breaking news
International
-
వీధిలో పాన్ ఉమ్మినందుకు రూ.3.5 లక్షల జరిమానా
లండన్: బహిరంగ ప్రాంతాల్లో పాన్ ఉమ్మినందుకు లండన్లో ఇద్దరు భారతీయులకు దాదాపు రూ.3.48 లక్షల(2,800 డాలర్ల) జరిమానా విధించారు. మొదట విధించిన 100 పౌండ్ల జరిమానాను చెల్లించకపోవడం, కోర్టుకు గైర్హాజరవడంతో ఆగ్రహించిన బ్రెంట్ సిటీ అధికారులు పెద్ద మొత్తంలో జరిమానా విధించారు. లండన్ శివార్లలో ఉన్న ప్రాంతం బ్రెంట్. ఇది లండన్లోని అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం. పాన్ ఉమ్మడం వల్ల నగరం రోడ్లు పాడవుతున్నాయి. ఈ మరకలను శుభ్రపరచడానికి నగర కౌన్సిల్కు భారమైంది. పాన్ మరకలను శుభ్రపరచడానికి కౌన్సిల్ ఏడాదికి 30,000 పౌండ్లు ఖర్చు చేస్తోంది. ఇది పౌరులపై పన్ను భారం మోపుతుండటంతో నగర కౌన్సిల్ దీనికి వ్యతిరేకంగా జీరో–టాలరెన్స్ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే ఎడ్జ్వేర్ పట్టణ నివాసి అయిన అక్షిత్ భద్రే పటేల్ 2025 జూన్లో స్థానిక మెట్రో స్టేషన్ సమీపంలోని కింగ్స్బరీ రోడ్డుపై పాన్ ఉమ్మినందుకు నార్త్ వెస్ట్ లండన్ మేజి్రస్టేట్స్ కోర్టు జరిమానా విధించింది. పటేల్ కోర్టు విచారణకు హాజరు కాలేదు. తనకు విధించిన జరిమానా 100 పౌండ్లు చెల్లించలేదు. రూయిస్లిప్ శివారు ప్రాంత నివాసి అయిన హితేష్ పటేల్ వెంబ్లీ హిల్ రోడ్డుపై పాన్ ఉమ్మినందుకు జరిమానా విధించింది. మొదటి కేసు తరహాలోనే ఈయనా కోర్టుకు హాజరుకాలేదు. జరిమానా చెల్లించలేదు. దీంతో జరిమానా పది రెట్లు పెరిగింది. లండన్లోని బ్రెంట్, దాని పొరుగునే ఉన్న హారోతో సహా పలు ప్రాంతాల్లో పాన్ ఉమ్మివేయడంపై ఆందోళనల నేపథ్యంలో కౌన్సిల్ ఈ కఠిన చర్యలు చేపట్టింది. ‘మా వీధులను పాడుచేసే వారిని మేం అస్సలు సహించబోం. మేం విధించే ప్రతి జరిమానా ఒక స్పష్టమైన సందేశం. మీరు మా వీధులను పాడు చేస్తే మేం మిమ్మల్ని పట్టుకుంటాం. దానికి మీరు మూల్యం చెల్లించాల్సిందే’ అని కౌన్సిలర్ కృపా షెత్ అన్నారు. -
శాంతిదూత డొనాల్డ్ ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జపాన్ మహిళా ప్రధాని సనే తకాయిచి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. ట్రంప్ను శాంతిదూతగా అభివరి్ణంచారు. హార్మూజ్ జలసంధిలో చమురు నౌకల రక్షణకు యుద్ధ నౌకలను పంపించడానికి జపాన్ ముందుకు రాలేదంటూ రుసరుసలాడుతున్న ట్రంప్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రయతి్నంచారు. అమెరికా అధ్యక్షుడితో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ సంకేతాలిచ్చారు. తకాయిచి గురువారం వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా యుద్ధంపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేపట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తకాయిచి స్పష్టంచేశారు. తకాయిచి నాయకత్వాన్ని ట్రంప్ కొనియాడారు. ఆమె బహుళ ప్రజాదరణ కలిగిన శక్తివంతురాలైన నేత అంటూ ప్రశంసించారు. ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు జపాన్ అందించే సాయంపై వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో జపాన్ సహకారాన్ని ట్రంప్ కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు ముందుకు ఆయన జపాన్ ప్రధానమంత్రితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. -
సోషల్ మీడియాతో సంతోషం ఆవిరి!
హెల్సింకీ: ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా యువతలో సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. లేనిపోని ఆందోళనకు కారణమవుతోంది. ప్రధానంగా పశి్చమ దేశాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ గురువారం విడుదల చేసిన ‘వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్–2026’ఇదే విషయం వెల్లడించింది. గ్యాలప్ విశ్లేషణ సంస్థ, ఐక్యరాజ్యసమితి సస్టెనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ భాగస్వామ్యంతో ఈ నివేదిక రూపొందించారు. అధ్యయనంలో భాగంగా 147 దేశాల్లో లక్షల మందిని ప్రశ్నించారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రపంచంలో ఫిన్లాండ్ అత్యంత సంతోషంగా ఉన్న దేశమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈసారి టాప్–10 జాబితాలో ఫిన్లాండ్తోపాటు ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే తదితర దేశాలకు స్థానం దక్కింది. అగ్రరాజ్యం అమెరికాకు 23, కెనడాకు 25, బ్రిటన్కు 29వ ర్యాంకు లభించింది. భారత్కు 116వ ర్యాంకు దక్కింది. నివేదికలోని కీలక అంశాలివీ.. → కోస్టారికా దేశం 2023లో 23వ స్థానంలో ఉండగా, 2026లో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. → ఏమాత్రం సంతోషంగా లేని దేశాల్లో అఫ్గానిస్తాన్, సియెర్రాలియోన్, మలావీ నిలిచాయి. → అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో 25 ఏళ్లలోపు యువత సోషల్ మీడియాకు బానిసగా మారుతోంది. ఫలితంగా వారు వాస్తవ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. సంతోషానికి దూరమవుతున్నారు. → మనుషులు సంతోషంగా ఉండాలంటే కుటుంబ బంధాలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. సామాజికంగా ఇతరులతో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలి. → సామాజిక జీవితాల్లో నాణ్యత, స్థిరత్వం ఉన్న దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉంటున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ ఎమ్మానుయేల్ డీ నెవ్ చెప్పారు. లాటిన్ అమెరికా దేశాల్లో కుటుంబ బంధాలు, సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయని వెల్లడించారు. అందుకే అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నట్లు స్పష్టంచేశారు. → ఫిన్లాండ్తోపాటు ఉత్తర యూరోపియన్ దేశాలు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటన్నది పరిశీలిస్తే.. అక్కడి సంపద, ఆ సంపద పంపిణీలో సమానత్వం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వాలు ఉండడం, ఆర్థిక విపత్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండడం వంటివి కనిపిస్తాయి. -
ఇరాన్ మిస్సైల్ ప్లాంట్ను నేలమట్టం చేసిన అమెరికా
ఇరాన్లోని కరాజ్ నగరంలో ఉన్న సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆ దేశ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఈ కేంద్రం బాలిస్టిక్ క్షిపణులు అసెంబుల్ చేయడానికి ఉపయోగించబడేదని.. అమెరికన్లు, పొరుగు దేశాల వాణిజ్య నౌకాయానానికి ముప్పు కలిగిస్తుండిందని CENTCOM పేర్కొంది. అమెరికా వైమానిక దళం నిర్వహించిన ఈ దాడిలో కరాజ్ ప్లాంట్ పూర్తిగా నేలమట్టమైంది. CENTCOM విడుదల చేసిన ఏరియల్ ఫోటోలు ఆ సదుపాయం పూర్తిగా ధ్వంసమైందని చూపిస్తున్నాయి. ఈ ప్లాంట్ ఇరాన్ క్షిపణి సామర్థ్యానికి కీలకమైన కేంద్రంగా ఉండింది.Prior to Operation Epic Fury, the Iranian regime used the Karaj Surface-to-Surface Missile Plant to assemble ballistic missiles that threatened Americans, neighboring countries, and commercial shipping. The photo dated March 1, 2026, shows the plant prior to U.S. strikes. The… pic.twitter.com/QEs5toZQpX— U.S. Central Command (@CENTCOM) March 19, 2026కరాజ్ ప్లాంట్ పూర్తిగా నిరుపయోగం కావడం వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం మరింత బలహీనపడే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానానికి కూడా ముప్పు తగ్గుతుంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్-అమెరికా ఎన్ని దెబ్బలు కొట్టినా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ గల్ఫ్ దేశాల ఇంధన సముదాయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది.సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులకు ప్రతిగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది. -
ట్రంప్కు ఎవరైనా చెప్పగలరా..? నెతన్యాహు
అమెరికాను ఇరాన్ యుద్ధంలోకి తాము లాగామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ప్రెసిడెంట్ ట్రంప్కు ఇలా చేయండని ఎవరైనా చెప్పగలరా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇరాన్పై యుద్దాన్ని అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించాయని అన్నారు.యుద్దం ప్రారంభానికి ముందు అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమంపై చర్చలు సాగుతున్నాయని.. ఇరాన్ ముందుగా దాడి చేస్తుందని భావించి, తానే ముందస్తు చర్యలు తీసుకున్నానని ట్రంప్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అలాగే ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడి విషయంలో అమెరికాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ దాడికి ఖతర్కు కూడా ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడిని ట్రంప్ ఖండించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.కాగా, ఇజ్రాయెల్ ఇటీవలే ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేసింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది.ఈ పరిణామాలతో ఓ మెట్టుదిగినట్లు కనిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయడం ముమ్మాటికి తప్పేనని తెలిపింది. భవిష్యత్తులో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేయరాదని ఇజ్రాయెల్ను కోరింది. ఈ అభ్యర్ధన మేరకు నెతన్యాహు సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు నిలిపేస్తామని ప్రకటించారు. -
ఇంధన వనరులపై దాడులా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కీలక ఇంధన వనరులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రపంచమంతటినీ ఎంతగానో కలతకు గురి చేసే అంశమిది. ఇప్పటికే ఒడిదొడుకుల్లో ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఈ దాడులు మరింతగా దెబ్బ తీస్తాయి’’అంటూ ఆందోళన వెలిబుచ్చింది. ఇరాన్లోని సౌత్ పార్స్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారంగా ఖతర్లోని ఎల్ఎన్జీ క్షేత్రం రస్ లఫాన్తో పాటు సౌదీ అరేబియాలో అతి పెద్ద చమురు క్షేత్రమైన ఆరాంకోపైనా ఇరాన్ దాడులు కలకలం రేపడం తెలిసిందే. ఇవి భారత్ను తీవ్రంగా కలచివేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. పౌర సదుపాయాలు, ఇంధన వనరులపై దాడులు కూడదని భారత్ ముందునుంచీ చెబుతూనే వస్తోందని గుర్తు చేశారు. వాటికి తక్షణం తెర దించాలని గురువారం మీడియా సమావేశంలో ఆయన సూచించారు. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో 40 శాతానికి పైగా ఖతర్ నుంచి వస్తుండటం తెలిసిందే. దాడులు గర్హనీయం: మోదీ పశ్చిమాసియా తాజా పరిణామా లపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చా రు. ఈ విషయమై పలువురు దేశాధినేతలతో ఆయన వేర్వేరుగా సంభాషించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను గురించి వారితో లోతుగా చర్చించారు. ఇంధన వ్యవస్థలపై దాడులు తీవ్రంగా గర్హనీయమన్నారు. ఉద్రిక్తతలకు తక్షణం తెర దించి శాంతి, సుస్థిరత పాదుగొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయాన్ని తక్షణం పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటన్నింటికీ దౌత్యం, మధ్యవర్తిత్వమే మార్గాలని స్పష్టం చేశారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు భారత్ అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. అధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టుల్లో ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా విషయమై ఆందోళనలతో వారంతా ఏకీభవించినట్టు తెలిపారు. ‘‘అబ్దుల్లా–2, తారిఖ్తో చర్చల సందర్భంగా జోర్డాన్, ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపా. ఇంధన వనరులపై దాడులను ఖండించా’’అని తెలిపారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒమన్, జోర్డాన్ అధినేతలతో మోదీ సంభాషించడం ఇది రెండోసారి.పాక్ నైజమే అంత: భారత్న్యూఢిల్లీ: అణ్వాయుధాల వ్యాప్తికి, అధునాతన క్షిపణి వ్యవస్థల విస్తరణకు పాకిస్తాన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందంటూ ఒక నివేదికలో అమెరికా నిఘా వర్గాలు వెలిబుచ్చిన ఆందోళనతో భారత్ ఏకీభవించింది. ‘‘ఇలాంటి వేషాలు పాక్కు కొత్త కాదు. ఆ దేశం నైజమే అంత’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ గురువారం ఎద్దేవా చేశారు. ‘‘ప్రపంచానికి పాక్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అమెరికా నివేదిక ఆ వాస్తవాన్ని మరోసారి అందరి ముందూ ఉంచంది’’ అని అభిప్రాయపడ్డారు. -
ఇరాన్ ఆయువుపట్టు.. సౌత్ పార్స్
సౌత్ పార్స్. ఇరాన్ ఇంధన అవసరాలు తీర్చే అత్యంత కీలకమైన సహజవాయువు క్షేత్రం. తాజాగా ఈ క్షేత్రంపై అమెరికా దాడి చేయడంతో ఇరానియన్లకు ఒక్కసారిగా విద్యుత్ కష్టాలు వచ్చిపడ్డాయి. శీతాకాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచే హీటింగ్ వ్యవస్థలు మొదలు పరిశ్రమల్లో ముడిసరుకు దాకా ఇదే సౌత్ పార్స్ నుంచి సరఫరా అయ్యే సహజవాయువునే ఇరాన్లో ఉపయోగిస్తున్నారు. దీంతో సౌత్ పార్స్ క్షేత్రం ఇరాన్కు ఎంతటి కీలకమైందనే అంశం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వేల కిలోమీటర్లలో విస్తరించి.. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ సహజవాయు క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఇరాన్లోని అసలూయే నగరానికి సమీపంలో పర్షియన్ గల్ఫ్ సముద్రతీరంలో ఏకంగా 9,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడ సహజవాయువు నిల్వలను తొలిసారిగా కనుగొన్నారు. ఇంతటి భారీ నిల్వలను సొంతంగా ప్రాసెసింగ్ చేసి, నిల్వ చేసి, వ్యాపారంచేసే శక్తిసామర్థ్యాలు ఇరాన్కు లేవు. దీంతో పొరుగుదేశం ఖతర్ను సాయం కోరింది. దీంతో ఖతర్, ఇరాన్లు సంయుక్తంగా గ్యాస్ఫీల్డ్ను అభివృద్ధి చేశాయి. ఇరాన్ ప్రధానభూభాగం వైపు ఉన్న క్షేత్రాన్ని సౌత్ పార్స్గా, మిగతా క్షేత్రాన్ని నార్త్ ఫీల్డ్గా పిలుస్తున్నారు. నార్త్ ఫీల్డ్ను ఖతర్ నిర్వహిస్తోంది. మొత్తం సహజవాయు క్షేత్రంలో 33 శాతం భూభాగాన్నే సౌత్ పార్స్గా పిలుస్తారు. దీని మీదనే అమెరికా దాడిచేసింది. ఇరాన్ 80 శాతం దేశీయ నేచురల్ గ్యాస్ అవసరాలను సౌత్ పార్స్ క్షేత్రమే తీరుస్తోంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ద్రవరూప సహజవాయువును అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశం ఇరానే. ఇరాన్ ఈ క్షేత్రంలో తయారైన లిక్విడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ)తోనే దేశవ్యాప్తంగా విద్యుత్ను తయారుచేస్తోంది. శీతాకాలంలో గడ్డకట్టే చలి నుంచి రక్షణ కోసం ఇళ్లను వేడిచేసే హీటింగ్వ్యవస్థలకు ఈ గ్యాసే ప్రాణాధారం. ఇరాన్ పరిశ్రమల్లో ముడిపదార్థంగానూ ఇదే గ్యాస్ అక్కరకొస్తోంది. దేశ ఇంధన జీవనాడిగా మారిన సౌత్ పార్స్పై అమెరికా దాడులతో ఇరాన్ ఇంధన కష్టాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. తమ ప్రాణాధార వ్యవస్థ మీదనే దాడులు జరగడంతో ఇరాన్ ఇకపై మరింతగా దాడులతో చెలరేగిపోయే ప్రమాదముందని ఇంధన నిఘా సంస్థ ‘మాంటెల్ న్యూస్’లో భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఆండ్రిస్ కాలా చెప్పారు. కొంత ఎల్ఎన్జీని ఇరాక్కూ ఇరాన్ సరఫరాచేస్తోంది. వాస్తవానికి ఎల్ఎన్జీని ఎగుమతి చేసేందుకు ఇరాన్ మూడు ప్రాజెక్టులను తీసుకొచ్చినా అమెరికా అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అవి కార్యరూపం దాల్చలేదు – సాక్షి, నేషనల్ డెస్క్ -
రస్ లఫాన్.. ఇండియాకు కీలకం
ఖతర్ పాలకుల దార్శనికతకు ప్రత్యక్ష రూపమే రస్ లఫాన్ సహజవాయు క్షేత్రం. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యంత అధునాతన సాంకేతికతతో సృష్టించిన అతిపెద్ద సహజవాయు ప్రాసెసింగ్ కర్మాగారంగా ‘రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీ’ ప్రఖ్యాతిగాంచింది. ఖతార్, ఇరాన్ మధ్యలోని పర్షియన్ గల్ఫ్ సముద్రగర్భంలో సహజవాయు నిక్షేపాలను కనుగొనేందుకు 1996లో రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీని నిర్మించారు. వీళ్ల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 1970 దశకంలో అపార సహజవాయు నిక్షేపాలను ఇక్కడి సముద్రగర్భంలో కనుగొన్నారు. ఇరాన్తో కలిసి గ్యాస్క్షేత్రాన్ని అభివృద్ధిచేసి ఖతర్ తన వాటాగా నార్త్ ఫీల్డ్ను తీసుకుంది. దీనినే నార్త్ డోమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ 20 శాతం ద్రవరూప సహజవాయు అవసరాలను రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. తమ అ«దీనంలోని 900 ట్రిలియన్ల ఘనపు చదరపు అడుగుల (టీసీఎస్ఎఫ్) మేర సహజవాయువును రస్ లఫాన్ కాంప్లెక్స్ ద్వారా ఖతార్ ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇక్కడే భారీ నౌకలను నిలిపేందుకు వీలుగా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయాన్ని నిర్మించారు. దీంతో సీఎన్జీ కంటైనర్ షిప్లు నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్ల దాకా వచ్చి సరుకు నింపుకుని పయనమవుతాయి. ఇక్కడి నుంచి డజన్లకొద్దీ దేశాలకు ఎల్ఎన్జీ ఎగుమతి అవుతోంది. ఖతర్కు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ప్రత్యక్షంగా భారత ద్రవరూప సహజవాయువు అవసరాలను తీరుస్తోంది. దోహా నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని ఈ పారిశ్రామిక నగరమే భారత 45 శాతం లిక్విడ్ నేచురల్ గ్యాస్ అవసరాలను తీరుస్తోంది. ఖతర్ ఆర్థికవ్యవస్థ పునాదులను పెకళించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా భారత్కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఎరువులు, సీఎన్జీ, పీఎన్జీ అంతా ఇక్కడే.. భారత్లో దాదాపు 45 శాతం ఎరువుల తయారీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అవసరాలు తీరాలంటే రస్ లఫాన్ క్షేత్రం నుంచి ద్రవరూప సహజవాయువు రావాల్సిందే. భారత్లో 34 శాతం ఎరువుల తయారీతోపాటు వాహనాల్లో సీఎన్జీకి, గృహావసరాలు తీర్చే పీఎన్జీకి రస్ లఫాన్ నుంచి దిగుమతి చేసుకునే ద్రవరూప సహజవాయవునే ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో పెట్రోరసాయనాల తయారీకి సైతం ఇదే ఎల్ఎన్జీ అవసరం. కొంతమేర భారత విద్యుత్ అవసరాలనూ ఇదే గ్యాస్ తీరుస్తోంది. అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పోలిస్తే భారత్ రస్ లఫాన్ క్షేత్రం నుంచి ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవడమే అత్యంత చవకైన వ్యవహారం. అందుకే భారత్ దీనిపైనే అధికంగా ఆధారపడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దాడులు నిలిపివేస్తాం.. నెతన్యాహు ప్రకటన
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులను నిలిపివేస్తామని ప్రకటించారు. తాజాగా జెరూసలేంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులను నిలిపి వేయమని కోరారు. మేము ఆయన అభ్యర్థనను గౌరవిస్తున్నామని అన్నారు. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడి విషయంలో అమెరికాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. అలాగే ఈ దాడికి ఖతర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడిని ట్రంప్ ఖండించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో, ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది.ఈ పరిణామాలతో ఓ మెట్టుదిగినట్లు కనిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయడం ముమ్మాటికి తప్పేనని తెలిపింది. భవిష్యత్తులో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేయరాదని ఇజ్రాయెల్ను కోరింది. ఈ అభ్యర్ధన మేరకే నెతన్యాహు దాడులు నిలిపేస్తామని ప్రకటించారు.సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరిన ట్రంప్.. ఇరాన్కు సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడి చేసిందని ఖతర్పై మరోసారి దాడి చేస్తే ఊహకందని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రూత్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. -
రస్ లఫాన్ క్షేత్రంపై ఇరాన్ దాడులు!
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను నానాటికీ పెను ప్రమాదంలోకి నెడుతోంది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై చేసిన ఇజ్రాయెల్ దాడి తీవ్ర విపరిణామాలకు దారి తీస్తోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ గురువారం గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలన్నింటికీ నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది! ఖతర్, సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి సహా పలుచోట్ల చమురు, సహజవాయు క్షేత్రాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెను కల్లోలం చెలరేగింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎల్ఎన్జీ క్షేత్రమైన ఖతర్లోని రస్ లఫాన్ ఇరాన్ దాడుల్లో భారీగా దెబ్బ తిన్నది. అక్కడి ఉత్పత్తి కేంద్రాల్లో 17 శాతం మేరకు బుగ్గిపాలైనట్టు ఖతర్ ప్రకటించింది. ‘‘ఇది అంచనాలకు అందనంతటి భారీ నష్టమిది! దీన్నుంచి కోలుకునేందుకు కనీసం మూడు నుంచి ఐదేళ్ల సమయం, రూ.2.4 లక్షల కోట్ల (26 బిలియన్ డాలర్ల) నిధులు అవసరం!’’ అని ఖతర్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబి పేర్కొన్నారు! భారత ఎల్ఎన్జీ అవసరాలను సగానికి సగం రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. దాంతో ఈ దాడి ప్రభావం మనపై తీవ్రంగా ఉండనుంది!! సౌదీ అరేబియాలో ఎర్రసముద్ర తీరంలో రేవు పట్టణం యన్బులో ఉన్న సమ్రెఫ్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. అరాంకోలో భాగమైన ఆ క్షేత్రంలో భారీగా మంటలు చెలరేగాయి. నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్టు సౌదీ రక్షణ శాఖ పేర్కొంది. ‘‘ఇరాన్ తీరుతో విసిగిపోయాం. మా ఓపికకూ హద్దుంటుంది! పరిస్థితి చేయి దాటితే ఇరాన్పై యుద్ధంలోకి మేమూ ప్రవేశించాల్సి వస్తుంది’’ అంటూ సౌదీ రాకుమారుడు, విదేశాంగ మంత్రి ఫైసల్బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘తిరుగులేని ఆయుధ సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత సౌదీ, దాని భాగస్వామ్య దేశాల సొంతం. అవసరమైతే వాటిని ఇరాన్పై ప్రయోగించేందుకు ఏమాత్రమూ వెనకడబోమని గుర్తుంచుకుంటే మంచిది’’ అని హితవు పలికారు. ఇరాన్ డ్రోన్లు కువైట్లో కూడా అల్ అహ్మదీ, మైనా అబ్దుల్లా చమురు క్షేత్రాలకు, యూఏఈ, అబుదాబిల్లోనూ పలు సహజవాయు కేంద్రాలకు నష్టం కలిగించాయి. తమ ఇంధన వ్యవస్థలపై దాడులకు దిగి ఇజ్రాయెల్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిందని ఇరాన్ ఐఆర్జీసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘నిజానికి పొరుగు దేశాల ఇంధన క్షేత్రాలపై దాడులు చేసే యోచనే మాకు లేదు. కానీ మా ఇంధన వ్యవస్థలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో యుద్ధం మరో స్థాయికి చేరింది. అందుకే గల్ఫ్ దేశాల ఇంధన వ్యవస్థలపై మేమూ దాడులకు దిగాం. మా ఇంధన వ్యవస్థలపై మరోసారి దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని సదరు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి తీరతాం’’ అంటూ హెచ్చరించింది! రస్ లఫాన్పై దాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దానిపై మళ్లీ దాడికి దిగితే కనీవినీ ఎరగని స్థాయి దాడులతో సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రాన్ని పూర్తిగా బుగ్గిపాలు చేసేస్తామని ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయబోదని అధ్యక్షుడు హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తూ 12 అరబ్, ఇస్లామిక్ దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ‘‘దాడులను ఇరాన్ తక్షణం మాను కోవాలి. లేదంటే స్వీయరక్షణ చేసుకునే హక్కు గల్ఫ్ దేశాలకు ఉంటుంది’’ అని హెచ్చరించాయి. నౌకలు, ఇంధన వ్యవస్థలపై ఇరాన్ దాడులను జపాన్తో పాటు పలు యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. రస్ లఫాన్పై దాడికి నిరసనగా ఇరాన్ దౌత్య కార్యాలయంలోని అధికారులంతా 24 గంటల్లోపు దేశం వీడాలని ఖతర్ ఆదేశించింది. తాజా పరిణామాలో చమురు ధరలు మరింతగా భగ్గుమన్నాయి. గురువారం బ్యారెల్ ధర 119 డాలర్ల దాకా ఎగబాకింది! ఇరాన్ జలాంతర్గాములు ఖతం! ఇరాన్ జలాంతర్గాములన్నింటినీ ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఆ దేశం వద్ద ఉన్న 11 జలాంతర్గాములనూ బుగ్గిపాలు చేసినట్టు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇరాన్ పౌర, సైనిక నేతలందరినీ లక్ష్యం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పడవలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్ భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలపై 5,000 పౌండ్ల బరువైన భారీ బాంబులు వేసినట్టు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు. మరోవైపు, కాస్పియన్ సముద్రంలో పలు ఇరాన్ లక్ష్యాలపై తొలిసారి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఒక నౌకాశ్రయం, పలు నౌకలు, కమాండ్ సెంటర్పై క్షిపణుల వర్షం కురిపించినట్టు వెల్లడించింది. అంతేగాక టెహ్రాన్తో సహా ఇరాన్వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల పరంపర గురువారం కూడా తీవ్రస్థాయిలో కొనసాగింది. కొన్ని వందల లక్ష్యాలను క్షిపణులు, బాంబులతో ధ్వంసం చేసినట్టు ఇరు దేశాలు ప్రకటించాఇయి. ఇజ్రాయెల్పైనా దాడులు ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ గురువారం ఎడాపెడా దాడులకు దిగింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీశారు. చాలాచోట్ల భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లో కీలకమైన విద్యుత్ గ్రిడ్ బాగా క్షిపణి దాడుల్లో దెబ్బ తిన్నట్టు ఇంధన మంత్రి ఎలీ కోహెన్ చెప్పారు. హైఫియా నగరంలో చమురు రిఫైనరీకి కూడా దాడుల్లో నష్టం జరిగింది. అక్కడినుంచి భారీగా పొగ వెలువడుతున్న దృశ్యాలను ఇజ్రాయెల్ మీడియా ప్రసారం చేసింది. లెబనాన్లో 1,000 దాటిన మృతులు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ దేశంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 1,000, నిర్వాసితుల సంఖ్య 10 లక్షలు దాటినట్టు ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. లెబనాన్లో 500 మందికి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. పొంచి ఉన్న ఇంటర్నెట్ సంక్షోభం సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లను ఇరాన్ కత్తిరిస్తుందా?ఇప్పటికే పశి్చమాసియాలో అమెరికా మిత్రదేశాలపై మిస్సైళ్లతో దాడిచేస్తున్న ఇరాన్ ఇకపై హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న సముద్రగర్భ ఇంటర్నెట్ భారీ కేబుళ్లను కత్తిరిస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఆయా కేబుళ్లపై ఆధారపడిన దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. నిజంగానే ఇరాన్ కేబుళ్ల కత్తిరింపు పర్వానికి తెరలేపితే మళ్లీ కేబుళ్ల పునరుద్ధరణకు వారాలు లేదా నెలల సమయం పడుతుందని అంతర్జాతీయ కేబుల్ నెట్వర్క్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ డిజిటల్ గుండెకు ఈ సముద్రకేబుళ్లను కవాటాలుగా చెప్పొచ్చు. పలు దేశాల బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, మెయిళ్లు, కృత్రిమమేధ సేవలు, వీడియో కాల్స్కు సంబంధించిన డేటా మొత్తం ఈ కేబుళ్ల ద్వారానే బదిలీ అవుతోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఇంటర్నెట్ వారధులుగా ఈ సముద్ర కేబుళ్లు ఖ్యాతిగాంచాయి. హార్మూజ్, ఎర్ర సముద్రం గుండా దాదాపు 17 భారీ ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఏఏఈ–1, ఫాల్కన్, ‘గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కేబుల్ సిస్టమ్’, ‘టాటా–టీజీఎన్ గల్ఫ్ కేబుల్’వంటి పలు కేబుళ్లు పర్షియన్ గల్ఫ్ జలాల గుండా వెళ్తున్నాయి. ఇవన్నీ భారత విదేశీ డేటా కనెక్షన్లకు కీలకం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో పెద్ద డేటా సెంటర్లను నెలకొల్పేందుకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఇక్కడి డేటా సెంటర్లను విదేశాల్లోని వినియోగదారులు, మార్కెట్లతో అనుసంధానించి గల్ఫ్దేశాలను భవిష్యత్లో ఏఐ కేంద్రాలుగా మార్చాలని ఆశిస్తున్నాయి. వీటికి ఇవే కేబుళ్లు ప్రాణాధారం. ఇప్పుడు ఈ కేబుళ్లను ఇరాన్ సముద్ర మందుపాతరలతో నాశనంచేస్తే వెంటనే పునరుద్ధరించడం కష్టం. కొత్త కేబుళ్లు అమర్చేందుకు ప్రత్యేక నౌకలు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అవి రావడం దాదాపు అసాధ్యం. దీంతో పునరుద్ధరణ పనులు ఆగిపోయి వారాలు లేదా నెలల తరబడి ఈ మార్గంలో డిజిటల్ లావాదేవీలు, డేటా బదిలీ ఆగిపోయే ప్రమాదముందని కేబుల్ సేవాలరంగ సంస్థ ‘టెలీజియోగ్రఫీ’లో నిపుణుడు అలాన్ మౌల్దీన్ చెప్పారు. ఇరాన్పై యుద్ధం కోసం... రూ.18.5 లక్షల కోట్లుపెంటగాన్ అభ్యర్థన వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధం నిమిత్తం ఏకంగా మరో రూ.18.5 లక్షల కోట్ల (200 బిలియన్ డాలర్ల) అదనపు నిధులు కావాలని అమెరికా అంచనా వేసింది! వాటిని విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్ను పెంటగాన్ అభ్యరి్థంచింది. ఈ మేరకు వైట్హౌస్కు ఇప్పటికే లేఖ పంపినట్టు వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించింది. దీనిపై మీడియా ప్రశ్నలకు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నేరుగా బదులివ్వలేదు. దుష్ట నిర్మూలనకు నిధులు కావాల్సిందేనంటూ సరిపెట్టారు. ఇంత భారీ నిధులకు కాంగ్రెస్ ఆమోదం అనుమానమే.దీనిపై ట్రంప్ సర్కారుకు చట్టసభ నుంచి పలు ప్రశ్నలు ఎదురవడం ఖాయమని భావిస్తున్నారు. యూఏఈ నుంచి ‘యాపిల్’ ఔట్?పశి్చమాసియా ఉద్రిక్తతల కారణంగా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ల నిల్వ కేంద్రాన్ని యూఏఈ నుంచి తరలిస్తోంది. యాపిల్కు భారత్లో భారీ ఐఫోన్ తయారీ కేంద్రమున్న విషయం తెలిసిందే. వాటిని అమెరికాకు రవాణా చేసే క్రమంలో దుబాయ్ అతి పెద్ద నిల్వ కేంద్రంగా ఉపయోగపడుతోంది.గల్ఫ్కు భారత యుద్ధనౌకలు హార్మూజ్ను దాటేందుకు ఎదురుచూస్తున్న తన నౌకల రక్షణ నిమిత్తం భారత్ మరిన్ని యుద్ధ నౌకలను గల్ఫ్ తీరానికి తరలిస్తోంది. నావికాదళం ఇప్పటికే ఆరుకు పైగా యుద్ధ నౌకలను మోహరించినట్టు తెలుస్తోంది. హార్మూజ్ వద్ద 22 భారత నౌకలు చిక్కుబడి ఉండటం తెలిసిందే. వీటిలో సగానికి పైగా చమురు, ఎల్పీజీ నిల్వలతో కూడినవే.అమెరికా విమానం కూల్చివేత! ఇరాన్ గురువా రం అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు తెలుస్తోంది! ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ అగ్ర రాజ్య ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు, ఇరాన్పై అణ్వస్త్ర దాడికి అమెరికా యోచన చేస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న ముఠాను శాంటా ఫే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, అందులో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 ఏళ్ల బల్కం నాగరాజుగా గుర్తించారు. పోలీసుల ప్రత్యేక విభాగం (Special Victims Unit) ఆన్లైన్లో మైనర్లుగా నటిస్తూ ఈ అండర్కవర్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుంటున్న వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది.నాగరాజుపై అమెరికా చట్టాల ప్రకారం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి కేసులు అమెరికాలో అత్యంత కఠినంగా పరిగణించబడతాయి. మైనర్లకు సంబంధించిన నేరాలు అక్కడి చట్టవ్యవస్థలో చాలా తీవ్రమైనవిగా భావించబడతాయి. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే, అది కేవలం అరెస్టుతో ముగియదు. బెయిల్ దొరకడం చాలా కష్టం. దీర్ఘకాలికంగా విచారణలు కొనసాగుతాయి. వీసా రద్దు, డిపోర్టేషన్, శాశ్వత నిషేధం వంటి పరిణామాలు ఎదురవుతాయి. భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. -
ఇదీ ఏఐ ప'వార్'!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఉక్రెయిన్ మొదలు పశ్చిమ ఆసియా వరకు జరుగుతున్న యుద్ధాలలో సైన్యాలు కేవలం డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా తమ లక్ష్యాలను వేగంగా గుర్తించడానికి, కదన రంగ సమాచారాన్ని విశ్లేషించడానికి, మిషన్ ప్లానింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కొత్త సాంకేతికత ఉపయోగ పడుతోంది. దీనివల్ల కేవలం తెర వెనుక ఉండి సమాచారా న్ని విశ్లేషించే స్థాయి నుండి నేరుగా యుద్ధ రంగంలోకి ఏఐ ప్రవేశించినట్టయింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం.. 2024లో ప్రపంచ సైనిక వ్యయం 9.4% పెరిగి రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. సైనిక ఖర్చులో ఇంతటి భారీ పెరుగుదల ఇదే మొదటిసారి. ప్రభుత్వా లు ఏఐ ఆధారిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్ సిస ్టమ్స్, శాటిలైట్స్, అటానమస్ డ్రోన్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. 2015 నుండి 2024 మధ్య సైనిక వ్యయం 37% పెరగడం గమనార్హం. దేశాల వారీగా సైనిక, ఏఐ వ్యయాలు..1. అమెరికా: మొత్తం బడ్జెట్ 997 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.40%). 2026 బడ్జెట్లో యుద్ధ పరికరాల కొనుగోళ్లు, పరిశోధన కోసం 384 బిలియన్ డాలర్లు కేటాయించారు. అటానమస్, మానవరహిత వ్యవస్థల కోసం ప్రత్యేకంగా 9.8 బిలియన్ డాలర్లు కేటాయించారు.2. చైనా: మొత్తం బడ్జెట్ 314 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.70%). 2024లో పరిశోధన కోసం చేసిన ఖర్చు 785.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మొదటిసారి అమెరికా కంటే ఎక్కువ. బైడూ, అలీబాబా వంటి పౌర సంస్థల ఏఐ సాంకేతికతను నేరుగా సైనిక వ్యవస్థల్లోకి అనసంధానిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూట్ క్లస్టర్ల కోసం 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు.3. రష్యా: మొత్తం బడ్జెట్: 149 బిలియన్ డాలర్లు (జీడీపీలో 6–7%). ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో 10 ఏళ్ల కాలానికి రక్షణ రంగ ఆధునీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది.4. భారత్: మొత్తం బడ్జెట్: 93.5 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.40%). పరిశోధన, అభివృద్ధి కోసం రూ.29,100 కోట్లు కేటాయించారు. డీఆర్డీఓ, ఇండియన్ నేవీ కలిసి ‘మిషన్ సుదర్శన్ చక్ర’అనే ఏఐ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.యుద్ధ రంగంలో కృత్రిమ మేధ వినియోగం..1. ఇజ్రాయెల్–గాజా సంఘర్షణ: ది గోస్పెల్ (హబ్సొరా): ఇది ఒక ఆటోమేటెడ్ టార్గెట్ సిస్టమ్. మానవ మేధస్సు కంటే 50 రెట్లు వేగంగా భవనాలను, మౌలిక సదుపాయాలను గుర్తించగలదు. లావెండర్: సోషల్ మీడియా సంబంధాలు, సమాచారం ఆధారంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు. వేర్ ఈజ్ డాడీ?: లావెండర్ గుర్తించిన వ్యక్తులు వారి ఇళ్లకు, నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నప్పుడు సైనిక అధికారులకు సమాచారం ఇచ్చే ట్రాకింగ్ సాధనం. స్మార్ట్ షూటర్స్: డ్రోన్లను అడ్డుకోవడంలో సహాయపడే ఏఐ ఆధారిత గన్–సైట్స్. 2. ఉక్రెయిన్–రష్యా యుద్ధం: అటానమస్ డ్రోన్లు: రష్యన్ జీపీఎస్ జామింగ్ను అధిగమించి లక్ష్యాలను గుర్తించి దాడి చేయడానికి వీటిని వాడుతున్నారు. మానవరహిత భూ వాహనాలు: సామాగ్రి సరఫరా, సైనికుల తరలింపు, ప్రత్యక్ష యుద్ధం కోసం ఆయుధాలు కలిగిన రోబోలను రంగంలోకి దించారు. డెల్టా సిస్టమ్: ఇది ఉక్రెయిన్ ప్రధాన యుద్ధరంగ కంప్యూటర్ వ్యవస్థ. ఉపగ్రహాలు, డ్రోన్లు, క్షేత్రస్థాయి నివేదికల నుండి వచ్చే భారీ డేటాను విశ్లేషించి అధికారులకు రియల్ టైమ్ లక్ష్యాల జాబితాను అందిస్తుంది. 3. వెనిజులానికోలస్ మదురోను పట్టుకోవడానికి కారకాస్లో జరిగిన దాడులను సమన్వయం చేయడానికి ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని (పలాంటిర్ ఐటీ కంపెనీ ద్వారా) యూఎస్ మిలిటరీ ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 4. ఇరాన్ (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ): కేవలం ఒక్క వారంలోనే 3 వేల కంటే ఎక్కువ లక్ష్యాలను గుర్తించడానికి ప్రాజెక్ట్ మావెన్, క్లౌడ్ ఏఐని ఉపయోగించారు. -
హ్యాపినెస్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?
వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026 మార్చి 19న విడుదలైంది. ఈ నివేదికలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఈ నివేదికలో జీవన సంతృప్తి, సామాజిక మద్దతు, అవినీతి తక్కువ స్థాయిలు వంటి అంశాలు ప్రధానంగా పరిగణించబడ్డాయి.ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో ఐస్లాండ్ రెండో స్థానంలో, డెన్మార్క్ మూడో స్థానంలో నిలిచాయి. లాటిన్ అమెరికా దేశమైన కోస్టా రికా నాలుగో స్థానాన్ని సాధించడం విశేషం. ఇది ఆ దేశానికి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ర్యాంక్. స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. భారత్ ఎక్కడ..?ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన 147 దేశాల జాబితాలో భారత్ 116 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రెండు స్థానాలు మెరుగుపడింది. 2025లో ఈ జాబితాలో భారత్ 118 స్థానంలో ఉండింది.చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్అతి తక్కువ సంతోషకరమైన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ దేశం 147వ స్థానానికి పరిమితం కాగా.. దానికి ముందు స్థానాల్లో నియెర్రా లియోన్, మాలావీ, జింబాబ్వే, బోట్స్వానా వంటి దేశాలు ఉన్నాయి.అమెరికాలో సంతోషం క్రమంగా తగ్గిపోతుంది..!వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026లో అమెరికా 23వ స్థానంలో నిలిచింది. గత కొద్ది రోజులుగా ఈ జాబితాలో అమెరికా ర్యాంక్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 2022లో 15వ స్థానంలో ఉండిన ఆ దేశం.. నాలుగేళ్లు తిరిగేసరికి 8 స్థానాలు దిగజారి 23వ స్థానానికి పడిపోయింది.ఈ జాబితాలో అమెరికా సహా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ఒక్కటి కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. నార్డిక్ దేశాలు మళ్లీ అగ్రస్థానాలను ఆక్రమించాయి. ఈ దేశాల్లో సామాజిక మద్దతు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, తక్కువ అవినీతి వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని పెంచుతున్నాయని నిర్ధారించబడింది. కోస్టా రికా లాంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువలతో సంతోష సూచీలో గణనీయమైన పురోగతి సాధించాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద దేశాలు సంతోష సూచీలో వెనుకబడటానికి ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక విభజన, రాజకీయ అస్థిరత వంటి అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం వెల్బీయింగ్పై ఎలా ఉందో ప్రత్యేకంగా విశ్లేషించారు. -
అంత్యక్రియలు జరుగుతుండగా డ్రోన్ దాడి.. 17 మంది మృతి
సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం పొరుగు దేశమైన చాద్లోకి వ్యాపించింది. మార్చి 19న జరిగిన ఘటనలో సూడాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ చాద్లోని టైన్ పట్టణంలో 17 మంది ప్రాణాలను బలిగొంది. స్థానిక నివాసి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఇంటి వద్ద అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో రెండు పేలుళ్లు సంభవించాయి. వాటి ధాటికి అంత్యక్రియలకు హాజరైన పలువురితో పాటు సమీపంలో ఆడుకుంటున్న పిల్లలు కూడా బలయ్యారు.చాద్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. సూడాన్పై త్వరలోనే ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమత్ ఇడ్రిస్ డెబీ, రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించి, సూడాన్ దాడులకు తక్షణమే బదులివ్వాలని సైన్యాన్ని ఆదేశించారు. అవసరమైతే వారి భూభాగంలోనూ ఆపరేషన్లు చేపట్టాలని అన్నారు.మరోవైపు సూడాన్ పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ దాడి సూడాన్ సైన్యం పనేనని వారు ఆరోపించారు. కాగా, సూడాన్లో సైన్యం మరియు RSF మధ్య యుద్ధం 2023 ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇప్పటివరకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1.2 కోట్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిలో దాదాపు 10 లక్షల మంది చాద్లోకి శరణార్థులుగా చేరారు. చాద్.. సూడాన్కు సరిహద్దు దేశం. -
దుబాయ్లో ఈద్ వేడుకలు.. కార్మికులకు కార్లు, బంగారు కడ్డీలు
దుబాయ్లోని కార్మికులకు ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ (రంజాన్) వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ఆధ్వర్యంలో మార్చి 20, 21 తేదీల్లో రెండు రోజులపాటు వర్చువల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ‘ఈద్ అల్ ఫితర్… లెట్స్ సెలబ్రేట్ టుగెదర్’ అనే థీమ్తో జరుగుతున్న ఈ కార్యక్రమం కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ వేడుకల్లో పాల్గొనే వారికి కార్లు, బంగారు బార్లు, విమాన టికెట్లు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించబడుతోంది. మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రెండవ రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది. దుబాయ్ అభివృద్ధి ప్రయాణంలో కార్మికులు పోషిస్తున్న కీలక పాత్రకు కృతజ్ఞతగా, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. కార్మికులు విస్తృతంగా పాల్గొనేలా ‘బ్లూ కనెక్ట్’ అనే ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ఈ వేడుకలు ప్రసారం చేయబడతాయి. ఇందులో వీడియోలు, ఇంటరాక్టివ్ గేమ్స్, పోటీలు వంటి విభిన్న వినోదాత్మక కంటెంట్ అందుబాటులో ఉంటుంది. GDRFA దుబాయ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ మాట్లాడుతూ.. ఈ వేడుకల ద్వారా కార్మికుల కృషిని గౌరవించడం, వారి దైనందిన సహకారాన్ని గుర్తించడం మా లక్ష్యం. ఈద్ ఆనందాన్ని వారితో పంచుకోవడం ద్వారా దుబాయ్ స్థిరమైన అభివృద్ధి ప్రయాణంలో వారి పాత్రను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. -
ట్రంప్ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరు.. జపాన్ ప్రధాని
పశ్చిమాసియాలో యుద్దం పతాకస్థాయికి చేరిన వేల జపాన్ ప్రధాన మంత్రి సనాఏ తకాఇచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరని ఆకాశానికెత్తారు. వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ట్రంప్తో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచం తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో శాంతి సాధనకు అవసరమైన ధైర్యం, దృఢ సంకల్పం ట్రంప్ వద్ద మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం తరఫున ఈ సందేశాన్ని ట్రంప్కు అందిస్తున్నట్లు తెలిపారు.ఇదే సందర్భంగా తకాఇచి ఇరాన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. హర్ముజ్ జలసంధి మూసివేత విషయంలో ఇరాన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా జపాన్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. జపాన్, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ప్రధాన మిత్రదేశంగా ఉంది. పెరుగుతున్న చైనా ప్రభావం, ఉత్తర కొరియా అణు పరీక్షలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాల నడుమ రెండు దేశాలు మరింత దగ్గరగా పనిచేయాల్సిన అవసరాన్ని పెంచుతున్నాయి. తకాఇచి వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై విస్తృత చర్చకు దారితీశాయి. ప్రపంచ శాంతి సాధనలో ట్రంప్ను ఏకైక నాయకుడిగా అభివర్ణించడం అమెరికా వ్యతిరేకులకు మింగుడుపడటం లేదు. ఈ వ్యాఖ్యలు ఇతర ప్రపంచ నాయకుల పాత్రను తగ్గించి చూపుతున్నాయనే విమర్శలూ వినిపిస్తున్నాయి. జపాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. రెండు దేశాల మధ్య స్నేహం, భాగస్వామ్యం ప్రపంచ శాంతి సాధనలో కీలకమని అన్నారు. జపాన్ ఎల్లప్పుడూ అమెరికాకు విశ్వసనీయ మిత్రదేశమని పేర్కొన్నారు. మేము కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలమని ధీమా వ్యక్తం చేశారు. -
హార్మూజ్ సముద్రగర్భ కేబుళ్లను దెబ్బతీస్తే..?
