Mahabubabad
-
పల్లె స్ఫూర్తి.. కావాలి దీప్తి!
మహబూబాబాద్ జిల్లా కురవిమండలం తిర్మలాపురం గ్రామంలోని జనాభా 765. గ్రామంలో 75 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. గతంలో రోడ్డు ప్రమాదాల బారినపడి పలువురు మృతి చెందారు. మరోసారి గ్రామస్తులు ప్రమాదాలకు గురి కావొద్దని, ప్రమాదవశాత్తు పడినా తలకు గాయం కాకుండా ఉండేందుకు ద్విచక్ర వాహనం ఉన్న ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. గ్రామ సర్పంచ్ కనకటి అచ్చమ్మ తన సొంత డబ్బులతో అందరికీ హెల్మెట్లు కొనుగోలు చేసి అందజేశారు. ఇప్పుడు ఆ గ్రామంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం పడిపేవారు లేరు.సాక్షి, మహబూబాబాద్: నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా హెల్మెట్ వాడకంపై హైదరాబాద్ మహానగరంలో కూడా చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మారుమూల పల్లెల్లో మాత్రం హెల్మెట్ తప్పనిసరని తీర్మానం చేసుకొని అమలుచేయడం విశేషం. మహబూబాబాద్ జిల్లాకు ఇటీవల వచ్చిన ఎస్పీ శబరీష్ రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నంగా ఆలోచించారు. కొత్తగా ఎంపికైన గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లతో గత నెల 17న జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. మన ఊరు–మన బాధ్యత పేరుతో చేపట్టిన కార్యక్రమం గురించి వివరించారు. సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్ల సలహాలు, సూచనలు తీసుకున్నారు. వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలుమార్లు మీటింగ్లు పెట్టి కార్యక్రమం ప్రాధాన్యత వివరించారు. దీంతో మూడు అంశాలపై ప్రతీ గ్రామంలో తీర్మానం చేశారు. ఈ ఫొటోలో ద్విచక్రవాహనదారుడికి పోలీసు హెల్మెట్ పెడుతున్న దృశ్యం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలోనిది. సర్పంచ్ భూక్య జ్యోతి గ్రామ సభ నిర్వహించి ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తీర్మానం చేశారు. గ్రామంలో 164 ద్విచక్ర వాహనాలు ఉండగా.. తీర్మానం చేసిన వెంటనే 93 మంది హెల్మెట్లు కొనుగోలు చేశారు. మిగిలిన 71 మందికి దాతల సహకారంతో పోలీసులు హెల్మెట్లు కొనుగోలు చేసి ఇచ్చారు. మొదటి విడత 36 పంచాయతీలు,15వార్డులు జిల్లాలో మొత్తం 482 గ్రామాలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే అన్ని గ్రామాల్లో ఒకేసారి హెల్మెట్ధరించడం, గంజాయి నిర్మూలించడం, సీసీ కెమెరాల ఏర్పాటు వీలు కాదని గ్రహించారు. ముందుగా ప్రతీ మండలానికి రెండు గ్రామాల చొప్పున 36 పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల నుంచి 15 వార్డులను ఎంపిక చేసుకుని గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేశారు. ఇప్పుడు ఆయా గ్రామాలు, వార్డుల్లో ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా చర్యలు తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచిమార్పురావాలని.. ప్రతీ సంవత్సరం రోడ్డు భద్రతావారోత్సవాలు, గంజాయి నిర్మూలన కార్యక్రమాలు, సీసీ కెమెరాల ఉపయోగంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. అయితే గ్రామస్థాయి నుంచి మార్పు వస్తే ఇది శాశ్వతంగా ఉంటుందని భావించాం. కొత్తగా ఎంపికైన సర్పంచ్లు, వార్డుకౌన్సిలర్లతో సమావేశం పెట్టగా.. మంచిస్పందన వచ్చింది. మొదటి విడత ఎంపిక చేసిన గ్రామాల్లో వందశాతం హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్నారు.దశలవారీగా జిల్లా మొత్తం అమలయ్యేలా ముందుకెళ్తున్నాం. -
పెసర.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి
హన్మకొండ : పత్తి తీసిన తర్వాత ఆ పంట మోడ్లను భూమిలో కలియదున్నిన తక్కువ పంట కాలపరిమితి కలిగిన పెసర సాగు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందొచ్చని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమా రెడ్డి అన్నారు. వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానంలో పత్తి అనంతరం పెసర సాగుపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. వ్యవసాయ కళాశాల డీన్ రవీందర్ నాయక్, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్య విద్యార్థులు, రైతులతో కలిసి ఉమా రెడ్డి పెసర పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెసర సాగుతో భూమిలోని నత్రజని శాతాన్ని పొంపొందించుకోవచ్చన్నారు. మార్కెట్లో పెసరకు డిమాండ్ ఉందని, ఈ నేపథ్యంలో లాభసాటిగా ఉంటుందన్నారు. రైతులు అపరాల సాగుపై దృష్టి సారించాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఉమారెడ్డి -
సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ ● ప్రజావాణిలో 195 వినతులు ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని వి భాగాల జిల్లా అఽధికారులు ప్రతీ సోమవారం ని ర్వహించే ప్రజావాణికి తప్పక హాజరుకావాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ దరఖాస్తులను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రజా వాణిలో 195 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలు పేలుళ్లు!
మరిపెడ రూరల్: జిల్లాలోని మరిపెడ మండలంలోని పలు ప్రాంతాల్లో ఉన్న గుట్టలు, రాళ్లను తొలగించేందుకు అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు (జిలెటిన్స్టిక్స్) వినియోగిస్తున్నారు. పేలుడు పదార్థాల కారణంగా శబ్దాలతో కూడిన విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో గుట్టల ప్రాంతంలోని అటవీ జీవులు, పక్షులకు ముప్పు ఏర్పడుతోంది. పేలుళ్ల శబ్దం, ధూళికి ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడం వల్ల జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో అటవీ జీవులు అంతరించే పరిస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అడ్డుగోలుగా పేలుళ్లు జరుగుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు కరువు.. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే పేలుడు పదార్థాల వినియోగం జోరుగా కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పేలుడు పదార్థాలతో గుట్టలు, రాళ్లను తొలుస్తున్నారు. భూముల చదును, ప్లాట్లలో అడ్డు వచ్చిన రాళ్లను పగలగొట్టేందుకు కంప్రెషర్ ద్వారా బండరాళ్లుకు రంధ్రాలు తొలుస్తున్నారు. ఆ తర్వాత అనుమతులు లేకుండా కొనుగోలు చేసుకున్న పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. చుట్టుపక్కల మూగజీవాలతో పాటు ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట యథేచ్ఛగా పేలుళ్లు జరుగుతున్నప్పకీ మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.మరిపెడ నుంచి మహారాష్ట్రకు.. గత ఏడాది ఇక్కడి నుంచి మహారాష్ట్రకు పేలుడు పదార్థాలను ఆ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కూలీ పనుల కోసం వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లాడు. అక్కడ పేలుడు పదార్థాలు పట్టుబడగా అవి మరిపెడ నుంచి సరఫరా అయినట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) బృందం అధికారులు మరిపెడ మండంలోని భూక్యతండాలో ఓ అనుమానిత వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా, వరంగల్కు చెందిన ఓ పేలుడు పదార్థాల వ్యాపారి మరిపెడ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత అధికారులతో ఉన్న సంబంధాలతోనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పేలుడు పదార్థాలపై నిఘా పెట్టి, నివారణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అవరసమైతే నిబంధనలు అతిక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపాలని అంటున్నారు. విచ్చలవిడిగా పేలుడు పదార్థాల వినియోగం గుట్టలు, రాళ్లు తొలగించేందుకు వాడకం అటవీ జీవులు, పక్షులకు ముప్పు జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం గత ఏడాది మరిపెడలో ఎన్ఐఏ అధికారుల సోదాలు చోద్యం చూస్తున్న మైనింగ్ అధికార యంత్రాంగం.. -
26 కేజీల గంజాయి స్వాధీనం
● నలుగురి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు డోర్నకల్: రూ. 13.41 లక్షల విలువైన 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ చంద్రమౌళి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై వంశీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బైక్పై ఇద్దరు, కారులో ముగ్గురు వెళ్తుండగా ఆపారు. బైక్పై ఓ బ్యాగు, కారులో రెండు బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి లభించింది. పంచుల సమక్షంలో తూకం వేయగా 26 కిలోల బరువు ఉందని తేలింది. దీని విలువ రూ.31,41,450 ఉంటుంది. దీంతో తనిఖీల సమయంలో కారు నుంచి ఒకరు పారిపోగా నలుగురిని అరెస్ట్ చేసి గంజాయితో పాటు కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ నాగోల్ ప్రాంతానికి చెందిన వాంకుడోత్ వినోద్, ముసారాంబాగ్కు చెందిన మల్లెపు శశికాంత్, అంబర్పేటకు చెందిన పెంటెం చంద్రశేఖర్, బాపనపల్లి విజయకాంత్ ఉన్నారు. వీరు ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తిరిగొస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఫకీరాతండాలో గంజాయి నిల్వ చేసిన వ్యక్తి అరెస్ట్ నర్సింహులపేట: ఎండు గంజాయి నిల్వ చేసిన నర్సింహులపేట మండలం ఫకీరాతండాకు చెందిన నేతావత్ రూప్లాను అరెస్ట్ చేసినట్లు ఎ స్సై మాలోత్ సురేశ్ తెలిపారు. రూప్లా తన ఇంట్లో గంజాయి నిల్వ చే శాడనే సమాచారం మేరకు టాస్క్పోర్స్ సీఐ హథీరాం, ఎస్సై మాలోత్ సురేశ్ సంయుక్తంగా సోమవారం తనిఖీ చేశారు. ఇందులో సుమారు రూ. 2,40,000 విలువైన 4.8 కిలోల సరుకు లభించడంతో సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత
హన్మకొండ చౌరస్తా: ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యతని, అందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, ఆహారం, తాగునీరు అంశాలపై ప్రజలు అవగాహనతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, ఫుడ్సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ప్రతీ కాలనీని అభివృద్ధి చేస్తా నయీంనగర్: ఐదేళ్లలో ప్రతీ కాలనీని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. 54వ డివిజన్ అపూర్వ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులను వేగంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పొరేటర్ గుంటి రజిత, కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం భూపాలపల్లి సీఐ నరేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కుర్రే చేరాలు (55)కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో చేరాలు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో కుటుంబంలో విభేదాలు ఏర్పడి తరచూ గొడవలు జరిగేవి. కాగా, చేరాలు తన భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో పని నిమిత్తం వారం రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడు. కానీ తిరిగి హైదరాబాద్కు వెళ్లకపోవడంతోపాటు ఫోన్లో స్పందించకపోవడంతో ఇద్దరు కుమారులు రామ్, లక్ష్మణ్ రేపాకకు చేరుకున్నారు. ఈ సమయంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంట్లో తండ్రి ఉండడాన్ని చూసి గొడ్డితో దాడికి పాల్పడి పరారయ్యాయి. తీవ్రంగా గాయపడిన చేరాలను స్థానికులు గమనిచి 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారి వద్ద నుంచి గొడ్డలి, ద్విచక్రవాహనం, 25 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై సుధాకర్, సిబ్బందిని సీఐ నరేశ్కుమార్ అభినందించారు. వివరాలు వెల్లడించిన పోలీసులు -
నేడు డీజీపీ శివధర్రెడ్డి రాక
వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో నేడు డీజీపీ శివధర్రెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం కర్రెగుట్టల్లో తడపల వద్ద బేస్ క్యాంపును ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కాపెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశ వేదిక వద్ద పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. అనంతరం డీజీపీ కంటి వైద్యశిబిరం ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 10 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు రోజుకు రెండు విడతలుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల టైంటేబుల్ షెడ్యూల్ను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. -
కలెక్టర్ ఉంటేనే సవ్యంగా..
మహబూబాబాద్: సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండలస్థాయిలో న్యాయం జరగకపోతే బాధితులు ప్రజా వాణికి వస్తున్నారు. దూరప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో వస్తున్నారు. దివ్యాంగులు అయితే ప్రత్యేకంగా ఆటోల్లో వచ్చి వినతులు ఇస్తున్నారు. అయితే కలెక్టర్ ఉంటేనే ప్రజావాణి సవ్యంగా సాగుతోంది. లేకుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇలా.. సోమవారం జరిగిన ప్రజావాణిలో ముందుగా అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ తన చాంబర్లో ఉన్నప్పటికీ.. పలు పనుల వల్ల కొంత ఆలస్యంగా వచ్చారు. ఆ సమయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కలెక్టర్ లేకుంటే ప్రతీ ప్రజావాణి ఇలాగే సాగుతోంది. కొంతమంది సెల్ ఫోన్లో బిజీగా.. మరికొందరు ముచ్చట్లలో, ఇంకొంతమంది ఆఫీస్ పని చేసుకుంటూ ల్యాప్ టాప్ల్లో మునిగిపోయారు. షోకాజ్ నోటీస్లు ఇచ్చినా.. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మా ట్లాడుతూ.. కొంతమంది అధికారులకు షోకాజ్ నో టీస్లు ఇచ్చినా హాజరుకావడం లేదన్నారు. తదుపరి పరిణామాలకు మీరే బాధ్యత వహించాలన్నా రు. జిల్లాస్థాయి అఽధికారులు రాకుండా కిందిస్థాయి అధికారులను పంపిస్తున్నారు. కలెక్టర్ సీరియస్గా తీసుకుంటేనే ప్రజావాణి సమర్థవంతంగా జరుగుతుందని దరఖాస్తుదారులు అంటున్నారు. కలెక్టర్ వస్తేనే.. ప్రజావాణికి కలెక్టర్ స్నేహశబరీష్ వస్తేనే దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో వచ్చి క్యూ కడుతున్నారు. కలెక్టర్కు దరఖాస్తు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆమె కూడా ప్రతీ దరఖాస్తును క్షుణంగా పరిశీలించి సంబంధిత అధికారిని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. దీంతో ప్రజా వాణి కొంతకాలంగా గాడిన పడుతోంది. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రతీ ప్రజావాణిలో కలెక్టర్ ఆదేశించినా పూర్థిస్థాయిలో పరిష్కారం కాలేదు. ఇప్పటికే కొంతమందిపై వేటు.. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లా కేంద్రంలో పలు కార్యాలయాలను సందర్శించారు. కార్యాలయాల నిర్వహణ తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పీఆర్ ఈఈ విద్యాసాగర్ను సరెండర్ చేసిన విషయం విదితమే. ఆకస్మిక తనిఖీలతో కార్యాలయాల్లో అధికారులు సాయంత్రం 6గంటల వరకు ఉంటున్నారు. ఫైళ్లు ఇతరత్రా అన్ని క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. చాలా వరకు కార్యాలయాల్లో మార్పు కన్పిస్తోంది. జిల్లాలోని 406 మంది జీపీఓలకు డిప్యుటేషన్ వేశారు. మరికొంత అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.జిల్లా పాలనాధికారి వస్తేనే ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్న ప్రజలు హాజరుకాని కొంతమంది జిల్లాస్థాయి అఽధికారులు షోకాజ్ నోటీస్లు ఇచ్చినా వీడని నిర్లక్ష్యం -
సంస్థ అభివృద్ధిలో ప్రతీ ఉద్యోగి కీలకం
హన్మకొండ : సంస్థ అభివృద్ధిలో ప్రతీ ఉద్యోగి కీలకమని హనుమకొండ కలెక్టర్, వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో 2025–2026 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ డీసీసీబీ అత్యుత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరార్థక ఆస్తుల నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించారని, డిపాజిట్ మోబిలైజేషన్, రుణాల పంపిణీ, గోల్డ్లోన్ విభాగాల్లో నిర్దేశిత లక్ష్యాలు అధిగమించారన్నారు. సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. భవిష్యత్లోనూ ఇదే మాదిరి అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎంలు చంద్రశేఖర్, చైతన్య రవి, వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ విజయకుమారి, జనరల్ మేనేజర్ ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎంలు, 32 బ్రాంచ్ల మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
ఈవీఎంల భద్రతకు నూతన గోదాంలు
హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో ఈవీఎంల భద్రతను మరింత బలోపేతం చేయడానికి నూతన గోదాంలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ సుబేదారిలోని రెడ్ క్రాస్ సమీపంలో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచేందుకు నిర్మించిన నూతన గోదాంను ప్రారంభించారు. అనంతరం గోదాంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్ల నిల్వ గదులను పరిశీలించారు. భవన ప్రాంగణంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి మొక్క నాటి నీరు పోశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ గోదాం నిర్మాణం ప్రధాన ఉద్దేశం ఈవీఎంలను సురక్షితంగా నిల్వ చేయడం, అన్ని భద్రతా ప్రమాణాలను పాటించడమేనని తెలిపారు. గోదాంలో 24 గంటలపాటు భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, పోలీస్ బందోబస్తు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉంటాయని వివరించారు. అలాగే రాష్ట్రంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు ముందు మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల వివరాలను సరిచూసి వారి స్థానం గుర్తిస్తామన్నారు. ఈ ప్ర క్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. సమావేశం అనంతరం సుదర్శన్ రెడ్డి, బిహార్ అదనపు సీఈఓ ప్రశాంత్ కుమార్ను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్ బాబు, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కన్నం నారాయణ, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
వేలేరు: రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని బండతండా, కమ్మరిపేట, వేలేరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు, సీసీ రోడ్ల ప్రారంభం, చింతలతండాలో సీసీ రోడ్లు, జీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వేలేరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలంటే సర్పంచ్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. వేలేరు, చిల్పూరు మండలాలకు వచ్చే జూన్ చివరి నాటికి గండి రామారం లిఫ్ట్ –1 పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానన్నారు. అనంతరం పలువురు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, మహిళా సంఘం సభ్యులకు డ్రోన్ అందజేశారు. తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసన్న, ఏఓ కవిత, సర్పంచ్లు యాదగిరి, కిరణ్, అశోక్, మనోజ్, అనిత, అరుణ, మౌనిక, మానస, సాంబయ్య, రాజు, శ్రీనివాస్, ఎంపీఎం అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, మాజీ ఎంపీపీ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, నాయకులు సద్దాం హుస్సేన్, రాజిరెడ్డి, లక్ష్మణ్ నాయక్, రణధీర్ రెడ్డి, సలీంమాలీక్, సునీల్, సంపత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
నిధుల మంజూరుపై హర్షం
● కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కడియం కావ్య హన్మకొండ చౌరస్తా : వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపం విస్తరణతో పాటు మిగిలిన పనులకు రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయాలని గతేడాది వరంగల్ ఎంపీ కడియం కావ్య.. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీ వినతిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం రూ.14.44 కోట్లు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు. చారిత్రక వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి, పురావస్తు శాఖ అధికారులకు ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి సీజన్లో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ కేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వచ్చేవారం నుంచి కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం నర్సింహరావు, డీసీఎస్ఓ రమేశ్ పాల్గొన్నారు. ఆరోగ్య సూత్రాలు పాటించాలి ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించి వడదెబ్బ, వేసవి తాపం నుంచి రక్షించుకోవాలని, జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం వేసవి తీవ్రత, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ విద్యాసంస్థలు, జనసాంద్రత ప్రదేశాల్లో వైద్య శిబిరాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యాసంస్థల్లో పిల్లలకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలోని ప్రజలకు వేసవికాలంలో ఆరోగ్య అవసరాల నిమిత్తం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. వడగళ్ల్ల బీభత్సం
గంగారం: మండలంలోని మడగూడెంగ్రామంలో సోమవారం అకాల వర్షం కురిసింది. వడగళ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మక్కల రక్షణకు రైతుల పాట్లు మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో పాటు వాతావరణం పూర్తిగా చల్లబడి ఈదురుగాలులు మొదలయ్యాయి. దీంతో రైతులు అప్రమత్తమై మహబూబా బాద్ వ్యవసాయ మార్కెట్లో ఆరబోసుకున్న మక్కల రాశులపై టార్పాలిన్లు కప్పుకున్నారు. ఏ సమయంలో వర్షం కురుస్తుందోనని రైతులు ఆందోళన చెందుతూ తమ వ్యవసాయ ఉత్పత్తుల వద్ద కాపలా ఉన్నారు. -
విద్యార్థుల ప్రాణభద్రతపై నిర్లక్ష్యం తగదు
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: విద్యార్థుల ప్రాణ భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఎస్పీ శబరీష్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలల బస్సు డ్రైవర్లపై ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సోమవారం నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేసుకుని బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల అర్హతలు, వాహనాల భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బస్సులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, పర్మిట్ తదితర అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. విద్యార్థులు ప్రయాణించే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు, అగ్నిమాపక పరికరాలు, ఇతర భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనం నడపడం ఒక తీవ్రమైన నేరమని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల బస్సుల డ్రైవర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. అన్ని విద్యాసంస్థలు తమ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల ప్రవర్తన, భద్రతా ప్రమాణాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు ప్రయాణించే వాహనాల పరిస్థితిపై అవగాహన ఉండాలని సూచించారు. విద్యార్థుల భద్రతను కాపాడడంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. -
పరీక్షలకు వేళాయె
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ తదితర యాజమాన్యాల పరిధిలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు(వార్షిక పరీక్షలు) సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–2) పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలో సంబంధిత విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల వేళలు ఇలా.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 6, 7 తరగతులకు ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి 11:45 గంటల వరకు నిర్వహించనున్నారు. 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. వాటిలో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పేపర్ పరీక్షలు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలు మండలాలకు.. హనుమకొండ జిల్లాలో విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీసీఈబీ (జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు )నుంచి ఆయా తరగతుల ప్రశ్నపత్రాలు మండల కేంద్రాలకు పంపిణీ చేశారని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, డీసీఈబీ సెక్రటరీ బి.డాక్టర్ బి.రాంధన్ తెలిపారు. మండల కేంద్రాలల్లోని కస్టోడియన్ల నుంచి హెడ్మాస్టర్లకు ప్రశ్నపత్రాలు అందజేస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లోని 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు అదేవిధంగా యాజమాన్యాల పరిధి పాఠశాలల్లోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖలోని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ప్రశ్నపత్రాలు అందజేస్తోంది. డీసీఈబీ అందజేసిన ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈపరీక్షల పర్యవేక్షణకు కస్టోడియన్లు మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా కో–ఆర్డినేటర్లు, గజిటెడ్ స్థాయి డీసీఈబీ సభ్యులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడు మూల్యాంకనం.. ఆయా పరీక్షలు సబ్జెక్టుల వారీగా నిర్వహించిన రోజునే సంబంధిత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఆయా మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈనెల 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ప్రగతి పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 24నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. ఎస్ఏ–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, హనుకొండ జిల్లా డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ హెచ్ఎంలను ఆదేశించారు. రేపటి నుంచి విద్యార్థులకు ఎస్ఏ–2 పరీక్షలు ఏర్పాట్లు చేసిన అధికారులు -
పుష్కరాల పనులు
నిర్విరామంగా చేపట్టాలికాళేశ్వరం : సరస్వతీనది అంత్యపుష్కరాల పనులు రాత్రిపగలు అనే తేడా లేకుండా నిర్విరామంగా చేపట్టి మే మొదటి వారంలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రభుత్వం ఇటీవల రూ.21.34కోట్లు మంజూరు చేయగా పలు పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరితో కలిసి సరస్వతీఘాట్, నిర్మాణంలో ఉన్న మ్యూజియం, అందులో ఏర్పాటు చేయనున్న విగ్రహాలు, సరస్వతీఆలయం వద్ద నిర్మిస్తున్న అక్షరాభ్యాస మండపం పనులు, వీఐపీ ఘాట్ వద్ద మకర, హంస తోరణాల పనులు పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో సంబంధితశాఖ అధికారులతో శాశ్వత, తాత్కాలిక పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాత్కాలిక మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సరస్వతీనది ఆది పుష్కరాల్లో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. బస్టాండ్లో సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఘాట్ వద్ద క్లాడింగ్, రైలింగ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. లైటింగ్ లోకేషన్లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ ఇంజినీర్లకు సూచించారు. హెలిపాడ్, బారికేడ్లు ఏర్పాటుతో పాటు నదిలో భక్తులు భద్రతకు చర్యలు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. 12 రోజుల పాటు హారతి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈఓ మహేశ్, అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలిసి శైలజారామయ్యర్ శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. మే మొదటివారంలోగా ప్రారంభోత్సవాలు చేయాలి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ -
సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
హన్మకొండ కల్చరల్: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2027 విద్యాసంవత్సరానికి సివిల్ సర్వీసెస్ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ ఉచిత శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోందని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మొహమ్మద్ ఆజం అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అర్హులన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ 2026, మే 26 కాగా, ప్రవేశపరీక్ష 2026 జూన్ 6న దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. వివరాలకు http//admission.jmi.ac.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● హర్జ్యతండా వద్ద ఘటన గీసుకొండ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హర్జ్యతండా వద్ద వరంగల్–నర్సంపేట రహదారిపై చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం..హైదరాబాద్ బహదూర్పూరకు చెందిన భూక్య రవి(36) బైక్పై నర్సంపేట వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో హర్జ్యతండా వద్ద ఎదురుగా నర్సంపేట వైపునకు వెళ్తున్న టాటా ఏస్ .. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు టాటా ఏస్ డ్రైవర్ పొన్నం వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. వార్డు సభ్యురాలి ఆత్మహత్య ఖానాపురం : మండలంలోని బుధరావుపేటకు చెందిన ఓ వార్డు సభ్యురాలు సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్ర కారం.. గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యురాలు గారె అనూష (28) సోమవారం గ్రామ పంచాయతీలో నిర్వ హించిన సమావేశానికి హాజరైంది. అనంతరం ఇంటికెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త రవికుమార్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, అనూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చింతల్లో మనస్తాపంతో మహిళ.. ఖిలా వరంగల్ : భర్త మందలించాడనే కారణంతో ఓ మహిళ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం రాత్రి వరంగల్ చింతల్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చింతల్ ప్రాంతానికి చెందిన రత్న అనూష(30), సురేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలో అనూషను భర్త మందలించడంతో మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఆరెపెల్లి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ సోమవారం తెలిపారు. -
గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కోఎ డ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న భూక్య వాసు ఆదివారం ఆ కళాశాల సమీపంలోని కెనాల్లో ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతైన విషయం విధితమే. దీంతో ఆ విద్యార్థి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టింది. సాయంత్రం వరకు చేపట్టినా ఆచూకీ లభించలేదని ఆ కళాశాల హాస్టల్ జాయింట్ డైరెక్టర్ దయాకర్ సోమవారం రాత్రి తెలిపారు. కాగా, వాసు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ చిన్యాతండాకు చెందిన విద్యార్థి. ఇదిలా ఉండగా వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, స్టూడెంట్స్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ ఇస్తారి ఘటనాస్థలికి వచ్చారు. కాగా, నేడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరోసారి కెనాల్లో గాలింపు ప్రక్రియ చేపట్టనుంది. -
డాక్యుమెంట్ రైటర్లపై ఏసీబీ నజర్!
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈనెల 2, 3వ తేదీల్లో ఆకస్మికంగా మొదలైన తనిఖీలు 12 గంటల పాటు కొనసాగాయి. ఏసీబీ దాడుల్లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్కు చెందిన ఖమ్మం, హనుమకొండలోని ఇళ్లలో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో రూ.24,61,540 నగదు, 819.500 గ్రాముల బంగారం, 2.600 కిలోగ్రాముల వెండి, 30 లక్షల ఎఫ్డీ బాండ్లతోపాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ.42 లక్షల లావాదేవిల వివరాలను సేకరించారు. కాగా ఈ దాడుల్లో కార్యాలయం ఆవరణలోని 20 మంది డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి 70 దస్తావేజులు రూ.47,450 స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కొందరు డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయాలను తెరవలేదు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతికి మూలమైన డాక్యుమెంట్ రైటర్లపై ఏసీబీ నిఘా పెంచినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. లైసెన్స్ లేకున్నా వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సుమారు 200 మంది డాక్యుమెంట్ రైటర్లుగా చలామణి అవుతూ నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. వీరు ఆన్లైన్లో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దాడులు.. గతఏడాది ఏసీబీ అధికారులు వరంగల్ ఆర్వో కార్యాలయంలోని జిల్లా రిజిస్ట్రార్ చాంబర్కు ఆనుకుని ఉన్న ఓ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై దాడి చేసేందుకు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయారు. కాగా సదరు ఉద్యోగి ఏసీబీ దాడుల నుంచి వెంట్రుక వాసలో తప్పించుకుని అదే కార్యాలయంలో మరో విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ ఏడాది ఏసీబీ అధికారులు పక్కా ఫిర్యాదులు, సమాచారంతో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో స్వాధీనపరచుకున్నారు. ఇదిలా ఉండగా.. చిట్స్ కార్యాలయంలో నిలిచిపోయిన ఎఫ్డీ రిలీజ్పై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారండాక్యుమెంట్ రైటర్ల ఆగడాలు ఇలా.. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతేడాది ఓ డాక్యుమెంట్ రైటర్ ఏకంగా కార్యాలయ సిబ్బంది అవతారమెత్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగమైన ఫొటోలను తీసే సెక్షన్లో దర్జాగా తిష్ట వేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశాడు. ఓ సామాజిక వర్గానికి చెందిన ఓ సంస్థ స్థలాన్ని ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ చేయించడంతో గొడవ పీఎస్ వరకు వెళ్లింది. కాజీపేటలోని ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ ఉండడంతో కోర్టులో కేసు నమోదైంది. కానీ, ఓ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వంతో ఏకంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించా డు. దీంట్లో రూ.లక్షల్లో లావాదేవిలు జరిగిన ట్లు సమాచారం. కార్యాలయంలో సబ్రిజి స్ట్రార్ నిలదీయడంతో గొడవ చోటు చేసుకుంది. నగర చుట్టు పక్కన గల గ్రామాల్లో రియల్టర్స్ రూపొందించిన నాన్ లే అవుట్ ప్లాట్లకు నంబర్లు లేకున్నా.. ఓ డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్లు సుమారు పదికి రిజిస్ట్రేషన్లు చేయించాడు. ఇక్కడితో ఆగకుండా నాన్ లే అవుట్ ఉంటే తీసుకురండి.. అంటూ ఇతర డాక్యుమెంట్ రైటర్లకు ఆఫర్ ఇస్తున్నాడు. ఖాళీ స్థలానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా పర్వాలేదు.. పక్క ఇంటి నంబర్ వేసి హౌజ్ అసెస్మెంట్లా క్రియేట్ చేసి ఓ డాక్యుమెంట్ రైటర్ తన ప్రత్యేకతను చాటుకుంటూ సబ్ రిజిస్ట్రార్కు ఆదాయవనరుగా మారడం గమనార్హం. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల తనిఖీలు లైసెన్స్ లేకున్నా రూ.లక్షల్లో రైటర్ల అక్రమార్జన -
బీఎల్ఐఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య సీడీఓఈ బీఎల్ఐఎస్సీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, ఎక్స్ విద్యార్థులకు ఈనెల 24నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 24, 27, 29 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు కురవి: శుభాకార్యానికి వెళ్తున్న దంపతుల బైక్ను కారు ఢీకొనడంతో భార్యభర్తలకు ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం రాత్రి కురవి శివారులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండాకు చెందిన బానోత్ హరిచంద్–జ్యోతి దంపతులు బైక్పై తండా నుంచి మహబూబాబాద్ వయా వావిలాల గ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలో కురవి శివారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలోకి రాగానే కురవి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో బైక్పైనుంచి ఇద్దరు కిందపడిపోయారు. హరిచంద్కు తీవ్రగాయాలు కాగా, భార్య జ్యోతికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటన స్థలం వద్ద ఉన్న వ్యక్తులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో హుటాహుటీన అంబులెన్స్ చేరుకుంది. తీవ్రగాయాలైన భార్యాభర్తలు ఇద్దరిని ఈఎంటీ గాంధీ, పైలట్ రఫీలు అంబులెన్స్లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. మహబూబాబాద్లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. బైక్ను ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. చికిత్స పొందుతున్న మహిళ మృతి బచ్చన్నపేట : దంపతుల మధ్య గొడవతో క్షణికావేశంలో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ సంఘటన మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. తరిగొప్పుల మండలంలోని కనీలకుంట గ్రామానికి చెందిన దండు ఉప్పలమ్మ, కృష్ణమూర్తి దంపతుల మూడో కుమార్తె ప్రేమలతను (29) తొమ్మిదేళ్ల క్రితం బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లికి చెందిన పుప్పాల కర్ణాకర్తో వివాహం జరిపించారు. వీరికి కుమారుడు వర్షిత్, కూతురు నివీక్ష ఉన్నారు. ఐదు రోజుల క్రితం భార్యభర్తలు గొడవ పడగా క్షణికావేశంలో భార్య ప్రేమలత ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన భర్త కర్ణాకర్ బచ్చన్నపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం మెరుగైన వైద్యంకోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ప్రేమలత మృతిచెందింది. మృతురాలు తల్లి ఉప్పలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో మునిగి వృద్ధుడి మృతి
పరకాల: చేపల పెంపకంలో భాగంగా చెరువులో మందు చల్లడానికి వెళ్లిన మత్స్యకారుడు మృత్యువాతపడిన ఘటన పరకాల మండలం నాగారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన పల్లెబోయిన రాములు(68) గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులతో కలిసి నాగారం గ్రామ శివారులోని కంజరకుంట చెరువులో చేపలకు మందువేయడానికి వెళ్లారు. ఈక్రమంలో రాములు చెరువునీటిలో మునిగి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకా రులు పోలీసులకు సమాచారమందించగా రెస్క్యూ టీంతో కలిసి మూడు గంటలపాటు వెతికి మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. కోమట్లగూడెం గ్రామ శివారులో.. గంగారం : చెరువులో పడి ఒకరు మృతిచెందిన ఘ టన మహబూబాబాద్ జిల్లా కోమట్లగూడెం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమట్లగూడెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి సారయ్య(51) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసుల కు సమాచారం అందించారు. ఎస్సై రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వయంగా చెరువులోంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గూడూరుకు తరలించారు. సారయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. -
గ్యాస్ కొరతను అధిగమించాను..
పొరుగు దేశాల్లో యుద్ధం నేపథ్యంలో నిత్యావసర సరుకులతోపాటు ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. ఖర్చులు పెరుగుతుండడంతో కొత్త మార్గం కోసం ఆలోచించాను. అప్పడు డీజిల్తో పని చేసే పొయ్యి తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తక్కువ ఖర్చుతో రెండు రోజుల్లోనే తయారు చేసాను. లీటర్ డీజిల్ సాయంతో సుమారు రెండు గంటలపాటు పొయ్యి మండుతుంది. ఇప్పుడు ఖర్చు తగ్గింది. పని సులభమైంది. – గుండు, వసంత్, ఫాస్ట్ఫుడ్ హోటల్ నిర్వాహకుడు -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డుల ప్రదానం
హన్మకొండ కల్చరల్: తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్.. 2025 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉత్తమ వార్త చిత్రానికి వరంగల్ సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్ పెద్దపెల్లి వరప్రసాద్ ఉత్తమ ఫొటో జర్నలిస్టు బహుమతి, జనగామ సాక్షి ఫోటోగ్రాఫర్ గోవర్ధనం వేణుగోపాల్ కన్సోలేషన్ బహుమతి అందుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ మీడియా అకాడమీలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం వారికి అవార్డులు ప్రదానం చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, దేవులపల్లి అమర్, విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
అణగారిన వర్గాల కోసం పోరాడిన జగ్జీవన్ రామ్
హన్మకొండ: సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానేత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జగ్జీవన్రాం జయంతిని నిర్వహించారు. ఈసంద్భంగా జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రా మ్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక విప్లవానికి నాంది పలికిన మహానుభావుడని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజాసేవకుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన నిర్వహించిన పా త్ర దేశ నిర్మాణంలో కీలక మలుపు తిప్పిందన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించడమే లక్ష్యంగా ఆయన చూపిన దారిని ప్రతీ ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేయడం, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూడడం అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు , వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీజీఎం రవీంద్రనాథ్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు వేణు బాబు, గిరిధర్, ప్రభా వతి, అధికారులు కళాధర్ రెడ్డి, నీలారపు రాజేందర్, నాగేశ్వర్ రావు, దేవేందర్, రాధిక పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
వైద్యపరీక్షలకు వస్తూ కానరాని లోకాలకు..
మహబూబాబాద్ రూరల్ : వైద్య పరీక్షల కోసం వస్తూ రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతిచెందిన ఘటన మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామ శివారులో ఆది వారం చోటుచేసుకుంది. కురవి ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మానుకోట జిల్లా చిన్నగూడూరు మండలం మేగ్యతండాకు చెందిన భూక్యా నరేందర్, శిరీష (27) దంపతులు వైద్య పరీక్షల కోసం తమ నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ బయల్దేరారు. కురవి మండలంలోని రాయినిపట్నం మీదుగా మహబూబాబాద్ మండలం మల్యాల నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో మల్యాల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ఓ కారు ఆగి ఉంది. వాహనానికి సంబంధించిన వ్యక్తి వెనుకకు చూసుకోకుండా కారు డోర్ తీయడంతో అటువైపుగా వస్తున్న నరేందర్, శిరీష వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శిరీషకు తీవ్రగా యాలుకాగా సదరు కారు నిర్వాహకులు ఆమెను అదే కారులో మహబూబాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందింది. శిరీష భర్త నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక నెల్లికుదురు: ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఈ నెల 4 నుంచి 8 వరకు జరుగుతున్న రగ్బీ పోటీలకు 69వ ఎస్జీఎఫ్ అండర్ 17 బాలుర విభాగంలో మండలంలోని ఆలేరు ఉన్నత పాఠశాల విద్యార్థి బానోతు యశ్వంత్ పాల్గొంటున్నట్లు ఎంఈఓ రాందాస్ తెలిపారు. గత డిసెంబర్లో డోర్నకల్లో జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలో యశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ● రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి -
కెనాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు
కేయూ క్యాంపస్: ఈత కోసం కెనాల్లో దూకిన ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. కేయూ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిన్యాతండాకు చెందిన 22ఏళ్ల భూక్య వాసు కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ ఫైనల్ ఇయర్ చదువుతూ, యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటున్నాడు. ఆది వారం మధ్యాహ్నం 3–30 గంటలకు మరో ఇద్దరు విద్యార్థులు సందీప్, సాయితో కలిసి వాసు కళాశాల సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వకు ఈతకు వెళ్లాడు. ఒకరితర్వాత ఒకరు కాల్వలో దూకి ఈత కొట్టి పైకి వచ్చారు. వాసు ఈదుకుంటూ దరికి వచ్చి చిన్నచెట్టుకొమ్మను పట్టుకోబోయి నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. వెంటనే మిగిలిన ఇద్దరు విద్యార్థులు డయల్ 100, హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్ దయాకర్కు ఫోన్ చేశారు. దయాకర్ పోలీ సులతోపాటు వాసు కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్లు సుమలత, శ్రీనివాస్, స్టూడెంట్స్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, పలువురు విద్యార్థులు కెనాల్ వద్దకు వెళ్లారు. కేయూ పోలీస్స్టేషన్ సీఐ రవికుమార్ కూడా అక్కడికి చేరుకొని ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిశీలించారు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి కెనాల్లో తాడుతో కొక్కెం వేసి పరిశీలించింది. చీకటి పడడంతో ఇప్పుడు వెతకడం కష్టమని, సోమవారం ఉదయం వస్తామని వెళ్లిపోయారు. కాగా, వాసు తండ్రి కొంతకాలం కిత్రం మరణించాడు. తల్లి, సోదరుడు ఉన్నారు. ఈసంఘటన వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం దృష్టికి కూడా వెళ్లింది. కేసును నమోదు చేసి దరాప్యప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గతంలో ఇద్దరు విద్యార్థుల మృతి.. కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదవుతూ కెనాల్లో ఈతకోసం వెళ్లి గతంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. 2016 సంవత్సరంలో ఒకరు, 2022–2023 సంవత్సరంలో ఒకరు ఈతకోసం వెళ్లి చనిపోయారు. ఇప్పుడు మరో విద్యార్థి భూక్యా వాసు ఈతకోసం కెనాల్లో దూకి గల్లంతయ్యాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు విద్యార్థులు కెనాల్కు ఈతకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
వినూత్నం.. డీజిల్ స్టవ్..!
పాలకుర్తి టౌన్: ‘అవసరమే ఆవిష్కరణకు మూలం’ అని మరోసారి నిరూపితమైంది. పెరిగిపోతున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలతో బతుకు బండిని లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక హోటల్ నిర్వాహకుడు, తన స్వయంకృషితో ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు. డీజిల్తో పని చేసే ప్రత్యేక స్టవ్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫాస్ట్ఫుడ్ హోటల్ నడపుతున్న గుండు వసంత్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన చెందాడు. దీనికి ప్రత్యామ్నాయంగా సుమారు రూ.1,300 ఖర్చుతో, రెండు రోజులపాటు శ్రమించి ఈ డీజిల్ పొయ్యిని రూపొంచాడు. ఈ వినూత్న పొయ్యిలో విద్యుత్తో నడిచే బ్లోయర్ను అమర్చారు. ఆ బ్లోయర్ మోటార్ ద్వారా వచ్చే గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్ను మరో పైపు ద్వారా పొయ్యి వద్దకు పంపించి మంట వచ్చేలా అమర్చాడు. అవసరాన్ని బట్టి మంటను పెంచుకోడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా బ్లోయర్లో రెగ్యులేటర్ కూడా అమర్చారు. సాధారణ గ్యాస్ సిలిండర్తో పోలిస్తే ఈ డీజిల్ పొయ్యి వల్ల ఖర్చు కూడా సగానికి పైగా తగ్గుతుందని వసంత్ చెబుతున్నారు. లీటర్ డీజిల్తో గంట నుంచి రెండు గంటలపాటు నిరంతరంగా పోయి మండుతుందని ఆయన తెలిపారు. వసంత్ ఆవిష్కరణను చూసిన మరి కొందరు హోటల్ నిర్వాహకులు తమ కోసం కూడా ఇలాంటి పొయ్యిలను తయారు చేయించుకోవడం విశేషం. సామాన్యుడి మేధస్సుతో పుట్టిన ఈ దేశీ ఆవిష్కరణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.డీజిల్ సాయంతో వంట చేస్తున్న హోటల్ నిర్వాహకుడు ఆహా... వాట్ ఎన్ ఐడియా అంటున్న ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఆవిష్కృతమవుతున్న వినూత్న ఆలోచనలు -
ప్రాణాలమీదకు తెచ్చిన ‘యాప్’
హసన్పర్తి: యాప్ వ్యాపారం ప్రాణాలపైకి తీసుకొచ్చింది. వ్యాపారంలో నష్టం రావడంతో ఓ వ్యక్తి గొంతుపై కత్తి దూసుకెళ్లిన సంఘటన నగరంలోని గోపాలపురంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన పొన్నం కార్తీక్, బిట్ల రాంచరణ్, మహర్షి 2025లో ‘లూపింగ్ యాప్’ వ్యాపారాన్ని ప్రారంభించారు. నష్టం రావడంతో ఆ వ్యాపారాన్ని మానేశారు. ఈ వ్యాపారంలో తను పెట్టిన రూ.3 లక్షలు ఇవ్వాలని కార్తీక్ తోటి భాగస్వామి రాంచరణ్పై ఒత్తిడి తీసుకొచ్చాడు. లావాదేవీల విషయమై పెద్దల సమక్షంలో మాట్లాడడానికి అంగీకరించారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం బైక్పై వచ్చిన కార్తీక్ డబ్బుల విషయమై మాట్లాడుకుందామని రాంచరణ్ను ఎక్కించుకుని గోపాలపురం చెరువు కట్టపైకి తీసుకెళ్లాడు. కత్తితో గొంతు, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితుడి తండ్రి శ్రీఽనాఽథ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడంతో గొడవ డబ్బులు ఇవ్వడం లేదని కత్తితో గొంతుపై దాడి -
కల్లు తాగిన కోతిలా సీఎం వ్యవహారం
హన్మకొండ: కల్లుతాగిన కోతిలా సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి ఉందని, రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి చూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యనేతగా ఉన్న విజయన్పై మాట్లాడేస్థాయి రేవంత్కి లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత రాష్ట్రంలో పంటల దిగుబడి ఎలా ఉందో అందరికీ తెలుసని, రూ.లక్ష కోట్లు నీళ్లపాలయ్యాయని కాళేశ్వరంపై కేంద్ర మంత్రి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. 2014కు ముందు తెలంగాణ వరి ఉత్పత్తిలో ఎక్కడో ఉండేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో 2023 నాటికి దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ ఆఫీస్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టుకుంటారా.. అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి ఏ పార్టీకి చెందినవారో స్టేషన్ ఘన్పూర్ ప్రజలతో రెఫరెండం నిర్వహించాలన్నారు. మేడారంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని, రెండు టన్నుల రాయి పడడంతో గాయపడి వరంగల్ గార్డియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి యువన్ను పరామర్శించినట్లు చెప్పారు. సీఎంతో సహా మంత్రులు క్యాంపు పెట్టింది వాటాల కోసమేనని అరోపించారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, ఈ సంఘటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. జెడ్పీ మాజీ చైర్మర్ సాంబారి సమ్మారావు, నాయకులు బొంగు అశోక్, పులి రజనీకాంత్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, రామ్మూర్తి, జోరిక రమేష్, నయీముద్దీన్ పాల్గొన్నారు.ఆరు గ్యారంటీలు అమలు చూపిస్తే ఉరేసుకుంటా మేడారంలో నాసి రకం పనులు.. వాటాల కోసం మకాం శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
‘వేయిస్తంభాల’కు యునెస్కో గుర్తింపునకు కృషి
● ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు ఆదివారం వేయిస్తంభాల దేవాలయంలో ఆయన మాట్లాడుతూ వేయిస్తంభాల దేవాలయం అభివృద్ధికి, కల్యాణమండపం పునరుద్ధరణ పనులకు కేంద్రపురావస్తుశాఖ రూ.14.44కోట్లతో టెండర్ పిలువడంపై హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, పురావస్తుశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. విదేశీ టూరిస్టులు, భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తున్న సందర్భంలో దేవాలయం, కల్యాణమండపం చుట్టూ ఉన్న మట్టి, రాళ్లతో, ఎండతాకిడికి ఇబ్బందిపడుతున్నారని గడ్డితో గార్డెనింగ్ చేయాలని, పచ్చనిచెట్లతో, పూలమొక్కలతో సుందరీకరణ, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్శర్మ, విశ్వనాథ కాశీలింగాచారి, శ్రవణ్కుమార్, రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు మామిడాల గణపతి, కట్ల రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మార్పు ఏది?
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మహబూబాబాద్: ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇటీవల పీఆర్ ఈఈ విద్యాసాగర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ సరెండర్ చేసినా ఆ కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బందిలో ఏమాత్రం మార్పు లేదు. ఎక్కువమంది అధికారులు, సిబ్బంది ఇతర పట్టణాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. గత నెల 31న కలెక్టర్ పీఆర్ ఈఈ కార్యాలయాన్ని సందర్శించారు. ఎక్కువ సమయం కేటాయించి అన్ని పరిశీలించారు. నిర్వహణపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిత్యం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఈనెల 4వ తేదీన ముగ్గురు అధికారులు మినహా ఎవరూ కూడా 11గంటలలోపు కార్యాలయానికి రాలేదు. జిల్లా కేంద్రంలో పీఆర్ ఈఈ కార్యాలయం.. జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం, ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో 21మంది సిబ్బంది పని చేస్తున్నారు. స్టాఫ్ కాక ఈఈ కార్యాలయంలో ఈఈ, ఏడుగురు డీఈలు, 18మంది ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయ పరిధిలో 18 మండలాలు ఉన్నాయి. అలాగే ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో ఒక డీఈ, ఇద్దరు ఏఈలు, డీఎం, యూడీసీ, ఇద్దరు అటెండర్లు పని చేస్తున్నారు. డీఈ కార్యాలయ పరిధిలో మానుకోట, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి. 31న కలెక్టర్ సందర్శన.. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గత నెల 31న కలెక్టర్ స్నేహ శబరీష్ పీఆర్ ఈఈ కార్యాలయం సందర్శించారు. కాగా ఆ కార్యాలయంలో నిర్వహణపై తదితర విషయాలపై అఽధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినా అధికారులు, సిబ్బందిలో మార్పు రాలేదు. ఈనెల 2న ఈఈ సరెండర్ పీఆర్ ఈఈగా పని చేసిన విద్యా సాగర్ను ఈనెల 2 పీఆర్ ఆర్డీకి కలెక్టర్ సరెండర్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం జీపీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, వీఓ భవనాల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఎన్ఆర్ఈజీఎస్ రూ.49 కోట్లు కేటాయించింది. కాగా, వాటిలో రూ 4.50 కోట్ల బిల్లులు ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో ఆ నిధులు మిగలడంతో పాటు పలు కారణాలతో సరెండర్ చేసినట్లు సమాచారం . పూర్తి కాని పనులు.. ఉపాధి హామీ నిధులతో 22 జీపీ భవనాలు మంజూరు కాగా.. కేవలం 14 వివిధ దశల్లో ఉండగా, 8 భవనాలు ప్రారంభం కాలేదు. అంగన్వాడీ భవనాలు 30మంజూరు కాగా.. 23 వివిధ దశల్లో ఉన్నాయి. ఏడు భవనాల పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్లు చాలా వరకు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఆ పనుల నిధులు, వాటి బిల్లుల క్లియరెన్స్లో జాప్యంతో ఈఈపై వేటు పడింది. అలాగే వీఓ భవనాలు 180 మంజూరు కాగా.. వాటిలో 9 వివిధ దశల్లో ఉండగా, మిగిలినవి పనులు ప్రారంభం కాలేదు. అయినా మారని సిబ్బంది.. కలెక్టర్ సందర్శన, ఈఈ సరెండర్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ సిబ్బందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈనెల 4న ఇన్చార్జ్ ఈఈ ఆదిత్య రాజ్ మాత్రమే సమయానికి హాజరయ్యారు. అలా గే ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో ఇద్దరు మహిళా ఉద్యోగులు మాత్రమే హాజరయ్యా రు. చాలామంది సిబ్బంది వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇంటర్సిటీ రైలు లో వస్తున్నారు. దీంతో వారు ఆలస్యంగా ఉదయం 11.30 గంటలు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఆవేదన.. ఈఈని సరెండర్ చేసిన తర్వాత అదేరోజు రాత్రి ఇన్చార్జ్ ఈఈ బాధ్యతలను కార్యాలయంలో డీఈ టెక్నికల్గా పని చేస్తున్న ఆదిత్యరాజ్కు అప్పగించారు. దీంతో మిగిలిన డీఈలు సీనియారిటీ ప్రకారం బాధ్యతలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గైడ్లైన్స్ పాటించలేదని అంటున్నారు. మిగిలిన శాఖల్లో వణుకు.. ఈఈని సరెండర్ చేసిన తర్వాత మిగిలిన శాఖల అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. ఆకస్మిక తనిఖీలు, 99 రోజుల పాలనలో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్, గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలు పూర్తి చేయని వారిలో, బిల్లుల క్లియరెన్స్ నిధుల విషయంలో తేడాలు ఉన్న వారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, కలెక్టర్ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పీఆర్ ఈఈ సరెండర్ అయినా అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి సమయపాలన పాటించని వైనం బాధ్యతల కేటాయింపులో సీనియర్ల అసంతృప్తి -
మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్: మహనీయుల ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 119వ జయంతి నిర్వహించారు. బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రామ్ దేశానికి అమూల్యమైన సేవలు అందించారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అని కొనియాడారు. మహనీయుల జీవిత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. యువత ఆయన బాటలో నడవాలన్నారు. ప్రతీ ఒక్కరికి ఉన్నత విద్యను అందించాలని ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అఽధికారి శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ సబిత, ఆర్డీఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
‘లిఫ్ట్’ ప్లీజ్..
