్ ఫిదాన్ సంచలన ప్రకటన చేశారు." ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి సుదూర డ్రోన్ దాడులను పెంచుతున్న నేపథ్యంలో పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. యుద్ధం ముందు వరుస నుంచి రష్యా భూభాగంలోకి కూడా తీవ్రంగా విస్తరిస్తే, రష్యా తన ఉనికినే కాపాడుకునే చివరి మార్గంగా అణ్వాయుధాలను ఉపయోగించే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు. -
యువగళంలో నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చావంటే నీ నీచమైన బుద్ది ఇప్పుడే అర్థమైంది
-
శ్రీకాకుళం పోలీసులకు కోర్టులో బిగ్ షాక్
-
నీ కొడుకుని పదవి నుండి తొలగించు..!? లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు..!
-
నా బిడ్డ గురించి సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం
-
అధః పాతాళానికి తొక్కకపోతే... జెన్ -జీ పై బాబు వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డి మాస్ కౌంటర్
-
Z+ క్యాటగిరి భద్రతగా ఎంతమంది పోలీసులు ఉంటారో నీకు తెలుసా? అనితను రఫ్ఫాడించిన నాగమల్లీశ్వరి
-
ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల అమలులో అర్హుల ఎంపిక, ప్రభుత్వాల బాధ్యతపై కోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా.. కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని వ్యాఖ్యానించింది.రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు వంటి పథకాలలోనూ సంపన్నులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏం మిగులుస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.“ఒకప్పుడు దేశానికి ఏం ఇచ్చామా? అని ఆలోచించేవాళ్లం.. ఇప్పుడు దేశం మనకేం ఇచ్చిందని అడుగుతున్నాం” అంటూ సామాజిక బాధ్యతపై కోర్టు వ్యాఖ్యలు చేసింది.చదువుకు సాయం.. అర్హులకు సంక్షేమంప్రభుత్వ నిధులు సరైన దిశలో వినియోగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. బాగా చదువుకునే విద్యార్థులకు ఫీజులు, నిజంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సూచించింది.1.15 కోట్ల మందికి పథకాలు.. ప్రభుత్వ నిర్వహణ ఎలా?రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. 1.15 కోట్ల మందికి ఉచిత పథకాలు ఇస్తున్నప్పుడు భవిష్యత్లో ప్రభుత్వాలు వాటిని ఎలా కొనసాగిస్తాయనే ప్రశ్నను లేవనెత్తింది. సంక్షేమ పథకాలు ప్రజలకు అండగా ఉండాల్సినవేనని, అయితే వాటి అమలులో పారదర్శకత, అర్హత ప్రమాణాలు కీలకమని హైకోర్టు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా ధనం సద్వినియోగం కావాలంటే అవసరమైన వారికి మాత్రమే ప్రయోజనాలు చేరేలా విధానాలు ఉండాలని సూచించింది. -
పేపర్ లీక్ కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాయ్పూర్: పేపర్ లీకేజ్ల కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం అనేది హత్య కంటే మరింత ఘోరమైన నేరం అని మండిపడింది. ఆ అంశం లక్షలాది మంది పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవన్ కిశోర్ ధ్రువ్ కు ఛత్తీస్గఢ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.ఏం జరిగింది?2020–2022 మధ్య జరిగిన ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియలో అక్రమాలకు అక్రమాలకు పాల్పడ్డాడడని అప్పటి కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన జీవన్ కిశోర్ ధ్రువ్ ను 2025 సెప్టెంబర్లో సీబీఐ అరెస్టు చేసింది. ఈ నియామక పరీక్షలో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన ఆయన కుమారుడు సుమిత్ ధ్రువ్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది."ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ దరఖాస్తులను పరిశీలించినప్పుడు చేసిన వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్కు పాల్పడే వ్యక్తి, ఆ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమవుతున్న లక్షలాది మంది యువ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటాడు. అలాంటి చర్య హత్య నేరం కంటే కూడా ఘోరమైనది. ఒక వ్యక్తిని హత్య చేస్తే ఒక కుటుంబం మాత్రమే నష్టపోతుంది. కానీ లక్షలాది మంది అభ్యర్థుల కెరీర్ను నాశనం చేస్తే మొత్తం సమాజమే తీవ్రంగా ప్రభావితమవుతుంది."అందువల్ల ఈ కేసులో నిందితులపై ఉన్న ఆరోపణలను సాధారణ నేరాలుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన హైకోర్టు, 2021 మెయిన్ పరీక్ష ప్రశ్నాపత్రాలను జీవన్ కిశోర్ ధ్రువ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గోప్యంగా తన వద్ద ఉంచుకున్నారని, అనంతరం వాటిని తన కుమారుడికి అందించినట్లు సూచించే ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా సుమిత్ ధ్రువ్ పరీక్షకు ముందు ప్రత్యేకంగా నాలుగు అంశాలను మాత్రమే సిద్ధం చేశాడని, అవే అంశాలు పరీక్షలో ప్రశ్నలుగా వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది. జీవన్ కిశోర్ ధ్రువ్ నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువులు, సాక్షుల వాంగ్మూలాలు, పత్రాధారాలు కూడా ఈ కుట్రలో ఆయన ప్రమేయాన్ని ప్రాథమికంగా సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది.అయితే విచారణ సందర్భంగా జీవన్ కిశోర్ ధ్రువ్ తరఫున న్యాయవాది దేవర్షి ఠాకూర్ వాదనలు వినిపించారు. CGPSC కార్యదర్శిగా పనిచేసిన కారణంగానే తన క్లయింట్ కిషోర్ ధృవ్ను తప్పుడు కేసులో ఇరికించారని, అసలు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా లేదని తెలిపారు.అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ తప్ప ఎలాంటి అభ్యంతరకర పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం కాలేదని, ప్రశ్నాపత్రాలను లీక్ చేశారని లేదా తన పిల్లలకు అందించారని నిరూపించే ప్రత్యక్ష ఆధారాలు లేవని ఆయన వాదించారు.జీవన్ కిశోర్ ధ్రువ్ కుమారుల్లో ఒకరు పరీక్షలో అర్హత సాధించలేదని, మరో కుమారుడు కూడా మొదటి ర్యాంకు కాకుండా చాలా తక్కువ ర్యాంకు సాధించాడని తెలిపారు.సీబీఐ వాదనజీవన్ కిశోర్ ధ్రువ్, అప్పటి CGPSC చైర్మన్, పరీక్షల నియంత్రణాధికారి (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్)తో పాటు ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర పన్ని, 2021 మెయిన్ పరీక్ష గోప్యమైన ప్రశ్నాపత్రాలను లీక్ చేసి, తన కుమారుడికి అక్రమ ప్రయోజనం కల్పించినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది.ధ్రువ్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో జనరల్ స్టడీస్ పేపర్–VIIకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు, అలాగే ఎస్సే పేపర్ ప్రశ్న-సమాధాన బుక్లెట్ ప్రతులు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.ఇతర సహ నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినందున తన క్లయింట్కు కూడా అదే వర్తించాలని రక్షణ పక్షం చేసిన వాదనను సీబీఐ ఖండించింది. బెయిల్ పొందిన వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి కాగా, జీవన్ కిశోర్ ధ్రువ్ మాత్రం పరీక్షల గోప్యత, సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత కలిగిన సీనియర్ ప్రభుత్వ అధికారి అని స్పష్టం చేసింది.ఈ కేసులో అరెస్టైన వారిలో మాజీ CGPSC చైర్మన్ తమన్ సింగ్ సోన్వానీ, ఆయన మేనల్లుళ్లు నితేష్ సోన్వానీ, సాహిల్ సోన్వానీ, మాజీ డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లలిత్ గన్వీర్, పారిశ్రామికవేత్త శ్రవణ్ కుమార్ గోయల్, ఆయన కుమారుడు శశాంక్ గోయల్, కోడలు భూమిక కటియార్ తదితరులు ఉన్నారు. -
చంద్రబాబును ఇమిటేట్ చేస్తూ... నువ్వు నీ అన్న అందగాళ్లే..
-
బాబు అబద్దం చెప్పాడు అనేది పెద్ద అబద్దం.. భువనేశ్వరి వ్యాఖ్యలకు అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్
-
అయ్యా గూండా ఉమా.. నిన్ను లోకేష్ మింగేయడం ఖాయం..!
-
'మా వాళ్లను గలీజుగా మాట్లాడినా చూస్తూ ఊరుకోం' : మంత్రి టీజీ భరత్
-
మహిళా జోలికొస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. ఆ మంత్రిని పీకేయండి!
-
ముడుపుల లెక్కచెప్పే.. నీతిమాటలు: ఉత్తమ్
సాక్షి,ఢిల్లీ: ఎమ్మెల్యే హరీశ్ రావు ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పి తర్వాతే నీతి మాటలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ప్రకటన పై ఘాటుగా మండిపడ్డారు. కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడమే తనకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. ఈ రోజు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం, పట్టిసీమ, రాయలసీమ ఎత్తిపోతలపై బీఆర్ఎస్ ఎందుకు మౌనం పాటించిందని 12 ఏళ్లుగా ప్రతి GRMB సమావేశంలో ఏపీ ఇదే అభ్యంతరాలు చెబుతోందని ఇందులో కొత్తేం లేదన్నారుఏపీ అభ్యంతరాలను తిప్పికొట్టి సీతమ్మసాగర్–సీతారామకు TAC అనుమతి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని 67 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించిందన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటును సమయస్ఫూర్తితో అడ్డుకున్నామని సమ్మక్క సాగర్ NOC కోసం ఛత్తీస్గఢ్ సీఎంను మూడుసార్లు కలిశాం… నెలాఖరులో NOC వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హాయాంలో ఒక్కసారైనా ఛత్తీస్గఢ్ సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ISM, IP క్లియరెన్స్ల కోసం గత ప్రభుత్వం ప్రయత్నించలేదని కాంగ్రెసే ముందుకు తీసుకవచ్చిందన్నారు.PBLPపై వెంటనే స్పందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం, సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్, IAలు దాఖలు చేశాం న్యాయపోరాటం కొనసాగుతోందని KWDT ముందు స్వయంగా హాజరై తెలంగాణ తరఫున వాదనలు వినిపించామన్నారు. RDS ఆధునీకరణకు ఏపీ, కర్ణాటక సీఎంలను ఒప్పించామని… బీఆర్ఎస్ ఏం చేసింది? తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ నీటి హక్కులు కాపాడలేని వాళ్లు… ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. -
అది కుట్ర ప్రకారం జరిగింది.. షేక్ హసీనా
బంగ్లాలో జరిగింది శాంతియుత విద్యార్థి ఉద్యమం కాదని ఆ విషయంలో విద్యార్థులతో చర్చలు జరపాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. నిరసనల పేరుతో ఉగ్రవాదులు క్రిమినల్స్ రిలీజ్ అయ్యారని ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన కుట్రని ఆరోపిస్తూ వాయిస్ మెసేజ్ రిలీజ్ చేశారు. ఇది తాము నిర్మించిన బంగ్లాదేశ్ కాదని తాను మళ్లీ బంగ్లాదేశ్కు వెళతానని తన దేశాన్ని పునర్నిర్మిస్తానని పేర్కొన్నారు. కాగా గత కొద్ది సంవత్సరాలుగా దేశం విడిచి భారత్లో ఉంటున్న ఆమె.. ఈ రోజు (బుధవారం) ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రసంగించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రసంగాన్ని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టవిరుద్ధమని దేశీయ మీడియాను హెచ్చరించింది.2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. 2025లో నిరసనల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా చట్టబద్ధం కాదంటూ కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలో.. తాను స్వదేశం విడిచి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వీడియో లింక్ ద్వారా ప్రసంగించనున్నారు. తన కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్తో పాటు ఇతర వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హసీనా ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడతారన్న వివరాలు వెల్లడికాలేదు.అయితే హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రసారం చేయడంపై గతంలో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విధించిన నిషేధాన్ని గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మీడియాను హెచ్చరించింది.మరోవైపు హసీనా వర్గం మాత్రం ప్రభుత్వ వైఖరిని ఖండించింది. దేశ సరిహద్దులు దాటి కూడా భిన్నాభిప్రాయాలను అణచివేయలేరని వ్యాఖ్యానించింది. హసీనా, ఆమె పార్టీ నేతలు డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటారని గతంలో ప్రకటించారు.ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ.. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేసింది. ఇందులో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం లేదని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలకు తాము బాధ్యత వహించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
Kohli Vs Gambhir.. ఆ రోజు ఏం జరిగిందంటే? 13 ఏళ్ల తర్వాత నిజం బయటపెట్టిన అంపైర్
-
ఎవరు అడవి పందులో నేను చెప్తా.. ఒకే ఒక్క డైలాగ్.. లోకేష్, బాబుపై నాగ మల్లీశ్వరి సెటైర్లు
-
చంద్రబాబుకు 7 ఏళ్లు జైలు శిక్ష..! DSC స్కాం కేసు చిన్నది కాదు..
ఆంధ్రప్రదేశ్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ స్కాం కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, పేకాట ఆడిన వారికి బ్రిడ్జి గేమ్ పేరుతో ఉద్యోగాలు కల్పించారని ఆయన అన్నారు. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.అలాగే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంపై కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సమయంలోనే చంద్రబాబు శంకుస్థాపన చేశారంటూ, దీనికి సంబంధించి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం తప్ప ఎలాంటి భూసేకరణ చేయలేదు. అలాగే, రూ.5,500 కోట్ల వ్యయంతో జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్టును నిర్మించగా.. జీఎంఆర్కు చంద్రబాబు ప్రభుత్వం ఐదు పైసలు కూడా ఇవ్వలేదు. కానీ తానే కట్టానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే, భూసేకరణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ హామీలపైనా కొడాలి నాని మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అమలులో మాత్రం 'సూపర్ సున్నా'గా మిగిలిపోయిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.అలాగే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడవద్దని, ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలు జరగకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మోసాలు సాగకుండా ఉండేలా వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కొడాలి నాని పిలుపునిచ్చారు. -
త్రిష పేరుతో సీఎం విజయ్పై కామెంట్స్
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న (సోమవారం) కావేరీ అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో సీఎం విజయ్పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో సభలోని ప్రజలనుంచి నుంచి "త్రిష-త్రిష" అంటూ నినాదాలు వ్యక్తమయ్యాయి. దీనికి ఉదయనిధి నవ్వుతూ ఇన్యుయేండో (అర్థవంతమైన వ్యాఖ్య) అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాగా ఈ వాఖ్యలను టీవీకేతో పాటు బీజేపీ ఖండించిందిటీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ మాట్లాడుతూ " ఇలాంటి వ్యాఖ్యలు అసహ్యకరం. ఎవరిపైనైనా ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు చేయడం పూర్తిగా సిగ్గుచేటు. ఇది ఆ కుటుంబం యొక్క ఆలోచనా విధానాన్ని, రాజకీయ సంస్కృతిని పడిపోతున్న ప్రమాణాలను బట్టబయలు చేస్తోంది" అని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుడిగా ఉదయనిధి స్థాయి మరింతగా దిగజారిందని విమర్శించారు.తమిళనాడు బీజేపీ చీఫ్ స్పోక్స్పర్సన్ నారాయణ తిరుపతి మాట్లాడుతుూ..తంజావూరులో ముఖ్యమంత్రి విజయ్ ,త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ ప్రసంగం అసహ్యకరమైనది, అభ్యంతరకరమైనది సిగ్గుచేటని అన్నారు. "తల్లి, భార్య, కూతురు ఉన్న ఏ దొంగ లేదా రౌడీ కూడా అంత నీచంగా మాట్లాడలేడు. 'ద్రవిడ మోడల్' అని చెప్పుకునే ఈ వ్యక్తులు బహిరంగంగా ఇలా మాట్లాడుతుంటే, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటు" అని ఆయన దుయ్యబట్టారు. ఉదయనిధిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం: "తాను ఆ కళాకారుడి మనవడిని అని చెప్పుకునే ఆయన ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ప్రతిపక్ష నేత స్వయంగా మాజీ నటుడే. అయినప్పటికీ తోటి కళాకారుల పట్ల ఇంత చిన్నచూపుతో, అసహ్యంగా మాట్లాడడం దిగ్భ్రాంతికరం ". అన్నారు.గత వివాదాలుమూడేళ్ల క్రితం సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోల్చి ఉదయనిధి స్టాలిన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దానిని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో, ఉదయనిధి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపాయి.ఏం జరిగింది.తమిళనాడులో కావేరి నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం (టీవీకే) వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తంజావూరులో ఒక భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఆ సమయంలో సభికుల్లో నుంచి కొందరు అకస్మాత్తుగా "త్రిష... త్రిష" అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రజల నుంచి ఆ నినాదాలను చూసి ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం మధ్యలో ఆగిపోయి, నవ్వుతూ ఒక డబుల్ మీనింగ్ (అర్థవంతమైన ఇన్యుయేండో) వ్యాఖ్య చేశారు. దీనిపై ఇప్పడు దుమారం చెలరేగింది -
బీహార్ బంకిపూర్లో బీజేపీ కంచుకోట బద్దలు : మంత్రి పొన్నం ప్రభాకర్
బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామంగా నిలిచిన బంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకిపూర్లో ఆ పార్టీ ఓటమిపాలవడం ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు చెందిన నియోజకవర్గంలోనే జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో గెలవడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు.అయితే, అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం, విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ ప్రజల తీర్పును ఎవరూ మార్చలేరు. దీనికి బంకిపూర్ ఫలితం మరో నిరూపన. ప్రజలు తమ ఓటుతో బీజేపీ అహంకారానికి గట్టి సమాధానం చెప్పారు. ప్రజల సమస్యలను విస్మరించి అహంకారపూరిత పాలన కొనసాగిస్తే తగిన సమయంలో ప్రజలు తీర్పు ఇవ్వడమే కాకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని మంత్రి గట్టిగా చెప్పుకొచ్చారు.ఇటీవల ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని ప్రస్తావించిన మంత్రి.. దేశవ్యాప్తంగా యువతలో అసంతృప్తి పెరుగుతోందని, అలాగే, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందనే భావన బలపడుతోందని, అదే భావోద్వేగం బంకిపూర్ ఉపఎన్నిక ఫలితంలో ప్రతిబింబించిందని ఆయన అన్నారు.అలాగే, బంకిపూర్ తీర్పు కేవలం ఒక ఉపఎన్నిక ఫలితం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రజల సంకల్పానికి ప్రతీక. దీంతో ప్రజల గొంతుకను అణచివేయాలని చూసే రాజకీయాలకు దేశ ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారని, బంకిపూర్లో బీజేపీ కంచుకోట బద్దలవడం దేశ రాజకీయాల్లో మరింత పెద్ద మార్పులకు నాంది పలుకుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. -
ప్రశాంత్ కిషోర్ గెలుపు.. మార్పుకు సంకేతం.. కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ: బిహార్లో ప్రశాంత్ కిషోర్ విజయంతో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలిందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఈ విజయంతో బీజేపీపై ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమైందన్నారు.బిహార్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్కు అభినందనలు చెబుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అరవింద్ కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతాలో " బీజేపీ తన జాతీయ అధ్యక్షుడి సీటును కూడా కోల్పోయింది. బంకిపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ జీ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు. బీజేపీ పట్టు పూర్తిగా చేజారిపోయింది. నిధుల దుర్వినియోగం, పత్రాల లీకులు, ఈ20... మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అహంకారం బద్దలవుతోంది. దేశ ప్రజలు మార్పునకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు," అని ఆయన రాసుకొచ్చారు.మరోవైపు ప్రశాంత్ కిషోర్ను అభినందిస్తూ బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఎక్స్లో పోస్ట్ చేశారు."ప్రజాస్వామ్య మహోత్సవంలో, బంకిీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రజలు జన సురాజ్ను ఎన్నుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ, విజయం సాధించిన శ్రీ ప్రశాంత్ కిషోర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను," అని పేర్కొన్నారు.కాగా దేశంలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. బిహార్లోని బంకీపూర్ నియోజకవర్గంలో జనసురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్ కుమార్పై విజయం సాధించారు.గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ (సతీశ్ పటేల్) విజయం సాధించారు. ఆయనకు మొత్తం 55,481 ఓట్లు పడగా 30,630 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి భిఖంభాయి రబారీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 66757 ఓట్లు రాగా, 6,016 తేడాతో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై గెలుపొందారు. -
నువ్వు దీనికే పనికొస్తావ్.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్..
