breaking news
Mahabubabad
-
దీప ప్రజ్వలనం.. సర్వం శుభకరం
హన్మకొండ కల్చరల్: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అంటే శివకేశవులకు అత్యంత ప్రీతికరం. దేవుళ్లు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేసిన సమయంలో మొదట హాలాహలం (విషం) పుడుతుంది. ఈ హాలాహలంతో లోకానికి ముప్పు కలు గుతుందని శివుడు దానిని సేవిస్తాడు. ఈ సమయంలో పార్వతిదేవి తన భర్త(శివుడు) కంఠాన్ని పట్టుకుని తన భర్తకు ఏ ఆపద కలగొద్దని కోరుకుంటుంది. తన పతికి ఏ ఆపద కలగని పక్షంలో జ్వాలాతోరణం వెలిగిస్తానని మొక్కుకుందని పురాణాల్లో ఉందని పలువురు వేదపండితులు చెబుతున్నారు. ఆ విధంగా దేవాలయాల్లో ఈ రోజు జ్వాలా తోరణాలు వెలిగించే సంప్రదాయం వచ్చింది. ఇలా కార్తీకపౌర్ణమిని నిర్వహించుకుంటా టరు. పూర్వం ప్రతీ ఇంటి ఎదుట ప్రతీ రోజు గూ ళ్లలో ప్రదోషకాలవేళ దీపాలు వెలిగించేవారు. అ యితే ఇలా అందరికీ అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే అలా వీలు కానీ వారు కార్తీకపౌర్ణమి రో జున ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. తెల్లవారుజాముకు ముందే స్నానాలు ఆచరించి తులసి మొక్క వద్ద ఉసిరిక కొమ్మను నాటి దీపాలు వెలిగిస్తారు. ఇతర రోజుల్లో కంటే కార్తీకమాసంలో దీపారాధన చేయడం విశిష్టమైనదిగా భావిస్తారు. సంవత్సరానికి 365 రోజులు. ఈ ప్రకారం ఇంట్లోని ఒక్కొక్క వ్యక్తి పేరుమీద 365 వత్తులు వెలిగిస్తారు. ఆ విధంగా సంవత్సరం మొత్తం దైవపూజ చేసిన ఫలం లభిస్తుందని భావిస్తారు. ఈ క్రమంలో బుధవారం(నేడు) కార్తీక పౌర్ణమి సందర్భంగా వేయిస్తంభాల దేవాలయంలో సాయంత్రం లక్షదీపోత్సవం, భద్రకాళి దేవాలయంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. అలాగే, పలు దేవాలయాల్లో దీపాలు వెలిగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. నేడు వేయిస్తంభాల దేవాలయంలో వేడుకలు.. చారిత్రక వేయిస్తంభాలదేవాలయంలో బుధవారం నిర్వహించనున్న కార్తీకపౌర్ణమి వేడుకలకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. భక్తుల రద్దీని తట్టుకోవడానికి క్యూలైన్లు, దీపాలు వెలుగించుకోవడానికి మట్టిప్రమిదలు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతం, మూలగణపతికి పంచామృతాభిషేకం, రుద్రేశ్వరుడికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. అనంతరం రాత్రి 10గంటల వరకు భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేసినట్లు దేవాలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్, ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.నేడు కార్తీక పౌర్ణమి, ఉసిరిక పున్నమి దీపాలు, వత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న భక్తులు పలు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు భక్తజనంతో కిటకిటలాడునున్న శివాలయాలుదీపావళి తర్వాత అదేస్థాయిలో జరుపుకునే పండుగ కార్తీకపౌర్ణమి. దీపావళి రోజున నోములు జరుపుకోవడం వీలుపడని వారు ఈరోజు నోముకుంటారు. ఈ క్రమంలో మంగళవారం నగరంలోని పలుకూడళ్ల వద్ద ఉసిరికొమ్మలు, కాయలు, నోము కుండలు, సాంబ్రాణి, పట్టు, నూలు నోము ధారాలు, దీపంతులు, వత్తులు, పూలు తదితర పూజాసామగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి. పూర్వం భూగోళం ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి ఉసిరికాయను ఉపమానంగా చూపేవారు. భూమికి మరోపేరు ధాత్రి. అలాగే, ఉసిరికను కూడా ధాత్రి అనే పేరుతోనే పిలుస్తారు. కార్తీకమాసంలో విష్ణు సంబంధ దేవతావృక్షమైన ఉసిరిక చెట్టును పూజించడం సంప్రదాయం. ఉసిరికను భూగోళంగా భావిస్తారు. అందుకే ఉసిరికపై దీపాలు వెలిగించడం అంటే భూగోళంపై వెలుతురు నింపడమని భావిస్తారు. నీటిలో ఉసిరిక ఆకులు వేసి తెల్లవారుజామునే స్నానం ఆచరించి బిల్వదళాలతో శివపూజ, తులసీదళాలతో విష్ణుపూజ చేస్తారు.కార్తీకదీపోత్సవం.. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు లక్షదీపార్చన, లక్షవత్తుల పూజ వైభవంగా నిర్వహించనున్నామని ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సాయంత్రం 5గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి , పేరిణి నృత్యాలు, భజనలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారని తెలిపారు. -
ఉత్సాహంగా ఖోఖో ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్ మైదానంలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఖోఖో ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు 500 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ప్రతిభ ఆధారంగా త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాక్టీసింగ్ హైస్కూల్ హెచ్ఎం జగన్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్రెడ్డి, కుమార్, ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్ప్రసాద్, పీడీలు కోట సతీశ్, బరుపాటి గోపి, డీఎస్ఏ ఖోఖో కోచ్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో రాణించాలి
నెల్లికుదురు: ప్రతీ ఆర్చరీ (విలువిద్య) క్రీడాకారుడు అంతర్జాతీయ పోటీల్లో రాణించి దేశానికి పేరు తీసుకురావాలని ఎంఈఓ రాందాస్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ గండి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి 69వ ఎస్జీఫ్ ఆర్చరీ పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, మెడల్స్తో పాటు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఎంపిక చేసిన క్రీడాకారులు మణిపూర్లో జరిగే జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి జ్యోతి, జోనల్ సెక్రటరీ ఎం.డి. ఇమామ్, మల్లయ్య, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు అయిలయ్య, ప్రణయ్, ప్రభాకర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓ రాందాస్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ గండి సత్యనారాయణ -
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: భారీ వర్షాలతో ధర్మసాగర్, వేలేరు మండలాల్లో జరిగిన నష్టంపై రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి అంచనాల నివేదిక ఇవ్వాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి రెండు మండలాల పరిస్థితిపై మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలన్నారు. వర్షాలతో ధాన్యం కొట్టుకుపోయిన వారికి పంట నష్టం కింద పరిహారం చెల్లించాలని, పశువులు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే సాయం అందించాలని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్ధరణ పనులు వారం రోజుల్లో పూర్తిచేయాలని పీఆర్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఉనికిచర్ల, రాపాకపల్లి రోడ్డు మరమ్మతులు, వేలేరు, కొత్తకొండ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సాగునీటి శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ తుపాను నష్టాలపై అంచనాలను త్వరగా అందజేయాలని, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
పిడుగుపాటుతో రైతు మృతి
●పోచారంలో ఘటన పరకాల : పిడుగుపాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఓ ఎద్దు కూడా మృత్యువాత పడింది. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోస మహిపాల్ (45)తన చేను వద్ద పనిచేస్తుండగా వర్షం మొదలైంది. ఉరుములతో కూడిన వర్షంతో భయపడి తన ఎద్దులను బండికి కట్టేందుకు యత్నించే క్రమంలో పిడుగుపడింది. దీంతో మహిపాల్తోపాటు ఎద్దు మృతి చెందింది. కాగా, కొద్ది సేపట్లో ఇంటికి చేరుకోవాల్సి న మహిపాల్ విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. -
అనారోగ్య కారణాలతో నర్సింగ్ ఆఫీసర్ ఆత్మహత్య
భూపాలపల్లి అర్బన్ : అనారోగ్య కారణాలతో ఓ నర్సింగ్ ఆఫీసర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భూపాలపల్లి సీఐ నరేశ్కుమార్ కథనం ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్కు చెందిన ఇరుప అనిత (30) ఏడాదిన్నర నుంచి భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తోంది. మంజూర్నగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అనిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున అద్దె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేశ్ కుమార్ పేర్కొన్నారు. -
పాలకుర్తికి కార్తీక శోభ..
పాలకుర్తి టౌన్: పాలకుర్తికి కార్తీక శోభ వచ్చింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శబరిమల మకరజ్యోతి మాదిరిగానే క్షీరాద్రి శిఖరం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో మంగళవారం అతిపెద్ద అఖండజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తిరువన్నామలై అరుణాచలం స్ఫూర్తితో పాలకుర్తి క్షీరగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై ఏర్పాటు చేస్తున్న భారీ ప్రమిదలో టన్ను నువ్వుల నూనె, ఆవు నెయ్యి, 2 క్వింటాళ్ల ముద్ద కర్పూరంతో అతిపెద్ద అఖండజ్యోతిని వెలిగించనున్నారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో మూడో అఖండజ్యోతి నిర్వహిస్తోంది. 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా రూపొందించిన దీపభాండాన్ని పాలకుర్తి శిఖరాగ్రవేదికపై ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలొచ్చే భక్తుల సమక్షంలో గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ అఖండజ్యోతి పాలకుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దర్శనమిస్తుంది. కాగా, 2013లో క్షీరగిరిపై అఖండ జ్యోతి దర్శనం ఏర్పాటును ప్రారంభించారు. ముఖ్య అతిఽథులుగా ఉత్తరకాశీ పీఠాధిపతి, ఎమ్మెల్యే సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్శంగా అఖండ జ్యోతి దర్శనం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ఉత్తరకాశీ పీఠాఽధిపతి శ్రీరామానంద ప్రభుజీ, స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హాజరు కానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు వేశారు. నేడు క్షీరగిరిపై అఖండజ్యోతి ముస్తాబైన సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం -
‘బుగులోని’ జాతర ప్రారంభం..
రేగొండ: కార్తీక పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో ఏటా జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలగిరి గ్రామంలోని అర్చకుడు కూర్మచలం వెంకటేశ్వర్లు ఇంట్లో కొలువై ఉన్న స్వామి వారి ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంలో బుగులోని గుట్ట వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఇక్కడ ఉన్న ఇప్ప చెట్టు చుట్టూ రథం తిప్పారు. సాయంత్రం కల్యాణం నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీ సేవలో గుట్టపైకి చేర్చారు. కాగా, స్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 8వతేదీ వరకు కొనసాగనున్నాయి. కల్యాణానికి ప్రత్యేక రఽథం.. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను డప్పుచప్పుళ్లు మధ్య జాతర ప్రాంగణానికి తరలించారు. ఊరేగింపుగా వెళ్తున్న స్వామి వారికి భక్తులు అడుగడుగునా మంగళహారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి నీరాజనాలు పలికారు. సాయంత్రం గుట్ట కింద ఉన్న శివాలయం ప్రాంగణంలో అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్లతో (విగ్రహాలు) స్వామి వారి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలతో పాటు పక్క మండలాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు. అనంతరం సతీసమేతంగా స్వామి వారిని కొండ గుహలో వెలసిన ప్రాంతానికి చేర్చారు. స్వామి వారి రాకతో గుట్ట పై ఉన్న గండ దీపాన్ని వెలిగించారు. దీంతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గుట్టల్లో కార్తీక పౌర్ణమి కాంతులు వెలుగుతున్నాయి. పచ్చని ప్రకృతి, పౌర్ణమి కాంతులు, విద్యుత్ వెలుగుల నడుమ బుగులోని కొండలు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను అలరిస్తున్నాయి. ప్రశాంతంగా నిర్వహించాలి.. బుగులోని జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ నరేశ్ అన్నారు. మంగళవారం జాతర ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతరకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఐలు కరుణాకర్ రావు, మల్లేశ్, ఎస్సైలు రాజేశ్, దివ్య, త్రిలోక్, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా స్వామి వారి కల్యాణం -
యూడైస్లో వివరాలు నమోదు చేయాలి
●హనుమకొండ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్ విద్యారణ్యపురి: ప్రతీ పాఠశాలకు సంబంధించిన ఫిజికల్ లొకేషన్, భౌతిక వనరులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను యూడైస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేశ్ కోరారు. హనుమకొండలోని లష్కర్బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ప్రతీ కాంప్లెక్స్కు ఒక ఉపాధ్యాయుడు, సీఆర్పీలకు యూడైస్లో వివరాలు నమోదు చేసే విధానంపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన పాఠశాల, టీచర్, స్టూడెంట్స్ ప్రొఫైల్పై ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్ ఉపయోగించే విధానాన్ని వివరించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడి, జిల్లా సైన్స్ అధికారి ఎస్. శ్రీనివాసస్వామి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రఘుచంద్రరావు, అసిస్టెంట్ ప్రోగ్రామర్ వినయ్కుమార్, టెక్నికల్ పర్సన్ రాజు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో గొర్రెల వ్యాపారి..
నల్లబెల్లి : అప్పుల బాధతో ఓ గొర్రెల వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిండి కొమురయ్య (55) గేదెలు, గొర్రెల కాపరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అవసరాలు పెరగడంతో కుటుంబ సభ్యులతో చర్చించి నాలుగేళ్ల క్రితం రూ.5 లక్షలు అప్పు చేసి గొర్రెల వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులకు వడ్డీలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీంతో మరింత అప్పు చేశాడు. అప్పులు పెరగడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఇటీవల అప్పు చెల్లించాలని పలువురు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. -
మత్స్య రైతులకు చేప పిల్లల పంపిణీ
మామునూరు: మత్స్యరైతులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసినట్లు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎస్. బింధుమాధురి తెలిపారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మత్స్యరైతులకు ఉచిత చేపపిల్ల లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మంచి నీటి ఆధారిత చేపల పెంపకానికి ఆదరణ ఉంటుందన్నారు. చేపల పెంపక విషయంలో ఎలాంటి సమస్యలున్నా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జి.గణేశ్, ఏ.రాజు, సస్యరక్షణ శాస్త్రవేత్త సాయి కిరణ్, పశువైద్య శాస్త్రవేత్త, తదితరులు పాల్గొన్నారు. -
పనులు వేగవంతం చేయాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మరిపెడ: మాకుల చెరువు కట్ట ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల చెరువును మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాఽథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మరిపెడ పట్టణంలోని మాకుల చెరువు అభివృద్ధికి రూ. 2 కోట్లు కేటాయించడం జరిగిందని, పనులను వేగంగా చేసి పూర్తి చేయాలని సూచించారు. అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లల హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం షెడ్యూల్ ప్రకారం అందించాలన్నారు. తహసీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ విజయానంద్ తదితరులు ఉన్నారు. ఏజెంట్ల పూర్తి వివరాలు ఇవ్వాలి.. మహబూబాబాద్: ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ప్రతిపాదిత ఏజెంట్ల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రాజ కీయ పార్టీల ప్రతినిధులతో బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులు బూ త్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, రాజ కీయ పార్టీ నాయకులు అజయ్ సారథిరెడ్డి, రాజ మౌళి, సురేష్, శ్యాంసుందర్, కిరణ్, రామారావు, కలెక్టరేట్ ఏఓ పవన్కుమార్ పాల్గొన్నారు. -
నేడు కార్తీక పౌర్ణమి
● పట్టణంలో కొనుగోళ్ల సందడి మహబూబాబాద్ రూరల్ : శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం భక్తులు ‘కార్తీక పౌర్ణమి’ వేడుకలను ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈమేరకు జిల్లాలోని పలు శైవక్షేత్రాలు, ఇతర ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆయా ఆలయాల్లో శివలింగాలకు లఘున్యాసపూర్వక, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహి స్తామని అర్చకులు తెలిపారు. దీపాలతో జ్యోతిర్లింగార్చనలు, జ్వాలాతోరణం పూజలు, శివపార్వతుల కల్యాణ వేడుకలు జరుగుతాయన్నారు. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలిగి శుభం చేకూరుతుందని తెలిపారు. ఉసిరి, దీపాంతల కొనుగోలు.. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సంప్రదాయం ప్రకారం భక్తులు తమ ఇళ్ల వద్ద, ఆలయాల్లో ఉసిరి కొమ్మలు, ఉసిరికాయలతో దీపాలు వెలిగిస్తారు. కాగా భక్తులు మానుకోట పట్టణంలో ఉసిరి కొమ్మలు, కాయలు, దీపాంతలు, ఒత్తుల కట్టలు కొనుగోలు చేస్తూ కనిపించారు. -
కొనుగోళ్లలో పారదర్శకతకు ప్రాధాన్యం
● డీసీఎస్ఓ ప్రేమ్కుమార్ పెద్దవంగర: ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని డీసీఎస్ఓ ప్రేమ్కుమార్, డీసీఓ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ మహేందర్, ఏఓ స్వామి నాయక్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పన, ధాన్యం రవాణా, నిల్వ, తేమ శాతం నిర్ధారణ వంటి అంశాలపై అధికారులు చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో పారదర్శకతపై అధికారులు దృష్టి సారించాలని, రైతుల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ కృష్ణవేణి, ఆర్ఐ లష్కర్, ఏపీఏ ఎండీ పాషా, ఏఈఓలు రాజు, యశస్విని, విశ్వశాంతి, సీసీలు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
మక్క రైతు గోస
సాక్షి, మహబూబాబాద్: ఆరుగాలం కష్టపడి మక్కలు పండిస్తే.. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీతో మక్క రైతు గోసపడుతున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఒకసారి పంటలు నమోదు చేయలేదని, మరోసారి తేమ, దుమ్ము ఉందనే నెపంతో మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో క్వింటాకు రూ. 600 వరకు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. దళారుల ప్రమేయం లేకుండా ఉత్పత్తులు కొనుగోలు, ఎరువులు, విత్తనాల పంపిణీలో పారదర్శకత ఉండాలని ప్రభుత్వం ప్రతీ గ్రామంలో పంటల సాగు వివరాలు నమోదు చేస్తోంది. ఈ నమోదు ఆధారంగానే ఉత్పత్తులను మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తోంది. రైతుల ఆధార్, పట్టాదారు పాసు పుస్తకంలోని నంబర్ ఆధారంగా ఎంత భూమిలో ఏ పంట సాగుచేశారని చూసి కొనుగోలు చేస్తున్నారు. అయితే వ్యవసాయశాఖ అధికారులు పొలాల వద్దకు వెళ్లి నమో దు చేయకుండా.. కార్యాలయాల్లో కూర్చొని నమో దు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొందరు రైతుల పంటల సాగు వివరాలు ఆన్లైన్లో పొందుపర్చలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉత్పత్తులు అమ్మేందుకు వెళ్లిన రైతులకు శాపంగా మారింది. మీ పేరున భూమి ఉందని, అయితే పంటలు సాగు వివరాలు లేవని, మీ ఉత్పత్తులు కొనమని మార్క్ఫెడ్కు మక్కలను తీసుకెళ్లిన రైతులకు అధికారులు చెప్పి వెనకకు పంపిస్తున్నారు. కొర్రీలు పెడుతున్న సొసైటీలు మక్కలను మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నానరు . దీంతో జిల్లాలోని కేసముద్రం మండలం ధన్నసరి, కేసముద్రం, గూడూరు, మహబూబాబాద్, బయ్యారం, గార్ల, పొగుళ్లపల్లి, తొర్రూరు పీఏసీఎస్లో కొనుగోలు చేసేందుకు గత నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఒక్కొక్కటి ప్రారంభించారు. అయితే తేమ శాతం ఎక్కువగా ఉందని, దుమ్ము ఉందని, వానకు తడిసి పాడయ్యాయని, గింజ నాసిరకంగా ఉందనే నెపంతో సొసైటీల్లో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్రాలు ప్రారంభించి పదిరోజులు కావొస్తున్నా.. ఒక ధన్నసరి కేంద్రంలో 56 మంది రైతుల వద్ద 141.8 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలే కొనుగోలు చేశారు. మిగిలిన ఎనిమిది సెంటర్లలో సోమవారం వరకు ఒక్క కిలో మక్కలు కూడా కొనుగోలు చేయలేదు. వ్యాపారుల దోపిడీ మక్కల కొనుగోళ్లలో పీఏసీఎస్లు రకరకాల కొర్రీలు పెడుతున్నాయి. ఇదే అదునుగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 18,089 మంది రైతులు 62,621ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఇందుకుగాను 1,56,553 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మక్కలకు కనీస మద్దతు ధర రూ. 2,400 ప్రభుత్వం ప్రకటించింది. పండిన పంట అంతా ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొంటుందని భావించిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. పంటలు చేతికి వచ్చి నెలరోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పదిరోజులు అయ్యింది. కానీ కేవలం ఇప్పటి వరకు 141.8 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. అంటే ఇప్పటి వరకు 50వేల మెట్రిక్ టన్నులకు పైగా మక్కలు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మారు. అదీ కూడా క్వింటాకు రూ.1,800కే అమ్మినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల వివరాలు నమోదు చేయలేదని కొనమంటున్న మార్క్ఫెడ్ నమోదైన రైతుల పంటల్లో కొర్రీలు ప్రైవేట్ వ్యాపారుల సిండికేట్తో తక్కువ ధరకు కొనుగోళ్లు ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అధికారులుఅకాలవర్షం.. తడిసిన మక్కలు కేసముద్రం: అకాల వర్షంతో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఓపెన్యార్డులో రైతులు ఆరబోసుకున్న మక్కలు తడిసిముద్దయ్యాయి. మంగళవారం ఒక్కసారిగా కురిసి న వర్షంతో మక్కలు తడిసిపోయాయి. ఈక్రమంలో వరద ప్రవాహంలోనూ కొట్టుకుపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని ఆయా గ్రామాల్లో పత్తి, వరి పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి. -
చెరువుకు చేప..
నెహ్రూసెంటర్: జిల్లాలోని చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 1,229 చెరువుల్లో 4.20 కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతించగా మత్స్యశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈమేరకు నేటి నుంచి చేప పిల్లలను చెరువుల్లో పోయనున్నారు. గతేడాది 50శాతం చేప పిల్లలను మాత్రమే చెరువుల్లో వదలగా.. ప్రస్తుతం 4.20 కోట్ల పిల్లలను పోయనున్నారు. అయితే ఆలస్యంగా చేప పిల్లలను వదులుతున్నారని, ఆశించిన మేర ఎదగవని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 1,229 చెరువుల్లో.. జిల్లాలోని 1,229 చెరువుల్లో 4.20 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆయా చెరువుల విస్తీర్ణం ఆధారంగా చిన్న చెరువుల్లో 35–40ఎంఎం సైజు 2.02 కోట్ల చేప పిల్లలు, పెద్ద చెరువుల్లో 80–100 ఎంఎం సైజు 2.20 కోట్ల వివిధ రకాల చేప పిల్లలను వదలనున్నారు. జిల్లాలో 205 మత్స్యశాఖ సొసైటీలు ఉండగా.. చేప పిల్లల పంపిణీ ద్వారా సుమారు 15,437 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా ఏడాదంతా ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా వేలాదిమందికి జీవనాధారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతించగా చెరువుల్లో వదిలేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాం. జిల్లాలోని అన్ని చెరువుల్లో త్వరలోనే పంపిణీ పూర్తి చేస్తాం. మత్స్యకారులు సద్వి నియోగం చేసుకోవాలి. – శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి 1,229 చెరువుల్లో 4.20కోట్ల చేప పిల్లలు పోయడమే లక్ష్యం నేటి నుంచి పంపిణీ షురూ.. జిల్లాలో 205 మత్స్య సొసైటీలు, 15,437 మంది సభ్యులు -
పంటలు నమోదు చేయించుకోవాలి
గూడూరు: రైతులు తమ పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. మండలంలోని బొల్లెపల్లిలో మంగళవారం పంటల నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి రైతుల పంటలు నమోదు చేయాలని సూచించారు. అదే విధంగా కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్మాలిక్, ఏఈఓ వినయ్ పాల్గొన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండిమహబూబాబాద్ రూరల్: వివాదాలు పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయని, కలిసిపోదామని ఒక నిర్ణయానికి వస్తే వివాదాలు ముగుస్తాయని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ.. ఉచిత న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా కోర్టులో మెగా స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తారని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివాదాస్పద కేసుల విషయంలో కోర్టుకు హాజరై రాజీ చేసుకుంటే ఆ కేసులు పూర్తిగా తొలగిస్తారని పేర్కొన్నారు. వాహన ప్రమాద కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్నచిన్న దొంగతనాల కేసులు, ఇతర రాజీ చేయదగిన కేసులను మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తారని తెలిపారు. ఫిర్యాదుదారుడు, నిందితుడు ఇద్దరు తమ ఆధార్ కార్డు తీసుకుని మహబూబాబాద్ కోర్టుకు హాజరుకావాలని కోరారు. పూర్తి సమాచారం కోసం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. ఎమ్మెల్యే చెప్పినా పట్టింపులేదు● ఉపాధ్యాయుల బదిలీలపై చర్యలేవి ● అనంతారం మోడల్ స్కూల్లో మళ్లీ గొడవలు!మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపం, తరచూ గొడవల వల్ల విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. ఈమేరకు పదిరోజుల క్రితం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ వెంటనే స్పందించి మోడల్ స్కూల్ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులను పట్టించుకోని, సమన్వయ లోపం ఉన్న ఉపాధ్యాయులను బదిలీ చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ ఉపాధ్యాయుల మధ్య అంతర్గతంగా చిన్నచిన్న గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులపై బదిలీ చర్యలు తీసుకుంటేనే స్కూల్లో చదువులు సాఫీగా సాగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఖాళీ స్థలాలు శుభ్రం చేయించాలి
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలి. పందులు, దోమల సంఖ్య పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 13వార్డులో నా ఇంటి పక్కనే మాలె నాగేశ్వర్రావు అనే వ్యాపారి ఖాళీ స్థలం ఉంది. దానిని శుభ్రం చేయాలని చెబితే పట్టించుకోవడం లేదు. అందుకే ప్రజావాణిలో వినతి అందజేసిన. – మేకల శ్రీనివాస్, మానుకోట ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు చేయలేదు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నా పేరు రాలేదు. నాలుగుసార్లు ప్రజావాణిలో దరఖాస్తులు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు. దివ్యాంగుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడం లేదు. అధికారులు ఇల్లు మంజూరు చేయాలి. – బండారి ఽశ్రీనివాస్, దివ్యాంగుడు, గార్ల -
రెండో రోజు పోటాపోటీగా ఆర్చరీ పోటీలు
నెల్లికుదురు: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆర్చరీ (విలువిద్య) పోటీలు సోమవారం రెండో రోజు పోటాపోటీగా సాగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 250 మంది బాలబాలికలు రెండో రోజు క్రీడల్లో పాల్గొన్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ జి.సత్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ అయిలయ్య తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకరెడ్డి, ఎంఈఓ రామ్దాస్, హెచ్ఎంలు రవి, శంకర్, ప్రణయ్, ప్రభు, సునీత, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలు
డోర్నకల్: డోర్నకల్లో నిర్వహించిన 69వ ఎస్జీ ఎఫ్ రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలు సోమవారం ముగిశాయి. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన పోటీల్లో పది ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీ డాకారులు పాల్గొన్నారు. బాలురు, బాలికల విభా గాల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన వారిని నవంబర్ 26 నుంచి అరుణాచల్ప్రదేశ్లో జరగనున్న 69వ ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బాలికలకు సంబంధించి 44 కేజీల విభాగంలో బి.భాగిత, 48 కేజీల విభాగంలో ఎం. సహస్ర, 53 కేజీల విభాగంలో తానిశ్రీ, 58 కేజీల విభాగంలో టి.అర్చన, 63 కేజీల విభాగంలో జి.అంజలి, 69 కేజీల విభాగంలో వి.హరిత, 77 కేజీల విభాగంలో కె.సంయుక్త, 77 కేజీల విభాగంలో బి.తోషిని విజ యం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. బాలురకు సంబంధించి 56 కే జీల విభాగంలో బి.నందకిశోర్, 60 కేజీల విభాగంలో సి.హెచ్. దీపక్, 65 కేజీల విభాగంలో ఎన్. సిద్దు, 71 కేజీల విభాగంలో కె.ధనుశ్, 79 కేజీల విభాగంలో ఎస్. ముజీబ్, 88 కేజీల విభాగంలో సి.హెచ్. శరత్చంద్ర, 98 కేజీల విభాగంలో బి.నౌశిక్, 98 కేజీల ప్లస్ విభాగంలో కె.అభిషేక్ విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జేఎన్ఎస్లో ముగిసిన జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు.. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు కొనసాగిన ఎస్జీఎఫ్ అండర్–14, 17 బాలబాలికల రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వి. ప్రశాంత్ తెలిపారు. ముగింపు సందర్భంగా విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జూడో క్రీడాకారులు ఈ నెలలో మణిపూర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని, జిమ్నాస్టిక్స్ విజేతలను డిసెంబర్లో కోల్కతాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, భూపాలపల్లి డీవైఎస్ఓలు గుగులోత్ అశోక్కుమార్, సి.హెచ్. రఘు, టీజీ పీఈటీల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి. సుధాకర్, జిల్లా అద్యక్షుడు ఎస్. పార్థసారథి, ప్రధాన కార్యదర్శి కె. మల్లారెడ్డి, టీఎస్ పీఈటీల సంఘం అధ్యక్షుడు ఎ. ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి. కుమార్, సి.హెచ్. పెద్దిరాజు, ఎం. సురేశ్బాబు, ఎస్. శ్రీలత, పీడీలు ఆర్. సుభాష్, సి.హెచ్. వెంకటేశ్వర్లు, రవీంద్రప్రసాద్, నీలం సురేశ్, రజిత, హరీశ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్ల ఎంపిక -
నిండు ప్రాణం
క్షణం ఆలస్యం విలువ..అంబులెన్స్కు దారి ఇవ్వడం సామాజిక బాధ్యతకాజీపేట: అంబులెన్స్ ప్రాణదాత. రహదారులపై ప్రమాదం, అత్యవసర పరిస్థితి, పురిటి నొప్పులు, గుండెపోటు.. ఇలా కారణం ఏదైనా ఫోన్ చేయగానే వెంటనే వచ్చి బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లే సంజీవని. ఈ క్రమంలో అంబులెన్స్ కూత (సైరన్) ఎక్కడ వినిపించినా తక్షణం వాహనాన్ని ప క్కకు మళ్లించి దారివ్వడం పౌరుడి విధి. అంబులె న్స్కు ట్రాఫిక్ నిబంధనలు కూడా వర్తించవు. అంటే ఆ వాహన ప్రయాణం నిరంతరంగా సాగా ల్సిన అవసరం ఉంటుంది. అయితే అంబులెన్స్కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. అత్యవసర సమయంలో వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేస్తాం. అదే సమయంలో మన వెనుక వచ్చే ఆ వాహనానికి దారి ఇవ్వడం మరచిపోతాం. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, సిగ్నల్ పాయింట్ల వద్ద దారి ఇవ్వకుండా వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్ను కూ డా సాధారణ వాహనంగానే ఎక్కువ మంది భావి స్తున్నారు. కొందరు సామాజిక బాధ్యతగా దారి ఇవ్వాలని చెప్పినా ఎగతాళి చేసేవారు కూడా ఎందరో. ఈ పరిస్థితిపై పలువురు సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా దారి ఇవ్వాలి.. అంబులెన్స్కు దారి ఇవ్వడం సామాజిక బాధ్యత. ఈ విషయంలో చాలామందికి అవగాహన లేక బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోని జాతీయ రహదారిని ఆనుకుని చాలా ప్రాంతంలో సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్లపైనే తమ వాహనాలు నడపాల్సిన ఆటో డ్రైవర్లు యథేచ్ఛగా హైవేపై హల్చల్ చేస్తున్నారు. సిగ్నల్ పాయింట్ల వద్ద వీరి అడ్డంకులే ఎక్కువ. అలాగే చాలా మంది ద్విచక్రవాహనదారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్లు సర్వీస్ రోడ్లపై వెళ్లాలంటే ఎక్కడిక్కడ ఉండే స్పీడ్ బ్రేకర్లతో ఇబ్బందులు. అందుకే ఆటో డ్రైవర్లు కచ్చితంగా సర్వీస్ రోడ్లపై తిరిగేలా చూస్తే అంబులెన్స్లకు మార్గం కొంత సులవవుతుంది. అదే సమయంలో అంబులెన్స్లు ఫ్రీగా వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.ప్రయాణ సమయంలో మనం ఏదో సందర్భంలో అంబులెన్స్ కూత (సైర న్) వింటూనే ఉంటాం. ఇందులో ప్రాణంతో పోరాడుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు. లేదా ప్రసవ వేదన అనుభవిస్తున్న గర్భిణి కావొచ్చు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడు అయి ఉండొచ్చు. అందుకే సైరన్ వినపించగానే వీలైనంత వరకు వాహనానికి దారి ఇచ్చి ముందుకు వెళ్లేలా చూడడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత. మన నిర్లక్ష్యం వల్ల క్షణం ఆలస్యం కావొచ్చు. దీని విలువ ఓ నిండు ప్రాణం. ఈ విషయంలో మనం చైతన్యవంతులు కావడం ముఖ్యం. ఎంత రద్దీ ఉన్నా వెంటనే తప్పుకోవాలి.. ముందుకు పంపాలి వాహనంలో ప్రాణాలతో పోరాడుతున్న వారు ఉండొచ్చు అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం కూడా నేరమే.. దీనిపై అవగాహన కల్పించాలంటున్న ప్రజలు -
వరి పంటల పరిశీలన
గూడూరు: మండలంలోని పొనుగోడు, రాములుతండా, చిర్రకుంటతండాలో వరి పంటల్లో తాలు శాతం ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. పంటలను పరిశీలించి వరి గింజలను హైదరాబాద్ ల్యాబ్కు పంపనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ దిలీప్, క్రాంతి మాట్లాడుతూ.. ల్యాబ్ రిపోర్ట్ ద్వారా రైతులకు విత్తన కంపెనీ, షాపు నిర్వాహకుడి ద్వారా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వ్యవసాయ సహాయ సంచాలకులు మురళి, ఏఓ అబ్దుల్మాలిక్, బాధిత రైతులు పాల్గొన్నారు. -
6న తెలుగు విభాగం పీహెచ్డీలో ప్రవేశాలకు ఇంటర్వ్యూ
● రీషెడ్యూల్ చేసిన అధికారులుకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మళ్లీ ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. తెలుగు విభాగంలో రెండు పీహెచ్డీ సీట్లు వెకెన్సీలు ఉండగా గతనెలలో ప్రవేశాలకు సంబంఽధిత ఆర్ట్స్ డీన్ సురేశ్లాల్ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. 31మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. అయితే ఎంపికై న జాబితాను వెల్లడించకముందే వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి పలు ఆరోపణలు వెళ్లడంతో ఆ ఇంటర్వ్యూను రద్దు చేశారు. ఈ క్రమంలో మళ్లీ ఈనెల 6వతేదీన ఇంటర్వ్యూ నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేశారు. ఈ సమాచారాన్ని సంబంధిత అభ్యర్థులకు కూడా పంపారని తెలుస్తోంది. జేఆర్ఎఫ్ ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత నెట్ అభ్యర్థులకు కూడా ఉంటుంది. రెండు సీట్లలో ఒకటి ఓసీ కేటగిరీ, మరోటి మిగతా అన్ని కేటగిరీలు కలిపి ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జిలు నిర్మించాలని శీర్షాసనం● జనగామ కలెక్టరేట్ వద్ద గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జి సాధన సమితి ఆందోళన జనగామ రూరల్: జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే దారి గానుగుపహాడ్ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రి డ్జి నిర్మాణం పూర్తిచేయాలని, అలాగే చీటకోడూ రు బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలుపెట్టాలని.. సో మవారం పట్టణంలో బ్రిడ్జిసాధన సమితి అధ్యక్షుడు యాసారపు కర్నాకర్ ఆధ్వర్యంలో గాడిదకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివా సరెడ్డి ఫ్లెక్సీ ఫొటోలు అంటించి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అడ్డుకుని వాటిని తొలగించా రు.అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకు న్నారు. కలెక్టరేట్ ఎదుట చీటకోడూర్కు చెందిన ఉమాపతి శీర్షాసనం వేస్తూ నిరసన తెలిపారు. సందీప్, గానుగ్పహాడ్, చీటకో డూర్ బ్రిడ్జి సాధ న సమితి సభ్యులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పా టు చేసేందుకు పనులు చేస్తున్నారు. కలెక్టరేట్లో ఏటా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. ఉద్యాన కళాశాల ఏర్పాటుపై సర్వేమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో ఉద్యాన కళాశాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అధికారులు జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం పరిధిలోని భూమిని మల్యాల రెవెన్యూ గ్రామానికి సంబంధించిన రికార్డు, గ్రామనక్షా, పహాణీ సహాయంతో డీజీపీఎస్ పరికరం ద్వారా సర్వే చేశారు. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నెహ్రూసెంటర్: దుష్ఫలితాలు లేని హోమియో మందులను ప్రజలు ఆదరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. ఆయుష్శాఖ ఆధ్వర్యంలో హోమియో వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు. వైద్య శిబిరంలో 200 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ పి.కిరణ్కుమార్, శ్రీకాంత్, మాధవి, క్యాంపు ఇన్చార్జ్ రామకృష్ణ, చైతన్య, మమత, ప్రీతి, శ్రేయ, వంశీ, డీఎంఓ శ్రవణ్, మేరీ, దీవెన, పద్మ, వీరన్న తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ట్రాక్టర్లో తీసుకెళ్లిన ఉపాధ్యాయులుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని వీఎస్.లక్ష్మీపురం గ్రామ కొత్తచెరువు అలుగుపోస్తుంది. కాగా, సోమవారం రోడ్డుపై నుంచి ప్రవాహం కొనసాగడంతో జంగిలిగొండ, వీఎస్.లక్ష్మీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో చుట్టు పక్కల తండాలు, గ్రామాల విద్యార్థులు లక్ష్మీపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లలేకపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్ఎం జానకీరాములు, ఉపాధ్యాయులు 20 మంది విద్యార్థులను ఓ ట్రాక్టర్ ద్వారా ఉదయం పాఠశాలకు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో మళ్లీ అదే ట్రాక్టర్లో విద్యార్థులను తీసుకొచ్చి వారి ఇళ్లకు పంపించారు. కాగా, వర్షం కురిసిన ప్రతీసారి వీఎస్.లక్ష్మీపురం, జంగిలిగొండ గ్రామాల మధ్య కొత్తచెరువు అలుగుపోసి వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోతున్నాయని, ఆ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రైతులు, ప్రజలు కోరారు. కేయూ ప్రైవేట్ కళాశాలల బంద్ కేయూ క్యాంపస్: ఫీజురీయింబర్స్మెంట్ బకా యిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేయూ పరిఽధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రైవేట్ డిగ్రీ అండ్పీజీ కళాశాలలు, ప్రొఫెషనల్ కళాశాలలు సోమవారం నుంచి నిరవధికంగా బంద్ చేశారు. ఎక్కువశాతం ప్రైవేట్ కళాశాలలు ముందుగా నే విద్యార్థులకు సమాచారం ఇవ్వడంతో కళా శాలలకు రాలేదు. అక్కడక్కడ వచ్చినా కళాశాలలు మూసివేసి ఉండడంతో విద్యార్థులు వెనుదిరిగారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది నిరసన తెలిపారు. -
ఉపకార వేతనాలు విడుదల చేయాలి
మహబూబాబాద్ రూరల్: విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు మాట్లాడుతూ .. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.8,500 కోట్ల ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో చదువుకోడానికి నిధులు లేక విద్యార్థులు భిక్షాటన చేయాల్సి దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉపకార వేతనాలు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు భాష పవన్, గుండ్ల రాకేష్, పట్టణ నాయకులు తాజ్, వీరేందర్, మహేశ్, యాకన్న, సాగర్, మహేశ్, ప్రవీణ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి
మహబూబాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి.. కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో చేపల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేప పిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ఆలస్యమైందని, ఈనెల 20వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. టీ మత్స్య యాప్లో చేప పిల్లలు, సరఫరాదారుల వివరాలు, రవాణా చేసే వాహనం సంపూర్ణ సమాచారం ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, మత్స్యశాఖ జిల్లా అఽధికారి శివ ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరి ష్కారం కాకుంటే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. పలువురు దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వచ్చినా వినతులు తీసుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా, ప్రజావాణిలో 89 వినతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో మానుకోట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా సేవలు అందించిన వారిలో కొంత మంది మృతి చెందారని, వారి స్థానంలో కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని వినతి ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాగన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ప్రజావాణిలో 89 వినతులు సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు దివ్యాంగుల ఆవేదన -
భూ తగాదాలకు సాక్షిగా ఉన్నాడని..
