breaking news
International
-
వైట్ హౌస్ సైట్లో... ప్రైవేట్ వీడియో!
వాషింగ్టన్: వైట్ హౌస్.జిఒవి/లైవ్. అత్యంత పటిష్టమైన సెక్యురిటీ వాల్స్ ఉండే, అత్యంత సురక్షితమైన అమెరికా ప్రభుత్వ సైట్. అందులో సాధారణంగా అధ్యక్షుని ప్రసంగాల లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. అంతటి ముఖ్యమైన సైట్ కాస్తా గురువారం రాత్రి పొద్దు ఉన్నట్టుండి పెట్టుబడి పాఠాలు బోధించడం మొదలుపెట్టింది. అలా ఏకంగా 8 నిమిషాల పాటు సాగింది. తీరా చూస్తే అది మాట్ ఫార్లే అనే ఓ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్లో చెప్తున్న ఇన్వెస్టిమెంట్ సంబంధిత చిట్కాల తాలూకు లైవ్ స్ట్రీమింగ్. దాంతో అసలిదెలా జరిగిందో తెలియక విస్తుపోవడం వైట్ హౌస్ సిబ్బంది పనయింది. ఇది హ్యాకర్ల పనా, లేక తమవాళ్లే పొరపాటున స్ట్రీమ్ చేశారా అన్నది తేల్చడంలో వాళ్లిప్పుడు తలమునకలుగా ఉన్నారు. ’దీన్ని సీరియస్గానే తీసుకున్నాం. విచారణ జరుపుతున్నాం’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దాంతో, దీనితో తనకు ఏ సంబంధమూ లేదని యూట్యూబర్ ఫార్లే చెప్పుకొచ్చాడు. మనవాడు అక్కడితో ఆగలేదు. ‘నా స్ట్రీమ్ అంత పెద్ద సైట్లో అంతమందికి రీచ్ అవుతుందని ముందే తెలిస్తే బాగుండేది! ఇంకాస్త బాగా తయారై కనిపించేవాడిని. ఇంకొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్లు కాస్త నాటకీయ జోడించి మరీ చెప్పేవాడిని‘ అంటూ హాస్యమాడాడు! గత జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రభుత సైట్లు డిజిటల్ సెక్యూరిటీ బ్రీచ్ బారిన పడుతున్న ఉదంతాలు తరచూ జరుగుతున్నాయి. గత మే లో పలువురు అధికారులు, ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలకు అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫోన్ నుంచి తనకు తెలియకుండానే మెసేజీకు, కాల్స్ వెళ్లి పెద్ద కలకలమే రేపాయి. ఇక గత ఏడాది ట్రంప్ ఎన్ని ప్రచార వేళ ఇరాన్ హ్యాకర్లు ఏకంగా ఆయన ప్రచార సైట్లలోకి చొరబడ్డారు. -
బంగ్లాదేశ్లో మళ్లీ మంటలు
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. ‘ఇంక్విలాబ్ మంచ్’ నాయకుడు, విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యాకాండ అగ్గి రాజేసింది. ఈ హత్య పట్ల ఆగ్రహానికి గురైన జనం వీధుల్లోకి వచ్చారు. విధ్వంసం సృష్టించారు. పత్రికా కార్యలయాలపైనా విరుచుకుపడ్డారు. గురువారం రాత్రంతా హింసాకాండ కొనసాగింది. అసిస్టెంట్ ఇండియన్ హైకమిషన్ కమిషనర్ నివాసంపై రాళ్లు రువ్వారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రెహా్మన్ నివాసాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని అల్లరిమూకలు దాడి చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో దీపూచంద్ర దాస్(25) అనే కారి్మకుడు మరణించాడు. ఆటోలో వెళ్తుండగా హదీపై కాల్పులు షరీఫ్ ఉస్మాన్ హదీ గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియా వ్యతిరేక రాడికల్ లీడర్గా యువతలో గుర్తింపు పొందాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరిగే ఎన్నికల్లో ఢాకా–8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు. ఈ నెల 12వ తేదీన సెంట్రల్ ఢాకాలోని విజోయ్నగర్ ప్రాంతంలో ప్రచారానికి ఆటోలో వెళ్తున్న హదీపై ముసుగులు ధరించి బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. సరిగ్గా తలపై కాల్చడంతో కుప్పకూలిపోయాడు. ఒక చెవిలోకి దూసుకెళ్లిన తూటా మరో చెవి నుంచి బయటకు వచి్చంది. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్లో సింగపూర్కు తరలించారు. ఆరు రోజుపాటు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆరోగ్యం విషమించి గురువారం మృతిచెందాడు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ ఈ విషయాన్ని స్వయంగా టీవీలో ప్రకటించారు. దాంతో జనంలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హదీ మరణాన్ని జీరి్ణంచుకోలేక వీధుల్లో విధ్వంసానికి దిగారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాజ్షాహీ సిటీలో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. నిరసనకారుల ముసుగులో అల్లరిమూకలు రెచ్చపోయాయి. గురువారం రాత్రంతా దాడులు జరిగాయి. రాజధాని ఢాకాలో నిరసనకారులు ఛాయానత్ అనే సాంస్కృతిక సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. ఫరి్నచర్ను బయటపడేసి నిప్పుపెట్టారు. బంగ్లా పత్రికలు ప్రొథోమ్ అలో, డెయిలీ స్టార్ కార్యాయాలపైనా దాడులు జరిగాయి. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు..హదీని హత్య చేసిన దుండుగులు భారత్కు పారిపోయారని ఆరోపిస్తూ నేషనల్ సిటిజెన్ పారీ్ట(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు భారత్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దుండగులను వెనక్కి తీసుకొచ్చేదాకా భారత హైకమిషన్ను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సంయమనం పాటించాలని యూనస్ వినతి హింసాకాండ పట్ల మొహమ్మద్ యూనిస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంయమనం పాటించాలని, దాడులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. హదీని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హంతకులపై దయ చూపించే ప్రసక్తే లేదన్నారు. శనివారం సంతాపం దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వాయిదా తప్పదా? బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఇంతలోనే షరీఫ్ ఉస్మాన్ హత్య జరగడం, విధ్వంసం ప్రారంభం కావడంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.రిజర్వేషన్లతో మొదలైన రగడ → ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా(రిజర్వేషన్లు) వ్యవస్థను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రారంభించిన పోరాటం చివరకు ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి దారితీసింది. → 1971 నాటి బంగ్లా విమోచన ఉద్యమం పాల్గొన్నవారి వారసులకు ఉద్యోగాల్లో ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 2024 జూలైలో ఆందోళన ప్రారంభించారు. ఇది ‘జూలై తిరుగుబాటు’గా పేరుగాంచింది. → షేక్ హసీనా తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆందోళనకారులు పోరాటం ఉధృతం చేశారు. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మైనారీ్టలపై విచ్చలవిడిగా దాడులు జరిగా యి. → చేసేది లేక షేక్ హసీనా అప్పటికప్పుడే దేశం విడి చిపెట్టి వెళ్లిపోవాల్సి వచి్చంది. భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కలి్పంచింది. → నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. → షేక్ హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. → మరోవైపు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని, 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని మొహమ్మద్ యూనస్ ప్రకటించారు. → ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురి కావడం సంచలనాత్మకంగా మారింది. దీపూచంద్ర దాస్ను కొట్టి చంపారు బంగ్లాదేశ్లపై మైనారీ్టలైన హిందువులపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. 25 ఏళ్ల దీపూచంద్ర దాస్ను గురువారం రాత్రి దారుణంగా కొట్టి చెట్టుకి కట్టి ఊరి తీశారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దీపూచంద్ర దాస్ మైమెన్సింగ్ సిటీలో ఓ ఫ్యాక్టరీలో కారి్మకుడిగా పని చేస్తున్నాడు. దైవ దూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అల్లరిమూక అతడిని హత్య చేసినట్లు బంగ్లా ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. దీపూచంద్ర హత్యను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. అతడిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కచి్చతంగా శిక్షిస్తామని పేర్కొంది.బంగ్లాదేశ్ను గడగడలాడిస్తా.. షరీఫ్ ఉస్మాన్ హదీపై కాల్పులు జరిపిన దుండుగుల్లో ఫైజల్ కరీంను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పక్కాప్రణాళికతోనే హదీని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ హత్య తర్వాత దేశమంతటా తీవ్రస్థాయిలో అలజడి రేగుతుందని అతడు ముందే ఊహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న హదీపై కాల్పులు జరగ్గా, అంతకుముందు రాత్రి ఢాకా శివార్లలోని ఓ రిసార్ట్లో ఫైజల్ కరీం తన గర్ల్ఫ్రెండ్ మరియా అఖ్తర్ లీమాతో ఉన్నాడు. బంగ్లాదేశ్ను వణికించే పెద్ద సంఘటన జరగబోతోందని ఆమెతో చెప్పాడు. దేశాన్ని గడగడలాడించబోతున్నానని పేర్కొన్నాడు. మరుసటి రోజే మరో ఇద్దరితోపాటు కలిసి హదీపై కాల్పులు జరిపాడు. -
బంగ్లాలో దారుణం.. హిందూ యువకుడిని చంపి ఆపై..
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు నానాటీకీ పెరిగిపోతున్నాయి. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం నేపథ్యంలో అక్కడి అల్లరి మూకలు రెచ్చిపోయాయు. గురువారం రాత్రి మైమెన్ సింగ్ అనే జిల్లాలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఒక హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టి చంపారు.బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, హింస తీవ్రస్థాయికి చేరుకుంది. భారత వ్యతిరేఖ భావజాలం గల నేత షరీప్ ఉస్మాన్ హాదిని డిసెంబర్ 12న గుర్తు తెలియని వ్యక్తులు తలపై కాల్చారు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం సింగపూర్ తరలించారు. కాగా షరీప్ ఉస్మాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లాలో మరోసారి హింస చేలరేగింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఉస్మాన్ మృతిచెందారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఢాకాలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ హిందూ యువకుడిని కొట్టిచంపారు.ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ "ఒక అల్లరిమూకల సమూహం గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టి చంపారు. అనంతరం అతనిని కాల్చివేశారు. మంటలలో వేసే ముందు నిరసన కారులు అతని శరీరాన్ని చెట్టుకు పట్టుకొని వ్రేలాడదీశారు." అని అధికారి అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అల్లరి మూకలను చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మైమెన్ మెడికల్ కాలేజ్కి తరలించామని తెలిపారు. ఈ ఘటన భాలుకా ఉప జిల్లా స్క్వేర్ మాస్టర్ బారిలో జరిగిందని తెలిపారు. బాధితుడు స్థానికంగా ఓ వస్త్రకర్మాగారంలో పనిచేస్తున్నారని అతని పేరు దీపు చంద్రదాస్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతుడి బంధువులకోసం వెతుకుతున్నామన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు వచ్చి కేసు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్లో ఇటువంటి హింసకు తావులేదని పేర్కొంది. కాగా బంగ్లాలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-జూన్ ప్రాంతంలో ఆ దేశంలో మైనార్టీలపై దాడుల ఘటనలు 258 జరిగాయి. ఈ దాడులలో 27 మంది మృతిచెందగా, 20 పైగా మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 59 దేవాలయాలపై దాడులు జరిగాయి. -
Green Card: ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్గా ప్రసిద్ధి చెందిన గ్రీన్కార్డ్ లాటరీను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఎంఐటీ ప్రొఫెసర్ హత్యకు గురయ్యారు. ఈ దుర్ఘటనకు కారణం పోర్చుగీస్ జాతీయుడు క్లాడియో నేవెస్ వాలెంటే (48)నని అమెరికా పోలీసులు గుర్తించారు. వాలెంటే అమెరికాలోకి ప్రవేశించేందుకు గ్రీన్ కార్డ్ లాటరీని అస్త్రంగా ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ క్రమంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వ్యక్తులు అమెరికాలో అడుపెట్టేందుకు అనర్హులు. అందుకే, అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు USCIS గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపివేస్తోంది’ అని తెలిపారు. గ్రీన్కార్డ్ కేటాయింపులు ఇలాప్రతి సంవత్సరం 50వేల గ్రీన్కార్డులను అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల అభ్యర్థులకు కేటాయిస్తారు. వీటిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాల అభ్యర్థులు ఉంటారు. 2025 లాటరీకి దాదాపు 2 కోట్ల మంది దరఖాస్తు చేశారు. వారిలో కుటుంబ సభ్యులను కలుపుకొని 1,31,000 మందిని ఎంపిక చేశారు. పోర్చుగీస్ పౌరులకు కేవలం 38 స్లాట్లు మాత్రమే లభించాయి. ఈ ప్రోగ్రామ్ను అమెరికా కాంగ్రెస్ సృష్టించింది. కాబట్టి దీని నిలిపివేతపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ చాలా కాలంగా ఈ లాటరీకి వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనతో గ్రీన్కార్డ్ లాటరీ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ ప్రకటించారు.ఇదిలా ఉండగా..ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వలస విధానాలపై చర్చకు దారితీశాయి. భద్రతా కారణాల వల్ల తీసుకున్న ఈ చర్య.. అమెరికాలో స్థిరపడాలనుకున్న విదేశీయులపై ప్రతికూల ప్రభావం పడనుంది.The Brown University shooter, Claudio Manuel Neves Valente entered the United States through the diversity lottery immigrant visa program (DV1) in 2017 and was granted a green card. This heinous individual should never have been allowed in our country. In 2017, President Trump…— Secretary Kristi Noem (@Sec_Noem) December 19, 2025 -
రైతన్నకు కోపం వచ్చింది.. రాజధాని తగలబడింది!
బ్రస్సెల్స్: యూరప్ రాజధాని బ్రస్సెల్స్ రైతుల ఆందోళనలతో అట్టుడికి పోతుంది. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాదిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు పదివేలకు పైగా ట్రాక్టర్లతో నిరసనలు చేపట్టారు. ఆ నిరసన తారా స్థాయికి చేరుకున్నాయి.ఇటీవల యురేపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్లతో యూరోపియన్ పార్లమెంట్ భవనం వెలుపల, యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మొహరించారు. కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయోనని తెలిపేలా.. రైతులు టైర్లు కాల్చి, రహదారులను బ్లాక్ చేసి, బంగాళాదుంపలు, గుడ్లు,సాసేజ్లు విసిరారు. ట్రాక్టర్లతో రాజధాని బ్రస్సెల్స్ను అష్టదిగ్భందనం చేశారు. అయితే, రైతుల ఆందోళనల్ని నిలువరించేందుకు పోలీసు దళాలు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కానన్లను ప్రయోగించారు. రైతుల సమూహాన్ని చెదరగొట్టారు. ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. రైతుల తిరుగుబాటుకు కారణంయురేపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంతో ఇరు దేశాల నుంచి చౌకగా మాంసం, పంటలు దిగుమతి అవుతాయని.. ఇది స్థానిక మార్కెట్లను దెబ్బతీస్తుందని రైతులు భయపడుతున్నారు. దీనికి తోడు సబ్సిడీలను తగ్గించడమే కాకుండా కఠినమైన పర్యావరణ నియమాలను అమలు చేస్తాయి. తద్వారా యూరోపియన్ రైతులను ప్రపంచ మార్కెట్లో పోటీ చేయలేని స్థితి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు.FARMERS BLOCK ROADS, BURN TIRES IN BRUSSELS to protest EU free trade deal and CARBON TAXESCritics say the deeply-unpopular policies will damage food security and farmer livelihoods in markets#BrusselsFarmersProtest #Brussels pic.twitter.com/X1kricxwBn— Mjrocksss (@Mritunjayrocks) December 19, 2025 రణరంగంగా గ్రీస్మరోవైపు, ఆగ్నేయ ఐరోపా దేశమైన గ్రీస్ రణరంగంగా మారింది. డిసెంబర్ 16–17న గ్రీక్ పార్లమెంట్ 2026 బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్పై ప్రజలు ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాలు 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు మున్సిపాలిటీ కార్యాలయాల్ని మూసివేశారు. ఉపాధ్యాయులు అథెన్స్లో కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలకు రైతులు సైతం మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారి బారికేడ్లను ఏర్పాటు చేశారు. తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఆహారం ధరలు, ఇంటి వ్యయంపై ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. రైతులు, ప్రజా రంగ కార్మికులు కలిసి నిరసన చేయడం వల్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, గ్రీస్ 2025లో 23.5 బిలియన్ రికార్డు స్థాయి పర్యాటక ఆదాయాన్ని గడించింది. ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచింది. పర్యాటక రంగం బలంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.Streets of Brussels woke up to a spud storm after farmers protested the EU -literally lining the streets with potatoes.#EuropeanUnion #Brussels #EuropeanParliament #farmers #BrusselsFarmersProtest#farming #NoFarmersNoFood pic.twitter.com/8ZbTkmcusR— MidnightVisions (@MidnightVision5) December 19, 2025 -
పాక్ పరువు తీస్తున్న అరబ్ కంట్రీస్
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇమేజ్ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్ దేశం అజర్ బైజాన్ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.హెచ్చరించినా కూడా.. 2024లో సౌదీ అరేబియా పాక్కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్ పౌరులపై వీసా పరిమితులు విధించింది. అరబ్ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం. వేల మంది ముఠాగా..ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది. మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్కు చెందిన డాన్ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం. ఈ పరిణామాలపై ఎఫ్ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్వర్క్ల వల్ల పాక్ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. -
దుబాయ్లో భారీ వర్షం.. బుర్జ్ ఖలీఫా పరిస్థితి ఇది..
దుబాయ్ (Dubai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా దుబాయ్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల పిడుగులతో (Lightning strikes) కూడిన వర్షం కురిసింది. వర్షం సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)ను పిడుగు తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. దుబాయ్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం సమయంలోనే దుబాయ్లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు (Dubai crown prince) షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ఈ వీడియోకి ‘దుబాయ్’ అనే చిన్న క్యాప్షన్ మాత్రమే జోడించారు యువరాజు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, తరచూ పిడుగులు పడుతున్నా, భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.Heavy rain early this morning led to localized flooding across parts of Dubai and other UAE areas. Waterlogging was reported on several roads as authorities issued weather warnings and urged residents to stay cautious and avoid unnecessary travel.Emergency teams are monitoring… pic.twitter.com/dwSYOXuT4Y— Mazhar Khan (@Mazhar4justice) December 19, 2025ఇక, ప్రస్తుతం యూఏఈలో వాతావరణం అస్థిరంగా ఉంది. 'అల్ బషాయర్' అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రాస్ అల్ ఖైమాలో గోడ కూలిపోవడంతో భారత్కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. First Rain in Dubai this year. Thank you, God, for this life-giving rain! We praise You for replenishing the earth, and bringing relief and new life, Thank you for every drop that nourishes our plants, fills our rivers, and refreshes our souls, making us remember our dependence… pic.twitter.com/AVCtSWysVg— Dolly_Pizzle of Chelsea💙🦅 (@harbyhorlar2) December 19, 2025Shaikh Hamdan posts video of lightning strike on Burj KhalifaShaikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, posted a video of lightning striking the tip of the world's tallest building, Burj Khalifa, as heavy rain hit parts of Dubai and the rest of the… pic.twitter.com/wHZpC49W3I— GDN Online (@GDNonline) December 18, 2025 -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కొత్తరూల్ను తీసుకొచ్చింది. హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్లకు సూచిస్తోంది.ఇన్స్టాగ్రామ్లో చేసే పోస్ట్ లేదంటే రీల్కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్ట్యాగ్లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్ ట్యాగ్ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్స్టాలో 30 హ్యాష్ట్యాగ్లు పెట్టుకోవడానికి అవకాశముండేది. అయితే.. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్ట్యాగ్లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా.. అదీ నిర్దేశిత హ్యాష్ట్యాగ్లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. ఉదాహరణ: బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్కు సంబంధించిన బ్యూటీ హ్యాష్ట్యాగ్లు వాడితే.. ఆ కంటెంట్ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఉపయోగించడం బెటర్. ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఏ హ్యాష్ ట్యాగ్ను పడితే ఆ హ్యాష్ట్యాగ్తో పోస్ట్ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఈ నెల ప్రారంభంలో కేవలం 3 హ్యాష్ట్యాగ్లే ఉపయోగించాలని ఇన్స్టాగ్రామ్ తన యూజర్లను అలర్ట్ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్ట్యాగ్ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.హ్యాష్ట్యాగ్లంటే(#).. కంటెంట్ డిస్కవరీకి ఉపయోగపడేవి. సంబంధిత టాపిక్ సెర్చ్లలో, ట్రెండింగ్ లిస్టుల్లో, సెర్చ్ (Explore) ఫీడ్లో కనిపించే అవకాశం ఉంటుంది. సరైన హ్యాష్ట్యాగ్లు వాడితే మీ కంటెంట్ను నిజంగా ఆసక్తి ఉన్నవారు చూసే అవకాశం పెరుగుతుంది. కానీ సంబంధం లేనివి.. అడ్డగోలుగా ఎక్కువ వాడితే కంటెంట్ పనితీరు తగ్గి.. ఎవరికి పడితే వాళ్లకు వెళ్తుంది. అలాగే ఇన్స్టా ఆల్గారిథమ్ ప్రకారమూ స్పామ్గా పరిగణించి రీచ్ తగ్గుతుంది. కాబట్టి ఇన్స్టాలో మాత్రమే కాదు.. ఇతర సోషల్మీడియా ప్లాట్ఫారమ్లోనూ తక్కువగా, సంబంధిత హ్యాష్ట్యాగ్లు వాడటం ఉత్తమని నిపుణులు చెబుతుంటారు. -
బరిలోకి అమెరికా.. చైనా వ్యూహం ఏంటి?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగియక ముందే.. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం కలవరపెడుతోంది. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందు నుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచింది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది.మరోవైపు.. తైవాన్కు రక్షణగా అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా తైవాన్కు 1,110 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఈ భారీ ఆయుధ విక్రయ ప్యాకేజీలో భాగంగా ఆ దేశానికి మధ్య శ్రేణి క్షిపణులు, శతఘ్నులు, డ్రోన్లను అందించనుంది. ఒకవైపు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తుండగా మరోవైపు అమెరికా ప్రభుత్వం ఆయుధ విక్రయంపై ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ విక్రయానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వ ఈ ప్రకటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామం తమకు, అమెరికాకు మధ్య కుదిరిన దౌత్య ఒప్పందాలకు విఘాతం కలిగిస్తుందని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇది చైనా సార్వభౌమాధికారానికి, భద్రతకు, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించి ప్రాంతీయ సుస్థిరతను భగ్నం చేస్తుందని పేర్కొంది.ఏమిటీ వివాదం?చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్కై షేక్ దేశం విడిచి తైవాన్లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి.BREAKING; CHINA warns the United States to "immediately stop" arming TAIWAN.China strongly condemned the United States for approving a massive $11.1 billion arms sale package to Taiwan, with officials urging the US to "immediately stop" arming the island.Chinese Foreign… pic.twitter.com/bDstNkNDJk— Global Surveillance (@Globalsurv) December 19, 2025అమెరికాకు సంబంధమేంటి?చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన.చైనా దాడికి దిగేనా?తైవాన్ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీసే అవకాశం లేకపోదని విశ్లేషకులు చెబుతున్నారు.యుద్ధ సవాళ్లు.. ఒకవేళ చైనా, తైవాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగితే.. దీని ప్రభావం ఆసియాపై మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. తైవాన్ ప్రపంచంలోనే అత్యధికంగా సెమీకండక్టర్ ఉత్పత్తి చేసే దేశం. Taiwan Semiconductor Manufacturing Company (TSMC) ప్రపంచంలో అత్యంత ఆధునిక చిప్ తయారీదారుగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం జరిగితే టెక్నాలజీ రంగం దెబ్బతింటుంది. ఏఐ, స్మార్ట్ఫోన్ల తయారీ, రక్షణ రంగంపై ముఖ్యంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే, తైవాన్ సమస్యపై యుద్ధం జరిగితే అది కేవలం ద్వైపాక్షికంగా కాకుండా జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది. తైవాన్ ఆర్థిక వ్యవస్థలో 60% కంటే ఎక్కువ భాగం ఎగుమతులపై ఆధారపడి ఉంది. తైవాన్కు అమెరికా, చైనా ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం మీద.. తైవాన్ భవిష్యత్తు కేవలం ఆసియా భద్రతకే కాదు, ప్రపంచ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా ఉంది. -
తెగిన నరాలకు అతుకు వేస్తున్నారు!
లక్ష కిలోమీటర్లు.. మనిషి శరీరంలోని చిన్నా పెద్దా నరాల పొడవు ఇది!. ప్రమాదం కొద్దో లేక ఇంకో కారణంతోనో ఈ నరాలు తెగాయి అనుకోండి. అతుకుపెట్టడం చాలా కష్టం. ఒకవేళ పెట్టినా అవి మునుపటిలా పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. నరాలు సరిగ్గా అతుక్కోకపోతే స్పర్శజ్ఞానం పోవచ్చు. లేదంటే విపరీతమైన నొప్పి బాధపెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో పక్షవాతం లాంటి విపరీత సమస్య కూడా ఎదురు కావచ్చు. అయితే.. ఇకపై ఈ సమస్యలు చాలావరకూ లేకుండా పోతాయి. ఎందుకంటారా? అమెరికాలోని ఓ కంపెనీ తెగిన నాడులను సరిగ్గా అతుకుపెట్టేందుకు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది మరి!. తెగిన నరాలను వైద్యులు ఇప్పటివరకూ కుట్లు వేయడం ద్వారా మాత్రమే జత చేస్తున్నారు. చాలా సూక్ష్మమైన నరాల విషయానికి వచ్చినప్పుడు మైక్రోస్కోపుల్లో చూసుకుంటూ కుట్లు వేస్తూంటారు. ఫలితంగా నాడుల్లో సమస్యలు కొనసాగే ప్రమాదం ఉంటుంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు టిసియం అనే సంస్థ ‘కోఆప్టియమ్ కనెక్ట్’ పేరుతో ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కొత్త టెక్నాలజీలో కుట్లు వేయడం అన్నది ఉండనే ఉండదు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన ఒక చిన్న గొట్టం లాంటిది తయారు చేస్తారు. రెండుపక్కల తెగిన నరాలను జొప్పించి దగ్గరకు తీసుకొస్తారు. ఆ తరువాత గొట్టానికి రెండు చివర్లలో ప్రత్యేకమైన బయో ప్లాస్టిక్ జిగురులాంటిది వేసి సీల్ చేస్తారు. అంతే.. తెగిన నరాల భాగాలు రెండూ ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. సహజసిద్ధంగా కలిసిపోతాయి. కొంత సమయం తరువాత గొట్టం, బయో ప్లాస్టిక్ కూడా నిరపాయకరంగా శరీరంలోకి కలిసిపోతాయి. వాస్తవానికి ఈ టెక్నాలజీని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంతో కాలం క్రితమే అభివృద్ధి చేసింది. జెఫ్రీ కార్ప్ అండ్ బాబ్ లాంగర్స్ ల్యాబ్లో దీనిపై ప్రయోగాలూ జరిగాయి. విజయవంతమయ్యాయి కూడా. ఈ శస్త్రచికిత్స జరిగిన తరువాత నాడుల పనితీరు పూర్వ స్థితికి చేరుకోవడమే కాకుండా.. కనీసం ఏడాది పాటు ఎలాంటి నొప్పి కూడా కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చికిత్స కేవలం నాడులకు మాత్రమే పరిమతం కాకపోవడం. శరీరం లోపలి భాగాలు బయటకు వచ్చే హెర్నియాతోపాటు గుండె కణజాలం అభివృద్ధి వరకూ వేర్వేరు చోట్ల వాడుకునే అవకాశం ఉంది. టిసియం సంస్థ అభివృద్ధి చేసిన ఈ కొత్త టెక్నాలజీకి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. గుండె, హెర్నియా తదితర విషయాలకు సంబంధించిన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్తో సహా ఏడుగురు దుర్మరణం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్ రీజనల్ ఎయిర్పోర్ట్లో గురువారం ఉదయం 10:15 గంటలకు సెస్నా C550 విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో ప్రముఖ నాస్కార్ మాజీ డ్రైవర్, అతని కుటుంబం ఉన్నారని కార్-రేసింగ్ సంస్థ తెలిపింది. ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా సి550 బిజినెస్ జెట్ టేకాఫ్ టేకాఫ్ అయిన 26 నిమిషాల తర్వాత విమానం తిరిగి రావడానికి ప్రయత్నించింది కానీ కూలిపోయింది. దీంతో NASCAR ఛాంపియన్ గ్రెగ్ బిఫిల్ తన భార్య, పిల్లలతో కలిసి విమాన ప్రమాదంలో మరణించాడు. మరో ముగ్గురు కూడా మరణించారు. వారిలో మరో తండ్రి కుమారుడు ఉన్నారు. వచ్చే వారం తన 56వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా బిఫిల్ ఆకస్మిక మరణం అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.విమానం కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి జెఫ్ కోలీ తెలిపారు. బిఫిల్ కుటుంబ సభ్యులంతా ఒకేసారి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హడ్సన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. ఎవరీ గ్రెగ్ బిఫిల్ రేసింగ్తో మక్కువతో కరియర్లో ఎంతో రాణించి, NASCAR హాల్ ఆఫ్ ఫేమ్కు నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి బిఫిల్ అని రేషింగ్ అభిమానులు చెబుతున్నారు. నాస్కార్ చరిత్రలోని ప్రముఖ రేసర్లలో 75 మందిలో ఒకరిగా గుర్తింపు పొందిన బిఫిల్, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాడు. 1998లో NASCAR క్రాఫ్ట్స్మ్యాన్ ట్రక్ సిరీస్లో రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2000లో అదే సిరీస్లో ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాడు.రేసింగ్ పట్ల ఆయనకున్న మక్కువ, సమగ్రత, అభిమానులు, తోటి పోటీదారుల పట్ల ఆయనకున్న నిబద్ధత క్రీడపై శాశ్వత ప్రభావాన్ని చూపాయంటూ కార్-రేసింగ్ సంస్థ బిఫిల్కు నివాళులర్పించింది. రేసింగ్తోపాటు, గత సంవత్సరం హెలీన్ హరికేన్ తర్వాత నార్త్ కరోలినాలో బిఫిల్ తన వ్యక్తిగత హెలికాప్టర్ను ఉపయోగించి చిక్కుకుపోయిన నివాసితులను రక్షించి, వారికి సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ❗️⚠️🇺🇸 - A Cessna C550 business jet crashed while attempting to land at Statesville Regional Airport in Statesville, North Carolina, on the morning of December 18, 2025, resulting in multiple fatalities.The aircraft, registered under tail number N257BW and owned by GB Aviation… pic.twitter.com/fb8qxZmrkm— 🔥🗞The Informant (@theinformant_x) December 18, 2025 Oh no!! Horrible breaking news!!Greg Biffle, a NASCAR champion has gone down in a plane crash with his wife and children. Three others perished as well. One was a man and his son.Just 26 mins after takeoff the plane tried to return but crashed. pic.twitter.com/4c2ieDpQaB— Jennifer 🟥🔴🧙♀️🦉🐈⬛ 🦖 (@babybeginner) December 19, 2025 -
భారత్ వ్యతిరేక షరీఫ్ ఉస్మాన్ మృతి.. బంగ్లాదేశ్లో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది(32) మరణ వార్త బంగ్లాదేశ్లో అగ్గి రాజేసింది. డిసెంబర్ 12న ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు హాది తలపై కాల్పులు జరపడంతో సింగపూర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ హాది మరణించాడని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఢాకాలో రెచ్చిపోయారు. ఆస్తులను ధ్వంసం చేశారు.కాగా.. తీవ్రవాద భావజాలం, 2024 బంగ్లాదేశ్లో తిరుగుబాటు నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం కారణంగా వేలాది మంది నిరసనకారులు ఢాకా, షాబాగ్ ప్రాంతంలో గుమిగూడారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు. అధికారుల వైఫల్యమే హాది మృతికి కారణమని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. దేశంలోని అతిపెద్ద పత్రిక అయిన ‘డైలీ ప్రథమ్ ఆలో’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మొదట ఆఫీసులను ధ్వంసం చేసిన నిరసనకారులు, ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టారు. అలాగే, ఢాకాలోని కవ్రాన్ బజార్లోని కార్యాలయానికి నిప్పుపెట్టారు. గంటలతరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. రెండు అంతస్తులు అగ్నికీలల్లో చిక్కుకొన్నాయి. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్పైనా దాడి జరిగింది. దీంతో బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. అయితే, ఆ భవనాల వద్ద సైనికులు, సరిహద్దు భద్రతా బలగాలు మోహరించినప్పటికీ.. నిరసనకారులను చెదరగొట్టలేదు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. VIDEO | Dhaka, Bangladesh: Daily Star newspaper building was attacked in Dhaka following death of Sharif Osman Hadi, a prominent leader of the July Uprising and a spokesperson of the Inqilab Manch who was shot last week. Protests erupted in Dhaka as soon as the news of his death… pic.twitter.com/wJSfbc0E01— Press Trust of India (@PTI_News) December 18, 2025మరోవైపు.. హాది మరణ వార్త వెలువడిన తర్వాత చిట్టగాంగ్లోని భారత ఉప హైకమిషనర్ నివాసం వద్ద సైతం నిరసనకారులు చెలరేగాయి. భారత రాయబార కార్యాలయంపైకి నిరసనకారులు రాళ్లు విసిరారు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖుల్షీ ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు హాదిని హత్య చేశారంటూ.. అవామీ లీగ్, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, అవామీ లీగ్ ఆఫీసుకు నిప్పంటించారు. దీంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఆస్తులను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెలివిజన్లో యూనస్ ప్రసంగిస్తూ.. షరీఫ్ ఉస్మాన్ హాది మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అతని మరణం దేశానికి తీరని లోటు నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. అలాగే, శుక్రవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. అతడి మృతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.#WATCH | Bangladesh: Visuals of the aftermath from The Daily Star office in Dhaka, which was burned down by protesters. After the death of Osman Hadi, a key leader in the protests against Sheikh Hasina, Bangladesh has erupted in unrest, and two newspaper offices have been set… pic.twitter.com/dpKn5h97fI— ANI (@ANI) December 19, 2025ఇక, బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 2026 జరగబోయే పార్లమెంటరీ ఎన్నికలలో హాది అభ్యర్థిగా ఉన్నారు. అయితే, డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్నగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడి తలపై తీవ్ర గాయం కావడంతో హాదిని మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణవార్త విన్న అనంతరం ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. Bangladeshis are burning down offices of Newspapers as a protest to the death of their beloved islamic terrorist Osman Hadi. Osman Hadi was responsible for crimes against women too. pic.twitter.com/4mX4ql2wbA— Lord Immy Kant (@KantInEastt) December 18, 2025 -
తైవాన్కు రూ.లక్ష కోట్ల ఆయుధాలు
వాషింగ్టన్/బీజింగ్: చైనాతో టారిఫ్ల యుద్ధం ఓ వైపు కొనసాగిస్తూనే, మరో వైపు తైవాన్కు భారీగా అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్దమైంది. ఏకంగా రూ.1 లక్షా 188 కోట్లు(11.1 బిలియన్ డాలర్లు) విలువైన క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్..విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలను గానీ, చైనా, తైవాన్ల గురించి గానీ ప్రస్తావించలేదు. ట్రంప్ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో.. తైవాన్కు అమెరికా అందించే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీగా నిలవనుంది. తైవాన్ రక్షణ శాఖతో కుదిరిన 8 ఒప్పందాల్లో 82 హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ వ్యవస్థలు(హైమార్స్), 420 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(అట్కామ్స్), 60 సెల్ఫ్ ప్రొపెల్డ్ హొవిట్జర్ వ్యవస్థలు, డ్రోన్లు, మిస్సైళ్లు ఉన్నాయి. ఎప్పటికైనా తైవాన్ తమ దేశంలో కలిసిపోవాల్సిందేనంటున్న చైనా.. ఇటీవల ఆ దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అమెరికా–చైనాల మధ్య సంబంధాలు ఇప్పటికే ఉప్పూనిప్పుగా సంబంధాలు కొనసాగుతున్న వేళ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే చైనా విధానానికి అమెరికా తూట్లు పొడిచిందని, తమ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడింది. -
భారతీయులకు పెరిగిన హెచ్–1బీ కష్టాలు
వాషింగ్టన్: తెంపరి ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాకు వెళ్లాలనుకున్న భారతీయుల హెచ్–1బీ వీసా కష్టాలు మరింత పెరిగాయి. అమెరికా వ్యతిరేక, పాలస్తానా అనుకూల వ్యాఖ్యలు, వీడియోలు, పోస్ట్లు చేసే విదేశీయులను తమ గడ్డమీద అడుగుపెట్టకుండా, హెచ్–1బీ, హెచ్4 వీసాలు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ సర్కార్ గత వారం ఆయా వీసా దరఖాస్తుదారుల సోషల్మీడియా ఖాతాల ముమ్మర పరిశీలన మొదలెట్టడం తెల్సిందే. అన్ని ఖాతాల పరిశీలనకు సుదీర్ఘకాలం పట్టేనున్న నేపథ్యంలో అప్పటిదాకా హెచ్–1బీ వీసాల ఇంటర్వ్యూలను 2026 అక్టోబర్దాకా వాయిదావేస్తున్నట్లు చాలా మంది అభ్యర్థులకు సందేశాలు అందాయి. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం సంపాదించి వీసా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిపుణులైన భారతీయులకు ఈ నిర్ణయం అశనిపాతమైంది. అక్టోబర్కైనా తమ వీసా ఇంటర్వ్యూలకు మోక్షం లభిస్తుందో లేదంటే 2027 జనవరికి మరోసారి వాయిదాపడతాయా? అనే సందిగ్దావస్థ భయాందోళనలు భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జరగాల్సిన ఇంటర్వ్యూలను గతంలోనే 2026 ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేయడం తెల్సిందే. జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు ఖరారైన వేరే దరఖాస్తుదారులు వాటిని రద్దుచేసుకుంటే వాళ్ల స్థానంలో తమకు అవకాశం లభిస్తుందేమోనన్న ఆశ ఈ అక్టోబర్కు రీషెడ్యూల్ అయిన దరఖాస్తు దారుల్లో కన్పిస్తోంది. -
పర్యాటకులు అమెరికాలో ఎప్పటిదాకా ఉండొచ్చు?
వాషింగ్టన్: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు. అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home వెబ్సైట్ను సందర్శించి అందులో మీ టూరిస్ట్ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్వీసా గడువు తేదీ, ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్ అన్టిల్ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. -
సమస్యల్ని పరిష్కరించా విజయాలెన్నో సాధించా
న్యూయార్క్/వాషింగ్టన్: జో బైడెన్ ప్రభుత్వం వారసత్వంగా తనకు ఇచ్చిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి దేశాన్ని అభివృద్ధిపథంలో ఉరకలెత్తిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2025 ఏడాది మరో రెండు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో తన 11 నెలల పాలనపై ట్రంప్ 19 నిమిషాలపాటు గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన విజయాల పరంపర ఇదేనంటూ పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘ బైడెన్ తన పాలనలో ప్రపంచంలోనే అమెరికా సరిహద్దును అత్యంత దుర్భలంగా మార్చారు. నేను దుర్భేద్యంగా పటిష్టపరిచా. ఇలాంటి ఎన్నో సమస్యలతో అధ్వానస్థితిలో అమెరికా పరిపాలనా పగ్గాలను ఆయన నాకు వారసత్వంగా ఇచ్చారు. ఆ సమస్య లను నేను సమర్థవంతంగా సరిదిద్దు తున్నా. అమెరికాకు పూర్వవైభవం తీసుకొచ్చా. 10 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 8 ప్రధానమైన యుద్ధాలను నిలువరించా. ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణుఉపద్రవాన్ని అడ్డుకున్నా. 3,000 సంవత్సరాల్లో సాధ్యంకాని పశ్చిమా సియాలో శాంతిని స్థాపించా. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసి గాజాలో శాంతి కపోతాలను ఎగరేశా. భారత్–పాకిస్తాన్, థాయిలాండ్–కాంబోడియా, అర్మేనియా–అజర్బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియో పియా, రువాండా, కాంగోల మధ్య సమరాలు సమసిపో యేలా చేశా. బైడెన్ హయాంలోనే అమెరికాలోకి లక్షలాదిగా అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి. వీళ్ల కోసం బైడెన్ సర్కార్ అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అనవసరంగా ఖర్చుచేసింది’’ అని ట్రంప్ ఆరోపించారు.వీళ్ల కారణంగానే ఇళ్ల అద్దెలు పెరిగాయి‘‘విదేశీ వలసదారులు పోటెత్తడంతోనే ఇళ్ల అద్దెలు పెరిగాయి. రెంటల్ మార్కెట్ 60 శాతం పెరగడానికి బైడెన్ ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణం. టారిఫ్ అనే పదం నాకెంతో ఇష్టం. టారిఫ్ల బెత్తం చూపించి అమెరికాలోకి మళ్లీ కర్మాగారాలు క్యూ కట్టేలా చేశా. అమెరికాకు 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించా. దీంతో ఉద్యోగాలు, జీతభత్యాల పెంపు, ఆర్థికాభివృద్ధి, కొత్త ఫ్యాక్టరీల ఆరంభాలు, పటిష్టమైన జాతీయ భద్రతను సాకారంచేశా. ఉత్పత్తకేంద్రాలను అమెరికాలో నెలకొల్పితే టారిఫ్లు ఉండబోవని కంపెనీలకు ఇప్పుడు అర్థమైంది. డ్రగ్స్ భూతాన్ని దూరంగా తరమికొట్టా. అందుకే భూ, సముద్రమార్గాల ద్వారా అమెరికాలోకి విదేశీ మత్తుపదార్థాల రాక 94 శాతం తగ్గింది. గత అర్థశతాబ్దకాలంలో తొలిసారిగా దేశం నుంచి అక్రమవలసదారులు తిరిగి వెళ్లిపోతున్నారు. వాళ్లు వదిలేసిన ఇళ్లు, ఉద్యోగాలు అమెరికన్లకు దక్కుతున్నాయి ’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
ఇక స్వేచ్ఛా వాణిజ్యం
మస్కట్: భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరుదేశాలు గురువారం సంతకాలు చేశాయి. ఫలితంగా 98 శాతానికిపైగా భారతీయ ఉత్పత్తులపై ఒమన్లో సుంకాలు సున్నాకు చేరుకోనున్నాయి. ఎలాంటి సుంకాలు లేకుండానే భారతీయ వ్రస్తాలు, వ్యవసాయ, తోలు సహా పలు ఉత్పత్తులను ఒమన్లో విక్రయించుకోవచ్చు. అదేసమయంలో ఒమన్ నుంచి దిగుమతి అయ్యే ఖర్జూరం, మార్బుల్స్, పెట్రో కెమికల్స్ సహా పలు ఉత్పత్తులపై సుంకాలను భారత్ తగ్గించనుంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం సుంకాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఒమన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం సానుకూల పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. ఒమన్ రాజధాని మస్కట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎఫ్టీఏపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య మంత్రి ఖాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసుఫ్ సంతకాలు చేశారు. దీన్ని అధికారికంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)గా పిలుస్తున్నారు. ఒప్పందంలో ముఖ్యాంశాలు → భారతదేశం ఒమన్కు చేసే ఎగుమతుల్లో 99.38 శాతం ఉత్పత్తులపై జీరో–డ్యూటీ అమల్లోకి రానుంది. → భారతీయ సంప్రదాయ ఔషధాలపైనా ఒమన్ సున్నా సుంకాలు విధించబోతోంది. దీనివల్ల ఇండియాలోని ఆయుష్, వెల్నెస్ రంగాలకు లబ్ధి చేకూరనుంది. → భారత్ నుంచి ఎగుమతి అయ్యే బంగారు ఆభరణాలు, తోలు, పాదరక్షలు, క్రీడా పరికరాలు, సామగ్రి, ప్లాస్టిక్, ఫరి్నచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మా, వైద్య పరికరాలు, ఆటోమొబైల్ పరికరాలపై ఎలాంటి పన్ను ఉండదు. → కంప్యూటర్ సంబంధిత సేవలు, వ్యాపార, వృత్తి సేవలు, ఆడియో–విజువల్, పరిశోధన–అభివృద్ధి, విద్య, ఆరోగ్య సేవలపైనా ఒమన్ ప్రభుత్వం సుంకాలు తగ్గించబోతోంది. ఒమన్ 12.52 బిలియన్ డాలర్ల విలువైన సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఇండియా వాటా కేవలం 5.31 శాతంగా ఉంది. ఎఫ్టీఏతో ఈ వాటా మరింత పెరగనుంది. → భారతీయ వృత్తి నిపుణులకు ఉద్యోగాలు కల్పిచేందుకు ఒమన్ ముందుకొచ్చింది. అకౌంటెన్సీ, టాక్సేషన్, ఆర్కిటెక్చర్, మెడికల్ సంబంధిత రంగాల్లో భారతీయులకు సులువుగా ఉద్యోగాలు లభిస్తాయి. → అంతేకాకుండా భారతీయ కంపెనీల నుంచి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్డీఐ)కు ఒమన్ అనుమతి ఇవ్వనుంది. → ఒమన్ నుంచి దిగుమతి అయ్యే వాటిలో 94.81 శాతం ఉత్పత్తులపై భారత ప్రభుత్వం సుంకాలు రద్దు చేయనుంది. → భారతీయ పరిశ్రమలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం లేదు. ఒమన్ నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బర్, పొగాకు, బంగారం, వెండి ఆభరణాలు, పాదరక్షలు, క్రీడాసామగ్రి, కొన్ని రకాల లోహాలపై ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. వీటిని ఒప్పందంలో చేర్చలేదు. కీలక మిత్రదేశం ఒమన్ → 2006 తర్వాత ఒమన్ ప్రభుత్వం మరో దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. అలాగే గత ఆరు నెలల్లో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో ఇది రెండోది. ఆరు నెలల క్రితం యూకేతో కలిసి ఎఫ్టీఏపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. → ఇండియా, ఒమన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2024–25లో 10.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. → గల్ఫ్ ప్రాంతంలో భారత్కు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి ఒమన్. అంతేకాకుండా భారతదేశ సరుకులు, సేవలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలకు చేరడానికి ఒమన్ ఒక ముఖద్వారంగా ఉపయోగపడుతోంది. → ఒమన్లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 300 ఏళ్ల క్రితమే స్థిరపడిన భారతీయ వ్యాపార కుటుంబాలు కూడా ఉన్నాయి. → ఒమన్లో 6 వేలకుపైగా భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. → ఒమన్లోని భారతీయులు ప్రతిఏటా 2 బిలియన్ డాలర్లను భారత్కు పంపిస్తున్నారు. → 2000 ఏప్రిల్ నుంచి 2025 సెపె్టంబర్ మధ్య ఒమన్ నుంచి భారత్కు 615.54 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. -
బలీయ బంధం
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మస్కట్లో ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు అల్ బకారా ప్యాలెస్కు చేరుకున్న మోదీకి సుల్తాన్ ఘనంగా స్వాగతం పలికారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత పట్ల తమ అంకితభావాన్ని ప్రకటించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం వెనుక సుల్తాన్ కృషి దాగి ఉందని మోదీ కొనియాడారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఒప్పందం ఇరుదేశాల సంబంధాల్లో నూతన, సువర్ణ అధ్యాయం అని అభివరి్ణంచారు. రెండుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంచడంపై ఒమన్ సుల్తాన్తో చర్చించినట్లు తెలిపారు. ఇంధనం, అరుదైన ఖనిజాలు, వ్యవసాయం, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు బలపడేలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వివరించారు. భారత్–ఒమన్ వాణిజ్యం 10 బిలియన్ డాలర్లు దాటడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇంధన రంగాల్లో ఒప్పందాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులపై మోదీ, సుల్తాన్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవైపు భారత్, ఒమన్ మధ్య ప్రతినిధుల స్థాయిలోనూ చర్చలు జరిగాయి. మరోవైపు, మారిటైమ్ హెరిటేజ్, మ్యూజియమ్స్, వ్యవసాయం–అనుబంధ రంగాలు, ఉన్నత విద్యకు సంబంధించిన పలు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) భారత్, ఒమన్ సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక సంబంధాలకు నూతన శక్తి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)తో 21వ శతాబ్దంలో భారత్, ఒమన్ సంబంధాలకు నూతన శక్తి, విశ్వాసం సమకూరుతాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆయన మస్కట్లో ఇండియా–ఒమన్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. దీని ప్రభావం రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఉంటుందని అన్నారు. ప్రగతిశీలం, స్వయం చోదకమే భారత్ స్వభావం అని వ్యాఖ్యానించారు. భారత్ అభివృద్ధి సాధిస్తే తమ మిత్రదేశాలు సైతం అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని, దీనివల్ల ప్రపంచం మొత్తం లబ్ధి పొందుతుందని వివరించారు. అంతకంటే ఎక్కువగా ఒమన్కు లాభం కలుగుతుందని పేర్కొన్నారు. ఒమన్ తమకు సన్నిహిత మిత్రదేశమని గుర్తుచేశారు. భారతదేశ ప్రగతి చరిత్రలో భాగస్వాములుగా మారాలని ఒమన్ కంపెనీలకు మోదీ పిలుపునిచ్చారు. ఇండియాలో కీలక రంగాల్లో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో ముందుకు రావాలని సూచించారు. ప్రపంచానికి మన దీపం వెలుగులు 21వ శతాబ్దంలో భారత్ భారీ నిర్ణయాలు, వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకొని, గడువులోగా ఫలితాలు సాధిస్తోందని చెప్పారు. మోదీ మస్కట్లో ‘మైత్రి పర్వ్’ కార్యక్రమంలో భారతీయ విద్యార్థులు, ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. వారిని ‘మినీ–ఇండియా’గా అభివరి్ణంచారు. మనమంతా ఒకే కుటుంబమని, టీమ్ ఇండియా అని వ్యాఖ్యానించారు. భారతదేశ సంస్కృతికి వైవిధ్యమే పునాది అని స్పష్టంచేశారు. కలిసి జీవించడం, పరస్పరం సహకరించుకోవడం ప్రవాస భారతీయుల హాల్మార్క్ అని ప్రశంసించారు. ఇండియా సాధిస్తున్న ప్రగతిని ప్రస్తావించారు. దేశంలో 8 శాతానికి పైగా వృద్ధి రేటు నమోదవుతోందని హర్షం వ్యక్తంచేశారు. ఒకవైపు ప్రపంచ దేశాలు సంక్షోభంలో చిక్కుకోగా, ఇండియా ప్రగతి ప్రయాణం మాత్రం ఎక్కడా ఆగడం లేదన్నారు. ఇండియా–ఒమన్ సంబంధాలకు విజ్ఞానమే మూలకేంద్రమని చెప్పారు. రాబోయే 50 ఏళ్లపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. పెద్ద కలలు కనాలని, విజ్ఞానం పెంచుకోవాలని, మానవాళి బాగు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. దీపావళి పండుగను కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చాలని ‘యునెస్కో’ ఇటీవల నిర్ణయించిందని ప్రధానమంత్రి తెలియజేశారు. మన దీపం మన ఇంటికే కాకుండా మొత్తం ప్రపంచానికి వెలుగులు పంచుతోందని పేర్కొన్నారు. ఇండియా అంటే కేవలం మార్కెట్ కాదని.. ప్రపంచానికి ఒక మోడల్ అని మోదీ తేలి్చచెప్పారు. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ ప్రదానం ఒమన్ ప్రభుత్వం తమ విశిష్ట పౌర గుర్తింపు గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. భారత్–ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడానికి తన వంతు పాత్ర పోషించడంతోపాటు అద్భుతమైన నాయకత్వ పటిమ ప్రదర్శిస్తున్నందుకు ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్ ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను స్వీకరించడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఒమన్ సుల్తాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల ప్రజల మధ్య విశ్వాసం, ఆప్యాయతలకు ఈ గౌరవం ఒక ప్రతీక అని పేర్కొన్నారు. శతాబ్దాలుగా భారత్, ఒమన్ బంధానికి బాటలు వేసిన సముద్ర ప్రయాణికులకు ఆయన ఈ పురస్కారాన్ని అంకితం ఇచ్చారు. -
ఏఐల మెదడుకు ఇండియన్లే మేత
ఏఐ యాప్లకు ఇండియా అతిపెద్ద యాక్టివ్ యూజర్–బేస్ మార్కెట్గా అవతరించిందని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్’ తాజా నివేదిక వెల్లడించింది. ఏఐ యాప్లకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో రోజువారీ, నెలసరి యూజర్లు ఉన్నారని తెలిపింది. అత్యధికంగా చాట్ జీపీటీకి 14.5 కోట్ల నెలవారీ వినియోగదారులు ఉంటే తరువాతి స్థానంలో 10.5 కోట్ల మందితో జెమినై ఉంది.ఓపెన్ ఏఐకి చెందిన ‘చాట్జీపీటీ’, గూగుల్కు చెందిన ‘జెమినై’, పెర్ప్లెక్సిటీ వంటి యాప్లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా వినియోగదారులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, వీటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రోజువారీ, నెలవారీ యాక్టివ్ యూజర్లు భారత్లో ఉన్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది.2025 నవంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్లలో.. జెమినైకి 31 శాతం, పెర్ప్లెక్సిటీలను 38 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి వినియోగంలోనూ భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోని మొత్తం వాట్సాప్ వినియోగదారుల్లో మనవాళ్లు 32 శాతం కాగా, ఇన్స్టాగ్రామ్ యూజర్లలో భారతీయులు 31 శాతం కావడం విశేషం.-సాక్షి స్పెషల్ డెస్క్ -
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
-
బీరుట్ గగనతలంలో భారీ ఎయిర్ ఫోర్స్ రద్దీ.. ఏం జరగబోతుంది..?
లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో ఇటీవల భారీ ఎయిర్ ఫోర్స్ రద్దీ కనిపిస్తోంది. స్థానికులు వరుసగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాల కదలికలను గమనిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఏం జరుగబోతుందోనని లెబనాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నట్లు సమాచారం.ఎందుకీ ఆందోళన..?లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుంది. సరిహద్దు నియంత్రణ, ప్రాంతీయ రాజకీయాల నేపథ్యంలో 1982లో ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేసింది. ఈ దాడికి వ్యతిరేకంగా లెబనాన్లో ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా హిజ్బుల్లా అనే సంస్థ ఏర్పడింది. హిజ్బుల్లా లెబనాన్లోని షియా ముస్లింలకు ఆధారంగా ఏర్పడి, ఇరాన్ మద్దతుతో బలపడింది. ప్రస్తుతం హిజ్బుల్లా లెబనాన్లో శక్తివంతమైన రాజకీయ, సైనిక శక్తిగా మారింది.ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లో సైనిక ఉనికిని కొనసాగించడం, హిజ్బుల్లా దానిని ప్రతిఘటించడం ద్వారా వివాదం తీవ్రరూపం దాల్చింది. 2024 నవంబర్లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, అప్పుడప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి.ఇటీవలే (డిసెంబర్ 9న) ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు జరిపాయి. మౌంట్ సఫీ, జ్బా, జెఫ్టా వ్యాలీ ప్రాంతాల్లో జనావాసాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి తమ గగనతలంలో సంచరిస్తుండటంతో లెబనాన్ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. -
చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు
అమెరికా-పాకిస్థాన్..! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ ఈ రెండు దేశాల మైత్రి పైనే..! ముందెన్నడూ లేనివిధంగా అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడిని వైట్హౌస్కు ఆహ్వానించడం మొదలు.. పాకిస్థాన్పై అమెరికా వరాల జల్లులు కురిపించడం వరకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం..! ఇప్పటికే రెండు సార్లు అమెరికాకు వెళ్లి.. ట్రంప్తో భేటీ అయిన పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వైట్హౌస్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. అమెరికా-పాక్ బంధం త్వరలో విడిపోనుందా? ఇరుదేశాల మధ్య తల్లాక్ తప్పదా? అంటే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. అందుకు గాజానే కారణమంటున్నారు. పాకిస్థాన్కు గాజాకు సంబంధమేంటి? అమెరికాతో తల్లాక్ వరకు వెళ్లేంతలా అందులో ఏముంది?నోబెల్ శాంతి బహుమతి కోసం ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు తహతహలాడుతున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరును ఆపేసి.. గాజాలో శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. గాజాలో ఇస్లామిక్ దేశాల సైన్యాలతో అక్కడ శాంతి దళాలను నెలకొల్పాలని భావించారు. దానికి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని నామకరణం చేశారు. సరిగ్గా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్ మద్దతు ట్రంప్కి అవసరమైంది. పైగా.. ట్రంప్కు నోబెల్ అవార్డు ఇవ్వాల్సిందేనని తొలుత ప్రతిపాదించింది కూడా పాకిస్థానే..! అంతే.. ట్రంప్ కూడా పాకిస్థాన్ సాయంతోనే గాజాలో శాంతిని స్థాపించాలని నిశ్చయించారు.ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికే కారణమా?ాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేశారు. దానికి ఐక్య రాజ్య సమితి నుంచి కూడా ఆమోదం తెచ్చుకున్నారు. అందులో ఆరో పాయింట్ అత్యంత కీలకమైనది. అదేంటంటే.. గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. అందుకు అనుగుణంగానే హమాస్ ఆయుధాలను వీడాలి. ఆ తర్వాత ఇరువైపులా యుద్ధం ముగుస్తుంది. అయితే.. మరోమారు కవ్వింపు చర్యలు లేకుండా ఉండేందుకు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలి. అయితే.. ఇక్కడే ట్రంప్ ఓ రాజకీయ చతురతను, చాణక్య నీతిని ప్రదర్శించారు. ఆఫ్ఘానిస్థాన్, సిరియాలలో అనుభవాలను బేరీజు వేసుకున్నారు. మిలిటెంట్లు, ఉగ్రవాదులు స్టెబిలైజేషన్ ఫోర్స్ను టార్గెట్గా చేసుకునే ఉదంతాలను విశ్లేషించారు. దీంతో.. నాటో దళాలు లేదా అమెరికా బలగాలను గాజాలో దింపకుండా.. ఆ బాధ్యతను ఇస్లామిక్ దేశాలకు అప్పగించాలని తీర్మానించారు. అంటే.. గాజా శాంతికోసం తీవ్రంగా కృషి చేస్తున్న తుర్కియే, జోర్దాన్, ఈజిప్టుతోపాటు.. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్ ఆ బాధ్యతను తీసుకోవాలనేది ట్రంప్ ఆకాంక్ష..! ఈ దళాలు గాజాతోపాటు.. పాలస్తీనాలోని పోలీసు దళాలకు శిక్షణ ఇవ్వాలి. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఒప్పందం జరగాలి. అది జరిగినప్పుడే ఇంతకాలం యుద్ధ నేరాలకు పాల్పడ్డ హమాస్ సభ్యులకు క్షమాభిక్ష ఉంటుంది. గాజాను వీడాలనుకునే హమాస్ సభ్యులు ఈజిప్ట్, జోర్దాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వలస వెళ్లేందుకు అమెరికా సహకరిస్తుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే.. ఆసిమ్ మునీర్ను వైట్హౌస్కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.చిక్కుల్లో ఆసిమ్ మునీర్..!ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పాలిట అశనిపాతంగా మారుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ని బద్ధశత్రువుగా భావిస్తాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల పథకం ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉంటుంది. పైగా.. ట్రంప్ ఇజ్రాయెల్కు ఆప్తమిత్రుడనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే ఈ 20 సూత్రాల పథకంపై ఈజిప్ట్, ఖతార్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్లో కూడా ఆసిమ్ మునీర్పై వ్యతిరేకతకు అంకురార్పణ జరగడానికి ఇదే కారణమవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్తో త్వరలో జరగనున్న భేటీలో మునీర్ బేషరతుగా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా మునీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారనుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో పాకిస్థాన్ సైన్యం ఉండదని మునీర్ చెబితే.. ట్రంప్కు నిస్సందేహంగా కోపం వస్తుంది. ఒకవేళ ట్రంప్ నిర్ణయానికి మునీర్ తలూపినా.. పాకిస్థాన్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పడానికి పాకిస్థాన్ బలగాలను అక్కడ మోహరించినా.. హమాస్ను ఆయుధాలు వీడమని చెప్పడం, నిరాయుధీకరణకు సహకరించడం తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు..!ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. జెన్-జీ ఉద్యమాలు ఇప్పుడు ప్రభుత్వాల పాలిట ముప్పుగా మారుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్లో అధికార మార్పిడి ఇందుకు ఉదాహరణ..! బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చి, యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది విద్యార్థి ఉద్యమమే. నేపాల్లో కూడా యువత ఉద్యమించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మునీర్ గనక ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. పాకిస్థాన్లోనూ నిరసనలు మొదలవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మునీర్ ఇటీవలి కాలంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, తుర్కియే, జోర్దాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాల రాజకీయ, సైన్య అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశాల సందర్భంగా గాజా శాంతి గురించి మాట్లాడారు. దీనికి ప్రతిగా ఇప్పటికే పాకిస్థాన్లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ అమలు చేస్తే.. పాక్లో ఆందోళనలు పేట్రేగిపోతాయని దక్షిణ-మద్య ఆసియా వ్యవహారాల నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనను మునీర్ సున్నితంగా తిరస్కరించినా.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో.. మునీర్ రిస్క్లో పడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని చూస్తే..!పాకిస్థాన్లో పాలస్తీనాకు మద్దతిచ్చే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని మునీర్ నిర్ణయిస్తే.. పాకిస్థాన్లో అస్థిరత పెరిగే ముప్పు ఉంది. పాకిస్థాన్లో కరడుగట్టిన ఇస్లామిక్ ఎన్జీవోలు, సంస్థలు ఎన్నో ఉన్నాయి. పైగా.. ఉగ్రవాద సంస్థలన్నీ హార్డ్కోర్ ఇస్లామిక్ మైండ్ సెట్ ఉన్నవే..! ఈ సంస్థలు మూకుమ్మడిగా జెన్-జీ స్థాయిలో ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు. దీన్ని గమనించే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ఓ ప్రకటన చేస్తూ.. హమాస్ నిరాయుధీకరణ తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయిన మునీర్.. ట్రంప్ను విభేదిస్తే.. పెద్దన్న ఆగ్రహానికి గురవ్వక తప్పదు. ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదిస్తే.. దేశంలో అస్థిరత ఏర్పడి మునీర్ పదవికే గండం తప్పదు. ఏది ఏమైనా.. త్వరలో అమెరికా-పాక్ మధ్య తల్లాక్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. - హెచ్.కమలాపతిరావుఇదీ చదవండి:చైనా-పాకిస్థాన్కు మధ్య చెడింది ఇక్కడే..! -
ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం
మస్కట్: భారత్ -ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ గౌరవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.సుల్తాన్ హైతమ్ స్వయంగా ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించారు. భారత్-ఒమాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన దూరదృష్టి, నాయకత్వం, పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.భారత్–ఒమాన్ మధ్య 1950లలో ప్రారంభమైన దౌత్య సంబంధాలు ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సముద్ర భద్రత, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ గౌరవం ప్రతీకాత్మకంగా నిలిచింది.ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్భారత్-ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టనున్నాయి. మస్కట్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) పై కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఇంధన, సముద్ర భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.12 బిలియన్ డాలర్ల వాణిజ్యం భారత్–ఒమన్ మధ్య ప్రస్తుతం సుమారు 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఎఫ్టీఏ అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఔషధాలు,వ్యవసాయ ఉత్పత్తులు,ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోకెమికల్స్ వంటి రంగాలకు భారీగా లాభం చేకూరనుంది. ఒమాన్, భారత సముద్ర భద్రతా వ్యూహంలో కీలక భాగస్వామి. అరేబియా సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ రంగంలో సంయుక్త విన్యాసాలు, నౌకాదళ సహకారం మరింత పెరగనున్నాయి.ఒమన్లో సుమారు 7 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై కూడా ఇరుపక్షాలు చర్చించాయి. వీసా సౌకర్యాలు, కార్మిక ఒప్పందాల సరళీకరణపై ఒమన్ సానుకూలంగా స్పందించినట్లు వర్గాలు తెలిపాయి.అంతకుముందు మస్కట్లో ప్రధాని మోదీకి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. సుల్తాన్ హైతమ్తో జరిగిన సమావేశం అనంతరం మోదీ, ఒమాన్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి బంధం మరింత బలపడుతోంది అని పేర్కొన్నారు. -
పెద్ద విమాన ప్రమాదమే తప్పింది..!
మనం ఏ పని చేయాలన్నా ప్రకృతి అనుకూలత అనేది చాలా ముఖ్యం. మనకు చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలిస్తున్నాయంటే అక్కడ ప్రకృతి అనుకూలంగా ఉన్నట్లే అర్ధం చేసుకోవాలి. సెల్ఫ్ ఎఫర్ట్ (మానవ ప్రయత్నం)కు ప్రకృతి అనుకూలించిందంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవనం అనే బండి ముందుకు పోతుంది. ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తరచు జరుగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్న దాఖలాలు కూడా చూశాం. అయితే కొన్ని రోజుల క్రితం ఓ భారీ విమాన ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఖతార్ ఎయిర్వేస్ విమానం.. డిసెంబర్ 14వ తేదీన దోహా నుండి బయల్దేరింది. అయితే అది అమెరికాలోని అట్లాంటాకు చేరుకున్న తర్వాత బలమైన గాలుల కారణంగా ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేద్దామని పైలట్ ప్రయత్నించాడు. ఆ బలమైన గాలులకు విమానం నియంత్రణ కోల్పోవడంతో ఓ ప్రయత్నంగా ల్యాండింగ్కు యత్నించాడు. కానీ విమానం వెనుక భాగం రన్వేకు తాకడానికి అత్యంత సమీపంగా వచ్చిన సమయంలో మళ్లీ పైలట్ టేకాఫ్ తీసుకున్నాడు. ఇక్కడ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం ఒకటైతే.. ఆకాశం కరుణించి.. భూమి శాంతించడంతో మళ్లీ విమానం తిరిగి యధాస్థితికి వెళ్లిపోయింది. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. Meanwhile in ATL 🤏Video: Kyle Marcks pic.twitter.com/cOOICcfRaG— Breaking Aviation News & Videos (@aviationbrk) December 16, 2025 దీనిపై ఖతార్ ఎయిర్వేస్ అధికారులు మాట్లాడుతూ.. తమ పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ల్యాండింగ్ తీసుకోకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఇలా అత్యవసరంగా ల్యాండింగ్ పరిస్థితులు ఎదురైనప్పుడు భయాందోళనలు అనేవి సహజంగానే ఉంటాయని, ప్రయాణికుల్లో ఇది ఇంకా గందరగోళానికి గురిచేస్తుందన్నారు. -
క్యాబ్లో మహిళ నిద్రలోకి : భారత సంతతి డ్రైవర్ ఘాతుకం
అమెరికాలో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన క్యాబ్లో గాఢంగా నిద్రపోయి, స్పృహ కోల్పోయిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని కాలిఫోర్నియాలోని బేకర్స్ఫీల్డ్ నివాసి భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ సిమ్రంజిత్ సింగ్ సెఖోన్ (35)గా గుర్తించారు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.వెంచురా కౌంటీ షెరీఫ్ కార్యాలయం సమాచారం ప్రకారం నవంబర్ 27 తెల్లవారు జామున 1:00 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుంది యువతి. క్యాబ్ రైడ్ సమయంలో దిగాల్సిన చోటు వచ్చినా కూడా గమనించలేనంతగా ఆమె నిద్రలోకి జారిపోయింది. దీనికి తోడు మద్యం సేవించి ఉండటంతో అదే అదునుగా భావించిన సెఖోన్ ఆమెను థౌజండ్ ఓక్స్ బార్ నుండి కామరిల్లోలోని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ ఏడాది నవంబరులో మొదలైంది. ఈ సందర్బంగా సెఖోన్ బాధితుల సంఖ్య ఇంకా ఉండి ఉండవచ్చని డిటెక్టివ్లు అనుమానిస్తున్నారు.బెయిల్ కోసం రూ. 4.52 కోట్లుసెఖోన్ను డిసెంబర్ 15న అరెస్టు చేసి, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేసినందుకు ప్రీ-ట్రయల్ డిటెన్షన్ ఫెసిలిటీలో కేసు నమోదు చేశారు. బెయిల్ రుసుము రూ. 4.52 కోట్లు (5లక్షల డాలర్లు) గా నిర్ణయించారు. తదుపరి విచారణ డిసెంబర్ 29న జరగాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలను సెఖోన్ ఖండించారు. అయితే నిందితుడు ఏ రైడ్ షేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, డ్రైవర్ స్థితి తదితర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.ఇదీ చదవండి: రూ. 2400 కోట్ల వివాదం, 87 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో బిడ్డకాగా భారతీయ సంతతికి చెందిన డ్రైవర్లు అమెరికా, కెనడాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయడంలాంటి అనేక ఆరోపణల మధ్య తాజా వార్త మరింత కలకలం రేపుతోంది. -
'ప్రశాంతతకు తాళం మన మనసులోనే'..!
ఒకప్పుడు సామాన్యులకు నిషిద్ధంగా భావించిన ధ్యానం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. ప్రపంచంలో అశాంతి మరింత పెరుగుతున్న ఈ కాలంలో ధ్యానసాధనను శాశ్వతంగా మన జీవితాలలో భాగంగా స్వీకరించాల్సిన అవసరాన్ని ప్రపంచం గుర్తించాలని, విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక గురువు మానవతావాది గురుదేవ్ విశంకర్ బుధవారం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి భవనం నుంచి పిలుపునిచ్చారు. రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. గతేడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకేసారి ధ్యానం చేసి, ప్రపంచవ్యాప్తంగా చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన విషయం విదితమే. వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా, అలసట, ఒత్తిడి, సంఘర్షణలు, అనిశ్చితి, భావోద్వేగ వేదనలతో పోరాడుతున్న సమాజాలకు ధ్యానం ఎంత అవసరమో గురుదేవ్ తన ప్రసంగంలో వివరించారు.ప్రపంచ శాంతి కోసం ధ్యానంఈ సందర్భంగా భారతదేశ శాశ్వత ప్రతినిధి కార్యాలయం (పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా), ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘ప్రపంచ శాంతి కోసం ప్రపంచం ధ్యానం చేస్తోంది’ అనే అంశంపై గురుదేవ్ ప్రసంగించారు. వయస్సు, ప్రాంతం అనే భేదం లేకుండా ఆందోళన, బర్నౌట్, ఒంటరితనం పెరుగుతున్న ఈ సమయంలో, సమస్యలకు బాహ్య పరిష్కారాలు కాకుండా, మానవ మనసును స్థిరపరిచి శాశ్వత పరిష్కారాన్ని అందించే దిశగా కూడా చూడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.“ఈ రోజుల్లో ధ్యానం ప్రపంచానికి ఒక విలాసం కాదు,” అని గురుదేవ్ అన్నారు. “మన జనాభాలో మూడో వంతు మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. సగం మంది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనల్ని మనతోనే కలిపే, మనలో దాగి ఉన్న ఒత్తిడిని తొలగించే ఒక సాధనం అవసరం. అప్పుడే ధ్యానానికి ప్రాముఖ్యత వస్తుంది.”ధ్యానం - మానసిక పరిపూర్ణతధ్యాన సందర్భంలో మానసిక పరిపూర్ణత (మైండ్ ఫుల్ నెస్) గురించి వివరిస్తూ గురుదేవ్ ఇలా అన్నారు: “మైండ్ ఫుల్ నెస్ మీ ఇంటికి వెళ్లే దారి లాంటిది, ధ్యానం మీ ఇల్లు. ధ్యానం మనల్ని మన అంతర్లీన లోకంలోకి తీసుకెళ్లి అవసరమైన ప్రశాంతతను అందిస్తుంది. ఇది చేయడం కష్టమేమీ కాదు. స్థూలంగా చెప్పాలంటే ధ్యానం అనేది మనసు అనే కంప్యూటర్లో అనవసరంగా నిల్వ చేసిన ఫైళ్లన్నింటినీ ‘డిలీట్’ బటన్ నొక్కి ఖాళీ చేయటమే.”శక్తి, సమన్వయం: ధ్యానం“మనమంతా శక్తే,” అని గురుదేవ్ పేర్కొన్నారు. “ఈ శక్తి సమన్వయంతో ఉందా? మన పరిసరాలలో ఐక్యతను సృష్టిస్తున్నదా? అనే ప్రశ్నలకు ధ్యానంలోనే సమాధానం ఉంది. ధ్యానం మన చుట్టూ అవసరమైన సామరస్యాన్ని సృష్టిస్తుంది. మన వైబ్రేషన్లను శుద్ధి చేస్తుంది.”చరిత్ర సృష్టించిన ప్రపంచ ధ్యానంగత ఏడాది డిసెంబర్ 21న ‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్’ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకచోట చేరి ధ్యానం చేశారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ధ్యాన సమూహంగా నిలిచి, ఆరు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది.ఈ కార్యక్రమం ప్రత్యేకత కేవలం సంఖ్యల్లోనే కాకుండా, పాల్గొన్న వారి వైవిధ్యంలోనూ కనిపించింది — నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలు, సామాజిక కేంద్రాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల అన్ని వర్గాల ప్రజలూ ఇందులో భాగమయ్యారు.భారత శాశ్వత ప్రతినిధి అభిప్రాయంజెనీవాలోని ఐక్యరాజ్యసమితి, సంబంధిత అంతర్జాతీయ సంస్థల భారతదేశ శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, “గతేడాది అంతర్జాతీయ సదస్సు నాటి గురుదేవుల జెనీవా సందర్శనను మేము ఆత్మీయంగా గుర్తుచేసుకుంటున్నాము. లోతైన సంఘర్షణలు, అవిశ్వాసంతో నిండిన ప్రపంచంలో, ధ్యానం కేవలం వ్యక్తిగత స్వీయాభివృద్ధి సాధన మాత్రమే కాదు అది సంక్లిష్టమైన ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, విశ్వాసాన్ని పరస్పర సుహృద్భావాన్ని పెంపొందించడానికి ఒక శక్తివంతమైన సాధనం,” అని తెలిపారు.బాహ్య ఆడంబరాల నుంచి అంతరంగ కేంద్రానికి ప్రయాణం ఆధునిక కాలంలో పశ్చిమ దేశాలలో ధ్యానం ఒకవైపు కొత్త ఫ్యాషన్గా, విభిన్నంగా ప్రాచుర్యం పొందగా, మరోవైపు అది పాతకాలపు ఆధ్యాత్మిక సాధనంగా, ఈ కాలానికి సరిపడదని కూడా భావించారు. 1980ల ప్రారంభంలో, మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగే ఈ శాస్త్రానికి పెద్దగా ప్రాధాన్యత లేని సమయంలోనే, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రపంచానికి ధ్యానాన్ని మరలా పరిచయం చేసే బృహత్తర ప్రయాణాన్ని ప్రారంభించారు.విద్య, సంఘర్షణల పరిష్కారం, రైతు సంక్షేమం, జైలు ఖైదీల పునరావాసం, యువ నాయకత్వం, కార్పొరేట్ రంగంలో ఒత్తిడి నిర్వహణ, సమాజ పునర్నిర్మాణం వంటి అనేక రంగాల్లో ధ్యానం ఆయన సేవలకు కేంద్రబిందువుగా మారి, 182కు పైగా దేశాలలో కోట్లాది మందిని చేరుకుంది.బుధవారంనాటి తన ప్రసంగంలో గురుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన సభ తీర్మానాన్ని ఆమోదించిన 192 దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్గత సాధన ఇంత విస్తృతమైన సాంస్కృతిక, శాస్త్రీయ, సంస్థాగత గుర్తింపును పొందడం అరుదైన విషయం. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.ముందుకు సాగుతున్న ప్రపంచ ఉద్యమంఈ విశ్వవ్యాప్త స్ఫూర్తిని కొనసాగిస్తూ.. గురుదేవ్ డిసెంబర్ 19న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి కీలక ప్రసంగం చేయనున్నారు. భిన్న ధృవాలుగా విడిపోతూ, విభిన్న అభిప్రాయాల సంఘర్షణకు లోనవుతున్న నేటి ప్రపంచంలో మానసిక ధైర్యం, పరస్పర చర్చలను, శాంతిని పెంపొందించడంలో ధ్యానం మరింత కీలకపాత్ర పోషించనుందిఈ ఏడాది డిసెంబర్ 21న, న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ప్రతిష్టాత్మక ‘ఒక్యులస్’ నుంచి రాత్రి 8.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గురుదేవ్ నేతృత్వంలో కోట్లాది మంది ధ్యానం చేయనున్నారు.నిరంతర ప్రయాణంగా సాగే ఈ ప్రపంచంలో, ఒక క్షణకాలపు నిశ్శబ్దం, సరిహద్దులను దాటి సామరస్యాన్ని వ్యాపింపజేసే ఒక శ్వాస.. అదే ధ్యానం. వేగంగా మారిపోతున్న అనిశ్చితమైన కాలంలో సైతం, మన ప్రశాంతతకు తాళం మన మనసులోనే ఉందని గుర్తుచేసే సున్నితమైన సందేశంగా ఈ కార్యక్రమం నిలవనుంది.(చదవండి: కొద్ది సేపు బ్రేక్ ఇచ్చే కిక్ వేరేలెవెల్..!) -
రూ. 2400 కోట్ల వివాదం, 87 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో బిడ్డ
చైనాలో అత్యంత గౌరవనీయమైన , ప్రసిద్ధ కళాకారుడు ఫ్యాన్ జెంగ్. 87 ఏళ్ల వయసులో తాను ఒక బిడ్డకు తండ్రి అయినట్లు ప్రకటించాడు. తన భార్య 37 ఏళ్ల జు మెంగ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించారు. అంతేకాదు ఏకైక జీవసంబంధమైన కొడుకు ఇతడే అంటూ తన ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుని, మరోసారి కుటుంబ వివాదాలను సోషల్ మీడియాలో తెరపైకి తీసుకురావడం విశేషంగా నిలిచింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తనకు కొడుకు పుట్టినట్లు ప్రకటించడం మాత్రమే కాదు ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన బిడ్డను "ఏకైక సంతానం"గా అభివర్ణించాడు. కొత్త ఇంట్లోకి మారాం, భార్య, కొడుకుతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అలాగే వయసు పెరిగిన నేపథ్యంలో తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తిగా జుకు అప్పగిస్తున్నట్లు చెప్పాడు. రూ 2400 కోట్ల వివాదం, లేటు వయసులోఫ్యాన్ బిడ్డను కనడం, ఇంటితో సంబంధాలను తెంచుకోవడం, సుదీర్ఘ కళా జీవితాన్ని మసకబారుస్తుందంటున్నారు నిపుణులు.ఫ్యాన్ కుటుంబంలో వివాదాలుగత కొన్నేళ్లుగా కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఫ్యాన్ కూతురు జియావోహుయ్, సవతితల్లి జుపై సంచలన ఆరోపణలు చేసింది. తమను, తండ్రిని కలవనివ్వడం లేదని, తన తండ్రి 2 బిలియన్ యువాన్లు (రూ. 2,400 కోట్ల) విలువైన కళాఖండాలను జు రహస్యంగా అమ్ముకుందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఫ్యాన్ జెంగ్ సంస్థ ఖండించింది.ఎవరీ ఫ్యాన్ జెంగ్ ఫ్యాన్ సాంప్రదాయ చైనీస్ పెయింటింగ్లు, కాలిగ్రఫీ నైపుణ్యంతో చైనాలో బాగా పాపులర్. జియాంగ్సు ప్రావిన్స్లో ఫ్యాన్ జెంగ్ జన్మించాడు. బీజింగ్ సెంట్రల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ప్రఖ్యాత కళాకారులు లి కెరాన్, లి కుచన్ వద్ద శిక్షణ పొందాడు.అద్భుతమైన కళాకృతులతో గొప్పకళాకారుడిగా, చైనాలోని ప్రముఖ కళాకారుడిగా తెచ్చుకున్నాడు. అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ప్రదర్శించబడుతున్నాయి. అయితే గత ఏడాది ఏప్రిల్లో, తన కంటే 50 ఏళ్ల చిన్నదైన జు మెంగ్ను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆయన నాలుగో భార్య జుతో కలిసి జీవిస్తున్నాడు. చైనీస్ మీడియా నివేదికల ప్రకారం, అతని రచనలు 2008 - 2024 మధ్య వేలంలో 4 బిలియన్ యువాన్లకు పైగా ఆర్జించాయి. పలు చిత్రాలు 10 మిలియన్ యువాన్లకు పైగా అమ్ముడయ్యాయి. వీటిలో 1991లో 2011లో బీజింగ్ వేలంలో 18.4 మిలియన్ యువాన్లకు అమ్ముడుపోవడం విశేషం. అతను సృష్టించే కాలిగ్రఫీ విలువ 0.11 చదరపు మీటరుకు 200,000 యువాన్ల ధర ఉంటుందట. -
భారత ఆర్థిక డీఎన్ఏ మారింది: మస్కట్లో ప్రధాని మోదీ
మస్కట్: గడచిన 11 ఏళ్ల కాలంలో భారత్ తన విధివిధానాలను మార్చుకోవడమే కాకుండా, తన దేశ ఆర్థిక డీఎన్ఏనే సమూలంగా మార్చుకున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా గురువారం మస్కట్లో నిర్వహించిన ‘ఇండియా-ఒమన్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. భారతదేశం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు నేడు దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటిగా నిలిపాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కుదురుతున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) 21వ శతాబ్దపు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను, వేగాన్ని ఇస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.Landed in Muscat, Oman. This is a land of enduring friendship and deep historical connections with India. This visit offers an opportunity to explore new avenues of collaboration and add fresh momentum to our partnership. pic.twitter.com/RKZ5d8M1Jf— Narendra Modi (@narendramodi) December 17, 2025దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడిన కీలక సంస్కరణలను ప్రస్తావిస్తూ, జీఎస్టీ (GST) అమలు ద్వారా భారతదేశం ఒకే సమీకృత మార్కెట్గా ఆవిర్భవించిందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) వంటి నిర్ణయాలు దేశంలో ఆర్థిక క్రమశిక్షణను పెంచి, పారదర్శకతను పెంపొందించాయని వివరించారు. ఈ చర్యల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారత్ పట్ల నమ్మకం రెట్టింపు అయిందని, పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోశాయని ఆయన వివరించారు. వ్యాపారవేత్తలతో జరిగిన ఈ సమావేశంలో భారత ఆర్థిక ప్రగతి పథాన్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు. భారత్-ఒమన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా సముద్రం రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారధి అని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వీకుల కాలం నుంచే సముద్ర వాణిజ్యంలో ఇరు దేశాలు సుసంపన్నమైన వారసత్వాన్ని కలిగి ఉన్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్నేహం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని మోదీ ఆకాంక్షించారు.ఇరు దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జోర్డాన్, ఇథియోపియా పర్యటనలను ముగించుకుని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ఒమన్ చేరుకున్న ప్రధాని, రెండు రోజుల పాటు ఇక్కడ వివిధ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వాణిజ్య రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడం, భవిష్యత్ ప్రణాళికల కోసం ఒక బ్లూప్రింట్ సిద్ధం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్ సుతార్ కన్నుమూత -
‘బీజింగ్కు సాధ్యం.. ఢిల్లీకి అసాధ్యమా?’.. చైనా ‘మాస్టర్ క్లాస్’
న్యూఢిల్లీ: ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు, వాయు కాలుష్యంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, చైనా తన విజయగాథను భారత్తో పంచుకుంది. ఒకప్పుడు ‘ప్రపంచ స్మోగ్ రాజధాని’గా పేరుగాంచిన బీజింగ్, కేవలం దశాబ్ద కాలంలోనే వాయు కాలుష్యాన్ని ఎలా తరిమికొట్టిదో వివరిస్తూ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వరుస పోస్ట్లు చేశారు. 2013లో 101.7 ug/m3గా ఉన్న బీజింగ్ వార్షిక PM 2.5 సగటు, 2024 నాటికి ఏకంగా 30.9 ug/m3కు పడిపోవడం గమనార్హం.బీజింగ్ అనుసరించిన వ్యూహాలివే!వాయు కాలుష్య నివారణకు వాహన ఉద్గారాల నియంత్రణే మొదటి మెట్టు అని జింగ్ పేర్కొన్నారు. యూరో 6 ప్రమాణాలకు సమానమైన 'చైనా 6NI' నిబంధనలను కఠినంగా అమలు చేయడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించడం ద్వారా బీజింగ్ గణనీయమైన మార్పు సాధించింది. కేవలం నిబంధనలే కాకుండా, లైసెన్స్ ప్లేట్ లాటరీలు, బేసి-సరి వంటి కఠినమైన ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తూనే.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో, బస్సు నెట్వర్క్లను నిర్మించింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని వేగవంతం చేయడం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.మరోవైపు పారిశ్రామిక పునర్నిర్మాణం ద్వారా బీజింగ్ విప్లవాత్మక మార్పులు చేపట్టింది. సుమారు 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం నుండి తొలగించడం లేదా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా చైనాలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘షోగాంగ్’ను వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా గాలిలోని హానికారక కణాలు ఒక్కసారిగా 20 శాతం తగ్గాయి. ఖాళీ అయిన కర్మాగారాల స్థలాలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చగా, మాజీ షోగాంగ్ సైట్ 2022 వింటర్ ఒలింపిక్స్కు వేదిక కావడం విశేషం.అయితే భారత్లో కూడా ఇటువంటి ప్రణాళికలు చర్చల్లో ఉన్నప్పటికీ, వాటి అమలు తీరులోనే ప్రధాన తేడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మన వద్ద BS6 ప్రమాణాలు ఉన్నా, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు’ అని పర్యావరణ విశ్లేషకులు సునీల్ దహియా పేర్కొన్నారు. కేవలం కాలుష్యం పెరిగినప్పుడు మాత్రమే అత్యవసర చర్యలు తీసుకోవడం కాకుండా, బీజింగ్ మాదిరిగా ఏడాది పొడవునా కఠినమైన పారిశ్రామిక మార్పులు అమలు చేయాలి. ఇంధన పరివర్తన చేపట్టినప్పుడే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్ సుతార్ కన్నుమూత -
ఆ ‘పదం’ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్
తన గురించి తానే కాస్త అతిగా గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పొగిడేసుకున్నారు. తనను తాను ప్రశంసించుకుంటూ 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపేశానని.. ఇందుకు ప్రధాన కారణం టారిఫ్లేనంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అమెరికా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం ‘టారిఫ్స్’ అంటూ చెప్పుకొచ్చారు.మరోవైపు మాజీ అధ్యక్షుడు జో బైడెన్పై విమర్శలు గుప్పించారు. తనకు గందరగోళ పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టానని.. 10 నెలల్లో 8 యుద్ధాలను పరిష్కరించానన్నారు. ఇరాన్ అణు ముప్పును తొలగించాను. గాజాలో యుద్ధాన్ని ముగించాను. దాదాపు 3,000 ఏళ్ల అనంతరం అక్కడ శాంతిని నెలకొల్పి.. బందీలను స్వదేశానికి తీసుకొచ్చానన్న ట్రంప్.. తన ప్రభుత్వ 2026 అజెండాను ప్రజలకు వివరించారు.#WATCH | In an address to the Nation, US President Donald Trump says, "I restored American strength, settled 8 wars in 10 months, destroyed the Iran nuclear threat and ended the war in Gaza - bringing for the first time in 3000 years peace to the Middle East and secured the… pic.twitter.com/8SAKdDQLvN— ANI (@ANI) December 18, 2025కాగా, అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు.బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రెండోరోజు ఒమన్ పర్యటనలో ప్రధాని మోదీ
రెండోరోజు ఒమన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పలు అంశాలపై అగ్రనేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించనున్నారు. ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ ఇథియోపియా నుంచి బుధవారం ఒమన్కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఉప ప్రధానమంత్రి సయీద్ షిహాబ్ బిన్ తారిఖ్ అలీ సైద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మోదీ ఇవాళ (గురువారం) ఒమన్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు.ఈ సందర్భంగా కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన పర్యటనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు మోదీ ఒమన్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి. -
పాక్ మరో దుశ్చర్య.. 40 ఏళ్ల ఆఫ్ఘన్ శిబిరాల మూసివేత
పెషావర్: పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయమిస్తున్న 42 శరణార్థి శిబిరాలను మూసివేస్తున్నట్లు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అధికారికంగా ప్రకటించింది. 1979లో సోవియట్ యూనియన్.. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసిన దరిమిలా లక్షలాది మంది శరణార్థులు పాకిస్తాన్కు వలస వచ్చారు. సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా దశాబ్దాలుగా ఈ వలసదారులకు ప్రధాన ఆశ్రయ కేంద్రంగా ఉంటూ వస్తోంది.దాదాపు 45 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శిబిరాలను మూసివేయడం వెనుక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రావిన్స్లో శరణార్థుల నివాస వ్యవస్థను, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరించడమే ఈ నిర్ణయంలోని ప్రధాన ఉద్దేశ్యం. ఈ క్రమంలో చట్టవిరుద్ధంగా, ఎటువంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని గుర్తించి, శిబిరాల నుండి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.శిబిరాల మూసివేత ప్రక్రియను ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా రెండు దశల్లో నిర్వహించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మొదటి దశలో భాగంగా వలసదారుల వివరాలను సేకరించి, రెండో దశలో శిబిరాల ఖాళీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే, దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వారికి ఈ హఠాత్ నిర్ణయం పెను సవాలుగా మారింది. క్రమబద్ధీకరణ పేరుతో తీసుకున్న ఈ చర్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.మరోవైపు ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శిబిరాల మూసివేత కారణంగా నిరాశ్రయులైన వారికి తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనిస్తే, శరణార్థుల పునరావాసం, కనీస అవసరాల విషయంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే మానవతా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని పలు స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఇంటింటికీ చౌక అణు విద్యుత్.. భద్రత గాలికి? -
యూదులపై కాల్పులు: అక్కడ మ్యారేజ్.. ఇక్కడ నిఖా!
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో యూదులపై కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ రెండుసార్లు వివాహం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. 1998 నవంబర్లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 1999లో యూరోపియన్ మహిళ వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడు. తొలుత అక్కడ అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి నిఖా జరిగింది. వీరికి 2001 ఆగస్టు 12న నవీద్ జన్మించగా.. అతడి 15వ ఏట తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో కొద్దిరోజులు టోలిచౌకీలో ఉండి దూద్బౌలీలో కొన్ని స్థిరాస్తుల్ని విక్రయించి వెళ్లినట్లు తెలిసింది. ఉగ్రవాద బాటపట్టిన సాజిద్, నవీద్ భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను ముందే ఊహించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సాజిద్ ఆస్తిపాస్తుల్లో తనకు ఉన్న వాటాలను గత ఏడాది ఫిబ్రవరిలోనే వెనెరాకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు. అక్కడే ఇతడికి పరిచయమైన వారి ద్వారా ఐసిస్లో చేరాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లు ఫిలిప్పీన్స్లో ఉన్న మిండానావో ఐలాండ్లోని ఐసిస్ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి గత ఆదివారం వరకు వీరి కదలికలను పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఉదయం వీళ్లు దాదాపు 20 కిమీ ప్రయాణించి బీచ్ వద్దకు చేరుకున్నట్లు ఆధారాలు సేకరించారు. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలను కూడా స్వాదీనం చేసుకున్నారు. -
చైనా డ్యామ్ కుట్ర.. భారత్కు పెను ముప్పు తప్పదా?
హిమాలయాల నుంచి భారత్, బంగ్లాదేశ్లలోకి ప్రవహిస్తూ, కోట్లాది మందికి జీవనాధారమైన బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. టిబెట్లోని యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై సుమారు $168 బిలియన్ల(సుమారు రూ. 1,51,860 కోట్లు) వ్యయంతో బీజింగ్ ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును చేపట్టింది. ఇది పర్యావరణానికే కాకుండా, భారత్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా దెబ్బతీయనుంది.పర్యావరణ సమతుల్యతకు విఘాతంఈ ప్రాజెక్టులో భాగంగా నది సహజ ప్రవాహాన్ని మళ్లించేలా డ్యామ్లు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నది ఎత్తులో ఉండే 2,000 మీటర్ల మార్పును చైనా వాడుకోనుంది. అయితే ఈ జోక్యం వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చేపల వలసలు, అవక్షేపాల కదలికలు మారిపోయి, దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం , జీవవైవిధ్యంపై కోలుకోలేని దెబ్బ పడే ప్రమాదం ఉంది.‘వాటర్ బాంబ్’ కానుందా?చైనా చర్యలను అరుణాచల్ ప్రదేశ్ తదితర సరిహద్దు రాష్ట్రాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. చైనా ఎప్పుడు నీటిని విడుదల చేస్తుందో, ఎప్పుడు నిలిపివేస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. అత్యవసర సమయాల్లో భారీగా నీటిని వదిలితే కృత్రిమ వరదలు, నిలిపివేస్తే కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును భారత్పై ప్రయోగించే ఒక ‘వాటర్ బాంబ్’గా ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు అభివర్ణించడం గమనార్హం.భౌగోళిక రాజకీయ వ్యూహాలుపర్యావరణ కోణంలోనే కాకుండా, ఈ ప్రాజెక్టు వెనుక చైనా రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను పెంచుకోవడం ద్వారా టిబెట్, భారత్ సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధించాలని బీజింగ్ యోచిస్తోంది. మెకాంగ్ నది విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరించి.. వియత్నాం వంటి దేశాల్లో కరువుకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి.చెదిరిపోతున్న స్థానిక జీవనంఈ మెగా ప్రాజెక్టు కారణంగా టిబెట్లోని మోన్పా, లోబా వంటి స్థానిక తెగలకు చెందిన వేలాదిమంది ప్రజలు తమ పూర్వీకుల గృహాలను వదులుకోవాల్సి వస్తోంది. బలవంతపు తరలింపుల వల్ల స్థానిక సంస్కృతి, ఉపాధి వనరులు నాశనమవుతాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత జనాభా స్వరూపాన్ని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని టిబెట్ పాలసీ ఇన్స్టిట్యూట్ విమర్శించింది.భారత్ ముందస్తు చర్యలుచైనా కదలికలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం, సరిహద్దు ప్రాంతాల పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధమవుతోంది. చైనా డ్యామ్కు ప్రతిగా బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల భారీ డ్యామ్ను నిర్మించాలని భారత్ ప్రతిపాదించింది. అయితే ఇరు దేశాల మధ్య ఈ ‘డ్యామ్ నిర్మాణ రేసు’ పర్యావరణానికి మరింత ముప్పు తెస్తుందని, రెండు దేశాలు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘సెవెన్ సిస్టర్స్’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్ -
డెమొక్రట్ల పైచేయి.. ట్రంప్ ఉత్తర్వులు నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై డెమొక్రట్లు మరోసారి పైచేయి సాధించారు. డిటెన్షన్ సెంటర్ల విషయంలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ వాషింగ్టన్ డీసీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఆరు నెలలుగా ఈ విషయంలో డెమొక్రట్లు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా చట్ట సభ్యులు ఎవరైనా సరే గతంలో డిటెన్షన్ సెంటర్లకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి సందర్శించే వీలుండేది. అయితే ట్రంప్(Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ సందర్శనలపై ఆంక్షలు విధించారు. ‘‘వారం ముందుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు(ICE) సెంటర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీల్డ్ ఆఫీసులు అనుమతి ఇస్తేనే సందర్శించొచ్చు. లేకుంటే లేదు’’ అనే ఉత్తర్వులు తీసుకొచ్చారు. అయితే.. ఈ ఉత్తర్వులపై హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లోని డెమొక్రట్లు కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ 2.0లో ఎంతటి కఠిన వైఖరి అవలంభిస్తున్నది చూస్తున్నదే. మరీ ముఖ్యంగా వలసవాదుల విషయంలో ఆయన ధోరణి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో.. డిటెన్షన్ సెంటర్లలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని డెమొక్రట్లు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. సరైన వసతులు ఉండడం లేదని.. అక్కడి వాళ్లను దారుణంగా చూస్తున్నారని.. ఈ తరుణంలో అలాంటివేవీ బయట పడకుండా ఉండేందుకే ట్రంప్ ఈ ఉత్తర్వులు తెచ్చారన్నది డెమొక్రట్ల వాదన. అయితే.. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఆ వాదనను ఖండించింది. చట్ట సభ్యుల భద్రత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో.. డెమొక్రట్ల వాదనలతో ఏకీభవించిన ఫెడరల్ జడ్జి జియా కాబ్ ట్రంప్ ఉత్తర్వులను ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని ప్రకటిస్తూ.. వాటిని పక్కన పెడుతూ తీర్పు ఇచ్చారు. జియా కాబ్ గత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో నియమించబడ్డారు. ఇదిలా ఉంటే.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లను ఆకస్మికంగా సందర్శించే హక్కు కల్పించే ఫెడరల్ చట్టాన్ని తెచ్చింది ట్రంపే కావడం గమనార్హం. ట్రంప్ మొదటి దఫా అధ్యక్ష పదవీ కాలంలో ఈ చట్టం ఆమోదించబడింది. ఇదిలా ఉంటే.. న్యూజెర్సీ డెమొక్రటిక్ ప్రతినిధి లమోనికా మెకైవర్ ఈ ఏడాది మే నెలలో న్యూయార్క్లోని ఓ డిటెన్షన్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే ఆ సమయంలో డిసెన్షన్ సెంటర్లో పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆమెపై కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆమె మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన నెలలోపే ట్రంప్ చట్ట సభ్యుల ఆకస్మిక సందర్శనలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ చదవండి: ఇక పూర్తిస్థాయి యుద్ధమేనా ట్రంప్? -
నోట మాట రాలేదు..!
విమాన ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చుని అద్భుతమైన ఫొటో తీసి, దాన్ని చూపించి ‘ఒక ఫ్రీ టికెట్ ఇస్తారా?’ అని మీరెప్పుడైనా అడిగారా? అడిగి ఉండరు కదా.. ‘రైనైర్’.. అంటేనే, టికెట్ ధర కంటే లగేజ్ రుసుము ఎక్కువ ఉండే బడ్జెట్ ఎయిర్లైన్ అని ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటిది.. ఐర్లాండ్ దేశానికి చెందిన ఈ ఎయిర్లైన్ని ఫ్రీ టికెట్ అడగడం అంటే.. గోతికాడ నక్కని బిర్యానీ అడిగినట్లే.. ఓకే, కథలోకి వెళ్దాం. అనగనగా ఒక తింగరోడు విమానంలో రోమ్ నగరం మీదుగా వెళ్తున్నాడు. ఆకాశం నీలం, కింద ఇటలీ రాజధాని నగరం అద్భుతంగా కనిపిస్తున్నాయి. వెంటనే తన మొబైల్లో ఓ అద్భుతమైన ఏరియల్ షాట్ తీశాడు. అందులో విమానం రెక్క, కింద పట్నం కళ్లకు విందు చేసేలా ఉన్నాయి. ఫొటో తీశా చూడండి.. ఆ ఫొటో చూశాక మనోడిలో ఆశ చిగురించింది. ‘ఆహా! ఈ ఫొటోకి కనీసం ఒక ఫ్రీ టికెట్ అడగాల్సిందే!’ అనుకున్నాడు. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా, ఆ గొప్ప ఫొటోను ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. దానిని రైనైర్ ఎయిర్లైన్కి ట్యాగ్ చేశాడు. ‘ఈ అద్భుతమైన ఫొటోకి బదులుగా నాకు ఒక ఉచిత విమాన టికెట్ ఇవ్వగలరా?’.. అని మరీ అమాయకంగా అడిగాడు. దానికి ఏదో నవ్వుతూ, నాలుగు మంచి మాటలు చెబుతారని, లేదా ఓ నవ్వుతున్న ఎమోజీ పంపిస్తారని ఆశించినట్లున్నాడు పాపం. ఒక్క మాటతో కథ క్లోజ్! రైనైర్ సోషల్ మీడియా టీమ్ ఉంది చూశారూ.. వాళ్లు సామాన్యులు కారు. వీళ్లు వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్లు. విషయం ఏంటంటే, వారు నిమిషం కూడా ఆలోచించకుండా, మర్యాదలన్నీ తుంగలో తొక్కి.. కేవలం ఒక్కే ఒక్క మాట.. నో.. (లేదు) అని జవాబిచ్చారు. అతన్ని ఏ మాత్రం నొప్పించకుండా, నెప్పి తెలియకుండా.. ఒక్కే ఒక్క పదంతో ‘గేట్’ మూసేశారు. అడగ్గానే ‘ఫ్రీ టికెట్’ దొరుకుతుందనుకున్న ఆ ప్రయాణికుడికి.. ఎయిర్లైన్ స్టైల్లో ముఖం మీదే ‘ఇక్కడ చపాతీ కూడా ఉచితంగా దొరకదు, నువ్వా ఫ్రీ టికెట్ అడుగుతున్నావ్?’ అని సూటిగా చెప్పినట్లయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢాకాలో భారత హైకమిషన్ వద్ద కలకలం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందన్న అక్కసుతో, ఆమెను తిరిగి అప్పగించాలన్న డిమాండ్తో బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వ అనుకూల ఆందోళనకారులు బుధవారం పేట్రేగిపోయారు. ఢాకాలోని ఇండియన్ భారత హైకమిషన్ను ముట్టడించేందుకు వందలాది మంది ర్యాలీగా వచ్చారు. బ్యారీకేడ్లను ఏర్పాటుచేసినా వాటిని ధ్వంసంచేసుకుంటూ నిరసకారులు ముందుకొచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జూలై ఐక్యత బ్యానర్ పట్టుకుని ఆందోళనకారులు నిరసన కొనసాగించారు. భారత్కు పారిపోయిన హసీనా, ఇతర అగ్రనేతలు, ఉన్నతాధికారులను తిరిగి అప్పగించాలని డిమాండ్చేశారు. ‘‘ మేం ఇండియన్ హైకమిషన్పై దాడిచేయబోం.కానీ పరోక్షంగా మా దేశాన్ని ఆధిపత్యం చెలాయించేందకు యతి్నస్తే చూస్తూ ఊరుకోం’’ అని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అనూహ్య ఘటనతో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదులాల్హ్ను తన కార్యాలయానికి తక్షణం రావాలంటూ ఆయనకు భారతవిదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. ఆఫీస్కు వచ్చిన రియాజ్పై మోదీ సర్కార్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ‘‘ ఇటీవలకాలంలో బంగ్లాదేశ్లో భద్రతా పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. భారత వ్యతిరేక పుకార్లు షికార్లుచేస్తున్నాయి. ఈ తప్పుడు కథనాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. బెదిరింపుల వంటి ఘటనలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, పత్రాలనూ మాతో పంచుకోవట్లేదు’’ అని ఆయనతో కేంద్రప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తంచేసింది. భారత వీసా కేంద్రం మూసివేత పరిస్థితులు అదుపు తప్పొచ్చనే అంచనాతో ముందస్తు చర్యగా ఢాకాలోని భారత వీసా జారీ కేంద్రాన్ని మోదీ సర్కార్ మూసేసింది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్లో ఈ ‘ది ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్(ఐవీఏసీ)’ ఉంది. ఢాకాలోని అన్ని భారతీయ వీసా సేవా సెంటర్లకు ఇదే సమీకృత కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన వీసాల దరఖాస్తుల పరిశీలనను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఐవీఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
వెనిజులాపై ట్రంప్... పూర్తిస్థాయి యుద్ధం?
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ఖాతాలో మంగళవారం ఆయన పోస్ట్ పెట్టారు. ‘వెనిజులాను అన్నివైపుల నుంచి దిగ్బంధించాం. కనీవినీ ఎరగనంతటి సంఖ్యలో సైన్యం ఆ దేశాన్ని చుట్టుముట్టనుంది. వెనిజులా చమురు విక్రయ సొమ్మంతా అమెరికాలోకి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటివాటికే ఉపయోగపడుతోంది. ఇది మా దేశ భద్రతకే సవాలుగా మారింది. అందుకే ఈ దిగ్బంధం. న్యాయబద్ధంగా అమెరికాకు చెందాల్సిన వెనిజులాలోని అపార చమురు నిల్వలు, భూములు, ఆస్తులు అన్నింటినీ మాకు అప్పగించేదాకా వదలం’ అని స్పష్టం చేశారు. గత నెలలో కూడా వెనిజులా తీర సమీపంలో ఆ దేశ చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ట్రంప్ తీరుపై వెనిజులా మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంలోని ఆస్తులు, చమురు క్షేత్రాలు తమావేవని అంటారా? అంతర్జాతీయ చట్టాలను, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను ట్రంప్ తుంగలో తొక్కుతున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ అసలు ఉద్దేశం డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడి కాదని స్వయానా ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ స్పష్టం చేశారు. మాట వినని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమేనని ఆయన అసలు లక్ష్యమని కుండబద్దలు కొట్టారు! ఈ మేరకు వానిటీ ఫెయిర్ వైల్స్కు ఇచ్చిన సంచలనాత్మక ఇంటర్వ్యూ మంగళవారం ప్రచురితమైంది. మదురో కాళ్ళబేరానికి వచ్చి తప్పుకునేదాకా వెనిజులా చమురు నౌకలను పేల్చేస్తూనే ఉంటామని కూడా ఆయన స్పష్టం చేయడం విశేషం! వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వకున్న విషయం తెలిసిందే. ఆ దేశం ఏకంగా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థకు చమురు ఆదాయమే జీవనాడి. -
బెడ్ మీదే బేడీలు !