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్పై సాగిస్తున్న యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన తరుణంలో మరో కొత్త అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. . ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచ చమురు సరఫరాకు సవాల్ విసురుతుండగా, ఇప్పుడు కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తే ఏమటనే ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశాలకు కమ్యూనికేషన్ కలపడానికి ఇంటర్నెట్ కేబుళ్లు హార్మూజ్ జలసంధి గుండా వెళ్తాయి. చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం ఇరాన్పై దాడులు సాగిస్తున్న తరుణంలో మరి ఆ దేశం హోర్ముజ్ జలసంధి ఇంటర్నెట్ కేబుళ్లను నిలిపివేస్తే పరిస్థితి ఏమిటి? అనేది పలుదేశాలను పట్టి పీడిస్తోంది. టెహ్రాన్ లక్ష్యం ఇంటర్నెట్ను నిలిపివేస్తుందా? అనేది ఇప్పుడు తలెత్తున్న ప్రశ్న.మరొకవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మండేబ్పై కూడా ఇరాన్ ప్రాక్సీ హౌతీలు దాడి చేయవచ్చనే భయాలు ఉన్నాయి. ప్రపంచ డిజిటల్ జీవనాధారాలు కూడా సముద్రగర్భ కేబుళ్ల రూపంలో ఈ మార్గాల గుండానే వెళ్తాయి. ఇది యూరప్-ఆసియా వాణిజ్యానికి అత్యంత కీలకం. ఇక్కడ కేబుల్స్ను కట్ చేస్తే ఆ ప్రాంతాల వాణిజ్యంతో పాటు ఇంటర్నెట్కు కూడా విఘాతం ఏర్పడుతుంది. అటు హోర్ముజ్ జలసంధి, ఇటు ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ను ఇరాన్ కానీ, ఇరాన్కు మద్దతిచ్చే హౌతీలు కానీ కట్ చేస్తే మాత్రం చాలా దేశాల్లో ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఎర్ర సముద్రంలో యెమెన్కు చెందిన హౌతీ గ్రూపులు ప్రయాణిస్తున్న నౌకలపై కాల్పులు జరుపుతుండటంతో, ఆ ఇరుకైన జలమార్గం కూడా ప్రమాదకర ప్రాంతంగా మారింది.పూర్తిగా ఆగదు.. కానీ ఇరాన్ హోర్ముజ్ సముద్ర మార్గంలోని అండర్సీ కేబుల్స్ను కత్తిరిస్తే ప్రపంచ ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు, కానీ తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయి. ఇంటర్నెట్ వేగం తగ్గడం, కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, గ్లోబల్ డేటా ట్రాఫిక్కు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, హోర్ముజ్, బాబ్ ఎల్-మండెబ్ వంటి చోక్ పాయింట్స్ చాలా కీలకమైనవిగా ఉన్నాయి. మొత్తంగా, ఇరాన్ హోర్ముజ్ లేదా బాబ్ ఎల్-మండెబ్ వద్ద కేబుల్స్ను దెబ్బతీస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నెమ్మదిస్తుంది,హోర్ముజ్ అండర్సీ కేబుల్స్ ప్రాముఖ్యతహోర్ముజ్ సముద్ర మార్గం: ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యాన్ని కలిపే ప్రధాన ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ ఇక్కడ గుండా వెళ్తాయి.95% అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ సముద్రపు కేబుల్స్ ద్వారానే జరుగుతుంది.భారతదేశం: పశ్చిమ దిశలో వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్లో మూడో వంతు హోర్ముజ్ మీద ఆధారపడి ఉంటుంది. -
మీకు భీకరమైన దాడి ప్యాకేజ్ని చూపించబోతున్నాం: యూఎస్ఏ
పశ్చిమాసియా యుద్ధం మొదలై ఇప్పటికే మూడు వారాలు కాగా, ఈ పరిస్థితి ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనబడుట లేదు. అటు అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై దాడి తీవ్రతను పెంచగా, ఇరాన్ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. ఈ యుద్ధం విషయంలో ఏ ఒక్క వర్గము వెనక్కి తగ్గడానికి ఆసక్తి చూపడం లేదు. ఆ యుద్ధం కారణంగా ప్రపంచంలో ఇప్పటికే పలు రకాల సంక్షోభ పరిస్థితులు చోటు చేసుకోగా, ఇంకా యుద్ధ తీవ్రత ముదిరితే ఎటువైపుకు వెళుతుందోననే ఆందోళన ప్రజల్లో కనబడుతోంది. అయితే నాయకుల్లో మాత్రం ఎటువంటి భయం కనపడకపోగా, యుద్ధాన్ని మేము ముగిస్తాం( మేమెంటో చూపిస్తాం) అంటే మేము ముగిస్తాం అని ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్కు మరొకసారి తామేంటో చూపిస్తామని, అందుకు సిద్ధంగా ఉండాలని ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈరోజు(గురువారం) ఇరాన్ మరో భీకర యుద్ధాన్ని చూడబోతోంది. అది కూడా ఒక భారీ యుద్ధ ప్యాకేజ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇరాన్లో 7,000 కంటే ఎక్కువ లక్ష్యాలపై అమెరికా దాడి చేసింది. గురువారం అత్యంత పెద్ద యుద్ధ ప్యాకేజ్ను ఇరాన్కు చూపించబోతున్నాం. అది మునుపటి దానితో సమానంగా ఉంటుంది. కానీ అది మీ ఊహకు అందదు. మా సామర్థ్యాలు పెరుగుతున్నాయి, ఇరాన్వి తగ్గుతున్నాయి, ఇప్పటికే ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు సమూలంగా ధ్వంసమయ్యాయి’అని పేర్కొన్నారు. -
‘సౌత్ పార్స్’ : ప్రపంచం మొత్తానికి పదేళ్లపాటు, షాకింగ్ నిజాలు
ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాన్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఇరాన్లోని సౌత్ పార్స్ (South Pars) గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి తీవ్ర ఉద్రిక్తతను రేపింది. ప్రపంచ ఇంధన సరఫరా , ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత రాజేస్తోంది. అసలు సౌత్ పార్స్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అంత కీలకం? తెలుసుకుందాం.ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. "నియంత్రించలేని పరిణామాలు" ఉంటాయని హెచ్చరించిన ఇరాన్ అన్నంత పనీ చేస్తోంది.ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారిప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిక్షేపంఅరేబియా గల్ఫ్ సముద్ర తీరంలో ఉన్న ఈ గ్యాస్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిక్షేపాల్లో ఒకటి. దీనిని ఇరాన్, ఖతార్ దేశాలు పంచు కుంటున్నాయి. అయితే ఇరాన్లో ఉన్న భాగాన్ని 'సౌత్ పార్స్' అని పిలుస్తారు. అలాగే ఖతార్ భాగాన్ని 'నార్త్ ఫీల్డ్' అని పిలుస్తారు.ఈ రెండింటి సామర్థ్యం సుమారు 1,800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్. ఇది ప్రపంచం మొత్తానికి పదేళ్ల పాటు సరిపోయేంత భారీ నిక్షేపం. సౌత్ పార్స్ కేవలం ఇంధన వనరు మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముక వంటిది. అందుకే ఇరాన్కు అంత ముఖ్యం. అంతేకాదు ఇరాన్ ఉపయోగిస్తున్న మొత్తం సహజ వాయువులో సుమారు 80శాతం ఈ ఒక్క ఫీల్డ్ నుంచే వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, గృహాలు, పరిశ్రమల నిర్వహణకు ఇదే ప్రధాన ఆధారం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదైనప్పటికీ, ప్రపంచంలో అత్యధికంగా గ్యాస్ వినియోగించే దేశాల్లో ఇరాన్ ఒకటి.ఇదీ చదవండి: నో జీన్స్, నో టీషర్ట్స్, నో పార్టీవేర్ : ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ప్రభావం ఎంత?ఈ గ్యాస్ ఫీల్డ్కు ఏదైనా అంతరాయం కలిగితే, ఇరాన్ అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడటమే కాదు, దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్లుగా ఇరాన్ ఇప్పటికే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఈ దాడి అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలకు కూడా దారితీస్తోంది. ఇంతపెద్ద గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, సరఫరా గొలుసుకు అంతరాయం తప్పదనే ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం, గ్యాస్ కంటే చమురు ధరలు వేగంగా పెరుగుతుండటం గమనార్హం. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కూడా కుదిపేస్తున్నాయి.ఇదీ చదవండి: 8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు -
రగిలిపోతోన్న ఇరాన్ సైన్యం
పశ్చిమాసియా యుద్ధం అప్డేట్స్ ఇరాన్కు ఈరోజు చుక్కలు చూపెడతాంఇరాన్ మరోసారి భీకర దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందిపశ్చిమాసియా యుద్ధాన్ని మేమే ముగిస్తాంమేము మా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాంఅమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్దేశంలో ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది: కేంద్రంప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాంబ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాంనిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఆరు వేల ప్రాంతాల్లో తనిఖీలుతెలంగాణలో వెయ్యి ప్రాంతాల్లో దాడులు, 2300 సిలిండర్లు సీజ్ప్రజలు ఎల్పీజీకి బదులు పీఎన్జీ కనెక్షన్లు తీసుకోవాలికిరోసిన్, బొగ్గు పొయ్యిలను కూడా వాడాలని కేంద్రం సూచన ఇరాక్లోనూ దాడులు చేస్తున్న ఇరాన్ ఇరాక్లోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో పేలుడు ఇరాక్లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాపై అమెరికా దాడులుసుల్తాన్ ఆఫ్ ఒమన్కు భారత ప్రధాని మోదీ ఫోన్ఒమన్పై ఇరాన్ దాడులను ఖండించిన మోదీపశ్చిమాసియా యుద్ధానికి చర్చలతోనే పరిష్కారం గల్ఫ్లోని చమురు కేంద్రాలే లక్ష్యం గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ భీకర దాడులు ఇరాన్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి దీంతో రగిలిపోతోన్న ఇరాన్ సైన్యంగల్ఫ్లోని చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులుమినాఅల్-అహ్మదీ రిఫైనరీపై దాడికువైట్లోని మినాఅల్-అహ్మదీ రిఫైనరీపై డ్రోన్ దాడిపక్కనే ఉన్న మినా అబ్దుల్లా రిఫైనరీకి అంటుకున్న మంటలుఖతార్లోని రాస్ లాఫాన్ చమురు కేంద్రంపై ఇప్పటికే దాడిఅమెరికా స్థావరాలపైనా ఇరాన్ దాడులు -
భయపెడుతున్న ఇరాన్.. అణు కేంద్రమా? ఖాళీ ప్రదేశమా?
టెహ్రాన్: ఇరాన్లోని ఇస్ఫహాన్ భూగర్భ కాంప్లెక్స్లో ఇరాన్ కొత్త యురేనియం సుసంపన్నత కేంద్రాన్ని (uranium enrichment site) అభివృద్ధి చేసినట్లు సమాచారం. అయితే, ఈ కొత్త కేంద్రం పని చేస్తోందా? లేదా? అది కేవలం ఒక "ఖాళీ ప్రదేశమా" అన్నది నిర్ధారించలేకపోతున్నామని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) తెలిపింది. ఆ కేంద్రం ఎంత ఆధునికమైనదో స్పష్టంగా తెలియదన్న ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ.. పలు సందేహాలున్నాయన్నారు.పర్యవేక్షణ సంస్థకు అక్కడ తనిఖీ చేసే అవకాశం దక్కితేనే వీటికి సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు. అది భూగర్భంలో ఉందని.. కానీ మేము ఇంకా ఆ ప్రదేశాన్ని పరిశీలించలేదని తెలిపారు. ట్రంప్ పరిపాలన అధికారులతో చర్చలు జరపడానికి వాషింగ్టన్ సందర్శించిన గ్రోసీ ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు. ఒకవేళ ఇది పూర్తయితే, ఇరాన్లో ఇది నాలుగో యురేనియం సుసంపన్నత ప్లాంట్ అవుతుందన్నారు.ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 440 కిలోల 60 శాతం సుసంపన్నం చేసిన యురేనియం ఉన్నట్లు IAEA అంచనా వేస్తోంది. దీనిని 90 శాతానికి (ఆయుధాల తయారీకి అవసరమైన స్థాయికి) చేర్చగలిగితే, అది అణు ఆయుధ తయారీకి సిద్ధమైనట్లే.. ఇది సుమారు 10 అణు బాంబుల తయారీకి సరిపోతుంది. అయితే దీనికి పట్టే కాలాన్ని లెక్కించడం కష్టమని అధికారులు గతంలోనే స్పష్టం చేశారు.గత ఏడాది 2025 జూన్లో ఐక్యరాజ్యసమితి బృందం దానిని పరిశీలించడానికి ఇస్ఫహాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఇజ్రాయెల్తో 12 రోజుల యుద్ధం ప్రారంభమైన తరుణంలో ఆ అణు కాంప్లెక్స్పై దాడి జరగడంతో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఐఏఈఏ బృందం తమ పర్యటనను రద్దు చేసుకోవాల్సి రావడంతో, అక్కడ సెంట్రిఫ్యూజ్ల అమరిక మొదలైందా? లేదా? అన్నది తెలియడం లేదు. "మేము అక్కడికి తిరిగి వెళ్లగలిగినప్పుడు మాత్రమే స్పష్టత లభిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.తమకు అణుబాంబు తయారీ ఉద్దేశం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ, అది బాంబు తయారీకి చాలా దగ్గరగా చేరుకుందనే కారణంతో అమెరికా, ఇజ్రాయెల్లు దాడులు చేస్తున్నాయి. అమెరికా దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాయని అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించినప్పటికీ, ఐఏఈఏ మాత్రం అణు ఆయుధ కార్యక్రమంపై తమ వద్ద ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపింది. -
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఖతార్లోని అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ రాస్ లాఫ్ఫాన్పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ తమపై చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ దాడి చేసింది. అలాగే, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తుండడంతో భారత్ వంటి దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులు ఉన్న దేశాలు ఇరాన్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఫ్యాక్టరీపై దాడి జరిగిన వెంటనే అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా ఎల్ఎన్జీ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖతార్పై ఇరాన్ దాడి మొదటి సారికాదు. మార్చి మొదటి వారంలో ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపింది. ఖతార్ గ్యాస్ క్షేత్రాలు, రాస్ లాఫ్ఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు.. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా జరిగినవని సమాచారం.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ నాయకత్వంపై వరుస దాడులు చేశాయి. తాజా దాడిలో గూఢచారి విభాగం అధిపతి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యాడు. ఇరాన్లో వేల సంఖ్యలో మరణాలు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలను తగ్గిస్తోంది.భారత్పై ప్రభావం ఈ పరిస్థితులు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం ఖతార్ నుంచే వస్తుంది.“భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% విదేశీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంది. అందులో సుమారు 40% ఎల్ఎన్జీ ఖతార్ నుంచి వస్తుంది. అంటే మొత్తం దిగుమతుల్లో దాదాపు 20 శాతం కతార్ నుంచే. భారత్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ రంగంలో వినియోగం తగ్గించాలి” అని ఇంధన ఆర్థిక నిపుణుడు కిరిట్ పారిఖ్ తెలిపారు.ప్రస్తుతం భారత్ రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతుంది.గత వారం నాటికి 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది దిగుమతుల్లో భాగం. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితుల వల్ల ఈ అంతరాయం జరిగింది. దీంతో ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ఇతర సోర్సుల నుంచి ఎల్ఎన్జీ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. -
అమెరికాలో డ్రోన్ల కలకలం.. హై అలర్ట్లో వాషింగ్టన్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. అత్యంత కీలక సైనిక స్థావరం ‘ఫోర్ట్ మెక్నైర్’ (Fort McNair) వద్ద గుర్తు తెలియని డ్రోన్లు తిరుగుతుండటం అమెరికా యంత్రాగాన్ని హడలెత్తిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్లు నివసించే ప్రాంతంలో డ్రోన్లు కనిపించడం అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో వైట్హౌస్ అత్యవసర చర్యల్లోకి దిగింది.యుద్ధ మేఘాల మధ్య..ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఈ డ్రోన్ల సంచారం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. భద్రతా పరమైన ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అమెరికా తన విదేశీ రాయబార కార్యాలయాలను హై అలర్ట్లో ఉంచడంతో పాటు, స్వదేశంలోని పలు సైనిక స్థావరాలను లాక్డౌన్ చేసింది.ట్రంప్ మాస్ వార్నింగ్మరోవైపు, ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా ఖతార్లోని ఇంధన ప్లాంట్లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఖతార్పై మళ్లీ దాడికి దిగితే, ఇరాన్ ఇంధన వనరులను పూర్తిగా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.మండిపోతున్న చమురు ధరలుఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 5 శాతం పెరిగి, మరింత భారంగా మారింది. చమురు రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ భీకర పోరులో ఇప్పటివరకు ఇరాన్లో 1,300 మంది, లెబనాన్లో 960 మంది, అమెరికా సైనికులు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షిపణి దాడుల కారణంగా ఖతార్లోని కీలక గ్యాస్ ప్లాంట్లు భారీగా దెబ్బతిన్నాయి.ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
అమెరికాకు ఇరాన్ ఝలక్.. ఖతార్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా ఖతార్, యూఏఈలోని అమెరికా నిర్వహిస్తున్న ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు.అయితే, సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. రస్ లాఫాన్ దాడి తరువాత తెల్లవారుజామున పలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కేంద్రాలు కూడా క్షిపణి దాడులకు గురయ్యాయని ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ తెలిపింది. దీంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి మరింత నష్టం వాటిల్లిందని పేర్కొంది. అగ్నిప్రమాదాలపై అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ ధృవీకరించింది. అనంతరం, ఇరాన్ రాయబారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది.కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు అగ్నిప్రమాదాల్లో రెండింటిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం తెలిపింది. ఇంకా కూలింగ్, భద్రత చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరోవైపు.. ఇరాన్ చర్యలపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది.ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ దాడులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు. పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుతంగా ఉంటే, ఇకపై సౌత్ పార్స్ మీద ఎటువంటి దాడులు జరగవని ఆయన హామీ ఇచ్చారు. తాను ఆ స్థాయి హింస, వినాశనాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్ తప్పు చేసింది : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాశియా దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయగా, ప్రతీకారంగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్.. సౌత్ పార్స్గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయడం ముమ్మాటికి తప్పే. ఇజ్రాయెల్ దాడి చేసిందని మీరు ఖతర్పై దాడి చేస్తే ఉపేక్షించబోమంటూ ట్రంప్ టూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇజ్రాయెల్ ఇకపై దాడులు చేయదని, కానీ ఇరాన్ ఖతర్పై మళ్లీ దాడి చేస్తే అమెరికా స్వయంగా ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ను పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్ ఖతర్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని హబ్షన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఫీల్డ్లపై కూడా దాడులు జరిపింది. ఈ దాడులు గల్ఫ్ దేశాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ఇరాన్ చర్యలతో ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్జలసంధి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో జరిగిన పరిణామాలపై ఆగ్రహంతో ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనే ప్రధాన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో కేంద్రంలోని ఒక చిన్న భాగమే దెబ్బతింది. ఈ ప్రత్యేక దాడి గురించి అమెరికాకు ఎలాంటి సమాచారం లేదు. ఈదాడికి ఖతర్కు ఏవిధమైన సంబంధం లేదు. ఈ దాడి జరగబోతుందని ఖతర్కు తెలియదు’అని పేర్కొన్నారు. తాజా పరిణామం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. బ్రెంట్ క్రూడ్ ధరలు మరో 5 శాతం పెరిగి బ్యారెల్కు 108 డాలర్లకు చేరాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ఇది దిగుమతులపై ఆధారపడే దేశాలకు, ముఖ్యంగా భారత్పై సైతం ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంది. మొత్తం మీద, ఇరాన్పై అమెరియా-ఇజ్రాయెల్ యుద్ధం సహజవనరుల భద్రతను కుదిపేస్తోంది. ఖతర్, యూఏఈపై దాడులు, అమెరికా హెచ్చరికలు, చమురు ధరల పెరుగుదల పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరత వైపు నెడుతున్నాయని ఆర్థిక నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పాకిస్తాన్కు షాకిచ్చిన అమెరికా.. యుద్దం వేళ ట్విస్ట్!
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్పై అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ బాంబు పేల్చారు. ఇదే సమయంలో రష్యా, చైనా, ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలు.. అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రపంచ భద్రతా ముప్పులపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్బంగా తులసీ గబ్బార్డ్..‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్లతో కూడిన అనేక రకాల కొత్త రకాల సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు చేస్తున్నారు. అలాగే, అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ దేశాలు అమెరికాను చేరగలిగే అణు సామర్థ్యం ఉన్న క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. అమెరికాను వాటి పరిధిలోకి తీసుకువస్తున్నాయి’ అని సంచలన ఆరోపణలు చేశారు.టార్గెట్ అమెరికా.. అంతేకాదు, మారుతున్న భౌగోళిక రాజకీయ కూటములను హైలైట్ చేస్తూ ఉత్తర కొరియా.. రష్యా, చైనాలతో తన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. ఇది అమెరికా శత్రువుల మధ్య సమన్వయ సైనిక సామర్థ్యాలపై ఆందోళనలను పెంచుతోందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికాపై దాడి చేయగల క్షిపణుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు 3,000 ఉండగా.. 2035 నాటికి ఈ సంఖ్య 16,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.పాక్ పీఎం షరీఫ్ ఇలా.. అయితే, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ తులసీ గబ్బార్డ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాగా, 2025లో గాజా పీస్ సమ్మిట్లో షరీఫ్ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. “మ్యాన్ ఆఫ్ పీస్” అని పిలుస్తూ.. ఆయన భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించారని పేర్కొన్నారు. ఆయన ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని కూడా అన్నారు.ఇరాన్ యుద్ధంపై..మరోవైపు, ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ఆమె స్పందిస్తూ..‘ఇరాన్పై అధ్యక్షుడు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నాను. గత 20 రోజులుగా భీకర దాడులు చేస్తున్నా.. సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నాయకులు, అధికారులు మరణించినా ఇరాన్ మాత్రం పోరాటం ఆపలేదు. యుద్ధంలో భారీ నష్టం జరిగినా.. ఇరాన్లో ప్రభుత్వం చెక్కుచెదరలేదు. కానీ, చాలా వరకు ఇరాన్ బలహీనపడిందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ సైనిక శక్తి తగ్గినా ఇంకా ప్రమాదకరమే’ అని ఆమె తెలిపారు. -
పాకిస్థాన్లో రిపబ్లిక్డే వేడుకలు రద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటన ప్రకారం.. కొనసాగుతున్న గల్ఫ్ చమురు సంక్షోభం, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరలు, అలాగే ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా జరిగే సైనిక కవాతు, 31-గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి జరగవు. దాని బదులుగా, కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించబడుతుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, శాఖలు ఈ సందర్భాన్ని నిరాడంబరంగా, గౌరవప్రదంగా పాటించాలని ఆదేశించారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన తీవ్ర ఇంధన సంక్షోభం, ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మార్చిలో పొదుపు చర్యలకు దిగిందని, వాటిలో భాగంగానే రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. -
గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలల నడుమ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతుండటంతో కీలక చమురు రవాణా మార్గాలను కాపాడుకునేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్కు మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తోంది.ఏడుకు చేరిన యుద్ధ నౌకలుపశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ దేశాలకు 20 శాతం ముడి చమురు సరఫరా చేసే హార్మూజ్ జలసంధి ప్రస్తుతం మూతపడింది. ఈ క్రమంలో భారత చమురు నౌకలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు నౌకాదళం తన యుద్ధ నౌకల మోహరింపును మరింతగా పెంచుతోంది. ప్రస్తుతం అక్కడ మూడు యుద్ధనౌకలు ఉండగా, తాజాగా చేపట్టిన అదనపు మోహరింపుతో ఈ సంఖ్య ఏడుకు చేరనుంది.నౌకాదళం అభయంషిప్పింగ్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జలసంధికి పశ్చిమ దిశలో సుమారు 22 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. అయితే భారత నౌకాదళం పహారా నడుమ ఇప్పటికే కొన్ని నౌకలు క్షేమంగా చేరుకున్నాయి. గత వారం ‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే రెండు ఎల్పీజీ క్యారియర్లు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్తో భారత తీరానికి చేరుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫుజైరా పోర్ట్ నుండి బయలుదేరిన ఒక చమురు ట్యాంకర్ను కూడా భారత యుద్ధనౌక సురక్షితంగా ఎస్కార్ట్ చేసింది.ఏమిటీ ‘ఆపరేషన్ సంకల్ప్’?భారత నౌకాదళం 2019 నుండి ‘ఆపరేషన్ సంకల్ప్’ పేరుతో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో తన ఉనికిని చాటుతోంది. సముద్ర మార్గంలో భారత వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి నౌకాదళం తన పహారాను మరింత కఠినతరం చేసింది. దీనికితోడు 2008 నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో కొనసాగుతున్న సముద్రపు దొంగల వ్యతిరేక గస్తీ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత ఇంధన భద్రతకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా, నౌకాదళం గల్ఫ్ ప్రాంతంలో నిరంతర నిఘా ఉంచుతోంది.ఇది కూడా చదవండి: 80 వేల టన్నుల చమురుతో భారత్కు ‘జగ్ లాడ్కీ’ -
కెనడాలో వారం వ్యవధిలో.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య
అట్టావా: కెనడాలో జాతి విద్వేష ఘటనలపై భారతసంతతి వాసులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో భారతసంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మార్చి 14వ తేదీన అల్బెర్టా ప్రావిన్స్లో బీరీందర్ సింగ్(22) లెడుక్ ప్రాంతంలో వాహనంలో ఉండగా కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 13వ తేదీన సాస్కాట్చెవాన్లోని నార్త్ బ్యాటిల్ ఫోర్డ్లో దేవీందర్ సింగ్(31), అదే రోజు ఫోర్ట్ సెయింట్ జాన్ వద్ద జరిగిన గొడవలో గుర్కిరీట్ మనోచా(31) మృతి చెందారు. ‘ఆ రోజు మధ్యాహ్నం సమయంలో లెడుక్ వద్ద కారులో బీరీందర్తో కలిసి కారులో ఉన్నాం. అంతలోనే ఓ పికప్ కారు మా పక్కన వచ్చి ఆగింది. అందులోని వ్యక్తులు మాపై కాల్పులు జరిపారు. తూటాలు తగిలి కారు స్టీరింగ్ వద్ద ఉన్న బీరీందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది జాతి విద్వేష ఘటనే అనుకుంటున్నాం’అని బీరీందర్ స్నేహితుడు తెలిపారు. మారుమూల, జన సంచారం అంతగా లేని ప్రాంతాలకు వెళ్లడం ప్రమాదకరమన్నారు. కాగా, దేవీందర్ హత్యపై దర్యాప్తు జరుగుతోందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) తెలిపింది. రెండో ఘటన. బ్రిటిష్ కొలంబియాకు చెందిన గుర్కిరీట్ సింగ్ మనోచా మేనేజ్మెంట్ డిగ్రీ చదువుకునేందుకు ఫోర్ట్ సెయింట్ జాన్కు మకాం మార్చాడు. ఈ నెల 13న చార్లీలేక్ బోట్ క్యాంపు వద్ద రాత్రి 11 గంటల సమయంలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తులతో తలెత్తిన ఘర్షణలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వచ్చే సరికే చనిపోయి ఉన్నాడు. ఇతడి సొంతూరు భారత్లోని ఉజ్జయిని. కాగా, గుర్కిరీట్తో ఘర్షణ పడిన వ్యక్తులెవరనే దానిపై పోలీసులు ఒక స్పష్టతకు రాలేదు. రాత్రి వేళ, అదీ జన సంచారం తక్కువగా ఉండే చోటుకావడంతో దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని నేర విభాగం తెలిపింది. మూడో ఘటన..మార్చి 13వ తేదీన ఉదయం 8గంటల వేళ క్యాబ్ డ్రైవర్ దేవీందర్ సింగ్కు హిచింగ్ పోస్ట్ మోటెల్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లాక అతడిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అతడిని తుపాకీతో కాల్చి పరారయ్యారు. తీవ్ర గాయాలతో దేవీందర్ మృతి చెందాడు. దుండగులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనతో భారత సంతతి క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా భయపడుతున్నారని దేవీందర్ పనిచేసే క్రౌన్ క్యాబ్ సంస్థ యజమాని హరీశ్ కొరాఠ్ తెలిపారు. కొందరు క్యాబ్ డ్రైవింగ్ మానేశారన్నారు. -
స్వచ్ఛందంగా దేశం వీడితే 2,600 డాలర్లు బోనస్
వాషింగ్టన్: అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా స్వచ్ఛందంగా అమెరికాను విడిచి స్వదేశం వెళ్లాలనుకుంటున్న అక్రమ వలసదారులకు ఆర్థిక ప్రో త్సాహాన్ని మరింత పెంచింది. భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన లక్షలాది మంది అక్రమ వలసదారులు స్వదేశానికి వెళ్లడానికి ఉచిత విమాన ప్రయాణంతో పాటు 2,600 డాలర్ల నిష్క్రమణ బోనస్ అందిస్తోంది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) విభాగం పోస్టర్లను ఎక్స్లో పోస్టు చేసింది. ముఖ్యంగా భారత్, చైనా, కొలంబియా దేశస్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. గతంలో బహిష్కరణకు గురైన తర్వాత అమెరికాను విడిచి వెళ్లలేని వారిపై విధించిన జరిమానాలతో సహా కొన్ని శిక్షలను కూడా ఈ పథకం కింద మాఫీ చేయనున్నట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. గతంలో బహిష్కరణకు గురైన తర్వాత అమెరికాను విడిచి వెళ్లని వారిపై విధించిన జరిమానాలతో సహా కొన్ని శిక్షలను ఈ పథకం కింద మాఫీ చేయనున్నట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. ఈ పథకాన్ని ఒక ‘చారిత్రాత్మక అవకాశం’గా అభివర్ణించింది. నమోదు చేసుకుని, దేశం విడిచి వెళ్లేందుకు అర్హత పొందిన వారిపై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీసీ) ఎలాంటి చర్యలు తీసుకోదని తెలిపింది. ఈ ప్రక్రియలో నమోదు కావడానికి వలసదారులు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) యాప్ను ఉపయోగించాలని డీహెచ్ఎస్ సూచించింది. జనవరి 2025లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22 లక్షలకు పైగా అక్రమ వలసదారులు దీని ప్రయోజనాన్ని పొందారని వెల్లడించింది. ఒక వ్యక్తిని బలవంతంగా దేశ బహిష్కరణ చేయడానికి 18,245 డాలర్లు ఖర్చవుతోంది. 2,600 డాలర్ల ప్రోత్సాహంతో సీబీపీ హోమ్ యాప్ ద్వారా స్వచ్ఛందంగా దేశం నుంచి వెళ్లడానికి అయ్యే ఖర్చు కేవలం 5,100 డాలర్లు అవుతుంది. దీనివల్ల 13వేల డాలర్లకు పైగా ఆదా అవుతుందని డీహెచ్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అక్రమ వలసదారులు సీబీపీలో నమోదు చేసుకోవడం వల్ల వారు తమ పని, చదువు ఇతర వ్యక్తిగత విషయాలను ముగించుకుని చట్టబద్ధంగా తమ తిరుగు ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు’ అని తెలిపింది. గతేడాది మేలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు నిష్క్రమణ బోనస్గా 1,000 డాలర్లు అందించింది. కొత్త సంవత్సరం రాకముందే దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఈ బోనస్ను మూడు రెట్లు పెంచి 3,000 డాలర్లుగా చేసింది. ఈ సంవత్సరం జనవరిలో 2,600 డాలర్లుగా నిర్ణయించింది. -
భారత్కు చేరిన జగ్ లడ్కీ
అహ్మదాబాద్/హాంకాంగ్: యుద్ధమయ హార్మూజ్ గుండా మరో ముడిచమురు రవాణా నౌక క్షేమంగా భారత నౌకాశ్రయానికి చేరుకుంది. భారతీయ జెండాతో ‘జగ్ లడ్కీ’నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా పోర్ట్లో 80,886 మెట్రిక్ టన్నుల ముడిచమురు నింపుకుని హార్మూజ్ గుండా ప్రయాణించి బుధవారం గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు చేరుకుందని ఆ పోర్ట్ నిర్వహణ సంస్థ ‘అదానీ పోర్ట్స్’ప్రకటించింది. ఇదే ఫుజైరా పోర్ట్పై ఇరాన్ ఇటీవల క్షిపణి దాడులు చేసింది. అయినాసరే పోర్ట్నుంచి సరకు ఎగుమతి నిరాటంకంగా కొనసాగుతోంది. సోమవారం హార్మూజ్ గుండా బయల్దేరి 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరకుతో ‘నందా దేవి’నౌక వచి్చన మరుసటి రోజే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా భారత్కు రావడం విశేషం. 274.19 మీటర్ల పొడవుండే జగ్ లడ్కీ నౌక గరిష్టంగా 1,64,716 టన్నుల సామర్థ్యతో ప్రయాణించగలదు. భారత చమురు దిగుమతులకు సంబంధించి హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. దీని గుండానే భారత్కు దాదాపు 40–50 శాతం చమురు వస్తోంది. హార్మూజ్ను దాటిన 89 నౌకలు హార్మూజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్ నిషేధం విధించినా సరే సిగ్నళ్లను నిలిపేసి, లైట్లను ఆర్పేసి ‘డార్క్ మోడ్’లో ఎవరి కంటా పడకుండా కొన్ని నౌకలు ఇదే మార్గం గుండా ప్రమాదకరరీతిలో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. అయితే మిత్రదేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడట్లేదని తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలు సైతం సురక్షితంగానే ప్రయాణం పూర్తిచేస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి నెల 15వ తేదీదాకా 89 సరకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా విజయవంతంగా ప్రయాణించాయని సముద్రమార్గ ప్రయాణాల డేటా సంస్థ ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’బుధవారం ప్రకటించింది. ఈ 89 నౌకల్లో ఐదింట ఒకవంతు నౌకలకు ఇరాన్తో సంబంధం ఉందని, చైనా, గ్రీస్ జెండాలున్న నౌకలూ సులభంగానే హార్మూజ్ను దాటేశాయని ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’పేర్కొంది. చైనాకు బదులు భారత్కు బయల్దేరిన 7 నౌకలు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షల సడలింపు ప్రకటించిన నేపథ్యంలో మోదీ సర్కార్ మళ్లీ రష్యాచమురు కొనుగోళ్ల పర్వానికి తెరలేపింది. దీంతో రష్యా నుంచి చైనాకు బయల్దేరిన ఏడు ముడిచమురు రవాణా నౌకలు సముద్రమార్గం మధ్యలోనే దిశ మార్చుకుని భారత్కు ప్రయాణం మొదలెట్టడం విశేషం. జనవరి చివరివారంలో రష్యా నుంచి బయల్దేరి బాలి్టక్ సముద్రజలాల్లో ప్రయాణించిన మధ్యశ్రేణి ముడిచమురునౌక ‘ఆక్వా టైటాన్’వాస్తవానికి చైనాలోని రిజావో పోర్ట్కు వెళ్లాలి. కానీ అది ఇటీవల దిశ మార్చుకుని భారత్ దిశగా వెళ్తోందని, మార్చి 21వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్లో లంగరు వేస్తుందని నౌకల ట్రాకింగ్ సంస్థ ‘ఓర్టెక్సా లిమిటెడ్’పేర్కొంది. ‘సూయిజ్మ్యాక్స్ జోయూజోయూ ఎన్’నౌక సైతం దిశ మార్చుకుని భారత్కు వస్తోందని మార్చి 25వ తేదీకల్లా గుజరాత్లోని జామ్నగర్ సిక్కా పోర్ట్కు చేరుకుంటుందని తెలిపింది. -
ఇంధన కేంద్రాలే టార్గెట్
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలే యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం బుధవారం 19వ రోజుకు చేరుకుంది. ఇరాన్లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రమైన ‘సౌత్ ఫార్స్’పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి దిగింది. ఇక్కడ నిత్యం 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఇజ్రాయెల్ దాడిలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైతం గల్ఫ్ అరబ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై విరుచుకుపడింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్పై భారీగా క్షిపణులు ప్రయోగించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపైనా క్షిపణులు, డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఆయా దేశాల్లో ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలను, పెట్రోకెమికల్ కేంద్రాలను ధ్వంసం చేయడం తథ్యమని హెచ్చరించింది. వాటి శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. అక్కడ పనిచేస్తున్న కారి్మకులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. పశ్చిమాసియా తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 108 డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 40 శాతం పెరిగింది. పెట్రో ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న కొద్దీ అమెరికాపై ఒత్తిడి పెరగడం తథ్యమని, తద్వారా యుద్ధం నుంచి అమెరికా సైన్యం నుంచి విరమించుకొనే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్లో రైల్వే స్టేషన్పై దాడి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో రైల్వే స్టేషన్పై ఇరాన్ సైన్యం దాడికి పాల్పడింది. దాంతో దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదు. పౌర మౌలిక సదుపాయాలను నేరుగా టార్గెట్ చేయడం సంచలనాత్మకంగా మారింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దౌత్య కార్యాయాలపైనా ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను సౌదీ అరేబియా సైన్యం కూలి్చవేసింది. ఇక్కడ అమెరికా ఎంబీసీతోపాటు ఇతర దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. రియాద్లో బుధవారం సాయంత్రం భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీసై రెండో రోజు బుధవారం కూడా దాడి జరిగింది. ఇరాక్లోని అమెరికా స్థావరాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లో స్వీడన్ పౌరుడికి ఉరి ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్లోని లారెస్తాన్ కౌంటీలో ఉన్న కోర్టు సముదాయంపై భారీ దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మరణించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటిదాకా 1,300 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్కు గూఢచారిగా పని చేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ఇరాన్లోని కీలక ప్రాంతాల సమాచారాన్ని మొస్సాద్కు చేరవేస్తున్నాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. అతడు స్వీడన్ జాతీయుడని తెలిసింది. తమ పౌరుడికి ఉరిశిక్ష విధించడాన్ని స్వీడన్ విదేశాంగ శాఖ ఖండించింది. లెబనాన్లో హెజ్»ొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. బుధవారం రాజధాని బీరూట్లో అపార్టుమెంట్లపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో పది మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ కార్యకలాపాల కోసం హెజ్»ొల్లా పెద్ద ఎత్తున ధనం నిల్వ చేసుకున్న అపార్ట్మెంట్ను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 5 వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం 5 వేల పౌండ్ల(2,268 కిలోలు) బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ యాంటీ–షిప్ క్రూయిజ్ మిస్సైళ్లు విదేశీ నౌకలకు ముప్పుగా మారాయని, అందుకే శక్తివంతమైన బాంబులు ప్రయోగించినట్లు స్పష్టంచేసింది. ఇరాన్ మంత్రి ఖతీబ్ మృతి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించారు. మంగళవారం రాత్రి దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారంటూ పేర్కొన్నారు. ఖతీబ్ మరణాన్ని ఇరాన్ అధికారిక టీవీ చానల్ సైతం ధ్రువీకరించింది. ఇది దారుణ హత్యాకాండ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సమీపంలో ఇద్దరు మరణించారు. మంగళవారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత అధికారులు అలీ లారిజానీ, ఘోలమ్ రెజా సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. లారిజానీ మృతిపట్ల ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) రగిలిపోతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్పై బహుళ వార్హెడ్లతో కూడిన క్షిపణులు ప్రయోగించింది. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక అక్కడి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన తర్వాత ఇప్పటిదాకా 2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని భారత విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని వేర్వేరు నగరాల్లోని విమానాశ్రయాల నుంచి భారతీయుల తరలింపు కోసం 70 విమానాలు నడుస్తున్నట్లు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి(గల్ఫ్) అసీమ్ ఆర్.మహాజన్ చెప్పారు. యూఏఈ పరిధి నుంచి భారతీయులను రప్పించడంపై యూఏఈ అధ్యక్షుడు షేక్మొహమ్మెద్ బిన్ జయేద్ అల్ నహ్యాల్లో ప్రధాని మోదీ మంగళవారం టెలిఫోన్ సంభాషణ జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ వెల్లడించారు. యుద్ధం మొదలయ్యాక ఇరునేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి.చిక్కుకున్న లక్షల టన్నుల చమురు, ఎల్పీజీ న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా లక్షల టన్నుల మేర ముడిచమురు సహా పలు రకాల సరుకులు భారత్కు రాకుండా పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లో నౌకల్లో చిక్కుకుపోయాయి. ఈ వివరాలను భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా బుధవారం వెల్లడించారు. ‘‘16.7 లక్షల టన్నుల ముడిచమురు, 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, దాదాపు 2 లక్షల టన్నుల ద్రవరూప సహజవాయువు 22 భారతీయ జెండా ఉన్న సరుకు రవాణా నౌకల్లో ఉండిపోయాయి. ఈ నౌకలన్నీ పర్షియన్ గల్ఫ్ నుంచి హార్మూజ్ గుండా భారత్కు రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా ప్రయాణం మొదలుపెట్టలేక గల్ఫ్లోనే ఉండిపోయాయి. 22 నౌకల్లోని 611 మంది భారతీయ నావికులు క్షేమంగానే ఉన్నారు. అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 500 నౌకలు పర్షియన్ గల్ప్లో ఆగిపోయాయి. వీటిల్లో 108 చమురు, 166 చమురు ఉత్పత్తులు, 104 రసాయన ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల నౌకలు, కొన్ని డ్రెడ్జర్లు, ఖాళీ నౌకలు ఉన్నాయి’’అని సిన్హా పేర్కొన్నారు. -
ఉత్తర కొరియా ఎన్నికల్లో 'కిమ్' ప్రభంజనం.. అన్ని సీట్లలో గెలుపు
మార్చి 15న జరిగిన ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో కింగ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 99.93 శాతం ఓట్లతో, పోటీ చేసిన 687 స్థానాల్లోనూ గెలిచి, తిరుగులేని విజయం సాధించింది. కిమ్ పార్టీకి వ్యతిరేకంగా కేవలం 0.07 శాతం ఓట్లు మాత్రమే రావడం చర్చనీయాంశమైంది. గెలుపొందిన సభ్యుల్లో 70 శాతం కొత్త వారు కావడం మరో విశేషం. వీరిలో కిమ్ సోదరి కిమ్ యో-జోంగ్ కూడా ఉన్నారు. కిమ్కు అత్యంత సన్నిహితుడు జో యోంగ్-వోన్కు కీలక పార్లమెంటరీ పదవికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గెలుపు తర్వాత కిమ్ దక్షిణ కొరియాతో సంబంధాలను శత్రుత్వంగా నిర్వచించేలా రాజ్యాంగ సవరణ చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్షం లేకపోవడానికి కారణం- ఉత్తర కొరియాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కిమ్ కనుసన్నల్లోనే నడుస్తుంది.- ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి ఉంటాడు. పోటీ చేసేందుకు అభ్యర్ది కూడా ఉండడు. - ఓటర్లు అభ్యర్థిని తిరస్కరించే అవకాశం ఉన్నా, బహిరంగ ఓటింగ్ విధానం కావడంతో వ్యతిరేక ఓటు వేయడం ప్రమాదకరంగా ఉంటుంది. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు కిమ్ నియంతృత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటాయి. ఇక్కడ చీమ చిట్టుక్కుమన్నా, కిమ్కు తెలిసే జరగాలి. వ్యవస్థలన్నీ కిమ్ చేతుల్లోనే ఉంటాయి. పౌరులు తినే తిండి దగ్గరి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ కిమ్ నియంత్రణలోనే ఉంటాయి. పౌర హక్కులు అనేవి ఉత్తర కొరియాకు వర్తించవు. అంతలా కిమ్ నియంతృత్వం కొనసాగుతుంది. -
వెనిజులా అధ్యక్షురాలి సంచలన నిర్ణయం
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 11 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగా పని చేసిన జనరల్ వ్లాదిమిర్ పడ్రినోను పదవి నుంచి తప్పించింది. అతడి స్థానంలో జనరల్ గుస్తావో గోంజాలెజ్ లోపెజ్ను నియమించింది.2014 నుంచి రక్షణ మంత్రిగా ఉన్న పడ్రినో మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితుడు. ఈ మార్పు వెనిజులా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. మాజీ అధ్యక్షుడు మదురో ముద్రను క్రమంగా తొలగించే ప్రయత్నంగా భావించబడుతోంది. రోడ్రిగెస్ ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న సంకేతంగా పరిగణించబడుతోంది.పడ్రినోపై అవినీతి ఆరోపణలతో పాటు, నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అయినా రోడ్రిగెస్ పడ్రినోను దేశానికి విశ్వాసపాత్రుడైన సైనికుడిగా అభివర్ణిస్తూ, త్వరలో కొత్త బాధ్యతలు అప్పగిస్తామని తెలపడం కొసమెరుపు. కొత్త రక్షణ మంత్రి గుస్తావో గోంజాలెజ్ లోపెజ్ విషయానికొస్తే.. ఇతను గతంలో వెనిజులా ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. ఇటీవల అతను ప్రభుత్వ చమురు సంస్థ PDVSAలో కీలక పాత్ర పోషించారు. ఇతనిపై కూడా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది జనవరి 3న అమెరికా సైనిక దాడి చేసి మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్ను చెరలోకి తీసుకుంది. ఆతర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగెస్ను నియమించింది. తదనంతరం మదురో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఒక్కొరిగా రాజీనామాలు చేశారు. రోడ్రిగెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వందలాది రాజకీయ ఖైదీలను విడుదల చేసి, సాధారణ అమ్నెస్టీ చట్టాన్ని ఆమోదించింది.ట్రంప్ ఒత్తిడిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజులా చమురు మరియు గనుల రంగాన్ని విదేశీ పెట్టుబడులకు తెరవాలని ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా ఇప్పటికే వెనిజులా చమురు విక్రయాలపై నియంత్రణ సాధించిందని ట్రంప్ ప్రకటించారు. కారాకాస్లోని అమెరికా రాయబార కార్యాలయం ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఇటీవలే మళ్లీ ప్రారంభమైంది. -
ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు
ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం పెరిగి 108.66 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) 2.5 శాతం పెరిగి 98.65 డాలర్లకు చేరింది. బ్రెంట్–WTI మధ్య ధర తేడా 2019 తర్వాత ఇదే అత్యధికం. కాగా, బుషెహర్ ప్రావిన్స్ తీరంలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ఫీల్డ్ "సౌత్ పార్స్" సదుపాయాలు దాడికి గురయ్యాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్.. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని ఆయిల్–గ్యాస్ సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది.హెచ్చరించిన విధంగానే ఇరాన్ ఖతార్లోని రాస్ లాఫాన్ గ్యాస్ ఫెసిలిటీపై బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు మంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చమురు, సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. రోజుకు 7–10 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి తగ్గినట్లు అంచనా. ఇది ప్రపంచ డిమాండ్లో 7–10 శాతం తగ్గుదల. చమురు–గ్యాస్ ధరలు ఎక్కువ కాలం ఇలాగే పెరుగుతూ పోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికాఅమెరికా ప్రభుత్వం ఇంధన సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు జోన్స్ యాక్ట్ నిబంధనలను 60 రోజుల పాటు సడలించింది. అలాగే, వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ PDVSAతో కొన్ని లావాదేవీలకు అనుమతి ఇచ్చింది. -
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ విరమణ
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా యుద్ధాన్ని ఐదు రోజుల పాటు నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. పాకిస్తాన్ సమాచార మంత్రి అట్టౌల్లా తరార్ ప్రకటన ప్రకారం.. ఈ విరమణ మార్చి 19వ తేదీ అర్థరాత్రి నుండి మార్చి 24వ తేదీ అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో ఏదైనా సరిహద్దు దాడి, డ్రోన్ దాడి లేదా ఉగ్రవాద ఘటన జరిగితే ఆపరేషన్లు వెంటనే మరింత తీవ్రతతో పునఃప్రారంభమవుతాయి. ఈ నిర్ణయం సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు తీసుకున్నది. కాగా, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్లు దురాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యంపై ఆపరేషన్ ప్రారంభించారు. -
హెచ్చరించిన విధంగానే ఇరాన్ దాడి
గంటల వ్యవధిలో ముగ్గురు కీలక నేతలను కోల్పోయిన ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. వార్నింగ్ ఇచ్చిన విధంగానే గల్ఫ్ దేశాలపై దాడులను ప్రారంభించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్పై నాలుగు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అయితే వీటిని సౌదీ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుంది.సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. రియాద్ వైపు ప్రయోగించబడిన నాలుగు బాలిస్టిక్ మిసైళ్లు విజయవంతంగా అడ్డుకోబడ్డాయి.మిసైళ్లను అడ్డుకునే ప్రక్రియలో ఏర్పడిన శకలాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అయితే ఇందులో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేసింది. కాగా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, ఆ దేశ కీలక సైనికాధికారి అలీ లారిజానీ, ఐఆర్జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు బుషేర్ ఫ్రావిన్స్లోని ఇరాన్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పర్స్పై కూడా దాడులు చేశాయి. వీటికి ప్రతీకారంగానే ఇరాన్ గల్ఫ్ దేశాల ఇంధన స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. -
త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు: ఖమేనీ
తమ కీలక సైనికాధికారి లారిజానీ హత్యపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది, లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలు లారిజానీ హత్యను ధృవీకరించిన ఒక రోజు తర్వాత మొజ్తబా ఖమేనీ ఓ ప్రజా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. లారిజానీ మరణ వార్త చాలా బాధించింది. అతను విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక స్థానమున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని హత్య చేసి ఇజ్రాయెల్, అమెరికా చాలా పెద్ద తప్పు చేశాయి. లారిజానీ హత్య ఇస్లాం వ్యతిరేకుల ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది. లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.కాగా, అలీ లారిజానీ దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడి భుజం లాంటి వ్యక్తి. కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లారిజానీ సహా ఐఆర్జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ మృతి చెందారు. వీరిద్దరి మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వీరిని హతమార్చాక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లారిజానీ, సులేమానీని గ్యాంగ్స్టర్ (అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. -
మేము ఇలా చేశామనుకో.. అంటూ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో తమకు మద్దతు ఇవ్వడంలో వెనుకంజ వేసిన మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చేస్తే లేదా అంతం చేస్తే ఏమవుతుందో అని తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. అమెరికా సైనికంగా ఇరాన్పై దాడి చేసి, అక్కడి ప్రస్తుత పాలనా వ్యవస్థనే పూర్తిగా తొలగిస్తే పరిస్థితి ఎలా మారుతుందో అన్న భావనను వ్యక్తం చేస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.హార్మూజ్ జలసంధిపై మిత్రదేశాలు స్పందించడం లేదని ట్రంప్ అన్నారు. హార్మూజ్ జలసంధిని “సో కాల్డ్ స్ట్రైట్” అని పేర్కొన్నారు. ఆ మార్గంపై అసలు అమెరికా ఆధారపడదని, వేరే దేశాలే ఆధారపడతాయని చెప్పారు.ఇరాన్ను ఉగ్రవాద దేశం అంటూ ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మిగిలిన వాటిని కూడా తాము పూర్తిగా ధ్వంసం చేస్తే ఏమవుతుందోనని తాను ఆలోచిస్తున్నాని చెప్పారు. అలాగే, హార్మూజ్ జలసంధి మార్గంపై ఆధారపడే దేశాలు దాన్ని రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఆ జలసంధి బాధ్యతను అమెరికాకు ఇవ్వకుండా ఆ పని చేయాలని మిత్రదేశాలకు చెప్పారు. అమెరికా ఇలా వెనక్కి తగ్గితే, ప్రస్తుతం సాయం చేయని మిత్రదేశాలు కూడా వెంటనే కదిలి హార్మూజ్ను కాపాడుకునే బాధ్యతల్లో పాల్గొనాల్సి వస్తుందని ట్రంప్ అంటున్నారు.కాగా, పశ్చిమాసియా ఘర్షణ మధ్య ఇరాన్పై అమెరికా సైనిక చర్యల్లో కలిసి పాల్గొనడానికి కొన్ని నాటో దేశాలు నిరాకరించాయి. నాటో దేశాలపై కూడా ట్రంప్ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. “మా నాటో మిత్రదేశాలు ఇరాన్పై సైనిక చర్యల్లో పాల్గొనాలనుకోవడం లేదని అమెరికాకు తెలియజేశాయి. అయినా, ఇరాన్కు అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని దాదాపు ప్రతి దేశం అంగీకరించింది” అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. -
ఇరాన్కు భారీ షాక్ : రెండు రోజుల్లో ముగ్గురు
గత 19 రోజులుగా భీకరంగా సాగుతున్న ఇరాన్ యుద్ధంలో ఇరాన్కు వరుసగా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. తాజా దాడుల్లో ఇరాన్ గూఢచార మంత్రిఇ స్మాయిల్ ఖతీబ్ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. అయితే, ఖతీబ్ మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు.అదనపు అనుమతులు తీసుకోకుండా, ఏఇతర సీనియర్ ఇరాన్ అధికారినైనా చంపేందుకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కాట్జ్ ప్రకటించారు. రెండు రోజుల్లో ఇరాన్ ముగ్గురు కీలక వ్యక్తులను కోల్పోయింది. మంగళవారం ఇరాన్ భద్రతా దళాల అధిపతి అలీ లారిజానీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్వచ్ఛంద బసిజ్ దళాధిపతి ఘోలమ్రెజా సోలేమానీని హత మార్చింది. ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుకాగా ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన స్థానంలో, ఆయన కుమారుడు 56 ఏళ్ల మోజ్తాబా ఖమేనీ అత్యున్నత లీడర్గా ఎంపికయ్యారు. మరోవైపు ఈ దాడిలో మోజ్తబా కూడా తృటిలో ప్రమాదంనుంచి తప్పించుకున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. (బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!) -
నేపాల్లో కుప్పకూలిన హెలికాప్టర్ , వీడియో వైరల్
ఖాట్మాండు : తూర్పు నేపాల్లోని ఖోటాంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్టు తెలుస్తోంది. బలమైన గాలులు లేదా ల్యాండింగ్ సమయంలో పేరుకుపోయిన దుమ్ము కారణంగా ఇది కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కొండ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, అది అకస్మాత్తుగా బోల్తా పడింది. పల్టీలు కొడుతూ చివరకు దాని తోక భాగం ఒక పర్వత గోడను ఢీకొట్టడంతో హెలికాప్టర్ ముక్కలై పోయింది. ఎయిర్ డైనాస్టీకి చెందిన ఈ హెలికాప్టర్, ఖాఠ్మండు నుండి ఐదుగురు ప్రయాణికులతో కలిసి ఒక మృతదేహాన్ని తరలిస్తుండగా పొలంలో కూలి పోయిందని అధికారులు ప్రకటించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగ లేదనీ, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఖోటాంగ్ జిల్లా ముఖ్య అధికారి రేఖా కండెల్ తెలిపారు.#WATCH : A helicopter crashed into farmland in Khotang district, Nepal, on Wednesday while transporting a body from Kathmandu to a nearby village.#Nepal #HelicopterCrash #Khotang #AviationNews #Kathmandu #AirIncident pic.twitter.com/PytLvBRj93— upuknews (@upuknews1) March 18, 2026 హెలికాప్టర్లోని ఒక ప్రయాణికుడు గాయపడగా, పైలట్ సబిన్ థాపా, ఇతర ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని హెలికాప్టర్ కంపెనీ వెల్లడించింది. గాయపడిన వ్యక్తికి సాయం చేసేందుకు అదనపు హెలికాప్టర్ను పంపించామని తెలిపింది. -
బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!