చిల్పూరు: భూ తగాదా లకు సాక్షిగా ఉన్నాడనే కారణంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్లో చోటు చేసుకుంది. సీఐ ఏడవెళ్లి శ్రీని వాస్ రెడ్డి, మృతుడి భార్య కావేరి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోతె జితేందర్, మో తె జీవన్, మోతె కిష్టయ్య కుటుంబాల మధ్య వ్యవసాయ భూమి, మామిడి తోటల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మోతె కిష్టయ్యను చంపుతామంటూ జితేందర్, జీవ న్ అతడి చుట్టూ ట్రాక్టర్ తిప్పుతూ భయభ్రాంతులకు గురిచేస్తుండగా ఫొటోగ్రాఫర్ అయిన ముత్యా ల నరేశ్(34) ఈ ఘటనను వీడియో, ఫొటోలు తీ శాడు. వాటిని పోలీసులకు చూపించగా ఇద్దరిపై కే సు నమోదు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇద్దరు.. నరేశ్పై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో మరో కొద్దిరోజుల్లో కోర్టులో ఈ కేసు ఉండడంతో ఫొటోల సాక్షిగా ఉన్న నరేశ్ను బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మొదట గ్రామస్తుడు మాచర్ల రమేశ్ బైక్పై తన ఇంటికి వెళ్తుండగా జితేందర్, జీవన్తోపాటు మరో ఆరుగురు కలిసి కర్రతో దాడి కి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమేశ్ రమేశ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అప్పటికే నిందితులు పరారయ్యారు. నమ్మకంగా ఫోన్ చేయించి హత్య.. ఆదివారం సాయంత్రం ఫొటో స్టూడియోలో ఉన్న నరేశ్కు నమ్మకం కలిగేలా జితేందర్, జీవన్.. ఇతరు లతో నరేశ్కు ఫోన్ చేయించారు. దీంతో నరేశ్ ఇప్పు డే వస్తానంటూ భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. కాలనీ సమీపంలో ఒంటరిగా వెళ్తున్న నరేశ్ను జితేందర్ ఒక్కసారిగా తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. అక్కడ గొడ్డలి, కర్రలతో చితకబాది చీరతో ఉరేసి చంపారు. రాత్రి అవుతున్నా నరేశ్ ఇంటికి రాకపోవడంతో పలుమార్లు అతడి భార్య కావేరి ఫోన్ చేసింది. అయినా స్పందించకపోవడంతో రమేశ్ను కొట్టినవారే తన భర్తను ఏదైనా చేసి ఉండొచ్చనే అనుమానంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిపింది. అప్పటికే పోలీసులు కూడా గ్రామానికి చేరుకోగా అందరూ కలిసి నరేశ్ కోసం పలు చోట్ల రాత్రి 2 గంటల వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చారు. ఈ క్రమంలో నరేశ్ మృతదేహాన్ని నిందితులు తమ మామిడి తోటలోకి తీసుకెళ్లి పడేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం మామిడి తోటలో వెతుకుతుండగా కాళ్లు, చేతులు వెనక్కి కట్టిపడేసి ఉన్న మృతదేహం కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విషయం తెలియగానే ఏసీపీ భీంశర్మ, రఘునాథపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడి భార్య నుంచి వివరాలు సేకరించారు. భార్య కావేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా ఏఆర్ఐ అర్జున్.. శవ పంచనామా చేశారు. పో స్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. కాగా, మృతుడికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు. మరొకరిపై దాడికి పాల్పడిన దుండగులు..తీవ్రగాయాలు చిల్పూరు మండలం కొండాపూర్లో ఘటన -
జాతర పనులు వేగవంతం చేయాలి
కురవి: మండలంలోని కందికొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు. సోమవారం కందికొండ గుట్ట వద్ద జరుగుతున్న జాతర పనులను ఆమె వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు విజయ, పున్నంచందర్, మరిపెడ సీఐ రాజ్కుమార్గౌడ్, ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ గౌస్, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఆర్ఐలు రవికుమార్, లక్ష్మీరెడ్డి, సీరోలు ఎస్సై సంతోష్, ఏపీఓ భూపాల్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, దయ్యాల శ్రీధర్, చందూలాల్ పాల్గొన్నారు. ఆర్డీఓ కృష్ణవేణి -
నా భూమి కాజేశాడు..
తోడేళ్లగూడెం గ్రామంలో నాపేరిట ఉన్న భూమిని నాకు తెలియకుండా నా పెద్ద కుమారుడి కొడుకు కాజేశాడు. అధికారి భూమిని నా మనవడి పేరున మార్చాడు. విచారణ చేసి న్యాయం చేయాలి. – శాంతమ్మ, తోడేళ్లగూడెం, డోర్నకల్ పింఛన్ మంజూరు చేయాలి నా భర్త తొమ్మిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతువు పింఛన్ కోసం తిరుగుతున్నా. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. నా కొడుకులు పట్టించుకోవడం లేదు. డబ్బులు లేక ఇబ్బంది అవుతుంది. – సామ్రాజ్యం, డోర్నకల్ మూడుసార్లు వినతి ఇచ్చినా పని కాలేదు పక్షవాతం వచ్చి ఎడమ కాలు, చేయి పని చేయడం లేదు. పింఛన్, ట్రైౖసైకిల్ మంజూరు చేయాలని మూడుసార్లు వినతిపత్రం అందజేశా. ఆటోకు వచ్చినప్పడుల్లా మూడు వందలు అవుతుంది.. పని మాత్రం కావడం లేదు. నా పరిస్థితి అర్థం చేసుకుని పింఛన్ మంజూరు చేయాలి. – జంపాల రాములు, గుమ్మడూరు -
పత్తి కొనుగోళ్లలో సీసీఐ జిమ్మిక్కులు
వరంగల్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో లబ్ధి పొందుదామని భావిస్తున్న పత్తి రైతులకు ఆశాభంగమే ఎదురుకానుంది. సీసీఐ గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన పత్తిలో సగానికి పైగా వరంగల్ జిల్లా నుంచి రావడంపై అందరి దృష్టి పడింది. తెలంగాణ జిల్లాల్లోని రైతులు తమకు ఇష్టం వచ్చిన సీసీఐ(జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కొనుగోలు కేందాలు)లలో విక్రయించారు. ఈవిక్రయాల కోసం వ్యవసాయ అధికారులు టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)లను జారీ చేయడం, రైతులు చెప్పిన ఫోన్ నంబర్లకు ఓటీపీ వచ్చే విధంగా మార్కెట్ అధికారులు సహకారం అందించడంతో ఇందులో పెద్దగా అక్రమాలు జరిగి నట్లు ఉన్నతాధికారులు భావించారు. దీంతో ఈ ఏడాది సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన ‘కపాస్ కిసాన్’యాప్లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. లేకుంటే సంబంధి త కొనుగోలు కేంద్రంలో పత్తిని అమ్ముకునే వీ లుండదు. ఈవిధానంపై 80శాతం మందికి అవగాహన లేదు. యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న ఈ నంబర్ ఆధార్కు లింక్ కాకుంటే స్లాట్ బుక్ కాదు. స్లాట్ బుక్ కాకుంటే రైతు పత్తి అమ్మకునే వీలుండదు. ఈవ్యవహారం చూసిన రైతులు తమ పత్తిని నేరుగా మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారుల కు అమ్ముకుంటున్నారు. దీనివల్ల రైతులు తేమశాతం నిర్దేశించిన మేరకు ఉన్నా ప్రతి క్వింటాకు రూ.1000నుంచి రూ.1500వరకు నష్టపోతున్నా రు. రైతు ప్రభుత్వం అంటున్న ప్రజాప్రతినిధులు గత ఏడాది మాదిరిగా పత్తిని విక్రయించుకునేందుకు సీసీఐ అధికారులను ఒప్పించడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో నిబంధన... సీసీఐ రోజుకో నిబంధన తీసుకురావడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈఏడాది 5,23 ,848 ఎకరాల్లో పత్తి వేసిన ట్లు వ్యవసాయ అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవల మోంథా తు పాను వరదలతో పత్తికి భా రీగా నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో 55,000, హనుమకొండలో 620, మహబూబాబాద్ 8,782, జనగామలో 6,445 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశా రు. ఇంకా సర్వే కొనసాగుతోంది. అకాల వర్షాల వల్ల ఎకరాకు దిగుబడి తగ్గితే 8క్వింటాళ్లుగా వ స్తుందని ప్రాథమిక అంచనా వేశారు. దీనిపై జిల్లాల్లో మరోసారి అంచనాలు వేసి ఎకరాకు 11.74క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా 12క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చింది. ఇప్పుడు 7క్వింటాళ్లు అని సీసీఐ ప్రకటించడంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర మంత్రికి లేఖ రాశా రు. దీంతోపాటు అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని 20శాతం తేమ ఉన్నా సీసీఐ కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని, లేనిపక్షంలో ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగో ళ్లు నిలిపివేస్తామని తెలంగాణ జిన్నింగ్ మిల్లర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రం, సీసీఐతో చర్చించి సమస్యను పరిష్కరించకుంటే పత్తి రైతులు సైతం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. 60 కేంద్రాలకు నోటిఫై.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈఏడాది సాగు చేసిన పత్తి విస్తీర్ణంలో 41లక్షల 90వేల 780క్వింటాళ్ల్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈలెక్క ప్రకారం సీసీఐ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేశారు. ఈసారి రైతులు ఇష్టం ఉన్న మిల్లుల్లో అమ్ముకోకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేట గిరీ లను అమలులోకి తీసుకువచ్చారు. ఎల్1లో నిర్దేశించిన మేరకు పత్తిని కొనుగోలు చేస్తే ఎల్ 2లో ఉన్న కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు అనుమతిస్తారు. ఈవిధానం వల్ల రైతులు తమకు అనుకూలంగా ఉన్న మిల్లుల్లో అమ్ముకోని పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల రైతులు సీసీఐ కేంద్రాల కంటే ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈపద్ధతిని తొలగించి పాత పద్ధతిలో పత్తిని సీసీఐ కొనుగో లు చేయాలని జిన్నింగ్ మిల్లుల యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రోజుకో నిబంధనతో ఠారెత్తుతున్న మిల్లుల యజమానులు కొత్తగా వచ్చిన యాప్తో రైతుల ఇబ్బందులు దిగుబడి అంచనాల తగ్గింపుతో కర్షకులకు నష్టంజిల్లాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, సీసీఐ కేంద్రాలుజిల్లా సాగు విస్తీర్ణం దిగుబడి సీసీఐ 2024 2025 అంచనా కేంద్రాలు ఎకరాలు ఎకరాలు క్వింటాళ్లు వరంగల్ 1,20,471 1,18,547 9,48,380 27 హనుమకొండ 78,013 74,849 5,98,790 4 మహబూబాబాద్ 83,357 85,480 6,83,840 6 ములుగు 20,740 20,593 1,64,740 3 జేఎస్.భూపాలపల్లి 93,823 98,260 7,86,080 5 జనగామ 1,25,992 1,26,119 10,08,950 15 మొత్తం 5,22,396 5,23,848 41,90,780 60 -
నేటినుంచి ‘బుగులోని’ జాతర..
రేగొండ: భక్తుల కొంగు బంగారం.. రెండో తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, జాతర నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్టకు చేర్చడంతో జాతర ప్రారంభం మొదటి రోజు తిరుమలగిరి గ్రామానికి చెందిన వంశీయ అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు ఇంటి నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్టకు చేర్చడంతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం గుట్టపై భాగంలోని గండ దీపంలో నూనె పోసి వెలిగిస్తారు. బుధవారం స్వామి వారికి నిత్య పూజలు, అభిషేకం, ఏనుగు, గుర్రం వాహనాలు తిరుగుట, స్వామి వారికి మెక్కులు తీర్చుకుంటారు. గురు, శుక్ర వారాల్లో నిత్య పూజలు, స్వామి వారికి మొక్కులు, శనివారం స్వామి వారిని గుట్టపై నుంచి తిరిగి అర్చకులు వెంకటేశ్వర్లు ఇంటి వద్దకు చేర్చడంతో జాతర ముగుస్తుంది. రెండో తిరుపతిగా ప్రసిద్ధి.. బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర రెండో తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడ స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తైన కొండలపై వెలసిన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన కొండకు చేరుకుంటారు. జాతర ప్రాంగణంలో ఇప్ప చెట్టు చుట్టూ భక్తులు తమ ప్రభబండ్లతో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈనెల 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, ఆలయ కమిటీ -
ఈఎంఐలు చెల్లించలేక బైక్ చోరీలు
జనగామ రూరల్: వాహనాల ఈఎంఐలు చెల్లించలేక బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జనగామ ఏఎస్పీ పండరి చేతన్ నితిన్ తెలిపారు. సోమవారం జనగామ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ఆరెగూడానికి చెందిన చెవుల మనోజ్, కేసారానికి చెందిన గొర్ల శివారెడ్డి, కొమ్మాలకు చెందిన ఆరె విజయ్, నెమ్మికల్కు చెందిన వీరబోయిన భరత్ స్నేహితులు. వీరు గత నెల 27న తిరుమలగిరి వద్ద కలుసుకున్నారు. ఈ సమయంలో మనోజ్.. శివారెడ్డితో తాను నాలుగు నెలల క్రితం కారు కొనుగోలు చేశానని, దీనికి ప్రతీ నెల ఈఎంఐ చెల్లించడం ఇబ్బంది అవుతోందని చెప్పాడు. అలాగే, శివారెడ్డి కూడా తన బైక్ను తెలిసిన వ్యక్తి వద్ద తాకట్టు పెట్టానని, దీనికి వడ్డీ చెల్లించడానికి ఇబ్బంది అవుతోందని చెప్పాడు. దీంతో చోరీలు చేసి అప్పులు చెల్లించాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మిగతా నిందితులు విజయ్, భరత్ కూడా చోరీ చేయగా వచ్చే సొత్తులో తమకు వాటా ఇవ్వాలని కోరడంతో మనోజ్, శివారెడ్డి ఒప్పుకున్నారు. అనంతరం నలుగురు కలిసి కారులో సూర్యాపేట నుంచి జనగామకు చేరుకున్నారు. ఇక్కడ రెండు బైక్లను అపహరించిన అనంతరం మనోజ్ వాటిని సూర్యాపేటకు తీసుకెళ్లి తన చిన్నమ్మ ఇంటి వద్ద పెట్టాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎస్సై భరత్ సిబ్బందితో సోమవారం ఉదయం 5 గంటలకు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మళ్లీ చోరీలకు పాల్పడడానికి నలుగురు నిందితులు కారులో జనగామ వస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి కారు, రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 9.50 లక్షలు ఉంటుంది. కాగా, నిందితులపై గతంలో సూర్యాపేట రూరల్, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ ఘటనల్లో కేసులు నమోదైనట్లు ఏఎస్పీ తెలిపారు. నలుగురి అరెస్ట్, రిమాండ్ కారు, రెండు బైకులు, నాలుగు ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన జనగామ ఏఎస్పీ -
టీఆర్లలో హస్తం ఉన్న పెద్దలపై చర్యలేవి?
● వ్యవసాయ శాఖ మంత్రికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు!వరంగల్: గత సంవత్సరం పత్తి కొనుగోళ్ల కోసం జారీ చేసిన టీఆర్(టెంపరరీ రిజి స్ట్రేషన్)లలో జరిగిన అవకతవకల్లో మా ర్కెటింగ్శాఖ వరంగల్ రీజియన్లో ఇద్ద రు ఉన్నతాధికారుల హస్తం ఉందని, దీని పై విచారణ జరిపి చ ర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తల పేరు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఓ లేఖను పంపినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్లను జారీ చేసేందుకు ఓటీపీ విధానం తాత్కాలికంగా డీఈ ఓ(డాటా ఎంట్రీ ఆపరేటర్)లతో అమలు చేశారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్లలోని జిన్నింగ్ మిల్లుల వ ద్ద రీజియన్లోని డాటా ఎంట్రీ ఆపరేటర్లు తమ ఇ ష్టం వచ్చినట్లు టెంపరరీ రిజిస్ట్రేషన్లు, ఓటీపీ విధానానికి ఒక్కొక్క దానికి రూ. వెయ్యి నుంచి రూ. మూడు వేల వరకు వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు ఇచ్చారని ఆరోపిస్తూ ఫిర్యాదులో పే ర్కొన్నారు. తాత్కాలికంగా నియమించుకున్న వారి ని తొలగించే అధికారం సదరు ఇద్దరు అధికారులకున్నా మినహాయింపు ఇచ్చి, బాధ్యులైన డీఈఓల ను వదిలేసి కార్యదర్శులపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. అంతేకాకుండా మిల్లు యజమాను ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధు లకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక్కొక్క మిల్లు నుంచి రూ.25వేలు వసూలు చేశారని ఆరోపించారు. మొత్తం రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు తమ స ర్వే టీం వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. ఈ దందా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈలేఖలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రులు,మంత్రి,ఎమ్మెల్యేలు, మా ర్కెటింగ్శాఖ డైరెక్టర్లకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కళాకృతులు అదుర్స్..
నెమలి గిటార్ఇస్రోరోబో కాజీపేట రూరల్ : భాషా, లిపి లేని రోజుల నుంచి నేటి రోబోల యుగం వరకు మానవుడు తన మేధస్సుకు పదును పెడుతూనే ఉన్నాడు. నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తూ సమాజాన్ని మేల్కొపుతూనే ఉన్నాడు. ఆలోచింపజేస్తూనే ఉన్నాడు. ఈ కోవలోనే కాజీపేట జంక్షన్కు చెందిన పలువురు రైల్వే టెక్నీషియన్లు చెత్తకుప్పలో పడేసే రైల్వే మెటీరియల్తో చేసిన వివిధ కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. కాజీపేట డీజిల్లోకో షెడ్లో షెడ్ సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్ పర్యవేక్షణలో పలువురు రైల్వే టెక్నీషియన్లు తమ నైపుణ్యంతో పనికిరాని మెటీరియల్తో చక్కటి ఆకృతులు, వస్తువులు తయారు చేశారు. ఈ ఆకృతులను చూసిన వారు మంత్రముగ్థులవుతున్నారు. రైల్వే టెక్నీషియన్ల ప్రతిభ అదుర్స్ అని కొనియాడుతున్నారు. గుడ్లగూబ పక్షి వెయిట్ లిఫ్టర్ వివిధ వస్తు రూపాల గ్యాలరీ చెత్తకుప్పలో పడేసే రైల్వే మెటీరియల్తో వివిధ కళాకృతులు తయారు చేసిన రైల్వే టెక్నీషియన్లు -
అత్యవసరంలో ఆదుకునే సంస్థ ‘లయన్స్’
హన్మకొండ: అత్యవసర సమయాల్లో ఆదుకునే సంస్థ లయన్స్ ఫౌండేషన్ అని ఆ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా అన్నారు. ఆదివారం హనుమకొండ, వరంగల్ జిల్లాలో ముంపునకు గురైన సమ్మయ్యనగర్, మైసయ్య నగర్, శివనగర్, బెస్తం చెరువు, మరియపురం, తిమ్మాపురం, జక్కలొద్ది, లెనిన్నగర్, షాపూర్, వడ్లకొండ, చౌటపల్లి, బొల్లికుంట, ఐనవోలు ప్రాంతాల్లో నష్టపోయిన 450 కుటుంబాలు, ములుగు జిల్లాలోని 200 కుటుంబాలకు రూ.15 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, బ్లాంకెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ మూలాన విపత్తు సంభవించినా వెంటనే స్పందించే సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని తెలిపారు. ఈ విపత్తు సాయం నిమిత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎల్సీఐఎఫ్ నిధులు మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా వరద ముంపు బాధితులకు నిత్యావసర కిట్, బ్లాంకెట్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రెండో ఉప జిల్లా గవర్నర్ పుట్టా హరికిషన్ రెడ్డి, జిల్లా ముఖ్య సలహాదారు, పూర్వ జిల్లా గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాస రావు, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి ఆర్.ప్రకాశం, కోశాధికారి చల్లా రఘునాథ్ రెడ్డి, ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ డాక్టర్ రాజేశ్వరి, జిల్లా నాయకులు మార్గం ప్రభాకర్, డాక్టర్ సురేశ్ కుమార్, కటంగూరు రాంగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.15 లక్షల విలువైన సరుకులు అందజేత లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా -
రైల్వే టెక్నీషియన్లు తయారు చేసిన కళాకృతులు..
రైల్వే టెక్నీషీయన్లు బయట పడేసే బోల్టులు, నట్లు, వాచర్స్, స్ప్రింగ్లు, చిన్న చక్రాలు, రింగ్లు, చైన్, రేకు, ఇతరత్రా ఇనుప వస్తువులతో ఈఫిల్ టవర్, రోబో, రాకెట్, గిటార్, వెయిట్ లిఫ్టర్, బుల్లెట్ వాహనం, ఇస్రో, హెలికాప్టర్, నెమలి, గుడ్లగూబ పక్షి, తాబేలు, కుక్క, ప్లవర్ వాజ్లు తయారు చేశారు. డీజిల్షెడ్లో వివిధ సెక్షన్లలో విధి నిర్వహణలో భాగంగా టెక్నీషియన్లు తయారు చేసిన వాటిని షెడ్ వద్ద ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేసినట్లు రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్.కె.జానీమియా, సెక్రటరీ పాక వేదప్రకాశ్ తెలిపారు. -
అగ్నికణం చాకలి ఐలమ్మ
శాయంపేట : అగ్నికణం చాకలి ఐలమ్మ అని అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారిణి విమలక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని కొప్పుల గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్ని ఆవి ష్కరించారు. అనంతరం ఐలమ్మ విగ్రహ దాత వైనాల రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో విమలక్క మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిలూదారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం సాగిన పోరులో విప్లవం రగిలించిన అగ్ని కణం చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. ఐలమ్మ జీవితం మహిళా లోకానికి మార్గదర్శకం, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారిణి విమలక్క -
మరింత ‘సహకారం’..
జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సహకార బ్యాంకు సేవలను మరింత విస్తరించేందుకు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు (సీసీ బ్యాంకు) ప్రణాళికలను రూపొందించింది. జనగామ జిల్లాలోని దేవరుప్పుల సింగిల్ విండో కార్యాలయ పరిధితో సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడు కొత్త బ్యాంకు శాఖలను ప్రారంభించేందుకు కేంద్ర సహకార బ్యాంకు ఏర్పాట్లు చేస్తోంది. సహకార బ్యాంకు సేవలను మరింత విస్తృత పరిచే క్రమంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీసీ బ్యాంకు రెండేళ్లుగా వీటి ప్రారంభానికి కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి స్థానికంగా బ్యాంకు సేవలను అందిస్తున్న నిపుణులతో అధ్యయనం సైతం చేసింది. ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో ఉన్న బ్యాంకులు పౌరులకు ఎలా సేవలందిస్తున్నారనే విషయమై ఆరా తీయడంతో కొత్తగా ఏర్పాటు చే యబోయే శాఖల్లో ఖాతాదారులను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయబోయే శాఖలు దేవరుప్పుల, రఘునాథపల్లి (జనగామ జిల్లా), హసన్పర్తి (హనుమకొండ), సంగెం (వరంగల్), నెల్లికుదురు, కురవి (మహబూబాబాద్), మొగుళ్లపల్లి (జయశంకర్ భూపాపల్లి జిల్లా)లో వీటిని ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. నూతన బ్యాంకు శాఖలకు సొంత భవనం నిర్మాణం చేసే వరకు ప్రస్తుతం అద్దె భవనాల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో కనీసం 15 వందల చదరపు అడుగుల నిర్మాణం ఉన్న భవనాల కోసం దరఖాస్తులను కోరుతున్నారు. ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పొదుపులు.. సహకార సంఘాల్లో ఎరువుల విక్రయంతోపాటు వివిధ పంట రుణాలు అందిస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పొదుపులు, దీర్ఘకాలిక పొదుపు ఖాతాలను నిర్వహించనున్నారు. దేవరుప్పులలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖ అందుబాటులో ఉన్నప్పటికీ, తమ శాఖ ద్వారా మరింత సేవలు అందించొచ్చనే భావనను సీసీ బ్యాంకు యోచి స్తుంది. బ్యాంకు ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంతృప్తిపరిచే నిబంధలున్నా భవనాలను గుర్తించే క్రమంలో బ్యాంకు అధికారులు యజమానులను సంప్రదిస్తున్నారు. వీలైనంత త్వరలో వీటిని ప్రారంభించాలని అధికారులు సంకల్పించారు. ఏడు సీసీ బ్యాంకు శాఖల ప్రారంభానికి సన్నాహాలు ఉమ్మడి జిల్లాలో పెరగనున్న సహకార సేవలు -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
సంగెం: విద్యుదాఘాతంతో రోజువారీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సంగెం మండలం లోహిత పెద్ద తండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాయపర్తి మండలం సూర్య తండాకు చెందిన గుగులోత్ రాజేందర్(29) రోజువారీగా అదే తండాకు విద్యుత్ సబ్ కాంట్రాక్టర్ బానోత్ దేవేందర్ వద్ద పనిచేస్తున్నాడు. శనివారం సంగెం మండలం లోహిత పెద్దతండా వద్ద స్తంభం ఎక్కి విద్యుత్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో స్తంభంపై ఉన్న తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కాంట్రాక్టర్ నెదురుగొమ్ముల సురేశ్, సబ్కాంట్రాక్టర్ దేవేందర్, విద్యుత్ అధికారులు హుటాహుటిన ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గేట్వాల్వ్ సంపులో పడి వృద్ధుడు.. సంగెం : ప్రమాదవశాత్తు గేట్వాల్వ్ సంపులో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వరంగల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో జరిగింది. ఎస్సై వంశీకృష్ణ కథనం ప్రకారం.. వాటర్ ట్యాంకు సమీపంలోని గేట్వాల్వ్ సంపులో వృద్ధుడి మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీ సులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, మృతుడు పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన మాసాని కనకమల్లు(70) అలియాస్ చిన్న కనకమల్లుగా పోలీసుల విచారణలో తేలింది. మృతుడు చెన్నారం గ్రామంలో బంధువు అంత్యక్రియలకు సైకిల్పై వెళ్లొస్తూ ప్రమావశాత్తు సంపులో పడినట్లు గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్.. రామన్నపేట : నగరంలోని కాశిబుగ్గ శాంతినగర్లో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ ఎండీ అహ్మద్ ఖాన్ (38) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ తెలిపారు. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. నగరంలోని కాశిబుగ్గలో నివాసం ఉంటున్న అహ్మద్ ఖాన్ గత నెల 27న ఉదయం 8 గంటల సమయంలో తల భాగంలో రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉండడాన్ని తన ఇంట్లో అద్దెకుంటున్న రేజియా గమనించింది. వెంటనే మృతుడి తల్లి రేహానాకు సమాచారం అందించింది. దీంతో రేహానా వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న తన కుమారుడు అహ్మద్ ఖాన్ను ఎంజీఎం తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై అనుమానాస్పద స్థితిలో తన కుమారుడు మృతి చెందాడనే తల్లి రేహానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఆదివారం తెలిపారు. బైక్ ఢీకొని వ్యక్తి..ఖిలావరంగల్/ వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వైపు నుంచి లేబర్ కాలనీకి వెళ్లే 100 ఫీట్లరోడ్డుపై బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథ నం ప్రకారం.. ఆదివారం రాత్రి 100 ఫీట్ల రో డ్డుకు చెందిన సుధాకర్ (48) రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీకొంది. ఈ ఘటనలో సుధాకర్ అక్కడికక్కడే దుర్మరణం చెందా డు. ఆగ్రహించిన స్థానికులు 100 ఫీట్ల రోడ్డు మధ్యలోని భారీ పైపులైన్లను వెంటనే తొలగించాలని ధర్నా చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో మిల్స్కాలనీ, ట్రాఫిక్ పోలీసులు వచ్చి ధర్నాను విరమింపజేసినట్లు తెలిసింది. -
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు షురూ
డోర్నకల్: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ఆదివారం 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు భారీగా హాజరుకాగా.. పోటీలు ఎస్సై గడ్డం ఉమ ప్రారంభించారు. పలు కేటగిరీల్లో పోటీలు హోరాహోరీగా సాగాయి. కార్యక్రమంలో వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండలోజు సుధాకర్, కొత్త వీరన్న, రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు మండలోజు రామారాజు, అబ్బయ్య, విమల, ఎస్సై ఖాదర్పాషా, పీఈటీలు రవికుమార్, విజయ్చందర్, తలారి విద్యాసాగర్, నాయకులు సుమేర్చంద్జైన్, మాదా శ్రీనివాస్, కేశబోయిన కోటిలింగం పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో ఆరోగ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా..
విద్యారణ్యపురి: పీఎంశ్రీ స్కూళ్లలో విద్యార్థుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు యోగా, క్రీడలపై ఆసక్తిని పెంచేలా 2025–2026 విద్యాసంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. ఒక్కో పీఎంశ్రీ స్కూల్కు రూ. 83,067 చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లోని పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రంలోని 794 పీఎంశ్రీ పాఠశాలల కోసం నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్,సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. గెస్ట్, పార్ట్ టైంగా యోగా టీచర్లు, స్పోర్ట్స్ కోచ్ల నియామకం పీఎంశ్రీ స్కూళ్లలో క్రీడాకార్యకలాపాలను బలో పేతం చేయడం, యోగాను ప్రోత్సహించడం ద్వా రా విద్యార్థుల్లో ఆరోగ్యకర జీవన శైలిని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను పీఎంశ్రీస్కూళ్లలో గెస్ట్, పార్ట్టైం యోగా టీచర్లను, స్పోర్ట్స్ కోచ్లను నియమించుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలకు మంజూరైన బడ్జెట్ నిధులలో పాఠశాల హెచ్ఎంలు యోగా, ఏదైనా క్రీడావిభాగంలో నిపుణులైన పార్ట్టైంగా ఆయా యోగా, స్పోర్ట్స్కోచ్ల సేవలను వినియోగించుకోవచ్చు. నిబంధనలు.. ఈ గెస్ట్ కోచ్లకు ఎలాంటి అధికారిక నియామక పత్రాలు జారీచేయొద్దు. వారు పాఠశాల రిజిస్టర్లో సంతకం చేయాల్సిన అవసరం లేదు. జిల్లాల స్థాయిలో నిధులు విడుదల చేశారు. డీడీఓ కోడ్ ఉన్న పీఎంశ్రీ స్కూళ్ల హెచ్ఎంలు నేరుగా నిధులను స్వీకరించి ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. డీడీఓ కోడ్లేని పీఎంశ్రీ స్కూళ్లకు సంబంధించిన నిధులను జిల్లా డీఈఓలు పర్యవేక్షణ చేస్తారు. పీఎంశ్రీ స్కూళ్లలో యోగా తరగతులు ఒక్కో స్కూల్కు రూ.83,067 నిధులు యోగా, క్రీడాకోచ్ల నియామకానికి ఉత్తర్వులు -
నేటినుంచి మక్కల క్రయవిక్రయాలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం ఆదివారం మొక్కజొన్న రాశులతో నిండిపోయింది. తుపాను కారణంగా గత గురు, శుక్రవారాల్లో వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిపివేశారు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో యథావిధిగా క్రయవిక్రయాలు జరగనున్నాయి. ఈక్రమంలో రైతులు రెండు మూడు రోజుల ముందు నుంచి మొక్కజొన్నలు విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించారు. కొందరు షెడ్ల ఆవరణలో మొక్కజొన్నల్ని రాశులుగా పోసుకోగా, తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు మార్కెట్ యార్డు ప్రాంగణంలోని ఖాళీ స్థలాల్లో ఆరబోసుకోవడం కనిపించింది. -
సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025
భగీరథ ప్రయత ్నం బయ్యారం: మోంథా తుపాను కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. పొలాల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పైరు వంగిపోవడంతో వరి కంకులు మొలకెత్తే అవకాశం ఉందని, నీరు బయటకు వెళ్లేందుకు పొలంలో కొంత భాగంలో కాల్వ తవ్వాడు బయ్యారానికి చెందిన రైతు తగిర పెద్ద వెంకట్రెడ్డి. 7 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 3 ఎకరాల్లో నీరు నిలిచింది. దీంతో పొలంలోని కొంత భాగాన్ని తొలగించి కాల్వ తవ్వి.. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నం చేశాడు. కాగా.. ఈసారి పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని, అధికారులు ఆదుకోవాలని వెంకట్రెడ్డి కోరుతున్నాడు. -
వీరన్న సన్నిధిలో భక్తుల సందడి
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు విద్యార్థులు కురవి: మండలంలోని మోద్గులగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 1వ తేదిన డోర్నకల్లోని బిషప్ గ్రౌండ్లో అండర్–14 ఎంపిక పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎన్.జె.చరణ్, ఐలి సౌజన్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ చారి, పీడీ దార్ల సునీల్ ఆదివారం తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి వికారాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. అభినందించిన వారిలో ఉపాధ్యాయులు శ్రీరాములు, లత, సలీం, ఇందిర, వీరన్న, దీపిక, రజిత, భాగ్యలక్ష్మి, టి.రమేశ్, బాలాస్టి రమేశ్, లక్ష్మి, జహేదాబేగం, పాఠశాల కమిటీ చైర్పర్సన్ శారద ఉన్నారు. నేటినుంచి శ్రీవారి పవిత్రోత్సవాలుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంలో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ముడుంబై లక్ష్మీనారాయణాచార్యులు, సత్యంగౌతంశర్మ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి నిత్య ఆరాధన, 9 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురారోపణ, తీర్థ ప్రసాద గోష్టి పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి నిత్య ఆరాధన, 9 గంటల నుంచి మూలమంత్ర, మూర్తి మంత్ర హవనాలు, పవిత్ర న్యాస హవనం, లఘు పూర్ణహుతి, పెరుమాళ్లుకు స్నపనం జరిపి తీర్థప్రసాద గోష్టి పూజలు ఉంటాయని తెలిపారు. బుధవారం ఉదయం నిత్యఆరాధన, ఉత్సవాంగ హవనంతో పాటు పౌర్ణమి సందర్భంగా సుదర్శన హోమం, పూర్ణాహుతి, పవిత్ర ఆరోపణం, మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, విమాన శిఖరానికి, ఆలయం చుట్టూ పవిత్రధారణ చేయటం పూజలు జరుగుతాయన్నారు. అనంతరం లక్ష తులసి అర్చన, కుంభ ప్రోక్షణ, వేద ఆశీర్వచనం, ఉత్సవ కై ంకర్యపరులకు పవిత్ర మాలధారణ, ఋత్విక్ సన్మానం, ఉత్సవ సమాప్తి నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మించాలని పూజారుల నిరసన ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి– ఊరట్టం నుంచి మేడారం వెళ్లే రోడ్డును తక్షణమే నిర్మించాలని గోవిందరాజుల పూజారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు, గోవిందరాజుల పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రాజారాం, బాబు, జనార్ధన్, నాగేశ్వర్రావు, మాణిక్యం, చంద్రమౌళి, రాజు, రవి, వెంగళరావు, నాగరాజు ఆదివారం కొండాయి నుంచి ఊరట్టం మీదుగా మేడారం వెళ్లే రోడ్డును పరిశీలించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. కొండాయి బ్రిడ్జితో పాటు రోడ్డు మార్గాన్ని నిర్మిస్తేనే గోవిందరాజులను మేడారం జాతరకు తీసుకొస్తామన్నారు. సరైన రోడ్డు మార్గం లేక గోవిందరాజులును మేడారం తీసుకెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మేడారం మహాజాతరకు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా రోడ్లు నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పలుమార్లు ఈ విషయాన్ని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. జాతరవరకు రోడ్డు నిర్మించకుంటే గోవిందరా జులను జాతరకు తీసుకురామన్నారు. -
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7వ తేదీన నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మైస నాగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వలకు చాలాసార్లు విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశామన్నారు. పెన్షనర్లకు నగదు రహిత ఈహెచ్ఎస్ సేవలను అన్ని కార్పొరేట్ హాస్పటల్స్లో అందించాలని, మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయిన వారికి పెన్షన్లు, బెనిఫిట్స్ చెల్లించాలన్నారు. పెండింగ్లో ఐదు డీఆర్ బకాయిలు ఒకేసారి చెల్లించాలని, పీఆర్సీ అమలు పరుస్తూ బకాయి అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య, జిల్లా బాధ్యులు మోహన్రావు, నారాయణ, రాములు, చంద్రయ్య, మంగపతిరావు, మండల బాధ్యులు వెంకట్రెడ్డి, మహేందర్, శ్రీనివాస్రావు, నాగేందర్రావు, మల్లయ్య, గోవర్ధన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
వంతెన ఎక్కలేక.. పట్టాలు దాటలేక!
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో వంతెన ఎక్కలేక.. పట్టాలు దాటలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లో మూడు ప్లాట్ఫామ్లున్నాయి. మరో ప్లాట్ఫామ్ నిర్మించాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ట్రైన్లు వచ్చి మూడో ప్లాట్ఫాంపై ఆగడంతో వంతెన మెట్లు ఎక్కలేనివారు, మోకాళ్లనొప్పులతో బాధపడేవారు, దివ్యాంగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన ఆస్పత్రి, కలెక్టరేట్, మార్కెట్ ప్రాంతాలన్నీ ప్రతిపాదిత నాలుగో నంబర్ ప్లాట్ఫాం వైపు ఉన్నాయి. అటువైపు వెళ్లే వాళ్లంతా మూడో నంబర్ ప్లాట్ఫాంపై దిగి ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో పలు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో 4వ నంబర్ ప్లాట్ఫామ్ నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. -
ఉడకని అన్నం
నీరు వెళ్లేందుకు పొలంలో కాల్వ తవ్వుతున్న రైతులు మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఉడికీ ఉడకుండా.. నల్ల బియ్యంతో వండిన అన్నం తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిత్యం వసతి గృహాలను జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, అధికారుల పర్యవేక్షిస్తున్నా మహబూబాబాద్ జిల్లాలోని వసతి గృహాల్లో విద్యార్ధుల ముద్ద అన్నం, నీళ్లచారే దిక్కవుతోంది. ఉండలు కట్టిన బియ్యం సరఫరా.. జిల్లాలోని హాస్టళ్లకు, గురుకులాలకు ఉండలు కట్టిన బియ్యం నల్లని బియ్యం సరఫరా అవుతోంది. ఆ బియ్యం వండిన తర్వాత అన్నం ముద్దగా అవుతోందని వంట మనుషులు వాపోతున్నారు. విద్యార్థులు కడుపు నిండా తినలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ‘ఏం పెట్టిన తినాల్సిందే.. ఏదైనా జరిగినా బయటకు రావొద్దు.. ఎవరైనా ఎదురు మాట్లాడితే టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తాం’ అంటూ విద్యార్థులను వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు వేధిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. జిల్లాలోని కస్తూర్బా, మోడల్ స్కూల్, సాంఘిక, గిరిజన సంక్షేమ, మైనార్టీ, మహత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల వసతి గృహాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, హాస్టళ్లు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నాయి. కొరవడిన పర్యవేక్షణ ముద్ద అన్నం తినబుద్ధి కావట్లేదని హాస్టళ్ల విద్యార్థులు వాపోతున్నారు. తినకపోతే తప్పట్లేదని, అన్నం అరగక తరచూ కడుపునొప్పి లేస్తోందని హాస్టళ్ల విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లపై పర్యవేక్షణ కొరవడిందని, ఉన్నతాధికారులు పర్యవేక్షించి హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, భోజనం పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.●అధికారుల నిర్లక్ష్యం సంక్షేమ, గిరిజన, మైనార్టీ, బీసీ గురుకులాలు జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక వార్డెన్లు ప్రిన్సిపాళ్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అన్నం దొడ్డుగా అవుతోందని, కూరలు రుచిగా లేవని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు పర్యవేక్షించి తక్షణమే దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి – గుగులోతు సూర్యప్రకాశ్, డీఎస్ఎఫ్ఐ నాయకుడుఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టళ్లలో బియ్యం నల్లగా వస్తున్నాయని, అన్నం వండితే దొడ్డుగా ముద్దగా అవుతోందనే సమస్య మా దృష్టికి వచ్చింది. విషయాన్ని సివిల్ సప్లయీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బియ్యం మార్చుకునే అవకాశం కల్పించాలి. పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. – గుగులోతు దేశీరాంనాయక్, జిల్లా గిరిజన శాఖ అధికారి, మానుకోట నీళ్ల చారుతో భోజనం సంక్షేమ, వసతి గృహల్లో విద్యార్థులకు అందని నాణ్యమైన భోజనం ప్రశ్నిస్తే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరింపులు తినలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు పాఠశాలలు సంఖ్య విద్యార్థులు సాంఘిక సంక్షేమ,డిగ్రీ గురుకులాలు 6 3,650 ట్రైబల్ వెల్ఫేర్, ఏకలవ్య 14 6,732 కస్తూర్బా విద్యాలయాలు 16 3,088 మోడల్ స్కూళ్లు 8 5,675 ఎస్సీ హాస్టళ్లు 20 1,521 పోస్ట్మెట్రిక్ 4 200 గిరిజన ఆశ్రమ పాఠశాలలు 19 5,677 వసతి గృహాలు 6 615 పోస్ట్మెట్రిక్ 9 685 మైనార్టీ గురుకులాలు, కళాశాలలు 6 1,483 బీసీ వసతి గృహాలు 8 680 పోస్ట్మెట్రిక్ హాస్టళ్లు 6 450 బీసీ మహాత్మా పూలే 6 3,030 -
ప్రైవేట్ కళాశాలల సమ్మె బాట
కేయూ క్యాంపస్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు సోమవారం నుంచి బంద్ బాట పట్టనున్నాయి. గతంలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సుల యాజమాన్యాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కళాశాలలను మూసివేసి ఆందోళన కూడా చేశాయి. అసెంబ్లీలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్పై పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తారు. విడతల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా జాప్యం జరుగుతూనే ఉంది. టోకెన్లు ఇచ్చిన కళాశాలల యాజమాన్యాలకు తొలుత రూ.1200 కోట్లు ఇస్తామని చెప్పి దసరా ముందు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లు విడుదల చేయలేదు. విజిలెన్స్ తనిఖీకి ప్రభుత్వం నిర్ణయం మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీతో సహా ప్రొఫెషనల్ కాలేజీలను విజి లెన్స్ అధికారులతో తనిఖీలు చేసేందుకు ఇటీవల జీఓ జారీ చేసింది. కళాశాలల్లో విద్యార్థులకు సదుపాయాలున్నాయా, బోగస్ విద్యార్థులున్నారా, ని బంధనలకు అనుగుణంగా కళాశాలలను నడుపుతున్నారా, అధ్యాపకులు ఉన్నారా తదితర వాటిని కూడా తనిఖీ చేసేందుకు నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుంటే కళాశాలలను బంద్ చేస్తామని ప్రకటించాక ప్రభుత్వం విజి లెన్స్ తనిఖీలు చేయిస్తామని జీఓ జారీ చేయడం కక్ష సాధింపు లాంటిదేనని కళాశాలల యజామాన్యాల అసోసియేషన్లు మండిపడుతున్నాయి. కేయూ పరిధిలో 240 కళాశాలలు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కళాశాలల యాజమాన్యాలు ఈనెల ఒకటిన అధికారులకు సమ్మెనోటీస్ కూడా అందజేశాయి. కేయూ పరిధిలో 240 వరకు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు, లక్ష మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అలాగే, మూడు ఇంజనీరింగ్ కళాశాలలు, 24 ఫార్మసీ కళాశాలలు, 42 విద్యాకళాశాలలు, రెండు లా కళాశాలలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలకు రూ.వందకోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉందని యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ రాకపోవడంతో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. నేటి నుంచి మూసివేయాలని యాజమాన్యాల నిర్ణయం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ కాకతీయ యూనివర్సిటీ అధికారులకు నోటీస్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణలోనూ ఇక జాప్యమే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఆలస్యం కేయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 3వ వరకు గడువు ఉంది. ఈనెల మూడో వారం లేదా ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాలనే యోచనలో పరీక్షల విభాగం అధికారులున్నారు. అయితే, ఈనెల 3వతేదీ నుంచే కళాశాలలు నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్కు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, బాధ్యులు వేణుమాధవ్, రవీందర్రెడ్డి, హరీందర్రెడ్డి తదితరులు ఈనెల ఒకటిన సమ్మె నోటీస్ అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేవరకు కళాశాలలను మూసివేస్తామని, పరీక్షలు కూడా నిర్వహించమని స్పష్టం చేశారు. దీంతో డిగ్రీ మొదటి, రెండు, మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెలలో నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు ఆయా సెమిస్టర్ల సిలబస్ కూడా పూర్తికాలేదని తెలుస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కళాశాలల నిర్వహణ కష్టంగా ఉంది.. ఒప్పుకున్న మేరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలి. రూ.1200 కోట్లలో రూ. 300 కోట్లు చెల్లించింది. మిగిలిన రూ.900 కోట్లు చెల్లించాలి. ఆతర్వాత ఇంకా చాలా బకాయిలున్నాయి వాటిని దశలవారీగానైనా చెల్లించవచ్చునని చెప్పాం. అయినా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులతో కళాశాలలను నడపలేకపోతున్నాం. తప్పనిపరిస్థితుల్లోనే కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తున్నాం. – ఉపేందర్రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు -
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల శివారు గోపాల్రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన ఇప్ప నాగరాజు(23) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటన్నాడు. కొంత కాలంగా ఆటో సరిగా నడవకపోవడంతో దాదాపు రూ. లక్షా 30వేల అప్పు అయ్యిందిు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఆదివారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య నాగరాణి, కుమారుడు సిద్దు ఉన్నాడు. మృతుడి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. శాయంపేట : అనారోగ్య కారణాలతో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన మండలంలోని కొత్తగట్టు సింగారంలో జరిగింది. ఎస్సై జక్కుల పరమేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలేటి బుచ్చివీరు(80) గత నెల 26వ తేదీన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు 27న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుచ్చివీరు ఆదివారం గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై పరమేశ్ తెలిపారు. -
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025గ్రేటర్ మహానగరం జలదిగ్బంధమైన వేళ.. మేమున్నామంటూ కదిలారు పోలీసులు, అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది. జల విలయాన్ని ఛేదిస్తూ వేలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి సేవలందించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. బల్దియా కార్మికులు అయితే ఒకవైపు వరద ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఎన్పీడీసీఎల్ సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించారు. దుప్పట్లు, వాటర్ బాటిళ్లు, ఆహారం పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు దాతలు. మానవత్వంతో కదిలివచ్చిన వీరందరి ‘సేవలకు సలాం’ పలుకుతూ ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ అర్బన్/వరంగల్క్రైం/హనుమకొండ/కాజీపేట అర్బన్వరంగల్ నగరంలో.. ఇటీవల కురిసిన వర్షానికి న్యూరాయపుర మొత్తం మునిగిపోయింది. కాలనీలోని ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డాడు. కనీసం బయటికి రాలేని పరిస్థితి. ఇంటి చుట్టూ నీళ్లు. సమాచారం అందుకున్న హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్సిబ్బంది అతడి ఇంటికి చేరుకున్నారు. బాధితుడిని స్ట్రెచర్పై పడుకోబెట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఎంజీఎంకు తరలించారు. తనను కాపాడిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.ఈ ఫొటో చూడండి.. హనుమకొండలోని టీవీ టవర్ కాలనీకి చెందిన అలేఖ్య గురువారం రాత్రి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. బుధవారం కురిసిన వర్షానికి ఆమె ఇంటి చుట్టూ వరద. బయటికి వెళ్లలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోప్ సాయంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. అలేఖ్యతోపాటు కుటుంబ సభ్యులకు లైఫ్ జాకెట్లు ధరింపజేసి రోప్ సాయంతో ఇంటిలో నుంచి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె అమెరికా వెళ్లేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. ● వరద ప్రభావిత బాధితులకు అండగా నిలిచిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బల్దియా డీఆర్ఎఫ్ ● కీలకంగా వ్యవహరించిన కమిషనరేట్ పోలీసులు ● నిరంతర విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు ● వారి సేవలను ప్రశంసిస్తున్న ముంపు బాధితులు ప్రకృతి విపత్తుల సమయంలో గ్రేటర్ వరంగల్ మహా నగరాన్ని రక్షించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) మేమున్నామంటోంది. అత్యవసర సమయాల్లో మెరుపు వేగంతో రంగంలోకి దిగి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను రక్షిస్తోంది. తాజా గా మోంథా తుపాను కారణంగా వరంగల్ మహానగరం అతలాకుతలమైంది. ఈనేపథ్యంలో బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది 30 మంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం హైదరాబాద్కు చెందిన ఎస్డీఆర్ఎఫ్, టీజీఎఫ్డీకి సంబంధించిన సుమారు వంద మంది రక్షకులు సేవలందించారు. వరదలో చిక్కుకున్న సుమారు 400 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి శెభాష్ అనిపించుకున్నారు. వరంగల్ నగరంలోని 45 వరద ప్రభావిత ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు మెరుపు వేగంతో స్పందించాయి. ఆస్తి, ప్రాణ నష్టం, రవాణా సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించి అందరి మన్ననలు పొందాయి. పోలీసుల సేవాభావం.. పలు కాలనీల్లో వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ భవన్లో ఓ వివాహ వేడుక కోసం వచ్చిన సుమారు 150 మంది వరదలో చిక్కుకున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. కాపువాడ, గోకుల్నగర్, టీవీ టవర్ కాలనీ, గోపాల్పూర్ భగత్సింగ్ నగర్ వంటి ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఒకదశలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ నేరుగా రంగంలోకి దిగి ట్రాక్టర్పై వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. విద్యార్థినులకు ఆపన్నహస్తం..రెండేళ్ల క్రితం 2023, జూలై 27న కురిసిన వర్షానికి హంటర్రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భవనం మొదటి అంతస్తులోకి వర్షపు నీటితోపాటు పాములు, తేళ్లు వచ్చాయి. భవనం టెర్రాస్పై బిక్కుబిక్కుమంటూ రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థినులు వేచి చూశారు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సాయంతో విద్యార్థినులను రక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ 29న అదే పరిస్థితి ఎదురైంది. మోంథా తుపాను కారణంగా డిగ్రీ కళాశాల భవనం పూర్తిగా జలమయమైంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు సుమారు 12 గంటల పాటు విద్యార్థినులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ సారథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బోట్ల సాయంతో 470 మంది విద్యార్థులను రక్షించి పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తమను రక్షించిన వారికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. వరద పోటెత్తినా.. విద్యుత్ పునరుద్ధరణవర్షం దంచికొడుతున్నా.. రాత్రింబవళ్లు వినియోగదారులకు కరెంట్ సరఫరాను అందించారు విద్యుత్ సిబ్బంది. నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. వరద నీటిలో వెళ్లి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు సరఫరా నిలిపివేసి ప్రత్యామ్నా య మార్గంలో విద్యుత్ సరఫరా అందించారు. వర్షం, వరద నీటిలో స్తంభం పైకి ఎక్కుతుంటే.. కాళ్లు పట్టు కోల్పోతున్నా.. విద్యుత్ సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.సల్లగా బతకమని ఆశీర్వదించింది.. సమ్మయ్యనగర్లో ఇళ్లు, చుట్టూ భారీగా వరద నీరు నిలిచిందని అందిన సమాచారంతో వరద నీటిలోకి వెళ్లాను. ఆ ఉధృతికి నాకే భయం వేసింది. కానీ, ధైర్యం చేసుకొని ముందుకు సాగాను. ఓ మహిళను తాడు సాయంతో ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ‘సల్లగా బతుకు’ అని ఆశీర్వదించింది. – వి.శ్రీకాంత్, డీఆర్ఎఫ్ గర్భిణిని ఒడ్డుకు చేర్చాం.. 28వ డివిజన్ హంటర్ రోడ్డులోని సాయినగర్ కాలనీలో గర్భిణి వరదల్లో చిక్కుకుందని తెలియడంతో డీఎఫ్ఓ శంకర్ లింగం ఆదేశాలతో ముందుకు సాగాం. అదే సమయంలో ఏసీపీ శుభం ప్రకాశ్, మట్టెవాడ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బందితో బయటకు తీసుకొచ్చి ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చాం – సీహెచ్.అశోక్, డీఆర్ఎఫ్అటు ట్రాఫిక్, ఇటు రెస్క్యూ.. వర్షం కురుస్తున్నంతసేపు సమస్య తీవ్రత ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు తక్షణ సేవలందించాం. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకున్నాం. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జేసీబీ, ట్రాక్టర్లతో వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. – పునాటి నరసింహారావు, ఏసీపీ, హనుమకొండ -
బేరసారాలు..