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ప్రముఖ బాండీ బీచ్ సమీప ఆర్చర్ పార్క్లోని యూదులపై విచక్షణా రహితంగా రైఫిళ్లతో కాల్పులు జరిపి పలువురిని పొట్టనబెట్టుకున్న 24 ఏళ్ల నవీద్ అక్రమ్ను పోలీసులు ఆస్పత్రిలోనే అరెస్ట్చేశారు. బీచ్లో ఇష్టారీతిగా కాల్పులు జరుపుతున్న నవీద్పైకి భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడటంతో అతన్ని సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యపరిస్థితి విషమించి తర్వాత నవీద్ కోమాలోకి వెళ్లాడు. కోమాలో ఉన్న నవీద్ బుధవారం కళ్లు తెరచి కోలుకోగానే ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మందిని చంపినందుకు 15 నేరాలు, ఉగ్రవాద చర్యతో పలువురిని పొట్టనబెట్టుకోవడం, పలువురిని గాయపర్చడం, అక్రమంగా ఆయుధాలు కల్గి ఉండటం, దుర్వినియోగపర్చడం, ఒక భవంతి సమీపంలో బాంబు అమర్చడం, కారులో పేలుడు పదార్థాలను పెట్టడం వంటి అంశాలపై మరో 40కిపైగా నేరాలను ఆ కేసులో పేర్కొన్నారు. నవీద్ కారులో ఇప్పటికే ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండాలను పోలీసులు గుర్తించడంతో అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాల నేరాన్ని సైతం కేసుకు జతచేశారు. మొత్తంగా 59 నేరాలు చేసినట్లుగా అతనిపై కేసు నమోదుచేశారు. వెలుగులోకి మరో జంట సాహసం50 ఏళ్ల ఉగ్రవాది సాజిద్, అతని కుమారుడు నవీద్ సమీప పార్క్ పాదచారుల వంతెన వద్ద కాల్పులతో తెగబడుతున్నప్పుడు వారిని అడ్డుకునేందుకు ఒక వృద్ధజంట ప్రయత్నించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరిస్, సోఫియా గుర్మాన్ అనే వృద్ధ జంట అటుగా వెళ్తున్నప్పుడే ఈ తండ్రీకొడుకులు కాల్పులు మొదలెట్టినట్లు తెలుస్తోంది. వెంటనే వీళ్లను అడ్డుకునేందుకు బోరిస్, సోఫియా విశ్వప్రయత్నంచేశారు. షూటర్ల చేతుల్లోని రైఫిళ్లను లాక్కునే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ కిందపడ్డారు. రైఫిల్ మాత్రం షూటర్ చేతుల్లోనే ఉండిపోయింది. దీంతో షూటర్ జరిపిన కాల్పులకు దంపతులిద్దరూ నేలకొరి వీరమరణం పొందారని ఆస్ట్రేలియా మీడియా వారిని సాహసోపేత చర్యను పొగిడింది. పలువురిని కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన దంపతులను కీర్తిస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు లక్షలాదిగా పోస్ట్లు పెడుతున్నారు. షూటర్ల మీదకు ఇటుకలు విసిరి, గాయపరిచేందుకు ప్రయత్నించిన 60 ఏళ్ల తన తండ్రి రీవెన్ మోరిస్ సైతం ప్రాణాలు కోల్పోయారని కూతురు వెల్లడించారు. -
ఒమన్ పర్యటన షురూ
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ ఉప ప్రధానమంత్రి సయీద్ షిహాబ్ బిన్ తారిఖ్ అలీ సైద్తో సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ ఇథియోపియా నుంచి బుధవారం ఒమన్కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఉప ప్రధానమంత్రి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మోదీ గురువారం ఒమన్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన పర్యటనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు మోదీ ఒమన్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి. భారత్–ఒమన్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఒమన్లోని మస్కట్లో తాను బస చేసే హోటల్కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేశారు. భారతీయ కళాకారులు సైతం సాంస్కృతి కార్యక్రమాలు ప్రదర్శించారు. అలాగే భారత్–ఒమన్ సంబంధాలను ప్రతిబింబించే ఎగ్జిబిషన్ను తిలకించారు. ఒమన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ గత శుక్రవారమే ఆమోదించింది. దీనిపై 2023 నవంబర్లో చర్చలు మొదల య్యాయి. ఈ ఏడాది విజయవంతంగా ముగి శాయి. ఒప్పందంపై సంతకాలు జరిగితే రెండు దేశాల వాణిజ్య సంబంధాల్లో నూతన ఆధ్యాయం ప్రారంభమైనట్లేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మోదీ ఒమన్ సుల్తాన్తో భేటీ కాబోతున్నారు. వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై వారు చర్చించనున్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. -
మనది సహజ భాగస్వామ్యం
అడిస్ అబాబా: ప్రాంతీయ శాంతి, భద్రత, అనుసంధానంలో భారత్, ఇథియోపియాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ శాంతి, సమానత్వం, ప్రగతి కోసం రెండు దేశాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని ఉద్ఘాటించారు. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం మంగళవారం ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోదీ బుధవారం దేశ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ‘తేనా ఇస్టిలిన్ సలామ్’ అంటూ స్థానిక భాషలో ఎంపీలకు అభివాదం చేశారు. సింహాల గడ్డగా ప్రసిద్ధి చెందిన ఇథియోపియాలో అడుగుపెట్టడం అద్భుతంగా ఉందన్నారు. ఇక్కడికి వస్తే సొంత ఇంటికి వచ్చినట్లే ఉంటుందని, తన సొంత రాష్ట్రం గుజరాత్ కూడా సింహాలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ప్రధానమంత్రి హోదాలో మోదీ ప్రసంగించిన విదేశీ పార్లమెంట్లలో ఇది 18వ పార్లమెంట్ కావడం విశేషం. ఆయన మాట్లాడుతుండగా ఇథియోపియా ఎంపీలు 50 సార్లకుపైగా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తంచేశారు. శుభాకాంక్షలు మోసుకొచ్చా.. ‘‘ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా కీలక స్థానంలో ఉంది. హిందూ మహాసముద్రంలో భారత్ హృదయ స్థానంలో నిలిచింది. ఇరుదేశాలు సహజ భాగస్వామ్య దేశాలు. ఈ ఏడాది కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందంతో పరస్పర భద్రత పట్ల అంకితభావం మరింత బలపడింది. భారత్, ఇథియోపియాలు ఒక కుటుంబంగా కలిసి ఉంటున్నాయి. ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకోవడంతోపాటు ప్రపంచ సౌభాగ్యం కోసం కృషి చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్కు అండగా నిలిచినందుకు ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉగ్రవాదంపై అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశాలయంలో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 140 కోట్ల మంది భారతీయుల తరఫున శుభాకాంక్షలు మోసుకొచ్చా. జన్మభూమి మన కన్నతల్లి ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో ఇథియోపియా కూడా ఒకటి. ఇది పాత, కొత్తల సమ్మేళనం. ఇక్కడ ప్రాచీన విజ్ఞానం, ఆధునిక ఆకాంక్షల మధ్య సమతూకం కనిపిస్తోంది. ఇదే ఇథియోపియా అసలైన బలం. భారతదేశ నాగరికత అత్యంత ప్రాచీనమైనది. పూర్తి ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులోకి అడుగులు వేస్తోంది. భారత జాతీయ గీతం, ఇథియోపియా జాతీయ గేయం ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. జన్మభూమిని కన్నతల్లిగా సంబోధిస్తున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు, జన్మభూమిని కాపాడుకొనే విషయంలో అవే మనకు స్ఫూర్తిదాయకం. ఇథియోపియా అభివృద్ధిలో వేలాది మంది భారతీయ ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనం పరస్పరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వ్యవసాయమే మనకు వెన్నుముక. మెరుగైన విత్తనాలు, సాగునీటి సరఫరా విధానాలు, భూమిలో సారం పెంచడంపై మనం దృష్టి పెట్టాలి. కలిసికట్టుగా పనిచేయాలి.ప్రజాస్వామ్యం జీవన విధానం ఇథియోపియాలోని కీలక రంగాల్లో భారతీయ కంపెనీలు 5 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టాయి. దీంతో స్థానికంగా 75 వేల ఉద్యోగాల సృష్టి జరిగింది. మన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఆ దశగానే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించాం. దీనివల్ల టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, మైనింగ్, క్లీన్ ఎనర్జీ, ఆహార భద్రత వంటి రంగాల్లో రెండుదేశాల బంధం బలపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుంది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో మేము సాధించిన నైపుణ్యాలు, అనుభవాన్ని ఇథియోపియాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్, ఇథియోపియాలు నిఖార్సెన ప్రజాస్వామ్య దేశాలు. ప్రజాస్వామ్యం మన జీవన విధానం. ఇదొక ప్రయాణం. తేనీరు అంటే నాకు ఇష్టం. ఇథియోపియన్ కాఫీ, ఇండియన్ టీ తరహాలోనే మన స్నేహం చక్కటి పరిమళాలు వెదజల్లుతోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ఇథియోపియా ఎంపీలు మోదీకి ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. పలువురు మంత్రులు, ఎంపీలతో మోదీ మాట్లాడారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఇథియోపియా పార్లమెంట్ ప్రాంగణంలో మొక్క నాటారు. మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ఇథియోపియా ప్రభుత్వం భారత ప్రధాని మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిశాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రదానం చేసింది. ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి విదేశీ నాయకుడు మోదీ కావడం గమనార్హం. ఆయనను ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాయి. మంత్రముగ్ధులను చేసిన ‘వందేమాతరం’ ప్రధాని మోదీ గౌరవార్థం ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముగ్గురు ఇథియోపియా గాయకులు భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ను శ్రుతిబద్ధంగా ఆలపించారు. ప్రధాని మోదీ సహా భారత ప్రతినిధులు ముగ్ధులయ్యారు. చప్పట్లతో అభినందించారు. ఇథియోపియా గాయకుల ఆలాపన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసిస్తూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సంబంధిత వీడియోను సైతం షేర్ చేశారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సమయంలోనే ఈ గీతాన్ని ఇథియోపియా గాయకుల నోటి వెంట వినడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
అమెరికాలోకి రాకుండా మరో 20 దేశాలపై నిషేధం
వాషింగ్టన్: అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు. బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఈ దేశాలకు అమెరికా చట్టంపై గౌరవం లేదు. తన పౌరుల గురించిన సమగ్ర సమాచారం పొందుపరచడంలో అమెరికా నిఘా, భద్రతా, ఇమ్మిగ్రేషన్ విభాగాలకు అందించడంలో తరచూ విఫలమవుతున్నాయి‘ అని తెలిపారు. పాలస్తీనా అథారిటీ తాలూకు పత్రాలున్న వారి ప్రవేశాన్ని నిషేధించారు. వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పలు ఉగ్ర మూకలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అమెరికా పౌరులను పొట్టన పెట్టుకున్నాయి. అందుకే ఈ చర్య’ అని వైట్ హౌస్ పేర్కొంది. వాటిపై కొనసాగింపు అఫ్గానిస్తాన్, బర్మా సహా 12 దేశాలపై ఇటీవలే అమెరికా నిషేధం విధించడం తెలిసిందే. అది ఇకముందు కూడా కొనసాగనుంది. గత నెలలో ఒక అఫ్గాన్ దేశస్తుడు వాషింగ్టన్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిని కాల్చి చంపడం తెలిసిందే. ఆ నేపథ్యంలో అఫ్గాన్తో పాటు ఇలా పలు మూడో ప్రపంచ దేశాలపై అమెరికా కఠిన నిషేధాలు విధిస్తూ వస్తోంది. -
బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇకపై OTP అవసరం లేదు..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో (UAE) బ్యాంకింగ్ లావాదేవీలు ఇకపై మరింత సురక్షితం కానున్నాయి. SMS ద్వారా వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) విధానాన్ని దశలవారీగా రద్దు చేసి, బ్యాంక్ మొబైల్ యాప్లోనే నేరుగా అనుమతి ఇచ్చే స్మార్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో ఆన్లైన్ కొనుగోళ్ల సమయంలో OTP బదులు బ్యాంక్ యాప్లో పుష్ నోటిఫికేషన్ వస్తుంది.వినియోగదారులు యాప్లో లాగిన్ చేసి బయోమెట్రిక్ లేదా స్మార్ట్ పాస్ పిన్ ద్వారా లావాదేవీకి అనుమతి ఇవ్వాలి. యాప్లోనే వెరిఫికేషన్ జరుగుతుండటంతో ఫిషింగ్, సిమ్ స్వాప్ వంటి మోసాలు నివారించబడతాయి. ఎమిరేట్స్ NBD సహా ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే ఈ మార్పు ప్రారంభించాయి. కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే..?కార్డ్ వివరాలు ఇచ్చిన వెంటనే యాప్లో లాగిన్ చేయమని సందేశం వస్తుంది. యాక్టివిటీస్ విభాగంలో లావాదేవీ వివరాలు చూసి, రెండు నిమిషాల్లో అనుమతి ఇవ్వాలి. స్మార్ట్ పాస్ పిన్ నమోదు చేసిన వెంటనే లావాదేవీ పూర్తవుతుంది. దశలవారీగా అమలు ప్రస్తుతం కొన్ని లావాదేవీలకు మాత్రమే ఈ సిస్టమ్ అమల్లో ఉంది. 2026 మార్చి నాటికి SMS, ఈమెయిల్ OTP విధానాలు పూర్తిగా రద్దవుతాయి. అప్పటి వరకు పాత విధానం మరియు కొత్త విధానం రెండూ కలిపి కొనసాగుతాయి. కొత్త స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్తో యుఏఈలో డిజిటల్ బ్యాంకింగ్ మరింత వేగవంతం, సురక్షితం కానుంది. -
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి. -
చైనా-పాకిస్థాన్కు మధ్య చెడింది ఇక్కడే..!
‘దోస్త్ మేరా దోస్త్.. నువ్వే నా ప్రాణం’.. అంటూ ఏక కంఠంతో చెప్పిన చైనా-పాకిస్థాన్ మధ్య దోస్తీ ఇప్పుడు చెడిందా..! పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి డ్రాగన్తో కలిసే ఉన్నా.. ఇంత సడెన్గా ఎందుకు చైనా దూరమవుతోంది..? షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మాదిరిగా కలిసి ఉండే చైనా-పాకిస్థాన్లు ఇప్పుడు విడిపోవడానికి కారణాలేమిటి..? ఇంతకాలం చైనా నుంచి ఇతోధికంగా సాయం పొందిన పాకిస్థాన్.. ఉన్నఫళంగా ఎందుకు రూట్ మార్చింది..? భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జియోపాలిటిక్స్ ఇంత వేగంగా మారిపోవడానికి దోహదపడిన అంశాలేమిటి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..సిల్క్ రోడ్ మాదిరి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ను నిర్మించింది. దీని కోసం చైనా ఎన్నో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనే షీ జిన్పింగ్ కలను సాకారం చేసే దిశలో పాకిస్థాన్ సీపీఈసీకి సహకరించింది. అంతేకాదు.. పాకిస్థాన్లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేసి, తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంది. భారత్కు ధీటుగా పాకిస్థాన్ను ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంతెందుకు.. మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై గళమెత్తిన ప్రతీసారి.. చైనా రొటీన్గా ఆధారాలేవి? అంటూ ప్రశ్నించేది. అలా పాలు-నీళ్లలా చైనా-పాకిస్థాన్ బంధం కొనసాగింది. భారత్కు చెక్ పెట్టేలా ఎప్పటికప్పుడు పాకిస్థాన్కు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలను సరఫరా చేయడంలో చైనా ముందంజలో ఉండేది. అంతెందుకు.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటలాలు.. ముఖ్యంగా స్టీల్ బుల్లెట్లు కూడా చైనా సరఫరా కావడం గమనార్హం..! సంక్షోభ సమయాల్లోనూ పాక్కు చైనా వెన్నంటే ఉంది.చైనా-పాకిస్థాన్ల చైనా బంధం దశాబ్దాలుగా కొనసాగింది. పాకిస్థాన్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పాలకులు మాత్రం చైనాకు అనుకూలంగా ఉండడం రివాజుగా మారింది. చివరకు సైనిక పాలన కొనసాగినా.. సైన్యాధికారులు చైనాకు తొత్తులగానే పనిచేసేవారు. నిజానికి చైనా మతరహిత సమాజాన్ని కోరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ఫక్తుగా ఇస్లామిక్ దేశం. ఇంకా చెప్పాలంటే.. చైనాలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై మారణకాండ కొనసాగినా.. పాకిస్థాన్ మాత్రం చైనాకు వంతపాడేది.అంటే.. సిద్ధాంతపరంగా వేర్వేరు భావజాలాలున్నా.. ‘అవసరం’ అనే ఒకే ఒక్క పదం ఈ రెండు దేశాలను ఫ్రెండ్స్గా మార్చేశాయి. జియోపాలిటిక్స్ అనే రాజనీతితో ఇరుదేశాలు సఖ్యతను ప్రదర్శించాయి. బలూచిస్థాన్లో వ్యతిరేకత పెరిగినా.. పాకిస్థాన్ మాత్రం చైనా కోసం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బలూచిస్థాన్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చైనాకు కట్టబెట్టేందుకు పాకిస్థాన్ ఇప్పుడు బలూచీలపై కత్తిదూస్తోంది. వారి ఆగ్రహ జ్వాలలకు సొంత సైన్యం, పోలీసులు బలవుతున్నా.. మొండిధోరణితో ముందుకు సాగింది.పాలు-నీళ్లుగా స్నేహ బంధంలో మునిగితేలిన చైనా-పాకిస్థాన్ ఇప్పుడు ఉప్పు-నిప్పులా మారిపోతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత రక్షణశాఖ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. భారత డిఫెన్స్తోపాటు.. అఫెన్స్ కెపాసిటీకి అగ్రదేశాలు సైతం అద్దిరిపోయాయి..! అందుక్కారణం.. ఈ రెండు అంశాల్లో భారతే టాప్ అన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేశాయి. డిఫెన్స్లో తోపులమనుకునే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా కంటే.. ఎంతో ముందంజలో ఉన్నట్లు ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది.అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జే-10సీ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నా.. పాకిస్థాన్ చతికిలపడిపోయింది. అదే సమయంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాంతో.. భారత్కు చెక్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది. ఓవైపు సుంకాల భారం మోపుతూనే.. మరోవైపు పాకిస్థాన్ను పావులా వాడుకోవాలని వ్యూహాలు రచించింది. అదే సమయంలో చైనాకు పోటీగా పాకిస్థాన్లోని ఓ పోర్టును అభివృద్ధి చేసి, బలూచిస్థాన్లోని అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసింది. దాన్ని అర్థం చేసుకోకుండా.. తమకు పెద్దన్న పెద్దపీట వేస్తున్నాడనే ఉద్దేశంతో పాకిస్థాన్ ట్రంప్ను గుడ్డిగా నమ్మేసింది..!అమెరికాను బద్ధ శత్రువుగా భావించే చైనా.. ఇప్పుడు పాకిస్థాన్ నిర్ణయంతో షాక్ అయ్యింది. దాంతో.. పాకిస్థాన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. 2013 నుంచి వ్యూహాత్మకంగా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసినా.. ఇప్పుడు పాక్కు దూరంగా ఉంటోంది. అయితే.. హోర్మూజ్ జలసంధి నుంచి గ్వాదర్ పోర్టు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పోర్టు మీదుగానే వస్తుంది. అక్కడి నుంచి సీపీఈసీ ద్వారా గిల్గిట్-బాల్టిస్థాన్కు.. అక్కడి నుంచి జిన్జియాంగ్కు చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా శత్రుదేశాల యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు గ్వాదర్ పోర్టును అడ్డాగా మార్చుకోవాలని చైనా భావించింది.ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ మార్గం మీదుగానే దక్షిణాసియాకు రావాల్సి ఉంటుంది. అయితే.. పాకిస్థాన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన చైనా.. ఇప్పుడు వాటిని అప్పుగా చూపించి, వసూలు చేసుకుంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పైగా.. బలూచిస్థాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వాల్లో రోడ్లను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో లభించే అరుదైన ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. దీన్ని చైనా సహిస్తుందా??గ్వాదర్ పోర్టు నుంచి జిన్జియాంగ్ వరకు సీపీఈసీ, రైల్వేలు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన చైనా.. వాటిని ఊరికే వదిలిపెడుతుందా??? ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే..! గ్వాదర్కు సమాంతరంగా పజ్నీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలకు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే..!-హెచ్.కమలాపతిరావు 👉ఇదీ చదవండి:చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు -
బంగ్లాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
బంగ్లాదేశ్ నేతల విద్వేశపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని ఇండియా వీసా కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసేస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రవాదుల నుంచి ముంపు పొంచిఉన్న నేపథ్యంలో దేశ భద్రతకై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇండియన్ వీసా సెంటర్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేసింది. ఇటీవల బంగ్లాదేశ్కి చెందిన నేత భారత్ను విచ్ఛిన్నం చేసే వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తద్వారా సెవెన్ సిస్టర్స్ ప్రాంతం చీలిపోయే అవకాశం ఉందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఆదేశ రాయభారి రియాజ్ హమీదుల్లాకి సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి శాంతి భద్రతల సమస్య పొంచిఉన్న నేపథ్యంలో ఆ బంగ్లాదేశీయులకు భారత వీసా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.అసలేం జరిగింది.బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నారు. అయితే ఆమెకు వివిధ కేసుల్లో మరణశిక్షతో పాటు 21 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ షేక్ హసీనాను ఆదేశానికి అప్పగించాలని భారత్ను కోరింది. ఈవిషయంపై ఇండియా ఇంకా స్పందించలేదు. ఇంతలోనే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్పై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. భారత్కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్లో ఆశ్రయం కల్పిస్తామని దాని వల్ల భారత్నుంచి ఈశాన్య ప్రాంతం సెవెన్సిస్టర్స్ వేరయ్యే అవకాశం ఉందన హెచ్చరించారు. దీనిపై సీరియస్ అయిన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హైకమిషనర్ని వివరణ కోరింది. తాజాగా బంగ్లాదేశీయులకు భారత వీసాను నిలిపివేసింది. -
ట్రంప్తో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ భేటీ?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. గాజాలో శాంతిస్థాపనకు ముస్లిం దేశాలు అక్కడ సైనిక దళాలలను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మునీర్ ఆవిషయమై యుఎస్ అధ్యక్షుడితో చర్చించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం పాకిస్థాన్-అమెరికా మధ్య సంబంధాలు బలీయంగా ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్లతో ఇటీవల తరచుగా భేటీలు జరుపుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ట్రంప్ ఎఫ్-16 యుద్ధవిమానాల అప్గ్రేడ్ కోసం పాకిస్థాన్కు ప్రత్యేక ప్యాకేజ్ మంజూరు చేశారు. ఈ చర్య భారత్ను కలవరపాటుకు గురిచేసింది. అనంతరం కూడా భారత్పై పలు రకాల ఆంక్షలు విధించి అదే సమయంలో పాకిస్థాన్కు దగ్గరయ్యే యత్నం ట్రంప్ చేశారు.కాగా ఇటీవల గాజాలో శాంతిస్థాపన కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ముస్లిం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు తమ దేశ సైనిక దళాలను గాజాలో మెుహరించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయమై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పాకిస్థాన్లో వ్యతిరేకత ఎదురవుతుంది. అక్కడి ప్రజలు ఆదేశ సైనికులను గాజా పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఒకవేళ ఈ డీల్కు అంగీకరిస్తే సొంత దేశంలో వ్యతిరేకత, అంగీకరించకుంటే అమెరికా అధ్యక్షుడి ఆగ్రహాం మెుత్తానికి ఆసిమ్ మునీర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన ఉంది. ఈ డీల్కు టర్కీ, ఈజిప్టు, జోర్దాన్ దేశాలు మద్దుతిస్తున్నాయి. ఇరాన్ మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఆ విషయమై గత నెలలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. గాజాలో సైనిక దళాల మెుహరింపు విషయం ఆలోచిస్తామన్నారు. అయితే హామాస్ని నిరాయుధీకరించడం తమ పని కాదన్నారు. -
తండ్రిని హత్య చేసిన ఎన్ఆర్ఐ, ట్విస్ట్ ఏంటంటే..!
ఇల్లినాయిస్లోని షామ్బర్గ్లో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి, 67 ఏళ్ల వృద్ధ తండ్రిని సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. థాంక్స్ గివింగ్ వారాంతంలో తండ్రిని చంపినట్లు ఆరోపణలపై అభిజిత్ పటేల్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఫస్ట్-డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ల ప్రకారం బాధితుడు అనుపమ్ పటేల్ డయాబెటిస్తో బాధపడుతున్నకారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. నవంబర్ 29న కుమారుడు చేతిలో హత్యకు గురయ్యాడు.కేసు ఏంటీ అంటేఅనుపమ్ పటేల్ భార్య ఉదయం డ్యూటీకి వెళ్లిపోయింది. తండ్రీ కొడుకులిద్దరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల తన బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి భార్యకు ఫోన్ చేయడం అలవాటు. పైగా అతని గ్లూకోజ్ మానిటర్ భార్య ఫోన్కు కనెక్ట్ అయ్యి ఉంది. హత్య జరిగిన రోజు భర్త నుంచి ఫోన్ రాకపోవడం, అతని గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం గమనించింది. ఫోన్లో వారితో సంప్రదించాలని ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో ఆందోళన ఇంటికి పరుగు తీసింది. ఎదురుగా కనిపించిన కొడుకు నాన్న బాగానే ఉన్నాడులే అని చెప్పాడు. ఏదో అనుమానం వచ్చి తల్లి చెక్ చేయగా, మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి హతాశురాలైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారి సాయంతో భర్తను ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఒక పెద్ద సుత్తిని గుర్తించారు పోలీసులు. అనుపమ్ పటేల్ తలకు తీవ్ర గాయాలు, పుర్రె, ముక్కు ఎముక విరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. మరోవైపు నిందితుడు అభిజిత్ పటేల్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ సమయంలో, చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధించాడని, అందుకే చంపేశానని, ఇది తన డ్యూటీని అని చెప్పుకొచ్చాడు. అయితే స్కిజోఫ్రీనియా బాధితుడైన అభిజిత్, గతంలో చికిత్స కోసం గతంలో ఆసుపత్రిలో చేరినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీంతో అభిజిత్ ఆరోపణలన్నీ భ్రమలు కావచ్చని పోలీసుల అంచనా. దీనికి తోడు గతంలో చాలా సార్లు తండ్రిని చంపేస్తానని బెదరించేవాడట. దీంతో అభిజిత్ తండ్రిని సంప్రదించకుండా చట్టబద్ధంగా నిషేధం 2027 జనవరి వరకు అమల్లో ఉంది. అయితే అతని తల్లిదండ్రులు ఇంట్లో నివసించడానికి అనుమతించారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అభిజిత్ పటేల్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనాయి. అంతేకాదు తల్లిని సంప్రదించకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.చదవండి: భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే..వాళ్లు బతికిపోయారురణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్ పరిస్థితి విషమం -
ఢిల్లీ వాయు కాలుష్యం.. చైనా కీలక ప్రకటన
ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్ర ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం పరిమితికి మించి ఉండడంతో ప్రభుత్వం సైతం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో చైనా, భారత్కు ఒక ఆఫర్ ఇచ్చింది. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెలకువలు పాటించాలని తెలిపింది. వాటిని ఒక్కొక్కటిగా వివరిస్తూ బీజింగ్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.ఢిల్లీ వాయుకాలుష్యం రోజురోజుకి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. గాలికాలుష్యం నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఢిల్లీలో పనిచేసే అన్ని సంస్థలకు 50శాతం వర్క్ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆంక్షలతో పనులు చేయలేకపోతున్న నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వం రూ. 10 వేలు పరిహారం అందిస్తుంది. అయినప్పటికీ గాలి నాణ్యత మెరుగవుతుందన్న ఆశలు పూర్తిస్తాయిలో లేవు.ఈ విషయమై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి సైతం తొమ్మిది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించలేమని అది సాధ్యమయ్యే ప్రక్రియ కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా ఢిల్లీకి ఒక సజేషన్ ఇచ్చింది ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్లో కూడా తీవ్రమైన వాయుకాలుష్యం ఉండేదని అయితే తగిన చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఆపరిస్థితులు మారాయని తెలిపింది.ప్రస్తుతం చైనా-భారత్ రెండు దేశాలు పట్టణీకరణ కారణంగా విపరీతమైన వాయు కాలుష్యాన్ని ఎదురుకుంటున్నాయని చైనా ఎంబసీ స్పోక్స్ పర్సన్ యూ జింగ్ పేర్కొన్నారు. అయితే చైనా గత దశాబ్దకాలంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు. భారత్ సైతం కొన్ని నియామాలు పాటిస్తే గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు.బీఎస్ 6 వెహికల్స్ మాత్రమే అనుమతించాలి.సర్సీస్ పూర్తి చేసుకున్న వాహనాలకు అనుమతి నిరాకరణ.కార్లపై పెరుగుదలపై ఆంక్షలు విధించాలి.వాహనాలు రోడ్డుపై రావడానికి సరిసంఖ్య, బేసిసంఖ్యలతో లాటరీ సిస్టమ్ తీయాలిమెట్రో నెటెవర్క్ను విస్తరించాలి.బస్సు సదుపాయాలని మెరుగుపరచాలి.ప్రస్తుత వాహనాలను ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చాలి.అంతేకాకుండా కాలుష్య నియంత్రణకు బీజింగ్తో కలిసి పనిచేయాలని యూ జింగ్ తెలిపారు. డిసెంబర్ 15న ఢిల్లీ, బీజింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కు సంబంధించిన చిత్రాలను ఆమె ఎక్స్లో షేర్ చేసింది. దీనిలో ఢిల్లీ AQI 447గా ఉండగా, బీజింగ్ AQI 67 గా ఉంది. అయితే భారత్ 2020 ఏప్రిల్ 1నుండే ఢిల్లీలో బీఎస్6 వాహనాల వాడకం తప్పనిసరి చేసింది. -
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..
ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. మరొకటి వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తి. వ్యూహాత్మకంగా చూస్తే ఇద్దరిదీ విడదీయరాని బంధం. కానీ, వ్యాపారం విషయానికి వస్తే మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ చర్చలు కొలిక్కి వచ్చే సమయానికి ఏదో ఒక అడ్డంకి పలకరిస్తూనే ఉంది.అమెరికా విధిస్తున్న కఠినమైన టారిఫ్ రూల్స్ ఒకవైపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ జీర్ణించుకోలేకపోవడం మరోవైపు.. ఈ రెండింటి మధ్య ట్రేడ్ డీల్ దోబూచులాడుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న పేచీ ఎక్కడ? అగ్రరాజ్యం ఆంక్షల నడుమ భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటోంది? ఈ ప్రతిష్టంభనకు గల కారణాలపై ప్రత్యేక విశ్లేషణ..టారిఫ్ యుద్ధం.. అమెరికా అభ్యంతరంభారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు కలిగిన మార్కెట్లలో ఒకటి అని అమెరికా వాదిస్తుంది. ముఖ్యంగా హార్లే డేవిడ్సన్ వంటి బైకులు, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నులను తగ్గించాలని కోరుతోంది.భారత్ వాదనభారత్ తన దేశీయ పరిశ్రమలను (Make in India) కాపాడుకోవడానికి ఈ పన్నులు అవసరమని చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో భారత్ను ‘టారిఫ్ కింగ్’ అని పిలవడం, ప్రస్తుతం మళ్లీ అధికారం చేపట్టాక అదే ధోరణి కొనసాగుతోంది.రష్యా నుంచి చమురు కొనుగోళ్లుఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇది అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులకు నచ్చలేదు. రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని అమెరికా భావిస్తుండగా భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ(వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి) వైఖరిని స్పష్టం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ భేదాభిప్రాయాలు వాణిజ్య చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) హోదాగతంలో అమెరికా భారత్కు జీఎస్పీ హోదా ఇచ్చేది. దీని ద్వారా కొన్ని భారతీయ ఉత్పత్తులు సుంకం లేకుండానే అమెరికాలోకి ప్రవేశించేవి. ట్రంప్ మొదటి హయాంలో ఈ హోదాను రద్దు చేశారు. దీన్ని పునరుద్ధరించాలని భారత్ పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం భారత మార్కెట్లలో తమ డెయిరీ, మెడికల్ డివైజ్లకు(Stents etc..) మరింత వెసులుబాటు ఇస్తేనే ఆలోచిస్తామని అంటోంది.డేటా గోప్యత, ఈ-కామర్స్ విధానాలుఅమెరికన్ దిగ్గజాలైన అమెజాన్, వాల్మార్ట్ (ఫ్లిప్కార్ట్), గూగుల్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. భారత్ తీసుకొస్తున్న డేటా లోకలైజేషన్(భారతీయ వినియోగదారుల సమాచారం ఇక్కడే ఉండాలి), ఈ-కామర్స్ నిబంధనలు అమెరికాకు ఇబ్బందికరంగా మారాయి. తమ కంపెనీలకు భారత్ ‘లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’(పోటీలో ఉన్న అందరికీ సమాన అవకాశాలు కల్పించడం) కల్పించడం లేదని అమెరికా వాణిజ్య శాఖ తరచుగా ఆరోపిస్తోంది.ఫార్మా రంగంలో..అమెరికన్ ఫార్మా కంపెనీలు తమ మందుల పేటెంట్ హక్కుల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ ధరకే జనరిక్ మందులను ఉత్పత్తి చేసే భారత విధానం తమ లాభాలను దెబ్బతీస్తోందని వారి వాదన.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్తో ట్రేడ్ డీల్ను వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, ట్రంప్ శైలిని పరిశీలిస్తే దీని వెనుక ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.ప్రతికార సుంకాలుభారత్ అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తుందో, అమెరికా కూడా భారత వస్తువులపై అంతే పన్ను విధించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దాంతో 2025 ఆగస్టులో భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25% రెసిప్రోకల్ సుంకాన్ని విధించింది. భారత్ తన వైపు నుంచి పన్నులు తగ్గించే వరకు ఈ డీల్పై సంతకం చేయకూడదనేది ఆయన ఉద్దేశం.క్రూడాయిల్.. ఎస్-400 పేచీఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాలను (S-400 వంటివి) కొనుగోలు చేయడం ట్రంప్నకు నచ్చడంలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు భారత్పై అదనంగా మరో 25% పెనాల్టీ సుంకాన్ని విధించారు. అంటే ప్రస్తుతం కొన్ని భారతీయ ఉత్పత్తులపై మొత్తం 50% సుంకం అమలవుతోంది. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి ఈ డీల్ను ఒక ఆయుధంగా వాడుతున్నారు.అమెరికా రైతుల ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల భారతీయ బియ్యం ఎగుమతులపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. దీంతో చర్చలు నిలిచిపోయాయి.వ్యక్తిగత ప్రతిష్ఠ, మధ్యవర్తిత్వంకొన్ని విశ్లేషణల ప్రకారం (ఉదాహరణకు: జెఫరీస్ గ్రూప్ నివేదిక), భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కానీ భారత్ దాన్ని సున్నితంగా తిరస్కరించడం ఆయనకు నచ్చలేదని, ఆ అసహనం కూడా వాణిజ్య చర్చల జాప్యానికి ఒక కారణమని భావిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులకు (MAGA - Make America Great Again) తాను ఇతర దేశాలతో వాణిజ్యం పరంగా ఒక కఠినమైన బేరసారాలాడే వ్యక్తి(Tough Negotiator) అని నిరూపించుకోవాలి. భారత్తో అరకొర ఒప్పందం చేసుకుంటే అది తన రాజకీయ ఇమేజ్కు దెబ్బని ఆయన భావిస్తున్నారు. భారత్ నుంచి భారీగా రాయితీలు పొందితేనే అది తనకు రాజకీయంగా విజయం అని ఆయన నమ్ముతున్నారు.ప్రస్తుత పరిస్థితిఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా ఆగిపోలేదు. ఇటీవల కూడా అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్లో పర్యటించింది. అమెరికా పట్టుబడుతున్న మొక్కజొన్న (Corn), సోయా వంటి ఉత్పత్తులను భారత్లోకి అనుమతించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరు దేశాలు ఈ విషయంలో ఒక అంగీకారానికి వస్తే 2026 ప్రారంభంలో ఈ సుంకాలు తగ్గే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే.. -
ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం!
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్.. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం కానుందా?.. మిగిలిన జీవిత కాలం ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా??.. పీటీఐ వర్గాలు, ఖాన్ కుటుంబ సభ్యుల ఆందోళలను హెష్బాజ్ షరీఫ్ ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందా?.. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను అసలు పట్టించుకోవడం లేదా?..‘మా తండ్రిని మళ్లీ చూడలేమేమో’.. అంటూ ఇమ్రాన్ ఖాన్ తనయులు చెబుతున్న ఈ మాట పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా సంస్థ స్కై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ ఇద్దరు కొడుకులిద్దరూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఖాసిమ్ ఖాన్.. మా తండ్రికి(ఇమ్రాన్ ఖాన్ను ఉద్దేశించి..) రెండేళ్లుగా ఇతరులతో సంబంధాలు లేకుండా చేశారు. ఒక సెల్లో ఒంటరిగా బంధించారు. తాగడానికి ఆయనకు మురికి నీరు ఇస్తున్నారు. ఆయన చుట్టూ హెపటైటిస్తో బాధపడుతున్న ఖైదీలు ఉన్నారు అని అన్నాడు.మరో కొడుకు సులేమాన్ ఇసా ఖాన్ తన తండ్రి ఉంది డెత్ సెల్లో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైల్లో ఆయనతో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు పెట్టారు. చివరకు జైలు గార్డులు కూడా ఆయన్ని పలకరించడానికి వీల్లేదు. పాక్ ప్రభుత్వం ఆయన విషయంలో సైకాలజికల్ టార్చర్ స్ట్రాటజీ అవలంభిస్తోంది అని ఆరోపించారు. పరిస్థితి పోనుపోను మరింత కఠినంగా మారుతోంది. ఆశను నిలుపుకోవడం కష్టమవుతోంది. ఇక ఆయనను మళ్లీ చూడలేమేమోనని భయపడుతున్నాం అని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా తాము తండ్రిని కలవలేకపోయామని.. జనవరిలో తాము ఇస్లామాబాద్ వెళ్తామని.. ఎలాగైనా ఆయన్ని కలిసి తీరతామని అంటున్నారు. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడిపించేందుకు పీటీఐ పోరాటం చేస్తోంది. ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖానుం, నూరీన్ ఖాన్ నియాజీ ఆ నిరసనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ దేశాల అధినేతలకు, ప్రముఖులకు ఇమ్రాన్ ఖాన్ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో.. ఇమ్రాన్ ఖాన్పై దేశ ద్రోహం పెట్టాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కుట్ర ఉందనేది ఖాన్ కుటుంబం చెబుతున్న మాట. ఈ పరిణామాల నడుమ.. ఖాన్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.ఇమ్రాన్ ఖాన్ విడుదల డిమాండ్తో పాటు పీటీఐ కార్యాలయాల మూసివేత.. కీలక నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. రావల్పిండిలోని ఆడియాలా జైలు సమీపంలోని ఫ్యాక్టరీ నాకా వద్ద ఈ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే షెహబాజ్ ప్రభుత్వం రావల్పిండిలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించుకోకుండా కఠిన ఆంక్షలు విధించింది. అయితే.. ఆ ఆంక్షలను అణచివేతగా పేర్కొంటూ ఖాన్ సోదరీమణులు స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొనబోతున్నారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 840 అనే రాతలు(ఖాన్కు కేటాయించిన ఖైదీ నెంబర్) కనిపిస్తున్నాయి.నాటి నుంచి.. పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు. ఆ మరుసటి ఏడాది.. తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) మార్చి 24న వారానికి రెండు సార్లు (మంగళవారం, గురువారం) సందర్శకులను అనుమతించాలని ఆదేశించింది. అయితే PTI ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపిస్తోంది.జైల్లో ఉన్నప్పటికీ ములాఖత్ల ద్వారా ఇమ్రాన్ ఖాన్ సందేశాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గీయులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆర్మీ చీఫ్ అసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశాక.. ఆయన నుంచి ఎలాంటి చప్పుడు లేదు.ములాఖత్లకు అడియాలా జైలు అధికారులు అనుమతించకపోవడమే అందుకు కారణంగా తెలిసింది. అయితే జైల్లో ఆయన భద్రంగానే ఉన్నారా?.. సజీవంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అనే అనుమానాలతో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ పరిణామాల నడుమ ఖాన్ సోదరీమణికి 20 నిమిషాల ములాఖత్కు అవకాశం దక్కింది. ఆ సమయంలో ఆయన జైల్లో మానసికంగా కుంగిపోయి ఉన్నారని అన్నారామె. అయితే అటుపైనా ములాఖత్లకు పోలీసుల ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో పీటీఐ కార్యకర్తలు జైల్లోకి దూసుకెళ్లే ప్రయత్నంగా చేయగా.. వాటర్ కెనన్లతో చెదరగొట్టారు.భారత్ రియాక్షన్ ఇదే..ఇమ్రాన్ ఖాన్ జైలు నిర్బంధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక ఒంటరి నిర్బంధంలో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐక్యరాజ్య సమితి.. పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే ప్రనయత్నంలో ఉంది. పాక్ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారే అవకాశం లేకపోలేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యంతో పాటు యూరప్ దేశాలు న్యాయమైన విచారణ జరగాలని, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై ఇంతదాకా ఎక్కడా స్పందించలేదు. కానీ, అది పాక్ రాజకీయ సంక్షోభంగా మాత్రం భావిస్తోంది. ఇక గల్ప్ దేశాలు ప్రత్యక్షంగా స్పందించకపోయినప్పటికీ.. అక్కడి ప్రవాస పాకిస్తానీలు మాత్రం #FreeImranKhan పేరిట నిరసనలు చేపడుతున్నారు. ఖాన్ కొడుకులు లండన్లో..ఇమ్రాన్ ఖాన్కు ఇప్పటిదాకా మూడుసార్లు వివాహం జరిగింది. మొదటి భార్య జెమీమా గోల్డ్స్మిత్ బ్రిటిష్ జర్నలిస్గ్. 1995లో వీళ్ల వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. అయితే.. 2004లో విడాకులు తీసుకున్నాక ఆమె పిల్లలతో లండన్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెహామ్ను ఖాన్ 2015 వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహ బంధం ఎన్నో రోజులు నిలవలేదు. 2018లో బుష్రా బీబీ (బుష్రా మానేకా)ను వివాహం చేసుకున్నారు. అయితే.. అవినీతి ఆరోపణల్లో ఖాన్తో పాటు అరెస్ట్ అయిన ఆమె అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
ఆమెకు 39, అతనికి 47 : ప్రియురాలితో ఎంగేజ్మెంట్ వీడియో వైరల్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన ప్రియురాలు, మోడల్, సామాజికవేత్త అయిన బెట్టినా ఆండర్సన్తో వైట్హౌస్ హాలిడే పార్టీలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈవిషయాన్ని వైట్హౌస్లో నిర్వహించిన ప్రీ-క్రిస్మస్ వేడుకల సందర్భంగా ట్రంప్ జూనియర్ తెలియజేశారు. ఇప్పటికే రెండు సార్లు నిశ్చితార్థం చేసుకున్న ఈయనకు ఇది మూడో నిశ్చితార్థం కావడం గమనార్హం. వేడుకలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు అనేక మంది ప్రభుత్వ అధికారులు, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.తనకు ఎస్ చెప్పిన ప్రియురాలికి 47 ఏళ్ల జూ. ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఇది అత్యంత మరపురాని వారాంతం. జీవిత ప్రేమను వివాహం చేసుకోబోతున్నాను. నేను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిని, ధన్యవాదాలు,” అంటూ 39 ఏళ్ల బెట్టీ తన సంతోషాన్ని ప్రకటించారు. బెట్టినా ఆండర్సన్ ఎవరు?బెట్టినా ఆండర్సన్ దాతృత్వవేత్తలు హ్యారీ లాయ్ ఆండర్సన్ జూనియర్, ఇంగర్ ఆండర్సన్ కుమార్తె. ఆమె పామ్ బీచ్ సామాజిక మరియు దాతృత్వ వర్గాలలో బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఆడ్రీ గ్రస్ స్థాపించిన హోప్ ఫర్ డిప్రెషన్ రీసెర్చ్ ఫౌండేషన్కు న్యాయవాది. ఫ్లోరిడాకు చెందిన పరిరక్షణ చొరవ ప్రాజెక్ట్ పారడైజ్లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పామ్ బీచ్ కౌంటీ అక్షరాస్యత కూటమితో క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా పాల్గొంటుంది.ఈ జంట దాదాపు ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నారని సమాచారం. గత నెలలో జరిగిన వ్యాపారవేత్త కుమార్తో వివాహానికి హాజరై ఉదయపూర్లో సందడి చేశారు.ట్రంప్ జూనియర్ గతంలో వెనెస్సా ట్రంప్ను వివాహం చేసుకున్నాడు. 12 ఏళ్ల తరువాత 2018లో వారి విడాకులు తీసుకున్నారు. వీరికి. ఐదుగురు పిల్లలు ఉన్నారుఈ తర్వాత, ట్రంప్ జూనియర్ 2018లో మాజీ ఫాక్స్ న్యూస్ హోస్ట్ కింబర్లీ గిల్ఫోయిల్తో డేటింగ్ ప్రారంభించాడు. 020లో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లి దాకా రాలేదు. అయితే వారి సంబంధం 2024 చివరిలో ముగిసింది. 2024లో ఆండర్సన్, జూ. ట్రంప్ బంధం వెలుగులోకి వచ్చింది. BREAKING NEWS:President Trump just announced at the White House that his son @DonaldJTrumpJr and his girlfriend Bettina Anderson are getting married! They just got engaged. Congratulations to them both. pic.twitter.com/psb38nTGla— Laura Loomer (@LauraLoomer) December 16, 2025 "> -
సింహాల గడ్డపై గర్వంగా ఉంది: ప్రధాని మోదీ
అడిస్ అబాబా: అడిస్ అబాబా: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింహాలకు నిలయమైన ఇథియోపియాలో అడుగుపెట్టడం తనకు సొంత గడ్డపై ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. తన స్వస్థలమైన గుజరాత్ కూడా ఆసియా సింహాలకు నిలయం కావడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రసంగించిన 18వ పార్లమెంటుగా ఇది రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఇథియోపియా ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రశంసించిన ఆయన, భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున ఆ దేశానికి స్నేహపూర్వక సోదరభావ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల జాతీయ గీతాలు ప్రజల్లో మాతృభూమి పట్ల గర్వాన్ని, దేశభక్తిని ప్రేరేపిస్తాయని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకు ముందు ఆయన ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులను కలుసుకున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశపు అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ జాతీయ గీతం ‘వందేమాతరం’, ఇథియోపియా జాతీయ గీతం రెండూ మాతృభూమిని తల్లిగా అభివర్ణిస్తాయని పేర్కొన్నారు. మన వారసత్వం, సంస్కృతి, ప్రకృతి అందాల పట్ల గర్వపడటమే కాకుండా, దేశాన్ని రక్షించుకునేందుకు ఈ గీతాలు మనల్ని నిరంతరం ప్రేరేపిస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.తమకు లభించిన 'గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా' పురస్కారాన్ని భారత ప్రజల తరపున ఎంతో వినయంతో స్వీకరిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతూ, చేతులు జోడించి భారత దేశ గౌరవాన్ని చాటిచెప్పారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. #FPLIVE: Indian Prime Minister Narendra Modi addresses a joint session of the Ethiopian Parliament and meets the Indian diaspora residing in the country. https://t.co/ffsFA0mtiq— Firstpost (@firstpost) December 17, 2025 -
'అయ్ బాబోయ్ ఎంత పొడుగో'..!
అత్యున్నత హోదాలో ఉండి అంతే శారీరక ధృడత్వంతో మంచి ఎత్తుతో ఉంటే..కళ్లు తిప్పుకోలేం కదూ. అబ్బా పదవికి తగ్గ ఫిజిక్ అన్న ఫీల్ కలుగుతుంది. అలాంటి అనుభవమే ఎదురైంది ఇటాలియన్ ప్రధాని మోలోనికి. ద్వైపాక్షిక సమావేశం కోసం వచ్చినప్పుడూ ఆ దేశ అధ్యక్షులు ఘనంగా ఆహ్వానం పలకడం కామన్. అలానే మొజాంబిక్ దేశ అధ్యక్షుడకి చక్కగా ఆహ్వానం పలికింది ఇటలీ దేశం . అయితే ఆ దేశ అధ్యక్షుడిని చూడగానే ఒక్కక్షణంలో ఇటలీ ప్రధాని మెలోని రియాక్షన్ మారిపోయింది. అది స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తోంది కూడా. అంతేగాదు వారిద్దరిని కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు సైతం ఇబ్బంది పడ్డారు. అసలేం జరిగిందంటే గతవాంర మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో రోమ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్కు స్వాగం పలికేందుకు వచ్చిన ఇటలీ ప్రధానికి మెలోని ఒక్కసారిగా కంగుతింటుంది. ఎందుకంటే డేనియ చాపో ఎత్తు చూసి ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా అతనికి కరచాలనం చేయడానికి కూడా తడబడుతుంది. చెప్పాలంటే ఆమె ముఖంలో ఇంత పొడుగా అని విస్తుపోతున్నట్లు హవభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె మనసులో ఏదో అనుకుంటూ ఇబ్బందిగా మొజాంబిక్ అధ్యక్షుడు చాపోకి కరచాలనం ఇవ్వడానిక వస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అంతేగాదు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లుకు సైతం ఇద్దర్నీ ఒకే ఫోటోఫ్రేంలో బంధించడం చాలా సవాలుగా మారుతుంది. ఎందుకంటే అత్యున్నత హోదాలో ఉన్నవారి శారీరక ఎత్తులలో మరి ఇంత వ్యత్యాసం కనపడుకుండా కవర్ చేసేందుకు నానాతంటాలు పడ్డారు ఫోటోగ్రాఫర్లు. కానీ అది దాదాపు అసాధ్యం.ఎందుకంటే మొజాంబిక్ అధ్యక్షుడు డేనియ్ చాపో ఎత్తు ఏకంగా 6'8 కాగా, మెలోని ఎత్త కేవలం 5'2. నెట్టంట అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు ఇటలీ మాట్టేయి ప్లాన్ ఫర్ ఆఫ్రికా శక్తి, వాణిజ్యం, సహకారం వంటి వాటిపై చర్చలు జరిపారు. కాగా, తన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 70 శాతం మెజార్టీ ఓట్లతో ఈ ఏడాది ప్రారంభంలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.Ho ricevuto oggi a Palazzo Chigi il Presidente della Repubblica del Mozambico, Daniel Francisco Chapo.In particolare il colloquio, nel ricordare il cinquantesimo anniversario dell’indipendenza mozambicana e dello stabilimento delle relazioni diplomatiche, ha confermato la… pic.twitter.com/hI8kH3pFfO— Giorgia Meloni (@GiorgiaMeloni) December 11, 2025 (చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..) -
బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ సాక్షిగా జరిగిన సామూహిక కాల్పుల ఘటన ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హనుక్కా వేడుకల కోసం వందలాది యూదు కుటుంబాలు అక్కడికి చేరిన సమయంలో తండ్రీకొడుకులైన సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) జరిపిన ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 ఏళ్ల పిల్లల నుండి 87 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో మరో 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం ఈ దారుణ ఘటనకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక డాష్క్యామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో బోరిస్, సోఫియా గుర్మాన్ అనే వృద్ధ దంపతులు ప్రాణాలకు తెగించి ఒక దుండగుని అడ్డుకోవడానికి ప్రయత్నించడం కనిపిస్తున్నది. లావెండర్ టీ-షర్ట్ ధరించిన బోరిస్, సాయుధుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, సోఫియా అతనికి తోడుగా నిలిచారు. ఈ పోరాటంలో వారు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు వారు చూపిన ధైర్యం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. New footage confirms a second hero at Bondi Beach.A man in a purple shirt charged the terrorists, disarmed one of them, and tried to stop the massacre.He and his wife paid with their lives.#bondibeach pic.twitter.com/lOG8Fo7xXv— TRIDENT (@TridentxIN) December 16, 2025ప్రాణాలకు తెగించిన పండ్ల వ్యాపారి 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ అనే పండ్ల వ్యాపారి చేసిన సాహసం అద్వితీయం. ఫుట్బ్రిడ్జిపై కాల్పులు జరుపుతున్న నిందితుడిని వెనుక నుండి పట్టుకుని, నిరాయుధుడిని చేసే క్రమంలో అహ్మద్ రెండు బుల్లెట్ గాయాలకు గురయ్యారు. కాగా ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా, అతను తుపాకీని లాక్కొని, పెను రక్తపాతాన్ని నివారించారని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆ పండ్ల వ్యాపారిని ప్రశంసించారు. ప్రస్తుతం అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రజా ఆగ్రహం.. నిందితుడిపై దాడిఈ ఊచకోత సృష్టించిన బీభత్సాన్ని చూసి అక్కడి పౌరులు ఆగ్రహంతో ఊగిపోయారు. జాకబ్ బార్న్ఫీల్డ్ అనే యువకుడు నేలపై పడి ఉన్న నిందితుడి తలపై దాడిచేసిన దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి. ‘అక్కడ పడి ఉన్న శవాలు, పిల్లల ఏడుపులు చూశాక సంయమనం కోల్పోయాను. ఏ ఆస్ట్రేలియన్ అయినా ఇదే చేసేవాడు’ అని అతను ఏమత్రం పశ్చాత్తాపం లేకుండా స్పష్టం చేశాడు.హైదరాబాద్ మూలాలు.. ఆస్ట్రేలియాలో ‘శిక్షణ’సిడ్నీ కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతానికి చెందినవాడు. 27 ఏళ్ల క్రితం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్, అక్కడ ఒక క్రైస్తవ మహిళను వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న ఇతను.. ఆస్తి వివాదాల పరిష్కారం కోసం మాత్రమే కొన్నిసార్లు హైదరాబాద్కు వచ్చి వెళ్లేవాడు. సాజిద్ కుమారుడు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. వీరిద్దరూ దాడికి ముందు ఫిలిప్పీన్స్లోని దావో నగరానికి వెళ్లి, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 28 రోజుల పాటు ఉగ్రవాద శిక్షణ పొందినట్లు దర్యాప్తులో తేలింది. సాజిద్ భారతీయ పాస్పోర్ట్పై, నవీద్ ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్పై ప్రయాణించి ఈ కుట్రను అమలు చేశారు.తీవ్రవాద భావజాలం.. నిఘా వైఫల్యం నవీద్ అక్రమ్ 18 ఏళ్ల వయస్సులోనే "అల్లాహ్ చట్టమే అన్నింటికన్నా గొప్పది" అంటూ చేసిన వీడియో ప్రసంగం అప్పట్లో కలకలం రేపింది. ఫలింగా అతను ఆస్ట్రేలియా నిఘా సంస్థల (ఏఎస్ఐఓ) జాబితాలో చేరాడు. అయినప్పటికీ సాజిద్ తన పేరు మీద స్పోర్ట్స్ క్లబ్ సాకుతో ఆరు రైఫిల్ లైసెన్సులను పొందడం, పైగా వాటిని 2023లో పునరుద్ధరించుకోవడం అనేది భద్రతా సంస్థల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. బాండీ బీచ్ దాడి సమయంలో పోలీసులు సాజిద్ను కాల్చి చంపగా, గాయపడిన నవీద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, దర్యాప్తు సంస్థల విచారణలో ఉన్నాడు. వీరిద్దరూ ఐసిస్ భావజాలానికి ప్రభావితమై, పక్కా ప్రణాళికతోనే యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఉగ్రవాద కోణంలో అధికారులు ఈ కేసును నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అండగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘శాంతి’తో సంచలనం.. ఇక భారత ‘అణు శక్తి’ ప్రైవేటీకరణ! -
ట్రంప్ ఖాతాలోకి మరికొన్ని దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం మరో ఏడు దేశాలపై నిషేధం విధించే ఉత్తర్వులపై ఆయన సంతకాలు(Trump Travel Ban) చేశారు. దీంతో.. మొత్తం 39 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించినట్లయ్యింది.ట్రంప్ తాజా సంతకంతో అమెరికాలో ప్రవేశానికి నిషేధం ఉన్న దేశాల సంఖ్యను 19 నుంచి 39కి పెరిగింది(US Travel Ban). వలస విధానాలను మరింత కఠినతరం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారని ఈ సందర్భంగా వైట్హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు దేశ భద్రతనే కారణమని చెబుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మొన్నీమధ్యే కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక నేషనల్ గార్డ్ సభ్యులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అఫ్గనిస్థాన్ నుంచి వలస వచ్చిన రహ్మానుల్లా లకన్వాల్గా నిర్ధారించారు. దీంతో.. వలసవాదులపై ట్రంప్ భగ్గుమన్నారు. తాజాగా.. పూర్తి నిషేధం విధించిన దేశాలు లావోస్, సియెర్రా లియోన్, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సూడాన్, సిరియా ఉన్నాయి. అలాగే.. తాత్కాలిక నిషేధం (భాగస్వామ్య పరిమితులు) విధించిన దేశాలు.. అంగోలా, ఆంటిగ్వా & బార్బుడా, బెనిన్, కోట్ దివ్వార్, డొమినికా, గాబోన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వేలు.పలు దేశాలపై నిషేధం మాత్రమే కాదు.. పాలస్తీనా వలసల మీద కూడా ట్రంప్ కొరడా ఝుళిపించారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన వారికి కూడా ఈ పరిమితులు వర్తించనున్నాయి. అదే సమయంలో.. తుర్కమేనిస్తాన్(మధ్య ఆసియా) పౌరులపై ఉన్న నాన్-ఇమిగ్రెంట్ వీసా నిషేధాన్ని ఎత్తివేసినా, ప్రవేశాన్ని మాత్రం నిలిపివేశారు.మినహాయింపు వీళ్లకే.. శాశ్వత నివాసితులతో పాటు ఇప్పటికే వీసా కలిగిన వాళ్లకు.. అలాగే కొన్ని ప్రత్యేక వీసా వర్గాలకు.. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన వాళ్లకు మినహాయింపు దక్కనుంది.ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వలస విధానాలను కఠినతరం చేస్తోంది. అలాగే ఆశ్రయం (అసైలం) విషయంలోనూ ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో బైడెన్ కాలంలో ఇచ్చిన వీసాలను సమీక్షించడంతో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్ల పునఃపరిశీలన వంటి చర్యలు చేపడుతోంది.ట్రంప్ పూర్తి నిషేధం విధించిన దేశాలు (Full Ban):1. ఆఫ్ఘానిస్తాన్2. బర్మా (మయన్మార్)3. చాద్4. రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో5. ఈక్వటోరియల్ గినియా6. ఎరిట్రియా7. హైటి8. ఇరాన్9. లిబియా10. సోమాలియా11. సూడాన్12. యెమెన్13. బురుండి14. క్యూబా15. లావోస్16. సియెర్రా లియోన్17. టోగో18. తుర్కమేనిస్తాన్19. వెనిజులా20. బుర్కినా ఫాసో21. మాలి22. నైజర్23. సౌత్ సూడాన్24. సిరియాభాగస్వామ్య పరిమితులు ఉన్న దేశాలు (Partial Restrictions):25. అంగోలా26. ఆంటిగ్వా & బార్బుడా27. బెనిన్28. కోట్ దివ్వార్29. డొమినికా30. గాబోన్31. గాంబియా32. మలావి33. మౌరిటేనియా34. నైజీరియా35. సెనెగల్36. టాంజానియా37. టోంగా38. జాంబియా39. జింబాబ్వేభాగస్వామ్య ప్రయాణ నిషేధం (Partial Travel Ban) అంటే.. ఒక దేశానికి చెందిన ప్రజలందరిపై పూర్తి నిషేధం కాకుండా, కొన్ని వర్గాలపై మాత్రమే పరిమితులు విధించడం. ఉదాహరణకు, పర్యాటక వీసాలు లేదంటే విద్యార్థి వీసాలు నిలిపివేయొచ్చు. కానీ వ్యాపార వీసాలు, అధికారిక వీసాలు అనుమతించొచ్చు. అలాగే సమాచారం పంచుకోవడంలో లోపాలు, భద్రతా తనిఖీలలో లోపాలు ఉన్న దేశాలపై ఈ విధమైన పరిమితులు అమలు చేస్తారు. భద్రతా కారణాల వల్ల కొన్ని వర్గాల వ్యక్తులు (ఉదా: ప్రభుత్వ అధికారులు, సైనికులు, లేదంటే నిర్దిష్ట వయసు ఉన్నవాళ్లను అమెరికాలో ప్రవేశించకుండా ఆపవచ్చు. -
ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
టెహ్రాన్: మధ్య ఇరాన్లో ఒక ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మరణించారు, పది మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సోమవారం ఆలస్యంగా ఇస్ఫాహాన్ నుండి ఈశాన్య నగరమైన మషాద్కు బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.బస్సు హైవే మధ్యలో ఉన్న సెంట్రల్ గార్డ్ రైల్ను ఢీకొని, ఎదురు లేన్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక టాక్సీని ఢీకొని బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సులోని 11 మంది ప్రయాణికులు, టాక్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. మొత్తం 13 మంది మరణించారు. -
ఆగిపోయిన కేబుల్ కారు..