ప్రపంచంలో అందమైన మహిళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ బాహ్య సౌందర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రపంచంలో, బిడ్డలకోసం ఎంతో అవమానాన్ని నెత్తిన వేసుకున్న మహిళ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. కుటుంబ పోషణ కోసం 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ' అన్న బిరుదును స్వీకరించిన సాహసి పేరు మేరీ ఆన్ బెవాన్. తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టి ఈ తల్లి గొప్ప పోరాటమే చేసింది. ఇంతకీ ఎవరా మాతృమూర్తి? ఎందుకు వికారమైన మహిళగా మారింది తెలుసుకుందాం పదండి..!1874లో లండన్లోని న్యూహామ్లో పేద కుటుంబంలో జన్మించింది మేరీ ఆన్ బెవాన్, నర్సింగ్ కోర్స్ చదివి 1894లో నర్సుగా మారింది. ఆ తరువాత థామస్ బెవాన్ అనే వ్యక్తిని ప్రేమిం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో 32 ఏళ్ల మేరీ జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వైద్యులకు పెద్దగా తెలియని అక్రోమెగాలీ(Acromegaly) అనే అరుదైన వ్యాధి మేరీకి సోకింది. దీంతో కుటుంబమంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. అంతుచిక్కని వ్యాధి - వికృత రూపంమేరీకి అక్రోమెగాలీ సోకడంతో, శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. ముఖంలోని ఎముకలు, కండరాలు ఉబ్బి, సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారాయి. చేతులు, కాళ్లు పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి. దవడ కిందికి సాగిపోయి ముఖం ఆకారం మారిపోయింది ముక్కు వెడల్పుగా మారింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి 'అందమైన' రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా పోయింది.శరీరంలో గ్రోత్ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల వచ్చే సమస్య. ఇది ఇలా కొనసాగుతుండగానే దురదృష్టం మరోసారి వెంటాడింది. 1914లొ ఆమె భర్త థామస్ మరణించాడు. ఫలితంగా నలుగురు పిల్లలతో మేరీ ఒంటరిదైపోయింది.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుపిల్లల కోసం తల్లి మనసు ఆరాటంరూపం మారిపోవడంతో ఆమెకు ఎక్కడా పని దొరకలేదు. ప్రజలు ఆమెను చూసి నవ్వుతుంటే, మరికొందరు భయపడేవారు. పిల్లలకు తిండి పెట్టడమే కష్టమైన తరుణంలో, 1920వ దశకంలో "ప్రపంచంలోనే అత్యంత వికృతమైన మహిళ కావాలి - భారీ వేతనం ఇవ్వబడును." అనే ఒక ప్రకటన చూసింది: కుటుంబానికి సహాయపడే బహుమతి డబ్బును గెలుచుకోవాలనే ఆశతో పోటీకి దిగింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె ఆ పోటీలో గెలిచి 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ'గా పేరు పొందింది. ఎన్నో ఫ్రీక్ షో లలో చేరింది. వేదికపై నిలబడితే జనం ఎగతాళి చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రసిద్ధ షోమాన్ పి.టి. బర్నమ్ పిలుపు మేరకు ఆమె అమెరికాకు వెళ్లి కోనీ ఐలాండ్లో ప్రదర్శనలు ఇచ్చింది.అలా త్వరలోనే సర్కస్లో స్పెషల్ ఎట్రాక్షన్గా మారిపోయింది. 1933లో చనిపోయే వరకు కోనీ ఐలాండ్లోని డ్రీమ్ల్యాండ్ సైడ్షోలో 'ఫ్రీక్ షో' ప్రదర్శకురాలిగా పనిచేసింది.మేరీ ఆన్ బెవాన్ 1933, డిసెంబరు 26న లో తన 59వ ఏట కన్నుమూసింది. తన రూపంతో జీవితాంతం ఎన్నో అవమానాల్ని మోసింది. కానీ ఆ అవమానాల నుండి వచ్చిన డబ్బుతోనే తన బిడ్డల కడుపు నింపింది. వారిని గౌరవప్రదంగా పెంచి పెద్ద చేసిన విద్యావంతుల్ని చేసింది.తన పిల్లల భవిష్యత్తు కోసం, బిడ్డలుఆకలితో అలమటించకూడదని మేరీ పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలిచి అవమానకరమైన కిరీటాన్ని జీవితాంతం మోసింది. కానీ అది ఒక తల్లిగా ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో ఊహించగలమా? కానీ వాటన్నింటినీ అధిగమించి పిల్లల్నిప్రయోజకుల్ని చేయడమే కాదు, అక్రోమెగలీతో బాధపడే చాలా మందికి మేరీ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది. లోకం దృష్టిలో ఆమె కేవలం ఒక "వికృత మనిషి" కానీ పిల్లల దృష్టిలో తమను ప్రాణప్రదంగా కాపాడుకున్న "అమ్మ". చరిత్రలో "అత్యంత అందమైన మనసున్న తల్లి"గా నిలిచిపోతుంది. ఏమంటారు? -
మరో ఐదు అగ్రదేశాల్లో యుద్ధం.. భారీగా ఎత్తున సైన్యం మోహరింపు?
బీజింగ్: ప్రపంచంలో యుద్ధాల కాలం కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ వరుస దాడులతో పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తున్న ఈ సమయంలో.. ఆ యుద్ధం ఆసియా దేశాల వైపు మళ్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. తైవాన్పై చైనా, జపాన్, దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్లోని ఘర్షణను పరిష్కరించేందుకు అమెరికాపై పరోక్ష ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా, లేక నిజమైన దాడులకు ఈ దేశాలు సిద్ధమవుతున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.చైనా ఆకాంక్షల నేపథ్యంలో తైవాన్పై దాడి చేయడానికి సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే చైనా.. తైవాన్ను చుట్టుముట్టింది. ఇప్పటివరకు 26 చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలు తైవాన్ చుట్టూ మోహరించాయి. తైవాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం ఇంత భారీ స్థాయిలో మోహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో ఆసియా దేశాల్లో ఆందోళనలు,భయాలు మొదలయ్యాయి. -
‘నేను బ్రతికే ఉన్నాను మైక్’ : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
జెరూసలేం: ఇరాన్ జరిపిన దాడిలో తాను మరణించాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఖండిస్తూ వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్యం, ఉనికి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో ఆయన అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నారు. ‘నేను బతికే ఉన్నాను మైక్’ అంటూ నెతన్యాహూ చమత్కరించారు. హకబీ కూడా సరదాగా స్పందిస్తూ, ‘మీ ఆరోగ్యం గురించి డొనాల్డ్ ట్రంప్ నన్ను పంపించారు. మీ క్షేమసమాచారం తెలుసుకోమన్నారు’ అని వ్యాఖ్యానించారు.నెతన్యాహూ స్వయంగా వీడియో విడుదల చేసి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. హకబీతో సరదా సంభాషణలో ఆయన ‘అవును, మైక్. నేను బతికే ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.వీడియోలో సరదా మాటల మధ్య ఇరాన్ నాయకత్వంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ రోజు, నేను పంచ్ కార్డ్పై ఉన్న రెండు పేర్లను చెరిపేశాను అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఈ వీడియోతో నెతన్యాహూ మరణం పుకార్లకు ముగింపు పలికారు. అయితే సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న అసత్య కథనాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.నెతన్యాహూ మరణంపై సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం ఆగలేదు. కేఫ్లో కాఫీ తాగుతున్న వీడియోలు, ప్రజలతో మాట్లాడుతున్న క్లిప్లు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న దృశ్యాలు ‘పాతవి. ఇదంతా ఏఐ సృష్టి ’అంటూ ప్రచారం చేస్తున్నారు. ‘ఆయన చేతిలో ఐదు వేళ్లు కాదు, ఆరు వేళ్లు ఉన్నాయి’ అంటూ వింత వాదనలు కూడా వైరల్ అవుతున్నాయి. Crossing names off the list is good - doing it shoulder to shoulder with our American friends is even better.Good to see Ambassador @GovMikeHuckabee. Always a pleasure.🇮🇱🇺🇸 pic.twitter.com/FZrZN03IZI— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 17, 2026 -
డాలర్ ఆధిపత్యానికి గండి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు అమెరికా డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసురుతున్నాయి.డీ-డాలరైజేషన్ వేగవంతం?హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచంలోని 20% పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీ ‘యువాన్’లో జరపాలని యోచిస్తున్నాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా చమురు లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఇప్పుడు యువాన్ వైపు మొగ్గు చూపడం వల్ల డాలర్కు ఉన్న గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే సురక్షితమైన కరెన్సీగా డాలర్ను కాకుండా ప్రత్యామ్నాయాల వైపు దేశాలు చూడటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.భారత రూపాయిపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ కరెన్సీ మార్పుల ప్రభావం భారత రూపాయిపై ద్వంద్వ ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా ఆధిపత్యం పెరగడంఅంతర్జాతీయ చమురు మార్కెట్లో యువాన్ పట్టు సాధిస్తే అది ఆసియాలో చైనా ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది. భారత్కు చైనాతో సరిహద్దు వివాదాలు, వాణిజ్య పోటీ ఉన్న నేపథ్యంలో మన పొరుగు దేశం కరెన్సీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారడం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లావేదేవీలు సర్వసాధారణం. ఒకవేళ యువాన్ వాడకం పెరిగితే భారత్ తన చమురు దిగుమతుల కోసం యువాన్ను భారీగా కొనాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో యువాన్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దానికి సాపేక్షంగా తగ్గే ప్రమాదం ఉంది. దాంతో మన విదేశీ మారక నిల్వలలో డాలర్ల కంటే యువాన్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర ప్రభావిత అంశాల గురించి కింద చూద్దాం.ఇదీ చదవండి: ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం! -
ఇజ్రాయెల్ టు జపాన్.. అంతటా ఉగాది పచ్చడి క్రేజ్
ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘ఉగాది పచ్చడి’. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు.. ఇలా ఆరు రుచుల సమ్మేళనంతో జీవిత పాఠాన్ని నేర్పే ఈ పచ్చడి మన తెలుగు వారికే ప్రత్యేకం అనుకుంటాం. అయితే ఈ ఆచారం కేవలం మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ‘జీవిత సారాన్ని’ తినిపించే సంప్రదాయాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? అవేంటో ఒకసారి చూద్దాం!ఇజ్రాయెల్ ‘సెడర్ ప్లేట్’: చేదు జ్ఞాపకంయూదుల ‘పాసోవర్’ పండుగలో వడ్డించే ‘సెడర్ ప్లేట్’ మన ఉగాది పచ్చడికి గట్టి పోటీ ఇస్తుంది. ఇందులో ‘మారోర్’ అనే చేదు ఆకును తింటారు. ఇది వారి పూర్వీకులు పడ్డ కష్టాలను గుర్తుచేస్తుంది. అదే ప్లేట్లో ‘చరోసెట్’ అనే పండ్లు, గింజల తీపి మిశ్రమం ఉంటుంది. అంటే కష్టం (చేదు) తర్వాత సుఖం (తీపి) వస్తుందని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది మన వేపపువ్వు, బెల్లం కాంబినేషన్ మాదిరిగానే ఉందనుకుంటున్నారా?జపాన్ 'ఓసేచి': బాక్సుల్లో భవిష్యత్తుజపనీయులు కొత్త సంవత్సరంలో ‘ఓసేచి ర్యోరి’ అనే ప్రత్యేక వంటకాల బాక్సును పంచుకుంటారు. ఇందులో ఒక్కో పదార్థానికి ఒక్కో అర్థం ఉంటుంది. నల్ల సోయా చిక్కుళ్లు తింటే ఆరోగ్యం, చేప గుడ్లు తింటే సంతాన ప్రాప్తి అని వారి నమ్మకం. మన ఉగాది పచ్చడిలో మామిడి వగరు లాగే, వారు కూడా ప్రకృతి ఇచ్చే ప్రతి పదార్థాన్ని ఒక ఆశీర్వాదంగా జపనీయులు భావిస్తారు.ఇరాన్ 'హఫ్త్-సీన్': ఏడు వస్తువులు.. ఏడు పాఠాలు!పర్షియన్ కొత్త సంవత్సరం ‘నౌరూజ్’ సమయంలో ఇరానీయులు ‘హఫ్త్-సీన్’ అనే టేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ‘ఎస్’ అక్షరంతో మొదలయ్యే ఏడు పదార్థాలు ఉంటాయి. వెల్లుల్లి ఆరోగ్యానికి, వినెగర్ సహనానికి ప్రతీక అని చెబుతారు. మన పచ్చడిలో చింతపండు పులుపు ఎలాగో, అక్కడ వినెగర్ అలా అన్నమాట. ఈ సంప్రదాయం వెనుక ఉన్న లోతైన అర్థం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.చైనా ‘లాబా గంజి’: ఎనిమిది రకాల అదృష్టంచైనీయులు ‘లాబా’ పండుగ నాడు ఎనిమిది రకాల ధాన్యాలు, పండ్లతో చేసిన గంజిని తాగుతారు. ఇది కేవలం ఆకలి తీర్చడానికే కాదు, రాబోయే ఏడాది అంతా అదృష్టం కలిసిరావాలని చేసే ఒక ప్రార్థన. మన ఉగాది పచ్చడిలో కొత్త బెల్లం ఎలాగైతే కొత్త ఆశలను చిగురింపజేస్తుందో, ఈ లాబా గంజి చైనీయులకు అంతటి పవిత్రమైనది.మహారాష్ట్ర 'పంఛరస': అదే సంప్రదాయంమన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో గుడి పడ్వా రోజున ‘పంఛరస’ పేరుతో వేపపువ్వు, బెల్లం, ఉప్పు, జీలకర్ర కలిపిన లడ్డూలను తింటారు. పేరు వేరైనా పరమార్థం ఒక్కటే. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదు, అన్ని రుచులను సమానంగా స్వీకరించాలని ఈ వంటకం మనకు గుర్తు చేస్తుంది. ఈ పోలికలను చూస్తుంటే ‘వసుదైక కుటుంబం’ అనే భావన మనలో కలుగుతుంది.రుచులు వేరైనా భావం ఒక్కటేమనిషి ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా జీవితంలోని ఒడిదుడుకులను ఆహారం ద్వారా అర్థం చేసుకోవడం ఒక అందమైన సంప్రదాయం. ఉగాది పచ్చడి అయినా, పాసోవర్ చేదు ఆకులైనా.. కష్టాన్ని భరిస్తూ సుఖాన్ని వెతుక్కోవడమే అసలైన విజయం. అందుకే ఈ ఏడాది ఉగాది పచ్చడి తీసుకునేటప్పడు దానిలోని ‘ప్రపంచవ్యాప్త తత్వాన్ని’ గుర్తుచేసుకోండి. ఇది కూడా చదవండి: విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం -
హార్మూజ్ వద్ద అమెరికా భయానక దాడులు.. ఇరాన్కు భారీ నష్టం?
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి తరుణంలో హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా ఫుల్ ఫోకస్ పెట్టింది. జలసంధిని తిరిగి తెరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ కీలక జలమార్గం సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది.అమెరికా సైన్యం తాజాగా హార్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది. జలసంధి సమీపంలోని ఇరాన్ తీరప్రాంతంలో పటిష్టంగా ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై పలు 5,000-పౌండ్ల డీప్ పెనెట్రేటర్ బాంబులను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా పరిణమించాయి అని చెప్పుకొచ్చింది.Hours ago, U.S. forces successfully employed multiple 5,000-pound deep penetrator munitions on hardened Iranian missile sites along Iran’s coastline near the Strait of Hormuz. The Iranian anti-ship cruise missiles in these sites posed a risk to international shipping in the… pic.twitter.com/hgCSFH0cqO— U.S. Central Command (@CENTCOM) March 17, 2026అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై చేస్తున్న యుద్ధానికి ప్రతీకారంగా, ప్రపంచ చమురులో ఐదో వంతు ప్రవహించే హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఈ బాంబు దాడి జరిగింది. ఈ దిగ్బంధనం సముద్ర రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, జలసంధిపై ఇరాన్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది. యుద్ధంలో పాల్గొనని దేశాలకు చమురు సరఫరా చేసే నౌకలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది.శక్తివంతమైన బాంబు..2022లో ఎయిర్ ఫోర్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, బంకర్ బస్టర్ అని పిలవబడే ఈ బాంబుల ఖరీదు సుమారు $288,000. అయినప్పటికీ, గత సంవత్సరం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వేసిన 30,000 పౌండ్ల (13,600 కిలోల) బాంబుల కంటే ఇవి తక్కువ శక్తివంతమైనవి. ఇవి సాధారణ బాంబులతో ధ్వంసం చేయలేని భూగర్భ బంకర్లు, కాంక్రీట్ కట్టడాలు వంటి గట్టి నిర్మాణాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.🇺🇸🇮🇷The U.S. unleashed the Massive Ordnance Penetrator, the 30,000-pound bomb.A.K.A. the bunker buster.This thing is engineered to slam through up to 200 feet of the toughest reinforced concrete before turning "buried and safe" into a myth…#iran #usa #dubai https://t.co/wtMI4obSkg pic.twitter.com/loQFtjDCIr— PROXY (@PROXY0b) March 14, 2026బాంబుల లక్షణాలుబరువు: సుమారు 2,267 కిలోలు (5,000 పౌండ్లు).రకం: బంకర్ బస్టర్, అంటే భూగర్భంలో ఉన్న గట్టి నిర్మాణాలను ఛేదించే బాంబు.ఉపయోగం: క్షిపణి సైలోలు, కమాండ్ సెంటర్లు, బలమైన రక్షణ గల స్థావరాలను ధ్వంసం చేయడం.వాహక విమానాలు: భారీ బాంబర్లు లేదా ప్రత్యేకంగా సిద్ధం చేసిన యుద్ధ విమానాలు.ట్రంప్ హెచ్చరిక..మరోవైపు..నాటో మద్దతు లేకపోయినా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే భద్రతలోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్తితుల్లో కూడా ఎక్కువ సమయం పట్టదు అని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎవరి సాయం అవసరం లేదని, ఒంటరిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హార్మూజ్ భద్రతపై అమెరికా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దాడులు తీవ్రతరం అయ్యాయని ట్రంప్ వెల్లడించారు. పశ్చిమాసియా దేశాలు.. ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. ఈ సహకారం భద్రతా చర్యలకు కీలకమని తెలిపారు. అమెరికా సైన్యం రంగం ప్రవేశం చేస్తే వియత్నాం తరహా యుద్ధం జరుగుతుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి చేసిన హెచ్చరికలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. తనకు ఎలాంటి భయం లేదని, దేనికీ కూడా భయపడేది లేదని స్పష్టం చేశారు -
టార్గెట్ తప్పలేదు.. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి హతం
మరింత భీకరంగా పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు బుధవారం నాటికి 19వ రోజుకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ఒత్తిడి పెరుగుతూనే ఉంది. అందుకు తాజా పరిణామాలు ఈ ఉద్రిక్తతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితులు పశ్చిమాసియా దేశాల భద్రతా సమీకరణాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి -
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 23 మంది మృతి
మైదుగురి: నైజీరియాలోని ఈశాన్య నగరం మైదుగురి సోమవారం రాత్రి ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ ఘటనల్లో కనీసం 23 మంది చనిపోగా, మరో 108 మంది గాయాలపాలయ్యారు. బోర్నో రాష్ట్ర రాజధాని అయిన మైదుగురిలోని బోధనాస్పత్రి ప్రధాన ద్వారం వద్ద రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్, వ్యాపార కూడలి అయిన పోస్టాఫీస్ వద్ద వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ మూడు ఘటనలను ఆత్మాహుతి దాడులుగా అనుమానిస్తున్నట్లు బోర్నో పోలీసు విభాగం ప్రతినిధి కెన్నెత్ తెలిపారు.వీటికి బాధ్యత వహిస్తున్నట్లు ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే, జిహాదీ గ్రూపు బోకో హరామ్పైనే అనుమానాలున్నాయి. మైదుగురి నగర శివార్లలో తీవ్రవాదుల దాడులను సైన్యం తిప్పికొట్టిన 24 గంటల వ్యవధిలోనే ఆత్మాహుతి దాడులు చోటుచేసుకోవడంపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో షరియా నిబంధనలను అమలు చేయాలంటూ ఈ గ్రూపు 2009 నుంచి హింసాత్మక ఘటనలకు దిగుతోంది. ఐఎస్ తదితర గ్రూపులను కలుపుకుని, వేలాది మంది సాయుధులు కలిగిన బోకో హరామ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇటీవలి కాలంలో ఈ గ్రూపు సైనిక స్థావరాలపై దాడులు తీవ్రతరం చేసింది. పలువురు ఉన్నతాధికారులను, సైనికులను చంపడంతోపాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని లూటీ చేసింది. -
ఇరాన్-రష్యా రెండూ ఒకటే.. 'ద్వేష సోదరులు': జెలెన్స్కీ
ఇరాన్, రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ యుద్ధం వల్ల కలిగే ప్రమాదాలపై లండన్లోని వెస్ట్ మినిస్టర్లో మాట్లాడుతూ.. ఇరాన్-రష్యా ప్రభుత్వాలను ద్వేషంలో సోదరులుగా అభివర్ణించారు. ఇరాన్ తయారు చేసిన షాహెడ్ ‘కామికాజే’ డ్రోన్లు రష్యాకు విక్రయించబడుతున్నాయని, అవి ఉక్రెయిన్పై దాడుల్లో ఉపయోగించబడుతున్నాయని వివరించారు. రష్యా చమురుపై ఆంక్షలను సడలించడం ప్రమాదకరమని, మాస్కోపై ఒత్తిడి కొనసాగించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. జెలెన్స్కీ తన ప్రసంగంలో మధ్యప్రాచ్య యుద్ధాన్ని ఉక్రెయిన్లో జరుగుతున్న దీర్ఘకాలిక యుద్ధంతో అనుసంధానిస్తూ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఆధునిక యుద్ధంలో పయనీకులుగా మారిందని, తమ అనుభవాన్ని మిత్రదేశాలతో పంచుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ చౌకగా తయారయ్యే ఇంటర్సెప్టర్ డ్రోన్లను ఉపయోగించి రష్యా దాడులను ఎదుర్కొంటోందని తెలిపారు.ప్రస్తుతం 201 మంది ఉక్రెయిన్ సైనిక నిపుణులు మధ్యప్రాచ్యంలో ఉన్నారని, మరో 44 మంది అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరంతా ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొనే విధానాలను మిత్రదేశాలకు బోధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, రక్షణ మంత్రి జాన్ హీలీ, ప్రతిపక్ష నాయకులు, 60 మంది ఎంపీలు, లార్డులు పాల్గొన్నారు. -
యుద్ధనౌకలను పంపబోం
వాషింగ్టన్: అగ్రరాజ్యం పిలుపిస్తే అందరూ కట్టకట్టుకుని వస్తారని కలలుగన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భంగపాటు ఎదురైంది. హార్మూజ్ జలసంధి గుండా నౌకలు వెళ్తే తగలబెడతామని హెచ్చరిస్తున్న ఇరాన్కు మనందరి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలతో బదులివ్వాలంటూ నాటోలోని సభ్యదేశాలు, ఇతర మిత్రదేశాలకు పిలుపునిచ్చిన ట్రంప్కు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. పైగా చైనా షరతులు విధించి ట్రంప్కు మరింత కోపం తెప్పించింది. యుద్ధంలో భాగస్వాములు కాబోమంటూ మిత్రదేశాలు ముఖంచాటేయడంతో ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. అసలేం జరిగింది? గట్టున కూర్చుని ఇరాన్ చేస్తున్న బెదిరింపులకు భయపడకుండా హార్మూజ్ వద్దకు తక్షణం యుద్ధ నౌకలను పంపాల్సిందిగా చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దీనిపై నాటో దేశాలు, మిత్రదేశాల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీనిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడారు. ‘‘ఇప్పటికిప్పుడు యుద్ధనౌకలు, డ్రోన్లు పంపే ఆలోచనే లేదు. అమెరికా, యురోపియన్ యూనియన్, గల్ఫ్లోని మిత్రదేశాలతో చర్చించాకే బ్రిటన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది’’అని అన్నారు.‘‘అసలు పశ్చిమాసియా యుద్ధంలో నాటోకు ఎలాంటి సంబంధం లేదు. శక్తివంత అమెరికా నేవీ యుద్ధనౌకలు చేయలేని పనిని యురోపియన్ యుద్ధనౌకలు పూర్తిచేయగలవా?’’అని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పోస్టోరియస్ అన్నారు. ‘‘పరిస్థితి కాస్తంత సద్దుమణిగాకే చమురునౌకలకు రక్షణగా మా యుద్ధనౌకలను పంపగలం’’అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ తెగేసి చెప్పారు. జలసంధిలో జలసమాధి కావాలా? ‘‘ఇప్పటికప్పుడు యుద్ధనౌకలను పంపే ఆలోచన మాకు లేదు. పశ్చిమాసియాకు సంబంధించిన యురోపియన్ యూనియన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. హార్మూజ్ జలసంధిని తెరపించడం కోసం మేం జలసమాధి కావాలా? మా దేశాలపై బాంబుదాడులు అవసరమా?’’అని ఐరోపా సమాఖ్య విదేశాంగ విధానాల విభాగ చీఫ్ కాజా కల్లాస్ తెగేసి చెప్పారు. ‘‘ముందుగా ఇరువైపులా సైనిక చర్యలను తక్షణం ఆపేయాలి. దాడుల పర్వానికి తెరదించాలి. ఆ తర్వాతే యుద్ధనౌకలను పంపడంపై ఆలోచిస్తాం.యుద్దం ఇలాగే కొనసాగితే చమురు సంక్షోభం, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం తప్పవు’’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు. ‘‘పార్లమెంట్ ఆమోదం లేకుండా యుద్ధనౌకలను హార్మూజ్కు పంపడం కుదరదు. కొరియన్ల భద్రత, ముడిచమురు రావాణామార్గాల రక్షణే మాకు ముఖ్యం’’అని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహన్గుయీ బాక్ చెప్పారు. ‘‘ఎస్కాట్గా యుద్ధనౌకలను పంపాలని మాకు ఎవరి నుంచీ అభ్యర్థన రాలేదు’’అని జపాన్ నూతన మహిళా ప్రధాని సనాయీ తకైచీ అన్నారు. మార్చి 19వ తేదీన ఆమె వాషింగ్టన్లో ట్రంప్తో భేటీకాబోతున్న వేళ అమెరికా ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరి సాయం అక్కర్లేదు: ట్రంప్ సాయుధ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆగ్రహం మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మంగళవారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఇరాన్ ఉగ్రరాజ్యంపై దాడులకు మాతో కలిసి రాబోమని తాజాగా నాటో సభ్యదేశాలు చావుకబురు చల్లగా చెప్పాయి. నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతి ఏటా వందల బిలియన్ డాలర్లను ధారపోసింది. ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న నాటో సభ్యదేశాలు మేం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాయని భ్రమించా. కానీ వాళ్లు మాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేరు. వాస్తవానికి ఇప్పటికే అమెరికా ఇరాన్ను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది. ఇప్పుడు మాకు నాటో నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదు. గతంలోనూ వాళ్లు మాకు సాయం చేయలేదు. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియాలదే అదే తీరు. మాకు ఎవరి సాయం అక్కర్లేదు’’అని అన్నారు. -
ఖతార్ విమానాల్లో స్వదేశానికి 1,600 మంది
దోహా: ఖతార్ గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ మంగళవారం ఐదు ఖతార్ ఎయిర్ వేస్ విమానాల ద్వారా సుమారు 1,600 మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. రెండు విమానాలు ఢిల్లీ, ముంబై, కొచ్చి, తిరువనంతపురంలకు ఒక్కోటి చొప్పున విమానాలు వెళ్లాయని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది.ఖతార్ ఎయిర్వేస్ పరిమిత సంఖ్యలో, నాన్ షెడ్యూల్డ్ విమాన సర్వీసులను మాత్రమే నడుపు తోందని వివరించింది. బుధవారం భారత్లోని తొమ్మిది గమ్యస్థానాలకు మరిన్ని విమానాలు నడుస్తాయని, సీట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. సల్వా భూ సరిహద్దు దాటి సౌదీ అరేబియా మీదుగా భారత్ చేరుకోవాలనుకునే భారతీయ పౌరులకు తాత్కాలిక సౌదీ ట్రాన్సిట్ వీసాల జారీ కొనసాగుతోందని కూడా తెలిపింది. -
బ్రిటన్లో 'మెనింజైటిస్' వ్యాప్తి.. ఇద్దరు మృతి, హై అలర్ట్
లండన్: బ్రిటన్లోని కాంటర్బరీ ప్రాంతంలో (కెంట్ రాష్ట్రం) మెనింజైటిస్ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి సోకడంతో ఓ పాఠశాల విద్యార్థి సహా ఇద్దరు మరణించినట్లు కెంట్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాధి లక్షణాలు ఉన్న మరో 11 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొంది. వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున కెంట్లో హై అలర్ట్ జారీ చేశారు. యూకే ఆరోగ్య భద్రతా సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మెనింజైటిస్ సోకిన వారిలో 'సెప్టిసీమియా' లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.మెనింజైటిస్ లక్షణాలుమెనింజైటిస్ అనేది మెదడు మరియు వెన్నుపామును కప్పి ఉంచే పొరల వాపు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మెడను తిప్పడంలో ఇబ్బంది, కాంతిని చూడటంలో ఇబ్బంది, శరీరంపై ఎర్రటి మచ్చలు మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.సెప్టిసీమియా లక్షణాలుశరీరంపై మచ్చలు కనిపిస్తే, వాటిని ఒక గాజుతో నొక్కి చూడాలి. గాజులో నుంచి చూసినప్పుడు ఆ మచ్చలు మాయం కాకపోతే, అది సెప్టిసీమియాకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవాలి.యాంటీబయాటిక్స్ కోసం క్యూమెనింజైటిస్ వ్యాప్తి నేపథ్యంలో కెంట్ విశ్వవిద్యాలయంలో వందలాది మంది విద్యార్థులు నివారణ యాంటీబయాటిక్స్ కోసం క్యూ కడుతున్నారు. విద్యార్థులలో వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, ఆరోగ్య శాఖ అధికారులు క్యాంపస్లను సందర్శించి నివారణ చర్యలు చేపడుతున్నారు.ఇలా వ్యాప్తి చెందుతుందిమెనింజైటిస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారికి అది వ్యాపిస్తుంది. బాక్టీరియా వల్ల కలిగే మెనింజైటిస్ గాలి ద్వారా లేదా స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది. మెనింజైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఐసోలేషన్కు వెళ్లాలి. -
ఇరాన్కు ఎదురుదెబ్బ
దుబాయ్: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడిభుజంగా పనిచేసిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీతోపాటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)కు చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ తమ దాడుల్లో మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం వెన్నుముక విరిచేశామని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ సైన్యం సోమవారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్పై విరుచుకుపడింది.అత్యున్నత సైనికాధికారులు నివాసం ఉండే కీలక స్థావరాలపై క్షిపణలు, డ్రోన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో అలీ లారిజానీ, ఘోలమ్రెజా సులేమానీ సహా పలువురు మృతిచెందారు. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఇంకా ధ్రువీకరించలేదు. ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఇరాన్ తమ అగ్రశ్రేణి అధికారులను కోల్పోవడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ సైన్యం వైమానిక దాడులు కొనసాగింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ రెండు క్షిపణుల ప్రయోగించిట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. యూఏఈలోని దుబాయ్పై ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. దాంతో ముందుజాగ్రత్తగా దుబాయ్ గగనతలాన్ని కొద్దిసేపు మూసివేశారు. అబూదాబీపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ మిస్సైల్ను అబూదాబీ సైన్యం కూల్చివేసింది. ఈ శకలాల కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై దాడి గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. పుజైరా తీరంలో నిలిచి ఉన్న చమురు ట్యాంకర్పై తాజాగా డ్రోన్తో దాడికి దిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు విడవడం లేదు. అక్కడ చమురు రవాణాపై ఆంక్షలు కొనసాగించడం తప్ప మరో మార్గం లేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ తేల్చిచెప్పారు. తమ దేశంపైకి రాకెట్లు, క్షిపణులు దూసుకొస్తున్నాయని, తాము ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండిపోవాలా? అని ప్రశ్నించారు.ఇరాన్ మంగళవారం ఉదయం పదుల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించిందని, వాటిని మధ్యలోనే తుత్తునియలు చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. ఖతార్లో భారీ ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణుల దండును విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ రక్షణశాఖ తేల్చిచెప్పింది. అయితే, క్షిపణుల శకలాలు నేలకూలడంతో మంటలు చెలరేగాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపైనా దాడి జరిగింది. నాలుగు డ్రోన్లను ఎంబసీ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. లెబనాన్లోని హెజ్»ొల్లా మిలిటెంట్లు ఉత్తర ఇజ్రాయెల్పై దాడికి దిగారు. పలు డ్రోన్లు ప్రయోగించారు. లెబనాన్లో ఇద్దరు జవాన్లకు గాయాలు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. టెహ్రాన్తోపాటు లెబనాన్ రాజధాని బీరూట్పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. కమాండ్ సెంటర్లు, మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడికి దిగింది. లెబనాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ సేనలు దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్తో ప్రత్యక్షంగా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు లెబనాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, లెబనాన్ సైన్యం అందుకు ఒప్పుకోవడం లేదు. ఖమేనీకి నీడలా లారిజానీ అలీ లారిజానీ ఘనమైన నేపథ్యం ఉంది. ఇరాన్లో ప్రముఖ రాజకీయ కుటుంబంలో జని్మంచారు. పార్లమెంటరీ స్పీకర్గా పనిచేశారు. ఇరాన్ సాంస్కృతిక మంత్రిగా వ్యవహారించార. ప్రజలపై ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రభుత్వానికి విధానపరమైన సలహాదారుగా సేవలందించారు. అణ్వాయుధాల అంశంపై అమెరికాతో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఖమేనీకి సలహాదారుగా నియమితులయ్యారు. అత్యున్నత భద్రతా విభాగమైన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ఎదిగారు. ఖమేనీకి నీడగా నిలిచారు. తత్వశాస్త్రంపై లారిజానీ ఆరు పుస్తకాలు రాశారు.కరడుగట్టిన బసిజ్ మిలీíÙయా ఫోర్స్ చీఫ్ సులేమానీ 1965లో జని్మంచారు. ఇటీవల ఇరాన్లో జరిగిన నిరసన కార్యక్రమాలను ఉక్కుపాదంలో అణచివేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ ప్రజలపై హింసకు పాల్పడిందని, అరెస్టులు చేసిందని ఇజ్రాయెల్ సహా పశి్చమ దేశాలు పేర్కొన్నాయి. బసిజ్ మిలీషియా ఫోర్స్పై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ముద్రవేసింది. సులేమానీ మరణంతో ఆ దళం చాలావరకు బలహీనపడినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిద్దరూ గ్యాంగ్స్టర్ అసిస్టెంట్లులారిజానీ మృతిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపర్చి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లో ఉండాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. అలీ లారిజానీతోపాటు బసిజ్ చీఫ్ సులేమానీని హతమార్చామని ప్రకటించారు. వారిద్దరూ గ్యాంగ్స్టర్(అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లు అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని విమర్శించారు. -
యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేల భారత ప్రధాని నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత వాణిజ్య నౌకాయానంపై ఇద్దరు నాయకులు చర్చించారు.మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్న ప్రకారం.. నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడాను. అతనికి ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరం చర్చించాం. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నావిగేషన్ అవసరమని మేము అంగీకరించాము. యూఏఈపై జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. పశ్చిమాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం కలిసి పని చేస్తాము.కాగా, ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఇది రెండోసారి. మార్చి 2న కూడా మోదీ యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడి దాడులను ఖండించారు. మోదీ ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ అల్-ఖాలెద్ అల్-సబాహ్, ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో కూడా మాట్లాడారు. -
నీలం రంగులోకి మారిపోయిన మనిషి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..!