సాక్షి, మహబూబాబాద్: మద్యం షాపుల కేటాయింపు కోసం జరిగిన లాటరీలో షాపు దక్కినవారు షాపు ఎలా నడపాలని ఆలోచిస్తుండగా.. షాపు దక్కని మద్యం వ్యాపారులు లాటరీలో షాపులు వచ్చిన వారికి గుడ్ విల్ ఇచ్చి షాపు తీసుకునేందుకు బేరసారాలు కుదుర్చుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం డిమాండ్ ఉన్న షాపులకు రూ.కోట్లు ఇచ్చేందుకు సైతం సై అంటున్నట్లు వినికిడి. అయితే దరఖాస్తులు వేసేటప్పడు అయిన సిండికేటు దారుల్లో కొందరు షాపులుఅమ్మాలని, మరికొందరు అమ్మొద్దని చెప్పడంతో అయోమయం నెలకొంది. సిండికేటుదారుల్లో కుదరని సయోధ్య గత సీజన్లో మద్యం షాపుకోసం దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సీజన్లో ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచారు. అయితే లాటరీలో షాపు రాకపోతే దరఖాస్తు ఫీజు ప్రభుత్వానికే చెందే పద్ధతి ఉండడంతో పెద్ద మద్యం వ్యాపారులు సింగిల్గానే దరఖాస్తులు చేసుకున్నారు. చిన్న చిన్న వ్యాపారులు, రియల్ ఎస్టేట్, ఇతర ఉద్యోగస్తులు తమ డబ్బులకు ఎంతో కొంత రక్షణ ఉంటుందని తాము తీసిన డీడీలతో సిండికేట్లుగా మారారు. ఇలా పది దరఖాస్తుల నుంచి మొదలైన సిండికేట్ వంద దరఖాస్తుల వరకు కూడా ఉన్నాయి. అయితే ఈ సిండికేటులో ఒకటి, రెండుషాపుల వచ్చినవారు ఉన్నారు. అసలే రానివారు కూడా ఉన్నారు. దీంతో ఎక్కువ మంది సిండికేట్గా ఉన్న గ్రూప్లో ఒకటి, రెండు షాపులు వస్తే వాటి నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నారు. కొందరు షాపును అమ్మి డబ్బులు పంచుకుందాని చెబుతుండగా మరికొందరు షాపును నడిపిద్దామని అంటున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య సమోధ్య కుదరడంలేదని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్ విల్ రూపంలో రూ.కోట్లు! జిల్లా వ్యాప్తంగా 61 మద్యం షాపులకు 1,800 దరఖాస్తులు వేశారు. అయితే లాటరీలో షాపులు దక్క ని వారు షాపులు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా.. షాపులు దక్కిన వారిలో కొందరు షాపులు నడిపించలేక పార్ట్నర్ను కలుపుకోవడం.. లేదా గుడ్ విల్ తీసుకొని షాపులు వేరేవారికి అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఇలా జిల్లాలోని ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్న ప్రాంతం, ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగే ప్రాంతాల్లోని షాపులకు పెద్ద మొత్తంలో గుడ్ విల్ ఇచ్చి షాపులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మహబూబాబాద్ సర్కిల్లో ఒక షాపును రూ.కోటి కి పైగా గుడ్విల్ ఇచ్చి లాటరీలో షాపు దక్కిన వారి నుంచి ఓ మద్యం వ్యాపారి తీసుకున్నట్లు ప్రచారం. అదే విధంగా మహబూబాబాద్, తొర్రూరు, గూడూ రు ఎక్సైజ్ సర్కిళ్లలో షాపులు తీసుకునేందుకు మ ద్యం వ్యాపారులు పోటీ పడుతున్నారు. అదే విధంగా సిండికేట్లో ఉన్న సభ్యులు కొందరు షాపును నడిపించుకునేందుకు షాపునకు బేరం పెట్టి మిగిలి న సభ్యులకు డబ్బులు ఇచ్చే విధంగా అంగీకారం చేసుకుంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న షాపులకు వేలం వేసిమరీ షాపులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా షాపునకు రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు కొనుగోలు చేసి చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. లాటరీలో వచ్చినవారే బాధ్యులు.. ఒక వైపు లాటరీలో షాపులు దక్కిన వారు భేరసారాలకు దిగి మరొకరికి షాపు అప్పగించే పనిలో ఉన్నారు. మరో వైపు ఎకై ్సజ్ అధికారులు మాత్రం లాటరీలో షాపు దక్కిన వారే రెండు సంవత్సరాలు షాపు నిర్వహించేందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు, రెంటల్ చెల్లింపులు మొదలైన విషయాలపై ముందుగానే అగ్రిమెంట్ పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. షాపులపై కేసులు అయినా.. ఇతర సమస్యలు వచ్చినా.. లాటరీలో షాపు వచ్చిన వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో లాటరీలో షాపు దక్కించుకున్న వారు నమ్మకస్తులకే షాపును ఇవ్వడం.. లేదా.. ముందుగానే అడ్వాన్స్ డబ్బులు తీసుకొని షాపు అప్పగించడంపై ఆచీ తూచీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. లక్కీ డ్రాలో వైన్స్ వచ్చిన వారికి డిమాండ్ రూ.కోట్లు పలుకుతున్న వైనం సిండికేటుదారుల్లో కుదరని సయోధ్య షాపుల కొనుగోలుపై మద్యం వ్యాపారుల కన్ను -
విధుల్లో అలసత్వం వహించొద్దు
నెహ్రూసెంటర్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధుల్లో అలసత్వం వహించినా.. సమయ పాలన పాటించకపోయినా చర్యలు తప్పవని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ హెచ్చరించారు. బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటనపై ఆస్పత్రి వైద్యులతో శనివారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో నర్సులు కాలక్షేపం చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఒక్క ఉద్యోగి కూడా డ్యూటీలో సెల్ఫోన్ ఉపయోగించరాదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టి సారించాలని తెలిపారు. అమానవీయ సంఘటనలు పునరావృతం అయితే సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఆర్ఎంఓపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇద్దరిపై వేటు.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బతికుండగానే మార్చురీలో పెట్టిన సంఘటనలో ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బతికుండగానే మార్చురిలో పెట్టారని, సిబ్బంది అలత్వం వీడి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అంకితభావంతో పనిచేయాలి మహబూబాబాద్ రూరల్ : వ్యవసాయ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. మోంథా తుపానుతో నియోజకవర్గ వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఏఓ విజయనిర్మల, ఏడీఏ శ్రీనిసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, వివిధ మండలాల ఏఓలు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మురళీనాయక్ బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటనపై స్పందన ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు -
మధ్యవర్తిత్వాన్ని వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : కుటుంబం, సమాజంలో తలెత్తే వివాదాలను సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మా నుకోటలో సకల జన కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రం ఏర్పాటు చేయగా.. శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కమ్యూనిటీ సామాజిక మధ్యవర్తులచే సకల జన కమ్యూని టీ మీడియేషన్ కేంద్రం నిర్వహించనున్నట్లు తెలి పారు. ఈ కేంద్రంలోని సేవలు అన్ని పూర్తిగా ఉచితమేనని చెప్పారు. నేటి సంక్లిష్ట సమాజంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగవుకే ఎన్నో కేసులు దాఖలవుతున్నాయని, దానివల్ల బంధాలు దెబ్బ తింటున్నాయన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని షాకెల్లి మాట్లాడుతూ.. కమ్యూనిటీ వివాదాలను పరిష్కరించడంలో శిక్షణ పొందిన వలంటీర్లు చురుకై న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, శిక్షణ పొందిన మీడియేటర్లు శంతన్ రామరాజు, పిట్టల బుచ్చిరామారావు, సుతారపు వెంకటనారాయణ, ఎడ్ల శ్రీనివాస్, వాంకుడోత్ భద్రమ్మ పాల్గొన్నారు. 15న ప్రత్యేక లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలకు ఆయా కోర్టుల్లోని న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని షాకెల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరవపల్లి కృష్ణతేజ్, డీఎస్పీ తిరుపతిరావు, పీపీ గణేష్ ఆనంద్, జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్ పాల్గొన్నారు. జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ సకలజన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభం -
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ మహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉపాధ్యాయులకు సూ చించారు. జిల్లా కేంద్రంలోని కేజీవీబీ, శనిగపురం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, డిజిటల్ తరగతులతో ప్రతి సబ్జెక్ట్పై పట్టు సా ధించేందుకు, విద్యార్థి సామర్థ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందన్నారు. మెనూ పాటిస్టూ నాణ్యమైన ఆహార పదార్థాలను వంటలకు ఉపయోగించాలని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గ ర్భిణులు, బాలింతలకు బలవర్ధమైన ఆహారం అందించాలని, హెల్త్ ప్రొఫైల్ను మెయింటైన్ చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్రావు, కేజీబీవీ ఎస్ఓ భవాని, ఉపాధ్యాయులు ఉన్నారు. సొంతింటి కల సహకారానికి కృషి మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో సొంతింటి కల సాకారం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో కలిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాద స్థలం పరిశీలన
ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని శనివారం అధికారులు పరిశీలించారు. వరంగల్ కమిషనరేట్ రోడ్డు సేఫ్టీ వింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రవాణా శాఖ డీటీఓ రమేశ్ రాథోడ్, సీఐ పులి రమేశ్, నేషనల్ హైవే ఏఈ ప్రశాంత్ ఉన్నారు. అధికారులు ప్రమాదం జరిగిన కారణాలను సమీక్షించి, రహదారి పనుల్లో నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా కాంట్రాక్టర్కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రివేళ డ్రైవర్లకు కనబడేలా లైటింగ్ సదుపాయం, రిఫ్లెక్టీవ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముల్కనూర్ ఎస్సై రాజు, సిబ్బంది ఉన్నారు. ఉదయం ప్రిపరేషన్.. రాత్రి చోరీలు● అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు ● పోలీసులకు చిక్కిన యువకుడు హసన్పర్తి : ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలకు సిద్ధమవుతూనే మరో వైపు రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు శనివారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎస్.రవికుమార్ మాట్లాడారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సెండే అరుణ్కుమార్ మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఓ ఏడాదిపాటు ఇంట్లోనే ఖాళీగా గడిపాడు. 2024లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధం కావడానికి హనుమకొండకు వచ్చి అద్దె గది తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతూ బెట్టింగ్కు బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గోపాలపురం, భీమారం ఏరియాల్లో తాళాలు వేసి ఉన్న 10 ఇళ్లలో రాత్రి వేళ చోరీలకు పాల్పడ్డాడు. పెగడపల్లి డబ్బాల వద్ద గుర్తు తెలియని వాహనంపై పారిపోతుండగా పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది నిందితుడిని పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.56,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఎస్సై శ్రీకాంత్, నవీన్కుమార్తో పాటు పోలీస్ సిబ్బంది అహ్మద్ పాషా, రాజశేఖర్, జితేందర్, సీసీఎస్ సిబ్బంది మధు, చందును పోలీస్ ఇన్స్పెక్టర్ అభినందించారు. -
కంపెనీ పనులు త్వరగా పూర్తి చేయాలి
గీసుకొండ : యంగ్వన్ కంపెనీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తిని పెంచాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని దక్షిణ కొరియా యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ కిహాక్సంగ్ పేర్కొన్నారు. శనివారం గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)లో దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పనులను ఆ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. కంపెనీలో టీషర్టులు, ట్రాక్సూట్లు, జర్కిన్లు, క్రీడా దుస్తులు, బూట్లు తదితర వస్తువులు తయారు చేయడానికి ఆరు షెడ్లను నిర్మిస్తున్నారని చెప్పారు. యూనిట్–1లో చేపట్టిన ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆయన మధ్యాహ్నం 12:30 గంటలు తిరుగు పయనమయ్యారు. కంపెనీ వైస్ చైర్మన్ మిన్షుక్, డైరెక్టర్లు షాహజాన్, సుభ్యసాచి చౌదరి, దిలీప్, ఇండియా హెడ్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎస్ భూమిడిపాటి, ఫైనాన్స్ హెడ్ ఆశిష్ అగర్వాల్, హెచ్ఆర్ సురేశ్, అడ్మిన్ మేనేజర్ కృష్ణమూర్తి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, మొగసాని సంపత్ తదితరులు ఉన్నారు. ఉత్పత్తి పెంచి, ఉద్యోగ నియామకాలు చేపట్టాలి యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్ కిహాక్ సంగ్ -
పురాతన వస్తువులు.. వరదపాలు
హన్మకొండ కల్చరల్ : చరిత్రకు అర్థం చెప్పడానికి, సంరక్షించడానికి, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గతం గురించి లోతైన అధ్యయనానికి ఉపయోగపడే వెలకట్టలేని అపురూపమైన పురాతన వస్తువులు, కళాఖండాలు వరదపాలయ్యాయి. మూడ్రోజుల క్రితం మహానగరాన్ని ముంచెత్తిన వరదలో వరంగల్ హంటర్రోడ్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠం వరదనీటితో ముంపునకు గురైంది. పీఠం గ్రౌండ్ఫ్లోర్లోని మ్యూజియం మునిగి పోవడంతో 30ఏళ్ల నుంచి సేకరించిన పురాతన వస్తువులు, కళాఖండాలు నీటిలో మునిగిపోవడంతో వాటిని సేకరించిన పీఠం సిబ్బంది ఆవేదన చెందారు. అరుదైన జానపదులు, గిరిజనులు ఉపయోగించిన పురాతన చారిత్రక వస్తువులు, కళాఖండాలు, పూర్వకాలంలో ఉపయోగించిన లోహ, చెక్క సంబంధించిన వంట, ఇంటి సామగ్రి, పనిముట్లు తదితర విలువైన వస్తువులు రెండ్రోజుల పాటు నీటిలో ఉండటంతో పనికి రాకుండా పోయాయి. 2023 జూన్, జూలైలో వచ్చిన అధిక వర్షాల వల్ల ఏర్పడిన వరదలతో పీఠంలోని మ్యూజియం మునిగిపోయింది. దీంతో సగం పైగా వస్తువులు తడిసిపోయాయి.. సిబ్బంది చొరవతో మిగిలిన వస్తువులను శుభ్రపరిచి క్రమపద్ధతిలో అమర్చి భద్రపరిచారు. ప్రస్తుతం మూడ్రోజుల నుంచి ముంపునకు గురికావడంతో పరిశోధకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గుర్తించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి సేకరించిన వస్తువులు పనికి రాకుండాపోవడం బాధాకరమని గిరిజన విజ్ఞానపీఠం అధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న పేర్కొన్నారు. పీఠానికి కళాభరణంగా ఉండే మ్యూజియాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.● ముంపునకు గురైన మ్యూజియం ● నీట మునిగిన జానపద గిరిజన విజ్ఞానపీఠం -
క్రీడల సక్సెస్లో పీఈటీలే కీలకం
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాపోటీల నిర్వహణ సక్సెస్ కావాలంటే వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నిర్వహిస్తున్న అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు క్రీడలు చాలా అవసరమని పేర్కొన్నారు. హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని అన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్ మాట్లాడుతూ.. మూడ్రోజుల పాటు అండర్–14,17,19 బాలబాలికల విభాగంలో జిమ్నాస్టిక్స్ పోటీలు, అండర్–17 బాలబాలికల విభాగంలో జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.పార్థసారథి, ఎ.ప్రభాకర్రెడ్డి, డి.కుమార్, సీహెచ్ పెద్దిరాజు, సురేష్బాబు, వి.రాణి, ఎస్.శ్రీలత, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సుభాష్, రవీంద్రప్రసాద్, సురేష్, దేవేందర్, కిషన్, సుమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 3, 4 తేదీల్లో ఎస్జీఎఫ్ క్రీడలు హనుమకొండలోని జేఎన్ఎస్లో ఈ నెల 3, 4 తేదీల్లో అండర్–19 బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన క్రికెట్, నెట్బాల్, సాఫ్ట్బాల్, లాన్టెన్నీస్, క్యారం, సెపక్తక్రా, స్కాష్, స్కేటింగ్, 4వ తేదీన ఖోఖో ఎంపికలు ఉంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు ఉదయం 9గంటలకు జేఎన్ స్టేడియం వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి -
అతివేగానికి నిండు ప్రాణం బలి
మరిపెడ రూరల్ : అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. శుభకార్యంలో క్యాటరింగ్ చేసేందుకు బొలెరో వాహనంలో 25 మంది యువకులు వెళ్తుండగా అతివేగంతో ఆ వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్పురం శివారు పత్తి మిల్లు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. మరిపెడ మండలంలోని లచ్చతండా, సీరోలు మండలం ఉప్పరగూడెం గ్రామాలకు చెందిన 25 మంది యువకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి క్యాటరింగ్ చేసేందుకు బొలెరో వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారి మలుపు వద్ద అతివేగంతో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో ఉప్పరగూడెం గ్రామ పరిధిలోని తండాకు చెందిన మాలోత్ పవన్ (20), మాలోత్ సందీప్, బానోత్ ఈశ్వర్, మరిపెడ మండలం లచ్చతండాకు చెందిన గుగులోత్ లక్ష్మణ్ (డ్రైవర్), గుగులోత్ కుమార్తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మహబూబాబాద్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాలోత్ పవన్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి మానసిక దివ్యాంగుడు కాగా కుటుంబ పోషణ నిమిత్తం పవన్ వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటున్నాడు. కానీ శనివారం మిత్రులతో కలిసి క్యాటరింగ్ పనికి వెళ్తుండగా ఘటన జరిగి పవన్ మృత్యువాత పడ్డాడని బంధువులు రోదిస్తూ తెలిపారు. అదుపు తప్పి బొలెరో వాహనం బోల్తా చికిత్స పొందుతూ యువకుడి మృతి, 9 మందికి తీవ్ర గాయాలు బుర్హాన్పురం శివారులో ఘటన -
బడికి పోతే బతికేటోడివి బిడ్డో..
సంగెం : మరో రెండ్రోజుల్లో హాస్టల్కు వెళ్తాడనుకుంటే అంతలోనే తుపాన్తో నానిన గోడ కూలి బాలుడు మృత్యువాత పడిన విషాద ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వేల్పుల మౌ నిక, సాంబరాజు దంపతులకు కూతురు దివ్యశ్రీ, కుమారుడు నవదీప్ (10)లు సంతానం. పేద కు టుంబానికి చెందిన సాంబరాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నవదీప్ కొ మ్మాలలోని ఏలోహీమ్ ప్రైవేట్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. ఇటీవల జనగామలోని తె లంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నవదీప్కు సీటు వచ్చింది. సోమవారం గురుకుల హాస్టల్కు పంపిస్తామని స్కూల్కు పంపించకుండా వారం రోజులుగా ఇంటి వద్దనే ఉండనిచ్చారు. శని వారం నవదీప్ ఇంటి సమీపంలోని దుకాణానికి తినుబండరాలు కొనుక్కొనేందుకు ఒక్కడే వెళ్తున్నాడు. అయితే ఇటీవల వర్షాలు, తుపాన్ కారణంగా నాని బలహీనపడిన బన్న రమేశ్కు చెందిన బా త్రూం గోడ ఒక్కసారిగా కూలి నవదీప్ భుజాలు, తలపై పడింది. దీంతో నవదీప్ తల పగిలి చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. హుటాహుటిన ఎంజీఎంకు తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లు తెలిపారు. కాగా బడికి వెళ్తే బతికేవాడివి కొడుకా అంటూ నవదీప్ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరుల గుండెలను పిండేశాయి. బాలుడి తాత లచ్చయ్య ఫిర్యాదు మేర కు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. ● బాత్రూం గోడ కూలి బాలుడి మృతి ● చింతలపల్లిలో విషాద ఘటన -
కార్యదర్శి లేక చెల్లింపులు పెండింగ్
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి చెల్లింపులు నాలుగు రోజులుగా పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ మార్కెట్కు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. వరంగల్ మార్కెట్కు రెగ్యులర్ ఉన్నత శ్రేణి కార్యదర్శి లేక ఏడాది కావొస్తున్నా నియామకం చేపట్టలేదు. నర్సంపేట కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్నారు. మార్కెట్ పాలకవర్గం లేక అస్తవ్యస్తంగా తయారు కావడంతో ఆయన అక్టోబర్ 4వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో మరో మార్కెట్ కార్యదర్శికి గాని స్థానిక గ్రేడ్–2 కార్యదర్శుల్లో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. పక్క జిల్లాలోని ఓ మార్కెట్కు చెందిన కార్యదర్శి వరంగల్కు వచ్చేందుకు పైరవీలు చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఇన్చార్జ్ బాధ్యతల విషయాన్ని పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి కొండా సురేఖ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అప్పటి నుంచి కొనుగోళ్లు చేసిన పత్తిని మార్కెట్ కార్యదర్శి ధ్రువీకరిస్తేనే సీసీఐ అందుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. కార్యదర్శికి మళ్లీ 10రోజుల వరకు సెలవు పొడిగించినట్లు తెలిసింది. మార్కెట్ కార్యదర్శి లేకపోవడంతో వరంగల్, నర్సంపేట మార్కెట్ల పరిధిలోని ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు నిలిచిపోయాయి. నెల రాగానే ఈఎంఐలు, ఇతరత్రా చెల్లింపులు చేయాలంటే జీ తాల రాలేదని, కార్యదర్శి లేనందున జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు, పింఛన్దారులు వాపోతున్నారు. అలాగే సుమారు రూ.కోటి వరకు పత్తి రైతులకు సీసీఐ చెల్లించాల్సి ఉంటుందని, వేతనాలు, పింఛన్లు కలిపి సుమారు మరో రూ.2కోట్ల వరకు ఉంటాయని సమాచారం. ప్రభుత్వం వెంటనే ఈవిషయంపై చర్యలు తీసుకుని మార్కెట్కు ఉన్నత శ్రేణి కార్యదర్శిని నియమించాలని వ్యాపారులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోని అధికార పార్టీ నాయకులు పత్తి రైతులకు సుమారు రూ.కోటి బకాయిలు వేతనాలు, పింఛన్ల కోసం ఎదురుచూపులు -
రేపు ఎస్ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్
విద్యారణ్యపురి : ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ప్రత్యేక ప్రతిభా పరీక్ష సాట్ క్యూ ఎస్ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఎస్ఆర్ అకాడమీ చైర్మన్ వరదారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్ష ఇంటర్మీడియట్లో చేరబోయే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రం హనుమకొండలోని ఎస్ఆర్ ఎడ్యుసెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. సిలబస్ ఇలా ఉంటుందన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 10వ తరగతి స్థాయిలో మొత్తం 75 ప్రశ్నలు, ప్రతీ సబ్జెక్టుకు 25 మార్కులు ఉంటాయన్నారు. ఐఐటీ –జేఈఈ అండ్ నీట్లో కోచింగ్లో ప్రవేశం పొందే అర్హత ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ పరీక్షతో తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు ఉత్తమ స్కాలర్షిప్ అవకాశాలను పొందుతారన్నారు. పరీక్ష నమోదు కోసం విద్యార్థులు సమీపంలోని ఎస్ఆర్ బ్రాంచ్ లేదా 9642117378, 9154989356, 8886287456, 9154854700, 9642117330, 9642117830, 99642114698 నంబర్లలో సంప్రదించొచ్చని ఆయన తెలిపారు. -
గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
జఫర్గఢ్: రెండు రోజుల క్రితం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కోయినాచలం గ్రామ శివారులోని బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో గల్లంతైన యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడెపల్లికి చెందిన బరిగెల శివకుమార్ (ప్రేమికులు) బుధవారం రాత్రి బైక్పై జఫర్గఢ్ మండలం కోనాయిచలం వస్తుండగా మార్గమధ్యలో బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో పడ్డారు. చెట్టు కొమ్మల సాయంతో శివకుమార్ ప్రాణంతో బయటపడగా శ్రావ్య వరదలో కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం ఉదయం శ్రావ్య మృతదేహం నీటిపై తేలింది. గమనించిన పోలీసులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనాస్థలి వద్ద కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. -
విజిలెన్స్ అధికారులకు సహకరించాలి
హన్మకొండ: విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అక్టోబర్ 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం అడిషనల్ ఎస్పీ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో వివిధ ప్రభుత్వ శాఖల విజిలెన్స్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆయా శాఖల అధికారులు, పౌరులు తమ బాధ్యతగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సహకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలో అవకతవకలు, అవినీతి జరిగినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 14432కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేడు ఉదయం 6గంటలకు హనుమకొండ జేఎన్ఎస్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వాక్థాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొలని పిలుపునిచ్చారు. అనంతరం అధికా రులతో ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి.మల్లయ్య, ఇన్స్పెక్టర్లు బి.అనిల్కుమార్, కిశోర్, ట్రాన్స్ కోఇన్స్పెక్టర్ ఎం.డి.షాదుల్లా, ఏఓ ఎ.శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఎ.గౌతం, తహసీల్దార్లు లక్ష్మణ్, భాస్కర్, ఇంజనీర్లు విద్య, శ్రీనివాస్ నాయక్, మల్సూర్, యూనియన్ బ్యాంక్ విజిలెన్స్ ఆఫీసర్ కార్తీక్, టీజీఎస్ ఆర్టీసీ, ట్రాన్స్కో, కేటీపీఎస్, సివిల్ సప్లై, జీడబ్ల్యూఎంసీ, అటవీ శాఖ, డీసీసీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఏపీజీవీబీ, రవాణా శాఖ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రావు -
టీజీ ఎన్పీడీసీఎల్కు రూ.10 కోట్ల నష్టం
హన్మకొండ: మోంథా తుపాను ప్రభావంతో టీజీ ఎన్పీడీసీఎల్కు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ డివిజన్ పరిధిలోని నీట మునిగిన గోపాల్పూర్, యాదవనగర్ సబ్ స్టేషన్లను సందర్శించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎక్కడ విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని భారీ వర్షంలోనూ రేయింబవళ్లు పని చేసి సరఫరా పునరుద్ధరించామన్నారు. ఇప్పటి వరకు నీట మునిగిన 249 ట్రాన్స్ఫార్మర్లలో 246 పునరుద్ధరించామని, నీట మునిగిన 8 సబ్ స్టేషన్లలో 6 పునరుద్ధరించా మని, మిగతా 2 సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ వి ద్యుత్ సరఫరా అందించామని వివరించారు. 33 కే వీ ఫీడర్లు 44 ప్రభావితం కాగా 44 పునరుద్ధరించా మని,11 కేవీ ఫీడర్లు 116ల్లో సమస్యలు తలెత్తగా పరిష్కరించామన్నారు. 428 స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. తరచూ నీట మునిగే సబ్ స్టేషన్లను మా ర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం హనుమకొండ 100 ఫీట్ రోడ్లోని ప్రగతి నగర్ కాలనీ, మచిలీ బజార్ సెక్షన్ కాపు వాడలో జరుగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ డి.ఈ సాంబరెడ్డి, ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈ దర్శన్ కుమార్, ఎ.డి.ఈ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షంలోనూ వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
మిన్నంటిన రోదనలు..
ఎంజీఎం/ కురవి : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారితోపాటు చికిత్స పొందుతున్న వా రిని చూసి గుండెలవిసేలా రోదించారు. హనుమకొండ–సిద్దిపేట ప్రధాన రహదారిపై హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో గురువారం అర్ధరాత్రి పెళ్లి వాహన్నాన్ని (బొలెరో) బోర్వెల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు రెడ్డబోయిన స్వప్న(15) అక్కడికక్కడే, రెడ్డబోయిన కళమ్మ(55), శ్రీనాథ్ (7) ఎంజీఎంలో చికిత్స పొందు తూ మృతి చెందారు. మిగతా 20 మందిలో 10మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని ఎంజీఎం తీసుకొచ్చారు. ఇందులో వృద్ధురాలు అనసూర్య, చిన్నారులు శివకుమా ర్, అక్షిత, సంజన, మారుతి చికిత్స పొందుతున్నా రు. మరో ఐదుగురు క్షతగాత్రులు ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. దీంతో బాధితులు ఎంజీఎం ఆస్పత్రిలో తమ వారిని చూసుకుని కన్నీరుమున్నీరుగా విలపించా రు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా పాలమాకుల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుటుంబం, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్పల్లికి చెందిన యువతితో కురవి లో మూడు రోజుల క్రితం వివాహం జరిపించారు. వధూవరులను తీసుకొని కుటుంబీకులు, బంధువులు బొలెరోలో తిరుగు ప్రయాణమయ్యారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారు ప్రాంతానికి చేరుకున్న సమయంలో కొందరు వాహనం దిగారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బోర్వెల్ వ్యాన్.. బొలెరోను ఢీకొంది. ఈ ఘటనలో స్వప్న అక్కడిక్కడే మృతి చెందగా, కళమ్మ, శ్రీనాథ్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదుగురు క్షతగ్రాతులు ఎంజీఎంలో, మరో ఐదుగురు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యాయం చేయాలని ధర్నా.. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్షతగాత్రుల బంధుమిత్రులు ఎంజీఎం ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమయానికి అక్కడికి చేరుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్కు ఘటనను వివరించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతర ఎమ్మెల్యే.. వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్నారేతో కలిసి పోస్టుమార్టం గది ఉన్న మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.రోడ్డు ప్రమాద మృతులకు ఎంజీఎంలో పోస్టుమార్టం చికిత్స పొందుతున్న ఐదుగురు గుండెలవిసేలా రోదించిన బాధితులు న్యాయం చేయాలని ఆందోళన పరామర్శించిన వరంగల్ పోలీసు కమిషనర్, డోర్నకల్ ఎమ్మెల్యే క్షతగాత్రులను పరామర్శించిన వరంగల్ పోలీసు కమిషనర్..వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్న అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
పోక్సో కేసులో యువకుడికి 25 ఏళ్లు జైలు
మహబూబాబాద్ రూరల్ : పోక్సో కేసులో నేరం రుజువుకావడంతో ఓ యువకుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి టి.దేవా కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2018 నవంబర్ 1వతేదీన రాత్రి 10 గంటలకు కనిపించకుండా పోయింది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసముద్రం పోలీస్ స్టేషన్లో అప్పటి ఏఎస్సై వెంకటాద్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా విచారణ అధికారులుగా అప్పటి ఎస్సై బి.సతీశ్, మహబూబాబాద్ రూరల్ సీఐలు లింగయ్య, వెంకటరత్నం విచారణ అధికారులుగా వ్యవహరించారు. అప్పటి రూరల్ సీఐ జె.వెంకటరత్నం.. బాలిక కనిపించకుండాపోయిన ఘటనకు సంబంధించి కేసముద్రం మండలం కల్వల శివారు వెంకట్రాం తండాకు చెందిన భూక్య శ్రీనును అరెస్ట్ చేశారు. అప్పటి డీఎస్పీ నరేశ్ కుమార్ విచారణ అనంతరం కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సాక్షులను ప్రస్తుత డీఎస్పీ ఎన్.తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సీఐ పి.సర్వయ్య, కోర్టు లైజనింగ్ అధికారి, ఎస్సై జీనత్ బ్రీఫింగ్ ఇవ్వగా ప్రస్తుత కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారులు అశోక్ రెడ్డి, దేవా సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటయ్య వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ.. శ్రీనుకు 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పనికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు.. ● మొక్కజొన్న మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి ఇద్దరు కూలీలు మృతి ● ఏనుగల్లు శివారులో ఘటన పర్వతగిరి: పనికి వెళ్లొస్తూ ఇద్దరు కూలీలు తిరిగిరాని లోకాలకు చేరారు. మొక్కజొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు మాల్య తండాలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కథనం ప్రకారం.. మండలంలోని పంచరాయితండాకు చెందిన బానోత్ రాములు(57), బానోత్ హర్లా(48)తోపాటు మరికొంతమంది కూలీలు మొక్కజొన్న మిషన్లో పని చేయడానికి ఏనుగల్లు వెళ్లారు. పని పూర్తయిన అనంతరం అదే ట్రాక్టర్(నెంబర్ ప్లేట్ లేని)కు అమర్చిన మొక్క జొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్పై రాములు, హర్లా కూర్చున్నారు. ఈ క్రమంలో మాల్యాతండాకు చేరుకోగా ట్రాక్టర్కు ఉన్న బోల్డ్ ఊడడంతో ఇద్దరు కిందపడ్డారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన హర్లా అక్కడికక్కడే మృతి చెందాడు. రాములును హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై రాములు కుమారుడు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, తెలుగు సినీ దర్శకుడు వంగ సందీప్రెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. అర్చకులు భద్రకాళి శేషు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వరరావులు.. దర్శకుడు సందీప్రెడ్డికి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. సాయంత్రం దేవాలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది. -
వరద నష్టం రూ.200కోట్లు
సాక్షి, మహబూబాబాద్: మోంథా తుపానుతో జిల్లా అతలాకుతలమైంది. చేతికొచ్చిన పంటలు నీట ము నిగాయి. చెరువులు, కాల్వలు తెగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఈ నష్టం రూ.200కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అయితే కొండంత నష్టం జరిగితే ప్రభుత్వ అధికారులు మాత్రం తక్కు వ అంచనాలు వేస్తున్నారని, రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తెగిన చెరువులు, రోడ్లు.. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు జిల్లాలోని 159 చెరువులు కుంటలు తెగిపోయాయి. వాటిని తాత్కాలిక మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండేలా చేశారు. మరికొన్ని చెరువులు మరమ్మతులకు నోచుకోలేదు. మోంథా తుపానుతో జిల్లాలోని చిన్ననాగారం, మునిగలవీడు, బలపాల ప్రాంతంలో కాల్వలు తెగిపోయాయి. కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలోని బర్లవానిచెరువు, పెరుమాండ్ల సంకీస రెడ్డి చెరువు, ఉయ్యాలవాడ ఊర చెరువు తెగిపోయాయి. డోర్నకల్ మండలం రావిగూడెం కొత్తకుంట, కురవి మండలం నేరడ పెద్ద చెరువు, మరిపెడ మండలం నీలికుర్తి గ్రామంలోని పెద్ద సముద్రం చెరువులకు గండ్లుపడ్డాయి. ఇలా జిల్లాలో మొత్తం 11 చెరువులు, కాల్వలు వర్షంతో దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతు చేసేందుకు రూ. 12.3లక్షలు, శాశ్వత పనులు చేసేందుకు 63.5లక్షల ఖర్చు అవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనాలు వేశారు. అదే విధంగా జిల్లాలో ఇప్పటికే ఆర్అండ్బీ రోడ్లు గుంతల మయంగా ఉన్నాయి. గత ఏడాది నుంచి వీటిని మరమ్మతులు చేసిన వారు లేరు. ప్యాచ్ వర్క్ పేరుతో కొన్ని ప్రాంతాల్లో పనులు చేసినా.. అవి ౖపైపెనే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షాలకు జిల్లాలోని రోడ్లు దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నిచోట్ల ఇంకా ప్రవాహం తగ్గకపోవడం, ఇంకా అంచనాలు వేయలేదు. దెబ్బతిన్న పంటలు.. వానాకాలం సీజన్లో 3,59,774 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో అత్యధికంగా 2.10లక్షల ఎకరాల్లో వరి, 64వేల ఎకరాల్లో మొక్కజొన్న, 82వేల ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. ఇందులో మోంథా తుపానుతో సుమారు లక్ష ఎకరాలకుపైగా పంట నష్టం జరిగిందని రైతు సంఘాల నాయకులు చెబు తున్నారు. కానీ, అధికారులు మాత్రం 10,422 మంది రైతులు సాగు చేసిన 16,617 ఎకరాల వరి, 35మంది రైతుల 65 ఎకరాల మొక్కజొన్న, 4,807 మంది రైతుల 8,782 ఎకరాల పత్తి, 350 మంది రైతులు సాగుచేసిన 565 ఎకరాల్లో మిర్చి.. మొత్తంగా 15,614 మంది రైతులు సాగుచేసిన 26,029 ఎకరాల్లో మాత్రమే పంటలు నీట మునిగాయని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ఈ నష్టం ఎక్కువగా ఉందని మొత్తం రూ.150కోట్ల మేరకు పంటనష్టం జరిగిందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. నీట మునిగిన పంటలు తెగిన చెరువులు, రోడ్లు అంచనాలు తయారు చేస్తున్న అధికారులు -
15 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్ప్రెస్
డోర్నకల్: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ 15 గంటలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాలతో గత బుధవారం డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రాక్ నీట మునగడంతో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్ నుంచి వెనుకకు వెళ్లి నడికుడి మీదుగా ఆలస్యంగా తిరుపతికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలో అదే రైలు ఆదిలాబాద్కు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో గురువారం సాయంత్రం 3.19 గంటలకు రైలు డోర్నకల్కు రావాల్సి ఉండగా సుమారు 15 గంటల ఆలస్యంగా శుక్రవారం ఉదయం 6.30లకు చేరుకుంది. రైతులు పంటలు నమోదు చేసుకోవాలిబయ్యారం: వానాకాలంలో వరిసాగు చేసిన రైతులు ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ఏఈఓ ద్వారా పంటలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల సూచించారు. మండలంలోని గంధంపల్లి–కొత్తపేట సమీపంలోని వరి పొలాలను శుక్రవారం ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓ రాజు, ఏఈఓలు నాగరాజు, అఖిల్, రైతులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని 22 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల బోధన కోసం ఉపాధ్యాయ, ఆయా పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పి.దక్షిణామూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పోస్టుకు కనీస ఉత్తీర్ణత కలిగి ఉండాలని, టీచర్ పోస్టుకు ఇంటర్, టీటీసీ అర్హత కలిగి ఉండాలన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. ఆయాకు నెలకు రూ.6 వేలు, టీచర్కు రూ. 8 వేల వేతనం అందిస్తామన్నారు. ఈ వేతనం పాఠశాలలు కొనసాగిన పది నెలలు మాత్రమే ఉంటుందన్నారు. దరఖాస్తులు నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు మండల, విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంతొర్రూరు: కార్మికుల హక్కులు కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకువస్తోందని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు అన్నారు. డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమ భిక్షపతితో కలిసి విశ్వేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలన్నారు. ఏఐటీయూసీ 9 దశాబ్దాలుగా కార్మికుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బందు మహేందర్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల ప్రభాకర్, నాయకులు ఘనపురం లక్ష్మణ్, పేరబోయిన కిరణ్, వెంకన్న, వీరన్న, చంద్రయ్య పాల్గొన్నారు. -
యువత పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్ : యువత సర్దార్ వల్ల భాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2కే రన్ నిర్వహించారు. విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనగా.. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శప్రాయుడని, ఐకమత్యంతో ఏదైనా సాధ్యం అవుతుందని నిరూపించారన్నారు. అనంతరం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభా య్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, మెరుగైన సమాజం కోసం ఆయన చూపిన మార్గాన్ని అ నుసరించాలన్నారు. కాగా మానుకోట టౌన్ పోలీ స్స్టేషన్ నుంచి ప్రారంభమైన రన్ ఎన్టీఆర్ స్టేడి యం వద్ద ముగిసింది. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎస్పీలు తిరుపతిరావు, శ్రీనివాసరావు, విజయప్రతాప్, మో హన్, సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య ఉన్నారు. -
వరద ప్రభావిత బాధితులకు సీఎం పరామర్శ, భరోసా..