శాన్ఫ్రాన్సిస్కో: నగరంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉన్న కేబుల్ కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో 15 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ప్రయాణికులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. నోబ్హిల్లోని లీవెన్వర్త్–హైడ్ వీధుల మధ్య కేబుల్ కారు సోమవారం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ సమయంలో వాహనంలో 15 మంది ఉన్నారు. కారు ఆగిపోవడంతో కుదుపుల వల్ల ప్రయాణికులు గాయపడ్డారు.శాన్ఫ్రాన్సిస్కో మున్సిపల్ ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఎమ్టీఏ) ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. కారు విండ్ïÙల్డ్ పగిలి ఉంది. ఎరవైనా బలమైన వస్తువును కారుపై విసిరేసి ఉండవచ్చని, దీంతో డ్రైవర్ హఠాత్తుగా కారును ఆపేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఈ కేబుల్ కార్లను 1870లో ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో మూడు కేబుల్ కారు లైన్లున్నాయి. ప్రయాణికుల భద్రత తమ ప్రాధాన్యతని, ప్రమాదానికి గల కారణాలను సమీక్షిస్తామని ఎస్ఎఫ్ఎమ్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. -
బీబీసీపై ట్రంప్ పరువు నష్టం దావా
వాషింగ్టన్: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. 2021లో కేపిటల్ హిల్ దాడి సమయంలో తన ప్రసంగాన్ని దురుద్దేశంతో తప్పుగా, రెచ్చగొట్టేవిధంగా బీబీసీ ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. అందుకుగాను సంస్థ 10 బిలియన్ డాలర్లు (రూ.90వేల కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోవడానికి, ప్రభావితం చేయడానికి ప్రయతి్నంచిందన్నారు. ఈ మేరకు 33 పేజీలతో మయామి ఫెడరల్ కోర్టులో దావాను వేశారు.2021 జనవరి 6న తేదీన అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో కేపిటల్ హిల్పై దాడికి ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ గంటపాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ‘కేపిటల్ హిల్కు వెళ్తున్నాం. నేనూ మీతోపాటు వస్తున్నాం. మనం పోరాడదాం’అన్నట్టుగా ఉన్న ప్రసంగాన్ని బీబీసీ ‘పనోరమ’డాక్యుమెంటరీగా ప్రసారం చేసింది. అయితే రెండు వేర్వేరు భాగాలను ఎడిట్ చేసి, కలిపి ప్రసారం చేశారని ట్రంప్ ఆరోపించారు. తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లుగా ప్రసారం చేసినందుకు బీబీసీపై దావా వేస్తున్నట్లు చెప్పారు. -
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లు
అమ్మాన్: భారత్–జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు రెట్లు వృద్ధి చెందాలని, రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్లో ఆర్థిక అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని, భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జోర్డాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ మంగళవారం రాజధాని అమ్మాన్లో జోర్డాన్ రాజు అబ్దుల్లా–2, యువరాజు అల్ హుస్సేన్తో కలిసి బిజినెస్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందని చెప్పారు. త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 140 కోట్ల మందితో కూడిన వినియోగ మార్కెట్, బలమైన తయారీ కేంద్రాలు, స్థిరమైన, పారదర్శక ప్రభుత్వ విధానాలు భారత్ సొంతమని వెల్లడించారు. ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్–జోర్డాన్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత బలపడనుందని ఉద్ఘాటించారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం కావాలని చెప్పారు. పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి ‘‘భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతానికిపైగానే వృద్ధి సాధిస్తోంది. ఉత్పత్తికి ప్రోత్సాహం ఇచ్చే పాలన, నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే విధానాల వల్ల జీడీపీ అత్యధికంగా నమోదవుతోంది. జోర్డాన్కు మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి భారత్. నేటి వ్యాపార ప్రపంచంలో అంకెలే కీలకం. కానీ, నేను అంకెలు వల్లెవేయడానికి ఇక్కడికి రాలేదు. గణాంకాలకు అతీతంగా జోర్డాన్తో దీర్ఘకాలిక, విశ్వసనీయ సంబంధాలు నిర్మించుకోవడానికి వచ్చా. ఇరుదేశాల నాగరికతల మధ్య చక్కటి సంబంధాలున్నాయి. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇండియాలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఐటీ, ఫిన్టెక్, హెల్త్టెక్, అగ్రిటెక్ రంగాలతోపాటు విభిన్న స్టార్టప్లలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగాలు ఇండియాకు ప్రధాన బలం.భౌగోళికంగా కీలక స్థానంలో జోర్డాన్కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫార్మా, వైద్య పరికరాల విషయంలో పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలకు జోర్డాన్ ఒక హబ్గా మారాలి. అలాగే వ్యవసాయం, కోల్డ్ చైన్, ఫుడ్ పార్కులు, ఎరువులు, మౌలిక సదుపాయాలు, అటోమొబైల్, హరిత రవాణా, సాంస్కృతిక పర్యాటకం వంటి రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి. పునరుత్పాదక ఇంధన వనరులు, నిర్లవణీకరణ, నీటి శుద్ధి, పునరి్వనియోగం వంటి అంశాల్లో రెండు దేశాల్లో పారిశ్రామిక వర్గాలు భాగస్వామ్యం ఏర్పర్చుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో మాట్లాడుతూ.. తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, భారత ఆర్థిక వృద్ధి ఒక్కటైతే ఇక తిరుగుండదని అన్నారు. దక్షిణాసియా, పశ్చిమాసియా మధ్య ఎకనామిక్ కారిడార్ను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అబ్దుల్లా–2తో మోదీ భేటీ ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి నిర్వహణ, డిజిటల్ మార్పు, సాంస్కృతిక సంబంధాలు సహా కీలక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు. రెండు దేశాల పౌరుల అభివృద్ధి, సౌభాగ్యానికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని మోదీ ఉద్ఘాటించారు. జోర్డాన్ పర్యటన ఫలవంతంగా సాగిందని పేర్కొన్నారు. జోర్డాన్ రాజుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అబ్దుల్లా–2, మోదీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల సంబంధాల్లో పురోగతి పట్ల హర్షం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ మంగళవారం జోర్డాన్ పర్యటన ముగించుకొని ఇథియోపియాకు చేరుకున్నారు. కారు నడుపుతూ మోదీని తీసుకెళ్లిన యువరాజు ప్రధాని మోదీ పట్ల జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా–2 ప్రత్యేకంగా గౌరవాభిమానాలు ప్రదర్శించారు. మంగళవారం తానే స్వయంగా కారు నడుపుతూ మోదీని జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లారు. భారత్–జోర్డాన్ మధ్యనున్న స్నేహ సంబంధాలను మరోసారి చాటిచెప్పారు. మహ్మద్ ప్రవక్త వంశంలో 42వ తరానికి చెందిన వారసుడు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా–2. మ్యూజియంలో జోర్డాన్ చరిత్ర, సంస్కృతిని తనకు కళ్లకు కట్టేలా వివరించినందుకు యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అల్ హుస్సేన్తో ఎన్నో అంశాలపై చర్చించానని, జోర్డాన్ ప్రగతి పట్ల ఆయన తపన ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. జోర్డాన్ మ్యూజియాన్ని 2014లో నిర్మించారు. ఇందులో ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తువులు ఉన్నాయి. -
బోండీ బీచ్ ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులకు గాయాలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన విద్యార్థుల పేర్లు వెల్లడి కాలేదు. కాగా, డిసెంబర్ 14న (ఆదివారం) సిడ్నీలోని బోండీ బీచ్కు సమీపంలో గల ఓ చిన్న పార్కులో యూదులు "హనుక్కా బైదసీ" అనే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సాయుధులు వేడుకల్లో మునిగిపోయిన యూదులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ దుర్ఘటనలో 10 ఏళ్ల బాలుడు సహా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 40 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు పోలీసు అధికారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని నవీద్ అక్రమ్గా గుర్తించగా.. మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్వేల్స్ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు పాకిస్తాన్ జాతీయులు. నవీద్కు ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఇథియోఫియాలో మోదీ.. కారు నడిపిన ప్రధాని
ప్రధాని మోదీ జోర్దాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితం ఇథియోపియా చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఎయిర్ పోర్టులో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని మూడుదేశాల పర్యటన నిమిత్తం సోమవారం జోర్దాన్ బయిలుదేరారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా చేరుకున్నారు. ఆదేశ ప్రధాని మోదీకి ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన అనంతరం ఇరు దేశాధినేతలు కాఫీ తాగారు. అనంతరం ఇథియోఫియా ప్రధాని అబియ్ అహ్మద్ మోదీ కారును స్వయంగా నడిపి నేషనల్ ప్యాలెస్కి వెళ్లారు. మార్గ మధ్యలో సైన్స్ మ్యూజియం, ఫ్రెండ్షిప్ పార్క్ మోదీకి చూపించారు. ఈ సందర్భంగా మోదీకి ఆ దేశంలోని భారతీయులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడికి పుష్పాలు అందించారు. మోదీ రాక సందర్భంగా ఓ చిన్నారి భారత సాంస్కృతిక నృత్యంతో స్వాగతం పలికింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇథియోపియా వెళ్లడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ జోర్దాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన నిమిత్తం సోమవారం బయిలుదేరారు. జోర్దాన్ పర్యటన ముగించుకొని అనంతరం ఇథియోపియా చేరుకున్నారు. -
చైనా ‘మ్యాప్’ రాజకీయం..!
చైనా.. మనకు పొరగునున్న దేశం. ఈ దేశం తీరు ఎవ్వరికీ అర్థం కాదు. ఒకవైపు మిత్రత్వం చేస్తూనే తమ సరిహద్దుల్లో ఉన్న భూభాగాల్ని తమదే అంటుంది. ఆ విషయం ఇటీవల రష్యా భూభాగాన్ని తన మ్యాప్లో చూపించడంతో చైనా వైఖరి మరోసారి బయటపడింది. అంతకుముందు భారత్ భూభాగాల్ని అనేకసార్ల తన మ్యాప్ల్లో చూపించింది చైనా.సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నా..చైనాతో ప్రస్తుతం భారత్ సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నప్పటికీ, అవకాశం వస్తే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనుకాడదు అనేది గతంలో చాలాసార్లు నిరూపణ అయ్యింది. గాల్వాన్ ఎపిసోడ్లో ఎంతటి రాద్దాంతం జరిగిందో అందరికి తెలిసిందే. 2020, జూన్ 15వ తేదీన భారత–చైనా గాల్వాన్ జరిగిన ఘటన హింసాత్మకమనే చెప్పాలి.ఈ సంఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది చైనా సైనికులు కూడా మరణించారు. ఇది 45 సంవత్సరాల తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద జరిగిన అత్యంత హింసాత్మక ఘర్షణగా నిలిచిపోయింది. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో చైనా దూకుడు తగ్గించింది. అదే సమయంలో భారత్తో స్నేహ సంబంధాలకోసం చేతులు చాచింది. ఆ క్రమంలోనే ఇటీవల ఇరదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి. ఐదేళ్ల తర్వాత భారత విమానాలు.. చైనా గగనతలంలోకి వెళుతున్నాయి.చైనా మారిందా.. నటిస్తుందా..?కానీ తన వైఖరిని పూర్తిగా మార్చుకుందా అనేది ప్రశ్నార్థకమే. ఎప్పుడు ఏదో వివాదంతో అగ్నికి ఆజ్యం పోయాలనే చూస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తూ తన పొరుగు దేశాలను ఏదో రకంగా గిల్లుతూనే ఉంటుంది. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే జరిగింది. రష్యాతో స్నేహం నటిస్తూనే ఆ దేశ భూభాగాన్ని చైనా తన మ్యాప్లో చూపించింది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే.. ప్రత్యర్థి దేశం ఏమాత్రం బలహీనంగా ఉన్నా వారిపైకి మెల్లగా తన అస్త్రాలను వదులుతుంది. రష్యా విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం రష్యా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఉక్రెయిన్తో సుదీర్గకాలంగా చేస్తున్న యుద్ధం కారణంగా రష్యా సైతం ఆర్థికంగా గాడిన పడటానికి అపసోపాలు పడుతోంది. ఇటువంటి తరుణంలో రష్యా భూభాగాన్ని తన మ్యాప్లో చూపించే యత్నం చేసింది డ్రాగన కంట్రీ. ఒక రాయి వేసి చూద్దాం అసలు ఏం జరుగుతుందా అనే వైఖరిని బాగా వంట బట్టించుకున్న చైనా.. అవకాశం వచ్చినప్పుడు ఈ జిత్తులు మారిన చేష్టలు చేస్తూనే ఉంటుంది.అమెరికాతో తీవ్రపోటీ..అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు ఆశాజనకంగా లేవనే సంగతిని పక్కన పెడితే. ఆ దేశంతో ఇటీవల కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది చైనా. పూర్తిగా ఇరు దేశాల మధ్య శత్వుత్వం లేకపోయినా తీవ్ర పోటీ ఉంది. ఆ క్రమంలోనే వారి మధ్య టారిఫ్ వార్ గట్టిగానే జరిగింది. ఇది కేవలం టారిఫ్ వార్గా అభివర్ణించినా, విషయం మాత్రం సీరియస్గానే ఉండటంతో మిత్రత్వం కోసం భారత్తో మిత్రత్వం కోసం పాకులాడింది.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అనే భావన చైనాలో ఉండటమే కాదు.. అత్యంత నమ్మదగిన దేశాలలో భారత్ ఒకటి అనే విషయాన్ని కూడా చైనా బాగానే గ్రహించింది. దాంతోనే భారత్తో స్నేహం కోసం నిరీక్షించి మరీ ఆ దిశగా సక్సెస్ అయ్యింది. ఆ క్రమంలోనే ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడిలో పడ్డాయి.అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ..ఇటీవల చోటు చేసుకున్న ఘటనను చూసుకుంటే.. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళను చైనా ఎయిర్పోర్ట్లో ముప్పుతిప్పలు పెట్టారు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు. తన పాస్పోర్ట్ను పరిశీలించే క్రమంలో అరుణాచల్ ప్రదేశే్-భారత్ అని ఉందేంటని ఆ అధికారులు ఆ మహిళను వేధింపులకు గురి చేశారు. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్పై అరుణాచల్ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను.పెమా వాంఘజామ్ థోంగ్డాక్ అనే లండన్ నుంచి జపాన్కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. కానీ అక్కడ భారత ఎంబాసీ అధికారులు జోక్యం చేసుకోవడంతో చివరకు ఆ మహిళ ఎలాగోలా బయటపడింది. మరి ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు చైనా ప్రభుత్వానికి తెలియదా.. కచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి ఏమైనా మాట్లాడిందా అంటే అదీ లేదు. ఇది చిన్న విషయంగా కనిపించినా, ఇటువంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి. అలాగే డ్రాగన్ కంట్రీపై సీరియస్గా భారత్ దృష్టిసారించి ఉండాల్సిందే.ఇదీ చదవండి: రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను! -
"సెవన్ సిస్టర్స్ చీలిపోతుంది"
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్పై కారు కూతలు కూశారు. భారత్ను చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, సంస్థలకు తమ దేశం ఆశ్రయం ఇస్తుందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఆశ్రయంతో భారత్లోని ఈశాన్యప్రాంతం ప్రాంతం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని తీవ్రంగా మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు.బంగ్లాదేశ్ ఎన్సీపీ లీడర్ అబ్దుల్లా భారత్ను బెదిరిస్తూ పిచ్చిగా మాట్లాడారు. అబ్దుల్లా మాట్లాడుతూ "నేను ఒక విషయం భారత్కు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తాం. దానివల్ల భారత్ నుంచి ఈశాన్య ప్రాంతం వేరయ్యే అవకాశముంది". అని హెచ్చరించారు. బంగ్లాదేశ్ సౌర్వభౌమాధికారాన్ని, మానవహక్కులని గౌరవించని వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్ సమాధానమిస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. "ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి, గతేడాది నుంచి తరచుగా ఈశాన్య రాష్ట్రాలని భారత్ నుంచి విడగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఈ విషయంలో మౌనంగా ఉండకూడదు" అని హిమంత అన్నారు. భారత్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. త్రిపుర రాష్ట్రాలను కలిపి సెవెన్సిస్టర్స్ అని అంటారు.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటుంది. గతేడాది ఆ దేశంలో జరిగిన ఘర్షణల తర్వాత హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లో ఆశ్రయం పొందింది. అయితే కొద్దిరోజుల క్రితం హసీనాకు బంగ్లాదేశ్లోని కోర్టులు 21 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మరణశిక్ష విధించాయి. దీంతో షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది. అయితే దీనిపై భారత్ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు. -
గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్న భారత సంతతి మహిళ అరెస్ట్
అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన 60 ఏళ్ల మహిళకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్నమహిళను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్లో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. బబ్లీజీత్ కౌర్ అలియాస్ బబ్లీ అనే మహిళ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తన తల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆమె కుమార్తె జోతి మీడియాకు తెలిపారు. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబుల్జిత్ "బబ్లీ" కౌర్, పెండింగ్లో ఉన్న ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 1న తన తల్లి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయం డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు భవనంలోకి ప్రవేశించారని జ్యోతి చెప్పింది. ఆ తర్వాత ఫెడరల్ ఏజెంట్లు వెళ్లిన గదిలోకి కౌర్ను పిలిచి, ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపింది. కౌర్కు తన న్యాయవాదితో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించినప్పటికీ, ఆమెను నిర్బంధంలోనే ఉంచారని ఆమె కుమార్తె చెప్పింది. కొన్ని గంటల పాటు కౌర్ను ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులైన తమకు తెలపకుండానే, రాత్రికి రాత్రే అడెలాంటోకు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అమెరికా పౌరురాలైన ఆమె మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త నుండి ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ హోదాలో ఉన్నారని లాంగ్ బీచ్ వాచ్డాగ్ తన కథనంలో వివరించింది.ఎవరీ బబ్లీ కౌర్ కౌర్ కుటుంబం USకి వలస వచ్చిన తర్వాత, మొదట లగున బీచ్లో స్థిరపడ్డారు, తర్వాత లాంగ్ బీచ్కు వెళ్లారు. తరువాత ఉద్యోగ బాధతలరీత్యా బెల్మాంట్ షోర్ ప్రాంతానికి మారారు. కౌర్కు ముగ్గురు పిల్లలున్నారు. 34 ఏళ్ల జోతి, DACA (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) కింద USలో చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు ,ఆమె అన్నయ్య, సోదరి, ఇద్దరూ అమెరికా పౌరులుగా ఉన్నారు.రెండు దశాబ్దాలకు పైగా, కౌర్ , ఆమె భర్త బెల్మాంట్ షోర్లోని 2వ వీధిలో నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అనే తినుబండారాల ఔట్లెట్ను నిర్వహిస్తున్నారు. లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి ఆదరణను కూడా పొందింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఫార్మసీ చైన్ దాని మిగిలిన స్థానాలను మూసివేసేంs వరకు ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్లో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్లో రెస్టారెంట్ పనిలోకి రావడానికి తిరిగి సిద్ధమవుతోంది.బబ్లీ కౌర్ను విడుదల చేయాలని పిలుపులాంగ్ బీచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, కౌర్ విడుదల కోసం పిలుపునిచ్చారు. ఆమె కుటుంబం ఆమె కేసు కొనసాగుతున్నందున కౌర్ను బాండ్పై విడుదల చేయడానికి అనుమతించే అదనపు చట్టపరమైన దాఖలును సిద్ధం చేస్తున్నందున, ఈ విషయంపై అతను ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నట్లు ఆయన సిబ్బంది తెలిపారు. -
జోర్డాన్ యువరాజు బీఎండబ్ల్యూలో ప్రధాని మోదీ
అమ్మాన్: ప్రధాని నరేంద్ర మోదీ.. కింగ్ అబ్దుల్లా- II ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్ రాజధాని అమ్మాన్కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ యువరాజు, మహమ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసుడైన అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా- II ప్రధాని మోదీకి అరుదైన గౌరవం అందించారు. యువరాజు తన వ్యక్తిగత బ్లాక్ కలర్ బీఎండబ్ల్యూ కారులో ప్రధాని మోదీని స్వయంగా అమ్మాన్లోని జోర్డాన్ మ్యూజియంనకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను చాటి చెప్పింది.అమ్మాన్లోని రాస్ అల్-ఐన్లో ఉన్న జోర్డాన్ మ్యూజియం పురావస్తు, చారిత్రక కళాఖండాలకు నిలయం. 2014లో నెలకొల్పిన ఈ మ్యూజియం జోర్డాన్ ప్రాంత సుదీర్ఘ నాగరిక ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇక్కడ 1.5 మిలియన్ సంవత్సరాల నాటి జంతువుల ఎముకలు ఉన్నాయి. అత్యంత పురాతన విగ్రహాలలో ఒకటైన తొమ్మిదివేల ఏళ్లనాటి ఐన్ ఘజల్ సున్నపు ప్లాస్టర్ విగ్రహాలు ఉన్నాయి.ఈ మ్యూజియంను ప్రధాని మోదీ సందర్శించారు. These outcomes mark a meaningful expansion of the India-Jordan partnership. Our cooperation in new and renewable energy reflects a shared commitment to clean growth, energy security and climate responsibility. Collaboration in water resources management and development will… https://t.co/SYbOTkd4B2— Narendra Modi (@narendramodi) December 16, 2025ప్రధాని మోదీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదపడింది. ఈ సందర్భంగా భారతదేశం, జోర్డాన్లు పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి ఇండియా-జోర్డాన్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో కూడా ప్రసంగించారు. ఇరు దేశాలు వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడి సంబంధాలను పెంచగల రంగాలను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ మూడు దేశాల (జోర్డాన్, ఇథియోపియా, ఒమన్) పర్యటనలో జోర్డాన్ మొదటి మజిలీ.ఇది కూడా చదవండి: Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే.. -
ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి?
గుడికెళ్లినా, ఆసుపత్రికెళ్లినా అవే దృశ్యాలు మనల్ని వెక్కిరిస్తుంటాయి. ఆఖరికి రోడ్డుమీద నడిచివెడుతున్నా కూడా చిక్కాకు పుట్టించే పరిస్థితి. ఏ మూల నుంచి ఎవడు పుసుక్కున ఉమ్ముతాడో తెలియదు. ఏ సిగ్నల్ దగ్గర ఆగినా ఇవే దృశ్యాలు.. కొండొకచో పోలీస్ స్టేషన్ల దగ్గర్ల కూడా ఇదే పరిస్థితి. ఇదంతా దేని గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. పాన్ పరాగ్, గుట్కా, ఖైనీ తిని అసహ్యంగా ఉమ్ముతూ పరిసర ప్రాంతాలను, రోడ్లను అత్యంత చెత్తగా తయారు చేస్తున్న వైనం గురించే. వీటిని ఇబ్బడి ముబ్బడిగా సేవిస్తున్న వారి సంఖ్య రోజూ రోజుకు పెరుగుతోంది. ఇవి తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు మితిమీరితే వివిధ రకాల కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడటం ఖాయం. దీనికి సంబంధించిన అనేక హెచ్చరికలు చేస్తున్నా.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వీటిని వాడేవారి నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏ సినిమా హాలుకెళ్లినా దీనికి సంబంధించిన యాడ్ ప్లే అవుతుంది. అయినా ఉత్తరభారతంలోని అనేక నగరాలతో పాటు, హైదరాబాద్ నగరంలో గుట్కా తిని ఉమ్మేసేవాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే షాకవ్వక మానరు. తాజాగా ఇంగ్లాండ్ లోని లింకన్ షైర్ లో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే.. మన దేశంలో చట్టాల అమలు తీరుపై ఆశ్చర్యం కలగమానదు. లింకన్ షైర్ కు చెందిన, ఆస్తమా, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న రాయ్ మార్ష్ (86) వైద్యుడి సలహా మేరకు వాకింగ్కు వెళ్లాడు. పార్క్లో నడుస్తుండగా ఎండిన ఆకు ఒకటి గాలికి ఎగిరొచ్చి వృద్ధుడి నోట్లో పడింది. చాలా యధాలాపంగా వెంటనే ఆయన దాని ఉమ్మేశారు. అదే ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు షైర్కు ఏకంగా రూ.30 వేల ( 250 పౌండ్ల ) జరిమానా విధించారు.చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం నేరమని, జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. మార్ష్ వివరణ ఇచ్చినా ససేమిరా అన్నారు. ఉద్దేశపూర్వకంగాఅలా చేయలేదని పొరబాటు జరిగిందని, అంతమొత్తం కట్టలేనని లబోదిబో మనడంతో కనికరించిన అధికారులు జరిమానాను 150 పౌండ్ల (సుమారు రూ.18 వేలు) తగ్గించారు. ఈ విషయాన్ని మార్ష్ కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేశారు.అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ ఇలాంటి కఠినచట్టాలు, అమలు మన దేశంలో అమలైతే ఎంతమంది ఎన్ని వేల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించింది. చట్టాలు, అమలు కంటే సమాజ హితంకోసం ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం. లేదంటే ఇంగ్లాండ్లొ వృద్ధుడికి ఎదురైన పరిస్థితే మనకు వస్తే? ఆలోచించండి.కాగా భారతదేశంలో పొగాకు ఉత్పత్తులపై కఠిన నియమ నిబంధలు, కొన్ని రాష్ట్రాల్లో వీటి విక్రయాలపై షేధం ఉన్నప్పటికీ పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు పొగాకు, సున్నం, వక్క, తామలపాకు, మసాలా దినుసులు, చక్కెరతోపాటు సుగంధ రసాయనాలతో గుట్కాలు, ఖైనీలు తయారవుతాయి. వాణిజ్య ఉత్పత్తులైన రజనీగందా, పాన్పరాగ్లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి సోడియం బెంజోయేట్ లాంటివాటినీ ఉపయోగిస్తారు. ఇవి రుచి, మత్తును కలిగిస్తాయి. అంతిమంగా వారిని మరణం అంచుకునెట్టేస్తాయి. మోటారు ఫీల్డ్లో ఉన్నవారు ప్రధానంగా వీటికి బానిసలవుతున్నారు. ప్యాన్లు సహా దీర్ఘకాల వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇండియాలోదాదాపు 20-25శాతం జనాభా తినే పొగాకు ఉత్పత్తులకు బానిసలేనని అంచనా. నికోటిన్తోపాటు ఆరెకోలిన్ వంటి రసాయనాలు ఈ ఉత్పత్తులను అత్యంత వ్యసనకరంగా మారుస్తాయి. ఎక్కడ బడితే అక్కడ ఉమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ ఉత్పత్తుల గురించి అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం. ఏమంటారు? -
తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
దక్షిణ బ్రెజిల్లోని గువైబా నగరంలో తీవ్ర తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, తుఫాన్ తాకిడికి దాదాపు 114 అడుగుల ఎత్తున్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కుప్పకూలిపోయింది.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్ బాగా షేర్ అవుతోంది. సోమవారం మధ్యాహ్నం బ్రెజిల్లోని గుయిబా నగరాన్ని తీవ్రమైన తుఫాను ముంచెత్తింది. దీంతో దాదాపు 40 మీటర్ల పొడవైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూలిపోయింది. ఫాస్ట్-ఫుడ్ అవుట్లెట్ సమీపంలోని హవాన్ రిటైల్ మెగాస్టోర్ ,కార్ పార్కింగ్లో ఏర్పాటు చేయబడినఈ విగ్రహాన్ని తీవ్రమైన గాలులు తాకాయి. బలమైన గాలుల ధాటికి తొలుత వంగిపోయిన ఈ విగ్రహం తాకిడి తీవ్రం కావడంతో స్టాట్యూ తల ముక్కలైంది. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ అధికారుల ప్రకారం.. పై భాగం మాత్రమే ప్రభావితమైది. అయితే 11 మీటర్లు (36 అడుగులు) పీఠం చెక్కుచెదరకుండా ఉంది. గుయిబా మేయర్ మార్సెలో మారనాటా మాట్లాడుతూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. సత్వరమే స్పందించిన అధికారులను ప్రశంసించారు. విగ్రహం కూలిపోవడానికి ఖచ్చితమైన కారణాన్నిగుర్తించేందుకు, తీవ్రమైన వాతావరణం తోపాటు, తర అంశాలు పాత్రపై ఆరా తీసేందుకు సాంకేతిక తనిఖీ నిర్వహించబడుతుందని అధికారి ఒకరు చెప్పారు.ఇదీ చదవండి: బోండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలుగుయిబాలో తుఫాను రియో గ్రాండే డో సుల్ను కూడా చాలా వరకు ప్రభావితం చేసింది. వడగళ్ల వాన, పైకప్పులు, చెట్లు, కూలిపోవడం, తాత్కాలిక విద్యుత్తు అంతరాయం లాంటి సంఘటనలు చోటు చేసు కున్నాయి. భారీ వర్షం కారణంగా కొన్ని వీధులు జలమయమయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటియాలజీ తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. చలిగాలులే దీనికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ మంగళ వారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. కాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అసలైన విగ్రహం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. బ్రెజిల్లోని హవాన్ అనే డిపార్ట్మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా 2020లో దీన్ని ఏర్పాటు చేశారు..Video footage shows a forty-meter-tall replica of the Statue of Liberty, located across from a McDonald's within the parking lot of a Havan in the Brazilian city of Guaíba, one of several dozen replicas of the statue located throughout the country, collapsing during a wind and… pic.twitter.com/kUid9lwA3b— OSINTdefender (@sentdefender) December 15, 2025 -
బోండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన అహ్మద్ అల్ అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టిమరీ దుండగులను నిలువరించిన అహ్మద్కు నాలుగు నుండి ఐదు తుపాకీ గాయాలు అయ్యాయి. చాలా రక్తం పోవడంతో పలు మార్లు ఆపరేషన్లు చేయాల్సి ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. అలాగే ఎడమ భుజం బ్లేడ్ వెనుక భాగంలో ఒక బుల్లెట్ను ఇంకా తీయలేదు. ఈగాయం కారణంగా అతని ఎడమ చేయిని తీసివేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అతని పరిస్థితి ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు అహ్మద్ చూపించిన తెగువ, దైర్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ముఖ్యంగా సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో అహ్మద్ను ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పరామర్శించారు. నిజమైన నేషనల్ హీరో అంటూ కొనియాడారు. ఆస్ట్రేలియన్లకు ప్రేరణ అంటూ అభివర్ణించారు. కాల్పుల తర్వాత వెంటనే బాధితులకు చికిత్స చేయడంలో సహాయం చేసిన అహ్మద్,ఇతరును ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసించారు. VIDEO | "Ahmed al Ahmed represents best of our country, will not let the nation to be divided," says Australian PM Anthony Albanese on Bondi Beach bystander who disarmed shooter.#SydneyAttack #BondiBeachTerrorAttack (Source: Third Party)(Full video available on PTI Videos -… pic.twitter.com/y6K1Ci2NTJ— Press Trust of India (@PTI_News) December 16, 2025 అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హెడ్జ్ ఫండ్ బిలియనీర్ బిల్ అక్మాన్ అహ్మద్ ధైర్య సాహసాలను కొనియాడారు. పెర్షింగ్ స్క్వేర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు అక్మాన్ అహ్మద్ను డేరింగ్ హీరో అంటూ ప్రశంసించారు. కుటుంబానికి మద్దతుగా హెడ్జ్ ఫండ్ సంస్థ ఏర్పాటు చేసిన నిధుల సేకరణకు భారీ స్పందన లభిస్తోంది. గోఫండ్మీ పేజీ విరాళాలు 2 మిలియన్ల డాలర్ల (రూ. 18.15కోట్లు)కు సమీపంలో ఉండటం విశేషం. దాదానె 33వేల మంది విరాళాలందించారు. అంతేకాదు అత్యధిక విరాళం (99,999 డాలర్లు) ఇచ్చిన వ్యక్తిగా విలియం అక్మాన్ నిలవడం విశేషం. సిరియాలో జన్మించిన అహ్మద్, 15 మందిని బలిగొన్న ఈ మారణహోమం సమయంలో కాల్పులకు గురైన వారిలో ఒకరిపైకి దూకి, అతని చేతుల నుండి తుపాకీని లాక్కున్నాడు. ఈ సంఘటన యొక్క అసాధారణ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సిడ్నీలోని బోన్డీ బీచ్లో జరిగిన హనుకా కార్యక్రమంలో యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన దుండగులు తండ్రీ కొడుకులేనని ఆస్ట్రేలియా అధికారులు ధృవీకరించారు. ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి అయిన ఈ మారణహోమంలో15 మంది మరణించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో 50 ఏళ్ల తండ్రి ఎదురుకాల్పుల్లో మరణించారు. 24 ఏళ్ల కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో హీరోగా నిలిచిన 43 ఏళ్ల అహ్మద్ను దక్షిణ సిడ్నీకి చెందినవాడిగా గుర్తించారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన అహ్మద్ 2006లో సిరియా నుండి ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఆస్ట్రేలియన్ పౌరసత్వం ఉన్న అతను చిన్న షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. -
కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?
ప్రపంచం చుట్టి రావాలనుకోవడం ప్రస్తుత రోజుల్లో పెద్ద విషయం కాదు. డబ్బుకి లోటు లేదు అనుకుంటే సులభంగా చుట్టొచ్చేయొచ్చు. అలాకాకుండా కాలినడకన చుట్టి రావాలనుకోవడం మాత్రం..కాస్త ఆలోచించాల్సిందే. అసలు ఈ ఆలోచన సాధ్యమేనా అనే సందేహం కచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఇతడు దృఢ సంకల్పమే ఆయుధంగా ఎలాంటి వాహనాలను ఉపయోగించకుండా కాలినడకన ప్రపంచం చుట్టి రావాలనుకున్నాడు. ఇప్పుడు దాదాపు చాలామేరకు చుట్టేశాడు. ఇంకొద్ది రోజుల్లో అతడి యాత్ర ముగింపుకి రానుంది. ఇంత పెద్ద ఘనతను సృష్టించిన ఆ వ్యక్తి ఎప్పుడు ఈ ప్రపంచ యాత్రను ప్రారంభించాడు?, ఎలా సాగింది వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.29 ఏళ్ల బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ కార్ల్ బుష్బీ, ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఎలాంటి మోటారు వాహనాలు ఉపయోగించకుండా ప్రపంచం చుట్టి రావాలనే అసాధారణ లక్ష్యంతో బయలుదేరాడు. ఇప్పటికీ అతడి కల తీరనుంది. దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ యాత్ర అనంతరం 56 ఏళ్ల వయసుకు చేరుకున్న దశలో పూర్తి చేయనున్నాడు. అప్పటికీ పూర్తిగా మారిపోయిన ప్రపంచం, మరోవైపు సోషల్ మీడియా ఒత్తిడి వంటి సవాళ్లను అధిగమించి మరి ప్రపంచ యాత్రను ఇంకొద్ది రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయనున్నాడు. తన యాత్ర పూర్తి అవ్వడానికి జస్ట్ వెయ్యి మైళ్ల దూరంలోనే ఉన్నాడంతే. ఇప్పటి వరకు చేసిన సాహస యాత్రల్లో ఈ వ్యక్తి చేసిన యాత్ర అత్యంత సుదీర్ఘమైన యాత్రగా నిపుణులు పేర్కొన్నారు. ఇక బుష్బీ తన ప్రపంచ యాత్రను 1998లో చిలీ సరిహద్దుల నుంచి ప్రారంభించాడు. అలా నడుచుకుంటూనే తన స్వదేశం ఇంగ్లాండ్కు చేరుకుంటానని భీష్ముడు మాదిరిగా ప్రతినబూనడట. ఇంతవరకు ఈ యాత్రలో ఎలాంటి యాంత్రిక రవాణాను వినయోగించకపోవడం విశేషం. ఇప్పడు తన యాత్ర చివరి దశలో ఉన్నాడు. అంతేగాదు అతడు వచ్చే ఏడాది సెప్టెంబర్ 2026 నాటికి తన స్వస్థలమైన ఇంగ్లాండ్కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నన్నా. ఇప్పటి వరకు 25 దేశాలు, ఎడారులు, యుద్ధ ప్రాంతాలు, అడవులు, గడ్డకట్టిన సముద్రాలను దాటాడు. ఈ డేరింగ్ యాత్ర అతడి అద్భుతమైన ఓర్పు, సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం 27 ఏళ్ల అనంతరం బుష్బీ ప్రయాణం పటగోనియా, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా, మెక్సికో, యుఎస్, రష్యా, మంగోలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల గుండా సాగనుంది. అతడు బ్రిటిష్ సైన్యంలో పారాటూపర్గా పనిచేసిన అనుభవమే ఈ సాహన యాత్రకు పురికొల్పిందని అంటాడు బుష్బీ. సైన్యంలో ఉన్నప్పుడూ అద్భుతమైన ప్రదేశాలను చూశాను. అదే తనని ఈ ప్రపంచమంతా చుట్టిరావాలనే సంచార కాంక్షను ప్రేరేపించిందని చెప్పుకొచ్చాడు. యాత్ర సాగిన విధానం..బుష్బీ 31,000-మైళ్ల యాత్ర సుమారు ఎనిమిది నుండి పన్నెండేళ్లు పడుతుందని అతను అంచనా వేశాడు. 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక భౌగోళిక రాజకీయ, ఆర్థిక, లాజిస్టికల్ అడ్డంకుల కారణంగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంగా మారిపోయింది.అతను తన నడకను దక్షిణ అమెరికా దక్షిణ కొనలో ఉన్న చిలీలోని పుంటా అరేనాస్లో ప్రారంభించాడు. పనామా, కొలంబియా మధ్య ఉన్న ప్రమాదకరమైన డారియన్ గ్యాప్ను దాటడంతో సహా అమెరికా ఖండాల పొడవునా నడిచాడు. మార్చి 2006లో, అతను తోటి సాహసికుడు డిమిత్రి కీఫర్ అలాస్కా నుండి సైబీరియాకు కాలినడకన గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని దాటిన మొదటి వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు.అనధికారిక సరిహద్దు పాయింట్లోకి ప్రవేశించిన తర్వాత వీసా సమస్యలు, ఐదు సంవత్సరాల ప్రవేశ నిషేధం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. దాంతో రష్యా గుండా వెళ్లటం సాధ్యపడలేదు. టండ్రా పరిస్థితుల దృష్ట్యా శీతాకాలం చివరిలో, వసంతకాలం ప్రారంభంలో మాత్రమే నడక మార్గం అనుకూలంగా ఉండేది బుష్బీకి. ఆగస్టు 2024లో, రాజకీయ ప్రమాదాల కారణంగా ఇరాన్ లేదా రష్యాలోకి ప్రవేశించకుండా కజకిస్తాన్ నుంచి అజర్బైజాన్కు కాస్పియన్ సముద్రం మీదుగా ఈదాడు. దీనికై విశ్రాంతి కోసం సహాయక పడవలతో 31 రోజులు పట్టిన 179-మైళ్ల క్రాసింగ్.ఆ తర్వాత కాకసస్, టర్కీ గుండా నడిచాడు, 2025లో బోస్ఫరస్ జలసంధిని దాటి యూరప్లోకి ప్రవేశించాడు. 2025 చివరి నాటికి, అతను యూకే నుంచి 1,400 మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న రొమేనియా గుండా నడక ప్రారంభించాడు. అయితే బుష్బీ సంకల్పించినట్లుగా తన ప్రధాన నియమం విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తపడ్డాడు. కాలినడకనే తిరిగి ఇంటికి వెళ్లానే తన పట్టుదలను ఎక్కడ బ్రేక్ చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం బుష్బీ హంగేరీలో ఉన్నాడు. ఇంగ్లాండ్లోని తన స్వస్థలమైన హల్ నుంచి దాదాపు 932 మైళ్ల దూరంలో ఉన్నాడు. అతడి యాత్ర విజయవంతమైతే గనుక నిరంతరాయంగా నడిచిన తొలి వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకుని రికార్డు క్రియేట్ చేస్తాడు. చివరగా బుష్బీ 29 ఏళ్ల వయసులో ప్రపంచ యాత్ర మొదలుపెడితే 56 ఏళ్ల వయసుకు పూర్తి చేయనున్నాడు. నిజంగా ఇది అతిపెద్ద డేరింగ్ యాత్ర కదూ..!(చదవండి: ఆ యువ సైక్లిస్ట్ గట్స్కి మాటల్లేవ్..! ఆ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం..) -
శ్రీలంక క్రికెట్ దిగ్గజానికి భారీ షాక్!
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అర్జున రణతుంగ చిక్కుల్లో పడ్డాడు. మంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రణతుంగను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.అంతర్జాతీయ క్రికెట్లో అర్జున రణతుంగా శ్రీలంక తరఫున సత్తా చాటాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 1996లో కెప్టెన్ హోదాలో శ్రీలంకకు వన్డే వరల్డ్కప్ అందించాడు. రణతుంగ సారథ్యంలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి లంక టైటిల్ గెలవడంతో అతడి ప్రతిష్ట మరింత పెరిగింది.ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత అర్జున రణతుంగా రాజకీయాల్లో ప్రవేశించాడు. శ్రీలంక రవాణా, విమానయాన శాఖ (2018- 19), పోర్ట్స్ అండ్ షిప్పింగ్ (2015- 17)శాఖ, పెట్రోలియం వనరుల అభివృద్ధి శాఖ (2017-18) మంత్రిగా పనిచేశాడు. అయితే, పెట్రోలియమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో అతడు అవినీతికి పాల్పడినట్లు సమాచారం.రూ. 23. 5 కోట్లుఈ కేసు విచారణలో భాగంగా అవినీతి నిరోధక శాఖ కొలంబో మెజిస్ట్రేట్ అసంగ బొడరగమా ముందు సోమవారం తమ వాదనలు వినిపించింది. మొత్తంగా 27సార్లు జరిపిన కొనుగోళ్లలో 800 మిలియన్ శ్రీలంకన్ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 23. 5 కోట్లు) అవినీతి జరిగినట్లు తాము గుర్తించినట్లు తెలిపింది.కాగా ఈ కేసులో ఇప్పటికే అర్జున రణతుంగ అన్నయ్య, సిలోన్ పెట్రోలియమ్ చైర్మన్గా ఉన్న ధమ్మిక రణతుంగను పోలీసులు సోమవారం అరెస్టు చేశాడు. అయితే, కాసేపటికే అతడు బెయిల్పై విడుదలయ్యాడు.ధమ్మికకు శ్రీలంక పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉండటం గమనార్హం. కాగా అర్జున రణతుంగ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని.. స్వదేశానికి తిరిగి రాగానే అతడిని అరెస్టు చేయనున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అర్జున రణతుంగ మరో సోదరుడు, పర్యాటక శాఖ మాజీ మంత్రి ప్రసన్న కూడా గత నెలలో ఫ్రాడ్ కేసులో అరెస్టయ్యాడు. చదవండి: అక్షరాలా రూ.8 వేల కోట్లు! -
ఐరాసలో పాక్ పరువు తీసిన భారత్
పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే.. దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్కు ముప్పు తలపెట్టడంపైనే ఉందని.. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను జైలుకు పంపి.. అతడికి విరోధి అయిన అసీమ్ మునీర్కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని చురకలంటించారు.ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన ఓపెన్ డిబేట్లో పాకిస్థాన్ మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్, లడఖ్ భారతదేశానికి విడదీయరాని భాగాలు. వాటిపై పాకిస్థాన్కి ఎలాంటి హక్కు లేదు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారి.. గత దశాబ్దాలుగా భారత్పై ఉగ్రదాడులు జరిపింది. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనడానికి.. 2025 ఏప్రిల్లో పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి ఉదాహరణ అని అన్నారాయన. అంతటితో ఆగకుండా.. పాకిస్థాన్లోని రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ఎత్తిచూపారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపి, అతనికి విరోధి అయిన ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేతుల్లో సర్వాధికారాలు పెట్టింది. ఇది ఆ దేశపు ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ప్రత్యేక పద్ధతి అని హరీశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో ప్రపంచానికి చూపించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో పాక్ ప్రతినిధులు కాస్త అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. VIDEO | New York: Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish (@AmbHarishP), delivered India's statement at the Open Debate on ‘Leadership for Peace’ in the UN Security Council."India had entered into the Indus Waters Treaty, 65 years ago, in… pic.twitter.com/hMRWESj0xQ— Press Trust of India (@PTI_News) December 16, 2025 -
హఠాత్తుగా ఆగిన కేబుల్ కార్.. తుళ్లిపడిన ప్రయాణికులు!
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలోగల శాన్ ఫ్రాన్సిస్కోలో కేబుల్ కార్ ప్రమాదం చోటుచేసుకుంది. నోబ్ హిల్లో కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లీవెన్వర్త్- హైడ్ వీధుల మధ్య 1351 కాలిఫోర్నియా వీధి వద్ద కేబుల్ కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం (SFFD) వెంటనే స్పందించి, సంఘటనా స్థలంలో 15 మంది బాధితులను రక్షించింది. వీరిలో 13 మంది గాయపడగా, వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. San Francisco fire department is on the scene at 1351 California St. between Leavenworth and Hyde with 14 patients who have been injured from a cable car that came to an abrupt stop. Avoid the area of California between Hyde and Leavenworth. There will be an ongoing… pic.twitter.com/AXsBxMn5DE— SAN FRANCISCO FIRE DEPARTMENT MEDIA (@SFFDPIO) December 15, 2025ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఘటనా స్థలంలో కారు విండ్షీల్డ్ పగిలి ఉండటాన్ని అధికారులు గమనించారు. అగ్నిమాపక అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం కేబుల్ కారుపై ఎవరో ఏదో బలమైన వస్తువు విసిరేసి ఉండవచ్చని, ఫలితంగా డ్రైవర్ అత్యవసరంగా కారును ఆపివేయవలసి వచ్చివుంటుందన్నారు. దీంతో ప్రయాణికులు ముందుకు కుదుపునకు గురయ్యారన్నారు.శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇందుకోసం హైడ్, లీవెన్వర్త్ మధ్య కాలిఫోర్నియా వీధిని మూసివేశారు. కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్ ప్రమాద ఘటన కారణంగా తాత్కాలికంగా ఈ సేవలకు అంతరాయం కలిగించింది. దర్యాప్తులో యాంత్రిక తనిఖీ, సాక్షుల వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఇది కూడా చదవండి: Mexico: కూలిన ప్రైవేట్ జెట్.. పదిమంది సజీవ దహనం -
మొరాకోలో ఆకస్మిక వరదలు.. 37 మంది మృతి
కాసాబ్లాంకా: మొరాకోలోని తీరప్రాంత నగరం సాఫిలో ఆదివారం రాత్రి సంభవించిన భారీ వర్షం, ఆకస్మిక వరదలతో కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి. పది వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. దీంతో, నగర యంత్రాంగం స్కూళ్లకు మూడు రోజులు సెలవు ప్రకటించింది. దేశంలోని టౌటొవాన్, టింఘిర్ తదితర నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా నష్టం సంభవించింది. -
Mexico: కూలిన ప్రైవేట్ జెట్.. పదిమంది సజీవ దహనం
మెక్సికో సిటీ: సెంట్రల్ మెక్సికోలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పదిమంది సజీవ దహనమయ్యారు. మెక్సికో రాష్ట్ర పౌర రక్షణ సమన్వయకర్త అడ్రియన్ హెర్నాండెజ్ ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు. ఈ విమానం మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో (Acapulco) నుండి బయలుదేరింది. Breaking news 🚨A private jet crashed near Toluca Airport in San Pedro Totoltepec, State of Mexico.The aircraft, registered as XA-PRO, was carrying **10 people—two pilots and eight passengers—**when it slammed into an industrial warehouse earlier today, sending a massive column… pic.twitter.com/EeSojqcTAJ— aircraftmaintenancengineer (@airmainengineer) December 15, 2025ఈ ప్రమాదం టోలుకా విమానాశ్రయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన శాన్ మాటియో అటెన్కోలో జరిగింది. ప్రైవేట్ జెట్ ఒక ఫుట్బాల్ మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా, సమీపంలోని ఫ్యాక్టరీ పైకప్పును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని హెర్నాండెజ్ తెలిపారు. జెట్ ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతం నుండి దాదాపు 130 మందిని ఖాళీ చేయించారని శాన్ మాటియో అటెన్కో మేయర్ అనా మునిజ్ మిలేనియో టెలివిజన్తో అన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్నదని అధికారులు ప్రకటించారు. ఈ విమాన ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఈ ప్రమాదం వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రాక్ కాదది.. రూ.449 కోట్ల ఫ్లైఓవర్! -
మ.3 గంటలకు ముందు.. 'కేన్సర్ మందు'!