లండన్: ఇటీవల యూకేలోని డెర్బిషైర్ ప్రాంతంలో ఓ వ్యక్తి రాత్రి పడుకొని, పొద్దునే లేచే సరికి నీలం రంగులోకి మారిపోయాడు. అచ్చం అవతార్ సినిమాలో పాత్రధారుల్లాగా. ఇంతకీ ఏం జరిగిందా అని డాక్టర్లు ఆరా తీయగా, షాకింగ్ విషయం బయటపడింది.అసలేం జరిగిందంటే..?42 ఏళ్ల టామీ లించ్ ఉదయం నిద్రలేచినప్పుడు, తన శరీరం నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే బర్టన్-ఆన్-ట్రెంట్లోని క్వీన్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళాడు. నిమిషాల వ్యవధిలోనే, ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్న టామీని పరీక్షించడానికి సుమారు 10 మంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు.అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగా, ఓ డాక్టర్ రక్తం తీయడానికి టామీ చేతిని ఆల్కహాల్ వైప్తో తుడిచారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ ప్రాంతంలోని నీలం రంగు మాయమైంది. అప్పుడే వైద్యులు ఆ సంఘటన వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు.విషయం తెలిసి నవ్వుకున్నారు..!ఇటీవల టామీకి ఓ స్నేహితుడు నీలం రంగు పరుపు, దుప్పట్లను ఇచ్చాడు. వాటిపై రెండు రాత్రులు పడుకున్న తర్వాత టామీ శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఇలా జరగడానికి ఆ పరుపు, దుప్పట్లకు ఉన్న రంగు శరీరానికి అంటుకోవడమే అని తెలిసి టామీ సహా వైద్యులంతా పక్కున నవ్వుకున్నారు. తొలుత భయపెట్టి, ఆతర్వాత నవ్వించిన ఈ ఘటన సోషల్మీడియాలో వైరలైంది. -
చైనా సాయం కోరిన ట్రంప్
గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా సహా ఏడు దేశాల సైనిక సాయం కోరారు. ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు యుద్ధ నౌకలను పంపాలని విజ్ఞప్తి చేశారు. సాయం అందించేందుకు వెనుకడుగు వేస్తున్న మిత్రదేశాలను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. సాయం చేయని వారిని గుర్తుంచుకుంటామని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.పట్టీపట్టనట్లున్న చైనాట్రంప్ పిలుపు విషయంలో చైనా పట్టీపట్టనట్లు ఉంది. వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే, హర్మూజ్ ప్రాంతంలో సైనిక చర్యలు తక్షణమే నిలిపివేయాలని బీజింగ్ కోరింది. చైనా అధికారిక స్పందన ఆధారంగా ఈ నెల చివర్లో జరగాల్సిన ట్రంప్ చైనా పర్యటన ఉండే అవకాశం ఉంది.ఆచితూచి అడుగులు వేస్తున్న ఐరోపా దేశాలుహర్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ పిలుపుపై ఐరోపా దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అమెరికా అభ్యర్థనపై జాగ్రత్తగా స్పందిస్తున్నాయి. యుద్ధం యొక్క తుది లక్ష్యం ఏమిటో స్పష్టత ఇవ్వాలని జర్మనీ సహా అనేక దేశాలు అమెరికాను కోరాయి. ఈ యుద్ధంలోకి లాగబడటానికి తాము ఆసక్తిగా లేమని యుకే ప్రధాని కియార్ స్టార్మర్ స్పష్టం చేశారు. మరోవైపు రెడ్ సీలో నౌకల రక్షణ కోసం జరుగుతున్న మిషన్ను హర్ముజ్ వరకు విస్తరించే అంశంపై యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తోన్నట్లు తెలుస్తుంది.వెనక్కు తగ్గని ఇరాన్ఇరాన్ మిసైల్ లాంచర్లలో 70 శాతం ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిజ్బుల్లా ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ లెబనాన్లోకి అదనపు భూసేనలను పంపింది. దక్షిణ లెబనాన్లో జరిగిన దాడిలో ముగ్గురు మరణించారని సమాచారం. -
అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవులు
ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని అజ్మాన్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు, ప్రైవేటు ఉద్యోగులకు మూడు రోజుల సెలవుగా పేర్కొంది. మానవ వనరుల విభాగం ప్రకటన ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 22 (ఆదివారం) వరకు కొనసాగుతాయి. వారికి అధికారిక పనులు మార్చి 23 (సోమవారం) తిరిగి ప్రారంభమవుతాయి. ప్రైవేటు ఉద్యోగుల విషయానికొస్తే.. వీరికి సెలవులు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 21 (శనివారం) వరకు ఉంటాయి. వీరు మార్చి 22 (ఆదివారం) తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే యూఏఈ ఫెడరల్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది.సాధారణంగా ఈద్ ఉల్ ఫితర్ ఖచ్చితమైన తేదీ చంద్ర దర్శనం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ చంద్ర దర్శనాన్ని గుర్తించడానికి యూఏఈ చంద్ర దర్శన కమిటీ మార్చి 18న (29వ రోజు) సమావేశం కానుంది. చంద్రుడు కనిపిస్తే, ఈద్ మార్చి 19న (గురువారం) ప్రారంభమవుతుంది. లేకపోతే, మార్చి 20న (శుక్రవారం) జరుపుకుంటారు. -
యూఏఈపై ఇరాన్ మరోసారి దాడి
యూఏఈపై ఇరాన్ మరోసారి (మార్చి 17) దాడికి దిగింది. 10 బాలిస్టిక్ మిసైళ్లు, 45 డ్రోన్లతో అటాక్ చేసింది. అయితే ఈ దాడిని యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఈ విషయాన్ని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దేశ సార్వభౌమత్వం మరియు భద్రతకు ముప్పు కలిగించే ఈ తరహా దాడులను సైన్యం అత్యంత అప్రమత్తతతో ఎదుర్కొంటున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి తమ రక్షణ వ్యవస్థలు 314 బాలిస్టిక్ మిసైళ్లు, 15 క్రూయిజ్ మిసైళ్లు, 1672 డ్రోన్లు నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గర్వంగా పేర్కొంది. కాగా, ఇప్పటివరకు జరిగిన రక్షణ చర్యలలో యూఏఈ ఇద్దరు అధికారుల ప్రాణాలు కోల్పోయింది. అదనంగా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాలస్తీనా దేశాలకు చెందిన ఆరుగురు సాధారణ పౌరులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 157 మంది గాయపడ్డారు. అపశృతిఇరాన్ జరిపిన మిసైల్, డ్రోన్ దాడిని తిప్పికొడుతుండగా అబుదాబిలోని బనియాస్ నివాస ప్రాంతంలో అపశృతి చోటు చేసుకుంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ధ్వంసం చేస్తుండగా శకలాలు కిందపడి, ఓ పాకిస్తానీ జాతీయుడు మృతి చెందినట్లు యూఏఈ వర్గాలు తెలిపాయి. ఘర్షణనలు ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈలో నమోదైన ఎనిమిదవ మరణం ఇది. -
ఎవరి సాయం మాకొద్దు.. ‘నాటో’పై ట్రంప్ సీరియస్
ఇరాన్తో యుద్ధంలో తాము పాలు పంచుకోవాలనుకోవడం లేదని నాటో (NATO) మిత్రదేశాల్లో మెజారిటీ దేశాలు తమకు సమాచారం అందించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ తేల్చి చెప్పారు."మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా మేము చేపట్టిన సైనిక చర్యలో పాలుపంచుకోవడం తమకు ఇష్టం లేదని మెజారిటీ నాటో (NATO) 'మిత్ర దేశాలు చెప్పాయి. వాస్తవానికి మేము చేస్తున్న పనిని దాదాపు ప్రతి దేశం గట్టిగా అంగీకరించింది, అలాగే ఇరాన్ ఏ రూపంలోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని అవి భావిస్తున్నాయి. అయినప్పటికీ అవి వెనకడుగు వేశాయి...వారి చర్య నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే నాటో అనేది ఒక 'వన్ వే స్ట్రీట్' (ఏకపక్ష ప్రయోజనం) అని నేను ఎప్పుడూ భావిస్తుంటాను. ఈ దేశాల రక్షణ కోసం మేము ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాము. మేము వారిని రక్షిస్తాము, కానీ అవసరమైన సమయంలో వారు మా కోసం ఏమీ చేయరు’’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.‘‘మేము ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశాం. వారి నౌకాదళం అంతమైంది. వైమానిక దళం పోయింది, వారి యాంటీ-ఎయిర్క్రాఫ్ట్. రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా, దాదాపు అన్ని స్థాయిలలోని వారి నాయకులు అంతమొందించబడ్డారు. వారు ఇకపై మనల్ని కానీ, మన మధ్యప్రాచ్య మిత్రదేశాలను కానీ, ప్రపంచాన్ని కానీ ఎప్పటికీ భయపెట్టలేరు. మేము అపారమైన సైనిక విజయాన్ని సాధించినందున మాకు ఇకపై నాటో దేశాల సహాయం 'అవసరం' లేదు. అటువంటి కోరికా లేదు. నిజానికి మాకు అది ఎప్పుడూ అవసరం పడలేదు! అదేవిధంగా జపాన్, ఆస్ట్రేలియా లేదా దక్షిణ కొరియా సహాయం కూడా మాకు అక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను, మాకు ఎవరి సహాయమూ అవసరం లేదు!’’ అంటూ ట్రంప్ ఘాటుగా రాసుకొచ్చారు. -
ఆ చిన్నవాక్ మోజ్తబాని కాపాడింది : సంచలన ఆడియో
ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి నుంచి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ లిప్త పాటులో ప్రాణాలతో బయట పడినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ కాంపౌండ్పై జరిగిన భయంకరమైన దాడి, ఖమేనీ తృటిలో ప్రాణాలతో బైటపడిన వైనం కొత్తంకథనం సంచలనంగా మారింది.తృటిలో తప్పిన ప్రమాదంది టెలిగ్రాఫ్ నివేదించిన లీకైన ఆడియో రికార్డింగ్ ప్రకారం, 56 ఏళ్ల ఖమేనా టెహ్రాన్లోని తన నివాసంపై క్షిపణులు దాడి చేయడానికి కొన్ని క్షణాల ముందు బయటకు వచ్చారు. ఫిబ్రవరి 28 ఉదయం 9:32 గంటలకు టెహ్రాన్లోని సుప్రీం లీడర్ నివాసంపై ఇజ్రాయెల్ 'బ్లూ స్పారో' బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో మోజ్తబా ఏదో పని మీద నివాసం నుండి బయటకు వచ్చి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లారు. అదే సమయంలో క్షిపణులు భవనాన్ని తాకాయి. ఆయన తిరిగి లోపలికి వెళ్లేలోపే ఈ విధ్వంసం జరిగింది.అలీ ఖమేనీ కార్యాలయంలో ప్రోటోకాల్ విభాగాధిపతి మజాహెర్ హొస్సేనీ, మార్చి 12న టెహ్రాన్లోని ఖోల్హాక్ ప్రాంతంలో ఉన్నత మత పెద్దలను, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించగా, లీకైన ఒక ఆడియో రికార్డింగ్ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని 'ది టెలిగ్రాఫ్' తెలిపింది.(బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!)హొస్సేనీ ప్రకారం, ఒకేసారి పలు ప్రాంతాలపై దాడి చేసేలా ఈ దాడులు ప్లాన్ చేశారు.మోజ్తబా నివాసం, అతని బావమరిది మిస్బా అల్-హుదా బఘేరీ కనీ ఇల్లు, అతని సోదరుడు ముస్తఫా నివాసం ఇలా మూడు క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో మోజ్తబా ప్రాణాలతో బయటపడినప్పటికీ, తండ్రి మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, తల్లి, ఆయన భార్య (హద్దాద్) కుమారుడు అక్కడికక్కడే మరణించారు. పలువురు ఉన్నత ఇరాన్ అధికారులు మరణించారు.సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ మహమ్మద్ షిరాజీ ఈ దాడిలో శరీర భాగాలు ఛిద్రమై అత్యంత దారుణంగా మరణించారు. చివరకు కొన్ని కిలోల మాంసం దొరికిందని హోస్సేని ఆ రికార్డింగ్లో చెప్పారు. క్షిపణుల తాకిడికి భవనాలు పూర్తిగా ధ్వంస మయ్యాయి.(కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్ సుప్రీం)ఖమేనీ ఆరోగ్యంపై పుకార్లు, షికార్లుఈ దాడి తరువాత మోజ్తబా ఖమేనీ కొత్త సుప్రీంగా ఎన్నికైనప్పటికీ బహిరంగంగా కనిపించలేదు. దీనితో ఆయన తీవ్రంగా గాయ పడ్డారని లేదా మరణించి ఉంటారనిఊహాగానాలకు ఆజ్యం పోసింది. తరువాత తీవ్రగాయాలతో, కాలు కోల్పోయి కోమాలో ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే కేవలం కాలికి చిన్న గాయం మాత్రమే అయ్యిందని అంతర్గత వర్గాల ఆడియో రికార్డింగ్ ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: సంచలన ఆరోపణలు : ట్రంప్నకు భారీ షాక్ -
సంచలన ఆరోపణలు : ట్రంప్నకు భారీ షాక్
ఇరాన్పై యుద్దం గత 18 రోజులుగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారీ షాక్ తగిలింది. అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (NCTC) అధిపతి జోసెఫ్ కెంట్, ఇరాన్-అమెరికా యుద్ధానికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. మనస్సాక్షిని చంపుకొని ఇరాన్పై వార్కు మద్దతుగా నిలవలేను అంటూ లేఖ రాయడం సంచలనం రేపింది. యుద్ధం జరుగుతున్న తరుణంలో అత్యున్నత స్థాయి భద్రతా అధికారి కీలక ఆరోపణలు చేస్తూ తప్పుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశ మైంది.ఇరాన్వల్ల అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ట్రంప్ యుద్ధం ప్రారంభించారని కెంట్ తన లేఖలో పేర్కొన్నారు. "నా అంతరాత్మ సాక్షిగా ఈ యుద్ధానికి నేను మద్దతు ఇవ్వలేను" అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఒక పథకం ప్రకారం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ఇరాన్ వల్ల ముప్పు ఉందని అధ్యక్షుడు ట్రంప్ను నమ్మించారని ఆయన విమర్శించారు. ఇరాన్పై దాడి చేస్తే విజయం త్వరగా లభిస్తుందని ట్రంప్ను కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు తప్పుదోవ పట్టించారని ఆయన లేఖలో రాశారు. మధ్యప్రాచ్యంలోని యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయని ట్రంప్కు గత జూన్ నాటికే తెలుసని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్ సుప్రీంకాగా అతివాద మితవాద వ్యక్తులతో, కుట్ర సిద్ధాంతాలతో గతంలో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ, కెంట్ నియామకాన్ని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. 2022 కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సమయంలో, కెంట్ 'ప్రౌడ్ బాయ్స్' అనే అతివాద మితవాద సైనిక బృందంలో సభ్యుడైన గ్రాహం జోర్గెన్సన్కు కన్సల్టింగ్ పని కోసం డబ్బు చెల్లించారని ఆరోపణలెదుర్కొన్నారు. అయినప్పటికీ, గత ఏడాది జూలైలో 52-44 ఓట్ల తేడాతో ఆయన పదవిలో నియమితులయ్యారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ దాడి వెనుక ఫెడరల్ ఏజెంట్ల హస్తం ఉందనే కుట్ర సిద్ధాంతాలను, అలాగే 2020 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారనే తప్పుడు వాదనలను కూడా కెంట్ గతంలో సమర్థించారు.ఇదీ చదవండి: బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు! -
యుద్ధం: పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతూ వెళ్లిన డ్రోన్
టెహ్రాన్: ఇరాన్ ప్రతీకారదాడులను కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో పదేపదే డ్రోన్లతో విరుచుకుపడుతుంది. అమెరికా దౌత్యకార్యాలయం ఉండే బాగ్దాద్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండడం కలకలం రేపుతోంది. సాధారణంగా ఆకాశంలో పక్షులు హాయిగా ఎగురుకుంటూ వెళ్తుంటాయి. బాగ్దాద్లో అచ్చం పక్షిలా ఓ డ్రోన్ ఎగురుకుంటూ దాడి చేయడానికి వెళ్తున్న వీడియోను ఇరాన్ ప్రభుత్వ మీడియా పోస్ట్ చేసింది. బాగ్దాద్లో అమెరికా ఎంబసీపై ఆ డ్రోన్ ఎగిరింది. డ్రోన్ ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV) వీడియో ఇది. ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే డ్రోన్ కెమెరా చూపిన దృశ్యం, డ్రోన్ చూస్తున్నట్టు కనిపించే వీడియో.ఈ ఘటనకు ముందు ఇవాళ తెల్లవారుజామున బాగ్దాద్లో అమెరికా ఎంబసీ, ఒక హోటల్ పై డ్రోన్లతో ఇరాన్ దాడికి యత్నించిందని నివేదికలు వచ్చాయి. ఎంబసీ దగ్గర గగనతల రక్షణ వ్యవస్థ ఒక ప్రాజెక్టైల్ను అడ్డుకున్నట్టు వీడియోలో కనిపించింది. ఇరాక్ దక్షిణాన ఉన్న మజ్నూన్ ఆయిల్ ఫీల్డ్ కూడా దాడికి గురైందని ఇరాక్ సాయుధ దళాల సేనాధిపతి ప్రతినిధి తెలిపారు.ప్రెస్ టీవీ ఎక్స్ పోస్టులో డ్రోన్ “స్వేచ్ఛాయుత పక్షిలా” ఎంబసీపై ఎగిరిందని పేర్కొంది. గగనతల రక్షణ వ్యవస్థలు స్పందించకుండా డ్రోన్ ఎంబసీపై ఎగిరిన దృశ్యాలను ఇరాకీ రెసిస్టెన్స్ గ్రూప్ (ఇరాన్కు మద్దతిచ్చే మిలీషియా గ్రూప్) విడుదల చేసిందని తెలిపింది.కాగా, నాలుగు డ్రోన్లు అమెరికా ఎంబసీపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఇరాక్ గగనతల రక్షణ వ్యవస్థలు అన్ని డ్రోన్లను కూల్చేశాయని వార్తలు వస్తున్నాయి. ఒక డ్రోన్ అబూ నవాస్ వీధిలో పడిందని, మరొకటి గ్రీన్ జోన్లో ఎంబసీ దగ్గర పడిందని తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున అల్-రషీద్ హోటల్ పై ఒక డ్రోన్ పడిందని ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.An Iraqi resistance group released FPV drone footage showing the drone flying over the US Embassy compound in Baghdad like a free bird without activating air defense systems.Follow https://t.co/B3zXG73Jym pic.twitter.com/7kfRudjJEs— Press TV 🔻 (@PressTV) March 17, 2026 -
కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్ సుప్రీం
ఇరాన్పై అమెరికా-ఇజ్రయెల్ దాడులతో మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ప్రతిపాదను మోజ్తబా తిరస్కరించినట్టు తెలుస్తోంది.అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి లేదా కాల్పుల విరమణకు సంబంధించి మధ్యవర్తి దేశాలు పంపిన ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ తిరస్కరించారని సమాచారం. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలనే విషయంలో ఖమేనీ చాలా కఠినంగా ఉన్నారని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ కాళ్లమీద పడి ఓటమిని అంగీకరించి, పరిహారం చెల్లించే వరకు శాంతి అనే మాటలు తావులేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్కు మరో ఎదురుదెబ్బ?!ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య గావించబడిన తరువాత ఆయన కుమారుడు మోజ్తబా సుప్రీంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఇరాన్ ఎప్పటికీ వెనకడుగు వేయదని, పూర్తి శక్తితో ప్రతిఘటిస్తుందని, దివంగత అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి మాత్రమే కాకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడికి ప్రతీకారం తీర్చుకుంటుందని, శత్రువు మూల్యం చెల్లించాల్సిందేనని మోజ్తాబా ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరిమరోవైపు, ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని మధ్యప్రాచ్య మిత్రదేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!ఖమేనీ మాస్కో ఆసుపత్రిలో కోలుకుంటున్నారా?ఫిబ్రవరి 28న తన తండ్రిని బలిగొన్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన 56 ఏళ్ల ఖమేనీని వైద్య చికిత్స కోసం రష్యాకు తరలించి ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి.కానీ అంచనాలను ధృవీకరించడానికి గానీ, ఖండించడానికి గానీ రష్యా నిరాకరించింది. -
బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!
ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన దాడులు 18వ రోజుకు చేరుకున్నాయి. సాధారణంగా యుద్ధం, లేదా సంక్షోభ సమయాల్లో చమురు, బంగారం, అమెరికన్ డాలర్ బాగా పెరుగుతాయి. అలాగే స్టాక్మార్కెట్లు కూడా పెట్టుబడుదారుల ప్యానిక్ అమ్మకాలతో కుప్పకూలుతాయి. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధ సమయంలో మాత్రం మార్కెట్ సమీకరణాలు మారుతున్నాయి. బంగారం, డాలర్ను మించి దూసుకుపోతోంది. అదేంటో తెలుసుకుందాం ఈ కథనంలో మారుతున్న పెట్టుబడి ధోరణికి అనుగుణంగా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి బిట్కాయిన్ విలువ 74 వేల డాలర్ల మార్కును దాటింది. అంటే సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. బంగారం ఔన్సుకు దాదాపు 5,035 డాలర్ల వద్ద ఉంది. గతంలో బిట్కాయిన్ పెట్టుబడులు చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా భావించేవారు. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ఇది సేఫ్గా మారుతుండటం విశేషం.బిట్ కాయన్పై ఎందుకింత ఆసక్తి?INRGrid స్టేబుల్ వ్యవస్థాపకుడు అనుజ్ చౌదరి అభిప్రాయం ప్రకారం.. బిట్కాయిన్ను బ్యాంకులు లేదా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తక్షణమే సరిహద్దులు దాటించి తరలించ వచ్చు. యుద్ధం వంటి సమయాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించినా, బిట్కాయిన్ నియంత్రణ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటుంది. బంగారం లేదా సాంప్రదాయ మార్కెట్ల వలె కాకుండా, బిట్కాయిన్ 24/7 ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా సంప్రదాయ మార్కెట్లు మూసి ఉన్నప్పుడు, భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడిదారులు తక్షణమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచ సంఘటనల సమయంలో ఇదొక ప్రాధాన్య సాధనంగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్కు మరో ఎదురుదెబ్బ?!ఇన్వెస్ట్పీడియా నివేదిక ప్రకారం, ఇరాన్పై దాడులు మొదలైనప్పటి నుంచీ ఐషేర్స్ బిట్కాయిన్ ట్రస్ట్ ,ఫిడిలిటీ వైజ్ ఆరిజిన్ బిట్కాయిన్ ఫండ్తో సహా బిట్కాయిన్కు 1.1 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు వచ్చాయంటేనే బిట్కాయన్ క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.బిట్కాయిన్ నిజంగా సురక్షితమేనా?ఇరాన్ యుద్ధం సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడంతో, కొంతమంది పెట్టుబడిదారులు క్రిప్టో పెట్టుబడుల వైపు మళ్లవచ్చు. అయితే, ఒక రక్షణ సాధనంగా (హెడ్జ్గా) బిట్కాయిన్ను బంగారంతో పోల్చడంపై నిపుణుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. బిట్ కాయిన్లో పెట్టుబడులు అంత సులువు కాదు. దీనిపై నిపుణులు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం భౌతికంగా అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని జప్తు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బిట్కాయిన్ డిజిటల్గా ఉండటం వల్ల దాన్ని ఎవరూ సీజ్ చేయలేరు. కానీ అయితే, దీని ధరల్లో ఉండే తీవ్రమైన హెచ్చుతగ్గుల (Volatility) చాలా తీవ్ర స్థాయిల్లో ఉంటుంది. అందుకే లాభనష్టాలను బేరీజు వేసుకోనొ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం, లేదా కోవిడ్-19 సంక్షోభం వంటి భౌగోళిక-రాజకీయ సంక్షోభాల సమయంలో క్రిప్టోకరెన్సీ పెరగవచ్చు. అయినా వ్యాపారులు/ పెట్టుబడిదారులు బిట్కాయిన్ను నమ్మదగిన సురక్షిత ఆశ్రయ ఆస్తిగా పరిగణించ కూడదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర బ్యాంకులు బిట్కాయిన్ను కొనుగోలు చేసే అవకాశం లేనందున, రిజర్వ్ ఆస్తిగా దాని పాత్ర పరిమితం. మరోవైపు, గత కొన్నేళ్లుగా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకున్నాయనేది గమనించాలి. -
ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్కు మరో ఎదురుదెబ్బ?!
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత 18 రోజులుగా ఇరాన్ పోరాడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ, టెహ్రాన్ బసిజ్ పారామిలిటరీ దళాల కమాండర్ సోలేమానీ హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మంగళవారం తెలిపారు. కీలక నేత అలీ లారిజానీ మృతిఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ చనిపోయారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.. ఈ దాడుల్లో బాసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అధిపతి సులేమానీ లక్ష్యంగా ఈదాడి జరిగిందని వెల్లడించాయి.అయితే లారిజాని ఈ దాడిలో మరణించారా లేదా గాయపడ్డారా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.ఇంకా స్పందించని ఇరాన్ ఈ నివేదికలపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. లారిజానిని ఇరాన్ అధికార వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా భావిస్తారు. ఈ వార్త నిజమైతే, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఇరాన్లో మరణించిన అత్యంత కీలకమైన వ్యక్తి లారిజానీ. లారిజానీ గతంలో అణు చర్చల ప్రతినిధిగా కూడా పనిచేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను విమర్శిస్తూ, ఇరాన్ ప్రజల పోరాటం కొనసాగుతుందని తమ పోరాటంలో టెహ్రాన్ "దృఢంగా" ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి లారిజాని ముస్లిం ఐక్యతకు పిలుపునిచ్చిన మరునాడు ఈ వార్తలు వెలువడ్డాయి. -
అమెరికా-ఇజ్రాయెల్ మిసైళ్లు కళ్లుగప్పిన మొజ్తాబా
టెహ్రాన్: ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడిలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అమెరికా ఈ దాడిని ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రోర్ ఆఫ్ ది లయన్’ పేరుతో చేపట్టింది. ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.దాడి సమయంలో ఖమేనీ పక్కనే ఉన్న ఆయన రెండవ కుమారుడు, నూతన సుప్రీం లీడర్గా భావిస్తున్న మోజ్తాబా ఖమేనీ, అమెరికా,ఇజ్రాయెల్ క్షిపణులు,యుద్ధ విమానాలు జరిపిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇరాన్ ప్రభుత్వంలోని ప్రముఖుల మధ్య జరిగిన ఒక అంతర్గత ఆడియో సంభాషణలో ఈ విషయం బయటపడిందని ది టెలిగ్రాఫ్ నివేదించింది.ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ అధిపతి మజాహెర్ హొస్సేనీ ఆ ఆడియోలో మాట్లాడుతూ.. ‘మోజ్తాబా బయటికి వెళ్లిన సమయమే మిసైల్ దాడి జరిగింది. ఆయన ప్రాణాలతో బయటపడటానికి కారణం ఇదంతా దేవుని సంకల్పమే’ అని వివరించారు.టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ బాలిస్టిక్ మిసైళ్లు ఖమేనీ నివాస సముదాయంపై మూడు మిసైళ్లు దాడు ప్రయోగించబడ్డాయి. ఒకటి ఖమేనీ ఉన్న ప్రాంతాన్ని తాకగా.. మరొకటి మోజ్తాబా నివాసంపై అంతస్తును ఢీకొట్టింది. ఈ దాడి నుంచి మొజ్తాబా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయనకు కేవలం కాలి భాగంలో స్వల్ప గాయం మాత్రమే జరిగింది.ఇరాన్ సైనికాధికారి మహ్మద్ షిరాజీ ఈ దాడిలో మరణించారు. ఆయన శరీరం పూర్తిగా ఛిద్రమైంది. మరో మిసైల్ మోజ్తాబా మరిది మిస్బాహ్ అల్-హుదా బఘేరీ కానీ నివాసమే లక్ష్యంగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన తర్వాత మోజ్తాబా ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాపించాయి. ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా ద్వారా ఆయన ఒక సందేశం పంపించారు. ‘మార్త్యుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’అని పేర్కొన్నారు.అమెరికా ప్రతిస్పందనఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోజ్తాబా గురించి స్పష్టత లేదని తెలిపారు. కొందరు ఆయన తీవ్రంగా గాయపడ్డారని, మరికొందరు ఆయన మరణించారని చెబుతున్నారని పేర్కొన్నారు. ‘మేము ఆయనను ఇప్పటి వరకు చూడలేదు. ఆయన బ్రతికున్నాడో లేదో తెలియదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ట్రంప్ కొత్త టార్గెట్ ఫిక్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. వెనిజులాలో సైనిక తిరుగుబాటు, ఇరాన్తో యుద్ధం తర్వాత ఇప్పుడు అమెరికాకు అతి సమీపంలో ఉన్న క్యూబాను తన గుప్పిట్లోకి తీసుకోవాలని ట్రంప్ తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. సోమవారం వైట్ హౌస్లో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలానికి దారి తీస్తోంది.అదను చూసి ట్రంప్ వ్యూహంఅమెరికా విధించిన చమురు దిగ్బంధం కారణంగా క్యూబా ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశవ్యాప్తంగా టోటల్ బ్లాక్ అవుట్ ప్రకటించడంతో ఆ ద్వీప దేశం చీకటిమయమైపోయి, అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. ‘క్యూబాను ఏదో ఒక రూపంలో స్వాధీనం చేసుకోవడం మాకు దక్కే గౌరవంగా భావిస్తున్నాను. దాన్ని విముక్తం చేస్తానా? లేదా నా ఆధీనంలోకి తీసుకుంటానా అనేది నా ఇష్టం. ప్రస్తుతం ఆ దేశం చాలా బలహీనంగా ఉంది, నేనేం చేయాలనుకుంటే అది చేయగలను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిని విన్న క్యూబా ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనలో కాలం గడుపుతున్నారు. ఆర్థిక దిగ్బంధంతో ఉక్కిరిబిక్కిరిగత 67 ఏళ్లుగా క్యూబాలో సాగుతున్న కమ్యూనిస్ట్ పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం క్యూబాపై ఆర్థిక ఒత్తిడిని అంతకంతకూ పెంచుతోంది. క్యూబాకు మిత్రదేశమైన వెనిజులాలో మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత, క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయింది. గత మూడు నెలలుగా తమకు ఎలాంటి ఇంధన రవాణా అందలేదని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ఆవేదన వ్యక్తం చేశారు.Trump on Cuba:I do believe I’ll have the honor of taking Cuba. That would be good. That’s a big honor.I can free it or take it, I think I can do anything I want with it. pic.twitter.com/I0TpVCY73j— Clash Report (@clashreport) March 16, 2026త్వరలోనే ఒక ఒప్పందంఅమెరికాకు క్యూబా ఒక అసాధారణ ముప్పుగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అయితే ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాతో ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని, లేదా తాము అనుకున్నది చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే క్యూబా ప్రభుత్వం కూడా తమతో రాజీకి రావాలని కోరుకుంటోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ దిశగా నెతన్యాహు కుట్ర? -
గుడ్న్యూస్.. ఇరాన్ యుద్దంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత వారంలో ఈ వివాదం ముగిసే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా మిత్ర దేశాలపై ట్రంప్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ..‘ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగింపునకు వస్తుంది. ఇప్పటికే యుద్ధం మూడో వారంలోకి చేరుకుంది. యుద్ధం ముగిసినప్పుడు మనకు చాలా సురక్షితమైన ప్రపంచం ఉంటుంది. తక్షణ ముగింపును నేను ఆశించడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా ఆపడం ప్రపంచ భద్రత కోసం అత్యంత అవసరం. ఇరాన్కు అణ్వాయుధాలు లభిస్తే అవి వెంటనే ఉపయోగించే అవకాశం ఉంది. అలా జరిగితే పశ్చిమాసియా మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు.ఇదే సమయంలో తాను యుద్ధాలను కోరుకునే వ్యక్తి కాదని, కానీ ప్రపంచ భద్రత కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. "నాకు యుద్ధాలు అంటే ఇష్టం లేదు. కానీ బాధ్యతగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది" అని ఆయన అన్నారు. ఇటీవల అమెరికా చేపట్టిన సైనిక చర్యల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ దాడులు ఆశ్చర్యమే.. అలాగే.. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ సహా ఈ ప్రాంతంలోని అనేక దేశాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ దాడులు ప్రారంభించిదని చెప్పుకొచ్చారు. అయితే, ఇరాన్ దాడులు తనను ఆశ్చర్యం కలిగించాయని అన్నారు. నిఘా అధికారులు సైతం అలాంటి దాడులను ఊహించలేదని ట్రంప్ వెల్లడించారు. దాడికి గురైన అనేక దేశాలు ఇరాన్తో సాపేక్షంగా తటస్థ సంబంధాలను కొనసాగించాయని తెలిపారు.🚨 JUST IN: President Trump reveals he could end the Iran war within DAYS if he wanted toDOOCY: "If Iran is totally obliterated...can we wrap this war up this week?"TRUMP: "Yeah. Sure. We could."DOOCY: "Will we?"TRUMP: "I don't think so, but it'll be soon!" 👀🔥 pic.twitter.com/GcAoLOIfdC— Eric Daugherty (@EricLDaugh) March 16, 2026మిత్ర దేశాలపై ఆగ్రహం.. మరోవైపు.. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంలో అమెరికాకు సహాయం చేయడానికి ఏయే దేశాలు అంగీకరించాయో త్వరలో ప్రకటించాలని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే, ప్రపంచంలోని చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు రోజువారీ రవాణాకు కారణమయ్యే ఈ జలమార్గం ద్వారా నౌకలకు రక్షణ కల్పించడంలో అనేక మిత్రదేశాలు విముఖత చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మాకు సహాయం చేయడానికి మిత్ర దేశాలు ఆసక్తి చూపడం లేదన్నారు. ఈ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఎక్కువగా ఆధారపడిన దేశాలు అమెరికా ప్రయత్నాలకు మరింత మద్దతు ఇవ్వాలని వాదించారు.ఇరాన్ ప్రపంచానికే ముప్పు.. అంతకుముందు కూడా ఇరాన్పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి ముప్పుగా తయారైందని, ఇజ్రాయెల్ సాయంతో ఆ ముప్పును అంతం చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఇరాన్లోని ఏడువేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని, అందులో అధిక భాగం వాణిజ్య, సైనిక స్థావరాలేనని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ సేనలు క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. సోమవారం కూడా అలాంటి 3 కేంద్రాలపై దాడులు చేసినట్లు చెప్పారు. మరోవైపు తమ దాడుల్లో గత వారం వ్యవధిలో వందకు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయని, దీనితో ఆ దేశానికి చెందిన నౌకాదళం, వాయుసేన దాదాపు అంతం అయ్యాయని పేర్కొన్నారు. -
మరణ వందతుల వేళ నౌరూజ్ శుభాకాంక్షలు..నెతన్యాహు సర్ప్రైజ్
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నౌరూజ్ పండుగ సందర్భంగా ఇరాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరణించారన్న వదంతులు సోషల్ మీడియాలో హోరెత్తుతున్న సమయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు జరుపుకునే నౌరూజ్ పండుగను పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ వేదిగా విడుదల చేసిన వీడియో సందేశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం ఇరాన్ ప్రజలకు నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. పర్షియన్ నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈసారి కూడా వీడియో సందేశం విడుదల చేశారు. ‘ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు నేను ప్రతి సంవత్సరం చెప్పినట్లుగా ఈసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లైట్ల పండుగతో ప్రారంభమయ్యే ఈ సెలవు దినాలు మీకు ఆనందాన్ని ఇవ్వాలి’ అని ఆయన పేర్కొన్నారు.నెతన్యాహు ప్రత్యేకంగా చాహర్షన్బే సూరి అనే పురాతన ఇరానియన్ కాంతి, అగ్ని పండుగను ప్రస్తావించారు. ఈ పండుగలో వెలుగులు చీకటిపై, మంచి చెడుపై విజయం సాధిస్తాయనే విశ్వాసాన్ని ఇరాన్ ప్రజలు తరతరాలుగా కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ‘ఈ సంవత్సరం ఈ పండుగకు ప్రత్యేకత ఉంది. మీ అందరికీ స్వేచ్ఛతో కూడిన కొత్త సంవత్సరం కావాలని, ఆశతో నిండిన కొత్త ఆరంభం కావాలని కోరుకుంటున్నాను’ అని నెతన్యాహు ఆకాంక్షించారు. ఇరాన్ ప్రజలకు, ముఖ్యంగా ఇస్లామిక్ రిపబ్లిక్ మతపరమైన నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారికి, నెతన్యాహు గత కొన్నేళ్లుగా తరచూ ఇలాంటి సందేశాలు పంపుతున్నారు. మార్చి 7న జరిగిన ఒక టెలివిజన్ సమావేశంలో కూడా ఆయన ‘నిజం చెప్పే సమయం దగ్గరపడుతోంది. మీరు నియంతృత్వపు బంధనాల నుండి బయటపడాలి. అప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మళ్లీ ధైర్యవంతమైన స్నేహితులుగా మారతాయి’ అని వ్యాఖ్యానించారు.నెతన్యాహు మరణించారన్న వదంతులు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో ఈ వీడియో వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన ఈ సందేశం, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.Prime Minister Netanyahu:To the brave people of Iran, I wish you, as I do every year a happy holiday season, beginning with the Festival of Lights.It signifies the age old belief of the Iranian people that light will triumph over darkness, that good will triumph over evil. pic.twitter.com/PoY2Mhlg6p— Prime Minister of Israel (@IsraeliPM) March 16, 2026 -
ఏంటీ.. రోబో అరెస్టా..
చైనాలో ఓ వృద్ధురాలిని బెదిరించినందుకుగానూఓ హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అరెస్టు చేశారు!! ఇంటర్నెట్లో ఈ వార్త రాగానే.. ఏంటి బ్రో.. రోబో అరెస్టా? అనినోరెళ్లబెట్టినోళ్లు కొందరైతే.. చైనాలో ఇంతే.. చైనాలో ఇంతే అనిసరిపుచ్చుకున్నవాళ్లు మరికొందరు. మరి.. మనమేం చేద్దాం..నిజంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న 70 ఏళ్ల మహిళ ఒక్కసారిగా రోబో తన వెనుక నిల్చుని ఉండటాన్ని చూసి హడలిపోయారు. నా గుండె ఆగినంత పనైంది అంటూ తిట్టేశారు. ఆ వృద్ధురాలు రోబోను తిడుతున్నట్లు.. చేతులు పలుమార్లు గాల్లోకి లేపి రోబో ఏదో అంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్గా మారింది. రోబో తనను ఫాలో చేసిందని.. భయపెట్టిందని ఆ మహిళ పోలీసులకు చెప్పడంతో యూనీట్రీ జీ–1 రోబోను పోలీసులు అరెస్టు చేసే నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. భయపడటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆస్పత్రికి పంపారు. అయితే, వైద్యులు బాగానే ఉందని అనడంతో ఆ రోబో ఆపరేటర్ మీద తాను ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయడం లేదని ఆమె పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు రోబోను ఆపరేటర్కు అప్పగించి.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ రోబో దగ్గర్లోని విద్యాసంస్థదట. ఆ సంస్థ ప్రమోషన్ కార్యక్రమాలకు దాన్ని వాడుతున్నారు. ఆ రోజున తన దారిలో తాను రోబో వెళ్తుండగా.. ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు రోబో ఆపరేటర్ చెప్పారు. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేయకున్నా.. ఇలా రోబోను అదుపులోకి తీసుకోవడం కూడా ఇదే తొలిసారని చెబుతున్నారు. మరోవైపు ఇంటర్నెట్లో నెటిజనులు ఎప్పట్లాగా రెండుగా విడిపోయారు. కొందరిటు.. కొందరటు చేరారు. ఇంతకీ మీరెటు? తప్పు రోబోదా? ఆ వృద్ధురాలిదా? -
పాకిస్తాన్లో పరువు హత్యలు..
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో దారుణం చోటుచేసుకుంది. పరువు పేరుతో ఓ వ్యక్తి భార్యను, ఐదుగురు సంతాన్ని గొడ్డలితో నరికి చంపాడు. సర్గోధా జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం ఉదయం ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ యాసీన్ అనే వ్యక్తి అనుమానానికి బలైన వారిలో అతడి 45 ఏళ్ల భార్య, 15 ఏళ్ల కుమార్తె, ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు వయస్సున్న నలుగురు కుమారులు ఉన్నారు.భార్యకు పొరుగూరికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నాడు. దీంతో, సంతానంలో కొందరు తనకు జన్మించిన వారు కాదని అనుమానం ఉందన్నాడు. అందుకే వారంతా నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులకు తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు యత్నించిన అతడు గాయపడ్డాడు. -
ఇరాన్పై బాంబుల వర్షం
దుబాయ్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్–అమెరికా సోమవారం కూడా ఇరాన్పై భారీగా దాడులు కొనసాగించాయి. రాజధాని టెహ్రాన్తో పాటు ఇస్ఫహాన్ తదితర నగరాలపై ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిపించాయి. వందలాది లక్ష్యాలపై ముమ్మరంగా దాడులు చేశాయి. ఇస్ఫహాన్, నతాంజ్లోని అణు కేంద్రాలపైనా దాడులు జరిగాయి. ఇరాన్వ్యాప్తంగా డ్రోన్ తయారీ ఫ్యాక్టరీలు, సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలు నేలమట్టమై ఇరాన్ యుద్ధపాటవం ఇప్పటికే విపరీతంగా క్షీణించినట్టు చెప్పారు. దాడుల్లో టెహ్రాన్లో రెడ్క్రాస్ సొసైటీ క్లినిక్ బాగా దెబ్బ తిన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇరాన్ క్షిపణి లాంచర్లలో 70 శాతానికి పైగా తమ దాడుల్లో ఇప్పటికే కుప్పకూలినట్టు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నడావ్ షొహానీ తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు 85 శాతం దాకా తుడిచిపెట్టుకుని పోయాయన్నారు.ఇజ్రాయెల్ ఒక్కటే ఇరాన్లో ఇప్పటిదాకా ఏకంగా 7,600పై చిలుకు లక్ష్యాలను నేలమట్టం చేసినట్టు చెప్పారు. ఇంకా వేలాది లక్ష్యాలను సర్వనాశనం చేయనున్నట్టు వెల్లడించారు. యుద్ధం, హార్మూజ్ జలసంధి మూత తదితర పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నానాటికీ ఎగబాకుతూ గుబులు రేపుతూనే ఉన్నాయి. చమురు బ్యారెల్ ధర సోమవారం కూడా 100 డాలర్లకు పై స్థాయిలోనే కొనసాగింది. గల్ఫ్ దేశాలపైనా...ఇరాన్ డ్రోన్ దాడులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి వణికించాయి. ఒక డ్రోన్ పేలుడుతో చమురు ట్యాంక్కు మంటలంటుకుని భారీ పేలుళ్లు సంభవించాయి. వాటిని ఆర్పేందుకు చాలాసేపటిదాకా శ్రమించాల్సి వచ్చింది. దాంతో విమానాశ్రయంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. యూఏఈలోని ఫుజైరా పారిశ్రామిక జోన్పైనా డ్రోన్ దాడులు జరిగాయి. అక్కడ పలుచోట్ల మంటలు చెలరేగాయి.తమ దేశ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా సోమవారం ఇరాన్ ప్రయోగించిన 35 డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా, ఆరు క్షిపణులు, 21 డ్రోన్లను కూలి్చనట్టు యూఏఈ వెల్లడించాయి. తమ దేశంపై నాలుగు క్షిపణులు, మూడు డ్రోన్లు పడ్డట్టు బహ్రెయిన్ తెలిపింది. అబుదాబిపై జరిగిన క్షిపణి దాడిలో ఒక పాలస్తీనా పౌరుడు మరణించినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది.అటు ఇజ్రాయెల్పైనా ఇరాన్ పెద్దపెట్టున దాడులు కొనసాగించింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో ప్రజలు బంకర్లకేసి పరుగులు తీశారు. చాలా క్షిపణులను, డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. క్షిపణి తాలూకు కూల్చేసిన భాగాలు పడి జెరూసలేం పాత నగరంలో ఓ ప్రార్థనాలయం దెబ్బ తిన్నట్టు తెలిపింది. ఖర్గ్ దీవిపై దాడుల కోసం పలు గల్ఫ్ దేశాల్లోని పోర్టులు, డాక్లను అమెరికా వాడుకున్నట్టు ఇరాన్ తాజాగా ఆరోపించింది. లెబనాన్లోకి పదాతి దళాలు లెబనాన్పై దాడుల తీవ్రతను సోమవారం ఇజ్రాయెల్ మరింత పెంచింది. రాజధాని బీరూట్తో పాటు పలు ప్రాంతాలు క్షిపణి, బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. దక్షిణాది ప్రాంతంలో జరిగిన వైమానిక దాడులకు ఫార్ సర్ గ్రామంలో ఏడుగురు బలైనట్టు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. వారిలో ఇద్దరు వైద్య సిబ్బందని వెల్లడించింది. అంతేగాక పలు హెజ్బొల్లా స్థావరాలను దెబ్బ తీసేందుకు లెబనాన్లోకి అదనపు పదాతి దళాలను పంపినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. లెబనాన్లో ఐరాస శాంతి పరిరక్షక దళాలపై హెజ్బొల్లా కాల్పులను ప్రుభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్కు ఇరాన్ షరతులు! హార్మూజ్ గుండా భారత నౌకలను సురక్షితంగా సాగనిచ్చేందుకు ఇరాన్ తాజాగా షరతులు విధించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. గత ఫిబ్రవరిలో జప్తు చేసిన మూడు ఇరాన్ నౌకలను విడుదల చేయాలని, అత్యవసరంగా ఔషధాలు, ఔషధ పరికరాలు సరఫరా చేయాలని ఆ దేశం కోరినట్టు తెలిపింది. తప్పుడు గుర్తింపుతో ప్రయాణిస్తున్నందుకు ఆ నౌకలను నిర్బంధించాల్సి వచి్చందని భారత్ పేర్కొంది. అంతేగాక అవి సముద్ర మధ్యంలో అక్రమంగా సరుకుల బదిలీకి పాల్పడ్డట్టు తెలిపింది. చమురుకు కొత్త మార్గం: ఇరాక్ పశ్చిమాసియా నుంచి చమురు రవాణాకు మరో కొత్త మార్గాన్ని వారంలో అందుబాటులోకి తేనున్నట్టు ఇరాక్ పేర్కొంది. ఉత్తరాది నగరమైన కిర్కుక్ నుంచి తుర్కియేకు పైప్లైన్ను ప్రారంభిస్తామని ప్రకటించింది. దాని సామర్థ్యం రోజుకు 2.5 లక్షల బ్యారెళ్లని ఇరాక్ చమురు శాఖ మంత్రి హయాన్ అబ్దుల్ గనీ తెలిపారు. యుద్ధానికి ముందువరకు బస్రా రేవు నుంచి ఇరాక్ రోజుకు 34 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసేది. చికిత్స కోసం రష్యాకు మొజ్తబా! ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీని శస్త్రచికిత్స నిమిత్తం రహస్యంగా రష్యాకు తరలించినట్టు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం తొలి రోజు ఇజ్రాయెల్ దాడుల్లో తండ్రి ఖమేనీతో పాటు ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలు రావడం తెలిసిందే. అందుకు తగ్గట్టే నేటిటిదాకా మొజ్తబా బయటి ప్రపంచానికి కనిపించలేదు. దాడుల్లో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలైనట్టు చెబుతున్నారు. ‘‘దాంతో మొజ్తబాకు వైద్య సాయానికి మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చారు. రష్యా సైనిక విమానంలో మొజ్తబాను మాస్కో తరలించారు’’అంటూ పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.ఖమేనీ విమానం ధ్వంసంఇరాన్ దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ విమానాన్ని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై జరిపిన దాడుల్లో అది పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. ఖమేనీతో పాటు అత్యున్నత పౌర, సైనికాధికారులు దేశీయ, విదేశీ ప్రయాణాలకు ఆ విమానాన్ని తరచూ వాడేవారని ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ వివరించింది. ఎల్పీజీ నౌక వచ్చేసింది46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలతో కూడిన భారత నౌక శివాలిక్ సోమవారం గుజరాత్ చేరింది. 20 వేల టన్నులను అక్కడి ముంద్రా రేవులో దించిన అనంతరం కర్నాటకలోని మంగళూరుకేసి బయల్దేరింది. దక్షిణాది అవసరాలను తీర్చే నిమిత్తం మిగతా 26 వేల టన్నుల ఎల్పీజీని అక్కడ అన్ లోడ్ చేయనున్నారు. మరో 45 వేల టన్నుల ఎల్పిజీతో మరో చమురు నౌక నందాదేవి కూడా మంగళవారం భారత్ చేరుకోనుంది. దీంతో దేశం ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరత కాస్త తగ్గనుంది. అలాగే 80 వేల టన్నుల చమురుతో కూడిన జగ్ లాడ్కీ నౌక కూడా మంగళవారం భారత తీరానికి చేరనుంది. మరోవైపు, సోమవారం ఒక పాక్ చమురు నౌక కూడా హార్మూజ్ను దాటింది.నెతన్యాహు కాఫీ వీడియో ఫేక్!క్షేమంపై మరిన్ని అనుమానాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బతికే ఉన్నారా, లేదా అన్న అనుమానాలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా శుక్రవారం విడుదల చేసిన వీడియో ఫేక్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. అందులో నెతన్యాహు కుడిచేతికి ఆరు వేళ్లున్నట్టు కన్పించడం మరింత కలకలం రేపింది. ‘‘అది ఫేక్ వీడియో. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారు. ఆ వాస్తవాన్ని దాచిపెట్టేందుకు ఇజ్రాయెల్ ఫేక్ ఏఐ వీడియో రూపొందించి విడుదల చేసింది’’అంటూ కామెంట్లతో ఇంటర్నెట్ హోరెత్తిపోయింది.దానికి స్పందనగా నెతన్యాహు పేరిట ఆదివారం మరో వీడియో విడుదలైంది. అందులో ఆయన ఒక కఫేలో ఉల్లాసంగా కాఫీ సేవిస్తూ కన్పించారు. తన మృతి వార్తలపై వ్యంగ్యంగా స్పందించారు కూడా. కానీ అది కూడా ఫేక్ వీడియోనేనని ప్రముఖ ఏఐ చాట్బాట్ గ్రోక్ తాజాగా తేల్చడం కలకలం రేపుతోంది! దానితో పలువురు ఎక్స్ యూజర్లు కూడా గళం కలిపారు. నెతన్యాహు చేతిలోని కప్పులో కాఫీ పరిమాణం ఆయన సిప్ చేసిన తర్వాత కూడా అలాగే ఉండటాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. అంతేగాక ఆ వీడియోలో నెతన్యాహు ముఖం తీరుతెన్నులు చాలా తేడాగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. హార్మూజ్పై ఆచితూచి..⇒ ట్రంప్ పిలుపుకు స్పందించని దేశాలు ⇒ మరింత స్పష్టత కావాలి: ఈయూ ⇒ ముందు యుద్ధం ఆపాలన్న చైనా ⇒ యుద్ధ విస్తరణలో భాగం కాలేం: బ్రిటన్వాషింగ్టన్/బ్రసెల్స్/లండన్/బీజింగ్: హార్మూ జ్ జలసంధిని తెరిపించే ప్రయత్నాల్లో కలిసి రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపుకు ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. హార్మూజ్ వద్దకు తక్షణం యుద్ధ నౌకలను పంపాల్సిందిగా చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలకు ఆయన విజ్ఞప్తి చేయడం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు బ్రసెల్స్లో భేటీ కానున్నారు. హార్మూజ్ను తెరిపించే విషయంలో రెండు రకాల చర్యలు తమ దృష్టిలో ఉన్నట్టు ఈయూ విదేశీ విధాన సారథి కజా కలాస్ తెలిపారు. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ వ్యూహాల గురించి ఈయూ దేశాలు మరింత సమాచారం కోరుతున్నాయి.అమెరికా తెర తీసిన ఈ యుద్ధం మరింత విస్తరించేందుకు తాము కారణం కావాలని కోరుకోవడం లేదని అవి కుండబద్దలు కొడుతున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ట్రంప్ కోరినట్టు యుద్ధ నౌకలు పంపేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. హార్మూజ్ను తెరిపించేందుకు మాత్రం యూరప్ దేశాలతో కలిసి ఇప్పటికే పలు మార్గాలను అన్వేíÙస్తున్నట్టు చెప్పారు. పశ్చిమాసియాలో పోరుకు తక్షణం తెర పడాలని ఆకాంక్షించారు. ఇరాన్పై దాడులకు స్వస్తి పలికితేనే హార్మూజ్ను తెరిపించే విషయంలో ముందుకొస్తానని చైనా సంకేతాలిచ్చింది.విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్కు చైనా వెంటనే యుద్ధ నౌకలు పంపకపోతే తన చైనా పర్యటనను వాయిదా వేసుకోవడానికి వెనకాడబోనని కూడా ట్రంప్ పేర్కొనడం తెలిసిందే. తన పిలుపుకు స్పందించని దేశాలను గుర్తు పెట్టుకుంటానంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు! అయితే అధ్యక్షుని వ్యాఖ్యల ఉద్దేశం హార్మూజ్ విషయమై చైనాపై ఒత్తిడి పెంచడం కాదని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పుకొచ్చారు.యూఎస్తో చర్చించలేదు: భారత్ హార్మూజ్ను తెరిపించే ప్రయత్నాలను గురించి అమెరికాతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలూ జరపలేదని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. -
తాలిబాన్లపై విరుచుకుపడిన పాక్.. 400 మంది మృతి
కాబూల్: ఆప్ఘనిస్థాన్లో పాకిస్తాన్ దళాలు విరుచుకుపడ్డాయి. కాబూల్లోని ఆసుపత్రిపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. పాక్ దాడుల్లో దాదాపు 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డట్లు అఫ్గానిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఈ దాడిపై అఫ్గాన్ తాలిబన్లు స్పందించారు" పాకిస్తాన్ మరోసారి అఫ్గాన్ గగనతల నియమాలను ఉల్లంఘించింది. కాబూల్లోని మాదకద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుంది, మాదక ద్రవ్యాలకు బానిసై చికిత్స పొందుతున్న వారు ఈ దాడుల్లో మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు". అని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. ఈ నేరాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన దాడిగా పేర్కొన్నారు.కాగా గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్.. కాబూల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేయగా అఫ్గాన్ సైతం ప్రతిదాడులతో తిప్పికొడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు క్షిపణులతో భారీ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. BREAKING: The Afghan health ministry said 200 people were killed and hundreds others injured after Pakistan launched airstrikes on a drug rehabilitation hospital in Kabul, Afghanistan.The Pakistan’s government rejected that they struck the hospital, claiming they targeted… pic.twitter.com/LenFAOyyYA— AZ Intel (@AZ_Intel_) March 16, 2026 -
యుద్ధం ఎఫెక్ట్.. వేలసంఖ్యలో మృతులు.. లక్షలాది నిరాశ్రయులు
పశ్చిమాసియా యుద్ధం తీవ్ర మానవతా సంక్షోభానినికి దారి తీస్తుంది. ఈ యుద్దంలో ఇప్పటికే దాదాపు 2 వేల మందికి పైగా పౌరులు చనిపోగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతే కాకుండా పెద్ద మెుత్తంగా ఆస్తినష్టం సంభవించింది.ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు మెుదలు పెట్టి 15 రోజులు పూర్తయింది. అయినప్పటికీ యుద్ద ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రగిలిపోతుంది.కాగా ఇప్పటివరకూ యుద్దం కారణంగా నష్టపోయిన వారి తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది.యుద్దం ప్రారంభంనుంచే ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్తో పాటు లెబనాన్పై దాడి చేస్తోంది. అక్కడి హిజ్బుల్లా తీవ్రవాదులే టార్గెట్గా దాడులు జరుపుతున్నట్లు చెప్పినప్పటికీ చాలా మట్టుకు జనావాసాలపైనే ఇజ్రాయెల్ మిసైల్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ నివేదిక తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. యుద్దం కారణంగా లెబనాన్లో ఇప్పటి వరకూ దాదాపు ఎనిమిది లక్షల ప్రజలు నిరాశ్రయులైనట్లు నివేదికలు తెలిపాయి. అంతే కాకుండా వారిలో దాదాపు రెండు లక్షల మంది చిన్నారులున్నట్లు పేర్కొన్నాయి.దీనితో పాటు యుద్దం ప్రభావం గల్ఫ్ దేశాలపైనా అధికంగా పడింది. అక్కడి అమెరికా రక్షణ స్థావరాలే టార్గెట్గా ఇరాన్ దాడులు జరపడంతో ఆ దేశాలలోని పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే దుబాయి బీచ్లు, హోటళ్లు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. మార్కెట్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. దీంతో యుద్దం ఎప్పుడు ముగుస్తుందా అని ఆందోళన చెందుతున్నాయి. -
సహయం చేస్తాం.. కానీ డబ్బులు కావాలి: జెలెన్స్కీ
ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్లను కూల్చివేయడానికి అమెరికా ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షాహిద్ డ్రోన్ల కూల్చివేతకు సాంకేతికంగా సహయం అందేజేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అయితే దానికి ప్రతిగా తమకు డబ్బులివ్వాలని కోరారుపశ్చిమాసియా యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్ను ఇరాన్కు చెందిన షాహిద్ డ్రోన్లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30$ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 3.7 $ మిలియన్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతితక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో టెహ్రాన్ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తోన్న ఉక్రెయిన్ పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది.కాగా ఈ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ఇరాన్ను డ్రోన్ దాడులను ఎదుర్కొవడానికి కావాల్సిన సహాయం చేస్తామని దానికి ప్రతీగా తమకు తగిన మెుత్తంలో డబ్బులివ్వాలని కోరారు. ఈనేపథ్యంలోనే డ్రోన్ దాడులు వాటిని ఎలా ఎదుర్కొవాలే అనే అంశం అంచనా వేయడానికి మూడు నిపుణుల బృందాలను పశ్చిమాసియా దేశాలకు పంపారు. అయితే తాము ఇరాన్తో యుద్ధం చేయడం లేదని ఇప్పుడు తమ దేశానికి డబ్బు అవసరం కనుక సాంకేతిక సాయం చేస్తున్నామని జెలెన్స్కీ స్పష్టం చేశారు. -
కుమారుడు తప్పు చేస్తే తండ్రికి శిక్ష.. గల్ఫ్లో అంతే?
గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న తప్పు చేసినా అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇటీవల ఓ మైనర్ బాలుడు చేసిన తప్పుకు అతని తండ్రికి కోర్టు శిక్ష విధించింది. పిల్లాడి సంరక్షణ బాధ్యత తండ్రిదేనని తెలిపింది.అబుదాబీలో ఇటీవల ఓ మైనర్ బాలుడు ఒకరి ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న మరో మైనర్ బాలుడి చిత్రాలను వీడియో తీసి అతనిని ఆట పట్టించడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని సదరు కుటుంబం సదరు కుటుంబం ఈ విషయంపై కేసు నమోదు చేసింది. ఈ వివరాలను పరిశీలించిన అక్కడి న్యాయమూర్తి ఇది పిల్లాడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని తీర్పు ఇచ్చారు.అందుకు గాను సదరు కుటుంబానికి 50 వేల దిర్హామ్లు జరిమానా విధించారు. అయితే ఆ పిల్లాడు మైనర్ అని వాదించినప్పటికీ వారి సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులేదనని వారి ఎటు వెళుతున్నది ఏం చేస్తున్నది కనిపెడుతూ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక ఆ ఫ్యామిలీ ఆ మెుత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది. -
ఇజ్రాయెల్ దాడి.. ప్రముఖ ఇన్ప్లూయెన్సర్ ఫ్యామిలీ మృతి
పశ్చిమాసియా యుద్దంలో మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ప్రముఖ లెబనీస్ ఇన్ప్లూయెన్సర్ నటాలీ కమల్ తన కుటుంబాన్ని కోల్పోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సైతం ప్రస్తుతం విషమంగా ఉంది.ఇజ్రాయెల్ ఓవైపు ఇరాన్పై దాడులు చేస్తూనే మరోవైపు లెబనాన్పై విరుచుకపడుతుంది. హిజ్బుల్లా స్థావరాలే లక్షంగా పెద్దఎత్తున మిసైల్స్ అటాక్ చేస్తోంది. టెల్ అవీవ్ ఆ దేశంలోకి చొచ్చుకొని కంబాట్ ఆర్మీ ఆపరేషన్ చేపడుతుంది. ఈ దాడుల నేపథ్యంలో ఆ దేశంలోని సాధారణ ప్రజలు సైతం దాడులలో పెద్దఎత్తున మృత్యువాత పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మౌంట్ లెబనాన్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ నటాలీ భర్త మెుహమ్మద్ షెబాద్, ఆమె చిన్న కుమార్తె తాలిన్ మరణించారు. అంతేకాకుండా ఈ అటాక్లో నటాలీ సైతం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన ప్రాంతం బీరూట్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం నేపథ్యంలో ఆశ్రయం కోల్పోయిన అనేక కుటుంబాలు అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ అటాక్ చేసిందని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మెుత్తంగా ముగ్గురు మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. -
నెతన్యాహూ మరో సంచలన వీడియో
ఇరాన్పై అమెరికా - ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధం వరుసగా 17వ రోజు భీకరంగా సాగుతోంది. ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతీ కార దాడుల్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ, అతని భార్య, మరో కీలక అధికారి మరణించారన్న ఊహాగానాలు కూడా నెట్టింట విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తన మరణం గురించి వస్తున్న పుకార్లకు సమాధానమిచ్చేలా నెతన్యాహూ పేరిట విడుదలైన వీడియోలు ఏఐ సృష్టి నెటిజన్లు వాదిస్తున్నారు. వీటిని తోసిపుచ్చుతూ విడుదలైన కాఫీ షాప్ వీడియో కూడా ఫేక్ అని గ్రోక్ తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: మోజ్తబా ఖమేనీ ఆచూకీ : మరో బిగ్ ట్విస్ట్!దీంతో మరోసారి నెతన్యాహూ వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెతన్యాహు, 'మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం, కలిసి గెలవడం' అని క్యాప్షన్తో సోమవారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఆయన పౌరులతో సంభాషిస్తున్నట్లు కనిపించారు.שומרים על ההנחיות ומנצחים ביחד >> pic.twitter.com/HC5w3PqKuV— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 16, 2026నెటిజన్ల విమర్శలుఈ వీడియోలో నెతన్యాహు కదలికలు సహజంగా లేవని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడిన వీడియో అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత ఇవ్వడానికి బదులు, ఇలాంటి వీడియోలు విడుదల చేయడం పట్ల చాలా మంది పెదవి విరిచారు. ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
మోజ్తబా ఖమేనీ ఆచూకీ : మరో బిగ్ ట్విస్ట్!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేనా? అసలు ఆయన బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? రష్యా అద్యక్షుడు పుతిన్ నీడలో రక్షణ పొందుతున్నాడనే మరో వార్తహల్ చల్ చేస్తోంది. ఇరాన్ సుప్రీం మోజ్తబా ఖమేనీ సేఫ్టీపై అగ్రనేతలు ఏమంటున్నారు? ఈ విషయాలపై కథనం.అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన వేళ, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ , ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.మోజ్తబా ఖమేనీ ఉనికిపై ఊహాగానాలుఇరాన్పై ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన అమెరికా -ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ ఇతర కుటుంబ సభ్యులు మరణించారు. తండ్రి మరణం తర్వాత, 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే, యుద్ధం ప్రారంభంలో జరిపిన దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారనే ఊహాగానాలు భారీగా వ్యాపించాయి. అయితే ఈ విషయాలను ఖండించిన ఇరాన్ మోజ్తబా గాయపడినప్పటికీ నాయకత్వ బాధత్యలను నిర్వహించే స్థితిలోనే ఉన్నారని ప్రకటించింది. రష్యాలో చికిత్స ?అయితే ఆయన రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైట్ పత్రిక 'అల్-జరీదా' తెలిపింది. దీని ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడుల తర్వాత మోజ్తబాను అత్యంత రహస్యంగా ఒక రష్యన్ సైనిక విమానంలో మాస్కోకు తరలించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంలోని ఒక ప్రైవేట్ వైద్య సదుపాయంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం అక్కడే కోలుకుంటున్నారని సమాచారం. ఇరాన్లో దాడులు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది.ఇరాన్లోనే ఉన్నారా?మరోవైపు 'ది సన్' పత్రిక కథనం మాత్రం మరోలా ఉంది మోజ్తబా ఇరాన్లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల్లో ఆయన రెండు కాళ్లు కోల్పోయారని, కాలేయం లేదా కడుపు భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని పేర్కొంది.ట్రంప్ , నెతన్యాహు ప్రకటనలుఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి.ఆయన అసలు బతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకు ఎవరూ ఆయన్ని చూడలేదు. ఆయన బతికే ఉంటే, తన దేశం కోసం శరణు కోరడం మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాదు మోజ్తబా సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఇరాన్ నేత మోజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం ఉందంటూనే "ఆయన ప్రాణాలకు నేను ఎలాంటి భరోసా (లైఫ్ ఇన్సూరెన్స్) ఇవ్వలేనునీ, అయితే ఖమేనీ ఉన్న ప్రదేశం గురించి ఇజ్రాయెల్కు నిఘా సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలను మరింత సంక్లిష్టం చేసింది. ఇరాన్ సైనిక కమాండర్లకు కూడా తమ కొత్త నాయకుడి నుండి ఎటువంటి ఆదేశాలు అందడం లేదని, దీంతో ఇరాన్ అంతర్గత గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. మోజ్తబా అందుబాటులో లేని కారణంగా యుద్ధంపై ఆయనకు ఎటువంటి నియంత్రణ లేదని, కమాండర్లకు కూడా ఆయన స్థితిగతులపై స్పష్టత లేదని 'ది టెలిగ్రాఫ్' నివేదించింది.(నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్ ‘డీప్ఫేక్’ చర్చ)ఖమేనీ పరిస్థితి గురించి సీనియర్ అధికారులు కూడా అనిశ్చితంగా ఉన్నారని ఇరాన్ అధికారి ఒకరు ది టెలిగ్రాఫ్తో అన్నారు. "మోజ్తాబా గురించి ఎవరికీ ఏమీ తెలియదు, అతను బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా లేదా ఎంత తీవ్రంగా గాయపడ్డాడో. అతను గాయపడ్డాడని చెప్పారు. అతను ఇక్కడ లేనందున అతనికి యుద్ధంపై నియంత్రణ లేదు. మెజారిటీ కమాండర్లకు, లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే, అన్ని కమాండర్లకు అతని గురించి ఎటువంటి సమాచారం లేదు." అని ఇరాన్ సీనియర్ అధికారిన ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ వెల్లడించింది.అలాగే సుప్రీం లీడర్ పేరుతో విడుదలైన మొదటి ప్రకటన ఆయన రాసింది కాదని, భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ రాసి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మోజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితి ఇరాన్ రాజకీయ , సైనిక వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై ప్రకటన చేశారు.‘ఇరాన్ సాయుధ దళాలు ఆ జలసంధిని నియంత్రిస్తున్నాయి. మాపై దాడి చేస్తున్న ఏ దేశ నౌకను అయినా హర్ముజ్ జలసంధి వినియోగించడానికి అనుమతించం. జాతీయ భద్రత రక్షణ కోసం హర్ముజ్ జలసంధిలో అవసరమైన చర్యలు తీసుకునే హక్కు ఇరాన్కు ఉంది. ఆ జలమార్గాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేసేవారిని అడ్డుకోవడమే మా లక్ష్యం. జలసంధి ద్వారా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు ఎన్నో ఏళ్లుగా ఇరాన్ కృషి చేసింది‘ అని అన్నారు.దీంతో ఇరాన్ విధించిన ప్రత్యేక షరతులను పాటిస్తూ నౌకలు హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ పెట్టిన నియమాలు, పరిమితులను పాటించాల్సిందేనని చెప్పింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఆ విమానాశ్రయం నుంచి వెళ్లే, వచ్చే అన్ని విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యే వరకు ప్రయాణం చేయవద్దని ప్రయాణికులకు సూచించారు.హోర్ముజ్ జలసంధి పర్యవేక్షణ కోసం కూటమిలో చేరాలని సుమారు ఏడు దేశాలను అడిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరోవైపు ఇరాన్లో ఇంకా వేలాది లక్ష్యాలపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్ ‘డీప్ఫేక్’ చర్చ
ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం 17వ రోజుకు చేరింది. తమ సుప్రీంనేతమరణం తరువాత ఇరాన్ భీకరమైనప్రతిదాడులతో శత్రు దేశాలకు చెమటలు పట్టిస్తోంది. ప్రధానంగా అమెరికా సైనిక బేస్కేంద్రాలున్న గల్ఫ్ ప్రాంతంలో మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రోజు రోజుకి ముదురుతున్న ఈ యుద్ధంలో గత వారం నుండి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భద్రతపై ఊహాగానాలు చెలరేగాయి.ఈనేపథ్యంలో ఆయన మరణించినట్లు వస్తున్న పుకార్లను పటాపంచలు చేయడానికి విడుదల చేసిన కాఫీ వీడియో నెతన్యాహూ ఉనికిపై మరింత చర్చకు తావిచ్చింది. అసలు అది నిజమైనదేనా లేక 'డీప్ఫేక్' (AI సృష్టించినదా) అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవల నెతన్యాహూ రిలీజ్ అయిన వీడియో ఏఐ సృష్టి అని, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోవడంతోనే ఇజ్రాయెల్ ఆయన ఏఐ వీడియో రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తమైనాయి. ఆ వీడియోలో ఆయనకు ఎడమ చేతికి ఆరువేళ్లున్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది. కాఫీ వీడియోపై ఆన్లైన్లో రచ్చదీనిపై స్పందనగా తాజాగా నెతన్యాహు ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. జెరూసలేం హిల్స్లోని ది సతాఫ్ కేఫ్లో కాఫీ ఆర్డర్ చేస్తున్నట్లు చూపించే వీడియోను విడుదల చేశారు. తాను చనిపోలేదు అనే సందేశాన్ని ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేశారు. నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగో లెక్కించుకోండి అంటూ తన రెండు చేతులను పైకెత్తి కెమెరాకు తన వేళ్లను చూపించారు. అంతేకాదు తాను కాఫీ కోసం చనిపోతున్నాను అంటూ పుకార్లకు కౌంటర్ ఇచ్చారు. అటు బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనే వార్తలను ఇప్పటికే ఇజ్రాయెల్ ఖండించింది.ఏఐ సృష్టే అంటున్న నెటిజన్లునెతన్యాహు ఎక్కడ, ఎలా ఉన్నారనే పుకార్ల మధ్య, కొత్త కాఫీ వీడియో మళ్లీ అనుమానాలను బలపరుస్తోంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు దీనిని కృత్రిమ మేధస్సు (AI) సృష్టి అని తేల్చారు. మరోవైపు గ్రోక్ కూడా 'డీప్ఫేక్' వెల్లడించింది. ఒక వినియోగదారుడి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎక్స్ AI చాట్బాట్, గ్రోక్, కాఫీ షాప్ వీడియోను 'AI-జనరేటెడ్' కంటెంట్గా తెలిపింది. ఈ ఏఐ వీడియోలో ఇజ్రాయెల్ తొలుత ఫేస్ గుండ్రంగా ఉంది. ఒక్కసారిగా కోలగా మారిందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే కప్పులోని కాఫీ పడిపోకుండా వింతగా ఉందని కొందరు. కౌంటర్ వెనుక ఉన్న ఒక కస్టమర్ మాస్క్ ధరించి ఉండటంపై కూడా మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నెతన్యాహు కోటు జేబులు కూడా వింతగా కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషించారు.It's AI-generated. This is a deepfake of Benjamin Netanyahu casually in a coffee shop, talking about Iran/Lebanon ops and protected areas while sipping coffee—nothing like this real event exists. The original post explicitly calls it advanced unreleased AI.— Grok (@grok) March 15, 2026Got some serious questions about the validity of this blatantly obvious AI video…🤷🏻♂️Magical pocket…Coffee in the cup defying gravity…Customer with mask behind the counter 😂 Nice Try…..NOTenyahu 😎 pic.twitter.com/oBA5U3HByK— Freed Ninja (@freezymfe) March 15, 2026 -
‘గ్రేటర్ ఇజ్రాయెల్’ దిశగా నెతన్యాహు కుట్ర?
యుద్ధంతో పశ్చిమాసియా రావణకాష్టంలా మారింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కాస్తా ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధంగా రూపాంతరం చెందింది. అయితే ఇది ఉగ్రవాద వ్యతిరేక పోరాటమా లేక శతాబ్దాల నాటి సరిహద్దుల విస్తరణా? అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. లెబనాన్ను కబళిస్తున్న తీరు చూస్తుంటే ప్రధాని నెతన్యాహు లక్ష్యం ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ వైపు మళ్లుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.15 రోజుల్లో 20 శాతం భూభాగం కబ్జా?గడచిన రెండు వారాల్లో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎప్) లెబనాన్ సరిహద్దుల్లో ఊహించని వేగంతో ముందుకు సాగింది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని సుమారు 20 శాతం భూభాగాన్ని ఖాళీ చేయించడం వెనుక భారీ వ్యూహం దాగివుంది. హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేయడం పేరుతో ఇజ్రాయెల్ అక్కడ శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 800 మందికి పైగా పౌరులు, పోరాట యోధులు మరణించడంతో ఈ ప్రాంతం శ్మశానవాటికను తలపిస్తోంది.ఏమిటీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ కల?బైబిల్ కాలం నాటి ‘ప్రామిస్డ్ ల్యాండ్’ (వాగ్దాన భూమి) సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలనేది కొందరు అతివాద ఇజ్రాయెలీ నాయకుల తీవ్ర ఆకాంక్ష. దీనినే ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లేదా 'అఖండ ఇజ్రాయెల్' అని పిలుస్తారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ లోని కొన్ని భాగాలను కలుపుకోవాలి. నెతన్యాహు తాజా దాడులు ఈ పాత మ్యాప్ను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.హిజ్బుల్లా అణచివేత.. ఇరాన్ లక్ష్యంగా పావులుఇజ్రాయెల్కు అసలైన శత్రువు ఇరాన్ అని నెతన్యాహు నమ్ముతారు. ఇరాన్ అండతో నడుస్తున్న హిజ్బుల్లాను బలహీనపరచకుండా లెబనాన్పై పట్టు సాధించడం అసాధ్యం. అందుకే ఒకవైపు క్షిపణి దాడులతో హిజ్బుల్లా వెన్ను విరుస్తూనే, మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోందని వశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ జోక్యం చేసుకోకుండా అడ్డుకోగలిగితే, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా మారుతుంది.ట్రంప్ హయాంలో.. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన గత 13 నెలల్లో ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఇరాన్ నేతలపై దాడులు, కఠినమైన టారిఫ్లు, ఇజ్రాయెల్కు బేషరతు మద్దతు ఇవ్వడం ద్వారా ట్రంప్ నెతన్యాహుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లయింది. అమెరికా అండ ఉండటంతో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తోంది.పశ్చిమాసియా మ్యాప్ మారుతోందా?ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణుల పోరాటం కాదు.. ఇది భౌగోళిక సరిహద్దుల మార్పిడి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ‘బఫర్ జోన్’ ఏర్పాటు ఇప్పుడు లెబనాన్ లోపలి వరకు చొచ్చుకుపోయింది. నెతన్యాహు వ్యూహం గనుక ఫలిస్తే, రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పటంలో లెబనాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.శాంతి చర్చలు సాధ్యమేనా?ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అటు ఇరాన్ తన పట్టు కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఇటు ఇజ్రాయెల్ తన లక్ష్యం నెరవేరకుండా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ మహా సంగ్రామం పశ్చిమాసియాను మరో పెను మార్పు వైపు నడిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా? -
అట్టుడుకుతున్న దుబాయ్ : విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి
మధ్యప్రాచ్య వివాదం ప్రారంభమైనప్పటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై 1,800కి పైగా క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగిచింది. ఇరానియన్ డ్రోన్ దాడి తర్వాత దుబాయ్ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పలు విమానాలు రద్దయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో జరిగిన డ్రోన్ ఇంధన ట్యాంక్ను ఢీకొట్టిన తర్వాత సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు చెలరేగాయి అత్యవసర బృందాలు వేగంగా స్పందించి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాయి. యుఎఇ అత్యంత లక్ష్య దేశంగా మారిందని అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందిని వెంటనే మంటలను అదుపు చేశారు. సమీపంలో భద్రతా చర్యలు చేపట్టడంతో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈమేరకు దుబాయ్ మీడియా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. దుబాయ్ విమానాశ్రయం దుబాయ్ విమానాశ్రయం నుండి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని విమానాలను మళ్లిస్తున్నట్లు కూడా ప్రకటించింది. విమానాశ్రయ రోడ్డు, విమానాశ్రయ సొరంగంను పోలీసులు మూసివేశారు.Large fire reported in the vicinity of Dubai International Airport after an Iranian drone attack tonight. pic.twitter.com/XmIvEq2KTu— OSINTtechnical (@Osinttechnical) March 16, 2026విమానాలు తిరిగి ప్రారంభంమరోవైపు ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత దుబాయ్ విమానాలను క్రమంగా తిరిగి ప్రారంభమైనాయి. ఇక్కడి నుండి కొన్ని విమానాలు క్రమంగా ఎంపిక చేసిన గమ్యస్థానాలకు తిరిగి ప్రారంభ మవుతున్నా యని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎక్స్ ద్వారా సమాచారం అందించింది. ప్రయాణీకులు తమ విమానాలకు సంబంధించిన వివరాలకోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని పేర్కొంది.విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి ఇదే మొదటిసారి కాదు. వరుస దాడుల మధ్య తమ సేనలు ఈ దాడులు తిప్పికొడుతున్న తరుణంగా లేటెస్ట్ అప్డేటట్స్ను ఫాలో కావాలని అధికారులు సూచించారు. ప్రస్తుత దాడులు ఈ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలను మరింత పెంచుతోంది.#WATCH | Dubai authorities brought under control a fire caused by a drone attack near the city's international airport that forced a temporary suspension of flights, though no injuries were reported, they said: Reuters (Video Source: Reuters) pic.twitter.com/tVEDxDqtFN— ANI (@ANI) March 16, 2026 -
ట్రంప్నకు భారీ షాక్.. యుద్ధంలో ఊహించని ఎదురుదెబ్బ?
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియా 17 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏడు మిత్రదేశాలు ట్రంప్కు షాకిచ్చాయి. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ ట్రంప్ చేసిన సూచనను పలు మిత్ర దేశాలు తిరస్కరించాయి. దీంతో, ఇరాన్తో యుద్ధంలో కీలక పరిణామం నెలకొంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి విషయంలో మిత్ర దేశాలకు సందేశాలు పంపించారు. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ సూచనలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ సందేశంపై మిత్రదేశాలు జపాన్, ఆస్ట్రేలియా షాకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ స్పందిస్తూ.. హర్మూజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో యుద్ధనౌకను పంపాలని కోరుతూ అమెరికా నుంచి తమకు అధికారిక విన్నపమేదీ అందలేదని మరో ట్విస్ట్ ఇచ్చారు. తమ వార్షిప్ను పశ్చిమాసియాకు పంపే ఆలోచనేదీ లేదని ఆమె తేల్చి చెప్పారు. అయితే హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంత ముఖ్యమైందో తమకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.జపాన్ ఝలక్..మరోవైపు.. ట్రంప్ సందేశంపై జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచి కూడా స్పందించారు. జపాన్ పార్లమెంటు వేదికగా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని ఆమె వెల్లడించారు.బ్రిటన్ ఇలా.. అలాగే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రాయల్ నేవీ డిస్ట్రాయర్లను పంపేందుకు లండన్ సిద్ధంగా లేదని స్టార్మర్ స్పష్టం చేశారు. బదులుగా, మైన్-హంటింగ్ డ్రోన్లను పంపి సహకరించవచ్చని తెలిపారు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం అత్యంత ముఖ్యం. కానీ సంక్షోభం మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. అంతేకాకుండా హర్మూజ్ జలసంధి విషయంలో కొన్ని అమెరికా మిత్ర దేశాలు కూడా ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు ముక్కుసూటిగానే నిరాకరిస్తున్నాయి. దీంతో, ఇరాన్పై యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్నకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.అమెరికా ఒత్తిడి..యుకే, జపాన్, ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడంతో అమెరికా ఒంటరిగా ఇరాన్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెంచుతోంది. ఈ నేపథ్యంలో మిత్రదేశాలు వెనక్కి తగ్గడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, చైనా ఎక్కువగా ఈ జలసంధి ద్వారా చమురు పొందుతున్న కారణంగా దాని రక్షణ బాధ్యతను కూడా వారు తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. -
భారత్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ ఇరాన్తో తాను జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం నేను ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ చర్చలు ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇరాన్తో భారత్ నిరంతరం టచ్లోనే ఉంటుంది. చర్చల ద్వారా దౌత్యపరమైన విజయాలు లభిస్తుంటే వాటిని పరిశీలించడంలో తప్పులేదు. నేనుకూడా అదే చేస్తున్నాను’ అని ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో జైశంకర్ తెలిపారు. ‘ఖచ్చితంగా, ఆయా దేశాలతో సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత్ దృక్కోణం నుండి ఇరాన్తో చర్చలు జరపడం,సమన్వయం చేసుకోవడం మంచిది. పరిష్కారం సైతం లభిస్తోందన్నారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంత కొనసాగుతోంది. క్రమంలో ప్రపంచ దేశాలపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చేలా ఇరాన్ తన హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. తమని కాదని చమురు నౌకల రవాణాని కొనసాగిస్తే వాటిని పేల్చుతామని హెచ్చరించింది. అందుకు కొనసాగింపు ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నేవల్ మైన్స్ను నింపేసింది. 700నౌకలను నిలిపివేసిందిఈ క్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్తో చర్చలు జరిపారు. హర్మూజ్ జలసంధిలో భారత్ నౌకలపై ఆంక్షలు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు భారత్ గ్యాస్, చమురు నౌకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. భారత్ జెండాలతో జలసంధి గుండా వెళ్లొచ్చని సూచించింది.ఆరోణల్ని ఖండించిన జైశంకర్భారత జెండాతో ఉన్న నౌకలకు సంబంధించి ఇరాన్తో ఎలాంటి ‘సమగ్ర ఒప్పందం’లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇరాన్ ప్రతిఫలం పొందిందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. భారత్-ఇరాన్ల మధ్య చిరకాల సంబంధం ఉంది. దాని ఆధారంగా చర్చలు జరిపినట్లు పునరుద్ఘాటించారు. భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. అయినప్పటికీ హర్మూజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన నౌకలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. -
UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే..
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఏకంగా 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం.అసలేం జరిగింది?పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, క్షిపణి దాడులు లేదా రక్షణ వ్యవస్థల ఆపరేషన్లను చిత్రీకరించవద్దని యూఏఈ ప్రభుత్వం గతంలోనే స్థానికులను హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాజాగా యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ 25 మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు (వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు). అంతకుముందు శనివారం పది మందిని (వీరిలో ఇద్దరు భారతీయులు) అరెస్ట్ చేశారు. మొత్తంగా 19 మంది భారతీయులు ఇప్పుడు జైలు పాలయ్యారు.అరెస్ట్ అయిన వారిపై మూడు రకాల ఆరోపణలు..నిందితులు మూడు గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారుక్షిపణుల వీడియోలు: ఆకాశంలో వెళ్తున్న క్షిపణులను లేదా వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి, వాటికి భయాందోళనలు కలిగించే శబ్దాలను జోడించి ప్రచారం చేయడం.ఏఐ ఫేక్ దృశ్యాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ఉపయోగించి పేలుళ్లు జరిగినట్లు కృత్రిమ వీడియోలను సృష్టించడం. ఇతర దేశాల్లో జరిగిన పాత ఘటనలను యూఏఈలో జరిగినట్లుగా నమ్మించడం.శత్రు దేశాలకు మద్దతు: యూఏఈ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలను, వారి సైనిక చర్యలను పొగుడుతూ పోస్టులు పెట్టడం.శిక్షలు కఠినం: లక్ష దిర్హమ్ల జరిమానాఈ తరహా చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని అటార్నీ జనరల్ హెచ్చరించారు. నిందితులకు కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు, ఒక లక్ష దిర్హమ్లకు (సుమారు రూ. 22 లక్షలకు పైగా) తగ్గకుండా జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీరందరినీ అదుపులోకి తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్, త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించింది.ఇది కూడా చదవండి: మెగా ఫైట్ @2026: పేలుతున్న ‘సీనియర్ల’ మాటల తూటాలు -
సంచలనం.. యుద్ధంలో తొలిసారి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’
టెహ్రాన్: పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా మెరుపు దాడులు చేస్తున్నాయి. ఇరాన్లో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని ఛేదిస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో అమెరికా-ఇజ్రాయెల్ను బయపెట్టేలా యుద్ధంలో తొలిసారి ఇరాన్ అమ్మల పొదిలో అస్త్రాన్ని బయటకు తీసినట్లు ఇరాన్ మీడియా సంస్థ ప్రెస్టీవీ తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధం మొదలవగా.. ఆదివారం ఆ అస్త్రాన్ని బయటకు తీసింది. ప్రయోగించింది. ప్రస్తుతం ఇరాన్ క్షిపణులపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది. ఇజ్రాయెల్, అమెరికాకు షాకిస్తూ ఇరాన్ రెండు దశల బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసి ఇటీవల పరీక్షించింది. వీటిలో ప్రధానమైనది సెజ్జిల్ బాలిస్టిక్ క్షిపణి. సెజ్జిల్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, దాని విస్ఫోటన ప్రభావం భారీ స్థాయిలో ఉంటుంది. ఇరాన్ వద్ద సెజ్జిల్తో పాటు అషురా వంటి ఇతర క్షిపణులు కూడా ఉన్నాయి.సెజ్జిల్-2 అనేది రెండు దశల, ఘన-ఇంధన మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, మొత్తం బరువు 23,600 కిలోలు. ఇది 2,000 కి.మీ పరిధిలో దాదాపు 700 కిలోల పేలోడ్ను మోయగలదు. అధిక ఎత్తులో మలుపులు తిరే సామర్థ్యం కారణంగా దీనికి ‘డ్యాన్సింగ్ మిసైల్’ అనే పేరు వచ్చింది. ఈ ప్రత్యేకత వల్ల ఐరన్డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను తప్పించగలదు.సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం, సజ్జిల్ క్షిపణి ఘన-ఇంధన రూపకల్పన వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది పాత షహాబ్ సిరీస్ ద్రవ-ఇంధన క్షిపణుల కంటే వేగంగా తయారు చేయబడుతుంది. తక్షణ ప్రయోగానికి సిద్ధంగా ఉంటుంది.సెజ్జిల్ రూపకల్పనపై పని 1990ల ప్రారంభంలో ప్రారంభమైంది. 2008లో మొదటి పరీక్ష జరిగింది, ఆ సమయంలో క్షిపణి దాదాపు 800 కి.మీ ప్రయాణించింది. 2009లో రెండవ పరీక్షలో మార్గదర్శక వ్యవస్థలను అంచనా వేశారు. 2009 నుండి నాలుగు అదనపు పరీక్షలు జరిగాయి. ఆరవ పరీక్షలో క్షిపణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1,900 కి.మీ ప్రయాణించినట్లు సమాచారం. ఇరాన్ ఈ క్షిపణిని యుద్ధంలో బయటకు తీయడం, అమెరికా–ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు కొత్త సవాలుగా మారింది. -
దుబాయ్ ఎయిర్పోర్టులో భారీ ప్రమాదం.. విమానాలు బంద్
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మూడు దేశాల మధ్య దాడులు 17వ రోజుకు చేరుకున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకారంగా భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా దుబాయ్ ఎయిర్పోర్టు వద్ద ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో, ఎయిర్పోర్టులో విమాన సర్వీసులకు అధికారులు నిలిపివేసినట్టు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాల మేరకు.. దుబాయ్పై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్టు సమీపంలో ఓ ఇంధన ట్యాంక్పై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ ఘటన జరిగినట్లు సమాచారం. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయ అధికారులు విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.The drone crash near Dubai International Airport resulted in damage to one of the fuel tanks, and Dubai Civil Defense teams are currently working to control the fire, with no injuries recorded so far. Dubai Media Officepic.twitter.com/t5zmXfsWUD— Furkan Gözükara (@FurkanGozukara) March 16, 2026కాగా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రవాణా కేంద్రమైన దుబాయ్ విమానాశ్రయాన్ని ఇప్పటికే అనేకసార్లు ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటీవల మార్చి 7న కూడా దాడి జరిగింది. అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని ఇరాన్ పిలుపునిచ్చిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. కాగా, ఇరాన్ చమురు ఎగుమతులను నిర్వహించే ప్రధాన టెర్మినల్కు నిలయమైన ఖార్గ్ ద్వీపంపై ఇటీవల దాడులు చేయడానికి యూఏఈలోని ఓడరేవులు, రహస్య స్థావరాలను అమెరికా ఉపయోగించిందని ఇరాన్ ఆరోపించింది.మరోవైపు.. ఇరాన్ మిలిటరీ సదుపాయాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేపడతుండగా, ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకారదాడులు కొనసాగిస్తోంది.❗️🇮🇷⚔️🇦🇪 - A large fire broke out in the industrial zone adjacent to Dubai International Airport (DXB) following reports of an Iranian Shahed-136 drone—known in Russian service as the Geran-2—striking or being intercepted nearby. Visible flames and smoke prompted authorities to… pic.twitter.com/0u1m4Zgtqo— 🔥🗞The Informant (@theinformant_x) March 16, 2026 Todo el aeropuerto de #Dubai en la planta baja . No se han escuchado explosiones ni nada pero acaban de cerrar todos los pisos superiores incluidas las tiendasNo hay nadie arriba , solo un escuadrón de militares. pic.twitter.com/SJ0lc4FZWw— Don Hulio Mezquitas (@BuscaRaciocinio) March 15, 2026 -
ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. మరో జలసంధి బంద్!