ఏరియల్ సర్వే తర్వాత హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు రోడ్డుమార్గాన మొదట సమ్మయ్య నగర్కు చేరుకున్నారు. వరద ప్రభావంతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి స్థానికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జరిగిన నష్టంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు. అక్కడే నాలా వంతెన వద్ద వరదకు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరదతో జరిగిన నష్టాన్ని పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి వివరించారు. అదేవిధంగా కాపువాడలో వరద ప్రభావం బారిన పడిన బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోతన నగర్లో వరద ముంపు బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. -
రైతుల సంక్షేమమే లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతులు పండించిన పత్తి పంటను తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సూచించారు. మహబూబాబాద్ మున్సి పాలిటీ పరిధి బేతోలు గ్రామ శివారు సాయి శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్ వద్ద సీసీఐ పత్తి కొనుగొళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను అర్థం చేసుకుని, సరైన మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతులకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందన్నారు. ఏఎ ంసీ చైర్మన్ సుధాకర్, డైరెక్టర్లు వెంకన్న, మల్ల య్య, డీఎంఓ వెంకటేశ్వర్లు, ఏఎంసీ కార్యదర్శి సుజన్ బాబు, వీరభద్రం, లక్ష్మీనారాయణ, రామరాజు, నరసింహారావు, గిరిధర్ గుప్తా, శ్రీనివాస్, యా కన్న, పాషా, దిలీప్ పాల్గొన్నారు. కేసముద్రంలో.. కేసముద్రం: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మురళీనాయక్ అ న్నారు. శుక్రవారం కేసముద్రం మార్కెట్లో సీసీ ఐ కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం మార్కెట్లో ధాన్యం ఆరబోత యంత్రాన్ని ప్రారంభించారు. ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభా య్పటేల్ జయంతి సందర్భంగా చిత్రపటా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్పనపల్లి గ్రామంలో వరద బాధితులకు ఐదు క్వింటాళ్ల బియ్యం అందజేశారు. మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, నాగేశ్వర్రావు,అమరలింగేశ్వరరావు ఉన్నారు.● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ● పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
ఆక్రమణలపై ఉక్కుపాదం
● ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు ● వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం● చెరువులు, నాలాల ఆక్రమణల వల్లే తరచూ నగరం ముంపు ● పది మంది స్వార్థం.. వేల ఇళ్ల మునకకు కారణం.. ● స్మార్ట్ సిటీ నిధులను సద్వినియోగం చేయండి.. ● అధికారులకు సీఎం దిశానిర్దేశం ● వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే ● ముంపు కాలనీల వాసులకు పరామర్శ ● హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని, చెరువులు, నాలాల ఆక్రమణలు కూడా ముంపునకు కారణాలని, ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలతో జరిగిన పంటలు, ఆస్తి, ప్రాణనష్టాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో జిల్లాల కలెక్టర్లు సమీక్ష నిర్వహించి ఆ నివేదికలను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలని సూచించారు. చెరువులు, నాలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. మోంథా తుపాను వరదలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ హాల్లో ముఖ్యమంత్రి.. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలి సి రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అధికా రులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో జరిగిన నష్టం అంచనాపై ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై నిర్ధిష్ట నమూనాలో అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు. శాశ్వత పరిష్కారం చూడాలి.. ఆక్రమణలు తొలగించాలి.. వరంగల్ నగరం ముంపుపై శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని, అన్ని విభాగాల అధికారులు కలిసి పనిచేయాలన్నారు. నాలాల కబ్జాలను తొలగించాల్సిందేనని.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దన్నారు. దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని, ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో ఒక కో–ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలని, వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైందని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాగా, హనుమకొండ, వరంగల్ జిల్లాలు, గ్రేటర్ వరంగల్లో నష్టాన్ని ముఖ్యమంత్రి, మంత్రులకు కలెక్టర్లు స్నేహ శబ రీష్, డాక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్పాయ్లు వివరించారు. సమీక్షలో మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు కావ్య, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, రాష్ట్రస్థాయి అధికారులు, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్, మహబూబాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు అద్వైత్కుమార్ సింగ్, రిజ్వాన్ బాషా అధికారులు పాల్గొన్నారు. -
వర్షార్పణం..
సాక్షి,మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్:మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచాయి. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలగా.. పత్తి, పసుపు, మిరప పంటలు నీట మునిగాయి. కొన్నిచోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని పలు వాగుల ఉధృతితో పరివాహక పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందే సమ యంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వరద నీటిలోనే పొలాలు.. జిల్లాలో చాలాచోట్ల వరి పంటలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. దీంతో ధాన్యం తడిసి మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సాగు చేసిన పంటలు అధిక వర్షాలు, వాగుల ఉధృతికి పూర్తిగా కోల్పోయి అప్పుల పాలయ్యామని, ప్రస్తుతం వరి పంట చేతికి అందివచ్చే సమయానికి తుపాను నిండా ముంచిందని రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. 15,614 మంది రైతులు.. 26,029 ఎకరాల్లో పంటలకు నష్టం.. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 10,422 మంది రైతులకు చెందిన 16,617 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అలాగే 4,807 మంది రైతులకు సంబంధించి 8,782 ఎకరాల్లో పత్తి, 350మంది రైతులకు చెందిన 565 ఎకరాల మిర్చి, 35మంది రైతుల మొక్కజొన్న 65 ఎకరాలు ముంపునకు గురైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మొత్తంగా 15,614 మంది రైతులకు సంబంధించిన అన్ని రకాల పంటలు 26,029 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు వాటిల్లిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనా నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు.జిల్లాలో ముంపునకు గురైన పంటలు(ఎకరాలలో) మోంథా తుపాను తాకిడికి దెబ్బతిన్న పంటలు నేలవాలిన వరి, మొక్కజొన్న.. నీట మునిగిన పత్తి, మిరప చేలు 26,029 ఎకరాల్లో నష్టంమండలం వరి మిర్చి పత్తి బయ్యారం 2,488 – 192 గంగారం 180 – – గార్ల 550 30 100 గూడూరు 980 80 190 ఇనుగుర్తి 600 30 – కేసముద్రం 1,240 95 – కొత్తగూడ 1,380 – – మహబూబాబాద్ 860 40 100 నెల్లికుదురు 950 100 – చిన్నగూడూరు 210 – 250 దంతాలపల్లి 1,050 – 1,300 డోర్నకల్ 1,135 190 1,430 కురవి 800 – 950 మరిపెడ 500 – 1,550 నర్సింహులపేట 418 – 950 పెద్దవంగర 1,546 – 100 సీరోలు 950 – 850 తొర్రూరు 780 – 820 -
ఎక్కడి బస్సులు అక్కడే..
నెహ్రూసెంటర్: భారీ వర్షంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగడంతో ఆర్టీసీ బస్సులు గురువారం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహబూబాబాద్ డిపో నుంచి ప్రధానంగా ఖమ్మం, ఇల్లెందు, సూర్యాపేట, నర్సంపేట, హనుమకొండ, భద్రాచలం, హైదరాబాద్, తొర్రూరు ప్రాంతాలకు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందుతున్నాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు ఉప్పొంగడంతో నర్సంపేట–వరంగల్, కేసముద్రం–వరంగల్, కురవి–ఖమ్మం, మహబూబాబాద్–తొర్రూరు రూట్లలో పూర్తిగా బస్సులను నిలిపివేశారు. మానుకోట– సూర్యాపేట, మానుకోట–ఇల్లెందు, మానుకోట–భద్రాచలం రూట్లలో బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తుపాను వల్ల వాగులు, వంకలు పొంగడం, బస్సులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు 2కే రన్ మహబూబాబాద్ రూరల్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6:45 గంటలకు 2కే రన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి నెహ్రూ సెంటర్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, అండర్ బ్రిడ్జి, ఎఫ్ఆర్ఓ సెంటర్, వివేకానంద సెంటర్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద 2కే రన్ ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల యువతి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు. దేశ ఐక్యత, సమగ్రతకు గుర్తుగా జరుపుకునే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికా రులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని దేశ ఏకతా స్ఫూర్తిని మరింత బలపరచాలని కోరారు. విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలి గూడూరు: ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విద్యుత్ అంతరాయాలను గుర్తించి వెంటనే పునరుద్ధరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. మోంథా తుపాను ప్రభావంతో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. గురువారం విద్యుత్ పునరుద్ధరణ పనులను సీఎండీ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఈ పి. విజయేదర్రెడ్డి, డివిజన్ ఇంజనీర్ హీరాలాల్, ఏడీఈ కె.కవిత, సబ్ ఇంజనీర్ లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్ష ఫీజును రద్దు చేయాలి మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు రూ.125ను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిగా రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్, ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.వీరునాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ దక్షిణామూర్తికి పదో తరగతి పరీక్షల ఫీజును రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్, వీరునాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులే చదువుతున్నారని, రూ.125 చెల్లించకపోతే కుల, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని రావాలని అధికారులు చెబుతున్నారని, వాటికి రూ. 500 నుంచి రూ.1000 ఖర్చు అవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో ఫీజును రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శివనాయక్, జిల్లా అధ్యక్షులు భధ్రునాయక్, మద్దెల వీరస్వామి, జిల్లా నాయకులు శ్రీనివాస్, పర్వతాలు, యాకోబు నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
స్తంభించిన జనజీవనం
● జలదిగ్బంధంలో మానుకోట ● రాకపోకలకు అంతరాయంమహబూబాబాద్,/మహబూబాబాద్ అర్బన్: భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మోంథా తుపానుతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో మానుకోట నుంచి పలు నగరాలు, పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మానుకోట నుంచి నర్సంపేట, వరంగల్, కేసముద్రం, ఖమ్మం, తొర్రూరుకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు, వాహనదారులు, ఉద్యోగస్తులు పలు గ్రామాలకు వెళ్లలేకపోయారు. కాగా, మానుకోటలోని పలు కాలనీలు జలదిగ్బంధం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నిలిచిన రాకపోకలు.. భారీ వర్షంతో మానుకోట నుంచి నర్సంపేట వరంగల్, గూడూరు, కొత్తగూడకు, మానుకోట నుంచి కేసముద్రం, మానుకోట నుంచి నెల్లికుదురు, తొర్రూరుకు రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు జాతీయ రహదారిపై నుంచి పొంగిపొర్లడంతో పాటు చెరువులు మత్తళ్లు దూకడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మున్నేరువాగు పొంగడంతో మానుకోట–గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్ల వాగు ఉధృతితో మానుకోట–కేసముద్రం మధ్య పోలీసులు కొంతసమయం రాకపోకలను నిలిపివేశారు. అనంతరం వాహనాలను దగ్గర ఉండి జాగ్రత్తగా పంపించారు. జిల్లా కేంద్రం కురవి రోడ్డులోని బంధం చెరువులో నీటిమట్టం పెరిగి, ఆ చెరువు పక్కనే ఉన్న రోడ్డు కొంతభాగం కొట్టుకుపోయింది. అయితే రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు. రెండోరోజు అప్రమత్తం.. వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఇటు రెవెన్యూ, అటు పోలీస్ అధికారులు, సిబ్బంది గురువారం ఉదయం 5 గంటల నుంచి వాగుల వద్ద బందోబస్తు నిర్వహించారు. మున్నేరువారు వద్ద టౌన్ సీఐ మహేందర్రెడ్డి, రాళ్లవాగు సమీపంలో పోలీస్ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించారు. -
వాగులో దంపతుల గల్లంతు..
ఎల్కతుర్తి: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగు దాటుతుండగా దంపతులు బుధవారం రాత్రి గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్, కల్పన దంపతులు బైక్పై అత్తగారి ఇల్లు అక్కన్నపేటకు వెళ్తున్నారు. మల్లారం దగ్గర రోడ్డు దెబ్బతినడంతో మోత్కులపల్లి వైపునకు వెళ్తున్నారు. ఇక్కడ వాగు దాటే ప్రయత్నంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు చెరువు దగ్గర బైక్ కనిపించడంతో నంబర్ ద్వారా దంపతులను గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది వాగు, చెరువు పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
నివేదికలు అందజేయాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్: తుపాను ప్రభావంపై ప్రతీ రెండు గంటలకు ఒకసారి నివేదికలు అందజేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో తుపాను ప్రభావం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, తదితర అంశాలపై ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి సంబంఽధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వా గులు, చెరువుల్లో నీటి మట్టాలను గమనిస్తూ వివరాల ను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్స్యకార్మికులు వేటకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలి పరిశ్రమల శాఖ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్చేంజ్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (డీఐసీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ టీ ఫ్రైడ్ స్కీంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా యువతకు ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి కల్పించాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం శ్రీమన్నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
టీజీ ఎన్పీడీసీఎల్కు తీరని నష్టం..
హన్మకొండ: మోంథా తుపానుతో టీజీ ఎన్పీడీసీఎల్కు తీరని నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు కూలడంతోపాటు కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. వరద ఉ ధృతికి సబ్స్టేషన్లు , డిస్ట్రిబ్యూషన్ ట్రా న్స్ఫార్మర్లులు నీటమునిగాయి. సంస్థ పరిధిలో 428 స్తంభాలు దెబ్బతినగా 88 స్తంభాలను పునరుద్ధరించారు. 218 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తినగా 78 పునరుద్ధరించారు. 8 సబ్స్టేషన్ల్లో వరద నీరు చేరింది. 172 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 342 స్తంభాలు దెబ్బతినగా 75 పునరుద్ధరించారు. 205 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా 68 పునరుద్ధరించారు. 8 సబ్స్టేషన్లు నీట మునిగాయి. 162 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివరాలు సర్కిల్ దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగిన స్తంభాలు సబ్స్టేషన్లు హనుమకొండ 164 100 2 వరంగల్ 76 86 5 జనగామ 16 01 –– మహబూబాబాద్ 71 18 1 జేఎస్ భూపాలపల్లి 15 –– –– దెబ్బతిన్న విద్యుత్ లైన్లు నీటమునిగిన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు -
ముందస్తుగా అప్రమత్తం చేయాలి
● ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి ● వీసీలో సీఎం రేవంత్రెడ్డిమహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, లోలెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందస్తుగానే అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి గురువారం సీఎం రేవంత్రెడ్డి ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, వెంకట్రెడ్డి, కొండా సురేఖ, శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డితో కలిసి తుపాను ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండలస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
శ్రమించిన పోలీస్
● ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ ● సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు వరంగల్ క్రైం: మోంథా తుపాను సృష్టించిన విధ్వంసానికి గ్రేటర్ పరిధి ట్రైసీటీలోని పలు కాలనీలు అతలాకుతలం అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పోలీసులు అందిస్తున్న సేవలతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. హనుమకొండ పోలీసులు రాయపుర ప్రాంతంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు బాధితులకు టిఫిన్లు, వాటర్ బాటిళ్లు అందించారు. ములుగు రోడ్డులోని గాయత్రి కళాశాలలో చిక్కుకుపోయిన విద్యార్థినులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఓ వృద్ధుడిని స్ట్రెచర్ మీద తీసుకొచ్చి 108లో ఎంజీఎంకు తరలించారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
తొర్రూరు రూరల్: రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ డీఎం కృష్ణవేణి తెలిపారు. మండలంలోని నాంచారిమడూరు, వెలికట్ట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. డీఎం కృష్టవేణి మాట్లాడుతూ.. అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే నగదు జమ చేస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్నారు. రైతులు అధైర్యపడొద్దని సూచించారు. -
అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు
నెహ్రూసెంటర్: ఆర్టీసీ, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు ఉద్యమాల్లో ముందుండి కార్మికుల పక్షాన పోరాడిన వామపక్ష నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. పోరాట కేసుల్లో భాగంగా కోర్టుకు హాజరై వామపక్ష నాయకులు గురువారం అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తమపై అక్రమంగా కేసులు పెట్టినా ప్రజలు, కార్మికుల పక్షాన పోరాటాలు సాగిస్తామని తెలిపారు. స్వల్ప మెజారిటీతో నెగ్గిన బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని, రైతులు, కార్మికులే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి వామపక్ష నాయకులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో అజయ్సారథిరెడ్డి, తమ్మెర విశ్వేశ్వర్రావు, నల్లు సుధాకర్రెడ్డి, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, హెచ్లింగ్యా, చొప్పరి శేఖర్, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, వరిపెల్లి వెంకన్న, రాజమౌళి, అల్వాల వీరయ్య, నాగయ్య, ఉపేందర్, మఽధు, సాయిలు ఉన్నారు. -
‘మోంథా’తో మరోసారి ఉలిక్కిపడ్డాం..
మరిపెడ రూరల్: ‘మోంథా’ తుపానుతో మరోసారి ఉలిక్కిపడ్డామని ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలోని సీతారాంతండా ముంపు నిర్వాసితులు తెలిపారు. గతేడాది సీఎం రేవంత్రెడ్డి వచ్చి తమకు మరో చోట పునరావాసం కింద ఇళ్లు నిర్మించి ఇస్తానని మాట ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలలోని పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు బ్రిడ్జి సమీపంలో మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాగు ముంపు ప్రాంతమైన సీతారాంతండాలో ఉంటే ఎప్పటికై నా తమ ప్రాణాలు వాగులో కలిసిపోతాయని బోరుమన్నారు. గతేడాది జూన్లో వచ్చిన వరదలకు ముంపుకు గురై సర్వం కోల్పోయామన్నారు. దాతల సహకారంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మళ్లీ తుపాన్ వరదలతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. గతేడాది ఆకేరు వాగు వరదకు గురైన తమ తండాను సీఎం రేవంత్రెడ్డి సందర్శించి తమకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించార న్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించిన తమకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై వీరభద్రరావు, అదనపు ఎస్సై కోటేశ్వర్రావు, ఎంపీఓ సోమ్లానాయక్ ఘటనాస్థలికి చేరుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమింపజేశారు. సీతారాంతండా ముంపు నిర్వాసితులు ప్రభుత్వ హామీ మేరకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ 365 జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో -
7 గంటలపాటు రైళ్ల నిలిపివేత
కాజీపేట రూరల్ : హసన్పర్తి–వరంగల్ మధ్య రెండు రైల్వే లైన్లలో గురువారం ఏడు గంటలపాటు రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వడ్డేపల్లి బ్రిడ్జి వద్ద ట్రాక్ను వరద ముంచెత్తడంతో ముప్పు పొంచి ఉందనే సమాచారం గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు రైల్వే అధికారులకు వచ్చింది. దీంతో బ్రిడ్జి ట్రాక్ వద్ద డేంజర్ లెవెల్ క్రాసింగ్ జోన్గా ప్రకటించి ఉదయం 6:45 నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు రైళ్ల రాకపోలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో గూడ్స్ రైలును పంపించి ట్రాక్ను సరిచేసి సర్వీస్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో వయా వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే న్యూఢిల్లీ రైళ్లు అప్అండ్డౌన్లో రెండు లైన్లలో యథావిధిగా ప్రయాణిస్తున్నాయని అధికారులు తెలిపారు. డోర్నకల్ రైల్వే లైన్ క్లియర్తో.. డోర్నకల్ జంక్షన్లో ట్రాక్ సమస్య బుధవారం రా త్రి వరకు క్లియర్ కావడంతో కాజీపేట, వరంగల్ మీదుగా న్యూఢిల్లీ–విజయవాడ, హైదరాబాద్ మా ర్గాల్లో ప్రయాణించే రైళ్లు నిర్ణీత సమయం కన్నా ఆ లస్యంతో యథావిధిగా నడుస్తున్నాయని కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. దారి మళ్లించిన, రద్దు చేసిన రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని వారు పే ర్కొన్నారు. కాగా, వర్షానికి జలమయమైన రైల్వే డీజిల్కాలనీని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) గోపాలకృష్ణణ్ పరిశీలించారు. కోచ్ఫ్యాక్టరీ యూనిట్లోకి వరదనీరు.. కాజీపేట శివారులో నిర్మిస్తున్న కాజీపేట రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్లోకి వరద నీరు చేరుకుంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి వరద భారీగా చేరడంతో రైల్వే యూనిట్లో సికింద్రాబాద్ వైపు గల 300 అడుగుల పొడవు వరకు ప్రహరీ నే లమట్టమై కొట్టుకుపోయినట్లు రైల్వే అధికారులు గు రువారం తెలిపారు. అలాగే, వివిధ నిర్మాణాల్లోకి వ రద చేరడంతో మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వడ్డేపల్లి బ్రిడ్జి వద్ద ట్రాక్ను తాకిన వరద నీరు -
వరదలో ప్రేమజంట గల్లంతు
జఫర్గఢ్ : బైక్పై వస్తున్న ప్రేమజంట వరద ఉధృతిలో పడింది. కొట్టుకుపోతున్న క్రమంలో యువకుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణంతో బయటపడగా యువతి గల్లంతు అయ్యింది. ఈ ఘటన బుధవారం రాత్రి జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కోనాయిచలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క అలీసాబ్, పూర్ణ దంపతులు కొంతకాలంగా హైదరాబాద్లోని కోళ్ల ఫామ్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ఫామ్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన బరిగేల శివకుమార్ పనిచేస్తున్నాడు. అలీసాబ్, పూర్ణ దంపతుల రెండో కుమార్తె శ్రావ్య వరంగల్లోని ఓ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతూ ఇదే కళాశాల వద్ద హాస్టల్లోనే ఉంటోంది. అప్పుడప్పుడు తల్లిదండ్రుల వద్దకు వస్తున్న క్రమంలో శివకుమార్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో శ్రావ్య.. శివకుమార్ను కలిసేందుకు బుధవారం హైదరాబాద్ వెళ్లింది. కాగా, శ్రావ్యను తిరిగి వరంగల్లోని హాస్టల్లో చేర్చేందుకు సాయంత్రం బైక్పై ఇద్దరు బయలుదేరి జఫర్గఢ్ మండలం కోనాయిచలం వైపు వస్తున్నారు. అప్పటికే బోల్లమత్తడి కల్వర్టు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా బైక్తో సహా కొట్టుకుపోతుండగా శివకుమార్ చెట్టుకొమ్మల సాయంతో బయటపడ్డాడు. శ్రావ్య గల్లంతు అయ్యింది. గురువారం గల్లంతైన శ్రావ్య ఆచూకీ కోసం వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రామారావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు. -
ఉసురు తీసిన వరద..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘మోంథా’ తుపాను పలువురి ఉసురు తీసింది. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం ఏకధాటిగా భీకరంగా కురిసింది. దీంతో ప్రమాదశాత్తు వరద నీటిలో పడి కొందరు మృతి చెందగా, మరికొందరు ప్రవాహంలో గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంకొందరు రోజంత కురిసిన వానకు ఇంటి గోడలు నాని కూలి మీదపడడంతో మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. –సాక్షి నెట్వర్క్ వరంగల్: నగరంలోని 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో వరద నీటిలో పడి అడప కృష్ణమూర్తి (65) మృతి చెందాడు. బంధువుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుండడంతో అధికారులు శుభం గార్డెన్స్లో సహాయక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ఎస్ఆర్నగర్ వాసులంతా వెళ్లగా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బంధువులు వచ్చి చూడగా కృష్ణమూర్తి నీటిలో పడి మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు కాలనీ వాసులు తెలిపారు. గోడ కూలి గాజులగట్టులో వృద్ధురాలు .. గూడూరు: వర్షానికి గోడ కూలి మీదపడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోల రామక్క(80) బుధవారం రాత్రి ఇంట్లో గోడ పక్కన మంచంలో నిద్రిస్తోంది. ఈ సమయంలో వర్షం కురిసి గోడ నానింది. దీంతో గోడ శిథిలాలు ఒక్కసారిగా నిద్రిస్తున్న రామక్కపై పడడంతో మృతి చెందింది. ఈఘటనపై కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. గిరిధర్రెడ్డి తెలిపారు. కొండపర్తిలో మరో వృద్ధురాలు.. ఐనవోలు: భారీ వర్షంతో ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కొండపర్తిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గద్దల సూరమ్మ(58) ఒంటరి జీవనం గడుపుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఇంటి(పెంకుటిల్లు) గోడలు తడిశాయి. గురువారం తెల్లవారుజామున మంచంపై నిద్రిస్తున్న సూరమ్మపై పడడంతో ఆమె మృతిచెందింది. కాగా, శిథిలాల కింద ఉన్న సూరమ్మ మృతదేహాన్ని స్థానికులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూరులో వ్యక్తి .. ఆత్మకూరు: భారీ వర్షంతో ఓ వ్యక్తి అస్వస్థకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన దివ్యాంగుడు నాగెల్లి ఆనందం(60)బుధవారం రాత్రంతా వర్షం కురుస్తుండడంతో ఇంటికి వెళ్లకుండా బస్టాండ్ సమీపంలో తలదాచుకున్నాడు.ఈ క్రమంలో చలికి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన బంధువులు గురువారం చికిత్స నిమిత్తం అంబులెన్స్ను పిలిపించగా అప్పటికే మృతిచెందాడు. కొత్తపల్లిలోకల్వర్టులో పడి వ్యక్తి.. ఎల్కతుర్తి: మొంథా తుపాను ప్రభావంతో బుధవారం కురిసిన వర్షంతో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన అప్పని నాగేంద్రం (58)కాల్వ లో పడి దర్మరణం చెందాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నాగేంద్రం విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా వర్షం ఉధృతి పెరిగింది. కల్వర్టు నీటితో నిండిపోవడంతో దారి కనిపించక అందులోనే పడి మృతి చెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు పెంపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు బీఏ, బీకాం, బీబీఏ,బీఎస్సీ , బీ ఓకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం అండ్ సిటీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రూ. 50 అపరాధ రుసుముతో నవంబర్ 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకటయ్య గురువారం తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వరకు గడువు ముగియగా మళ్లీ ఆ గడువు పొడిగించారు. ‘ఓపెన్’ ఫలితాలు విడుదలవిద్యారణ్యపురి: ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ గురువారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాల వారీగా ఫలితాలు ఇలా.. ● హనుమకొండ జిల్లాలో టెన్త్లో 70 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 54మంది ఉత్తీర్ణత( 77.14శాతం), ఇంటర్లో 226మందికి 144మంది ఉత్తీర్ణత (63.72శాతం) సాఽధించారు. ● వరంగల్ జిల్లాలో టెన్త్లో 263 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 82 మంది (3 1.18శాతం), ఇంటర్లో 232 మందికి 107 మంది ఉత్తీర్ణత (46.12శాతం)సాధించారు. ● మహబూబాబాద్ జిల్లాలో టెన్త్లో 95మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 75మంది ఉత్తీర్ణత (78.95శాతం), ఇంటర్లో 98మందికి 70 మంది ఉత్తీర్ణత (71.43శాతం) సాధించారు. ● జనగామ జిల్లాలో టెన్త్లో 59మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 48మంది (81.36శాతం), ఇంటర్లో 96మందికి 57మంది ఉత్తీర్ణత (59.38శాతం) సాఽధించారు. ● ములుగు జిల్లాలో టెన్త్లో 120మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 105మంది (87.50శాతం ఉత్తీర్ణత), ఇంటర్లో 287మందికి 201మంది ఉత్తీర్ణత (70.03శాతం) సాధించారు. ● జయశంకర్భూపాలపల్లి జిల్లాలోటెన్త్లో 60 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 39మంది ఉత్తీర్ణత (65శాతం) సాధించారు. ఇంటర్లో 76మంది విద్యార్థులకు 54 మంది ఉత్తీర్ణత 71.05శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈఫలితాలను తెలంగాణ ఓపెన్ స్కూల్.ఓఆర్జీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు నవంబర్ 4నుంచి 12 తేదీవరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
ఉత్సాహంగా ఉత్కర్ష్..