సాక్షి, హైదరాబాద్: రోగాన్ని తగ్గించేందుకు మందు వేసుకోవాల్సిందే. అందులో కేన్సర్ వంటి రోగాలకు మందు వేసుకోవడమే కాదు.. వాటిని నిర్ణీత సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే జీవితకాలంలో కొంత కోల్పోవాల్సి వస్తుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. సాయంత్రం, రాత్రి వేళలకన్నా ఉదయం వేళల్లో రోగ నిరోధక మందులు వాడటం వల్ల జీవితకాలం పెరుగుతుందని చైనా శాస్త్రవేత్తలు నిర్వహించిన వివిధ అధ్యయనాల్లో తేలింది. ప్రమాదకర దశలో ఉన్న స్మాల్సెల్ లంగ్ కేన్సర్ (ఎస్సీఎల్సీ) రోగులకు ఇమ్యునోథెరపీ ఔషధాలను మధ్యాహ్నం 3 గంటల్లోగా అందించడం వల్ల బాధితుల జీవితకాలం పెరుగుతుందని చైనాకు చెందిన సెంట్రల్ సౌత్ యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం తెలిపింది. 2019 మే నుంచి 2023 అక్టోబర్ వరకు 397 మంది రోగులపై జరిపిన ఈ అధ్యయనంలో మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఇమ్యునోథెరపీ తీసుకున్న వారికి సగటున 7 నెలలు అదనపు జీవితకాలం లభించినట్లు తేలింది. ఈ ఫలితాలు తాజాగా కేన్సర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.పరిశోధన ఎలా చేశారంటే..చైనా పరిశోధకులు అటెజోలిజుమాబ్ లేదా డూర్వాల్యూమాబ్ ఇమ్యునోథెరపీ మందులను కీమోథెరపీతో కలిపి పొందిన రోగుల గణాంకాలను విశ్లేషించారు. లింగం, వయసు, ధూమపానం వంటి ఇతర కారకాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. వారిలో మధ్యాహ్నం 3 గంటల్లోగా చికిత్స పొందిన బాధితుల్లో వ్యాధి పెరుగుదల ప్రమాదం 52 శాతం మేర, మరణ ప్రమాదం 63 శాతం మేర తగ్గినట్లు గుర్తించారు. శరీరంలోని ‘సర్కేడియన్ రిథమ్’ (జీవ గడియారం) ప్రభావంతో రోగనిరోధక కణాల పనితీరు ఒక రోజులో సమయానుసారం మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా సీడీ8+ టీ–కణాలకు ఉదయం వేళల్లో కేన్సర్ కణాలపై ఎక్కువ దాడి సామర్థ్యం కలిగి ఉంటోందని ఈ పరిశోధనలో తేలింది. 2019లో వచ్చిన పీఎన్ఏఎస్ అధ్యయనం కూడా రోజులో మొదటి భాగంలో ఇచ్చే టీకాలకు ఈ కణాలు మరింత శక్తివంతంగా స్పందిస్తాయని నిర్ధారించింది.ఉపయోగకర మార్పు..కేన్సర్లోని ఎస్సీఎల్సీకి మాత్రమే కాకుండా నాన్–స్మాల్సెల్ లంగ్ కేన్సర్ (ఎన్ఎస్సీఎల్సీ), కిడ్నీ, మెలనోమా, జీర్ణాశయ కేన్సర్లలోనూ ఈ ప్రభావం కనిపిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. 2025 ఫిబ్రవరిలో ‘ఈ–బయో మెడిసిన్’లో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం ఉదయం 11:30 గంటల ముందు ఇమ్యునోథెరపీ తీసుకున్న ఎన్ఎస్సీఎల్సీ రోగుల మనుగడ దాదాపు రెట్టింపు అయింది. అంతేకాకుండా 13 అధ్యయనాల మెటా–అనాలిసిస్లోనూ ఉదయం వేళల్లో చికిత్సకు సత్ఫలితాలు వచ్చినట్లు వెల్లడైంది. చికిత్స సమయాన్ని మార్చడం, ఖర్చు లేకుండా అమలు చేయదగిన సులభతరమైన ఉపయోగకర మార్పుగా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఏ ఆసుపత్రిలోనైనా ఇది సాధ్యమేనని, అయితే హాస్పిటల్ షెడ్యూళ్లు, డే కేర్ బెడ్లు, సిబ్బంది లభ్యత వంటి అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ విషయంలో ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్నాయని.. త్వరలో మార్గదర్శకాలు మారే అవకాశమున్నట్లు ఈ అధ్యయన సీనియర్ రచయిత యాంగ్చాంగ్ జాంగ్ తెలిపారు. -
నాటోలో ఉక్రెయిన్ చేరికకు రష్యా ఓకే!
బెర్లిన్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే ప్రయత్నాల్లో అతి పెద్ద ముందడుగు. అమెరికా, యూరప్ దేశాలతో కుడిన నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరికను అనుమతించే విషయమై యోచిస్తున్నట్టు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జర్మనీలో చర్చలు జరుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూతల బృందం సోమవారం ఈ మేరకు పేర్కొంది. రష్యా వర్గాల నుంచి తమకు ఈ మేరకు వర్తమానం వచ్చినట్టు తెలిపింది. నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. అలాంటి ప్రయత్నం చేస్తే మొత్తం యూరప్ నే తమ శత్రువుగా భావించి వారితో నేరుగా యుద్ధానికి దిగాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు, అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ భద్రతకు కచ్చితమైన హామీలిస్తే నాటోలో చేరిక డిమాండ్ ను శాశ్వతంగా వదులుకుంటామని జెలెన్ స్కీ ఆదివారమే ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఈ విషయమై రష్యా వైఖరి ఇలా అనూహ్యంగా మారడం విశేషం! -
జిమ్మీ లాయ్ దోషే
హాంకాంగ్: ప్రజాస్వామ్య అనుకూల మీడియా మాజీ అధిపతి, చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే జిమ్మీ లాయ్(78)ను హాంకాంగ్లోని న్యాయస్థానం సోమవారం దోషిగా నిర్థారించింది. దీంతో, జాతీయ భద్రతా చట్టం కింద ఆయనకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. విదేశీ శక్తులతో కుమ్మక్కై దేశ భద్రతను ప్రమాదంలో పడేశారని, విద్రోహ కథనాలను ప్రచురించేందుకు కుట్ర పన్నారంటూ ముగ్గురు జడ్జీలు ఏకగ్రీవంగా ప్రకటించారు. అయితే, తానెలాంటి తప్పూ చేయలేదని లాయ్ వాదించారు. 2019లో చైనా వ్యతిరేక, ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు హాంకాంగ్లో మిన్నంటాయి. జిమ్మీ లాయ్ సారథ్యంలోని యాపిల్ డైలీ ప్రజాస్వామ్య వాదులకు అనుకూలంగా పనిచేసింది. దీంతో, డ్రాగన్ ప్రభుత్వం 2020 ఆగస్ట్లో లాయ్ను, అందులోని కీలక ఉద్యోగులను అరెస్ట్ చేసింది. 2021లో యాపిల్ డైలీని మూసివేసింది. ఆ పత్రిక ఆస్తుల్ని సీజ్ చేసింది. అప్పటినుంచి ఆయన జైలులోనే మగ్గుతున్నారు. ఇందులో ఎక్కువ కాలం ఏకాంతవాసమే. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. జిమ్మీ లాయ్పై హాంకాంగ్ అధికారులు పలు అవినీతి ఆరోపణలను కూడా మోపారు. చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి కూలదోసేందుకు అమెరికా, యూకే తదితర దేశాలతో కుట్ర పన్నారని పేర్కొన్నారు. మొత్తం 156 రోజులపాటు ఆయనపై విచారణ జరిపారు. అయితే, న్యాయమూర్తులు వెలువరించిన 855 పేజీల తీర్పులో తన తండ్రికి వ్యతిరేకంగా ప్రత్యేకించి ఎలాంటి నేరారోపణలు లేవని ఆయన కుమారుడు సెబాస్టియన్ లాయ్ చెప్పారు. లాయ్, తదితరులు తమ వాదనలను జనవరి 12వ తేదీ నుంచి వినిపించేందుకు అవకాశమిస్తారని భావిస్తున్నారు. అభియోగాల తీవ్రతను బట్టి గరిష్టంగా లాయ్కు జీవిత కాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. లాయ్కు జైలు శిక్ష విధించడంపై చైనా ప్రభుత్వంతో మాట్లాడుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలపగా, బ్రిటిష్ పౌరుడు కూడా అయిన లాయ్ విడుదలకు ప్రయత్నాలను కొనసాగిస్తామని యూకే ప్రధాని స్టార్మర్ చెప్పారు. లాయ్ను దోషిగా నిర్థారించడాన్ని ఈయూ ఖండించింది. -
అహ్మద్.. అసలైన హీరో
సిడ్నీ: సిడ్నీ బీచ్లో అమాయక యూదులపై ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాది సాజిద్ను సాహసోపేతంగా నిలువరించిన 43 ఏళ్ల అహ్మద్–అల్–అహ్మద్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యసాహసాలతో సాజిద్ చేతుల్లోంచి తుపాకీ లాక్కుని పలువురి ప్రాణాలను అహ్మద్ కాపాడారంటూ అతడిని జనం వేనోళ్ల పొగుడుతున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక్క ఉదుటున సాజిద్పైకి దూకిన వైనం వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్గా మారడంతో అతని ధైర్యసాహసాల గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.కాపాడే క్రమంలో కన్నుమూశాడని చెప్పు...దాడి జరిగినప్పుడు ఆదివారం ఉదయం అదే బాండీ బీచ్లో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన కాఫీ తాగుతున్నాడు. ఉగ్రవాది సాజిద్ అక్కడివారిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతుంటే అహ్మద్ హతాశుడయ్యాడు. వెంటనే తేరుకుని ఎలాగైనా సాజిద్ను అడ్డుకుందామని నిశ్చయించుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితుడితో.. ‘‘ వాడిని అడ్డుకునేందుకు వెళ్తున్నా. ఒకవేళ చనిపోతానేమో. నా కుటుంబాన్ని చూసుకో. అహ్మద్ ఎలా చనిపోయాడని నా వాళ్లు అడిగితే ప్రజల్ని కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు అర్పించాడని చెప్పు’’ అని అనేసి వెంటనే రంగంలోకి దూకాడు. కారు చాటుగా దాక్కుంటూ నెమ్మదిగా సాజిద్ వద్దకు చేరుకుని వెంటనే అతడి చేతిలోని పెద్దరైఫిల్ను పెనుగులాట తర్వాత లాక్కున్నాడు. సాజిద్కు రైఫిల్ను గురిపెట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్లేలా చూశాడు. తర్వాత రైఫిల్ను కిందపెట్టేశాడు. అయితే దూరంగా ఉండి కాల్చుతున్న సాజిద్ కొడుకు నవీద్ ఇదంతా చూసి అహ్మద్ పైకి కాల్పులు జరపడం మొదలెట్టాడు. దీంతో పక్కన చెట్టుకు పెట్టిన రైఫిల్ను మళ్లీ చేతుల్లోకి తీసుకుని ప్రతిదాడి చేయబోయాడు. అయితే అప్పటికే టెలిస్కోపిక్గా సూటిగా కాలుస్తున్న నవీద్ బుల్లెట్ల ధాటికి అహ్మద్ నిలవలేకపోయాడు. నవీద్ పేల్చిన బుల్లెట్లు అహ్మద్ భుజం, చేయి, అరచేతిలోకి దూసుకెళ్లాయి. ఆలోపు పోలీసులు రంగప్రవేశం చేయడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే రక్తమోడుతున్న అహ్మద్ను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. న్యూసౌత్వేల్స్ అగ్రనేత క్రిస్ మిన్స్సహా పలువురు నేతలు, ఉన్నతాధికారులు అహ్మద్ను ఆస్పత్రిలో పరామర్శించారు.గతంలో సైన్యంలో పనిచేసిన అహ్మద్!అహ్మద్ స్వస్థలం సిరియాలోని ఇడ్లిబ్ పట్టణం. 2006లో శరణార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవలే ఇతన తల్లిదండ్రులు సైతం సిరియా నుంచి ఇతని వద్దకు వచ్చేశారు. అహ్మద్ సిడ్నీ సమీప సదర్లాండ్లో సొంతంగా పండ్ల వ్యాపారం చేస్తున్నారు. అహ్మద్ గతంలో సైన్యంలో పనిచేసినట్లు వార్తలొచ్చాయి. అయితే సిరియాలోని అసద్ అల్ బషీర్ ప్రభుత్వంలోనా లేదంటే ఆస్ట్రేలియాలో సేవలందించారా అనేది తెలియాల్సి ఉంది. ప్రాణాలు ఎదురొడ్డి పలువురిని కాపాడిన అహ్మద్ ఇప్పుడు ఆస్పత్రిపాలవడంతో చికిత్స ఖర్చుల కోసం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఆన్లైన్లో గోఫండ్మీ క్యాంపెయిన్ మొదలెట్టారు. ఇప్పటికే దాదాపు రూ. 8.61 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ‘‘సైన్యంలో చేసిన నా కుమారుడికి ప్రాణాల విలువ తెలుసు. అందుకే కాపాడేందుకు ఒక్క నిమిషం కూడా ఆలస్యంచేయకుండా పరుగెత్తాడు’’ అని అహ్మద్ తండ్రి మొహమ్మద్ ఫతే అన్నారు. -
ద్వైపాక్షికం ద్విగుణీకృతం
అమ్మాన్: జోర్డాన్తో భారత ద్వైపాక్షిక బంధం ద్విగుణీకృతం కాబోతోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జోర్డాన్కు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడి అత్యంత విలాసవంత రాజ ప్రాసాదం హుస్సేనియా ప్యాలెస్లో జోర్డాన్ రాజు అబ్దుల్లాహ్–2 ఇబిన్ అల్ హుస్సేన్తో భేటీ అయ్యారు. 37 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్లో పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం పర్యటించడం ఇదే తొలిసారికావడం విశేషం. ఇరుదేశాల ప్రతినిధుల స్థాయి సమావేశానికి ముందే ఇరుదేశాల అగ్రనేతలు ఇలా స్వయంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. పరస్పరం ప్రయోజనం చేకూర్చే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా మోదీ, రాజు అబ్దుల్లాలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపారు. ‘‘భారత్–జోర్డాన్ బంధం మరింత పటిష్టమవుతోందని రాజు అబ్దుల్లాహ్ బలంగా విశ్వసిస్తున్నారు. ఇరుదేశాల సత్సంబంధాల పునాదులు మరింత గట్టిపడుతున్నాయి. వాణిజ్యం, ఎరువులు, డిజిటల్ సాంకేతికత, మౌలిక వసతుల కల్పన అంశాలతోపాటు ఇరుదేశాల ప్రజల మధ్య సాంస్కృతిక బంధాల బలోపేతం కోసం పరస్పర సహకారాన్ని ఇకమీదటా కొనసాగిస్తాం. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల ఉమ్మడి పోరు సల్పుతాం. గాజా అంశంలోనూ క్రియాశీలక, సానుకూల పాత్ర పోషిస్తాం. పశ్చిమాసియాలో శాంతికపోతాలు ఎగిరేందుకు శతథా కృషిచేస్తాం. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల వైఖరి ఒక్కటే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ మీ నాయకత్వంలో జోర్డాన్ అనేది ఉగ్రవాదం, అతివాదం, వేర్పాటువాదాల విషయంలో ప్రపంచానికి గట్టి సందేశం ఇస్తోంది. నన్ను, భారత ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రాజు అబ్దుల్లాహ్ను మోదీ కొనియాడారు. సత్సంబంధం సమున్నత శిఖరాలకు..‘‘ ఇండియా–జోర్డాన్ బంధాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేలా మీరెంతో సానుకూల దృక్పథాన్ని అవలంభిస్తున్నారు. భారత్ విషయంలో మీ స్నేహపూర్వక వైఖరి, అంకిత భావానికి ధన్యవాదాలు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధం ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. మేలిమలుపు లాంటి ఈ సందర్భంలో కొంగొత్త ఉత్సాహంతో ఇరుదేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం’’ అని రాజుతో మోదీ అన్నారు. ఈ సందర్భంగా 2018లో ఇస్లామిక్ వారసత్వ సదస్సు కోసం అబ్దుల్లాహ్ భారత పర్యటన నాటి విశేషాలను మోదీ గుర్తుచేసుకున్నారు. ‘‘ ప్రాంతీయ శాంతి కోసం మాత్రమేకాదు ప్రపంచశాంతి కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. 2015లో ఐక్యరాజ్యసమితిలో సమావేశాల వేళ తొలిసారిగా మీతో భేటీ అయ్యా. ఉగ్రవాదభూతాం పెను విలయాలను మానవాళి ఎంతగా ఇబ్బందులు పడుతుందో మీరెంతో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు’’ అని మోదీ పొగిడారు. పర్యటనలో భాగంగా మోదీ ప్రాచీనభారత్లో వ్యాపారంచేసిన పెట్రా ప్రాంతంలో యువరాజుతో కలిసి పర్యటించనున్నారు.భారతీయుల ఘన స్వాగతంఅంతకుముందు సోమవారం మోదీ జోర్డాన్లోని అమ్మాన్ నగరంలోని విమానాశ్రయానికి చేరుకోగానే జోర్డాన్ ప్రధానమంత్రి జఫర్ హసన్ సాదరంగా ఆహ్వానించారు. తర్వాత హోటల్కు చేరుకోగానే అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. భారతీయ అనుకూల జోర్డాన్ పౌరులు సైతం ప్రధానికి షేక్హ్యాండ్ ఇచ్చారు. జోర్డాన్స్థానికులు భారతీయ నాట్యంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే కళారూపాలను ప్రదర్శించారు. -
వామ్మో.. ఇంత వేడా.. డేంజరే!
వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్ తాలూకు విపరిణామాలకు మరో తాజా తార్కాణం. గత నవంబర్ ప్రపంచవ్యాప్తంగా పెద్దగా చలి జాడలు లేకుండానే గడచిపోయింది. అంతేనా, చరిత్రలో అత్యంత వేడిని చవిచూసిన నవంబర్ మాసాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. యూరోపియన్ యూనియన్కు చెందిన కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) ఈ మేరకు చేదు వాస్తవాన్ని వెల్లడించింది.నవంబర్లో సగటు భూ ఉపరితల వాయు ఉష్ణోగ్రత 14.02 డిగ్రీ సెంటీగ్రేడ్ గా నమోదైంది. 1991–2020 నడుమ నమోదైన నవంబర్ సగటు కంటే ఇది ఏకంగా 0.65 డిగ్రీ అదనం! అత్యంత వేడిమి నవంబర్లుగా రికార్డులకెక్కిన 2023 కంటే 0.2 డిగ్రీలు, 2024 కంటే కేవలం 0.08 డిగ్రీలే తక్కువ. ఇక పారిశ్రామికీకరణ (1850–1900)కు ముందునాటితో పోలిస్తే ఏకంగా 1.54 డిగ్రీలు ఎక్కువ! ఈ విషయంలో అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీల పరిమితిని కూడా ఈ నవంబర్ దాటేసింది.2025లో తొలి 11 నెలల సంగతి చూసుకున్నా 1.48 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ లెక్కన 2025 కూడా చరిత్రలోనే అత్యంత వేడిమిమయమైన సంవత్సరాల జాబితాలో రెండు, లేదా మూడో స్థానంలో నిలవడం ఖాయమేనని సైంటిస్టులు (Scientists) అంటున్నారు.ఎంత భారీ తేడాలో! ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత (Temperature) పెరుగుదలలో కూడా భీతి కలిగించే ఒక పరిణామాన్ని సైంటిస్టులు గమనించారు. ధ్రువ ప్రాంతాల్లో ఈ పెరుగుదల మరీ ఎక్కువగా నమోదైంది. ఆర్కిటిక్ లోని ఉత్తర కెనడా, ఆర్కిటిక్ మహాసముద్రం, పశ్చిమ రష్యా సగటు కంటే ఏకంగా 5 నుంచి 7 డిగ్రీలు ఎక్కువ వేడెక్కాయి.చదవండి: సంచలన విజయం.. ఎవరీ 'రైడ్ శ్రీలేఖ'? -
బీచ్ అటాక్.. ఉగ్రవాది తల్లి సంచలన విషయాలు
ఆస్ట్రేలియా బీచ్లో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 16మంది అమాయక ప్రజలను పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాల్పులు జరిపిన ఉగ్రవాది తల్లి ఆసక్తికర విషయాలు తెలిపింది. కాల్పులు జరిపే కొద్ది సేపటి ముందు తన కుమారుడితో ఫోన్ మాట్లాడినట్లు పేర్కొంది. తన కుమారుడు తనతో ఎప్పటిలాగానే సాధారణంగా మాట్లాడాడని కొద్దిసేపటి తర్వాత తినడానికి వెళ్తానన్నాడని తెలిపింది.ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని కొద్దికాలం క్రితమే ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఈకాల్పుల ఘటనపై ఉగ్రవాది నవీద్ అక్రమ్ తల్లి స్పందించింది. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే అక్రమ్ తనతో మాట్లాడరని తెలిపింది.ఉగ్రవాది తల్లి వెరినా మాట్లాడుతూ "ఘటన జరగడానికి కొద్ది సేపు మందు నా కొడుకుతో మాట్లాడా అక్రమ్ చాలా సాధారణంగా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే స్కూబా డ్రైవింగ్కు, స్విమ్మింగ్కు వెళ్లివచ్చాను. ఈ రోజు చాలా వేడిగా ఉంది హోటల్లోనే ఉంటాను. కొద్దిసేపు తర్వాత తింటాను " అని అక్రమ్ అన్నారని తన తల్లి పేర్కొంది. తన కొడుకు చాలా మంచివాడని అతనికి ఏలాంటి దురలవాట్లు లేవని,స్నేహితులతో కూడా ఎక్కువ తిరగడని తనకు పనికి వెళ్లడం ఇంటికి రావడం తప్ప మరేది తెలియదని ఆమె అంది. అయితే తన కుమారుడి చిత్రాలను ప్రస్తుతం చూపిస్తున్న చిత్రాలతో సరిపోల్చలేమని తెలిపింది. నవీద్ అక్రమ్ సిడ్నీలోని హెకెన్బర్గ్- అల్- మురాద్ ఇనిస్టిట్యుూట్లో ఖురాన్ సంబంధింత అధ్యయనాలని పూర్తి చేశాడు. 2024లో అక్కడే ఒక గృహాన్ని కొనుగోలు చేశాడు. ఇటీవల తన పని చేస్తున్న నిర్మాణ సంస్థ దివాళా తీయడంతో అతని ఉద్యోగం పోయినట్లు అతని తల్లి తెలిపింది. -
ఉగ్రవాదమా.. నీ మతమేంటి?
అలజడులు సృష్టించడం.. పదుగురు అటెన్షన్ రాబట్టుకోవడం.. మనుషుల ప్రాణాలను ఏమాత్రం ఆదలెక్కలేకుండా ఎడాపెడా తీసేయడం.. ఇవే కదా ఉగ్రవాద లక్షణాలు.. లక్ష్యాలు. మరి ఈ ఉగ్రవాదం ఏదో ఒక మతానికి పరిమితం చేయడం ఎంతవరకు సబబు? క్రూరత్వానికి మతమేముంటుంది? విద్వేషానికి, కుట్రలకు, కుతంత్రాలకు మతమంటూ ఉంటుందా? తాజాగా ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని ఓ బీచ్లో ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారు కావడంతో విమర్శలు మరింత ఘాటుగా.. నాటుగా ఉంటున్నాయి.బాండీ బీచ్ లో ఆదివారం తుపాకులు గర్జించడంతో ఆస్ట్రేలియా సిడ్నీ ఉలిక్కిపడ్డాయి. బాండీ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన సందర్శకులకు ఆక్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులు చేతపట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాండీ బీచ్ లో సంప్రదాయంగా జరుగుతున్న హనుక వేడుకల్లో పాల్గొన్న జుయిష్ కమ్యూనిటీ ప్రజల్లో ఏమయ్యిందో తెలుసుకునేలోగా 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న వేడుక.. రక్తసిక్త రణరంగంగా మారిపోయింది. ఈ ఉగ్రదాడుల్లో తండ్రి కుమారుడు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన వారు...ముస్లిం మతస్తులు కావడంతో...ఆ మతం పై సహజంగానే కొందరు విరుచుకు పడుతున్నారు.అయితే ఇంత ఘోర ఉగ్రచర్యల్ని అడ్డుకుంది కూడా ఓ ముసల్మానే అని మనం గుర్తుంచుకోవాలి. అతనో పండ్ల వ్యాపారి. ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులిద్దరూ తుపాకులు పట్టుకుని విచక్షణ రహితంగా కాలుస్తుంటే.. పండ్లవ్యాపారి అహ్మద్ అత్యంత ధైర్యసాహసాలను, మానవత్వాన్ని ప్రదర్శించాడు. వెనకనుంచి వచ్చి వారిలో ఒకరికి వారి గన్ తీసుకుని గురిపెట్టి తరిమేయసాగాడు. కానీ మరో ఉగ్రవాది అతడిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో అహ్మద్ రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అహ్మద్ చొరవ ప్రదర్శించకుండా ఉంటే మరికొందరు కచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవారే.కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్...కామెంటేటర్ మైకేల్ వాన్ అహ్మద్ చూపిన చొరవ తెగింపును ప్రశంసించాడు. ఘటన సమయంలో బాండీ బీచ్ కు దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్లో వాన్ తన కుటుంబంతో ఉన్నాడు. ఫోన్లో మాటాడ్డానికి బైటికి వెళ్లిన సమయంలో ఈ కాల్పుల శబ్దం వినిపించినట్లు వివరించాడు. అహ్మద్ చూపిన మానవీయ దైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అహ్మద్ నిజమైన హీరో అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.పెహల్గాం దాడిలో పాల్గొంది ముస్లింలే కావచ్చు. వారు బాధితుల్ని మతం అడిగి మరీ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు. అలాగే మన దేశంలో చాలా వరకు ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల మతం ముస్లిం మతమే కావచ్చు. అయినంత మాత్రాన అందరినీ అదే గాటన కట్టేయడం సరికాదని కొందరి అభిప్రాయం. ఉగ్రవాదమనేది మనిషిలోని అతిరేక లక్షణమే గానీ మతం విధానం కానేకాదు.ఇప్పుడు చెప్పండి.. విచక్షణారహితంగా ఉగ్రరూపంతో కాల్పులు జరిపిన తండ్రీ కొడుకులు ముస్లిం మతానికి చెందిన వారు. అలాగే ధైర్య సాహసాలతో మానవీయతతో ప్రజల్ని ఆ కాల్పుల నుంచి కాపాడిన వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వాడే. మరి ముస్లింలందరూ ఉగ్రవాదులే అన్న కొందరి వితండ వాదన నిజమైతే ...పండ్ల వ్యాపారి అహ్మద్ కు ఎదుర్కోవాల్సిన పనేం ఉంది. తను కూడా ఉగ్రవాదుల చర్యల్ని సమర్థించవచ్చు కదా అంటున్నారు సెక్యూలరిస్టులు. ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులుండవచ్చేమో గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అనడం అర్థరహితం. అసలు ఉగ్రవాదానికి ముస్లిం మతమెందుకు ఉంటుంది? అది కొందరు పనిగట్టుకుని అద్దిన రంగు మాత్రమే.- ఆర్ఎం. -
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్లను గిఫ్ట్గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
కొద్ది రోజుల్లో ప్రళయం.. ఘనా ప్రవక్త జోస్యం!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని సామెత. ఈయనగారి వ్యవహారం ఇంతకంటే ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడెప్పుడో బైబిల్లో చెప్పినట్టు ఈయనగారు కూడా ఒక ఆర్క్ను కట్టేస్తున్నాడు. ఆర్క్ అంటే ఏమిటని అనుకుంటున్నారా? ఇది బుక్ ఆఫ్ జెనిసిస్లోని ఓ గాథ. భూమ్మీద మనుషులందరూ స్వార్థంతో వ్యవహరిస్తున్నారని క్రీస్తు నోవా అనే భక్తుడికి ఓ నావను నిర్మించమని బాధ్యతను అప్పగిస్తాడు. నోవా, అతడి కుటుంబం కలిసికట్టుగా ఈ నావను నిర్మిస్తుంది. ప్రళయమొచ్చి భూమి మొత్తం నాశనమైపోతుంది. కానీ నోవా కుటుంబం, ఆ నౌక మాత్రం చెక్కు చెదరదు. నౌకలో దాచిన జంతువుల జంటలు, విత్తనాలతో ప్రపంచం మళ్లీ మొదలవుతుందని ‘నోవాస్ ఆర్క్’ కథ చెబుతుంది.సరిగ్గా ఇదే కథనాన్ని పోలినట్లు.. ‘డిసెంబర్ 25 నుంచి భీకర వరదలు చుట్టుముట్టనున్నాయని.. ఇవి నాలుగేళ్లపాటు కొనసాగి ప్రపంచాన్నంతటికీ అల్లకల్లోలం చేయనున్నాయని.. ఈ విషయాన్ని దేవుడు తనకు చెప్పాడని ఆఫ్రికా దేశమైన ఘనాకు చెందిన స్వయం ప్రకటిత ప్రవక్త ఎబో నోహ్ చెబుతున్నాడు. తన భవిష్యవాణితో ఎబో జీసస్గా పేరొందిన ఈ ప్రవక్త ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రళయం నుంచి విశ్వాసులను, జంతువులను రక్షించడానికి పది భారీ చెక్క ఓడలను నిర్మించాలని దేవుడు తనకు ఆజ్ఞాపించాడని కూడా ఎబో నోహ్ తెలిపాడు. ఈ ఘనా ప్రవక్త హెచ్చరికల నేపధ్యంలో ఇప్పటివరకు, ఎనిమిది భారీ ఓడల నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది. అతని హెచ్చరికలు బుక్ ఆఫ్ జెనిసిస్లోని కథనంలో పోలివుండటంతో దీనిపై చర్చజరుగుతోంది.ఈ నేపధ్యంలో ఎబో నోహ్ ప్రవచనాలు, ఓడ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు టిక్టాక్, యూట్యూబల్లలో విరివిగా వైరల్ అవుతున్నాయి.ఎబో నోహ్ అనుచరులు ఈ హెచ్చరికలను అందరికీ చెబుతున్నారు. అయితే ఎబో నోహను విమర్శించేవారు మాత్రం ఈ హెచ్చరికలను నమ్మడం లేదు. బైబిల్లో వర్ణించిన వరద ఘటన ఒకేసారి మాత్రమే జరిగిందని వారు అంటున్నారు. ఎబో నోహ్ ఎప్పటి నుంచో ఇలానే చెబుతూ వస్తున్నారని విమర్శిస్తున్నారు. కాగా ఘనా మత పెద్ద బిషప్ అబేద్ క్వాబెనా బోకియే అసియామా తదితరులు ఈ హెచ్చరికకు మద్దతు పలుకుతూ, వరద రాబోతోందనే భయంతో ఉన్న ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా ఎబో నోహ్ హెచ్చరికలకు శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: పీకే యూ టర్న్? ప్రియాంకను కలిసి.. -
అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆస్ట్రేలియాలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను కూడా బాండీ బీచ్కు వెళ్లాలనుకున్నానని.. అయితే, రెస్టారెంట్ నిర్వాహకుల అప్రమత్తతే తనను కాపాడిందని పేర్కొన్నాడు. తాను, తన కుటుంబం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నామని తెలిపాడు.కాగా బాండీ బీచ్లో కాల్పుల మోతతో ఆస్ట్రేలియా ఆదివారం ఉలిక్కి పడింది. ఇద్దరు ముష్కరులు తుపాకీలు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సంప్రదాయ హనుక్కా వేడుకలో పాల్గొంటున్న యూదులుపై కాల్పులకు తెగబడి దాదాపుగా పదహారు మందిని పొట్టనబెట్టుకున్నారు.తండ్రీ-కొడుకులేఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడగా.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులు తండ్రీ-కొడుకులే కావడం గమనార్హం. వీరు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.పండ్ల వ్యాపారి ధైర్యంమరోవైపు.. వీరిద్దరు ఉన్మాద చర్యకు పాల్పడుతుండగా అహ్మద్ అనే పండ్ల వ్యాపారి ధైర్యం ప్రదర్శించి ఓ ఉగ్రవాదిని చెట్టు వెనుక నుంచి పట్టుకుని.. అతడికే గన్ గురిపెట్టి తరిమేశాడు. ఇంతలో మరో ఉగ్రవాది అతడిపై కాల్పులు జరుపగా అహ్మద్ కుప్పకూలిపోయాడు. ఏదేమైనా అహ్మద్ లేకుంటే మరికొంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారే!ఆ శబ్దాలు వినిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ తాజాగా స్పందించాడు. బాండీ బీచ్లో కాల్పులు జరిపిన సమయంలో తాను అక్కడికి దగ్గర్లోనే ఉన్నానని తెలిపాడు. ‘‘తొలుత ఆ శబ్దాలు విని షార్క్ దాడి చేసిందేమో అనుకున్నాము. అయితే, కాసేపటి తర్వాత చెవులు రిక్కించి వినగా.. అది ఇంకేదో శబ్దమని అర్థమైంది.అపుడు నేను నా కుటుంబంతో కలిసి దగ్గర్లోని ఓ రెస్టారెంట్లో ఉన్నాను. మేము ఆర్డర్ చేసిన పదార్థాల కోసం వేచి ఉన్నాము. ఇంతలో నాకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడుతున్నా.అప్పుడు ఓ బౌన్సర్ తన చేతిలో తుపాకీ పట్టుకుని నా వైపు వేగంగా దూసుకువచ్చాడు. వెంటనే లోపలికి వెళ్లాలని నన్ను హెచ్చరించాడు. బయట జరుగుతున్న దాడి గురించి మాకు అప్పుడే తెలిసింది. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బీచ్లో చాలా మందిని బంధించారని కొంతమంది అన్నారు.లోపలి నుంచి తాళం వేశారుసిడ్నీ, ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇలాంటి దాడులు ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది. మేమున్న రెస్టారెంట్ తలుపులన్నింటికి లోపలి నుంచి తాళం వేశారు. బయట పరిస్థితి చక్కబడిందని తెలిసిన తర్వాతే మమ్మల్ని పంపించారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు మేము అక్కడే లాక్ అయిపోయాం.నా జీవితంలో ఇంతటి భయంకర అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. నాతో పాటు నా భార్య, సోదరి, నా ఇద్దరు కుమార్తెలు, వారి స్నేహితురాలు ఇలా.. అందరం అక్కడే ఉన్నాము. పిల్లలు భయపడకుండా నాలో భయాన్ని అణిచిపెట్టుకుంటూ వారికి ధైర్యం చెప్పాను. వారి గురించే నా ఆందోళన, భయం. బయట ఉన్నవారి పరిస్థితి గురించి కూడా బాధేసింది.బీచ్కు వెళ్లాలని మేము అనుకున్నాము. అక్కడే నా కుమారుడు క్రికెట్ ఆడుతూ.. పరుగులు తీస్తుంటే చూశాము. పబ్, రెస్టారెంట్ కాకుండా మా తదుపరి గమ్యం అదే అయి ఉండేది’’ అని ది టెలిగ్రాఫ్నకు రాసిన కాలమ్లో మైకేల్ వాన్ పేర్కొన్నాడు.ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలిఇక ఎక్స్ వేదికగానూ ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘బాండీ ఘటన సమయంలో మేము రెస్టారెంట్లో లాక్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాము. ఎమర్జెన్సీ సర్వీస్ వారికి ధన్యవాదాలు.అదే విధంగా.. ఉగ్రవాదిని అడ్డుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలి. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి నా సానుభూతి’’ అని మైకేల్ వాన్ పోస్ట్ పెట్టాడు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ కామెంట్రీ కోసం వాన్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు.చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు! -
లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 17 మంది మృతి
ఆంటియోకియా: ఉత్తర కొలంబియాలో విషాదం జరిగింది. లోయలో స్కూల్ బస్సు పడటంతో 17 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. విహార యాత్ర తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. బస్సు కరేబియన్ పట్టణం టోలు నుండి మెడెలిన్ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో ఆంటియోకియోకి చెందిన హై స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.ఈ ప్రమాదం ఉదయం 5:40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణికులతో బస్సు.. సుమారు 80 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ పర్యటన అధికారిక స్కూల్ కార్యక్రమం కాదని.. విద్యార్థులే స్వయంగా నిర్వహించారని పాఠశాల స్పష్టం చేసింది. మృతుల్లో బస్సు డ్రైవర్ ఉన్నారు.Un autobús con 45 estudiantes de 11° grado cayó por un barranco este domingo en Colombia, dejando al menos 16 muertos y 20 heridos. Los jóvenes viajaban en excursión desde la región Caribe hacia Medellín cuando el vehículo se salió de la vía en la zona de El Chispero, entre los… pic.twitter.com/PGsR7ljMHS— Noticiero El Salvador 🇸🇻 (@NoticieroSLV) December 14, 2025 -
తండ్రీకొడుకుల పనే
సిడ్నీ: ప్రశాంత ఆస్ట్రేలియాలో రక్తపుటేరులు పారించింది పాక్ జాతీయులైన తండ్రీకొడుకులని తేలింది. ఇద్దరు సాయుధులు ఆదివారం సిడ్నీలోని బాండీ బీచ్ను ఆనుకుని ఉన్న చిన్న పార్క్లో వేడుకల్లో మునిగిపోయిన యూదులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించి 15 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని ఆదివారమే నవీద్ అక్రమ్గా గుర్తించగా మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. సాజిద్ను పోలీసులు ఆదివారం ఘటనాస్థలిలోనే అంతంచేయగా నవీద్కు బుల్లెట్ గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించి ప్రశ్నిస్తున్నామని న్యూ సౌత్వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ చెప్పారు. సోదాల్లో నవీద్కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జెర్సీ ధరించినట్లుగా కార్డ్పై ఫొటోలో కన్పిస్తోంది. కార్డ్ ప్రకారం నవీద్ ఆస్ట్రేలియాలోనే 2001 ఆగస్ట్ 12న జన్మించారు. దీంతో నవీద్కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. తండ్రి సాజిద్ విద్యార్థి వీసాతో పాకిస్తాన్ నుంచి 1998లో ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లో ఆ వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత దానిని ‘రెసిడెంట్ రిటర్న్’ వీసాగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి టోనీ బుర్కీ సోమవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన వీసా గడువు ముగిసేలోపే ఆస్ట్రేలియాను వీడినా లేదా ఆస్ట్రేలియాకు ఆవల ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిన పక్షంలో అలాంటి వాళ్లకు తిరిగి ఆస్ట్రేలి యాలోకి అడుగుపెట్టాక ‘రెసిడెంట్ రిటర్న్’ వీసా జారీచేస్తారు. ఆ వీసాతో ప్రస్తుతం సాజిద్ ఆస్ట్రేలియాలో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలి యాకు వచ్చిన ఇన్నేళ్లలో సాజిద్ మూడు సార్లు మాత్రమే దేశం దాటాడు. గతంలో నిఘా పరిధిలో ఉన్నా..యువ నవీద్పై గతంలో కొన్ని నెలలపాటు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి. ఐఎస్ఐఎస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 2019 అక్టోబర్లో తొలిసారిగా నవీద్పై ఆస్ట్రేలియా నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఉగ్రవాదంతో సంబంధమున్న ఇద్దరికీ జైలుశిక్ష పడింది. వీళ్లతో నవీద్కు సంబంధం ఉన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. దీంతో ఇతను సైతం ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా లేదా అని తెల్సుకునేందుకు 2019 ఏడాదిలో దాదాపు ఆరునెలలపాటు అతని కదలికలపై ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్(ఏఎస్ఐవో) అధికారులు నిఘా పెట్టారు. అయితే తనపై నిఘా ఉందని ముందే పసిగట్టిన నవీద్ ఏళ్ల తరబడి ఎలాంటి ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా మంచివాడిలా నటించాడు. దీంతో వేర్పాటువాద లక్షణాలు, ప్రవర్తన ఇతడిలో లేవని భావించి నవీద్ను నిఘా వర్గాలు సీరియస్గా తీసుకోలేదు. అదను చూసి ఆదివారం ఇలా దుశ్చర్యకు పాల్పడటంతో ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థలో లోటుపాట్లపై మరోసారి సమీక్ష అవసరమనే వాదనలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం నవీద్ను మేస్త్రీ పని నుంచి ఒక సంస్థ తొలగించింది. ఆ సంస్థ ఇటీవల దివాలా తీయడంతో వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా నవీద్ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 🚨 Here’s a full 10 minute video of the terrorist attack that happened today in Bondi beach Australia. How utterly terrifying pic.twitter.com/KNr8Xo6lRU— Queen Natalie (@TheNorfolkLion) December 14, 2025 -
కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు
మాన్సా (పంజాబ్): కెనడాలోని ఎడ్మంటన్లో జరిగిన కాల్పుల ఘటన పంజాబ్లోని మాన్సా జిల్లా పరిధిలో గల రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బార్రే గ్రామానికి చెందిన గురుదీప్ సింగ్ (27), ఉద్దత్ సైదేవాలాకు చెందిన రణ్వీర్ సింగ్ (19) గుర్తు తెలియని దుండగుల కాల్పులకు బలయ్యారు. ఉన్నత కెరీర్ ఆశయాలతో విదేశాలకు వెళ్లిన తమ పిల్లలు హత్యకు గురికావడంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ హత్యలు తప్పుడు గుర్తింపు కారణంగా జరిగి ఉండవచ్చు. మరో పంజాబీ యువకుని కారులోకి ఎక్కిన గురుదీప్, రణ్వీర్లపై దుండగులు కాల్పులు జరిపారు. 19 ఏళ్ల రణ్వీర్ గత మార్చిలో కెనడాకు వెళ్లాడు. అమెరికాలో అకౌంటెన్సీ వృత్తిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగ కౌన్సెలింగ్ సెషన్కు హాజరైన తర్వాత ఎడ్మంటన్లో తన స్నేహితుడి పుట్టిన రోజు పార్టీలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడి మరో ఫ్రెండ్కు చెందిన కారులో డ్రైవర్ సీటులో కూర్చున్న సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. రణ్వీర్ మామ మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ ఘటనతో కుటుంబం షాక్లో ఉందని, కెనడియన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో యువకుడు గురుదీప్ 2023లో కెనడాకు వెళ్లాడు. ట్రక్ మెకానిక్స్లో కోర్సు పూర్తి చేసి, ఉద్యోగ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. త్వరలో తన భార్య అమన్దీప్ కౌర్ను ఇక్కడికి తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు. గురుదీప్ మామ దర్శన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం కారు యజమాని వెనుక సీట్లలో కూర్చోగా, రణ్వీర్, గురుదీప్ ముందు సీట్లలో కూర్చున్నారు. దీంతో దుండగులు తమ టార్గెట్కు భిన్నంగా గురుదీప్, రణ్వీర్లపై కాల్పులు జరిపివుంటారని దర్శన్ సింగ్ అన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు తమ వారి మృతికి గల నిజమైన కారణం కోసం, నేరానికి సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇది కూడా చదవండి: లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్ -
బాండీ బీచ్ ఘటన.. భారత్లో జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో యూదు సమాజంపై ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో యూదు ప్రార్థనా మందిరాలు, సాంస్కృతిక కేంద్రాలు, యూదు సమాజానికి చెందిన సంస్థలు ఉగ్రవాదుల లక్ష్యంగా మారే అవకాశం ఉందని గూఢచార సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాయి.సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా బాండీ బీచ్లో ఇద్దరు ముష్కరుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయాలపాలైయ్యారు. కాగా పోలీసులు కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరొక ఉగ్రవాదిని అరెస్టు చేశారు. -
72 గంటలపాటు చెట్టును కౌగిలించుకుని..
