breaking news
Mahabubabad
-
అంత్యక్రియలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..
వర్ధన్నపేట: తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఓ వృద్ధురాలు అనంతలోకాలకు చేరింది. బైక్ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో తల్లి దుర్మరణం చెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన మున్సిపాలిటీ పరిధి వరంగల్–ఖమ్మం రహదారి డీసీ తండా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కమ్మనపల్లి తండా గ్రామానికి చెందిన గుగులోత్ రేశమ్మ(56) తన కుమారుడు తుకారంతో కలిసి గురువారం ఉదయం బైక్పై రాయపర్తి మండలం టీకే తండాలో జరిగిన తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం అదేరోజు రాత్రి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వరంగల్– ఖమ్మం రహదారి డీసీ తండా వద్ద ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రేశమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కుమారుడు తుకారామ్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఎంజీఎం తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని గేదెల కాపరి .. మహబూబాబాద్ రూరల్ : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ గేదెల కాపరి దుర్మరణం చెందగా మూడు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర మిల్ తండా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కాలనీకి చెందిన రేఖ సోమయ్య మేనల్లుడు గంగుల వెంకన్న (42) గేదెలను మేత నిమిత్తం గురువారం ఉదయం మున్నేరువాగు సమీపంలోకి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో తీసుకుని వస్తుండగా నర్సంపేట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కంకరమిల్ తండా వద్ద గేదెలను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ మూడు గేదెలు వచ్చి వెంకన్నపై పడగా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గేదెలకు వైద్య చికిత్స చేయిస్తున్నారు. అనంతరం మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బొలెరో ఢీకొని అయ్యగారిపల్లిలో రైతు.. కురవి: చేను వద్ద నుంచి నడుచుకుంటూ ఇంటికొస్తున్న ఓ రైతును బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండలంలోని అయ్యగారిపల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు పొన్నెబోయిన మధుసూదన్(48) చేను వద్ద పని ముగించుకుని పశువులను ఇంటికి తోలుకొస్తున్నాడు. ఈ క్రమంలో బొలెరో వాహనం మరిపెడ నుంచి కురవి వైపునకు వస్తూ మధుసూదన్ను ఢీకొంది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే మానుకోట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. మధుసూదన్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. బైక్ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ తల్లి దుర్మరణం.. కుమారుడికి తీవ్రగాయాలు డీసీ తండా వద్ద ఘటన -
ముందే వచ్చిన శీతాకాల అతిథి!
హన్మకొండ అర్బన్: సాధారణంగా శీతాకాలం(అక్టోబర్– మార్చి)లో దక్షిణ ఆసియా, భారతదేశం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), శ్రీలంక వరకు వలస వచ్చే బ్లూథ్రోట్ (నీలగొంతు పిట్ట) ఈ ఏడాది ముందే వచ్చింది. దీని శాసీ్త్రయ నామం లూస్కినియా స్వేసికా. ఈ పక్షి ఫొటోను నగరానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు జగన్ కాజీపేట మండలం అమ్మవారిపేట చెరువు సమీపంలో గంటల కొద్ది నిరీక్షించి తన కెమెరాలో బంధించారు. సాధారణంగా శీతాకాలంలో చెరువులు, నీరు, గడ్డిపొదలు, పొలాల అంచుల దగ్గర ఎక్కువగా ఈ పక్షులు కనిపిస్తాయని తెలిపారు. మగపక్షి గొంతు భాగంలో నీలి రంగు ఉంటుంది. అందుకే దీనికి బ్లూథ్రోట్ అనే పేరు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా చు రుకై న పిట్ట అని, తరచూ తోక కదుపుతూ, కిందికి పైకి ఎగిరి కీటకాలను పట్టుకుంటుందని వివరించారు. దీని కూత మధురంగా ఉంటుందని, కొన్నిసార్లు ఇతర పక్షుల స్వరాలను కూడా అనుకరిస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రకృతి వలసల పరిశోధనలకు ముఖ్యమైన జాతిగా కూడా వివరించారు. -
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్కు గురువారం 1,386.900 మెట్రిక్ ట న్నుల స్పిక్ కంపెనీ యూరియా, 507 మెట్రిక్ టన్నుల 20.20.013 రకం ఎరువులు చేరాయి. యూరియా వ్యాగన్ను కంపెనీ అధికారులు రమణరెడ్డి, తిరుమల్రావులతో కలిసి వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి పరి శీలించారు. 1,386.900 మెట్రిక్ టన్నుల స్పిక్ యూరియాను వరంగల్ జిల్లాకు 256, హనుమకొండ 250, ములుగు 240, భూపాలపల్లి 300, జనగామ జిల్లాకు 340 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు డబుల్ ధమాకా ● సాంకేతిక లోపంతో రెండుసార్లు రూ.లక్ష చొప్పున జమ జనగామ: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సాంకేతిక లోపం డబుల్ ధమాకాతో మురిపించింది. గృహ నిర్మాణ సంస్థ సాఫ్ట్వేర్లో ఏర్పడిన సమస్యతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రెండుసార్లు రూ.లక్ష చొప్పున బిల్లులు జమయ్యాయి. ఈనెల 12, 15(శుక్రవారం, సోమవారం)వ తేదీల్లో ఒక్కో లబ్ధిదారుడి ఖాతాల్లో రెండుసార్లు రూ.లక్ష చొప్పున డిపాజిట్ అయినట్లు సమాచారం. లబ్ధిదారుల ఖాతాల్లో రెండుసార్లు డబ్బులు జమ కావడాన్ని ఆలస్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు తిరిగి ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాలో సుమారు 20 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున రెండు సార్లు డబ్బులు జమైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషయమై జనగామ హౌసింగ్ పీడీ మాతృనాయక్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 15 మంది ఉండొచ్చని, ఎవరు కూడా డబ్బులు డ్రా చేసుకోలేదని, రేపటికల్లా తిరిగి తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ పరిధి మిగతా జిల్లాలోనూ 20–30 మందికి రెండుసార్లు డబ్బులు జమ అయినట్లు తెలిసింది. విద్యార్థులు పఠనాసక్తి పెంపొందించుకోవాలి హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: విద్యార్థులు పఠనాసక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ జిల్లా వి ద్యాశాఖాధికారి డి.వాసంతి కోరారు. ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్కు విశ్రాంత ఉపాధ్యాయుడు తాడూరి రమేశ్ ఇచ్చిన రూ.50 వేల విరాళంతో గ్రంథాలయం, గ్రానైట్ యజమాని సత్యనారాయణ ఇచ్చిన రూ.50 వేలతో ల్యాబ్ను పీజీ హెచ్ఎం బద్దం సుదర్శన్రెడ్డి ఏర్పాటు చేయించారు. ఈ మేరకు గురువారం ల్యాబ్, గ్రంథాలయాన్ని ఆమె దాతలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పుస్తక పఠనంతోనే విద్యార్థుల్లో జ్ఞానం పెరుగుతుందన్నారు. మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం దుర్గాభవాని, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి, పాఠశాల చైర్పర్సన్ నీరజ, గ్రామ మాజీ సర్పంచ్ రత్నాకర్, ప్రతాప్, రామారావు, ఉపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, వెంకటస్వామి, వెంకటసుహాసిని, పద్మలత, కల్యాణి, రమాదేవి, ప్రసాద్రావు, అఖిల్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పంచ పరివర్తనతోనే సమాజ పరివర్తన
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కేయూ క్యాంపస్: పంచ పరివర్తనతోనే సమాజ పరివర్తన సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ రిజి స్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం కేయూలో నిర్వహించిన విజయదశమి ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వ దేశీ, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ బలో పేతం, సామాజిక సామరస్యత, పౌర వ్యవస్థ బలో పేతం లాంటి అంశాలు సమాజ మార్పునకు పునా ది రాళ్లు అవుతాయన్నారు. ఆర్ఎస్ఎస్ దేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో కార్యకర్తలు ఐసో లేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారని ఆహారం, ఔషధాలు కూడా సరఫరా చేశారన్నారు. ఉత్సవ వక్త, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఖా నాపురం ఉదయ్కుమార్మాట్లాడుతూ దేశంలో సమాజ పరివర్తన వ్యక్తి పరివర్తనతోనే సాధ్యమన్నా రు. అందుకు పంచ పరివర్తన కీలకమన్నారు. రిటైర్డ్ ఆచార్యులు చిలుకమారి సంజీవ, జి. దామోదర్, పాలకమండలి సభ్యులు డాక్టర్చిర్రరాజు, ప్రొఫెస ర్లు స్వర్ణలత, మామిడాల సుధాకర్, డాక్టర్ మంజుల, డాక్టర్ మమత తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 72 నెట్వర్క్ హాస్పిటల్స్ గీసుకొండ: పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ సేవలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సగం ఆస్పత్రుల్లో నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల వారు సేవలు నిలిపివేశారు. ప్రభుత్వం తరఫున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఉదయ్కుమార్ విజ్ఞప్తి చేశారు. తక్షణమే బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 72 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా వాటిలో 34 ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేసినట్లు వాటి యాజమాన్యాలు చెబుతున్నాయి. మిగతా ఆస్పత్రుల్లో సేవలు కొనసాగుతున్నాయని, సేవలను నిలిపివేసిన యాజమాన్యాలకు నచ్చజెబుతున్నామని ఆరోగ్యశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ స్వరూప్ తెలిపారు. అయితే, ఉమ్మడి జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఎంత బకాయి ఉందనేది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పోర్టల్లో కనిపించడం లేదు. నెట్వర్క్ ఆస్పత్రులు, ట్రస్ట్ మధ్యనే ఈ లెక్కల వివరాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో నెట్వర్క్ ఆస్రత్రులకు ప్రతీ రోజు సుమారు 2,500 వరకు రోగులు పరీక్షలు చేయించుకోవడానికి వస్తుంటారని, వారిలో సుమారు 180 మంది వరకు చికిత్స, ఆపరేషన్లు చేయించుకోవడానికి జాయిన్ అవుతారని తెలుస్తోంది. గత ఏడాది మార్చి నెల నుంచి తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆస్పత్రుల వారు అంటున్నారు. తాము భరించలేని విధంగా ఖర్చులు పెరుగుతుండటంతో తప్పని పరిస్థితిలో సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని ఆస్పత్రుల వారు సేవలను నిలిపివేయడంతో ఫాదర్ కొలంబో, ప్రతిమ, ఎంజీఎం, కేఎంసీలోని ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగే, సేవలు కొన్ని రోజులపాటు కొనసాగితే రోగులకు ఇబ్బంది తప్పేలా లేదు. ఈ విషయమై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెట్వర్క్ ఆస్పత్రులు జిల్లా పేరు నెట్వర్క్ సేవలు ఆస్పత్రులు నిలిపివేసినవిహనుమకొండ 45 21 వరంగల్ 14 10 జనగామ 4 0 మహబూబాబాద్ 7 2 భూపాలపల్లి 2 1 ములుగు 0 0 మొత్తం 72 34 వాటిలో 34 ఆస్పత్రుల్లో నిలిచిన సేవలు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలంటున్న యాజమాన్యాలు ప్రతీ రోజు సుమారు 2,500 మంది రోగులకు ట్రస్ట్ వైద్యం -
తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
కాజీపేట: ఆ కుటుంబ పెద్ద దుకాణంలో పనిచేస్తే రోజుకు రూ.200. ఆ ఇంటామె కూలీకి వెళ్తే రూ.300. ఆ కూలీ పని కూడా నెలలో 10 రోజులు దొరకడం కష్టమే. ఇల్లు లేదు. జాగా లేదు. ఉన్నదాంట్లో సర్దుకుపోదామనుకున్న ఆ దంపతులకు.. కూతురు ఆరోగ్యం నిద్రపట్టనివ్వట్లేదు. కాజీపేట పట్టణం బాపూజీనగర్ కాలనీకి చెందిన తోకల సర్వేష్, ప్రేమలత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె యశ్వత (5) మానసిక స్థితి సరిగ్గా లేదు. ఇప్పటికీ నడవలేని దుస్థితి. దుకాణంలో జీతం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న సర్వేష్కు కూతురుకు వైద్యం చేయించడం కష్టంగా మారింది. ఇప్పటికే రూ.4 లక్షలు చికిత్స కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కార్పొరేట్ ఆస్పత్రిలో చూపిస్తే తప్ప పరిస్థితి ఏంటో అర్థంకాదని వైద్యులు సూచించడంతో కూతురును అలా వదిలేయలేక, సరైన వైద్యం చేయించే స్తోమత లేక కన్నవాళ్లు తల్లడిల్లుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారిన తల్లిదండ్రులు కార్పొరేట్ వైద్యం ఎలా చేయించాలో తెలియక కన్నీళ్లు పెడుతున్నారు. దాతలు ఆర్థిక సాయం అందించి చిన్నారికి ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం అందించాలనుకుంటే.. కల్వల ప్రేమలత యూనియన్ బ్యాంక్ కాజీపేట బ్రాంచ్ ,అకౌంట్ నంబర్ 122710100091805ఐఎఫ్ఎస్సీ కోడ్ యుబీఐఎన్ 0802999మెయిన్ రోడ్ కాజీపేట 63008 -12559 నంబర్కు ఫోన్పే చేయవచ్చు. ఐదేళ్ల వయసొచ్చినా మంచానికే పరిమితం మానసిక స్థితి బాగాలేని యశ్విత ఆస్పత్రులు తిరిగి ఉన్నదంతా ఖర్చు చేసిన తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు -
గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : నలుగురు గంజాయి రవాణాదారులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.అపర్ణాదేవి గురువారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి కథనం ప్రకారం.. హసన్పర్తి ఏఎస్సై ఉపేందర్రావు 2017, జనవరి 16న మల్లారెడ్డిపల్లి శివారులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు ద్విచక్రవాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా పట్టుకున్నారు. అనంతరం తనిఖీ చేయగా బస్తాలో ఎండు గంజాయి లభించింది. వెంటనే విచారించగా ద్విచక్రవాహనంపై వచ్చిన వారు శాయంపేట మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన నారిగే రాజయ్య, గంగిరేనిగూడెం సూర్యానాయక్ తండాకు చెందిన లావుడ్య భద్రమ్మగా తెలిసింది. గ్రామస్తుడు దుప్పటి మల్లయ్యతో కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మల్లారెడ్డిపల్లికి చెందిన రైతులు బొల్ల అయిలయ్య , దాసరి కుమారస్వామి నుంచి కిలో గంజాయి రూ.వెయ్యికి కొనుగోలు చేసి హైదరాబాద్, కదిరి, మహారాష్ట్రకు కిలో రూ.6,500 చొప్పున అమ్మడానికి రవాణా చేస్తున్నామని ఒప్పుకున్నారు. అలాగే, వీరికి కొద్ది దూరంలో మరో రెండు బస్తాల గంజాయితో దుప్పటి మల్ల య్య, బొల్ల అయిలయ్య, దాసరి కుమారస్వామి ఉన్నారని తెలిసింది. పోలీసుల రాకను గమనించిన ముగ్గురు పరారయ్యారు. అనంతరం నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో నలుగురు నేరస్తులు లావుడ్య భద్రమ్మ, దుప్పటి మల్లయ్య, బొల్ల అయిలయ్య, దాసరి కుమారస్వామికి 10 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెల్లడించారు. కాగా, విచారణ సమయంలోనే ప్రధాన ముద్దాయి నారిగే రాజయ్య మృతి చెందాడు. ఈ కేసును పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, కిషన్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ పరమేశ్వరి విచారణ పర్యవేక్షించారు. సాక్షులను హెడ్ కానిస్టేబుల్ వి.రవీందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. -
విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి
నర్సంపేట : విద్యుదాఘాతంతో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం ఖాదర్పేటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన చిరబోయిన రాజు(30) ఖాదర్పేటలోని పెండ్లి ఐలయ్య ఇంటి నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ పనులు చేయడానికి వెళ్లాడు. బుధవారం స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ సరి చేస్తున్న క్రమంలో చేతిలో ఉన్న బైండింగ్ వైర్ ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్కు గురై కింద పడగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య మౌనిక, కుమారులు వరుణ్సాయి, చరణ్సాయి ఉన్నారు. రైలు ఢీకొని వ్యక్తి.. కేసముద్రం/ ఖిలా వరంగల్: ట్రాక్ దాటుతుండగా గూడ్స్ (రైలు) ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సుదర్శన్ కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధి ఎన్టీఆర్ నగర్కు చెందిన భుక్యా లక్కు(53) ఇంటికన్నె–కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య ఫ్లై ఓవర్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా డౌన్లైన్లో వచ్చిన గూడ్స్ ఢీకొంది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పత్తి కొనుగోళ్లకు పూజలు
వరంగల్ చౌరస్తా: పత్తి కొనుగోళ్ల కోసం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పలువురు వ్యాపారులు, అడ్తిదారులు కాంటాల వద్ద గురువారం ప్రత్యేక పూజాలు చేశారు. కొద్ది రోజులుగా కొత్త పత్తి వస్తున్న నేపథ్యంలో పూజలు చేసి, కాంట్రాలు ప్రారంభించారు. మారని సరుకుల ధరలతో అయోమయం రైతులకు మెరుగైన సేవలు అందించడంలో మార్కెట్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల మార్పులు, చేర్పులను హాజరు సూచిక పట్టికలో నమోదు చేయడంలో యంత్రాంగం విఫలమైంది. మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శి జి.రెడ్డి సెలవుల్లో ఉండటంతో ధరల మార్పులు, చేర్పులు చేసే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా పట్టికలో మార్పులు చేయాలని రైతులు కోరుతున్నారు. -
అవకతవకలు.. నిర్లక్ష్యం!
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025● ఐదు పీఏసీఎస్ పాలకవర్గాలపై వేటు ● రుణాల చెల్లింపుల్లో నిర్లక్ష్యమే ప్రధాన కారణం ● పర్సన్ఇన్చార్జ్ల నియామకంమహబూబాబాద్ రూరల్/తొర్రూరు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పదవీకా లాన్ని ప్రభుత్వం ఇటీవల ఆరు నెలల పాటు పొడిగించింది. కానీ నిధుల దుర్వినియోగం, రుణా ల చెల్లింపులో నిర్లక్ష్యం, డైరెక్టర్లు డిఫాల్టర్లుగా మా రిన కారణంగా జిల్లాలోని ఐదు సొసైటీల పాలకవర్గాలపై వేటు వేసింది. పలు ఆరోపణల నేపథ్యంలో తొర్రూరు, నెల్లికుదురు, బయ్యారం, కేసముద్రం పీఏసీఎస్లు, కురవి రైతు సహకార పరపతి సంఘం పాలకమండళ్ల పదవీకాలం పొడిగించలేదు. జిల్లాలో మొత్తం 18సహకార పరపతి సంఘాలు ఉండగా ఐదు సంఘాల పాలకమండళ్లను రద్దు చేసి పర్సన్ ఇన్చార్జ్లను నియమిస్తూ జిల్లా సహకారశాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అవకతవకలు.. సొసైటీల పరిధిలోని గ్రామాల రైతుల(సభ్యులు)కు రుణాలు ఇవ్వడం, ఎరువులు అందించడం వంటి సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో పలు సొసైటీల పాలకమండళ్లు నిర్వహణ ఖర్చుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు కార్యదర్శులు(సీఈఓ)లు కూడా సహకరించడంతో పలుచోట్ల వేటువేశారు. ఇదే సమయంలో ఐదు సొసైటీల పాలకవర్గాలు రద్దయ్యాయి. నిధుల దుర్వినియోగం, రుణాల చెల్లింపుల్లో నిర్లక్ష్యం, డిఫాల్టర్లయిన డైరెక్టర్లను చూపుతూ వేటు వేశారు. అంతేగాక పలు సంఘాలు నష్టాల్లో ఉన్నట్లు చూపారు. ఐదు సొసైటీలు ఆరు మాసాల పాటు పర్సన్ ఇన్చార్జ్ పాలనలో కొనసాగనున్నాయి. కారణాలివే.. ● తొర్రూరు పీఏసీఎస్లో ధాన్యం తరలింపు, గన్నీ సంచుల కొనుగోళ్లలో అవకతవకలు, డైరెక్టర్లు రుణాలు తీసుకుని చెల్లించకపోవడం, రుణాల రికవరీ, వార్షిక బడ్జెట్ సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా 2024–25లో సిబ్బంది ఖర్చులు 30 శాతానికి మించి, నిర్వహణ వ్యయం 20 శాతానికి మించి ఉండడం వంటి కారణాలతో పాలకమండలిని రద్దుచేసినట్లు తెలిసింది. ● నెల్లికుదురులో పీఏసీఎస్ పాలకవర్గ ప్రతినిధులు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహించారు. రూ.24, 47,844 రుణాలుగా పొంది సకాలంలో చెల్లించనందువల్లే పాలకమండలిని రద్దుచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ● కురవి కర్షక సేవా సహకార సంఘం మూడేళ్లుగా నష్టాల్లో ఉన్నట్లు చూపారు. ● కేసముద్రం సొసైటీలో రుణాల రికవరీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లలో లెక్కలు సరిగా చూపించకపోవడం, 2021–22 నుంచి 2023–24 వరకు ఆడిట్ నివేదికలో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాలతో పాలకమండలిపై వేటు వేసినట్లు తేలింది. ● బయ్యారం సొసైటీలో రూ.3.24 కోట్ల బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2019–20, 24–25లో సొసైటీ నిర్వహణలో రూ.28.30 లక్షల తేడా ఉన్నట్లు తేలింది. 2024–25లో రూ.33 లక్షల నష్టం వచ్చిన విషయంలో కారణాలు చూపలేదు. ఎరువుల విక్రయాల లెక్కల్లో రూ.54.37లక్షల తేడా ఉన్నట్లు తేలింది. డైరెక్టర్లు రుణాలు తీసుకుని చెల్లించలేదు. ప్రతిపక్ష నాయకులు చైర్మన్లుగా ఉండడమే కారణమా?ఐదు సొసైటీల పాలకవర్గాలను రద్దు చేయడానికి బీఆర్ఎస్ నేతలు చైర్మన్లు, డైరెక్టర్లుగా ఉండడం కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేసముద్రం చైర్మన్ ధీకొండ వెంకన్న, కురవి కర్షక సేవా సహకార సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్రెడ్డి, నెల్లికుదురు సొసైటీ చైర్పర్సన్ కాసం లక్ష్మి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో సొసైటీలను రద్దు చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయనకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి పొసగడం లేదు. దీంతో ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తున్నాడు. బయ్యారం చైర్మన్ మూల మధుకర్రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ అవినీతి ఆరోపణలు, అవకతవకలు రద్దుకు కారణమయ్యాయని పేర్కొంటున్నారు. దీంతో పాటు మెజారిటీ డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకే చెందిన వారే కావడం, స్థానిక ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడం వంటి కారణాలే పాలకమండళ్లను రద్దు చేసినట్లు చర్చించుకుంటున్నారు. -
ఉపాధ్యాయుడిని నియమించాలని రోడ్డెక్కిన విద్యార్థినులు
బయ్యారం: పాఠశాలలో ఖాళీగా ఉన్న సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ గురువారం బయ్యారం బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా గాంధీసెంటర్లో విద్యార్థినులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. విద్యార్థినుల నిరసనకు జెడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు మద్దతు పలికి వారి సమస్యను డీఈఓ, ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంఈఓ గాంధీసెంటర్కు చేరుకొని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు నిరసన విరమించారు. కాగా పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషల్ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని పీడీఎస్యూ జిల్లా కోశాధికారి మహేష్కుమార్ విద్యాశాఖాధికారులను కోరారు. -
జీపీ భవనాల్లోనే ‘మున్సిపాలిటీలు’
మహబూబాబాబాద్: జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేశారు. అయితే అప్గ్రేడ్పై శ్రద్ధపెట్టిన ప్రజాప్రతినిధులు నూతన భవన నిర్మాణాలపై పెట్టడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి గ్రామ పంచాయతీ భవనాల్లో మున్సిపల్ కార్యాలయాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సరిపడా గదులు లేక అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు సరిపోను సిబ్బంది లేక అవస్థలు తప్పడం లేదు. ఐదు మున్సిపాలీటీలు జీపీ భవనాల్లోనే.. జిల్లాలో మానుకోట, మరిపెడ, డోర్నకల్, తొర్రూ రు మున్సిపాలిటీలతో పాటు ఇటీవల కేసముద్రం కూడా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. కాగా, ప్రస్తుతం అన్ని కార్యాలయాలు గ్రామపంచాయతీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా.. 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు ఉన్నారు. 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి. విద్య, వ్యాపారం, ఉద్యోగ రీత్యా నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. తొర్రూరులో 16 వార్డులు, 19,100 జనాభా, మరిపెడలో 15 వార్డులు, 17,875 మంది జనాభా, డోర్నకల్లో 15వార్డులు 14,425 మంది జనాభా ఉంది. కేసముద్రం మున్సిపాలిటీని జనాభా ఆధారంగా 16 వార్డులుగా అధికారులు నిర్ణయించినప్పటికీ.. అధికారికంగా వార్డుల విభజన పూర్తి కాలేదు. 2018లోనే శంకుస్థాపన.. పురపాలక అభివృద్ధి నిధుల నుంచి 2018లో మానుకోట మున్సిపాలిటీ భవనానికి రూ.5కోట్లు కేటాయించారు. కాగా అనంతారం రోడ్డులో 2018 ఏప్రిల్ 4వ తేదీన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ నేటి వరకు పనులు పూర్తి కాలేదు. 80శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. జీప్లస్ వన్ భవన నిర్మాణ పనులు చేపట్టగా.. ప్లాస్టింగ్, టైల్స్ ఇతర పనులు పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో భవన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం జీపీ భవనంలోనే మున్సిపల్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. వెంటాడుతున్న సిబ్బంది కొరత.. మానుకోట మున్సిపాలిటీకి ఆఫీస్ స్టాఫ్ ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. కాగా వార్డు ఆఫీసర్లు ఇతర సిబ్బంది సమావేశ మందిరంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే పారిశుద్ధ్య సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో సంఖ్య పెంచాలని పలు మార్లు సీడీఎంఏకు వినతులు ఇచ్చారు. కానీ నూతన సిబ్బందిని తీసుకోలేదు. మరిపెడలో కమిషనర్ ఇతర రెగ్యులర్ స్టాఫ్ ఉండగా టీపీఎస్, టీపీఓ, ఏఈ లేకపోవడంతో డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. తొర్రూరులో శానిటరీ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు లేకపోవడంతో వారి స్థానంలో ఇన్చార్జ్లు పని చేస్తున్నారు. డోర్నకల్లో టీపీఎస్, ఏఈ లేరు. వారి స్థానంలో డిప్యుటేషన్పై పని చేస్తున్నారు. ఇతర సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు. కేసముద్రం మున్సిపాలిటీకి మానుకోట కమిషనర్ రాజేశ్వర్, టీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్కుమార్, ఏఈ కుమార్ ఇన్చార్జ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం డిప్యుటేషన్పై వార్డు ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ పని చేస్తున్నారు. ఆ మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. బిల్లులు రాకనే పనులు నిలిచిపోయాయి మానుకోట మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం కేవలం బిల్లులు రాకనే నిలిచిపోయింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు విడుదల కాగానే వెంటనే పనులు పూర్తి అయ్యేలా చూస్తాం. ఆ భవనం పూర్తి అయితే పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సిబ్బందికి ఏ సమస్య ఉండదు. –టి.రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిషనర్● కార్యాలయాల్లో గదులు సరిపోక అధికారుల ఇబ్బందులు ప్రతిపాదనలకే పరిమితమైన నూతన భవనాలు వేధిస్తున్న సిబ్బంది కొరతభవనాల మంజూరే లేదు.. మరిపెడ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం స్థలంలోనే నిర్మాణం చేయడానికి నిర్ణయించారు. టెండర్ పూర్తయింది.. కానీ నిధులు రద్దు కావడంతో పనులు ప్రారంభించలేదని అధికారులు పేర్కొన్నారు. డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల కార్యాలయాలు గ్రామపంచాయతీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇటీవల మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన కేసముద్రం కార్యాలయం కూడా జీపీ భవనంలోనే కొనసాగుతోంది. ఆ మున్సిపాలిటీకి నిధులు మంజూరు అయ్యా యి. ఆ నిధుల నుంచి కార్యాలయ భవన నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు. -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
కేయూ క్యాంపస్: తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం వర్సిటీలోని కామర్స్ విభాగం, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ విభాగాల వద్ద విద్యార్థులు, మహిళా అధ్యాపకులు బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల మహిళా అధ్యాపకులు డాక్టర్ రమ, మేఘనరావు, పి.అమరవేణి, వరలక్ష్మి, ఎస్ జ్యోతి, మమత, సవితాజ్యోత్స్న, దీపాజ్యోతి, డాక్టర్ సౌజన్య, నీలిమ, ప్రగతి పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, ఆచార్య నర్సింహాచారి అధ్యాపకులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్కురవి: పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలురు, బాలికల వసతి గృహాలను, విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్, పరిసరాలను పరిశీలించారు. చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కిచెన్, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, తాగునీరు, తదితర వాటిని తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించి వంట మనుషుల అనుభవం, భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజ నం అందించాలన్నారు. జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల సంఖ్య, హాజరును పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి,విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాల్లోని వివిధ అంశాలపై విద్యార్థులను ప్రశ్నించగా సరైన సమాధానాలు చెప్పడంతో అభినందించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం జాగ్రత్తలు తెలిపారు. చదువుతోపాటు క్రీడలను నేర్పించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని అన్నారు. కార్యక్రమంలో సీరోలు తహసీల్దార్ పున్నంచందర్, ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ సంతోష్సోని, హెచ్ఎం బంగారి, ఆర్ఐలు సుమతి, శ్రావణి, గ్రామ పాలన అధికారి వీరస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సేవలు అస్తవ్యస్తం
డోర్నకల్: నియోజకవర్గ కేంద్రమైన డోర్నకల్లో ఆర్టీసీ సేవలు అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోర్నకల్ నుంచి మహబూబాబాద్, డోర్నకల్–ఖమ్మం, మహబూ బాబాద్–గార్ల–ఖమ్మం బస్సులు నడుస్తున్నా యి. అయితే ఆయా రూట్లలో బస్సులు ఎప్పుడు వస్తా యో తెలియని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ నిరుపయోగం.. బైపాస్ రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారడం, బస్సుల టైంటేబుల్ లేకపోవడం, సమయానుకూలంగా బస్సులు నడవకపోవడంతో ప్ర యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ నిరుపయోగంగా మారడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్, గాంధీ సెంటర్ వద్ద ఎండలో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. తరచూ రైళ్లు రద్దుకావడం, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండడంతో ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నా రు. సరిపడా సర్వీసుల నడపకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతాలతో ప్రత్యేక అనుబంధం.. డోర్నకల్ ప్రాంత ప్రజలకు ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు ప్రాంతాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. కాగా, కొత్తగూడెం మార్గంలో రైళ్లు సక్రమంగా నడవకపోవడం, అలాగే బస్సు సౌకర్యం లేకపోవడం, ఇల్లెందుకు ఒకే బస్సు నడుస్తుండడం ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ప్రతీరోజు డోర్నకల్ నుంచి కొత్తగూడెం మార్గంలో వందలాది మంది ప్రయాణిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి డోర్నకల్ మీదుగా భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని ఈ ప్రాంత ప్రజలు చాలాకాలంగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ అధికారులు స్పందించి డోర్నకల్లో బస్టాండ్ విని యోగంలోకి తేవాలని, డోర్నకల్ మీదుగా భద్రాచలం వరకు ప్రతీరోజు బస్సులు నడపాలని స్థానికులు కోరుతున్నారు. నిరుపయోగంగా బస్టాండ్ బస్సుల టైంటేబుల్ లేకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు భద్రాచలం బస్సు నడపాలని స్థానికుల డిమాండ్ -