-
అల భోగాపురంలో ఇలా భజన పరులు చిడతలు.. వెంకట్ రెడ్డి సెటైర్లు
-
పవన్, బాబు మోడీ భజన.. ఒకపక్క చిడతల అప్పారావు.. ఇంకోపక్క చిడతల పాపారావు
-
అమరావతిని గ్రేటర్ కమ్యూనిటీగా మార్చేస్తున్నారు.. ఆ రోజు జగన్ ను నేను కలిసినప్పుడు నాతో అన్న మాట
-
రాజకీయ డ్రామా కోసం 40 కోట్లు
-
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అంటారా?.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయమై రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, ఇంజినీర్లను "క్రిమినల్ వేస్ట్" అనడం ఏంటని దేశ అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్న ఇంజినీర్లను అవమానించడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి చేత క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీదేనని కేటీఆర్ స్పష్టం చేశారు.కేటీఆర్ మాట్లాడుతూ.. "ఒకవేళ రాహుల్ మౌనం వహించడం అంటే రేవంత్ వ్యాఖ్యలను సమర్థించినట్లే విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ విద్యార్థులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత కాంగ్రెస్ హామీల మోసాన్ని గుర్తుంచుకుంటుంది రేవంత్ వెంటనే విద్యార్థులు, గురువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
ఇరాన్ దాడులపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై దాడి ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టెహ్రాన్తో పాటు కొన్ని మధ్య ప్రాచ్యదేశాల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి హర్ముజ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. ఇటీవలే మరోసారి ఇరాన్పై రెచ్చిపోతూ వస్తున్న ట్రంప్ ఆ దేశాన్ని హెచ్చరిస్తూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఇరాన్పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే మరోసారి ప్లేటు ఫిరాయంచారు. ట్రంప్ మాట్లాడుతూ.. "ఇరాన్పై అమెరికా ప్రతిపాదిత దాడి వాయిదాపడింది. దానికోసం ఇరాన్తో పాటు కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఒక రాజీ ప్రతిపాదన తెచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.హర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం, ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు ముప్పును తొలగించే ఒప్పందం ముసాయిదాపై అంగీకారం కుదిరింది" అని ట్రంప్ అన్నారు.ఇరాన్పై దాడి విరమణపై కీలక నిర్ణయంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ సైతం ఉంది అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా ఆక్సియోస్ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. ఇరాన్పై దాడి విషయంలో సంయమనం పాటించాలని, ఇరాన్పై జరగబోయే పెద్ద దాడిని ఎట్టిపరిస్థితుల్లో నివారించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులుప్రస్తుతం అమెరికా-ఇరాన్ల మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే, ఇరాన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు ఒక తాత్కాలిక యుద్ధ విరామానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గత మూడు రోజులుగా ఇరు దేశాలు దాడులను నిలిపివేశాయి. -
కొబ్బరి కాయ, గుమ్మడి కాయ కట్టింది నువ్వా..? లైవ్ లో సంచలన వీడియోలు వేసి..
-
వీళ్లేంటో.. వీళ్ళ అడవిడి ఏంటో.. KK రాజు మాస్ ర్యాగింగ్
-
ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న.. పోకిరి డైలాగ్ తో లోకేష్ పై పేర్ని నాని సెటైర్లు
-
మిగిలిపోయిన ప్లహరి గోడకట్టి మేమే చేశాం అని డప్పు కొట్టుకుంటున్నారు
-
ప్రాజెక్ట్ కు టెంకాయ కొడితే చాలు.. కట్టింది నేనేనని బాబు క్రెడిట్ కొట్టేస్తారు
-
వైద్య విద్యపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వైద్య విద్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడేళ్లలో ‘ఆప్టిమస్’ రోబోలు ఇప్పుడున్న బెస్ట్ డాక్టర్ల కన్నా మెరుగైన శస్త్రచికిత్సలు చేయగలని, పెద్దపెద్ద ఆపరేషన్లను కూడా సునాయాసంగా నిర్వహించగలవని వ్యాఖ్యానించారు. అందుకే కొత్తగా వైద్య విద్యలో చేరవద్దని సూచించారు. ఎలాన్ మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు వైద్య రంగంలో టెక్నాలజీ ఆధిపత్యంపై తీవ్ర చర్చకు దారితీశాయి. 2029 నాటికి టెస్లా 'ఆప్టిమస్' (Optimus) హ్యూమరాయిడ్ రోబోట్లు మానవ సర్జన్ను మించిపోతాయని, ఆ తర్వాత కొద్ది కాలానికే వైద్యులను వెనక్కి నెట్టివేస్తాయని ఆయన పేర్కొన్నారు. కేవలం 12 ఏళ్ల సుదీర్ఘ వైద్య విద్య, శిక్షణ అవసరం లేకపోవడం, అలసిపోకుండా పనిచేయడం, అపరిమితంగా విస్తరించే సామర్థ్యం రోబోట్ల సొంతం. ప్రస్తుతం ఉన్న వైద్యుల కొరత, ఆకాశాన్నంటుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే ఈ మార్పు అనివార్యమని మస్క్ అంటున్నారు.అయితే, ఈ మార్పునకు నిర్దేశించిన కాలపరిమితిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఎలాన్ మస్క్ శైలిలో అత్యంత వేగవంతమైన జోస్యం మాత్రమేనని నిపుణులు భావిస్తున్నారు. వైద్య రంగంలో చట్టపరమైన నిబంధనలు, న్యాయపరమైన బాధ్యతలు, రోగుల నమ్మకం వంటి అనేక వాస్తవిక అడ్డంకులు ఉన్నాయి. 2029 నాటికి ఇది సాధ్యం కావడం చాలా దూలభమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భవిష్యత్లో అత్యుత్తమ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని, నేడు దేశాధ్యక్షులకు లభించే వైద్యం కంటే మెరుగైన సంరక్షణ సామాన్యులకు కూడా దక్కే గమ్యస్థానం వైపు మనం పయనిస్తున్నామని స్పష్టమవుతోంది.ఈ సాంప్లికా విప్లవంలో కేవలం మాన్యువల్ సర్జరీలపై ఆధారపడే వైద్యులు వెనుకబడే ప్రమాదం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని, రోబోట్లతో కలిసి పనిచేయడం నేర్చుకున్నవారే భవిష్యత్లో అసలైన విజేతలుగా నిలుస్తారు. వైద్య వృత్తి పూర్తిగా అంతరించిపోకపోయినా, దాని స్వరూపం మాత్రం పూర్తిగా మారిపోనుంది. మనుషుల నైపుణ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రోబోటిక్స్ కలయికతో వైద్య రంగంలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. 🚨 ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు⚠️"మెడికల్ కాలేజీలో చేరకండి. అది పూర్తిగా నిష్ప్రయోజనం."3 ఏళ్లలో 'ఆప్టిమస్' రోబోలు భూమిపై ఉన్న బెస్ట్ డాక్టర్ల కన్నా మెరుగైన శస్త్రచికిత్సలు చేయగలవు — అది కూడా భారీ స్థాయిలో.#Doctors pic.twitter.com/LXSiOw6NTG— UttarandhraNow (@UttarandhraNow) July 31, 2026 -
జగన్ పర్యటన అంటేనే బాబు గుండెల్లో గుబులు.. శ్రీకాకుళం పర్యటనపై చంద్రబాబు కుట్రలు
-
సీఎం రేవంత్ కు గట్టి ఎదురుదెబ్బ.. హైడ్రా ఉంటుందా..? ఊడుతుందా..?
-
కార్యకర్తల ముందు తొడ కొట్టడం ఏంటి.. ఇదేమన్నా నీ మామ సినిమా అనుకుంటున్నావా
-
‘దమ్ముంటే ఒంటరిగా రా’.. కంగనాపై రాఖీ తిరుగుబాటు
జంతర్మంతర్ వద్ద జరిగిన జెన్ జెడ్ విద్యార్థుల నిరసనలపై ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటి రాఖీ సావంత్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు, దేశ యువతకు మద్దతుగా నిలిచిన ఆమె, కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కంగనా రనౌత్ జెన్ జెడ్ వారిని ‘జనరేషన్ గట్టర్’ అని అభివర్ణించడంతో పాటు, నిరసనల్లో పాల్గొన్న యువతులపై వివాదాస్పద కామెంట్లు చేశారు.దీనిపై రాఖీ సావంత్ తీవ్రంగా స్పందిస్తూ, దేశంలోని యువతులు, విద్యార్థినుల గురించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసిన రాఖీ సావంత్, కంగనా రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ‘మీకు ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా బయటకు తిరగండి. అప్పుడే దేశంలోని యువత శక్తి ఏంటో మీకు తెలుస్తుంది’ అని సవాలు విసిరారు.పార్లమెంట్లో కూర్చుని ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్లో కంగనా గత వివాదాలను గుర్తుచేస్తూ, ఆమె భాషపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. మరోవైపు, కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో జెన్ జెడ్ నిరసనల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనల్లోని రీల్స్ చూసి తాను దిగ్భ్రాంతి చెందానని, కొద్దిరోజులు డిజిటల్ డిటాక్స్లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరిపై ఆమె మండిపడ్డారు. ఈ పరిణామాలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
రైతుల పొట్ట కొట్టకు చంద్రబాబు.. నీకు ఇదే నా విజ్ఞప్తి
-
పేపర్ లీక్ చేసినందుకు శిక్ష పడాల్సిందే.. లోకేష్ కు రాజీనామా డిమాండ్స్
-
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే ఒక పతివ్రత... తెల్లార్లు చల్లారలేదంట..!