నైరోబీ: కెన్యా పర్యావరణ ఉద్యమకారిణి ట్రంఫెనా ముతోని ప్రపంచ రికార్డు సృష్టించారు. నిద్రాహారాలు మాని 72 గంటలపాటు ఒక చెట్టును కౌగిలించుకుని ఉండిపోయారు. గతంలో 48 గంటల పాటు చెట్టును కౌగిలించుకుని తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టారు. నౌరీ పట్టణంలోని ఓ ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో చెట్టును ఆమె ఇందుకు ఎంచుకున్నారు. అడవుల నరికివేత, మృగాల హత్యలకు నిరసనగా, యువతకు పర్యావరణ సంరక్షణ విలువను తెలపడానికి ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. ఆమె నిరసనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచి్చంది. చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒకానొక దశలో ఆమె నిద్రలోకి జారుకోగా.. మద్దతుదారులు మేల్కొలిపారు. కొందరైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పరిశీలకులకు ఆమె ఫీజు చెల్లించడానికి ముందుకొచ్చారు. ఈ సమయంలో ఆమె నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగుల్లో ఉన్న ఊలు టీషర్ట్ను ధరించారు. నలుపు ఆఫ్రికన్ శక్తని, ఆకుపచ్చ అడవులకు, ఆశకు ప్రతిరూమని, ఇక ఎరుపు ప్రతిఘటనకు, నీలం నీటికి గుర్తని.. చెప్పారు. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల కలిగే ప్రమాదం గురించి అవగాహన పెంచడమే తన నిరసన లక్ష్యమని చెప్పారు. తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే తమ దేశాలు.. వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆఫ్రికన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. -
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ను “పబ్లిక్” సెట్టింగ్స్లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్ఫార్మ్లలోని కంటెంట్ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
ప్రొవిడెన్స్: అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. రోడ్ ఐలాండ్స్లోని ప్రొవిడెన్స్ పట్టణంలోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు కాలేజ్కు వచ్చి పరీక్షలు రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఇద్దరు మరణించారు. 9 మంది గాయపడ్డారు. వెంటనే దుండగుడు పరారయ్యాడు. అతను 30ల్లో ఉంటాడని, నలుపు దుస్తులు ధరించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ అతడు దొరికాడన్న విషయం పోలీసులు వెల్లడించలేదు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులంతా హడలిపోయారు. రూమ్లో, బాత్రూమ్లలో, డెస్క్ కింద, జిమ్లో, ఎక్కడ వీలైతే అక్కడే గంటల తరబడి దాక్కున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాంతో వారాంతంలో అత్యంత సందడిగా ఉండే పట్టణ వీధులన్నీ దుండగుడు బయటే తిరుగుతున్నాడన్న భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. సెక్యూరిటీ చెకింగ్లను దాటుకుంటూ అతను కాలేజీలోకి హంతకుడు ఎలా రాగలిగాడు? ఫేస్ రికగి్నషన్ లాక్ రక్షణ ఉన్న క్లాస్ రూమ్ లోనికి ఎలా దూరాడు అన్నది ప్రశ్నగా మారింది. మృతులకు అమెరికా ట్రంప్ నివాళులు అర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుండగుడు హ్యాండ్ గన్ వాడినట్టు భావిస్తున్నారు. -
ముద్దుల్లో ప్రపంచ రికార్డు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరం మరోసారి ముద్దుల పోటీకి వేదికైంది. ‘నేషనల్ కిస్ అండర్ ది నేషనల్ మిజిల్టో’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జంటలు తరలివచ్చాయి. ఆంథెమ్ రోలో వేలాడదీసిన మిజిల్టో మొక్కల కింద 480 మంది జంటలు ముద్దాడటం ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. అయితే, శనివారం జరిగిన కార్యక్రమానికి సుమారు 1,435 జంటలు వచ్చి ముద్దాడుకున్నాయి. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు తరఫున న్యాయ నిర్ణేతగా వచ్చిన మైకేల్ ఎంప్రిక్ ఇక్కడికి చేరుకున్న మూడు వేలమందిని చూసి ఆశ్చర్యమేస్తోంది. వీరంతా మిజిల్టో కింద ముద్దుల చరిత్రను సృష్టించారని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న రికార్డును వీరు సులభంగా బద్దలు కొట్టారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు’అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ఒంటరిగా ఇక్కడికి ఎవరూ రాలేదన్నారు. అందరూ జంటలుగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. వీరంతా ఏకకాలంలో ఐదు సెకన్లపాటు ముద్దులు పెట్టుకుని, రికార్డు నెలకొల్పారని ఎంప్రిక్ వివరించారు. తాము కేవలం 500 జంటలు మాత్రమే పాల్గొంటాయని భావించామని, అనూహ్యంగా 6 వేల జంటలు నమోదు చేయించుకున్నాయని నిర్వాహకుడు ఎబనీ వాల్టన్ చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ఒరెగాన్లోని ఓ వ్యవసాయక్షేత్రం నుంచి 17,150 మిజిల్టో అనే గుబురుగా ఉండే పారాసైటిక్ నాచు మొక్కలను తెప్పించామన్నారు. -
యూదులపై ఉగ్రదాడి
సిడ్నీ: ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లింది. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదాంతంగా మారింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బీచ్లో ఉత్సాహంగా పండగలో పాల్గొంటున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడ్డారు. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రకటించింది. మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకోవడం, ఆయుధాలతో విరుచుకుపడడంపై కచ్చితంగా ఉగ్రవాద దాడిగా ప్రభుత్వం పేర్కొంది. యూదులపై కాల్పుల జరిపిన ఇద్దరు ముష్కరులపై పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఒకరిని మట్టుబెట్టారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రెండో ఉగ్రవాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఉగ్రవాద దాడిని ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా ఖండించారు. ఈ రాక్షస కాండ ఘటన ఆ్రస్టేలియా హృదయాన్ని గాయపర్చిందని ఉద్ఘాటించారు. దుశ్చర్య పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. యూదులపై విద్వేషాన్ని అల్బనీస్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తాజా దాడికి ఆయనే కారణమని ఆరోపించారు. విచ్చలవిడిగా కాల్పులు ప్రాచీన కాలంలో జెరూసలేం నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా యూదులు హనుక్కా పండుగను ప్రతిఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. యూదులకు ఇది ప్రధానమైన పండుగ. ఆస్ట్రేలియాలోని యూదులు బాండీ బీచ్లో హనుక్కాలో పాల్గొనడానికి భారీగా తరలివచ్చారు. వందలాది మంది గుమికూడారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సంతోషంగా ఆటపాటల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో నల్లటి దుస్తులు ధరించి అక్కడికి చేరుకున్న ఇద్దరు ముష్కరులు తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే 16 మంది విగతజీవులయ్యారు. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. బీచ్లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. యూదులపై కాల్పుల్లో జరిపిన సాయుధ దుండగుల్లో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తించారు. సిడ్నీ బానీరిగ్ ప్రాంతంలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో ఆ్రస్టేలియా ప్రజలకు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. యూకేలో భద్రత కట్టుదిట్టం ఆ్రస్టేలియాలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఖండించారు. యూదుల మరణించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. యూకేలో యూదులు నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా లండన్లో యూదుల ప్రార్థనా మందిరాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలియజేశారు. సామూహిక వేడుకల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దేశంలో ఆయుధ చట్టాలు కఠినం ఆ్రస్టేలియాలో సామాన్య జనంపై కాల్పులు ఘటనలు చాలా అరుదే. 1996లో పోర్ట్ అర్థర్ టౌన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్స్లు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు, 2018లో ఏడుగురు మృతిచెందారు. ఆయా ఘటనల్లో సాయుధులు తమ కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఉత్తర ఆ్రస్టేలియాలోని డారి్వన్ సిటీలో జైలు నుంచి పెరోల్పై బయటకు వచి్చన ఖైదీ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో క్వీన్స్లాండ్ స్టేట్లో ఓ తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. ఆ్రస్టేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, పది మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. పెచ్చరిల్లుతున్న యూదు వ్యతిరేకత ఆ్రస్టేలియా జనాభా 2.8 కోట్లు. వీరిలో 1.17 లక్షల మంది యూదులు ఉన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఆ్రస్టేలియాలోని యూదులపై దాడులు పెరిగిపోయాయి. వారి ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. యూదు వ్యతిరేక ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత ఏడాది సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో యూదులే లక్ష్యంగా దాడులు జరిగాయి. యూదుల ప్రార్థనా మందిరాలకు, వారి వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు యూదులకు తగిన రక్షణ కల్పించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ్రస్టేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.రియల్ హీరో అహ్మద్ బీచ్లో ముష్కరులు కాల్పులు జరుపుతుండగా అహ్మద్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకొని, తుపాకీను లాక్కొని అతడికే గురిపెట్టాడు. అహ్మద్ను గమనించిన మరో మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. దాంతో అహ్మద్ గాయాలపాలై కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అహ్మద్ సాహసోపేతంగా వ్యవహరించిన దృశ్యం ఆస్ట్రేలియా టీవీ చానళ్లలో ప్రసారమైంది. అతడు ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోతే ఉగ్రవాదుల కాల్పుల్లో మరికొందరు మరణించేవారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రియల్ హీరో అహ్మద్ అంటూ జనం ప్రశంసిస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి.. భారత్లో ‘హై అలర్ట్’
ఢిల్లీ: భారత్లోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో యూదుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు భారత్లోని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.హనుక్కా పండుగ ఎప్పుడు?యూదులు ఘనంగా జరుపుకునే ఎనిమిది రోజుల పండుగ హనుక్కా. ఈ పండుగ డిసెంబర్ 14 నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో యూదులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తారు. అందువల్లే పండుగ పర్వదినాన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఏ నగరాలు ప్రధాన టార్గెట్?ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం యూదు సంస్థలు, ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత పెంచారు. విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్రాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. -
ఉగ్రమూకపై తిరగబడి.. వైరల్ వీడియో
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండై బీచ్లో ఉగ్ర దాడి వేళ ఓ పౌరుడు పెద్ద సాహసమే చేశాడు. ఉగ్ర మూకపై స్థానిక పౌరుడు తిరగబడ్డాడు. కాల్పులు జరుపుతున్న ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని అతడిపైనే కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతడిని తరిమికొట్టాడు. వందలాది మంది పర్యాటకులను ఉగ్రవాదుల నుంచి ఆ వ్యక్తి రక్షించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.బాండి బీచ్ కాల్పుల ఘటనలో 10 మంది మరణించారు. బీచ్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ చేయడంతో వందల మంది పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగులను అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్లు, 30 అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు
జెరూసలేం: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ దాడి ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. ముందే అలర్ట్ చేయడంతో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదుల వేడుకలను టార్గెట్ చేసిన ఉగ్రమూక దాడిలో 10 మంది మృతిచెందగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్లు హతమయ్యారు.యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని.. యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు. I'm appalled by the murderous shooting attack at a Hanukkah event in Sydney, Australia.These are the results of the anti-Semitic rampage in the streets of Australia over the past two years, with the anti-Semitic and inciting calls of “Globalise the Intifada” that were realized… pic.twitter.com/ZMveTRIvwx— Gideon Sa'ar | גדעון סער (@gidonsaar) December 14, 2025మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు’ అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న ‘యాంటీ-సెమిటిజం’ని ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉగ్రదాడి యూదులే లక్ష్యంగా జరిగిందా? అనేదానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.బాండీ బీచ్లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని.. బాధితులకు తన ప్రగాఢ సానుభూతి’’ అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు. -
ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు
ఇదివరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి విని ఉంటారు, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల గురించి తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచంలోనే అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు ఎవరు?, వాళ్ల నెట్వర్త్ ఎంత అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)రష్యన్ అధ్యక్షుడు పుతిన్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడు. ఈయనకు ప్రధానంగా ఇంధన & సహజ వనరుల కంపెనీలలో ఎక్కువ వాటా వస్తుందని సమాచారం. దీంతో ఆయనను అత్యంత సంపన్నుడిగా గుర్తించారు. అయితే ఈయన నెట్వర్త్ ఎంత అనే విషయం అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. 200 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. సుదీర్ఘ రాజకీయ జీవితం ఈ అపారమైన సంపదకు కారణమైందని పలువురు చెబుతున్నారు.అలెగ్జాండర్ లుకాషెంకో (Alexander Lukashenko)పలు నివేదికల ప్రకారం.. సుమారు 9 బిలియన్ డాలర్ల సంపద కలిగిన అలెగ్జాండర్ లుకాషెంకో ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయం నాయకుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1994 నుంచి బెలారస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయనకు.. విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ , వ్యవసాయ, మాన్యుఫ్యాక్టరింగ్ సంస్థలలో వాటాలు ఉన్నాయని సమాచారం.డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద.. ప్రధానంగా రియల్ ఎస్టేట్, బ్రాండింగ్, హోటల్స్ & గోల్ఫ్ రిసార్ట్ల నుండి వస్తుంది. ఈయన నెట్వర్త్ సుమారు 7.2 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈయన రాజకీయ పదవిలో ఉన్న సమయం కంటే.. పెట్టుబడులు & మీడియా వెంచర్లలోనే సమయం గడిపారు. దీంతో ఆయన నెట్వర్త్ గణనీయంగా పెరుగుతూ ఉంది.కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నెట్వర్త్ దాదాపు 5 బిలియన్ డాలర్లు అని అంచనా. కానీ ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు ఈయన సంపద 40 బిలియన్ డాలర్లని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం, సైన్యం, వ్యాపారాలన్నీ కిమ్ కుటుంబం నియంత్రణలోనే ఉంటాయి. అంతే కాకుండా.. బంగారం, బొగ్గు, ఆయుధాలు, సిగరెట్లు, మద్యం ఎగుమతులు ద్వారా కూడా వీరికి ఆదాయం వస్తుంది.జీ జిన్పింగ్ (Xi Jinping)బ్లూమ్బెర్గ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంపద 1.5 బిలియన్ డాలర్లు. ఇందులో ఆయన కుటుంబ సంబంధిత ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. జిన్పింగ్ జీతం ఏడాదికి కేవలం 22,000 డాలర్లు మాత్రమే. ఇది కాకుండా ఈయనకు భూ ఖనిజాలు, టెక్ సంస్థలు, బంధువులతో ముడిపడి ఉన్న రియల్ ఎస్టేట్లో అనేక పెట్టుబడులు ఉన్నాయి.ఇదీ చదవండి: డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు.. -
ఆస్ట్రేలియాలో పహల్గామ్ తరహా టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ పహల్గాం తరహాలో సిడ్నీ బాండీ బీచ్లో ఉగ్రదాడి జరిగింది. బీచ్లోని యూదులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పదిమందికి పైగా పర్యాటకులు మృతిచెందారు. ముసుగు ధరించిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు.అయితే బీచ్లో సరదాగా గడుపుతున్న పర్యాటకులు.. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీచ్లో ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.బీచ్లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాల్పుల తర్వాత ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్కాస్టర్తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్
మెహసానా : గుజరాత్లోని మెహసానా జిల్లాకు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో పాటు పోర్చుగల్కు వలస వెళ్లే ప్రయత్నంలో లిబియాలో కిడ్నాప్కు గురయ్యారు. వీరిని కిస్మత్సింగ్ చావ్డా, అతని భార్య హీనాబెన్, కుమార్తె దేవాన్షిగా గుర్తించారు. కిస్మత్సింగ్ సోదరుడు నివసిస్తున్న పోర్చుగల్లో స్థిరపడాలనే ఉద్దేశ్యంతో వీరు నవంబర్ 29న అహ్మదాబాద్ నుండి బయలుదేరారు. వీరు దుబాయ్ మీదుగా లిబియాలోని బెన్ఘాజీ నగరానికి విమానంలో చేరుకోవలసి ఉంది. అయితే ఇంతలోనే బెన్ఘాజీలో కిడ్నాప్కు గురయ్యారు.ఈ కుటుంబం పోర్చుగల్ కేంద్రంగా పనిచేసే ఒక విదేశీ ఏజెంట్ సహాయంతో ఈ ప్రయాణం చేస్తున్నట్లు మెహసానా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాన్షు సోలంకి తెలిపారు. కిడ్నాపర్లు మెహసానాలోని చావ్డా బంధువులను సంప్రదించి, వారిని విడుదల చేయడానికి రూ. రెండు కోట్లు డిమాండ్ చేశారు.ఈ సమాచారం అందుకున్న బంధువులు.. సహాయం కోసం మెహసానా జిల్లా కలెక్టర్ ఎస్కే ప్రజాపతిని ఆశ్రయించారు.ఈ కిడ్నాప్ ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.. విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఏజెంట్లు ఎవరూ భారతీయులు కాదని సోలంకి ధృవీకరించారు. దీనిలో అంతర్జాతీయ ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చన్నారు. కాగా ఇదే తరహాలో గత జూలైలో జమ్ముకశ్మీర్కు చెందిన రంజిత్ సింగ్ .. నైజర్లోని డోస్సో ప్రాంతంలో కిడ్నాప్కు గురయ్యారు.ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు? -
Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు
కోతులు.. అత్యంత తెలివైన జంతువులు.. వాటికి జీవవైవిధ్యంలో, మానవ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన కోతులు భూమిపై గల అత్యంత ముఖ్యమైన జంతు సమూహాలలో ఒకటి. అరణ్యాలలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, విత్తనాలను వెదజల్లే ఏజెంట్లుగా అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోతులు ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న కోతుల దినోత్సవం (Monkey Day) జరుపుకుంటారు. సరదాగా మొదలై..కోతుల దినోత్సవం అనేది కేవలం కోతులను మాత్రమే కాకుండా, చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లతో సహా అన్ని రకాల సిమియన్లను (ప్రైమేట్లను) గుర్తుచేస్తుంది. మానవ కుటుంబ వృక్షంలో ప్రైమేట్స్ ఒక భాగం. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఈ జాతుల పట్ల మనకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమైన ఈ దినోత్సవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే వార్షికోత్సవంగా మారింది.కేలండర్లో సరదాగా రాయగానే..ఈ ప్రత్యేక దినోత్సవ ఆవిర్భావం 2000లో జరిగింది. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన కాసే సారో, ఎరిక్ మిల్లికిన్ అనే విద్యార్థులు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. డిసెంబర్ నెలలో సెలవు రోజులను వెదుకుతూ వారు క్యాలెండర్లో 14వ తేదీన మంకీ డే అని రాశారు. ఈ విషయాన్ని వారు తోటి స్నేహితులకు తెలిపారు. దీంతో వారంతా కోతుల తరహా ప్రత్యేక దుస్తులు ధరించి, గెంతుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ విధంగా వినోదంగా మొదలైన ఈ దినోత్సం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.మంకీ డే నాడే ‘కింగ్ కాంగ్’ విడుదలసారో, మిల్లికిన్ ఈ దినోత్సవం సందర్భంగా కొన్ని కళాకృతులు తయారుచేశారు. వీటిని ఆన్లైన్లో ప్రచురించడం ద్వారా ‘మంకీ డే’ భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి దారితీసింది. పీటర్ జాక్సన్ తీసిన ‘కింగ్ కాంగ్’(2005) మంకీ డే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. ఇది మంకీడే ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. మొదట సరదాగా ప్రారంభమైన మంకీ డే ఇప్పుడు పూర్తి స్థాయి ప్రపంచ ఆపరేషన్గా రూపాంతరం చెందింది. నేషనల్ జియోగ్రాఫిక్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్, గ్రీన్పీస్ వంటి సంస్థలు ఈ రోజున కోతులు ఎదుర్కొంటున్న ముప్పుపై అవగాహన కల్పిస్తున్నాయి. (Facts About Monkeys In Telugu)కోతులలో సుమారు 260 జాతులు ఉండగా, వాటిలోని పలు రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. బార్బరీ మకాక్ల జనాభా గత 24 ఏళ్లలో 50 శాతానికి తగ్గింది. మంకీ డే అనేది కేవలం ఉల్లాసానికి మాత్రమే కాకుండా, కోతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కలిగించేందుకు కూడా దోహపదపడుతుంది.కోతులు.. 10 అద్భుత విషయాలువిభిన్న జాతులు (Diversity): ప్రపంచవ్యాప్తంగా సుమారు 260కి పైగా రకాల కోతి జాతులు ఉన్నాయి. వీటిని ప్రధానంగా ‘పాత ప్రపంచ కోతులు’ (ఆఫ్రికా, ఆసియా), ‘కొత్త ప్రపంచ కోతులు’ (దక్షిణ, మధ్య అమెరికా)గా విభజిస్తారు.తోక ప్రాముఖ్యత (Prehensile Tails): కొత్త ప్రపంచ కోతులు (ఉదాహరణకు సాలీడు కోతులు) కొన్నిటికి ప్రత్యేకమైన తోకలు ఉంటాయి. ఇవి చెట్ల కొమ్మలను పట్టుకోవడానికి లేదా ఆహారాన్ని తీసుకునేందుకు ఒక అవయవంలా పనిచేస్తాయి.సమాజ జీవనం (Social Lives): కోతులు అత్యంత సామాజిక జీవులు. అవి సమూహాలుగా (ట్రూప్స్) జీవిస్తాయి. కొన్నిచోట్ల వందల కోతులు కలిసివుంటాయి. ఈ సమూహాలలో వాటి మధ్య బంధాలు ఉంటాయి.శుభ్రం చేసుకోవడం (Grooming): కోతులు తమ సమూహంలోని ఇతర కోతులను శుభ్రం చేస్తుంటాయి. ఇది వాటి సామాజిక బంధాలను, పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.బుద్ధి కుశలత (Intelligence): కోతులు చాలా తెలివైనవి. అవి సమస్యలను పరిష్కరించుకుంటాయి. వివిధ పరికరాలను ఉపయోగించగలవు. ఉదాహరణకు పండ్లను, కాయలను ముక్కలు చేసేందుకు రాళ్లను వినియోగిస్తాయి.వివిధ రకాల ఆహారం (Varied Diet): కోతులు సాధారణంగా పండ్లు, ఆకులు, పువ్వులు, కీటకాలు చిన్న జంతువులను తినే సర్వభక్షకాలు (Omnivores). వాటి ఆహారం జాతిని బట్టి, అవి నివసించే ప్రాంతం ప్రకారం మారుతుంటుంది.ప్రత్యేకమైన కమ్యూనికేషన్ (Unique Communication): కోతులు వివిధ రకాల శబ్దాలు, ముఖ కవళికలు, శరీర భాష ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. ప్రమాదాన్ని సూచించడానికి లేదా ఆహారం గురించి తెలియజేయడానికి ప్రతి జాతికి ప్రత్యేకమైన అరుపులు ఉంటాయి.చిన్న కోతి (Pygmy Marmoset): పిగ్మీ మార్మోసెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత చిన్న కోతి జాతి. ఇది కేవలం 5-6 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. 100 గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది.నిద్రించే విధానం (Sleeping Habits): చాలా కోతులు చెట్లపై నిద్రిస్తాయి. మాంసాహార జీవుల నుంచి సంరక్షణకే అవి అలా చేస్తుంటాయి. కొన్ని కోతులు నిద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంటాయి.మానవులకు దగ్గర సంబంధం (Close to Humans): కోతులు, ముఖ్యంగా పాత ప్రపంచ కోతులు (మకాక్లు, బబూన్లు వంటివి), మానవులకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.ఇది కూడా చదవండి: Delhi Pollution: తొలగని అంధకారం.. వైద్యుల హెచ్చరికలు -
సిరియాలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్కు చెందిన ముష్కరుడొకరు సాగించిన ఆకస్మిక దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఈ ఘటన సిరియాలో జరిగింది. CENTCOM అనేది మిడిల్ ఈస్ట్లో అమెరికన్ మిలిటరీ కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ. ఈ విషయాన్ని వారు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. BREAKING:3 U.S. soldiers shot and wounded in an ambush in Syria during an anti-ISIS patrol near Palmyra.The soldiers have been airlifted to the Al-Tanf base on the border with Iraq and Jordan pic.twitter.com/xWrlNc37RV— Visegrád 24 (@visegrad24) December 13, 2025ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు యూఎస్ సైనిక సిబ్బంది, ఒక యూఎస్ పౌరుడు ఉన్నారని CENTCOM నిర్ధారించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఆ పౌరుడు అమెరికన్ అనువాదకునిగా పనిచేస్తున్నారు. గాయపడిన ముగ్గురు సర్వీస్ సభ్యులను చికిత్స నిమిత్తం ఆల్-తన్ఫ్ గారిసన్కు హెలికాప్టర్లో తరలించారు. కాగా ఐఎస్ఐఎస్ ముష్కరుడిని అమెరికన్ బలగాలు వెంటనే ఎదుర్కొని మట్టుబెట్టాయి. ఈ దాడులు సిరియాలోని పాల్మైరా సమీపంలో జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొంటున్న సైనికులపై ఈ ఆకస్మిక దాడి జరిగింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ, ఇది ISIS దాడి అని ధృవీకరించారు. దీనికి తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. మరణించిన ముగ్గురిని అమెరికన్ దేశభక్తులుగా ట్రంప్ అభివర్ణించారు. గాయపడిన సైనికులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
5 ఏళ్లు నిండక ముందే
నిరోధించగల వ్యాధుల వల్ల పిల్లల మరణాల సంఖ్య ఈ ఏడాది పెరుగుతుందని ఓ అధ్యయనం అంచనా వేసింది. ఐదో పుట్టినరోజుకు ముందే వారు లోకం విడవడం ఆందోళన కలిగించే అంశం. వాస్తవానికి ఇటువంటి మరణాలు 25 ఏళ్లుగా తగ్గుముఖం పట్టాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అధ్యయన అంశాలను పొందుపరుస్తూ గేట్స్ ఫౌండేషన్ తన గోల్కీపర్స్–2025 నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం గతేడాది ప్రపంచవ్యాప్తంగా 46 లక్షల మంది పిల్లలు ఐదేళ్ల వయసు వచ్చేలోపే మరణించారు. 2025లో ఈ సంఖ్య 48 లక్షలకు చేరుతుందని అధ్యయనం అంచనా వేసింది. నిరోధించగల వ్యాధుల వల్లే కన్నవారికి వారు దూరం అవుతున్నారని.. టీకాలు, ఇతర చికిత్సలతో కూడిన ఆధునిక వైద్యం ఈ మరణాలను నిరోధించగలదని నివేదిక స్పష్టం చేసింది. గ్లోబల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఫర్ హెల్త్ (డీఏహెచ్) నిధులు పెద్ద ఎత్తున క్షీణిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. భారీగా తగ్గుముఖం..: డీఏహెచ్ కింద యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి ధనిక దేశాలు, స్వచ్ఛంద సంస్థలు తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలకు ఆరోగ్య కార్యక్రమాల కోసం నిధులు సమకూరుస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, ప్రజాశ్రేయస్సు మెరుగుదలను డీఏహెచ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో డీఏహెచ్ 80 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. గతేడాది ఇది 49.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది మరింత తగ్గి 39 బిలియన్ డాలర్లు నమోదు కావొచ్చని అంచనా. వినాశకర పరిణామాలు..: నిధుల కోతలు కొనసాగితే పరిణామాలు వినాశకరంగా ఉంటాయని గోల్కీపర్స్–2025 నివేదిక హెచ్చరించింది. డీఏహెచ్ నిధులు 20% తగ్గితే 2045 నాటికి అదనంగా 1.2 కోట్ల మంది పిల్లలు చనిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కోతలు 30 శాతానికి చేరుకుంటే 2045 నాటికి 1.6 కోట్ల మంది పిల్లల మరణాలు సంభవిస్తాయని నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలను చంపేస్తున్న మలేరియా, హెచ్ఐవీ/ఎయిడ్స్, నవజాత శిశువులకు వచ్చే ముప్పులను నివారించే అవకాశాలూ మనముందు ఉన్నాయని గుర్తుచేసింది.పరిష్కారం ఇదిగో..ప్రాథమిక ఆరోగ్యానికి ప్రాధాన్యం: బలమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు అత్యంత తెలివైన నిర్ణయం. ఏటా ఒక వ్యక్తికి 100 డాలర్ల (రూ. 9,000) కంటే తక్కువ ఖర్చుతో ఈ వ్యవస్థలు 90% వరకు పిల్లల మరణాలను నివారించగలవు. నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే పసిగడతాయి. సురక్షితమైన ప్రసవాలు జరుగుతాయి.ఇమ్యునైజేషన్ రెట్టింపు: నిరంతర ఇమ్యునైజేషన్ ప్రక్రియ అత్యుత్తమ విధానం. టీకాలకు ఖర్చు చేసే ప్రతి డాలర్.. ఆర్థిక, సామాజిక ప్రయోజనాల రూపంలో 54 డాలర్ల రాబడిని అందిస్తుంది. న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ల డోసుల తగ్గింపు వంటి ఆవిష్కరణలు 2050 నాటికి దాదాపు 2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఆదా చేయగలవు.తదుపరితరం ఆవిష్కరణల్లో పెట్టుబడి: 2045 నాటికి మలేరియా నివారణలో భాగంగా నూతన సాధనాలు 57 లక్షల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలవు. రెస్పిరేటరీ సిన్సీíÙయల్ వైరస్, గ్రూప్–బి స్ట్రెప్టోకాకస్ వంటి ముప్పుల కట్టడి కోసం ప్రసూతి టీకాలను పెంచడం 34 లక్షల మంది పిల్లలను కాపాడగలదని అంచనా.ప్రపంచం ధనికంగా మారింది. అయినప్పటికీ అత్యంత పేద పిల్లలకు సహాయపడే డబ్బులో మనం అసమాన కోతలు విధించినందున వారిలో ఎక్కువ మంది చనిపోతుండటం విషాదకరం. మానవ చరిత్రలో అత్యంత అధునాతన శాస్త్ర, ఆవిష్కరణలను పొందగలిగిన తరం మనదే కావచ్చు. కానీ ఈ తరం ప్రాణాలను కాపాడేలా నిధులు సమకూర్చుకోలేకపోయాం. – బిల్ గేట్స్, ఛైర్మన్, గేట్స్ ఫౌండేషన్ -
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని రోడ్ ఐలాండ్లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో విద్యార్థులు తుది పరీక్షలు రాస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఒక ఆగంతకుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నిందితుని జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. There is currently heavy Providence Police and Fire presence on Hope Street near Brown University. Please exercise caution and avoid this area until further notice.— Providence Police (@ProvidenceRIPD) December 13, 2025We are actively monitoring the shooting at @BrownUniversity. Our teams at @RIStatePolice and @RhodeIslandEMA are working closely with local law enforcement. Please stay clear of the area and monitor official channels for updates. Praying for our community.— Governor Dan McKee (@GovDanMcKee) December 13, 2025బారస్ అండ్ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇది ఏడు అంతస్తుల భవనం. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతోంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ పోలీస్ టిమోతీ ఓ'హారా ప్రకారం.. నిందితుడు ముదురు రంగు దుస్తులు ధరించాడు. దాడి జరిగిన ఇంజనీరింగ్ భవనం నుండి అతను బయటకు వెళ్లడం చివరిసారిగా కనిపించింది. ఈ సందర్భంగా మేయర్ బ్రెట్ స్మైలీ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ‘షెల్టర్-ఇన్-ప్లేస్’ అమలులో ఉందని ప్రకటించారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, పరిస్థితి సద్దుమణిగే వరకు బయలకు రాకూడదని కోరారు.గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకడగా ఉందని మేయర్ స్మైలీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన విద్యార్థులలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. ఒక విద్యార్థి తన వసతి గృహంలో ప్రాజెక్ట్పై పని చేస్తుండగా సైరన్లు, సందేశం విని తన భయపడ్డానని తెలిపారు. మరో ల్యాబ్లోని విద్యార్థులు హెచ్చరిక అందగానే డెస్క్ల కింద దాక్కుని, లైట్లు ఆపివేశామన్నారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మనం బాధితుల కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్'లో, ఎఫ్బిఐ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. అయితే, నిందితుడు అదుపులో ఉన్నాడని మొదట చెప్పినప్పటికీ, తరువాత అతను పోలీసుల అదుపులో లేడని స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తూ, ఈ వార్తను తాను విన్నానని ఎఫ్బిఐ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నదని, బాధితుల కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ‘షాక్ అయ్యాను’.. మెస్సీ కార్యక్రమంపై మమతా క్షమాపణలు -
సన్ క్యాండిల్
సకల ప్రాణకోటికి దినకరుడే ప్రత్యక్ష దైవం. నిత్యం ఉదయిస్తూ, అస్తమిస్తూ ప్రకృతిలో భిన్న కాలాలకు సూరీడే కారణభూతంగా నిలుస్తున్నాడు. సకల చరాచర జీవకోటికి శక్తిప్రదాతగా దేదీప్యమానంగా వెలిగిపోయే సూర్యుడు ఇదే ప్రకృతిలో ఎన్నెన్నో వింతలకు హేతువుగా ఉన్నాడు. అందులో ఒకటే సన్ క్యాండిల్. సముద్ర మట్టం నుంచి అత్యంత ఎత్తులో కదలాడే సిర్రస్ మేఘాల్లోని స్ఫటిక మంచు బిందువుల కారణంగా ఈ సూర్య కొవ్వుత్తులు వెలిగి చూపరులకు నేత్రానందం కల్గిస్తున్నాయి. తాజాగా ఆ్రస్టియాలోని ఒక మంచుమయ పర్వత సానువుల్లో స్కీయింగ్ చేస్తున్న ఒక బృందం ఎదుట ఈ సన్ క్యాండిల్ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి వాళ్లంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అత్యంత అరుదైన ఈ వింతను అక్కడి స్కీయర్ లెంకా ల్యాంక్ వెంటనే తన కెమెరాకు పనిచెప్పారు. ల్యాంక్ తీసిన ఈ వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘‘సైన్స్ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లుగా హఠాత్తుగా ఏర్పడిన ఈ వింతను చూసి కంగారుపడ్డా. దగ్గరికెళ్లి చూద్దామనుకున్నాగానీ భయపడిపోయా. ఎందుకంటే సమాంతర విశ్వానికి ఇది ముఖద్వారమేమో అన్నట్లు అనిపించింది’’అని లెంకా ల్యాంక్ వీడియో లైసెన్సింగ్ వేదిక అయిన ‘వైరల్హోగ్’లో రాసుకొచ్చారు.ఎలా ఏర్పడుతుందంటే?.. ఇదొక సూర్యకాంతి సంబంధ దృగి్వషయం. సిర్రస్ మేఘాల మీదుగా కాంతి నేల మీదపై పడే సందర్భాల్లో ఈ సన్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. మంచు పొగలో కోట్ల సంఖ్యలో అతి సూక్ష్మ, స్ఫటికాకార, సమతల మంచు బిందువులు ఉంటాయి. వీటిల్లో కొన్ని భూమికి సమాంతరంగా ఏర్పడినప్పుడు చూడ్డానికి అవన్నీ స్ఫటికాల్లా ప్రవర్తిస్తాయి. అంటే అద్దంలా అన్నమాట. తమ మీద పడిన కాంతిని అచ్చంగా మళ్లీ అదే దిశలో పరావర్తనం చెందిస్తాయి. అలా పై నుంచి కిందకు వచ్చే కాంతి కిరణాలను ఈ స్ఫటిక బిందువులు తిరిగి ఎగువ దిశలో పంపిస్తాయి. దీంతో వెండి రంగులో దేదీప్యమానంగా వెలిగిపోయే కొవ్వొత్తులు ఏర్పడతాయి. సాధారణంగా పర్వత శిఖరాల వంటి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో సన్ క్యాండిల్ ఆవిష్కృతమవుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లోనే ఈ క్యాండిళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. సూర్యకాంతి పుంజం ఇలా పడి మళ్లీ అలా పైకి వెళ్తుండటంతో వీటిని సూర్య స్తంభాలు అని కూడా అంటారు. విమానాల్లోంచి కిందకు చూసినప్పుడు కూడా మంచు పర్వతాల సమీపంలో ఇలాంటి కాంతి కొవ్వొత్తులను చూడొచ్చు. ఎంత ఎక్కువగా స్ఫటిక మంచు బిందువులు ఒకే కోణంలో ఏర్పడతాయో అంతగా అతిపెద్ద కొవ్వొత్తి ఏర్పడుతుంది. అప్పుడు దానిని నేరుగా కంటితో చూడలేం. అంత ధగద్దాయమానంగా అది వెలిగిపోతుంది. మేఘాల లోపలి నుంచి దూసుకెళ్తున్నప్పుడు ఇలాంటివి కొన్ని సార్లు విమాన కాక్పిట్లోని పైలట్ల కంట పడతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తతలు
ఢాకా: సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హాదీపై కాల్పుల ఘటన బంగ్లాదేశ్లో అలజడి సృష్టించింది. తీవ్రంగా గాయపడిన హాదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా దేశవ్యాప్తంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆపద్ధర్మ ప్రభుత్వా ధిపతి మహ్మద్ యూనస్ భద్రతాధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇంక్విలాబ్ మంచ్ నేత హాదీ వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎన్ని కల్లో పోటీ చేయనున్నారు. సెంట్రల్ ఢాకాలోని బిజొయ్నగర్ ప్రాంతంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దగ్గర్నుంచి కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు భద్రతపై భరో సా కల్పించేందుకు, అక్రమ ఆయుధాల బెడద ను తొలగించేందుకు రెండో దశ ఆపరేషన్ డేవిల్ హంట్ను త్వరలో మొదలు పెడతామని హోం శాఖను పర్యవేక్షిస్తున్న రిటైర్డు లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి మీడియాకు తెలిపారు. మాజీ మంత్రి నివాసంపై ఫిబ్రవరిలో దాడి జరి గిన నేపథ్యంలో ప్రభుత్వం ఆపరేషన్ డేవిల్ హంట్ మొదటి దశను చేపట్టింది. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులే ఈ ఆపరేష న్ లక్ష్యమని ఆరోపణలున్నాయి. హాదీపై కాల్పు లు జరిపిన దుండగుల్లో ఒకడైన ఫైజల్ కరీం మసూద్ గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.37 లక్షల వరకు బహుమానం అందజేస్తామ ని చౌదరి ప్రకటించారు. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలకంగా ఉన్నారు. అప్పటి ఉద్యమ నేతలకు ప్రత్యేక భద్రత కల్పిస్తామని చౌదరి తెలిపారు. హాదీపై జరిగిన హత్యాయత్నాన్ని ఇంక్విలాబ్ మంచ్ తీవ్రంగా ఖండించింది. నిషేధిత అవామీ లీగ్ నేతలందరినీ ఉగ్రవాదులుగా పేర్కొన్న ఇంక్విలాబ్ మంచ్.. వారందరినీ అరెస్ట్ చేయాలంటూ శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలతో ఉ ద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ పార్టీని భూస్థాపి తం చేయాలని మంచ్ డిమాండ్ చేస్తోంది. -
ఢీ కొట్టింది నేనే!
ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ప్రవర్తనే మన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. ఆ్రస్టేలియాలోని ఒక పార్కింగ్ స్థలంలో జరిగిన సంఘటన, అక్కడి పౌరుల నైతికతకు అద్దం పట్టింది. ఎవరో ఒక వ్యక్తి, అనుకోకుండా పార్క్ చేసిన కారును ఢీకొట్టాడు. మన ఊహ ప్రకారం.. భయపడిపోవాలి.. పలాయనం చిత్తగించాలి. మౌనంగా ఉండాలి.. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ వ్యక్తి పరారైపోలేదు. జరిగిన నష్టానికి నైతిక బాధ్యత స్వీకరించాడు. తన పేరు, చిరునామా, బీమా వివరాలను ఒక కాగితంపై రాసి పెట్టాడు. విదేశాల్లోని పౌర స్పృహ, నిజాయితీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన దేవాంగ్ సేథి అనే భారతీయుడు ఈ సంఘటన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు.కాగితంపై ఏముంది? వీడియోలో సేథి మాట్లాడుతూ, తాను ఒక పార్క్లో ఉన్నప్పుడు ఈ నోట్ను గమనించానన్నారు. ఎవరో ఒక వ్యక్తి అనుకోకుండా మరో కారును ఢీకొట్టాడని తెలిపారు. కానీ ఆయన పారిపోకుండా, కారు యజమాని నష్టపరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా, ఒక కాగితంపై తన పేరు, వాహనం రిజి్రస్టేషన్ నంబర్, ఇన్సూరెన్స్ వివరాలను స్పష్టంగా రాసిపెట్టారని వివరించారు. బీమా సంస్థను ఎలా సంప్రదించాలో కూడా అందులో సూచించారని ప్రశంసించారు. ఆ నోట్ను సేథి కెమెరాకు చూపిస్తూ, ఇది బాధ్యతాయుత ప్రవర్తనకు స్పష్టమైన ఉదాహరణని కొనియాడారు. భారత్లో ఊహించగలమా?..ఈ దృశ్యాన్ని చూసిన సేథి, తాను తరచూ స్వదేశంలో (భారత్లో) చూసిన పరిస్థితులతో ఈ సంఘటనను పోల్చారు. ‘భారత్లో ఎవరైనా ఇంకొకరి కారును గుద్దితే, వాళ్లు సాధారణంగా అక్కడి నుంచి పారిపోతారు’.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలే.. కొన్ని సమాజాలు ఇతరుల కంటే మెరుగ్గా పనిచేయడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఒక దేశం గొప్పగా మారుతుందంటే, దానికి కారణం అక్కడి మంచి మనుషులు మాత్రమే’.. అని సేథి తన వీడియోను ముగించారు. పౌర ధర్మంలోనే దేశ వైభవం నిజాయితీ అనేది అసాధారణ చర్య కాకూడదు, అది సమాజపు ఊపిరి కావాలి. ఈ చిన్న నోట్, కేవలం ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి మాత్రమే కాదు. ఇది బాధ్యత, నైతికత, సామాజిక విలువలపై ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉది్వగ్న చర్చకు తెరలేపింది. కొందరు దీనికి విద్యా వ్యవస్థను, నాయకత్వాన్ని ఆపాదించవచ్చు. కానీ అంతిమ సత్యం ఒక్కటే: ఒక దేశ వైభవం దాని భవంతులలో కాదు, దాని ప్రజల చిన్న చిన్న పౌర ధర్మంలో దాగి ఉంది. చేసిన తప్పును అంగీకరించే ఆ క్షణంలోనే, ఒక దేశపు అంతరాత్మ ప్రతిబింబిస్తుంది. చిన్న నోట్తో.. ప్రపంచానికి పాఠం చెప్పిన ఆ్రస్టేలియన్ స్ఫూర్తి ఇది.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను!
పొరుగు దేశాల భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే జిత్తుల మారి చైనా ఇప్పుడు రష్యాపై కన్నేసింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చి.. మ్యాపులు విడుదల చేసే డ్రాగన్ దేశం ఇప్పుడు రష్యా-చైనా సరిహద్దుల్లోని ఓ ద్వీపం తమదేనని వాదిస్తోంది. దీనిపై రష్యా నిఘా వర్గాలు ఇది నిజమేనంటూ నివేదికలు అందజేశాయి. అసలు ఆ ద్వీపం కథేంటి? శతాబ్దన్నర క్రితం చైనా ఆ ద్వీపాన్ని కోల్పోవడానికి కారణాలేంటి? దీనిపై సాక్షి డిజిటల్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం ఇది..రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. ఉస్సూరీ-అమూర్ నదుల సంగమం వద్ద అతిపెద్ద ద్వీపం ఉంది. దీన్ని బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్గా పిలుస్తారు. 150 ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ద్వీపంపై చైనా కన్నేసింది. ఈ ద్వీపాన్ని ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇటీవల రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బీ 8 పేజీల నివేదికను అందజేసింది. ఆ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొంది. అమెరికా మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’.. అదేవిధంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక దీనిపై కథనాలను ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ఐల్యాండ్ పూర్తిగా చైనాదేనని పేర్కొనడమే కాకుండా.. ఆ దీవి పేరును మార్చివేసింది. అంతేకాదు.. రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టోక్ కూడా తమ భూభాగమేనని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ మ్యాప్ స్పష్టం చేస్తోంది.బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే..! కానీ, 150 ఏళ్ల క్రితం.. అంటే.. 19వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది. ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. భద్రత దృష్ట్యా ఈ దీవిని రష్యాకు అప్పగించింది. రష్యాకు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఈ దీవి అప్పట్లో అవసరంగా మారింది. 1958లో జరిగిన ఒప్పందం ప్రకారం అమూర్ నదికి ఉత్తరాన ఉన్న విశాలమైన ప్రాంతాన్ని రష్యాకు అప్పటించింది. 1860లో మరో యుద్ధంలో చైనా ఓడిపోవడం.. పాశ్చాత్య దేశాలకు రష్యా సహకరిస్తుందనే భయంతో ‘పెకింగ్ ఒప్పందం’ చేసుకుంది. ఈ రెండు ఒప్పందాల ప్రకారం ఈ దీవితోపాటు.. సువిశాలమైన భూభాగం రష్యా సొంతమైంది. ఆ వెంటనే రష్యా ఇక్కడ వ్లాదివోస్తోక్ నగరాన్ని నిర్మించింది.ఐదు దశాబ్దాల క్రితం నుంచి చైనా సంస్కరణల బాటలో దూసుకుపోతున్నది. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా బలోపేతమవుతుండడంతో.. క్రమంగా ఈ ప్రాంతాలపై వివాదాలు రాజుకున్నాయి. రష్యా-చైనా మధ్య 4,200 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సరిహద్దు ఉంది. 60వ దశకంలో కూడా ఈ సరిహద్దు వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1990-2000 మధ్యకాలంలో ఈ వివాదం మరింత ముదిరింది. దాంతో.. పలు ఒప్పందాలు కుదిరాయి. అయినా డ్రాగన్ తన కవ్వింపు చర్యలకు ఫుల్స్టాప్ పెట్టకపోవడంతో 2008లో రష్యా కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్లో కొంత భాగం చైనాకు చెందుతుంది.ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంతో రష్యా ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కకుపోయింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో అతలాకుతలమమయ్యింది. దీంతో డ్రాగన్ మరోమారు కుయుక్తులకు తెరతీసింది. ఓ వైపు రష్యాను మిత్రదేశంగా పేర్కొంటునే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను కాదని రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించింది. మరోవైపు బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ని హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ చైనా తన చర్యలను మరింత ముమ్మరం చేస్తే.. రష్యా దానిని ఎదుర్కోగలదా? ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే.. అది ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -హెచ్.కమలాపతి రావు -
పాకిస్థాన్కు.. అమెరికా మరో వరం
జీ7 దేశాలను కాదని.. భారత్ సహా ఐదు దేశాలతో కోర్-5 దేశాల కూటమి ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్పై వరాల జల్లులను కంటిన్యూ చేస్తున్నారు. వాణిజ్యం, అప్పులు, ఇతరత్రా సహాయసహకారాలు అందించడంలో ఇప్పటికే పాకిస్థాన్కు అగ్రతాంబూలం ఇస్తున్న ట్రంప్ సర్కారు.. తాజాగా పాక్ యుద్ధ విమానాలు – ఎఫ్16 అప్గ్రేడేషన్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా 686 మిలియన్ డాలర్లు.. అంటే.. సుమారు 5,800 కోట్ల రూపాయలను వెచ్చించనుంది.పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత పాక్ ప్రతిస్పందనకు ధీటుగా బదులిచ్చేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. అయితే.. భారత్తో పోలిస్తే.. పాకిస్థాన్ వద్ద అధునాతన యుద్ధ విమానాలున్నాయి. అమెరికా సరఫరా చేసిన ఎఫ్16, చైనా అందజేసిన జే10సీ వంటి యుద్ధ విమానాలు పాకిస్థాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అయినా.. భారత్ తన సంప్రదాయ మిరాజ్, మిగ్ విమానాలతో పాకిస్థాన్ పీచమణిచింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ ఆ సమయంలో బంకర్లలో తలదాచుకోవడంతో.. అధునాతన యుద్ధ విమానాలున్నా పాకిస్థాన్ ఏమీ చేయలేకపోయింది.నిజానికి ఆపరేషన్ సిందూర్లో భారత్కు చెందిన రాఫెల్ను కూల్చేశామని పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది. అదే సమయంలో పాకిస్థాన్కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16లు భారత్ దాడిలో ధ్వంసమైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఒక విధంగా అమెరికాకు తీవ్ర అవమానం. దీంతో అగ్రరాజ్యం పాకిస్థాన్కు ఇచ్చిన యుద్ధ విమానాలను మరింత సమర్థంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ 5,800 కోట్ల రూపాయలతో పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను అమెరికా పార్లమెంట్కు పంపింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ చేసిన ప్రతిపాదన ఇప్పుడు అమెరికా పార్లమెంట్ ముందు ఉంది. దీనిపై కాంగ్రెస్ ఆమోదం లేదా తిరస్కరణకు 30 రోజుల సమయం ఉంది. ఆ వెంటనే అమెరికా తన మిత్రదేశమైన పాక్కు లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ను జారీ చేస్తుంది. ఆ వెంటనే పాకిస్థాన్లోని ఎఫ్16 యుద్ధ విమానాల అప్గ్రేడ్ ప్రక్రియ మొదలవుతుంది. 686 మిలియన్ డాలర్ల ప్రతిపాదనలో వేర్వేరు కేటగిరీల వారీగా ఆ ఏజెన్సీ వివరాలను కాంగ్రెస్కు అందజేసింది. దాని ప్రకారం 37 మిలియన్ డాలర్లను ఎఫ్16లో ఉపయోగించే కీలక పరికరాలకు వెచ్చిస్తారు. మిగతా 649 మిలియన్ డాలర్లను హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, లాజిస్టిక్స్కు కేటాయిస్తారు.సరే.. పాకిస్థాన్కు అమెరికా చేసే ఈ సాయంతో భారత్కు నష్టమేంటి? అనుకుంటున్నారా? దీని ప్రభావం మనదేశంపై తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఎఫ్16లో అత్యంత కీలకమైన అప్గ్రేడేషన్స్పై అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా 92 లింక్-16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్ని పాకిస్థాన్కు అందజేయనుంది. ఈ సాంకేతికత అమెరికాతోపాటు.. నాటో దేశాల వద్ద మాత్రమే ఉంది. అంటే.. క్లిష్టపరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాల మధ్య జామ్-ప్రూఫ్ కమ్యూనికేషన్కు ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఇప్పుడు పాకిస్థాన్కు అందుతుంది. దీంతోపాటు.. కొత్త ఏవియానిక్స్, క్ట్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, విడిభాగాలను అమెరికా అందజేస్తుంది. ఇక ఎఫ్16పై పైలట్లకు సమర్థమైన ట్రైనింగ్ ఇచ్చేలా సిమ్యులేటర్లను అందజేయనుంది. అయితే.. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నుంచి భారత్కు మరింత ముప్పు పెరిగే ప్రమాదాలున్నాయి. అయితే.. శత్రువు కదలికలను నిశితంగా పరిశీలించే భారత ప్రభుత్వం .. ముప్పును ఎదుర్కోవడంలో చాణక్య నీతిని ప్రదర్శిస్తుందని ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచదేశాలు గుర్తించాయి. ఇప్పుడు ఎఫ్16ల అప్గ్రేడేషన్ ముప్పును కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఆశిద్దాం..!-హెచ్.కమలాపతి రావు -
చుట్టూ అగ్నికీలలున్నా బెదరలే, తెగువ చూపింది!
ఆపద సమయంలో చురుగ్గా స్పందించాలి. అది ఎంతటి ప్రమాదమైనా సరే.. గాభరా పడకుండా తప్పించుకునే మార్గాలున్నాయా అనేది ఆలోచించాలి. ఆందోళన పడితే బుర్ర పనిచేయదు.. ఏం చేయాలో తోచదు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ధైర్యంగా అడుగుముందుకేయాలి. ఫిలిప్పీన్స్లోని సెబులోని మాండ్యూ నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒక మహిళ సరిగ్గా ఇలాగే చేసింది. తన పెంపుడు కుక్కల్ని కూడా కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఫిలిప్పీన్స్లో ఇటీవల భారీ అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ నివసిస్తున్న భవనంలో మంటలు చుట్టుముట్టాయి. ఎటు చూసినా దట్టమైన, నల్లటి తీవ్రమైన పొగ వ్యాపించింది. తన రెండు పోమెరేనియన్లను కుక్కల్ని వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. అందుకే అంత ఆపదలోనూ తెలివిగా, అంతకుమించిన మానవత్వంతో ఆలోచించిందా మహిళ. భవనంలో మంటలు చెల రేగుతున్న సమయంలో వాటిని మూడో అంతస్తులోని రైలింగ్పైకి విసిరి వాటిని కాపాడింది. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బంది వేసిన ల్యాడర్ ద్వారా చాలా జాగ్రత్తగా కిందికి దిగింది. రెండు నిమిషాల వీడియో ఆన్లైన్లో ఆకర్షణీయంగా మారింది. దీంతో ఆమెను షీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఏకంగా 30 లక్షలకుపైగా వ్యూస్ను సాధించడం విశేషం. ICYMI: This is real courage.During a massive fire in Mandaue City, Cebu, Philippines, a woman refused to leave without her dogs.As flames spread, she climbed onto a ladder, threw each dog down to safety, then hung by her hands from the railing while firefighters climbed up to… pic.twitter.com/unDE6PcyUG— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) December 13, 2025 -
ఇది పాక్ ప్రధాని తప్పిదమా.? లేక కావాలనే చేశారా?
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఇప్పుడు ఒక్క ఫోటో కారణంగా ట్రోలింగ్ బారిన పడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసు క్రమంలో ఒక్కరే కూర్చుని ఉన్న ఫోటో ఇప్పుడు ట్రెండింగ్,గా ఆపై ట్రోలింగ్గా మారిపోయింది. రష్యా అధ్యక్షుడి కోసం దాదాపు 40 నిమిషాల పాటు నిరీక్షించారు షెహబాజ్. ఇది తుర్కిస్థాన్ దేశంలో చోటు చేసుకున్న ఘటన. ఆష్కాబాద్లో పాక్ ప్రధాని-రష్యా అధ్యక్షుడి సమావేశం జరగాల్సి ఉండగా అది కాస్త బాగా ఆలస్యమై పోయింది. మరి పుతిన్ కావాలనే వెయిట్ చేయించారో.. లేక ప్రత్యేక పరిస్థితల్లో ఆలస్యమైందో అనేది ఆయనకే తెలియాలి. అయితే గతంలో కూడా ట్రంప్.. పుతిన్కు ఫోన్ చేసిన సందర్భాల్లో కూడా ఆయన ఇలానే వ్యవహరించిన ఘటన గుర్తుకొస్తుంది. నాలుగైదు నెలల క్రితం ట్రంప్ ఫోన్ చేసిన సమయంలో పుతిన్ అధ్యక్ష కార్యాలయంలో సిబ్బంది ఫోన్లోకి టచ్లోకి వచ్చేవారు. పుతిన్ ఏదో అత్యవసర సమావేశంలో ఉన్నారని వారు చెప్పేవారే కానీ, పుతిన్ ఆ ఫోన్ను తీసుకునేవారు కాదు. ఇదంతా పుతిన్ చర్యగానే అప్పట్లో వైరల్ అయ్యింది. ట్రంప్ను కావాలనే పుతిన్ వెయిట్ చేయించారనే వార్తలు వచ్చాయి. ఈ యాంగిల్లో చూస్తే పుతిన్ తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలనే వ్యక్తులను వెయిట్ చేస్తారనే చెప్పక తప్పదు. మరి షెహబాజ్ను కూడా ఇలానే వెయిట్ చేయించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కొంతమంది షెహబాజ్కు తిట్టిపోస్తున్నారు. అంతసేపు వెయిటింగ్ అవసరమా అంటూ పాకిస్తానీయులు ట్రోలింగ్ చేస్తున్నారు.షెహబాజ్ గేట్ క్రాసింగ్.. షెహబాజ్ వెయింట్ అనేది విమర్శల బారిన పడితే, ఆయన గేట్ క్రాసింగ్ ఎపిసోడ్ మరింత చర్చకు దారి తీసింది. పుతిన్ ఎంతకూ రాకపోయేసరికి షెహబాజ్ నేరుగా పుతిన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడకు వెళ్లిపోయారు. ఆ సమయంలోటర్కీ అధ్యక్షుడు ఎర్గోడన్తో సమావేశంలో ఉన్నారు. అయితే ఎదురుచూపులు చాలనుకున్న షెహబాజ్.. నేరుగా పుతిన్ ఉన్న దగ్గరకు వెళ్లిపోయారు. అలా వెళ్లి ఇలా వచ్చేసారు కూడా. అయితే అక్కడ ఏమైందనేది తెలియకపోయినా షెహబాజ్న వేచి ఉండండి అని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇది పాక్ ప్రధానికి జరిగిన అవమానమే అయినా ఎటువంటి అనుమతి లేకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించి షెహబాజ్ ఇలా చేశారు. ఇది గేట్ క్రాసింగ్ కిందుకు వస్తంది. అసలు గేట్ క్రాసింగ్ అంటే ఏమిటి..?అంతర్జాతీయ సంబంధాల్లో నాయకులు, ప్రతినిధులు కలిసే సమయంలో ప్రోటోకాల్ అనేది అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రోటోకాల్లో ప్రవేశ క్రమం, గ్రీటింగ్ విధానం, సీటింగ్ ఆర్డర్, ఫ్లాగ్ ప్రదర్శన వంటి అంశాలు ఉంటాయి. ఒక నాయకుడు ఆతిథ్యుడు ముందుగా ఆహ్వానించకముందే గేట్ దాటి ముందుకు వెళ్లడాన్ని గేట్ క్రాసింగ్ అంటారు.. ఇది షెహబాజ్ ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు అభిప్రాయపడుతుండగా, ఇది సాధారణ తప్పిదంగా మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా అంతర్జాతీయ అంశాలకు వచ్చేసరికి ఇవి చాలా ప్రాధన్యత సంతరించుకుంటాయి. ఆ క్రమంలోనే షెహబాజ్ గేట్ క్రాసింగ్ ఎపిసోడ్ వైరల్గా మారిపోయింది. ఇలా జరగడం తొలిసారా?ఇలా ఒక దేశ అధ్యక్షుడు వేరే వారితో సమావేశంలో ఉన్నప్పుడు మరో దేశ ప్రతినిధి.. ఇలా వెళ్లడం చాలా అరుద అనే చెప్పాలి. అంతర్జాతీయ సమావేశాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ ఇలా గేట్ క్రాసింగ్ చేయడం అనేది తొలిసారిగా జరిగిన ఘటనగానే కొందరు పేర్కొంటున్నారు.. సాధారణంగా నాయకులు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం వచ్చిన తర్వాతే ప్రవేశిస్తారు. కానీ షెహబాజ్ షరీఫ్ పుతిన్–ఎర్డోగాన్ సమావేశం జరుగుతున్న గదిలోకి నేరుగా వెళ్లడం అంతర్జాతీయ స్థాయిలో మొదటి సారి పెద్దగా హైలైట్ అయిన ఘటన.గా మారింది, కొసమెరుపు..ఇది షెహబాజ్ తెలిసే చేసేరా.. లేక పొరపాటును ఓపిక నశించి ఇలా చేశారనేది ఆయనకే తెలియాలి. ఇదీ చదవండి:భారత్తో ట్రంప్ దాగుడు మూతలు..! -
భారత్తో ట్రంప్ దాగుడు మూతలు..?
ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను చూస్తే.. భారత్తో అమెరికా దూరం పెరిగిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ఏ విషయాన్ని తెగేసి చెప్పకుండా భారత్-పాక్ల యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకున్న ట్రంప్.. మద్దతు విషయానికొచ్చేసరికి పాక్కే ప్రయారిటీ ఇచ్చారు. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్లను అమెరికాకు ఆహ్వానించడమే కాకుండా వారితో రాసుకుపూసుకుని తిరిగారు. ఇక్కడ ట్రంప్ ద్వంద్వ వైఖరి బయటపడింది. భారత్పై ఆంక్షలే లక్ష్యంగా..అదే సమయంలో భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్ను హెచ్చరించారు కూడా. భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంలో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.ఇదిలా ఉంచితే, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్ను చాలాసార్లే హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. తాము భారత్కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. మెక్సికో సుంకాల వెనుక ట్రంప్ హస్తం?గత రెండు రోజుల క్రితం భారత దిగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాన్ని విధించింది. దీనికి ఏవో కారణాలు చెప్పుకొచ్చింది. తమ దేశంతో పూర్తిస్థాయి వాణిజ్య సంబంధాలు లేని దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తున్నామంటూ స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారత్తో పాటు చైనా కూడా చేరింది. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) లేని దేశాలన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయని చెప్పింది. అయితే వీటి వెనుక ఉన్నది ట్రంప్ అని పలు ఆరోఫలణలు వచ్చాయి.. వస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఇప్పటికే మెక్సికో సుంకాలపై స్పందించారు. ఇది ట్రంప్ చర్య కావొచ్చనే అనమానం వ్యక్తం చేశారు. దీన్ని పూర్తిగా కాదనలేం. అమెరికాకు అత్యంత మిత్ర దేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సికోను పదే పదే పొగడ్తలతో ముంచెత్తం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది.ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలున్నాయి. గతంలో పలు సందర్భాల్లో మెక్సికో అధ్యక్షరాలు క్లాడియా షీన్బామ్ను అత్యంత సాహసిగా, గొప్ప నాయకురాలిగా అభివర్ణించారు ట్రంప్. ఇక మెక్సికోకు కూడా అమెరికాపై అంతే ప్రేమ ఉంది. ఈ కారణంగానే ట్రంప్ దాగుడు మూతలకు తెరలేపి భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని చూశారనేది నిపుణుల అంచనా. ఇది ట్రేడ్ డైవర్షన్కు అడ్డుకట్టా.. ట్రంప్ అడ్డుకట్టా..?భారత్, చైనాలపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాలు మెక్సికోకు దిగుమతి చేసే వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. దీన్ని ట్రేడ్ డైవర్షన్ అంటారు.దీనికి అడ్డుకట్టవేయాలనే తలంపుతో మెక్సికో చేసినా, ఇందులో ట్రంప్ హస్తం ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత్పై అమెరికా విధించిన సుంకాలపై అక్కడ ఎంపీల నుంచే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ ఇలా చేసే ఉంటారనేది మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి:భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావంట్రంప్ భారీ సుంకాల రద్దు.. ? యూఎస్ కాంగ్రెస్లో తీర్మానం! -
ట్రంప్ భారీ సుంకాల రద్దు?.. యూఎస్ కాంగ్రెస్లో తీర్మానం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతపై విధించిన అదనపు సుంకాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ అత్యవసర అధికారాన్ని ఉపయోగించి, భారతదేశం నుండి వచ్చే దిగుమతులపై 50 శాతం అదనపు సుంకాన్ని విధించారు. తాజాగా వీటిని రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ప్రతినిధులు డెబోరా రాస్, మార్క్ వీసీ, భారతీయ-అమెరికన్ రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో ఈ తీర్మానం వెలువడింది. ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధం అని, ఇది అమెరికన్ కార్మికులు, వినియోగదారులతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు హానికరం అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానం కేవలం వాణిజ్యపరమైన సమస్యను మాత్రమే కాకుండా, అధ్యక్షుడు తన అత్యవసర అధికారాలను ఏకపక్షంగా వినియోగించడాన్ని ఎత్తిచూపింది.ఈ సుంకాల ప్రభావం గురించి కాంగ్రెస్ మహిళా సభ్యురాలు డెబోరా రాస్ మాట్లాడుతూ నార్త్ కరోలినా ఆర్థిక వ్యవస్థ భారతదేశం వాణిజ్యం, పెట్టుబడులతో ముడిపడి ఉందని, భారతీయ అమెరికన్ సమాజం ఇక్కడ వేళ్లూనుకుందని అన్నారు. భారతీయ కంపెనీలు ఇక్కడ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, వేలాది ఉద్యోగాలు సృష్టించాయని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యుడు మార్క్ వీసీ తన ప్రసంగంలో భారతదేశాన్ని .. ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించారు. ఈ చట్టవిరుద్ధమైన పన్నులు అమెరికన్ పౌరులపై భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సుంకాలు వ్యతిరేకమైనవని, అమెరికన్ కార్మికులకు హాని కలిగిస్తాయని, వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయని అన్నారు. ఈ సుంకాలను రద్దు చేయడం ద్వారా యూఎస్-భారతదేశం మధ్య ఉన్న కీలకమైన ఆర్థిక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయవచ్చని, తద్వారా మన ఉమ్మడి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ తీర్మానం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నంగా తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ గత ఆగస్టులో భారత్పై రెండు విడతలుగా 25 శాతం చొప్పున సుంకాలను విధించారు. భారతదేశం రష్యన్ చమురు కొనుగోలు చేస్తూ, మాస్కో యుద్ధ ప్రయోజనానికి ఆజ్యం పోస్తున్నదని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద సుంకాలను పెంచారు.ఇది కూడా చదవండి: ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు! -
ఏఐని బెస్ట్గా వాడుతున్న దేశం ఏదో తెలుసా?