పేదలకు భరోసా కల్పించాలి
● డీఆర్డీఓ మధుసూదన్రాజు తొర్రూరు: ఉపాధిహామీ పనులు కల్పించి పేదలకు భరోసా కల్పించాలని డీఆర్డీఓ మధుసూదన్రాజు తెలిపారు. డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఉపాధిహామీ పనులపై ప్రజావేదిక కార్యక్రమం చేపట్టారు. 2024–25లో మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. మండలంలో రూ.3 కోట్ల విలువ చేసే 277 ఉపాధిహామీ పనులు జరగగా, దానికి సంబంధించిన నివేదికలను చదివి వినిపించారు. డిమాండ్ లేకుండానే పనుల నిర్వహణ, జాబ్ కార్డులు అప్గ్రేడ్ చేయకపోవడం, మస్టర్లలో సంతకాలు లేకుండా కూలీలకు వేతనాల చెల్లింపు వంటి లోపాలను గుర్తించారు. ఉపాధిహామీ సిబ్బంది నుంచి రూ.2.40 లక్షల రికవరీకి సిఫార్సు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ మాట్లాడుతూ.. సామాజిక తనిఖీతో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఎలాంటి తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, అంబుడ్స్మెన్ ఆడమ్, విజిలెన్స్ కోఆర్డినేటర్ మన్మోహన్రెడ్డి, ఏపీఓ మధు, ఎస్ఆర్పీ కవిత, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు జాబ్మేళా
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈనెల 20న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాబ్మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని, దాదాపు 500 ఖాళీలకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హతగల అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఉదయం 9.30గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లామా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు బయో డేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లతో పాటు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రేట్లు పెంచే వరకూ సమ్మె సాగిస్తాం నెహ్రూసెంటర్: విద్యుత్ కాంట్రాక్టర్ల రేట్లు పెంచే వరకూ సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ కాంట్రాక్టర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బందు సైదులు అన్నారు. గురువారం సమ్మె మూడో రోజుకు చేరగా విద్యుత్ పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేట్లు పెంచడంతో పాటు పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులు చెల్లించేలా విద్యుత్ సంస్థ, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజులుగా పనులను నిలిపివేసి సమ్మె చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని, జిల్లా ఎస్ఈ, సీఎండీ చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్లు కుమార్, రాంబాబు, నజీర్, బాలాజీ, విశ్వేశ్వర్రావు, వెంకట్రెడ్డి, కిశోర్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు పోషణ అందించడమే లక్ష్యం మహబూబాబాద్ అర్బన్: ఐదేళ్లలోపు చిన్నారులకు పోషణ అందించడమే లక్ష్యమని డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో గురువారం అంగన్వాడీ టీచర్లకు మూడురోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న పిల్లలందరికీ పౌష్టికాహారం, మంచి విద్య అందించాలన్నారు. నూతనంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పేర్లను అంగన్వాడీల్లో నమోదు చేయాలన్నారు. చిన్నారుల ఎదుగుదల, మహిళల ఆరోగ్యానికి అంగన్వాడీ సెంటర్లు చేస్తున్న సేవల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.సూపర్వైజర్లు పద్మావతి, విజయలక్ష్మి, సులోచన, కాట రోజ, పద్మ, పద్మావతి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరానికి నేషన్ల్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ (ఎన్ఎంఎంఎస్)కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దక్షిణామూర్తి గురువారం తెలిపారు. విద్యార్థులు ఏడో తరగతిలో 55 శాతం మార్కులు సాధించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం మార్కులు ఉండాలన్నారు. పరీక్ష ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు రూ.50 మాత్రమే ఉంటుందన్నారు. అక్టోబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 9849761012 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. 19న సైన్స్ డ్రామా పోటీలు.. జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు ఈ నెల 19న మానుకోట మున్సిపల్ పరిధిలోని మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు డీఈఓ దక్షిణామూర్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సైన్స్, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, గ్రీన్ టెక్నాలజీ అనే అంశాల్లో సైన్స్ డ్రామా పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి అప్పారావును ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంప్రదించాలన్నారు. రామప్పలో సింగపూర్ దేశస్తుడు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సింగపూర్కు చెందిన దెవ్ గురువారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుడిని సైతం దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని దెవ్ కొనియాడారు. -
ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగుచేసి తమ ఆదాయం రెట్టింపు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు యాకాద్రి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని గురువారం సందర్శించారు. కేవీకే నిర్వహిస్తున్న ప్రథమ శ్రేణి ప్రదర్శనలు, క్షేత్ర దినోత్సవాలు, అవగాహన, శిక్షణ కార్యక్రమాల గురించి శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. వరి విత్తనోత్పత్తి, వివిధ ప్రాజెక్టులు, కేవీకే రైతులకు అందిస్తున్న విషయ సమాచారం, వాతావరణ సమాచారం, యాంత్రీకరణ పద్ధతులపై పరిశీలన చేశారు. జిల్లాలో ప్రధానంగా సాగవుతున్న ప్రధాన పంటల గురించి ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ముఖ్య ంగా పంట మార్పిడి అలవాటు చేసుకోవాలని, పప్పు, నూనెగింజల పంటల సాగు వైపునకు మొగ్గుచూపాలని సూచించారు. ఒకే పంటను వానాకాలం, యాసంగిలో సాగు చేయకుండా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన పాడి, ఉద్యాన, గృహ విజ్ఞానంలో కూడా మెళకువలు తెలుసుకోవాలన్నారు. రైతులు వీలైనంత మేరకు యూరియా వాడకాన్ని తగ్గించి, పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంచుకోవాలన్నారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని సూచించారు. అనంతరం కురవి రైతు మేక వెంకటరెడ్డి రైతు క్షేత్రంలో అధిక సాంద్రత పద్ధతి పత్తిపంట సాగును సందర్శించారు. కార్యక్రమంలో మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ దిలీప్ కుమార్, శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, సుహాసిని, దినేష్, శేఖర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన పోస్టర్ల ఆవిష్కరణ
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరంచారు. అక్టోబర్ 2న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో లక్షగాంధీ విగ్రహాల ప్రదర్శన చేపడుతున్నట్లు గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ప్రధాన కార్యదర్శి పరికి పండ్ల అశోక్, జిల్లా అధ్యక్షుడు కొండ బత్తుల ఈశ్వర్కుమార్ తెలిపారు. గాంధీజీ ఆశయాలను, సిద్ధాంతాలను నేటి యువత పాటించాలన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.ఎకై ్సజ్ వాహనాల వేలంమహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను బుధవారం వేలం వేశారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల వేలంపాటలో 41 వాహనాలు ఎరాప్టు చేయగా 21 వాహనాలను దరఖాస్తుదారులు కొనుగోలు చేశారు. సదరు వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3.70లక్షలకు గాను రూ.5,39,500 ఆదాయం వచ్చినట్లు ఎకై ్సజ్ సీఐ చిరంజీవి తెలిపారు.ఆర్టీసీ డిపో మేనేజర్గా కల్యాణినెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్గా కల్యాణి నియమితులయ్యారు. ముషీరా బాద్ డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న కల్యాణి పదోన్నతిపై డీఎంగా మహబూబాబాద్ డిపోకు వస్తున్నా రు. ఇక్కడ డీఎంగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.శివప్రసాద్ బదిలీపై ఖమ్మం వెళ్లనున్నారు.బాలసదనం తనిఖీమహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం, షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ధనలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రజల ముంగిట పాలన
సంక్షేమ పథకాల అమలే కీలకం● యూరియా కొరత లేకుండా చర్యలు ● ప్రజాపాలన దినోత్సవంలో ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్: ప్రజల అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన చేస్తున్నారని రాష్ట్ర విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సొంతింటి కల నెరవేరుస్తూ.. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పా రు. ఇప్పటి వరకు జిల్లాకు 10,651 ఇళ్లు మంజూరు చేసి.. 9,858 ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేశామని, నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ స్కూల్స్గా ఏర్పాటు నుంచి విశ్వవిద్యాలయాల బోధన వరకు అనేక మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించామని అన్నారు. అదేవిధంగా సబ్బండ వర్ణాల పిల్లలకు ఒకే ఆవరణలో బోధన జరిపేలా ప్రతీ నియోజకవర్గంలో 25ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అన్నదాతకు అండగా.. జిల్లాలోని రూ.2లక్షల లోపు రుణం ఉన్న రైతులను రుణ విముక్తి చేయడం కోసం నిధులు కేటాయించామన్నారు. ఈ నిధులతో జిల్లాలో మూడు విడతలుగా 65,147 మంది రైతులకు రూ.570కోట్లు వారి ఖాతాల్లో జమచేశామని చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.12వేల చొప్పున అందిస్తున్నామన్నారు. రైతు పండించిన సన్న ధన్యానికి రూ. 500 బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. 558 రేషన్ షాపుల ద్వారా 2.70లక్షల కార్డులకు 5,127 టన్నుల సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. 31,052 కొత్త రేషన్ కార్డుల మంజూరు, 41,095 మందివి కొత్తగా పేర్లు నమోదు చేశామని చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామిక అభివృద్ధికోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. గ్రామ స్థాయిలో పారదర్శక పాలన అందించేందుకు 180 క్లస్టర్లకు 179మంది గ్రామ పరిపాలనాధికారులను నియమించామని చెప్పారు. వివిధ కారణాలతో యూరియా సరఫరాలో కొంత అసౌకర్యం కలిగిందని, రైతులను సమన్వయం చేసుకుంటూ.. నిజమైన రైతులకు యూరియా అందించడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి అభినందనీయం అన్నారు. ఈమేరకు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధ్ర్ రాంనాథ్ కేకన్ను విప్ సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని విప్ రాంచంద్రునాయక్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. నిరుపేదలకు పెద్దాసుపత్రుల్లో ఖరీదైన వైద్యం కోసం 163 రకాల చికిత్సలకు రూ.10లక్షల మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 17,308 మందికి చికిత్స చేయించేందుకు రూ. 76.73కోట్లు ఖర్చు చేసిందన్నారు. రూ. 500లకే వంట గ్యాస్ అందిస్తూ ఇప్పటి వరకు జిల్లాలో 1.34లక్షల మందికి ప్రభుత్వం రూ.53.08కోట్ల సబ్సిడీ చెల్లించినట్లు వివరించారు. -
విశ్వకర్మ చూపిన భక్తిమార్గంలో నడవాలి
మహబూబాబాద్ అర్బన్: విశ్వకర్మ చూపిన భక్తిమార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఎం. నర్సింహస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. జిల్లా అధికారి నర్సింహస్వామి, విశ్వబ్రాహ్మణ సంఘం బాధ్యులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారి నర్సింహస్వామి మాట్లాడుతూ.. విశ్వకర్మ బాటలో నడవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరేంద్ర వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వంగాల సోమనర్సయ్యచారి, ప్రధాన కార్యదర్శి విజయగిరి, వెంకట్రాజయచారి, స్వర్ణకార అధ్యక్షుడు మోత్కూరి శంకర్, ప్రధాన కార్యదర్శి ఏరోజు కృపాకర్చారి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నారోజు సత్యమనోహరమ్మ, ఉపాధ్యక్షులు అలుబోజు కనకాచారి, మండల బాధ్యులు పమ్మీ సనాతనచారి, పూర్ణచారి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా పెద్దల పండుగ
గూడూరు: మండల కేంద్రంలోని ఆదివాసీ కోయదొరలు బుధవారం కొత్తల (పెద్దల) పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గ్రామ దొర పొడుగు క్రిష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం ఉత్తరకార్దె మొదటి పాదంలో బుధవారం ఆదివాసీ పెద్దల పండుగ జరుపుకుంటామని తెలిపారు. కాగా చెంద్రుగూడెం శివారు అటవీ ప్రాంతంలో, మచ్చర్ల శివారు కొమురంభీనగర్లో కొత్తల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ దొరలు చాపల నాగయ్య, దారం స్వామి, అయిలబోయిన వీరయ్య, బత్తుల శ్రీనివాస్, పెనుక ప్రభాకర్, కాక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడలో.. కొత్తగూడ: మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఆదివాసీ తెగలు పెద్దల పండుగను ఘనంగా జరుపుకున్నారు. పెద్దల స్మరణలో భాగంగా ఆదివాసీ పోరాట యోధులు కొమురం భీం, బీర్సా ముండాకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ పూజారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, తుడుందెబ్బ నాయకులు, ఆయా గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 22నుంచి నిర్వహించే పరీక్షలకు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పదో తరగతిలో 96 మంది, ఇంటర్లో 102 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పన చేసి పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ తిరుపతి రావు, డీఈఓ దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ యాత్రాదానం
నెహ్రూసెంటర్: ప్రయాణికులను ఆకర్షించేలా ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలను ఆర్టీసీ తీసుకువస్తోంది. దీనిలో భాగంగా ‘యాత్రాదానం’ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా, అనాథలు, వృద్ధులను దాతల సహకారంతో విహార యాత్రలు, ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. యాత్రాదానం మహబూబాబాద్ డిపో నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే డిపో నుంచి పలు పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోంది. యాత్రదానం ఇలా.. ఆద్యాత్మిక క్షేత్రాలు, వినోదం, విజ్ఞానం, పర్యాటక ప్రాంతాలకు పంపించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్టీసీ యాత్ర బస్సు బుక్ చేసుకోవాలి. దాతల సహకారంతో విహార ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఉపయోగకరంగా ఉంటుంది. దాతలు ఎంత మందిని ఎంపిక చేశారు.. ఎన్ని బస్సులు కావాలనేది దాతల అభిప్రాయంతో ముడిపడి ఉంటుంది. పెళ్లిరోజు, పుట్టిన రోజు, ఇతర శుభ ముహూర్తాల్లో అన్నదానం, దుస్తుల దానం వంటివి చేయడం సహజమే. కానీ అనాథలు, వృద్ధులకు యాత్రదానం చేయడం ద్వారా వారు ఆయా ప్రాంతాలకు విహారయాత్రలో భాగంగా ఆర్టీసీ ఉపయోగపడుతుంది. ప్రత్యేక టూర్ బస్సులు.. కాగా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి ఇప్పటికే పలు ప్రాంతాలకు విహార, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక టూర్ యాత్ర బస్సులను నడిపిస్తున్నారు. ప్రయాణికులు, యాత్రికుల నుంచి స్పందన లభిస్తుండగా మరికొన్ని కొత్త కార్యక్రమాలను ఆర్టీసీ అమలు చేస్తోంది. పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఇప్పటికే బస్సులను ఆర్టీసీ సమకూరుస్తోంది. వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ ఇప్పటికే ప్రత్యేక యాత్ర బస్సులు విభిన్న మార్గాల్లో సమకూరుతున్న ఆదాయం యాత్రదానంతో సహాయం.. ఆర్టీసీ చేపట్టిన యాత్రాదానం ద్వారా దాతలు విహార, పుణ్యక్షేత్రాలకు వెళ్లలేని వారిని పంపించవచ్చు. పెళ్లిళ్లు, పుట్టిరోజుల్లో అన్నదానం, దుస్తులు దానం తెలిసిందే.. అదేవిధంగా అనాథలు, వృద్ధులు, స్కూల్ పిల్లలను యాత్రదానం ద్వారా విహార యాత్రలకు పంపించవచ్చు. – శివప్రసాద్, డీఎం, మహబూబాబాద్ -
కేటీఆర్.. నర్సింహమూర్తిని బహిష్కరిస్తావా?
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నములుగు: ములుగు జిల్లాలో బాండ్ మొక్కజొన్న న కిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను వచ్చి విచా రిస్తావా.. బీఆర్ఎస్కు చెందిన దళారి నర్సింహ మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా కేటీఆర్ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నించారు. బుధవారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. బాండ్ మొక్కజొన్న నకిలీ విత్తనాలను రైతులకు అందించిన ప్రైవేట్ కంపెనీలో ద ళారీగా ఉన్న బీఆర్ఎస్కు చెందిన నర్సింహమూర్తి.. కేటీఆర్ సమక్షంలో మాట్లాడుతూ ‘నా యావదాస్తిని పార్టీకి రాసిస్తా కానీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కలెక్టర్ను వదిలిపెట్టవద్దు’ అని మాట్లాడితే కేటీఆర్ నవ్వి ఊరుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నా రు. మొక్కజొన్న విత్తనాలతో వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో 1,521 ఎకరాల్లో పంట నష్టపోయిన 671 మంది రైతులకు కలెక్టర్ దివాకర టిఎస్ ప్రైవేట్ కంపెనీల నుంచి రూ.3. 80 కోట్లు పరిహారాన్ని ఇప్పించారని చెప్పారు. కలెక్టర్ కార్యకర్తగా పనిచేశాడని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు పరిహారం ఇప్పించిన ఘన త ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు సేవచేసే అధికారులను టార్గెట్ చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా అని విమర్శించారు. రైతులపై కేటీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నర్సింహమూర్తిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులపక్షాన పనిచేస్తున్న కలెక్టర్ను ప్రశంసించాలే తప్ప విమర్శించకూడదని ఆమె హితవుపలికారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇరుసవడ్ల వెంకన్న పాల్గొన్నారు. -
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
జనగామ రూరల్: వీర తెలంగాణ రైతాంగ సాయుఽ ద పోరాటంలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివవి, చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను నిలదీయాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన తెలంగాణ సా యుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం పట్టణంలో రైల్వే స్టేషన్ నుంచి ప్రె స్టెన్ మైదానం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంఏ బేబీ మాట్లాడుతూ తెలంగాణలో 1946 – 51 వరకు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మూడు వేల గ్రామాలు పాల్గొన్నాయన్నారు. ఈ సందర్భంగా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది కార్యకర్తలు చనిపోయారని, ఈపోరాట ఫలితంగా తెలంగాణలో భూసంస్కరణల చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. 1957లో కేరళలో భూసంస్కరణ చట్టం కోసం ఉద్యమం ముందుకు వచ్చిందన్నారు. చరిత్రలో పారిస్ కమ్యూన్ కంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గొప్పదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తెలంగాణలో విమోచన పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గాడ్సే 6నెలలకు ముందే సావర్కర్ వద్ద ఆశీర్వాదం పొంది గాంధీజీని హత్య చేశారని, దీనిని కూడా వక్రీకరించిందని, చరిత్ర ఎరిగిన సాక్ష్యమని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మహ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లింల పోరాటంగా వక్రీకరిస్తున్నారని, దీనిని కమ్యూనిస్టు కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి విట్టల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, బూడిది గోపి, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేశ్, రాపర్తి సోమన్న, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాశ్, సుంచు విజేందర్, తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాటంతో పేదలకు 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ -
వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం
ఖిలా వరంగల్: సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సావాలను వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కరీమాబాద్లోని ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై నగర మేయర్ గుండు సుధారాణి, నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మంత్రి సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ ఆట స్థలాలను శుభ్రం చేయాలని బల్దియా అధికారులను ఆదేశించారు. దసరా కమిటీ విజ్ఞప్తి మేరకు రంగలీల మైదానంలో మైసూరును తలపించేలా దసరాకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన రహదారుల్లోని గుంతలను పూడ్చివేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉర్సుతోపాటు కాశిబుగ్గ, రంగశాయిపేట, శివనగర్లో మహిళా సంఘాలతో ఫుడ్స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు, ఈనెల 21న వేయి స్తంభాల దేవాలయంలో నిర్వహించనున్న వేడుకలు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీపీ సలీమా, డీఆర్ఓ విజయలక్ష్మి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్రావు, ఏఎస్పీ శుభం ప్రకాశ్, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్లార్లు ఇక్బాల్, శ్రీకాంత్, ఏసీపీలు జితేందర్రెడ్డి, సత్యనారాయణ, దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు నాగపూరి సంజయ్బాబు గౌడ్, మేడిది మధుసూదన్, మండ వెంకటన్న, గోనె రాంప్రసాద్, గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు.బతుకమ్మ, విజయదశమికి ఏర్పాట్లు చేయండి రంగలీల మైదానం అభివృద్ధికి చర్యలు అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ -
మంత్రాల నెపంతోనే వృద్ధురాలి హత్య
నెల్లికుదురు : ఓ వృద్ధురాలిని హత్య చేసి బావిలో పడేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం నెల్లికుదురు పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన వీరగాని రాధమ్మ (80) ఒంటరిగా నివసిస్తోంది. కాగా, మండల కేంద్రానికి చెందిన నిందితులు వీరగాని ఉప్పలయ్య, అతడి తమ్ముడు మహేశ్కు రాధమ్మ వరుసకు పెద్దమ్మ అవుతుంది. ఈ క్రమంలో ఉప్పలయ్య తన ఆరోగ్యం బాగలేకపోవడానికి కారణం రాధమ్మ మంత్రాలు చేయడమేనని ఆమైపె కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తన తమ్ముడు మహేశ్కు చెప్పగా అతడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన రాత్రి 11గంటల సమయంలో ఇద్దరు కలిసి రాధమ్మ ఇంటికెళ్లారు. ఆమెను బయటకు పిలిచి తమ వెంట తెచ్చుకుని ఇనుపరాడ్తో తలపై బలంగా కొట్టారు. దీంతో రాధమ్మ కిందపడగా పక్కనే ఉన్న చేదబావిలో పడేశారు. మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం మహేశ్ ఈ విషయం తన స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన దువ్వాడ రాజుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో రాజు బైక్ తీసుకుని రాగా ముగ్గురు కలిసి మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి బ్రిడ్జివద్దకు వెళ్లి రాధమ్మ హత్యకు ఉపయోగించిన రాడ్ను వాగులో పడేశారు. వాగులోనే రక్తపు మరకలు అంటుకున్న తమ దుస్తులను శుభ్రం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు కలిసి రంగనాయకమ్మ గుడి దగ్గర ఉన్న బెల్టుషాపులో మద్యం తాగారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐదు రోజుల్లోనే నిందితులు ఉప్పలయ్య, మహేశ్, రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు మృతురాలి బంధువులే.. రాధమ్మ హత్య ఘటనలో ముగ్గురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ కృష్ణకిశోర్ -
రైల్వే ఎన్ఐ వర్క్స్..
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని కాజీపేట, బల్లార్షా మధ్య ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ రైల్వే ఎన్ఐ వర్క్స్తో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు పలు రైళ్లకు వివిధ స్టేషన్లలో హాల్టింగ్ ఎత్తివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. రద్దయిన రైళ్లు ఈ నెల 19వ తేదీన కాజీపేట–సిర్పూర్టౌన్ (170 03) ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) రామగిరి ప్యాసింజర్, ఈ నెల 18వ తేదీన(నేడు) కాజీపేట–బల్లార్షా (17035) రామగిరి ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17036) ప్యాసింజర్, సిర్పూర్టౌన్–కరీంనగర్ (87771) పుష్పుల్, కరీంనగర్–సిర్పూర్టౌన్ (67772) పుష్పుల్ రద్దయ్యాయి. పాక్షికంగా రద్దయిన రైళ్లు ఈ నెల 19వ తేదీన భద్రాచలంరోడ్–బల్లార్షా (1 7033) సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య, సిర్పూర్టౌన్–భద్రాచలంరోడ్ (17034) సింగరేణి సిర్పూర్ టౌన్–కాజీపేట మధ్య, సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్ (17234) ఎక్స్ప్రెస్ సిర్పూర్కాగజ్నగర్–కాజీపేట మధ్య, ఈ నెల 18న సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233) ఎక్స్ప్రెస్ కాజీపేట–సిర్పూర్కాగజ్నగర్ మధ్య రద్దు. తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేత.. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011) ఎక్స్ప్రెస్కు, సిర్పూర్కాగజ్నగర్–బీదర్ (17012) ఎక్స్ప్రెస్కు మందమర్రి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఎత్తివేశారు. రెగ్యులేషన్ ట్రైన్.. ఈ నెల 19వ తేదీన డెహ్రాడూన్–చర్లపల్లి (07078) ఎక్స్ప్రెస్ 30 నిమిషాల పాటు రెగ్యులెటెడ్ చేశారు.● పలు రైళ్లు రద్దు..హాల్టింగ్ ఎత్తివేత ● ఈ నెల 18, 19 తేదీల్లో అమలు -
ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్రం
హన్మకొండ: ఆర్థిక ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకెళ్తోందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాల ఉంచి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం జరిపిన పోరాట ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న ప్రత్యేక సంస్థానంగా ఉన్న తెలంగాణ ప్రాంతం భారత్లో విలీనమైందన్నారు. ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్లాల్, రాజు చౌహాన్, అశోక్, కె.మాధవరావు, చీఫ్ జనరల్ మేనేజర్లు రవీంధ్రనాథ్, ఆర్.చరణ్ దాస్, జనరల్ మేనేజర్లు వెంకట కృష్ణ, మల్లికార్జున్,నాగప్రసాద్, వేణుబాబు, అన్నపూర్ణ, శ్రీకాంత్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్ పూర్తి చేయాలి ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, వివిధ విభాగాల డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న సర్వీస్లను మ్యాపింగ్ చేయాలన్నారు. ఇంటి లోపల ఉన్న మీటర్లు బయట అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్కిల్ పరిధిలో విధిగా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, సి.జి.ఎంఆర్. చరణ్ దాస్, జీఎంలు వెంకటకృష్ణ, అన్నపూర్ణ, నాగప్రసాద్, వేణుబాబు, కృష్ణ మోహన్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఐదు పీఏసీఎస్ పాలకమండళ్లు రద్దు
మహబూబాబాద్ రూరల్/బయ్యారం/తొర్రూరు రూరల్: జిల్లాలోని 18 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయని, అందులోని ఐదు సొసైటీల పాలకమండళ్లను రద్దుచేసి, పర్సన్ ఇన్చార్జ్గా అసిస్టెంట్ రిజిస్ట్రార్లను నియమించినట్లు జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జిల్లాలోని కేసముద్రం, కురవి, బయ్యారం, నెల్లికుదురు, తొర్రూరు సొసైటీల పాలకమండళ్లు రద్దయ్యాయని తెలిపారు. కేసముద్రం సొసైటీకి ప్రవీణ్, కురవి సుమలత, బయ్యారం ఆదినారాయణ, నెల్లికుదురుకు మనోహర్ రావు, తొర్రూరు సొసైటీకి రమేశ్ పర్సన్ ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా పీఏసీఎస్ పాలకమండళ్లు పనిచేయలేదనే కారణంతో సర్కారు రద్దు చేసిందన్నారు. కాగా, ప్రభుత్వ నిబంధనలను అమలుచేయకపోవడంతో పాటు ఆయా సొసైటీల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టి పాలకమండళ్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. మిగిలిన 15 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకమండళ్ల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. -
రైతులకు యూరియా పంపిణీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్ట ణంలోని పీఏసీఎస్ వద్ద బుధవారం 330 మంది రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి తెల్ల వారుజాము నుంచి యూరి యా పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పర్యవేక్షించారు. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శివ, ఏఆర్, పలు విభాగాల పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. రామప్ప టెంపుల్ అద్భుతం వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ అద్భుతంగా ఉందని జర్మనీ దేశానికి చెందిన క్రిష్టియన్ స్లావిక్ కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆయన బుధవారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
డీసీసీబీలో ‘ప్రజాపాలన’
హన్మకొండ: హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషాశ్రీ, పద్మావతి, డీజీ ఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, గంప స్ర వంతి, రాజు, కృష్ణ మొహన్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు -
అప్రమత్తతే ఆయుధం..
