"సీఎం రేవంత్ తీరని ద్రోహం చేస్తున్నారు" | CM Revanth is committing betrayal For telangana | Sakshi
Sakshi News home page

"సీఎం రేవంత్ తీరని ద్రోహం చేస్తున్నారు"

Dec 30 2025 4:23 PM | Updated on Dec 30 2025 5:14 PM

 CM Revanth is committing betrayal For telangana

సాక్షి హైదరాబాద్: రాష్ట్రానికి సీఎం రేవంత్ తీరని జలద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్ల విషయంలో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తామే లేపామన్నారు. బీఆర్ఎస్ చెప్పినాకే ఆ అంశంపై ప్రభుత్వం స్పందించింది అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని హరీశ్‌రావు విమర్శించారు.

అయితే అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీశ్ రావు విరుచుకపడ్డారు. జలమంత్రిగా పనిచేస్తూ రెండేళ్లయినా ఇంకా ఆ శాఖపై అవగాహన రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఇచ్చిన జీఓలో 90TMCల నీటి కేటాయింపు అంశం అస్పష్టంగా ఉందని  ప్రస్తుత ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరిస్తూ లేఖ రాసిందని హరీశ్ రావు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement