ఇరాన్లోని కరాజ్ నగరంలో ఉన్న సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆ దేశ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఈ కేంద్రం బాలిస్టిక్ క్షిపణులు అసెంబుల్ చేయడానికి ఉపయోగించబడేదని.. అమెరికన్లు, పొరుగు దేశాల వాణిజ్య నౌకాయానానికి ముప్పు కలిగిస్తుండిందని CENTCOM పేర్కొంది.
అమెరికా వైమానిక దళం నిర్వహించిన ఈ దాడిలో కరాజ్ ప్లాంట్ పూర్తిగా నేలమట్టమైంది. CENTCOM విడుదల చేసిన ఏరియల్ ఫోటోలు ఆ సదుపాయం పూర్తిగా ధ్వంసమైందని చూపిస్తున్నాయి. ఈ ప్లాంట్ ఇరాన్ క్షిపణి సామర్థ్యానికి కీలకమైన కేంద్రంగా ఉండింది.
Prior to Operation Epic Fury, the Iranian regime used the Karaj Surface-to-Surface Missile Plant to assemble ballistic missiles that threatened Americans, neighboring countries, and commercial shipping. The photo dated March 1, 2026, shows the plant prior to U.S. strikes. The… pic.twitter.com/QEs5toZQpX
— U.S. Central Command (@CENTCOM) March 19, 2026
కరాజ్ ప్లాంట్ పూర్తిగా నిరుపయోగం కావడం వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం మరింత బలహీనపడే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానానికి కూడా ముప్పు తగ్గుతుంది.
ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్-అమెరికా ఎన్ని దెబ్బలు కొట్టినా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ గల్ఫ్ దేశాల ఇంధన సముదాయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది.
సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులకు ప్రతిగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది.