-
అమెరికా ఆక్రమణకు యత్నిస్తోంది.. క్యూబా సంచలన ఆరోపణ
హవానా:క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా క్యూబాని ఆక్రమించాలని యత్నిస్తుందన్నారు. అమెరికా తన దేశంపై అమలు చేస్తున్న ఆంక్షలను 'జాతి విమర్శక విధానం' (జెనోసైడల్ పాలసీ)గా ఆయన అభివర్ణించారు. అమెరికా విధిస్తున్న ఒత్తిడి విధానాలను క్యూబా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో క్యూబాపై మరింత ఒత్తిడిని పెంచారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వాణిజ్య దిగ్బంధంతో పాటు, చమురు సరఫరాను నిలిపివేయడంతో పాటు కఠినమైన ఆంక్షలను విధించారు. దీనికి తోడు, క్యూబాకు ప్రధాన మిత్రదేశంగా ఉన్న వెనిజులాలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుని నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూలదోయడం క్యూబాను మరింత సంక్షోభంలోకి నెట్టింది.ఈ కఠినమైన చర్యల నేపథ్యంలో క్యూబా అధ్యక్షుడు అమెరికాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా ఆంక్షల కారణంగా క్యూబాలో పర్యాటకం దెబ్బతిన్నదని, విదేశీ కంపెనీలు వెనుదిరిగాయని ,విదేశీ మారకద్రవ్య ప్రవాహం పూర్తిగా నిలిచిపోయిందన్నారు. రష్యా, చైనాలకు మిత్రదేశంగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి భద్రతా ముప్పుగా మారుతోందని, పౌరుల హక్కులను ఉల్లంఘిస్తోందని అమెరికా వాదిస్తున్నప్పటికీ, తమ దేశం ఎవరికీ ముప్పు కాదని ఆయన స్పష్టం చేశారు.క్యూబా విప్లవానికి నాంది పలికిన 1953 నాటి మొన్కాడా బ్యారెక్స్పై దాడికి గుర్తుగా జరిగిన 73వ వార్షికోత్సవ వేడుకల్లో డియాజ్-కానెల్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్యూబా ప్రజలలో అశాంతిని సృష్టించి, తద్వారా తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దురుద్దేశంతోనే అమెరికా ఈ యుద్ధ తంత్రాలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. దేశంలో తీవ్రమైన ఇంధన సంక్షోభం, కరెంటు కోతలు నెలకొన్న ఈ తరుణంలో ప్రజలంతా ఐక్యంగా ఉండి, తగిన ఆర్థిక, సామాజిక మార్పులతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ఆయన పిలుపునిచ్చారు. -
DSC పేపర్ లీక్.. నారా లోకేష్ రాజీనామ చెయ్యాల్సిందే.. పుష్ప శ్రీ వాణి డిమాండ్
-
నా సోదరి క్రాంతి చేసింది మహాపాపం: ముద్రగడ గిరిబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం మరణం మా కుటుంబానికి తీరని లోటు’’ అని ఆయన కుమారుడు గిరిబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా తండ్రికి నివాళులర్పించిన అందరికీ మా కృతజ్ఞతలు. నా తండ్రిని బతికించేందుకు వైఎస్ జగన్ చాలా ప్రయత్నం చేశారు. ముద్రగడ ఆరోగ్యం గురించి వైఎస్ జగన్ ఫోన్ చేసి తెలుసుకునేవారు. ముద్రగడను బతికించేందుకు వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు’’ అని గిరిబాబు తెలిపారు.నా తండ్రి పాడెను వైఎస్ జగన్ మోయడం ఎప్పటికీ మర్చిపోలేం. ఇది రాజకీయ లబ్ధికాదు. కుమారుడు తండ్రికి ఇచ్చిన గౌరవం. వైఎస్ జగన్ పట్ల మా కుటుంబంలో మరింత గౌరవం పెరిగింది. ముద్రగడ చెప్పినట్టే నడుచుకున్నాం. మా సోదరి క్రాంతిని రానివ్వద్దని ముద్రగడ మాకు చెప్పారు. కానీ పోలీసులు బలవంతంగా క్రాంతిని తీసుకొచ్చారు. మేం క్రాంతిని తీసుకురావద్దని చెప్పినా పోలీసులు వినలేదు’’ అని ముద్రగడ గిరిబాబు చెప్పారు.అంబటి రాంబాబుపై కేసు పెట్టడం సరికాదు. అంత్యక్రియలకు అధికార లాంఛనాలు వద్దని మేమే చెప్పాం. మా తండ్రి అంత్యక్రియలు ప్రశాంతంగా చేసుకోనివ్వలేదు. నా సోదరి క్రాంతిని అడ్డుపెట్టుకుని జనసేన రాజకీయం చేస్తోంది. నా సోదరి క్రాంతి చేసింది మహాపాపం’’ అని గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజీనామా చెయ్ లోకేష్... నువ్వు విద్య శాఖ మంత్రిగా పనికిరావు..!
-
ధర్మేంద్ర ప్రధాన్ సంగతి ఓకే.. పేపర్ లీకేష్ లోకేష్ రాజీనామా ఎప్పుడు?
-
బీజేపీని వదిలి సీజేపీతో టీడీపీ పొత్తు..? వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నిర్ణయం వల్లనే ఈ ఉద్యమం మొదలయింది..! కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది...?
-
ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తే తర్వాత జరిగేది ఇదే..
-
జోమాటో నుండి అంత ఫుడ్ ఏవరు పంపారంటే? CJP కి అంతమంది సపోర్ట్ ఎందుకు ?
-
ధర్మేంద్ర రాజీనామా నుంచి PM మోదీ రాజీనామా వరకు వెళ్లిందంటే.. నెక్స్ట్ జరగబోయేది అదే..
-
వీసా స్కాం ఇంకా ఆగలేదు..! అసలు UKలో ఏం జరుగుతుందంటే?
-
సీదిరి అప్పలరాజు ఆరోగ్యంపై ఆందోళన
-
చంద్రబాబు సర్కారును నిద్ర లేపుతాం... పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతాం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన
-
2027 వరల్డ్ కప్.. రోహిత్, కోహ్లి ఫిక్స్.. షమీ, సిరాజ్ రీఎంట్రీ
-
చిన్నబాబు కట్టుబట్టల కథ.. వీకెండ్ వస్తే గచ్చిబౌలి ఫ్లైట్
-
నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే.. రాయపాటి శైలజ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అడ్వకేట్ రజిని
-
రాహుల్ గాంధీపై మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ప్రధాని నివాసం ఎదుట చేసిన నిరసనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు ( మంగళవారం) మండిపడ్డారు. విద్యార్థులకు మీరు ఆగ్రహం కంటే బాధ్యతనే బాకీ ఉన్నారన్నారు. విద్యార్థుల ఆందోళనను రాజకీయంగా వాడుకోవడం ఆపాలని హితవు పలికారు.ఈ రోజు సాయంత్రం ప్రధాని నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నిరసన చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి.కాగా తాజాగా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ధర్మేంద్రప్రధాన్ మాట్లాడుతూ" ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ, నిర్ధారిత భద్రతా నియమాలను ఉల్లంఘించి, గౌరవనీయ ప్రధానమంత్రి గారి నివాసం బయట ధర్నాకు దిగారు. సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చ కన్నా రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చింది. వారి లక్ష్యం విద్యార్థులకు పరిష్కారాలు అందించడం ఎన్నడూ కాదు, కేవలం రాజకీయ శీర్షికల కోసం గందరగోళం సృష్టించడమే. నీట్ గురించి చర్చించడానికి, సభలో మన యువత యొక్క ప్రతి నిజమైన ఆందోళనను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. విద్యార్థులకు మనం ఆగ్రహం కన్నా ఎక్కువ ఇవ్వాలి. వారికి మనం సమాధానాలు, సంస్కరణలు మరియు జవాబుదారీతనం ఇవ్వాలి. వాటిని అందించడానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది." అని రాసుకొచ్చారు. -
పరిపాలన అంటే ఎలా ఉండాలో జగన్ ను చూసి నేర్చుకో చంద్రబాబు
-
వాంగ్ చుక్ దీక్ష.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్కు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆరోగ్యం తీవ్రవంగా క్షీణించడం, డివిజన్ బెంచ్ ఆదేశాల కారణంగానే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కోర్టు పేర్కొంది.ఈ ప్రభుత్వ చర్యను ఏకపక్షమైనదిగా ఎట్టిపరిస్థితుల్లో పేర్కొనలేమని తెలిపింది.వాంగ్చుక్ అంగీకరించిన రీతిలోనే ఆయనకు మందులని ఇస్తున్నారని పేర్కొంది. ఈ కేసుపై కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలతో పాటు పోలీసులు సైతం తమ స్పందనలను మూడు రోజుల్లోగా దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 24కు వాయిదా వేసింది.కాగా సోనమ్ భార్య గీతాంజలి, వాంగ్చుక్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు.దీక్ష భగ్నంకాగా సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను నిన్న (శనివారం) ఉదయం ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్చుక్ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్చుక్తోపాటు జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు.మరో వైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్మంతర్ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నాటకీయ పరిణామాలు వాంగ్చుక్ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్ కుమార్ను నియమించింది. కొత్త కమిషనర్ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు.‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్మంతర్ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ జామర్ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు.పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా అంబులెన్స్లోకి చేర్చి, వెంటనే సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్చుక్ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు వెనకబడి పోయారు
నెహ్రూనగర్ (గుంటూరు వెస్ట్): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్రంలో గుంటూరు నగరానికి అవార్డు రాకపోవడంతో తీవ్ర వెనకబాటుకు గురైందని, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు వెనకబడిపోయారని సీఎం నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్చువల్గా ఈ–ఆటోలను ప్రారంభించారు. ఈ క్రమంలో స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర పురస్కారాల ప్రదానంలో భాగంగా సీఎం చంద్రబాబు గుంటూరు నగరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అవార్డుల ప్రకటనలో గుంటూరు పేరు ఎక్కడా వినిపించకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, వెనకబడిపోయారని, ఇకనైనా వారు వేగం పెంచి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఒక పక్క సీఎం చంద్రబాబు గుంటూరు పారిశుధ్యంపై చురకలు అంటిస్తుంటే మరో పక్క కేంద్ర మంత్రి పెమ్మసాని నవ్వుతూ సమాధానం చెప్పడంపై ఒకింత విమర్మలకు తావించినట్లయింది. నగరాభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్న సీఎం.. ‘ఐ లవ్ గుంటూరు‘ అనే బోర్డులు ఏర్పాటు చేసి, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వర్కవుట్ ప్రారంభించాలన్నారు. -
‘ఒక్క పెళ్లి చేసుకున్న వారే రాష్ట్రంలో ఉంటారు’
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించాలంటే కేవలం ఒక్క వివాహం మాత్రమే చేసుకుని ఉండాలన్నారు. ఈ మేరకు త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెడుతుందని, "ఒకే వివాహం చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్రంలో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుంది" అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నొక్కి చెప్పారు.కట్నీ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే అధిపతి, ఒకే జెండా ఉండాల్సినప్పుడు, హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకు ఉండాలి? అందరికీ ఒకే చట్టం ఉండాలి. రామ్కు ఒకే వివాహం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు, రహీమ్కు రెండు, మూడు లేదా నాలుగు వివాహాలు ఎందుకు ఉండాలి? మన ముస్లిం సోదరీమణులు కూడా మన సోదరీమణులే. ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ప్రకారం, ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే మధ్యప్రదేశ్లో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుంది," అని తేల్చిచెప్పారు.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెడుతుందని ఆ ప్రాతిపాదిత చట్టం ఏకరీతి న్యాయ వ్యవస్థను అందిస్తుందని, తక్షణ ట్రిపుల్ తలాక్ యుగం ముగిసిందని పేర్కొన్నారు.కాగా భారతదేశంలో యూసీసీని చట్టబద్ధం చేసి, విజయవంతంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2024 లోనే అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వగా, 2025 జనవరి 27 నుండి ఈ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చింది. వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కులు, సహజీవనం వంటి అంశాలపై ఇక్కడ అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. -
రోహిత్ రిటైర్మెంట్ పై టీమిండియా కోచ్ క్లారిటీ
-
ఈ రోజు నిన్ను ఏమనాలి లోకేష్..! తల్లి కి వందనం పథకానికి ఎగనామం
-
కూటమిలో లోకల్ వార్.. లోకేశ్ Vs నాదెండ్ల..
-
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కీలక ప్రకటన
-
పవన్ చేసిన ఒక్క అవమానం.. కూతురిని రానివ్వక పోవడానికి అసలు కారణం..