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ షిప్పింగ్కు వీలుగా తెరిచే ఉంచుతామని ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రమే దాని గుండా అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ‘ఈ మార్గాన్ని ఇతర దేశాల నౌకలకు తెరిచే ఉంచుతాం. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా పలు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లాయి. కొన్ని షిప్పింగ్ కంపెనీలు భద్రతా కారణాలతో వేరే మార్గాలు ఎంచుకుంటున్నాయి’ అని ఆయన తెలిపారు.మరో జలసంధి బంద్..!మరోవైపు.. ఇరాన్ అండదండలున్న యెమన్ హౌతీ మిలిటెంట్లు ఆ దేశానికి మద్దతుగా అతి త్వరలో రణరంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన మార్గమైన బాబ్ ఎల్–మాండెబ్ జలసంధి కూడా మూతపడేలా కనిపిస్తోంది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రాలను మధ్యదరా సముద్రంతో అనుసంధానించే మాండెబ్పై హౌతీలకు గట్టి పట్టుంది. ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచడానికి దాన్ని మూసేస్తామని హౌతీలు చెబుతున్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టు వంటి హార్మూజ్ జలసంధి మూతపడటంతో ఇప్పటికే చమురు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. మాండెబ్ నుంచి కూడా రవాణా ఆగితే సరుకుల ధరలకు రెక్కలు రావడం ఖాయం. భారత్ వైపు చమురు నౌక.. భారత్కు చెందిన మరో నౌక ‘జగ్ లాడ్కీ’ భారీ చమురుతో యూఏఈలోని పుజైరా చమురు కేంద్రం నుంచి స్వదేశానికి బయల్దేరింది. పశ్చిమాసియా యుద్ధక్షేత్రం నుంచి క్షేమంగా బయటపడిన నాలుగో భారత నౌకగా నిలిచింది. పుజైరాపై భీకర దాడులు జరుగుతున్నా 80,800 టన్నుల ముడి చమురు నింపుకొని క్షేమంగా వస్తున్నట్లు కేంద్రం అదివారం వెల్లడించింది. -
ఇరాన్లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబీసీ హెచ్చరిక
జెరుసలేం: ఇరాన్పై ఇజ్రాయెల్,అమెరికా యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇరాన్ జరిపిన ప్రతి దాడుల్లో తాను మరణించినట్లు వస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఖండించారు. ‘అవును నేను మరణించా కాఫీ కోసం అంటూ ఓ కాఫీ షాపులో ప్రత్యక్షమయ్యారు. స్థానికులతో ముచ్చట్లు పెట్టారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ ప్రపంచ దేశాలకు సంకేతాలు పంపారు. -
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి
కైరో: గాజాపై ఇజ్రాయెల్ ఆదివారం మరోసారి భీకర వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భవతి, 8 మంది పోలీసులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.సెంట్రల్ గాజాలోని నుసెయిరత్ శరణార్థుల శిబిరంలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఒక బాలుడు, కవలలతో గర్భవతిగా ఉన్న అతడి తల్లి సహా నలుగురు చనిపోయారని అల్ అక్సా మార్టిర్స్ ఆస్పత్రి, ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 14 మంది గాయపడ్డారని వెల్లడించాయి. జవైదా సమీపంలో పోలీసు వాహనంపై జరిగిన మరో దాడిలో సీనియర్ పోలీసు అధికారి సహా 8 మంది చనిపోయారు. -
మొజ్తబాకు నోపో కవచం
శత్రు శేషం, రుణ శేషం, వ్రణ శేషం, అగ్ని శేషం ఉండకూడదంటారు. ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ విషయంలో అమెరికా కూడా ఈ సూత్రాన్నే పాటించే ప్రయత్నంలో ఉంది. తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మాదిరిగానే మొజ్తబాను కూడా అంతం చేయాలని చూస్తోంది. కానీ అదంత సులువు కాదని ఇరాన్ ధీమాగా చెబుతోంది. అందుకు కారణం ఒక్కటే. మొజ్తబా చుట్టూ ఉన్న అత్యున్నత రహస్య భద్రతా కమెండో విభాగం ‘నోపో’! ఏమిటీ నోపో? నోపో ఇరాన్ ప్రత్యేక రహస్య భద్రతా దళం. పార్సీ భాషలోని ‘నిరోయే విజేహ్ పాస్దరాన్ వేలాయత్’కు సంక్షిప్త రూపం. అంటే ‘పాలకులను కాపాడే ప్రత్యేక దళం’ అని చెప్పొచ్చు. ఇరాన్ పోలీస్ వ్యవస్థలో ఒక విభాగంగా నోపోను దశాబ్దాల క్రితం ఏర్పాటుచేశారు. మెరుపు వేగంతో పనిముగించే మెరికల్లాంటి కమెండోలు ఇందులో ఉంటారు. 1979లో ఇరాన్లో ‘ఇస్లామిక్ చైతన్యం’ తర్వాత తొలి సుప్రీం నేతగా ఆవిర్భవించిన అయతొల్లా రుహొల్లా ఖమేనీ కాలంలో తిరుగుబాటుదారుల నుంచి అగ్ర నేతల రక్షణ నిమిత్తం 28వ రొహల్లా డివిజన్ నుంచి నోపోను ఏర్పాటు చేశారు. ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన, పలుకుబడి గల సాయుధ విభాగమైన రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ)తో కూడా నోపోకు సంబంధం ఉండదు.కేవలం అగ్ర నేతల భద్రతపైనే ఇది దృష్టి సారిస్తుంది. వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. నోపో కమెండోల పని పూర్తిగా గోప్యంగానే కొనసాగుతుంది. ప్రమాదాన్ని పసిగట్టి ముందస్తు వ్యూహాలు రచించి అమలు చేయడం, పరిస్థితి హఠాత్తుగా అదుపు తప్పితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లడం ఈ దళం ప్రత్యేకత. నాలుగు నోపో బ్రిగేడ్లు మొజ్తబా రక్షణలో నిరంతరం నిమగ్నమైనట్టు తెలు స్తోంది. మహ్ షాద్, ఇస్ఫహాన్ అణుకేంద్రాల భద్రత కోసం మరో రెండు యూ నిట్లు పని చేస్తున్నట్టు సమా చారం. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాల్గొనడం, బందీ లను విడిపించడం, ప్రభుత్వ భవనాలతోపాటు వ్యూహాత్మక ప్రదేశాలకు రక్షణ కలి్పంచడం వంటి విధులను కూడా నోపో చూస్తుందని యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు. కఠిన శిక్షణ యుక్త వయసులో ఉండి శరవేగంగా స్పందించగల నైపుణ్యం, తెలివితేటలు, దేహదారుఢ్యం, సాంకేతికతపై పట్టు, గురిపెట్టి కాల్చే నైపుణ్యం... ఇలా పలు అర్హతలున్న వారిని అన్నిరకాలుగా వడపోసిన అనంతరం నోపోలోకి తీసుకుంటారు. సాధారణ పోలీస్ శిక్షణలో అత్యంత ప్రతిభ కనబర్చిన వాళ్లను నోపో కోసం ఎంపిక చేస్తారు. వారికి మళ్లీ కఠినమైన కమెండో శిక్షణ ఇస్తారు. నోపో మాజీ కమెండో హొస్సేన్ అమ్జాదియాన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. ‘‘అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ అవలీలగా పని ముగించే తెగువ, నైపుణ్యం నోపో కమెండోల సొంతం. కఠినమైన కమెండో శిక్షణ పూర్తయ్యాక కూడా సభ్యుని ప్రవర్తనపై అనుమానముంటే తక్షణం విధుల నుంచి తప్పిస్తారు.స్వీయరక్షణ విద్యతో పాటు మార్షల్ ఆర్ట్స్ సైతం వచ్చి ఉండాలి. స్నైపర్ షూటింగ్లో నైపుణ్యముండాలి. పరిసరాలను డేగ కళ్లలో గమనిస్తుండాలి. అగ్ర నేతల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసే తెగువ కావాలి’’ అని ఆయన చెప్పారు. 1999– 2022 మధ్య ఇరాన్లో సంక్షోభం లేవదీసేందుకు జరిగిన పలు ప్రయత్నాలను వమ్ము చేసేందుకు ఖమేనీ ప్రభుత్వం నోపో కమెండోలను విజయవంతంగా ఉపయో గించినట్టు గతంలో వార్తలొచ్చాయి. ‘‘దేశం పట్ల అత్యంత అంకితభావం చూపడమే నోపో సభ్యుల ప్రాథమిక లక్షణం’’ అని పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (ఎన్సీఆర్ఐ) పార్టీ నేత అలీ సఫావీ చెప్పారు. నోపో అరాచకాలకు పాల్పడుతోందని, మానవహక్కులను హరిస్తోందని అమెరికా ఆరోపించింది. 2021లోనే నోపోపై ఆంక్షలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇస్ఫహాన్పై బాంబుల వర్షం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం ఆదివారం 16వ రోజుకు చేరింది. ఇరాన్లోని పారిశ్రామిక నగరం ఇస్ఫహాన్పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. వాయవ్య ఇరాన్లో ఇజ్రాయెల్కు సహకరించేందుకు ప్రయతి్నస్తున్నారన్న ఆరోపణలతో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్లో దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని అమెరికా పరిశ్రమలను బయటకు తరలించాలని హెచ్చరించింది.అమెరికా సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఇరాన్లో సైనికేతర పరిశ్రమలపై జరిగిన దాడుల్లో సాధారణ పౌరులు మృతి చెందారు. ఇందుకు ప్రతీకారం తప్పదని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తామని వెల్లడించింది. ఇరాన్ సుప్రీం కమాండర్ మొజ్తబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు.అమెరికా సైన్యం పశ్చిమాసియాలో క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగిస్తోందని, వాటిని ధ్వంసం చేస్తామని అన్నారు. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదని ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా ప్రకటించారు. అందులో కొన్ని కీలక మార్గాలను మాత్రమే తమ నియంత్రణలోకి తీసుకున్నామని తెలిపారు. ఇరాన్పై యుద్ధాన్ని కనీసం మరో మూడు వారాల పాటు కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. అల్–డాఫ్రా ఎయిర్బేస్పై 10 క్షిపణులు ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్–అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్లో 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,400 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్ దాడిలో తమ సీనియర్ మిలటరీ అధికారి బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా జలాలీ నసబ్ మృతి చెందినట్లు ఇరాన్ తెలిపింది. మరోవైపు గల్ఫ్లో ఇరాన్ దాడుల పరంపరం ఆగడం లేదు. రియాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంపై ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను తుత్తునియలు చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. అల్–ఖర్గ్పై ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ మిస్సైళ్లను, తూర్పు ప్రావిన్స్లో రెండు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ప్రకటించింది.యూఏఈలోని అమెరికా అల్–డాఫ్రా ఎయిర్బేస్పై ఐఆర్జీసీ 10 క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్లో సైరన్ల మోత వినిపించింది. దాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బహ్రెయిన్లో ఆరుగురు, యూఏఈలో 33 మంది అరెస్టయ్యారు. వారిలో పలువురు భారతీయులున్నారు. ఇరాన్ దాడుల్లో గాయపడిన 108 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ భూభాగం నుంచి హెజ్»ొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించారు.రాకెట్ల శిథిలాలు తాకడంతో టెల్ అవీవ్, హోలోన్ సిటీలో మంటలు చెలరేగాయి. కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో ఓ అపార్టుమెంట్ భవనం ధ్వంసమైంది. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇజ్రాయెల్ వద్ద బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల కొరత నెలకొంది. యుద్ధం మరింత ముదిరితే ఇరాన్, హెజ్»ొల్లా దాడులను తిప్పికొట్టడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. ఇరాన్తో ఒప్పందానికి సిద్ధంగా లేం: ట్రంప్ స్పష్టీకరణయుద్ధాన్ని ముగించే విషయంలో తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ ఆసక్తి చూపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ, అందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు సమంజసంగా లేవని అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. హార్మూజ్ నుంచి వచ్చే చమురుపై ఆధారపడే దేశాలు యుద్ధనౌకలను పంపించాలని ట్రంప్ కోరారు. చమురు నౌకలకు ఇవి ఎస్కార్ట్గా పని చేస్తాయన్నారు. -
అమెరికా అంచనాలు ఎలా తప్పాయ్? గల్ఫ్ భవిష్యత్తు ఏంటి?
ఇరాన్ తమకు లొంగిపోతుందని అమెరికా అనుకుంది. ఇరాన్ వద్ద ఆయుధాలు లేకుండా చేస్తే తమకు ఏ ముప్పూ ఉండబోదని ఇజ్రాయెల్ భావించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రారంభించాయి. అయితే, ఊహించని విధంగా ఇరాన్ ఎదురు నిలుస్తోంది. ప్రతీకారదాడులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ ప్రతిస్పందన అమెరికా-ఇజ్రాయెల్ అంచనాలను ఎలా తారుమారు చేసింది? ఇరాన్ దాడులు, ఇజ్రాయెల్ తీరుతో గల్ఫ్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?అమెరికా ప్రకటించిన అంచనాలు, లక్ష్యాల ప్రకారం ఇరాన్పై సైనిక చర్యలు ఇప్పటికే ముగిసి, ఇజ్రాయెల్-అమెరికా విజయం సాధించాల్సింది. ఇరాన్లో పాలనావ్యవస్థ ఇప్పటికే కూలిపోవాలి. అణు మౌలిక వసతులు మళ్లీ ఎప్పటికీ కోలుకోలేని విధంగా ధ్వంసం కావాలి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్ర నాయకులను లేకుండా చేయడంతో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభించిన సమయంలోనే అసాధ్యమైన పనిని సాధించినట్టు చాలామంది భావించారు. వారి అంచనాల ప్రకారం ఇది ముయామ్మర్ గడాఫీ, సద్దాం హుస్సేన్ పట్టుబడిన ఘటనలకన్నా పెద్ద విజయం.ఊహించని విధంగా ఇరాన్ పోరాటం అయితే, కొన్ని గంటల్లోనే వందల సంఖ్యలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ లక్ష్యాలు, సమీప గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై దాడి చేశాయి. వాటిలో అధిక శాతం క్షిపణులు లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్, అమెరికా ముందుగానే ఇలాంటి సైనిక ఘర్షణను ఊహించి ఉండొచ్చు. కానీ, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఆస్తులను లక్ష్యాలుగా ప్రకటించడంతో ఇరాన్ ఈ చర్యను సంప్రదాయ ఆపరేషన్ నుంచి అస్థిరత సృష్టించే ప్రాంతీయ యుద్ధంగా మార్చింది. గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వలేదు. గల్ఫ్లో అమెరికా సైనిక స్థావరాలు ఆయా దేశాలకు ప్రమాదంగా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ చర్చలు జరపాలంటే గల్ఫ్ దేశాల నుంచి అమెరికా స్థావరాలు తొలగించాలని ఇరాన్ షరతు పెట్టింది.మరింత ఆయుధీకరణ వైపు ఇరాన్? యుద్ధం ప్రారంభమైన 2 వారాల్లోనే ఒక విషయం స్పష్టమైంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇరాన్ను మరింత ఆయుధీకరణ వైపు నడిపించనున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ సహజ వనరులను ఆయుధంగా వినియోగించే అవకాశమూ ఉంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఓ ఆయుధంగా వాడుతోంది. అంటే గల్ఫ్ ప్రాంత సముద్రం నుంచి ప్రపంచానికి చమురు సరఫరా వెళ్లే కీలక సముద్ర మార్గంలో ఆటంకాలు కల్పిస్తోంది.చూస్తుంటే ఇప్పట్లో ఇరాన్ పాలనా వ్యవస్థ కుప్పకూలే అవకాశాలు కనిపించడం లేదు. పశ్చిమాసియా భద్రత, స్థిరత్వం మాత్రమే కాదు ప్రపంచ ఇంధన సరఫరా కూడా ప్రభావితమైంది. ఇరాన్లో పాలనా మార్పు, అణు నిరాయుధీకరణ చేస్తామని ప్రజలకు ఇజ్రాయెల్, అమెరికా వాగ్దానాలు చేశాయి. ఆ లక్ష్యాలు ఎన్నటికి నెరవేరతాయో ఎవరూ చెప్పలేరు. ఇప్పట్లో ముగిసే యుద్ధం కాదిది! కొందరు ఇజ్రాయెల్ నేతలు ఇరాన్పై భూతలంలో భీకర దాడులు చేయాలని భావిస్తున్నారు. అమెరికా నేతల్లో అసహనం పెరుగుతోంది. “షాక్ అండ్ ఆ” వ్యూహం ప్రకారం యుద్ధం ముగియదని విశ్లేషకులు చెబుతున్నారు. షాక్ అండ్ ఆ వ్యూహం అంటే శత్రువును ఒక్కసారిగా భారీ సైనిక దాడులతో మానసికంగా కుదేలు చేయడం.యుద్ధ లక్ష్యాలు సమయ పరిమితితో ఉంటాయి. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోకూడదని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఈ లక్ష్యానికి అంతర్జాతీయ మద్దతు ఉంది. ఇరాన్ పొరుగు దేశాలు, టర్కీ, రష్యా, చైనా కూడా దీనికి ఒప్పుకున్నాయి. ఈ అంతర్జాతీయ ఒత్తిడి ఇరాన్ను అణ్వాయుధ ప్రోగ్రాం కొనసాగించకుండా నిరోధించింది. అదే సమయంలో 2015లో జరిగిన జాయింట్ కంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందుకు సంబంధించిన ఒప్పందానికి అంగీకరించేందుకు కారణమైంది. ఇది ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం.ఇరాన్ మతపరమైన వాదనను కూడా వినిపిస్తుంది. అణ్వాయుధ తయారీ ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని చెబుతుంది. అయితే యురేనియం శుద్ధి స్థాయి పెరుగుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇరాన్ తెలిపిన వివరాల ప్రకారం తన అణు విద్యుత్ కార్యక్రమం హక్కును గుర్తిస్తేనే యరేనియం శుద్ధిని ఆపుతామని చెబుతోంది. అణు విద్యుత్ కార్యక్రమాన్ని విదేశాలకు మార్చాలన్న ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. భారతదేశం సహా అనేక దేశాలు ఇరాన్కు అణు విద్యుత్ కార్యక్రమం నిర్వహించే హక్కు ఉందని గుర్తించాయి.అయితే ఇజ్రాయెల్ దృక్కోణం పూర్తిగా వేరేలా ఉంది. ఇరాన్ ను పూర్తిగా అణు నిరాయుధీకరణ చేయాలని, భవిష్యత్తులో ఇజ్రాయెల్కు ముప్పు కలిగించే ఆయుధాలు కూడా ఆ దేశం వద్ద ఉండొద్దని కోరుతోంది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి.ఈ యుద్ధంలో ఇరాన్ ఒక అంశంలో విజయవంతమైంది. ఇజ్రాయెల్ సైనిక శక్తి కేవలం ఇరాన్కే కాక గల్ఫ్ దేశాలకు కూడా ముప్పుగా మారవచ్చని గల్ఫ్ దేశాలను నమ్మించింది.గల్ఫ్పై ప్రభావంగల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినప్పటికీ ఆయా దేశాలు శాంతియుత వైఖరితో ఉన్నాయి. అమెరికా సెనేటర్ లిన్డే గ్రాహం సహా పలువురు నాయకులు సౌదీ అరేబియాను యుద్ధంలో చేరాలని కోరారు. కానీ గల్ఫ్ దేశాలు ఇరాన్తో ఘర్షణను పెట్టుకోలేదు. ఇజ్రాయెల్, అమెరికా చర్యలకు గల్ఫ్ ప్రజల్లో మద్దతు కనిపించలేదు. అయితే, గల్ఫ్ దేశాలను ఇజ్రాయెల్ భద్రతకు కవచంగా ఉపయోగిస్తున్నారని చాలా మందిలో అసంతృప్తి పెరుగుతోంది. ప్రాంతీయ నాయకులు కూడా గల్ఫ్ భద్రతను పట్టించుకోలేదని విమర్శించారు. 2023లో జరిగిన సౌదీ అరేబియా-ఇరాన్ సయోధ్య తర్వాత ఇజ్రాయెల్ కఠిన విధానాలకు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వడం లేదు. ఇజ్రాయెల్-గల్ఫ్ భద్రతా వ్యవస్థను నిర్మించేందుకు రూపొందించిన అబ్రహం ఒప్పందాలు ఇప్పుడు అమలులో లేవు. సౌదీ సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రాంతీయ భద్రతా వ్యవస్థపై దృష్టి పెట్టాయి. -
బ్రిక్స్లో ఏకాభిప్రాయ గండం!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న వివాదంపై బ్రిక్స్ కూటమిలో ఉమ్మడి వైఖరిని రూపొందించడం సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ పరిణామాల్లో బ్రిక్స్ సభ్య దేశాలకు నేరుగా ప్రమేయం ఉండటమే దీనికి ప్రధాన కారణమని విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.జైశంకర్తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలుఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో భారత్ నాయకత్వంలోని బ్రిక్స్ కూటమి చురుకైన పాత్ర పోషించాలని అరాగ్చి ఈ సందర్భంగా ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ పోన్ సంభాషణ తర్వాత జైశంకర్ స్పందిస్తూ.. పశ్చిమాసియా పరిస్థితులపై బ్రిక్స్ సభ్య దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. అయితే, కూటమిలోని కొన్ని దేశాలు ఈ వివాదంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములు కావడమే ఉమ్మడి ప్రకటనకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది.ఏకాభిప్రాయానికి ఆటంకాలు ఇవే..బ్రిక్స్ వేదికగా యుద్ధం పరంగా ఒకే మాట వినిపించడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. దీనికి కొన్ని అంశాలు అంశాలు కారణమవుతున్నాయి. జనవరి 2024లో బ్రిక్స్లో చేరిన ఇరాన్ ఈ వివాదంలో ప్రధాన పక్షంగా ఉంది. మరో సభ్య దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఈ ప్రాంతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. (2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇరాన్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు) సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక ప్రయోజనాలు వేర్వేరుగా ఉండటంతో ఈ సంఘర్షణపై ఒకే రకమైన వైఖరిని తీసుకోవడంలో ప్రతిష్టంభన నెలకొంది.భారత్ సారథ్యంబ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సంక్షోభ పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సభ్య దేశాల మధ్య చర్చలను భారత్ సమన్వయం చేస్తోంది. ‘మార్చి 12న జరిగిన వర్చువల్ బ్రిక్స్ షెర్పా సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. పశ్చిమాసియాలోని సభ్య దేశాల నాయకులతో భారత అగ్రనాయకత్వం నిరంతరం టచ్లో ఉంది’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
పిల్లలను చంపే నేరస్థున్ని లేపేస్తాం: ఇరాన్
టెహ్రాన్: ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఉనికిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రాణాలతో ఉన్నారా, లేరా? ఉంటే ఎందుకు బయిటకి రావడం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. బెంజిమిన్ నెతన్యాహు బ్రతికే ఉంటే ఎట్టిపరిస్థితుల్లో ఆయనను చంపి తీరుతామని హెచ్చరించింది.పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం నెతన్యాహు క్షేమంగా ఉన్నారా లేరా అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇటీవలే ఆయన ప్రసంగంతో ఒక వీడియో వచ్చినా అది ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ పలువురు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటనలో " పిల్లలను చంపిన నేరస్థుడు బతికి ఉన్నాడో లేరో తెలియదు ఒక వేళ బతికి ఉంటే మేము పూర్తి శక్తితో అతనిని వెంటాడి చంపేస్తాము" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభంలో ఇరాన్లోని ఓ బాలికల పాఠశాలపై దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 180 కిపైగా అభం శుభం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ దాడి అనుకోకుండా జరిగిందని అమెరికా చెబుతుండగా తెలిసే చేశారని ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుని పిల్లలను చంపే నేరస్థుడు అని ఇరాన్ పిలుస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తదుపరి ఆ బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీపైన దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలను లేపేస్తాం అని పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో దాదాపు రెండువేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ, శాంతి మంత్రం కన్నా శతఘ్నుల మోతకే ప్రాధాన్యత పెరుగుతోంది. దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, అంతర్యుద్ధ భయాలు సామాన్యుడిని భయపెడుతుంటే.. ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలకు మాత్రం ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా 2021-2025 మధ్య కాలానికి సంబంధించి ఎస్ఐపీఆర్ఐ(స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచ ఆయుధ మార్కెట్ ఏ విధంగా అగ్రరాజ్యాల గుప్పిట్లోకి వెళ్తోందో స్పష్టమవుతోంది.అమెరికా ఏకఛత్రాధిపత్యంప్రపంచ ఆయుధ విక్రయాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం ఎగుమతుల్లో 42% వాటాను సొంతం చేసుకోవడం ద్వారా తన సమీప ప్రత్యర్థి కంటే నాలుగు రెట్లు అధికంగా ఆయుధాల వ్యాపారం చేస్తోంది. అమెరికా ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కొన్ని కారణాలున్నాయి.అత్యాధునిక యుద్ధ విమానాలు (ఎఫ్-35 వంటివి), క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా సాంకేతికతలో అమెరికాకు సాటిలేదు.నాటో దేశాలతో పాటు ఆసియా, మిడిల్ఈస్ట్ దేశాలతో ఉన్న రక్షణ ఒప్పందాలు అమెరికా ఆయుధాలకు నిరంతర డిమాండ్ను కల్పిస్తున్నాయి.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికా వైపు మొగ్గు చూపడం వల్ల ఈ వ్యాపారంలో మరింత వృద్ధి నమోదైంది.ఎస్ఐపీఆర్ఐ నివేదిక ప్రకారం.. ప్రపంచ దేశాల ఆయుధ ఎగుమతుల వాటా (2021–25)దేశంఎగుమతుల వాటా (%)యూఎస్42ఫ్రాన్స్10రష్యా7జర్మనీ6చైనా6ఇటలీ5ఇజ్రాయెల్4యూకే3దక్షిణ కొరియా3స్పెయిన్2ఇతర దేశాలు12 చైనాను వెనక్కి నెట్టిన జర్మనీ.. యూరప్ జోరుఆయుధ ఎగుమతుల్లో జర్మనీ చాలా పురోగతి సాధిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. మొత్తంగా 6% వాటాతో జర్మనీ ఇప్పుడు చైనాను అధిగమించి నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్లో భద్రతా ఆందోళనలు పెరగడం, నాటో దేశాలు స్వదేశీ (యూరోపియన్) పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం జర్మనీకి కలిసొచ్చింది. మరోవైపు, చైనా తన ఎగుమతులను ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ దేశాలకే పరిమితం చేస్తోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల పాశ్చాత్య దేశాలు చైనా ఆయుధాల పట్ల విముఖత చూపడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.దక్షిణ కొరియాప్రస్తుతం ఆయుధ మార్కెట్లో దక్షిణ కొరియా చాలా దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తంగా కేవలం 3% వాటా ఉన్నప్పటికీ అది వేగంగా వృద్ధి చెందుతోంది. ఇతర దేశాల కంటే తక్కువ సమయంలో ఆయుధాలను డెలివరీ చేయగల సామర్థ్యాన్ని ఇది సొంతం చేసుకుంటోంది. అత్యాధునిక ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలను తక్కువ ధరకు అందిస్తోంది. తూర్పు యూరప్, ఆగ్నేయాసియా దేశాలు దక్షిణ కొరియా ఆయుధాల కోసం ఆర్టర్లు పెడుతున్నాయి.ఆయుధాల ఎగుమతి కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక దేశం భౌగోళిక రాజకీయ ప్రాబల్యానికి నిదర్శనం. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటుండగా, దక్షిణ కొరియా వంటి కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. శాంతి చర్చల కంటే ఆయుధ ఒప్పందాలే వేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ‘మారణాయుధాల వ్యాపారం’ ప్రపంచాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.ఇదీ చదవండి: ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ! -
సరదా కోసమైనా ఖార్గ్ దీవిపై దాడి చేస్తాం : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేయని చర్యలను ఇకపై చేపట్టబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఇంధన ఎగుమతిలో కీలకమైన ఖార్గ్ ఐలాండ్పై సరదా కోసమైనా దాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు.అదే సమయంలో హర్మూజ్ జలసంధిని కాపాడేందుకు యుద్ధనౌకలను పంపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ప్రతిగా, ఇరాన్ దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. తాను విధించిన షరతులకు లోబడి ఇరాన్ నడుచుకోవాలని, లేదంటే యుద్ధం తీరుతెన్నులు, లక్ష్యాల్ని ఎప్పటికప్పుడూ మారుస్తుంటామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేలా పశ్చిమాసియా దేశాలు ట్రంప్తో సంప్రదింపులు జరిపాయి. ట్రంప్తో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ తన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో, ఆ దేశానికి ఆర్థిక ఆయువుపట్టైన ఖార్గ్ దీవిపై దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఖార్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులు చేస్తామని ఆయన ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.వాస్తవానికి అమెరికా ఇప్పటి వరకు ఖార్గ్ దీవిలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. కానీ చమురు కేంద్రాలపై దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇరాన్ తన డిమాండ్లకు తలొగ్గకపోవడంతో ఇప్పు ట్రంప్ ఖార్గ్ ఐలాండ్పై పడినట్లు సమాచారం.ఖార్గ్ ఐలాండ్పై దాడులు జరగడం వల్ల ఇరాన్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి సమీపంలో ఖార్గ్ ద్వీపం ఉండటం.. చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. గ్యాస్ కొరత ప్రజలను మరింతగా వేధించనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఆ దేశం అతలాకుతలంగా మారింది. సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణంతో రాజకీయంగా సైతం సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలోనే ఇరాన్ బహిష్కృత రాజు రెజా పహ్లావి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు.టెహ్రాన్ మునుపెన్నడూ లేని సంక్షోభాలని చూస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతమవుతున్న ఆ దేశం రాజకీయంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి అణుచర్చల విఫలంతో పాటు ఆ దేశంలో ప్రజలు జరిపిన నిరసనలు సైతం ఒక కారణం. ఇస్లామిక్ ప్రభుత్వ కఠిన చట్టాలు, అవినీతిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలతో రోడ్లెక్కారు. దీంతో ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో వారిని అణిచివేసింది. వేలాది మందిని కాల్చి చంపింది. ఈ విషయంలో మెుదటి నుంచి ఇరాన్ను వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ ఇదే సాకుగా భావించి యుద్ధాన్ని ప్రకటించారు.అయితే యుద్దం ప్రారంభంలోనే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని హతమార్చారు. ప్రస్తుతం సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీని సైతం లేపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ బహిష్కృత యువరాజు రెజాపహ్లవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ"ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే వెను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నా నాయకత్వంలో ఇరాన్ని పాలించడానికి ప్రతినిధి వర్గం సిద్ధంగా ఉంది. కొద్దికాలంలోనే ఇరాన్లో శాంతి భద్రతలు, స్వేచ్ఛా తిరిగి పునరుద్ధరిస్తాం." అని ప్రకటనలో తెలిపారు.దేశంలో తిరిగి శాంతిని పునరుద్ధరించడానికి స్థానికంగా ఉన్న వారితో పాటు విదేశాలలో ఉన్న నిపుణులను నియమించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధి కోసం “ఇరాన్ ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్” అనే కార్యక్రమం కూడా రూపొందించబడిందని ఇస్లామిక్ ప్రభుత్వం పడిపోయిన మొదటి 180 రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, కొత్త రాజ్యాంగం రూపకల్పన, ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) వంటి అంశాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య పాలనతోనే ఇరాన్లో అభివృద్ధి సాధ్యం అని రెజా పహ్లవీ పేర్కొంటున్నారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది.దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆసమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు. -
ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు..
అమెరికా రాజకీయ రంగంలో ‘ట్రంప్’ అనేది ఒక బ్రాండ్. ఇప్పుడు ఆ కుటుంబం నుండి మరో శక్తివంతమైన గొంతు ప్రపంచానికి వినిపిస్తోంది. ఆమెనే లారా ట్రంప్. కేవలం డోనాల్డ్ ట్రంప్ కోడలిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న లారా గురించి ఇప్పుడు ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. ఫోక్స్ న్యూస్ హోస్ట్గా, రాజకీయ విశ్లేషకురాలిగా ఆమె ప్రస్థానం దూసుకుపోతోంది. ఆమెకు సంబంధించిన ఐదు షాకిచ్చే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..ట్రంప్ కుటుంబంలో కీలకంలారా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవ కుమారుడు ఎరిక్ ట్రంప్ను 2014లో వివాహం చేసుకున్నారు. అలా ట్రంప్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన ఆమె, అనతి కాలంలోనే ఆ కుటుంబంలో అత్యంత కీలకమైన, నమ్మకస్తురాలైన మనిషిగా మారారు.రాజకీయాల్లో చక్రం తిప్పుతూ..కేవలం ఇంటికే పరిమితం కాకుండా, రిపబ్లికన్ పార్టీలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2024లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) కో-చైర్గా బాధ్యతలు చేపట్టి, పార్టీ నిధుల సేకరణలో, ఎన్నికల వ్యూహరచనలో తనదైన ముద్ర వేశారు.ఫోక్స్ న్యూస్ స్టార్ హోస్ట్గా..మీడియా రంగంలోనూ లారా తన సత్తా చాటుతున్నారు. 2025 ఫిబ్రవరిలో ఆమె ఫోక్స్ న్యూస్లో ‘మై వ్యూ విత్ లారా ట్రంప్’ (My View with Lara Trump) అనే సొంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షోలో జాతీయ భద్రత, రాజకీయ పరిణామాలపై ఆమె చేసే విశ్లేషణలకు విపరీతమైన క్రేజ్ ఉంది.పబ్లిక్ లైఫ్ ఒత్తిడిపై ఓపెన్ కామెంట్స్రాజకీయాల్లోకి రాకముందు ఉన్న సాధారణ జీవితాన్ని తాము అప్పుడప్పుడు మిస్ అవుతుంటామని లారా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష బరిలోకి దిగిన తర్వాత తమ కుటుంబంపై పెరిగిన నిఘా, విమర్శల కారణంగా తమ పాత రోజులను గుర్తుచేసుకుంటామని ఆమె చెబుతుంటారు.వ్యక్తిగత జీవితంలారా, ఎరిక్ దంపతులకు ల్యూక్, కరోలినా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ వేడుకల్లో ఆమె తరచూ కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ట్రంప్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లారా ట్రంప్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా కనిపిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా? -
మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో లేడన్నారు. ఆయన మరణించినట్లు తాను వార్తలు విన్నానని పేర్కొన్నారు. అయితే ఇదివరకే ఇరాన్ మోజ్తాబా ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసింది ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ అధినేతల ఉనికిపై చర్చ జోరుగా నడుస్తోంది. మార్చి 2న ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై ఇరాన్ దాడి జరిపింది. ఈ వివరాలను ప్రకటిస్తూ నెతన్యాహు అదృష్టం ఏలా ఉందో తెలియలేదు. అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ రోజు నుంచి నెతన్యాహు ఆరోగ్యంపై పుకార్లు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ నెతన్యాహుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది. అందులో నెతన్యాహు కుడిచేతికి ఆరువేళ్లు ఉన్నాయని అది ఏఐ జనరేటడ్ వీడియో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.మరో వైపు ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదే విధమైన ఆరోపణలు ప్రచారమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వారిని లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే సుప్రీం లీడర్గా మోజ్తాబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజులకే ఇరాన్పై జరిపిన దాడుల్లో ఆయనకు తీవ్రగాయాలయ్యాయని కోమాలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పందించారు. శనివారం ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ " మోజ్తాబా ఖమేనీ బ్రతికే ఉన్నాడో లేదో తెలియదు. ఆయన గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఆయన ప్రాణాలతో లేడని నేను విన్నాను. ఒక వేళ ప్రాణాలతో ఉంటే వారి దేశం కోసం తెలివిగా ఆలోచిస్తారు. అది ఆయన లొంగిపోవడమే" అని ట్రంప్ అన్నారు.కాగా మోజ్తాబా ఖమేనీ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. సుప్రీం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం రాతపూర్వక ఆదేశాలు మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల ఇరాన్పై జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కాలు పోయిందని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఇరాన్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆయనపై మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. -
ఏమీ తినకున్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది?
మధుమేహం అనేది కేవలం తీపి పదార్థాలు, పిండి పదార్థాలు తింటేనే పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి మనం ఏమీ తినకపోయినా, కడుపు ఖాళీగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యాలను కెనడాకు చెందిన డాక్టర్ రాచెల్ వాంగ్, డాక్టర్ చిరాగ్ టాండన్లు వివరించారు. మనం చేసే నాలుగు చిన్న పొరపాట్లు మన ప్రాణాల మీదకు తెస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.నిద్ర లేమి: ఇన్సులిన్కు శత్రువుచాలామంది పని ఒత్తిడిలోనో, మొబైల్ ఫోన్లు చూస్తూనో రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఎవరైతే రాత్రిపూట ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతారో, వారిలో ఉదయాన్నే ‘ఫాస్టింగ్ బ్లడ్ షుగర్’ అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర సరిగ్గా లేనప్పుడు శరీరం ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు గురవుతుంది. అంటే శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా వాడుకోలేక, కాలేయం నుంచి గ్లూకోజ్ను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తుంది. అందుకే మధుమేహ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా 7-8 గంటల పాటు నిద్ర పోవాలి.మానసిక ఒత్తిడి: సైలెంట్ కిల్లర్ఎవరైనా సరే మానసిక ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో ‘కోర్టిసాల్’, ‘అడ్రినలిన్’ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించే క్రమంలో కాలేయంలో నిల్వ ఉన్న గ్లూకోజ్ను రక్తం వైపు మళ్లిస్తాయి. ఫలితంగా పూటంతా ఉపవాసం ఉన్నా సరే, ఒత్తిడి కారణంగా షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. ప్రశాంతంగా ఉండటం కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు, షుగర్ కంట్రోల్కు కూడా చాలా అవసరమని వెద్యులు చెబుతుంటారు.ఖాళీ కడుపుతో కాఫీ: ఒక హెచ్చరికఉదయాన్నే ‘బెడ్ కాఫీ’ తాగే అలవాటు ఉందా? అయితే మీరు జాగ్రత్తపడాల్సిందే. ఖాళీ కడుపుతో కెఫిన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. ముఖ్యంగా కాఫీలో చక్కెర, క్రీమ్ జోడిస్తే ఆ ప్రభావం రెట్టింపు అవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కాఫీ తాగాలనుకుంటే, అల్పాహారం తర్వాత లేదా బ్లాక్ కాఫీని మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.భోజనం మానేయడం: అస్సలు చేయకూడదుబరువు తగ్గాలనో లేదా బిజీ షెడ్యూల్ వల్లో భోజనం మానేస్తే షుగర్ తగ్గుతుందని చాలామంది పొరబడతారు. కానీ, ఎక్కువ సేపు శరీరం ఆకలితో ఉన్నప్పుడు, దానికి కావాల్సిన శక్తి కోసం కాలేయమే సొంతంగా గ్లూకోజ్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో అస్థిరత ఏర్పడి, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్రమబద్ధమైన సమయాల్లో భోజనం చేయడం రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.జీవనశైలి మార్పులే అసలైన మందుఈ నాలుగు అంశాలను గమనిస్తే, రక్తంలో చక్కెర పెరగడానికి కేవలం ఆహారమే కాదు, మన దైనందిన అలవాట్లు కూడా ప్రధాన కారణమని అర్థమవుతోంది. సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వంటివి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి.వైద్యుల సలహా తప్పనిసరిఆరోగ్యం విషయంలో సొంత నిర్ణయాల కంటే నిపుణుల సలహాలే సురక్షితంగా ఉంచుతాయి. ఎవరైనా సరే వారి జీవనశైలిలో లేదా డైట్ ప్లాన్లో ఏవైనా మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. నిరంతరం గ్లూకోజ్ లెవల్స్ను పర్యవేక్షించుకుంటూ, ఆరోగ్యకరమైన అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు -
మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఇరాన్ ప్రభుత్వం తెరదించింది. మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.అమెరికా అనుమానం ఏంటి?అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇటీవల ఇరాన్ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన కేవలం రాతపూర్వక సందేశాలకే పరిమితమవుతున్నారని హెగ్సెత్ ఆరోపించారు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా, మొజ్తబా వీడియో లేదా ఆడియో సందేశం ద్వారా ప్రజల ముందుకు రాకపోవడం వెనుక ఏదో రహస్యం ఉందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు.హోర్ముజ్ జలసంధిపై కీలక ప్రకటనఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ అందరికీ మూసివేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం తమను అటాక్ చేస్తున్న శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రమే ప్రవేశం లేదని, మిగిలిన దేశాల నౌకలు యధావిధిగా రాకపోకలు సాగించవచ్చని స్పష్టం చేశారు.ముదురుతున్న ఉద్రిక్తతలుఒకవైపు టెహ్రాన్లో ప్రభుత్వానికి మద్దతుగా భారీ ర్యాలీలు జరుగుతుండగా, మరోవైపు ఇరాన్ తన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్తో పాటు కొన్ని గల్ఫ్ దేశాలపై దాడులు ముమ్మరం చేసింది. ఇక లెబనాన్లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. దక్షిణ లెబనాన్లోని ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 12 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారింది. ఇది కూడా చదవండి: ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి -
సిగరెట్ ఫ్యాక్టరీపై మిసైల్ దాడి.. 15 మంది మృతి
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్పై మరోసారి ఇజ్రాయెల్ భారీ అటాక్ చేసింది. ఈ దాడిలో 15 మంది కార్మికులు మృతి చెందినట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. వారిలో అత్యధిక మంది టెహ్రాన్కు చెందిన ప్రజలే. అయితే ఈ యుద్దం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇరాన్లోని ఇస్ఫాహాన్ నగరంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిలో 15 మందికి పైగా మృతిచెందారు.ఇస్ఫాహాన్ నగరంలో రిఫ్రిజిరేటర్లు, హీటర్లు తయారుచేసే ఓ ఫ్యాక్టరీపై ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో అందులో కార్మికులు విధులు నిర్వహిస్తుండడంతో పెద్దఎత్తున మరణాలు సంభవించాయని తెలిపాయి. అయితే ఇటీవల ఖర్గే ద్వీపంపై అమెరికా దాడి చేసిన తర్వాతే ఈ క్షిపణి అటాక్ జరిగింది. అయితే దీనికి ఘాటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది.అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పట్లో సద్ధుమణిగేలా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే ఇరాన్ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేశామని ప్రకటించారు. ఇరాన్ సైతం ఎక్కడా తగ్గట్లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది.అయితే ట్రంప్ ఇటీవలే హార్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు రక్షణ కల్పించే విధంగా వివిధ దేశాలు తమ యుద్ధ నౌకలు అక్కడికి పంపించాలని కోరారు. అయితే ఇరాన్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. తమ అనుమతి లేకుండా ఈ జలసంధి గుండా ప్రయాణిస్తే వాణిజ్య నౌకలు పేల్చివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నెతన్యాహును వేటాడి హతమార్చుతాం: ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. -
భారత యుద్ధనౌకల మోహరింపు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ సమీపంలో భారత నావికాదళానికి చెందిన పలు యుద్ధనౌకలను మోహరించారు. అవసరమైనప్పుడు వాణిజ్య నౌకలకు సహాయం అందించేందుకు భారత నావికాదళ యుద్ధనౌకలు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.అంతకుముందు శనివారం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) రవాణా చేస్తున్న రెండు భారత నౌకలకు ఇరాన్ అధికారులు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. వాటిలో ఒక నౌక ‘శివాలిక్’. నౌకా ట్రాఫిక్ పర్యవేక్షణ వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఈ నౌక చివరిసారిగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఉన్నట్లు నమోదైంది. మార్చి 21 నాటికి అది తన గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సముద్ర పరిస్థితులు, అలాగే భారతీయ నావికులు, నౌకల భద్రతను నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తాజా వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 668 మంది నావికులతో 24 భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే హోర్ముజ్ జలసంధికి తూర్పు భాగంలో ఉన్న మూడు నౌకల్లో 76 మంది భారతీయ నావికులు ఉన్నట్లు పేర్కొంది.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, నౌక యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, విదేశాల్లోని భారత మిషన్లతో సమన్వయం కొనసాగిస్తూ అన్ని భారత నౌకలు, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి డీజీ షిప్పింగ్ మొత్తం 2,425 కాల్స్, 4,441 ఈమెయిళ్లను పరిష్కరించిందని తెలిపింది. అంతేకాకుండా చిక్కుకుపోయిన 223 మందికిపైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ మధ్య హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని భారతదేశంలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ధ్రువీకరించారు. భారత్తో ఉన్న దీర్ఘకాల స్నేహం, పరస్పర ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు. -
‘ఒక్క మిసైల్తో లేపేస్తాం’.. కిమ్ వైరల్ వార్నింగ్ నిజమేనా?