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉత్కర్ష్ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం సాంస్కృతిక కార్యక్రమాలతో వైద్య విద్యార్థులు హోరెత్తించారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, క్లాసికల్ డ్యాన్స్లు, నాటికలతో ఆకట్టుకున్నారు. అనంతరం క్రీడలు, సోషల్ మీడియా పోటీల్లో విజేతలు, రన్నరప్లకు బహుమతులు అందించారు. కాగా, ఈఎన్టీ స్పెషలిస్టు, కేఎంసీ మాజీ ప్రిన్సిపాల్ రమేశ్ తన నృత్య ప్రదర్శనతో విద్యార్థుల్లో ఉత్తేజం నింపారు. ఈ కార్యక్రమానికి డీఎంఈ నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా విశిష్ట అతిథులుగా ఉస్మానియా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాధిపతి మధుసూదన్, హనుమంతరావు, ప్రముఖ వైద్య నిపుణుడు నర్సింహారెడ్డి, డెర్మటాలజీ విభాగాధిపతి మధుబాబు, ప్రొఫెసర్లు కాత్యాయినీ, పుల్లయ్య, రాంకుమార్రెడ్డి, కూరపాటి రమేశ్ పాల్గొన్నారు. కేఎంసీలో సాంస్కృతిక కార్యక్రమాలు -
ఆక్రమణలపై విచారణ జరుపుతాం
● ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ డోర్నకల్: డోర్నకల్లో చెరువులు, కుంటల ఆక్రమణపై విచారణ జరుపుతామని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, అంబేడ్కర్నగర్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం విప్ రాంచంద్రునాయక్ మాట్లాడారు. ఆక్రమణల వల్లే వరదలు వచ్చిన సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరువులు, కుంటల ఆక్రమణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమినర్ నిరంజన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్యాదవ్, పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్చంద్జైన్, నాయకులు మాదా శ్రీనివాస్, ఎస్. వెంకటేశ్వర్లు, తాళ్లూరి హనుమంతరావు, శీలం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కంబాలపల్లిలో యువకుడు..
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు వరద ఉధృతిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు జంపన్నవాగు వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వి.దీపిక కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) వ్యవసాయం చేసుకుంటూ భార్య స్వరూప, ఇద్దరి కూతుళ్లను పోషించుకుంటున్నాడు. బుధవారం గ్రామంలో తమ బంధువు దశదిన కర్మలు జరిగాయి. ఈకార్యక్రమానికి బయ్యారం మండలం గురిమిళ్లకు చెందిన తన మేనత్త సూరబోయిన మల్లమ్మ హాజరైంది. కార్యక్రమం అనంతరం ఆమెను బైక్పై రెడ్యాల నుంచి గురిమిళ్లకు తీసుకెళ్లాడు. రాత్రి గురిమిళ్ల నుంచి రెడ్యాలకు బయలుదేరాడు. ఈ సమయంలో చిన్నవాగు కల్వర్టుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరదను గమనించకుండా వెళ్లి గల్లంతయ్యాడు. దీనిపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టగా చిన్న వాగుకు కొంతదూరంలో సంపత్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శివనగర్లో యువకుడు..
ఖిలా వరంగల్/గీసుకొండ: ఓ యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జి ల్లా గీసుగొండ మండలం మచ్చాపూర్ మనుగొండ గట్టుకింది పల్లెకు చెందిన పులి అనిల్ (35) తన భార్య మమతతో కలిసి బుధవారం బైక్పై రైల్వేగేట్ ప్రాంతంలో జరిగిన బంధువు అంత్యక్రియలకు హాజరయ్యాడు. వర్షం భారీగా కురుస్తుండడంతో భార్యను బస్సులో పంపించి బైక్ ఇంటికి బయలుదేడు. ఈక్రమంలో శివనగర్ మైసయ్యనగర్ వద్ద జాతీయ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న భారీ వరదలో బైక్తో సహా కొట్టుకుపోయాడు. రాత్రి అ యినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య మమత ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఆందోళన చెందిన మమత వెంటనే వరంగల్ శివనగర్లోని మైసయ్యనగర్కు చేరుకుంది. అప్పటికి వరద ప్రవహం తగ్గడంతో డ్రైనేజీ లో బైక్ లభించింది. కా నీ అనిల్ ఆచూకీ లభించలేదు. దీంతో కార్పొరేటర్లు దిడ్డికుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్ ఆ ధ్వర్యంలో గాలింపు చ ర్యలు చేపట్టగా 35వ డివిజన్ నేతాజీ స్కూల్ స మీపం డ్రెయినేజీలో అనిల్ మృతదేహం లభించింది. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గురువారం తెలిపారు. -
Telangana: ఓరుగల్లు క‘న్నీరు’
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను దెబ్బకు వరంగల్ నగరం కన్నీరు పెడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కురిసిన కుంభవృష్టితో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని 141 కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గురువారం కూడా కాలనీలు, రహదారులపై మోకాలిలోతు నీళ్లు నిలిచి ఉండటంతో జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసరాలు, విలువైన వస్తువులన్నీ తడిసిపోవటంతో ప్రజలు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితి ఏర్పడింది. ముంపు బాధితులను డీఆర్ఎఫ్, ఎస్జీఆర్ఎఫ్, పీజీ ఎఫ్టీ బృందాలు పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించాయి. ఇళ్ల పైకప్పులపై తలదాచుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. గురువారం సాయంత్రానికి వరదనీరు తగ్గినా బురద ఉండడంతో దుర్వాసనతో ప్రజలకు తిప్పలు తప్పలేదు. ఎస్ఆర్ నగర్లోని ఓ ఇంట్లోకి వరద నీరు చేరడంతో అనారోగ్యానికి గురై మంచంలో ఉన్న వ్యక్తి నీటిలో పడి చనిపోయాడు. ప్రముఖుల పర్యటన: వరంగల్లోని ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ సత్యశారద గురువారం పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. రామన్నపేటలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ అలంకార్ జంక్షన్లో వరదనీటి ప్రవాహ తీరును కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. నయీంనగర్ బ్రిడ్జి, జవహర్ కాలనీ, దేవరాజ్ కాలనీ, వడ్డెపల్లి శ్యామల గార్డెన్ ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ పర్యటించారు. ఎంపీ కడియం కావ్య లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు. ఒక్కసారిగా తన్నుకొచ్చిన వరద: ఐనవోలు మండలం కొండపర్తి చెరువు కట్టకు గండిపడంతో ఆ నీళ్లంతా కొత్తపల్లి, భట్టుపల్లి చెరువు నుంచి నేరుగా బొందివాగు నాలా ద్వారా హంటర్ రోడ్డు పరిసరాలను ముంచెత్తింది. బంధం చెరువు, బెస్తం చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల మత్తళ్లు పొంగి నగరాన్ని ముంచెత్తాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి వచ్చిన నీళ్లలో యువకులు వలలు వేసి చేపలు పట్టారు. ఆక్రమణలే సమస్యకు కారణం.. వరంగల్ నగరం ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతోంది. ముఖ్యంగా బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, బంధం చెరువు, వడ్డెపల్లి చెరువు, గోపాల్పూర్ చెరువు, చిన్నవడ్డెపల్లి చెరువు, బొందివాగు నాలా, కట్టమల్లన్న నుంచి చిన్నవడ్డెపల్లికి వచ్చే నాలా, అగర్తాలా నాలా, సాకారాశి కుంట నాలా తదితర నీటి వనరులు అక్రమణకు గురికావడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సరైన మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడం కూడా ముంపునకు కారణమవుతోంది. రూ.100 కోట్లతో నయీంనగర్ నాలాను పటిష్టం చేయటంతో కొన్ని కాలనీలు వరద ముంపు నుంచి తప్పించుకున్నాయి. 2020 సెపె్టంబర్లో భారీ తుపాన్కు వరంగల్ నగరంలో వరద ముంచెత్తి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. 171 కాలనీలు వారం రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఐదేళ్ల తరువాత మోంథా తుపాను వరంగల్ను అతలాకుతలం చేసింది. నగరంలోని 141 కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. నేడు సీఎం రేవంత్రెడ్డి ఏరియల్ సర్వే... నీట మునిగిన వరంగల్ మహానగరం సహా ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అకాల వర్షం, వరదలపై ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ లో పర్యటిస్తానని తెలిపారు. భయం గుప్పిట్లోనే పరీవాహకం మోంథా తుపాన్ ప్రభావంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాల్వ ఒడ్డు వద్ద మున్నేటి వరద ప్రవాహం గురువారం సాయంత్రం 5 గంటలకు 25.80 అడుగుల మేర నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం లేకున్నా మున్నేరుకు వరద పెరుగుతుండడంతో పరీవాహక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వరద ఉధృతి దృష్ట్యా బుధవారం సాయంత్రం నుంచే కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లి గుడి వెనుక రోడ్డు, ధంసలాపురం కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఖమ్మం నయాబజార్ కళాశాలకు 100 కుటుంబాలు, ధంసలాపురం పాఠశాలకు 30 కుటుంబాలను తరలించారు. ఖమ్మం–బోనకల్ రహదారిపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ఐదుగురు మృతి.. పలువురు గల్లంతు మోంథా తుపాన్ ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ముగ్గరు వ్యక్తులు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి వరదలో పడిపోయింది. శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో గల్లంతయ్యాడు. గురువారం గాలింపు చేపట్టగా వాగుకు కొంతదూరంలో సంపత్ మృతదేహం లభ్యమైంది. అదేవిధంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై వాహనాల దారిమళ్లింపు నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు కుడి భాగంలో నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న అలుగు నీటి ప్రవాహం ధాటికి హైద్రాబాద్–శ్రీశైలం హైవేపై బ్రిడ్జి వద్ద రోడ్డు బుధవారం అర్థరాత్రి కొట్టుకుపోయింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహనాలను నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మీదుగా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా నుంచి శ్రీశైలం, అచ్చంపేటకు పంపిస్తున్నారు. కొట్టుకపోయిన రోడ్డు పునరుద్ధరణ పనులు గురువారం ప్రారంభించారు. మరోసారి తెరపైకి ‘లైడార్ సర్వే’హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, చెరువులు, నాలాల అక్రమణదారులపై హైడ్రా ద్వారా ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే తరహాలో వరంగల్లోనూ ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. హైడ్రా తరహాలో వాడ్రాను తీసుకురావాలని ఇప్పటికే సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, వరంగల్లోని చెరువులపై లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ (లైడార్) సర్వే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలోనే ఈ సర్వే చేయాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా మోంథా తుపానుతో నగరం మొత్తం నీట మునగటంతో మళ్లీ లైడార్ సర్వే తెరపైకి వచ్చింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 75 చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు. -
దారుణం.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన వైద్యులు
సాక్షి, మహబూబాబాద్: వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఆసుపత్రి ఆవరణలో రోగి.. వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నీరసించడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో భద్రపరిచిన అమానవీయ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి.రవి మూత్ర పిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. రోగికి తోడుగా ఎవ్వరు ఉండక పోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో రోగి 2 రోజుల పాటు ఆస్పత్రి ఆవరణలో పడిగాపులు పడి.. నీరసించి ఆ చేతనంగా మారిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మార్చూరికి తరలించి భద్ర పరిచారు.మరుసటి రోజు మార్చురిని శుభ్ర పరచడానికి వచ్చిన స్వీపర్లు.... రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంత దారుణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు.. మానవత్వం మంటగలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రైల్వే కాలనీలోకి వరద నీరు...
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి పోటెత్తిన వరద దిగువ ప్రాంతంలోని రైల్వే క్వార్టర్స్లోకి చేరడంతో రైల్వే ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రైల్వే స్టేషన్ మీదుగా వరదనీరు రైల్వే పార్కు నుంచి పక్కన ఉన్న క్వార్టర్స్లోకి చేరడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. అకస్మాత్తుగా ఇళ్లలోకి వరద చేరడంతో ఫర్నిచర్తో పాటు సామగ్రి నీట మునిగింది. వృద్ధులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. అధికారుల సమీక్ష... భారీ వర్షాలపై కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి సమీక్షించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ రైలు ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులతో మా ట్లాడారు. అంబేడ్కర్నగర్లో రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరదను కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్మానియల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అతలాకుతలం..
జిల్లాను ముంచెత్తిన మోంథా తుపానుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో జోరు వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. మోంథా తుపా ను ప్రభావంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో పత్తి పంటలు దెబ్బతిన్నగా, వరి, మొక్కజొన్న పంటలు నేలవా లాయి. రోడ్లు, కల్లాల్లో ఆరబోయిన ధాన్యం, మక్కలు తడిసి ముద్దవ్వడంతో రైతులు కన్నీరు మున్నీ రుగా విలపించారు. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందుల పడ్డారు. డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టా లపై వర్షపు నీరు నిలవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అప్రమత్తం.. జిల్లాలో బుధవారం ఉదయం 5 గంటల నుంచే వాన మొదలైంది. ఈమేరకు కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈమేరకు ఎక్కడికక్కడే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు రోడ్లపై, వాగులు, ఇతర జలాశయాల వద్ద విధులు నిర్వర్తించారు. కాగా వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పొంగిన వాగులు, వంకలు.. చెరువుల మత్తళ్లు భారీ వర్షానికి జిల్లాలోని ఆకేరు, మున్నేరు, పాకాల, వట్టి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై నుంచి ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే నిజాం చెరువు, బంధం చెరువు, రాబంధు చెరువు, జనాల చెరువు, కంబాల చెరువు, ఈదులపూసపల్లి చెరువు మత్తళ్లు పోస్తున్నాయి. జిల్లాలో మహబూబాబాద్, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీల పరిధిలో పలు శివారు కాలనీలు నీట మునిగాయి. సైడ్ డ్రెయినేజీల నుంచి రోడ్లపైకి మురుగు నీరు ప్రవహించింది. అదేవిధంగా జిల్లా కేంద్రం ధర్మన్న కాలనీలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం జలమయమైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నిలిచిన వర్షపునీరు జలమయమైన ఇళ్లు.. ప్రజల ఇబ్బందులు దెబ్బతిన్న పత్తి, నేలవాలిన వరి, మొక్కజొన్న పంటలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు అలుగుపోస్తున్న పలు చెరువులు..పోలీసుల బందోబస్తు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు -
పొంచి ఉన్న ప్రమాదం
మహబూబాబాద్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శిథిలావస్థలో ఉన్న భవనాలతో ప్రమాదం పొంచి ఉంది. నిజాం కాలం నాటి భవనాల్లోనే ఇప్పటికీ పలు ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండగా అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ కార్యాలయాల నూతన భవనాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయం.. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలోనే కొనసాగుతోంది. ఆ భవనం వెనుకభాగం చాలా వరకు కూలిపోయింది. భవనం స్లాబ్ పెచ్చులూడిపోతున్నాయి. దీంతో భవనం ఎప్పడు కూలిపోతుందోనని బిక్కుబిక్కూమంటూ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కార్యాలయాలు.. నిజాంకాలం నాటి భవనంలోనే ఇరిగేషన్ శాఖ కార్యాలయం కొనసాగుతోంది. ఆ భవనంలో చాలా గదులు కూలిపోయాయి. మిగిలిన గదుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తపాలా శాఖ కార్యాలయం కూడా నిజాంకాలం నాటి భవనంలోనే కొనసాగుతోంది. అలాగే కంకరబోడ్ ప్రాంతంలో బీఎస్ ఎన్ఎల్ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరి పిచ్చి మొక్కలు ఏపుగాపెరిగి పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలోనే మున్సిపాలిటీ క్వార్టర్స్ చాలా వరకు కూలిపోగా.. కొన్ని గదులు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నా యి. అలాగే ఆఫీసర్ క్లబ్ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇదిలా ఉండగా శిథిలావస్థ ఇళ్లలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గత ంలోనూఆ ఇళ్ల యజమానులకు నోటీస్లు ఇచ్చారు. తుపానుతో శిథిలావస్థ భవనాలు ఖాళీ చేయించాలని ఆదేశాలు నిజాంకాలం నాటి భవనాల్లోనే పలు ప్రభుత్వ కార్యాలయాలు బిక్కుబిక్కుమంటూవిధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ప్రతిపాదనలకే పరిమితమైన నూతన భవనాలు -
అన్నదాతల ఆశలపై నీళ్లు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో భారీ వర్షం వల్ల పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 2,15,723 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 50 శాతానికిపైగా పంటలకు నష్టం వాటిల్లింది. 62,751 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా.. అధిక మొత్తంలో మొక్కజొన్న కంకులను కోసి విక్రయించేందుకు కల్లాలు, అనువుగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఆరబోసుకున్నారు. వర్షంతో మక్కలు తడిసి ముద్దయ్యాయి. 70నుంచి 80శాతం వరకు నష్టం వాటిల్లింది. 86,224 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ప్రస్తుతం కోత దశలో 60 శాతానికిపైగా నష్టం జరిగింది. 38,289 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా పూత 40శాతం వరకు రాలిపోయినట్లు రైతులు పేర్కొన్నారు. -
నాలుగేళ్లకే నూరేళ్లు
రేగొండ: నాలుగేళ్లకే చిన్నారికి నూరేళ్లు నిండాయి. కూలర్ వైరే యమపాశమైంది. అప్పటి వరకు ఆడుకున్న చిన్నారి అంతలోనే మృత్యు ఒడికి చేరుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రామన్నగూడెం తండాలో కరెంట్ షాక్తో చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన బానోత్ వీరు–ప్రియాంక దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉదయం పనినిమిత్తం వారు పరకాలకు వెళ్లారు. కాగా, ఇంటి వద్ద అమ్మమ్మ వద్ద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కూలర్ వైరు తగలడంతో కుమార్తె అంజలి (4) షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి తండ్రి వీరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు బైక్లు ఢీ.. దుగ్గొండి: రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గిర్నిబావి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పీజీతండా గ్రామానికి చెందిన నునావత్ రాజేందర్(35) భార్య రజితతో కలిసి బైక్పై బుధవారం ఉదయం గురిజాలలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామం వస్తుండగా గిర్నిబావి సమీపంలోని వినాయక ఇండస్ట్రీస్ వద్ద అదే మిల్లులో డ్రైవర్గా పనిచేస్తున్న బాబు మిల్లులోకి వెళ్లడానికి బైక్ రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రాజేందర్ బైక్ బాబు వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రజిత, బాబుకు గాయాలయ్యాయి. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్రెడ్డి తెలిపారు.● కరెంట్ షాక్తో చిన్నారి మృతి ● రామన్నగూడెంలో విషాదఛాయలు యువకుడి మృతి.. ఇద్దరికి గాయాలు -
జాతర పనుల్లో నాణ్యత పాటించాలి
● సీఎం ముఖ్యకార్యదర్శి కె.ఎస్ శ్రీనివాసరాజు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సీఎం ముఖ్యకార్యదర్శి కె.ఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. బుధవారం మేడారంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్నాయక్తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనదేవతల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జాతర సమయానికి ముందుగా పనులన్నీ పూర్తి చేయాలని, ఈ పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ అభివృద్ధి పనులను నమూనా మ్యాప్ ద్వారా అధికారులు వివరించారు. అంతకు ముందు శ్రీనివాసరాజు.. సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పూజారులు అమ్మవార్ల శేష వస్త్రం కండువాతో శ్రీనివాసరాజును సన్మానించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, పూజారులు సిద్ధబో యిన మునీందర్, కాక సారయ్య, కొక్కెర కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
వర్షంలో చిక్కుకున్న పెళ్లి బృందం
హన్మకొండ అర్బన్/కాజీపేట అర్బన్: పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులు ఒక్కసారిగా ముంచెత్తిన వర్షంలో చిక్కుకున్న ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన వారి పెళ్లిని అంబేడ్కర్ భవన్లో చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు. వివాహానికి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సుమారు 500 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వివాహం ఘనంగా పూర్తి అయ్యింది. వివాహ అనంతరంలో విందులో పాల్గొన్నారు. సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంబేడ్కర్ భవన్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో 250 మంది వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్, ఆర్ఐ దశరథరామిరెడ్డి కలిసి రెండు ట్రాక్టర్లలో పెళ్లి బృందాన్ని సురక్షితంగా తరలించినట్లు తహసీల్దార్ తెలిపారు. దీంతో పెళ్లి బృందం ఊపిరి పీల్చుకుని తహసీల్దార్, ఇన్స్పెక్టర్, ఆర్ఐకి కృతజ్ఞతలు తెలిపింది. ట్రాక్టర్లలో సురక్షితంగా తరలించిన అధికారులు -
స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి అనుమతి
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏ ర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి ప రిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 28న స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. స్పోర్ట్స్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, శాట్ వీసీ ఎండి సోనీబాలదేవితో సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 14వ తేదీలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. కాగా, జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే కడియ శ్రీహరి జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. టీచర్ల శిక్షణ వాయిదావిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన టీచర్లు, నూతనంగా నియామకమైన ఎస్జీటీల శిక్షణ తేదీల్లో మా ర్పులు చేశారు. ఈనెల 30 నుంచి జరగాల్సిన శిక్షణను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు డీఈఓ డి.వాసంతి, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బండారు మన్మోహన్ బుధవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఆరు జిల్లాల డీఈఓలకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ శిక్షణ నవంబర్ 6, 7 తేదీల్లో జీహెచ్ఎంలు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లకు, 10, 11 తేదీల్లో ఎస్జీటీలు, లాంగ్వేజెస్ స్కూల్అసిస్టెంట్లకు కలిపి మొత్తం 725 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని జెడ్పీహెచ్ఎస్, మడికొండ జెడ్పీహెచ్ఎస్, హనుమకొండ లష్కర్బజార్ గర్ల్స్ హైస్కూల్, ప్రాక్టీసింగ్ ప్రభుత్వ హైస్కూల్లో శిక్షణ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కేయూ క్యాంపస్: భారీ వర్షాల కారణంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 30న నిర్వహించనున్న ఎల్ఎల్బీ మూడేళ్ల నాలుగో సెమిస్టర్, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు, బీటెక్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ బుధవారం తెలిపారు. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 30 జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ మీట్ను వాయిదా వేసినట్లు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. భారీవర్షాల కారణంగా వాయిదా వేశామని, మళ్లీ నిర్వహించే తేదీ త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. తప్పిపోయిన బాలుడి అప్పగింత గీసుకొండ: తప్పిపోయిన బాలుడిని పోలీసులు తండ్రికి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడకు చెంది న ధారవేణి శివన్న 15 ఏళ్ల కుమారుడు హర్షిత్ మంగళవారం తప్పిపోయి తిరుగుతుండగా ధర్మారానికి చెందిన నవయుగ యూత్ సభ్యులు పోలీసులకు అప్పగించారు. వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్.. ఆ బాలుడిని బుధవారం తండ్రి శివన్నకు అప్పగించారు. దీంతో బాలుడి తండ్రి.. పోలీసులతో పాలు నవయుగ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్..
కురవి: మోంథా తుపాన్తో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం కురవి మండలంలోని గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లో నిలిచింది. దీంతో మధ్యాహ్నం వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై జయకుమార్, కానిస్టేబుళ్లు కాశీరాం, భద్రు, అశోక్.. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, అరటిపండ్లు అందజేశారు. కాగా, ప్రయాణికులకు గార్లబయ్యారం సీఐ రవికుమార్, బయ్యారం రెండో ఎస్సై మహబూబీతోపాటు బయ్యారం మండల కేంద్రానికి చెందిన యువకులు రూ.50వేల విలువైన అరటి పండ్లు, బ్రెడ్, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, టిఫిన్లు అందజేశారు. -
మానుకోటలో నిలిచిన కృష్ణా ఎక్స్ప్రెస్ ..
మహబూబాబాద్ రూరల్ : మోంథా తుపాన్ ప్రభావంతో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు మూడున్నర గంటలపాటు నిలిచింది. ఉదయం 11.05 గంటలకు మానుకోటకు చేరుకుని నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు, రైల్వే అధికారుల సూచన మేరకు ఆర్యవైశ్యులు, కిరాణా వర్తక సంఘం, మార్వాడీ యువమంచ్, సత్యసాయి సేవా ట్రస్టు, రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సీఆర్ఐ పంప్స్, శ్రీవాసవి సేవా ట్రస్టు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థల ప్రతినిధులు, సెల్ షాపుల నిర్వాహకులు, తహసీల్దార్ రాజేశ్వరరావు.. ప్రయాణికులకు సేవలు అందించారు. వాటర్ బాటిళ్లు, అరటి పండ్లు, బిస్కెట్లు, తదితర అల్పాహారం పంపిణీ చేశారు. దీంతో ప్రయాణికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డోర్నకల్ వైపునకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో మధ్యాహ్నం 3.32 గంటలకు రైలును అధికారులు తిరిగి కాజీపేటకు పంపించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, టౌన్, రూరల్ సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, ఎస్బీ సీఐ నరేందర్, ఆర్ఐలు భాస్కర్, సోములు, నాగేశ్వరరావు, ఎస్సైలు ప్రశాంత్ బాబు, అలీం హుస్సేన్, అశోక్, దీపిక, తదితరులు పాల్గొన్నారు. -
మాటలే.. చేతల్లేవు
హన్మకొండ: సీఎం రేవంత్ మాటల్లో ఉన్న వాగ్ధాటి చేతల్లో లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నమ్మించడం రేవంత్ నైజమని, వంచించడం, ద్రోహం చేయడం ఆయన రక్తంలో ఉందని తూర్పారబట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో ద్రోహం చేసిన చరిత్ర దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని విమర్శించారు. దేవునివి కానప్పడు ఎందుకు హామీలు గుప్పించావని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరోసారి హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ తీయాలని సీఎం రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైడ్రాను తీసుకొచ్చి హైదరాబాద్ పరువు తీశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రిలో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్ఎస్ నాయకులు దాస్యం విజయ్భాస్కర్, చింతం సదానందం, పులి రజినీకాంత్, శోభన్, సోదా కిరణ్, జోరిక రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి, బుద్దె వెంకన్న, బొంగు అశోక్ యాదవ్, బండి రజినీ కుమార్, రాజు, చాగంటి రమేశ్, వీరు పాల్గొన్నారు. వంచించడం సీఎం రేవంత్ రక్తంలో ఉంది శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
చెట్టు కూలి మీదపడి మరిపెడ వాసి మృతి
● చందుపట్ల సమీపంలో ఘటనమరిపెడ రూరల్: మోంథా తుపాన్ బీభత్సానికి చెట్టు కూలి మీదపడడంతో మరిపెడ వాసి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతన మండలం చందుపట్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ (50) 30 ఏళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం మరిపెడ మండలం తానంచర్లకు వలస వచ్చి మెడికల్ షాపు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం బైక్పై మద్దిరాలకు వెళ్లి తిరిగి తానంచర్లకు వస్తున్నాడు. మార్గ మధ్యలో చందుపట్ల సమీపంలో భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులకు చెట్టు కూలి బైక్ పై పడడంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. -
తుపాన్ ఎఫెక్ట్.. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, నిలిపివేత
కాజీపేట రూరల్ : మోంథా తుపాన్ ఎఫెక్ట్ బుధవారం కాజీపేట, వరంగల్ మీదుగా న్యూఢిల్లీ, విజయవాడ, సికింద్రాబాద్ రూట్లో ప్రయాణించే పలు రైళ్లపై తీవ్ర ప్రభావం పడింది. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్పైకి వర్షం నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు తలెత్తాయని అధికారులు తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, పాక్షికంగా రద్దుతో క్రమబద్ధీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ–విజయవాడ మధ్య వయా వరంగల్ మీదుగా వెళ్లే టాటానగర్, షాలిమార్, కోణార్క్, షిర్టీ, కృష్ణా, గోల్కొండతోపాటు పలు రైళ్లను వయా కాజీపేట జంక్షన్ మీదుగా పగిడిపల్లి, నడికుడ మీదుగా దారి మళ్లించారు. షిర్డీ–కాకినాడ ఎక్స్ప్రెస్ను మహబూబాబాద్ నుంచి వెనక్కి తీసుకొచ్చి వయా కాజీపేట మీదుగా దారి మళ్లించారు. అదేవిధంగా షిర్డీ–కాకినాడ ఎక్స్ప్రెస్ను వరంగల్కు రాకుండా విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ను వయా నడికుడ మీదుగా తిరుపతి దారి మళ్లించారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, రైల్వే ట్రాక్, యార్డులోకి వర్షం నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందనే సమాచారం మేరకు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆర్.గోపాలకృష్ణన్ ప్రత్యేక రైలులో డోర్నకల్ వెళ్లారు. రద్దయిన రైళ్లు.. సికింద్రాబాద్– విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ను, సికింద్రాబాద్ –కాగజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను బుధవారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి రైళ్ల రద్దు.. విజయవాడ–సికింద్రాబాద్ (12713) శాతవాహన ఎక్స్ప్రెస్ను గురువారం రద్దు చేసినట్లు రైల్వే అ ధి కారులు తెలిపారు. కాజీపేట–విజయవాడ పుష్ పు ల్, శాతవాహన, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లను కూడా రద్దు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాజీపేటలో హెల్ప్డెస్క్.. కాజీపేట జంక్షన్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ ద్వారా టీటీఈలు, కమర్షియల్ స్టాఫ్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు రైళ్ల సమాచారం అందించారు. 0870–2576430 నంబర్లో రైళ్ల సమాచారం అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. -
డోర్నకల్ రైల్వే స్టేషన్..జలదిగ్బంధం
ఇబ్బందులు పడిన ప్రయాణికులు.. వరద ప్రభావంతో గోల్కొండ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు కదిలే పరిస్థితి లేకపోవడంతో ఖమ్మం, మహబూబాబాద్లకు ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గార్ల మండలానికి చెందిన ఓ గర్భిణి డోర్నకల్ స్టేషన్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుండగా డోర్నకల్ సీఐ చంద్రమౌళి చొరవతో ప్రైవేట్ వాహనంలో ఖమ్మం తరలించారు. డోర్నకల్: డోర్నకల్ రైల్వే రైల్వే స్టేషన్ జల దిగ్బంధమైంది. బుధవారం తెల్లవారుజామున చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షంగా మారడంతో వరదతో డోర్నకల్ రైల్వే స్టేషన్ జలదిగ్బంధమైంది. కాకతీయ, సింగరేణి, శాతవాహన్ ఎక్స్ప్రెస్ రైళళ్లు వెళ్లిపోయిన తర్వాత ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వరంగల్ వైపునకు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటికే వరదనీరు ట్రాక్ మీదుగా ప్రవహిస్తుండడతో అధికారులు రైలును నిలిపారు. నిమిషాల్లోనే వరదనీరు భారీగా ప్రవహించడంతో ట్రాక్ మునిగింది. గార్ల వైపు నుంచి వస్తున్న గూడ్స్ను హోం సిగ్నల్ వద్ద నిలిపారు. మధ్యాహ్నం వరకు వరద పెరగగా రైళ్ల రాకపోకలను నిలిపారు. రైల్వే స్టేషన్లోకి వరద భారీగా రావడంతో ట్రాక్లు నీట మునగగా, స్టేషన్ యార్డు చెరువును తలపించింది. కుంటల ఆక్రమణే కారణమా? డోర్నకల్ రైల్వే స్టేషన్కు ఎగువ ప్రాంతంలో ఉన్న కొర్లకుంటతో పాటు అంబేడ్కర్నగర్ సమీపంలోని కుంటల్లో వెంచర్లు ఏర్పాటు చేయడంతో గార్ల మండలంలోని పలు కుంటల నుంచి వచ్చే వరద డోర్నకల్ రైల్వే స్టేషన్ను ముంచెత్తింది. డోర్నకల్ పరిధిలోని కుంటలను ఆక్రమించి వెంచర్లను ఏర్పాటు చేయడంతో ఇలాంటి దుస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సౌత్జోన్ కబడ్డీ టోర్నమెంట్కు కేయూ ఉమెన్స్ జట్టు
కేయూ క్యాంపస్: తమిళనాడులోని వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఈనెల 29 నుంచి నుంచి నవంబర్ 2వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ కబడ్డీ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. జట్టులో సీహెచ్.వైష్ణవి (తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల, వరంగల్), డి.సునీత (టీజీటీడబ్ల్యూఆర్డీసీ, మహబూబాబాద్), యు.సంజన (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపేట), బి.భార్గవి (ఎంజేపీటీ బీసీ, ఖమ్మం), ఎస్.అక్షర (కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ), పి.శిరీష (వీఐపీఎస్, బొల్లికుంట), జె.జ్యోతి (ఎంజేపీటీడబ్ల్యూ ఆర్డీసీ, స్టేషన్ఘన్పూర్), బి.విద్యశ్రీ (టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ, కొత్తగూడెం), జి.కావ్యశ్రీ (టీజీడబ్లూ ఆర్డీసీ, ఖమ్మం), బి.దివ్య (ఎల్బీ కళాశాల, వరంగల్), పి.శారద (యూసీపీఈ, ఖమ్మం), వై.అనిత (వీసీపీఈ, బొల్లికుంట), జి. హారిక (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), ఎస్.అఖిల (టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ , దమ్మన్నపేట) ఉన్నారు. జట్టుకు కోచ్గా వరంగల్ కిట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మేనేజర్గా వాగ్డేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.అజయ్ వ్యవహరిస్తున్నారని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు. -
జాతరలో నాణ్యమైన విద్యుత్ అందించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో నాణ్యమైన విద్యుత్ అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి అన్నారు. బుధవారం మేడారంలో విద్యుత్ పనులపై ములుగు, ఏటూరునాగారం డివిజన్ పరిధిలోని ఇంజనీర్లు, అసిస్టెంట్లు ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. జాతరలో విద్యుత్ ఏర్పాట్ల కోసం కావాల్సిన మెన్, మెటీరియల్ను సమకూర్చుకొని నాణ్యమైన విద్యుత్ అందించి సంస్థకు పేరు తీసుకురావాలన్నారు. మహాజాతర పనులను పస్రా సబ్ స్టేషన్ నుంచి మొదలు.. నార్లాపూర్, కొత్తూరు, తాడ్వాయి, మేడారం న్యూ సబ్ స్టేషన్ మెయిన్ అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్న వాగు పరిసరాలను పరిశీలించి అవసరమైన విద్యుత్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్ ) మధుసూదన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్రావు, జీసీఎం రాజు చౌహాన్, ఎస్ఈ మల్చూర్నాయక్, డీఈ పులుసం నాగేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
కొత్తవారికే లక్కు..