● డోర్నకల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఇబ్బందులు ● లిఫ్ట్ ఏర్పాటు చేయాలంటున్న ప్రయాణికులు డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లోని 2, 3, 4వ నంబర్ ప్లాట్ఫాంలపైకి ప్రయాణికులు ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నారు. విజయవాడ, కొత్తగూడెం వైపు వెళ్లే రైళ్లతో పాటు వరంగల్ వైపు వెళ్లే కొన్ని రైళ్లు 2, 3, 4వ ప్లాట్ఫాంలపైకి వస్తుంటాయి. దీంతో ప్రయాణికులు తప్పనిసరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా ఈ ప్లాట్ఫాంలపైకి వెళ్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కడం, దిగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లిఫ్ట్, పాత్ వే, ఎస్కలేటర్ సౌకర్యం లేకపోవడంతో తప్పనిసరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. లగేజ్, చంటి పిల్లలతో సకాలంలో రైలును అందుకునేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కలేక అవస్థలు పడుతున్నారు. వర్షం పడిన సమయంలో బ్రిడ్జిపై నీరు చేరి ప్రయాణికులు జారిపడిన సందర్భాలు ఉన్నాయి. రైలు ఎటొస్తుందో తెలియదు.. వరంగల్ వైపు వెళ్లే శాతవాహన, గోల్కొండ, కృష్ణా, ఇంటర్సిటీ లాంటి రైళ్లు ఒకటో నంబర్ ప్లాట్ఫాం పైకి రావాల్సి ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరం లేకుండా నేరుగా ఒకటో నంబర్ ప్లాట్ఫాం పైకి వెళ్లవచ్చు. అయితే ప్రతీరోజు ఆ రైళ్లు వచ్చే సమయంలో ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై గూడ్స్ రైళ్లు నిలిచి ఉంటున్నాయి. దీంతో ఆయా రైళ్లు రెండు లేదా మూడో నంబర్ ప్లాట్ఫాంపైకి వస్తున్నాయని మైక్లో అనౌన్స్ చేయడంతో ప్రయాణికులు పిల్లలు, లగేజ్తో హడావుడిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా అవతలి ప్లాట్ఫాంపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ వైపు వెళ్లే చాలా మంది ప్రయాణికులు రైలు ఏ ప్లాట్ఫారంపైకి వస్తుందో తెలియక ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కూర్చుని రైలు కోసం వేచి చూస్తున్నారు. విజయవాడ, ఖమ్మం, కొత్తగూడెం వైపు వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదుగా స్టేషన్ లోపలికి వెళ్లాలి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కలేని కొంతమంది ప్రయాణికులు 2, 3ప్లాట్ఫాంలకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతిచెందిన పడిన ఘటనలు చాలా ఉన్నాయి. కాగా, డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఒకటి, మూడో ప్లాట్ఫాంలపై లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. లిఫ్ట్ల ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు. -
ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా అమరులైన ఉద్యమకారులు దేశెట్టి రామచంద్రయ్య, బాదరబోయిన రాఘవులు, తూము వెంకన్న, గుంజే హన్మంతు, భూక్య సత్యనారాయణకు నివాళులర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, జర్నలిస్టు, కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారన్నారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగులకు పింఛన్తో పాటు ఉద్యమ గుర్తింపు కార్డులు, మెడికల్ కార్డులు తక్షణమే అమలు చేయాలన్నారు. రాబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందే ఉద్యమకారుల హామీలను అమలు చేయాలని కోరారు. లేని యెడల భవిష్యత్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ పిల్లి సుధాకర్, నియోజకవర్గాలు, మండలాల కన్వీనర్లు మేక సురేష్రెడ్డి, శంతన్రామరాజు, ఫరీద్, పరకాల రవీందర్, కృష్ణమూర్తి, గుగ్గిళ్ల పీరయ్య, రవికుమార్, లాలయ్య, రవి, కిషన్, దస్రునాయక్, లింగన్న, పాపన్న, దేవేందర్, వెంకన్న, అంబరీష, ఇమామ్, వెంకటేశ్వర్లు, సాయి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యా కమిషన్వి ఏకపక్ష సిఫారసులు
తొర్రూరు: విద్యా కమిషన్ ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్షంగా సిఫారసులు చేసిందని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలాష్టి రమేశ్ అన్నారు. డివిజన్ కేంద్రంలో టీపీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రమేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై కాకుండా ఉపాధ్యాయుల వేతనాలపై కమిషన్ నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా కమిష న్ వ్యవహరించిందన్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్రెడ్డి, ఉపాధ్యాయదర్శిని మాస పత్రిక సంపాదకుడు సూరం ఉపేందర్రెడ్డి, జిల్లా కార్యదర్శి రవీందర్రెడ్డి, మండల అధ్యక్షుడు కొండం జనార్దన్రెడ్డి, నాయకులు కొలుపుల శ్రీనివాస్, చింతల సురేష్, కుమారస్వామి, రమేశ్ పాల్గొన్నారు. డిప్యుటేషన్పై కార్యదర్శుల బదిలీ మరిపెడ రూరల్: మరిపెడ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు డిప్యుటేషన్పై బదిలీ అయ్యారు. మండలంలోని 48 గ్రామ పంచాయతీలకు 31మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తుండగా.. గత నెల తాళ్లఊకల్ కార్యదర్శి బదిలీ అయ్యాడు. దీంతో 30 మంది విధులు నిర్వర్తిస్తుండగా.. ఇద్దరిని మినహాయించి 28మందిని డిప్యుటేషన్పై బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నేడు వారు విధుల్లో చేరనున్నట్లు అధికారులు తెలిపారు. సంకటహరచతుర్థి పూజలు హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సా యంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్ శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహా హారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి కాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్, డాక్టర్ ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, ఆడెపు రవి, ఎలగం వెంకటమల్లు, బూర వేణుమాధవ్, పిట్టరాములు, వలుస కిరణ్ పాల్గొన్నారు. -
ఆన్ సైట్ ఎఫ్ఐఆర్
● బాధితుల వద్దకు వెళ్లి సత్వర న్యాయం ● జిల్లా వ్యాప్తంగా 35 కేసులు నమోదు ● ఎస్పీ శబరీష్మహబూబాబాద్ రూరల్ : బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసులు అమలు చేస్తున్న ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ విధానం ఫలితాలు ఇస్తోంది. పోలీస్స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు రావాల్సిన అవసరం లేకుండా, స్వయంగా పోలీసులు ఘటన స్థలాని వెళ్లడం లేదా బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయడం ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ విధానం ప్రత్యేకత. ప్రధాన అంశాలు.. ● మహిళలు, చిన్నారులపై నేరాలు ● లైంగిక నేరాలు (పోక్సో, అత్యాచారం తదితరాలు) ● ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాలు ● ఆస్తి సంబంధిత నేరాలు (చోరీ, దోపిడీ) వృద్ధులపై నేరాలు ● ప్రత్యేక చట్టాల కింద కేసులు (వరకట్నం, బాల్య వివాహాలు, ర్యాగింగ్ మొదలైనవి) ● పోలీస్స్టేషన్కు రాలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు సంబంధించిన ఇతర నేరాలు ● ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ నమోదు సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. బాధితుల వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 35 కేసులు.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 35 ఆన్సైట్ ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. ఈ విధానం వల్ల బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీసు సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. సత్వర న్యాయం అందించడమే లక్ష్యం బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్శాఖ లక్ష్యం. ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్ ద్వారా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం. జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలి. ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ ద్వారా బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీసు సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. – శబరీష్, ఎస్పీ -
గడ్డి మందు తయారీని నిలిపివేయాలి
మరిపెడ: గడ్డి మందు తయారీని నిలిపివేయాలని మరిపెడ ము న్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్రెడ్డి అన్నారు. మరిపెడలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. గడ్డి మందు వాడకం వల్ల భూమిలో సారం తగ్గి దిగుబడి తగ్గుతుందన్నారు. ప్రభుత్వం నిషేధిత గడ్డి మందును తక్షణమే నిలిపివేయాలని కోరారు. నాయకులు కుడితి నర్సింహరెడ్డి, షేక్ తాజుద్దీన్, షేక్ నజీర్ పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించాలిప్రజలకు, వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మరిపెడ మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్రెడ్డి అన్నారు. మరిపెడలో సంతను ఆమె ప్రారంభించి మాట్లాడారు. సంతలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ప్రభుత్వం నిర్మించిన మార్కెట్లో విక్రయాలు జరుపాలని వ్యాపారులకు సూచించారు. షేక్ ఖలీల్, ఖాదర్, సంత కాంట్రాక్టర్ మహ్మద్ వసీం, కౌన్సిలర్లు గుగులోతు నీలాలచ్చిరాం, మెరుగు రాము, భిక్షపతి, ఉపేందర్ ఉన్నారు. -
కాజీపేటను రైల్వే డివిజన్గా చేయాలి
● మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కాజీపేట రూరల్: కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, పోరాడి సాధించుకున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, చిరువ్యాపారులకు సముదాయాలు కట్టించాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట మీడియా పాయింట్లో ఆయన శనివారం మాట్లాడుతూ అనేక అంశాలపై రైల్వే జీఎంను మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, కాజీపేట బీఆర్ఎస్ నాయకులతో కలిసి గత మార్చి 9వ తేదీన కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు గుర్తుచేశారు. కోచ్ఫ్యాక్టరీ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రధాని ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని వినయ్భాస్కర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వేణు, నార్లగిరి రమేష్, కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
యువకుడిపై పోక్సో కేసు నమోదు
మహబూబాబాద్ రూరల్ : బాలిక ను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ కొద్దిరోజుల క్రితం మహబూ బాబాద్ పట్టణానికి రాగా.. నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన డెకరేషన్ పనిచేసే యువకుడు చిలుకబత్తిని రంజిత్ పరిచయం చేసుకున్నాడు. బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకుని వెంట తీసుకెళ్లాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి, అతనిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చిట్యాలలో.. చిట్యాల: ప్రేమ పేరుతో మైనర్ను వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దూత్పల్లి గ్రామానికి చెందిన బాణాల రాకేష్ కొంత కాలంగా ఓ మైనర్ను వేధిస్తూ ప్రేమించాలని వెంటబడుతూ.. బాలికకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిస్తున్నాడు. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని భూపాలపల్లి సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఫేజ్ త్రీలో కొనసాగుతున్న పంపింగ్ ● ఒక మోటారు పంపింగ్ బంద్ కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక మోటారు పంపింగ్ను అధికారులు నిలిపివేశారు. జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉన్నాయి. అందులో ఫేజ్ త్రీలో ఐదు మోటార్లు, ఫేజ్ టూ లో ఒక మోటారుతో కొన్నిరోజులుగా నీటిని నిరంతరం దిగువకు ఎత్తిపోసిన అధికారులు శనివారం ఫేజ్త్రీలో ఒక మోటారు పంపింగ్ను నిలిపివేశారు. దీంతో రెండు ఫేజ్లలో ఐదు మోటార్లతో 1,414 క్యూసెక్కుల నీటి పంపింగ్ దిగువకు కొనసాగుతోంది. కాగా సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 4,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా బ్యారేజీలోని గేట్లను ఎత్తి 2,586 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. -
కృత్రిమ మేధతో వేగంగా సేవలు
హన్మకొండ: కృత్రిమ మేధ వినియోగంతో విద్యుత్ రంగంలో సేవలు వేగంగా అందుతున్నాయని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన ‘ఏ.ఐ హ్యాకథాన్’ పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్ మిట్టల్తోపాటు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పాల్గొన్నారు. సంస్థలోని అన్ని విభాగాలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఏ.ఐ సాంకేతికతతో రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే చేపడుతున్న డిజిటల్ చర్యలు, భవిష్యత్లో అమలు చేయనున్న ఏఐ ఆధారిత పరిష్కారాలను నవీన్ మిట్టల్ సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన సేవలు అందించడమే టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని, కృత్రిమ మేథ అమలు ఆ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గతంలో రోజులు పట్టే పనులు ఇప్పుడు కేవలం నిమిషాల్లో పూర్తవుతున్నాయని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల వినియోగంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఫిర్యాదుల పరిష్కారం కూడా వేగవంతమైందన్నారు. భవిష్యత్లో ఏఐ వినియోగం మరింత విస్తరించి విద్యుత్ రంగాన్ని పూర్తిగా స్మార్ట్గా మార్చుతుందన్నారు. ప్రతి విభాగం తమ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేథను వినియోగిస్తే అధిక ఫలితాలు సాధించవచ్చని సూచించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు అడుగులు వేస్తూ కృత్రిమ మేథ వినియోగం ద్వారా విద్యుత్ రంగంలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకత పెరిగి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఎన్పీడీసీఎల్ ముందుకెళ్తుందన్నారు. అనంతరం ఓగులాపూర్ 400 కేవీ మానవ రహిత సబ్ స్టేషన్ను సందర్శించారు. నిర్వహణ పద్ధతులు, అనుసరిస్తున్న విధానాలు, ఓల్టేజీ స్థాయిలు, తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహన్, సురేందర్, వెంకట రమణ, మాధవ రావు, అన్నపూర్ణ, సీజీఎంలు రవీంద్రనాథ్, కిషన్, జాయింట్ సెక్రెటరీ రమేష్, ట్రాన్స్ కో సీఈ శ్రీరామ్ కుమార్, డీఈ మహేష్ పాల్గొన్నారు. నవీన్ మిట్టల్ -
వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్: వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తు న్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మె ల్యే ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధి దారులకు సబ్సిడీ పై డ్రోన్, బేయిలర్స్ వంటి వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 13 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు, 43 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మక్కలు అమ్మిన 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెల్లడించా రు. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని కాబట్టి రైతులు వ్యవసాయ యాంత్రికరణ దిశగా ముందుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ యాంత్రికరణ ద్వారా పెట్టుబడి తగ్గి రైతుకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులు స్టేషన్ ఘన్పూర్కు మంజూరు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో కడియం శ్రీహరి మార్క్ అభివృద్ధి కనిపించాలన్నదే తన తాపత్రయమని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసుకోవాలని, రాజకీయాలకు అతీ తంగా గ్రామాలను అభివృద్ధి చేసుందామని సర్పంచులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
తొర్రూరు రూరల్: అనుమానంతో భర్త వేధించడాన్ని తట్టుకోలేని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మానుకోట జిల్లా తొర్రూరు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన పనికెర అనూష(22) హరిపిరాల గ్రామానికి చెందిన పులిగుజ్జ సాయి ఆరేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినా వారిరువురు విడిపోకుండా బంధానికి కట్టుబడ్డారు. కానీ, గత కొద్ది కాలంగా సాయి ప్రవర్తనలో మార్పు వచ్చి భార్యను అనుమానిస్తూ వేధించసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగగా భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన అనూష శనివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనూష తండ్రి ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, అనూషకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి హసన్పర్తి: ఈతకోసం నీటిలోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి ప్రాణాలు వదిలాడు. ఈసంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురంలోని కుంటలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మట్టెవాడకు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్(43) చిరు వ్యాపారి. ప్రతీ రోజు ఉదయం ఇంటి నుంచి రెడ్డిపురంలోని కుంటకు ఈతకు వచ్చేవాడు. రోజు మాదిరిగానే శనివారం కూడా ఈతకు వచ్చి నీటిలో మునిగి మృతిచెందాడు. అయితే చెరువులో తేలిఉన్న మృతదేహాన్ని స్థానికులు సాయంత్రం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కల్యాణ్ తెలిపారు. కెనాల్లో పడి .. ఆత్మకూరు: ప్రమాదవశాత్తు కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆత్మకూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామెర మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన పెండ్లి ప్రభాకర్(41) శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం దుర్గంపేట–సీతారాంపురం మధ్యలో కెనాల్లో పడి మృతిచెందిఉండడాన్ని గమనించారు. బహిర్భూమికి వెళ్లి కెనాల్లోకి వెళ్లగా ప్రమాదవశాత్తు మృతిచెందాడని ప్రభాకర్ భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
శనిగరంలో శాతవాహనుల నాటి టెర్రకోట శిల్పం
● 2 వేల ఏళ్ల క్రితం నాటి బౌద్ధ యక్షిణి శిల్పంగా గుర్తింపు కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరంలో శాతవాహనుల కాలం నాటి టెర్రకోట శిల్పం తల లభ్యమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉజ్జేతుల రాజు ఇచ్చిన సమాచారం మేరకు శనిగరం గ్రామ శివారులోని వాగు పరీవాహక ప్రాంతంలో చెక్డ్యాం పక్కన గట్టుమల్లు అనే రైతుకు చెందిన పంట పొలాల్లో శాతవాహనుల కాలం నాటి టెర్రకోట శిల్పం తల (సుమారు 2 వేల ఏళ్ల క్రితం నాటి బౌద్ధ యక్షిణి శిల్పం)ను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం సభ్యుడు దేవరం రమేష్ శర్మ తెలిపారు. ఈ శిల్పం కోటిలింగాల, ధూళికట్ట, చేర్యాల కొండపాకలో లభించిన టెర్రకోట శిల్పాలను పోలి ఉందని, ఇదొక యక్షిణి టెర్రకోట శిల్పమని, నుదుట బొట్టు, రెండు పాయలుగా కట్టిన సిగ, ఆభరణాలతో ఉన్న ఈ శిల్పం తల ఎత్తు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు ఉందని, తల వెనుక భాగం మట్టి పొరలు రాలిపోయి ఉందని వివరించారు. చక్కని పని తనంతో కూడిన ఈ టెర్రకోట శిల్పం శాతవాహనుల కాలం నాటి సాంస్కృతిక చిహ్నమని, తొలి చారిత్రక యుగానికి చెందిన ఈ అపురూప టెర్రకోట శిల్పం చారిత్రకంగా విశేషమైందని తెలిపారు. ఈ శిల్పం దొరికిన పంట పొలాల్లో మట్టి పూసలు, కుండ పెంకులు, టెర్రకోట శిల్పాల అవశేషాలు లభిస్తున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారని, పురావస్తు శాఖ ఇక్కడ మరిన్ని పరిశోధనలు చేస్తే మరిన్ని ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంటుందని రమేష్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రాణాలపై పట్టింపేది..?
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది తమ ప్రాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ విధులు ప్రమాదకరమని తెలిసినా భద్రత కోసం వినియోగించాల్సిన పనిముట్లను వాడకుండా విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్యుత్ మరమ్మతుల సమయంలో విద్యుత్ స్తంభంపై చేరుకున్నప్పుడు విధిగా టెస్టర్తో పరీక్షించాలి. ఎర్త్రాడ్ వాడాలి. చేతికి గ్లౌజ్లు వేసుకోవాలి. తలకు హెల్మెట్ ధరించాలి. అయితే విధుల్లో ఉన్న సిబ్బంది వీటిని వినియోగించడం లేదు. సబ్ స్టేషన్లు, వినియోగదారుల వివరాలు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 1,528 ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 3,51,115 ఉన్నాయి. గృహ వినియోగదారులు 48,23,874, వాణిజ్య, వ్యాపార వినియోగదారులు 6,32,457, ఎల్టీ పరిశ్రమలు 34,156, ఎల్టీ వ్యవసాయ సర్వీస్లు 13,96,285, ఇతరాలు 1,37,036 సర్వీస్లున్నాయి. హెచ్టీ పరిశ్రమలు 3,413, హెచ్టీ కమర్షియల్ 1,151, హెచ్టీ నీటిపారుదల 470, హెచ్టీ ఇతర సర్వీస్లు 268 ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు 5,579 మంది, ఆర్టిజన్లు 3,457, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు 1,382 మంది పని చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే..విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం, సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి.. స్టీల్ నిచ్చెన, హెల్మట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్రాడ్, టెస్టర్ ఉద్యోగులు, సిబ్బందికి పంపిణీ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని రూ.3వేల జరిమానా విధిస్తామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం హెచ్చరించినా.. ఉద్యోగులు, సిబ్బంది వాడడడం లేదు. సెక్షన్ స్థాయి అధికారి అసిస్టెంట్ ఇంజనీర్లు, ఫోర్మెన్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, లైన్ ఇన్స్పెక్టర్లు క్షేత్ర స్థాయి సిబ్బందిచే వాటిని వాడేలా ప్రోత్సహించడంలో, వారిని ఆదేశించడంలో అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విద్యుత్ ప్రమాదాలపై అవగాహన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రతీ సర్కిల్లో డీఈ టెక్నికల్ను సేఫ్టీ ఆఫీసర్గా నియమించి ప్రమాదాలపై విద్యుత్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎల్సీ యాప్ను తీసుకొచ్చి విద్యుత్ లైన్ క్లియరెన్స్ను సులభతరం చేశారు. ఇన్ని సౌకర్యాలు కల్పించినా ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదు. ● ‘మార్చి 30న హనుమకొండ యాదవనగర్ సెక్షన్లో విద్యుత్ బకాయిల వసూళ్లు చేస్తున్న క్రమంలో సర్వీస్ డిస్కనెక్షన్ కోసం అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ నిచ్చేన సాయంతో విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.’ ఇక్కడే ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ కూడా భద్రతా ప్రమాణాలు పాటించడంలో అలసత్వం వహించారు. అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్చే వాటిని ధరింపజేయడంలో విఫలమయ్యారు. భద్రతకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రాధాన్యం సిబ్బందికి భద్రతా ఉపకరణాల పంపిణీ ఉపకరణాల వాడకంలో నిర్లక్ష్యం గాలిలో కలుస్తున్న ప్రాణాలు -
తెలంగాణ హెరిటేజ్ శాఖ, టార్చ్ ఒప్పందం
హన్మకొండ: సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వరంగల్కు చెందిన టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్), రాష్ట్ర హెరిటేజ్ శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శనివారం హైదరాబాద్లోని పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలను నమోదు చేయడం, సంరక్షించడం, పునరుద్ధరించడం, ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ భాగస్వామ్యంతో రెండు సంస్థలు కలిసి వారసత్వ డాక్యుమెంటేషన్, డిజిటల్ రికార్డులు తయారు చేయడం, ఆలయాలు, చారిత్రక కట్టడాల సంరక్షణ, సంప్రదాయ కళలు, జానపదం, స్థానిక జ్ఞానాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ.. పురావస్తు శాఖ, టార్చ్ సంస్థ మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వారసత్వ సంరక్షణ, పరిరక్షణ, వెలుగులోకి రాని వారసత్వ ప్రదేశాల డాక్యుమెంటేషన్ను తమ పరిశోధనలు, పుస్తకాలు, ప్రదర్శనలు, డాక్యుమెంటరీల ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్న టార్చ్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్లో తెలంగాణలోని స్మారక కట్టడాల సంరక్షణలో ఇరు సంస్థలు పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. టార్చ్ సంస్థ సెక్రటరీ అరవింద్ ఆర్య మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కల్పించినందుకు హెరిటేజ్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పురావస్తు శాఖ ప్రాజెక్టుల్లో కూడా తాము పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ పగడం నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్, పురావస్తు శాఖ ఓఎస్డీ రాజు పాల్గొన్నారు. యాదవనగర్ సెక్షన్ ఏఈ లక్ష్మణ్ సస్పెన్షన్హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్, హనుమకొండ టౌన్ డివిజన్లోని యాదవనగర్ సెక్షన్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం.లక్ష్మణ్ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. సాక్షిలో శనివారం ప్రచురితమైన ‘అధికారులపై చర్యలుండవా’అనే కథనంపై సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు.. స్పందించారు. హనుమకొండ సర్కిల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే రిపోర్టు పంపాలని ఎస్ఈ పి.మధుసూదన్ రావును ఆదేశించారు. ఎస్ఈ రిపోర్టు మేరకు ఎం.లక్ష్మణ్పై సస్పెన్షన్ వేటు వేసింది. మార్చి 30న యాదవనగర్లో సెక్షన్లో జరిగిన ప్రమాదంలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ చనిపోయిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు ఆందోళన కూడా చేశారు. ఈ ఘటనలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాదవనగర్ సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్ను ఈ నెల ఒకటిన సస్పెండ్ చేశారు. ఆ రోజు సెక్షన్ ఏఈ లక్ష్మణ్ స్థానికంగా ఉండి భద్రత పరికరాలు లేకుండానే విద్యుత్ స్తంభంపై ఎక్కించినట్లు తేలడంతో యాజమాన్యం తీవ్రమైన బాధ్యతారాహిత్యంగా భావించి అతన్ని సస్పెండ్ చేస్తూ శనివారం హెచ్ఆర్డీ చీఫ్ ఇంజనీర్ ఎం.మాధవరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారసత్వ సంపద పరిరక్షణకు అంగీకారం -
మార్కెట్లోకి ఎక్స్టర్, వెర్నా కార్లు విడుదల
రామన్నపేట: వరంగల్ ములుగు రోడ్డులోని హేమ హ్యూందాయ్ కార్ షోరూంలో ఎక్స్టర్, వెర్నా నూతన కార్లను ఎస్బీఐ ఆర్ఎం అబ్దుల్ రహీం, హెచ్డీఎఫ్సీ మేనేజర్ జి.రమేష్, షోరూం మేనేజింగ్ డైరెక్టర్ యుగంధర్ శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూం ఎండీ యుగంధర్ మాట్లాడుతూ.. న్యూ ఎక్స్టర్ కొత్త బోల్డ్ డిజైన్ స్పోర్టీ లుకింగ్, సేఫ్టీ ఫ్యూచర్లు, సిక్స్ ఎయిర్బ్యాగ్స్, డాస్ కెమెరా వంటి అధునాతన ఫ్యూచర్ల కలిగి ఉందని తెలిపారు. అలాగే వెర్నా ప్రీమియం డిజైన్, పవర్ఫుల్ పర్మామెన్స్, లెవెల్–2 అడాస్, బూట్ స్పేస్, 8 వే డైవర్ సీట్ అడ్జెస్ట్మెంట్ కలిగి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్, పృథ్వీ, మేనేజర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీల అమలులో సర్కారు విఫలం
కాశిబుగ్గ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, తెలంగాణకు చెందిన డబ్బులను ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తరలిస్తున్నారని మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్ ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్రావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తుందన్నారు. తెలంగాణకు సంబంధించిన నిధులను ఎన్నికలు జరుగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులకు రైతు బంధు ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి, ఒక ఎకరానికే పరిమితమయ్యారన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, పెన్షన్ పెంపు అడ్రస్ లేకుండా పోయిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, వ్యక్తిగత చర్చలకే పరిమితం చేశారని ఆరోపించారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ మేయర్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్రావు, వన్నాల శ్రీరాములు, బొడిగె శోభ, ఎడ్ల అశోక్రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, రత్నం సతీష్షా, రంజిత్, తిరుపతిరెడ్డి, వెంకట్గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ డబ్బులు ఎన్నికల రాష్ట్రాలకు తరలింపు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
మామిడికి ముసుగు