ఒకప్పుడు కంటికి కనిపించే మరయంత్రాలు.. ఇప్పుడు కానరాకుండానే అద్భుతాలు చేస్తున్నాయి. నిమిషాల్లో.. కాదు చిటికేసేలోపే పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి. ఆఖరికి.. మనం తీసుకునే నిర్ణయాలనూ ప్రభావితం చేసేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తి కూడా. ఆరోగ్యం నుంచి విద్య వరకు.. బ్యాంకింగ్ నుంచి వినోదం దాకా.. ప్రతీ రంగంలోనూ ఏఐ తన ముద్రను వేసేసుకుంది. క్రితంతో పోలిస్తే 2025లో వాడకం బాగా పెరిగింది. ఏఐ అభివృద్ధి, పరిశోధన, మోడల్ డెవలప్మెంట్లో ప్రపంచంలోకెల్లా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీ, ఎంఐటీ, స్టాన్ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ.. ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని ముందంజలో ఉంచాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా.. 87% కంపెనీలు ఏఐని తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించాయి. మొత్తంగా 76% సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐని వాడుతున్నాయివాస్తవ వినియోగం విషయంలో మాత్రం అత్యధిక జనాభా ఉన్న చైనా (58%), భారతదేశం (57%) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి. చైనాలో ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ సేవల్లో AI విస్తృతంగా అమలవుతోంది. భారతదేశంలో బ్యాంకింగ్, ఈ-కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాలు పెద్ద జనాభా, విస్తృత మార్కెట్ కారణంగా AIని ప్రాక్టికల్గా ఉపయోగించడంలో ముందున్నాయి. అదే సమయంలో.. ఎంటర్టైన్మెంట్ విభాగంలో చూస్తే చైనా కంటే మన దేశమే ముందంజలో ఉంది. అయితే.. ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్న దేశాలు ఏంటో తెలుసా?.. ఏఐ వినియోగంలో చిన్న దేశాలు వెనుకబడలేదు. యూరప్లోని చిన్న కంట్రీ అయిన ఎస్టోనియా ప్రపంచంలోనే ఏఐని అతి సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దేశంగా గుర్తింపు దక్కించుకుంది. డిజిటల్ పాలసీలతో పాటు ఈ-పౌరసత్వం, డిజిటల్ ఐటీ వంటి ప్రాజెక్టుల కోసం పూర్తిగా ఏఐనే ఉపయోగించుకుంటోందా దేశం. ఈ లిస్ట్లో తర్వాత సింగపూర్ ఉంది. అక్కడి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ సర్వీసుల్లోనూ AIని అత్యుత్తమంగా ఉపయోగిస్తున్నారు. స్పష్టమైన పాలసీలు, సమర్థవంతమైన అమలుతోనే ఇది సాధ్యమైందని సింగపూర్ ఈ మధ్యే గొప్పగా ప్రకటించుకుంది కూడా. ఇక.. మన దేశంలో ఏఐని విచ్చలవిడిగా వాడుతోంది చూస్తున్నదే!. అయితే యూరప్లో మాత్రం ఏఐ తరహా కంటెంట్ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి. ఈయూ AI Act ద్వారా ఎథికల్ AI వినియోగానికి(ఎలా పడితే అలా వాడడానికి వీల్లేకుండా..) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు ఏఐని తక్కువేం వాడడం లేదు. ఏఐ కంప్యూటింగ్ పవర్లో భారీగా పెట్టుబడులు పెడుతూ.. భవిష్యత్తులో గ్లోబల్ AI హబ్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దక్షిణ కొరియాలో ప్రభుత్వం ఉద్యోగులకు AI అక్షరాస్యతలో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.మొత్తంగా.. ప్రపంచ ఏఐ దృశ్యం ఇప్పుడు పెద్ద దేశాల ఆధిపత్యంతో పాటు చిన్న దేశాల సమర్థవంతమైన వినియోగం అనే ద్వంద్వ రూపంలో ఉందని చెప్పొచ్చు. -
ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు!
ఆకాశం.. ఓ అద్భుతం.. దానిలో కనిపించే దృశ్యాలు మహాద్భుతం.. ఇలాంటి అపురూప దృశ్యాలను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇందుకోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. 2025, డిసెంబర్ 13–14 రాత్రి జెమినిడ్స్ ఉల్కాపాతం ఉతృష్ట స్థాయికి చేరి కనువిందు చేయనుంది. ఇది ఈ ఏడాదిలోకెల్లా అత్యంత అరుదైన దృశ్యంగా నిలిచిపోనుంది. నింగిని చీల్చుకుంటూ మెరుపులు వెదజల్లుతూ దూసుకుపోయే ఈ ‘షవర్’ను చూసేందుకు ఖగోళ ప్రేమికులతో పాటు ప్రపంచ ప్రజలంతా సిద్ధమవుతున్నారు.14 తెల్లవారుజామున మ్యాజిక్ఈ అద్భుతాన్ని పూర్తి స్థాయిలో చూడాలంటే, డిసెంబర్ 14న తెల్లవారుజాము 2 నుండి 4 గంటల మధ్య మేల్కొని ఉండాలి. ఇదే దీనిని వీక్షించేందుకు అత్యుత్తమ సమయం.ఈ కీలక సమయంలోనే మన భూమి ఉల్కా శిథిలాల మార్గంలోకి సంపూర్ణంగా ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఈ ఉల్కలు వేగంగా కిరణాల్ల మాదిరిగా ఉద్భవించి, ఆకాశాన్ని మరింతగా ప్రకాశింపజేస్తాయి. ఇటువంటి స్థలంలో..జెమినిడ్స్ అద్భుతాన్ని కనులారా చూడాలంటే, కేవలం సమయం మాత్రమే కాదు.. స్థలం కూడా ముఖ్యం. చీకటిగా, స్పష్టంగా ఆకాశం కనిపించే ప్రదేశాన్ని ఎంచుకోండి. ఇందుకోసం నగరపు కాంతి కాలుష్యం లేని ప్రాంతానికి వెళ్లడం ఉత్తమం. అర్ధరాత్రి దాటి, తెల్లవారుజాము వరకు గల సమయంలోనే ‘రేడియంట్’ (ఉల్కలు వచ్చే ప్రాంతం) హృద్యంగా కనిపిస్తుంది.ఇంట్లో నుంచే విశ్వ విందుక్షేత్ర స్థాయిలో ఈ అద్భుతాన్ని చూడలేని వారికి నిరాశ చెందనక్కర్లేదు. సాంకేతికత మనకు తోడుంది! ఇటలీలోని అబ్జర్వేటరీ నుండి వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ లాంటి సంస్థలు ఈ మెరుపుల ప్రదర్శనను రియల్టైమ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఫలింతంగా మీరు ఇంట్లో కూర్చునే ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచంలో ఎక్కడి నుండైనా వీక్షించవచ్చు.2025లో అద్బుత జ్ఞాపకం2025 చివరిలో కనిపించే ఈ జెమినిడ్స్ కేవలం ఒక సాధారణ ఖగోళ సంఘటన కాదు. ఇది విశ్వశక్తిని, అందాన్ని తెలియజేసే మరపురాని ప్రదర్శన. అందుకే రాత్రిపూట ఆకాశంలో జరిగే ఈ మెరుపుల వేడుకను చూడటానికి సిద్ధమవ్వండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ అద్భుతమైన ఖగోళ విందు గురించి చెప్పి, వారితో కలిసి ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించేందుకు ప్లాన్ చేసుకోండి.ఇది కూడా చదవండి: ‘గోవా కలెక్టర్ ఫోన్ చేసి..’ బిగ్గరగా రోదించిన బాధితురాలు.. -
పాక్ వర్సిటీలో సంస్కృతం కోర్సు.. భగవద్గీత, మహాభారతం పాఠాలు!
పాకిస్థాన్లోని ఓ యూనివర్సిటీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్కు చెందిన ప్రాచీన భాష సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టింది. అంతేకాదు.. మహాభారతం, భగవద్గీత పాఠాలు కూడా బోధించేందుకు సిద్ధమైంది. దేశ విభజన తర్వాత సంస్కృతం పాక్లో అడుగపెట్టింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (LUMS) ఈ భాషతో పార్ట్టైం కోర్సును ప్రారంభించింది. అంతకు ముందు.. మూడు నెలలుగా వారాంతపు వర్క్షాప్ కోర్స్గా ప్రవేశపెట్టగా.. అనూహ్య స్పందన లభించింది. 2027 నాటికల్లా పూర్తిస్తాయి కోర్సుగా మార్చేందుకు వర్సిటీ సిద్ధమవుతోంది. ఫార్మన్ క్రిస్టియన్ కాలేజ్లో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డా. షాహిద్ రషీద్ ఈ మార్పునకు ప్రధాన కారణం. గతంలో అరబిక్, పార్సీ భాషలపై పట్టు సాధించిన ఆయన.. ఏడాదిపాటు కష్టపడి సంస్కృతం నేర్చుకున్నారు. ఇందుకోసం కేంబ్రిడ్జ్ సంస్కృత పండితురాలు ఆంటోనియా రుపెల్, ఆస్ట్రేలియన్ ఇండాలజిస్ట్ మెక్కామస్ టేలర్ వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందారు.‘‘ప్రాచీన భాషల్లో మానవజాతికి చాలా జ్ఞానం ఉంది. సంస్కృతం ఈ ప్రాంతానికి చెందినది. పాణిని గ్రామం ఇక్కడే ఉంది. ఇది ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. అందు కోసమైనా మేం కచ్చితంగా నేర్చుకోవాలి. సంస్కృతం ఏ ఒక్క మతానికి మాత్రమే చెందినది కాదు. భారతదేశంలోని హిందువులు, సిక్కులు అరబిక్ నేర్చుకుంటే.. పాకిస్తాన్లోని ముస్లింలు సంస్కృతం నేర్చుకుంటే.. భాషలనేవీ అడ్డంకులు కాకుండా వంతెనలుగా మారతాయి. ఇది దక్షిణాసియాకు కొత్త ఆశాజనక ఆరంభం అవుతుంది’’ అని రషీద్ అంటున్నారు.సంస్కృత వ్యాకరణ పండితుడు పాణిని గంధార ప్రాంతంలో నివసించారు. ఆ గంధార ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్గా ఉంది.విద్యార్థులు మొదట సంస్కృతాన్ని కఠినంగా, కష్టంగా భావించారు. కానీ కొద్దికాలానికే అర్థం చేసుకోగలిగారు. ఉర్దూ భాషపై సంస్కృతం ఎంత ప్రభావం చూపిందో వారికి కొత్తగా తెలిసింది. కొంతమంది విద్యార్థులు సంస్కృతం హిందీకి భిన్నమని కూడా తెలియదు అని ప్రొఫెసర్ రషీద్ చెబుతున్నారు. హిందీ మహాభారత్ టీవీ సిరీస్ థీమ్ సాంగ్ అయిన “హై కథ సంగ్రామ్ కి” (మహాభారత టీవీ సిరీస్ థీమ్) యొక్క ఉర్దూ అనువాదాన్ని కూడా నేర్చుకుంటున్నారట. గుర్మాని సెంటర్ డైరెక్టర్ డా. అలీ ఉస్మాన్ ఖాస్మీ చెబుతున్నది ఏంటంటే.. పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో సంస్కృతం పామ్-లీఫ్ మాన్యుస్క్రిప్ట్స్ పెద్ద కలెక్షన్ ఉంది. 1930లలో జేసీఆర్ వూల్నర్ వాటిని కేటలాగ్ చేశారు. కానీ 1947 తర్వాత పాకిస్తానీ అకాడెమిక్లు వాటిని ఉపయోగించలేదు. అయితే ఇప్పుడు స్థానిక పండితులను శిక్షణ ఇవ్వడం వల్ల పరిస్థితి మారుతుందని అన్నారు. లాహోర్ వర్సిటీ భవిష్యత్తులో మహాభారతం, భగవద్గీతపై కోర్సులు ప్రారంభించాలనుకుంటోంది. మరో 10–15 ఏళ్లలో పాకిస్తాన్లో భగవద్గీత, మహాభారతంపై అధ్యయనాలు చేసే రీసెర్చర్లు కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని. -
ట్రంప్.. క్లింటన్.. బానన్.. బిల్గేట్స్.. ఎప్స్టీన్ ఫైల్స్లో మరో బాంబు!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న హైఫ్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రట్స్ నేతృత్వంలోని హౌజ్ ఓవర్సైట్ కమిటీ మరికొన్ని ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన మొత్తం 19 ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్, ప్రముఖ ఫిల్మ్మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా పలువురు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. ఇందులో.. డొనాల్డ్ ట్రంప్ కొంత మంది అమ్మాయిలతో(వాళ్ల మఖాల బ్లర్ చేసి ఉన్నాయి) కలిసి దిగిన ఫొటో బ్లాక్ అండ్ వైట్లో ఉంది. మరొక ఫొటోలో ఎప్స్టీన్తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ఫొటోలో ఒక అమ్మాయితో(ముఖం కనిపించకుండా చేశారు) కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారాయన. ఇంకొక ఫొటోలో ట్రంప్ పేరిట కండోమ్ ఉండడం గమనార్హం. వీటితో పాటు క్లింటన్ ఎప్స్టీన్తో దిగిన ఫొటోలు, ఎప్స్టీన్ ఎస్టేట్లో బిల్గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫొటోలు ఉన్నాయి.ట్రంప్.. ఎప్స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే. అయితే లైంగిక దాడి కేసులో ఎప్స్టీన్ అరెస్ట్(2004) తర్వాత ఆ బంధానికి ఎండ్కార్డ్ పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఇదే విషయాన్ని ఆయన చెబుతూ వస్తుంటారు. బానన్తో ఎప్స్టీన్ సెల్ఫీ.. పక్కన ఐల్యాండ్లోని ఓ గోడ మీద ఫొటోలో బిల్గేట్స్తాజాగా రిలీజ్ అయిన ఫొటోలు.. పలు ఈవెంట్లలో, పిచ్చాపాటి సంభాషణల్లో దిగిన ఫొటోలే ఉన్నాయి. అంతేగానీ.. అందులో ఉన్నవాళ్లంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగం అయినట్లు మాత్రం ఎక్కడా లేదని చెబుతూ ఈ ఫొటోలను రిపబ్లికన్లు తేలికగా తీసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఆ ఫొటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని అన్నారు. ‘‘నేను వాటిని చూడలేదు. కానీ అందరికీ ఈ వ్యక్తి(బానోన్ను ఉద్దేశిస్తూ..) తెలుసు. అతను పామ్ బీచ్లో ఎక్కడైనా కనిపించేవాడు. అతనితో వందలాది మంది ఫోటోలు ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు’’ అంటూ బదులిచ్చారు. 🇺🇸⚡️Reporter: There were new Epstein photos released today showing..What was your reaction?Trump: I haven't seen them, but everybody knew this man (Bannon). He was all over Palm Beach. There are 100s and 100s of people that have photos with him. I know nothing about it. pic.twitter.com/KKWGtyr4Q2— Osint World (@OsiOsint1) December 12, 2025కామ పిశాచి.. ఎప్స్టీన్!అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ ఏడాది జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని.. సన్నిహితంగా ఉన్న ప్రమఖలపైనా నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ట్రంప్ ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపించాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు కూడా).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో.. ఇది డెమోక్రాట్ల మోసం అంటూ తొలి నుంచి ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. చివరకు నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు ఓ సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికి ఏమీ లేదు.. విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నా అని ఆయన ప్రకటించడం గమనార్హం. దాని ప్రకారం.. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌజ్ ఓవర్సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎప్స్టీన్ ప్రైవేట్ ల్యాండ్స్కు సంబంధించి.. అందులో ఉన్న 150 ఫొటోలను, డాక్యుమెంట్లను కమిటీ బయటపెట్టింది. 20,000 పేజీల డాక్యుమెంట్లలో ఎప్స్టీన్కు ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఈ-మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారానే ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రముఖంగా బయటపడింది. మాజీ ట్రెజరీ కార్యదర్శి లారీ సమర్స్తో ఎప్స్టీన్ చేసిన ఈ-మెయిల్లు, అలాగే ట్రంప్ మాజీ సలహాదారు బానన్కు సహాయం చేయాలనే ఆఫర్లు బయటపడ్డాయి.అంతేకాదు ఐల్యాండ్లోని విలాసవంతమైన వసతుల ఫొటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మరోపక్క.. గిస్లేన్ మాక్స్వెల్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ మెటీరియల్స్ కూడా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి, కాబట్టి మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
థాయ్ల్యాండ్ పార్లమెంట్ రద్దు
బ్యాంకాక్: థాయ్లాండ్ పార్లమెంటు శుక్రవారం రద్దయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు, కాంబోడియాతో ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ పార్లమెంటును రద్దు చేశారు. రాజు మహా వజీరాలాంగ్కార్న్ అనుమతి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు అనుతిన్ ప్రకటించారు. అయితే ‘అధికారాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా’ అని గురువారం రాత్రి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన అనుతిన్ రద్దుపై ముందే సంకేతాలిచ్చారు. పార్లమెంటు రద్దు తరువాత 45 రోజుల నుంచి రెండు నెలలలోపు ఎన్నికలు జరగాలి. ఈలోపు పరిమిత అధికారాలతో అనుతిన్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. థాయ్లాండ్కు కంబోడియాతో సరిహద్దు వివాదం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. రెండు వైపులా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఘర్షణల్లో ఈ వారమే 20 మందికి పైగా మరణించారు. ఈ ఉద్రిక్తతల సమయంలో పార్లమెంటు రద్దు నిర్ణయం కీలకంగా మారింది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా రాజీనామా చేసిన షినవ్రతా స్థానంలో అనుతిన్ బాధ్యతలు తీసుకున్నారు. మూడు నెలలు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నారు. -
సోషల్ మీడియా నిషేధంపై కోర్టుకు
మెల్బోర్న్: పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆన్లైన్ వేదిక రెడ్డిట్ సవాలు చేసింది. ఈ అమెరికన్ ఆన్లైన్ ఫోరమ్ శుక్రవారం హైకోర్టులో దావా వేసింది. యువతను రక్షించాలనుకుంటే ప్రభుత్వానికి మరింత మెరుగైన మార్గాలున్నాయని, కానీ సోషల్ మీడియా కనీస వయసు చట్టం వల్ల రాజకీయ చర్చల నుంచి వేరుచేయడం అవుతుందని, ధ్రువీకరణ ప్రక్రియ కూడా అంత సురక్షితం కాదని రెడ్డిట్ తెలిపింది. 16 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. పిల్లల ఆన్లైన్ భద్రతరీత్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించకపోతే రెడ్డిట్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, స్నాప్చాట్, త్రెడ్స్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్లకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే.. దీనిపై ఇప్పటికే ఇద్దరు బాలికల తరపున సిడ్నీకి చెందిన హక్కుల వేదిక డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్టు గత నెలలో కేసు వేసింది. కాలిఫోరి్నయాకు చెందిన రెడ్డిట్ దానిని అనుసరించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని రెండు వాజ్యాలు పేర్కొన్నాయి. -
ఉన్నట్లుండి ఆ ఊరిలో పెద్ద పెద్ద గుంతలు
ఒకటి కాదు.. రెండు కాదు.. వంద సింక్హోల్స్ (భారీ గుంతలు) ఏర్పడ్డాయి. అది కూడా ఈ మధ్య కాలంలోనే!. గ్రామం చుట్టూ.. కొన్ని ఇళ్ల పక్కనే ఈ గుంతలే కనిపిస్తున్నాయి. సింక్హోల్స్ తమ పొలాలను ఎక్కడ మింగేస్తాయోనని అక్కడి ప్రజలు నిత్యం భయంతో వణికిపోతున్నారు. ఆ ప్రాంతం సురక్షితమని ఏ సైంటిస్టు కూడా చెప్పలేకపోతున్నారు. ఇది టర్కీ(తుర్కియే) ధాన్యాగారంగా పేరున్న కోన్యా రీజియన్ పరిస్థితి.సెంట్రల్ అనాటోలియాలోని కోన్యా రీజియన్ ప్రధానంగా గోధుమ, ఇతర చిరుధాన్యాల సాగుకు ప్రసిద్ధి. అందుకే ఈ ప్రాంతానికి బ్రెడ్బాస్కెట్ అనే పేరు ముద్రపడింది. అయితే ఈ ఊరిని.. పంట పొలాలను భారీ గుంతలు మింగేస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 684 గుంతలు(బుధవారం నాటికి) ఏర్పడ్డాయి అక్కడ. ఈ మేరకు AFAD (Turkey Disaster Agency)గుర్తించిన ఆ గుంతల కొన్ని డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎలా ఏర్పడ్డాయంటే..భూగర్భ జలాల అధిక వినియోగం.. దశాబ్దాలుగా సాగు కోసం అధికంగా నీటిని పంపింగ్ చేయడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ఉంది. దీనికి తోడు విపరీతమైన కరువు, వాతావరణ మార్పులు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రంగా మార్చాయి. ఇక్కడి భూగర్భ శిలల స్వభావం కూడా ఒక కారణమనే చెప్పొచ్చు. కార్బోనేట్, జిప్సం రాళ్లతో కూడిన "కార్స్ట్" భూభాగం. దీంతో.. సహజంగా గుహలు, ఖాళీలు ఏర్పడేలా ఉంటుంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు నేలల స్వభావం కూడా ఇలాంటి గుంతలు ఏర్పడడానికి కారణమైంది.ఈ ప్రభావంతో.. భూగర్భ జలాలు అడుగంటాయి. కొన్ని ప్రాంతాల్లో అది 60 మీటర్ల వరకు తగ్గాయి. సుమారు 30 మీటర్ల లోతైన గుంతలు పొలాలు, రహదారులు, నిర్మాణాలను మింగేస్తున్నాయి. రైతులు ప్రమాదకరమైన పొలాలను వదిలిపెట్టాల్సి వస్తోంది. శాస్త్రవేత్తలు సింక్హోల్ హాట్స్పాట్లను మ్యాప్ చేస్తున్నారు, భవిష్యత్తులో మరింత కుంగిపోవడం జరగవచ్చని హెచ్చరిస్తున్నారు.సాధారణ విషయమే కానీ..కొన్యా మైదానంలో సింక్హోల్స్ ఏర్పడడం కొత్తదేం కాదు. నేల స్వభావంతో అప్పుడప్పుడు(పదేళ్లకో.. పాతికేళ్లకో..) చిన్న చిన్న గుంతలు ఏర్పడేవి. అదీ సహజ ప్రక్రియలో నెమ్మదిగా కుంగిపోయేది. ఇప్పుడేమో వాతావరణ మార్పులు.. దీర్ఘకాలిక కరువు ఫ్లస్ అధిక భూగర్భ జల వినియోగం కారణంగా శరవేగంగా, పెద్ద సంఖ్యలో సింక్హోల్లు ఏర్పడుతున్నాయి. ఫలితంగా.. రైతుల పొలాలు, రహదారులు, చుట్టుపక్కల గ్రామాలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.Nearly 700 sinkholes have appeared in parts of Turkey, with new ones showing up, fueled by extreme drought. pic.twitter.com/AaSdD3YNap— AccuWeather (@accuweather) December 12, 2025అన్ని రకాల నష్టాలు..కొన్యాలో తాజాగా ఏర్పడిన గుంతలు సాధారణమైనవేం కాదు. రైతుల జీవనోపాధి, గ్రామాల భద్రత, పర్యావరణ సమతుల్యత అన్నీ ఈ ప్రభావంతో కుదేలవుతున్నాయి. సుమారు 100 అడుగుల లోతు దాకా ఉంటున్నాయి. ఇవి గోధుమ, మొక్కజొన్న, బీట్ వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రతి గుంత సగటున 1–3 హెక్టార్ల పొలాన్ని మింగేస్తోంది. అంటే కనీసం 700–2000 హెక్టార్లు పంట భూమి నష్టపోయింది. పొలాలు వదిలిపెట్టాల్సి రావడం వల్ల రైతులు ఆదాయం కోల్పోతున్నారు. పైగా ఈ కుంగుబాటుతో చుట్టుపక్కల భూములు కూడా నిస్సారంగా మారుతున్నాయి. రహదారులు, చుట్టుపక్కల ఉండే జనావాసాలు దెబ్బతింటున్నాయి. కొ ప్రమాదకర ప్రాంతాల నుంచి కొంతమంది రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.భూగర్భ జలాలు 60 మీటర్ల వరకు తగ్గిపోవడం వల్ల సహజ సమతుల్యత దెబ్బతింది. టర్కీ గత 50 ఏళ్లలో 186 సరస్సులను కోల్పోయింది. 1.5 మిలియన్ హెక్టార్ల వెట్ల్యాండ్ అదృశ్యమైంది. ఇది స్థానిక జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. సింక్హోల్లు కొత్త భూభాగ ఆకృతులను సృష్టిస్తూ, భూసంరక్షణకు సవాళ్లు విసురుతున్నాయి.పరిస్థితి మెరుగుపడాలంటే.. భూగర్భ జల వినియోగంపై కఠిన నియంత్రణలు అవసరమని.. లేకుంటే సింక్హోల్స్ మరింత పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు . తక్కువ నీటితో సాగు చేసే పంటలవైపు రైతుల మళ్లితే మంచిదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. -
చైనీయులకు సులువుగా బిజినెస్ వీసాలు
న్యూఢిల్లీ: భారత్ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా బిజినెస్ వీసాలు జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సడలించింది. వీసా దరఖాస్తులను ఇకపై వేగంగా ఆమోదించబోతున్నారు. లద్దాఖ్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్–చైనా సంబంధాలు ఇటీవల మళ్లీ గాడిన పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షలు, టారిఫ్ల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే బిజినెస్ వీసా నిబంధనల్లో తాజాగా మార్పులు చేసింది. తక్కువ కాలంపాటు భారత్ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వడం ద్వారా వారి సేవలు ఉపయోగించుకోవచ్చని, చైనాతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వీసా దరఖాస్తుదారుల తనిఖీ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. చైనా వృత్తి నిపుణులకు గతంలో ఎంప్లాయ్మెంట్ వీసాలు(ఈ వీసాలు) జారీ చేస్తుండేవారు. వీటి కాలపరిమితి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ. బిజినెస్ వీసాలకు సంబంధించి మార్పు చేసిన నిబంధనలు అన్ని దేశాల దరఖాస్తుదారులకు వర్తిస్తాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల చైనీయులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఈ వీసాల జారీ ప్రక్రియను నాలుగు వారాల్లోపే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చైనా పరికరాలు, యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలు సాగించే భారతీయ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లాభం చేకూరనుంది. చైనా నిపుణులు బిజినెస్ వీసాలపై ఇండియాకు వచ్చి, సదరు కంపెనీలకు సహకరించే వీలుంది. చైనా పౌరులకు టూరిస్టు వీసాలను జారీ చేసే ప్రక్రియను ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వాగతించిన చైనా విదేశాంగ శాఖ చైనా నిపుణులకు బిజినెస్ వీసాలను సులువుగా, వేగంగా జారీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ శుక్రవారం స్వాగతించారు. ఇదొక సానుకూలమైన ముందడుగుగా అభివరి్ణంచారు. ప్రయాణాలను సులభతరం చేస్తే ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా ప్రజల మధ్య అనుబంధం బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. -
కోర్–5 సూపర్ క్లబ్
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది. యూరప్ దేశాలకు చెక్? జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.ట్రంప్ సంకేతాలు సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు. సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.అప్పుడే ఎజెండా రెడీ? అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
రెండున్నరేళ్ల క్రితం ఉక్రెయిన్తో యుద్ధం మొదలు పెట్టిన రష్యా ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్లుంది. ఈ నేపధ్యంలో రష్యా ముందున్న ఒకేఒక్క ఆశాదీపం భారతదేశమేనని, అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారత్లో పర్యటించారనే వాదన వినిపిస్తోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? యుద్ధం ప్రారంభమైన రెండేళ్ల వరకు జీడీపీలో ఎలాంటి తరుగుదల లేకుండా.. పైపైకి దూసుకుపోయిన రష్యాకు ఇప్పుడేమైంది?అది 2022 ఫిబ్రవరి 24. రష్యా దళాలు బెలారస్ మీదుగా ఉక్రెయిన్పై దురాక్రమణను ప్రారంభించాయి. క్రమంగా ఉక్రెయిన్కు సముద్రమార్గంతో సంబంధాలు లేకుండా ఈ ఆక్రమణ కొనసాగింది. అంటే.. దక్షిణ ఉక్రెయిన్లో ఉండే ప్రధాన పోర్టులు ఒడెస్సా, మైకొలైవ్తోపాటు.. మారియుపూల్ వరకు రష్యా కబ్జా చేసేసింది. అంతేకాదు.. నల్లసముద్రంతో సంబంధం లేకుండా.. అతిపెద్ద ప్రావిన్స్ అయిన జాపొరిజియా దక్షిణ భాగాన్ని ఆక్రమించి.. అక్కడి పౌరులకు రష్యా పౌరసత్వాన్ని ఇవ్వడం ప్రారంభించింది. తూర్పున డోనెట్స్క్, లుహాన్స్క్పై పట్టుసాధించింది. అంటే.. 2014లో ఆక్రమించిన క్రిమియా నుంచి రష్యాలోని బెల్గోల్ట్ వరకు రోడ్డు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరిణామాలతో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఉక్రెయిన్ సముద్రంపై ఆధారపడకుండా చేసినట్లైంది.2020లో కొవిడ్ కల్లోలం తర్వాత అమెరికా సహా.. దాదాపుగా అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. రష్యా సొంతంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను తయారు చేసినా.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా.. కారిమకుల జీతాలను పెంచిన పుతిన్ సర్కారు ద్రవ్యోల్బణ ప్రమాదం నుంచి గట్టెక్కింది. 2022లో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయింది. 2024లో ముదిరి పాకాన పడే పరిస్థితులు నెలకొన్నాయి.యుద్ధం మూడున్నరేళ్లుగా నడుస్తుండడంతో.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం రష్యాకు తలకు మించిన భారమవుతోంది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. దీంతో.. గత త్రైమాసికంలో జీడీపీ నేలముఖం చూడడం ప్రారంభించింది. 2023, 2024 సంవత్సరాల్లో 3-4% వృద్ధి నమోదైనా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. ఈ పరిస్థితుల్లో రష్యా ముందు ఆశాదీపంగా కనిపిస్తున్న ఒకే ఒక్క దేశం భారత్..! అందుకే.. 2022 నుంచే రష్యా మన దేశానికి మరింత దగ్గరవ్వడం మొదలుపెట్టింది.నిజానికి రష్యా-భారత్ల మైత్రి చారిత్రకమైనది. ఓల్గా నుంచి గంగా వరకు స్నేహం ఫరిడవిల్లిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. అయితే.. చమురు కోసం ఇరాక్, సౌదీలపై ఆధారపడే భారత్కు కూడా ఇప్పుడు తక్కువ ధరకే చమురును అందించే రష్యా ఓ ఆశాజ్యోతిగా మారింది. రష్యా అత్యధికంగా చమురు ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిపోయింది. యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా నుంచి రోజుకు లక్ష బ్యారెళ్లలోపు చమురు మాత్రమే భారత్కు దిగుమతి అయ్యేది. ఇప్పుడు ఆ దిగుమతి ఏకంగా రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెరిగిపోయింది. అందుకే ట్రంప్ కూడా పదేపదే రష్యాను ఆర్థికంగా ఆదుకుంటున్నది భారతదేశమేనని వ్యాఖ్యానాలు చేస్తుంటారు. 38% రష్యా చమురు భారత్కే వెళ్తోందని, ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా భారత్ ఆజ్యం పోస్తోందంటూ కారాలుమిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే..!ఇప్పుడున్న పరిస్థితుల్లో.. భారత్ ఏమాత్రం చమురు దిగుమతులను తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. రష్యా చమురును భారత్ కొనడం ఆపేయనుందని ట్రంప్ ఒకట్రెండు సార్లు ప్రకటనలు చేసిందే దరిమిలా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. భారత్కు కావాల్సిన రక్షణపరమైన అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధమంటూ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారత్ను కోరారు. అవును.. ఇప్పుడు రష్యాకు పెద్దదిక్కు భారతే..! ఉక్రెయిన్లోని కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా భారత్ గనక రష్యా చమురు కొనుగోళ్లను కనీసం 20% తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందంటూ నివేదిక ఇచ్చింది. ఓ వైపు భారత్ను నమ్ముకుంటూనే.. రష్యా తమ ప్రజలపై పన్నుల భారం వేస్తోంది. రష్యాలో అధిక డిమాండ్ ఉండే వోడ్కాపై అదనంగా 5% పన్ను విధిస్తోంది. ఇక వ్యాట్ను 10శాతం నుంచి 11శాతానికి పెంచింది. అదనంగా పెరిగిన ఒక శాతం వ్యాట్ విలువ ఒక ట్రిలియన్ రూబిల్స్గా ఉంటుంది. అంటే.. 1,304 బిలియన్ డాలర్లన్నమాట. అంతేకాదు. ఇంతకాలం రష్యాలో చిరువ్యాపారులపై వ్యాట్ లేదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే వంకతో.. వారిపైనా దశలవారీగా పన్ను విధించేందుకు సిద్ధమైంది. రష్యాలో రెపోరేటు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ వడ్డీ రేట్లు 15శాతానికి పైగా ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల కారణంగా విదేశాల నుంచి అప్పు పుట్టే అవకాశాలు లేకుండా పోయాయి. అమెరికా, ఐరోపాలో ఉండే రష్యా ఆస్తులు, రష్యన్ల బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయి.ఆర్థికపరంగా రష్యాకు ఇప్పుడు భారత్ అత్యంత కీలకమైన మిత్రదేశం. అదే సమయంలో భారత్కు కూడా రక్షణపరంగా రష్యా ఆప్తమిత్రుడు. పాకిస్థాన్ దాడులను భారత్ సమర్థంగా ఎదుర్కొనేందుకు దోహదపడ్డ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు మనకు రష్యా నుంచి వచ్చినవే. మిగ్ విమానాలు కూడా రష్యా సరఫరానే. నిజానికి భారత్ తన రక్షణ వ్యవస్థల అవసరాలను ‘మేకిన్ ఇండియా’లో భాగంగా తీర్చుకోవాలని నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడు రష్యా అధునాతన ఆయుధాలను విక్రయించేందుకు సిద్ధమవ్వడంతో.. దిగుమతుల వాటా 36శాతానికి పెరిగింది. నిజానికి దశాబ్దాలుగా భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి సహకరిస్తూ వచ్చిన ప్రధాన దేశం రష్యానే..! ఈ నేపథ్యంలో చమురు కొనుగోళ్ల ద్వారా మిత్రదేశం రష్యాను ఆదుకుంటూనే.. భారత్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశలో అడుగులు వేస్తోంది. భారత్ ఈ నిర్ణయం గనక తీసుకోకపోయి ఉంటే.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు..!-హెచ్.కమలాపతి రావు -
పాకిస్థాన్ ప్రధానికి అవమానం
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్కు ఘోర పరాభవం ఎదురైంది. తుర్కిస్థాన్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవడానికి ఆయన దాదాపు 40 నిమిషాలు ఎదురుచూశారు. అయినప్పటికీ పుతిన్ కలవకపోవడంతో షెహబాజ్ పుతిన్ ఉన్న ప్రదేశానికి నేరుగా వెళ్లాడు. దీంతో పాకిస్థాన్ అధ్యక్షుడిపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్- అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తరచుగా పాకిస్థాన్ని పొగుడుతూ వారిని బుట్టులో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. కొద్దినెలల క్రితం ఆ దేశ ప్రధాని షెహబాజ్తో పాటు ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్తోనూ నేరుగా చర్చలు జరిపారు. అంతేకాకుండా పాకిస్థాన్ను దక్షిణాసియాలో అవసరమైన మిత్రుడు అని గతంలో అభివర్ణించాడు. ఇదే సమయంలో భారత్తో ట్రంప్ డిస్టెన్స్ పెంచాడు. భారత్పై అధిక పన్నులు విధించడంతో పాటు ఆపరేషన్ సిందూర్ తానే ఆపానంటూ ప్రేలాపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య కొంత గ్యాప్ పెరిగింది. అయితే భారత్కు ఎల్లవేళలా నమ్మదగిన మిత్రుడిగా ఉండే రష్యా ఇప్పుడు పాక్కు చిన్న ఝలక్ ఇచ్చింది.తుర్కిస్థాన్లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ సమ్మిట్లో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశానికి వెళ్లాడు. ఆ పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడితో పుతిన్ భేటీ జరగాల్సి ఉంది. కాగా ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు ఎర్గోడన్తో పుతిన్ సమావేశంలో ఉన్నారు. దీంతో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రితో కలిసి పుతిన్ను కలవడానికి ఎదురుచూశారు.దాదాపు 40 నిమిషాలపాటు వేచి చూసినప్పటికీ భేటీ ముగియకపోవడంతో షెహబాజ్ అసహానానికి గురయ్యారు. దీంతో పుతిన్ చర్చలు జరుపుతున్న ప్రాంతానికి నేరుగా వెళ్లాడని అక్కడ కొద్ది సేపు ఉన్న అనంతరం షెహబాజ్ తిరిగి వెళ్లినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలవుతోంది. పుతిన్ సమయాన్ని వృథా చేసుకోరు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ట్రంప్ కూడా అలానే చేశారని మరో యూజర్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవలే రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. పుతిన్కు స్వాగతం పలకడానికి ప్రధాని మోదీ స్వయంగా వెళ్లారు. అంతేకాకుండా పుతిన్ తనకు మిత్రుడని సంభోదించారు. -
12 భాగాలుగా పాకిస్తాన్!
పాకిస్తాన్లో విభజన అనగానే 1971 నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. మళ్లీ ఇప్పుడు దాయాది దేశంలో విభజన మాట బాగా వినబడుతోంది. అయితే ఈ విభజన వేరే రకమైనది. పాకిస్తాన్ జాతీయ సమాచార శాఖ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్ ఇటీవల చేసిన ప్రకటనతో విభజన చర్చ ఊపందుకుంది. దేశంలో చిన్న ప్రావిన్సుల ఏర్పాటు ఇప్పుడు ఖాయమని ఆయన చేసిన ప్రకటన పాక్లో సంచలనంగా మారింది. అయితే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే చిన్న ప్రావిన్సులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారని జియో టీవీ నివేదించింది. అయితే ప్రావిన్సులను విభజించడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు అంటున్నారు.పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్స్లను విడగొట్టి 12 చేయడానికి రంగం సిద్ధమైందని స్థానికి మీడియా సమాచారం. ఈ మేరకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మధ్య తుది చర్చలు జరిగాయని.. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. 1947 నాటికి పాకిస్తాన్లో ఐదు ప్రావిన్సులు ఉన్నాయి. అవి తూర్పు బెంగాల్, పశ్చిమ పంజాబ్, సింధ్, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (NWFP), బలూచిస్తాన్. 1971 విముక్తి యుద్ధం తర్వాత తూర్పు బెంగాల్ స్వాతంత్ర్యం ప్రకటించుకుని బంగ్లాదేశ్ ఏర్పడింది. పశ్చిమ పంజాబ్.. పంజాబ్ అయింది. వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ పేరును ఖైబర్ పఖ్తుంఖ్వాగా (Khyber Pakhtunkhwa) మార్చారు. సింధ్, బలూచిస్తాన్ పేర్లు అలాగే ఉన్నాయి.ఎందుకీ విభజన?పరిపాలనా సౌలభ్యం కోసమమే చిన్న ప్రావిన్సుల ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు పాకిస్తాన్ పాలకులు చెబుతున్నా అందుకు భిన్నమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉద్రిక్తతలు పెరిగాయి. తమను స్వతంత్ర దేశాలుగా ప్రకటించాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు పోరాడుతున్నారు. మరోవైపు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ హైబ్రిడ్ పాలనపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విభజన చర్చ తెరపైకి వచ్చింది. దీంతో పాకిస్తాన్లో సెమినార్లు, మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.ఒక్కోదాన్ని మూడుగా విభజిస్తాంషెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఇస్తేకామ్-ఎ-పాకిస్తాన్ పార్టీ (IPP) నాయకుడు అబ్దుల్ అలీమ్ ఖాన్ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలన్నింటిలోనూ అనేక చిన్న ప్రావిన్సులు ఉన్నాయని అన్నారు. సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి అదనంగా మూడు ప్రావిన్సులు చొప్పున ఏర్పాటు అవుతాయని వెల్లడించారు. పరిపాలనా నియంత్రణను బలోపేతం చేయడానికి, పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి ఇది సహాయపడుతుందని ఆయన చెప్పినట్టు జియో టీవీ తెలిపింది.మేం ఒప్పుకోంషెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మాత్రం సింధ్ విభజనను వ్యతిరేకిస్తోంది. తమ ప్రావిన్స్ను విభజించడానికి లేదా మూడు ముక్కలు చేయడానికి తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని సింధ్ ముఖ్యమంత్రి, పీపీపీ నాయకుడు మురాద్ అలీ షా (Murad Ali Shah) గత నెలలో కుండబద్దలు కొట్టారు.12కు పెరగనున్న ప్రావిన్సులుదేశంలోని ఒక్కో ప్రావిన్స్ను మూడు భాగాలుగా చేయాలని పాకిస్తాన్ యోచిస్తున్నట్టు స్థానిక మీడియా సమాచారం. నాలుగు ప్రావిన్సులను విడగొట్టి 12కు పెంచేలా పాక్ సర్కారు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్ ఉత్తర పంజాబ్, మధ్య పంజాబ్, దక్షిణ పంజాబ్గా విభజించబడుతుంది. సింధ్ ప్రావిన్స్ కరాచీ సింధ్, మధ్య సింధ్, ఎగువ సింధ్లుగా విభజించబడుతుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా మూడు భాగాలవుతుంది. వీటిని ఉత్తర, దక్షిణ, గిరిజన ఖైబర్ పఖ్తుంఖ్వాగా పరిగణిస్తారు. అదేవిధంగా, బలూచిస్తాన్ (Balochistan) కూడా తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రావిన్సులుగా మారుతుంది.కొత్త సమస్యలు ఖాయంప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రావిన్సులను విభజించడం వలన ప్రయోజనం ఉండదని మేధావులు, సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పాలనలోని అంతరాలను తొలగించకుండా ఏం చేసినా నిష్ఫలమన్నారు. బలహీనమైన సంస్థలు, అసమాన చట్ట అమలు, పేలవమైన స్థానిక పాలన అనేవి నిజమైన సమస్యలన.. వీటిని నివారించకుండా కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేయడం వల్ల అసమానతలు మరింత తీవ్రమవుతాయని వెటరన్ పోలీసు ఉన్నత అధికారి సయ్యద్ అక్తర్ అలీ షా అభిప్రాయపడ్డారు.తిరుగుబాటు తప్పదుపరిపాలనా పునర్నిర్మాణంతో గతంలో చేసిన ప్రయోగాలు సమస్యలను మరింత పెంచాయని పాకిస్తాన్కు చెందిన మేధావి సంఘం పిల్దాట్ అధ్యక్షుడు అహ్మద్ బిలాల్ మెహబూబ్ పేర్కొన్నారు. కొత్త ప్రావిన్సులను సృష్టించడం అనేది ఖరీదైన, సంక్లిష్టమైన, రాజకీయంగా మోసపూరితమైనదిగా డాన్ పత్రికలో రాసిన తన వ్యాసంలో వర్ణించారు. ఇప్పుడు చేయాల్సింది విభజన కాదని, రాజ్యాంగానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం.. బ్రిటిష్ తరహాలో విభజించు- పాలించు విధానాన్ని అనుసరిస్తున్నాయని మరికొందరు విమర్శించారు. ఇలాంటి చర్యలతో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.పాకిస్తాన్లో మరిన్ని ప్రావిన్సులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను ముందుకు తీసుకురావడం ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిది కూడా కాకపోవచ్చు. కానీ గత ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈసారి ప్రతిపాదనకు ప్రధానమంత్రి షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఇస్తేకామ్-ఎ-పాకిస్తాన్ పార్టీ, సింధ్ ఆధారిత ముత్తహిదా క్వామి మూవ్మెంట్-పాకిస్తాన్ (MQM-P) పార్టీలతో పాటు పలువురు మేధావులు మద్దతుగా నిలవడం గమనార్హం. -
మృత్యువు అంచునుంచి..
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్, టల్లీ ఎయిర్ పోర్ట్.. ఆకాశం నిర్మలంగా ఉంది.. సాధారణ స్కైడైవింగ్ విన్యాసం కోసం సిద్ధమైన ప్రత్యేక రోజది. 17 మంది పారాచూటిస్టులతో కూడిన ’సెస్నా కారవాన్’ విమానం 15,000 అడుగుల (సుమారు 4,500 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. 16 మంది స్కైడైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్ జంప్ చేయబోతున్నారు. అంతా సిద్ధంగా ఉంది.. విమానం తలుపు వద్ద నిల్చున్న స్కైడైవర్ ఆడ్రియన్ ఫెర్గూసన్ గుండె వేగం పెరిగింది. విమానం నుంచి బయటికి దూకడానికి సెకన్ మాత్రమే ఉంది.. కానీ, ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది. ఆడ్రియన్ ఫెర్గూసన్ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా, అతని రిజర్వ్ పారాచూట్ తాడు విమానం రెక్క ఫ్లాప్ను తాకింది. అంతే.. కళ్లు మూసి తెరిచేలోపే, పారాచూట్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. ఆ ఉధృతి ఫెర్గూసన్ను వెనక్కి లాగేసింది. నియంత్రణ కోల్పోయిన అతను.. విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్ను ఢీకొట్టాడు. ఆ ఆపరేటర్ వెంటనే విమానం నుంచి బయటకు దూకి, అదుపులేని ఫ్రీ–ఫాల్లో పడిపోయాడు. అసాధారణ ధైర్యశాలికళ్లు మూసి తెరిచేలోపే, ఫెర్గూసన్ కాళ్లు విమానం తోక భాగంలోని ’హారిజాంటల్ స్టెబిలైజర్’కు బలంగా తగిలాయి. అంతలో, తెరుచుకున్న పారాచూట్ మొత్తం తోకకు చుట్టుకుపోయింది! ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు అనిపించింది. 15,000 అడుగుల ఎత్తులో.. ఆడ్రియన్ ఫెర్గూసన్ విమానం తోకకు వేలాడుతూ, చావు అంచున చిక్కుకుపోయాడు. అతని ముఖంలో మృత్యు భయం స్పష్టంగా కనిపించింది. కింద అగాధం.. పైన మృత్యుపాశం.. పట్టు తప్పితే ప్రాణాలు దక్కవు. ఆ ప్రమాదకర స్థితిలో, ఆడ్రియన్ ఫెర్గూసన్ భయంతో వణికిపోకుండా, అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం.. చేతిలో ఉన్న చిన్న హుక్ కత్తి. ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్ మృత్యువుతో పోరాడాలి. ప్రాణం కాపాడిన కత్తిఆడ్రియన్ తన వద్ద ఉన్న చిన్న ’హుక్ కత్తి’ తీశాడు. వేలాడుతూనే.. విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్ పారాచూట్ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు. ఇది సాహసం కాదు, ఆత్మరక్షణ! ఆఖరికి 11 లైన్లను తెగ్గొట్టగలిగాడు. చివరికి, చిరిగిన పారాచూట్లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే, ఆడ్రియన్ తన ప్రధాన పారాచూట్ను తెరిచాడు. రిజర్వ్ పారాచూట్ అవశేషాలు అడ్డుప డినా, అది పూర్తిస్థాయిలో విచ్చుకుంది. చివరకు, ఫెర్గూసన్ కేవలం స్వల్ప కాలి గాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యాడు. మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది ప్రమాదంలో విమానం..ఇంతలో పైన విమానం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. పారాచూట్ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో, పైలట్ కొంతవరకు విమానంపై నియంత్రణ కోల్పోయాడు. వెంటనే, ఆయన ’మేడే’ అత్యవసర సంకేతాన్ని పంపారు. తోకకు చిక్కుకున్న పారాచూట్తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించినా, బ్రిస్బేన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయంతో, పైలట్ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని టల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. కానీ తోక భాగానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. A skydiver in Queensland Australia was left dangling thousands of metres in the air after their parachute caught on the plane’s tail. The dramatic footage was released by the Australian Transport Safety Bureau following an investigation into the incident. pic.twitter.com/ntXU6d8pAQ— Channel 4 News (@Channel4News) December 11, 2025శభాష్ ఫెర్గూసన్!ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరిగిన ఈ అసాధారణ ఘటనపై ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ఏటీసీబీ) దర్యాప్తు జరిపి, ఈ ఉత్కంఠభరితమైన వీడియోను విడుదల చేసింది. ఏటీసీబీ ముఖ్య కమిషనర్ ఆంగస్ మిచెల్ మాట్లాడుతూ, ‘హుక్ కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ, రిజర్వ్ పారాచూట్ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడింది’.. అని ఫెర్గూసన్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు. పదిహేను వేల అడుగుల ఎత్తులో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫెర్గూసన్ సాహసం, ఆత్మవిశ్వాసం ప్రపంచ స్కైడైవింగ్ చరిత్రలో ఒక పాఠ్యాంశంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా -
రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా
బీజింగ్ : రూ.1,404 కోట్ల అవినీతి , లంచం తీసుకున్న నేరాలకు సంబంధించిన కేసు చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దోషిగా తేలిని సీనియర్ బ్యాంకర్ను ఉరి శిక్షను అమలు చేసింది.సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన తర్వాత టియాంజిన్లో మరణశిక్ష అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. బాయి టియాన్హుయ్ వేలకోట్ల అక్రమాలు, దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఒకటి పాపులర్ ఈ కేసు చైనాలో , అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది.చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాయి టియాన్హుయ్ 1.1 బిలియన్ యువాన్లకు(దాదాపు రూ.1,404 కోట్లు) పైగా చట్టవిరుద్ధమైన చెల్లింపులు పొందారని కోర్టులు తేల్చిన తర్వాత చైనా అతణ్ని ఉరితీసింది . ఆర్థిక సంస్థలు మరియు రాష్ట్ర-సంబంధిత సంస్థలలో అవినీతికి వ్యతిరేకంగా బీజింగ్ కొనసాగుతున్న ప్రచారంలో భాగంగా ఈ శిక్షను అమలు చేసింది.చైనా గతంలో ప్రధాన కేసుల్లో శిక్షను అమలు చేసినప్పటికీ, అవినీతి కేసుల్లో మరణశిక్షలు అరుదనే చెప్పాలి.చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ ఛైర్మన్గా పనిచేసిన లై షియోమిన్ 1.79 బిలియన్ యువాన్ల లంచం తీసుకున్నందుకు దోషిగా తేలిన తర్వాత 2021లో ఉరితీశారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం సుప్రీం పీపుల్స్ కోర్టు మునుపటి తీర్పును సమర్థించిన నేపథ్యంలో టియాంజిన్లో బాయి టియాన్హుయ్ మరణశిక్ష అమలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అక్రమ డబ్బు పరిమాణం , దేశంలోని ప్రధాన ఆర్థిక సమూహాలలో ఒకదానిలో బాయి ఒకప్పుడు కలిగి ఉన్న స్థానం కారణంగా ఈ కేసు చైనాలో మరియు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. టియాంజిన్ సెకండ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు తొలుత బాయికి 2024 మేలో మరణశిక్ష విధించింది. అతని వ్యక్తిగత ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. బాయి టియాన్హుయ్ అందుకున్న లంచాల మొత్తం , నేరాల స్థాయి చాలా తీవ్రమైనవిగా కోర్టు పరిగణించింది. బాయి ప్రవర్తన దేశప్రయోజనాలను దెబ్బతీయడం తోపాటు, ప్రజలకు హాని కలిగించిందని, చట్టం ప్రకారం అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా పేర్కొంది.సుప్రీం పీపుల్స్ కోర్ట్ ఈ పరిశోధనలను ఆమోదించింది సాక్ష్యాలు స్పష్టంగా, నిర్ణయాత్మకంగా ఉన్నాయని అతనికి ఈ శిక్ష "తగినది" అని పేర్కొంది. SCMP ప్రకారం, బాయి 2014 - 2018 మధ్య చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్లో జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్గాపనిచేశారు. ఆ కాలంలో, అతను ఫైనాన్సింగ్ ఏర్పాట్లు మరియు ప్రాజెక్ట్ సంబంధిత లావాదేవీల ఆమోదం కోసం అక్రమాలకు పాల్పడ్డాడు. ఇది చివరికి 1.1 బిలియన్ యువాన్లకు (రూ. 1,404 కోట్లు) పైగా అక్రమ లాభార్జనకుదారితీసింది. -
డొనాల్డ్ ట్రంప్లో అసహనం..