-
ప్రభుత్వ లాంఛనాలు తీసుకోకపోతే ముద్రగడ ఫ్యామిలీపై కేసు పెడతారా..
-
నెల రోజులు ముద్రగడ ఆసుపత్రిలో ఉంటే కూతురికి పరామర్శించే సమయం లేదా ?
-
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
జగన్ ని డ్యామేజ్ చేయడం అసాధ్యం.. లోకేష్ ని తొక్కేసి విజయ్ లా NTR సక్సెస్ అయితే!
-
పీకాక్స్ పర్వతంపై ట్రంప్ గురి.. అవసరమైతే లేపేస్తాం
-
ఆయనను ఎదుర్కొనే దమ్ము లేక... కన్న కూతురితో తిట్టించారు
-
యోగా గురు రామ్దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు : దుమారం
యోగా గురు రామ్దేవ్ బాబా హిందూ రాష్ట్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన పూర్వీకులు ఒక్కరేనని, దేశంలో ముస్లింలకు లేదా క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదం లేదని, అందువల్ల 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ద్వారా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న 60 ఏళ్ల ఈ యోగా గురువు, 2009లో ఉత్తరప్రదేశ్లోని తాను మదర్సాను సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ రామ్దేవ్ ఇలా అన్నారు: "హరిద్వార్ సమీపంలో డియోబంద్ ఉంది. మన మతాలు వేరుగా ఉండవచ్చు, కానీ మన పూర్వీకులు ఒక్కరే. 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మనందరి పూర్వీకులు సనాతన హిందూ ఆర్య-వైదికులే. ఈ విషయం మన కళ్ల ముందే స్పష్టంగా ఉంది’’ అంటూ పెద్ద దుమారాన్నే రాజేశారు. హిందుస్థాన్లోముస్లింలకు గానీ, క్రైస్తవులకు గానీ ఎలాంటి ప్రమాదం లేదని ఆయన అన్నారు. అంతేకాదు ముస్లింలు తమ ఇష్టప్రకారం గడ్డం ఉంచుకోవచ్చు, లేదా తీసేసుకోవచ్చన్నారు. అంతేకాదు, నచ్చిన దుస్తులు ధరించవచ్చని, కానీ తమ పూర్వీకుల లాంటి మంచిప్రవర్తనను, సాంప్రదాయాలను అలవర్చు కోవాలని ఆయన సలహా ఇచ్చారు.మండిపడ్డ విపక్షాలు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రామ్దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అందరూ సనాతనులే అయితే, సమాజంలో ఇన్ని విభజనలు సృష్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అందరినీ సమానంగా అంగీకరించ కుండా విడదీయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తించారు.దేశం కేవలం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని, భారతదేశాన్ని 'హిందూ రాష్ట్రం' అని ఎవరు ప్రకటించారని AIMIM వారిస్ పఠాన్ ప్రశ్నించారు. ముస్లింలు ఎవరికీ భయపడరని, రాజ్యాంగానికి లోబడే జీవిస్తారని చెబుతూ, ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు.ఇదీ చదవండి:అయోధ్య ట్రస్ట్ సీఈవో పదవికి దరఖాస్తులు ఆహ్వానం, అర్హతలేంటో!దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ఇలాంటి వారిని తెరపైకి తెచ్చి 'హిందూ రాష్ట్రం' గురించి మాట్లాడిస్తోందని సమాజ్వాదీ పార్టీ నేత ఫఖ్రుల్ హసన్ చాంద్ ఆరోపించారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే లౌకిక దేశమనదని ఎన్సీపీ నేత నసీమ్ సిద్దిఖీ గుర్తుచేశారు. ప్రజలు తమకు నచ్చిన మతాన్ని, ఆచారాలను అనుసరించే స్వేచ్ఛ ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు, సోదరభావానికి ముప్పు కలిగిస్తాయని ఆయన ఖండించారు.ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? -
షాబాద్ హత్యలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
షాబాద్ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ కేసు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకొని ఆరుహత్యల నిందితుడు రాజ్ కుమార్ను అరెస్టు కాకుండా కాపాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అండదండలతో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇచ్చి కాపాడారు. ఈలోపు నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని ఆరుగురిని హత్య చేశాడు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ స్పోక్స్పర్సన్ నాగార్జున యాదవ్ అనే నాయకుడు రేవంత్ రెడ్డిని పెయింట్ వేస్తారు అన్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని, నల్లబాలు ట్విట్టర్లో ట్వీట్ చేస్తే పోలీసులు అతనిని జైలుకు తరలించారు. కానీ రేప్ చేసిన నిందితుడు రాజ్ కుమార్ను అరెస్ట్ చేయకుండా, అతడితో కూర్చొని పోలీసులు మందు తాగారు అని హరీశ్ రావు ఆరోపించారు.కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆ హంతకుడి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని పోలీసులు ప్రకటించారు. -
బాబు కొత్త పథకం.. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
-
మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్
-
రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...
-
రావణ్ పై ఉపా కేసు.. ఆధారాలతో నిరూపించకపోతే కోర్టులో జరిగేది ఇదే
-
నీకు దమ్ముంటే జగన్ ను ఆపి చూడు... చంద్రబాబుకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
సొంత పార్టీ MLAపైనే తిరుగుబాటు.. కారు టాప్ ఎక్కి ఓవరాక్షన్!
-
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకు అనర్హుడు..! ప్రశ్న రావణ్ పై పెట్టిన కేసు నిలవదు
-
నాకు తెలంగాణే ఫస్ట్.. ఈటల సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడని అదే తన గుర్తింపన్నారు. తనకు ఎప్పుడు తెలంగాణనే ఫస్ట్ అని దాని తర్వాతే పార్టీ అని కుండబద్దలు కొట్టారు. ఈటల వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో హాట్ టాఫిక్గా మారాయి. ''ఎవరి మెప్పుకోసమో, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తేనో.. ఎవరో పలికిస్తేనో పలికే రకం కాదు. మేము స్వయం ప్రకాశులం. సొంత జ్థానం, అవగాహన, కమిట్మెంట్ ఉన్నవాళం మేము. నేను రిమోట్కంట్రోల్ లాంటివాడిని కాదు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోను'' అని ఈటల అన్నారు. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడి తెలంగాణ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తున్నా ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా రైతులను కష్టాల పాలు చేయడం సరైంది కాదన్నారు. వర్షాకాలం పంటలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. -
కొంచమైనా సిగ్గనిపించట్లేదా బాబు.. నిద్రలో కూడా జగన్ పేరేనా..
-
ఒకరికి అమరావతి.. ఇంకొకరికి పోర్టులు.. దిల్ సినిమాలో వేణుమాధవ్, MS నారాయణలా..
-
హెచ్1-బీ పై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్ డీసీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ హెచ్-1బీ వీసా నిబంధనల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉన్న ఉద్యోగాలు అమెరికన్లకేనేగాని విదేశీ మోసగాళ్లకు కాదన్నారు. అయితే కొంతమంది విదేశీ కార్పోరేషన్లు అమెరికాలోని కార్మికుల వేతనాలను తగ్గించడానికి ఈ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దానికి అడ్డకట్ట వేస్తున్నామని వాన్స్ ఉద్ఘాటించారు.ట్రంప్ అమెరికాలోని విదేశీయుల పట్ల ఎంత కఠినంగా వ్యవహారిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రెండోసారి అధికారం లోకి వచ్చాక ఆ దూకుడు మరింత పెంచారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల నుంచి హెచ్-1బీ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. దానిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో జేడీ వాన్స్ స్పందించారు.జేడీవాన్స్ మాట్లాడుతూ" హెచ్-1బీ వీసా కార్యక్రమం ఒక ప్రతిభావంతుడైన సాంకేతిక నిపుణుడు, లేదా ఒక ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త, లేదా ఒక ప్రతిభావంతుడైన వైద్యుడు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి కానీ.. ఆ ఉద్దేశ్యాన్ని మార్చారు. మీకు తెలుసా, విదేశాల్లోని పెద్ద కార్పొరేషన్లు మోసగాళ్లు అమెరికన్ కార్మికుల వేతనాలను తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని చాలా ఎక్కువగా వాడుకుంటున్నారు. కాబట్టి, ట్రంప్ పరిపాలనలో మేం ఏం చేస్తున్నామో మీకు తెలుసా? ఇకపై కుదరదని మేం చెబుతున్నాం. మీరు ఆ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తుంటే, అటువంటి వారికి అమెరికాలోకి ప్రవేశం లేదు," అని ఆయన అన్నారు.నేను మీకు ఒకటి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి కానీ విదేశీ మోసగాళ్లకు కాదు దానికోసం అమెరికా కార్మికశాఖ పోరాడుతుంది అని వాన్స్ నొక్కి చెప్పారు.వీసా నిబంధనల్లో మార్పులు?అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు అవకాశమిచ్చే హెచ్1–బీ వీసాల ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఉద్యోగితోపాటు, కంపెనీ తాలూకూ వివరాలను మరింత నిశితంగా పరిశీలించనున్నారు. క్లయింట్ సైట్లలో ఉద్యోగులు ఎలాంటి పనులు చేస్తున్నారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. హెచ్1–బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల విషయంలో మరింత కఠినంగా ఉండనున్నారు.యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలకు ప్రస్తుతం ఉన్న వార్షిక కోటా మినహాయింపు రద్దయ్యే లేదా కుదించే అవకాశముంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశమిచ్చే గ్రీన్కార్డుల విషయానికి వస్తే పెర్మ్ లేబర్ సర్టీఫికెట్లు జారీ చేసేందుకు వసూలు చేసే ఫీజులను కూడా పెంచాలని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న హెచ్1–బీ వీసాదారులకు గ్రీన్కార్డు ఇవ్వాలని కార్మిక శాఖకు ప్రతిపాదిస్తారు.అమెరికన్లు చేయలేని పని హెచ్1–బీ వీసాదారు చేస్తున్నాడని, అతడికి ఇచ్చే వేతనం అమెరికన్లకు ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా ఉందని కంపెనీ నిరూపిస్తే పెర్మ్ సర్టీఫికెట్ లభిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును పెంచడం ద్వారా గ్రీన్ కార్డులను మరింత తగ్గించున్నారన్నమాట. -
జైల్లో ప్రశ్న రావణ్ ఇప్పటికి కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు.. ఎందుకంటే..
-
బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు.. దొంగ సర్టిఫికెట్ల వాడికి విద్యాశాఖా..?
-
చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్న పవన్...! గవర్నర్ తో చర్చలు..
-
ఏమ్మా సునీతమ్మ, నీ మొగుడు నా కల్లోకి ఎందుకు వస్తాడు? అప్పుడే మర్చిపోయావా?