మహబూబాబాద్ రూరల్ : జెమిని వైరస్, బొబ్బ రోగం.. ప్రస్తుతం మిరప రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పంటను నాటి నెలరోజులు గడవక ముందే చిన్న మొక్కలపై రైతులు పోటాపోటీగా పురుగుల మందులు, సిఫార్సు లేని బయో మందులను పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా పెట్టుబడి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టులో పొడి వాతావరణం పరిస్థితులలో వేసిన మిరప పంటను ప్రస్తుతం వివిధ చీడ పీడలు ఆశిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మహబూబాబాద్ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త దిలీప్ కుమార్, శాస్త్రవేత్తలు సుహాసిని, క్రాంతికుమార్.. రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. పైముడత నివారణకు : ఫిప్రోనిల్ ఎస్.సి 2 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో లేదా డైఫెన్ ధయురాన్ 1.5గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కింది ముడత నివారణకు .. నీటిలో కరిగే గంధకం 3 గ్రాములను లీటర్ నీటిలో లేదా స్పైరోమెసిఫెన్ 0.8 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి లేదా ప్రాపర్ గైట్ 57శాతం 2 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లద్దె పురుగు నివారణకు .. నోవాల్యూర్న్ 0.75 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములను లీటర్ నీటిలో లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సిఫార్సు లేని బయో మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. ● పొలం చుట్టూ 2 నుంచి 3 వరుసల సజ్జ, జొన్న లేదా మొక్కజొన్న రక్షణ పంటలుగా వేసుకోవాలి. పసుపు, నీలం రంగు జిగురు అట్టలను 20 నుంచి 25 చొప్పున ఎకరానికి రైతులు సామూహికంగా వేసుకోవాలి. మొక్కల ఎత్తును బట్టి జిగురు అట్టలను కూడా పైకి అమర్చుకోవాలి. తెల్ల దోమల నివారణకు 5శాతం వేప గింజల కషాయం ( వేప నూనె 1500 పీపీఎం) 5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా ఫైరిప్రాక్సిఫెన్ 102 ఇ.సి. 1.5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా ఫెరిప్రాక్సిఫెన్ 57. ఇ.సి. + ఫెన్ పోపాత్రిన్ 15 ఇ.సి. 1 మిల్లీ లీటర్ను లీటర్ నీటిలో లేదా ఫెనో పాత్రిన్ 30శాతం ఇ.సి 0.5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా థయామిథాక్సాం 0.4 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● ప్రతీ సారి రైతులు పురుగుమందును పిచికారీ చేసినప్పుడు కేవలం పురుగు మందును మాత్రమే కాకుండా పోషకాల మిశ్రమం (191919/13045) లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమం 5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే మొక్కలకు బలాన్ని ఇస్తూ, వ్యాధి నిరోధక శక్తి పెరిగి కొత్తరకాల చీడ, పీడలను తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. మిరప పంటను ఆశిస్తున్న చీడపీడలు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి జెమిని వైరస్, బొబ్బ రోగంపై జాగ్రత్తగా ఉండాలి రైతులకు మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ దిలీప్ కుమార్, శాస్త్రవేత్తలు సుహాసిని, క్రాంతికుమార్ సలహాలు ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ నివారణకు ప్రత్యేకంగా ఎలాంటి మందులు లేవు. అందుకే సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలి. తొలిదశలోనే వైరస్ సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి కాల్చి వేయాలి. ప్రధాన పొలంలో, గట్లపై కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని రకాల కలుపు మొక్కలు వైరస్ తెగుళ్లకు ఆశ్రయం కల్పిస్తాయి. మిరప తోటలో వంగ (బెండ), టమాట మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచొద్దు. ఇవి తెల్ల దోమలకు ఆశ్రయం కల్పిస్తాయి. -
ప్రాణాల మీదికి తెచ్చిన యూరియా
● యూరియా కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ● గాయపడిన రైతులు.. ఆస్పత్రుల్లో చికిత్స బయ్యారం: యూరియా రైతుల ప్రాణాల మీదికి తెస్తోంది. జిల్లాలో ఇటీవల యూరియా కోసం వాహనంపై వెళ్తూ ఇద్దరు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, తాజా గా యూరియా కోసం వెళ్తూ ఆటో ప్రమాదంలో రైతులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గురిమెళ్ల గ్రామానికి చెందిన రైతులకు ఉప్పలపాడులో సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం యూరియా పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కాగా, గరిమెళ్ల గ్రామానికి చెందిన బోడ అశోక్ తన ఆటోలో 12 మందిని తీసుకొని ఉప్పలపాడుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ మండలం కంబాలపల్లి సమీపంలోని వాగు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న రైతులు బోడ కిషన్, వజ్జ సూరమ్మ, బోడ లక్ష్మి, మాలోత్ లక్ష్మి, మాలోత్ మంగమ్మ, మాలోత్ కవిత, గలిగి సారమ్మ, మాలోత్ భీముడు, మాలోత్ వస్య, వజ్జ బుచ్చయ్య, బోడ విజయకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనాల్లో మానుకోటలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కాగా, క్షతగాత్రులను పలువురు పరామర్శించారు. -
ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలి
● డీఆర్డీఓ మధుసూదన్రాజు తొర్రూరు: ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలని డీఆర్డీఓ మధుసూదన్రాజు అన్నారు. డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధిహామీ పనులపై ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. 2024–25లో మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. మండలంలో రూ.3 కోట్ల విలువ చేసే 277 ఉపాధిహామీ పనులు జరగగా, దానికి సంబంధించిన నివేదికలను చదివి వినిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. జాబ్ కార్డు కలిగిన పేదలకు పని చూపించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, అంబుడ్స్మెన్ ఆడమ్, విజిలెన్స్ కోఆర్డినేటర్ మన్మోహన్రెడ్డి, ఏపీఓ మధు, ఎస్ఆర్పీ కవిత, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నిజాంను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులది
నెహ్రూసెంటర్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నిజాం సర్కార్ను తరిమికొట్టి తెలంగాణను విముక్తి చేసి, దున్నేవాడికే భూమి అంటూ 10 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు వేల మంది అమరత్వం, హింస, దోపిడీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిందని, రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనన్నారు. కమ్యూనిస్టుల పోరాట చరిత్రను కనుమరుగు చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ యత్నిస్తున్నాయని మండిపడ్డారు. నా టి నిజాం ప్రభుత్వానికి నేటి కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వానికి తేడా ఏమి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ, బంచరాయి భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో శెట్టి వెంకన్న, సూర్నపు సోమయ్య, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, కందునూరి శ్రీనివాస్, కుంట ఉపేందర్, అల్వాల వీరయ్య, బానోత్ సీతారాంనాయక్, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
గ్రామీణ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం
మామునూరు: గ్రామీణ పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని వ్యవసాయ కళాశాల డీన్ భూపాల్రాజు సూచించారు. ఈ మేరకు ఖిలా వ రంగల్ మండలం తిమ్మాపురం రాంగోపాలపురంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల వి ద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామీణ పరిస్థితుల అధ్యయన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వనరులు, పటం, గ్రామ భౌగోళిక పరి స్థితులు, వ్యవసాయ స్థితిగతులు, సామాజిక అంశాలు, పశు సంవర్థక రంగం, గ్రామ సమస్యలు వంటి అనేక అంశాలను విద్యార్థులు సమగ్రంగా సేకరించి చిత్రపటాల రూపంలో ప్రదర్శించాలన్నారు. ఇన్చా ర్జ్ డాక్టర్ శ్రీకర్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ వీరన్న, డాక్టర్ శ్రవణ్కుమార్, కేటీ విజయ్, ఇన్స్పెక్టర్లు కార్తీక్, వెంకటేశ్వర్లు, ఫార్మసీ అధికారులు జలగం రమేశ్కుమార్, బి.సురేశ్, డాక్టర్ మధు, శ్రావ్య, రవితేజ, ఏఈఓ సత్యప్రకాశ్, జలగం రమేశ్, సొసై టీ డైరెక్టర్లు చెన్నారెడ్డి, సాయి నందన్రెడ్డి, రాజేశ్వర్రావు, ప్రసాద్రావు, రాములు పాల్గొన్నారు. -
సమాజ సేవ చేయాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సమాజ సేవ చేసి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బుధవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఉన్న ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించాలన్నారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడానికి తమవంతు కృషి చేయాలని, ప్రజాపాలన దినోత్సవం ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం అనే విలువలను గుర్తుచేస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ, ప్రతిపల్లె, ప్రతివాడ, ప్రతిఇంటి వరకు ప్రభుత్వ సేవలను చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ధ్యేయమని, ఇది ప్రజల పాలన అనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. -
ఓరుగల్లులో రణనినాదం
భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం ఆనాడు ప్రజలు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. దొరలు, దేశ్ముఖ్లను గడగడలాడించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో నిజాం పాపపు పాలనకు చరమగీతం పాడారు. రాక్షస రజాకార్ల అరాచకాలను ఎండగట్టారు. పంటను పాలకులు లాక్కుంటే మహిళలు వేటకొడవళ్లతో తరిమికొట్టారు. ఈ నేల నుంచి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యతోపాటు అనేక మంది అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉద్యమాలు, వీరోచిత పోరాటంపై (సెప్టెంబర్ 17 సందర్భంగా) ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.పరకాల: పరకాల పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సాయుధ పోరాటంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. అప్పటికే ఇక్కడ నిజాం పోలీసులు మకాం వేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది అమరులయ్యారు. రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపారు. చంద్రగిరి గు ట్టలను కేంద్రంగా చేసుకుని సా యుధ పోరాటం జరిపారు. మరో జలియన్వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, చెన్నమనేని విద్యాసాగర్రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున వందలాది విగ్రహాలను తయారు చేయించారు. పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 ఆ విగ్రహాలతో ఏర్పాటు చేసిన అమరధామాన్ని ఆయన ప్రారంభించారు.చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్జనగామ: దొరల ఆగడాలకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర లష్కర్ (సికింద్రాబాద్)కు పారిపోయే ప్రయత్నంలో సాయుధ పోరాట యోధులు మట్టుబెట్టి తమ వీరత్వాన్ని చాటుకున్నారు. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబు దొర అరాచకాలు మితిమీరిపోయాయి. 1947లో సవారు కచ్చురంలో నలుగురు విప్లవకారుల కాళ్లు, చేతులను కట్టేసి తన గూండాలతో గడ్డివాములో తలదాచుకుని తెల్లవారు జామున 4 గంటల వరకు లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. ఊరి శివారున ఉన్న ఈత చెట్ల సమీపంలో ముగ్గురిని చంపేశాడు. ఇందులో ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకుని, కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనను స్థానికులకు వివరించాడు. దీంతో పదివేల మందికిపైగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దొర పోలీస్ స్టేషన్లో తలదాచుకుని రైల్వేస్టేషన్ సమీపంలోని పాత ఎస్బీహెచ్ ఆవరణలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విప్లవ యోధుడు గబ్బెట తిరుమల్రెడ్డి నాయకత్వంలో జాటోత్ దరాగ్యనాయక్, మరికొందరు విప్లవకారులు నాటి రైల్వే వ్యాగన్ ఏరియాలో దొర రాకకోసం ఎదురు చూశారు. పట్టాలపై ఆగిఉన్న గూడ్స్ రైలు కింది నుంచి దాటుకుంటూ వ్యాగన్ పాయింట్ మర్రిచెట్టు కిందకు రాగానే దరాగ్యనాయక్.. దొర మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. అనంతరం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.పోలీసు ఉద్యోగం వదిలి..మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన రేగూరి చంద్రారెడ్డి నాడు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేశారు. పోలీసు ఉద్యోగం మానేసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పరకాల కేంద్రంగా సాయుధ పోరాటం చేసిన యోధుల్లో చివరగా మిగిలిన.. ఆయన ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. -
విద్యార్థికి పాముకాటు
కొత్తగూడ: విద్యార్థి పాము కాటుకు గురైన సంఘటన మండలంలో ని ఎదుళ్లపల్లి జెడ్పీ ఉన్న త పాఠశాలలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెగడపల్లి గ్రామానికి చెందిన వల్లపు రంజిత్ ఎదుళ్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. స్కూల్లో మూత్రశాలలు లేకపోవడంతో ఇంటర్వెల్లో మూత్రవిసర్జనకు బయటికి వెళ్లగా పాము కాటుకు గురయ్యాడు. దీంతో విద్యార్థి తండ్రి వల్లపు సాంబరాజుకు సమాచారం అందించి 108 ద్వారా వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. బాలుడి ఆర్యోగం నిలకడగా ఉందని సాంబరాజు తెలిపాడు. -
మంచి ఫలితాలు వచ్చేలా బోధించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో నర్సింహులపేట: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని యూరియా పంపిణీ కేంద్రం, హైస్కూ ల్, ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. యూరియా పంపిణీ కేంద్రంలో కూపన్లు, యూరియాపై అధికారులను అడిగారు. అనంతరం హైస్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల నోట్ బుక్స్, పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మాధవి, ఎంఈఓ రామ్మోహన్రావు, ఏఓ వినయ్కుమార్, తహసీల్దార్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా పార్లర్ల ఏర్పాటు
బచ్చన్నపేట: రాష్ట్రంలో అన్నిచోట్ల విజయ డెయిరీ, పార్లర్లను ఏర్పాటు చేసి ఆయాప్రాంతాల్లోని దేవాలయాలు, అంగన్వాడీలు, హాస్టళ్లు, పాఠశాలలకు అవసరమైన పాలు, పాల పదార్థాలు సరఫరా పెంచాలని రాష్ట్ర విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి స్పష్టం చేశారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన పార్లర్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల విజయ పాల డెయిరీ సొసైటీ చైర్మన్లకు పాల క్యాన్లను పంపిణీ చేశారు. విజయ పాల ఉత్పత్తుల డెయిరీ రాష్ట్రంలోనే జనగామ, బచ్చన్నపేట ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పాడితోపాటు, పంటలు పుష్కలంగా పండడానికి ఈ ప్రాంతంలో చెరువులు నింపడంలేద ని రైతులు కోరడంతో చెరువులు నింపే కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎండీ చంద్రశేఖర్రెడ్డి, జీఎం మధుసూదన్, మల్లయ్య, గోపాల్, డైరెక్టర్లు పాల్గొన్నారు.విజయ డెయిరీ చైర్మన్ అమిత్రెడ్డి -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయికుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం డీఈఓ దక్షిణామూర్తికి డీఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. గాంధీపురం పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు ఒక్కరే పనిచేస్తున్నారని, వెంటనే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలన్నారు. జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్, పట్టణ నాయకులు ప్రవీణ్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎన్నికల ప్రక్రియపై
మహబూబాబాద్ : జిల్లా పంచాయతీ అధికారులు స్థానిక సంఎన్నికల ప్రక్రియపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేయడంతో పాటు బ్యాలె ట్ బాక్స్లు సమకూర్చుకున్నారు. నోటిఫికేషన్ కోసం అధికారులు, ప్రజలు ఎదురూచూస్తున్నారు. కాగా యూరియా సమస్య తలెత్తకుంటే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేదని జిల్లాలో చర్చగా మారింది. జిల్లాలో 482 జీపీలు.. జిల్లాలో 18 మండలాలు, 5 మున్సిపాలిటీలు, 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 5,56,780 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుష ఓటర్లు 2,73,692 మంది, మహిళా ఓటర్లు 2,83,064 మంది ఉన్నారు. ఈమేరకు మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 18 జెడ్పీటీసీ స్థానాలు, 193 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 1,066 పోలింగ్ బూత్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా కూడా ఫైనల్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి 3,721 బ్యాలెట్ బాక్స్లు, రాగా వాటిని చెక్ చేసి భద్రపరిచారు. ఐదు మండలాల్లో 40,000లకు పైగా ఓటర్లు.. జిల్లాలోని ఐదు మండలాల్లో 40,000లకు పైగా ఓటర్లు ఉన్నారు. గూడూరులో 48,570మంది ఓటర్లు, తొర్రూరు 47,089 మంది, మరిపెడ 46,478 మంది, కురవి 44,216 మంది, నర్సింహులపేట మండలంలో 40,471 మంది ఓటర్లు ఉన్నారు. యూరియాతోనే ఎన్నికలు ఆలస్యమని చర్చ..యూరియా సమస్య వల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందనే చర్చ జరుగుతోంది. మరో రెండు నెలల ఆలస్యం కావొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చనే కోణంలో అధికారులు అన్ని సిద్ధం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మండలాల వారీగా జీపీలు, ఓటర్ల వివరాలు మండలం జీపీలు వార్డులు పురుష మహిళా ఓటర్లు ఓటర్లు బయ్యారం 29 252 18,887 19,724 చిన్నగూడూరు 11 96 6,507 6,590 దంతాలపల్లి 18 166 13,019 13,663 డోర్నకల్ 26 218 14,289 14,799 గంగారం 12 100 4,543 4,631 గార్ల 20 184 15,007 15,699 గూడూరు 41 354 23,851 24,717 ఇనుగుర్తి 13 112 8,968 9,166 కేసముద్రం 29 254 15,980 16,123 కొత్తగూడ 24 202 11,740 12,326 కురవి 41 344 21,464 22,752 మానుకోట 41 338 19,422 20,244 మరిపెడ 48 396 22,986 23,492 నర్సింహులపేట 23 194 12,118 12,616 నెల్లికుదురు 31 280 20,019 20,451 పెద్దవంగర 26 192 12,511 12,898 సీరోలు 18 152 9,118 9,350 తొర్రూరు 31 276 23,263 23,823 వార్డులు 4110, పోలింగ్ కేంద్రాలు 4,110 జిల్లాలో 5,56,780 మంది ఓటర్లు మహిళా ఓటర్లే ఎక్కువ 3,721 బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేసిన అధికారులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూపు -
పోష్ చట్టంపై మహిళలకు అవగాహన అవసరం
● ఎంపీ కడియం కావ్య హన్మకొండ చౌరస్తా: మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం(పోష్)పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మహిళా సాధికారతపై జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ పోష్ అమలు– 2014 అంశంపై ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కావ్య పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసిన కావ్య సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య హైదరాబాద్లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట చేపట్టనున్న మల్టీ మోడల్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంతోపాటు భూపాలపల్లికి దగ్గరగా ఉన్న ఉప్పల్, కమలాపూర్ స్టేషన్లకు అనుసంధానించేలా రైల్వే లైన్ నిర్మాణం అంశాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలని రేవంత్రెడ్డిని కోరారు. ‘కుడా’ను సంప్రదించకుండానే 2014 మాస్టర్ప్లాన్కు విరుద్ధంగా చింతలపల్లి నుంచి నష్కల్, హసన్పర్తి రెండు కొత్త రైల్వే లైన్లు ప్రతిపాదించారని తెలిపారు. అంతేకాకుండా చారిత్రక భద్రకాళి, వేయిస్తంభాలగుడి, బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ పథకానికి సహకరించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రయాణికుల భద్రతే ముఖ్యం
మహబూబాబాద్ రూరల్: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని సికింద్రాబాద్ డివిజన్ సేఫ్టీ కమిషనర్ మాధవి అన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో నూతనంగా నిర్మించిన మూడో లైన్ సేఫ్టీ అంశాలపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) బృందం ఉన్నత అధికారులు మంగళవారం సందర్శించింది. ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న సీఆర్ఎస్ బృందం మొదటగా సిగ్నల్ ఆపరేటింగ్, స్టేషన్ మాస్టర్ గది, సేఫ్టీ గదిలో సాంకేతిక అంశాలను పరిశీలించింది. అనంతరం నూతనంగా నిర్మించిన రైల్వే లైన్ పనివిధానం, నిర్మాణశైలిని సందర్శించిన అధికారులు దక్షిణ మధ్య రైల్వే శాఖ సేఫ్టీ కమిషన్ నిబంధనల మేరకు పనులు జరిగాయా.. లేదా.. అని పరిశీలించారు. మూడో రైల్వే ట్రాక్ వద్ద పాయింట్ తిక్ వెబ్ స్విచ్ పనివిధానాన్ని పరిశీలించి, అక్కడి నుంచి నూతనంగా నిర్మించిన ఎల్.సీ 80 రైల్వే గేట్ క్యాబిన్ వద్ద శాఖాపరమైన అంశాలను తనిఖీ చేసి, అక్కడి ఆవరణలో మొక్కలు నాటారు. డీఆర్ఎం రాజగోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ విభాగాల ఉన్నత అధికారులు గుడేషార్, సృజన్ రెడ్డి, రణధీర్ రెడ్డి, సునీల్ కుమార్ వర్మ, శ్రీనివాసరావు, స్థానిక రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కనకరాజు, స్టేషన్ మాస్టర్ రమేష్ పాల్గొన్నారు. రైల్వే థర్డ్లైన్ పరిశీలన కేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్ మీదుగా కొత్తగా ఏర్పాటుచేసిన రైల్వే థర్డ్లైన్ను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) మాధవి, డీఆర్ఎం రాజగోపాలకృష్ణన్తో కలిసి మంగళవారం పరీశీలించారు. మండలంలోని తాళ్లపూసపల్లి, కేసముద్రం, ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మీదుగా అప్లైన్లో థర్డ్లైన్పై ప్రత్యేకంగా మోటార్ ట్రాలీపై ప్రయాణిస్తూ, అడుగడుగునా పనితీరును పరిశీలించారు. రైల్వేస్టేషన్ను సందర్శించారు. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి -
ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
మరిపెడ రూరల్: యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం మండలంలోని పీఏసీఎస్ను సందర్శించారు. గిరిపురం క్రాస్ రోడ్డులోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పీఏసీఎస్ కార్యాలయంలో యూరి యా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, ప్రతీ రైతుకు యూరియా అందేలా చూడాలన్నారు. అలాగే కేజీబీవీ వసతి గృహంలోని డైనింగ్ హాల్, స్టోర్ గది, కిచెన్ షెడ్, పిల్లలకు వండిన వంటలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశాలలోని తరగతి గదికి వెళ్లి పాఠ్యపుస్తకాల్లోని పలు అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఏ విజయ్చంద్ర, తహసీల్దార్ కృష్ణవేణి, ఏఓ బోడ వీరసింగ్, సీఈఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ప్రజలు
● పెరుమాండ్ల రామకృష్ణ పరకాల: అసాధ్యం అనుకున్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుసాధ్యం చేసి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కుతుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగ ప్రజానీకమే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ఖాయమని అన్నారు. పరకాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత తీసుకురావడంతోపాటు దండోరా పోరాటంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. పరకాల నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభివృద్ధిలో కుంటుపడేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాట్లాడుతూ.. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ దండోరా కమిటీల పునానిర్మాణం చేసి జాతి ఐక్యతకు హక్కుల సాధనకు మాదిగలు కలిసి రావాలని పిలుపుచ్చారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని కలిసి సన్మానించారు. కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ బాధ్యులు పెండెల రాము, పెండెల సారన్న, పూరెల్ల సూర్యం, పెండెల తిరుపతి, బరిగెల అనిల్, వడ్ల నవీన్, పెండెల ప్రసాద్, మొండి సమ్మయ్య పాల్గొన్నారు. -
పాము కాటుతో మహిళ మృతి
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివా రులో నివాసముంటున్న లావుడియా కమల(35) పాము కాటుకు గురై మంగళవారం మృతి చెందింది. ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం దేశరాజుపల్లికి చెందిన కమల–రమేశ్ దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి కొత్తపల్లి శివారులో ఉంటున్నారు. ఈక్రమంలో మంగళవా రం ఇంట్లో నిద్రిస్తుండగా కమలను పాము కాటేసింది. భర్త రమేష్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా కమ ల మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు ఎస్సై రాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కమలకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు.. ఐనవోలు: తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని రాంనగర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం.. బుర్ర సాంబరాజు(41) గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వృత్తిలో భాగంగా మంగళవారం తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందా డు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సాంబరాజుకు భార్య సంధ్య, కుమారుడు సిద్దు, కూతురు సిరి ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి .. కేసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మానుకోట జిల్లా కేసముద్రం మండలంలోని చంద్రుతండా జీపీ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తండావాసులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటగిరి సమీపంలోని చంద్రుతండా జీపీకి చెందిన చెందిన లకావత్ దేవా(35) వెంకటగిరి గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించేక్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న భగీరథ ఎయిర్వాల్ దిమ్మెను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయ మైంది. దీంతో మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్కు విద్యుత్ సరఫరా సిద్ధం ● ట్రాన్స్కో సీఈ రాజుచౌహాన్ కాటారం: చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా గారెపల్లి పంప్హౌస్ కోసం నిర్మించిన సబ్స్టేష న్ ద్వారా విద్యుత్ సరఫరా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్కో సీఈ రాజుచౌహాన్ తెలిపారు. ఎస్ఈ మల్చూర్తో కలిసి సీఈ లిఫ్ట్ ఇరిగేషన్ గారెపల్లి నూతన సబ్స్టేషన్ను మంగళవారం పరిశీలించారు. సబ్స్టేషన్లో అమర్చిన యంత్రాల వివరా లు, పవర్ లోడ్ కెపాసిటీ, సరఫరా ప్రక్రియ తదితర అంశాలపై ట్రాన్స్కో అధికారులతో ఎస్ఈ చర్చించారు. ప్రొటెక్షన్ వింగ్, టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో టెస్ట్ చార్జ్ చేశారు. అనంతరం లో ఓల్టేజ్ సమస్య నివారణలో భాగంగా మండల కేంద్రంలోని ఎర్రగుంటపల్లిలో అమర్చిన నూతన 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను సీఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యు త్ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా నా ణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నట్లు సీఈ తెలి పారు. లో ఓల్టేజ్ సమస్యలను అధిగమించేందుకు సీఎండీ ఆదేశాల మేరకు అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఈఈలు పాపిరెడ్డి, సదానందం, ఏడీఈ నాగరాజు, ఏఈ ఉపేందర్, లైన్ ఇన్స్పెక్టర్ క్రాంతికిరణ్ పాల్గొన్నారు. -
రజాకార్లు ఉన్మాదుల్లా ప్రవర్తించారు..
ఆరోజు రజాకార్లు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. రజాకార్లంతా నాటుసారా తాగి గ్రామస్తులను ఒక్కచోట చేర్చి తుపాకులతో విచక్షణారహితంగా కాల్చి చంపారు. చనిపోయినవారిని, గాయపడ్డవారిని గడ్డిలో వేసి నూనె పోసి కాల్చారు. నన్ను తీవ్రంగా కొట్టడంతో పారిపోయాను. నా కుటుంబంతో సహా కాంపెల్లి సమీపంలో అడవుల్లో ఆరు నెలలు దాక్కున్నాం. – తేరాల గురవయ్య, పెరుమాళ్లసంకీస, డోర్నకల్ మండలం భయంతో వణికిపోయాం.. ఆ రోజు మా ఇంటి పక్కనే ఉన్న బందెలదొడ్డి వద్ద తుపాకుల కాల్పులు వినిపించడంతో భయంతో వణికిపోయాం. మానాన్న తుపాకీ గాయాలతో ఇంటికి వచ్చి కొంతసేపటికి చనిపోయాడు. తర్వాత అందరం ఇంటి నుంచి పారిపోయి మూడు నెలలపాటు అడవుల్లో దాక్కున్నాం. – గుడిమెట్ల రామక్క, పెరుమాళ్ల సంకీస, డోర్నకల్ మండలం -
ఓరుగల్లులో రణనినాదం
1947 ఆగస్టు15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ స్టేట్ నిజాం పాలనలో మగ్గుతూనే ఉంది. నిజాం నిరంకుశత్వంతో విసుగెత్తిన జనాలు తిరగబడ్డారు. రజాకార్లను తరిమి కొట్టారు. స్వేచ్ఛావాయువుకోసం పోరాడుతున్న నాటి హైదరాబాద్ స్టేట్ ప్రజలు.. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో చేపట్టిన పోలీస్ చర్యతో 1948 సెప్టెంబర్ 17న భారత్లో భాగస్వామ్యమయ్యారు. గార్ల: గీత కార్మికుడైన తోడేటి రామస్వామి, శాంతమ్మకు 1928లో జన్మించిన నేను భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేశా.‘నిజాం తొత్తు జాగీర్దార్ సైతం గార్లలో అజమాయిషీ చెలాయిస్తూ దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడేవాడు. రజాకార్లకు హెడ్గా మిస్కిల్సాబ్ వ్యవహరించేవాడు. జీవంజిపల్లిలో రజాకార్లకు రైఫిల్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. రజాకార్లు పగలు గ్రామాల్లో ప్రదర్శన నిర్వహిస్తూ ‘జిన్నీకా హుకుం సే నెహ్రూకు జుకాదేంగే’ అంటూ నినాదాలు చేసేవారు. నాడు అందరూ ఉర్దూ మీడియం చదవాల్సిందే అంటూ హుకుం జారీచేశారు. జాగీర్దార్ వ్యవస్థలో తహసీల్దార్లుగా ఉన్న నూరుద్దీన్, రషీద్మియా అమానుష ఆగడాలకు అంతులేకుండా పోయింది. అప్పట్లో ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’.. అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట శంఖాన్ని పూరించిన దాశరథి కృష్ణమాచారి, రంగాచారి స్ఫూర్తితో 18 సంవత్సరాల వయసులో నేను నాటి సామాజిక పరిస్థితులకు ప్రభావితుడనయ్యాను. రజాకార్లు, నైజాం పోలీసులు రాంపురంలో బాలింతను చెరచడంతోపాటు దుబ్బగూడెం, ముల్కనూరు గ్రామాల్లో విచక్షణారహితంగా దాడులు చేశారు. ప్రజలు చెట్టుకొకరు. పుట్టకొకరుగా ఇళ్లు వదిలి పెట్టాల్సిన పరిస్థితులు నన్ను కలిచివేసి ఉద్యమం వైపు నడిపించాయి. నాడు ఈ ప్రాంత ఉద్యమ కమాండర్గా పనిచేస్తున్న తుమ్మల శేషయ్య నాయకత్వంలో ముందుకు సాగాం. బండ్లకుంట వద్ద సేదతీర్చుకుంటున్న మా దళానికి రజాకార్లకు మధ్య 1948లో జరిగిన ఎదురు కాల్పుల్లో దామినేని వెంకటేశ్వరరావు, బుచ్చిమల్లు, మరికొంతమంది అమరులయ్యారు.సాయుధ పోరులో డోర్నకల్ డోర్నకల్: మానుకోట జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస, ఉయ్యాలవాడ, వెన్నారం, బూరుగుపాడు, తోడేళ్లగూడెం, చిలుకోడు తదితర గ్రామాల నుంచి అనేకమంది పోరులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన తుమ్మ శేషయ్య, ఏలూరి వీరయ్య, నున్న పుల్లయ్య దళకమాండర్లు ఉండడంతో రజాకార్లు ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. దళాల ఆచూకీ తెలపాలని 1948 సెప్టెంబర్ 1న 200 మంది రజాకార్ల ముఠా పెరుమాళ్ల సంకీసపై దాడి చేసింది. బందెల దొడ్డి వద్ద కాల్పులు జరపడంతో 16 మంది అక్కడికక్కడే.. గాయపడ్డ ఆరుగురు తర్వాత చనిపోయారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం మృతదేహాలతోపాటు గాయాలైనవారిని తగులబెట్టారు. ఉయ్యాలవాడలో 1947 ఫిబ్రవరి 14న రజాకార్లు జరిపిన దాడిలో ఇద్దరు గ్రామస్తులు చనిపోయారు. నిజాం దొరలు, రజాకార్లను తరిమికొట్టిన వీరులు ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛావాయువులు సెప్టెంబర్ 17 సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు సాయుధ పోరాటంలో ఉమ్మడి జిల్లా కీలక భూమిక -
దేశాభివృద్ధికి వన్ నేషన్ – వన్ ఎలక్షన్
కాజీపేట అర్బన్: వన్ నేషన్ వన్ ఎలక్షన్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యుడు సయ్యద్ జాఫర్ ఇస్లాం తెలిపారు. హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్లో మంగళవారం ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్ కోసం తెలంగాణ విద్యార్థులు’ నినాదంతో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సయ్యద్ జాఫర్ ఇస్లాం హాజరై మాట్లాడారు. 1984లోనే నాటి ప్రధాని వాజ్పేయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన తీసుకురాగా అదే అంశాన్ని 2019లో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక తీసుకొచ్చారని తెలిపారు. ఎన్నికల్లో కోట్ల రూపాయల ఖర్చు తగ్గించుకునేందుకు, సమయం, ప్రజాధనం వృథాకాకుండా ఈ విధానం తోడ్పడుతుందని అన్నారు. విద్యార్థులు దేశాభివృద్ధికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ అంటోనీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్ర కన్వీనర్ భర్తుర్ శ్రీరాం, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గౌతమి అహీర్రావు, మీజీ ఆర్మీ డాక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ భిక్షపతి మాచర్ల, క్లాసికల్ డ్యాన్సర్ బారాది విజయ్కుమార్, ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీత నక్క స్నేహలత, వివిధ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్రెడ్డి, గంట రవికుమార్, వెంకటేశ్వర్లు, నిషిధర్రెడ్డి, రమేష్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, నాయకులు రావుపద్మరెడ్డి, కాళీప్రసాద్, రావు అమరేందర్రెడ్డి, కొత్త రవి, పాండేజీ, మల్లికారావు, అహన్యరాజ్, కార్తీక్ పాల్గొన్నారు. ‘కుడా’ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతనయీంనగర్: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనే సామాజిక అవగాహన కార్యక్రమం కాళోజీ కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించడానికి మౌఖిక అనుమతి ఇచ్చి ‘కుడా’ అధికారులు రద్దు చేసినట్లు హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో శ్రేణులు మంగళవారం ‘కుడా’ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆఖరి నిమిషంలో కాళోజీ కళాక్షేత్రం అనుమతిని కూడా అధికారులు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతుంటే అనుమతి ఎందుకు ఇవ్వరంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలకతీతంగా చేస్తున్న సామాజిక కార్యక్రమం అని చెప్పిన అధికారులు వినలేదన్నారు.‘కుడా’ వైస్ చైర్మన్తో అనుమతిని ఎందుకు రద్దు చేస్తున్నారో రాతపూర్వకంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కార్యక్రమాన్ని నగరంలోని సీఎస్ఆర్కు గార్డెన్కు మార్చినట్లు వారు తెలిపారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం -
సాయుధ పోరాటం@ జనగామ
జనగామ: తెలంగాణ సాయుధ పోరాటం జనగామలోనే పురుడు పోసుకుంది. విస్నూరు రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో నల్లా నర్సింహులు, చకిలం ధర్మారెడ్డి, యాదగిరిరావు నేతృత్వంలో 1946 జూలై 14న కడవెండి పోరుకు అంకురార్పణ చేశారు. గబ్బెట తిరుమల్రెడ్డి, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, ఏసిరెడ్డి నర్సింహారెడ్డి, గానుగుపహాడ్ నారాయణరెడ్డి, దండబోయిన నర్సింహులు, బిట్ల ముత్తయ్య ప్రాణత్యాగం చేశారు. జనగామ మొట్టమొదటి ఎమ్మెల్యే గంసాని గోపాల్రెడ్డి రాజకీయ నాయకుడిగా సాయుధ పోరాటానికి తన సేవలందించారు. నిజాం నవాబ్ 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్పటేల్ ఎదుట లొంగిపోయారు. సైనిక ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట దళం సెంట్రల్ కమాండ్గా పనిచేసిన గంగసాని తిరుమల్రెడ్డిని సైనిక బలగాలు పట్టుకుని చెట్టుకు కట్టేసి కంచనపల్లిలో మొదటి ఎన్కౌంటర్ చేశాయి. దొరల స్వాధీనంలో ఉన్న 1.40 కోట్ల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసేందుకు సాయుధ పోరాటం దోహదపడింది. -
పోరాటాల కేంద్రం.. బయ్యారం
బయ్యారం: నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాలకు బయ్యారం కేంద్రంగా బిందువుగా చెప్పవచ్చు. నిజాం పాలనను వ్యతిరేకించిన దామినేని వెంకటేశ్వరరావు, కంచర బుచ్చిమల్లుతోపాటు 30 మందిని మండలంలోని బండ్లకుంట సమీపంలో నిజాం పోలీసులు కాల్చి చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఎడ్లబండ్లపై గ్రామాల్లో ఊరేగించి అందరినీ ఒకే చితిపై పెట్టి కుటుంబ సభ్యులు సైతం కడసారి చూపునకు నోచుకోకుండా దహనం చేశారు. పోరాటాల పురిటిగడ్డగా పేరు తెచ్చుకున్న బయ్యారంలో 1969లో మొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మించారు. బయ్యారం గాంధీసెంటర్లో ఉన్న అమరవీరుల స్మారక స్తూపం నాటి పోరాట పటిమ, త్యాగాలకు సాక్షిగా నిలుస్తోంది. ఊరూరా ఉద్యమకారులు జనగామ: జనగామ మండలంలోని వడ్లకొండ, గానుగుపహా డ్, మరిగడి, ఎర్రగొల్లపహాడ్, సిద్ధెకి ఇలా అనేక గ్రామాలు రజాకార్ల అరాచకాలను ఎదురించాయి. వడ్లకొండకు చెందిన దండెబోయిన నరహరి, మేదరి గాల్రెడ్డి, దేవుసాని వెంకటయ్య, సిద్ధిరాల యాదగిరి, గజ్జెల సాయిలు, కొత్త పాపిరెడ్డి రజాకార్లతో పోరాడారు. గానుగుపహాడ్లో నారాయణరెడ్డి, పులిగిళ్ల కొమురయ్య, కారింగుల నారాయణరెడ్డి, వనమాల నాగమల్లయ్య.. ఇలా ఎందరో వీరులు ఉద్యమంలో నేలకొరిగారు. దండెబోయిన నరహరిపై నిజాం నవాబు 18 మర్డర్ కేసులను నమోదు చేసి రెండు ఉరిశిక్షలు విధించారు. ఓ సమయంలో రజాకార్లకు పట్టుబడిన నరహరిని సజీవంగా చితిపై పడుకోబెట్టి కాల్చేందుకు ప్రయత్నిస్తుండగా చాకచక్యంగా తప్పించుకున్నాడు. నరహరిని ప్రాణాలతో పట్టుకోవాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు. 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయన 20 ఏళ్ల క్రితం మృతి చెందారు. గానుగుపహాడ్కు చెందిన నారాయణరెడ్డి ఉపాధ్యాయ వృత్తి వీడి రజాకార్లను తుదముట్టించేందుకు దళంలో చేరాడు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా కూటిగల్ గ్రామంలో రజాకార్లు నారాయణ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. జనగామ: నిజాం పాలనలోనే జనగామలో తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. 1943లో పాఠశాలకు అంకుర్పారణ చేసి.. 1945లో విద్యాబోధన ప్రారంభించారు. ప్రెస్టన్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఉపద్రష్ట వెంకటరామశాస్త్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనగామ తాలూకాలో మొదటి తెలుగు పాఠశాలకు శ్రీకారం చుట్టారు. తెలుగుకు ఓ గుర్తింపు తీసుకొచ్చేందుకు తాపత్రయపడ్డారు. ఆంధ్ర భాషాభివర్ధిని ఉన్నత పాఠశాల(ఏబీవీ)గా నామకరణం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1949లో నాటి ప్రభుత్వం ఏబీవీ స్కూల్ను ఎయిడెడ్గా మార్చింది. -
నాలుగో నంబర్ ప్లాట్ఫారం నిర్మించాలి
● డీఆర్ఎంను కలిసిన ఎమ్మెల్యే మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో నిర్మాణం పూర్తయిన మూడోలైన్ పరిశీలనకు వచ్చిన సీఎస్ఆర్ మాధవి, డీఆర్ఎం రాజగోపాలకృష్ణన్ను నాలుగో నంబర్ ప్లాట్ ఫారం నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే మురళీనాయక్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, వినియోగదారుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. మహబూబాబాద్ పట్టణంలోని కోర్టు వైపున నూతనంగా ప్రవేశ ద్వారం నిర్మించాలని, వందే భారత్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. సిగ్నల్ కాలనీ, కురవి గేటు వద్ద అండర్ పాస్ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, నూతన ఆర్ఓబీని తక్షణమే నిర్మించాలని, రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలన్నారు. కొత్త బజార్ ప్రయాణికులకు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంక్షేమ మండలి కార్యదర్శి మైస శ్రీనివాసులు, సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథిరెడ్డి, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సూర్నపు సోమయ్య, ఆయా పార్టీల ముఖ్య నాయకులు గిరిధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవం
మహబూబాబాద్: ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన దినోత్సవానికి కలెక్టర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో అలకరించారు. కాగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ హాజరుకానున్నట్లు కలెక్టరేట్ అధికారులు మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 9.58గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ముందుగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ ముఖ్య అతిథిని స్వాగతిస్తారన్నారు. ఉదయం 10గంటలకు రాంచంద్రునాయక్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. 10.01 గంటలకు జాతీయ గీతాలాపన, 10.02 గంటలకు రాష్ట్ర అధికారిక గీతాలాపన ఉంటుందని తెలిపారు. 10.07గంటలకు ముఖ్యఅతిథికి పోలీసుల గౌరవ వందనం, 10.10గంటలకు ముఖ్య అతిథి ప్రసంగం, 10.15గంటలకు కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లా అఽధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సకాలంలో హాజరుకావాలని కోరారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ హాజరు -
అమాయకులను బలిగొన్న రజాకార్లు
పర్వతగిరి: ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు 1948 మార్చి 11 చౌటపల్లి గ్రామాన్ని చుట్టుముట్టారు. 21 మందిని నిర్బంధించి తుపాకులతో కాల్చి చంపారు. కొంతమంది ఇళ్లను తగులబెట్టారు. అదేవిధంగా కొంకపాక గ్రామం దొరల పాలనలో సాగింది. మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తమరావు తండ్రి తక్కళ్లపల్లి వెంకట్రాం నర్సయ్య ఆధీనంలో గ్రామం ఉండేది. దీంతో రజాకార్లు దొరలను టార్గెట్ చేశారు. వారి సంపదను దోచుకున్నారు. అడ్డువచ్చిన వారిని కాల్చి చంపారు. కొందరి ఇళ్లను దహనం చేశారు. ఈ ఘటనలో 15 మంది బలైపోయారు. -
ఆటలు ఆడేదెలా?