ఇటీవల కాలంలో పలు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నాయకుల మధ్య మాటల దాడి హెచ్చుమీరుతోంది. ఈ పరిణామాలను చూస్తే గతంలోనే వరల్డ్ వార్-3 వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావించారు. దేశాల మధ్య సఖ్యత చెదిరి, యుద్ధాలకు దారి తీస్తున్న పరిస్థితులే వీటన్నంటికీ కారణం. అటు రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలుకొని నేటి పాకిస్తాన్-ఆఫ్గాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల్ని చూస్తే ఏదో ఉపధ్రవం రాబోతుందా? అని పగటు ప్రజానీకం ఉలిక్కిపడిన సందర్భాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ట్రంప్లో అసహనం.. మరొకవైపు ‘శాంతి-శాంతి’ అని చెప్పుకునే అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో వరల్డ్ వార్-3 అంటూ వ్యాఖ్యానించారు కూడా. మళ్లీ తాజాగా ట్రంప్ అదే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయన్ల మధ్య యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ యుద్ధం కారణంగా గత నెలలోనే సుమారు 25 వేల మంది వరకూ మృత్యువాత పడ్డారని, అందులో ప్రజలు, సైనికులు కూడా ఉన్నారన్నారు.ఆ యుద్ధాన్ని తక్షణమే ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అది కారణం కావొచ్చని హెచ్చరించారు. ఆ ఇర దేశాల నేతాలకు ఎన్నిసార్లు చెప్పినా యుద్ధాన్ని ఏదొక రూపంలో ముందుకు తీసుకెళుతున్నారే కానీ దాన్ని ముగించాలనే ఆలోచన చేయడం లేదంటూ వైట్హౌస్ వేదికగా మీడియా సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు ట్రంప్.ఇక మాటల్లేవ్.. అంతా యాక్షనే..!అంతకుముందు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ల యుద్ధంపై ట్రంప్ చాలా ఆందోళనగా ఉన్నారన్నారు. అది ట్రంప్కు విపరీతమైన చిరాకు తెప్పిస్తుందన్నారు. ఇరుదేశాలు ఒక సఖ్యతకు వచ్చి యుద్ధం ఆపకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్నారు. ఇక రష్యా- ఉక్రెయిన్లతో మాట్లాడాలని ట్రంప్ అనుకోవడం లేదని, ఇక కేవలం చర్యలతోనే ఇరు దేశాలకు సరైన సమాధానం చెప్పాలని ట్రంప్ భావిస్తున్నారన్నారు. భారత టూరిస్టులకు షాకిచ్చిన ట్రంప్.. -
శాస్త్రవేత్తలే విస్తుపోయేలా 92 అడుగుల భారీ డైనోసార్
దక్షిణ చైనాలో భారీ ఎముకలతో, కనీవినీ ఎరుగని పెద్ద డైనోసార్ శిలాజాలను గుర్తించారు. ఈ భారీ శిలాజం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. ఇది దాదాపు 92 అడుగుల (సుమారు 28 మీటర్లు) పొడవు ఉంటుందని అంచనా. టోంగ్నాన్లాంగ్ జిమింగి (Tongnanlong zhimingi) అనే పేరుపెట్టారు. ఈ భారీ 92 అడుగుల సౌరోపాడ్ (Sauropod) జాతి డైనోసార్ ఇపుడు భూమిపై అతిపెద్ద భూ జంతువులలో ఒకటిగా నిలుస్తోంది.న్యూ జురాసిక్ డైనోసార్ టోంగ్నాన్లాంగ్టోంగ్నాన్ జిల్లా తవ్వకాలలో శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. డైనోసార్ శిలాజాలకు భౌగోళిక హాట్స్పాట్ అయిన సిచువాన్ బేసిన్లోని ప్రాంతమైన చాంగ్కింగ్లోని టోంగ్నాన్ జిల్లాలో నిర్మాణ పనుల సమయంలో ఈ అవశేషాలను మొదటిసారిగా 1998లో తవ్వారు. కానీ ఇటీవలే శాస్త్రవేత్తలు పీర్-రివ్యూడ్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో పూర్తి విశ్లేషణను ప్రచురించారు. పొడవాటి మెడ, తోక, చిన్న తల ఉండే శాకాహారి డైనోసార్ ఇది. అవశేషాలలో అవయవాలు, వెన్నుపూసలు ,భుజం ఎముకలు కూడా ఉన్నాయి. ఈ భాగాలు ఇది సౌరోపాడ్ సమూహం అయిన మామెన్చిసౌరిడేకు చెందినదని నిర్ధారించారు. గతంలో నమోదు చేయబడిన వాటి కంటే పొడవైన భుజం బ్లేడ్ పొడవు 1.8 మీటర్ల కంటే ఎక్కువ. ఇది డైనోసార్ల పరిమాణ పరిమితులను ప్రశ్నిస్తోందనీ, ఎందుకంటే ఇంత పెద్దవిగా పెరగడం చాలా కష్టమని భావిస్తున్నారు. అస్థిపంజరం సుయినింగ్ ఫార్మేషన్ రాక్ బెడ్ లోపల ఉంది. ఇది సుమారు 147 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. అక్కడ వరదలు సంభవించిన సంఘటనలు అక్కడ చాలా త్వరగా మృతదేహాలను పాతిపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.మూడు డోర్సల్ వెన్నుపూస, ఆరు కాడల్ వెన్నుపూస పూర్తి స్కాపులా , కోరాకోయిడ్ టిబియా, ఫైబులా, మెటాటార్సల్స్ మరియు గోళ్ల భాగాలు తదితరాలు ఈ తవ్వకాల్లో గుర్తించినవాటిల్లో ఉన్నాయి. డైనోసార్ ఇంత భారీ పరిణామంలో ఎలా?ఈ జంతువులు విపరీతమైన పరిమాణం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఏంటి? వాటి చిన్న పుర్రెలు, చాలా పొడవైన, సరళమైన మెడకు సపోర్ట్గా నిలవడంతోపాటు, కారగాలితో నిండిన ఎముకలు భారీ శరీరాన్ని చాలా తేలికగా ఉంచుతాయి. సమర్థవంతమైన శ్వాస వ్యవస్థలు వాటి లోపల ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరిచాయి. ఈ లక్షణాలు కాలక్రమేణా పరిమాణానికి బాటలు వేశాయి. నేడు కనిపించే ఆధునిక పక్షులలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయని అధ్యయనవేత్తలు అంటున్నారు. ఈ పరిణామ మిశ్రమం స్థిరమైన పెరుగుదలను ప్రోత్సహించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ జెయింట్స్ ఎలా వృద్ధి చెందాయో వివరించడానికి కొత్త శిలాజం సహాయపడుతుందట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అసలు అధ్యయన ప్రచురణలో పొందుపర్చారు. -
మెక్సికో 50 శాతం సుంకాలు, స్పందించిన చైనా
అమెరికా భారతదేశంపై చాలా వస్తువులపై 50 శాతం సుంకాలను విధించిన నాలుగు నెలల తర్వాత, అమెరికా పొరుగునే ఉన్న మెక్సికో కూడా ఈ వరుసలో చేరింది. భారతదేశం ,చైనాతో సహా ఆసియా దేశాల నుండి కొన్ని రకాల ఉత్పత్తుల దిగుమతిపై 50 శాతం వరకు సుంకాలను విధించింది. ఈ మేరకు మెక్సికో ఒక బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఇవి 2026 జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయి. ప్రతిపాదిత సుంకాల ద్వారా 3.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33,910 కోట్లు) అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని దేశాలు భారతదేశం, దక్షిణ కొరియా, చైనా, థాయిలాండ్ , ఇండోనేషియా వంటి దేశాలపై ప్రభావం చూపుతాయి. ఈ టారిఫ్స్పై చైనా స్పందించింది. ఏకపక్ష సుంకాల పెంపుదలను వ్యతి రేకిస్తున్నామని పేర్కొంది. మెక్సికో ఇలాంటి తప్పుడు పద్ధతులను త్వరగా సరిదిద్దుకోవాలని కోరింది. ఎందుకంటే 2024లో 130 బిలియన్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిన చైనా ఎక్కువగా ప్రభావితమవుతుంది.ఇండియాతో పాటు పలు దేశాలపై మెక్సికో 50 శాతం టారిఫ్లను విధించింది. ఆ దేశంతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం లేని ఇండియా, చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాలపై ఈ ప్రభావం పడనుంది. ప్రధానంగా ఆటో విడిభాగాలు, తేలికపాటి కార్లు, దుస్తులు, ప్లాస్టిక్లు, ఉక్కు, గృహోపకరణాలు, బొమ్మలు, వస్త్రాలు, ఫర్నిచర్, పాదరక్షలు, తోలు వస్తువులు, కాగితం, కార్డ్బోర్డ్, మోటార్సైకిళ్లు, అల్యూమినియం, ట్రైలర్లు, గాజు, సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై సుంకాలు 5 నుంచి 50 శాతం అమలు కానున్నాయి. మెక్సికన్ ప్రభుత్వం ఆసియా దేశాల నుండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనేది మెక్సికో ప్రధాన లక్ష్యం. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ దేశ పరిశ్రమకు ఎక్కువ రక్షణ కల్పించాలని, దేశీయ ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నారు. ముఖ్యంగా చైనాతో దాని వాణిజ్య అసమతుల్యత గణనీయంగా ఉంది. ముఖ్యంగా భారత్నుంచి ఆటోమొబైల్స్ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. వీటి విలువ 1 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. వోక్స్వ్యాగన్, హ్యుండాయ్, నిసాన్, మారుతి సుజుకీ వంటి కంపెనీల ఎగుమతులపై ఈ ప్రభావం ఉండనుంది. కార్లపై టాక్స్ 20 శాతం నుంచి 50 శాతానికి పెరగనుంది. దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత మెక్సికోకు మూడో అతిపెద్ద కార్ల ఎగుమతి మార్కెట్ భారత్దే దీంతో భారతదేశంలోని అతిపెద్ద వాహన ఎగుమతిదారులకు భారీ షాక్ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత సుంకాల పెంపు భారత ఆటోమొబైల్ ఎగుమతులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్న నేపథ్యంలో మెక్సికన్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా భారత ప్రభుత్వ మద్దతును కోరుతున్నామని సుంకం ఖరారు కావడానికి ముందు ఆటో ఇండస్ట్రీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. -
జపాన్లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరికలు
టోక్యో: జపాన్లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉత్తర జపాన్ తీరంలో శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. తాజా భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్గా మారాయి.జపాన్ను వరుస భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. జపాన్లో భూకంప తీవ్రతను 6.7గా నిర్ధారించింది. హోన్షు ద్వీపంలోని ఇవాటే ప్రిఫెక్చర్లోని కుజీ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పసిఫిక్ తీర ప్రాంతాల్లో సుమారు మీటరు (మూడు అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. BREAKING: Massive 6.7 magnitude earthquake has struck northeast Japan on December 12 and a tsunami warning has just been issued pic.twitter.com/Ufjy62QOlF— Surajit (@surajit_ghosh2) December 12, 2025ఇక, కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసింది. ఈ క్రమంలో 50 మంది వరకు గాయపడ్డారు. అయితే, సోమవారం నాటి భూకంపంతో పోలిస్తే ఈసారి ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉందని స్థానిక మీడియా సంస్థ ఎన్హెచ్కే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఆ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని, అసాధారణ పరిస్థితులేవీ గమనించలేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ స్పష్టం చేసింది. Earthquake M6.7 near the east coast of Honshu yeah, just strong enough to shake Japan’s socalled ‘major’ areas like they were on vibrate mode.#earthquake #Japan #Tsunami#地震#余震 pic.twitter.com/cV2J5m4GnI— Sumit (@A_Sumishiv1423) December 12, 2025 Strong magnitude 6.7 earthquake hit Japan’s northeast on December 12th, prompting a tsunami warning across coastal zones pic.twitter.com/tmRCeW0UIR— Surajit (@surajit_ghosh2) December 12, 2025 -
భారత టూరిస్ట్లకు షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: వీసాల విషయంలో అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యాటక వీసాలపై కొత్తగా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అమెరికాలో ప్రసవించి... తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే వీసాలు తిరస్కరించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.కాగా, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో వలసదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటక వీసా (Visa) జారీ విషయంలోనూ ట్రంప్ సర్కార్ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా జన్మతః పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో పర్యాటక వీసా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా..‘పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడం పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం. ఇటువంటి వాటిని అనుమతించం’ అని పేర్కొంది. మరోవైపు తమ దేశంలోకి వచ్చే పర్యాటకుల్లో కొందరు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో, H-1B వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాల సమీక్షను కూడా విస్తరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.అంతేకాకుండగా.. అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో, విదేశాంగ శాఖ ఇప్పటికే F, M, J వంటి విద్యార్థి, సందర్శకుల వీసా వర్గాలకు సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సమీక్ష H-1B, H-4 దరఖాస్తుదారులకు కూడా డిసెంబర్ 15 నుంచి వర్తిస్తుంది. ట్రంప్ యంత్రాంగం ఇటీవల H-1B, H-4 దరఖాస్తుదారులందరికీ సోషల్ మీడియా స్క్రీనింగ్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇది వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రతి కేసును క్షుణ్ణంగా భద్రతా సమీక్ష చేస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. -
ఆమె టైమ్ బాలేదు!
సాధారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీసుకు వస్తేనే కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయి. కానీ, స్పెయిన్లో ఒక మహిళ.. చాలా ముందుగా ఆఫీసుకు వస్తోందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు. మీరు చదివింది నిజమే.. స్పెయిన్లో రూల్ అంటే రూలే మరి. మేనేజర్ల ఆదేశాలుబేఖాతర్.. స్పెయిన్కు చెందిన 22 ఏళ్ల ఒక ఉద్యోగిని అధికారికంగా ఉద యం 7.30 గంటలకు పని ప్రారంభించాలి. కానీ, ఆమె అలవాటు ప్రకారం రోజూ దాదాపు 6.45 గంటలకే కార్యాలయానికి చేరుకునేది. ఒకరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదికి పైగా ఇదే పద్ధతిని పాటించింది. ఈ విషయంలో కంపెనీ ఆమెకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో ఆమెకు కేటాయించిన పనులేవీ లేవని, ముందే రాకూడదని స్పష్టంగా చెప్పినా.. ఆమె వినిపించుకోలేదు.ఎందుకుముందే వచ్చావ్! కంపెనీ యాజమాన్యానికి సహనం నశించింది. ఆదేశాలను ఉద్యోగిని పట్టించుకోకపోవడం, నియమాలను ఉల్లంఘించడం తీవ్రమైన దు్రష్పవర్తనగా భావించింది. ‘ఇది కేవలం ఉత్సాహం కాదు, కంపెనీ ఆదేశాలను పదేపదే ధిక్కరించడమే’.. అని మేనేజర్లు స్పష్టం చేశారు. ఆ సమయంలో చేయగలిగిన ముఖ్యమైన పనులేవీ లేనప్పటికీ, కావాలనే పదేపదే ఆదేశాలను బేఖాతర్ చేయడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు.న్యాయస్థానంలో నూచుక్కెదురుకంపెనీ నిర్ణయంతో ఆగ్రహించిన ఆ మహిళ.. తన తొలగింపు అన్యాయమని వాదిస్తూ అలికెంట్ సోషల్ కోర్టులో సవాలు చేసింది. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా.. సంస్థ ఎన్ని హెచ్చరికలు చేసినా ఆమె అదే అలవాటును కొనసాగించిందని తేలింది. కొన్నిసార్లు, ఆమె ఆఫీసుకు రాకముందే కంపెనీ యాప్లో లాగిన్ కావడానికి కూడా ప్రయతి్నంచినట్లు కోర్టు దృష్టికి వచి్చంది.రూల్ అంటే రూలే మరి..న్యాయమూర్తి.. ఉద్యోగం నుండి తొలగించడానికి కారణం ‘ముందే ఆఫీస్కు రావడం’కాదని, పనిచేసే చోట నియమాలను పాటించడానికి నిరాకరించడమే ప్రధాన కారణమని తన తీర్పులో స్పష్టం చేశారు. ఉద్యోగుల చట్టం ఆర్టికల్ 54 ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘనే అని తేలి్చ, కంపెనీ తొలగింపు నిర్ణయాన్ని కోర్టు సమరి్థంచింది. ప్రస్తుతానికి తీర్పు మారకపోయినా, ఆమె ఇంకా వాలెన్సియా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాల్కనీకి వేలాడింది..
అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్పైప్లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది. పక్కింట్లో ఆపద్బంధువు!భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్ పైప్ పట్టుకుని పక్క ఫ్లాట్ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ‘ఏఐ’
న్యూయార్క్: ఏఐ. కృత్రిమ మేధ. కొన్నేళ్లుగా ప్రపంచాన్నే ఏలుతున్న సరికొత్త సాంకేతిక విప్లవం. దాని రూపకల్పనలో శ్రమించిన వారందరికీ సమష్టిగా ప్రఖ్యాత టైమ్ మేగజైన్ 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ గౌరవం దక్కింది. గురువారం ఒక ప్రకటనలో మేగజైన్ ఈ మేరకు వెల్లడించింది. కృత్రిమ మేధ ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని రీతిలో సింహగర్జన చేసిన ఏడాదిగా 2025ను అభివర్ణించింది. ‘సొంతంగా ఆలోచించే యంత్రాలు మొదలుకుని ఒకప్పుడు అసాధ్యమని భావించిన వాటన్నింటినీ సుసాధ్యం చేస్తున్న సాంకేతిక అద్భుతం ఏఐ. దాన్ని స్వప్నించి, శ్రమించి చివరికి సాధించిన వ్యక్తులందరూ 2025కు గాను పర్సన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి అర్హులే‘ అని పేర్కొంది. ’వ్యక్తులు మాత్రమే కాదు, సంస్థలు, కాన్సెప్టులను కూడా ఈ పురస్కారానికి ఎంపిక చేశాం’ అని టైమ్ మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ సామ్ జాకబ్స్ వివరించారు. -
మంచుకొండల్లో పెనుముప్పు!
హిమాలయాలు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పేనా? మంచుకొండల్లో పెను విలయం తప్పదా? అది కూడా అతి త్వరలోనే ముంచుకురానుందా? ఆ ఆస్కారం చాలానే ఉందని చెబుతున్నారు సైంటిస్టులు. ఏకంగా 7.6 తీవ్రతతో జపాన్ ను తాజాగా వణికించిన లేను భూకంపం ఇందుకు సూచికేనని అని వారు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఉత్పాతాన్ని ఇప్పటి నుంచే ’గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్’ గా పిలిచేస్తున్నారు కూడా! పేలనున్న మందుపాతర! జపాన్ భూకంపం వంటి ప్రాకృతిక విలయాలకు ఆస్కారం అత్యంత ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉన్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ జనానికి ఈ విపత్తులు, ముఖ్యంగా భూకంపాలతో సహజీవనం పరిపాటిగా మారింది. త్వరలో హిమాలయాల్లో కూడా అదే పరిస్థితి తలెత్తేలా ఉందన్నది భూ భౌతిక శాస్త్రవేత్తల ఆందోళన. హిమాలయ ప్రాంతాన్ని ఏ క్షణంలోనైనా పేలనున్న మందుపాతరగా వాళ్లు అభివరి్ణస్తున్నారు. హిమాలయాల అడుగున టెక్టానిక్ ప్లేట్ల కుమ్ములాటే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకంటే అక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేషియన్ ప్లేట్ ను ఢీకొడుతూ వస్తోంది. దాంతో కొన్ని సహస్రాబ్దాలుగా ఆ ప్రాంతమంతటా భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు అతి భారీ పరిమాణంలో విడుదలవడం ఖాయమన్నది సైంటిస్టుల మాట. ‘అదే జరిగితే రిక్టర్ స్కేలుపై ఏకంగా 8, లేదా అంతకు మించిన తీవ్రతతో భూమి కంపిస్తుంది. దాని ప్రభావానికి మొత్తం ఉత్తర భారతమే గాక నేపాల్, ఇరుగుపొరుగు దేశాలు కూడా కనీవినీ ఎరగనంతటి స్థాయిలో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను చవిచూడాల్సి రావచ్చు‘ అని వారు హెచ్చరిస్తున్నారు. చరిత్రే సాక్షి హిమాలయాలకు భూకంపాలు, అందులోనూ భారీ ప్రకంపాలు నిజానికి కొత్తేమీ కాదు. 1934లో ఏకంగా 8 తీవ్రతతో సంభవించిన భూకంపం బిహార్ మీదుగా నేపాల్ దాకా ఉత్పాతం సృష్టించింది. ఇటీవలి చరిత్ర చూసుకున్నా, 2015లో నేపాల్లోని హిమ సానువుల్లో 7.8 తీవ్రతతో వచి్చన భూకంపం అక్కడ భారీ జన, ఆస్తి నష్టాలకు కారణమైంది. అయితే హిమాలయాల్లో భూకంపం వచ్చేస్తుందని ఆందోళన అక్కర్లేదన్నది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డైరెక్టర్ డాక్టర్ ఓం ప్రకాశ్ మిశ్రా మాట. ‘హిమాలయాల్లో సైంటిస్టులు చెబుతున్నట్టు ప్రాకృతిక ఉత్పాతమేదీ రాబోదు. నిజానికి ఎన్నెన్నో ఉత్పాతాల నుంచి దేశాన్ని కాపాడుతున్న పెట్టని కోట మన హిమ సానువులు. భూ పలకల ఒరిపిడి విలయానికి దారి తీస్తుందని బెంబేలు పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆ ఒరిపిడి తాలూకు ఒత్తిడి 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన భూకంపాల రూపంలో ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంది. కనుక గ్రేడ్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ గురించి మరీ ఆందోళన పనిలేదు‘ అని చెప్పుకొచ్చారాయన. కానీ ఎవరెన్ని చెప్పినా సమీప కాలంలో భారీ భూకంపానికి హిమ సానువులు సిద్ధమవుతున్నాయన్నదే మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం. బీఐఎస్ దీ అదే మాట ఇటీవల జరిగిన దేశ భూకంప రిస్కు జోన్ల మ్యాపింగ్ కూడా మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయాయాన్నే బలపరుస్తుండటం విశేషం. అందులో భాగంగా భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తాజాగా సవరించింది. అత్యధిక రిసు్కతో కూడిన జోన్ 6 ను కొత్తగా ఏర్పాటు చేయడమే గాక హిమాలయ ప్రాంతమంతటినీ దాని పరిధిలోనే చేర్చింది! ఇవన్నీ మంచు కొండల్లో ముంచుకు రాగల పెను ముప్పు ముందస్తు సూచికలేనని చెబుతున్నారు. -
ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ వీసా పథకం అమల్లోకి వచ్చింది. బుధవారం శ్వేతసౌధంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయనే స్వయంగా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారు. ఇందుకోసం trumpcard. gov అనే ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి, శాశ్వత నివాసానికి, తర్వాత పౌరసత్వం పొందడానికి కూడా వీలు కలి్పంచే ఈ కార్డు ధర మిలియన్ డాలర్లు(రూ.9.02 కోట్లు). అమెరికాలో స్థిరపడాలని భావించే విదేశీయులు వ్యక్తిగతంగా లేదా విదేశీ ఉద్యోగుల తరఫున అమెరికాలోని కంపెనీలు కొనుగోలు చేయొచ్చు. కంపెనీల మాత్రం రెండు మిలియన్ల డాలర్లు(రూ.18.03 కోట్లు) చెల్లించాలి. గోల్డ్ కార్డు కోసం వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రాసెసింగ్ ఫీజు కింద 15,000 డాలర్లు(రూ.13.54 లక్షలు) చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఆన్లైన్లోనే మిలియన్ డాలర్ల రుసుము చెల్లించవచ్చు. అమెరికాలో అతి తక్కువ సమయంలో నివాసిత హోదా, తద్వారా పౌరసత్వం పొందాలంటే ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ కొనుగోలు చేయడం చక్కటి మార్గమని ప్రభుత్వం వెల్లడించింది. కార్డు విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతో అమెరికా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. ట్రంప్ గోల్డ్ కార్డు అనేది నిజానికి ఒక వీసా లాంటిదే. నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికాలో ఉద్యోగాల్లో నియమించుకోవడం, వారు ఇక్కడే ఉండిపోయే అవకాశం కల్పించడం, పౌరసత్వం ఇవ్వడం, అమెరికా అభివృద్ధి కోసం వారి సేవలు ఉపయోగించుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విదేశీ నిపుణులు రావడం ఒక బహుమతి గోల్డ్ కార్డు వీసా విక్రయాలు అధికారికంగా ప్రారంభం కావడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న నైపుణ్యం కలిగిన విదేశీ విద్యార్థులు ఇకపై స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉద్యోగాలు పొందవచ్చని, ఇక్కడే ఉండిపోవచ్చని సూచించారు. గ్రీన్ కార్డు కంటే గోల్డ్ కార్డు అత్యత్తమమైనదని స్పష్టంచేశారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. ట్రంప్ బుధవారం మధ్యాహ్నం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, డెల్ టెక్నాలజీస్ సీఈఓ మైఖేల్ డెల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. వెబ్సైట్ ద్వారా గోల్డ్ కార్డులు కొనుగోలు చేయొచ్చని ట్రంప్ సూచించారు. అమెరికాలో చదువుకుంటున్న భారత్, చైనా విద్యార్థులు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత స్వదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉండడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. విదేశీ నిపుణులు అమెరికాకు రావడం, అమెరికా ప్రగతి కోసం పనిచేయడాన్ని ఒక బహుమతిగా భావిస్తామని చెప్పారు. సమస్య ఏమిటో తెలిసింది..యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్తోపాటు ఇతర కంపెనీల ప్రతినిధులతో తనకు ఎదురైన అనుభవాన్ని ట్రంప్ పంచుకున్నారు. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు చదువు అయిపోయిన తర్వాత సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని, వారిని ఉద్యోగాల్లో నియమించుకోలేకపోతున్నామని, వారంతా అమెరికాలోనే ఉండేలా చూడాలని టిమ్ కుక్ తనను కోరారని తెలిపారు. అసలైన సమస్య ఏమిటో తనకు తెలిసిందని చెప్పారు. ఇకపై ఆ సమస్య ఉండదన్నారు.సొమ్ము చేసుకోవడానికేనా? ఇండియాలో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలను ఐదారు నెలలపాటు వాయిదా వేశారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైళ్లను, వారు చేసిన పోస్టులను క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ ప్రకటించింది. వేలాది మంది దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. తదుపరి షెడ్యూల్ కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలకు తెరతీయడం గమనార్హం. అధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కఠినతరం చేసింది. విదేశాల నుంచి వలసలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. మరోవైపు విదేశీయులను ఆకర్శించడానికి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచి్చంది. గోల్డ్ కార్డు పేరిట భారీగా సొమ్ము చేసుకోవడం, ఆర్థిక లోటును పూడ్చుకోవడమే ట్రంప్ సర్కార్ అసలు లక్ష్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్లాటినం వెర్షన్ కార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని ధర 5 మిలియన్ల డాలర్లు. కంపెనీలు ఈ కార్డు కొంటే కొన్ని రకాల పన్ను రాయితీలు, మినహాయింపులు లభిస్తాయి. త్వరలో ఈ కార్డు అందుబాటులోకి రానుంది.ఐదేళ్ల తర్వాత పౌరసత్వం: హోవార్డ్ లుట్నిక్ గోల్డ్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే మిలియన్ డాలర్లు, కంపెనీలు దరఖాస్తు చేస్తే రెండు మిలియన్ల డాలర్లు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ కార్డు కొనుగోలు చేసినవారు ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఒక కార్డుతో ఒక్కరు మాత్రమే అమెరికాలో ఉండడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కంపెనీలు ఎన్ని కార్డులైనా కొనుగోలు చేయొచ్చని అన్నారు. కార్డు ఎన్ని రోజుల్లో రావొచ్చు..గోల్డ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యి కార్డు చేతికి అందడానికి కొన్ని వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. అవసరాన్ని బట్టి అదనపు డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. దరఖాస్తు రుసుము 15,000 డాలర్లు నాన్ రీఫండబుల్. అంటే గోల్డ్ కార్డు వచి్చనా రాకున్నా ఈ సొమ్ము వెనక్కి తిరిగిరాదు. కార్డు వచి్చన వారికి అమెరికాలో చట్టబద్ధమైన పరి్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కల్పిస్తారు. ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాదారుల హోదా లభిస్తుంది. అసాధారణమైన, అద్భుతమైన తెలివితేటలు, నైపుణ్యాలు ఉన్నవారికి ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాలు ఇస్తుంటారు. ట్రంప్ గోల్డ్ కార్డు కొంటే పరోక్షంగా ఈబీ–1 లేదా ఈబీ–2 వీసా పొందినట్లే. -
వీసా రహిత ప్రయాణికులకు.. సోషల్ మీడియా స్క్రీనింగ్
వాషింగ్టన్: విదేశీయులకు ప్రవేశ ని బంధనలను అగ్ర రాజ్యం అమెరికా నానాటికీ కఠినతరం చేస్తోంది. మూడో ఓరియన్ దేశాల వారికి శాశ్వతం తలుపులు మూసేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించే వెసులుబాటున్న దేశాలకు చెందిన ప్రయాణికుల కూడా పలు నిబంధనలను వర్తింపజేయాలని అమెరికా అంతర్గత భద్రత (హోమ్ లాండ్ సెక్యూరిటీ) విభాగం తాజాగా నిర్ణయించింది. ప్రవేశానికి అనుమతించే ముందు వారి సోషల్ మీడియా హిస్టరీ, ఇ మెయిల్ ఖాతాలు, కుటుంబ సమగ్ర చరిత్ర తదితరాలను లోతుగా పరిశీలించనుంది. బుధవారం ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురించిన నోటీసులో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. వారి తాలూకు ఐదేళ్ల సోషల్ మీడియా సమాచారాన్ని వడపోయాలని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ప్రతిపాదించినట్టు అందులో పొందుపరిచారు. అంతేగాక ఐదేళ్లలో వారు వాడిన ఫోన్ నంబర్లు తదితరాలను కూడా ఇకపై విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. దాదాపు 40 దేశాలకు అమెరికాలోకి వీసారహిత ప్రవేశం అందుబాటులో ఉంది. అక్కడి పౌరులు అగ్ర రాజ్యానికి వెళ్లాలంటే ఎల్రక్టానిక్ సిస్టం ఫర్ ట్రావెల్ అథరైజేషన్లో ఆన్ లైన్లో వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. ఆ పద్ధతిని ఇకపై మార్చనున్నారు. అభంతరాల స్వీకరణ, వారి అనంతరం 60 రోజుల్లో ఈ నిబంధనలన్నీ అమల్లోకి రానున్నాయి. దీనివల్ల అమెరికాకు పర్యాటకపరంగా నష్ట ఉండబోదని మీడియా ప్రశ్నలకు బదులు ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాకు వీసారహిత ప్రవేశ వెసులుబాటున్న 40 దేశాల్లో అత్యధికం యూరప్, ఆసియా దేశాలే. -
ఎయిర్ స్ట్రైక్.. 34 మంది మృతి
మయన్మార్ మరోసారి నెత్తురోడింది. గురువారం పశ్చిమ రఖైన్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై ఆదేశ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ నెలలో ఆదేశంలో మిలటరీ దాడి చేయడం ఇది రెండోసారి.మయన్మార్లో హింసతో అట్టుడుకిపోతుంది. 2021లో నోబెల్ గ్రహిత ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టి ఆదేశ ఆర్మీ అధికారాన్ని హస్తగతం చేసుకున్ననాటి నుంచి ఆ దేశం అంతర్గత సంఘర్షణలతో అట్టుడుకుతుంది. ఆర్మీకి వ్యతిరేకంగా అక్కడి రెబల్ గ్రూపులు వారి హక్కులు, సంస్కృతి కాపాడుకోవడానికి ఆర్మీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ వారిపై ఉక్కుపాదం మోపుతుంది. ఈనెల 5వ తేదీన సగాయింగ్ ప్రాంతంలో ఓ టీషాపులో పుట్బాల్ మ్యాచ్ తిలకిస్తున్న ప్రజలపై ఆర్మీ బాంబులతో విరుచుకపడింది. ఈ ఘటనలో 18మంది మృతిచెందారు. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో ఆసుపత్రిపై దాడి చేసింది. రఖైన్ రాష్ట్రంలోని మ్రౌక్ యు టౌన్షిప్లోని ఓ ఆసుపత్రిపై ఆదేశ ఆర్మీ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో 34 మంది చనిపోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ఆర్కాన్ అనే రెబల్ గ్రూపు ఆధీనంలో ఉంది. మయన్మార్ ఆర్మీ ప్రధానంగా ఆ దేశ ఆర్మీ రెబల్ గ్రూపు ప్రాంతాలే టార్గెట్గా దాడులు చేస్తోంది. 2025 ప్రారంభం నుంచి నవంబర్ చివరి వరకూ సైనిక దళాలు 2,165 సార్లు వైమానిక దాడులు నిర్వహించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. డిసెంబర్ 28నుంచి మయన్మార్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే అక్కడి ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్త్నున్నట్లు సమాచారం. -
ట్రంప్కు ప్రధాని మోదీ ఫోన్
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్ భారత్ పర్యటన తర్వాత ట్రంప్కు మోదీ ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్ చర్చించారు. ఉమ్మడి, లాభదాయక అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా చర్చించారు.కాగా, భారత్, పాక్ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయని కల్పించుకుని దాన్ని నివారించానంటూ తాజాగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. మంగళవారం(డిసెంబర్ 9) పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం! కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్ బైజాన్‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్ లాండ్ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్ స్టాప్ పెట్టానని చెప్పుకొచ్చారు. మరోవైపు, భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రధాని మోదీతో టెలిఫోన్లో సంభాషించిన సంగతి తెలిసిందే. నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఇరువురు అగ్రనేతలు త్వరలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మోదీ, నెతన్యాహు మధ్య స్నేహపూర్వక, ఆత్మీయ సంభాషణ సాగినట్లు ఇజ్రాయెల్ పీఎంవో పేర్కొంది. -
బంగ్లాలో ఎన్నికలు.. హసీనా పార్టీ లేకుండానే?
కొద్దికాలంగా రాజకీయ అనిశ్చితి, అశాంతితో రగిలిపోయిన బంగ్లాదేశ్ త్వరలో ప్రజస్వామ్య వేడుకకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల కమిషనర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ దేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హసినా దేశాన్ని వీడిన తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.2024లో బంగ్లాలో జరిగిన అల్లర్లు ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలను అప్పటి ప్రభుత్వం హింసాత్మకంగా అణిచివేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రధాని షేక్ హాసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసింది. అనంతరం ఆ దేశాన్ని వీడి భారత్లో తలదాచుకుంది. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాలో మహ్మద్ యూనస్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంలో ఎన్నికలు జరుపుతున్నట్లు ఎలక్షన్ కమిషనర్ నసిరుద్దీన్ ప్రకటించారు. ఈమేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అత్యంత పారదర్శకతతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దయచేసి ప్రజలెవరూ ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. విదేశాలలో ఉన్న దేశీయులు ఓటుకోసం డిసెంబర్12 నుంచి 25వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అయితే వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న షేక్ హసీనాకు ఆ దేశంలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యూనల్ మరణ శిక్ష విధించింది. ఇతర న్యాయస్థానాలు 21 సంవత్సరాల జైలుశిక్ష విధించాయి. ఈ పరిస్థితుల్లో హాసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం భారత్ను అభ్యర్థిస్తుంది. అయితే బంగ్లాదేశ్ వెళ్లే నిర్ణయం స్వయంగా షేక్ హసీనానే తీసుకోవాలని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు.షేక్ హసీనా తొలిసారిగా 1996లో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2009 నుంచి 2024లో రాజీనామా చేసే వరకూ వరుసగా 15 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. 2024లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో షేక్ హాసీనాకు చెందిన పార్టీ ఆవామీ లీగ్ను బంగ్లాదేశ్లో బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనానే కాకుండా ఆమె పార్టీ అభ్యర్థులు ఎవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు. -
త్వరలో ప్రధాని మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని భేటీ!
న్యూఢిల్లీ/జెరూసలేం: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో సంభాషించారు. ఈ సంభాషణలో నెతన్యాహూ, ప్రాంతీయ పరిస్థితులపై మోదీకి వివరాలు అందించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్–ఇజ్రాయెల్ ఒకే వేదికపై నిలబడుతున్నాయని స్పష్టం చేశారు.నేతన్యాహూ, గాజా-ఇజ్రాయెల్ ఘర్షణలు, ప్రాంతీయ భద్రతా సవాళ్లపై మోదీకి వివరించారు. ఈ పరిస్థితుల్లో భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యం మరింత కీలకమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. మోదీ-నేతన్యాహూ సంభాషణ, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచనుంది. రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతుందని అంచనా. ఫోన్ సంభాషణలోనే ఇద్దరు నాయకులు త్వరలో ముఖాముఖి సమావేశం జరపాలని అంగీకరించారు. ఈ సమావేశం ద్వారా పశ్చిమ ఆసియా శాంతి, స్థిరత్వం కోసం కొత్త వ్యూహాలు రూపొందే అవకాశం ఉంది. Spoke with my friend Prime Minister Netanyahu. We reviewed progress in the India-Israel Strategic Partnership and agreed to further strengthen our cooperation. Also reaffirmed our shared commitment to zero tolerance for terrorism. India supports all efforts aimed at achieving a…— Narendra Modi (@narendramodi) December 10, 2025ఇదిలా ఉంటే.. గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4,5 తేదీల్లో భారత్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచాయి. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు,ప్రధాని మోదీల మధ్య ఫోన్ సంభాషణ జరగడం చర్చాంశనీయంగా మారింది. -
పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్కు షాక్, 14 ఏళ్ల జైలు
పాకిస్తాన్ సైనిక చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్కు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి మిలిటరీ కోర్టు. రావల్పిండిలో డిసెంబర్ 11 విడుదల చేసిన ISPR (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) గురువారం ఈ తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ అధికార నిర్మాణ లోపాలు, సైనిక అంతర్గత జవాబుదారీతనం విధానాలపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.ISPR ప్రకారం, దేశ భద్రత, ప్రయోజనాలకు నష్టం కలిగించడంతో పాటు, ప్రభుత్వ వనరులను కూడా ఫైజ్ హమీద్ దుర్వినియోగం చేశారని సైనిక కోర్టు విశ్వసించింది. కోర్టు ప్రతి అభియోగంపై హమీద్ను దోషిగా నిర్ధారించింది. దేశంలో రాజకీయ అస్థిరత వ్యాప్తికి సంబంధించిన అంశాలపై ఫైజ్ హమీద్ పాత్రపై దర్యాప్తు ఇంకా ముగియలేదని ISPR తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ కేసులను విడిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం భవిష్యత్తులో ఆయనపై మరిన్ని చట్టపరమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు పాకిస్తాన్ సైన్యంలో అరుదైన విచారణFGCM చర్యలు ఆగస్టు 12, 2024న పాకిస్తాన్ ఆర్మీ చట్టం కింద ప్రారంభమై 15 నెలలకు పైగా కొనసాగాయి. ప్రాసిక్యూటర్లు నాలుగు ప్రధాన ఆరోపణలను కొనసాగించారు. వీటిలో రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం, రాష్ట్ర భద్రతకు హానికరమని భావించే విధంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం, అధికారాన్ని మరియు రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేయడం మరియు వ్యక్తులకు తప్పుడు నష్టం కలిగించడం ఉన్నాయి.సుదీర్ఘమైన విచారణల అనంతరం డిసెంబర్ 11, 2025న 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ప్రక్రియ చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నొక్కి చెప్పింది . అలాగే హమీద్ తన సొంత రక్షణ బృందాన్ని ఎంచుకునే అనుమతి ఉందని అన్నారు. తీర్పుపై అప్పీల్ చేసుకునే హక్కు ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు -
భార్యను ముక్కలుగా చేసి.. ముద్దలుగా మార్చేసి..
ఆ మధ్య మలయాళంలో సూక్షదర్శిని అనే సినిమా వచ్చింది. అందులో అమాయకంగా కనిపించే తల్లీకొడుకులు.. తమ ఇంటి బిడ్డనే దారుణంగా హతమార్చి.. యాసిడ్లో పోసేసి కరిగించేస్తారు. ఆపై ఏం ఎరగనట్లు నాటకాలాడతారు. పరువు హత్య(ఓ సున్నితమైన అంశం) నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్ అయ్యి.. ఇక్కడ తెలుగు డబ్తో ఓటీటీలోనూ అలరించింది. అయితే దాదాపు ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెరపైకి వచ్చింది.వింటేనే వెన్నులో వణుకుపుట్టే ఘటన ఇది. తన భార్యను.. ఇద్దరు పిల్లల తల్లిని.. క్షణికావేశంలోనో లేదంటో ఉద్దేశపూర్వకంగానో హత్య చేశాడో భర్త. ఆపై నేరం నుంచి తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నమే కిరాతకంగా ఉంది. ఆమెను ముక్కలుగా.. చెక్కలుగా చేసి.. ముద్దగా మార్చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి దోషిగా తేలాడు.స్విట్జర్లాండ్లో హైప్రొఫెషనల్ కేసుగా ఉన్న క్రిస్టియానా జోక్సిమోవిక్(38) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని స్థానిక అధికారులు బుధవారం నిర్ధారించారు. క్రిస్టియానా జోక్సిమోవిక్ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ కావడమే ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.2024 ఫిబ్రవరిలో బిన్నింగెన్లోని తన నివాసంలో క్రిస్టియానా జోక్సిమోవిక్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వేళ్లన్నీ భర్త థామస్ వైపే చూపించాయి. అయితే తన భార్య తనపై దాడికి ప్రయత్నించిందని.. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించిందని.. తాను భయంతో ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం మాత్రమే చేశానని మొదటి నుంచి అతను వాదించాడు. కానీ, ఆధారాలు అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి.ఆమెను గొంతు నులిమి హత్య చేసిన థామస్.. గర్భాశయాన్ని తొలగించి ఆ తర్వాత పెరట్లోని రంపంతో ముక్కలుగా కత్తిరించాడని.. ఆపై మిక్సర్లో వేసి ముద్దగా మార్చేశాడని.. అందులో కొంత భాగాన్ని రసాయనాల్లో వేసి కరిగించేశాడని తెలిపారు. నేరానికి ఉయోగించిన రంపాన్ని, తోలు భాగాన్ని, ఎముకల అవశేషాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఘోరాన్ని అతను యూట్యూబ్ వీడియోలు చూస్తూ చేశాడని వెల్లడించారు.శరీరం నుంచి నడుమ జాయింట్లను విరిచేసి.. మెడ, వెన్నెముకను కోసేసి.. చివరకు ఆమె తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. శవపరీక్షలో అత్యంత భయానకమైన ఈ వివరాలు వెల్లడయ్యాయి అని కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించిన వివరాల్లో ఉంది.క్రిస్టియానా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి తీవ్రంగా ప్రయత్నించారు. నెలలు గడిచినా ఆమె ఆచూకీ కానరలేదు. అయితే.. క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్లో ఆమె తండ్రి గుర్తించడం ఈ కేసును అసలు మలుపు తిప్పింది. ఆ ఘటన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా ఉన్నాడని.. అది అతనిలోని క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని పోలీసులు తమ నివేదికలో వివరించారు. భర్తే హంతకుడిగా తేలడంతో ఈ కేసు ట్రయల్ జరగాల్సి ఉంది.మిస్ నార్త్వెస్ట్ స్విట్జర్లాండ్ క్రిస్టియానా జోక్సిమోవిక్.. 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్తో సరిపెట్టుకుంది. ఆ తర్వత క్యాట్వాక్ కోచ్గా మారి.. అనేక మంది మోడల్స్కు శిక్షణ ఇచ్చింది. పై కేసు చదువుతుంటే.. భార్యను కుక్కర్లో ఉడికించిన కేసు గుర్తొచ్చిందా?.. ఆ కథనమూ చదివేయండి 👉 హైదరాబాద్ మీర్పేటలో కిరాతకం -
టారిఫ్ పిడుగు.. న్యూఇయర్ రోజు భారత్కు భారీ షాక్!
న్యూఢిల్లీ: న్యూ ఇయర్లో కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? లేదంటే ఇతర వాహనాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే తస్మాత్ జాగ్రత్త. త్వరలో ఆటోమొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు భారత్పై మెక్సికో విధించే 50 శాతం సుంకమే కారణమని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.న్యూఇయర్ జనవరి1,2026 నుంచి మెక్సికో నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం వసూలు చేయనుంది. ఇప్పటికే భారత్ దిగుమతులపై అమెరికా 50శాతం అంతకంటే ఎక్కువగా సుంకాలు విధించింది. తాజాగా,మెక్సికో సైతం భారత్ దిగుమతులపై భారీ ఎత్తున టారిఫ్ వసూలు చేసేందుకు సిద్ధం కాగా.. అందుకు ఆదేశ సెనేట్ సైతం ఆమోదం తెలిపింది. మెక్సికో భారత్, చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల నుంచి సుంకాలను వసూలు చేయనుంది.ఫలితంగా మెక్సికో నుంచి భారత్ భారీ స్థాయిలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 50శాతం సుంకాల్ని చెల్లించాల్సి వస్తుంది. వాటిలో ప్రధాన ఉత్పత్తులు వాహనాలు, వాహనాల విడిభాగాలు, టెక్స్టైల్స్, ప్లాస్టిక్, స్టీల్ ఉంది. అలా చెల్లించే పరిస్థితి వస్తే దేశీయంగా సంబంధిత వస్తువుల ఉత్పత్తుల అమాంతం పెరిగే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ దేశీయంగా తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాజాగా, భారత్ దిగుమతులపై సుంకం విధించే దిశగా చర్యలు తీసుకున్నారు. భారత్పై ప్రతికూల ప్రభావంభారత్పై 50శాతం వరకు సుంకాలను విధించాలన్న మెక్సికో చర్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెక్సికన్ ఎగుమతులకు భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం, భారత్.. మెక్సికోతో అధిక మొత్తంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2024లో భారత్ నుంచి మెక్సికోకు ఎగుమతులు దాదాపు 8.9 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 2.8 బిలియన్లుగా ఉంది.గతేడాది భారత్.. మెక్సికో నుంచి వాహనాలు, వాటి తయారీలో వినియోగించే ఆటో విడిభాగాలు,ఇతర ప్రయాణీకుల వాహనాలు. ఇప్పుడు, మెక్సికో ఈ వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో.. వచ్చే ఏడాది దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశ ఉందని ఆర్థిక నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్కు ‘బంగ్లా’ దౌత్య ద్రోహం.. పాక్, చైనాలతో జతకట్టి..
న్యూఢిల్లీ: పాకిస్తాన్-చైనా నేతృత్వంలోని కొత్త ప్రాంతీయ కూటమిలో చేరేందుకు బంగ్లాదేశ్ అమితమైన ఆసక్తి చూపిస్తున్నదనే వార్తలు ఇటీవలి కాలంలో విరివిగా వినిపిస్తున్నాయి. ఇది దక్షిణాసియాలో కీలక వ్యూహాత్మక మార్పును సూచిస్తున్నది. భారతదేశం లేకుండా, పాకిస్తాన్తో కలిసి ప్రాంతీయ కూటమిలో చేరడం బంగ్లాదేశ్కు వ్యూహాత్మకంగా సాధ్యమే అని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఢాకా, బీజింగ్, ఇస్లామాబాద్లతో కూడిన కొత్త త్రైపాక్షిక సమూహంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో..2024ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం పాకిస్తాన్-బంగ్లాదేశ్ సంబంధాలు వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాలలో విస్తరిస్తూ వస్తున్నాయి. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం.. న్యూఢిల్లీ, బీజింగ్, వాషింగ్టన్లను నొప్పించకుండా సమతుల్య సంబంధాలను చాకచక్యంగా కొనసాగించింది. నాడు భారతదేశం ఒక కీలక భాగస్వామిగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులలో ఢాకా.. ఇస్లామాబాద్, బీజింగ్ వైపు మొగ్గు చూపుతూ, భారత్తో సమతుల్య భాగస్వామ్యాన్ని కోల్పోయింది.చైనాలోని కున్మింగ్లో మంతనాలుఈ ప్రాంతీయ కూటమి చర్చలు గత ఏడాది నుండి వేగం అందుకున్నాయి. గత జూన్లో చైనా, బంగ్లాదేశ్,పాకిస్తాన్లు చైనాలోని కున్మింగ్లో తమ మొదటి అధికారిక త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు , రుణ నిర్వహణలో సహకారాన్ని పెంపొందించేందుకు మూడు పక్షాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్ తాజాగా భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ, విస్తృతమైన దక్షిణాసియా కూటమిని ప్రతిపాదిస్తున్నది. ఈ నేపధ్యంలో ఇస్లామాబాద్- బీజింగ్ మధ్య ఈ అంశంపై చర్చలు జరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.‘త్రైపాక్షిక సంబంధం’తో కొత్త చిక్కులు?భారతదేశం కీలక సభ్యురాలిగా ఉన్న సార్క్ (SAARC) స్థానంలో కొత్త ప్రాంతీయ కూటమిని సృష్టించేందుకు పాకిస్తాన్- చైనాలు పనిచేస్తున్నాయనే వార్తలు కూడా కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక కూటమి ఏర్పాటు దక్షిణాసియాలో చైనాకు పెరుగుతున్న ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తున్నది. భారతదేశాన్ని మినహాయించి, చైనాను భాగస్వామిగా చేర్చుకుంటూ పాకిస్తాన్ ప్రతిపాదిస్తున్న ఈ కూటమి, కొత్త భౌగోళిక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.ఈ అభివృద్ధి చెందుతున్న త్రైపాక్షిక సంబంధం (బంగ్లాదేశ్-చైనా-పాకిస్తాన్) ప్రాంతీయ దౌత్యానికి, భవిష్యత్తులో దక్షిణాసియా కూటమికి చిక్కులను తీసుకువచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: Tamil Nadu: విజయ్-రంగస్వామి మెగా ప్లాన్.. -
రూ. 9.1 కోట్లు ఉంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ మీదే! ఎలా అప్లయ్ చేయాలి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్న "ట్రంప్ గోల్డ్ కార్డ్" (Trump Gold Card) పథకానికి సంబంధించిన అధికారిక అమ్మకాలను ప్రారంభించారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు, అమెరికన్ కంపెనీలు నిపుణులైన వారికి ఎంపిక చేసుకు నేందుకు వీలుగా ఈ కార్డుని తీసుకొచ్చారు. గోల్డ్ కార్డ్కు భారీ ఖరీదు ఈ 'ట్రంప్ గోల్డ్ కార్డ్' పథకం ప్రధానంగా డబ్బు చెల్లించే వారికి వేగవంతమైన వసతి మార్గాన్ని అందిస్తుంది. అలాగే అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి ఒక మార్గంగా ట్రంప్ భావిస్తున్నారు. అదే సమయంలో ఫెడరల్ ఖజానాకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుందని అంచనా. అయితే ఈ గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.9.1 కోట్లు), ప్రతీ ఉద్యోగి కోసం సంస్థ 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. దీనికి త్వరలో ఉన్నతస్థాయి ‘ప్లాటినం కార్డ్’ హామీ ఇవ్వబడుతుందని ప్రకటించారువైట్హౌస్లోని వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఈ కొత్త వెబ్సైట్ ద్వారా గ్రీన్ కార్డు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నిమిషాల్లోనే జరుగుతుందన్నారు. 1990లో విదేశీ పెట్టుబడుల నిమిత్తం తీసుకొచ్చిన EB-5 విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే గోల్డ్ కార్డును ప్రకటించారు. ప్రాథమికంగా, ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే, కానీ దానికంటే చాలా మెరుగైనది, చాలా శక్తివంతమైనది, చాలా బలమైన మార్గం." అని ట్రంప్ చెప్పారు. భారతదేశం, చైనా వంటి దేశాల విద్యార్థులు అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని పట్టభద్రులైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి రావడం సిగ్గు చేటని ట్రంప్ వ్యాఖ్యానించారు. .ఎలా దరఖాస్తు చేయాలిదరఖాస్తులను trumpcard.gov ద్వారా దాఖలు చేయాలి.గోల్డ్ కార్డ్, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ లేదా ప్లాటినం వెయిట్లిస్ట్ను ఎంచుకోవాలివ్యక్తిగత వివరాలను నమోదు చేయాలిmyUSCIS.gov ఖాతాను క్రియేట్ చేసి 15వేల డాలర్ల (నాన్ రిఫండబుల్) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలివ్యక్తిగతం దరఖాస్తు చేసుకుంటోంటే ఒక మిలియన్ డాలర్లు, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కోసం 2 మిలియన్లు డాలర్లు చెల్లించాలి. దీనికనుగుణంగా ఆప్షన్ ఎంచుకోవాలి. వెరిఫికేషన్ తరువాత మొత్తం రుసుము చెల్లించాలి.క్రెడిట్ కార్డ్, ACH డెబిట్ (USలో మాత్రమే) లేదా అంతర్జాతీయ వైర్ బదిలీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి అర్హులు అయి ఉండాలియునైటెడ్ స్టేట్స్కు అనుమతి ఉండాలివీసా నంబర్ అందుబాటులో ఉండాలిగోల్డ్ కార్డ్ హోల్డర్లు US శాశ్వత నివాసితుల వలె పన్ను విధించబడతారు.ఆమోదం పొందడానికి ఎంత సమయం పడుతుంది?ప్రాసెసింగ్ రుసుము చెల్లించిన తర్వాత, నేపథ్య తనిఖీ , పరిశీలన సాధారణంగా కొన్ని వారాలు పడుతుంది. దరఖాస్తుదారులు వీసా ఇంటర్వ్యూను పూర్తి చేయాలి , డాక్యుమెంట్ అభ్యర్థనలకు వెంటనే స్పందించాలి.గోల్డ్ కార్డ్ రద్దు అయ్యే అవకాశం ఉందా? ఇతర అమెరికా వీసా మాదిరిగానే, జాతీయ భద్రతా సమస్యలు లేదా తీవ్రమైన నేరారోపణల మీద వీటిని రద్దు చేసే అవకాశం ఉంది.కాగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల వీసాలు సర్వసాధారణం, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీతో సహా డజన్ల కొద్దీ దేశాలు సంపన్న వ్యక్తులకు "గోల్డెన్ వీసాల" వెర్షన్లను అందిస్తున్నాయి.