సాక్షి, మహబూబాబాద్: ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా మామిడి చెట్లు విరగపూసాయి. చెట్లకు ఆకులు కనిపించకుండా మొత్తం పూతే కనిపిస్తే చెట్టు విరిగిపోయే విధంగా కాపు వస్తుందని రైతులు సంబురపడ్డారు. అయితే వారి సంతోషం ఎంతసేపు నిలువలేదు. మాయదారి మంగు రోగంతో పూత రాలిపోయింది. కాత తేలిపోయింది. ఇటువంటి పరిస్థితిలో కాసిన కాయలు మంచి కలర్ వచ్చి మార్కెట్లో అధిక రేటు పలకాలంటే కవర్లు తొడుగితే ఫలితం ఉంటుందంటున్నారు ఉద్యాన వన శాఖ అధికారులు. గతంలో మంచి ఫలితం మామిడికాయలకు పిందె దశలో కవర్లు తొడుగితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు రైతులు. జిల్లాలో 15 వేల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. ఇందులో పలువురు రైతులు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలోని తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ, గార్ల మొదలైన మండలాల్లో సుమారు 20 మంది రైతులతో ఈ ప్రయోగం చేయించారు. సాధారణ మామిడి పండ్లతో పోలిస్తే కవర్లు కట్టి పెంచిన పండ్లు ఆకర్షనీయమైన రంగు రావడంతో 50శాతం రేటు అధికంగా పెట్టి వినియోగదారులు కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. రసాయనాల ప్రభావం తక్కువ కవర్లు తొడిగి పెంచిన మామిడి పండ్లపై తోటపై పిచికారీ చేసే రసాయనాల ప్రభావం తక్కువగా ఉంటుంది. పండుపై ఈగలు, దోమలు, మంగు వంటి శిలీంధ్రాల ప్రభావం కూడా తక్కువే. కవర్ కాయ తొడిమకు కాకుండా చెట్టు కాండానికి కట్టడంతో వడగండ్ల వాన, గాలి దుమారం వచ్చినా.. కాయ రాలిపోకుండా ఉంటుంది. ఎకరానికి రూ.10వేల ప్రోత్సాహకం కవర్లు కట్టి కాయలను పెంచడం మూలంగా మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం దీనిని ప్రోత్సహించేందుకు పూనుకుంది. ఇందుకోసం ఎకరానికి రూ.10వేల చొప్పున రైతులకు ప్రోత్సాహకం అందిస్తుంది. జిల్లావ్యాప్తంగా 15వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఇందులో ఈ ఏడాది 200 ఎకరాలకు ప్రోత్సాహకం అందించనున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. మామిడికాయలకు కవర్ల తొడుగు ఆకర్షణీయమైన రంగుతో పండ్లు రసాయనాల ప్రభావం తక్కువ వడగళ్ల వాన, గాలి దుమారం నుంచి రక్షణ ఎకరాకు రూ.10వేల ప్రోత్సాహకం -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి సరిత నర్సింహులపేట: ఎరువుల షాపు డీలర్లు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.సరిత హెచ్చరించారు. శనివారం మండలకేంద్రంలోని ఎరువుల షాపులను, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, కోరమాండల్ ఇంటర్నేషనల్ షాపులను ఆకస్మికంగా సందర్శించి స్టాక్ రిజిస్టర్, బిల్లులు, లైసెన్స్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడారు. ఎరువులను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా, బ్లాక్లో అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పారాక్వాట్ మందును నిషేధించామని, ఎరువుల డీలర్లు అమ్మితే చర్యలు తప్పవన్నారు. అనంతరం పామాయిల్, వరి పొలంను పరిశీలించారు. రసాయన ఎరువులను తగ్గించి, పశువుల ఎరువులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్కుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు కలగొద్దు
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్ రూరల్: రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో మొక్కజొన్న కొనుగోళ్లు జరపాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ స్నేహశబరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్దతు ధర కల్పిస్తూ కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.2,400 చెల్లించాలని, రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఈనామ్ విధానం ద్వారా కొనుగోలు చేయాలన్నారు. పెసర్లు, మినుములు, వేరుశనగ, తదితర పంటలవైపు దృష్టిమరల్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కాగా ఎకరానికి వచ్చిన దిగుబడి మొత్తం కొనుగోలు చేసేలా ఆదేశించాలని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుజన్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సరిత, ఏడీఏ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ డీఎం వెంకటేశ్వర్లు, ఏఓ తిరుపతిరెడ్డి, ప్రమోద్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకంగా నిర్వహించాలి మహబూబాబాద్:స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎలక్టోరల్ అఽధికారి సుదర్శన్రెడ్డి సంబంఽధిత ఉన్నతాధికారులతో కలిసి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడారు. వీసీలో కలెక్టర్ స్నేహ శబరీష్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం డ్రగ్స్ నిర్మూలనపై సంబంధిత అధికారులతో సమావేఽశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
మహబూబాబాద్ రూరల్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర కార్యదర్శి ముబిన్ అహ్మద్ డిమాండ్ చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఓపీఎస్ను అమలు చేయకపోతే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాస్, ఉద్యోగులు ఫిరోజ, నాగముని, ఆవునూరి రవి, రఫీక్, కొప్పుల నాగరాజు, రవీందర్, రాంజీనాయక్, బలాష్టి రమేష్, సింగు రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ, న్యాయవాదులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్లుమహబూబాబాద్: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్ ప్రక్రియపై కసరత్తు జరుగుతుందని గత నెల 16వ తేదీన ‘డిప్యుటేషన్లపై కసరత్తు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఈనెల 4న (శని వారం) కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లాలోని 406 మంది పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్ల జాబితా విడుదల చేసినట్లు డీపీఓ హరిప్రసాద్ తెలిపారు. అయితే గైడ్లైన్స్ పాటించకుండా దూరంగా వేశారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం కలెక్టర్ను కలిసి విన్నవించారు. దరఖాస్తుల గడువు పెంపుమహబూబాబాద్ అర్బన్: ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాల గడువు ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు కె. శ్రీనివాస్ శని వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతీయువకులు, నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ హార్డ్ కాపీలను, ధ్రువపత్రాలను పట్టణంలోని వారు మున్సిపాలిటీ కార్యాలయం, గ్రామీణ ప్రాంతంలోని వారు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్ కులముల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తు..మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ టి.రాజేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వారి నుంచి ఇద్దరికి అవకాశం ఉంటుందని, వారిలో ఒకరు మహిళకు అవకాశం ఉంటుందన్నారు. మైనార్టీస్ నుంచి ఇద్దరికి అవకాశం ఉండగా వారిలో ఒకరికి మహిళకు అవకాఽశం ఉంటుందన్నారు. రెండు కేటగిరిలో ఉండగా పరిపాలన ప్రత్యేక పరిజ్ఞానం కేటగిరిలో దరఖాస్తు చేసుకునే వారు ఓటరు జాబితాలో ఓటు ఉండాలని, 21 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతులు, అణగారిన వ ర్గాల అభివృద్ధి, విద్య, వైద్యం, సంక్షేమానికి ఇందిర మ్మ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఓ గార్డెన్లో క ల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చె క్కులు శనివారం పంపిణీ చేసి, సన్నబియ్యం లబ్ధి దారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. మహబూబాబాద్ ని యోజకవర్గంలోని 92 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధిలో భాగంగా ప్రజలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. సన్న బియ్యం పథకం ద్వారా ఏప్రిల్, మే, జూన్, మూడు నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నామన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు జిల్లాలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించి వారి అభ్యున్నతికి కృషి చేయడానికి జిల్లా యంత్రాంగం ముందుంటుందన్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ రమేష్, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, వార్డు కౌన్సిలర్లు, తహసీల్దార్లు చంద్రరాజేశ్వర్ రావు, వివేక్, నాగభవాని, నరేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ సన్నబియ్యం లబ్ధిదారులతో సహపంక్తి భోజనం, చెక్కుల పంపిణీ -
జనగణనకు కసరత్తు
మహబూబాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, ప్రణాళికలు రూపొందించే విషయంలో జనాభా గణాంకాలు కీలకం. ప్రస్తుతం జన గణనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారు. జిల్లాలో 7,74,000 జనాభా 2011 లెక్కల ప్రకారం 7,74,000 జనాభా ఉన్నట్లు సీపీఓ అధికారులు తెలిపారు. మళ్లీ 2021 జన గణన జరగనుండగా కోవిడ్, పలు కారణాలతో గణన ఆసల్యమైనట్లు అఽధికారులు పేర్కొన్నారు. జన గణన విషయంలో గత నెల 15, 16, 17 తేదీల్లో కలెక్టరేట్లో జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారు. జిల్లాలో ఎన్యుమరేటర్లు 1,450 మంది, సూపర్వైజర్లు 252 మంది (మొత్తం 1,702) జన గణనలో పాల్గొననున్నారు. వారికి ఇప్పటికే గణనకు సంబంధించిన బుక్లెట్స్, ఇతర విషయాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. అలాగే కిందిస్థాయి సిబ్బందికి ఈనెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు మండల స్థా యిలో శిక్షణ ఉంటుంది. మే నెలలో ఇళ్ల సర్వే.. ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల సర్వే జరుగుతుంది. 2027 ఫిబ్రవరి, మార్చి నెలలో జన గణన చేస్తారు. 2027 మే నెలలో జిల్లా జనాభా స్పష్టత వస్తుంది. డిజిటల్ విధానంలో.. ఈసారి నూతనంగా డిజిటల్ విధానంలో జనగణన జరగనుంది. మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమో దు చేస్తారు. అయితే జనగణన విధులు నిర్వర్తించే వారికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారు. డిజిటల్ విధానంలో సర్వే మరింత వేగవంతం కానుంది. నిబంధనల మేరకు జనగణన.. జనగణన శాఖ నుంచి వచ్చిన నిబంధనల మేరకు జన గణన ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశాం. జనగణనకు ప్రజలు సహకరించాలి. – అశోక్, జిల్లా ఉపగణాంక అధికారి జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి ఎన్యుమరేటర్లు 1,450, సూపర్ వైజర్లు 252 మంది.. జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 7,74,000 మంది జనాభా ఈసారి డిజిటల్ విధానంలో సర్వే -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలి
మరిపెడ రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బాలికలకు ఉచితంగా పంపిణీ చేసే హెచ్పీవీ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వర్రావు అన్నారు. శనివారం మరిపెడ మండలకేంద్రంలోని పీహెచ్సీలో వారం రోజులుగా నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ కౌన్సిలర్ మేరుగు రాముతో కలిసి పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ మహిళల్లో వచ్చే గర్భాశయ కేన్సర్ నివారించడంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. 14–15 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సినేషన్ పంపిణీ అందేల వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుగులోతు రవి, డాక్టర్ పూజిత, పీహెచ్ఎన్ఓ మంగమ్మ, స్టాఫ్ నర్సు పద్మ, చైతన్య, రత్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వర్రావు -
కేయూ దూరవిద్య సీఎల్ఐఎస్సీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య సీడీఓఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మెషన్ సైన్స్ సీఎల్ఐఎస్సీ రెగ్యులర్ అండ్ ఎక్స్ అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఈనెల 15, 17, 20, 22, 24 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరగుతాయని వారు తెలిపారు. బీఎల్ఐఎస్సీ పరీక్షలు... కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ /ఎస్డీఎల్సీఈ) బీఎల్ఐఎస్సీ ఇయర్వైజ్ ఎక్స్ అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఈనెల 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనగామ టు నేపాల్ ● ద్విచక్రవాహనంపై 5,300 కిలో మీటర్లు ప్రయాణించిన యువకుడు జనగామ రూరల్: జనగామ పట్టణానికి చెందిన మోర్తాల దీపక్ జనగామ నుంచి నేపాల్ హిమాలయాల వరకు 5,300 కిలోమీటర్లు అంతర్జాతీయ బైక్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. నేపాల్లోని అత్యంత ఎత్తయిన మార్గాలు 13,100 అడుగుల ఎత్తులో ఉన్న అప్పర్ ముస్తాంగ్, లోయర్ ముస్తాంగ్ వంటి హై అల్టిట్యూడ్ ప్రాంతాలను విజయవంతంగా చేరుకున్నాడు. ఇన్నర్ లైన్ బైక్ పర్మిట్ తీసుకుని ఈ ప్రత్యేక ప్రాంతాలను సందర్శించడంతోపాటు నేపాల్ రాజధాని ఖట్మాండ్ను సందర్శించాడు. విద్యుదాఘాతంతో మహిళ మృతి నడికూడ: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సనుగోజు వనమాల(46) తనకున్న పిండిగిర్నిని స్టార్ట్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పడిపోయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, 108 సిబ్బంది పైలట్ రాము, ఈఎన్టీ స తీష్ ఘ టనా స్థలానికి చేరుకుని వనమాలను పరీక్షి ంచి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. తాడిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి బచ్చన్నపేట: ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల సత్యనారాయణ (57) రోజూ మాదిరిగానే తాటి కల్లు తీసేందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు తాడి చెట్లు వద్దకు వెళ్లి పరిశీలించగా.. తాడి చెట్టు కింద చనిపోయి పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
వంట నూనె.. ధరల మంట
లీటర్ ఆయిల్ ధరలు(రూ.లలో) ఇలా.. నూనె నెల క్రితం ప్రస్తుతం సన్ ఫ్లవర్ 150 175–180 వేరుశనగ 155 180–185 పామాయిల్ 130 150–155తొర్రూరు: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర పెరిగి అందుబాటులో లేకుండా పోగా.. తాజాగా వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వంట నూనె సలసల కాగుతోంది. యుద్ధం సాకుగా చూపి కొందరు వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో వాటి ధరలు అమాంతం పెంచేశారు. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా కిలో ధర 22 శాతం పెరిగింది. గత నెల 10న పొద్దుతిరుగుడు వంట నూనె లీటర్ ప్యాకెట్ రూ.140 నుంచి రూ.145 ఉండేది. 15 కిలోల డబ్బా రూ.2,200 వరకు విక్రయించేవారు. యుద్ధం ప్రారంభమైన రెండో వారం నుంచి లీటర్ ప్యాకెట్ ధర రూ.180కు చేరింది. 15 కిలోల డబ్బా రూ.2,700 నుంచి రూ.2,00కు పెరిగింది. పామాయిల్ లీటర్ ప్యాకెట్ రూ.130 నుంచి రూ.155కు ఎగబాకింది. జిల్లాలో రోజు ఆరు వేల లీటర్ల వంట నూనె అమ్మకాలు జరగుతాయి. పెంచి అమ్ముతున్న ధరల వల్ల వినియోగదారులపై రోజుకు రూ.70 వేలు అదనంగా భారం పడుతోంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మరో రూ.2అదనంగా వసూలు చేస్తున్నారు. చౌక దుకాణాల ద్వారా గతంలో రాయితీపై పామాయిల్ అందించేవారు. ప్రభుత్వం నూనె అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యథేచ్ఛగా కల్తీ... ధరలు పెరగడంతో కల్తీ పెత్తనం చేస్తోంది. హోటళ్లు, బజ్జీ కొట్ల వారు తక్కువ ధరకు దొరికే కల్తీ నూనెను కొనుగోలు చేస్తున్నారు. పామాయిల్ నూనెను హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, బజ్జీ కొట్ల నిర్వాహకులతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా వాడతాయి. మొక్కుబడిగా నియంత్రణ కమిటీలు.. నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించినా, అధిక ధరలకు అమ్మినా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఉన్న నియంత్రణ కమిటీలు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ మొక్కుబడిగా మారాయి. అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. హోల్సేల్ వ్యాపారాలు, పెద్ద దుకాణాలను తనిఖీ చేస్తే ఎక్కువ ధరలకు అమ్మకుండా నియంత్రణలో ఉంటారు. ఇతర వస్తువులపై ప్రభావం పడకముందే యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. కిలోకు రూ.20 నుంచి రూ.30వరకు పెరుగుదల సామాన్యులపై అదనపు భారం మార్కెట్లో యథేచ్ఛగా కల్తీ నూనెలు పట్టింపులేని అధికారులునూనె కొనడం భారంగా మారింది నెల రోజుల్లో రూ.20 నుంచి రూ.30 వరకు నూనె ధరలు పెరగడంతో కొనడం కష్టంగా ఉంది. ఇలా ధరలు పెరిగితే మాలాంటి పేదలు ఎలా కొనుగోలు చేస్తారు? ప్రభుత్వం ఆలోచన చేసి ధరలు తగ్గించాలి. –బాద నాగమణి, గృహిణిధరలు నియంత్రించాలి వంట నూనెల ధరలు తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నియంత్రించే యంత్రాంగం ఉన్నా వ్యాపారులు ఇష్టారీతిన పెంచుతున్నారు. వంట నూనెల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి. –మధుకర్రావు, వెలికట్ట -
మానవాళి రక్షణకు యేసుక్రీస్తు ప్రాణత్యాగం
● సంగాల పాల్సన్ రాజ్ ధర్మసాగర్: ప్రపంచ మానవాళి రక్షణకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణత్యాగం చేశారని క్రీస్తుజ్యోతి మినిస్ట్రీస్ కరుణాపురం ఫౌండర్, ప్రవక్త, రెవ.సంగాల పాల్సన్ రాజ్ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని క్రీస్తుజ్యోతి మందిరంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సొసైటీ ఆఫ్ క్రైస్ట్ జనరల్ సెక్రటరీ రెవ.డాక్టర్ జయప్రకాశ్ గోపు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్సన్ రాజ్ మాట్లాడారు. యేసుక్రీస్తు సిలువ త్యాగం గొప్పదన్నారు. సిలువపై మరణించిన రోజు గంభీరమైన, నిరుపమానమైన ప్రేమకు నిదర్శనమని అన్నారు. సిలువలో యేసుక్రీస్తు పలికిన మొదటి మాటలో క్షమాపణ, రెండో మాట రక్షణ, మూడో మాట సంబంధం, నాల్గవ మాట వేదన, ఐదో మాట శరీర శ్రమ, ఆరవ మాట విజయం, ఏడో మాట సమర్పణ అని ఈ ఏడు మాటలు మానవాళి మార్గదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రదర్స్ పౌల్, ప్రదీప్, సందీప్, సత్యం, వినయ్, బెంజమిన్, యోసోఫ్ లు ఏడు మాటలపై వివరించారు. వేలాది భక్తులు పాల్గొన్నారు. -
లాభదాయకం.. కౌజు పిట్టల పెంపకం
● వ్యవసాయానికి అనుబంధంగా అనువైన పరిశ్రమ ● లాభాలు గడిస్తున్న రైతు దుగ్గొండి: మాంసాహార ప్రియులు కొత్త రుచులు ఆస్వాదిస్తున్నారు.. ఈక్రమంలో మటన్, చికెన్, చేపల స్థానంలో కౌజు పిట్టలు చేరుతున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజు పిట్టల మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇదే కోవలో అభ్యుదయ రైతులు వ్యవయానికి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్నారు. నేటి పరిస్థితులలో దినదినాభివృద్ధి చెందుతున్న చిన్నతరహా పరిశ్రమ కౌజు పిట్టల పెంపకం. వీటిని క్వయిల్ పక్షులని, జపనీస్ పక్షులని పిలుస్తారు. బాయిలర్ కోళ్లతో పోలిస్తే ఒక కోడిని పెంచే స్థలంలో 8నుంచి 10 పక్షులను పెంచవచ్చు. 4 వారాలు పెంచితే ఒక్కో పక్షి 150 నుంచి 180 గ్రాములకు బరువు తూగుతుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బీరం శ్రీనివాసరెడ్డి తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అనుబంధంగా ఇంటి వద్ద ఉన్న కొద్దిపాటి స్థలంలో కౌజు పిట్టలను పెంచుతున్నాడు. రూ.50 వేలు ఖర్చు చేసి షెడ్డు నిర్మించుకుని 800 కౌజు పిట్టలను పెంచుతున్నాడు. సాధారణ బాయిలర్ కోళ్లకు అందించే దానానే ఈ పిట్లలకు సైతం ఉపయోగిస్తున్నాడు. 40 రోజుల పెంపకం పూర్తి కాగానే జత పిట్టలను రూ.120కి విక్రయిస్తున్నాడు. ఒక్కో పిట్టను పెంచడానికి సుమారు రూ.30 ఖర్చు చేస్తున్నాడు. రెండు పిట్టలకు రూ.60 ఖర్చు పోగా రూ.60 లాభం పొందుతున్నాడు. 40 రోజుల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదిస్తున్నాడు. స్వయంగా ఇంక్యూబేటర్ల తయారీ కౌజు పిట్టలతోపాటు 100 నాటు కోళ్లను పెంచుతున్నాడు.. రైతు శ్రీనివాసరెడ్డి. కౌజు పిట్టల నుంచి సేకరించిన గుడ్లను ఇంక్యూబేటర్లో ఉంచి పిల్ల లను ఉత్పత్తి చేస్తున్నాడు. తనకు అవసరం ఉన్న పిల్లలను ఉంచుకుని మిగిలిన పిల్లలను ఒక్కో పి ల్లకు రూ.10 చొప్పున విక్రయిస్తూ లబ్ధిపొందుతున్నా డు. ఇందుకు గాను తానే స్వయంగా అతి తక్కువ ఖర్చుతో ఇంక్యూబేటర్ తయారు చేసుకున్నాడు. థర్మాకోల్ షీట్లు, రెండు విద్యుత్ బల్బులు, వేడిని కొలిచే యంత్రాలతో రూ.3 వేలు మాత్రమే ఖర్చు చేసి ఇంక్యూబేటర్ తయారు చేశాడు. ఇలా 8 ఇంక్యూబేటర్లు స్వయంగా తయారు చేసుకున్నాడు. కౌజు గుడ్లనుంచి రోజుకు 80 పిల్లలను ఉత్పిత్తి చేస్తున్నాడు. 18 రోజుల్లో గుడ్లనుంచి పిల్లలు ఉత్పత్తి అ వుతున్నాయి. ఇక నాటు కోడి గుడ్ల నుంచి 21 రోజు లకు పిల్లలు ఉత్పత్తి అవుతున్నాయి. నాటు కోడి పి ల్లలను ఒక్కోటి రూ.35 చిప్పున విక్రయించి అదన పు ఆదాయం గడిస్తున్నాడు. ఇలా వ్యవసాయానికి అనుబంధంగా శ్రీనివాసరెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగికి స రి సమానంగా నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కుటీర పరిశ్రమలతో లాభాలు..ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా లేదు. అలా అని వ్యవసాయాన్ని వదిలే పరిస్థితి లేదు. కావున వ్యవసాయానికి అనుబంధంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలతో లాభాలు పొందవచ్చు. నేను కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకాన్ని గత నాలుగేళ్లుగా కొనసాగిస్తున్నాను. వ్యవసాయంలో యాసంగిలో మాత్రమే మొక్కజొన్న వేస్తున్నాను. నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నాను. యువత మార్కెట్లో డిమాండ్ ఉన్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలవైపు వస్తే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. – బీరం శ్రీనివాసరెడ్డి, తిమ్మంపేట -
ఆన్లైన్ మూల్యాంకనం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలను ఇక నుంచి ఆన్లైన్లోనే వాల్యుయేషన్ చేయనున్నారు. జవాబు పత్రాలను స్కానింగ్ చేసి ఆన్లైన్లో వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టే పనులను ఓ సంస్థకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల జవాబుపత్రాల వాల్యుయేషన్ను ఇప్పటికే ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. కేయూ పరిధిలో త్వరలో నిర్వహించబోయే డిగ్రీ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు, అలాగే మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలను ఇక ఆన్లైన్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టాలని పరీక్షల విభాగం అధికారులు నిర్ణయించారు. ఈనెల 20నుంచి ఆయా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఎక్కడినుంచినైనా వాల్యుయేషన్.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగానికి వచ్చి డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలు వాల్యుయేషన్ చేసేవారు. అయితే దూరప్రాంతాల నుంచి ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి అధ్యాపకులు రావడంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే ఎక్కువగా మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. మూల్యాంకనంలో పాల్గొన్నవారికి ఒక బుక్లెట్కు కొంత రెమ్యూనరేషనల్ చొప్పున చెల్లించడంతోపాటు టీఏ, డీఏ చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఏ జిల్లాకు చెందిన అధ్యాపకులైనా ఎక్కడ నుంచైనా కంప్యూటర్ ద్వారా వాల్యుయేషన్ చేయొచ్చు. పరీక్షల విభాగం నుంచి సబ్జెక్టులవారీగా జవాబుపత్రాలను స్కాన్ చేసి సంబంధిత వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఎగ్జామినర్లుకు పాస్వర్డ్ను అందజేస్తారు. ఓటీపీతో నిబంధనల ప్రకారం ఎన్ని పేపర్లు అందుబాటులో ఉంచాలో అన్ని పేపర్లు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. తద్వారా ఎగ్జామినర్లు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశం నుంచే వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వాల్యుయేషన్ ఎలా కొనసాగుతుందో సబ్జెక్టులవారీగా నియామకమయ్యే చీఫ్ ఎగ్జామినర్లు ఆన్లైన్లోనే పర్యవేక్షిస్తారు. అన్ని పేజీలు చూస్తేనే సబ్మిట్ ప్రతీ సబ్జెక్టు బుక్ లెట్ 28 పేజీల వరకు కూడా ఉంటుంది. ఎగ్జామినర్ అన్ని పేజీలను చూసి మార్కులు వేస్తేనే సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఒక పేజీ చూడకున్నా సబ్మిట్ కాదు. 3 నిమిషాల సమ యం గడిస్తే సబ్మిట్కు అవకాశం ఉంటుంది. మాన్యువల్ పద్ధతిలో ఒక ఎగ్జామినర్ వాల్యుయేషన్ చేసిన జవాబుపత్రాల్లో ఒకటి రెండు పేపర్లు సీఈ పరిశీలిస్తారు. ఇదే విధానం ఆన్లైన్లో కూడా కొనసాగించనున్నట్లు తెలిసింది. ఎగ్జామినర్లు తప్పులు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థికి వచ్చిన మొత్తం మార్కులు ఆన్లైన్లోనే అప్లోడు చేస్తారు. ఎగ్జామినర్లు వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతం నుంచి వాల్యుయేషన్ చేస్తుండడంతో ఇక టీఏ, డీఏలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ సంస్థకు స్కానింగ్ ప్రక్రియ అప్పగింత ఎక్కడినుంచైనా వాల్యుయేషన్కు అవకాశం ఈనెల 6 నుంచి అవగాహన సమావేశాలు జవాబుపత్రాల వాల్యుయేషన్లో అవకతవకలకు చోటులేకుండా ఉండేందుకు ఎగ్జామినర్ వినియోగించే కంప్యూటర్ లేదా ల్యాప్ట్యాప్కు వెబ్ కెమెరాను అమర్చుకోవాలనే నిబంధనలు విధించారు. తద్వారా ఎగ్జామినర్ కాకుండా ఇతరులు వాల్యుయేషన్ చేసే అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అయితే ఎగ్జామినర్లు వెబ్ కెమెరా ఏర్పాటుకు అంగీకరిస్తారా.. లేదా అనేది వేచిచూడాలి. అధ్యాపకులకు అవగాహన సమావేశాలు కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, ఎగ్జామినర్లకు ఆన్లైన్ వాల్యుయేషన్పై అవగాహన కల్పించేందుకు ఈనెల 6నుంచి 10వ తేదీ వరకు పరీక్షల విభాగం అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. సంబంధిత జవాబు పత్రాలు స్కాన్చేసే సంస్థతోపాటు ఎక్స్పర్ట్స్ ఎలా వాల్యుయేషన్ చేయాలో నిబంధనలను ఎగ్జామినర్లకు వివరించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈ నెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాశాలల అధ్యాపకులకు ఖమ్మం పీజీ కళాశాలలో, ఈనెల 7న ఉమ్మడి వరంగల్ జిల్లా కళాశాలల అధ్యాపకులకు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో, 8న మంచిర్యాల, 10న నిర్మల్, ఆదిలాబాద్ కేంద్రాల్లో అధ్యాపకులకు అవగాహన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇప్పటికే అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ పరీక్షల విభాగం అధికారులు లేఖలను పంపారు. అంతేగాకుండా ప్రతి కళాశాలనుంచి సబ్జెక్టులవారీగా అధ్యాపకుల వివరాలను పరీక్షల విభాగానికి పంపాలని కోరినట్లు సమాచారం. నూతన విధానంలో కేయూ డిగ్రీ జవాబుపత్రాల వాల్యుయేషన్ -
సత్యమార్గంలో నడవాలి
మహబూబాబాద్ రూరల్: ప్రజల రక్షణ కోసం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారని, క్రీస్తు చూపిన సత్యమార్గంలో నడవాలని వరంగల్ మేత్రాసనం పాలనాధికారి ఫాదర్ డి.విజయ్పాల్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్లోని ఫాతిమమాత దేవాలయం ఆధ్వర్యంలో గుడ్ఫ్రైడేను పురస్కరించుకుని పరిశుద్ధ మహా సిలువ యాత్ర కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫాదర్ డి.విజయ్పాల్రెడ్డి హాజరై ప్రసంగించారు. పవిత్ర శుక్రవారం యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజుగా జరుపుకుంటామన్నారు. సిలువ నుంచి కారిన రక్తంతో ప్రజల పాపాలన్నీ కడిగివేయబడ్డాయని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. మొదటగా ఫాతిమా కమ్యూనిటీ హాల్ను ఫాదర్ దుగ్గింపుడి విజయ్ పాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఫాతిమామాత దేవాలయ విచారణ గురువు ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, శనిగపురం ఏసుగుట్ట గురువులు ఫాదర్ పాల్ రాజ్, ఫాదర్ పీటర్, ఫాదర్ జోసెఫ్, ఫాదర్ క్రీస్తు, కేసముద్రం చర్చి విచారణ గురువు ఫాదర్ శ్రావణ్, క్రీస్తు ఆరాధకులు పాల్గొన్నారు. వరంగల్ మేత్రాసనం పాలనాధికారి విజయ్పాల్రెడ్డి -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన సత్యరంజన్ బారెల్, దీప్తి మాయిస్వైన్లకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మనీషానెహ్రా వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా సత్యరంజన్, దీప్తి ఇద్దరు ఐదు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకుని తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 46.4 కిలోల గంజాయి లభించగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి ముంబైలోని దాదర్కి రైలులో తరలించి విక్రయించేందుకు వెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. నిందితుల వద్ద గంజాయితోపాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.2,690, రైలు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ట్రెయినీ ఐపీఎస్ తెలిపారు. సమావేశంలో సీఐ వేణు, ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
బండికి.. దండిగా!