క్రీడా మైదానాల్లో అసౌకర్యాలు.. పట్టించుకోని అధికారులు కురవి: జిల్లాలోని సీరోలు, కురవి మండలాల్లోని పలు గ్రామాల్లో క్రీడా మైదానాలు అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. క్రీడా మైదానాలకు సరైన స్థలాలు కరువయ్యాయి. నీళ్ల ట్యాంకులు, నర్సరీలు, గుట్టలు, పాఠశాలల్లో క్రీడామైదానాలను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, క్రీడాకారులు ఆటలు ఎలా ఆడాలని ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో క్రీడా మైదానాలను చాలా గ్రామాల్లో ఏర్పాటు చేశారు. అయితే కొన్ని గ్రామాల్లో స్థలాల కొరత ఉండడం వల్ల ఇలా ఏర్పాటు చేయడంతో ఆటలకు ఉపయోగ పడడంలేదు. దీంతో విద్యార్థులు, క్రీడాకారులు ఆటలు ఆడే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. కాగా, ప్రభుత్వం పలు రకాల అసోసియేషన్ల పేరిట ఆటలను ఆడిస్తోంది. అయితే తూతూ మంత్రంగా ఆటలు ఆడిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం క్రీడామైదానాలకు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి క్రీడలను అభివృద్ధి చేయాల్సి ఉంది. -
నాన్బోర్డర్లు ఖాళీ చేయాల్సిందే..
కేయూ క్యాంపస్: కేయూ హాస్టళ్లలోని నాన్బోర్డర్లు గదులను వేకెట్ చేయాల్సిందేనని రిజిస్ట్రార్ వి.రామచంద్రం స్పష్టం చేశారు. వర్సిటీలో శనివారం రాత్రి ఇద్దరు విద్యార్థులపై పలువురు దాడిచేసిన ఘటన అనంతరం అదేరోజు రాత్రి, ఆదివారం రాత్రి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనలు నిర్వహించడం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. హాస్టళ్లల్లో నాన్బోర్డర్ల వల్ల తలెత్తుతున్న సమస్యలపై సోమవారం సాయంత్రం పరిపాలన భవనంలోని కమిటీ హాల్లో అన్ని విభాగాధిపతితులతోనూ, వర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో హాస్టళ్ల డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లతో రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. నాన్బోర్డర్లు ఈనెల 17న సాయంత్రం వరకు వేకెట్ చేయాలని హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్ సోమవారం సాయంత్రం సర్క్యూలర్ జారీ చేశారు. అలుమనాక్ ప్రకారం ఈనెల 20 నుంచి మధ్యాహ్నం లంచ్ తర్వాత హాస్టళ్లను మూసివేస్తున్నట్లు సర్క్యూలర్లో పేర్కొన్నారు. (దసరా సెలవుల నేపథ్యంలో) హాస్టళ్లలోని విద్యార్థులు నిబంధనలు పాటించకపోతే అడ్మిషన్లు రద్దు చేస్తామని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ సర్క్యూలర్లో పేర్కొన్నారు. విద్యార్థులతో సమావేశం కేయూలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో హనుమకొండ, కాజీపేట ఏసీపీలు నర్సింహారావు, ప్రశాంత్రెడ్డి, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ రవి కుమార్, ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో యూనివర్సిటీకి వచ్చారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ పాలకమండలి సభ్యులు సురేశ్లాల్ సమక్షంలో హాస్టళ్ల విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు. సర్క్యూలర్ జారీ చేసిన హాస్టళ్ల డైరెక్టర్ -
వందేభారత్కు సిర్పూర్కాగజ్నగర్లో హాల్టింగ్
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్పూర్–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్కు సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి సికింద్రాబాద్–నాగ్పూర్ (20102) వందేభారత్, ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్పూర్–సికింద్రాబాద్ (201010 వందేభారత్ ఎక్స్ప్రెస్కు సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లో అధికారికంగా హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. దీంతో కాజీపేట పరిసర ప్రాంతాల నుంచి సిర్పూర్కాగజ్నగర్కు వెళ్లే ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్లేందుకు ఈ రైలు ఉపయోగపడనుంది. ఆర్సీఎఫ్ యూరియా వచ్చేసింది.. ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్కు 1,319.220 మెట్రిక్ టన్నుల ఆర్సీఎఫ్ యూరియా వచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు చేరిన వ్యాగన్ను వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని వరంగల్కు 209.22 మెట్రిక్ టన్నులు, హనుమకొండ 280, ములుగు 160, జయశంకర్ భూపాలపల్లి 220, జనగామ 230, మహబూబాబాద్ జిల్లాకు 220 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. కేటాయింపుల ప్రకారం ఆయా జిల్లాలకు యూరి యా తరలింపు చేపట్టినట్లు వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. విశ్వేశ్వరయ్యకు రిజిస్ట్రార్ ఘన నివాళి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్స్డేను పురస్కరించుకుని సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ రమణ, టీజీఎస్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్ సంధ్యారాణి పూలమాలలువేసి ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఇంజనీర్గా విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. -
ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక..
● బావిలో దూకి వ్యక్తి బలవన్మరణం● మర్రిపల్లిలో ఘటనదుగ్గొండి: మధ్య తరగతి కుటుంబం.. పనిచేస్తే గాని పూట గడవదు. అప్పు భారమైంది. వేధింపులు మొదలయ్యా యి. అప్పు తీర్చే మార్గం కనిపించక బావిలో దూకి బలవన్మరణాకి పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన కసివోజుల బ్రహ్మం(48) తనకున్న ఎకరంన్నర భూమిలో వ్యవసాయంతోపాటు ఇంటివద్ద వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా మిరప సాగు చేస్తుండగా పంట గిట్టుబాటు కాక అప్పులే మిగిలాయి. ఇదిలా ఉండగా ఏడాదిన్నర క్రితం ఇల్లు నిర్మించాడు. దీనికి ప్రైవేట్ బ్యాంకు, ఫైనాన్స్ల వద్ద అప్పు తెచ్చాడు. రూ. 20లక్షలు అప్పు అయ్యింది. ఇంటి నిర్మాణం పూర్తయింది. అయితే ప్రతీనెల వాయిదాలు చెల్లించలేకపోవడంతో బ్యాంకర్లు, ఫైనాన్సర్లు ఒత్తిడి తెస్తున్నారు. వీటికి తోడు గ్రా మంలో కొంత మంది వద్ద అప్పు తీసుకున్నాడు. దీంతో అప్పు ఎలా చెల్లించా లని వారం రోజులుగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉద యం 6 గంటలకు చేను వద్దకు వెళ్లి తిరిగా రాలేదు. దీంతో 10గంటలకు బావి వద్దకు వెళ్లిన భార్య శ్రీలత తన భర్త బావిలో పడినట్లు గుర్తించింది. దీంతో బా విలో వెతికి బ్రహ్మం మృతదేహాన్ని బయటకు తీశారు. బ్రహ్మం తన నడుముకు చున్నీతో రాయి కట్టుకుని బావిలో దూకాడు. దీంతో పైకి తేలలేదు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్రెడ్డి తెలిపారు. అప్పుల బాధతో ఆటోడ్రైవర్.. బచ్చన్నపేట : అప్పుల బాధతో ఓ ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వంగా సుదర్శన్రెడ్డి నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతల అర్జున్(38) తన ఆటో మరమ్మతుకు రావడంతో మరో ఆటో కొనుగోలు చేశాడు. దీనికితోడు తల్లిదండ్రులు కూడా కుటుంబ అవసరాలకు అప్పు చేశారు. మొత్తం సుమారు రూ. 8 లక్షల వరకు కావడంతో ఎలా తీర్చాలని కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్న అర్జున్.. సోమవారం తన వ్యవసాయ బావివద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై అబ్దుల్ హమీద్ తెలిపారు. కడుపునొప్పితో వృద్ధురాలు.. వెంకటాపురం(కె): కడుపు నొప్పితో ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘట న మండలంలోని నేలారిపేటలో జరిగింది. ఎస్సై తిరుపతిరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెంది న సంగం సమ్మక్క(60) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆ స్పత్రిలో చూపించి మందులు వాడుతున్నారు. అ యినా తగ్గకపోవడంతో ఆదివారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న బావిలో దూకి అత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం సమ్మక్క కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా బావిలో మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థిని చితకబాదిన కిరాణాషాపు యజమాని
కురవి : చాక్లెట్లు కొనేందుకు కిరాణా షాపునకు వెళ్లిన విద్యార్థిని దుకాణ యజమాని, ఆమె కుమార్తె చితకబాదారు. ఈ ఘటన సోమవారం మండలంలోని కంచర్లగూడెం తండాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవి మండలం కంచర్లగూడెం ప్రాథమిక పాఠశాలలో గుగులోత్ ఆకాశ్ ఐదో తరగతి చదువుతున్నాడు. కొంత మంది చిన్నారులు ఏడుస్తుండడంతో హెచ్ఎం వెంకటేష్ రూ.5 ఇచ్చి ఆకాశ్ను చాక్లెట్లు తీసుకురమ్మని చెప్పాడు. దీంతో తండాలోని కిరాణా షాపునకు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే కోతుల గుంపు బాలుడిపై దాడికి యత్నించాయి. దీంతో ఆకాశ్ భయంతో షాపులోకి వెళ్లాడు. ఆ సమయంలో షాపులో యజమాని లేడు. అనంతరం యజమాని గుగులోత్ కాళీ షాపులోకి వచ్చింది. షాపులోకి రాగానే భయపడుతున్న విద్యార్థి ఆకాశ్ను చూసి ఎందుకు లోపలికి వచ్చావని అడగడంతో కోతులు మీదకు రావడంతో వచ్చానని చెప్పాడు. విద్యార్థి మాటలు వినకుండా గల్లాపెట్టెలోని కొంత నగదును బాలుడి జేబులో పెట్టి దొంగతనం చేసేందుకు వచ్చావని విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. యజమాని కుమార్తె బానోత్ ప్రమీల సైతం బాలుడిని దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. రెండు గంటలపాటు బాలుడిని షాపులో బంధించి కొట్టారు. ఆకాశ్ తమ షాపులో దొంగతనం చేసేందుకు వచ్చాడని బాలుడి తండ్రి శివలాల్కు యజమాని ఫోన్ చేసి చెప్పింది. తాను వచ్చి మాట్లాడుతా అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత బాలుడిని విడిచిపెట్టారు. ఆకాశ్ ఇంటికి వెళ్లలేదు. దీంతో తాత మంగ్యా తన మనుమడు ఆకాశ్ ఇంటికి రాకపోయే సరికి షాపు వద్దకు వెళ్లాడు. తన మనుమడు ఎక్కడ అని అడగడంతో షాపు యజమాని కాళీ ఇటుకతో తలపై కొట్టడంతో వృద్ధుడి తల పగిలింది. బాలుడి తండ్రి శివలాల్ తండాకు చేరుకుని కురవి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం చెప్పాడు. శివలాల్ ఫిర్యాదు మేరకు బాలుడిని కొట్టిన గుగులోత్ కాళీ, ఆమె కుమార్తె బానోత్ ప్రమీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. బాలుడికి తీవ్రగాయాలు అడిగేందుకు వెళ్లిన తాతపైనా దాడి.. -
ఆదివాసీ సంస్కృతి
ప్రతిబింబించేలా గద్దెల విస్తరణ ఎస్ఎస్తాడ్వాయి : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమ్మవార్ల గద్దెల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పూజారుల అభిప్రాయం మేరకే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. సోమవారం మేడారంలో పూజారులు, ఆర్కిటెక్, దేవాదాయశాఖ అధికారులు, కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరీశ్, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావుతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతరలో 20 ఏళ్ల తర్వాత మంత్రిగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గద్దెల ప్రాంగణాల్లో మార్పులు, చేర్పులు చేయడంలో భాగంగా కొద్ది రోజులుగా పూజారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గొట్టు, గోత్రాలు, ఆదివాసీ ఆచారాలు, చరిత్ర, జీవన విధానాల ప్రకారం నిర్మాణ పనులు జరుగుతాయని, దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించారన్నారు. చిన్న గద్దెల మార్పిడితో అపచారం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని, పూజారుల అభిప్రాయం మేరకే పనులు కొనసాగుతాయన్నారు. గద్దెల ప్రాంతాన్ని 20 ఫీట్ల వెడల్పు, 80 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పూజారుల తుది నిర్ణయాల మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించి సీఎం ముందు ఉంచుతామని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూజారులతో కలిసి మేడారంలో నూతన మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, పూజారులు ముణిందర్, వెంకటేశ్వర్లు, రఘుపతి, రమేశ్, సారయ్య, స్వామి, గోవర్ధన్, భోజరావు, కృష్ణయ్య, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూజారుల నిర్ణయం మేరకే మాస్టర్ ప్లాన్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
హసన్పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెల్ఫోన్ రిపేర్ (30రోజులు), బైక్ మెకానిక్ (30రోజులు), ఏసీ, రిఫ్రిజిరేటర్ (30రోజులు), ఎల్ఎండబ్ల్యూ డ్రైవింగ్ (30రోజుల) శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 45ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, తెల్లరేషన్, ఆధార్కార్డుతోపాటు విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఈనెల 25వ తేదీ లోపు సంస్కృతీ విహార్, హసన్పర్తిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9704056522కు నంబర్లో సంప్రదించాలని సూచించారు. వాజేడు: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల పీఈటీ తెల్లం రాజ్యలక్ష్మి జాతీయ స్థాయి చెస్ పోటీలకు ములుగు జిల్లా నుంచి ఎంపికయ్యారు. ఈనెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. దీంతో న్యాయనిర్ణేతలు రాజ్యలక్ష్మిని జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మిని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు పలువురు ఉద్యోగులు అభినందించారు. రెండు బైక్లు ఢీ.. ● జీపీ కార్యదర్శి దుర్మరణం ● రక్మీ తండా శివారులో ఘటన నెక్కొండ: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం చెందాడు. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొర్ర వెంకట్రాం (55) మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం జయపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రక్మీ తండా శివారులో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. మృతుడి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మాజీ డిప్యూటీ సీఎం ‘తాటికొండ’ గృహ నిర్బంధం
హన్మకొండ: మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం రఘునాథపల్లి మండలంలో పాదయాత్ర కొనసాగించాల్సి ఉండగా అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హనుమకొండ సర్క్యూట్ హౌజ్ రోడ్లోని స్వగృహంలో పోలీసులు గృహ నిర్బంధం లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ శ్రేణులు రాజయ్య ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం రాజయ్యను గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయడంతో 12 గంటలకు సద్దుమణిగింది. అనంతరం పాదయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ నీతి వ్యాఖ్యలు మాట్లాడే స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారడం ఏ విలువలకు నిదర్శనమని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పార్టీ మారాడని దుయ్యబట్టారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ జెండాతో గెలిచిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్ర చేస్తుంటే భయం ఎందుకని ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నావో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఆరు నూరైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర కొనసాగిస్తానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. హనుమకొండలో ఉద్రిక్తత రైతుల కోసం పాదయాత్ర కొనసాగిస్తా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య -
శ్రాద్ధకర్మ పూజలు చేయొద్దని అభ్యంతరం
కాళేశ్వరం: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద శ్రాద్ధకర్మ పూజలు చేసేందుకు త్రివేణి తీర్థ బ్రాహ్మణ సంఘం సభ్యులంతా విశ్వబ్రాహ్మణ పురోహితుడికి అ భ్యంతరం తెలుపడంతో మనస్తాపానికి గురయ్యా డు. వెంటనే పెట్రోల్ బాటిల్ తీసుకుని మిషన్ భగీ రథ వాటర్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని, తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరిగింది. పురోహితుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కాళేశ్వరం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణుడు ము మ్మడి సురేశ్, రమ దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్ మూడేళ్లుగా గోదావరిలో శ్రాద్ధ కర్మపూజలు చేసేందుకు వారి సమ్మతితోనే వెళ్తున్నాడు.ఈక్రమంలో సోమవారం యథావిధిగా గోదావరి వద్దకు వె ళ్లాడు. అక్కడ బ్రాహ్మణ సంఘం సభ్యులందరు ‘గోదావరికి నీవు రావొద్దు.. నువ్వు వస్తే నీతోపాటు మరి కొంత మంది ఇతర కులాల వారు వస్తామంటున్నారు’ అని అభ్యంతరం తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ పెట్రోల్ బాటిల్ తీసుకొని మిషన్భగీరథ వాటర్ ట్యాంకు ఎక్కి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై తమాషారెడ్డి ఘటనాస్థలికి చేరుకుని నచ్చచెప్పే యత్నం చేసినా ససేమిరా అని గంటన్నర పాటు ఆందోళన చేపట్టాడు. తనకు యథావిధిగా పురోహిత వృత్తికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాడు. దీంతో బ్రాహ్మణ సంఘం సభ్యులు మాడుగుల పవన్శర్మ, జగన్శర్మ, ఆరుట్ల పవన్చార్యులు, రఘుచార్యులు.. హామీ ఇవ్వడంతో ఆ పురోహితుడుకిందికి దిగొచ్చాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. మనస్తాపంతో పురోహితుడి ఆత్మహత్యాయత్నం పెట్రోల్తో ట్యాంకు ఎక్కి హల్చల్.. కాళేశ్వరంలో ఘటన -
దొంగల ముఠా అరెస్ట్
● కాపర్ వైర్, పలు సామగ్రి స్వాధీనం కాటారం(మహాముత్తారం): మహాముత్తారంతోపా టు పలిమెల మండలంలో వరుస చోరీలకు పాల్ప డిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మహాముత్తారం పోలీస్స్టేషన్లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన చిగురు సంతోష్, బుర్రకుంట ప్రకాశ్, జైనేని రమేశ్, షేక్ కుదరత్ ముఠాగా ఏర్పడ్డారు. కాటారం సబ్ డివి జన్ పరిధిలోని పలు గ్రామాల్లో పగలు ఆటోలో రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీలకు పా ల్పడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాటారం మండలంలో మూడు ట్రాన్స్ఫార్మర్లు, కొయ్యూర్లో రెండు, పలిమెల, మహాముత్తారం ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చొప్పున పగలగొట్టి కాపర్వైర్ అపహరించారు. అంతేకాకుండా మహాముత్తారం మండలంలో రోడ్డుపై ఉన్న ఎడ్ల బండి ఇనుప చక్రాలు, ట్రాక్టర్ బ్యాటరీ, మంథని మండలం ఆరెందలో పవర్ టిల్లర్ను చోరీ చేశారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు పెట్రోలింగ్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున యామన్పల్లి వద్ద ఆటోలో అనుమానాస్పందగా ఉన్న సంతోష్, ప్రకాశ్, రమేశ్, కుదరత్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితులు చోరీలకు పాల్పడు తున్నట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి కాపర్వైర్, పవర్ టిల్లర్, ట్రాక్టర్ బ్యాటరీ, ఎడ్ల బండి చక్రాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు రైల్వే అధికారుల పరిశీలన
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో నిర్మించిన మూడో రైల్వేలైన్, నూతన రైల్వే స్టేషన్ భవనం, ఎస్సీ–80 రైల్వే గేట్, ఇతర శాఖాపరమైన పనులను మంగళవారం కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఉన్నత అధికారి కవిత, దక్షిణ మధ్య రైల్వే జీఎం పరిశీలన చేయనున్నారు. వారివెంట ఏజీఎం, సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 13 ప్రత్యేక విభాగాల ప్రిన్సిపల్ హెచ్ఓడీలు తనిఖీకి రానున్నట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. ఉదయం ప్రత్యేక తనిఖీల అనంతరం దక్షిణ మధ్య రైల్వే ఉన్నత అధికారుల బృందం కేసముద్రం రైల్వే స్టేషన్, అక్కడి నుంచి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక రైలులో ప్రయాణం చేసి మూడో రైల్వే లైన్ నిర్మించిన ప్రాంతాన్ని పరిశీలన చేసి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. -
విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి
● డీఈఓ దక్షిణామూర్తిమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ీఈఓ మాట్లాడుతూ.. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం తరగతి గదులు, వంట గదులను పరిశీలించి, చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవాలన్నారు. జీసీడీఓ విజయకుమారి, సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాల ఎస్ఓ భవాని పాల్గొన్నారు. -
ప్రణాళికతో నియోజకవర్గ అభివృద్ధి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తొర్రూరు/పెద్దవంగర: పక్కా ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని 78మంది లబ్ధిదారులకు రూ.78లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల 51 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.26.90లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోనే కాదు దేశమంతా యూరియా కొరత ఉందని, దానికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు దివ్యాంగులకు పింఛన్ పెంచాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్లు అచ్చిరెడ్డి, కంచర్ల వెంకటాచారి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, నాయకులు మోత్కూరి రవీంద్రాచారి, చిత్తలూరి శ్రీనివాస్, చెవిటి సదాకర్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
● పలు పాఠశాలల్లో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత ● ఇష్టారాజ్యంగా వర్క్ అడ్జెస్ట్మెంట్ చేశారని ఆరోపణలు ● విద్యాపరంగా నష్టపోతున్న విద్యార్థులు‘మానుకోట మున్సిపాలిటీ పరిధి గాంధీపురం ఎంపీపీఎస్లో ఐదుగురు ఉపాధ్యాయుల్లో నలుగురు పదోన్నతులపై వెళ్లారు. ఉన్న ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నారు. మొత్తం 54మంది విద్యార్థులకు చదువుతున్నారు. కాగా, హెచ్ఎం కాంప్లెక్స్ సమావేశాలు, జూమ్ మీటింగ్కు హాజరుకావడం, ఎండీఎం అప్డేట్ చేయడం, ఎఫ్ఆర్ఎస్ ఇలా రకరకాల విద్యా సంబంధమైన డ్యూటీలు వేస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు తక్షణమే స్పందించి ఇతర పాఠశాలల నుంచి డిప్యుటేషన్ పై ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.’ మహబూబాబాద్ అర్బన్: ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. కాగా అవసరం మేరకు ఆయా జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీలోపు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలను ఆదేశించారు. కలెక్టర్ల ఆమోదంతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గతంలో జూలై 15లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆ తర్వాత పదోన్నతులు, బదిలీల అంశం తెరపైకి రావడంతో అనేక జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు పెండింగ్లో పడింది. పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో తాజాగా మరోసారి ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఆరోపణలు.. జిల్లాలో 676 ప్రైమరీ పాఠశాలలు ఉండగా.. 19,213 మంది విద్యార్థులు చదువుతున్నారు. 120 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా 5,354 మంది విద్యార్థులు చదువుతున్నారు. 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా 13,497 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 3,281 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కాగా జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేక, విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, జిల్లా విద్యాశాఖ నెల రోజుల క్రితం 84మంది ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసింది. అయితే ఎంఈఓలు నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని, జాబితాను తప్పుల తడకగా రూపొందించారని పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈసారైనా సక్రమంగా జరిగేనా.. ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయుల సర్దుబాటు మొదట జరిగిన జిల్లాలో పదోన్నతులపై సుమారు 90మంది ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. అదేవిధంగా సర్దుబాటు చేసిన డీఈఓ కూడా పదవీ విరమణ పొందారు. నూతనంగా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అధికారికి సర్దుబాటు విషయ తలనొప్పిగా మారింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 18 సబ్జెక్టులను బోధించడానికి విద్యార్థులకు అనుగుణంగా మొత్తం నలుగురు ఉపాధ్యాయులతో ఒక హెచ్ఎం ఉండాలి. గత డీఈఓ, విద్యాశాఖ అధికారులు చేసిన తప్పులు ఈసారి సరిదిద్దుకుంటారో లేదో వేచిచూడాలి. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సర్దుబాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో మాదిరిగా ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో తప్పిదాలు జరగకుండా ఈసారి విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తాం. – దక్షిణామూర్తి, డీఈఓ -
పోలీస్ తిప్పలు!