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో మద్యం షాపులను దక్కించుకునేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు సమర్పించగా.. కొత్తవారినే లక్కు వరించింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో మద్యం షాపుల లక్కీడ్రా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై లక్కీడ్రా తీసి ఎంపికై న వారి పేర్లు ప్రకటించారు. కాగా, 2025–2027వరకు నూతనంగా వైన్ షాపుల నిర్వహణ కొనసాగనుంది. ఈమేరకు ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. వీడియో చిత్రీకరణ మధ్య.. వీడియో చిత్రీకరిస్తూ డ్రా తీసి పేర్లు పిలవడంతో పాటు వచ్చిన నంబర్ను దరఖాస్తుదారులకు చూపి ంచారు. దుకాణాలు దక్కించుకున్న వారు వార్షిక లైసెన్స్ ఫీజులో ఆరోవంతు చెల్లించి లైసెన్స్లు పొందారు. జిల్లాలో 61 షాపులకు 1,800 దరఖాస్తులు రాగా.. దరఖాస్తుదారులతో ఏబీ గార్డెన్స్ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. లాటరీ తీసే సమయంలో ప్రతీ ఒక్కరు టెన్షన్ పడుతూ కనిపించారు. ఏమవుతుందో ఏమో అన్న ఉత్కంఠ అందరిలో కనిపించింది. కాగా డ్రా ప్రక్రియ రెండు గంటల్లోనే ముగియడం విశేషం. ఒక పక్క సంతోషం.. మరోపక్క నిరాశ రెండేళ్ల పాటు వైన్షాపుల నిర్వహణకు లైసెన్స్ పొందినవారు సంతోషంలో మునిగిపోగా... అదృష్టం వరించనివారు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. కాగా డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగింసింది. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ అధికారి బి.కిరణ్ ఆధ్వరర్యంలో డ్రా నిర్వహించగా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, వరంగల్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ శ్రీనివాసరెడ్డి, సీఐలు చిరంజీవి, భిక్షపతి, అశోక్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగేశ్వర్ రావు, ఎస్సైలు రవికుమార్, అశోక్ కుమార్, మౌనిక, రాజేశ్వరి, రవళిరెడ్డి, శంకర్, డీటీఎఫ్ ఎస్సై కిరీటి, ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఒకే దరఖాస్తుతో.. జిల్లా పరిధిలో మద్యం షాపుల ఏర్పాటు కోసం కొందరు మొదటిసారిగా దరఖాస్తు చేశారు. కాగా, మానుకోట మండలం వేమునూరు గ్రామానికి చెందిన నలమాస రాంబాబు గెజిట్ సీరియల్ నంబర్–2కు, జిల్లా కేంద్రానికి చెందిన గొల్లపల్లి వెంకటేశ్వర్లు గెజిట్ సీరియల్ నంబర్–4కు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు సమర్పించగా వారిద్దరిని అదృష్టం వరించింది. అదే విధంగా జిల్లా కేంద్రానికి చెందిన గోట్ల వెంకటేశ్వర్లుయాదవ్ గెజిట్ సీరియల్ నంబర్–31కి, ఆయన కుమారుడు రాకేశ్ యాదవ్ గెజిట్ సీరియల్ నంబర్–12కు దరఖాస్తు చేయగా తండ్రీకొడుకులను అదృష్టం వరించింది. ఇకపోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఎన్.శ్రీవాణి గెజిట్ సీరియల్ నంబర్లు 15, 17, 21కు దరఖాస్తు చేయగా ఆమెకు మూడు షాపులు దక్కాయి. కొత్తవారే అధికం... పాత వ్యాపారుల్లో కొంతమందికే షాపులు దక్కగా ఈ ఏడాది మద్యం వ్యాపారంతో సంబంధంలేని కొత్త వ్యక్తులు తెరమీదకు వచ్చారు. చాలా చోట్ల గ్రూపులుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. వీరికి దీటుగా పాత వ్యాపారులు సైతం వందల సంఖ్యలో దరఖాస్తులు చేసినప్పటికీ లాటరీలో వారికి సింగిల్ డిజిట్ దుకాణాలకు మించి రాలేదు. ప్రయత్నాలు ముమ్మరం.. మద్యం వ్యాపారంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కొంతమంది వ్యాపారులకు షాపులు రాలేదు. కాగా, కొత్తగా షాపులు దక్కించుకున్న వారికి భారీగా ఆఫర్లు ఇచ్చి షాపులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొత్తగా షాపులు దక్కించుకున్న వారితో బేరసారాలు నడుపుతున్నట్లు సమాచారం. లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు పాత వ్యాపారుల్లో కొంతమందికే దక్కిన వైన్షాపులు ఒక్క దరఖాస్తుతోనే వరించిన అదృష్టం తండ్రీకొడుకులకు రెండు షాపులు రెండు గంటల్లోనే ముగిసిన డ్రా ప్రక్రియ భారీ బందోబస్తు.. మద్యం షాపుల డ్రా సందర్భంగా దరఖాస్తుదారులు, వారి బంధువులు, స్నేహితులతో ఏబీ ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా వారి వాహనాలతో చుట్టూ పక్కల ప్రాంతాలు నిండిపోయాయి. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు ప్రశాంత్ బాబు, శివ, సూరయ్య, పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కాగా, లక్కీ డ్రా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
వరంగల్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని దృఢంగా నమ్మిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి.. 24 గంటల ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, సబ్సిడీ విత్తనాల పంపిణీ, ఇండస్ట్రీయల్ పాలసీని తీసుకొచ్చారన్నారు. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులు మార్కెట్కు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గరిష్ట ధర పొందాలన్నారు. పత్తిని అమ్ముకునే రైతులు కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని ఆయా మిల్లుల్లో కేటాయించిన తేదీల్లో విక్రయించాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే 1800 599 5779 టోల్ ఫ్రీ నంబర్, 88972 81111 వాట్సాప్ నంబర్ను సంప్రదించాలన్నారు. అనంతరం మార్కెట్లోని అపరాల యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, సీసీఐ జీఎం మోహిత్ శర్మ, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీ నీరజ, కాటన్ కొనుగోలు అధికారి కృష్ణారెడ్డి, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేద ప్రకాశ్, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, పండ్ల మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, గ్రేడ్ –2 కార్యదర్శి రాము, తదితరులు పాల్గొన్నారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాలి..ఖిలా వరంగల్ : వరంగల్ శివనగర్లోని చారిత్రక ప్రసిద్ధి చెందిన మెట్ల బావిని మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుందరీకరణ, లైటింగ్, అభివృద్ధి పనులు చేపట్టారు. సోమవారం ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై మెట్ల బావిని పునఃప్రారంభించి మాట్లాడారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధిని మంత్రి సురేఖ బావిలోకి దిగి పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, గోపాల నవీన్రాజు, శామంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణంలో గార్డెన్, సెంట్రల్ లైటింగ్, భూగర్భ డ్రెయినేజీలను ఏర్పా టు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సోమవారం సుబ్రహ్మణ్యంతోపాటు హంపీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ నిఖిల్దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణచైతన్య వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించి పరిశీలించారు. రుద్రేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, జోగులాంబ దేవాలయం కన్జర్వేటర్ అసిస్టెంట్ మల్లేశం, వరంగల్ కేంద్ర పురావస్తుశాఖ కన్జర్వేటర్ అసిస్టెంట్ అజిత్ పాల్గొన్నారు. కార్తీక సోమవారం పూజలు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వే యిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యే క పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణ వ్ నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8గంటలకు మహాహారతి శోభాయమానంగా నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. కోట సందర్శన..ఖిలా వరంగల్: ఖిలావరంగల్ కోటను సోమవారం కేంద్ర పురావస్తుశాఖ మాన్యుమెంట్ డైరెక్టర్ సుబ్ర హ్మణ్యం, అధికారులు సందర్శించారు. భవిష్యత్తుల చేపట్టనున్న నిర్మాణాల శైలిని డైరెక్టర్కు అధికారులు వివరించారు. ఆయనవెంట టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ ఉన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం ఆలయాన్ని పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు -
మానుకోట రూపురేఖలు మారుతాయి
● సీఎం ఆశీస్సులతో రూ 59.62 కోట్లు ● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్మహబూబాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఆశీస్సులతో మానుకోట మున్సిపాలిటీకి రూ 59.62 కోట్లు విడుదల అయ్యాయని, ఆ నిధులతో పట్టణ రూపురేఖ లు మారుతాయని ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అన్నారు. నిధులు విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే, నాయకులు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబురాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. విడుదలైన నిధులతో ఇండోర్ స్టేడియం పార్క్లో రోడ్లు, డ్రైయినేజీలు లాంటి పనులు చేపడుతామన్నారు. ప్రజల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కృషి చేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. మానుకోటలో నీటి సమస్య పరిష్కారానికి రూ.20 కోట్లతో పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఘనపురపు అంజయ్య, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు,, ఖలీల్, ఎడ్ల రమేశ్, లక్ష్మీనారాయణ, రామగోని రాజు, గిరిధర్గుప్తా, నాళ్ల నర్సింహారావు, పోతురాజు, దేవరం ప్రకాశ్రెడ్డి, బి.రాజు, నీరుటి సురేశ్, ఆకుల శ్రీను, ఉపేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మహబూబాబాద్: తుపాన్ ప్రభావంతో పంటలకు నష్టం జరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండానే వెంటనే పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఆర్డీఓ కృష్ణవేణి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం చేసే విధంగా లేకపోతే వివరాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 104 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. తూకంలో మోసాలు చేస్తే చర్యలు తీసుకుంటాం గూడూరు: వ్యాపారులు, దళారులు తూకంలో మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల జిల్లా అధికారి శ్రీలత హెచ్చరించారు. మండల కేంద్రంలోని శ్రీరామ వేబ్రిడ్జి తూకంలో తక్కువగా చూపుతుందనే పలువురు వ్యాపారులు, రైతుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వే బ్రిడ్జిపై లారీతో తూకం పరిశీలించగా, 30 టన్నులకు సుమారు 6 క్వింటాళ్ల 50 కిలోలు తక్కువగా చూపుతుందని గుర్తించారు. దీంతో వెంటనే ఆ వే బ్రిడ్జి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి, సరిచూసుకోవాలని అన్నారు. వే బ్రిడ్జిలే కాకుండా కిరాణా, ఇతర షాపుల వద్ద తూకాల్లో తేడాలను గుర్తించి వెంటనే ఫిర్యాదు చేయాలని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎంసీ కార్యదర్శిగా సుజన్బాబు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్–1 కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) గా వి.సుజన్బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్–1 కార్యదర్శిగా సుజన్ బాబు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆయనను మార్కెటింగ్శాఖ ఉన్నత అధికారులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీబీని ముందస్తుగా గుర్తించాలి నెహ్రూ సెంటర్: టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా నయం చేయవచ్చని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. టీబీ నిర్ధారణ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మానుకోటను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి విజయ్కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారం
హన్మకొండ కల్చరల్ : కవి, న్యాయవాది డాక్టర్ నమిలికొండ బాలకిషన్రావు స్మారకంగా ఏర్పాటు చేసిన నబారా పురస్కారం–2025ను కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అందుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీరాజరాజనరేంద్రంద్ర భాషానిలయంలో కవి బిల్ల మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం నబారా సొసైటీ అధ్యక్షుడు నమిలికొండ పాంచాలరాయ్ అతిథులతో కలిసి శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్వీఎన్ చారి, గన్నమరాజు గిరిజమనోహర బాబు, వీఆర్ విద్యార్థి చంద్, వల్లంపట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
హన్మకొండ : హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రతీరోజు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరి రాత్రి 7:30గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. తిరిగి ఉదయం 5గంటలకు ఎయిర్పోర్ట్లో బయలుదేరి ఉప్పల్ మీదుగా హనుమకొండ, భూపాలపల్లికి వెళ్తుంది. హనుమకొండ–శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చార్జీ రూ.700 లుగా నిర్ణయించారు. ఈ బస్సును సోమవారం ప్రారంభించినట్లు వరంగల్–1 డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
జాతర పనుల్లో వేగం పెంచాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న జాతర అభివృద్ధి పనులను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేడారం ఐటీడీఏ కార్యాలయంలో జాతర అభివృద్ధి పనులపై ఎస్పీ శబరీశ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. జాతర పనుల పురోగతిపై ఆయాశాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సమయం దగ్గర పడుతోందని, పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. డిసెంబర్కల్లా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర అభివృద్ధి పనులతోపాటు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులపై పూజారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఈఓ వీరస్వామి, సీఐ దయాకర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
జంపన్న వాగు బావుల్లో పూడికతీత ప్రారంభం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జంపన్నవాగులోని ఇన్ఫిల్టరేషన్ బావుల్లో ఇరిగేషన్శాఖ అధికారులు సోమవారం పూడితీత పనులు ప్రారంభించారు. జాతర సమయంలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం వాగులోని బావుల నుంచి నీటి సరఫరా చేస్తారు. ఏటా వర్షాలకు జంపన్నవాగు వరద ఉధృతికి బావులు ఇసుక, చెత్తతో నిండిపోతుంటాయి. దీంతో ప్రతీ మహాజాతరలో కార్మికులతో బావుల్లో పూడిక తీయిస్తుంటారు. ఈసారి త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచన మేరకు డ్రెడ్జింగ్ మోటారు సాయంతో బావుల్లో పూడిక తీత పనులకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం డ్రైడ్జింగ్ మోటార్లు బావుల్లో ఏర్పాటు చేసి ఈఈ నారాయణ, డీఈ సదయ్య, కాంట్రాక్టర్ సురేందర్రెడ్డి ట్రయల్ రన్ చేశారు. ప్రయోగం విజయవంతమైతే మోటార్లతోనే పూడికతీత పనులు పూర్తి చేస్తామన్నారు. వారి వెంట ఏఈలు ప్రశాంత్, రాజా ఉన్నారు. డ్రెడ్జింగ్ మోటార్లతో ట్రయల్ రన్ -
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
దంతాలపల్లి : అప్పుల బాధతో ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మండలకేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్లకు చెందిన గడ్డం ఉప్పలయ్య(48) బతుకుదెరువు నిమిత్తం సుమారు పదేళ్ల క్రితం దంతాలపల్లికి వలస వచ్చాడు. మండల కేంద్రంలో ఎలక్ట్రికల్, శానిటరీ షాపు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు సుమారు రూ. 75 లక్షల వరకు ఫైనాన్స్లో అప్పు చేశాడు. అయితే కొంతకాలంగా షాపు సరిగా నడవకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు అంబిక, కుమారుడు శ్రీరామ్ ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. నెల్లికుదురు : పని చేయాలని తల్లి మందలించిందనే కారణంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర శివారు నంద్య తండాలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ పవన్ కల్యాణ్ (21) గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేసేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం తన తండ్రి మృతిచెందినప్పటి నుంచి మనస్తాపం చెందుతున్నాడు. కొద్దిరోజులుగా పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో పనులకు వెళ్లాలని తల్లి కమిలి మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన పవన్కల్యాణ్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి కమిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. విషజ్వరంతో వివాహిత మృతి బయ్యారం: విషజ్వరంతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం మండలంలోని జగ్గుతండాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన చల్ల రమాదేవి(30)కి వారం రోజుల క్రితం జ్వరం రాగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం, హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందింది. మృతురాలికి భర్త మహేశ్, కుమారుడు ఉన్నారు.గుండెపోటుతో భక్తుడు.. ● సోమేశ్వరాలయంలో ఘటన పాలకుర్తి టౌన్/పెద్దవంగర: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆలయ అధికారులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామానికి చెందిన పాకనాటి సోమారెడ్డి(72) కుటుంబ సభ్యులతో కలిసి సోమేశ్వరాలయానికి వచ్చాడు. ఆలయ గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేశాడు. అనంతరం పక్కన ఉన్న లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని మహా మండపంలోకి రాగానే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబీలు, భక్తులు, ఆలయ అధికారులు, ఎస్సై వపన్కుమార్.. సోమారెడ్డికి సీపీఆర్ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సోమారెడ్డికి గతంలో గుండె ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగిందని కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, సోమారెడ్డి రైతుబంధు పెద్దవంగర మండల కన్వీనర్గా పని చేశాడు. -
‘ఇందిరమ్మ’ బిల్లు రాకపాయె!
సాక్షి, మహబూబాబాద్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే పలువురికి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త ఇల్లు మంజూరు కావడంతో.. ఉన్న ఇళ్లు కూల్చివేశామని, ప్రస్తుతం బిల్లులు రాకపోవడంతో తిప్పలు పడుతున్నామని, అధికారులు స్పందించి చెల్లించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. సర్వేలో తప్పులు.. లబ్ధిదారుల తిప్పలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం ద్వారా పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే నిర్వహించారు. ఇందులో సొంత ఇంటి స్థలం ఉండి శిథిలావస్థలో ఇల్లు ఉన్నవారు, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనివారు, ఇల్లు, స్థలం రెండూ లేని వారుగా మూడు విభాగాలుగా గుర్తించారు. అయితే అందులో సర్వేకోసం వచ్చిన వారు తప్పులుగా నమోదు చేశారు. ఇంటి పేరు, ఆధార్ నంబర్, పేర్లు, భర్త, తండ్రి పేర్లు తప్పుగా నమోదు చేశారు. ఇలాంటి తప్పులను చూడకుండా, వాటిని సరిచేయకుండానే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఆర్భాటంగా నిర్మాణాలు చేపట్టారు. తీరా ఇల్లు నిర్మాణం మొదలైన తర్వాత ఫొటో క్యాప్చర్ కాకపోవడం, ఇతర తప్పులతో బిల్లులు రావడం లేదు. లబ్ధిదారుల ప్రదక్షిణలు.. అధికారులు చెప్పినట్లు తూచ తప్పకుండా ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు బిల్లులు రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్ నంబర్, ఇంటిపేరు, తండ్రి, భర్త పేర్లు ఇలా తప్పులు ఉంటే.. ముందుగా ఎంపీడీఓ లాగిన్లో సరిచేస్తారని అక్కడికి పంపించారు. అక్కడ కాకపోతే కలెక్టర్ కార్యాలయంలోని హౌసింగ్ అధికారుల వద్దకు రావడం.. అక్కడ కూడా సరి చేయకపోవడంతో ఎక్కడికి వెళ్తే తమ సమస్యకు పరిష్కారం అవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తమతో పాటు ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి బిల్లులు వచ్చాయని, తమకెందుకు బిల్లులు రావడం లేదని అధికారులను నిలదీస్తున్నారు. ఈమేరకు ఒక అధికారి కలెక్టర్ లాగిన్లో ఆగిందని, మరొకరు ఎండీ వద్ద ఆగిందని చెబుతూ తమ చేతిలో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో తప్పులతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సతమతం ఇళ్లు నిర్మిస్తున్నా.. అందని బిల్లులు తప్పులు సవరించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు పెండింగ్లో 1,300 ఇళ్ల బిల్లులు ఇందిరమ్మ ఇళ్లకోసం ముందుగా చేపట్టిన పైలెట్ పంచాయతీల్లో 602, ఐటీడీఏ ద్వారా 11,00, రెండో విడత 8,949 ఇళ్లు.. మొత్తం 10,651 ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇందులో 9,931 ఇళ్లకు కలెక్టర్ పునఃపరిశీలించి మంజూరీ ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 8,047 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 6,670 ఇళ్లు బేస్మెంట్ లెవల్, 2,581 ఇళ్లు గోడల వరకు, 561 ఇళ్ల స్లాబ్లు వేశారు. వీరిలో వారి వారి నిర్మాణం స్థాయిని బట్టి మొత్తం 9,812 బిల్లులు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు 8,512 బిల్లులు చెల్లించగా.. 1,300 మంది ఇళ్ల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
సమాజ సేవ.. ఎన్ఎస్ఎస్ తోవ!
తొర్రూరు: సమాజ సేవలో భాగస్వాములవుతూ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలతో గ్రామాల్లో ప్రజలను జాగృతం చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఓటు ప్రాధాన్యం, మద్యపాన నిర్మూలన వంటి అంశాల్లో గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏడు రోజుల పాటు శిబిరం నిర్వహించి విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందిస్తున్నారు. తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, కొత్తగూడెం ప్రభుత్వ జూని యర్ కళాశాలల ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు క్యాంపులో పాల్గొని పల్లె వాసుల్లో స్పూర్తిని నింపారు. మహబూబాబాద్ గిరిజన సంక్షేమ బాలికల గురుకులం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో తొర్రూరులో క్యాంపు కొనసాగుతోంది. కదులుతూ.. కదిలిస్తూ.. జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ కేయూ కో ఆర్డినేటర్ ఈసం నారాయణ, జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏడు రోజుల శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ● బహిరంగ మలమూత్రవిసర్జన నిర్మూలించి మరుగుదొడ్లు నిర్మించుకునేలా స్థానికులకు అవగాహన కల్పించారు. ● గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రపరిచి పరిసరాల శుభ్రతపై స్థానికులను చైతన్యపరిచారు. ● వయోజన విద్య, అక్షరాస్యత అభివృద్ధికి కృషి చేశారు. ● పర్యావరణ విశిష్టతను తెలియజేస్తూ గ్రామాల్లో మొక్కలు నాటుతున్నారు. ● గ్రామీణ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ● వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేయడంతో పాటు శ్రామికుల శ్రమ శక్తి విలువ ప్రాధాన్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. ● విద్య ప్రాముఖ్యం. మద్యపాన నిర్మూలన, అనర్థాలు, పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించారు. ● ప్రభుత్వ పథకాల ప్రయోజనంపై సమావేశాలు నిర్వహించారు. ● డ్రైవర్స్ డే సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ● బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు. ● డ్రగ్స్ వినియోగంతో తలెత్తే పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. శిబిరాలతో విద్యార్థుల్లో ఉత్సాహం గ్రామాల్లో ఆయా అంశాలపై అవగాహన జిల్లాలో ఆదర్శంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ : రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నా టి వరుణ్రెడ్డి ఆదేశించారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 24/7 సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఏజెన్సీలు, బ్రేక్ డౌన్ టీంలు రెడీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఔత్సాహికులు ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు తీసుకోవా లన్నారు. సమావేశంలో డైరెక్టర్లు మోహన్రా వు, మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, వెంకటరమణ, జీఎంలు అన్నపూర్ణ, శ్రీనివాస్, శ్రీకాంత్, డీఈ లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ క్రీడాంశాలలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు యోగా, కరాటే, టగ్ఆఫ్వార్, తంగ్తా, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నీస్, సాఫ్ట్ టెన్నిస్, మాల్కమ్, గట్కా క్రీడల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 350 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్జేడీ గోపాల్, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కాకా మాధవరావు, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి దరిగి కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న బైక్..
● డిగ్రీ విద్యార్థి దుర్మరణం ● మరో యువకుడి పరిస్థితి విషమం ● నెల్లుట్ల బ్రిడ్జి వద్ద ఘటన లింగాలఘణపురం: బైక్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన సోమవారం జనగామ – సూర్యాపేట రోడ్డులోని నెల్లుట్ల బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన రాగి సంజయ్ (19), లింగాలఘణపురం మండలం నవాబుపేటకు చెందిన బూడిద ప్రసాద్ స్నేహితులు. ఇందులో సంజయ్ జనగామలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతుండగా, ప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు బైక్పై నవాబుపేట నుంచి జనగామ వైపునకు వస్తూ నెల్లుట్ల బిడ్రి వద్ద లారీని ఎదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో సంజయ్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రసాద్ను 108లో జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
‘అన్వేషిక’లో పరమేశ్వర్..
కాళోజీ సెంటర్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రయోగపూర్వకంగా శాసీ్త్రయ జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఎస్సీఈఆర్టీ ఆరు నుంచి పదో తరగతి వరకు భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు ల్యాబ్ మాన్యువల్ అయిన అన్వేషిక ప్రయోగదర్శిని అనే పుస్తకాన్ని రూపొందించింది. ఇందులో ప్రయోగ అంశాలు, కృత్యాలను పొందుపరిచారు. వీటిని ఎలా చేయాలి? కావాల్సిన పరికరాలు ఏమిటి? అందులో ఉన్న శాసీ్త్రయ సూత్రం ఏమిటి? ఫలితాలు, నిర్ధారణ వంటి అంశాలను పొందుపరుస్తూ విపులంగా ప్రతీ కృత్యానికి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ప్రయోగదర్శిని రూపకల్పనలో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు (విషయ నిపుణులు) పాల్గొన్నారు. ఇందులో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం జెడ్పీ హైస్కూల్ జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు చిప్ప పరమేశ్వర్ 8వ తరగతి ప్రయోగదర్శినిని రూపొందించారు. కాగా, ఇటీవల పాఠశాలలకు ఈ ప్రయోగదర్శిని పుస్తకాలను అందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రయోగపాఠాలు అమలు చేసేలా నిపుణులతో రూపొందించిన ప్రయోగదర్శిని పుస్తకంలో ఉన్న విశేషాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు సంవత్సర నుంచి తెలుసుకుంటున్నారు. ఇవి రూపొందించిన విషయ నిపుణుల బృందంలో వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పరమేశ్వర్ ఉండడం జిల్లా విద్యాశాఖకు గర్వకారణం. పరమేశ్వర్కు జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, సైన్స్ అధికారి వరంగల్విద్యార్థులు, టీచర్లకు ఉపయోగపడేలా ఉభయతారకంగా ఈ అన్వేషిక ప్రయోగదర్శిని ఉంటుంది. ఈ పుస్తకం రూపకల్పనలో పాల్గొనడం వృత్తి జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కినట్లు అనిపిస్తోంది. 8వ తరగతికి సంబంధించిన కృత్యాలు, ప్రయోగాలకు సంబంధించిన ప్రయోగ పద్ధతి, పరికరాలు, శాసీ్త్రయ సూత్రం, ఫలితాలు, తదితర అంశాలు రాశా. 18 సంవత్సరాల నా బోధన అనుభవంలో తరగతి గదిలో ప్రయోగాల్లో నేను చేసిన కృత్యాలు, ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ల్యాబ్ మాన్యువల్ను రచించా. పుస్తక రచనలో పాల్గొనే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. – చిప్ప పరమేశ్వర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు● విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉభయతారకంగా అన్వేషిక బుక్ పుస్తక రూపకల్పనలో జిల్లా టీచర్ పాల్గొనడం గర్వకారణం : డీఈఓ -
పారా అథ్లెట్ దీప్తికి గౌరవం..
● హైదరాబాద్లోని ఓ ప్లైఓవర్ పిల్లర్పై ఆమె రన్నింగ్ చిత్రం పర్వతగిరి : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫ్లైఓవర్ పిల్లర్పై సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి గౌరవార్థం ఆమె రన్నింగ్ చిత్రం వేశారు. దీప్తి పారిస్ పారా ఒలింపిక్స్లో కాంస్య పతకంతోపాటు అర్జున అవార్డు సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 400మీటర్లు, 200మీటర్ల పరుగు పందెంలో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. దీంతో దీప్తి ప్రతిభకు గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మామునూరు పీఎస్లో ఇద్దరు సస్పెన్షన్వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలోని మామునూ రు పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. పర్యవేక్షణ అధికారులు మౌనం వహించ డం, కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పోలీస్ స్టేషన్ పాలన అస్తవ్యస్తంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కేసు విషయంలో మామునూరు ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్కు పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేసి ఒక్కరోజు కాకముందే అదే పీఎస్లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్పై సీపీ సస్పెన్షన్ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్లో చర్చనీయాంశమైంది. పది రోజుల క్రితం వాహనాల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులను పీఎస్ లో విచారిస్తున్న క్రమంలో ఆ నిందితులు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యారు. ఈ ఘటనలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు హెడ్ కాని స్టేబుల్ ఎండీ యూసుఫ్, కానిస్టేబుల్ శ్రీనివాస్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిందితులు పరారైనట్లు నిర్ధారించి సీపీకి నివేదికలు ఇచ్చా రు. దీంతో ఆయన ఆ ఇద్దరి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు పీఎస్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయితే మరికొంత మంది అధికారులపై చర్యలు ఉండే అవకాశం ఉంది. 29 వరకు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ,బీకాం, బీబీఏ, బీఎస్సీ బీ ఒకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం అండ్ సీటీ (రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్) మొదటి, మూడు , ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్లో నిర్వహించనున్నారు. ఈమేరకు రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు ఇస్తూ కేయూ పరీక్షలనియంత్రణాధికారి సోమవారం ఫీజు రీ–నోటిఫికేషన్ జారీచేశారు. ఆయా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు అపరాధ రుసుములేకుండా ఈనెల27వతేదీతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీవరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలి
● మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ మహబూబాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ వ్యాపారులను కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను వాడొద్దన్నారు. జూట్ బ్యాగులు వినియోగించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జరిమానాలు విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, వ్యాపారులు పాల్గొన్నారు. -
కౌమార బాలికలకు సాధికారత కల్పించాలి
కాజీపేట రూరల్ : కౌమార బాలికలకు సమాజంలో సాధికారత కల్పించి ప్రోత్సాహించాలని సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయని దేవి అన్నారు. ఫాతిమానగర్ బాలవికాస కేంద్రంలో ఏడు జిల్లాలకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న కౌమర బాలికల సంఘాల తయారీలో భాగంగా సోమవారం స్నేహ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాత్యాయని దేవి మాట్లాడుతూ.. బాలికలకు విద్య, మార్గదర్శకత్వం, ఉపాధిని కొనసాగించేలా చేయాలన్నారు. యూనిసెఫ్ విభాగం నుంచి మురళి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జోన్స్ టెక్నికల్ కన్సల్టెంట్, సెర్ప్ హెచ్డీ విభాగం నుంచి లింగయ్య గౌడ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు ఆర్డీఓలు సరిత, 7జిల్లాల డీపీఎంలు, ఏపీఎంలు మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ అధిక కౌమార జనాభా ఉన్న దేశమని, వారి అవసరాలు, ఆలోచనలు, ప్రస్తుత సామాజిక మాధ్యమం ఇంటర్నెట్, సమాచార ఏఐ యుగం, డ్రగ్స్ మద్యం, వ్యసనాలు, సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ తదితర విషయాలపై పనిచేసి వారి సంఘాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. కార్యక్రమంలో జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్, ములుగు, హనుమకొండ, కొమురంభీమ్, ఆసిఫాబాద్ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనిదేవి -
సంక్షేమ పథకాలు పక్కాగా అమలుచేయాలి
● జెడ్పీ సీఈఓ పురుషోత్తంతొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అధికారులకు సూచించారు డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న జాతీయ ఉపాధిహామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరుపై ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడారు. గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరగాలని, అర్హులకు పథకాలు అందిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి అభివృద్ధి కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చాలని, అధికారులు నిత్యం గ్రామాలను సందర్శించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ పూర్ణచందర్ రెడ్డి, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న లారీ..