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఓరుగల్లు రైల్వేకు నిధుల వరద దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి ● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్, అధికారులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలినెల్లికుదురు: గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరిపై ఉందని ఎస్పీ శబరీష్ అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మన గ్రామం–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో అందించిన హెల్మెట్లను ఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు హెల్మెట్ కొనుగోలు చేయడమే కాదు.. వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గ్రామస్తులంతా ఏకతాటిపై ఉంటూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేసుకోవాలన్నారు. గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు శ్రమించాలన్నారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్ బాబు, సర్పంచ్ బండి శ్రీనివాస్ ఉన్నారు. పీఆర్ ఈఈ విద్యాసాగర్ సరెండర్ మహబూబాబాద్: పంచాయతీరాజ్ శాఖ ఈఈ విద్యాసాగర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ పీఆర్ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేశారు. వెంటనే ఆ కార్యాలయంలో పని చేస్తున్న డీఈ టెక్నికల్ ఆదిత్యరాజ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ నిధులు రూ.49 కోట్లు కేటాయించగా మార్చి 31వరకు అందులో రూ 4.50 కోట్లు మిగలడంతో కలెక్టర్ ఈఈని సరెండర్ చేసినట్లు సమాచారం. జనాభా గణాంకాలు కీలకం మహబూబాబాద్: ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణాంకాలు కీలకమని జనాభా లెక్కల శాఖ డైరెక్టర్ భారతి హోలికేరి అన్నారు. కలెక్టరేట్లో మాస్టర్ శిక్షణ అధికారులకు జనాభా గణనపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి జనాభా గణన చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: దక్షిణ మధ్య రైల్వే పరిధి ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించారు. 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్లు), సర్వేలు, నిర్మాణంలో ఉన్న మూడో లైన్ పూర్తి, స్టేషన్ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కేటాయింపులతో కూడిన పింక్బుక్ శుక్రవారం విడుదల కాగా, అధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు.. భారీగా నిధులు ఉమ్మడి వరంగల్ మీదుగా వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిధుల కేటాయింపు జరిగింది. కొత్త లైన్లు, డబ్లింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ● కాజీపేట–విజయవాడ మధ్య 219.64 కి.మీ.పొడవైన మూడో లైన్, విద్యుద్దీకరణ పనుల కోసం రూ.1,955.27 కోట్లు మంజూరు చేశారు. ● కాజీపేట–బల్లార్షా వరకు 201.04 కి.మీ. పొడవైన మూడో లైన్ పనులకు రూ.2,063.03 కోట్లు ఇచ్చారు. ● నష్కల్ (పెండ్యాల) – హసన్పర్తి నడుమ 24.55 కి.మీ. బైపాస్ లైన్ నిర్మాణానికి రూ.465.29 కోట్లు మంజూరయ్యాయి. ● భద్రాచలం రోడ్ – డోర్నకల్ వరకు 54.65 కి.మీ సెక్షన్ పనుల కోసం రూ.770.12 కోట్లు కేటాయించారు. ● కాజీపేట – బల్లార్షా మెయిన్ లైన్ను పెద్దపల్లి–కరీంనగర్ లైన్తో అనుసంధానించే 2.169 కి.మీ. బైపాస్ లైన్ కోసం రూ.36.99 కోట్లు కేటాయించారు. ● ఘన్పూర్–సూర్యాపేట (పాలకుర్తి మీదుగా) 170 కి.మీ. కొత్త లైన్ సర్వేకు నిధులిచ్చారు. ● బీజాపూర్–వరంగల్కు 288 కి.మీ.ల కొత్త లైన్ కోసం సర్వేకు కూడా అనుమతి ఇచ్చారు. ● క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల) సర్వేలకు కూడా నిధులు ఇచ్చారు. రైల్వేస్టేషన్లకు ‘అమృత్ భారత్’ హంగులు ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా.. వరంగల్ స్టేషన్ తూర్పు వైపు ఎంట్రీ అభివృద్ధి, బుకింగ్ ఏరియా, కాన్ కోర్స్ మెరుగుదల కోసం రూ.4.50 కోట్లిచ్చారు. వరంగల్ స్టేషన్లో 12 మీటర్ల వెడల్పు గల కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) కోసం రూ. 13.24 కోట్లు, కాజీపేట స్టేషన్ ఆధునికీకరణకు రూ.18.73 కోట్లు (జనగామ, యాదాద్రితో కలిపి) కేటాయించారు. కాజీపేటలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీ కోసం రూ.9.78 కోట్లు, ప్లాట్ఫామ్ 4–5 వరకు ఎఫ్ఓబీ విస్తరణ, లిఫ్టులు, ఎస్కలేటర్ల కోసం రూ.13.93 కోట్లు మంజూరు చేసినట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. మహబూబాబాద్ – జనగామ స్టేషన్లలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీలు, ర్యాంప్ల నిర్మాణం కోసం రూ.44.34 కోట్లు, జనగామ గూడ్స్ షెడ్ సౌకర్యాల మెరుగుదలకు రూ. 6.24 కోట్లు ఇచ్చారు. అలాగే భద్రత పనుల కింద వరంగల్ – చింతలపల్లి లెవల్ క్రాసింగ్ 63 ఏ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25.58 కోట్లు, కాజీపేట – వరంగల్ ఎల్సీ 61 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కోసం రూ. 24.65 కోట్లు, రఘునాథపల్లి – ఇప్పగూడ ఎల్సీ 44 వద్ద 2–లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, సబ్వే కోసం రూ.12.83 కోట్లు, డోర్నకల్ – మణుగూరు మార్గంలో కారేపల్లి – సింగరేణి కొలీరీస్ మధ్య వివిధ లెవల్ క్రాసింగ్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. నీళ్లు లేక ఎండిపోతున్న వరిపొలాన్ని పరిశీలిస్తున్న అధికారులు, రైతులుగార్ల సమీపంలో అడుగంటిన పాకాల ఏరుగార్ల: పాకాల ఏరు అడుగంటింది. నీళ్లు లేక బండలు తేలి ఎండిపోయి కనిపిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతంలో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. కాగా పాకాల ఏటిలోకి ఎస్సారెస్పీ లేదా నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు జలాలను వదిలి తమ పంటలను కాపాడాలని గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల రైతులు కోరుతున్నారు. డిసెంబర్లో సమృద్ధిగా నీరు.. డిసెంబర్లో పాకాల ఏటిలో నీరు సమృద్ధిగా ఉండడంతో గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల పరిధిలోని పరీవాహక ప్రాంత ఆయకట్టు రైతులు 2వేల ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుంది. ఈక్రమంలో పాకాల ఏటిలో నీళ్లు అడుగంటిపోవడంతో రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వరిపంట సాగు చేశామని, పైరు ఎండిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ లేదా నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు నీటినైనా పాకాల ఏటిలోకి వదిలిపెట్టాలని కోరుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత జిల్లా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీటిని పాకాల ఏటికి మళ్లించేలా చర్యలు చేపట్టి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.పాకాల ఏరు ఎండిపోతోంది.. పాకాల ఏటి పరీవాహక ప్రాంతంలో నాకున్న 6 ఎకరాల్లో వరిపంట సాగు చేశాను. ప్రస్తుతం ఏటిలో నీళ్లులేక ఎండిపోయే దశకు చేరింది. జిల్లా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీళ్లు పాకాల ఏటిలోకి విడుదల చేయాలి. లేకపోతే వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. – పి.సంజీవరెడ్డి, రైతు, గార్ల వరి పంటలను కాపాడాలి..గార్ల సమీపంలోని పాకాల ఏరు నీరు లేక అడుగంటి పోయింది. నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు నీటిని విడుదల చేసి ఈ ప్రాంతంలో సాగుచేసిన వరిపంటలను కాపాడేందుకు జిల్లా ఇరిగేషన్ అధికారులు స్పందించాలి. – ఏనుగంటి మల్లేశం, రైతు, గార్లలైన్ కి.మీ నిధులు భూపాలపల్లి–కాజీపేట (హసన్పర్తి) 64 1.60 హసన్పర్తి–కరీంనగర్ 62 1.55 డోర్నకల్–గద్వాల (సూర్యాపేట, నల్లగొండ మీదుగా) 296 7.40 కాజీపేట–సికింద్రాబాద్ 120 2.40 కాజీపేట–విజయవాడ 220 4.40 కాజీపేట–బల్లార్షా 234 4.68 వరంగల్–సికింద్రాబాద్ 38 0.75 కాజీపేట–విజయవాడ మూడో లైన్కు రూ.1,955 కోట్లు కాజీపేట–బల్లార్షాకు రూ.2,063 కోట్లు నష్కల్–హసన్పర్తికి రూ.465.29 కోట్లు క్వాడ్రప్లింగ్, కొత్త రైల్వే సర్వేల కోసం కేటాయింపులు కాజీపేట జంక్షన్ నుంచే పలు మార్గాలు పీఓహెచ్కు రూ.521.36 కోట్లు.. ‘అమృత్ భారత్’ కింద స్టేషన్లకు కొత్త హంగులు 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్బుక్)లో భారీగా నిధులు నీరులేక బండలు తేలిన పాకాల ఏరు వరి పంటలకు అందని నీరు ఆందోళన చెందుతున్న రైతాంగం ఎస్సారెస్పీ లేదా పాకాల చెరువు జలాలు వదలాలని విజ్ఞప్తి -
కాజీపేట పీఓహెచ్కు రూ.521 కోట్లు
రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో కాజీపేటను కీలక మెయింటెనెన్స్ హబ్గా మార్చేందుకు పెద్దపీట వేశారు. కాజీపేట పీరియాడికల్ ఓవరాలింగ్ (పీఓహెచ్) వర్క్ షాప్ కోసం రూ. 521.36 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేటలో 24–కోచ్ల నిడివి గల క్యాంటెక్ డిజైన్ పిట్ లైన్ల కోసం రూ.17.81 కోట్లు ఇచ్చారు. కాజీపేట డీజిల్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (ఎలక్ట్రిక్ లోకోలను ఉంచేందుకు) కోసం రూ.30.95 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (125 నుంచి 175 లోకోలకు) రూ. 21.68 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ (175 నుంచి 300 లోకోలకు)కు రూ. 22.56 కోట్లు చొప్పున కేటాయించారు. -
తల్లీ కూతుళ్ల మృతిపై భిన్నకోణాల్లో దర్యాప్తు
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు శివారు స్విమ్మింగ్ పూల్లో పడి తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం అబార్షన్కు ఒప్పుకోకపోవడంతోనే భర్త అజారుద్దీన్ హత్యకు పాల్పడి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా చిత్రీకరించాడా.. లేదా.. మరేదైనా హత్యకు దారితీశాయా అనే కోణంలో కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ భార్యతోపాటు తమ్ముడి భార్య కూడా ఇటీవల గర్భవతి కాగా వారికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు సమాచారం. అయితే అజారుద్దీన్ భార్యకు ఆడపిల్ల, తమ్ముడి భార్యకు మగ పిల్లాడుగా తెలియడంతో అదే రోజు కుటుంబంలో చర్చ జరిగిందని, అక్కడే అజారుద్దీన్ భార్యకు గర్భం తొలగించాలని పట్టుపట్టి చివరికి ఆమె వినకపోవడంతో ప్లాన్ ప్రకారం హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు. అసలు గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ వీరికి ఎలా తెలుస్తోంది.. ఇంతకుముందు రెండుసార్లు ఎక్కడ అబార్షన్ చేయించారు. సహకరించేది ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు భార్య, కూతుర్లను అజారుద్దీన్ ఏవిధంగా హతమార్చి ఉంటాడో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. నిందితుడితోపాటు ఆయన తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుండగా మరి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పాపం.. పసి పిల్లలు తల్లి, కూతుర్ల మృతిలో ముక్కుపచ్చలారని పసి పిల్లలు చేసిన తప్పేంటని అభం శుభం తెలియని పసి పిల్లలు బలయ్యారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో స్థితి మంతమైన కుటుంబం కావడంతో పసి పిల్లల సంరక్షణకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవని, చలాకీగా ఉండే అమాయక పసిపిల్లలు మృతిచెందారనే అంశం అటు వారు చదివే పాఠశాలలోనూ. ఇటు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేరేపించిన అంశాలపై పోలీసుల ఆరా -
మాజీ మావోలు బూర్జువా పార్టీలతో కలవొద్దు
న్యూశాయంపేట: ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులు బూర్జువా పార్టీలతో కలవొద్దని, వారంతా వామపక్ష ఉద్యమంలో భాగం కావాలని సీపీఐ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే.నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండకు వచ్చిన ఆయన బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 40 ఏళ్ల పాటు వారి జీవితాలను త్యాగం చేశారని అలాంటి వారికి సరైన స్వేచ్ఛ, గౌరవాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. గౌరవంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఉండటానికి సీపీఐ వారికి అండగా ఉంటుందని చెప్పారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలవాలని మొదట కోరింది తమ పార్టీనే అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో హిడ్మాలాంటి నక్సలైట్లను వందల మందిని ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయిందని ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్షా కమ్యూనిస్టులు, మావోయిస్టులపై తన అక్కసును వెల్లగక్కారాని అన్నారు. గద్దర్ను నక్సలైట్ అన్నారని, అదే గద్దర్ చనిపోతే ప్రధాని మోదీ సంతాప లేఖను పంపారని గుర్తుచేశారు. కేంద్రం చేపట్టిన ఎస్ఐఆర్ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇటీవల క్రిష్టియన్ మతంతో చేరితే ఎస్సీ కులం హోదా రద్దు అవుతుందని వచ్చిన తీర్పు సరికాదని, ఏ మతంలో చేరినా మనిషి కులం ఎన్నటికీ మారదన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై క్రమంగా అసంతృప్తి పెరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు, కే.భిక్షపతి, కరుణాకర్, లింగారెడ్డి, వెంకట్రాజం, జ్యోతి, స్టాలిన్, టీ.భిక్షపతి, భిక్షపతి, రాజమౌళి, శ్రీనివాస్, రవి, సాదానందం పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ -
ఇంటి స్థలం పంపకాల్లో ఘర్షణ
మహబూబాబాద్ రూరల్ : ఇంటి స్థలం పంపకాల్లో తలెత్తిన ఘర్షణ కారణంగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలోని బలరాం తండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బలరాం తండా గ్రామానికి చెందిన పెద్దపులి ఫకీర, బుల్లి కుటుంబానికి అతడి తమ్ముడు పెద్దపులి రవి, బుజ్జి కుటుంబానికి మధ్య ఇంటి స్థలం విషయంలో కొద్దిరోజుల క్రితం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పెద్దపులి రవి, బుజ్జి దంపతుల పెద్ద కుమారుడు రాజేష్ (21) ని అతడి పెద్దమ్మ పెద్దనాన్న బుల్లి, ఫకీర, సోదరీ సరిత తిట్టారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ గురువారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయంపై రూరల్ ఎస్సై దీపికను వివరణ కోరగా మృతుడి తల్లి బుజ్జి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య -
సమస్యల పరిష్కారానికి గ్రామసభ
● కలెక్టర్ స్నేహ శబరీష్ ఇనుగుర్తి: క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి గ్రామ సభ బలమైన వేదిక అని కలెక్టర్ స్నేహ శబ రీష్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా సర్పంచ్ తమ్మడవల్లి కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలు అర్హులకు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యసదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తు న్నట్లు తెలిపారు.రైతు భరోసా, గృహ జ్యోతి, మహా లక్ష్మి వంటి పఽథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారన్నారు. వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని, ఆయిల్ పామ్ సాగు లాభదాయకంగా ఉందన్నారు. అంతర పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. నానో యూరియాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారథి, ఎంఈఓ రూపారాణి, దిశ కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు. -
ప్రాణరక్షణ కోసమే హెల్మెట్
● ఎస్పీ శబరీష్ కేసముద్రం: వాహనాదారులు తమ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ శబరీష్ అన్నారు. గురువారం మండలంలోని వెంకటగిరి గ్రామంలో నిర్వహించిన మన గ్రామం–మన బాధ్యత కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పోలీసుల పిలుపు మేరకు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దలు ముందుకు రావ డం, ద్విచక్రవాహనాలు కలిగిన వారంతా హెల్మెట్లు కొనుగోలు చేయడం సంతోషకరమన్నారు. అదే విధంగా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు క్రాంతికిరణ్, నరేష్, గ్రామ సర్పంచ్ భూక్య జ్యోతి, పవన్, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలి కురవి: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలని, హెల్మెట్ తమ శరీరంలో అంతర్భాగం కావాలని ఎస్పీ శబరీష్ సూచించారు. గురువారం మండలంలోని తిర్మలాపురం గ్రామ సర్పంచ్ కనకటి అచ్చమ్మ ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుంటే తమ గ్రామంలోకి నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలతో తయారు చేసిన ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తీర్మానం చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, గంజాయి, డ్రగ్స్ వంటివాటిని గ్రామంలోకి రానివ్వమని చెప్పడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ అంజలి, ఎస్సై గండ్రాతి సతీష్, గ్రామ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గడ్డి మందు బ్యాన్
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, మహబూబాబాద్: ప్రతీ రైతు ఇంట్లో గడ్డి మందు ఉండటం సహజం. అయితే అప్పుల బాధలు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో క్షణికావేశంలో గడ్డి మందు తాగితే అంతే సంగతులు. ప్రాణా లపై ఆశలు వదలుకోవాల్సిందే. లక్షల రూపాయలు ఖర్చుచేసినా.. ఫలితం ఉండదు. ఈ మహమ్మారితో ప్రాణాలు పోవడమే కాదు.. కుటుంబం కూడా లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. ఈ విషయాలను వివరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడాది నవంబర్ నుంచి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై ప్రజాప్రతినిధుల స్పందన, ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయంతో ఎట్టకేలకు గడ్డి మందు అమ్మకాలను బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన వారు.. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుగుల మందు తాగుతున్న వారే అధికం. ఐదేళ్లలో 905 మంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 800మందికి పైగా గ్లైఫోసెట్, పండిమిథాలిన్, ప్రిటిల్లాక్లోర్, నామినీ గోల్డ్, ఆల్మిక్స్ వంటి గడ్డి మందులు తాగిన ఘట నలు ఉన్నాయి. గడ్డిమందు తాగిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయే వరకు మాట్లాడుతూ ఉంటారు. దీంతో కుటుంబ సభ్యులు పేషెంట్ను బతికించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైనా ప్రాణాలు కాపాడలేని సంఘటనలు ఉన్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ఈ గడ్డి మందు రైతుల ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడం.. ఫర్టిలైజర్ షాపు యజమానులు ఎవరికి పడితే వారికి విక్రయాలు జరపడంతో అందుబాటులో ఉంటుంది. ఆవేశంతో మందు తాగి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మందు ప్రభావంతో పంటలు కూడా విషతుల్యం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధికంగా గడ్డి మందు వినియోగించి పండించిన పంటలు తింటే క్యాన్సర్ వంటి వ్యాధుల వారిన పడే అవకా శం ఉందని అంటున్నారు. ఇంతటి ప్రమాదకరమైన గడ్డి మ ందు విక్రయాలే కాదు.. త యారీనే నిషేధించా లని ప్రజా సంఘాలు, డాక్టర్లు కో రారు. అసెంబ్లీలో చర్చ.. వ్యవసాయమే ఆధారంగా జీవించే వారు అధికంగా ఉన్న మహబూబాబాద్ వంటి జిల్లాలో ఆత్మహత్యలు చేసుకునే వారిలో.. అత్యధికంగా గడ్డి మందు తాగిన వారు ఉన్నారు. ఈ విషయంపై మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అసెంబ్లీలో వివరించారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా గడ్డి మందు మరణాల విషయం తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం, మంత్రులతోపాటు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గడ్డి మందు నిషేఽధించాలనిమక్తకంఠంతో చెప్పారు. దీంతో ఎట్టకేలకు గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సాక్షి’ వరుస కథనాలపై అసెంబ్లీలో చర్చపెట్టిన ఎమ్మెల్యేలు పారాక్వాట్ అమ్మకాలను నిషేధించాలని ఆరోగ్యశాఖ మంత్రికి వినతి చలించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అసెంబ్లీలో తీర్మానం, రాష్ట్రంలో అమ్మవద్దని ఆదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు సంవత్సరాలు మృతుల సంఖ్య 14 10 14–18 69 19–30 382 31–45 426 46–60 283 60 కిపైగా 97 -
గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు
● జీజీహెచ్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ ప్రారంభం నెహ్రూసెంటర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ రవిరాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. జీజీహెచ్లో గురువారం ప్రత్యేక హెల్ప్డెస్క్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చిన గర్భిణులకు అవసరమైన సూచనలు, పరీక్షలు, వైద్య సేవలపై సమాచారం అందించడమే హెల్ప్డెస్క్ ప్రధాన లక్ష్యమన్నారు. హెల్ప్డెస్క్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, 79931 54429 నంబర్ సంప్రదించి సమాచారం పొందవచ్చన్నారు. 102 అంబులెన్స్ సేవలు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, తల్లిశిశువుకు సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. గర్భిణులు సురక్షిత ప్రసవం కోసం సేవలను వినియోగించుకోలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అఽఽధికారి సారంగం, ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ రాధిక, శశిజోత్స్న, డాక్టర్ సంజయ్, మీడియా అధికారి కొప్పు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించాలి మహబూబాబాద్ అర్బన్: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ జయంతి పండుగలా జరుపుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధిశాఖ అధికారి కె. శ్రీని వాస్రావు గురువారం తెలిపారు. ఈనెల 5న ఉయదం 9గంటలకు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ పాలబజార్ సమీపంలో బాబుజగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పి ంచాలని, సభావేదిక కలెక్టర్ కార్యాలయంలో ఉంటుందని, అన్ని కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కొరారు. దళిత కాలనీలో గ్రామసభకురవి: గ్రామం ఆవిర్భవించి సుమారు 40 ఏళ్లు కావొస్తుంది.. సాధారణంగా గ్రామసభలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరుగుతుంటాయి.. అందుకు భిన్నంగా మండలంలోని కొత్తూరు(సీ)లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ దళితకాలనీలో జరగడం విశేషం. కొత్తూరు(సీ) సర్పంచ్గా గిరిజన మహిళ బాదావత్ చిన్ని విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామసభను దళిత కాలనీలో నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దళిత కాలనీలో జరిగిన గ్రామసభకు అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను పంచాయతీ కార్యదర్శి అశోక్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్ని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను ప్రజలకు అందిస్తామని, గ్రామాన్ని ప్లాస్టిక్రహిత గ్రామంగా తయారు చేయాలని, ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు తీర్మానం చేశారు. అంగన్వాడీ సిబ్బంది శ్రీదేవి, ద్రౌపది, ఏఎన్ఎం జ్యోతి, లైన్మెన్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు కేయూలో దొడ్డి కొమురయ్య జయంతి కేయూ క్యాంపస్: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతిని శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భనంలో నిర్వహించనున్నట్లు బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
మొబైల్ వ్యసనాన్ని తగ్గించుకోవాలి
హన్మకొండ: విద్యార్థులు మొబైల్ వ్యసనాన్ని తగ్గించుకోవాలని ఎస్బీఐ వరంగల్ రీజినల్ మేనజర్ అ బ్దుల్ రహీం షేక్ అన్నారు. హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు మంత్ర 2కే26 జాతీయస్థాయి సద స్సు గురువారం నిర్వహించారు. ఎంబీఏ డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణమాచార్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. కేయూ ప్రొఫెసర్ వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు కార్పొరేట్ అవసరాలకు తగ్గట్టుగా మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ అమరవేణి మాట్లాడుతూ ఎంబీఏ స్టూడెంట్స్ లీడర్షిప్ క్వాలి టీస్ పెంపొందించుకోవాలని కోరారు. మంత్ర 2కే26 కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి 300కు పైగా ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నా రు. పలు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతి, సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాధ్యులు, విద్యార్థులను వాగ్దేవి కళాశాలల వ్యవస్థాపకుడు సీహెచ్ దేవేందర్రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ వాహిని దేవి, విభా సీఈఓ విశ్వంబర్రెడ్డి అభినందించారు. మంత్ర 2కే26 కన్వీనర్ డాక్టర్ బి.కిశోర్ కుమార్, ఎంబీఏ విభాగం అధిపతి డాక్టర్ ఎస్.మహేందర్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ కె.రాజి రెడ్డి, ప్రొఫెసర్ కొనాటి రాజిరెడ్డి, అధ్యాపకులు పి.సుగుణాకర్రెడ్డి, ఎ.రజిన్కుమార్, టి.అనూష, డి.ప్రేమ్కుమా ర్, సీహెచ్.కరుణ, బి.చంద్రకళ నాయక్, ఎస్.శాంభవి, ఎం.అరవింద, సీహెచ్ స్వాతి, కె.వెంకటేశ్వర్లు, సీహెచ్ శ్రీకాంత్ వర్మ, విద్యార్థులు పాల్గొన్నారు . ఎస్బీఐ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం షేక్ -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
కాజీపేట అర్బన్ : కాజీపేట వంద పీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏసీబీ ఆకస్మిక తనిఖీ కలకలం రేపింది. ఈ తనిఖీలకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయ షెట్టర్లు, తలుపులను మూసివేసి జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావు, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్లను విచారించారు. పలు దస్తావేజులను క్షణ్ణంగా పరిశీలించి, జిల్లా రిజిస్ట్రార్, చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ లు చేశారు. కార్యాలయంలో 204 దస్తావేజులు డబ్బులు ఇస్తేనే ఇస్తామని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ భూక్రయదారులను వేధిస్తున్నాడనే ఫిర్యాదు మేర కు దాడులు నిర్వహించారు. తనిఖీ సమయంలో 20 మంది డాక్యూమెంట్ రైటర్లు 70 డాక్యూమెంట్లతో కార్యాలయం లోపల ఉండడంతో వారి వద్ద నుంచి రూ.45,500 స్వాధీనపరచుకున్నారు. డాక్యూమెంట్ రైటర్ల ఫోన్లను పరిశీలించగా సబ్ రిజిస్ట్రార్లు.. డాక్యూమెంట్ రైటర్ల మధ్య నగదు లావాదేవిలకు సంబంధించిన మేసేజ్లను గుర్తించారు. భూక్రయదారులు నేరుగా కార్యాలయానికి వచ్చినా స్పందించడం లేదని డాక్యూమెంట్ రైటర్లతో రావాలని తెలుపుతున్నట్లు నిర్ధారించారు. రిజి స్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదుల మేరకు దర్యాప్తు కొనసాగించి కేసు నమెదు చేస్తామని సాంబయ్య వెల్లించారు. ఇదిలా ఉండగా.. ఆర్వో రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలోని చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహాయ రిజిస్ట్రార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లతోపాటు ఓ ప్రైవేట్ వ్యక్తి కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. కాగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం కార్యాలయాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లగా కార్యాలయంలోని రిజిస్ట్రర్లో సంతకాలు చేసిఉన్నా.. ఎవరూ లేకపోవడంతో సహాయ రిజిస్ట్రార్ను పిలిపించి పలు పత్రాలు పరిశీలించారు. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్య -
ఆర్టిజన్ జేఏసీని చర్చలకు పిలవాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్లను చర్చలకు పిలవా లని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కే.వీ.జాన్సన్ అన్నా రు. హనుమకొండలోని ట్రాన్స్కో వరంగల్ జోనల్ కార్యాలయం వద్ద గురువారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించగా.. జాన్సన్ సంఘీబావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయడానికి విద్యుత్ ఉద్యోగ సంఘాలు అండగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ ట్రాన్సో కో అధ్యక్షుడు సంపత్ రావు గారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఆర్టిజన్ కార్మికులు ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తూ సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిజన్ జేఏసీ ట్రాన్స్కో విభాగం రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, తెలంగాణ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసి యేషన్ నాయకుడు పుల్యాల రాజిరెడ్డి, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి, కన్వీనర్ సింగిరెడ్డి చంద్రారెడ్డి చంద్ర సింగ్, వెంకన్న నాయక్, సికిందర్, భరత్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సునీల్, జనార్ధన్, జయచందర్, సృజన, రాజేష్ నాయక్, రంగారావు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిందే..: ఆర్టిజన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీష్ రెడ్డి ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి, కన్వీనర్ చంద్రారెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని సర్కిల్ కార్యాలయ ఆవరణలో గురువారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని టీ ఎస్ఈఈయూ–327 హనుమకొండ, వరంగల్ జి ల్లా కార్యదర్శులు చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్ సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ జేఏసీ హనుమకొండ జిల్లా చైర్మన్ రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ సికింద న్, నాయకులు చంద్ర సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ -
జాతర చూసేందుకు వెళ్లి..