● యూరియా పంపిణీలో జాగారం ● ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీలు ● కొరతపై నిఘా వర్గాలతో నివేదిక ● పంపిణీలో మార్పులు, చేర్పులుసాక్షి, మహబూబాబాద్: రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందించే వ్యవసాయశాఖ.. ఈ ఏడాది సీజన్కు ముందు నుంచే యూరియా పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈక్రమంలో ఆగస్టు మొదటి వారం నుంచి పోలీసులు లేనిదే యూరియా పంపిణీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు తేల్చి చెప్పారు. దీనికి తోడు రోజురోజుకూ సమస్య జఠిలం కావడం.. ఎక్కడ లేని సమస్య జిల్లాలోనే ఉండడంతో యూ రియా పంపిణీ అధికారులకు సవాల్గా మారింది. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చేలా వ్యవహారం ముదరడంతో.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి చొరవ తీసుకునే వరకు వెళ్లింది. దీంతో యూరియా పంపిణీ శాంతి భద్రతల సమస్య వర కు దారి తీయడం.. అందులో రైతుల సమస్య కావడంతో పోలీస్శాఖకు అగ్ని పరీక్షగా మారింది. రోజుకో చోట సమస్య.. యూరియా పంపిణీలో సమస్యను ఒకచోట చక్కదిద్దితే మరోచోట ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. ఇలా జిల్లాలో యూరియా కోసం వచ్చిన రైతులు కింద పడిపోవడం, తలకు గాయాలు కావడం.. మరో చోట ప్రమాదానికి గురై మృతి చెందడం, ఇంకోచోట యూరియా లారీపై రైతులు దాడి చేసి యూరియా బస్తాలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం.. క్యూలో రైతులు గొడవలు పెట్టుకోవడం.. మహిళల సిగపట్లు.. మొదలైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అదుపు చేయడం కోసం పోలీసు ల పహారా మధ్య టోకెన్లు, యూరియా బస్తాల పంపిణీ చేయాల్సి వస్తోంది. పోలీసుల జాగారం.. ఒక వైపు యూరియా ఎప్పుడు వస్తుందో.. టోకెన్లు ఎప్పుడు ఇస్తారో అనే ఆలోచనతో రైతులు పీఏసీఎస్ సెంటర్లు, ఆగ్రోస్, రైతు వేదికల వద్ద రాత్రంతా పడుకొని జాగారం చేస్తున్నారు. వీరితోపాటు పోలీసులు కూడా అక్కడే డ్యూటీలు చేస్తున్నారు. టోకెన్లు, యూరియా పంపిణీ వద్ద బందోబస్తూ కోసం.. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో పాటు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు తేడా లేకుండా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద డ్యూటీలు చేస్తున్నారు. యూరియా అనేది అతిపెద్ద సమస్యగా పరిగణించి.. రోజు ఉదయం పోలీసులు కాన్ఫరెన్స్లో చర్చించుకొని పరిస్థితిని అంచనా వేసి డ్యూటీలు వేస్తున్నారు. అయితే పదిహేను రోజుల నుంచి యూరియా పంపిణీ పనిలోనే పోలీసులు ఉండడంతో ఇతర కేసుల కోసం స్టేషన్లో నామ మాత్రం సిబ్బందికి డ్యూటీలు వేస్తున్నారు. రంగంలోకి నిఘా వర్గాలు.. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేస్తున్నామని వ్యవసాయ, సహకార శాఖ ల అధికారులు చెబుతున్నా.. సమస్య సద్దుమణగపోవడంతో అసలేం జరుగుతుందనే విషయంపై జిల్లా పోలీస్శాఖ నిఘా వర్గాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.. సమస్య తీవ్రంగా ఉన్న మరిపెడ ఏడీఏ పరిధితోపాటు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఆగస్టు 28 వరకు పీఏసీఎస్లు, ఆగ్రోస్, ఇతర కేంద్రాల్లో ఇష్టారాజ్యంగా బస్తాలు ఇచ్చారు. ఇందులో రైతులే కాకుండా దళారులకు కూడా బస్తాలు ఇచ్చారు. దీంతో నిజమైన రైతులకు యూరియా అందలేదని గుర్తించినట్లు తెలిసింది. దీనిని అదుపు చేసేందుకు రైతు బంధు జాబితాను ముందు పెట్టుకొని పట్టాదారుపాస్ పుస్తకాలు, ఆధార్ కార్డును పరిశీలించి రైతు వేదికల్లో టోకెన్లు ఇచ్చి.. రైతుల జాబితాను డిస్ప్లే చేసి యూరియా పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. డబ్బులు తీసుకోవడం మినహా.. టోకెన్లు ఇవ్వడం, బస్తాల పంపిణీ, రైతుల సమన్వయం చేసే పని అంతా పోలీసులే చేయడం మొదలు పెట్టారు. దీంతో గతంతో పోలిస్తే సమస్య కాస్త సద్దుమణిగిందని అధికారులు చెబుతున్నారు. -
‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా రాంచంద్రునాయక్
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ఈ నెల 17న అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాంచంద్రునాయక్ హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి విప్ మాట్లాడనున్నారు. వచ్చే నెల 4న ఐఆర్సీఎస్ సర్వసభ్య సమావేశం కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాద్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సర్వ సభ్య సమావేశం వచ్చే నెల 4న నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఐఆర్సీఎస్ కార్యవర్గం, ఎజెండాలోని పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. విద్యుత్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి నెహ్రూసెంటర్: విద్యుత్ కాంట్రాక్టర్లకు పనులు ముగిసిన వెంటనే బిల్లులు చెల్లించాలని విద్యుత్ కాంట్రాక్టర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బందు సైదులు అన్నారు. విద్యుత్ కాంట్రాక్టర్లు సోమవారం విద్యుత్శాఖ జిల్లా ఎస్ఈ విజయేందర్రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని, రేట్ల పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా రేట్ల పెంపు జరగలేదని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి సమ్మెలో ఉంటామని పనులను చేపట్టబోమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు కుమార్, విశ్వేశ్వర్రావు, సోమిరెడ్డి, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదు కేసముద్రం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజల్లో తిరుగుబాటు తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతి నిలిపివేయాలనే పేరుతో, భారతదేశం ఎగుమతులపై 50శాతం టారిఫ్లు పెంచాడన్నారు. యురోపియన్ దేశాలపై భారత ఎగుమతులపై సుంకాలు వందశాతం పెంచాలని ఒత్తిడి తెస్తున్నాడన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల రాజు, మార్తనేని పాపారావు, మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న, నీరుటి జలేందర్, తాడబోయిన శ్రీశైలం, జల్లె జయరాజ్, నర్సయ్య, సావిత్ర, జాటోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు మహబూబాబాద్ అర్బన్: డాక్టర్ బీఆర్ అబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల గడువు ఈ నెల 26వరకు పెంచినట్లు ప్రభుత్వ డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సోమవారం ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల వాల్ పోస్టర్ను అధ్యాపక బృందం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఇంటర్, ఐటీఐ, పాలిసెట్, ఓపెన్ ఇంటర్ పాసైన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. డిగ్రీలో బీఎస్సీ సైన్స్, మ్యాథ్స్, బీకాం, బీఏ గ్రూపులు ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 500తో అడ్మిషన్ పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు 7382929705 నంబర్లో సంప్రదించాలన్నారు. -
డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్ళి కుమ్మరికుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో డైలీ వేజ్ వర్కర్లు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈసందర్భంగా నాగన్న మాట్లాడుతూ.. గతంలో గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లకు కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించారన్నారు. 2021లో ఆర్థికశాఖ విడుదల చేసిన జీఓ నంబర్ 64 వల్ల వేతనాలు తగ్గాయన్నారు. వెంటనే ఆ జీఓను రద్దు చేసి, పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలన్నారు. 212జీఓను సవరణ చేసి 2014 నాటికి ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలన్నారు. నాయకులు కుర్ర మహేశ్, జ్యోతిబసు, మధు, వెంకన్న, మహేశ్, లింగ్యా, రవీందర్ పాల్గొన్నారు. -
నీలినీడలు..
నగదు అందించాలి.. నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి సొసైటీలకు డబ్బులు అందించాలి. టెండర్ల ద్వారా ఉచితంగా ఇస్తున్న చేప పిల్లలు సరైన సైజు ఉండడం లేదు. తక్కువగా పిల్లలు వస్తున్నాయి. తద్వారా మత్స్యకారులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి నగదు చేయాలి. – కొత్తూరు రమేశ్, ముదిరాజ్ సంఘం నాయకుడు త్వరలో పంపిణీ చేస్తాం జిల్లా వ్యాప్తంగా ఉచిత చేప పిల్లలను త్వరలో పంపిణీ చేస్తాం. ఈనెలలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మత్స్య సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. –శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి తొర్రూరు రూరల్: మత్స్యకారులకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది. ఏటా టెండర్లు నిర్వహించి చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతున్నారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు టెండర్లు నిర్వహించకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఉంటుందా.. ఉండదా అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కాగా చేప పిల్లలకు బదులు సొసైటీలకు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ప్రణాళిక ఇలా.. జిల్లాలోని సుమారు 1,000 చెరువులు, 220 కుంటల్లో 4.50కోట్ల చేప పిల్లలను ఈ ఏడాది వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం, నిధులు మంజూరు చేయకపోవడం చేప పిల్లల పంపిణీ టెండర్ ప్రక్రియ చేపట్టలేదు. కాగా అదును దాటితే చేప పిల్లల ఉత్పత్తి సరిగ్గా ఉండదని మత్స్యకారులు అంటున్నారు. నగదు బదిలీ చేయాలి.. టెండర్ ద్వారా అందించే చేప పిల్లలు నాసికరంగా ఉండడంతో ఎదగడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు చేపపిల్లల్లో కోత విధిస్తున్నారని, చిన్న సైజు పిల్లలను ఇస్తూ చేతులు దులుపుకుంటున్నార ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తమ ఉపాధికి గండి పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి నేరుగా మత్స్య సొసైటీలకు డబ్బులు ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. చేప పిల్లల పంపిణీపై సందిగ్ధం ఇంకా పూర్తికాని టెండర్లు అదును దాటితే పిల్లలు పెరగవని ఆందోళన సొసైటీలకు నగదు అందించాలని మత్స్యకారుల డిమాండ్ -
పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు
మహబూబాబాద్ రూరల్ : పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మున్సిపల్ అధికారులతో మహబూబా బాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించే బతుకమ్మ పండుగ ఏర్పాట్ల గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకుని, ప్రతీ వీధిలోనూ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని వెజ్, నాన్ వెజ్ కూరగాయల మార్కెట్ కోసం రూ.90 లక్షల నిధులు మంజూరు చేయించినా ఇప్పటికీ పనులు అసంపూర్తిగా ఉండడంపై మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని, అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం లోపిస్తుందని, అధికారులు ఎవరైనా పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, మున్సిపల్ డీఈ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు. -
షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి
● నామాలపాడు ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ బయ్యారం: షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో సిలబస్ పూర్తి చేయాలని కలెక్టర్ అధ్వైత్కుమార్సింగ్ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిచెన్, డైనింగ్హాల్, మ్యూజిక్, తరగతి గదులను తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. బోధనాంశాలతో పాటు సబ్జెక్టుల్లో విద్యార్థుల శక్తిసామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతుల్లో పాఠాలు బోధించాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించటంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి నెహ్రూసెంటర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన సమయంలో వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకో వాలన్నారు. ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఫీవర్ వార్డు, పిల్లల వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆర్ఎంఓ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేయూలో ఉద్రిక్తత
● ఇద్దరి విద్యార్థులపై దాడి చేసిన వారిపై కేసు కేయూ క్యాంపస్: కేయూలో ఇద్దరు విద్యార్థులపై దాడి ఘటనతో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎంబీఏ ఫస్టియర్ విద్యార్థులు గజానంద్, పవన్ శనివారం రాత్రి 8: 20 గంటలకు బైక్పై కామన్ మెస్కు వెళ్తుండగా గెస్ట్హౌస్ ప్రాంతంలో పలువురు అడ్డుకుని దాడి చేశారు. దీంతో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. దాడిచేసి కొట్టినవారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో తరలించే యత్నం చేశారు. అక్కడికి చేరుకున్న విద్యార్థులు వాహనాన్ని అడ్డుకొని రాత్రి 11:30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, కేయూ సీఐ రవికుమార్, ఎస్సై రవీందర్ తదితరులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని సర్దిచెప్పారు. చివరికి పోలీసులు ఇద్దరిని మాత్రం అదుపులోనికి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత వదిలివేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థులు గజానంద్, పవన్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన గట్టు ప్రశాంత్, అఖిల్తోపాటు మరికొందరిపై కేసును నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. నాన్బోర్డర్లు రాకుండా చర్య తీసుకోవాలి హాస్టళ్లలోకి నాన్బోర్డర్లు రాకుండా చూడాలని ఆదివారం సాయంత్రం 6:45 గంటలకు విద్యార్థులు కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళన చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాన్బోర్డర్లపై కేయూ అధికారులు చర్యలు తీసుకుంటే సహకరిస్తామని పేర్కొన్నారు. దీంతో రాత్రి 11 గంటలకు ఆందోళన విరమించారు. -
పోగొట్టుకున్న నగదు బ్యాగు అందజేత
ఖిలా వరంగల్: పోగొట్టుకున్న నగదు బ్యాగు బాధితుడికి అందజేశారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన మహమ్మద్ అఫ్సర్ సెకండ్ హ్యాండ్ బొలెరో వాహనం కొనుగోలు చేసేందుకు శనివారం హైదరాబాద్ నుంచి నేరుగా మడికొండకు చేరుకున్నాడు. కన్సల్టెన్సీలో సెకండ్ సేల్స్ వాహనాలు నచ్చకపోవడంతో మడికొండ నుంచి నేరుగా ఆటో ఎక్కి వరంగల్ ఆర్టీఏ జంక్షన్లో దిగాడు. వాహనం కొనుగోలు కోసం వెంట తెచ్చిన రూ.3 లక్షల నగదు గల బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. కన్సల్టెన్సీకి వెళ్లి చూసుకుంటే ఆటోలో రూ.3 లక్షల బ్యాగు మర్చిపోయానని గ్రహించి వెంటనే శనివారం సాయంత్రం మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ చాలెంజ్గా తీసుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాగు మరిచిపోయిన ఆటోను కనిపెట్టి కాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్ యాసిన్ను అభినందించి, రూ.3లక్షల బ్యాగును బాధితుడు మహమ్మద్ అఫ్సర్కు ఆదివారం ఇన్స్పెక్టర్ బొల్ల రమేశ్ చేతుల మీదుగా అందజేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బ్యాగును కనిపెట్టి బాధితుడికి అప్పగించేందుకు సహకరించిన ఎస్సై శ్రావణ్, క్రైం పార్టీ కానిస్టేబుల్ జంపాల నాగేశ్వరరావును ఏఎస్పీ శుభం, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ అభినందించారు. -
ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: రెండు రోజుల పా టు నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–5 నుంచి 18 బాలబాలికలకు రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు ఆదివారం ముగిశా యి. మొదటి రోజు ఉనికిచర్లలోని ఎస్ఎస్హౌస్ వద్ద నిర్వహించగా, రెండో రోజు రాంపూర్లోని ఢిల్లీ పబ్లి క్ స్కూల్ ఆవరణలోని స్కేటింగ్ రింక్లో నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు స్కేటింగ్ అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిద్దార్థ, ఓం ప్రకాశ్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీ డాకారులు త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తామనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. విజేతలకు డీపీఎస్ ప్రిన్సిపాల్ ఇన్నారెడ్డి బహుమతులు అందజేశారు. -
పెంపకమే ప్రాధాన్యం..
కాజీపేట/చిల్పూరు : పాడి అభివృద్ధికి పెయ్యదూడల సంరక్షణనే కీలకం.. దూడల పెంపకంపై పాడి రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని పశు వైద్యాధికారులు తెలిపారు. దూడల పెంపకంపై శ్రద్ధ వహిస్తే అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. పెయ్యదూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మడికొండ పశువైద్యాధికారి కరుణాకర్ రెడ్డి, మల్కాపూర్ పశువైద్యాధికారి మూడిక అనేష్ సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి.. పెయ్యదూడలు పుట్టినప్పటి నుంచి ఎదకు వచ్చే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దూడలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టిన దూడకు వెంటనే జున్ను పాలు తాగించాలి. దీంతో దూడలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్లో వాటికి వ్యాధులు సోకకుండా, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అవగాహన లేక కొంతమంది రైతులు పాడి పశువుల నుంచి మొత్తం పాలను పితుకుతారు. దీంతో దూడలకు పాలు సరిపోక నీరసించి, వ్యాధి నిరోధక శక్తి కోల్పోతుంది. అనంతరం వ్యాధుల బారిన పడి మృత్యువాత పడే అవకాశం ఉంది. అందుకే రైతులు దూడలకు సరిపడా పాలు అందేలా జాగ్రత్త వహించాలి. పాడి పరిశ్రమ వైపు మొగ్గు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తదితర పనుల నిర్వహణకు తగినంత సాగునీరు లేకపోవడంతో రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రారంభంలో ఒకటి, రెండు ఆవులను కొనుగోలు చేసి పాడిని ప్రారంభిస్తున్నారు. వ్యవసాయ పనులతో పాటు ఉదయం, సాయంత్రం కొద్దిపాటి సమయం పాడి పశువుల కోసం సమయం కేటాయిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఇప్పటికే ఆవులను కొనుగోలు చేసి, లాభాలు పొందుతున్న రైతులను గమనిస్తున్న ఇతరులు పాడి ఆవులను కొనుగోలు చేసి పాడి పరిశ్రమపై ఆధారపడేందుకు మొగ్గు చూపుతున్నారు. దూడలను కాపాడుకుంటూ అదనపు ఆదాయం పొందుతున్నారు.పాడి రైతులు పుట్టిన దూడల పెంపకంపై జా గ్రత్త వహించకుండా పాలిచ్చే ఆవులపై మా త్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. లేగదూడలు పుట్టి న వెంటనే వాటికి ముర్రుపాలు తాగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బొడ్డు కోసే సమయంలోనూ జాగ్రత్త అవసరం. లేగదూడల వ యస్సును బట్టి అవి బలిష్టంగా పెరిగేందుకు సరిపడా పాలు మిగల్చడం ఎంతో ముఖ్యం. దూడలు ఆరోగ్యంగా పెరిగితేనే భవిష్యత్లో అధిక మొత్తంలో పాలు ఇస్తాయి. పెంపకంలో ఎటువంటి అనుమానం తలెత్తిన వెంటనే స మీపంలోని పశువైద్యాధికారిని సంప్రదించా లి. వెంటనే అనుమానాన్ని నివృత్తి చేసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలి. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. పాడిపశువుల విషయంలో పరిశుభ్రత ము ఖ్యమైందని పెంపకందారులు గుర్తించాలి. దూడల సంరక్షణతోనే పాడి వృద్ధి మడికొండ, మల్కాపూర్ పశువైద్యాధికారులు కరుణాకర్ రెడ్డి, అనేష్ దూడలకు సోకే వ్యాధులు..పెయ్యదూడల సంరక్షణలో వాటికి పలు వ్యాధులు సోకే అవకాశం ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ఇతరత్రా వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దూడలకు అతిసార, తెల్ల పారుడు, న్యూమోనియా, రక్తవిరోచనాలు, కీళ్ల నొప్పులు, బొడ్డువాపు వ్యాధులతో పాటు ఇతరత్రా వ్యాధులు, పరాన్న జీవులతో వ్యాప్తి చెందుతాయి. దూడలు ఎటువంటి రోగాల బారిన పడకుండా పెరిగితే రైతుకు ఆదాయమే. వీటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. -
ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
జఫర్గఢ్ : జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్షిప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో మెదక్ జట్టు మొదటి స్థానం, ఖమ్మం ద్వితీయ, వరంగల్ తృతీయ, ఆదిలాబాద్ జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ, నల్లగొండ ద్వితీయ, కరీంనగర్ తృతీయ, నిజామాబాద్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు జయాకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి రమణ హాజరై మాట్లాడారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులకు గుర్తింపు ఉందన్నారు. మారుమూల ప్రాంతమైన కూనూర్లో రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు నారాయణరెడ్డి, వీరభద్రరావు, రవీందర్ కుమార్, వీరయ్య, కమల్కుమార్, తిరుపతి, శ్రీనివాస్రెడ్డి, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో ఆదిలాబాద్, మెదక్ జట్లు -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటాం
● టీఎస్ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాం మనోహర్ హన్మకొండ: విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాం మనోహర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ మేడి రమేశ్ అన్నారు. శనివారం రాత్రి హనుమకొండ విద్యుత్ నగర్లోని డీఐపీఈఏ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల నుంచి అసోసియేషన్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమ సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ.ఆనందం, వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కుమారస్వామి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో సంఘం వ్యవస్థాపకుడు కలకుంట్ల మాణిక్యం, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్.నాంపల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.చంద్రయ్య పాల్గొన్నారు. -
పీఆర్సీ అమలు చేయాలి
టీఆర్టీఎఫ్ రాష్ట్ర చీఫ్ పాట్రన్ సంజీవరెడ్డి విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర చీఫ్పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో టీఆర్టీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ స్టేట్ జాయింట్ కౌన్సిల్లో టీఆర్టీఎఫ్నకు తిరిగి ప్రాతినిథ్యం కల్పించినందుకు సీఎం రేవంత్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కోకన్వీనర్ దాక్షపు విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్టీఎఫ్ బాధ్యులు పెండెం మధుసూదన్, రాజునాయక్ మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రెండు జిల్లాల నూతన కార్యవర్గాలను ఎన్నకున్నారు. హనుమకొండ జిల్లా కార్యవర్గం.. టీఆర్టీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బాసిరి రాజిబాపురావు, ప్రధాన కార్యదర్శిగా గు గులోత్ శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షులుగా గుండు సదానందం, బంగారు స్వామి ఎన్నికయ్యారు. వరంగల్ జిల్లా.. టీఆర్టీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వడ్డె కిషన్, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రాజు, ఉపాధ్యక్షులుగా భక్తిని రాజేశ్, శ్రీపతి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శులుగా ల్యాద లింగమూర్తి, కలకోట ప్రభాకర్, బుర్ర మొగిలి, శివశంకర్ ఎన్నికయ్యారు. సమావేశంలో బాధ్యులు మాడిశెట్టి శ్రీనివాస్, సర్వర్నాయక్, సారంగం, మురళి పాల్గొన్నారు. -
అమ్మానాన్న కోసం అన్వేషణ
ఖిలా వరంగల్: చిన్నతనంలో ఓ అనాథాశ్రమంలో పెరిగిన కుమార్తె సంధ్యారాణి తల్లిదండ్రుల కోసం అన్వేషిస్తోంది. కన్నవారిని కలవాలని స్వీడన్ దేశం నుంచి ఆమె ఆదివారం వరంగల్కు వచ్చింది. తల్లిదండ్రుల మూలాలు ఇక్కడే ఉన్నాయని వరంగల్ శివనగర్లోని పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్తోపాటు పద్మశాలి సంఘాల ప్రతినిధులను కలిసింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘మా తల్లిదండ్రులు రాజ్కుమార్, అనసూయ. కొందరు నా తల్లి చనిపోయిందని అంటున్నారు. కానీ, ఆమె చనిపోలేదు. నా వయసు రెండేళ్లు ఉన్నప్పుడు బతుకుదెరువు కోసం నాన్న నన్ను తీసుకుని హైదరాబాద్ ఖైరతాబాద్లోని ప్రేమ్నగర్ వెళ్లాడు. అక్కడ నిజాం కాలేజీ తోటమాలి రామయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అక్కడే ఓ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాడు. ఈ విషయం తెలిసి రామయ్య తన మరదలు విజయను నాన్నకు ఇచ్చి వివాహం చేశాడు. మూడు నెలలు ఆమెతో కాపురం చేసిన ఆయన ఓ రాత్రి నన్ను విజయ దగ్గరే వదిలేసి పత్తాలేకుండా వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం రామయ్య గాలించినా దొరకలేదు. దీంతో విజయ.. మూడేళ్ల వయసున్న నన్ను విజయనగర్ కాలనీలోని ‘సేవా సమాజం.. బాలికా నిలయం’ అనే అనాథాశ్రమంలో వదిలేసింది.సంతానం లేని స్వీడన్కు చెందిన లిండ్, గ్రేన్ నన్ను ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. చిన్నతనం నుంచి అక్కడే పెరిగి పెద్దయ్యా. ఊహ తెలిసినప్పటి నుంచి స్వీడన్ నా దేశం కాదు.. వాళ్లు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని గ్రహించా. పైచదువుల కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో నా అసలు పేరెంట్స్ గురించి 2009 నుంచి అన్వేషణ ప్రారంభించా. ఇందులో భాగంగా ఆదివారం వరంగల్ శివనగర్కు చేరుకున్నా. పద్మశాలి సంఘం ప్రతినిధి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ను కలిశా. తన తండ్రి రాజ్కుమార్, తల్లిపేరు అనసూయ. ఏళ్లు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులను కలుసుకోవాలని ఇండియాకు వచ్చా. మూలాలు వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చా. నా తల్లిదండ్రులు తెలిస్తే 9822 206485 నంబర్కు కాల్చేయండి. తల్లిదండ్రులను ఎలాగైనా కలుస్తాననే నమ్మకం నాలో దృఢంగా ఉంది’ అని సంధ్యారాణి కన్నీటి పర్యంతమైంది. వేయి కళ్లతో కుమార్తె ఎదురుచూపులు తల్లిదండ్రుల కోసం స్వీడన్ నుంచి వరంగల్కు పద్మశాలి సంఘం ప్రతినిధులను కలిసిన సంధ్యారాణికన్నవారి కోసం సముద్రాలు దాటి వచ్చింది. వేల కిలోమీటర్లు ప్రయాణించింది. భాష రాకపోయినా.. తెలిసిన వారెవరూ లేకపోయినా.. అమ్మానాన్న జాడ కోసం 16 ఏళ్లుగా అన్వేషిస్తోంది. వారి ఫొటోలు లేకపోయినా, ఆనవాళ్లు తెలియకపోయినా.. వారిని కలుస్తాననే దృఢ నిశ్చయంతో ఉంది. కన్నవారిని కలిసేదాకా నిద్రపోనని చెబుతున్న స్వీడన్కు చెందిన సంధ్యారాణి ఆదివారం వరంగల్ నగరంలో తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నించింది. -
తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
హన్మకొండ: తెలంగాణ పవర్ డిప్లొ మా ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం హనుమకొండ వి ద్యుత్ నగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి విద్యుత్ డిప్లొమా ఇంజనీర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నార్ల సుబ్రహ్మణ్యేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.మల్లికార్జున్, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎం.అనిల్ కుమా ర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్, కార్యాలయ కార్యదర్శిగా భవాని, సలహాదారులుగా మధుసూదన్, మనోహర్, కార్యవర్గ సభ్యులుగా త రుణ్, వరుణ్, జ్యోతిర్మయి, వి.రాములు, లక్ష్మణ్ నాయక్, వాలు నాయక్, జి.సత్యనారాయణ, టి.యగంధర్, ఖలీం, టి.శ్రీనివాస్, క్రాంతి కుమార్ ఎన్నికయ్యారు. -
జాతరకు ప్రత్యామ్నాయ దారులు..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరకు ప్రత్యామ్నాయ దారుల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈసారి మహాజాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రోడ్ల ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ శబరీశ్తో కలిసి పరిశీలించారు. గోవిందరావుపేట మండలం మొట్లగూడెం నుంచి ముత్తాపురం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు, కొండపర్తి మీదుగా గోనెపల్లి వరకు, గోనెపల్లి నుంచి మేడారంలోని శివరాంసాగర్ సమీపంలోని వీఐపీ వరకు, వీఐపీ పార్కింగ్ నుంచి చిలకలగుట్ట వరకు రోడ్ల ఏర్పాటును పరిశీలించారు. ఈసారి జాతరకు నూతన రోడ్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ తలెత్తకుండా ఉంటుందని భావించారు. కాగా, కొండపర్తి నుంచి ఒకదారి, ముత్తాపురం నుంచి మరో దారి, ఈరెండు దారులు కూడా గోనెపల్లిలో కలిసి జంక్షన్ ఏర్పడనుంది. అక్కడ నుంచి ఈ దారులు ప్రత్యామ్నాయం కానున్నాయి. కాగా, మంత్రి జా తీయ రహదారి నుంచి కొండపర్తి మీదుగా అటవీ మార్గ గుండా గోనెపల్లి వరకు బైక్పై సుమారు 3 కిలోమీటర్లు అటవీ మార్గంలో పర్యటించి రోడ్డు ఏర్పాటును పరిశీలించారు. డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి వినతి మండలంలోని నార్లాపూర్ చెక్ పోస్టు సమీపంలోని కల్వర్టుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రి సీతక్కకు నార్లాపూర్ రైతులు ఆదివారం వినతి పత్రం అందజేశారు. కల్వర్టు కింద పైపులు చిన్నగా ఉండడంతో జంపన్నవాగు వరద తాకిడికి కల్వర్టుకు ఇరువైపులా ఉన్న వందలాది ఎకరాల వరి పంట నీటమునిపోతుందని విన్నవించారు. స్పందించిన మంత్రి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మేడారం జాతర చైర్మన్ అర్రెం లచ్చుపటేల్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అటవీ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాట్ల పరిశీలన బైక్పై మూడు కిలోమీటర్ల ప్రయాణం.. -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్ను రోల్మెడల్గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
ఏజెన్సీలో భారీ వర్షం
బయ్యారం: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అల్లిగూడెం, కంబాలపల్లి, రామచంద్రాపురం, లక్ష్మీపురం, మిర్యాలపెంట, ఇసుకమేధి పంచాయతీల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. అలాగే ఇల్లెందు ఏజెన్సీలో కురిసిన వర్షానికి మండలంలోని మసివాగు, రాళ్లవాగుల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో మండలం నుంచి ఇల్లెందు వైపు వెళ్లే రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దచెరువుకు భారీ వరద.. మండలంలో బయ్యారం పెద్దచెరువుకు ఇల్లెందు ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో వరద ప్రవాహం పెరిగింది. మసివాగు ప్రవాహం భారీగా పెరగడంతో 16.2 అడుగుల నీటిసామర్థ్యం ఉన్న చెరువులోకి 19.2 అడుగుల మేర నీరు చేరడంతో మూడు అడుగుల మేర అలుగు పారుతోంది. తెగిపోయిన రహదారి.. మండలంలోని భీమ్లాతండా–కొత్తూరు గ్రామాల నడుమ ఉన్న ప్రధాన రహదారి వర్షం కారణంగా తెగిపోయింది. దీంతో అల్లిగూడెం–కంబాలపల్లి ప ంచాయతీల మధ్య రాకపోకలు నిలిచిపోగా బ య్యారం నుంచి రామగుండాల మీదుగా ఇల్లెందు వైపు వెళ్లే బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలా యి. దెబ్బతిన్న రహదారి, పంటలను తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి పరిశీలించారు. బయ్యారం పెద్దచెరువుకు భారీగా వరద -
నేటి ప్రజావాణి రద్దు
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలో నేడు(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమై ఉండడం వల్ల ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ప్రజావాణి దరఖాస్తులతో కలెక్టర్ కార్యాలయానికి రావొద్దని సూచించారు. కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. రెండు రోజులు సెలవులు రావడంతో వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో నిలబడి స్వామి, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేటి నుంచి ‘విలువలు’ విద్యమహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విలువల విద్యపై ప్రత్యేక కార్యక్రమాలను టీ శాట్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం, ఫోన్ ఇన్ లైవ్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ దక్షిణామూర్తి ఆది వారం తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి యో గితారాణా ప్రైమరీ విద్యార్థులతో ఉదయం 11నుంచి 12గంటల వరకు, హైస్కూల్ విద్యార్థులతో మధ్యాహ్నం 2:30నుంచి 3:30 గంటల వరకు లైవ్లో సంభాషిస్తారన్నారు. సందేహాల కోసం 040–23540326, 23540726, టోల్ ఫ్రీ నంబర్ 18004254039లో ఉపాధ్యాయులు సంప్రదించాలన్నారు. అనంతరం పుస్తకాల కార్యాలయాని డీఈఓ సందర్శించారు. కార్యక్రమంలో ఏఎంఓ చంద్రశేఖర్ ఆజాద్, సైన్స్ అధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ పరిశీలన కురవి: సీరోలు మండలం కాంపల్లి సొసైటీలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని డీఏఓ విజయనిర్మల ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని, అందరికీ యూరియా అందుతుందని తెలిపారు. యూరియా పుష్కలంగా వస్తుందన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ఉండేలా పంపిణీ చేస్తామన్నారు. ఆమె వెంట సీరోలు ఏఓ చాయారాజ్ ఉన్నారు. మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెవెన్యూ సర్వేయర్ల పరీక్షల ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా భూమి, కొలతల అదనపు డైరెక్టర్ నర్సింహమూర్తి ఆదివారం తెలిపారు. ఉయదం 10 గంటలకు థియరీ పరీక్షకు 65మందికి 63 అభ్యర్థులు హాజరయ్యారని, మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 71 మందికి 68 మంది అభ్యర్థులు హాజరయ్యరని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. రైతులందరికీ యూరియాగార్ల: రైతులందరికీ యూరియా అందిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) హరిప్రసాద్ సూచించారు. ఆదివారం ముల్కనూరు జరిగిన మండల అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని నాలుగు రైతు వేదికల్లో యూరియా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల సమన్వయంతో యూరియా పంపిణీ సజావుగా కొనసాగుతుందన్నారు. మండల అధికారులు ప్రణాళిక ప్రకారం రైతులందరికీ యూరి యా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, ఏఓ కావటి రామారావు, ఎస్సై రియాజ్పాషా, ఏఈఓ కిరణ్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కేసముద్రం: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధి అమీనాపురం గ్రామంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టోర్ రూం, కిచెన్ షెడ్, చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు, వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతీ సబ్జెక్ట్పై అవగాహన, డిజిటల్ తరగతులు, క్రీడా, సాంస్కృతి విభాగాల్లో శిక్షణ అందించాలన్నారు. ఆ తర్వాత ధన్నసరి పీఏసీఎస్ సెంటర్ను సందర్శించారు. యూరియా పంపిణీ ఎలా కొన సాగుతుందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా డీఎస్పీ తిరుపతిరావు ధన్నసరి పీఏసీఎస్ సెంటర్ను సందర్శించి, యూరియా పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, తహసీల్దార్ వివేక్, ఎస్సై మురళీధర్రాజు, ఏఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా పంపిణీ చేయాలి మహబూబాబాద్ రూరల్ : పారదర్శకంగా ప్రతీ రైతుకు యూరియా అందేవిధంగా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రా మంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు.రైతుల కోసం ఇప్పటికే అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిత్యం యూరియా పంపిణీ కోసం అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సహకార సంఘాలు, అన్ని విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారని తెలిపారు. డీఏఓ విజయనిర్మల, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, తహసీల్దార్ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
యూరియా పంపిణీలో ప్రభుత్వాలు విఫలం
నెహ్రూసెంటర్: యూరియా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే రైతులు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గూడూరులో యూరియా టొకెన్ల కోసం వెళ్తూ ఇద్దరు రైతులు మృతి చెందగా.. వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్ మార్చురీ ఎదుట ఆదివారం బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ యూరియా అందించడంలో జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడి వారిని ఓదార్చారు. కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ నాయకులు బోడ లక్ష్మణ్నాయక్, ఆంగోత్ చందూలాల్, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గుగులోత్ రవినాయక్, బానోత్ రామునాయక్ పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ జీజీహెచ్ మార్చురీ ఎదుట ధర్నా -
మేడారంలో మొక్కుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ కు మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. వనదేవతల దర్శనం అనంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్నవాగు ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. డీజే సౌండ్లతో డ్యాన్స్లు చేసి సందడి చేశారు. హనుమకొండ డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేడారం దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్, రమాదేవి భక్తులకు సేవలందించారు. -
రైతులు ఆందోళన చెందవద్దు
డోర్నకల్: రైతులు యూరియా బస్తాల కోసం ఆందోళన చెందవద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. సీరోలు మండలం మన్నెగూడెం పీఏసీ ఎస్లో ఆదివారం ఎరువుల పంపిణీని పరిశీలించారు. డోర్నకల్ పోలీస్ స్టేషన్ను పరిశీలించి పలు కేసుల వివరాల గురించి తెలుసుకున్న ఎస్పీ మన్నెగూడెంలో ఎరువుల పంపిణీని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో డోర్నకల్ సీఐ రాజమౌళి, ఎస్సై వంశీధర్, పీఏసీఎస్ సెక్రటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలో పరిశీలన.. బయ్యారం: మండల కేంద్రంలోని రైతువేదిక, గంధంపల్లిలోని రైతువేదికలో ఆదివారం నిర్వహించిన యూరియా పంపిణీని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. గంధంపల్లిలో ఓ రైతు దిచక్రవాహనంపై తన సిబ్బందితో స్వయంగా యూరియా బస్తాలు వేయించిన ఎస్పీ జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. తహసీల్దార్ నాగరాజు, గార్ల–బయ్యారం సీఐ రవికుమర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎస్సై తిరుపతి తదితరులు ఉన్నారు. జాగ్రత్తగా వెళ్లాలి.. కురవి: ఆదివారం సీరోలు మండలం కాంపల్లి సొసైటీ వద్ద ఓ రైతు రెండు యూరియా బస్తాలను తీసుకున్నాడు. తన బైక్పై బస్తాలను పెట్టేందుకు యత్నిస్తుండగా సిబ్బంది సాయం చేశారు. ఆ రైతు దగ్గరకు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెళ్లి బస్తాలతో బైక్పై జాగ్రత్తగా వెళ్లు.. పదిలంగా ఇంటికి చేరుకో అని జాగ్రత్తలు చెప్పారు. దీంతో ఆ రైతు జాగ్రత్తగా వెళ్తానని ఎస్పీకి చెప్పాడు. పంపిణీ పరిశీలన మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ ప్రక్రియను ఆదివారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడుతూ.. అవసరం ఉన్నంత మేరకు యూరియా సరఫరా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై శివ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. యూరియా కేంద్రం తనిఖీ గార్ల: గార్ల మండలం ముల్కనూరు గ్రామంలోయూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించారు. యూరియా రైతులందరికీ అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ వెంట గార్లబయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై రియాజ్పాషా, ఏఓ కావటి రామారావు, ఏఎస్సైలు వెంకట్రెడ్డి, రవీందర్ ఉన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే
● హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్వరంగల్ లీగల్ : యువ న్యాయవాదులకు శిక్షణ త రగతులు అవసరమేనని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్గౌడ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ భవన్లో తెలంగా ణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా జడ్జి లక్ష్మణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సీనియర్ న్యాయవాది కె.వి. గుప్తా రాసిన ‘తెలంగాణ కోర్టు ఫీ యాక్ట్ పుస్తకం’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్గౌడ్ మాట్లాడారు. యాంటీ కరప్షన్ లాస్, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ అంశాల్లో యువ న్యా యవాదులు మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాద పరిషత్ అ ధ్యక్ష, కార్యదర్శులు ఎల్.ప్రభాకర్ రెడ్డి, శ్యాంశాని సునీల్, చొళ్లేటి రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు అమ్మవారికి హైకోర్టు జడ్జి పూజలు.. హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్ సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు.. జస్టిస్ను ఘనంగా స్వాగతించారు. పూజలనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి పట్టాభి రామారావు, వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తదితరులు పాల్గొన్నారు. -
పాస్ కావాల్సిందే..