● యువకుడి దుర్మరణం ● మైలారంలో ఘటన రాయపర్తి: బైక్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మండలంలోని మైలారంలో చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పెర్కవేడుకు చెందిన అంగిరేకుల శివ(26) బైక్పై మైలారం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మైలారంలో ఓ లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, శివ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
బైబై టెక్నోజియాన్..
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–25 వేడుకలు శనివా రం ముగిశాయి. రెండు రోజుల పాటు సీ రాకెట్, మిలిటరీ మ్యాన్ నమూనా, ఏరోప్లేన్, రోబోటిక్స్ క్లబ్ సర్వీంగ్ రోబో, నియాన్ క్రికెట్, పెడస్టల్ బ్రిడ్జి వంటి 40కి పైగా ఈవెంట్లతో టెక్నోజియాన్ అలరించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి సుమారు ఏడు వేల మంది విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా టెక్నోజియాన్–25 నిలిచింది. ఈ ఫెస్ట్లో వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు నిట్ టెక్నోజియాన్ టీం ఆన్లైన్లో రూ.2 లక్షల బహుమతులు ప్రదానం చేసింది. చివరి రోజువిద్యార్థులు ప్రదర్శించిన పలు ఈవెంట్లు ఆకట్టుకున్నాయి. ప్రణాళికతోనే విజయం.. ప్రణాళిక విద్యనభ్యసిస్తేనే విజయం సాధ్యమని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత తెలిపారు. నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న రెండురోజుల టెక్నోజియాన్–25 వేడుకల్లో భాగంగా శనివారం నిట్ అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఎక్స్పర్ట్ టాక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ సాధించడానికి తీసుకోవాల్సిన అంశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. సివిల్స్ సాధనకు ప్రత్యేక సమయం కేటాయించండంతో పాటు ప్రతీ రోజు అధ్యయనం చేసి అంశాలపై పరీక్ష రాయడం, గతంలో సివిల్స్లో వచ్చిన ప్రశ్నలను చ దవడం, రాయడం ద్వారా చదువుకున్న అంశాలపై పట్టు సాధించొచ్చన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సత్తాచాటుతున్న నిట్ విద్యార్థులు సివిల్స్పై దృష్టి సారించాలన్నారు. నిట్లో ముగిసిన సాంకేతిక మహోత్సవ వేడుకలు విజేతలకు ఆన్లైన్లో రూ.2 లక్షల బహుమతుల ప్రదానం -
వేయిస్తంభాల గుడిలో నాగుల చవితి పూజలు
హన్మకొండ కల్చరల్: కార్తీకమాసోత్సవాల్లో భాగంగా శనివారం వేయిస్తంభాల దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా ఆలయప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాత పూజలు, మూలగణపతికి ఆరాధన, రుద్రేశ్వరుడికి మహాన్యాసకపూర్వక ఏకాదశ రుద్రాభిషేకా లు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధికసంఖ్యలో పాల్గొని వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలోని నాగేంద్రస్వామి శిలలు, పుట్ట కు నీళ్లు, నవరసాలు, పాలతో అభిషేకం చేశారు. పుట్టలో పాలు, పండ్లు, చిమ్మిరి, చలిమిడి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజల్లో హనుమకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు, హిమబిందు దంపతులు, రమేశ్కుమార్, సూర్యప్రభ దంపతులు పాల్గొని నాగేంద్రస్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ నాగుపాములను పూజించడం అతిప్రాచీన సంస్కృతని, సంతానం, సౌభాగ్యానికి చిహ్నమన్నారు. -
మహిళా పీజీ కళాశాలలో రచ్చ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్యకు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మధుశ్రీకి మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదం శనివారం తారస్థాయికి చేరింది. ప్రిన్సిపాల్ సౌజన్య తనపై దౌర్జన్యం, దాడి చేశారని మధుశ్రీ తాజాగా వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేసింది. సౌజన్య కూడా మధుశ్రీపై పలు ఆరోణలు చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లారు. వీరి వివాదాన్ని పరిష్కరించేందుకు రిజిస్ట్రార్ రామచంద్రం నలుగురు ప్రొఫెసర్లతో కూడిన విచారణ కమిటీని నియమించారు. వివిధ ఖర్చుల బిల్లుల వ్యవహారం.. యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా సెప్టెంబర్లో గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఏడాదిపాటు కంప్యూటర్ సైన్స్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ మధుశ్రీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. మొదటినుంచి వీరిమధ్య సయోధ్య లేదు. మధుశ్రీ ప్రిన్సిపాల్గా పనిచేసిన కాలంలో అలుమ్ని సమావేశం పేరిట వసూలు చేసిన డబ్బులు, ఖర్చుల విషయంపై సౌజన్య ప్రశ్నించడం, వివిధ బిల్లుల విషయంలోనూ అడగటంతో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అదేవిధంగా విద్యుత్శాఖ డిపార్ట్మెంటల్ పరంగా యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలను పరీక్ష కేంద్రంగా వినియోగించుకున్నారని, ఇందుకు వారు రూ.20వేల వరకు ఇస్తారని, ఆ డబ్బులు దేనికి వినియోగించారని ఈనెల 24న ప్రిన్సిపాల్ సౌజన్య కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ మధుశ్రీని అడిగినట్లు తెలిసింది. దీంతోపాటు పలు విషయాలపై ప్రిన్సిపాల్ అభ్యంతరాలు తెలుపుతుండడంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. విచారణ కమిటీ చైర్పర్సన్గా జ్యోతి.. వీరిద్దరి వివాదంపై ఈనెల 24న వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. కమిటీ చైర్పర్సన్గా ఆర్ట్స్అండ్సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, సభ్యులుగా ప్రొఫెసర్లు మనోహర్, శ్రీలత, నర్సింహాచా రి, మెంబర్ కన్వీనర్గా శ్రీలతను నియమించారు. విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రిన్సిపాల్ సౌజన్య వర్సెస్ మధుశ్రీ తనపై దాడి చేశారని మధుశ్రీ.. వీసీ, రిజిస్ట్రార్కు ఫిర్యాదు మధుశ్రీ హయాంలో జరిగిన వ్యవహారాలను వీసీకి వివరించిన సౌజన్య నలుగురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ నియామకం మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు మధుశ్రీకి కంప్యూటర్ ల్యాబ్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఈనెల 24న ప్రిన్సిపాల్ సౌజన్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తీసుకునేందుకు మధుశ్రీ నిరాకరించారు. ప్రిన్సిపాల్ స్వయంగా స్టాఫ్రూమ్కు వెళ్లి మధుశ్రీ బ్యాగ్పై ఆర్డర్ కాపీని పెట్టగా, తిరిగి ఆ కాపీని చుట్టి తనమీదకి విసిరిందని, దుర్బాషలాడిందని ప్రిన్సిపాల్ సౌజన్య అంటున్నారు. స్టాఫ్రూమ్నుంచి బయటికి వచ్చి గట్టిగా అరుస్తుండటంతో ప్రిన్సిపాల్ సౌజన్య అమెవద్దకు వెళ్లి ఎందుకు అరుస్తున్నావ్ లోనికి రావాలని మధుశ్రీ చేయి పట్టుకొని లాగగా, ఆమె చేయికి గాయమైనట్లు సమాచారం. ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరడంతో మధుశ్రీ ఈనెల 24 వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా సౌజన్య కొద్దిరోజుల క్రితమే వీసీ ప్రతాప్రెడ్డిని కలిసి గతంలో మధుశ్రీ ప్రిన్సిపాల్గా పనిచేసిన సమయంలో వివిధ బిల్లుల వ్యవహారాలను వీసీకి తెలియజేసినట్లు సమాచారం. -
గొర్రెల మందపై చిరుత దాడి
● రెండు జీవాలు మృత్యువాత కాటారం: మహాముత్తారం మండలంలో చిరుత పులి బీభత్సం సృష్టించింది. శని వారం తెల్లవారుజామున గొర్రెల మందపై దాడికి పాల్పడి రెండు జీవాలను చంపింది. బాధితుడు, అట వీశాఖ అధికారు కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం పర్లపల్లి సమీపంలో మేడిపల్లి రామయ్య అనే వ్యక్తి తన గొర్రెల మందను ఉంచి ఇంటికి వెళ్లాడు. గమనించిన చిరుతపులి మందపై దాడికి పాల్పడి రెండు జీవాలను చంపింది. ఒక గొర్రె రక్తం తాగిన చిరుత.. మరో జీవాన్ని చెట్టుపైకి తీసుకెళ్లింది. ఉదయం మంద వద్దకు వచ్చిన రామయ్య.. తన గొర్రెలపై ఏదో జంతువు దాడి చేసినట్లు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎఫ్ఆర్ఓ స్వాతి, సిబ్బంది పాదముద్రలు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా దాడికి పాల్పడింది చిరుతపులి అని నిర్ధారణకు వచ్చారు. వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. కాగా, చిరుతపులి దాడితో అటవీ గ్రామాల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రేమించిన యువతి దక్కదని యువకుడి ఆత్మహత్య నర్సంపేట రూరల్: ప్రేమించిన యువతి దక్కదని మనస్తాపం తో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం చెన్నారావుపేట మండలం ధర్మతండాలో వెలుగులోకి వచ్చింది. తండావాసులు, పోలీసు కథనం ప్రకారం.. తండాకు చెందిన బోడ మోహన్ కుమారుడు మహేశ్ (21) డిగ్రీ చదువుతున్నాడు. మండలంలోని ఓ తండాకు చెందిన ఓ యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన మహేశ్ సదరు యువతి తనకు దక్కదని మదనపడ్డాడు. ప్రేమ విషయం తెలియడంతో తల్లిదండ్రులు కూడా ఆ యువకుడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన మహేశ్.. ఈనెల 23న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే కుటుంబీకులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. -
దొంగ అరెస్ట్
పర్వతగిరి: పెట్రోల్ బంకులు, మినీ బ్యాంకులను టార్గెట్ చేసిన దొంగను పర్వతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఎస్సై బోగం ప్రవీణ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యానాయక్ కాలనీకి చెందిన రాపోలు శ్రీనివాస్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలోని పెట్రోల్ బంకులు, మినీ బ్యాంకులను టార్గెట్ చేశాడు. తన క్రెడిట్కార్డు బిల్లు పెండింగ్లో ఉందని, వెంటనే కడితే తిరిగి మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తానని నమ్మించి రూ.50వేలనుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసి తిరిగి డబ్బులు ఇవ్వకుండా పారిపోయేవాడు. ఇలా పర్వతగిరి, నెక్కొండ, వర్ధన్నపేట, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల్లోని పెట్రోల్ బంకులు, మినీ ఏటీఎంలలో దాదాపు రూ.6లక్షల వరకు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలన్నీ ఒప్పుకోగా అతడి నుంచి రూ.3లక్షల నగదు, ఆరు గ్రాముల బంగారం, బ్లూ కలర్ యాక్టీవా స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. శ్రీనివాస్ను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పర్వతగిరి ఎస్సై బోగం ప్రవీణ్, సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేట్ స్కూల్ బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, నర్సింగ్రావుపల్లికి చెందిన బండారి వినోద్ (22) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తుండేవాడు. ఓ హల్దీ ఫంక్షన్కు సంబంధించిన ఫొటోలు తీసేందుకు టీఎస్27ఎఫ్ 3270 స్కూటీపై బొంగ్లూర్ నుంచి ఔటర్ సర్వీస్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు వెళ్తున్నాడు. రావిర్యాల శివారులోని కళాంజలి సమీపంలో ఇండస్వాలీ స్కూల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. బైక్ పైనుంచి కింద పడిన వినోద్ను రోడ్డుపై కొద్దిదూరం లాక్కెళ్లింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఈసమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేరు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడి
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఒంటరి మనుషుల మోముల్లో చిరునవ్వు నింపుతున్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట.. పండ్లు.. కడుపు నిండా భోజనం ఇటీవల పెరిగిన సేవా దృక్పథం -
బడిలో బురద!
ఆ పాఠశాలకు వెళ్లాలంటే ప్రధాన సెంటర్ నుంచి పాఠశాల గేటు వరకు ఉన్న రోడ్డు వెంట ఉన్న బురదలో నడవాల్సిందే.. ఇక పాఠశాల గేటు వద్ద నుంచి తరగతి గదుల వరకూ బురదే.. ప్రాంగణం మొత్తం ఏపుగా పెరిగిన గడ్డి.. ఇదీ గూడూరు మండల కేంద్రంలో 102 మంది బాలికలతో కొనసాగుతోన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ పరిస్థితి. చిన్నపాటి వర్షం కురిసినా దారంతా బురదమయంగా మారుతుండడంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను పరిష్కరించేవారే లేరా.. అని విద్యార్థినులు ఆవేదనగా అడుగుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తీర్చాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. – గూడూరు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఎమ్మెల్యే మురళీనాయక్ కేసముద్రం: అధికారులు, ఆయా శాఖల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మురళీనాయక్ హెచ్చరించారు. కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లో వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు అధికారులు ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంటికన్నె గ్రామంలో ఇంకుడుగుంత నిర్మాణం పనులను ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మరోసారి ఇలా జరగొద్దని పీఆర్ ఏఈని హెచ్చరించారు. పీఆర్ శాఖ నుంకి మంజూరైన 10 రోడ్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెనక్కి వెళ్లాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కొందరు కా ర్యదర్శులు వసూళ్లకు పాల్పడుతున్నారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం పలువురికి కల్యా ణలక్ష్మి చెక్కులు అందజేశారు. అదేవిధంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ద్వారా ధన్నసరి పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మక్కల కొనుగోళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మహముద్పట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. తమకు భోజనం సక్రమంగా పెట్టడంలేదని విద్యార్థినులు ఎమ్మెల్యే తెలి యజేయగా.. నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీలోని సమస్యలపై, ఇక్కడి టీచర్ల తీరుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆ యన కోరారు. అమీనాపురం భూనీలా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. కేసముద్రం మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓలు క్రాంతి, పార్థసారథి, ము న్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి, నాగేశ్వర్రావు, రావుల మురళి, వెంకన్న, దస్రూనా యక్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్ కేడీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడాపోటీల్లో హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అంతర్ కళాశాలల పురుషుల రెండో దఫా క్రీడాపోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి రిజిస్ట్రార్ వి. రామచంద్రం, స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం రామచంద్రం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లోనూ రాణించాలన్నారు. వివిధ క్రీడల్లో విజేతలు వీరే.. ఐదు విభాగాల్లో క్రీడాపోటీలు జరిగాయి. ఇందులో ఖోఖోలో కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ మొదటి బహుమతి, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ద్వితీయ బహుమతి, బాల్బ్యాడ్మింటన్లో బొల్లికుంట వీసీపీఈ మొదటి బహుమతి, మణుగూరులోని టీజీటీఆర్డీసీ రెండో బహుమతి, హ్యాండ్బాల్లో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రథమ బహుమతి, ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కాలేజీ ద్వితీయ బహుమతి, సాఫ్ట్బాల్లో హనుమకొండలోని యూ ఏఎస్సీ కాలేజీ ప్రథమ బహుమతి, మంచిర్యాలలోని ఎంఐఎంఎస్ కళాశాల రెండో బహుమతి సాధించింది. క్రాస్కంట్రీ పోటీల్లో హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకాలేజీ ప్రథమ బహుమతి, ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కాలేజీ ద్వితీ య బహుమతి సాధించింది. ఓవరాల్ చాంపియన్గా హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిలిచింది. కార్యక్రమంలోయూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమారస్వామి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. సోమన్న, సెక్రటరీ సునీల్రెడ్డి, డాక్టర్ ఆశీర్వాదం, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ముగిసిన అంతర్ కళాశాలల క్రీడాపోటీలు బహుమతులు ప్రదానం చేసిన రిజిస్ట్రార్ -
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షి, మహబూబాబాద్: ఈ చిత్రంలో పిల్లలకు షూ పంపిణీ చేస్తున్న దంపతుల పేరు యాళ్ల మురళీధర్రెడ్డి, సాధనారెడ్డి. వీరిది మహబూబాబాద్ పట్టణం. కుమార్తె ఆన్సారెడ్డి పుట్టిన రోజు వేడుకను పట్టణంలోని రాంచంద్రాపురం కాలనీలోని దైవ కృప అనాథాశ్రమంలోని చిన్నారులు, వృద్ధుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి.. ఆడిపాడి.. తెచ్చిన రకరకాల వంటకాలను వారితోనే కలిసి తిని తీపి జ్ఞాపకాలతో తిరిగి వచ్చారు. ఖిలా వరంగల్: ఈ చిత్రంలో అనాథ పిల్లలకు నోట్బుక్స్ అందిస్తున్నది రావికంటి అశోక్, శ్రీదేవి దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వారి జన్మదిన వేడుకలను ప్రతీ ఏడాది అనాథ పిల్లల నడుమ నిర్వహిస్తున్నారు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి నడుమ గడుపుతున్నారు. ఏటా హనుమకొండలోని ఒయాసిస్ చారిటబుల్ ట్రస్ట్లోని అనాథ పిల్లలకు రాఖీలు కట్టి, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసి వేడుకలు జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. -
జస్టిస్ గవాయ్ దళితుడైనందునే ఈ వివక్ష..
హన్మకొండ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవా య్పై దాడికి యత్నం జరిగితే ఇప్పటి వరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. శనివారం హనుమకొండలోని హోట ల్ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరిస్తున్న వ్యవస్థలు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడి యత్నం ఘటనలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఘ టన జరిగి 19 రోజులైనా ఇంకా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం దళితుడు అయినందు నే కేసు నమోదు చేయడం లేదన్నారు. ఈ స్థానంలో ఇతరులుంటే ఎప్పుడో కేసు నమోదు చేసే వారన్నా రు. ఢిల్లీ పోలీసులు,జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసును స్వీకరించలేదన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఓ రౌడీషీటర్ ఎన్కౌంటర్లో చనిపోతే తెలంగాణ మానవ హక్కు ల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. ఇలా అనేక సందర్భాల్లో సుమోటో కేసులు నమోదైన అంశాలను వివరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, జిల్లా ఇన్చార్జ్ సోమన్న, నాయకులు శ్రీనివాస్, వెంకటస్వామి, శివ, నారా యణ, మంద వర్ధన్ , రాజేశ్, అనిల్ పాల్గొన్నారు. ఆయనపై దాడికి యత్నం జరిగితే కేసు ఎందుకు నమోదు చేయలేదు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ -
‘డ్వాక్రా’ సంఘాల్లో గందరగోళం
మహబూబాబాద్: కొన్ని డ్వాక్రా గ్రూపుల లీడర్లు, ఆర్పీలు సభ్యులకు తెలియకుండా రుణం డబ్బులు డ్రా చేశారు. దీంతో ఆయా సంఘాల సభ్యులు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడంతోపాటు మెప్మా కార్యాలయంలో వినతులు అందచేశారు. బ్యాంక్ సిబ్బంది సహకారాలతోనే డబ్బులు కాజేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. మెప్మా అధికారులు పరిష్కారం చేయకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు చేసినట్లు సమాచారం. 2,701 డ్వాక్రాగ్రూపు సంఘాలు మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) పరిధిలో మానుకోట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం మున్సిపాలిటీ ఉన్నాయి. కాగా, కేసముద్రం మున్సిపాలిటీగా మారినా ఆన్లైన్లో సమాచారం నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 339 డ్వాక్రా గ్రూపులు 3,092 మంది సభ్యులు ఉన్నారు. మానుకోట మున్సిపాలిటీలో 1,620 గ్రూపులు 15,617 మంది సభ్యులు, మరిపెడ పరిధిలో 331 సంఘాలు, 3,273 మంది సభ్యులు, తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 411 సంఘాలు 4,044 మంది సభ్యులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రతీ గ్రూపులో అధ్యక్షురాలు, కార్యదర్శితోపాటు 8 మంది సభ్యులు ఉంటారు. రుణాల మంజూరు పత్రాల తయారీ ఇతరత్రా మెప్మా కార్యాలయంలోనే జరుగుతాయి. 98 మంది ఆర్పీలు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 98 మంది రిసోర్స్ పర్సన్లు, ఒక ఆర్పీ పరిధిలో 18 నుంచి 25 సంఘాలు ఉంటాయి. సంఘాలతో సమావేశాలు, ప్రభుత్వ పథకాలు, రుణాలు ఇప్పించడం వీరి పని. కానీ, కొంతమంది ఆర్పీలు కాసులకు కక్కుర్తిపడి కొన్ని సంఘాల లీడర్లతో కుమ్మక్కై కొంతమంది బ్యాంక్ సిబ్బంది సహకారంతో డబ్బులు డ్రా చేస్తున్నారు. గ్రూపు పేరున ఆర్పీ బి.జయ, లీడర్లు కలిసి రుణం డబ్బులు డ్రా చేసి రూ.పది లక్షలు కాజేశారని ఈ ఏడాది ఆగస్టులో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఎంపీఎస్ డ్వాక్రా గ్రూపు సభ్యుల్లో ఐదుగురు మెప్మా కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. తమ సంతకాలు పోర్జరీ చేసి రుణం కాజేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెప్మా అధికారుల విచారణలో.. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేశారని తేలింది. దీంతో రూ.10 లక్షలు రికవరీ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. 2024 నవంబర్ 21న జిల్లా కేంద్రానికి చెందిన శ్రీమహాలక్ష్మి గ్రూపు సభ్యులు కూడా రుణం విషయంలో అన్యాయం జరిగిందని బ్యాంక్ అధికారులు తప్పు చేశారని ఆందోళన చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కూడా పలు సంఘాల సభ్యులు తమకు తెలియకుండానే డబ్బులు డ్రా చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రికవరీ చేస్తున్నాంబ్యాంక్ అధికారుల తప్పిదంతోనే రుణం మంజూరైంది. మెప్మా నుంచి ఎంసీపీ డాక్యుమెంట్లు ఇతరత్రా లేకుండానే రుణం ఇచ్చారు. గ్రూపు రుణం మంజూరు కాగా.. కొంతమంది రుణం వద్దని చెప్పడంతో మిగిలిన వారు, ఆర్పీ కలిసి రుణం డబ్బులు తీసుకున్నారు. కేవలం వారి టార్గెట్ కోసమే రుణం డబ్బులు ఇచ్చారు. – విజయ, మెప్మా పీడీ సభ్యులకు తెలియకుండానే రుణం నగదు డ్రా ఆర్పీల నిర్వాకంతో దందా కొంత మంది బ్యాంక్ సిబ్బంది తప్పిదాలతోనే..? న్యాయం చేయాలని మహిళల వేడుకోలు -
కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల నిర్వహణకు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సంబంధిత అధికారులతో శనివారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ సంబంధిత అధికారులంతా సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గన్నీ బ్యాగులు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో 242 కేంద్రాలను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణం విషయంలో రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓ గణేష్, డీసీఓ వెంకటేశ్వర్లు, డీసీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఏఓ విజయనిర్మల, తదితరులు పాల్గొన్నారు. -
కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు. -
ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన
హన్మకొండ: ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టీజీ ఎన్పీడీసీఎల్ దృష్టి సారించింది. ఈ మేరకు అధికారులు అనువైన స్థలాల గుర్తింపు కోసం సర్వే చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 80కి తగ్గకుండా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ మేరకు రెండు రోజులుగా స్థల పరిశీలన చేస్తున్నారు. శనివారం టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి, ఏడీఈ పి.మల్లికార్జున్, ఏఈ మధులిక, లైన్ ఇన్స్పెక్టర్ మహేందర్ రాజు, లైన్మెన్ సతీశ్ సర్వే చేశారు. ఇప్పటి వరకు 46 స్థలాలను గుర్తించారు. ఇందులో ప్రభుత్వ స్థలాలు 19, పబ్లిక్ రంగ సంస్థలు 6, ప్రైవేట్ స్థలాలు 21 గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికిల్ ఎన్హాన్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు రాయితీ అందిస్తుంది. హనుమకొండ జిల్లాలో 80కి తగ్గకుండా ఏర్పాటు టీజీ ఎన్పీడీసీఎల్ అధికారుల సర్వే -
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
● ఆలయాల్లో నాగదేవతలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలుమహబూబాబాద్ రూరల్: నాగుల చవితిని పురస్కరించుకుని భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచామృత అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పార్వతీరామలింగేశ్వరస్వామి దేవాల యం, ముత్యాలమ్మ దేవాలయం, ఏ క్యాబిన్ రోడ్డులోని నాగేంద్రుడిపుట్ట వద్ద, వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయం, వేణుగోపాలస్వామివారి దేవాల యం, వేంకటేశ్వర బజార్లోని స్వయంభూ పార్వ తీ రామలింగేశ్వరసహిత వేంకటేశ్వరస్వామి దేవాల యం, భక్త మార్కండేయ శివాలయం, శిఖారుఖానగడ్డ ముత్యాలమ్మ దేవాలయం, నర్సంపేట రోడ్డులోని మహాగాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. -
ఇందిరమ్మ ఇళ్ల పేరిట దందా!
చిన్నగూడూరు: మండల కేంద్రం శివారు ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లోడ్తో ట్రాక్టర్లు మండల కేంద్రం ప్రధాన వీధుల గుండా వెళ్తుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వీధుల గుండా నిత్యం పాఠశాలల విద్యార్థులు, రైతులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండడంతో ఇసుక ట్రాక్టర్ల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.అక్రమంగా ఇసుక రవాణా -
టెండర్ల దందా!
కూరగాయల మార్కెట్లోవరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో వేలం(టెండర్)దందా జరుగుతోందనే ఆరోపణలు వి నిపిస్తున్నాయి. మా ర్కెట్లో వినాయకచవితి ఉత్సవాల నిర్వహణ, మార్కెట్లో మృతి చెందిన వ్యాపారులు, కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సా యం అందిస్తామన్న పేరుతో 20 సంవత్సరా లుగా వేలం(టెండర్) నిర్వహిస్తున్నారు. అయితే ఆ వేలంలో వచ్చిన ఆదాయాన్ని బాధితులకు అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన వేలలో రూ.6.80లక్షలు సమకూరినప్పటికీ నేటికీ ఆర్థిక సాయం అందించకపోవడంతో పలువురు వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లోని కమీషన్ వ్యాపారులు ‘ది వరంగల్ సిటీ వెజిటబుల్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్’ పేరుతో 2005 ఆగస్టులో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ చేయించిన కార్యవర్గం కనీసం పాన్కార్డు తీయకపోవడంతో బ్యాంకు అకౌంట్ తీసే అవకాశం కోల్పోయారు. దీంతో అసోసియేషన్ ఆదాయవ్యయాలు మొత్తం కార్యవర్గంలోని ఒకరిద్దరి చేతుల్లోనే జరిగాయి. మార్కెట్లో 2005నుంచి 2023 సంవత్సరం వరకు పెట్టిన టెండర్లతో సుమారు రూ.కోటిన్నర వరకు నిధులు సమకూరినట్లు వ్యాపారుల్లో చర్చ జరిగింది. దీనిపై కమీషన్ వర్తక సంఘం నాయకులు ఎప్పటికప్పుడు లెక్కలు చూస్తున్నామని చెప్ప డం.. వారికి రాజకీయంగా అండ ఉండడంతో మిగతా వ్యాపారులు నోరుమెదపలేకపోయారు. లెక్కలు కొంత మందికి తెలియడంతో మిగతా వ్యాపారులు ఇందులో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. గడిచిన 20ఏళ్లలో రెండు, మూడు కమిటీలు మారినప్పటికీ లెక్కలు ఏనాడు వర్తకసంఘంలోని సభ్యులకు చెప్పిన దాఖలాలు లేవు. ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో వ్యాపారులు బహిరంగంగా ఆరోపణలు చేశారు. చివరకు లెక్కలపై ఆరోపణలు తీవ్రం కావడంతో 2024జూలైలో కమీషన్ వ్యాపారుల సంఘం కార్యవర్గాన్ని రద్ద చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి కొత్తగా ఎన్నికలు పెడతామని ప్రకటించినా పలుమార్లు వాయిదా పడ్డాయి. దీనికి మారిన రాజకీయ సమీకరణలు సైతం కారణమని పలువురు పేర్కొంటున్నారు. తూర్పు ముఖ్య నేత మారడంతో అప్పుడు ఉన్న నాయకులు కొంత కాలం వేచి చూసి మార్గం సుగమం చేసుకున్నారు. చివరకు తాజాగా రద్దయిన కమిటీలో ఉన్న వారితోనే మళ్లీ ఇటీవల నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యింది. ప్రజాస్వామ్య పద్ధతిలో అసోసియేషన్ ఎన్నికలు జరపాలని మెజార్టీ వ్యాపారులు డిమాండ్ చేసినా అధికార పార్టీ నాయకుల అండతో పాత కమిటీ మళ్లీ కొత్తగా పురుడుపోసుకుంది.కూరగాయల మార్కెట్లో వినాయకచవితి నిర్వహణతో పాటు మార్కెట్లో వ్యాపారం, హమాలీ పనులు చేస్తూ మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని వేలం (టెండర్) పెట్టి వచ్చిన ఆదాయానికి 20 ఏళ్లుగా లెక్కలు చూపకపోవడంతో వ్యాపారులు ఆరోపణలు చేయడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమవడం కలెక్టర్ దృష్టికి వచ్చింది. నిధుల వ్యయంపై స్పష్టత లేకపోవడం గమనించిన అప్పటి కలెక్టర్ ప్రావీణ్య టెండర్ మార్కెట్లో పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి టెండర్ జోలికి పోని వ్యాపారులు.. కొత్త కమిటీ రావడంతో మృతి చెందిన వారికి ఆర్థిక సాయం పేరుతో ఆగస్టు 26న వేలం (టెండర్)పెట్టారు. కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా వేలం పెట్టొద్దని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు.గతంలో సమకూరిన నిధులెక్కడ సంఘానికి అకౌంట్ లేదు.. లెక్కలు లేవు? టెండర్ పెట్టొద్దనే కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ తాజాగా టెండర్ పెట్టినా నేటికీ అందని ఆర్థిక సాయం మరోసారి పెట్టేందుకు పావులు కదుపుతున్న నాయకులురెండు నెలలైనా సాయం ఏది?వేలం(టెండర్)తో వచ్చిన ఆదాయాన్ని మార్కెట్లో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం రెండు నెలలైనా అందించలేదు. వచ్చిన ఆదాయంలో ఎంత మందికి ఎంతెంత అందిస్తారనే విషయం ఇప్పటి వరకూ గోప్యంగానే ఉంది. ఆర్థిక సాయం అందజేత విషయంపై వర్తక సంఘం బాధ్యులను అడిగితే మంత్రి సమయం తీసుకుని ఆర్థిక సాయం చెక్కులు బాధితులకు అందజేస్తారు అనే సమాధానం వస్తోంది. సంఘానికి బ్యాంకు అకౌంట్ లేకుండా చెక్కులు ఎలా ఇస్తారో వేచి చూడాల్సిందే. మళ్లీ త్వరలోనే మరోసారి వేలం (టెండర్)నిర్వహించేందుకు వర్తకసంఘం నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం.