చిల్పూరు: జాతర చూసేందుకు వెళ్లి వాగులో పడి ఇద్దరు బాలురు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన గూటం ప్రవీణ్–హరిత దంపతుల కుమారుడు అఖిలానంద (14) ఎనిమిదో తరగతి, నూనె సదానందం–స్వప్న దంపతుల కుమారుడు మనోజ్కుమార్ (13) స్థానికంగా ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నష్కల్ గ్రామంలోని రామాలయం దగ్గర జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను చూసేందుకు సాయంత్రం ఇద్దరు కలిసి సైకిల్పై వెళ్లారు. అనంతరం రామాలయం వెనుక ఉన్న ఆకేరు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ సైకిల్ కడుగుతున్న సమయంలో రైతులు వాగు దాటేందుకు ఏర్పాటు చేసుకున్న తెడ్డు కనిపించింది. దానిపై సైకిల్ పెట్టి ఇద్దరు కూర్చుని కొద్ది దూరం వెళ్లారు. అదిఒక పక్కకు ఒరగడంతో సైకిల్తో పాటు ఇద్దరు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగి మృతి చెందారు. కొద్దిసేపటికి కొందరు రైతులు అటుగా వెళ్తుండగా వాగు ఒడ్డుకు చెప్పులు కనిపించాయి. అనుమానంతో వాగులో గాలించగా నీటిలో మునిగిన సైకిల్తోపాటు వారి మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మనోజ్కుమార్(ఫైల్) , అఖిలానంద (ఫైల్) ఆకేరు వాగులో పడి ఇద్దరు బాలుర మృతి జనగామ జిల్లా వంగాలపల్లిలో విషాదం -
ఆటలాడుకున్న అరుగే సమాధి!
చెన్నారావుపేట: ఆటలాడుకున్న ఇంటి అరుగే ఆ చిన్నారులకు సమాధిగా మారింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోడమాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు. రాఘవేంద్ర కాలనీలో స్రవంతితోపాటు ఇద్దరు పిల్లలు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామం బోడమాణిక్యం తండాకు తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు బంధువులు ప్రవీణ్ ఇంటి ఎదుట గుంతలు తీశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి కళ్లలో కారం చల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలను ఈ గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం స్రవంతి మృతదేహాన్ని సమీపంలోని వారి పత్తిచేనులో దహనం చేశారు. ప్రవీణ్ ఇంటి ఎదుట సమాధి చేసిన చిన్నారుల మృతదేహాలు మళ్లీ తీసే ప్రసక్తే లేదని తండావాసులు తెగేసి చెబుతున్నారు. కాగా, మూడు రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇదిలా ఉండగా.. స్థానిక సర్పంచ్ ఉమామోహన్ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. బోడమాణిక్యం తండాలో పిల్లల మృతదేహాల పూడ్చివేత -
ప్రియుడి మృతిని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
నర్మెట: ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి సైతం బలవన్మరణానికి పాల్పడిన ఘటన జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన తరిగొప్పుల హారిక (22) అదే గ్రామానికి చెందిన అనుముల రాకేష్ రెడ్డి ప్రేమించుకుని ఏడాదికాలంగా హైదరాబాద్లో నివాసముంటూ మూడు నెలల క్రితం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విషయం తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొద్దిరోజులు దూరంగా ఉండాలని, అనంతరం పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సూచించడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో గత నెల 28న రాకేష్ రెడ్డి (25) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ 30న మృతి చెందాడు. దీంతో యువతిని తల్లిదండ్రులు నర్మెటలోని అమ్మమ్మ కొన్నె లక్ష్మి వద్ద వదిలి వెళ్లారు. కాగా, అప్పటికే ప్రియుడు మృతిచెందడంతో మనస్తాపంతో ఉన్న యువతి గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నగేష్ తెలిపారు. గుట్కాల పట్టివేతవరంగల్ క్రైం: హనుమకొండ టైలర్స్ స్ట్రీట్లోని శివం కిరాణా స్టోర్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాలు, పొగాకు ఉత్పత్తులను గురువారం పట్టుకున్నట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4.70 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడు రాజ్పుత్ చేతన్ నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఇక్కడ పలు షాపుల వారికి అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడైందని వివరించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దాడుల్లో ఎస్సై కిశోర్, బ్లూకోల్ట్స్ సిబ్బంది మహిపాల్, తిరువర్ధన్ పాల్గొన్నారు. స్పాట్ కేంద్రం పరిశీలన విద్యారణ్యపురి: కాజీపేట ఫాతిమా హైస్కూల్లో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం రాష్ట్ర అబ్జర్వర్ శ్రీనివాసాచారి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులు జవాబుపత్రాలు మూల్యాంకనం చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు సెల్ఫోన్లు వినియోగించొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. సెల్ ఫోన్ వినియోగిస్తూ స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాంపు ఆఫీసర్గా డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ వ్యవహరిస్తున్నారు. సరిపడా ఉపాధ్యాయులు మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్నారని సంబంధిత అధికారులు అబ్జర్వర్ శ్రీనివాసాచారికి తెలిపారు. -
వార్డుసభలతో అర్హులకు లబ్ధి
● మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి మహబూబాబాద్: అర్హులకు లబ్ధి చేకూర్చడానికే ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహిస్తుందని మున్సిపల్ చైర్ప్సన్ గుగులోత్ జ్యోతి అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 36వార్డులకు సంబంధించి 8చోట్ల వార్డు సభలు నిర్వహించారు. హౌజింగ్ బోర్డు కాలనీలో 4,5,17,18 వార్డులకు సంబంధించిన వార్డు సభ నిర్వహించారు. ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, గృహజ్యోతి తదితర పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రాజేశ్వర్, వార్డు కౌన్సిలర్లు గుగులోత్ నరేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. భాగస్వాములు కావాలి.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఎంఏ హాల్లో మున్సిపాలిటీలోని 8,19,20,33,34,35 వార్డులకు సంబంధించిన వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అజయ్సాథిరెడ్డి, గద్డె నీరజారాణి, చిదిరాల అరుణ, బానోత్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. 1,323 క్వింటాళ్ల మిర్చి విక్రయం మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో 1,323 క్వింటాళ్ల మిర్చి విక్రయం జరిగిందని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు గురువారం తెలిపారు. మహబూబాబాద్ మండలంతో పాటుగా చుట్టుపక్కల మండలాలకు చెందిన రైతులు 3,781 బస్తాల మిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. వ్యాపారులు కొనుగోలు చేసిన అనంతరం గరిష్ట ధర క్వింటాకు రూ.19,520, కనిష్ట ధర రూ.18,550 పలికిందని వారు పేర్కొన్నారు. -
యూనిఫాం ఇండెంట్ల రద్దు
టెండర్ల ద్వారా కొనుగోలుకు విద్యాశాఖ సన్నాహాలుకాశిబుగ్గ: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు, ఎక్స్అఫీషియో రాష్ట్ర సంచాలకులు, సమగ్ర శిక్ష హైదరాబాద్ తరఫున ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన యూనిఫాం క్లాత్ కోసం టెస్కోకు ఇచ్చిన ఇండెంట్ను ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలోని పవర్లూం, చేనేత సహకార సంఘాలు చతికిలపడనున్నాయి. దీనిపై ఆధారపడిన వేలా దిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెస్కోకు ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్ను విద్యాశాఖ రద్దు చేసుకోవడంతో సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా యూనిఫాం సరఫరా.. నాలుగైదు దశాబ్దాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన ఏకరూప దుస్తులు, కార్పెట్లు, బెడ్షీట్లు చేనేత సహకార సంఘాలు సరఫరా చేస్తూ చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. నేతన్నల ఉత్పత్తులను టెస్కో ద్వారా ఖరీదు చేసి ప్రభుత్వ సంస్థలకు అమ్మకాలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కొత్తగా టెండర్ విధానం ద్వారా చేనేత ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించడంతో కార్మికులకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్న టెండర్ విధానం రద్దు చేయాలని విన్నవించారు. చేనేత కార్మికుల ఉపాధి దృష్టిలో పెట్టుకుని రెండు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా కార్మికులకు నిరాశే మిగిలింది. విద్యాశాఖ ఆకస్మిక నిర్ణయంతో ఆందోళన.. ఈ పరిస్థితిలో తాజాగా విద్యాశాఖ 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 12వ తరగతి వరకు, ప్రీప్రైమరీ చదువుతున్న 20,02,689 మంది విద్యార్థుల రెండు జతల యూనిఫాం తాత్కాలిక ఇండెంట్ను రద్దు చేసి, కొనుగోలు ప్రక్రియను ప్రారంభించొద్దని టెస్కోను అభ్యర్థించింది. దీంతో చేనేత జౌళిశాఖ అధికారులు సైతం పీపీ ఆర్డర్లను రద్దు చేసి, లివరీ యూనిఫాం క్లాత్ రకాల ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని గురువారం రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాతోపాటు కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పవర్లూం, చేనేత సహకార సంఘాలకు ఆదేశాలు జారీ చేశా రు. దీనివల్ల ఇప్పటికే వివిధ శాఖల నుంచి రావా ల్సిన రూ.200 కోట్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. గోదాముల్లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు నిల్వ ఉండడం, మిల్లుల్లో వస్త్రాలు తయారు చేస్తుండడం వంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆకస్మిక నిర్ణయం నేతన్నలను నిరాశకు గురిచేస్తోంది. వస్త్రాల ఉత్పత్తి నిలిపివేయాలంటూ చేనేత జౌళిశాఖ ఉత్తర్వులు లబోదిబోమంటున్న పవర్లూమ్, చేనేత సహకార సంఘాలు ఉపాధి కోల్పోతామని నేత కార్మికుల ఆందోళనప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. 2026–27 విద్యా సంవత్సరంలో రూ.105.54 కోట్ల విలువైన ఆర్డర్లు రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని 393 చేనేత సంఘాల్లోని వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. టెండర్ విధానం వల్ల కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగిస్తే సామాన్య నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. టెస్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో కార్మికులు పనులకు దూరంగా ఉండాల్సి వస్తుందని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు కూడా వర్తించవని వాపోతున్నారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని టెండర్ విధానానికి స్వస్తి పలికి, గతంలో మాదిరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు వరంగల్లో గురువారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చేనేత సంఘాల ప్రతినిధులు మొరపెట్టుకున్నారు. -
19 గ్యాస్ సిలిండర్లు సీజ్
రామన్నపేట : నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధి శ్రీకృష్ణకాలనీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం దాడులు చేసి 19 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.47,500 ఉంటుందని తెలిపారు. నిందితుడు లహరి ఫుడ్ క్యాటరింగ్ యజమాని సంతోష్కుమార్ను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ జి.బాబులాల్, ఏఎస్సై కె.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు, డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు అపరాధ రుసుంలేకుండా ఈనెల 4వ తేదీ వరకు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 9వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 2, 4, 5, 6వ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించే యోచనలో పరీక్షల విభాగం అధికారులు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయా పరీక్షల టైం టేబుల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. పుట్టెడు దుఃఖంతో పది పరీక్షకు హాజరుస్టేషన్ఘన్పూర్: కన్నతండ్రి మృతిచెందిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన దేవరాయ సాంబయ్య (47), సంధ్య దంపతులకు కుమారుడు చరణ్, కుమార్తె పావని ఉన్నారు. చరణ్ స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పావని తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చరణ్ పదో తరగతి వార్షిక పరీక్షలను మండలంలోని నమిలిగొండ శివారు మాడల్స్కూల్ సెంటర్లో రాస్తున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ చరణ్ తండ్రి సాంబయ్య బుధవారం మృతిచెందాడు. చరణ్ దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం జరిగిన భౌతికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం స్వగ్రామం తాటికొండకు వెళ్లి తండ్రి అంత్యక్రియలు చేశాడు. ఇంటి వద్ద తండ్రి మృతదేహం ఉన్నా బాధను దిగమింగుకుని పరీక్ష రాసిన చరణ్ను పలువురు ఓదార్చారు. -
సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వారి విషయం నేను డాక్టర్గా నేరుగా చూశాను. ఈ మందు తాగిన వ్యక్తి చనిపోగా.. లక్షల రూపాయల ఖర్చుతో కుటుంబం కూడా అప్పుల పాలు అవుతుంది. ఈ విషయంపై అసెంబ్లీలో పలుమార్లు మాట్లాడాను. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి తీవ్రతను చెప్పాను. వారు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయడం.. గడ్డి మందు అమ్మకాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. – మురళీనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే గడ్డి మందు అమ్మకాలు నిషేధంగడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ తాగి ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో తయారీ, నిల్వ, అమ్మకాలు, వాడకం, కొనుగోళ్లపై నిషేధం ఉంది. కావునా రైతులు, వ్యాపారులు గమనించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – బి. సరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అమ్మకాల నిషేధం సంతోషకరం రైతుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసే గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. శాశ్వతంగా నిషేధించాలి. ఉత్తర్వులు అమలు అయ్యేలా చూడాలి. – డాక్టర్ వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు -
బడికి తాళం వేసి మహిళ నిరసన
● భూమి తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాతృత్వంగా ఇచ్చిన భూమి తిరిగి అప్పగించాలని బుధవారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ దొంగరి శ్రీలత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దొంగరి శ్రీలత, ఉపేందర్రావు దంపతులతో పాటు వారి పాలివాళ్లు కలిసి 400 గజాలకు పైగా భూమిని విరాళంగా ఇచ్చారు. దొంగరి శ్రీలత, ఉపేందర్రావు దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు హైదరాబాద్లో ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తున్నారు. ఉపేందర్రావు 15 ఏళ్ల క్రితం మృతి చెందారు. శ్రీలత గ్రామంలో ఉన్న తన ఇల్లు శిథిలావస్థకు చేరడంతో బంధువుల ఇంటిలో నిద్రిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో డబుల్బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమి లేక స్థానిక ప్రభుత్వ పాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు గేటు బయట వేచి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ పోతుగంటి నర్సయ్య పాఠశాల వద్దకు చేరుకున్నారు. అనంతరం పాఠశాల హెచ్ఎం తండ మల్లయ్యతో కలిసి మాట్లాడుతూ ఈ విషయంపై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శ్రీలత నిరసన విరమించింది. -
కాజీపేటలో చైన్స్నాచింగ్
కాజీపేట: పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చైన్స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడ నుంచి దుండగులు పుస్తెల తాడు అపహరించారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఐలోని ధనలక్ష్మి వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బైక్పై వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోంచి 3 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు కేకలు వేయగా స్థానిక యువకులు నిందితులను పట్టుకోవడానికి యత్నించగా తప్పించుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులతో పాటు క్రైం పార్టీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విచారణను వేగవంతం చేశారు. జల్లెడ పడుతున్న పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు అన్ని రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నా రు. ఇటీవల పట్టణంలో రెండు దఫాలుగా చైన్ స్నా చింగ్లకు పాల్పడిన ముఠాకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తెలతాడు అపహరణ రంగంలోకి క్రైం పార్టీ పోలీసులు -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ముఠాను అరెస్ట్ చేసి రూ.15.20 లక్షల విలువైన 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఇద్దరి నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మదురైకి చెందిన కల్యాణ సుందరం గంజాయి విక్రయాలతోపాటు బైక్ చోరీలకు పాల్పడిన కేసులో జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత సెల్ ఫోన్ షాపులో సేల్స్ మెన్గా పనిచేస్తున్న సమయంలో మదురైకి చెందిన సెల్వ రాజ్తో పరిచయమైంది. ఇరువురు కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. ఆదాయం సరిపోకపోవడంతో ఒంటరి మహిళలను లక్ష్యంగా చైన్స్నాచింగ్లకు పాల్పడేందుకు గత నెల వరంగల్కు చేరుకున్నారు. ప్లాన్ ప్రకారం మట్టెవాడ పీఎస్ పరిధిలో బైక్ చోరీ చేసి, దానిపై ప్రయాణిస్తూ సుబేదారి, హనుమకొండ, కేయూ పీఎస్లతోపాటు ఏపీలోని కర్నూల్తో కలుపుకొని మొత్తం ఐదు చైన్ స్నాచింగ్లకు పాల్ప డ్డారు. ఈ చోరీలపై కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు మరోమారు బుధవారం చైన్ స్నాచింగ్ చేయడానికి వరంగల్ వచ్చారు. బైక్పై హనుమకొండ బస్టాండ్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపునకు వస్తున్న క్రమంలో పోలీసులు వారిని పటుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్ల సీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అడిషనల్ క్రైమ్ డీసీపీ జి.బాలస్వామి, క్రైమ్ ఏసీపీ పి. సదయ్య, హనుమకొండ ఏసీపీ పి.నర్సింహరావు, సిబ్బందిని సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. ఇద్దరు దొంగలు అరెస్ట్.. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, టీవీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, సెల్ఫోన్లు, వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నగరంలోని కొత్తూరు జెండాకు చెందిన బింగి రఘు, బొక్కలగడ్డకు చెందిన మహ్మద్ అసద్.. నిర్మాణంలో ఉన్న ఇళ్లలో, తాళం వేసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం హనుమకొండ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడతున్నట్లు అంగీకరించారు. దీంతో చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ వివరించారు. 95 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్ సింగ్ -
బాధితులను ఆదుకోవడమే మా లక్ష్యం
ఆపదలో బాధితులను ఆ దుకోవడమే మా లక్ష్యం. కాల్ వచ్చిన వెంటనే సాంకేతికత ద్వారా సమాచారం సేకరించి 30 సెకన్లలో అంబులెన్స్ను పింపిస్తాం. సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాం. – శివకుమార్, 108 సర్వీస్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ప్రతీ కాల్ వెనుక ఒక ప్రాణం12 ఏళ్లుగా 108 సేవల్లో పనిచేస్తున్నా. ప్రతీ కాల్ వెనుక ఒక ప్రాణం ఉంటుంది. సమయానికి స్పందించి వారి ప్రాణం కాపాడడం మా బాధ్యత. ఇది ఉద్యోగం కాదు ఒక ప్రాణం కాపాడే పవిత్ర సేవ. – బొక్క చైతన్య, ఈఎంటీ సేవలు ప్రశంసనీయంఅత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ చాలా ము ఖ్యమైంది. మా సిబ్బంది 24 గంటలూ పని చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఐస్ బాక్సులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సైలెన్లు అందుబాటులో ఉంచాం. వెలుదండి రాము( ఈఎంఈ), 108 జనగామ జిల్లా కోఆర్డినేటర్18 ఏళ్లుగా సేవలు 18 ఏళ్లుగా 108లో సేవలు అందిస్తున్నా. బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్కు తీసుకెళ్లే సమయంలో గంటల తరబడి అంబులెన్స్లోనే ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు. అయినా అవన్నీ లెక్క చేయకుండా బాధితులకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మామిడి రాకేశ్,ఈఎంటీ -
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సివిల్స్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని, దీనిని అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు మే 26వ తేదీ వరకు గడువు ఉందని, ప్రవేశ రుసుం రూ. 1,325 చెల్లించి ఆన్లైన్లో హెచ్టీటీపీఎస్:అడ్మిషన్.జేఎంఐ.ఏిసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష జూ న్ 6వ తేదీన హైదరాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 8520860785 నంబర్లో సంప్రదించాలన్నారు. విపత్తుల పర్యవేక్షణ వ్యవస్థ వివరాలివ్వండి ● వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య హన్మకొండ చౌరస్తా: వరంగల్ జిల్లాలో భూకంప, వర్షాలు, ఉరుములు, మెరుపుల హెచ్చరికలు అందించేందుకు ప్రత్యేక డాప్లర్ వెదర్ రాడార్ లేదా ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ కావ్య ఆధునిక విపత్తుల పర్యవేక్షణ వివరాలపై ప్రశ్నించారు. వరంగల్ వంటి ఉష్ణతరంగాలు, అనియంత్రిత వర్గాలకు గురయ్యే ప్రాంతాల్లో వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం పెంపు, విపత్తు నిర్వహణ చర్యలపై వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూకంప పరిశీలన కేంద్రాలు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, వాతావరణ పరిశోధన కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని సూచించారు. కావ్య ప్రశ్నకు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లా సిస్మిక్ జోన్–2 తక్కువ ప్రమాద స్థాయిలో ఉందని పేర్కొన్నారు. మైక్రోజోనేషన్ అధ్యయనాలు ఇప్పటి వరకు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం ఐదు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ ఐదు కిలోల సరుకు స్వాధీనం జనగామ రూరల్: ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకు చెందిన భగవాలే రాజ్ కుమార్, కోట నిఖిల్ను ఎస్సై సతీశ్, కానిస్టేబుళ్లు రాజ్ కుమార్, రమేశ్, సాగర్ తనిఖీ చేశారు. ఇందులో వారి వద్ద ఉన్న బ్యాగుల్లో సుమారు 5 కిలోల గంజాయి లభించింది. దీంతో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పాముకాటుతో మహిళ మృతి మల్హర్: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మండల కేంద్రం తాడిచర్లలో చోటు చేసుకుంది. తాడిచర్ల గ్రామానికి చెందిన గంగుల రాధమ్మ(50) తెల్లవారుజామున ఇంటి పనులు చేస్తున్న క్రమంలో పాముకాటు వేసింది. గమనించిన కుటుంబీకులు 108లో మంథని ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గోదావరిఖనికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
మాటలతోనూ ప్రాణం పోసే దేవుళ్లు ఈఎంటీలు..