మహబూబాబాద్: ప్రభుత్వం భూ సమస్యల పరి ష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చింది. దీని లో భాగంగా పూర్తి స్థాయిలో రెవెన్యూ సర్వేయర్లు లేకపోవడంతో లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ ఇచ్చి న తర్వాత మూడు రకాల పరీక్షలు నిర్వహిస్తుంది. ఆ పరీక్షలలో పాస్అయితేనే లైసెన్స్ జారీ చేయాల ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 139 మందికి కేవలం 30 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన వారి కోసం మరోమారు పరీక్ష నిర్వహించనుంది. జిల్లాలో 31,900 దరఖాస్తులు భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో మొదట పైలెట్ ప్రాజెక్ట్ కింద దంతాలపల్లి మండలాన్ని ఎంపిక చేసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మిగిలిన మండలాల్లో జూన్ 3 నుంచి 16 వరకు రెవెన్యూ సదస్సులు ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అదే నెల 17 నుంచి 20వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తుల స్వీకరణ చేశారు. మొత్తం 31,900 దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేశారు. గ్రామ పరిపాలన అధికారుల కోసం పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలకు అవకాశం కల్పించారు. ఆప్షన్ పెట్టుకున్న వారికి పరీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 151 మందిని ఎంపిక చేసి ఈనెల 5న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్న విషయం విదితమే. సర్వేయర్ల పాత్రకీలకం జిల్లాలో 18 మండలాలుండగా కేవలం 10 మంది మాత్రమే రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం కల్పించింది. మొదటి విడతలో 181 మంది మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వారికి జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్లో 50 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు 181 మందిలో 139 మాత్రమే హాజరై శిక్షణ పూర్తి చేశారు. 30 మంది మాత్రమే ఉత్తీర్ణత మొదటి విడతలో శిక్షణ పొందిన వారికి ఎస్ఎస్ మెంట్ పరీక్షలు, ప్రాక్టీకల్, రాత పరీక్ష ఉంటుంది. చాలా మంది ఎస్ఎస్ మెంట్ పరీక్ష, ప్రాక్టీకల్స్ పాస్ అవుతున్నారని అధికారులు తెలిపారు. రాత పరీక్షలో 139 మందికి కేవలం 30 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. లేదంటే లైసెన్స్ రాదు రెవెన్యూ సర్వేయర్లకు పరీక్షలు మొదటి విడతలో 139 మందిలో 30 మంది మాత్రమే ఉత్తీర్ణత ఫెయిల్అయిన వారి కోసం మరోసారి అవకాశం నేడు రాత పరీక్ష 94 మంది దరఖాస్తులు మొదటి విడతలో ఫెయిల్అయిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మొదటి విడతలో ఫెయిల్ అయిన 94 మంది మళ్లీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి నేడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా రెండో విడతలో 185 మంది దరఖాస్తు చేసుకోగా 137 మంది శిక్షణకు హాజరవుతున్నారు. వారికి శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించనున్నారు.అన్ని ఏర్పాట్లు చేశాం.. నేడు నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష పాస్ అయితేనే లైసెన్స్ను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంది. రెండో విడత శిక్షణ కొనసాగుతోంది. వారికి కూడా పరీక్షలో పాస్ అయితేనే లైసెన్స్ జారీ చేస్తారు. – నర్సింహమూర్తి, భూమి కొలతల జిల్లా అదనపు డైరెక్టర్ -
పగిలిన ‘దేవాదుల’పైపులైన్
● ఎగిసిపడిన నీరు.. నిండిన జయగిరి పాత చెరువు హసన్పర్తి: హసన్పర్తి మండలం జయగిరి పాత చెరువు వద్ద దేవాదుల పైపులైన్ పగిలింది. ఇటీవల దేవాదుల నుంచి నీటిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితం జయగిరి సమీపంలోని పాత చెరువు వద్ద పైపునకు చిన్న రంధ్రం పడింది. అది పెద్దది కావడంతో ఒత్తిడి పెరిగి పగిలింది. దీంతో ఒకేసారి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ నీరంతా సమీప చెరువులోకి చేరడంతో నిండి మత్తడి పోసింది. చెరువుకింద ఉన్న పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం అందుకున్న నీటి పారుదలశాఖ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ మంగీలాల్, సునీత, డీఈఈ కిషన్ ప్రసాద్, తేజేశ్వర్రావు, ఏఈ శ్రీనివాస్లు ఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పులుకుర్తి వద్ద పంపింగ్ను నిలిపివేశారు,. రైలు నుంచి జారిపడి ప్రయాణికుడి దుర్మరణం ఖిలా వరంగల్: ప్రమాదవశాత్తు శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారి పడి ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం చింతలపల్లి– ఎల్గూరు రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం.. వెస్ట్ బెంగాల్లోని తిల్న్ చౌదర్ గ్రామానికి చెందిన లాబాను కరుణాకర్ (41).. అబ్దుల్ సల్మాన్, రంజిత్ మరిడేతో కలిసి శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలులో విజయవాడ నుంచి వరంగల్కు ప్రయాణిస్తున్నాడు. ఈక్రమంలో చింతలపల్లి– ఎల్గూరు రైల్వేస్టేషన్ల మధ్య కరుణాకర్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి అక్కడికక్కడే దుర్మణం చెందాడు. మృతుడి బంధువులకు సమాచారం అందజేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వరంగల్ జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
మళ్లీ మొదటికి వచ్చినట్లేనా?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 2010లో నియమితులైన వివిధ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని ఆమోదిస్తూ ఈ ఏడాది మే 8న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీఓ 22ను సవాల్ చేస్తూ అప్పట్లో ఉద్యోగం రాని వినిత నాయిని హైకోర్టులో ఈనెల 9న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, కాకతీయ యూనివర్సిటీ, కేయూలో 2010లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులైన వారిని ప్రతివాదులుగా చేర్చారు. దీంతో హైకోర్టు ఈనెల 9న వాదనలు వింటూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి, కాకతీయ యూనివర్సిటీకి కౌంటర్దాఖలు చేయాలని, 2010లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీస్లు జారీచేయాలని ఆదేశాలు ఇస్తూ ఈ కేసును అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. మొదటి నుంచీ వివాదమే.. కాకతీయ యూనివర్సిటీలో 2010లో వివిధ విభాగాల్లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉన్న విషయం విధితమే. అప్పట్లో ఉద్యోగాలు రాని పలువురు అభ్యర్థులు ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా చివరికి పూర్తిస్థాయి పాలకమండలి సమావేశంలో ఆమోదించుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. దీంతో 2019 నవంబర్లో కేయూ పూర్తిస్థాయి పాలకమండలి సమావేశంలో చర్చించి అవకతవకలు చోటుచేసుకున్నాయని భావించి ఆమోదించలేదు. దీంతో అప్పటి రిజిస్ట్రార్ తుది నిర్ణయం కోసం ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో జువాలజీ విభాగానికి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను యూనివర్సిటీ అధికారులు కొంత కాలం క్రితమే ఉద్యోగాలనుంచి తొలగించిన విషయం విధితమే.ఆ తర్వాత కూడా ఉద్యోగం రాని వినితనాయిని అప్పటి నుంచి న్యాయం పోరాటం చేస్తూనే ఉన్నారు. మిగతా పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం కూడా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి సుప్రీం కోర్టు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తుది నిర్ణయం తీసుకోవాలని ఈఏడాది ఫిబ్రవరి 24న ఆదేశించిన విషయం విధితమే. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా ఉన్నత విద్యాశాఖ 2010లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై(అప్రూవల్ చేస్తూ) సానుకూల నిర్ణయం తీసుకుని జీఓ 22ను ఈఏడాది మే 8న యూనివర్సిటీ అధికారులకు పంపింది. తదుపరి చర్యలను తీసుకోవాలని కూడా పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగాలనుంచి తొలగించబడిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు జీఓలో మాత్రం అవకాశం కల్పించ లేదు. ఈక్రమంలో జూన్ 17న హైదరాబాద్లో నిర్వహించిన కేయూ పాలకమండలి సమావేశంలో 2010లో నియమితులైన వివిధ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై చర్చించి ఆమోదించింది. దీంతో ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఊపిరి పీల్చుకున్నారు. కేయూపాలకమండలి ఆమోదించడంతో వారంతా సంతోషించారు. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై వినితనాయిని మళ్లీ రిట్ పిటిషన్ కౌంటర్దాఖలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, కేయూకు హైకోర్టు ఆదేశంకేయూపాలకమండలి ఆమోదంతో ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లు పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ కూడా ఇటీవలే ప్రారంభించినట్లు తెలిసింది. పదోన్నతుల కల్పనకు యూనివర్సిటీ అధికారులు కూడా కొద్దిరోజుల్లోనే ఉపక్రమించబోతుండగా మళ్లీ అప్పట్లో ఉద్యోగం రాని వినితనాయిని.. ఉన్నత విద్యాశాఖ ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను ఆమోదిస్తూ సానుకూలంగా జారీచేసిన జీఓను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో వీరి సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లైందని కాకతీయ యూనివర్సిటీలో చర్చ జరుగుతోంది. వీరికి ఇక ఇప్పట్లో పదోన్నతుల కల్పన ఉండబోదని, ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లేనని భావిస్తున్నారు. -
చెట్టు కొమ్మ తొలగిస్తుండగా..
భూపాలపల్లి రూరల్: చెట్టు కొమ్మ తొలగిస్తుండగా ఓ విద్యార్థి విద్యుత్ తీగ తగిలి గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం భూపాలపల్లి మండలం గొల్లబు ద్దారం ఎస్సీ హాస్టల్లో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం పెద్దకుంటపల్లి గ్రామానికి చెందిన పి. రాజేంద్రన్ గొల్లబుద్దారం ఎస్టీ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు దినం కావడంతో హాస్టల్ పరిసరాలను శుభ్రం చేయాలని వార్డెన్ రాంగోపాల్రెడ్డి విద్యార్థులకు సూచించారు. దీంతో కొంత మంది విద్యార్థులు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. రాజేంద్రన్ వసతి గృహం ఆవరణలో అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించేందుకు చెట్టు ఎక్కాడు. కొమ్మలు కొడుతున్న క్రమంలో చెట్టుపై నుంచి వెళ్లిన విద్యుత్ తీగలకు తాకి కిందపడ్డాడు. వెంటనే సహ విద్యార్థులు కేకలు వేయడంతో హుటాహుటిన సదరు విద్యార్థిని భూపలపల్లిలోని వంద పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బీఆర్ఎస్పీ, ఎస్ఎఫ్ఎ విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థి రాజేంద్రన్ను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ తీగ తగిలి విద్యార్థికి గాయాలు గొల్లబుద్దారం ఎస్టీ హాస్టల్లో ఘటన -
ఓటమిని గెలుపుగా మలుచుకోవాలి
కొత్తగూడ: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశపడకుండా గెలుపు కోసం మరోసారి ప్రయత్నించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఈఎంఆర్ఎస్లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి క్రీడలు, చదువులో ప్రతిభచాటాలన్నారు. ప్రస్తుత క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పథకాలు సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. అనంతరం ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించిన కామారెడ్డి జిల్లా గంధారి ఈఎంఆర్ఎస్కు, అలాగే వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీఓ రత్నకుమారి, రాష్ట్ర ఉపాధిహామీ సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అజ య్సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్పీతో మంత్రిప్రత్యేక సమావేశం.. ఈఎంఆర్ఎస్లో క్రీడల ముగింపు కార్యక్రమానికి వచ్చిన మంత్రి సీతక్క.. ఎస్పీ సుధీర్రాంనాఽథ్ కేకన్తో పాఠశాలలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎవరిని లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. జిల్లాలో యూరియా పంపిణీ గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నట్లు సమాచా రం. కొత్తగూడ, గంగారం మండలాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీకి సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముగిసిన రాష్ట్ర స్థాయి క్రీడలు -
నాణ్యమైన భోజనం అందించాలి
కురవి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి మాడిశెట్టి నరసింహస్వామి అన్నారు. శనివారం బలపాలలోని ఎస్సీ బాలు ర వసతిగృహం, కురవిలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో జరిగిన పీటీఎంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రుల సూచనలను తూచా తప్పకుండా పాటించి భవిష్యత్లో అన్ని వసతి గృహాలు సజావుగా నడపడానికి ఎంతో తోడ్పాడునందిస్తామన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. చదువుతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ మరిపెడ రూరల్: చదువుతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి నర్సింహాస్వామి అన్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా వసతి గృహాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ఐదేళ్ల కోర్సు విద్యార్థుల సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు. ఈనెల 12న ఐదేళ్ల లాకోర్సుల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులతో శనివారం పరిపాలనాభవనం వద్ద చర్చలు జరిపారు. అయినప్పటికీ విద్యార్థులు వినకుండా పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. మళ్లీ కొంతసేపటికి రిజిస్ట్రార్ రామచంద్రం విద్యార్థులతో మాట్లాడారు. వీసీ ప్రతాప్రెడ్డి ఈనెల 23న కేయూకు రానున్నారని మీ సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించా రు. వినతిపత్రాన్ని రిజిస్ట్రార్ రామచంద్రంకు అందజేశారు. రిజిస్ట్రార్ వెంట పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్లాల్, లా హాస్టల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చల్లా శ్రీనివాస్ ఉన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. కేయూ పోలీస్టేషన్ పోలీస్ అధికారులు కూడా అక్కడికి విచ్చేశారు. రామప్పలో అమెరికన్ల సందడి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన బ్రాడ్, రాచెల్లు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. హేమాచలక్షేత్రంలో.. మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శనివారం భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించారు. -
జీపీ భవనాల్లోనే మున్సిపల్ కార్యాలయాలు
● ఇబ్బందులు పడుతున్న అధికారులు, సిబ్బంది మహబూబాబాబాద్: మేజర్ గ్రామపంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసింది. ప్రజాప్రతినిధులు అప్గ్రేడ్పై పెట్టిన శ్రద్ధ నూతన భవనాల నిర్మాణాలపై పెట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపోను గదులు లేక అధికారులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు మున్సిపాలిటీలు జీపీ భవనాల్లోనే.. జిల్లాలో మానుకోట మున్సిపాలిటీ, మరిపెడ, డోర్నకల్, తొర్రూర్తో పాటు ఇటీవల కేసముద్రంను కూడా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం అన్ని కార్యాలయాలు గ్రామపంచాయతీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు ఉన్నారు. 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి, తొర్రూరులో 16 వార్డులు 19,100 జనాభా, మరిపెడలో 15 వార్డులు 17,875 మంది జనాభా, డోర్నకల్లో 15 వార్డులు 14,425 మంది జనాభా ఉన్నారు. కేసముద్రంలో 16 వార్డులుగా అధికారులు నిర్ణయించినప్పటికీ అధికారికంగా వార్డుల విభజన పూర్తి కాలేదు. జనాభా 19,438 మంది ఉన్నారు. 2018లోనే శంకుస్థాపన.. పురపాలక అభివృద్ధి నిధుల నుంచి 2018లోనే మానుకోట మున్సిపాలిటీ భవనానికి రూ.5 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. నేటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లులు రాకపోవడంతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్ నిలిపివేశారు. మరిపెడ మున్సిపాలిటీకి టెండరు పూర్తి కాగా నిధులు రద్దవడంతో పనులు ప్రారంభం కాలేదు. డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల కార్యాలయాలు జీపీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వెంటాడుతున్న సిబ్బంది కొరత మానుకోట మున్సిపాలిటీకి అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు పూర్తి స్థాయిలో లేకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. మరిపెడ, తొర్రూరు, డోర్నకల్, కేసముద్రంలో ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. బిల్లులు రాలేదు.. మానుకోట మున్సిపాలిటీ నూతన భవనానికి కేవలం బిల్లులు రాకనే పనులు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు విడుదల కాగానే పనులు పూర్తి అయ్యేలా చూస్తాం. – టి.రాజేశ్వర్, మానుకోట మున్సిపాలిటీ కమిషనర్ -
మహబూబాబాద్
ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సమన్వయ సమావేశాలు నిర్వహించాలి7మహబూబాబాద్: జిల్లాలో పకడ్బందీగా యూరియా పంపిణీ విషయంలో మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి రైతు వేదికలు, ప్రాథమిక సహకార సొసైటీల వద్ద అందుబాటులో ఉండాలని, రైతులకు స్టాక్ వివరాలను తెలియపర్చాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి యారియా పంపిణీని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, డీఏఓ వి జయనిర్మల, డీసీఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. యూరియా పంపిణీ సజావుగా జరగాలి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట
జఫర్గఢ్: గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక నిధులు కేటాయిస్తూ పె ద్దపీట వేస్తోందని ఖోఖో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్ షిప్ బాల్ బ్యాండ్మిటన్ క్రీడా పోటీలను శనివారం పాఠశాల పూర్వ వి ద్యార్థి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు మొండిచేయి చూపిందన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీ ఎం రేవంత్రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడారంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్నా రు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి స్ఫూర్తి చాటాలన్నారు. తల్లిదండ్రులు పి ల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించి వారి ఉజ్వల భవిష్యత్కు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, బాధ్యులు బంగారు స్వామి, బి.వి. రమణ, దర్గయ్య, వెంకట్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీగల కరుణాకర్రా వు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెబోయిన భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. ఖోఖో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి -
జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల కోర్టు ప్రాంగణాల్లో శనివారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన లభించింది. కేసుల పరిష్కారానికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్లు ఏర్పాటు చేశారు. ఇందులో వరంగల్ – 8, నర్సంపేట–2 బెంచ్లు ఏర్పాటు చేసి 5,938 పెండింగ్ కేసులు ఛేదించారు. ఇందులో సివిల్ 26, ఎంవీఓపీ 24 కేసులకు రూ.2,15, 44,176లు, క్రిమినల్ కేసులు 5912, బ్యాంకు పీఎల్సీ కేసులు 76,720 కేసులకు రూ. 2,28,82,709లతో పరిష్కరించారు. అలాగే, హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 8 బెంచ్లు ఏర్పాటు చేసి 56,867 పెండింగ్ కేసులు పరిష్కరించారు. ఇందులో సివిల్ కేసులు 71, ఎంవీఓపీ 62 కేసులకు రూ.7,31,55,963లు, క్రిమినల్ కేసులు 18,412, బ్యాంకు పీఎల్సీ 38,379 కేసులకు రూ.1,15,56,828లతో పరిష్కరించారు. ఈజాతీయ లోక్ అదాలత్లో వినూత్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజ్కుమార్ సుమారు 300 పులిహోర ప్యాకెట్లను కక్షిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కక్షిదారులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు జయశ్రీ, రమాదేవి పాల్గొన్నారు దంపతులను కలిపిన లోక్ అదాలత్.. మహబూబాబాద్ రూరల్ : కుటుంబ తగాదాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న దంపతులను లోక్ అదాలత్ కలిపింది. మహబూబాబాద్ జిల్లా గంగారం పోలీసు స్టేషన్ పరిధికి చెందిన బోడ అనూష, అనిల్ దంపతులు ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో గూడూరు సీఐ సూర్యప్రకాశ్, గంగారం ఎస్సై రవికుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫిర్యాది అనూషతో మాట్లాడి రాజీ కుదుర్చగా శనివారం లోక్ అదాలత్ సందర్భంగా కోర్టు డ్యూటీ అధికారి వెంకటేశ్వర్లు ఆ దంపతులను జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ సమక్షంలో మాట్లాడించారు. దీంతో తాము కలిసి ఉంటామని ఒప్పుకున్నారు. కాగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ వారిని అభినందించారు. యూరియా వచ్చేసింది.. ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్కు శనివారం 2,644.150 సీఐఎల్ కోరమండల్ యూరియా వచ్చింది. దీంతో రైతులకు ఊరట లభించనుంది. వ్యవసాయ అఽధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి.. కంపెనీ ప్రతినిధులతో కలిసి యూరియా స్టాక్ను పరిశీలించారు. కలెక్టర్ సత్యశారద, డీఏఓ అనురాధ.. మార్క్ఫెడ్కు 60 శాతం, ప్రైవేట్ఫర్టిలైజర్ డీలర్లకు 40శాతం కేటాయించారు. వరంగల్ జిల్లాకు 424.15 మెట్రిక్ టన్నులు, హనుమకొండ 430, ములుగు 300, జయశంకర్ భూపాలపల్లి 400, జనగామ 450, మహబూబాబాద్ జిల్లాకు 440 మెట్రిక్ టన్నుల కేటాయింపులు జరిగాయి. శనివారం సాయంత్రం వరకు యూరియాను జిల్లా, మండల కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టామని ఏఓ రవీందర్ రెడ్డి తెలిపారు. -
చైన్స్నాచర్ అరెస్ట్, రిమాండ్
స్టేషన్ఘన్పూర్: మండలంలోని సముద్రాల శివారు నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు కత్తుల రాజమ్మ మెడ నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించిన కుక్కల రాంబాబును పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ జి.వేణు కథనం ప్రకారం.. జఫర్గఢ్ మండలం కూనూరుకు చెందిన కుక్కల రాంబాబు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గతేడాది నుంచి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల్లో పాల్గొంటూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టేషన్ఘన్పూర్లో ఓ వ్యక్తి తన బైక్ డిక్కీలో రూ.70వేలు ఉంచి కిరాణాషాపుకు వెళ్లొచ్చే సరికి ఆ నగదు తస్కరించాడు. ఆ ఘటనలో పోలీసులకు చిక్కి వారం రోజులు జైలుకెళ్లొచ్చాడు. అయినా మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన ఉదయం మహిళా రైతు కత్తుల రాజమ్మ, యాదగిరి దంపతులు యూరియా కోసం స్టేషన్ఘన్పూర్ వచ్చారు. సాయంత్రం బైక్పై యూరియా తీసుకెళ్తుండగా రాంబాబు బైక్పై వారిని అనుసరించాడు. విశ్వనాథపురం వద్ద రాజమ్మ మెడ నుంచి రూ.1.20లక్షల విలువైన మూడుతులాల పావు బంగారు పుస్తెలతాడు గొలుసును లాక్కుని ఉడాయించాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎస్సై మనీషా ఈనెల 12న ఘన్పూర్ శివాజీ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా రాంబాబు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళా రైతు రాజమ్మ మెడ నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించింది తానేనని అంగీకరించాడు. దీంతో పుస్తెలతాడును, బైక్ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, చైన్స్నాచింగ్ జరిగిన వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి బంగారం రికవరీ చేసిన సీఐ జి.వేణు, ఎస్సైలకు,సిబ్బందికి బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు వినయ్కుమార్, మనీషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వారం రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు -
ప్రాణాల మీదకు వస్తున్న యూరియా కొరత
కొత్తగూడ: యూరియా కొరత రైతుల ప్రాణాల మీదకు వస్తోంది. క్యూలో నిల్చున్న రైతులు అనారోగ్యం పాలవుతుంటే.. యూరియా దొరకక కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో మొక్కజొన్న, వరి పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. దీంతో యూరియా వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది. పంటకు అదనుకు యూరియా వేయకపోతే పంట ఎర్రబడి దిగుబడి తక్కువగా వస్తుంది. తర్వాత యూరియా వేసినా ప్రయోజనం ఉండదు. తాజాగా కొత్తగూడ మండల కేంద్రంలోని బూరుగుగుంపుకు చెందిన మల్లెల నర్సయ్య యూరియా దొరకడం లేదని శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘పొగుళ్లపల్లి సొసైటీ వద్దకు పది రోజులు.. కొత్తగూడలో ఐదు రోజుల పాటు యూరియా కోసం తిరిగినా దొరకలేదు. పంట ఎర్రబడి పోతుంది. ఏం చేయాల్నో తెలువక పురుగుల మందు తాగి సద్దామనుకున్న.. ఎవుసం చేసినోడు సావక ఏం చేయాలె’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అలాగే తెల్లవారుజాము నుంచి లైన్లో నిల్చుని అనారోగ్యం పాలైన గాంధీనగర్కు చెందిన రామక్క, ఈశ్వరగూడెంకు చెందిన లక్ష్మినర్సులను ఎస్సై రాజ్కుమార్ తన వా హనంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలా చాలా మంది రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. క్లస్టర్ల వారీగా పంపిణీ చేస్తున్నా.. మండలంలోని పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దూర ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు క్లస్టర్ వారీగా విభజించి పంపిణీ చేస్తున్నారు. అయినా సరిపడా యూరియా లభించకపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి సకాలంలో యూరియా పంపిణీ చేసి రైతులకు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. అదనుకు అందకపోవడంతో రైతుల ఆత్మహత్యాయత్నం -
బంగారమే వృద్ధురాలి ప్రాణం తీసింది..