-
నువ్వు అంత పోటుగాడివా.? పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్
-
ఇంకెంత కాలం? పవన్ కళ్యాణ్ కు వంగవీటి రంగా కూతురు విజ్ఞప్తి
-
నాడు పవన్ చెప్పు చూపిన రోజే బుద్ధి చెప్పి ఉంటే.. ఏకిపారేసిన అడ్వకేట్ రజిని
-
నేను పవన్ కళ్యాణ్ ని దగ్గర నుండి చూశా..? డిప్యూటీ సీఎంకు క్రిమినల్ కు తేడా ఏంటి?
-
రావణ్ పై ఎన్ని కేసులైన పెట్టుకోండి.. బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది
-
ఉద్యోగాలపై సైబర్ సెక్యూరిటీ దిగ్గజం నికేష్ అరోరా సంచలన వ్యాఖ్యలు
భారతీయ అమెరికన్ బిలియనీర్ సీఈఓ, సైబర్ సెక్యూరిటీ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్వర్క్స్' (Palo Alto Networks) సీఈఓ నికేష్ అరోరా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే మూడేళ్లలో కార్పొరేట్ కంపెనీల్లోని కొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్, హెచ్ఆర్ (HR), ఫైనాన్స్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు.సగానికిపైగా ఆ ఉద్యోగాలు మాయంఒక పాడ్కాస్ట్లో నికేష్ అరోరా మాట్లాడుతూ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) విభాగాలలో ప్రాసెస్ మేనేజ్మెంట్ (నిర్వహణ ప్రక్రియలు) ఎక్కువగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాబోయే అధునాతన ఏఐ అప్లికేషన్ల ద్వారా ఈ పనులను మరింత తెలివిగా, సులువుగా చేయవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న సాస్ (SaaS - సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) అప్లికేషన్లకు సొంత అభిప్రాయాలు ఉండవు. కానీ రాబోయే ఏఐ అప్లికేషన్లు స్వతంత్రంగా (Autonomous) వ్యవహరిస్తాయి. ఉదాహరణకు, ఒక మార్కెటింగ్ కాపీని చూసి అది బాగోలేదని చెప్తూ, బ్రాండ్కు తగినట్లుగా ఎలా మార్చాలో ఏఐ స్వయంగా సూచించగలదు. దీనివల్ల సగటు ఉద్యోగి మరింత స్మార్ట్గా పనిచేయగలుగుతాడు. ఫలితంగా, ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండదు. ప్రస్తుతం తమ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్న 600 మంది సిబ్బందిని ఏఐ సహాయంతో సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఏవి?ఏఐ యుగంలో కొన్ని ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, టెక్నికల్ , సేల్స్ లాంటి మరికొన్ని విభాగాలకు డిమాండ్ పెరుగుతుందని కూడా అరోరా చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నప్పుడు, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరవేయడానికి సేల్స్, టెక్నికల్ సిబ్బంది అవసరం పెరుగుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమర్థవంతంగా ఉపయోగించగలిగే (AI Savvy) ఉద్యోగులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఉద్యోగులకు హెచ్చరికప్రస్తుతం కార్పొరేట్ సంస్థల్లోని 90శాతం మంది ఉద్యోగులకు AIపై సరైన అవగాహన/పరిజ్ఞానం లేకపోవడమే అతిపెద్ద సవాలని నికేష్ అరోరా అభిప్రాయపడ్డారు. ఇది డార్విన్ సిద్ధాంతం లాంటి సమయం. ఇక్కడ ఎవరు అత్యుత్తమంగా రాణిస్తారో వారే నిలబడతారు. కాబట్టి ఉద్యోగులు స్వయంగా ఏఐ సాంకేతికతను నేర్చుకుని అప్డేట్ అవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఒకప్పుడు గూగుల్ సంస్థలో అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగిగా రికార్డు సృష్టించిన నికేష్ అరోరా, ఐఐటీ (BHU) వారణాసి పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయన నేతృత్వం వహిస్తున్న పాలో ఆల్టో నెట్వర్క్స్ మార్కెట్ విలువ దాదాపు 287 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా గత రెండేళ్లుగా ఏఐ పునర్నిర్మాణం కారణంగా మెటా (Meta), అమెజాన్ (Amazon), ఒరాకిల్ (Oracle), కాగ్నిజెంట్ లాంటి వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: అయోధ్యరాముడి విరాళాల గోల్మాల్ : స్పందించిన ఆర్ఎస్ఎస్ -
రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్
-
My Lovely Darling.. రఘురామపై జడ శ్రవణ్ సెటైర్లే సెటైర్లు
-
దమ్ముంటే వేయ్ జైల్లో... నన్ను విప్పమంటావా నీ గుట్టు..?
-
హే రామ్.. సేవ్ ఆంధ్రా.. జగన్ విసిరిన బాణాలకు అధికార కూటమి అల్లాడిపోతోంది..
-
పవన్ కుమార్తెపై చంద్రబాబు కామెంట్స్
-
జర్నలిస్ట్ KVR ని చూపించండి అంటే... సీఐ తన సొంత ప్రాపర్టీలా ఫీల్ అయిపోతున్నాడు
-
ఏపీ రాజధానిపై YS జగన్ సంచలన ప్రకటన
-
శవం ఇవ్వం.. బూడిద ఇవ్వం.. దమ్ముంటే అధికారిక ప్రకటన చేయండి!
-
ఆ 70 వేల సీసీ కెమెరాలు ఏమైపోయాయి?.I 18 నెలలుగా సీసీటీవీ ఫుటేజ్ మాయం...
-
సాయి కృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్ చూపిస్తూ బాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
-
ఈ సారి అరే గిరే అని సౌండ్ చేస్తే రౌండ్ పక్కా...
-
మేకప్ మంత్రి అని అన్నది మీ టీడీపీనే.. అనితను చెడుగుడు ఆడుకున్న శ్యామల, నాగమల్లీశ్వరి
-
చంద్రబాబుపై బోండా ఉమా షాకింగ్ కామెంట్స్!
-
ఆ తల్లి బూడిద అడిగితే ఇవ్వరు కానీ... మేకప్ కోసం రాద్ధాంతం చేసున్నావ్
-
ఆఫ్ట్రాల్ CI గాడివి.. క్రిమినల్ అయితే చంపేస్తావా..?
-
తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా.. సాయికృష్ణ కేసులో నోరు విప్పిన హెడ్ కానిస్టేబుల్స్
-
ఇరాన్ ఫ్రీజింగ్ ఆస్తులు.. మసూద్ పెజెష్కియన్ కీలక ప్రకటన
టెహ్రాన్ : ఇరాన్ ప్రజలకు ఆదేశ అధ్యక్షుడు మసూజ్ పెజెష్కియన్ శుభవార్త చెప్పాడు. ఆ దేశానికి చెందిన ఆరు బిలియన్ డాలర్లను విడుదల చేయడానికి ఖతార్ అంగీకరించిందని పేర్కొన్నారు. త్వరలోనే ఆ డబ్బు విడుదల కానుందని పేర్కొన్నారు.అయితే అమెరికా మాత్రం స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులేవీ విడుదల చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.గత కొంత కాలంగా ఇరాన్- అమెరికా చర్చలు సజావుగా సాగకపోవడానికి స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులు సైతం ఓ కారణం విదేశాల్లో ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ పట్టుబట్టడం దానికి అమెరికా ససేమిరా అనడంతో చర్చల వ్యవహారం ఎంత మాత్రం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు సైతం నిధులు విడుదల చేసేది లేదన్నారు.అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ఫెజెష్కియన్ మాత్రం దానికి విభిన్నంగా మాట్లాడారు “ ఇటీవలే రూపొందించిన ప్రణాళికల ప్రకారం, ఖతార్లోని మొత్తం 12 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులలో ఆరు బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేసి దేశానికి తిరిగి ఇవ్వనున్నారు, అంతే కాకుండా తదనంతరం అవసరమైన తదుపరి చర్యలు చేపడుతారు.” అని అన్నారు. అయితే ఈ యుద్ధ ఉద్రిక్తతల వేళ చర్చల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ 'నిస్సహాయతతో' చర్చల్లోకి ప్రవేశించిందని, 60 రోజుల చర్చల కాలంలో టెహ్రాన్కు ' పది సెంట్లు కూడా ' అందవని తేల్చి చెప్పారు. అదే విధంగా ఈ యుద్ధంలో ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, వాయు, రక్షణ వ్యవస్థలు భారీ స్థాయిలో డ్యామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. -
నడిరోడ్డుపై మహిళ బట్టలు చించి... TDP కౌన్సిలర్ దారుణం
-
అమరావతిపై నేను చేసిన వీడియోలు అన్ని డిలీట్ అయిపోయాయి..
-
ఈ రోజు కోర్టులో జరగబోయేది ఇదే.. సాయి కృష్ణ కేసుపై కారుమూరి షాకింగ్ నిజాలు
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. SIT కు కీలక రిపోర్టు ఇచ్చిన అంబటి..
-
సిగ్గులేదా.. అక్కడ చెయ్యి పెట్టడానికి... JC ప్రభాకర్ పరువు తీసిన పెద్దిరెడ్డి
-
వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు (ఆదివారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఎల్వోలుగా ఉన్నది తెలంగాణ ఉద్యోగుల కాదా అని ప్రశ్నించారు? పాతబస్తీలో, బంగ్లాదేశ్, మయన్మార్, దేశాల ప్రజలున్నారని వారంతా భారతీయులు కాదన్నారు.అటువంటి వారిని ఓటర్ లిస్టులో ఎట్టిపరిస్థితుల్లో ఓటర్ లిస్టులో ఉంచేది లేదన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని ప్రజలకు హామీలిచ్చి పచ్చిమోసం చేశాయని కేంద్రమంత్రి ఈ సందర్భంగా రెండు పార్టీలపై మండిపడ్డారు. -
‘పశ్చిమబెంగాల్లో జరిగిందే.. తెలంగాణలో..’
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ అన్నారు. ఈ రోజు (ఆదివారం) తొమ్మిది జిల్లాలలో బీజేపీ ఆఫీసులను వర్చువల్గా ప్రారంభించారు. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో జరిగిందే తెలంగాణలోనూ జరుగుతుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందన్నారు.కాగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. క్యాడర్ని బలోపేతం చేసేలా పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించున్నారు.జూన్ 29న రేపు ( సోమవారం) ఘట్కేసర్లోని VBIT ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. తర్వాత వరంగల్ పర్యటనలో భాగంగా గిరిజన సంఘాల నేతలతో, పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశమవుతారు. తదుపరి జూన్ 30 నఘట్కేసర్లో రాష్ట్ర కార్యవర్గం, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను దిశానిర్దేశం చేసి, అనంతరం ఢిల్లీకి పయనం కానున్నారు. -
200 భాషల్లో వారణాసి.. జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన ప్రియాంక
-
నువ్వు, నీ బలుపు... లక్ తో డిప్యూటీ సీఎం అయ్యావ్.. తగ్గించుకుంటే మంచిది..!