హనుమకొండ 16, జనగామ జిల్లాలో 12 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పని చేస్తున్న సిబ్బంది (మెడికల్ టెక్నీషియన్లు) రోజూ ప్రాణాలతో పోరాడుతున్నారు. గోల్డెన్ అవర్ అంటే పుస్త కాల మాట కాదు, అ ది వీరు ప్రతిరోజూ రాసుకునే ‘ప్రాణరక్షణ గడియారం’. ఫోన్ గంట మోగగానే పరుగెడతారు. మార్గం కష్టమైనా, వర్షం వచ్చినా, అర్ధరాత్రి అయినా క్షతగాత్రుల పాలిట సంజీవనిగా మారి ప్రమాద స్థలానికి చేరే వేగమే వారి విజయం. ఒకవైపు రోగికి శ్వాస ఆగకుండా ఆక్సిజన్ ఇస్తూ, మరోవైపు రక్తస్రావం ఆపడానికి కట్లు కడుతూ తోబుట్టువుల్లా సేవలందిస్తారు. పక్కనే ఏడుస్తున్న బంధువులకు ధైర్యం చెప్పడం కూడా వారి పని. రోగిని అంబులెన్స్లో ఎక్కించగానే శ్వాస ఆగకుండా, మాటలతోనూ ప్రాణం పోసే ఈఎంటీలను దేవుళ్లుగా భావిస్తారు. ఇది ఈఎంటీల జీవితంలో రోజు రాసుకునే ఎపిసోడ్. జీపీఎస్ సాంకేతికతతో కాల్ వచ్చిన వెంటనే సమీప అంబులెన్స్కు సమాచారం చేరి, సగటున 12 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని ‘గోల్డెన్ అవర్’ కాన్సెప్ట్ ద్వారా ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఎక్కిస్తున్న ఈఎంటీలుక్షతగాత్రులను లోయ నుంచి తీసుకొస్తున్న ఈఎంటీలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మహబూబాబాద్ శివారులోని ఆర్తి గార్డెన్స్ సమీపంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం జీపీ పరిధిలోని నెహ్రూనగర్కు చెందిన బానోత్ శ్రీను, వినోద దంపతుల ఏకై క కుమారుడు మహేందర్ (23) హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్పై మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సమయంలో ఆర్తి గార్డెన్స్ సమీపంలో ఎదురుగా ఓ గుర్తు తెలియని వాహనం.. బైక్ను ఢీకొని వెళ్లింది. స్థానికులు డయల్ 100కు కాల్ చేయగా ఘటనా స్థలికి చేరుకున్న ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది గణపతి, నరేశ్ 108లో ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీ కరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీను ఫి ర్యాదు మేరకు టౌన్ ఎస్సై సూరయ్య కేసు నమోదు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎల్.శ్రీనివాసరావు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. 15 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరి మృతి.. నెహ్రూనగర్కు చెందిన బానోత్ శ్రీను కుటుంబంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 15 రోజుల క్రితం శ్రీను తండ్రి భోజ్య గుండెపోటుతో మృతిచెందగా ప్రస్తుతం అతడి కుమారుడు మహేందర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహేందర్కు మరికొద్ది రోజుల్లో వివాహం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఈ క్రమంలో అతడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో స్థానికులు, బంధువులు బోరున విలపించారు. మహబూబాబాద్ శివారులో ఘటన 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి -
చెక్
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అక్రమ రవాణాకుఆన్లైన్ ద్వారా ఇసుక బుకింగ్సాక్షి, మహబూబాబాద్: ఇసుక అక్రమ రవాణా.. అవసరం ఉన్నవారికి ఇసుక అందకపోవడం.. అందినా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితికి చరమ గీతం పాడేందుకు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. మన ఇసుక వాహనం పేరుతో రూపొందించిన వెబ్సైట్ ద్వారా ఇసుక బుకింగ్ నుంచి పంపిణీ వరకు అంతా పారదర్శకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బుకింగ్ ప్రక్రియ పారంభిస్తే కొందరు పోలీస్ అధికారులు, ఇసుక దందా చేసేవారికి ఇబ్బందిగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఐదు మండలాల్లో ఇసుక జిల్లా వ్యాప్తంగా పలు వాగుల్లో ఇసుక లభ్యమవుతున్నా.. ప్రధానంగా ఐదు మండలాల్లో ఇసుక లభ్యత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఆకేరు, మున్నేరు వాగుల పరివాహక ప్రాంతాల్లో ఇసుక లభిస్తుంది. ఇందులో నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ, నెల్లికుదురు, డోర్నకల్ మండలాల్లో ప్రవహించే ఆకేరు వాగులో ఎక్కువ ఇసుక లభ్యత ఉంది. అక్రమాలకు చెక్ ఇప్పటి వరకు జిల్లాలో లభించే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. జిల్లా నుంచి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు తరలించి ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకునేవారు. ఈ ఇసుక అక్రమ వ్యాపారానికి కొందరు పోలీస్, రెవెన్యూ అధికారులతోపాటు పలువురు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల ప్రజా ప్రతినిధులే తమ అనుచరులను పెట్టి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అనుచరుల ట్రాక్టర్లు మినహా ఇతరుల వాహనాలు నడపొద్దని అలా నడిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ ద్వారా సామాన్యులు సైతం తమ అవసరాలకు కావాల్సిన ఇసుక తమ సొంత వాహనాల్లో తీసుకెళ్లే అవకాశం లభించనుంది. పారదర్శకత కోసం కొత్త పాలసీప్రతీ ఒక్కర వినియోగదారుకు ఇసుకను అందుబాటులోకి తేవడం కోసం ఈ కొత్త పాలసీ దోహదపడుతుంది. కూపన్ల పంపిణి, డబ్బుల చెల్లింపు అంతా ఆన్లైన్లోనే నమోదు అవుతుంది. ఈ పాలసీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – అనిల్ కుమార్, అదనపు కలెక్టర్, రెవెన్యూసురక్షిత సమాజ నిర్మాణానికి కృషి ఇసుక వాహనం పేరుతో కొత్త వెబ్సైట్ పంచాయతీ కార్యదర్శి నుంచి తహసీల్దార్, ఎస్ఆర్ఓ వరకు సమాచారం అవసరాలకు అనుగుణంగా సరఫరాఅంతా ఆన్లైన్ ద్వారా.. ఇప్పటి వరకు అడ్డూ అదుపు లేకుండా సరఫరా అవుతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రైవేట్ గృహాల నిర్మాణం, ఇతర పనులకోసం వినియోగించే ఇసుక ఇలా మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో ఆయా అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాక్టర్కు రేటు ఫిక్స్ చేశారు. అవసరం ఉన్నవారు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే అది నేరుగా పంచాయతీ కార్యదర్శి లాగిన్కు, అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్కు ఆతర్వాత సాండ్ రీచ్ ఆఫీసర్(ఎస్ఆర్ఓ)కు లాగిన్ అవుతుంది. అక్కడి నుంచి వినియోగదారులు నేరుగా ఇసుక తీసుకునే అవకాశం ఉంది. -
ఆయిల్ పామ్ రైతుల అగచాట్లు..
జిల్లాలో ఆయిల్ పామ్ పండించిన రైతులు పంటను మిల్లులకు చేరవేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్లలో గెలలను తీసుకువెళ్లి ప్రధాన రహదారి పక్కన డంప్ చేస్తే కొనుగోలు దారులు లారీల్లో లోడ్ చేసుకునేవారు కానీ, ప్రధాన రహదారి వెంట డంప్ చేసే అవకాశం లేకపోవడంతో కొనుగోలుదారులు వచ్చి లారీల్లో గెలలను వేసుకునేవరకు రైతులు ఆయా గెలలను తాము తీసుకొచ్చిన కందికొండ వద్ద ట్రాక్టర్లలోనే ఉంచి దారి వెంట వేచి ఉండగా.. సాక్షి తమ కెమెరాలో బంధించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గూడూరు: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో పెట్టుకోవాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్తోపాటు చెంద్రుగూడెంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ వార్డును పరిశీలించారు. ఓపీ వివరాలతో పాటు వైద్యులు, సిబ్బంది విధులపై ఆరా తీశారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం చెంద్రుగూడెంలోని పాఠశాలలో తరగతి గదులు, స్టోర్ రూం పరిశీలించారు. రుచికరమైన భోజనం మెనూ ప్రకారం వడ్డించాలని నిర్వాహకులకు సూచించారు. పదో తరగతిలో ప్రతీ ఒక్కరు ఉత్తీర్ణులయ్యేలా శ్రద్ధవహించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాలల్లో ఎంపికలు
మహబూబాబాద్ అర్బన్: క్రీడాపాఠశాలల్లో విద్యాభాస్యం కోసం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మానుకోట జిల్లా నుంచి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవవారం ఉదయం క్రీడా ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి మాట్లాడుతూ.. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి ప్రవేశానికి మూడో తరగతి చదువుతున్న బాలబాలికలకు 9 రకాల పోటీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు ఈ నెల 27న హైదరాబాద్ హకీంపేట క్రీడా పాఠశాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ● పశుసంవర్ధక శాఖ జిల్లాఅధికారి దంతాలపల్లి: రైతులు తమ పశువుల, గేదెల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో బుధవారం పశువులు, గేదెలకు నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ వైద్యశిబిరంలో పాల్గొని సర్పంచ్ కారుపోతుల సాయిదుర్గతో కలిసి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి సోకడంవల్ల పశువుల్లో వచ్చే నష్టాల గురించి వివరించారు. ప్రభుత్వం పశువుల్లో సోకే వివిధ వ్యాధుల నుంచి కాపాడి పశు సంపదను పెంచే విధంగా బుధవారం జాగ్రత్తలు తీసుకుంటుందని రైతులకు గుర్తుచేశారు. మండలంలోని గ్రామాల్లో పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు తమ పశువులకు ఎలాంటి వ్యాధి సోకినా దగ్గరలోని పశు వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి నౌసిని, సిబ్బంది వరలక్ష్మి, రాములు, వెంకన్న, రైతులు పాల్గొన్నారు. -
మెగా ప్రైట్ మెయింటెనెన్స్ పనులు ప్రారంభించాలి
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్లో మంజూరైన మెగా ప్రైట్ మెయింటెనెన్స్ డిపో పనులను ప్రారంభించాలని కోరుతూ బీ ఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ ఎంపీల బృందం.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మహబూబాబాద్ మెగా ప్రైట్ మెయింటెనెన్స్ డిపో, రైల్వే అభివృద్ధిపై వారు సుదీర్ఘంగా చర్చించారు. స్పందించిన కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్టు పురోగతిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యాధి నివారణకు అవగాహన ముఖ్యంనెహ్రూసెంటర్:హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నివా రణలో అవగాహన ఎంతో ముఖ్యమని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ, చికిత్స, కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లింక్ వర్కర్స్, సర్వోదయ స్వచ్ఛంద సంస్థ, కోఆర్డినేటర్స్ సమన్వయంతో పని చేస్తూ కేసుల గుర్తింపు, చికిత్సపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ప్రొగ్రాం అధికారి అర్జున్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, డెమో ప్రసాద్, హెచ్ఈ కేవీ రాజు, నీలిమాశ్వేత, అశోక్, సారంగం పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గార్ల: విద్యార్థులకు ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాంనాయక్ అన్నారు. బుధవారం రాత్రి గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వంట వర్కర్లకు కూరలు నాణ్యమైన కూరగాయాలతో వండాలని సూచించారు. కూరలు రుచిగా లేవని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే వేటు తప్పదని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో మెనూ అమలుపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థుల పడక గదుల్లో సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీడీ వెంట హెచ్ఎం జోగయ్య, వార్డెన్ మేగ్యానాయక్, పీడీ పద్మ ఉన్నారు . ‘ఏప్రిల్ను మహనీయుల మాసంగా నిర్వహించాలి’ మహబూబాబాద్ అర్బన్: ఏప్రిల్ నెలల్లో జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహనీయుల మాసంగా నిర్వహించాలని డీపీఆర్ఓ పసూనూరి రాజేందర్ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పౌరసంబంధల శాఖ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల మహనీయుల మాసం కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు మద్దెల వీరస్వామి, జిల్లా కార్యదర్శులు దాసరి మహేందర్, గంగుల రమేష్, జక్కుల నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స విజయవంతం
నయీంనగర్: అకస్మాత్తుగా వచ్చే తీవ్ర తలనొప్పిని సాధారణంగా తీసుకోవద్దని, ఇది కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకర బ్రెయిన్ అన్యూరిజం కావొచ్చని హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రి న్యూరో సర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి తెలిపారు. మలక్పేట్ యశోద ఆస్పత్రి వైద్య బృందం సకాలంలో అత్యవసర ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికి త్స చేసి రోగి ప్రాణం కాపాడారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర తలనొప్పితో డిసెంబర్ 5న ఆస్పత్రికి వచ్చాడు. దీంతో వైద్య సిబ్బంది సిటి స్కాన్ పరీక్ష నిర్వహించగా అందులో మెదడులో రక్తస్రావం ఉన్నట్లు తేలింది. మరికొన్ని పరీక్షల్లో మెదడులోని రక్తనాళంలో పెద్ద బ్రెయిన్ అన్యూరిజం ఉన్నట్లు గుర్తించారు. ఇది అత్యంత ప్రాణాపాయకర పరిస్థితి. అన్యూరిజం నిర్మాణం అత్యంత క్లిష్టంగా ఉండడంతో కోయిలింగ్, స్టంట్ చికిత్సలు సురక్షితంగా చేయడం సాధ్యం కాలేదు. అవి మెదడుకు రక్తప్రవాహాన్ని ఆపే ప్రమాదం ఉండడంతో అత్యవసరంగా ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స (మైక్రో సర్జికల్ క్లిప్పింగ్) నిర్వహించారు. క్లిష్టమైన బ్రెయిన్ అన్యూరిజం కేసులకు కూడా విజయవంతంగా చికిత్స చేస్తున్నామని వారు తెలిపారు. సమావేశంలో మేనేజర్ ఎ.వాసుకిరణ్ రెడ్డి, గంగయ్య పాల్గొన్నారు. యశోద ఆస్పత్రి న్యూరోసర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి -
నేటినుంచి ‘టెన్త్’ మూల్యాంకనం
విద్యారణ్యపురి: టెన్త్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. ఈ క్యాంపునకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని సబ్జెక్టులు కలిపి 2,40,100 జవాబుపత్రాలు కేటాయించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ జవాబుపత్రాలు రాగా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. ఈ క్యాంపు ఆఫీసర్గా హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా ఏసీజీఈ భువనేశ్వరి, ఎంఈఓ హనుమంతురావు వ్యవహరిస్తున్నారు. నేటినుంచి మొదటి దశలో స్పాట్ ప్రక్రియ ఫాతిమా హైస్కూల్ స్పాట్ కేంద్రంలో బుధవారం నుంచి 9వతేదీవరకు తెలుగు, హిందీ,ఇంగ్లిష్, మ్యా థ్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఇందుకు 600 మంది ఉపాధ్యాయులను ఏఈలుగా, సీఈలు,స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని సీనియరీటీ ప్రకారం ఆయా టీచర్లను స్పాట్ విధులకు కేటాయించారు. వీరు ఉదయం 8.30 గంటలకు క్యాంపులో తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సింటుది. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 1,250 మంది ఉపాధ్యాయుల వరకు నియామాక ఉత్తర్వులు అందజేశారు. రెండోదశలో 10 నుంచి 17వ తేదీ వరకు.. టెన్త్ మూల్యాంకనం రెండోదశలో ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. మూడోదశలో 15 నుంచి 23వ తేదీ వరకు.. మూడో దశలో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం 15 నుంచి 23వ తేదీ వరకు చేపటనున్నారు. ఇందులో సోషల్ స్టడీస్, ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టులు ఉంటాయి. నియామకమైన ఉపాధ్యాయులందరూ మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. విధులు సక్రమంగా నిర్వర్తించాలి.. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలని క్యాంపు ఆఫీసర్, హనుమకొండ జిల్లా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాజీపేట ఫాతిమాహైస్కూల్ స్పాట్ కేంద్రంలో సంబంధిత డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ ప్రక్రియ 2,40,100 జవాబు పత్రాలు కేటాయింపు 1, 250 మంది వరకు టీచర్లకు విధులు ఫాతిమా హైస్కూల్లో స్పాట్ కేంద్రం -
యశ్వంత్కు గోవా సీఎం అభినందన
మరిపెడ రూరల్ : తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ గోవాలో పర్వతరోహణ చేసిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ను మంగళవారం మర్యాదప్వూకంగా కలిశారు. ఈ సందర్భంగా యశ్వంత్ను సీఎం అభినందించారు. యశ్వంత్ ప్రస్తుతం ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ జాతీయ మిషన్లో భాగంగా గోవాలోని ‘సోన్సోగోర్’ ఎత్తైన పర్వతాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించడం సాహసంతో కూడిన అరుదైన విజయమన్నారు. దేశంలోని అతి ఎత్తైన పర్వత శిఖరాలను, ఏడు ఖండాల్లోని శిఖరాలను అధిరోయించాలనే లక్ష్యంతో శిఖరాగ్ర సమావేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందని సీఎం కొనియాడాడు. పిన్న వయసులో మౌంటైనర్ యశ్వంత్ చేసే ఈ ప్రయాణం దేశ యువతకు స్ఫూర్తిని ఇవ్వడంతోపాటు ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. ఇంటర్వర్సిటీ ఖోఖో టోర్నమెంట్కు కేయూ ఉమెన్ జట్టు కేయూ క్యాంపస్: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శి రీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈజట్టుకు వరంగల్ ఎల్బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. రాజు కోచ్గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. పంటమార్పిడితో నేల ఆరోగ్యం హసన్పర్తి : పంటమార్పిడి విధానం అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి అన్నారు. భీమారంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు పంటమార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పత్తి పంట తర్వాత అపరాల పంట, నువ్వులు సాగు చేయాలన్నారు. వానాకాలంలో వరి, యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలైన పెసర, మినుములు, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయడం ద్వారా మట్టిలో పోషకాలు సమతుల్యంగా ఉంటాయన్నారు. ఆదర్శ రైతు ఆదిరెడ్డి మాట్లాడుతూ కంది పంటకు మద్దతు ధర పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఆదిరెడ్డి, శాస్త్రవేత్త మాధవి, వ్యవసాయాధికారిణి అనురాధ, ఏఈఓలు భాస్కర్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ పంటకు మద్దతు ధర ప్రకటించాలి
వరంగల్ చౌరస్తా : రైతులు పండించిన ప్రతీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ సోమిడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన రైతు ఉద్యమ నేత, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత కూసం రాజమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో కొత్త వంగడాలను తయారు చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసినప్పుడే నిరుద్యోగం నిర్మూలనవుతుందన్నారు. 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇలాంటి రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నాలను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. గత కేంద్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యల నివారణతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డాక్టర్ స్వామినాథన్ కమిటీని నియమించిందన్నారు. ఈ కమిటీ కొత్త వంగడాలను రూపొందించి రైతాంగానికి దిగుబడి వచ్చే విత్తనాలను అందించాలని సూచించిందన్నారు. అయితే ఆ సిఫార్సులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. విత్తనం, విద్యుత్, మార్కెట్ కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాల ని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వమే 50శాతం సబ్సిడీతో అందించాలని, ఫసల్ బీమా పథకాన్ని కొనసాగించాలని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. నాయకులు ఓదల రాజయ్య, సోమ రామ్మూర్తి, పల్నాటి మల్లేశం, వంగూరు నర్సింహ, వన్నాల తిరుపతిరెడ్డి, వివిధ జిల్లా బాధ్యులు తిరుపతి, మస్కు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి రాష్ట్ర సదస్సులో జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ -
అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ మృతి
హన్మకొండ: విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడి అన్మ్యాన్డ్డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ మృతిచెందిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ వరంగల్ నగరంలోని యాదవనగర్ సెక్షన్లో అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గాదె పున్నం చందర్ విధుల్లో భాగంగా సోమవారం విద్యుత్ స్తంఽభాన్ని నిచ్చెన పై నుంచి ఎక్కుతూ కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా అంబులెన్స్లో మృతదేహంతో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మృతుడి భార్య శ్వేతకు ఆర్టిజన్గాన్ ఉద్యోగ అవకాశం కల్పించాలని, నష్టపరిహారం ఇప్పించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీడీసీఎల్ సీజీఎం రాజు చౌహాన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, ఇతర అధికారులు చేరుకుని పున్నం చందర్ చనిపోవడం బాధాకరమని, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని న్యాయం చేస్తామని చెప్పారు. సీఎండీ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. ధర్నా విరమించకపోవడంతో ప్రతినిధుల బృందాన్ని హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ వద్దకు చర్చలకు తీసుకెళ్లారు. డైరెక్టర్లు సి.ప్రభాకర్, వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ విషయమై టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి సంస్థ పరంగా రూ.17 లక్షల ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా రూ.5 లక్షలు మొత్తం రూ.22 లక్షలు అందజేస్తామని వివరించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాపు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడిన పున్నం చందర్ మృతదేహంతో టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా -
నిందితుడి ఇంటికి నిప్పు
చెన్నారావుపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యంతండాకు చెందిన బోడ స్రవంతి(28) తన ఇద్దరు కుమారులు కార్తీక్(12), కౌశిక్ (08)తో మంగళవారం హైదరాబాద్లోని కూకట్పల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, భర్తే.. భర్య, కుమారులను హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆమె భర్త ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి చుట్టూ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఇంట్లో సామగ్రి కాలిపోయింది. నాడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.. నేడు అదే ప్రేమను చిదిమేశాడు.! చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం శివారు బోడమాణిక్యతండా జీపీకి చెందిన బోడ ప్రవీణ్ సమీపంలోని 16 చింతల తండాకు చెందిన స్రవంతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 14 సంవత్సరాల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ జన్మించారు. ఈ క్రమంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా మళ్లీ ఒక్కటయ్యే వారు. కానీ రెండు సంవత్సరాల క్రితం ప్రవీణ్ మరో మహిళకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ విషయం స్రవంతికి తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్ వేధింపులు అధికమవడంతో త ట్టుకోలేక స్రవంతి ఆరు నెలల క్రితం తనపిల్లలను తీసుకుని వచ్చి తల్లిగారి ఇంటి వద్ద 16 చింతల తండాలో ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రవీణ్ తీరు మారడం లేదని తల్లిదండ్రుల వద్ద వాపోయేది. అయితే చివరి అవకాశంగా ఒక్కసారి చూడమని తల్లిదండ్రులు సోమవారం నర్సంపేటలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇక నుంచి సక్రమంగానే ఉంటానని నమ్మబలికిన ప్రవీణ్.. భార్యాపిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ 24 గంటలు గడవక ముందే ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలతో కలిసి స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో కుటుంబంతోపాటు తండాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు.. తమ కూతురు స్రవంతి, ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ను తమ అల్లుడు ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు భద్రి, భిక్యా ఆరోపించారు. ప్రవీణ్ రెండు సంవత్సరాల క్రితం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, గతంలో గొడవలు జరిగా యని తెలిపారు. ఆరు నెలలుగా స్రవంతి,ప్రవీణ్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అతను స్రవంతిని వేధిస్తున్నాడని, తన ప్రేమకు ఇతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో భార్యాపిల్లలను హత్య చేశాడని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించి ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో తల్లికుమారుల అనుమానాస్పద మృతి బోడమాణిక్యంతండాలోని భర్త ఇంటికి నిప్పు పెట్టిన మృతురాలి బంధువులు భర్తే హత్య చేశాడని ఆరోపణ -
ఆర్టీఏలో వాహనదారుల సందడి
● నేడు సారథి పోర్టల్పై అవగాహన ఖిలా వరంగల్ : రవాణాశాఖ సేవలన్నీ సారఽథి పరివాహన్ పోర్టల్ ద్వారా అందించాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్టీఏ సేవలను మరింత సులభతరం చేసి దళారుల ప్రమేయం తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణ రవాణాశాఖ ఇటీవల పోర్టల్లో చేరింది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి రాకుండా ఇంటి వద్ద కూర్చొని సారఽథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, శాశ్వత లైసెన్స్ (డీఎల్) పొందే ఆవకాశం ఉంది. ఈప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుందని ప్రచారం జోరందుకుంది. ఈ విధానంతో వాహనదారులు మొబైల్ ఫోన్, కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) పరీక్ష పాస్ కావడం అంత సులభం కాదని, ఒక్కసారి పరీక్ష ఫెయిల్ ఆయితే మరోసారి స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయం తెలిసి మంగళవారం వాహనదారులు పెద్ద ఎత్తున స్లాట్స్ బుక్ చేసుకున్నారు. మంగళవారం 70ఎల్ఎల్ఆర్, 50 డీల్ కోసం వాహనదారులు సారథి పోర్టల్లో స్లాట్స్ బుక్ చేసుకుని ఆర్టీఏకు చేరుకున్నారు. అనంతరం జీరో కౌంటర్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించి ఆర్టీఏ సేవలు అందుకున్నారు. రేపు మెగా జాబ్మేళా హన్మకొండ అర్బన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) ప్రాంగణంలో రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు మెగాజాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.చందర్ తెలిపారు. వివరాల కోసం వరంగల్ ఐటీఐ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
గుముడెల్లి రేణుకకు ఘన నివాళి