నెల్లికుదురు: శరీరంపై ఉన్న బంగారమే వృద్ధురాలి హత్యకు కారణమైంది. బంగారం కోసం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వీరగాని రాధమ్మ(80), హుస్సేన్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హుస్సేన్ పదేళ్ల క్రితమే మృతి చెందగా కూతుళ్లు, కుమారుల పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురు కొడుకులు వ్యాపార నిమిత్తం ఇతర గ్రామాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో రాధమ్మ ఒంటరిగా ఉంటూ కూలీ చేసుకుంటూ జీవిస్తోంది. రాధమ్మ శరీరం మీద సుమారు మూడు తులాల బంగారం, కొంత వెండి ఉంది. ఇది గమనించి దుండగులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రాధమ్మపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఎదుట ఉన్న బావిలో పడేశారు. శనివారం ఉదయం రాధమ్మ కనిపించకపోవడం.. ఇంటి ఎదుట రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు చూసి రాధమ్మ కుమారులకు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో బావి నుంచి రాధమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి కుమారుడు మలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. హత్య చేసి బావిలో పడేసిన దుండగులు నెల్లికుదురులో ఘటన వివరాలు వెల్లడించిన ఎస్సై రమేశ్ బాబు -
నాడు శాంతిని నెలకొల్పడమే గాంధీ ధ్యేయం
విద్యారణ్యపురి: దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం సిద్ధించాక నాడు శాంతిని నెలకొల్ప డమే ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. శనివారం హనుమకొండలోని నవీన్ రెసిడెన్సీలో ప్రజాకవికాళోజీ నారాయణరావు రచించిన బాపూ..బాపూ రెండో ముద్రణకావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప రచయితలు మహాత్మాగాంధీ గురించి అద్భుతంగా రచించారన్నారు. గిరిజా మనోహరాబాబు ఈ గ్రంథాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, బాధ్యులు పొట్లపెల్లి శ్రీనివాస్రావు, పందిళ్ల అశోక్కుమార్, కాళోజీ ఫౌండేషన్ పేరుతో గ్రంఽథాన్ని ముద్రించిన చింతకుంట్ల సంపత్రెడ్డి, రచయితలు గంటారామిరెడ్డి, ఆచార్య బన్న అయిలయ్య, బాసిరి సాంబశివరావు, నెల్లుట్ల రమాదేవి, డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ -
నిరీక్షణకు తెర!
సాక్షి, మహబూబాబాద్ : నమ్మకంతో భూములు కొనుగోలు చేసి తెల్లకాగితంపై ఒప్పందం కుదుర్చుకున్న రైతులు భూమిని సాగు చేసుకుంటున్నా.. వారి పూర్తి స్థాయి హక్కు రాలేదు. ఇటువంటి రైతులకు భూమి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కల్పించిన సాదా బైనామాకు ఇంత కాలం అడ్డంకిగా ఉన్న సమస్యలకు కోర్టు స్టే తొలగిపోయింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో నిబంధనలకు పొందుపరుస్తూ జీఓ జారీ చేశారు. దీంతో ఐదు సంవత్సరాలుగా సాదాబైనామా కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడనుంది. తొలగిన అడ్డంకులు భూ ప్రక్షాలన సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు 2020లో అప్పటి ప్రభుత్వం 121 జీఓ తీసుకొచ్చింది. ఈ జీఓ ప్రకారం భూ క్రయవిక్రయాలపై తెల్లకాగితం ఉంటే చాలు సాదా బైనామా ద్వారా పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేసే అవకాశం వచ్చింది. దీనిని ఆసరాగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే 2020 ఆర్ఓఆర్ చట్టంలో క్రమబద్ధీకరణ సెక్షన్లు లేనందున కోర్టు స్టే విధించింది. దీంతో సాదాబైనామా ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ఇటీవల 106 జీఓ తీసుకొచ్చి అడ్డంకులను తొలగించడంతో సాదాబైనామాకు మార్గం సుగమనం అయ్యింది. కాస్తులో ఉన్నా.. రూ.లక్షలు పెట్టి భూమిని కొనుగోలు చేసుకొని.. కాస్తులో ఉన్నా.. హక్కు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా బ్యాంకు రుణాలు, ప్రభుత్వం అందించే సబ్సిడీతో ఎరువులు, విత్తనాల కొనుగోలు, పండించిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధరకు అమ్మడం, చివరకు ప్రకృతి వైపరీత్యాలకు పంటనష్టం జరిగితే వచ్చే పరిహారం పొందేందుకు పట్టేదారు పాస్ పుస్తకం అనివార్యమైంది. దీంతో భూమి తనదైనా.. సాగుచేసి పంట పండిస్తున్నా.. హక్కు పత్రం లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 12 సంవత్సరాలు కాస్తులో ఉన్నవారికే.. సాదాబైనామాకు అడ్డంకి తొలిగినా.. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 106 జీఓ ప్రకారం 2014కు పూర్వం క్రయవిక్రయాలు జరిగినట్లు ఉండి.. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్నవారికే అవకాశం ఉంటుంది. అంటే 12 సంవత్సరాల క్రితం భూమిని కొని కాస్తులో ఉన్నవారికే సాదాబైనామా ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు అందనున్నాయి. రెవెన్యూ సదస్సులో.. గత ప్రభుత్వ హయాంలో 2020లో రైతులు చేసుకున్న దరకాస్తులకు తోడుగా ప్రభుత్వం ఇటీవల భూ భారతి చట్టం అమలుకోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు కూడా పరిశీలిస్తున్నారు. అంతకు ముందు 80వేల సాదా బైనామా దరఖాస్తులు రాగా.. రెవెన్యూ సదస్సుల్లో 39,513 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా 24,014 దరఖాస్తులు సాదాబైనామావే ఉన్నాయి. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందులో ఉన్న దరఖాస్తుల్లో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వాటిని పరిశీలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్టు గ్రీన్ సిగ్నల్తో రైతుల్లో ఆశలు 2020లో 80వేలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు నిబంధనల ప్రకారం పట్టాలు జిల్లాలో మొదలైన ప్రక్రియజిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలు సమస్య వచ్చిన దరఖాస్తులు సర్వే నంబర్ మిస్సింగ్ 1,476 పెండింగ్ మ్యుటేషన్ 384 డీఎస్ పెండింగ్ 1,148 విస్తీర్ణ సవరణ 1,632 భూ స్వభావం 263 పట్టాదారు పేర్ల సవరణ 225 ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తీసివేయడం 462 ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం 02 అసైన్డ్ భూ సమస్య 1,378 ఓఆర్సీ ఇష్యూ కానివి 45 38–ఈ సర్టిఫికెట్ రాకపోవడం 06 వారసత్వ సమస్య 2,007 భూ సేకరణ సమస్య 169 ఇతర సమస్యలు 30,316 మొత్తం 39,513ప్రక్రియ వేగవంతమైంది.. భూ భారతి చట్టం అమలు ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. సాదా బైనామాకు ఉన్న అడ్డంకులు తొలిగి పోయాయి. నిబంధనలను అనుసరించి ప్రక్రియ మొదలవుతుంది. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి గైడెన్స్ రావాల్సి ఉంది. మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. – అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ -
రాజీ మార్గం అత్యుత్తమం
మహబూబాబాద్ రూరల్ : రాజీమార్గమే ప్రశాంతమైన జీవన విధానానికి మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భార్యభర్తల మధ్య వచ్చే తగాదాలతో ఎన్నో రకాల కేసులు నమోదవుతున్నాయని, వీటన్నింటికీ భార్యాభర్తలు ఒక కేసులో రాజీ పడినట్లయితే మిగతా అన్ని కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. జాతీయ లోక్ అదాలత్కు సహకరిస్తున్న న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.శాలిని మాట్లాడుతూ కక్షిదారులకు తక్కువ సమయంలో అంతిమమైన పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.ప్రేమ్ చందర్, న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణతేజ్ అర్వపల్లి, న్యాయవాదులు, వివిధ బ్యాంకుల అధికారులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. 6,482 కేసుల పరిష్కారం... జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 6,482 కేసులను పరిష్కరించారు. ఇందులో రాజీపడిన 104 క్రిమినల్ కేసులు, నేరం ఒప్పుకున్న క్రిమినల్ కేసులు 116, చెక్కు బౌన్స్ కేసులు రెండు, సివిల్ కేసులు ఎనిమిది, సైబర్ క్రైమ్ కేసులు 22, ఒప్పుకున్న సెకండ్ క్లాస్ కోర్టు నేరం కేసులు 865 ఉన్నాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ప్రిలిటిగేషన్, ట్రాఫిక్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకు, విద్యుత్ శాఖ మొత్తం కేసులు కలిపి 5,350 ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద (ఎంవీఓపీ) కేసులు 15 పరిష్కరించి బాధితులకు రూ.1,16,45,000 పరిహారంగా అందజేయాలని ఆదేశించారు. న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ డీసీసీబీ భవన్లో న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ -
జీవన ఎరువులు వాడాలి
మహబూబాబాద్ రూరల్ : జీవన ఎరువుల వాడకంతో రైతులకు మేలు జరుగుతుందని మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.దిలీప్ కుమార్ అన్నారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా కంబాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మిర్చి పంట సాగులో పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిరపలో ఆశించే పురుగుల యాజమాన్యం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా పంపిణీ చేసిన ట్రైకోడెర్మా, సూడోమొనాస్ జీవన ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ.. కూరగాయల సాగు పెంచుకోవాలని రైతులను కోరారు. పంట ఉత్పత్తి శాస్త్రవేత్త క్రాంతికుమార్ మిరపలో తెగుళ్ల యాజమాన్యం గురించి వివరించారు. ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని మాట్లాడారు. -
శభాష్.. ఎల్కతుర్తి పోలీస్
ఎల్కతుర్తి : వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఖాకీలు కాపాడారు.హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన గాజుల రాకేశ్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోని తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే క్రమంలో రాకేశ్ కొట్టుకుపోయి బ్రిడ్జి వద్ద ఉన్న మూడో పిల్లర్ను పట్టుకొని కేకలు వేశాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే డయల్–100కు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్కుమార్ వెంటనే తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తాడుసాయంతో రాకేశ్ను రక్షించారు. దీంతో పోలీసులను ప్రజలు అభినందించారు. కానిస్టేబుల్ బక్కయ్య, వికిల్, రాజు గ్రామస్తులు పాల్గొన్నారు. -
డీసీసీబీ ‘ఏ’ కేటగిరీ సాధించాలి
హన్మకొండ : నాబార్డు ఇన్స్పెక్షన్లో వరంగల్ డీసీసీబీ ‘ఎ’ కేటగిరీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ల వారీగా ప్రగతిని సమీక్షించి ఆయన మాట్లాడారు. నిర్దేశించిన లక్ష్యాలు గడువులోగా సాధించాలని సూచించారు. వ్యక్తిగత పనితీరు మెరుగుపడని వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆదేశించారు. రుణాలు, మొండి బకాయిలను రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని పేర్కొరు. నిరర్థక ఆస్తులు 2 శాతానికి లోబడి ఉండేలా, టర్నోవర్ రూ.2,500 కోట్లు చేరుకునేలా కృషి చేయాలని అన్నారు. ప్రతి నెల ఖాతాదారులతో సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో రెండో స్థానానికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషశ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయకుమారి, బ్యాంకు బ్రాంచ్ల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు -
సాంకేతిక లోపంతో నిలిచిన ‘గోల్కొండ’
డోర్నకల్ : రైలులోని ఓ బోగీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో మూడు గంటలకు పైగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేట దాటిన తర్వాత రైలులోని డీ–2 బోగీలో సాంకేతిక లోపం తలెత్తింది. వరంగల్ స్టేషన్లో బోగీలోకి ఎస్కార్ట్గా ఎక్కిన సిబ్బంది రైలు ఆగిన ప్రతీ స్టేషన్లో డీ–2 బోగీని పరిశీలించారు. రైలు మహబూబాబాద్ దాటిన తర్వాత డీ–2 బోగీలో హార్డ్ యాక్సిల్ బేరింగ్ దెబ్బతిందని సిబ్బంది డోర్నకల్ రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు. డోర్నకల్ స్టేషన్లో సీఅండ్ డబ్ల్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు సాయంత్రం 5:04 గంటలకు డోర్నకల్ స్టేషన్లోని నాలుగో ప్లాట్ఫామ్ చేరుకున్న తర్వాత డీ–2 బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేసి రైలు నుంచి తొలగించాలని నిర్ధారించారు. రైలు వెనుకవైపు ఇంజన్ అమర్చి బీ–2 వరకు చివరి ఐదు బోగీలను జంక్షన్లోని యార్డుకు తరలించారు. డీ–2 బోగీని యార్డులో వదిలి మిగతా నాలుగు బోగీలను తిరిగి రైలుకు అమర్చిన తర్వాత రైలు రాత్రి 8:13 గంటలకు డోర్నకల్ నుంచి కదిలింది. సుమారు మూడు గంటలకు పైగా స్టేషన్లో రైలు నిలవడంతో విజయవాడ, గుంటూరు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. -
గొర్రెల మందపై పిడుగు..
కాళేశ్వరం : గొర్రెల మందపై పిడుగు పడి 94 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, గొర్రెల కాపరులు తెలిపిన కథనం ప్రకారం.. అంబటిపల్లికి చెందిన సుమారు ఆరు గొర్రెల మందలు పెద్దంపేట–లెంకలగడ్డ గ్రామ శివారులో మేతకు వెళ్లి అక్కడే నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాపరులు మంద నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న గుడారంలోకి వెళ్లారు. మందపై ఒక్కసారి పిడుగు పడడంతో గొర్రెలన్నీ ఎక్కడిక్కడ చెల్లా చెదురయ్యాయి. రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృతిచెందడంతో యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి, మండల పశువైద్యాధికారి రాజబాపు, తహసీల్దార్ రామారావు చనిపోయిన గొర్రెలకు పంచనామా, పోస్టుమార్టం చేశారు. గోతితీసి పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు. -
ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా పనులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పనులు చేపట్టనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఐటీడీఏ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ సంఘాల ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఆర్కిటెక్చర్, కోయల పడిగల గుడ్డల లిపి 3నుంచి 7 గొట్ల మూలాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాలు గుడ్డలో ఉన్న పూర్వ చరిత్ర చిత్రలిపి, ఆదివాసీ జీవన విధానం గోడలపై ఆవిష్కరించాలని సూచించారు. వెయ్యేళ్లు సజీవంగా ఉండేలా, ఆదివాసీల చరిత్ర నిలిచేలా జాతర చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా గద్దెల ప్రాంగణం, సాలాహారం నిర్మాణంపై ఆదివాసీల బొమ్మలు ఉండాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. కోయ ద్వారాల మాదిరిగానే ఆలయ ద్వారాల నిర్మాణాలు ఉంటాయని వివరించారు. ద్వారాలపై సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు మూలాలు, ఆదివాసీల గొట్లు, గోత్రాలు, సిద్ధబోయిన వారి పూజావిధాన పద్ధతులు కూడా ఉంటాయని చెప్పారు. మిగిలిన 8 ద్వారాల్లో ఐదో గొట్టు సమ్మక్క, మూడో గొట్టు సారలమ్మ, నాలుగో గొట్టు పగిడిద్దరాజు, గోవిందరాజు, వడ్డె (పూజారి) గోత్రాలతో ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆ వంశ మూల చరిత్ర ఉంటుందన్నారు. ఆదివాసీ సంస్కృతికి విరుద్ధంగా నిర్మాణాలు ఉండవని స్పష్టం చేశారు. ఆలయంలో ఏర్పాటు చేయనున్న చిత్రాలను కలెక్టర్కు పంపించామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, పూజారులు చందా రఘుపతి, సిద్ధబోయిన స్వామి, నర్సింగరావు, సిద్ధబోయిన అరుణ్, కొక్కెర రమేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ఆదివాసీ నేత ముద్దబోయిన రవి, సమ్మక్క–సారలమ్మ పరిశోధన కేంద్రం సభ్యుడు కోరం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కేసముద్రం: యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం ఉదయం మండలంలోని కల్వల, ధన్నసరి పీఏసీఎస్ సెంటర్తోపాటు, ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక యూరియా పంపిణీ సెంటర్లను పరిశీలించారు. రైతులకు సరిపడా యూరియా అందుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్సై మురళీధర్రాజు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ప్రతీ రైతుకు యూరియా బస్తా అందుతుంది మరిపెడ రూరల్: ప్రతీ రైతుకు యూరియా బస్తా అందేల చూస్తామని ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ అన్నారు. శుక్రవారం మరిపెడ పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు యూరియా పంపిణీని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మరిపెడ సీఐ రాజ్కుమార్, సెకండ్ ఎస్సై కోటేశ్వరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఖిలా వరంగల్ : మైక్రో ఫైనాన్స్ వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రై వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ పడమరకోట ఎస్సీ కాలనీకి చెందిన ఆకులపల్లి కమలాకర్ (40) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పు తీర్చాలని మైక్రో ఫైనాన్స్లో వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో కమలాక ర్ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు. మృతుడి మమత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఒకే ఇంటిపై మూడు పిడుగులు
●ఎల్లంపేటలో గృహోపకరణాలు దగ్ధం.. మరిపెడ రూరల్ : ఒకే ఇంటిపై మూడుసార్లు పిడుగులు పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వంగూరి వెంకన్న, వెంకటమ్మ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వారి భవనం మెట్లపై ఒక చోట, డాబాపై రెండు చోట్ల పిడుగు పడింది. భయంతో వణికిపోయిన దంపతులు పక్కింట్లో తలదాచుకున్నారు. సొమ్మసిల్లి పడిపోయిన వెంకటమ్మను ఆస్పత్రికి తరలించారు. పిడుగులు పడి స్లాబుకు పెచ్చులూడి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంట్లోని ఫ్రిడ్జి, ఫ్యాన్లు, టీవీ, విద్యుత్ తీగలు కాలిపోయాయి. మొత్తం రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఘటన స్థలాన్ని శుక్రవారం గ్రామ పరిపాలన అధికారి గణేశ్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గండి మహేశ్తో పాటు గ్రామస్తులు కోరారు. -
ప్రభుత్వ బడిలో కార్పొరేట్ విద్య
హసన్పర్తి : ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. దాతలు (అరబిందో ఫార్మా ఫౌండేషన్, బ్రెల్చివ్ టర్నాలజీ, స్వాన్ టర్బిన్ సర్వీస్) సహకారంతో హసన్పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల పాఠశాలలో సుమారు రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి కలెక్టర్ స్నేహశబరీష్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డుకాదని చెప్పారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. ఆడిటోరియంలో ఫర్నిచర్ను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. హసన్పర్తికి చెందిన ఈగల్ ఎస్పీ చెన్నూరి రూపేశ్ పేదరికాన్ని జయించి ఐపీఎస్గా ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీపరీక్షలకు సంబంధించిన సుమారు రూ.8లక్షల విలువైన మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. దాతలు స్వాన్ టర్బిన్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ, బ్రెల్చివ్ టర్నాలజీ సీఈఓ డాక్టర్ ఉదయ్కుమార్, మహర్షి ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నూరి రవిని శాలువాలతో సత్కరించారు. డీఐఈఓ గోపాల్, ప్రిన్సిపాల్ సునీత, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ దాతల సాయంతో హసన్పర్తి కళాశాల, పాఠశాలలో రూ.42 లక్షల వ్యయంతో ఆడిటోరియం, ల్యాబ్ ప్రారంభం -
16న జాబ్మేళా
న్యూశాయంపేట: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 16న ములుగురోడ్డులోని ఐటీఐ క్యాంపస్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ కంపెనీలో రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్న ట్లు తెలిపారు. వివరాలకు 80790 09659లో నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసంమహబూబాబాద్ రూరల్ : బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం జరగగా ఓ బాధితుడు రూ.32.53 లక్షలు పోగొట్టుకున్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా షాదీడాట్ కామ్ అని మెసేజ్ చేసి వివరాలు అడిగారు. బాధితుడికి వివాహమైందని తెలియజేసి వారికి వివరాలు ఇవ్వలేదు. కొన్నిరోజుల తర్వాత అదే వాట్సాప్ నంబర్ నుంచి బిట్ కాయిన్ ట్రేడింగ్ గురించి చెప్పి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మబలికి లింక్ పంపించారు. ఆ లింక్తో బిట్ కాయిన్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం వాళ్లు చెప్పిన విధంగా మొదటగా రూ.50వేలు, ఆ తర్వాత రూ.5లక్షలు పంపించాడు. అయితే బాధితుడి వాలెట్లో రూ.పది లక్షలు ఉన్నట్టు చూపించి నమ్మించారు. ఇది నమ్మిన బాధితుడు పలు దఫాలుగా వాళ్లు చెప్పినట్లు వివిధ ఖాతా నంబర్లకు మొత్తం రూ.32,53,447 పంపించాడు. తర్వాత ఎలాంటి నగదు బాధితుడి అకౌంట్లో జమకాలేదు. అయినా కూడా డబ్బులు జమ చేయకుండా మరింతా డబ్బులు అడుగుతుండటంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ● రూ.32.53లక్షలు పోగొట్టుకున్న బాధితుడు ● కేసు నమోదు చేసిన పోలీసులు -
అత్తను కడతేర్చిన అల్లుడి అరెస్ట్
ఏటూరునాగారం : మద్యానికి బానిసై మేనత్తను హత్యచేసిన అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం వీఆర్కేపురం–ఇప్పలగూడెం ప్రాంతానికి చెందిన కొండగొర్ల ఎల్లమ్మను బుధవారం ఆమె మేనల్లుడు విజయ్కుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటనపై వెంకటాపురం(కె) పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా విజయ్కుమార్ తండ్రి చిన్నతనంలో మరణించగా ఎలాంటి పని చేయకుండా మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈక్రమంలో అతడి మేనత్త ఎల్లమ్మ భర్తతో విడిపోయి తల్లిగారి ఇంటి వద్దనే ఉంటోంది. దీంతో ఆమె వద్దనుంచి విజయ్కుమార్ తరుచూ డబ్బులు తీసుకొని జల్సాలు చేసేవాడు. బుధవారం కూడా డబ్బు, బంగారం ఇవ్వాలని ఎల్లమ్మ ను అడడగా ఆమె నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్న విజయ్కుమార్ కోపోద్రికుడై గొడ్డలితో ఎల్లమ్మపై దాడి చేసి హత్య చేశాడని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ రమేష్, ఎస్సై తిరుపతిని ఏఎస్పీ అభినందిచారు. -
ఖాతానుంచి రూ.99,600 మాయం
ఖానాపురం : బంగారం కుదువ పెట్టి తీసుకున్న నగదు ఖాతానుంచి మాయమైంది. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బాలుతండాకు చెందిన గుగులోత్ ఈరు బంగారాన్ని తీసుకెళ్లి బుధవారం నర్సంపేట పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కుదువ పెట్టి రూ.2.60 లక్షల రుణం తీసుకున్నాడు. గురువారం నగదు విత్డ్రాకు అనుమతి ఇవ్వకపోవడంతో తనకున్న మరో ఏపీజీవీబీకి బదిలీ చేయించుకున్నాడు. బీఓఐలో బంగారం ఇచ్చినట్లు రశీదు తీసుకోవడానికి రూ.260 చెల్లించాలని బ్యాంక్ ఉద్యోగి తెలిపాడు. దీంతో క్యూఆర్ కోడ్తో చెల్లించి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత చిట్టీ చెల్లించడానికి రూ. 13వేలు, పెట్రోల్ కోసం రూ.200 ఖాతా నుంచి వినియోగించాడు. సాయంత్రం కుటుంబ స భ్యులు ఈరు సెల్కు వచ్చిన మెసేజ్లు చూ డటంతో పలు దఫాలుగా రూ.99,600 ఖా తాలో నుంచి వి త్డ్రా అయినట్లు గమనించారు. దీంతో భయాందోళనకు గురైన ఈరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెల్పూరులో చైన్ స్నాచింగ్ ● బంగారు పుస్తెలతాడు అపహరణ గణపురం: మండలంలోని చెల్పూరులో గురువారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. చెల్పూరుకు చెందిన వృద్ధురాలు కౌటం మొండక్క మూత్రవిసర్జనకు బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడకు వెంట తెచ్చుకున్న టైరును వేసి బంధించాడు. ఒక చేతితో నోటిని మూసి ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును అపహరించాడు. ఆమె అరుపులు విన్న భర్త మొగిలయ్య బయటకు రావడంతో అప్పటికే దుండగుడు పారిపోయాడు. మెడ ను ంచి పుస్తెల తాడు తెంపే క్రమంలో మొండక్క మెడకు గాయాలయ్యాయి. భర్త మొగిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. వరుస చోరీలతో ఆందోళన.. గతనెలలో కూడా చెల్పూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు నరహరి కమలమ్మను ఇంటి వద్ద దింపుతానని గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలును లాక్కెళ్లాడు. ఈ ఘటన జరిగి నెలగడవక ముందే గురువారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలను ప్పాడుతున్న వారు స్థానికుల లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా అని గ్రామస్తులు భయపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని పోలీసులు ధైర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముగిసిన కబడ్డీ టోర్నమెంట్కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇంటర్ కాలేజీయేట్ డిగ్రీ, పీజీ కళాశాలల కబడ్డీ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్లో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ జట్టు విజయం సాధించింది. హనుమకొండలోని వాగ్దేవి కళాశాల జట్టు రన్నరప్గా నిలిచింది. ఇరు జట్లకు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. మనోహర్ బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. కుమారస్వామి, ఫిజికల్ డైరెక్టర్లు సోమన్న, జేత్య, కిరణ్కుమార్, పాషా, పల్లవి, బుచ్చన్న, సుమన్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షం, పిడుగుల బీభత్సం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టంఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో రూ.95 వేల విలువైన ఎద్దు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. టేకుమట్ల మండలంలో మానేరులో వరద ఒక్కసారిగా ఉప్పొంగడంతో ట్రాక్టర్లు మునిగిపోగా ఏడుగురిని పోలీసులు రక్షించారు. -
శంకర్దాదా ఎంబీబీఎస్లు!
● వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్య కేంద్రాలపై ఆగస్టు 20న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ డాక్టర్ పోస్టర్ పెట్టుకుని రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు. ● హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు టీజీఎంసీ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈతనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్డులో ‘సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో అక్రమంగా ఒక క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్ఘన్పూర్, గీసుకొండ, హసన్పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు.. ● వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. ● మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్లు, ల్యాబ్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ వైద్యం వికటించి పలువురికి అస్వస్థత పోలీసు కేసులకు వెరవని కొందరు -
యూరియా అందేలా చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ గార్ల: ప్రతీ రైతుకు యూరియా బస్తాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గార్లలోని పీఏసీఎస్ గోదాం, సీహెచ్సీ, కేజీబీవీని పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క అధికారి అంకితభావంతో పనిచేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా స రఫరా చేయాలన్నారు. గోదాం వద్దకు వెళ్లి యూ రియా నిల్వలను పరిశీలించారు. అలాగే సీహెచ్సీని తనిఖీ చేసి వైద్యులు, వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ రమేశ్ను ఆదేశించారు. రోగుల వార్డులను పరిశీలించి, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కేజీబీవీ సందర్శించి, తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. డీపీఓ హరిప్రసాద్, తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, ఏఓ కావటి రామారావు, సీఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి డోర్నకల్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్సింగ్కుమార్ ఆదేశించారు. స్థానిక పీహెచ్సీని శుక్రవారం తనిఖీ చేశారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ సిబ్బంది వివరాలు, సిబ్బంది హాజరు రికార్డులు తనిఖీ చేశారు. మాతా, శిశు మరణాల నివారణకు మందస్తు చర్యలు చేపట్టాలని, సాదారణ ప్రసవాలను పెంచాలని సూచించారు. అనంతరం పీఏసీఎస్లో ఎరువుల పంపిణీని పరిశీలించారు. -
అనాసక్తి!