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ వణికిపోతోంది. ఇదిలా ఉండగా ఈ యుద్ధం గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.‘డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఇరాన్తో యుద్ధం చేస్తున్నారంటే, ఆ దేశం తనకు ఎదురు నిలవలేదని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన నా దేశం ఉత్తర కొరియాను కానీ, చైనా, రష్యాను కానీ రెచ్చగొట్టే ధైర్యం చేయడు, ఎందుకంటే మా శక్తి, క్షిపణుల గురించి ఆయనకు బాగా తెలుసు.ఒక్క క్షిపణితో అమెరికా మొత్తాన్ని అదృశ్యం చేయగల సామర్థ్యం మాకు ఉంది. ఏ దేశాలైతే బదులు ఇవ్వలేవని అతడు (ట్రంప్) నమ్ముతాడో ఆ దేశాలతో విభేదాలను కోరుకుంటాడు.కానీ ఇరాన్ నిజంగా అనుకుంటే, అది అమెరికాపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయగలదు. ఇది చాలా పెద్ద సంఖ్యలో అమెరికన్ పౌరుల మరణానికి కారణమవుతుందని వారు భయపడుతున్నారు. బెదిరింపులు శక్తిని నిరూపించవు. ఒక దేశం నిజమైన గొప్పతనం శాంతి, న్యాయం, మానవ జీవితం పట్ల గౌరవంలో కనిపిస్తుంది’ అని కిమ్ వ్యాఖ్యానించినట్లుగా ఆయా వార్తల్లో ఉంది.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ఎలాంటి ధ్రువీకరణలు లేవు. అటు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ అయిన కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) కానీ, ఇటు ఇతర ప్రామాణిక అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి దీని గురించి ప్రస్తావన లేదు. -
యూఏఈ పోర్టులపై ఇరాన్ హెచ్చరిక.. భారీ దాడుల ముప్పు
గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. యూఏఈలో ఉన్న అమెరికా ప్రయోజనాలు, సైనిక స్థావరాలు, పోర్టులు భవిష్యత్ దాడుల్లో లక్ష్యాలుగా మారవచ్చని హెచ్చరించింది.ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా సైన్యం వినియోగిస్తున్న ప్రదేశాలు “న్యాయమైన లక్ష్యాలు” కావచ్చని పేర్కొంది. అందువల్ల ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, కార్మికులు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని సూచించింది.దాడులకు ముందు హెచ్చరికఇరాన్ ప్రకారం యూఏఈలోని కింది ప్రాంతాలు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. అవి.. * ప్రధాన పోర్టులు, డాక్లు* అమెరికా సైన్యం ఉపయోగించే స్థావరాలు* అమెరికా ప్రయోజనాలు ఉన్న ఆయిల్ టర్మినల్స్* వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రాలుఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ సైన్యం సూచించింది.ఫుజైరా పోర్ట్ వద్ద డ్రోన్ దాడిఈ ఉద్రిక్తతల మధ్య ఫుజైరా పోర్ట్ వద్ద డ్రోన్ దాడి జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ ఘటనతో అక్కడి ఆయిల్ లోడింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని ఆయిల్ నిల్వ ట్యాంకుల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించగా, భారీగా పొగలు ఎగసిపడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి.ప్రపంచానికి కీలకమైన చమురు ఎగుమతి కేంద్రాలలో ఫుజైరా పోర్ట్ ఒకటి. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 10 లక్షల బ్యారెల్స్ చమురు ఎగుమతి అవుతుందని అంచనా.ఉద్రిక్తతలకు కారణం ఇదే..ఇటీవల అమెరికా సైన్యం ఇరాన్లోని కీలక ఆయిల్ టర్మినల్ అయిన ఖార్గ్ ద్వీఈపంపై దాడులు జరిపిందని వార్తలు వచ్చాయి. ఈ చర్యలకు ప్రతీకారంగానే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. -
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్ను దాటుకుని వచ్చాయి. గుజరాత్లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు. -
నెతన్యాహు ఎక్కడ?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమమేనా? ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అసలు బతికే ఉన్నారా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు, పుకార్లతో శనివారం సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్ ఖాతా నుంచి శుక్రవారం విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నింటికీ కారణంగా మారడం విశేషం. ఇరాన్పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెలీలను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒకచోట నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లున్నట్టుగా కన్పించింది. అది నెటిజన్లను వెంటనే ఆకర్షించింది. చూస్తుండగానే ఆ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. వాస్తవానికి నెతన్యాహు రెండు చేతులకూ ఐదు వేళ్లే ఉంటాయి.దాంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావిచి్చంది. దానిపై రకరకాల విశ్లేషణలూ తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏఐ జెనరేటెడ్ వీడియో అని నెటిజన్లు అనుమానం వెలిబుచ్చారు. మార్చి 2వ తేదీన నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడిని పలువురు గుర్తు చేశారు. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, బహుశా మరణించి ఉంటారని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. కానీ కాసేపటికే నెతన్యాహు బాహాటంగా కన్పించారు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాంతో ఆయన మరణించారన్న వార్తలకు తెరపడింది. కానీ మార్చి 2 నాటి దాడిలో నెతన్యాహు నిజంగానే మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని తాజాగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యుద్ధం మధ్యలో ఆ విషయం బయటికొస్తే ఇరాన్కు నైతిక బలంగా మారుతుందనే భయంతో ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచి ఉంటుందన్నది వారి విశ్లేషణ. అందుకే నాటినుంచీ ఏఐ సాయంతో నెతన్యాహు వీడియోలను రూపొందిస్తూ ప్రపంచాన్ని మభ్యపెడుతోందన్నది వాటి సారాంశం. కానీ నెతన్యాహు తాజా వీడియో నిజమైనదేనని పలు ఫ్యాక్ట్ చెకింగ్ సైట్లు అంటున్నాయి. వీడియో నిజమే గానీ కుడి చేతికి ఆరు వేళ్లు వాస్తవం కాదని గ్రోక్ తేల్చింది. ఒకానొక ఫ్రేమ్లో నిర్దిష్ట కోణంలో అరచేతికి ఆరో వేలున్నట్టు కేవలం దృశ్యభ్రాంతి కలుగుతోందని పేర్కొంది.అయినా ఆన్లైన్ రగడకు తెర పడకపోవడం విశేషం! ‘నెతన్యాహు ఎక్కడ?’, ‘బిబి (నెతన్యాహు ముద్దుపేరు) క్షేమమేనా?’అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరద కొనసాగుతూనే ఉంది. నెటిజన్లు తమ వాదనకు మద్దతుగా శుక్రవారం నాటి అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ ఇంటర్వ్యూను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వైట్హౌస్లో ఓ మీడియా ప్రతినిధికి బెసెంట్ ఇంటర్వ్యూ ఇస్తుండగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ‘అత్యవసర’పిలుపు రావడంతో ఉన్నపళంగా ‘సిచ్యుయేషన్ రూమ్’కేసి పరుగెత్తారు. ఏకంగా రెండు గంటల అనంతరం తిరిగొచ్చారు.తర్వాత ఇంటర్వ్యూ కొనసాగించినా బెసెంట్లో తడబాటు, గొంతులో వణుకు కనిపించాయి. ‘‘నెతన్యాహు ఇక లేరని బహుశా ట్రంప్కు ఉప్పంది ఉంటుంది. అదే విషయాన్ని బెసెంట్తో పంచుకున్నారు. తడబాటుకు అదే కారణం కావచ్చు’’అని సోషల్ మీడియా యూజర్లు విశ్లేíÙస్తున్నారు. ప్రఖ్యాత రాజకీయ వ్యాఖ్యాత జోహనస్ ఎం.కొన్రాడ్త్ కూడా నెతన్యాహు మరణించారని సదరు వీడియోను ఉటంకిస్తూ పేర్కొనడం విశేషం. ఆ విషయం తెలియడం వల్లే బెసెంట్ అంతగా దిగ్భ్రాంతికి లోనైనట్టు కన్పించారని ఆయన కూడా చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చమురు సింహద్వారం
ఖర్గ్ ఐలాండ్. ఇరాన్ ప్రధాన భూభాగానికి దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లో ఉన్న అతిచిన్న దీవి ఇది. ఇరాన్ ముడిచమురుకు సంబంధించి ఈ దీవి దశాబ్దాలుగా అంతర్జాతీయ ఎగుమతుల రాజధానిగా భాసిల్లుతోంది. దేశ ఎగుమతుల్లో ఇక్కడి నుంచే 90 శాతం జరుగుతున్నాయి. ఇరాన్ ఆర్థికజీవనాడిగా వినతికెక్కిన ఖర్గ్ ద్వీపంపై అమెరికా శనివారం దాడి చేయడంతో ఈ దీవి భద్రతపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. దీవిని కాపాడుకునేందుకు ఇరాన్ శతథా ప్రయత్నించడం ఖాయం. ఇరాన్లో ఈ ద్వీపాన్ని కిరీటంలో రత్నంగా పిలుస్తారు. ఇరాన్ చమురు కిరీటంగానూ ఘనకీర్తిని సాధించిన ఖర్గ్ దీవిని నాశనం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా కంకణం కట్టుకున్నాయి. ఈ పోరులో గెలుపెవరిదో వెనువెంటనే చెప్పడం కష్టమని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. భారీ భద్రత.. అంతకంటే పెద్ద పైప్లైన్లు.. ఇరాన్లోని అతిపెద్ద ముడిచమురు, సహజవాయు క్షేత్రాలు అన్నింటి నుంచీ ఈ దీవికి పైప్లైన్ వ్యవస్థ ఉంది. అబూజార్, ఫొరైజాన్, దారూద్, అవాజ్, మరూన్, గచ్చరన్ చమురు క్షేత్రాల నుంచి భారీ పైప్లైన్లు ఏర్పాటుచేసి క్రూడ్ ఆయిల్, గ్యాస్ను దీవికి సరఫరా చేస్తుంటారు. ఇక్కడ చమురు డిపోల్లో నిల్వచేసి అంతర్జాతీయ డిమాండ్కు తగ్గట్లుగా నౌకల్లో విదేశాలకు సరఫరా చేస్తుంటారు. ఈ దీవి విస్తీర్ణం కేవలం 20 చదరపు కిలోమీటర్లు. సమీప సముద్రజలాల వెంట ఒడ్డు లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో భారీ చమురు రవాణా నౌకలు సైతం సులభంగా తీరందాకా వచ్చి సరుకును ఎక్కించుకునే అవకాశం ఉంది.దీంతో రోజుకు 70 లక్షల బ్యారెళ్ల ముడిచమురును లోడింగ్ చేసే సామర్థ్యంతో ఇక్కడి నౌకాశ్రయాన్ని ఆధునీకరించారు. ఇక్కడి చమురు డిపోల్లో ఏకంగా 3 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వచేసే అవకాశం ఉంది. ఇరాన్ రోజూ 4.5 శాతం ప్రపంచ చమురు అవసరాలను తీరుస్తోంది. రోజూ 33 లక్షల బ్యారెళ్ల ముడి చమురును, 13 లక్షల బ్యారెళ్ల తక్కువ గాఢత ఉన్న ద్రవరూప హైడ్రోకార్బన్ మిశ్రమాన్ని ఎగుమతిచేస్తోంది. ఆర్థికంగా అత్యంత కీలకమైన ప్రదేశం కావడంతో ఇక్కడ సైనిక మోహరింపు అనూహ్యస్థాయిలో ఉంటుంది.ముందస్తు అనుమతి లేకుండా ఎంత పెద్ద అధికారి అయినా దీవిలోకి అడుగుపెట్టడం అసాధ్యం. యుద్ధం మొదలయ్యాక ఈ దీవి నుంచి ఎగుమతులు చరిత్రలో ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి పెరిగాయని అమెరికా పెట్టుబడుల బ్యాంక్ ‘జేపీ మోర్గాన్’ఇటీవల పేర్కొంది. రెండేళ్ల క్రితమే ఇరాన్ కేవలం ముడిచమురు అమ్మకాలతో 80 బిలియన్ డాలర్ల లాభాలు గడించింది. 1960 దశకం నుంచే అభివృద్ధి ఈ దీవిలో క్రీస్తుపూర్వం 550 నుంచి 330 కాలంలో ఇక్కడ ప్రాచీననాగరికత వెల్లివిరిసిందని పురాతత్వశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అచమెనిడ్ సామ్రాజ్య కాలం నాటి శాసనాలు, సమాధులు ఇక్కడ లభించాయి. సుమేరియన్ల కాలంనాటి క్యూనిఫామ్ సంజ్ఞల రూప రాతలూ ఇక్కడ వెలుగుచూశాయి. శతాబ్దాల క్రితం ఇక్కడి నుంచి వ్యాపారాలు జరిగేవి. ఇక్కడి ముత్యాలు అత్యంత నాణ్యమైనవని 982 సంవత్సరంలో రచించిన ‘హుదుద్ అల్ ఆలమ్’రచనలో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో డచ్ వలసపాలనలో ఈ దీవి భాగంగా ఉండేది. శతాబ్దాల క్రితమే ఇక్కడ చర్చిలు నిర్మించారు. 1830వ దశకంలో ఈ దీవిని కొంతకాలం బ్రిటన్ తన అ«దీనంలో ఉంచుకుంది. తర్వాత రెజా షా పహ్లావీ రాజరికపాలనలో దీవి అభివృద్ధి నెమ్మదిగా మొదలైంది.భారీ నౌకలు సైతం లంగరువేసేందుకు అనువుగా ఉండటం, హార్మూజ్ జలసంధికి సైతం సమీపంగా ఉండటంతో ఈ దీవి సరుకు రవాణాకు అత్యంత ఉత్తమమని ఇరాన్ పాలకులు భావించారు. దీంతో నాటి షా పాలకుల కాలంలో అమెరికాకు చెందిన ఆమోకో కంపెనీ సహకారంతో 1960 దశకంలోనే దీవిలో ఆయిల్ టరి్మనల్ను తొలిసారిగా నిర్మించారు. తర్వాత అత్యంత వేగంగా దీవి కీలకమైన చమురు టర్మినల్గా విస్తరించింది.ఇక్కడ చిన్న విమానాశ్రయం సైతం ఉంది. దీవిని దిగ్బంధించి ఇరాన్తో బేరసారాలు మొదలెట్టాలని అమెరికా ఆశపడుతోంది. హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలకు ఇరాన్ అనుమతించేలా ఆ దేశంపై ఒత్తిడిచేయాలని అమెరికా చూస్తోంది. ఒప్పుకోకుంటే దీవిలో ఒక్క చమురుచుక్క మిగలకుండా తగలబెడతామని ఇటీవలే వైట్హౌస్ సమావేశంలో ట్రంప్ తెగేసిచెప్పడంతో ఇప్పుడీ దీవి పరిస్థితి ఏంటనే చర్చ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దద్దరిల్లిన ‘ఖర్గ్’
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలనే గాక ఆ దేశంతో సంబంధమున్న చమురు వ్యవస్థలన్నింటినీ ఇకపై లక్ష్యం చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. తమపై అమెరికా దాడులకు ఉపయోగపడుతున్న గల్ఫ్ నగరాలన్నింటిపైనా ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.అమెరికా సేనలు మోహరించిన ప్రదేశాల నుంచి పౌరులంతా తక్షణం వెళ్లిపోవాలని సూచించింది! మరోవైపు ఖర్గ్పై భూతల దాడులకు కూడా అమెరికా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2,500 మందితో కూడిన నావికా దళాన్ని, మరిన్ని ఆంఫీబియస్ యుద్ధ నౌకలను హుటాహుటిన గల్ఫ్కు తరలిస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. వీటికి తోడు ఇరాన్తో యుద్ధం నిర్ణాయక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధ పరిధి మరింతగా విస్తరించడం ఖాయమని, తద్వారా మరింత జనహననం, ఆస్తి నష్టం తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు వ్యవస్థలు బుగ్గే: ట్రంప్ఇరాన్ చమురు నెట్వర్క్కు జీవనాడి వంటి ఖర్గ్ దీవిపై అమెరికా భారీ స్థాయిలో దాడులకు దిగింది. అక్కడ పదులకొద్దీ సంఖ్యలో భారీ పేలుళ్లు విని్పంచాయి. సముద్రంలో అమర్చే మందుపాతరల నిల్వ కేంద్రం, క్షిపణి నిల్వ కేంద్రం, బంకర్లతో పాటు మొత్తం 90కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. దీవిలోని కీలకమైన సైనిక స్థావరాలను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే కీలకమైన చమురు వ్యవస్థల జోలికి మాత్రం పోలేదని తెలిపారు.హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని ఇరాన్ నిరోధిస్తే వాటిని కూడా తుడిచి పెట్టేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన పోస్టులు చేశారు. జపాన్ నుంచి తక్షణం పశ్చిమాసియాకు తరలాలంటూ 31వ మరీన్ ఎక్స్పెడిషనరీ యూనిట్, యాంఫిబియస్ షిప్ యూఎస్ఎస్ ట్రిపోలీకి ఆదేశాలు జారీ అయ్యాయి. యూఎస్ఎస్ అబ్రహంలింకన్తో పాటు అమెరికా ఇప్పటికే 12 యుద్ధ నౌకలను, 8 డి్రస్టాయర్లను గల్ఫ్లో మోహరించింది. అమెరికా దాడిలో ఖర్గ్లోని తమ చమురు వ్యవస్థలకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఇరాన్ పేర్కొంది.ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, నావల్ బేస్, విమానాశ్రయ కంట్రోల్ టవర్, ఒక చమురు కంపెనీ తాలూకు హెలికాప్టర్ హ్యాంగర్పై దాడులు జరిగినట్టు తెలిపింది. శనివారం ఇరాన్లో 200 పై చిలుకు లక్ష్యాలను తుడిచిపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిలో క్షిపణి కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలున్నట్టు తెలిపింది. అయితే ఖర్గ్ నుంచి చమురు ఎగుమతులు నిర్నిరోధంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది. లెబనాన్లో మృతులు 826 మంది లెబనాన్పైనా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. బీరూట్, శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 826 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది. వారిలో 31 మంది వైద్య సిబ్బందేనని తెలిపింది. దాడుల తీవ్రతకు ఐదు ఆస్పత్రులను మూసేయాల్సి వచ్చినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. మొజ్తబాపై 92 కోట్ల రివార్డు ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ జాడ తెలిపిన వారికి కోటి డాలర్ల (రూ.92.5 కోట్ల) రివార్డును అమెరికా ప్రకటించింది. విదేశాంగ శాఖ ఎక్స్లో ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ చీఫ్ అలీ హస్గర్ హెజాజీ, భద్రతా విభాగం ఉన్నతాధికారి అల లరిజానీ తదితరుల పేర్లను కూడా పేర్కొంది. వాళ్లకు సంబంధించిన సమాచారం అందించే వారికి తగిన పారితోíÙకంతో పాటు పునరావాసం కూడా కలి్పస్తామని పేర్కొంది.గల్ఫ్పై క్షిపణుల వర్షంఖర్గ్పై అమెరికా దాడులకు తమ ప్రతీకారం ఊహించని స్థాయిలో ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘెర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. కనీవిని ఎరుగని రీతిలో పూర్తిస్థాయి దాడులకు దిగుతామన్నారు. అందుకు తగ్గట్టే ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైనా దాడుల తీవ్రతను ఇరాన్ యథాతథంగా కొనసాగించింది. శనివారమంతా వాటిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్పై క్షిపణి దాడికి దిగింది. తీవ్ర నష్టానికి సంకేతంగా అక్కడినుంచి భారీగా పొగలు వెలువడ్డాయి.ఇరాన్ డ్రోన్ దాడిలో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడి నుంచి వెలువడే పొగలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బ్యాంకులు, ఇతర వ్యవస్థలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు జరుపుతోంది. దుబాయ్లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, పుజైరా నౌకాశ్రయాలను విడిచి వెళ్లాల్సిందిగా సిబ్బందిని, ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాటిపైనా భారీ దాడులు తప్పవని భావిస్తున్నారు. 9 బాలిస్టిక్ క్షిపణులను, 33 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.నిమిషాల్లో 1,430 క్షిపణులు! ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా దాడితో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్పై శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1,430 క్షిపణులు ప్రయోగించింది! ఇజ్రాయెల్ వైద్య సేవా విభాగానికి చెందిన మాగెన్ డేవిడ్ ఆడొమ్ దీన్ని ధ్రువీకరించారు. ఈలట్ నగరంలో చాలా ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఎంతోమంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు కూడా క్షిపణుల మోతతో దద్దరిల్లిపోయాయి.హార్మూజ్కు యుద్ధనౌకలు పంపండి ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తిహార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పలు దేశాలు ఇప్పటికే అమెరికాకు దన్నుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని చెప్పారు. హార్మూజ్ను త్వరలో తెరిపించి అక్కడినుంచి అంతర్జాతీయ రవాణా యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.గల్ఫ్ దేశాలపై దాడులొద్దు ఇరాన్కు హమాస్ పిలుపు గల్ఫ్ దేశాలపై దాడులకు ఇరాన్ స్వస్తి పలకాలని పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ విజ్ఞప్తి చేసింది! పొరుగు దేశాలపై దాడులు మానుకోవాలని హితవు పలికింది. యుద్ధానికి తక్షణం తెర దించేలా దేశాలన్నీ కృషి చేయాలని కూడా పిలుపునిచి్చంది. ఇరాన్కు హమాస్ అత్యంత సన్నిహితమన్నది తెలిసిందే. దానికి ఇరాన్ పూర్తిస్థాయిలో సాయుధ, ఆర్థిక సాయం చేస్తుంటుంది. హమాస్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.మరో ఐదు విమానాలను నష్టపోయిన అమెరికా! ఇరాన్ దాడుల్లో అమెరికా గత రెండు రోజుల్లో మరో ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలను నష్టపోయినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు కేసీ–135 స్ట్రాటో ట్యాంకర్ రీ ఫ్యూయలింగ్ విమానాలకు భారీ నష్టం వాటిల్లినట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేపట్టారని ఇద్దరు అమెరికా సైనికాధికారులను ఉటంకిస్తూ కథనం వెలువరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. ఇదంతా అమెరికా ఓటమిని కోరుకునే కొన్ని పనికిమాలిన మీడియా సంస్థల దిగజారుడు ప్రచారమేనంటూ మండిపడ్డారు. ‘‘నాలుగు విమానాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. ఇరాన్పై దాడుల్లో అవి చురుగ్గా పాల్గొంటున్నాయి. ఒక్క రీ ఫ్యూయలింగ్ విమానానికి స్వల్ప నష్టం జరిగింది. మా సైన్యం దానికి వెంటనే మరమ్మతు చేసింది కూడా’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
నేపాల్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయులు మృతి
నేపాల్లోని గోర్ఖా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మంకమ్నా ఆలయంలో దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.పోలీసుల సమాచారం ప్రకారం, సాహిద్ లఖన్ గ్రామీణ మునిసిపాలిటీ పరిధిలోని కాంతర్ ప్రాంతంలో భక్తులను తీసుకెళ్తున్న ఎలక్ట్రిక్ మైక్రోబస్ నియంత్రణ తప్పి కొండ రహదారి నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు యాత్రికులు గాయపడగా, వారిని చికిత్స కోసం చిత్వాన్ జిల్లాలోని భరత్పూర్ పట్టణంలోని చిత్వాన్ మెడికల్ కాలేజీకి తరలించారు.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్కుమార్ శ్రేష్ఠ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద సమయంలో మైక్రోబస్లో డజనుకు పైగా ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.గోర్ఖా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తులసి బహదూర్ శ్రేష్ఠ మాట్లాడుతూ, ఈ మైక్రోబస్ మంకమ్నా ఆలయం నుంచి పశ్చిమ దిశగా తనహు జిల్లాలోని అన్బుఖైరేని ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపారు. అయితే దర్శనం అనంతరం యాత్రికులు అసలు ఏ ప్రాంతానికి వెళ్తున్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. కొండ ప్రాంత రహదారిపై ప్రయాణిస్తుండగా మైక్రోబస్ అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 2024లో భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అన్బుఖైరేని సమీపంలో ప్రమాదానికి గురై కనీసం 27 మంది మరణించిన విషయం తెలిసిందే. -
ప్రజలకు యూఏఈ హెచ్చరిక.. ఫొటోలు, వీడియోలు తీయొద్దు..
యూఏఈ నేషనల్ మీడియా అథారిటీ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. భద్రతకు సంబంధించిన ఘటనలను చిత్రీకరించడం లేదా ధ్రువీకరించని సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవద్దని అథారిటీ హెచ్చరించింది. ఇటువంటి చర్యలు ప్రజా భద్రతతో పాటు సమాజ రక్షణకు ముప్పు కలిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో కమ్యూనిటీ భద్రత ప్రతి ఒక్కరి భాగస్వామ్య బాధ్యత అని అథారిటీ పేర్కొంది. పుకార్లు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ప్రజలు అధికారిక వనరుల ద్వారా వచ్చిన సమాచారాన్నే నమ్మాలని నివాసితులకు సూచించింది.భద్రతా ఘటనలు జరిగిన ప్రదేశాల నుంచి ఫోటోలు లేదా వీడియోలు పంచుకోవడం వల్ల సున్నితమైన ప్రాంతాల వివరాలు బయటపడే ప్రమాదం ఉందని అథారిటీ తెలిపింది. అలా చేస్తే రహదారులు, ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ మార్గాలు వంటి ముఖ్యమైన సమాచారం వెల్లడై ప్రజలు ప్రమాదంలో పడే అవకాశముందని హెచ్చరించింది.ఇలాంటి వీడియోలు లేదా చిత్రాల ద్వారా ప్రజల కదలికలు, సమావేశ సమయాలు వంటి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉందని, వాటిని శత్రు గుంపులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నదని అథారిటీ తెలిపింది. ప్రజల భద్రతను కాపాడటంలో అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ఆన్లైన్ ప్రవర్తన ఎంతో కీలకమని అథారిటీ పునరుద్ఘాటించింది. -
క్షిపణులతో కిమ్ కవ్వింపులు
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన క్షిపణులకు పనిజెప్పారు. ఉత్తర సముద్ర జలాల్లో ఒకేసారి 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులను తీసుకొచ్చారు. ఉ.కొరియా కవ్వింపు చర్యలను పొరుగున ఉన్న వైరిదేశం దక్షిణకొరియా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమవుతున్నవేళ కిమ్ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని దక్షిణకొరియా ఆగ్రహం వ్యక్తంచేసింది.ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచి శనివారం ఈ 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని, అయితే అవి ఎంత దూరం ప్రయాణించాయనే వివరాలపై స్పష్టత లేదని ద.కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు.ఉ.కొరియా దుందుడుకు చర్యలను నిశితంగా గమనిస్తున్నామని నిఘాతోపాటు సైనిక సన్నద్ధతతో ముందుకెళ్తున్నామని ద.కొరి యా ప్రకటించింది. ఇరాన్లో యావత్దేశంలోని సెక్యూరిటీ కెమె రాలను హ్యాక్ చేసి ఖమేనీ హత్యను అమెరికా సులభతరం చేసిన నేపథ్యంలో తమ దేశంలోనూ అమెరికా ఇదే పనిచేస్తోందా? అన్న అనుమానాలు సగటు దక్షిణ కొరియన్లలో ఎక్కువయ్యాయని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
పాక్ ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత
ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్పై తీవ్రంగా పడింది. దీంతో, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వేతనాల్లో కోత సహా పలు పొదుపు చర్యలను ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగుల వేతనాల్లో 5 నుంచి 30 శాతం వరకు కోత విధించాలని నిర్ణయించింది. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనంలో 50 శాతం కోత విధించడంతోపాటు, వచ్చే రెండు నెలల్లో 60 శాతం వరకు ప్రభుత్వ వాహనాలను రోడ్లపై తిరగకుండా నిలిపివేయనుంది.అంతేకాకుండా, కొత్త వాహనాల కొనుగోళ్లను నిలిపివేయడంతోపాటు, ఇతర అన్ని రకాల కొనుగోళ్లపైనా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల బోర్డుల ప్రభుత్వ ప్రతినిధులకు ఇకపై పార్టిసిపేషన్ ఫీజు ఇవ్వరాదని సమావేశంలో నిర్ణయించింది. ఈ నిధులను కూడా ప్రభుత్వ పొదుపులో భాగంగానే పరిగణించనుంది.వచ్చే రెండు నెలల కాలంలో మంత్రి వర్గ సభ్యులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల వేతనాల నిలిపివేసి, ఆ మొత్తాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, సహాయ మంత్రులు, ప్రత్యేక సలహాదారుల విదేశీ పర్యటనలపై పూర్తి నిషేధం అమలు కానుంది. ఇరాన్ యుద్ధం ప్రభావంతో పాకిస్తాన్లో పెట్రోలియం ధరలు లీటరుకు రూ.55 మేర పెరిగాయి. -
మీ యుద్ధ నౌకలను పంపండి..!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్త యుద్ధం. ఇది గత కొన్ని రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూ సహకరిస్తున్న అరబ్ దేశాలపై ఇప్పటికే ఇరాన్ విరుచుకుపడుతూ ఉంది. తమతో యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తే వారు తమ శత్రువులేనని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. ఆ క్రమంలోనే వారిపై భీకరమైన దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. విదేశాలకు సరఫరా అయ్యే చమురు విషయంలో కూడా ఇరాన్ కఠినంగానే ఉంది. ఇరాన్కు నచ్చిన దేశాలను మినహాయించి మిగతా దేశాలను కట్టడి చేస్తోంది. ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచి వచ్చే చమురు నౌకల విషయంలో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే దీన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ జలసంధి ద్వారా వెళ్తుంది. ప్రపంచ ఇంధన భద్రతకు కీలకమైన చోక్పాయింట్గా చెప్పుకుంటారు. మరి దీన్ని ఇరాన్ పూర్తిగా క్లోజ్ చేస్తే ఏంటనేది పరిస్థితి. ఇదే ఇప్పుడు ట్రంప్లో మొదలైన భయం. మీ నౌకలను పంపండిహర్మూజ్ జలసంధి భద్రతపై తీవ్ర ఆందోళనలు నడుమ ట్రంప్.. ప్రపంచ దేశాలకు ఒక పిలుపునిచ్చారు. హర్మూజ్ జలసంధి భద్రతకు సంబంధించి పలు ఇతర దేశాల నౌకలను పంపమని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకేలకు ఆయన తన సందేశాన్ని పంపారు. ఈ జలసంధితో ఇబ్బంది తలెత్తితే ఎక్కువగా ప్రభావితమయ్యేది ఆయా దేశాలేనని అందుచేత ముందస్తు జాగ్రత్తగా ఆ జలసంధి భద్రతకు నౌకాదళాన్ని సిద్ధం చేసుకుని పంపాలన్నారు. ఇలా చేస్తే ముప్పు ఉండదని, లేకపోతే అతి తీవ్రమైన సంక్షోభాన్ని కూడా చూడాల్సి రావచ్చన్నారు. వారంతా హర్మూజ్ జలసంధి అంశంలో ముందుకొస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. -
వీళ్లను పట్టిస్తే కోటీశ్వరులైపోవచ్చు.. ఏకంగా రూ.93 కోట్లు
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా ఆ దేశంలోని పలువురు ఉన్నతాధికారుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ.92,47,48,000) బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధం మరింత ముదురుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహకాన్ని అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కార్యక్రమం ద్వారా ప్రకటించింది.రివార్డు ఉన్న వ్యక్తుల జాబితాలో మొజ్తబా ఖమేనీతో పాటు కీలక నేతలు, అధికారులు అలీ అస్గర్ హిజాజీ, యాహ్యా రహీమ్ సఫవి, అలీ లరిజాని, ఎస్మాయిల్ ఖతీబ్ ఎస్కందర్ మొమెని ఉన్నారు. ఈ నాయకులపై సమాచారం ఇచ్చే వారికి అమెరికా బహుమతి ప్రకటించింది.అమెరికా ఈ నాయకులకు వేర్వేరుగా కచ్చితమైన మొత్తాన్ని బహుమతిగా ప్రకటించలేదు. అమెరికా చెప్పింది ఒక్కటే.. ఎవరైనా తమకు ఇచ్చే సమాచారం ఉపయోగపడితే “గరిష్ఠంగా $10 మిలియన్ (సుమారు రూ.92-93 కోట్లు) వరకు” బహుమతి ఇవ్వవచ్చు.రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం అంటే అమెరికా మీద ఉగ్రదాడులు చేసినట్లు అనుమానించే వ్యక్తులను గుర్తించేందుకు సమాచారం ఇచ్చిన వారికి డబ్బు బహుమతి ఇచ్చే కార్యక్రమం. మొజ్తబా ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులను “ఇరానియన్ టెర్రరిస్టులు”గా పేర్కొంటూ అమెరికా ఒక ప్రకటనలో వివరాలు తెలిపింది.“ఈ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లో వివిధ విభాగాలను నడిపిస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర చర్యలకు ప్రణాళికలు వేసి, అమలు చేస్తుంది” అని చెప్పింది.“ఈ ఐఆర్జీసీ నాయకులు లేదా దాని విభాగాలపై సమాచారం తెలిసినవారు ఆ విషయాన్ని టోర్ ఆధారిత టిప్లైన్ లేదా సిగ్నల్ ద్వారా మాకు పంపండి. సమాచారం ఇచ్చిన వారికి బహుమతి లభించే అవకాశం ఉంటుంది” అని తెలిపింది.టోర్ అంటే ఇంటర్నెట్లో గుర్తింపును దాచుతూ సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ. సిగ్నల్ అంటే గోప్యంగా సందేశాలు పంపే ఎన్క్రిప్షన్ ఆధారిత మెసేజింగ్ యాప్. -
జెరూసలేం మీదుగా పేలుళ్లు
US-Israel War on Iran day 15: భీకర దాడులతో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 15 రోజు కూడా తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఇరాన్లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దళాలు (CENTCOM) అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఖార్గ్ ద్వీపం బాంబు దాడి తర్వాత అమెరికా మద్దతు ఉన్న చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ గట్టి కౌంటరిచ్చింది.2,500 మంది అమెరికన్ మెరైన్లు, నౌకలు గల్ఫ్కు పయనమవుతుండగా టెహ్రాన్ ‘మరింత విధ్వంసక’ క్షిపణులను సిద్ధం చేస్తోంది.ఇరాన్ నుండి వస్తున్న క్షిపణులను గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శనివారం ఇజ్రాయెల్రాజదాని నగరం జెరూసలేం మీదుగా భారీ పేలుళ్లు వినిపించాయని AFP నివేదించింది. ఇది ఇలా ఉంటే యుఎఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వైమానిక రక్షణ దళాలు మార్చి 13న 7 బాలిస్టిక్ క్షిపణులు , 27 యుఎవిలను అడ్డుకున్నాయి. UAE ఈ రోజు 9 క్షిపణులు , 33 డ్రోన్లను అడ్డుకుంది. దీంతో వీటి సంఖ్య 285 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు , 1,567 యుఎవిలకు చేరుకున్నాయి. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని యుఎఇ కాన్సులేట్ జనరల్ను లక్ష్యంగా చేసుకుని వారం రోజుల్లో రెండవసారి జరిగిన ఉగ్రవాద డ్రోన్ దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడగా, కాన్సులేట్ భవనం దెబ్బతింది.45 మంది అరెస్ట్ మరోవైపు యుఎఇలో, తప్పుదారి పట్టించే లేదా ఏఐ వీడియోలను ఆన్లైన్లో పంచుకున్నందుకు 10 మంది నిందితులకు భారీ షాక్ తగలనుంది. వీరిపై విచారణణు వేగవంతం చేశారు. సంఘటనాస్థలాలను చిత్రీకరించడం, లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 45 మందిని అబుదాబి అధికారులు అరెస్టు చేశారు. ఇది తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను రక్షించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగమని అక్కడి అధికారులు తెలిపారు. కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం మధ్యప్రాచ్య వివాదం మూడవ వారంలోకి ప్రవేశించింది. దాదాపు 43,000 నివాస, వాణిజ్య యూనిట్లు దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ వెల్లడించారు. ప్రభుత్వ నిర్వహణలోని IRNA వార్తా సంస్థ ప్రకారం, దెబ్బతిన్న నిర్మాణాలలో 36,469 నివాసాలు, 6,179 వాణిజ్య సౌకర్యాలు ఉన్నాయి..అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని, 223 మంది మహిళలు , బాలికలు మరణించారని మరియు 2,129 మంది గాయపడ్డారని మొహజెరానీ చెప్పారు. ఆమె మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించలేదు కానీ గతంలో అధికారులు 1,230 మంది మరణించారని చెప్పారు.సైనిక నష్టం గురించి ఇరాన్ ఎటువంటి సమాచారం అందించలేదు. -
రోజూ వైన్, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం. ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే జిన్ బావోలింగ్ (Jin Baoling).సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్ కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి. దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్లో సమృద్ధిగా ఉండే ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట. జిన్ దీన్ని దాదాపు ప్రతిరోజూ తింటుంది. ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.ప్రతీ పూట మందు ఉండాల్సిందే ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.నెటిజన్లు స్పందనతమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం. నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. -
ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది!
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై యుద్ధంలో ఉన్నాయి. ఇరాన్ను తమ గుప్పిట్లోకి తీసుకునే వరకూ యుద్ధం ఆపేది లేదంటోంది అమెరికా. అదే సమయంలో ఇరాన్ కూడా తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఈ యుద్ధం ఎంతవరకూ వెళుతుందో అనే భయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇరాన్ గగనతలం తమ గుప్పిట్లోకి వచ్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చెబుతున్నా.. పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. ఇరాన్ సైతం అంతే ధీటుగా బదులిస్తూ ఉండటంతో అటు గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాలో కూడా ఆందోళన చాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ట్రంప్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇంకా ఇరాన్ లొంగిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంచితే, ఒక లైవ్ షోలో ఉండగా అమెరికా ఆర్థికశాఖ కార్యదర్శి స్కాట్ బీసెంట్కు ఉన్నపళంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కాల్ రావడం చర్చనీయాంశమైంది. బీసెంట్ స్కై న్యూస్ స్టూడియోలో లైవ్ ప్రోగ్రామ్లో ఉండగా పిలుపు వచ్చింది. ఆ స్టూడియోకు ట్రంప్ నుంచి కాల్ రావడంతో ఉన్నపళంగా బీసెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు.ఆ కాల్ సారాంశం ఏంటంటే.. ‘ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది.. మిమ్మల్ని ట్రంప్ వెంటనే కలవాలట. వైట్హౌస్ సిట్యువేషన్ రూమ్కి రమ్మన్నారు’ అని లైవ్ ప్రోగ్రామ్ మధ్యలో సందేశం వెళ్లింది. దాంతో బీసెంట్ తన ఇంటర్వ్యూను అక్కడే వదిలేసి పరుగు పరుగున వెళ్లి ట్రంప్ను కలిశారు. అయితే ఆ తర్వాత బీసెంట్ తన లైవ్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు బీసెంట్ ప్రోగ్రామ్ వాయిదా పడిన తర్వాత కొనసాగించారు. దీనిలో భాగంగా బీసెంట్ మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇరాన్ మిషన్ షెడ్యూల్కి ముందుగానే విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే ప్రభుత్వ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ట్రంప్ను కొనియాడారు.U.S. Treasury Secretary Scott Bessent was abruptly pulled from a live interview after being told “the President wants you right away.” After returning, his voice was noticeably shaken. pic.twitter.com/jx5CamFi03— Clash Report (@clashreport) March 13, 2026 ఇదీ చదవండి: ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్ -
ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్
Iran war ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ భీకరదాడులు, ఇరాన్ సుప్రీం నేత హత్య తరువాత ఇరాన్కూడా అదే స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. దీంతో సోషల్ మీడియాలో పలు అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) గురించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వాస్తవం ఏంటి?ఇజ్రాయెల్ ప్రధాని అధికారికసోషల్ మీడియా ఖాతా నుండి ఆయన మరణించారని ప్రకటించిన సందేశానికి పోస్ట్ కావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. అంతేకాదు ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో ఏఐతో రూపొందించారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. పాత వీడియోకు కొత్త వాయిస్ను జోడించారనే పుకార్లు షికారు చేశాయి.నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నాయా? నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియో వైరల్ అయింది. దీంతో వీడియోలు నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిందనీ, ఇది ఏఐతో సృష్టించిన వీడియో అని రూమర్లు వ్యాపించాయి. అసలు ఆయన బతికే ఉన్నారా అనే ఆందోళన రేగింది. జియోనిస్ట్ నాయకుడు ఎక్కడ ఉన్నాడనేది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.అసలు నిజం ఏమిటంటేఇజ్రాయెల్ నాయకుడి మరణం గురించి ఆన్లైన్లో వ్యాపించిన పుకార్లను అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, ఫ్యాక్ట్-చెకర్లు , వార్తా సంస్థలు ఇప్పటికే తోసిపుచ్చాయి.నెతన్యాహు సురక్షితంగా ఉన్నారనీ, సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో AI సృష్టి అని తేలింది. ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు తేల్చారు.ది సండే గార్డియన్ ఉటంకించిన విశ్లేషకుల ప్రకారం, ఈ పుకార్లు ఎక్కువగా నకిలీ స్క్రీన్షాట్లు, తప్పుడు దృశ్యాలు. తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలంలో ఇవి ధృవీకరించని కంటెంట్ ఆధారంగా రూపొందించినవి. ఈ వాదనలకు ధృవీకరించబడిన ఆధారాలు లేవు.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅలాగే ఆరువేళ్లున్నాయనే విషయంపై కూడా ఫ్యాక్ట్ చెకర్లు స్పందించారు. అది ఆప్టికల్ భ్రమ అనీ, ఒకే ఫ్రేమ్ను విడిగా పరిశీలించినప్పుడు కెమెరా కోణాలు, మోషన్ బ్లర్చ హ్యాండ్ పొజిషనింగ్ లాంటి తప్పుదారి పట్టించే దృశ్యాలను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు.(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్) -
షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన భారతీయ సంతతికి చెందిన సోదరులు భాస్కర్ సవానీ(60), అరుణ్ సవానీ(58)లకు 835 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మనీలాండరింగ్, హెచ్1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో సుమారు $30 మిలియన్ల (రూ. 250 కోట్లకు పైగా) కుంభకోణానికి పాల్పడి, రికార్డ్ స్థాయిలో సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. అసలేంటీ కుంభకోణం వివరాలు తెలుసుకుందాం.US అటార్నీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, భారతీయ సంతతికి చెందిన సోదరులు దంతవైద్యుడు భాస్కర్ సవానీ , అతని సోదరుడు అరుణ్ సవానీ "సవానీ గ్రూప్" పేరుతో పలు రకాల వ్యాపారాలు నడిపారు. తద్వారా మిలియన్ల డాలర్లను అక్రమంగా సంపాదించారు. వీటితోపాటు అమెరికాలో మెడికైడ్ ప్రోగ్రామ్ ద్వారా 30 మిలియన్ల డాలర్లకు పైగా మోసం, H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు దోషులుగా నిర్ధారించబడ్డారు ఈ కుంభకోణంలోని ప్రధానాంశాలను ఒక సారి పరిశీలిస్తే...హెచ్-1బి (H-1B) వీసా స్కాంవీరు 'సవాని గ్రూప్' పేరుతో ఒక నేరపూరిత సంస్థను నడిపారు. భారత్ నుండి విదేశీ కార్మికులను తీసుకురావడానికి తప్పుడు పత్రాలతో H-1B వీసాల కోసం దరఖాస్తు చేశారు. అక్కడికి వచ్చిన కార్మికులను వేధించి, వారికి ఇచ్చే జీతాల్లో కొంత భాగాన్ని తిరిగి తమకే ఇవ్వాలని (కిక్బ్యాక్స్) బలవంతం చేసేవారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.మెడికేడ్ (Medicaid) కుంభకోణంభాస్కర్ సవాని ఒక దంతవైద్యుడు. వీరి దంత వైద్యశాలలను మెడికేడ్ ప్రోగ్రామ్ నుండి తొలగించినప్పటికీ, వీరు ఇతర వ్యక్తుల పేర్లతో (Nominee owners) దొంగ కంపెనీలను సృష్టించి ప్రభుత్వానికి తప్పుడు బిల్లులు పంపారు. ఈ విధంగా అమెరికా ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘మెడికేడ్’ను ఉపయోగించుకొని సుమారు రూ. 250 కోట్లకు పైగా మోసం చేశారు.మనీ లాండరింగ్ , పన్నుల ఎగవేతవచ్చిన అక్రమ సొమ్మును దాచడానికి అనేక బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. దాదాపు 1.6 మిలియన్ల డాలర్లను వ్యక్తిగత ఆదాయాన్ని 1.1 మిలియన్ల డాలర్ల మేర ఉద్యోగుల ఆదాయాన్ని దాచిపెట్టి ప్రభుత్వానికి పన్నులు చెల్లించ కుండా ఎగవేశారు.దారుణమైన వైద్య ప్రయోగాలుఅంతేకాదు వీరు చేసిన అత్యంత దారుణమైన పని ఏమిటంటే, FDA అనుమతి లేని, "మనుషులపై వాడకూడని" (Not For Human Use) అని రాసి ఉన్న ప్రోటోటైప్ డెంటల్ ఇంప్లాంట్స్ను రోగులకు తెలియకుండానే వారి శరీరాల్లో అమర్చారు.మనీలాండరింగ్ ద్వారా కార్పొరేట్ బ్యాంక్ల్లోకి తరలించారని 2023లో వారిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ తర్వాత, భాస్కర్ సవానీ అరుణ్ సవానీ రాకెటీరింగ్ కుట్రకు సంబంధించిన అనేక ఆరోపణలపై దోషులుగా తేలారు.వీరితో పాటు అలెగ్జాండ్రా రాడోమియాక్ (48)ని కూడా దోషిగా తేల్చింది కోర్టు.శిక్షలు ఇలా ఉండబోతున్నాయిభాస్కర్కు 420 ఏళ్లు, అరుణ్ సవానీకి 415 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాలు ఎదుర్కొంటున్నారు. అలెగ్జాండ్రా రాడోమియాక్ కూడా 40 సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానాలు విధించింది. ఈ ఏడాది జూలో (2026) లో శిక్ష అమలు కానుంది. -
మాతో పెట్టుకుంటే అంతే.. ఇరాన్ మంత్రి
టెహ్రాన్: ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో రెండు వారాల యుద్ధానికే అమెరికా పనైపోయిందని తెలిపారు. వాషింగ్టన్ ఇప్పుడు భారత్తో పాటు అనేక దేశాలను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని అడుక్కుంటుందని ఆరోపించారు.పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం చమురు వాణిజ్యానికి ఆటంకం తలెత్తింది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలపై దాడులు చేయడంతో క్రూడాయిల్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ గతంలో విధించిన ఆంక్షలు సడలించారు. ప్రపంచ దేశాలు తాత్కాలికంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కౌంటరిచ్చారు,ఆయన మాట్లాడుతూ " గత కొద్ది నెలలుగా అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయద్దంటూ ఆంక్షలు విధించింది. ఇరాన్తో 15 రోజులు యుద్ధం చేయగానే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు భారత్తో సహా ఇతర దేశాలని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని యాచిస్తుంది. యూరప్ సైతం ఈ అక్రమ యుద్ధంలో మద్దతు ఇవ్వడం ద్వారా రష్యాకు వ్యతిరేకంగా యుఎస్ సపోర్టు లభిస్తోందని భావిస్తోంది" అని అన్నారు. వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉందని తెలిపారు.కాగా ఇంతకాలం రష్యాతో చమురు కొనుగోలు ఇతర దేశాలను అమెరికా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మాస్కో నుంచి పన్ను కొనుగోలు చేసిన వారిపై అధిక పన్నులు విధించింది. ఈ నేపథ్యంలో భారత్పైన తొలుత పన్నులు పెంచి అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశారని ప్రకటించింది. అయితే ఇటీవలే రష్యా నుంచి తాత్కాలికంగా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చని ఆదేశించినట్లు తెలిపింది. కాగా దీనిపైఇరాన్ విదేశాంగమంత్రి స్పందించారు.కాగా ప్రస్తుతం ఇరాన్ భారత్ విషయంలో సానూకులంగా ఉంది. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగశాఖ మంత్రితో చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలో భారత్ వెళ్లే చమురు నౌకలకు ఇరాన్ అనుమతి తెలిపింది. ఇటీవల భారత్ పతాకంతో ఉన్న రెండు నౌకలు హార్మూజ్ గుండా ఇండియాకు చేరుకున్నాయి. -
ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు జపాన్ ప్రకటించింది. ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ప్రయోగాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే ఈ క్షిపణి ప్రయోగ తర్వాత జపాన్ తమ పౌరులను అప్రమత్తం చేసింది. జపాన్ ప్రధాని మంత్రి కార్యాలయం ఎక్స్లో ఒక అధికారిక పోస్ట్ను ప్రచురించింది. 'నార్త్ కొరియా జపాన్ జలాల్లోకి అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీనిపై మరింత సమాచారం అందిస్తాం' అని పోస్ట్లో తెలిపింది. అయితే క్షిపణి ప్రయోగంపై పూర్తిపూర్తి స్థాయిలో విశ్లేషణ జరిపిన అనంతరం ఆ క్షిపణులు జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జలాల అవతల పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు జరుపుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ మిసైల్స్ ప్రయోగం ఆందోళన కలిగిస్తోంది. -
ఖర్గ్ ఐలాండ్పై దాడి.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఖర్గ్ ఐలాండ్పై అమెరికా దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్.. అమెరికా చమురు మౌలిక సదుపాయాలను బూడిద చేస్తామంటూ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు చేసింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశామంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.కాగా, ‘ఇరాన్ ఇప్పటికే లొంగుబాట పట్టిందని.. మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్ను నిర్మూలించానంటూ కూడా జీ7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్కు సూచించారు. అంతకుముందు ట్రూత్సోషల్ పోస్టుల్లో ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఈ మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తూండండి! వారి నేవీ, ఎయిర్ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి. సర్వమూ నాశనమవుతోంది.నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయమిది!’’ అని చెప్పుకున్నారు. ఇరాన్ వద్ద పోగుపడ్డ యురేనియం నిల్వల స్వా«దీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నారు. -
ఇరాన్తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం!
ఇరాన్తో యుద్ధం మొదలై దాదాపు రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచింది. ఇరాన్పై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిడిల్ ఈస్ట్కు అమెరికా మెరైన్ కమాండోలను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్ దళాలను మోహరించింది. యూఎస్ఎస్ ట్రిపోలి యుద్ధనౌకలో 2500 మెరైన్ కమాండోలతో పాటు 20 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు మధ్యప్రాచ్యానికి పంపినట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నిన్న (శుక్రవారం) భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. నగరం నడిరొడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్పై ఇజ్రాయెల్–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విస్తృత దాడులను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగే చమురులో ఐదో వంతు ప్రయాణించే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ దాదాపుగా మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, ఇతర లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల లెబనాన్లో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటివరకు దాదాపు 800 మంది మరణించగా.. 8.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
‘బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీ తప్పనిసరి’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో న్యూక్లియిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్టింగ్(ఎన్ఏటీ)ని తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. వైద్య శాస్త్రం తెలియకున్నా తెలిసినట్లుగా ఎందుకు తాము నటించాలని ప్రశ్నించింది. ఢిల్లీకి చెందిన ‘సర్వేశం మంగళం ఫౌండేషన్’వేసిన పిల్పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఏటీ వల్ల గ్రహీతలకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేని రక్తాన్ని అందించేందుకు వీలవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం పిల్లకు విదేశీ నిధులు అందవని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించింది. ‘ఈ అంశంపై మాకు ఎటువంటి పరిజ్ఞానం లేదు, వైద్య శాస్త్రంతో ఎటువంటి పరిచయం లేకున్నా తెలిసినట్లుగా మేమెందుకు నటించాలి?అని ప్రశ్నించింది. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీకి అవసరమైన ఏర్పాట్లు చేసే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్ను కోరింది. రాష్ట్రాల కార్యదర్శులు సంబంధిత అంశాల్లో నిపుణుల సలహాలతో సరైన నిర్ణయం తీసుకుంటారంది. బ్లడ్ బ్యాంకుల్లో ఎటువంటి పరీక్షలు చేయాలన్నది నిపుణుల పరిధిలోనే ఉంటుందని తెలిపింది. ఈ అంశంలో ప్రత్యేకంగా తమకు ఎటువంటి పరిచయం లేనందున, పిటిషనర్ కోరిన విధంగా ఆదేశాలివ్వజాలమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకుల్లో ఖరీదైన ఎన్ఏటీకి ఏర్పాటు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.పిటిషన్లో ఏముంది? రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21లోని జీవించే హక్కులో భాగమే సురక్షితమైన రక్తాన్ని పొందే హక్కని పిటిషన్ తెలిపింది. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ఏటీకి వెసులుబాటు కలి్పస్తే దాతల నుంచి సేకరించిన రక్తంలో హెచ్ఐవీ, హెపటైటిస్ సీ, బీ, మలేరియా, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలవుతుందని వివరించింది. రక్త దాతల నుంచి సేకరించిన రక్తం పూర్తి సురక్షితంగా గ్రహీతలకు అందేలా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. అయితే, ప్రభుత్వాల వైఫల్యాల వల్ల అత్యంత సున్నితమైన ఆరోగ్య పరిస్థితి కలిగిన, ముఖ్యంగా తలసీమియా రోగులను ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో విఫలమవుతున్నామని తెలిపింది. ఇన్ఫెక్షన్ కలిగిన రక్తాన్ని అందించడం వల్ల మధ్యప్రదేశ్లోని సత్నా ఆస్పత్రిలో ఆరుగురు తలసీమియా బాధిత చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా, జార్ఖండ్లోని చైబాసా ఆస్పత్రిలో 2025లో ఐదుగురు బాలలు, యూపీలోని ఓ మెడికల్ కాలేజీలో 2023లో 14 మంది బాలలకు హెపటైటిస్, హెచ్ఐవీ సోకిందని తెలిపింది. -
అమెరికాతో చర్చలు నిజమే: క్యూబా
హవానా: అమెరికా ప్రభుత్వంతో తాము చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలను కమ్యూనిస్ట్ దేశం క్యూబా అధ్యక్షుడు మిగెల్ డయాజ్ కనెల్ ధ్రువీకరించారు. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నదే ఈ సంభాషణల లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు అవకాశమిచ్చాయన్నారు. చర్చల వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ అంశంపై నిరాకరించేందుకు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నిరాకరించింది. అమెరికా ఇంధన దిగ్బంధం కారణంగానే గత మూడు నెలలుగా తమకు పెట్రోలియం ఉత్పత్తులు అందడం లేదని అధ్యక్షుడు డయాజ్ కనెల్ అన్నారు. సహజ వాయువు, సోలార్ పవర్ థర్మోఎలక్ట్రిక్ ప్లాంట్లతో నెట్టుకొస్తున్నామన్నారు. తీవ్ర ఇంధన కొరత ప్రభావం సమాచార, విద్య, రవాణా రంగాలపై ఎక్కువగా పడిందని, ఆస్పత్రుల్లో వేలాదిమందికి అవసరమైన శస్త్ర చికిత్సలు వాయిదాపడ్డాయని చెప్పారు. దేశంలో ఉన్న 115 బేకరీలు ప్రస్తుతం బొగ్గు, వంటచెరుకుతోనే నడుస్తున్నాయన్నారు. క్యూబాకు ప్రధాన చమురు సరఫరాదారు వెనెజువెలా. అయితే, రెండు నెలల క్రితం వెనెజువెలాపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లడంతో క్యూబాకు చమురు రవాణా ఆగిపోయింది. అమెరికా ఆంక్షల కారణంగా ఇతర దేశాల నుంచి అవసరమైన యంత్రాలు, ఇతర విడి భాగాలను క్యూబా కొనుగోలు చేయలేకపోతోంది. -
లెబనాన్పై బాంబుల వర్షం
పశ్చిమాసియా యుద్ధ తీవ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు మద్ధతుగా నిలిచే గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుంది. హిజ్బూల్లా స్థావరాలే లక్షంగా అటాక్స్ చేస్తుంది. అయితే ఈ దాడుల్లో అధిక సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు తీవ్రతరం చేసింది. కొద్దిరోజుల క్రితమే గ్రౌండ్ లెవల్ ఆపరేషన్ చేపట్టింది. ఆ దేశ ఆర్మీ దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తున్నాయి. తాజాగా బీరూట్ నగరంపై బాంబులతో విరుచుకపడింది. హిజ్బుల్లా టార్గెట్గా జరిగిన దాడుల్లో ఆ దేశంలోని సాధారణ పౌరులు పెద్దమెుత్తంలో మరణిస్తున్నారు. తాజాగా బీరూట్పై జరిపిన బాంబుదాడుల్లో 12 మంది వైద్యసిబ్బంది మృతిచెందినట్లు లెబనాన్ ప్రకటించింది.హిజ్బుల్లా హెచ్చరికఅయితే ఈ నేపథ్యంలో హిజ్బుల్లా నేత నయీమ్ ఖాసిమ్ తీవ్రంగా స్పందిచారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు." మమ్మల్ని మేము దీర్ఘకాలిక పోరాటానికి సిద్దం చేసుకున్నాం. భగవంతుడు కోరుకుంటే ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇది సాధారణ యుద్ధం కాదు. అస్థిత్వ యుద్దం." అన్నారు. లెబనాన్లో మౌళిక సదుపాయాలపై జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మూల్యం చెల్లించాలని తెలిపారు.కాగా నిన్న శుక్రవారం జ్రారియే మరియు టేర్ ఫాల్సే పట్టణాలను కలిపే లిటాని నదిపై ఉన్న వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇది హిజ్బుల్లాకు ప్రధానమైన రహదారి. ఇది ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్ చేరుకోవడానికి కీలకంగా ఉంటుంది. తాజాగా ఇజ్రాయెల్ దాన్ని ధ్వంసం చేసింది.ఇజ్రాయెల్ హెచ్చరిక కాగా మరోవైపు ఇజ్రాయెల్ ఈ దాడిపై ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే మరియు హిజ్బుల్లా ఉగ్రవాదులు ఉపయోగించే హిజ్బుల్లాకు తన మద్ధతు ఉపసంహరించి దానిని నిరాయుధీకరణ చేసే వరకూ లెబనాన్ భూభాగం కోల్పోతూనే ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ హెచ్చరించారు.ఐక్యరాజ్యసమితి స్పందనఅయితే శుక్రవారం బీరుట్ ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ పర్యటించారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు తక్షణమే యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలకు మద్ధతు ఇవ్వడానికి 325 మిలియన్ డాలర్ల మానవతావాద సహాయం అందించాలని ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. -
‘ఉగ్గు’తో ఉసురు తీయకండి!