-
ఎక్కడ ఏమి మాట్లాడాలో చేతకాని సీఎం.. నీ చేతకానితనం వల్లే ఏపీకి నష్టం
-
కర్త, కర్మ, క్రియ CP రాజశేఖర్ బాబే...! హైకోర్టు న్యాయమూర్తికి నా విన్నపం ఇదే
-
రూ. 100 కోట్ల విలువైన భూమి రాత్రికి రాత్రే తారుమారు..
-
బాబు మార్క్ కుట్ర సిద్ధాంతాలు.. ఎల్లో మీడియా వాయింపు!
అధికారంలో ఉన్నవారికి తమ తప్పులను ఎత్తి చూపితే అవి కుట్రల్లా కనిపిస్తాయి. అంతే తప్ప తాము చేస్తున్న పనులలో తప్పులు జరుగుతున్నాయని అంగీకరించలేరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అధికారులను హెచ్చరించారట. ఇంతకీ ఆయన దృష్టిలో ఏది కుట్ర? ఏది కాదు? తాను విపక్షంలో ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేస్తుంటారు. అదే అధికారంలో ఉన్నప్పుడు విపక్షం సాక్ష్యాధారాలు చూపిస్తూ విమర్శలు చేసినా, ఆయా వివాదాలలో తన ప్రభుత్వం దొరికిపోయినా అదంతా కుట్ర అని చెబుతూ జనం నమ్మాలని కోరుకుంటారు. ఆయనకు ఎల్లో మీడియా తబలా వాయిస్తుంటాయి కనుక అలా సాగిపోతుంటుంది. తమ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం ఆయన లక్ష్యంగా ఉంటుంది.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో విపక్షంపై ఇదే ఆరోపణ చేసేది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు లోక్సభ సభ్యురాలిగా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆమె ఇది కుట్ర అని ఆరోపించి ఏకంగా ఎమర్జెన్సీని విధించి, అనేక మంది ప్రతిపక్ష పార్టీల నేతలను జైళ్లలో పెట్టించారు. ఎమర్జెన్సీని ఎత్తివేశాక కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. అది వేరే విషయం.కాంగ్రెస్ ఐ నుంచి రాజకీయ ఆరంగ్రేట్రం చేసిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని, తన మామ ఎన్టీఆర్ను పడదోసి అధికారంలోకి వచ్చారు. ఇదే పని 1984లో నాదెండ్ల భాస్కరరావు చేస్తే కుట్ర అని, ప్రజాస్వామ్య హననం అని అంటారు. సొంత మామ ఎన్టీఆర్ను కూలదోస్తే మాత్రం అది కుట్ర కాదని ప్రచారం చేసుకోగలిగారు. ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబును తీవ్రమైన భాషలో నిందించారు. ఆర్టీజీఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అన్నారట. ఎల్లో మీడియా చాలా ప్రముఖంగా ప్రచారం చేసింది. ఇంతకీ ఏది కుట్ర అవుతుంది? పోలీస్ స్టేషన్లలో నిందితులను హింసించి చంపిన ఘటనలను ఎవరికి తెలియకుండా చేయాలని అనుకోవడం కుట్ర అవుతుందా? ఆ విషయాన్ని బహిర్గతం చేసిన వైఎస్సార్సీపీ ది కుట్ర అవుతుందా?విజయవాడలో సాయికృష్ణ అనే కాపు యువకుడు మిస్సింగ్ అవడం, ఆ తర్వాత అతనిని దహనం చేసి బూడిద కూడా కనిపించకుండా చేశారన్న ఆరోపణ రావడం ఏమిటి? దాని గురించి నిష్పక్షపాతంగా విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవన్ని కుట్రలు అన్నట్లుగా మాట్లాడడం ఏమిటి. సాయికృష్ణ కేసులో ఇంతవరకు ఒక్క సీఐని మాత్రం అరెస్టు చేసి, మిగిలినవారి జోలికి వెళ్లకపోవడం కుట్ర అవుతుందా? కాదా? చివరికి సిసిటీవీ ఫుటేజీ మిస్ అవ్వడం అంటే కూటమిప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతుందా? లేదా? ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబును రక్షించడం కోసం ప్రభుత్వం రకరకాల పన్నాగాలను పన్నుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.మాజీ మంత్రి అంబటి రాంబాబు, జైభీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ వంటివారు అనేక ఆధారాలతో సహా ఆరోపణలు చేశారే. వాటికి జవాబు ఇవ్వకుండా కుట్రలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా అధికారులకు ఎలాంటి సంకేతం పంపుతున్నారు? అంటే తప్పు చేసినా దొరకవద్దని పరోక్షంగా చెబుతున్నారా? లీగల్గా, టెక్నికల్గా దొరకరాదని చెబుతున్నట్లు అనిపించదా! సాయికృష్ణ రౌడీషీటర్ అని ప్రచారం చేసి, అతని కుటుంబాన్ని జగన్ పరామర్శించడాన్ని టీడీపీ ఎందుకు తప్పు పట్టింది? ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా రౌడీషీటర్ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడడాన్ని ఏమని అంటారు? ఏమి న్యాయం చేశారో బయటపెట్టకుండా బాధిత కుటుంబ నోరు కట్టేయడాన్ని కుట్ర అంటారా? లేక ఓపెన్గా ప్రజాస్వామ్య హక్కుల కోసం వైఎస్సార్సీపీ, మరి కొన్ని ఇతర ప్రతిపక్షాలు పోరాడడం కుట్ర అవుతుందా?వివిధ ఘటనలకు కులం, మతం రంగు పులుముతున్నారని కూడా ఆయన అన్నారట. ఇలాంటి వ్యవహారాలలో చంద్రబాబుకు ఉన్న అనుభవం మరెవరికైనా ఉందా? అన్న చర్చ జరుగుతోంది. కందుకూరులో జనసేనకు చెందిన ఒక కాపు వ్యక్తి టీడీపీ నేత చేతిలో హత్యకు గురైతే ఏ ప్రాతిపదికన ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద చంద్రయ్య అనే స్థానిక టీడీపీ నేత ఫ్యాక్షన్ రాజకీయాలలో హత్యకు గురైతే బీసీ నేతను వైఎస్సార్సీపీ వారు చంపారంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిన మాట నిజమా? కాదా?ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న అతని కుమారుడికి ఏ ప్రమాణం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు? అందులో కుల రాజకీయం లేదా? వైఎస్సార్సీపీ హయాంలో క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన సుధాకర్ అనే డాక్టర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాతకాలంలో ఆయన మద్యం మత్తులో విశాఖ నడిరోడ్డుపై నానా రచ్చ చేస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ ఆయన చేతులు కట్టి స్టేషన్కు తీసుకువెళితే దళిత డాక్టర్ను అలా చేస్తారా అంటూ విమర్శలు చేయడాన్ని ఏమని అంటారు? అది కుట్ర కాదా? అతను అనారోగ్యానికి గురై మరణిస్తే, దానిని ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించడం ఏ రాజకీయం అవుతుంది? అవినీతి కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అయినా, మరో కేసులో ఇంకో నేత కొల్లురవీంద్ర అరెస్టు అయినా బీసీలను అరెస్టు చేస్తారా అంటూ ఎల్లో మీడియా ద్వారా విరుచుకుపడింది ఎవరు? దానిని కుల రాజకీయం అంటారా? ఇంకేమైనా అంటారా?అసలు విషయంలోకి వెళ్లకుండా ప్రత్యర్ధులపై తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు ఘనాపాటి అని ఆయన విమర్శకులు చెబుతుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న, చితక కేసులు పెట్టించి, ఆయనపై దుష్ప్రచారం చేసింది ఎవరు? ఆయన కుమారుడు జగన్పై ఈ పదేళ్లలో ఎన్ని కుట్రలు చేశారు. ఎంత అబద్దపు ప్రచారం చేశారు? ఇక మత రాజకీయం గురించి చెప్పవలసి వస్తే చాంతాడంత అవుతుంది.కొన్నిచోట్ల టీడీపీకి చెందిన వారు విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివారిలో ఒకరికి ఐదు లక్షల పరిహారాన్ని ఎలా ఇచ్చారు? తిరుమల లడ్డూపై లేని వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడం కుట్ర అవుతుందా? కాదా? పోనీ జగన్ ఏ కుట్ర పన్నారో ఒక్కటైనా ఉదాహరణ ఇవ్వాలి కదా! అలాకాకుండా బట్టకాల్చి మీద వేయడం ఏమిటి? దానిని కదా కుట్ర అనాల్సింది. మొత్తం మీద ఇటీవలికాలంలో ప్రభుత్వపరంగా జరగుతున్న అనేక ఘటనలలో అటు పాలకులు, ఇటు అధికారులపై ఆరోపణలు వస్తుండడంతో చంద్రబాబు కుట్ర ధీరిని ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్
-
CI నాగరాజు గారు జైల్లో మీరు జాగ్రత.. ఎందుకు చెప్తున్నాను అంటే...!