వ్యాపారులమహబూబాబాద్: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్లోకి వెళ్లేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. పనులు పూర్తికాలేదని, గాంధీపార్కులోనే ఉంటామని చాలామంది వ్యాపారులు వాదిస్తున్నారు. అయితే సభలు, సమావేశాలకు ఇబ్బంది అవుతుందని గాంధీపార్కునుంచి కూరగాయల మార్కెట్ను తొలగించాలని పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ఈసమస్య ఇలా ఉంటే పాత బజార్లో ఉన్న పాత కల్లు కాంపౌండ్ స్థలంలో కూరగాయాల మార్కెట్ ఏర్పాటు చేయాలని వ్యాపారులు కార్యాలయంలో వినతులు ఇచ్చారు. లక్ష దాటినా జనాభా.. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 57,818 మంది ఓటర్లు 68,889 మంది జనాభా ఉంది. కానీ ఉద్యోగం, విద్యా, వ్యాపారం పరంగా మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి. కాగా చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం హయాంలోనే ఆఫీసర్ క్లబ్ పక్కనే ఉన్న స్థలంలో ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయానికి నిధులు కేటాయించి దాదాపు పనులు పూర్తి చేశారు. అయితే ఆ స్థలంలోనే కూరగాయల వ్యాపారులు వ్యాపారం చేసే వారు. ఇంటిగ్రేటెడ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం వల్ల వారికి గాంధీపార్కులో కేటాయించారు. అప్పటి నుంచి అక్కడే కూరగాయలు విక్రయిస్తున్నారు. 2023లోనే మోడల్ మార్కెట్ ప్రారంభం మోడల్ మార్కెట్ను 30–06–2023లో ప్రారంభించారు. అయితే నేటి వరకు కూరగాయల వ్యాపారులు అందులోకి వెళ్లలేదు. కొన్ని పనులు పెండింగ్లో ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రూ.90లక్షలు మంజూరు చేయగా.. అందులో రూ.60లక్షల పనులు పూర్తయ్యాయి. మిగిలిన రూ.30లక్షలతో పార్కింగ్, గేట్లు ఇతర పనులు చేపట్టాల్సి ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్ను ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా వ్యాపారులు వెళ్లకపోవడంతో మందు బాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. అనుకూలంగా లేదనే వాదన.. మార్కెట్ తమకు అనుకూలంగా లేదని వ్యాపారులు వాదిస్తున్నారు. దానికి తోడు పనులు కూడా పూర్తి కాలేదని చెబుతున్నారు. దీంతో గాంధీపార్కులోనే వారు తిష్ట వేశారు. అధికారులు మాత్రం పార్కింగ్ గేట్ల పనులు జరుగుతున్నాయని, దీంతో ఎలాంటి ఆటంకం లేదని వ్యాపారులు వెళ్లాలని సూచిస్తున్నారు. కానీ వ్యాపారులు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ సమస్య అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. పలు పార్టీలు ఆధ్వర్యంలో ఆందోళనలు.. గాంధీపార్కు మొదటి నుంచి సభలు, సమావేశాలకు వేదికగా ఉందని వెంటనే కూరగాయల వ్యాపారులను ఖాళీ చేయించి, అభివృద్ధి చేయాలని పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఆపార్కులో అంబేడ్కర్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. తెరపైకి కొత్త సమస్య.. పాత బజార్లోని పాత కల్లు కాంపౌండ్ స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని కమిషనర్కు వినతులు ఇచ్చారు. కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయకపోతే ఆస్థలం కబ్జా చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులకు విన్నవించారు. కాగా అది గ్రీన్ల్యాండ్ కావడంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.పనులన్నీ పూర్తయితేనే.. మోడల్ మార్కెట్లో పనులన్నీ పూర్తయితేనే వెళ్తాం. అందరికీ అనుకూలంగా ఏర్పాటు చేయాలి. మార్కెట్ ఎదుట గుమ్చీలు ఏర్పాటు చేయవద్దు. వ్యాపారపరంగా నష్టం లేకుండా చేస్తేనే వెళ్తాం. –ఎం.వెంకట్రావ్, కూరగాయల మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు దసరాలోపే తరలిస్తాం దసరాలోపే కూరగాయల మార్కెట్ను మోడల్ మార్కెట్లోకి తరలిస్తాం. దాదాపు పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన చిన్న చిన్న పనులతో సమస్య లేదు. వ్యాపారులు మోడల్ మార్కెట్లోకి వెళ్లాల్సిందే. వ్యాపారుల కోసమే అది ఏర్పాటు చేశాం. వ్యాపారులు సహకరించాలి. – రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిషనర్ -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం, వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియంతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కడం సరికాదు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. పత్రికా స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ గూడూరు: రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్లో యూరియా నిల్వ, వడ్డెరగూడెం శివారు రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం రైతుల క్యూను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి అబ్దుల్మాలిక్తో యూరియా పంపిణీ, రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియా పంపిణీలో తప్పకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని, అందుకు పోలీసులు తప్పక సహకరించాలని సూచించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్తో పాటు ప్రాథమిక పాఠశాలను, తిరిగి వెళ్లే ముందు బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం సమయంలో పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ ప్రతీరోజు మెనూ పాటిస్తూ వడ్డిస్తున్నారా, భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగారు. అందుకు పిల్లలు బాగుంటుందని చెప్పడంతో సంతృప్తి చెందారు. అదేవిధంగా సీహెచ్సీలో మందులు వివరాలను అడిగి తెలుసుకొని, వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. కేజీబీవీ పరసర ప్రాంతాలను పరిశుభ్రంగా చూసుకోవాలన్నారు. భోజన వసతి, తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగభవాని, సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. -
రైతులకు సరిపడా యూరియా
● డీఏఓ విజయనిర్మల, డీసీఓ వెంకటేశ్వర్లు మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని రైతులందరికీ యూరియా అందించడం కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని జిల్లా వ్యవసాయ, జిల్లా సహకార శాఖల అధికారులు విజయనిర్మల, వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో రైతులకు యూరియా అంది ంచడానికి అన్ని మండలాలలకు ప్రత్యేక అధికారులను నియమించారని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ స్వయంగా రైతులను కలుస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని, ప్రస్తుతం అందిస్తున్న యూరి యా, వచ్చే యూరియా వివరాలను క్లస్టర్ల వారీగా రైతులకు సమాచారం అందిస్తున్నారన్నారు. జిల్లాలో 44 యూరియా అమ్మకాల కేంద్రాలు, 20 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. మరో 10 కేంద్రాల నిర్వహణ కోసం ప్రతి పాదనలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 27,347 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. రైతులు నానో యూరియా వినియోగించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమావేశంలో డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొరత లేకుండా చర్యలు డోర్నకల్: జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఏఓ విజయనిర్మల తెలిపారు. మండలంలోని అమ్మపాలెం గ్రామ రైతువేదిక భవనంలో జరుగుతున్న యూరియా కూపన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం డీఏఓ పరిశీలించారు. గొల్లచర్ల సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఎరువుల పంపిణీని మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, సీఐ చంద్రమౌళి, వ్యవసాయ అధికారి మురళీమోహన్ తదితరులు పరిశీలించారు. -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
రైతులు అధైర్యపడొద్దు
● ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ నర్సింహులపేట: రైతులకు సరిపడా యూరియా అందుతుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. గురువారం నర్సింహులపేట, పెద్దనాగారం రైతు వేదికల వద్ద యూరియా కూపన్లు, బస్తాల పంపిణీని ఎస్పీ పరిశీలించారు. బస్తాల కోసం క్యూలో ఉన్న రైతులతో మాట్లాడారు. ఈరోజు మండలానికి 50టన్నుల యారియా వచ్చిందని, ప్రతీరోజు వస్తుందని, రైతులు ఎలాంటి అందోళన చెందవద్దన్నారు. నిత్యం పోలీసులు బందోబస్తు మధ్య పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. యూరియా పంపిణీపై అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిశోర్, ఎస్సై సురేష్, ఏఓ వినయ్కుమార్ పాల్గొన్నారు. సజావుగా సరఫరా మహబూబాబాద్ రూరల్: యూరియా సరఫరా సజావుగా జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం పీఏసీఎస్, అమనగల్ రైతు వేదిక వద్ద యూరియా టోకెన్లు, బస్తాల పంపిణీ ప్రక్రియను ఎస్పీ గురువారం సందర్శించి పరిశీలించారు. డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు మహేందర్ రెడ్డి, హతీరాం, సర్వయ్య ఉన్నారు. -
ముందస్తు ప్రణాళిక
సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం మాదిరిగానే వానాకాలం రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గత యాసంగిలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన తప్పులు జరగకుండా మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.2,89,350 మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన మొత్తం ధాన్యంలో 2,89,350 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు జిల్లా సివిల్ సప్లయీస్ మార్కెటింగ్ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. 8,097 ఎకరాల దొడ్డురకం, 2,15,782 ఎకరాల్లో సన్న రకం మొత్తం 2,23,880 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో 17,607 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 4,47,878 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో రైతులు తినడానికి నిల్వ ఉంచుకోవడం, ఇతర మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు పోగా 17,383 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 2,71,967 మెట్రిక్ టన్నుల సన్నరకం మొత్తం 2,89,350 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందని వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలో పేర్కొన్నారు.జిల్లాలో వరి సాగు వివరాలువానాకాలం వరి సాగు: 2,23,880 ఎకరాలుధాన్యం దిగుబడి అంచనా: 4,65,485 మెట్రిక్ టన్నులురైతుల నిల్వ, మిల్లర్లు, ప్రైవేట్ కొనుగోళ్లు: 1,76,135 మెట్రిక్ టన్నులుప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం: 2,89,350 మెట్రిక్ టన్నులుగుణపాఠం నేర్చితేనే..గత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తలెత్తిన సమస్యల నుంచి గుణపాఠం నేర్చుకుంటేనే వానాకాలం కొనుగోళ్లు సజావుగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. యసంగిలో 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 44.75లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా జిల్లాలో 22,02,225 సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 22,72,775 గన్నీలు కావాలని ఉన్నతాధికారులకు ఇండెంట్ పెట్టారు. అదేవిధంగా 9,979 టార్పాలిన్లు, 259 ప్యాడీ క్లీనర్లు, 239 క్యాలీపర్స్, 234 డస్ట్ రిమూవర్స్, 427 తేమ పరిశీలన యంత్రాలు, 921 వెయింగ్ మిషన్లు సిద్ధం చేశారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు పెట్టేందుకు హమాలీల కొరత వెంటాడింది. కాంటాలు పెట్టిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాల్సి ఉండగా.. లారీ సప్లయీస్ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తక్కువ లారీలను పంపించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అంచనాలకు మించి 1,76,100 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చింది. దీంతో మరోవైపు గన్నీ బ్యాగుల కొరత వెంటాడింది. దీంతో కల్లంలో కాంటాలు పెట్టేందుకు, కాంటాలు పెట్టిన ధాన్యం లారీల్లో లోడ్ చేసేందుకు నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో కాంటాలు పెట్టిన ధాన్యం వర్షాలకు తడిసి మొలకెత్తిన సంఘటనలు ఉన్నాయి. ఇలా యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులు, అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ వానాకాలం అలా జరగకుండా ముందుగానే లారీలు, గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని రైతులు కోరుతున్నారు.నవంబర్ నుంచి కొనుగోళ్లుగతంలో మాదిరిగానే ఈ వానాకాలంలో నవంబర్ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు పడ్డాయి. అయితే బావులు, బోర్లు, ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో జూన్, జూలైలో నాట్లు వేయగా.. చెరువులనే నమ్ముకున్న ప్రాంతాల్లో ఆగస్టు చివరి వరకు నాట్లు వేశారు. జిల్లాలో ప్రధానంగా పెద్దవంగర, తొర్రూ రు, దంతాలపల్లి, నెల్లికుదురు, నర్సింహులపేట మండలాల్లోని కొంత భాగం నవంబర్ నుంచి వరికోతలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈక్రమంలో నవంబర్ చివరి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తే జనవరి వరకు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. -
అటవీ సంపదను కాపాడుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : భవిష్యత్ తరాల మనుగడ కోసం అటవీ సంపదను కాపాడుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ బత్తుల అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా సెంటర్ నుంచి జమాండ్లపల్లి శివారు అటవీశాఖ జిల్లా కార్యాలయం వరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి అటవీశాఖలో విధి నిర్వహణలో అమరులైన వారిని స్మరించుకుంటూ నివాళులర్పించారు. డీఎఫ్ఓ విశాల్ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో అడవుల ప్రాముఖ్యతను గురించి జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో అటవీ మండల అధికారి వెంకటేశ్వర్లు, రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైళ్లను పునరుద్ధరించాలి
డోర్నకల్: కరోనా కాలంలో రద్దైన రైళ్లను పునరుద్ధరించాలని డీఆర్యూసీసీ సభ్యుడు జె.లచ్చిరాంనాయక్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్కుమార్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న లచ్చిరాంనాయక్ పలు రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అంందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో రద్దైన రైళ్లను పునరుద్ధరించాలని, డోర్నకల్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరినట్లు తెలిపారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాలపై టాయిలెట్ల ఏర్పాటుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేపట్టాలి నెల్లికుదురు: సేంద్రియ పద్ధతులు పాటించి ఎత్తు మడులు, మల్చింగ్ విధానంలో పంటల సాగు చేసి లాభాలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం పర్యటించారు. బోర్లు, బావుల కింద ఆయిల్పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, పసుపు, మున గ, మల్బరీ పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు మానస, విజయ్పాల్రెడ్డి, అశోక్, హరీశ్, రైతులు రమేశ్, భూషయ్య తదితరులు పాల్గొన్నారు. విహారయాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ–బాపట్ల బీచ్కు ఆర్టీసీ యాత్ర ప్రత్యేక బస్సు ఈ నెల 18న బయలుదేరుతుందని ఆర్టీసీ డీఎం ఎం.శివప్రసాద్ గురువారం తెలిపారు. డిపో నుంచి ఉదయం 4 గంటలకు డీలక్స్ బస్సు బయలుదేరి విజయవాడ కనకదుర్గమ్మ గుడి, బాపట్ల బీచ్కు పర్యాటకులను తీసుకెళ్లి అదే రాత్రి 11 గంటలకు మహబూబాబాద్కు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ. 500గా చార్జీలు నిర్ణయించామన్నారు. బుకింగ్ కోసం ఎండి.నబీ 99482 14022 నంబర్లో సంప్రదించాలన్నారు. భోజనం, రూమ్ సదుపాయాలు యాత్రికులే భరించాలన్నారు. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి మహబూబాబాద్ అర్బన్ : జిల్లాలోని అన్ని ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఈ నెల 13న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఎం.నర్సింహస్వామి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని, మంచిచెడులు వివరించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న సంక్షేమాలు, నూతన డైట్ మెనూ గురించి తెలియజేయాలన్నారు. ఈ సమావేశానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మెడికల్ ఆఫీసర్స్, సిబ్బంది, వార్డెన్లను ఆహ్వానించాలన్నారు. విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తాం మహబూబాబాద్ రూరల్: విద్యుత్ అంతరాయాలు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 11కేవీ లింక్ లైన్ ఏర్పాటు చేశామని జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ విజేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని దర్గా తండా జీపీ పరిధిలోని రేగడిగూడెం గ్రామంలో 11కేవీ లింక్ లైన్ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. నూతన 11 కేవీ లింక్ లైను లక్ష్మీపురం, లక్ష్మీపురం తండా, లాక్య తండా, దర్గా తండా, కొమ్ముగూడెం గ్రామాలను కలుపుతూ నిర్మాణం చేపట్టామన్నారు. తద్వారా రంగాపురం సబ్ స్టేషన్ పరిధిలోని వేమునూరు ఫీడర్పై గల 30శాతం లోడ్ను నడివాడ ఫీడర్పైకి మారిందన్నారు. పొలంబాట కార్యక్రమం చేపట్టి విద్యుత్ వినియోగదారులు, రైతులకు విద్యుత్ ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డీఈ విజయ్ కుమార్, ఏడీఈ ప్రశాంత్, ఏఈ వెంకటేశ్వర్లు, విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి
నెహ్రూసెంటర్: మహిళల రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి గాడిపెల్లి ప్రమీల డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అన్ని రంగాల్లో మహిళలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు నడుంబిగించాలనిపిలుపునిచ్చారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుఛిజీ సూర్నపు సోమయ్య, సంఘం జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత, తాళ్లపల్లి రమ, సావిత్ర, మమత, చాగంటి భాగ్యమ్మ పాల్గొన్నారు. పంపిణీ పరిశీలన కురవి: సీరోలు మండలం కాంపల్లి సొసైటీలో గురువారం యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులతో మాట్లాడారు. యూరి యా పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూ డాలని సూచించారు. యూరియా రైతులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట సీరోలు ఏఓ చాయారాజ్, తహసీల్దార్ పున్నంచందర్ ఉన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు ఆహ్వానం గూడూరు : మండలంలోని దామరవంచ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 6, బైపీసీలో 17 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ ఎం.రమే్శ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల జిల్లాలోని గిరిజన బాలురు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేడు (శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాజరై అడ్మిషన్ పొందాలని ఆయన పేర్కొన్నారు. -
ఆర్టీసీలో భద్రతకు పెద్దపీట..
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతోంది. డ్రైవర్ ఆరోగ్యంగా ఉండి, మంచి నడవడిక, ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటే, మానసికంగా దృఢంగా ఉంటారని... తద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చనే ఆలోచనతో వరంగల్ రీజియన్ ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సేఫ్టీ వార్డెన్లను నియమించారు. ప్రమాదాలు చేయని, అనుభవజ్ఞులు, సత్ప్రవర్తన, ఎలాంటి దురలవాట్లు లేని డ్రైవర్లు, కండక్టర్లను సేఫ్టీ వార్డెన్లుగా ఎంపిక చేశారు. వరంగల్ రీజియన్లో 9 డిపోలకు ఒకరి చొప్పున నియమించారు. సేఫ్టీ వార్డెన్ల విధులు.. సేఫ్టీ వార్డెన్లు డ్రైవర్లను ప్రతీరోజు నిశి త పరిశీలన చేస్తా రు. సెలవులో ఉ న్న వారిని వదిలి పెట్టరు. వారి ఆరోగ్యాన్ని, జీవనశైలిని దగ్గరగా గమనిస్తారు. వారాంతపు సెలవు రోజులు, స్పెషల్ ఆఫ్లో ఉన్న సమయంలో తగిన విశ్రాంతి తీసుకుంటున్నారా..? మద్యం సేవిస్తున్నారా..? ఇతర దురలవాట్లకు పాల్పడుతున్నారా.. అనారోగ్యంగా ఉంటే అవసరమైన మందులు సమయానుకూలంగా వాడుతున్నారా.. తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకుని విశ్రాంతి రోజు వారి జీవన విధానాన్ని గమనిస్తున్నారు. వారి నడవడిక, ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా డిపో, రీజియన్ అధికారులకు వివరించి సన్మార్గంలో నడిచేలా చూస్తారు. ఇలా చేయడం ద్వారా డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి అలజడులకు తావు లేకుండా మానసికంగా ఉంటారని అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్లో సంస్థ డ్రైవర్లు 1100, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లు 258 మంది ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులకు వైద్య పరీక్షలు.. గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం వైద్య పరీక్షలు నిర్వహించింది. వారి ఆరోగ్యాన్ని బట్టి ఉద్యోగులకను కేటగిరీలుగా విభజించింది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించింది. హెల్త్ డేటా బేస్లో ఉద్యోగి వారీగా ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపరిచారు. వైద్య పరీక్షల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మందులు వాడుతున్నారా లేదా అని సేఫ్టీ వార్డెన్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. విధులకు వచ్చిన సందర్భంలోనూ వారి వ్యక్తిగత రికార్డులు పరిశీలించి వాడాల్సిన ఔషధాలు వెంట తెచ్చుకున్నారా లేదా అని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా భోజనం, తాగునీరు కూడా ఇంటి వద్ద నుంచి తెచ్చుకునేలా మార్గదర్శనం చేస్తున్నారు. నైట్ డ్యూటీకి వెళ్లే వారు, రెస్ట్లో ఉండే వారు దోమతెర, ఓడోమస్ వెంట తీసుకొచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా డ్రైవర్ల ఆరోగ్యం బాగుండడంతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. వ్యక్తిగత రికార్డుల పరిశీలన.. డ్రైవర్ల పనితీరుపై కూడా వ్యక్తిగత రికార్డులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగంలో చేరిన తేదీ, ప్రవర్తన తీరు.. ప్రమాదాలు జరిగాయా.. జరిగితే ప్ర మాదానికి కారణం ఎవరు.. మామూలు ప్రమాదా మా, మేజర్ ప్రమాదమా.. ప్రాణాలుపోయిన ప్ర మాదమా వంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షిత డ్రైవింగ్ చేసే డ్రైవర్లను ‘ఏ’ కేట గిరీలో, మైనర్ ప్రమాదాలు చేసిన వారిని ‘బి’ కేట గిరీ, మేజర్ ప్రమాదాలకు పాల్పడిన వారిని ‘సి’ కే టగిరి, ప్రమాదంలో ప్రాణాలు పోతే ‘డి’ కేటగిరీలో చేర్చారు. డిపో డ్రైవర్లు హనుమకొండ 199 వరంగల్–1 286 వరంగల్–2 19 పరకాల 90 జనగామ 172 తొర్రూరు 120 మహబూబాబాద్ 83 నర్సంపేట 121 భూపాలపల్లి 119డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల నియామకం..ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేఫ్టీ వార్డెన్స్ను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు.డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల నియామకం..ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేఫ్టీ వార్డెన్లను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు. సేఫ్టీ వార్డెన్స్ ద్వారా నిత్య పరిశీలన మారుతున్న డ్రైవర్ల జీవన శైలి తగ్గుతున్న ప్రమాదాలు వరంగల్ రీజియన్లో 9 డిపోలు -
మహాజాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం మహాజాతర అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దివాకరటీఎస్ అన్నారు. గురువారం మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్లో ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డీఎఫ్ఓ రాహుల్కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావుతో కలిసి మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టనున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ పీఆర్, ఆర్అండ్బీ, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి వారంలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసిన పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులు మేడారంలో క్షేత్ర స్థాయిలో ఉండాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు. మహాజాతరకు సుమారు కోటి యాభై లక్షల పైగా భక్తులు హాజరవుతారని అంచనా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతర పనులు భక్తులకు సంతృప్తికరంగా ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, డీఆర్ఓ శ్రీనివాస్రావు, మేడారం ఈఓ వీరస్వామి, తహసీల్దార్ సురేశ్బాబు, అధికారులు పాల్గొన్నారు. పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి కలెక్టర్ దివాకరటీఎస్ -
సేఫ్టీ వార్డెన్లతో సత్ఫలితాలు..
సేఫ్టీ వార్డెన్ల నియామకం సత్ఫలితాలనిస్తోంది. డ్రైవర్లు వ్యసనాలు, దురలవాట్లకు దూరమవుతున్నారు. మానసికంగా దృఢంగా తయారై సురక్షిత డ్రైవింగ్ చేస్తున్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. గత సంవత్సరంలో చూసుకుంటే గడిచిన నాలుగు నెలల కాలంలో 8 ఫ్యాటల్ ఆక్సిడెంట్లు తగాయి. గతేడాది నాలుగు నెలల కాలంలో 19 ఫ్యాటల్ ఆక్సిడెంట్లు జరుగగా ఈ ఏడాది 11 ప్యాటల్ ఆక్సిడెంట్లు జరిగాయి. 11 ప్రమాదాల్లో మూడు మాత్రమే సంస్థ, సంస్థ అద్దెకు తీసుకున్న డ్రైవర్ల పొరపాటుతో జరిగాయి. మిగతా ప్రమాదాలు ఇతరుల తప్పిదాలతో జరిగాయి. డి.విజయభాను, రీజినల్ మేనేజర్ , వరంగల్ -
పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
రామన్నపేట: మట్టెవాడ పీఎస్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు(అంబర్ ప్యాకెట్లు) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వ్యాపారి కొలారియా ముకేశ్ ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు. ఈ మేరకు రూ.8.82 లక్షల విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై టి.వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 13 నుంచి రోలర్ స్కేటింగ్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: అండర్–5 నుంచి 18 బాలబాలికలకు ఈ నెల 13, 14వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు స్కేటింగ్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి సిద్ధార్థ, ఓం ప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలు 13వ తేదీన ఉనికిచర్లలో ఎస్ఎస్హౌస్ వద్ద, 14న రాంపూర్లోని ఢిల్లీ పబ్లిక్స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివరాల కోసం 6301591754 నంబర్లో సంప్రదించాలని వారు కోరారు. 13,14వ తేదీల్లో వాగ్దేవిలో క్రీడాపోటీలు మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి క్రీడామైదానంలో ఈనెల 13,14 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్థాయి (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల) క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ సునీల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పోటీల్లో 32 కళాశాలకు చెందిన డిగ్రీ, పీజీ , ప్రొఫెషనల్ కోర్సుల క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు. క్రీడా పర్యవేక్షకులుగా వాగ్దేవి కళాశాలల కార్యదర్శి సి.హెచ్. దేవేందర్రెడ్డి, సి.హెచ్.వాణిదేవి, డైరెక్టర్ సుదర్శన్రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ రామాంజనేయులు వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. బాంబు బ్లాస్టింగ్లో మునేశ్కు గాయాలు ఎస్ఎస్తాడ్వాయి: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో గురువారం జరిగిన బాంబు బ్లాస్టింగ్లో తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన సీఆర్ఎఫ్ 195 బెటాలియన్ చెందిన ఆదివాసీ యువకుడు అలెం మునేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని బార్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది సమీపంలో బాంబులను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలో బాంబు పేలి మునేశ్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మునేశ్ త్వరగా కోలుకోవా లని భూపతిపూర్ గ్రామస్తులతోపాటు మండల ప్రజలు సోషల్ మీడియా ద్వారా దేవతలను వేడుకుంటున్నారు. -
తల్లిదండ్రులకు భారమైన శిశువు మృతదేహం
● ఎంజీఎం మార్చురీలో వదిలేసిన కన్నవారు ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనఎంజీఎం: ఎంజీఎం మార్చురీలో ఓ పసికందు మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందిన హైమవతి–అనిల్ దంపతులు వదిలివెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైమావతి 7 నెలల గర్భిణి. కాగా, ఇటీవల తొర్రూరు ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శిశువుకు గుండె సమస్య ఉందని చెప్పడంతో అక్కడి నుంచి ఎంజీఎంలోని నవజాత శిశు కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స చేస్తుండగా ఈనెల 8వ తేదీన మృతి చెందింది. కాగా, పసికందు మృతదేహాన్ని తల్లిదండ్రులు మార్చురీలో వదిలివెళ్లారా, డబ్బులు లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఖననం చేస్తారు అని వదిలివెళ్లారో తెలియదు. కానీ, గురువారం సాయంత్రం ఆస్పత్రిలో ఈ విషయం చర్చకు దారితీసింది. వెంటనే సమాచారం తెలుసుకున్న మట్టెవాడ పోలీసులు మార్చురీలో ఉన్న పసికందు మృతదేహం గురించి సదరు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు మరోసారి ఎంజీఎం మార్చురీకి రానున్నట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. -
పేకాట శిబిరంపై పోలీసుల దాడి
● నలుగురి అరెస్ట్ వరంగల్ క్రైం : పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ మేకల రంజిత్కుమార్ గురువారం తెలిపారు. సుబేదారి పీఎస్ పరిధి జులైవాడలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయగా నలుగురు పట్టుబడ్డారు. దీంతో నిందితుల నుంచి రూ. 1.04 ల క్షలు స్వాధీనం చేసుకుని జులైవాడకు చెందిన భూక్య రవి, గుండ్లసింగారానికి చెందిన మాలోత్ రాజు, రాయపర్తికి చెందిన హలావత్ వినోద్, అదాలత్కు చెందిన నూనవత్ తిరుపతిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్సై రామారావు, కానిస్టేబుళ్లు మారేపల్లి ప్రభాకర్, అఖిల్, ప్రమోద్ను ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ అభినందించారు. -
విద్యార్థులు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి
● రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి కొత్తగూడ: విద్యార్థులు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతా లక్ష్మి అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలోని ఏకలవ్య గురుకులంలో గురుకులాల రాష్ట్ర స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం ఏర్పరుచుకుని సాధనకు నిరంతరం కష్టపడాలన్నారు. విద్యతోపాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖ రాలు అధిరోహించాలన్నారు. అదనపు కార్యదర్శి మాధవిదేవి, ఓఎస్డీలు రామారావు, శ్రీనివాస్, గంగాధర్, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీఓ రత్నకుమారి, ప్రిన్సిపాల్ అజయ్సింగ్, వివిధ పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా, ఈ పోటీలు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ ఆందోళన
హన్మకొండ అర్బన్: విద్యార్థుల పెండింగ్ ఉపకార వేతనాలు చెల్లించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ నినాదాలతో హోరెత్తిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. కలెక్టరేట్ గేట్ను తోసుకుని, గేట్లు ఎక్కి లోపలికి దిగేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా సుమారు గంటకుపైగా ఆందోళన కొనసాగింది. ఈసందర్భంగా ఏబీవీపీ వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి విద్యార్థులు గుర్తుకొస్తారని ఆరోపించారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోతే సీఎం, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ దూళిపూడి హరిచరణ్, వరంగల్ మహానగర్ కార్యదర్శి బెల్లం కార్తీక్, రోహిత్, రాహుల్, నవీన్, త్రినేష్, అభిలాష్, శ్రీశాంత్, సిద్ధు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నం సీఎంను విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ధర్నా -
ఎఫ్ఓబీ నిర్మాణం ఎప్పుడో?
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ (ఈఎల్ఎస్) వద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు నిర్మిస్తారని రైల్వే కార్మికులు అంటున్నారు. కాజీపేట జంక్షన్లో 2004లో రైల్వే శాఖ ఎలక్ట్రిక్లోకో మెయిన్ షెడ్ నిర్మించింది. అప్పటి నుంచి రైల్వే అధికారులు, కార్మికులు రైలుపట్టాలు దాటి షెడ్కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం షెడ్లో 250 లోకోల నిర్వహణతో సుమారు 410 మంది రైల్వే కార్మికులు వివిధ సెక్షన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. షెడ్లోకి వెళ్లి రావాలంటే రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. రన్నింగ్ ట్రైన్స్, షట్టింగ్ ట్రైన్స్, డీజిల్షెడ్, ఫిట్లైన్ నుంచి వచ్చి వెళ్లే రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు రైల్వే కార్మికులు అంటున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్లేటప్పుడు, లంచ్ టైం, డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో రైళ్లు వెళ్లే వరకు గేట్ వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. రైళ్ల రాకపోకలతో విధులకు అంతరాయం ఏర్పడినప్పుడు షెడ్లో 8 గంటల పని వేళలో ఆలస్యం కావడం వల్ల పని భారం పడుతోందని రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో షెడ్ వద్ద ఆర్యూబీ మంజూరైందని, ఏమైందో ఏమో గాని రద్దు కూడా అయిందని అంటున్నారు. షెడ్ కార్మికుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే జీఎం, డీఆర్ఎం, పీఎన్ఎం మీటింగ్తోపాటు రైల్వే బోర్డు స్థాయి వరకు వెళ్లిందని చెబుతున్నారు. ఇప్పటికై నా రైల్వే శాఖ బ్రిడ్జిని నిర్మించాలని షెడ్ రైల్వే నాయకులు, కార్మికులు కోరుతున్నారు. ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ లోకోషెడ్ రైల్వే కార్మికులు -
అంతర్జాతీయ క్రీడా సదస్సుకు డీవైఎస్ఓ అశోక్
వరంగల్ స్పోర్ట్స్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్ (ఎన్ఏపీఈఎస్ఎస్) ఆధ్వర్యంలో మలేషియాలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటి అంతర్జాతీయ క్రీడా సదస్సులో పాల్గొనేందుకు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు ఆహ్వానం అందింది. మలేషియాలోని యూనివర్సిటీ టెక్నాలజీ మారా, షా ఆలంలో మూడు రోజులపాటు జరిగే సదస్సులో అశోక్కుమార్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్ఎపీఈఎస్ఎస్ చైర్మన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజామహ్మద్ ఫిర్హరాజాఅజిదిన్ ఆహ్వాన పత్రికను పంపించారు. కాకతీయ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్పై పీహెచ్డీ చేస్తున్న అశోక్కుమార్ సెమినార్లో పేపర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.