కొందరు పెద్దలు సంప్రదాయంలో భాగమంటూ ‘ఉగ్గు’ పేరుతో పసిపిల్లల నాలుకకు తేనె రాస్తుంటారు. ఈ కార్యాన్ని శుభసూచికగా చెబుతారు. అయితే ముద్దులొలికే పసిపాపలకు అందించే ఆ ఒక్క తేనె చుక్క వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐర్లాండ్లోని అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నిపుణులు డాక్టర్ సురేష్ సి పిళ్ళై చిన్నారులకు తేనె పెట్టడం వలన కలిగే ప్రాణంతక ముప్పును తెలియజెప్పారు.జపాన్ చిన్నారి మరణంతో వెలుగులోకి..గత కొంతకాలంగా పసిబిడ్డలకు తేనె పెట్టడంతో కలిగే ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2017లో టోక్యోలో జరిగిన ఒక విషాద ఘటన ఈ నాటికీ వెంటాడుతోంది. నాడు ఆరు నెలల వయసున్న చిన్నారికి తేనె కలిపిన ఆహారాన్ని ఇవ్వగా, ఆ పసిపాప ‘ఇన్ఫాంట్ బోటులిజం’ బారిన పడి మృతి చెందింది. తేనెలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్య పరీక్షల్లో తేలింది.శరీరం మొద్దుబారిపోయేలా చేసి..అప్పటి నుంచి జపాన్ సహా పలు దేశాలు ఏడాదిలోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదనే కఠిన నిబంధనను అమలు చేస్తున్నాయి. తేనెలో 'క్లోస్ట్రిడియం బోటులినమ్' అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఏళ్ల తరబడి సజీవంగా ఉంటుంది. ఏడాదిలోపు చిన్నారుల జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో, ఈ ప్రమాదకర బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశించి, విషతుల్యమైన 'బోటులినమ్ టాక్సిన్'ను విడుదల చేస్తుంది. ఇది నేరుగా బిడ్డ నరాల వ్యవస్థపై ప్రభావం చూపి, శరీరం మొద్దుబారిపోయేలా చేస్తుంది.పెద్దలకు లేని ముప్పు.. పిల్లలకే ఎందుకు?తేనెను పెద్దలు తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెద్దవారి జీర్ణాశయంలో ఉండే శక్తివంతమైన ఆమ్లాలు, ఇతర బ్యాక్టీరియాలు ఈ బోటులినమ్ మూలాలను నిర్వీర్యం చేస్తాయి. అయితే పసిపిల్లల విషయంలో ఇలా జరగదు. అందుకే అమెరికాకు చెందిన ఎఫ్డీఏ (ఎఫ్డీఏ) వంటి సంస్థలు సైతం ఏడాది దాటే వరకు పిల్లలకు కనీసం ఒక్క తేనె చుక్క కూడా ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నాయి.పాత అలవాట్లకు స్వస్తి పలకాల్సిందే!సంప్రదాయం పేరిట గర్భవతులు, బాలింతలు లేదా పసిబిడ్డలకు తేనెను రుచి చూపించడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల నిల్వలో తేడా వచ్చినా లేదా కలుషితమైన క్యాన్డ్ ఫుడ్ తిన్నా పెద్దల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. గత ఏడాది ఇటలీలో జరిగిన ఒక ఘటనలో ఇలాంటి విషతుల్యమైన ఆహారం తిని ఒకరు మరణించగా, మరో తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. అందుకే సహజసిద్ధమైన ఆహారమైనప్పటికీ పసిపిల్లల విషయంలో తేనె అత్యంత ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి -
ఐదుగురు భారతీయులు మృతి: విదేశాంగ మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. -
ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇరాన్ ఆర్థిక రాజధానిగా భావించే ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.సైనిక స్థావరాలు ధ్వంసం‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఒక వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి ధ్వంసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఈ దీవి నుంచే సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధిపై హెచ్చరికవ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ‘ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే, చమురు క్షేత్రాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఆయన హెచ్చరించారు. యుద్ధ ట్యాంకర్లకు రక్షణగా త్వరలోనే అమెరికా నౌకాదళం కాపలాగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తాం’పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, మూడు అత్యాధునిక యుద్ధ నౌకలను యుద్దప్రాంతానికి పంపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇది కూడా చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే! -
యుద్ధం దిశగా పాక్-ఆఫ్ఘాన్
కాబూల్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఘర్షణ రగులుతోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పరస్పర దాడుల్లో సామాన్య జనం బలైపోతున్నారు. పాకిస్తాన్ సైన్యం గురువారం రాత్రి తమ రాజధాని కాబూల్తోపాటు పరిసర ప్రాంతాల్లో సాధారణ జనావాసాలపై మోర్టార్లతో దాడులు చేసినట్లు అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు పౌరులు మరణించారని, పది మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. ఈ దాడులకు ప్రతీకారం పాకిస్తాన్ సైనిక కేంద్రాలపై విరచుకుపడ్డామని పేర్కొంది.ఖైబర్ పఖ్తూంక్వాలోని కోహట్లో జరిగిన ఈ వైమానిక దాడిలో పాకిస్తాన్కు భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపింది. కాందాహార్ ఎయిర్పోర్టు సమీపంలోని ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థ ఇంధన డిపోలపై పాక్ వైమానిక దాడులకు దిగినట్లు అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పౌర విమానయాన సంస్థలతోపాటు ఐక్యరాజ్యసమితి విమానాలకు ఇక్కడి నుంచే ఇంధనం సరఫరా అవుతుందని తెలిపారు. అఫ్గానిస్తాన్ భూభాగంపై విజయవంతంగా వైమానిక దాడులు చేసినట్లు పాక్ ప్రభుత్వ టీవీ చానల్ పేర్కొంది.మిలిటెంట్ల స్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. అఫ్గాన్, పాక్ మధ్య మూడు వారాల క్రితం ఘర్షణ ఆరంభమైంది. అఫ్గాన్పై తాము బహిరంగ యుద్ధం చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. సరిహద్దు వివాదానికి తోడు తాలిబన్ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మిలిటెంట్ గ్రూప్లను ఉసిగొల్పుతోందని పాక్ సర్కార్ ఆరోపిస్తోంది.అలాంటి గ్రూప్లకు తాము ఆశ్రయం ఇవ్వడం లేదని తాలిబన్లు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉండగా, వాయువ్య పాకిస్తాన్లోని లకీ మార్వాత్జిల్లాలో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనకు కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. తాలిబన్ల అండదండలున్న తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ కారణం కావొచ్చని పాక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులకు దిగుతున్నాయి. ఇరాన్ సైతం గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దుగా డ్యూరాండ్ లైన్ఉంది. ఈ సరిహద్దును గుర్తించడానికి తాలిబన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. దాంతో వివాదం మొదలైంది.సరిహద్దులో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. సంయమనం పాటించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నప్పటికీ పాక్, అఫ్గాన్లు వెనక్కి తగ్గడం లేదు. ఇరుదేశాల ఘర్షణ రానున్న రోజుల్లో పూర్తిస్థాయి యుద్ధంగా మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. -
‘ఘోస్ట్ టౌన్’గా మారిన దుబాయ్!
దుబాయ్ అంటే సాధారణంగా మెగా భవనాలు, విలాసవంతమైన రిసార్ట్లు, మిచెలిన్-స్టార్ రెస్టారెంట్లతో ఆకర్షణీయమైన పర్యాటక నగరంగా ప్రపంచానికి తెలుసు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో దుబాయ్ పరిస్థితి మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత భద్రతా ఆందోళనలు పెరగడంతో దుబాయ్ నగరం క్రమంగా వెలవెలబోతూ ‘ఘోస్ట్ టౌన్’ను తలపిస్తోంది.ఇరాన్ క్షిపణి దాడుల ప్రభావం గల్ఫ్ ప్రాంతంపై తీవ్రంగా పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్లోని పలు బీచ్ బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. గూచీ వంటి హై-ఎండ్ దుకాణాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. అలాగే దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్, గ్లోబల్ విలేజ్ థీమ్ పార్క్, ఐన్ దుబాయ్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షణలను కూడా తాత్కాలికంగా మూసివేశారు.సాధారణంగా వీకెండ్ సమయంలో ట్రాఫిక్తో కిక్కిరిసే నగరం ఇప్పుడు అసాధారణంగా ప్రశాంతంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో యజమానులు తమ సిబ్బందికి సెలవులు ఇచ్చి పంపుతున్నారు. పర్యాటకులు లేకపోవడంతో హోటళ్లు తక్కువ ధరలకు గదులు అందిస్తున్నాయి.ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా మంది స్థానికులు, పర్యాటకులు దుబాయ్ను విడిచివెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యం నుంచి బయలుదేరే విమానాల్లో దాదాపు సగం విమానాలు రద్దు అయినట్లు ట్రావెల్ అనలిటిక్స్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా దుబాయ్లో నివసిస్తున్న విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచిన దుబాయ్ గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల నగర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధికారులు మాత్రం తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలు ధ్రువీకరించని సమాచారాన్ని పంచుకోరాదని హెచ్చరిస్తున్నారు. -
ఇరాన్ ముందుచూపు.. మొజాయిక్ డిఫెన్స్!
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు అగ్ర నాయకత్వాన్నంతా దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఆ దాడుల్లో ఆర్మీ చీఫ్ సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం ముసావీ, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదేతో పాటు మరో 30 మందికి పైగా పౌర, సైనిక అగ్ర నేతలను అంతం చేశాయి. అంతటితో ఆగకుండా రెండు వారాలుగా ఇరాన్పై ఎడతెరిపి లేని దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఆ దేశ డిఫెన్స్, దాడుల వ్యవస్థలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ వస్తున్నాయి. పైగా నూతన సుప్రీం నేత, ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా తొలి రోజు దాడిలోనే గట్టిగా గాయపడ్డట్టు వార్తలొస్తున్నాయి. అయినా సరే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశించినట్టుగా ఇరాన్ను ఓడించడం దేవుడెరుగు, ఆ దేశాన్ని కాస్త కూడాలొంగదీయలేకపోయారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముమ్మర దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. పశి్చమాసియా మొత్తాన్నీ యుద్ధక్షేత్రంగా మార్చేసింది. ఇంకెంత కాలమైనా పోరాడేందుకు సిద్ధమంటోంది. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోయినా, వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నా, డెడ్లీ కాంబినేషన్గా పరిగణించే ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులను దీటుగా ఎదుర్కోవడం ఇరాన్కు ఎలా సాధ్యపడుతోంది? ఇందుకు సమాధానం ఒక్కటే. ఆ దేశం ముందుచూపుతో సిద్ధంచేసి పెట్టుకున్న మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం! అత్యంత శక్తిమంతుడైన శత్రువుపై ఇరాన్కు గెలుపు సాధించి పెట్టలేకపోయినా, ఓటమిని మాత్రం అసాధ్యంగా మార్చే గమ్మత్తైన ఏర్పాటిది!! సైనికాధికార వికేంద్రీకరణ ఇరాన్ మొజాయిక్ రక్షణ సిద్ధాంతానికి 2003 ఇరాక్ యుద్ధంతో బీజం పడింది. దీని రూపకర్త నాటి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) డైరెక్టర్ మొహమ్మద్ అలీ జఫారీ. 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలను తుడిచిపెట్టేందుకు అమెరికాకు కేవలం 26 రోజుల సమయం సరిపోయింది. నాయకుని పలాయనంతో ఇరాక్ సైన్యం చేష్టలుడిగింది. తమకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ సమన్వయం చేసే వ్యవస్థ లేక ఉన్నపళంగా చేతులెత్తేసింది. ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా గమనించిన జఫారీ ఇరాన్కు ఎప్పటికీ అలాంటి గతి పట్టకుండా జాగ్రత్త పడాలని నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచనల్లోంచి 2005లో పుట్టుకొచి్చందే మొజాయిక్ రక్షణ సిద్ధాంతం. ఒక్కముక్కలో చెప్పాలంటే అధికార వికేంద్రీకరణే దీని మూలమంత్రం.ఇందులో భాగంగా సైనిక, ఐఆర్జీసీ బలగాలను పాక్షిక స్వయంప్రతిపత్తితో కూడిన 31 విభాగాలుగా తీర్చిదిద్దారు. అలా రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రొవిన్షియల్ కమాండ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి కమాండ్కూ సొంత ప్రధాన కార్యాలయం, కమాండ్–కంట్రోల్ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఆయుధ వ్యవస్థ, సమీకృత బసీజ్ పోరాట యూనిట్లు, నావికా దళ విభాగాలు, నిఘా వ్యవస్థలు, ఆయుధాగారం వంటివి ఉంటాయి. నాయకత్వం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతి కమాండ్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పోరాటం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2007లో జఫారీ ఐఆర్సీజీ చీఫ్ కమాండర్గా ఎంపికయ్యా మొజాయిక్ సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. పొరుగునుంచే పాఠాలు ఇరాక్లో మాదిరిగా నాయకత్వాన్ని అంతం చేసి తమను లొంగదీసుకోవడం సాధ్యపడే విషయం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాఘ్చీ ముందే స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన రెండో రోజు మార్చి 1వ తేదీనే ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. ఆద్యంతం ఐఆర్జీసీతోనే ముడిపడ్డ కెరీర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీది. ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్లో నిఘా విభాగంలో చేరారు. అనంతరం ఇరాక్తో పదేళ్ల యుద్ధంలో పోరాడారు. 1992 నాటికి ఐఆర్జీసీ పదాతి దళాల కమాండర్గా ఎదిగారు. 2005లో ఐఆర్జీసీ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్గా ఎంపికయ్యాక మొజాయిక్ సిద్ధాంతానికి పదును పెట్టారు. 2003లో ఇరాక్ను అమెరికా ఆక్రమించిన తీరు నుంచి నేర్చుకున్న పాఠాలనే అందుకు ముడిసరుకుగా మార్చుకున్నారు.నిద్రలేని రాత్రులేఇరాన్ ముందుచూపుతో ఏర్పాటు చేసుకున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ నేటి అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఫిబ్రవరి 28న అనూహ్య రీతిలో భారీ దాడులకు గురైనా ఖమేనీతో పాటు అత్యున్నత నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినా గంటల వ్యవధిలోనే ఇరాన్ బలగాలు తేరుకున్నాయి. ఇజ్రాయెల్పైనే గాక గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఎడాపెడా దాడులతో విరుచుకుపడ్డాయి.శత్రు దాడులకు ఎక్కడికక్కడ దీటుగా బదులిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా స్వీయ నిర్ణయాలతో విమానాశ్రయాలు, చమురు, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాంకుల వంటి పౌర వ్యవస్థలపైనా దాడులతో గుబులు పుట్టిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం లేని లోటు పెద్దగా కనిపించకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా రెండింటికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుత యుద్ధ తంత్రాన్ని పైలట్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పని లేకుండానే విమానాన్ని సురక్షితంగా నడిపే ఆటో పైలట్ మోడ్తో అంతర్జాతీయ రక్షణ నిపుణులు పోలుస్తున్నారు. -
కుప్పకూలిన రీఫ్యూయలింగ్ విమానం
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లుతోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన కేసీ–135 రీఫ్యూయలింగ్ విమానం పశ్చిమ ఇరాక్లో గురువారం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న మొత్తం ఆరుగురు సిబ్బంది మరణించారు. యూఎస్ మిలటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయం నిర్ధారించింది. విమానం కూలిపోవడానికి శత్రువుల దాడి గానీ, ఫ్రెండ్లీ ఫైర్ గానీ కారణంగా కాదని తేల్చిచెప్పింది. రెండు కేసీ–135 విమానాలు పక్కపక్కనే ప్రయాణిస్తూ ప్రమాదవవశాత్తూ పరస్పరం ఢీకొన్నాయని తెలియజేసింది.వాటిలో ఒకటి కూలిపోగా, మరొకటి స్వల్పంగా దెబ్బతిని ఇజ్రాయెల్లో క్షేమంగా ల్యాండైనట్లు స్పష్టంచేసింది. పశ్చిమాసియాలో ఇరాన్పై యుద్ధంలో పాల్గొంటున్న తమ సైన్యానికి మద్దతుగా ఈ విమానాలను అమెరికా రంగంలోకి దించినట్లు సమాచారం. అయితే, పశ్చిమ ఇరాక్లో యూఎస్ కేసీ–135 ఎయిర్క్రాఫ్ట్ను తామే కూల్చేశామని ఇరాన్కు అనుకూలంగా వ్యవహరించే ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది.ఇరాన్పై యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియాలో అమెరికా విమానాలు కూలిపోవడం ఇది నాలుగోసారి. కేసీ–135 రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ను గగనతలంలో యుద్ధ విమానాల్లో ఇంధనం నింపడానికి ఉపయోగిస్తారు. ఇదొక భారీ చమురు ట్యాంకర్ అని చెప్పొచ్చు. కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ అని పిలుస్తుంటారు. కేవలం చమురు నింపడానికే కాకుండా, సైనిక ఆపరేషన్లలో గాయపడిన జవాన్లను చికిత్స కోసం తరలించడానికి వాడుతుంటారు. -
ర్యాలీపై దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. శుక్రవారం నగరం నడిరోడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్పై ఇజ్రాయెల్–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి. దాంతో రాజధాని మీదుగా ఎటు చూసినా దట్టమైన పొగ అలముకుని కన్పించింది.అయితే దాడులకు ఇరానీలు వెరవలేదు. పేలుళ్ల అనంతరం కూడా వేలాదిగా టెహ్రాన్ వీధుల్లో ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ‘అమెరికాకు, ఇజ్రాయెల్కు మరణం’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ గులాం హుసేన్ మొహసెనీ ఎజెయ్, రక్షణ శాఖ ఉన్నతాధికారి అలీ లరిజానీ తదితరులు కూడా అందులో భాగస్వాములయ్యారు. పేలుళ్లలో చాలామందే మరణించినట్టు భావిస్తున్నారు. ఇరాన్ మాత్రం ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పాలస్తీనావాసులకు మద్దతుగా ఇరాన్ ఏటా ఖుద్స్ డే జరుపుతూ వస్తోంది. ఇరాన్వ్యాప్తంగా క్షిపణి, ఇజ్రాయెల్–అమెరికా బాంబు దాడులు శుక్రవారమూ కొనసాగాయి. ప్రధానంగా సైనిక, క్షిపణి కమాండ్ వ్యవస్థలనే లక్ష్యం చేసుకున్నారు.ఇరాన్ కూడా భారీ స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. మద్యధరా ప్రాంతంలో మోహరించిన అమెరికాకు చెందిన భారీ విమానవాహక యుద్ధ నౌక అబ్రహం లింకన్పై ఏకంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ‘‘అత్యంత కచ్చితత్వంతో కూడిన మా దాడుల్లో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అది పని చేయడం లేదు. యుద్ధరంగం నుంచి వెనుదిరిగి వెళ్లిపోతోంది’’ అని పేర్కొంది. అమెరికా మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఒక ఇరాన్ పడవ కేవలం తమ నౌకకు అతి సమీపానికి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.అమెరికాకు చెందిన మరో విమానవాహక యుద్ధ నౌక గెరాల్డ్ ఫోర్డ్లోనూ మంటలు చెలరేగడం కలకలం రేపింది. దీనికి యుద్ధంతో సంబంధం లేదని అమెరికా తెలిపింది. ‘‘లాండ్రీ ప్రదేశంలో చెలరేగిన మంటల్లో ఇద్దరు నావికులకు గాయాలయ్యాయి. నౌకకు నష్టమేమీ వాటిల్లలేదు. ఎప్పట్లాగే చురుగ్గా యుద్ధంలో పాల్గొంటోంది’’ అని వెల్లడించింది. మరోవైపు లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు నిర్నిరోధంగా కొనసాగాయి. దాంతో 60 మందికి పైగా గాయపడ్డారు.గల్ఫ్పై దాడులే దాడులు అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. నలుగురు గాయపడ్డట్టు సమాచారం. దుబాయ్ పారిశ్రామిక ప్రాంతంపైనా దాడులు జరిగాయి. దాంతో దుబాయ్ ఇంటర్నేషనల్ పైనాన్షియల్ సెంటర్లో ఒక భవనం భారీగా దెబ్బ తిన్నది. అబుదాబి విమానాశ్రయ సమీపంలో కూడా డ్రోన్ దాడులతో మంటలు చెలరేగాయి. తమపైకి దూసుకొచి్చన 7 ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను, 27 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.ఒమన్లోని సొహర్ నగరంపై రెండు డ్రోన్ దాడులు జరిగాయి. వాటిలో ఒకటి అల్ అవీ పారిశ్రామిక ప్రాంతాన్ని తాకడంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వారిలో 10 మంది భారతీయులేనని తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఇప్పటిదాకా మరణించిన భారతీయుల సంఖ్య 5కు చేరింది. ముజ్తాబాకు తీవ్ర గాయాలు: హెగ్సెత్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గాయాలతో మొజ్తబా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారని ఆయన చెప్పారు. ఇరాన్లో ఇప్పటిదాకా 15 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు తెలిపారు. మా టార్గెట్ ముజ్తబా: నెతన్యాహుఇరాన్పై దాడులు ఊహించిన దాని కంటే గొప్పగా సాగుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ జీవితానికి గ్యారంటీ లేదన్నారు. ఆయనతో పాటు హెజ్బొల్లా నేత నయీం ఖాసీంను కూడా లక్ష్యం చేసుకున్నట్టు వెల్లడించారు.ఇరాన్ లొంగుబాట: ట్రంప్‘‘ఇరాన్ ఇప్పటికే లొంగుబాట పట్టింది. మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్ను నిర్మూలించాను’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జీ7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగ్లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్కు సూచించారు. అంతకుముందు ట్రూత్సోషల్ పోస్టుల్లో ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఈ మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తూండండి! వారి నేవీ, ఎయిర్ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి.సర్వమూ నాశనమవుతోంది. నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయమిది!’’ అని చెప్పుకున్నారు. ఇరాన్ వద్ద పోగుపడ్డ యురేనియం నిల్వల స్వా«దీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నారు. యుద్ధంలో ఇరాన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాయం చేస్తున్నారని కూడా ట్రంప్ అనుమానాలు వెలిబుచ్చారు. -
వీసాల పొడిగింపు.. భారత్ గుడ్ న్యూస్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత విదేశీ పౌరులకు అన్ని రకాల వీసాలకు 30 రోజుల పాటు పొడిగింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎక్కువ కాలం బస చేసినందుకు విధించే జరిమానాలను కూడా మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. రెగ్యులర్ వీసాలు, ఈ-వీసాలు సహా అన్ని రకాల వీసాలకు ఈ సడలింపులు వర్తిస్తాయని తెలిపింది.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పలువురు విదేశీయులు ప్రయాణ సమస్యల కారణంగా తమ దేశాలకు వెళ్లలేకపోతున్నారు.వీసా పొడిగింపు, జరిమానా మాఫీభారత ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు ఇలా ఉన్నాయి..గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న అన్ని రకాల వీసాలకు ఒక నెల పాటు పొడిగింపు.కేసు ప్రాతిపదికన ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా ఈ పొడిగింపు మంజూరు.ఫిబ్రవరి 28, 2026 తర్వాత ఎక్కువ కాలం బస చేసిన విదేశీయులపై విధించే జరిమానా పూర్తిగా మాఫీ.ఎగ్జిట్ పర్మిట్, తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్పై సడలింపుయుద్ధ పరిస్థితుల వల్ల చిక్కుకుపోయిన విదేశీయులకు భారత్ మరిన్ని సడలింపులు ప్రకటించింది.అవసరమైన విదేశీయులకు ఎగ్జిట్ పర్మిట్లు ఉచితంగా జారీ.ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయకపోవడం వలస చట్ట ఉల్లంఘనగా పరిగణించరు.విమానాల మళ్లింపు కారణంగా భారత్కు వచ్చే విదేశీయులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్ (TLP) మంజూరు.ముందుగానే సూచనలుమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రారంభమైన వెంటనే, మార్చి 1న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశీ పౌరులకు సూచనలు జారీ చేసింది. వీసా పొడిగింపు లేదా బసను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ సమీపంలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)ను సంప్రదించాలని సూచించింది. -
ఇరాక్లో కూలిన అమెరికా సైనిక విమానం.. ఆరుగురూ మృతి
పశ్చిమ ఇరాక్లో యూఎస్ ఎయిర్ ఫోర్స్కు చెందిన KC-135 స్ట్రాటోట్యాంకర్ రీఫ్యూయలింగ్ విమానం కూలిపోయిన సంఘటనలో విమానంలో ఉన్న మొత్తం ఆరుగురు సిబ్బంది మరణించారని యుఎస్ సెంట్రల్ కమాండ్ శుక్రవారం ధ్రువీకరించింది. ఇరాన్పై జరుగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఈ విమానం రీఫ్యూయలింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటోంది.ఈ ప్రమాదంతో ఆపరేషన్లో అమెరికా సైనిక మరణాల సంఖ్య కనీసం 13కి చేరుకుంది. ఇందులో ఏడుగురు యుద్ధంలో మరణించగా, మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగాయి. సుమారు 140 మంది సైనికులు గాయపడ్డారని పెంటగాన్ నివేదించింది.రెండు KC-135 విమానాలు పాల్గొన్న 'ఫ్రెండ్లీ ఎయిర్స్పేస్' సంఘటనలో ఒకటి కూలిపోయింది. మరొక విమానం సురక్షితంగా ఇజ్రాయెల్లో ల్యాండ్ అయింది. ప్రమాదం శత్రు కాల్పులు లేదా స్నేహపూర్వక కాల్పుల వల్ల జరిగిందికాదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇరాన్ మద్దతుగల ఇరాకీ మిలిటంట్లు విమానాన్ని కాల్చివేశామని పేర్కొన్నప్పటికీ, అమెరికా సైన్యం దానిని తిరస్కరించింది. ఇది మిడ్-ఎయిర్ ఇన్సిడెంట్ లేదా టెక్నికల్ సమస్య వల్ల జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.KC-135 స్ట్రాటోట్యాంకర్ యూఎస్ వైమానిక దళంలో దీర్ఘకాల సేవలందిస్తున్న విమానం. బోయింగ్ 707 డిజైన్ ఆధారంగా తయారైన ఇది 60 ఏళ్లకు పైగా సేవలందిస్తోంది. వాయుతలంలోనే ఇంధనం నింపడమే కాకుండా, వైద్య తరలింపు, నిఘా కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా ముగ్గురు సిబ్బంది (పైలట్, కో-పైలట్, బూమ్ ఆపరేటర్) ఉంటారు. అదనపు మిషన్లలో మరిన్ని మంది చేరవచ్చు. పాత విమానాల కారణంగా విశ్వసనీయతపై ఆందోళనలు ఉన్నప్పటికీ, KC-46A పెగాసస్తో భర్తీ చేసే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.గతంలో KC-135 విమానాలు అనేక ప్రమాదాలకు గురయ్యాయి. 2013లో ఆఫ్ఘనిస్తాన్ మద్దతు కార్యకలాపాల్లో కిర్గిజిస్తాన్ నుంచి టేకాఫ్ అయిన విమానం కూలిపోయి ముగ్గురు మరణించారు. 1966లో స్పెయిన్లో B-52తో ఢీకొని నలుగురు మరణించారు. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం ఇరాన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా సైనిక ఆపరేషన్లపై మరింత దృష్టిని పెంచింది.దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. -
దుబాయ్లో జరిమానాలపై కొత్త చట్టానికి ఆమోదం
దుబాయ్లో ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు వర్తించే ఉల్లంఘనలు, జరిమానాలపై కొత్త చట్టానికి దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదం తెలిపారు. పారదర్శకత, న్యాయాన్ని పెంపొందించే ఉద్దేశంతో 2026 సంవత్సరానికి సంబంధించి చట్టం నెం.6ను ప్రకటించారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే విధానంపై మరింత స్పష్టత తీసుకొచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు.ఈ చట్టం ప్రధానంగా ప్రభుత్వ స్థాయిలో జరిగే ఉల్లంఘనలకు స్పష్టమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటుచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అధికార దుర్వినియోగాన్ని నిరోధించడం, చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కూడా దీని ఉద్దేశంగా ఉంది. ఉల్లంఘనలను వాటి తీవ్రత ఆధారంగా చిన్న, మధ్యస్థ, తీవ్రమైనవిగా వర్గీకరించి, ప్రతి ఉల్లంఘనకు తగిన శిక్షను విధించేలా నిబంధనలు రూపొందించారు.చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులు లేదా సంస్థలపై అధికారులు పలు రకాల చర్యలు తీసుకోవచ్చు. జరిమానా విధించే ముందు లేదా తరువాత పరిస్థితిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేయవచ్చు. అవసరమైతే సంస్థలను ఆరు నెలల వరకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేయవచ్చు. అలాగే వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చిన లైసెన్సులు, అనుమతులను రద్దు చేయడం లేదా సవరించడం కూడా చేయవచ్చు. ఉల్లంఘనలకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా కార్యకలాపాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే అధికారాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తోంది.ఇక చర్యల ప్రక్రియలో పారదర్శకతను తప్పనిసరి చేశారు. ప్రతి ఉల్లంఘనను స్పష్టంగా నిర్వచించాల్సి ఉంటుంది. జరిమానాలు లేదా శిక్షలు నిర్ణయించే సమయంలో ఉల్లంఘన తీవ్రత, అది పునరావృతమైందా లేదా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.క్రమశిక్షణా చర్యలను ప్రకటించే ముందు సంబంధిత ప్రభుత్వ సంస్థల అధిపతుల అనుమతి తప్పనిసరి. అదేవిధంగా సమాచారం విడుదలలో దుబాయ్ మీడియా ఆఫీస్తో సమన్వయం చేయాలని కూడా నిబంధనలు పేర్కొంటున్నాయి.శాంతి భద్రతను కాపాడుతూ చట్టబద్ధమైన పాలనను మరింత బలోపేతం చేయడమే ఈ కొత్త ఉత్తర్వుల ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీనికి విరుద్ధంగా ఉన్న పాత చట్టాలు రద్దయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
‘ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది’
వాషింగ్టన్: ఇరాన్ గగనతలం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ ఆయుధ నిల్వలు బలహీనపడిన క్రమంలో ఆ దేశ గగనతలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నామని అమెరికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్పై కొనసాగిస్తున్న యుద్ధంపై అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు చేశాం. ఫైటర్ జెట్లు, బాంబర్లతో ఇరాన్పై దాడులు చేశాం. ఇరాన్ అణు సామర్థ్యాలు, మిస్సైల్ స్థావరాలు, నేవీ వ్యవస్థను నాశనం చేయడమే మా టార్గెట్. ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు ఆపేది లేదు. యుద్ధంలో ఏడుగురు అమెరికా సైనికులు మృతి చెందారు. 140 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఇరాన్ ఒంటరి అయిపోయింది. ఇరాన్ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇరాన్పై దాడులను మరింత ఉధృతం చేస్తాం’ అని అమెరికా పేర్కొంది.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహుల సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ తమకు సరెండర్ కాబోతుందన్న ట్రంప్.. తమ దాడులకు ఇరాన్ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు.మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని నెతన్యాహు అన్నారు. -
భారీ పేలుళ్లు : బుర్జ్ ఖలీఫా చుట్టూ దట్టమైన పొగ
ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్దాడులు, ఇరాన్ ప్రతిదాడులోగల్ఫ్ ప్రాంతం గజగజ లాడుతోంది. ఈ రోజు (శుక్రవారం)దుబాయ్లోని కొన్నిప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) దగ్గర దట్టమైన పొగ వ్యాపించిన వీడియోలు వైరల్గా మారాయి.బుర్జ్ ఖలీఫా దగ్గర కనిపించిన పొగఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలలో ఐకానిక్ బుర్జ్ ఖలీఫా భవనాల పైన నుండి భారీ పొగ ఎగసిపడుతున్నట్లు కనిపించింది. ఆకాశహర్మ్యాల మీదుగా పొగ మేఘాలు అలుముకున్నాయి. ఈ ఘటననగరంలోని కేంద్ర వ్యాపార మండలాల్లో ఆందోళనను పెంచింది. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల భవనాల్లో గణనీయమైన ప్రకంపనలు వచ్చాయని సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు వెల్లడించారు.Scenes from downtown #Dubai, United Arab Emirates. The impact on a building in the area can be seen. pic.twitter.com/jg8JrXBXdK— Mina (@Mina696645851) March 13, 2026 >ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ ప్రతినిధి ప్రకారం, మొదటి పేలుడు సమీపంలోని నిర్మాణాలను కదిలించేంత బలంగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండో పెద్ద పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలోని నివాసితులు, కార్మికులలో ఆందోళన రేపింది.అయితే ఇది స్వల్ప నష్టం మాత్రమేనని అధికారులు ప్రకటించారు. -
యుద్ధ సంక్షోభం : రూ. 19 లక్షల కోట్లు ఢమాల్!
Iran War: ప్రపంచవ్యాప్తంగా ఏ ఉపద్రం వచ్చినా, భౌగోళికంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా ముఖ్యంగా యుద్ధం వచ్చిందంటే ముందుగా ప్రభావితమయ్యేది దేశీయ స్టాక్ మార్కెట్లు. తాజాగా ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మధ్యప్రాచ్య అనిశ్చితి, హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు సంక్షోభం భారత మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా గత నాలుగేళ్లలో అత్యంత దారుణమైన వారంగా ఈ వారం నిలిచింది. ఈ దారుణ పతనంతో పెట్టుబడిదారులు దాదాపు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ అనిశ్చితి ప్రపంచ మార్కెట్లను కూడా బలహీనపరిచిందని, కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు విశ్లేషకులు.75వేల దిగువకు సెన్సెక్స్, మార్కెట్ క్యాప్ నష్టంఈ వారం వీకెండ్ శుక్రవారం రోజు సెన్సెక్స్ 1,442 పాయింట్లు కోల్పోయి 75వేల పాయింట్ల (74,592 పాయింట్ల వద్ద ముగిసింది)దిగువకు చేరింది. ఒక రోజులో దాదాపు రూ.9.8 లక్షల కోట్ల సందప తుడిచి పెట్టుకుపోయింది. ఫలితంగా రూ.19 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్ వాల్యుయేషన్ రూ.430 లక్షల కోట్లకు చేరింది. FIIలు అమ్మకాల భారీగా కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టీ టాటా స్టీల్ , SBI, భారత్ ఎలక్ట్రానిక్స్ , మారుతి టాప్ లూజర్స్గా నిలిచాయి. మునుపటి శుక్రవారం అంటే మార్చి 6న బీఎస్సీ సెన్సెక్స్ 78,918 వద్ద ముగిసింది. అప్పటి మార్కెట్ వాల్యుయేషన్ రూ.449.35 లక్షల కోట్లుగా ఉంది.ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్నిఫ్టీ నష్టాలు ఇలా..ఇక నిఫ్టీ 468 పాయింట్లు క్షీణించి 23,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. జనవరి 5న నమోదైన గరిష్ట స్థాయి 26,373 పాయింట్లు. అంటే 10 శాతం క్షీణించింది. భారత మార్కెట్లు చివరిసారిగా ఈ స్థాయిలో నష్టాలను చవిచూసింది 2022 జూన్లో మాత్రమే. బ్రెంట్ ముడిచమురు ధరలు బ్యారెల్కు 102 డాలర్లకు పెరగడం ఈ వారం పెట్టుబడిదారులకు ఒక పీడకల చెప్పవచ్చు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలుయుద్ధం చమురు సంక్షోభం- మార్కెట్లు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చమురు సరఫరాపై ప్రభావం ముడిచమురు ధరలను అమాంతం పెరిగాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా, జపాన్, చైనా , హాంకాంగ్ల సూచీలు దిగువన ముగిశాయి. (తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు) -
ఇరాన్ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్ వార్నింగ్!
మరో రెండు నెలల్లో ఫుట్బాల్ సాకర్ ఫీవర్ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్కప్కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాకర్ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిపా వరల్డ్కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్సోషల్ వేదికగా స్పందించారు. ‘ఇరాన్ ఫుట్బాల్ జట్టు సాకర్ ప్రపంచకప్లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ వరల్డ్కప్కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో (4-2) ఫ్రాన్స్ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్కప్ జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా! -
వారు సజీవంగా లేరు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ తమకు సరెండర్ కాబోతుందన్న ట్రంప్.. తమ దాడులకు ఇరాన్ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు.మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని నెతన్యాహు అన్నారు. -
తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు
ఇరాన్ కొత్త అత్యున్నత నాయకుడు మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపైపలు అనుమానాలు హల్చల్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న భిన్నమైన కథనాల ప్రకారం శత్రు పక్షం దాడిలో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కాలు తీసేసారని, కోమాలో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణఘేదీ లేనప్పటికీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.ది సన్ నివేదిక ప్రకారం, మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని బ్రిటీష్ పత్రిక 'ద సన్' (The Sun) నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 56 ఏళ్ల కుమారుడు మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి ,ప్రస్తుతం టెహ్రాన్లో చికిత్స పొందుతున్నాడని నివేదించింది. తండ్రిమరణానికి దారి తీసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీకి ఒక కాలు (లేదా రెండు కాళ్లు) తొలగించారని, కాలేయం లేదా కడుపు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన టెహ్రాన్లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్లో కోమాలో ఉన్నట్లు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.దీనికి తోడు ఇరాన్ సుప్రీంగా ఎన్నికైన తరువాత తొలిసారి మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ఈ కొత్త ఫోటోలను ఇరాన్ మీడియా విడుదల చేసినప్పటికీ, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించినవి లేదా పాత ఫోటోలను ఎడిట్ చేసినవనీ చాలా సంస్థలు అనుమానిస్తున్నాయి.అయితే ఏఐ ఫోటో అన్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కుమారుడు యూసుఫ్ ఖండించారు. మొజ్తబా ఖమేనీ "సురక్షితంగా, ఆరోగ్యంగా" ఉన్నారని , భద్రతా కారణాల దృష్ట్యా రహస్య ప్రదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్)మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ, ఖమేనా గాయపడి ఉండవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించడంతో అసలు మొజ్తబా ఖమేనీ సజీవంగా ఉన్నారా లేదా అనుమానాలు మరింతగా చెలరేగాయి. అయితే ఖమేనీ కోమాలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు అదికారిక ధృవీకరణ ఏదీ లేదుకాగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో (Operation Epic Fury) మొజ్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీనికోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే తల్లి, భార్యను, కొడుకును, అక్కను, ఆమె భర్తను, వారి పిల్లలు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు -
మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి ఇరాన్పై యుద్దాన్ని మొదలు పెట్టిన తరువాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ దేశం "ఎప్పటికన్నా బలంగా మారుతోంది" అని గురువారం ఒక వార్తా సమావేశంలో నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై బలవంతంగా దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీని చంపేస్తామని ఒక రహస్య బెదిరింపు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని పేర్కొన్నారు. אתמול במסיבת העיתונאים עמדתי על היעדים הברורים של המערכה: פגיעה במשטר הטרור באיראן, המשך המאבק מול שלוחותיו, והבטחת ביטחונה ועתידה של ישראל.אנחנו לא מחכים. אנחנו יוזמים, אנחנו תוקפים ואנחנו עושים זאת בעוצמה.צפו בדברים המלאים >> pic.twitter.com/hubJWVdiKQ— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 13, 2026 (ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్) ఇరాన్ తన అణు, బాలిస్టిక్ ప్రాజెక్టులను భూగర్భంలోకి తరలించకుండా తమ దళాలు నిరోధించాయనీ, ఇరాన్ ఇకపై అదే ఇరాన్ కాదు, పేర్కొన్నారు. అంతేకాదు తాము ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను చంపాయని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), బాసిజ్ దళాలకు తీవ్ర నష్టం కలిగించాయని నెతన్యాహు అన్నారు.ఇదీ చదవండి: లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం! -
ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడులు, 14వ రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ చేస్తున్న ప్రతి దాడులు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై స్పందిస్తూ, పరిస్థితి "చాలా వేగంగా మారుతోంది" అని, అతి త్వరలో ఇరాన్మాకు లొంగిపోనుందంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ కొత్త బెదిరింపు తర్వాత ఇరాన్, లెబనాన్లో కొత్త దాడులు జరిగినట్లు తెలుస్తోంది.యుద్ధంలో తన పక్షం గెలిచిందని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్, హార్ముజ్ జలసంధి మూసివేతతో ఉత్పన్నమైన సరఫరా సమస్యల కారణంగా చమురు ధరలు పెరగడం ద్వారా అమెరికా గణనీయమైన డబ్బు సంపాదించే అవకాశం ఉందని గురువారం అన్నారు. ఇరాన్ ఇంధన బెదిరింపులు చేస్తున్నప్పటికీ, అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "అమెరికా ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు, కాబట్టి చమురు ధరలు పెరిగినప్పుడు, మేము చాలా డబ్బు సంపాదిస్తాము." ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండకుండా అడ్డుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొనడం చర్చకు దారి తీసింది. ఇరాక్లో విమాన ప్రమాదం: అమెరికా విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే శత్రుదాడిలో కాకుండా ఇరాక్లో అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ (ఇంధనం నింపే) విమానం ప్రమాదానికి గురైంది. మరో విమానంతో జరిగిన ఢీకొనడం వల్ల జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాక్లోని కుర్దిస్తాన్ రీజియన్లో జరిగిన దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దీనిని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించారు.UAE పై ఇరాన్ దాడులుమార్చి 12న ఇరాన్ నుండి ప్రయోగించిన 10 బాలిస్టిక్ క్షిపణులు మరియు 26 డ్రోన్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విజయవంతంగా అడ్డుకుంది.దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు UAE మొత్తం 278 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు మరియు 1,540 డ్రోన్లను గాలిలోనే ధ్వంసం చేసింది. దుబాయ్ మధ్య భాగంలో క్షిపణి శకలాలు పడటంతో ఒక భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఇది ఇలా ఉంటే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశాలకు వెళ్లాల్సిన ప్రవాసులకు యూఏఈ భారీ ఊరట కల్పించింది. ఫిబ్రవరి 28 లేదా ఆ తర్వాత వీసా గడువు ముగిసిన వారు, కొత్త ఎంట్రీ పర్మిట్ అవసరం లేకుండానే మార్చి 31 వరకు ఉండేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు యుద్ధ పరిణామాలపై తొలిసారి స్పందించిన ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ పోరాడుతూనే ఉంటామన , హోర్ముజ్ జలసంధిని మూసివేస్తానని గురువారం నాటి ఒక టెలివిజన్ ప్రెజెంటర్ చదివిన సందేశంలో స్పష్టం చేశారు. రక్తం ధారబోసిన తమ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చు కుంటామని ప్రకటించాడు.కాగా పశ్చిమాసియా యుద్ధం రెండవ వారంలోకి అడుగుపెడుతుండగా ఇరు పక్షాలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తుండటం గమనార్హం. ఈ అనూహ్య యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 2వేలకు పైగా పెరిగింది. వీరిలో ఎక్కువమంది ఇరాన్లోనే ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. ఇరు పక్షాల భీకర దాడుల మధ్య కొనసాగుతున్న యుద్ధం లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది.