-
ముద్రగడ ఆరోగ్యంపై పిచ్చి వార్తలు.. తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ వార్నింగ్
-
నయా పైసా చెల్లించలేదు.. రెచ్చిపోయిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిహారం కింద ఇరాన్కు ఇప్పటి వరకూ తామూ నయాపైసా కూడా చెల్లించలేదని తెలిపారు. అదేవిధంగా హర్ముజ్లో ఎలాంటి టోల్ విధించబోమని ఇరాన్ ఇదివరకే తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ ఇరాన్ ఇచ్చిన ఈ సమాచారం అబద్ధమని తేలితే, ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చలను తక్షణమే నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు.అయితే, ఇరాన్లో ఆహార కొరత తీవ్రంగా ఉన్నందున, వారి నిధులను పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉంచి కేవలం అమెరికా రైతులకు సంబంధించిన మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రమే వాటిని వాడేలా అనుమతిస్తామని వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ బంకుల్లో ధరలను తగ్గించకుండా వినియోగదారులను దోచుకుంటున్నారనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే దర్యాప్తు చేయాలని అమెరికా న్యాయశాఖను కోరినట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరోసారి కలకలం రేపుతున్నాయి.కాగా గత సోమవారం స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఒప్పందం షరతుల్లో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ వెసులుబాటు ఆగస్ట్ 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. -
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
కాపులపై దాడుల మీద ప్రభుత్వం జవాబివ్వాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు సామాజికవర్గంపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ప్రభుత్వం జవాబివ్వాలని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు. కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్తో పాటు క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుస ఘటనలతో ఇరకాటంలో పడిన చంద్రబాబు ఎప్పటిలాగే పవన్కళ్యాణ్, జనసేన నాయకులను రంగంలోకి దింపి డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్పై పిచ్చి కూతలు కూసిన పంతం నానాజీ సహా జనసేన నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో చనిపోతే దానికి హోం మంత్రి, డీజీపీ, పోలీసు అధికారులే బాధ్యత వహించాలన్నారు. మంత్రి కందుల దుర్గేష్ కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడే ముందు.. రెండేళ్లుగా ఆ సంస్థకు ఎందుకు నిధులు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో కాపు నేస్తం సహా వివిధ పథకాల ద్వారా రూ.36 వేల కోట్ల మేర కాపులకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. -
డీల్పై కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ను మళ్లీ రెచ్చగొట్టిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ పాటించకపోతే తాను అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో కాస్త ఘాటు హెచ్చరికలే జారీ చేశారు."ఇరాన్ తమ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఒప్పందం పట్ల వాళ్లు సక్రమంగా ప్రవర్తించాల్సిందే. లేకుంటే నేను చేయాల్సింది నేను చేస్తా. ఊరుకుంటానుకుంటే ఆ దేశం పొరపాటే" అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ.. గత వారం ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాత్కాలిక ఒప్పందం(MoU)పై డిజిటల్ సంతకాలు చేశారు. ప్రత్యక్ష చర్చల్లో భాగంగా.. మొన్న ఆదివారం ఇరాన్, అమెరికా, మధ్యవర్తిత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్లో చర్చలు మొదలుపెట్టారు. దీంతో 60 రోజుల్లో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. అయితే.. స్విస్ చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ను కవ్వించేలా మాట్లాడారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే భీకర దాడులు.. అదీ గతంలో కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే ఇరాన్ ప్రతినిధులు చర్చల మధ్య నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇరాన్ అధికార ప్రతినిధులు ట్రంప్ వార్నింగ్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ తరుణంలో.. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కు ఇరాన్ నుంచి కౌంటర్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిధుల వినియోగంపైనా ఓ క్లారిటీఇదిలా ఉంటే.. ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను విడుదల చేసే అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. విడుదలయ్యే డబ్బు మొత్తం అమెరికా నుంచే ఆహార పదార్థాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. "విడుదల చేసే డబ్బంతా తిరిగి అమెరికా రైతులకే చేరుతుంది. ఎందుకంటే ఆ నిధులతో ఇరాన్ అమెరికా నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సుమారు 9.1 కోట్ల జనాభాకు సరిపడా ఆహారాన్ని ఇరాన్ ఉత్పత్తి చేయలేకపోతోంది" అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరాన్కు నిధుల విడుదల అనేది నేరుగా నగదు సాయం కాదని, నియంత్రిత వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థలో భాగమని అమెరికా సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతూనే..అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా ఒప్పందం శాంతికి మార్గం వేస్తుందా? లేదంటే ఇరాన్ ఒప్పంద నిబంధనల అమలుపై కొత్త వివాదాలకు దారితీస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.ఇదీ చదవండి: ఇదెక్కడి ఫిట్టింగ్?.. పే చేయాల్సింది గల్ఫ్ దేశాలేనా! -
సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంక్షోభం తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో పంటలు కొనే నాథుడే లేడని.. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రజల కోసం ఒక్క మంచి పని చేసిన దాఖలా లేదన్నారు. -
బరితెగించిన బీటెక్ రవి.. విద్యార్థుల మృతిపై అసత్య ప్రచారం
వైఎస్సార్,సాక్షి: చక్రాయపేట మండలంలో నిన్న జరిగిన ఘోర విషాదంపై టీడీపీ నేత బీటెక్ రవి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ఇసుక గోతుల్లో పడి చనిపోతే.. కావాలనే ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని అత్యంత హేయంగా మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతేనేలా కారుకూతలు కూశారు. దీంతో బీటెక్ రవి వ్యాఖ్యలపై ఆ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ఆదివారం (జూన్21) నాడు చక్రాయిపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లు సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లారు. అయితే అక్కడ ఇసుకకోసం తవ్విన గుంతల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి అక్రమ దందాలో కాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు. దీనివల్ల నది లోపల ప్రమాదకరమైన భారీ గోతులు ఏర్పడ్డాయి. అలా తవ్విన ఇసుకను చక్రాయపేట ప్రాంతం నుండి యథేచ్ఛగా బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వారి అనుచరులు ఈ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాపాగ్ని నదిని ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పలుమార్లు జిల్లా కలెక్టర్కు అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, ఇసుక దందా ఆగకపోవడం వల్లే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు మండిపడ్డారు. అమాయక విద్యార్థుల మృతికి కారణమైన అక్రమ ఇసుక క్వారీ నిర్వాహకులపై, దానికి సహకరిస్తున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా తాజాగా బాధితుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులపై మృతిపై టీడీపీ నేత బీటెక్ రవి ఇష్ఠారీతిన వ్యాఖ్యానించడం వారి కుటుంబసభ్యులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. -
సుగాలి ప్రీతి కేసులో భౌ భౌ అని మొరిగి.. ఇప్పుడు ఆధారాలు లేవంటే.. ప్రజలు నమ్మాలా
-
తాట తీస్తా.. నా కొడకా.. పవన్, పంతం నానాజీ వ్యాఖ్యలు.. అంబటి మాస్ వార్నింగ్
-
పవన్ కామెంట్స్ పై పచ్చి బూతులు తిడుతున్న యువత!
-
కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్
-
ఇక మారవా పవన్! ఐటెం సాంగ్ మాటలాపు!
-
ఎవడివి రా నువ్వు.. నువ్వెంత నీ బతుకెంత.. పంతం నానాజీపై రెచ్చిపోయిన కారుమూరి
-
సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..!
-
పోలీసులు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
-
బీజేపీ ఎన్నికల అధికారులతో కుమ్మక్కయ్యింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి తన కోసం రాజ్యసభ సీటు కేటాయిస్తానంటే తాను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మహిళనని అక్కడి నుండి సీటు కేటాయించాలని తెలిపారు. తన సీటు కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.మధ్య ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అవకాశం లేదని బీజేపీకి అర్థమైందని అందుకే ఎన్నికల అధికారులతో కుమ్మక్కు అయ్యిందని ఆరోపించారు. నత్వానీ కి ఇచ్చిన అవకాశం తనకు ఎందుకు ఇవ్వలేదని? 2023 రూల్ బుక్ అడ్డం పెట్టుకొని నత్వాని కి నామినేషన్ కరెక్షన్ కోసం 24 గంటలు ఇచ్చారని తనకు మాత్రం 2026 రూల్ బుక్ ప్రకారం నామినేషన్ కరెక్షన్ కోసం ఆ అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు.తనకు సంబంధం లేని కేసు వల్ల నా నామినేషన్ తిరస్కరించారు. ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కేసులో నాకు లీగల్ నోటీస్ వచ్చింది. లీగల్ నోటీస్ క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నామినేషన్ పత్రంలో లీగల్ నోటీస్ అనే కాలమ్ లేనే లేదన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ స్థానం గెలవాలంటే 58 మంది మాత్రమే అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటని బీజేపీకి తెలుసు అయినప్పటికీ కుట్రలో భాగంగానే నామినేషన్ వేశారన్నారు.తన కేసుల అంశాన్ని కాంగ్రెస్ నాయకులు ఇచ్చారనేది పచ్చి అబద్ధం బీజేపీ కావాలనే అబద్ధాలను సృష్టించింది. తానెప్పుడూ బాధితుల పక్షమేనని, శ్రీలతకు కూడా నేను అండగా ఉన్నానని తెలిపారు.రాజ్యసభ నామినేషన్ కేవలం కేసు ఉన్నంత మాత్రానా తిరస్కరణ కాలేదని, బీజేపీ,ఎన్నికల కమిషన్ పూర్తిగా కాంప్రమైజ్ అయింది కాబట్టే నామినేషన్ తిరస్కరణకు గురైందని తెలిపారు.కేవలం ఇది ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాదని ఒకే దేశం ఒకే ఎన్నిక చేయాలని బీజేపీ చేస్తోందన్నారు. -
భారత్పై విషం చిమ్మిన పాక్
ఢిల్లీ: భారతలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. జర్దారీ వ్యాఖ్యలు అత్యంత ద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో కూడినవని విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఇస్లామాబాద్కు ఎంతమాత్రం లేదని మరోసారి స్పష్టం చేసింది.ఇటీవల పాకిస్థాన్ అధ్యక్షుడు భారత్పై విషం చిమ్మారు. ఎక్స్ వేదికగా భారత్ను విమర్శిస్తూ "భారతదేశంలోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి 'మసీదు గంజ్ షహీదా'తో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలి, ఇలాంటి చర్యలు కొనసాగితే, అవి భారతదేశ విచ్ఛిన్నానికి నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది" అని ఎక్స్ వేదికగా విమర్శించారు. తాజాగా దీనికి భారత్ తీవ్రస్థాయిలో బదులిచ్చింది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయమై మాట్లాడుతూ... "పాకిస్థాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారతదేశం ఖచ్చితంగా తిరస్కరిస్తోంది. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాకిస్థాన్ స్వంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే, ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వివిధ మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించడంలో పాకిస్థాన్కు ఉన్న సుదీర్ఘమైన, దురదృష్టకరమైన చరిత్ర ప్రపంచమంతటికీ తెలిసిందే" అని స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా ఆ దేశంలో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై అక్కడ నిరంతరం దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. రాజకీయ ప్రేరేపిత దాడిజర్దారీ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, ఆ దేశంలో కొనసాగుతున్న మతోన్మాదం, ద్వేషపూరిత విధానాల నుంచే ఇవి పుట్టుకొచ్చాయని జైస్వాల్ ముగించారు. "ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఆ దేశ జాతీయ విధానాలైన మతోన్మాదం, ద్వేషం ఆధారంగా చేసిన ఒక ఉద్దేశపూర్వక రాజకీయ దాడిగా మాత్రమే పరిగణించవచ్చు" అని ఆయన అన్నారు.వారణాసిలోని చారిత్రాత్మక 'మస్జిద్ గంజ్ షహీదా'తో పాటు భారతదేశంలోని ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేతకు ముప్పు ఉందంటూ జర్దారీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో చేసిన పోస్ట్కు సమాధానంగా భారత్ ఈ ఘాటు స్పందన ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో ఇస్లామాబాద్ జోక్యం చేసుకోకూడదని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. -
సాయి కృష్ణ కేసు వెనుక ఉన్న బడా బాబులను కాపాడటం కోసం ఈ కేసుకు మేకప్ వేస్తున్నారు