దేవరుప్పుల : ఏడాది క్రితం కగార్ ఆపరేషన్లో నేలకొరిగిన మావోయిస్టు అనుబంధ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు, విప్లవ రచయిత గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో అమరత్వ స్మరణతో ఉద్యమాల ఖిల్లా కడవెండి మరోసారి ఎరుపెక్కింది. మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో ప్రథమ వర్ధంతి తల్లిదండ్రులు సోమయ్య, జయమ్మ సమక్షంలో నిర్వహించారు. ఈ వర్ధంతికి అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి అధ్యక్షత వహిచంగా పలువురు స్మారక స్తూపం వద్ద ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, అరుణోదయ గాయకురాలు విమలక్క, విరసం నేత పాణి మాట్లాడు తూ రేణుక ఉన్నత జీవితం వదిలి ప్రజాసమస్యల పరిష్కారానికి పుస్తకాల్లో మిరుగుడుపూవు(మి డ్కో)గా అటవీబాట పట్టి వెనుకంజ వేయలేదన్నారు. ఓ మహిళగా అనేక పోరాట రూపాల్లో సమాజ స్థాపన కోసం పాటుపడుతుంటే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరిట పొట్టన బెట్టుకుందన్నారు. రేణుక భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆమె రచనలు దేశ విప్లవోద్యమానికి వేగుచుక్కగా మారాయన్నారు. అనంతరం పద్మకుమారి మాట్లాడుతూ నక్సల్ ఉద్యమంలో నేటికి ఇరవై వేల మంది నేలకొరగగా ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తామన్నా లొంగుబాటు నేతల భరోసా తమకు అవసరం లేదన్నారు. అమరుల ఆశయాల సాధనకు వారి వైఖరి వెలిబుచ్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, గాయకులు మిడ్కో త్యాగాన్ని గుర్తు చేసేలా కవితలు, పాటలు ఆలోచింపజేశా యి. సమావేశంలో విరసం ప్రతినిధి పాణి, సామాజిక ఉద్యమకార్యకర్త సజయ్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, సీనియర్ జర్నలిస్టులు భరద్వాజ్, రమాసుందరి, మిడ్కో కుటుంబ సభ్యులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కడవెండిలో విప్లవ రచయిత మిడ్కో మొదటి వర్ధంతి సభ హాజరైన ప్రజాసంఘాలు, విరసం, మాజీ మావోయిస్టులు -
పెత్తందారుల గుప్పిట్లో హెచ్సీఏ
వరంగల్ స్పోర్ట్స్: పెత్తందారులు, అగర్వాల్, తమిళీయులు, తెలంగాణేతరుల కబంధహస్తాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొనసాగుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్సీఏలో నిధుల దుర్వియోగం, ఇతర అక్రమాలపై విచారణ జరపాలనే టీసీఏ ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగిందన్నారు. విచారణలో రూ.660 కోట్లు దుర్వినియోగమైనట్లు సీఐడీ గుర్తించిందని, అందులో భాగంగానే హెచ్సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతరులు జైలుకెళ్లారన్నారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. 70 సంవత్సరాలుగా వందల కోట్ల హెచ్సీఏ నిధులను కొల్లగొట్టిన అక్రమార్కులు ప్రతీ ఒక్కరు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. హెచ్సీఏ అక్రమాలపై బాంబే హైకోర్టులో కేసు నడుస్తోందని త్వరలోనే టీసీఏకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో మినీస్టేడియం నిర్మాణానికి 8 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. వచ్చే ఏడాదిలో రంజీ మ్యాచ్ నిర్వహించేలా క్రీడాకారులకు శిక్షణ అందిస్తామన్నారు. స్టేడియంతోపాటు నగరంలో ఎక్సలెన్సీ ఆఫ్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. వారం రోజుల్లో ఫైనల్ చేసి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయచందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ అలీం, సీనియర్ క్రికెటర్ జయచందర్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి -
పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనల అతిక్రమణ
ఎంజీఎం : మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో వైద్యులు నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు మంగళవారం ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారి కథనం ప్రకారం.. ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇజ్జగిరి సుజాత (40) తీవ్ర గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందింది. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మిల్స్ కాలనీ పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే ముందు చేపట్టే పంచనామాలో తండ్రి సంతకం తీసుకోకపోవడంతోపాటు కనీస సమాచారం అందించలేదు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా, ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, నిబంధనల మేరకే పోస్టుమార్టం నిర్వహించామని ఆర్ఎంఓ అశ్విన్ వివరించారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. మృతురాలి బంధువుల ఆరోపణ ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన -
ఆకట్టుకున్న ‘జగన్నాథ దేవాలయ చరితం’
● ముగిసిన పోతన విజ్ఞాన పీఠం వార్షికోత్సవం హన్మకొండ కల్చరల్: పోతన విజ్ఞానపీఠం 39వ వార్షికోత్సవంలో భాగంగా చివరిరోజు జగన్నాథ దేవాలయ చరితం నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంగళవారం వరంగల్లోని పోతనవిజ్ఞాన పీఠం ఆడిటోరియంలో గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సీఏ త్రిపురనేని గోపిచంద్, ఆత్మీయ అతిథులుగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, నెల్లుట్ల రవీందర్రావు, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పౌరాణిక కళాకారుడు పల్లకొ ండ రాజేందర్ను సన్మానించి ‘నటచతుర’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం పోతన విజ్ఞానపీఠం వారిచే పీఎల్ఎన్ ప్రసాద్ రచించిన జగన్నాథ దేవాలయ చరితం చారిత్రక, పౌరాణిక వచన నాటకాన్ని కుసుమ సుధాకర్ దర్శకత్వంలో ప్రదర్శించారు. జగన్నాథుడిగా జూలూరి నాగరాజు, విశ్వావసుగా కాజీపేట తిరుమలయ్య, నారధుడిగా గొట్టె రమేశ్, ఇంద్రద్యుయుడుగా జేఎన్ శర్మ, విద్యావతిగా కుసు మ సుధాకర్, లలితగా సురభిహారిక తదితరులు పాత్రలు పోషించారు. నాటక నిర్వహణ అడ్లూరి చంద్రశేఖర్, సహకారం షఫీమహ్మద్, మాలిజయరాజ్, సురభి సంతోష్ రాగాలంకరణ చేయగా,బాపనపల్లి పరమేశ్వర్ మేకప్ చేశారు. -
నానో యూరియాతో రైతులకు మేలు
డోర్నకల్: నానో యూరియాతో పంటలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని డీఏఓ సరిత తెలిపారు. మండలంలోని చిలుకోడు రైతువేదికలో మంగళవారం జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా టెలికాన్ఫరెన్స్లో పలువురు రైతులు అధికారులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. నానో యూరియా నేరుగా మొక్కలకు అంది ఎదుగుదల వేగంగా ఉంటుందని తెలిపారు. ఘన రూపంలో ఉండే యూరియా బస్తాల కంటే ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడకం తేలికగా ఉంటుందన్నారు. మామిడిపంట పూతదశలో వచ్చే తెగుళ్లను వెంటనే గుర్తించి మందులు పిచికారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ అనిల్కుమార్, ఏఈఓ అవినాష్, సెరికల్చర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మహబూబాబాద్
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267ప్రజాహితానికి ప్రత్యేక కార్యాచరణ● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ప్రజాహితం కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనున్నట్లు ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశం మందిరంలో మంగళవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రజల ప్రాణ రక్షణ కోసం హెల్మెట్లు ధరించే విధంగా అవగాహన కల్పిస్తామని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల సహకారం ఉండాలని కోరారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టి హెల్మెట్లు ధరించే విధంగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గంజాయి సేవించే వారిని కట్టడి చేసందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీ నుంచి మూడు వార్డులను, ప్రతీ మండలం నుంచి రెండు గ్రామాలను ఎంపిక చేస్తామన్నారు. గంజాయి కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య పాల్గొన్నారు. మానుకోట మున్సిపల్ బడ్జెట్పై కౌన్సిలర్ల అసంతృప్తి కాంగ్రెస్, సీపీఐ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం సమావేశంలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం సిబ్బంది తమ మాట వినడం లేదని చైర్పర్సన్ ఆవేదన -
ఈ–నామ్లో సాంకేతిక సమస్య
● సాయంత్రం వరకు ప్రారంభమైన కాంటాలు కేసముద్రం: ఈ–నామ్ విధానంలో కొత్తగా అప్డేట్ చేసిన 2.0వెర్షన్ సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో రైతులు రోజంతా తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రైతులు మక్కలు, మిర్చి బస్తాలను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకువచ్చారు. దీంతో ఉదయం 194 మంది రైతులకు లాట్ ఐడీలు ఇచ్చారు. ఈ క్రమంలో వ్యాపారులు రైతులు తీసుకువచ్చిన సరుకులను చూసిన అనంతరం, టెండర్లు వేసే క్రమంలో లాగిన్ ఓపెన్ కాలేదు. సాయంత్రం వరకు సాంకేతిక సమస్య అలాగే ఉండడంతో, చేసేదీ ఏమీలేక మాన్యువల్గా చీటీలపై ధరలను వేసి రైతులకు ఇచ్చారు. అప్పటి వరకు రైతులు పంట రాశుల వద్ద, మరికొందరు మార్కెట్ ఆఫీస్ వద్ద విన్నర్ జాబితా కోసం పడిగాపులు పడుతూ ఇబ్బందులు పడ్డారు. కాగా సాయంత్రం 6 గంటలకు కాంటాలు మొదలు పెట్టడంతో రాత్రి సమయంలో తొలకాలు జరిగాయి. మార్కెట్కు 10వేల మక్కల బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మానుకోట వ్యవసాయ మార్కెట్లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. -
గందరగోళంగా బడ్జెట్
మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యో తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విడుదల చేయించిన రూ.60 కోట్ల నిధుల జీఓ వచ్చిందా.. వస్తే ఎందుకు బడ్జెట్లో పొందుపర్చలేదని కమిషనర్తో కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ స్నేహ శబరీష్ సైతం కమిషనర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చైర్పర్సన్కు అయినా జీఓ చూపించారా లేదా అని సీరియస్ అయ్యారు. దీంతో కమిషనర్ మళ్లీ బడ్జెట్ రూ.92,66,70,000 రూపకల్పన చేసి ప్రవేశపెట్టారు. సీపీఐ వర్సెస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు.. సీపీఐ కౌన్సిలర్ అజయ్సారథిరెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రవికుమార్ అభ్యంతరం తెలిపారు. కేవలం బడ్జెట్ గురించి మాట్లాడాలని, వేరే విషయాలు వద్దని రవికుమార్ అనడంతో సీపీఐ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చిదిరాల అరుణ పారిశుద్ధ్యం తదితర సమస్యలపై మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గుండా రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. కేవలం బడ్జెట్ గురించి మాట్లాడాలని, ఇతర విషయాలపై మాట్లాడొద్దన్నారు. ఈక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రూ.60కోట్ల నిధులపై లొల్లి.. ఎమ్మెల్యే విడుదల చేయించిన రూ.60 కోట్ల నిధుల జీఓ వచ్చిందా.. ఫైనాన్స్ క్లియర్ అయిందా.. లేకుంటే కమిషనర్ బాధ్యత వహించాల్సి వస్తుందని పలువురు కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. అనంతరం రూ.92,66,70,000 బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమోదించారు. మున్సిపల్ చట్టాన్ని చదవాలి: కలెక్టర్ ముందుగా ప్రతీ కౌన్సిలర్ మున్సిపల్ చట్టాన్ని చదివి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు కృషి చేయడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి గత ఏడాది రూ.30 లక్షలు వస్తే.. ఈ ఏడాది రూ.6కోట్లు ఎలా వస్తాయని, అధికారులు బడ్జెట్ రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. వాహనాలు ఎక్కువగా మరమ్మతుల బారిన పడుతున్నాయన్నారు. నిధులు రావడం లేదని, స్టాఫ్ సక్రమంగా రావడం లేదని కలెక్టర్కు వివరించారు. వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ.. మున్సిపల్ ఆదాయం పెంచుకోవాలన్నారు. తొర్రూరు బస్టాండ్ ఏరియాలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో కమిషనర్ రాజేశ్వర్, డీఈఈ ఉపేందర్, టీపీఓ సాయిరాం, మేనేజర్ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీహరి, అధికారులు తదిత రులు పాల్గొన్నారు. -
గడ్డిమందును నిషేధించాలి
● అసెంబ్లీలో ఎమ్మెల్యే మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : గడ్డిమందు పారాక్వాట్ డైక్లోరైడ్ను పూర్తిగా నిషేధించాలని అసెంబ్లీలో ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం అభినందనీయమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ గడ్డి మందును నిషేధించాలనే అంశంపై సోమవారం మాట్లాడారు. పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలని గతంలో అసెంబ్లీలో రెండు, మూడుసార్లు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు. ఈ గడ్డిమందుకు విరుగుడు మందులేదని, కుటుంబ తగాదాలు, చిన్నచిన్న విషయాలకు మనస్థాపానికి గురై గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గడ్డిమందును తాగిన గంటన్నరలోనే కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, తదితర అవయవాలు పనిచేయకుండా పోతున్నాయని, బాధితులకు వెంటనే డయాలసిస్ చేసి సరైన చికిత్స చేసినా బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. గడ్డిమందుపై నిషేధం విధించే వరకు అందరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, వ్యవసాయ అధికారుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని కోరారు. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మరో ఐదు డయాలసిస్ బెడ్లను పెంచారని, అందులో ఒక బెడ్ గడ్డిమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వారికి రిజర్వ్ చేశారని, ఐదు డయాలసిస్ బెడ్లను పెంచినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఖిలా వరంగల్: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. గుంటూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్, పోలీస్ కమిషనరేట్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా మామునూరు సబ్డివిజన్ ఏసీపీ వెంకటేష్, హెచ్ఎం విద్యాసాగర్ అధ్యక్షతన ఇటుక బట్టిల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు విద్యా సామగ్రి, యూనిఫామ్ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనేది పోలీస్, వివిధ ప్రభుత్వశాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. అడిషనల్ డీసీపీ ఎన్.రవి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాం సుందర్, ఎస్సైలు సుధాకర్, శ్రీకాంత్, గుంటూరుపల్లి సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ దండు నరేష్, బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, కుమ్మరి రవికుమార్, డాక్టర్ అనంద్, వసుధ, డీసీపీఓ ఉమ, శిరీష పాల్గొన్నారు. కళానైపుణ్యాలను పెంచేది ‘రంగస్థలం’ ● రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య హన్మకొండ కల్చరల్: కళాకారుల ప్రతిభను వె లికితీసి వ్యక్తిత్వం, కళానైపుణ్యాలను పెంచేది రంగస్థలమని రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్లోని పోతనవిజ్ఞానపీఠంలో రెండురోజుల పాటు జరిగే పీఠం వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా తిరుమలయ్య, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, యేర కోటేశ్వరరావు, నేరెళ్ల శోభావతి, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని మాట్లాడారు. అనంతరం రంగస్థల కళాకారులను సన్మానించారు. మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వరంగల్ ప్రదర్శించిన ‘వివాహబంధం’ నాటిక అలరించింది. ఈ నాటికలో మాడిశెట్టి రమేశ్, సాదుల సురేశ్, కొడం సురేందర్, వేముల ప్రభాకర్, ఆకుతోట లక్ష్మణ్ నటించారు. సురభి సంతోష్ రంగాలంకరణ చేయగా, సంగీతం పాక సృజన్ అందించారు. పీఠం కార్యవర్గ సభ్యులు నాగరాజు, శ్రీధర్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యం
మహబూబాబాద్ రూరల్ : మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మక్కలను మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకువస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్క్ఫెడ్ అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో మక్కలకు మద్దతు ధర రూ.2,400 అందడంలేదని, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి క్వింటాకు ధర రూ.1,800 చెల్లిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. కాగా, ఆందోళనతో మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్కుమార్ను నిర్బంధించారు. ఆగ్రహించిన అన్నదాతలు ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ నిర్బంధం -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
పర్వతగిరి: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తూనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం టూక్యానగర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. టూక్యానగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్(46) సోమవారం విధులకు హాజరయ్యాడు. పాఠం బోధిస్తున్న క్రమంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే నెక్కొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మృతుడు చంద్రశేఖర్ది సంగెం మండలం కాట్రపల్లి గ్రామం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. వడదెబ్బతో యువకుడి మృతి కురవి: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కురవి మండలం కొత్తూరు(సీ)లో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పత్తేపురపు బాబు(36) రేకుల ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడు రోజులుగా రేకుల కింద ఉండడంతో ఎండకు అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఆరోగ్యం క్షీణించి సోమవారం మృతి చెందాడు. మృతుడు బాబుకు భార్య రేణుక, కూతురు, కుమారుడు ఉన్నాడు. చెక్ బౌన్స్ కేసులో ఒకరికి జైలు ములుగు రూరల్ : చెక్ బౌన్స్ కేసులో ఒకరికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న తీర్పు వెలువరించినట్లు ఎస్సై ఉపేందర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు మండలానికి చెందిన శంకర్ అనే వ్యక్తి వద్ద 2023లో శ్రీనివాస్ అనే వ్యక్తి రూ. 8లక్షల అప్పు తీసుకొని చెక్ అందించాడు. చెక్కును బాధితుడు బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీంతో శంకర్పై శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి కోర్టులో హాజరుపర్చుగా నేరం రుజువు కావడంతో జడ్జి.. శ్రీనివాస్కు నెల రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు. -
సాంకేతికతతో తగ్గిన విద్యుత్ అంతరాయాలు
హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల అంతరాయాల లొకేషన్ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్ కండక్టర్తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్, శ్రీని వాస్, వేణు మాధవ్, వాసుదేవ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి
గ్రామాల్లో అంగన్వాడీ కోడిగుడ్ల విక్రయం● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని, అందుకు సంబంధిత అఽధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎస్సీ యాక్షన్ ప్లాన్పై డిస్ట్రిక్ లెవల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పథకాలపై విస్త్తృత ప్రచారం చేయాలన్నారు. బ్యాంకర్లతో మాట్లాడి రుణాల విషయంలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ శ్రీమన్నారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం తనిఖీమరిపెడ రూరల్: మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం అంగన్వాడీ కేంద్రం–1ను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. కేంద్రంలోని చిన్నారులు ప్రార్థన చేయగా వారిని అదనపు కలెక్టర్ అభినందించారు. కేంద్రం నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని సీడీపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, సీడీపీఓ ఎల్లమ్మ, మున్సిపల్ కమిషనర్ విజయానంద్, ఎంపీఓ సోంలాల్, సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ రేణుక పాల్గొన్నారు. ఇనుగుర్తి: చిన్నారులు, గర్భిణుల, బాలింతలకు అందించే అంగన్వాడీ కోడిగుడ్లు గ్రామాల్లో విక్రయిస్తున్న ఘటన మండలంలోని చిన్ననాగారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో కిశోర్ ఎగ్ సప్లయర్ పేరుతో ఉన్న టాటాఏస్ వాహనంలో తిరుగుతూ కేసు కోడిగుడ్లు రూ.60నుంచి రూ.70వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేసిన గ్రామస్తులు కోడిగుడ్లపై అంగన్వాడీ ముద్ర ను గమనించి తహసీల్దార్ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చారు. కొడిగుడ్ల వాహనాన్ని స్ధానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన గుడ్లను పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులపై దర్యాప్తు చేస్తామన్నారు. -
మహబూబాబాద్
మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 20267దరఖాస్తులను సత్వరమే పరిష్కరించండి● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావా ణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్లు, దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలన్నా రు. ప్రత్యేక అధికారులు హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. కాగా, ప్రజావాణిలో 168వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, జిల్లాస్థాయి అఽధికారులు పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పంచాయతీకి చెందిన నరేందర్, కాంతారావు, పాపారావు, శ్రీను ఆ గ్రామంలోని ఫర్టిలైజర్స్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఎరువులు ఉద్దెర ఇచ్చి వడ్డీలు వేసి లక్షల్లో వసూళ్లు చేసి ఇబ్బందులు పెడుతున్నారని వినతిలో పేర్కొన్నారు. వ్యాపారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా కేంద్రం శివారులోని 107 సర్వే నంబర్లో భూ కబ్జా చేసిన ఓం నారాయణపై చర్యలు తీసుకోవాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్ వినతిపత్రం అందజేశాడు.దర్యాప్తు నాణ్యతను బలోపేతం చేయాలి● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ, కేసుల్లో దర్యాప్తు నాణ్యతను బలోపేతం చేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన వివిధ రకాల కేసులపై సమీక్షించారు. పెండింగ్ కేసులు, గ్రేవ్ నేచర్ కేసులు, మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించిన కేసులపై చర్చించారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ విధానం, సాంకేతిక ఆధారాల వినియోగం, సాక్షుల వాంగ్మూలం నమోదు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రతీ కేసులో చట్టపరమైన విధానాలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా కేసుల్లో చార్జిషీట్లను పూర్తిస్థాయిలో ఎలాంటి లోపాలులేకుండా కోర్టులో దాఖలు చేయాలన్నారు. చార్జిషీట్ల తయారీలో ప్రతీ అంశం స్పష్టంగా ఉండేలా, సాక్ష్యాధారాలు బలంగా ప్రతిపాదించేలా, కోర్టులో కేసు నిలబడే విధంగా రూపొందించాలన్నారు. దర్యాప్తు అధికారుల బాధ్యతను గుర్తుచేస్తూ కేసుల్లో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నేరస్తులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం అందేలా దర్యాప్తు చేయడం పోలీస్ అధికారుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తరచూ రాత్రి పర్యటనలు నిర్వహించి పోలీస్ వ్యవస్థ పనితీరును సమీక్షించాలని సూచించారు. గంజాయి తాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమావేశం అనంతరం ఇటీవల మూడు కేసుల్లో నిందితులకు శిక్షలు విధించేలా కృషి చేసిన సీడీఓలు, సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ శబరీష్ అభినందించి, ప్రశంస పత్రాలను అందజేశారు. వారి పనితీరును ఇతర అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాల పరిశీలనమహబూబాబాద్ అర్బన్: మూడో తరగతి విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరిశీలించినట్లు డీఈఓ రాజేశ్వర్ సో మవారం తెలిపారు. విద్యార్థులు చదవడం, రాయడం, సులభమైన అంకగణిత ప్రక్రియలను పరిశీలించామని తెలిపారు. జిల్లాలో డీఈడీ అభ్యర్థులతో ఏడు పాఠశాలల ఎఫ్ఎల్ఎస్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు. ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
రూ. 396.69 కోట్లు
కేయూ అంచనా బడ్జెట్కేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలనభవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ.126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ను ప్లానింగ్, నాన్ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొత్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50లక్షలు, అకడమిక్ , ట్యూషన్ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్ బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభా గాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపకంగా నివాళులర్పిస్తూ సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అకడమిక్ సెనెట్లో ఆమోదం దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధిలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఒరియంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ఐ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫెల్లోలు గా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిటలీకరణ, క్యాంపస్లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. –కె. ప్రతాప్రెడ్డి, వీసీ -
ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్వీకెఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్పీఈయూ నాయకులు రావుల రమణారెడ్డి, కడెం మహేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, ట్రాన్స్ కోవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్.రాంబాబు, పూర్ణాచారి, సతీశ్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సృజన, రాకేశ్, శ్రీధర్, సాగరం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
చి‘వరి’కి పశువులపాలు..
కురవి: నీరు లేకపోవడంతో మండల కేంద్రం శివారు రేకుల తండాలో వరి పంట ఎండిపోయింది. తండాకు చెందిన రైతు శంకర్ తనకున్న వ్యవసాయ బావి కింద రెండున్నర ఎకరాల్లో వరి పంట సాగుచేశాడు. బావిలో నీరు అయిపోవడం, పక్కనే ఉన్న కుంట అడుగంటడంతో ఎకరం పొలం ఎండిపోయింది. దీంతో చేసేదేమీలేక పొలంలో మేపేందుకు ఆదివారం గేదెలను వదిలాడు. ఎఫ్ఆర్ఎస్తో ఉన్నత విద్య బలోపేతం ● టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్గౌడ్, బ్రిజేష్ కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుతో ఉన్నత విద్య బలోపేతం అవుతోందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్గౌడ్, బ్రిజేష్ పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక సభ్యుల సంక్షేమం, డిగ్రీ కళాశాలల ఉన్నతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సీకేఎం) నుంచి ఇటీవల క్రమబద్ధీకరణ పొందిన అధ్యాపకులు మూకుమ్మడిగా సంఘంలో సభ్యత్వం పొందారు. వీరిని రాష్ట్ర కార్యవర్గం సంఘంలోకి ఆహ్వానించింది. అనంతరం వివిధ కళాశాలల అధ్యాపకులకు సంబంధించిన వేతన బకాయిలు, పదోన్నతికి సంబంధించిన అంశాలు, నూతన వేతన సవరణలో ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ వంటి అనేక అంశాల పరిష్కారానికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించించారు. సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.భవాని, అసోసియేట్ సెక్రటరీ అమరేందర్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధరణి పేరుతో బీఆర్ఎస్ భూకబ్జాలు
● అసెంబ్లీలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : ధరణి పోర్టల్ను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మురళీనాయక్ ఆదివారం మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ అక్రమాలపై వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటుచేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని, మానుకోట జిల్లాలో దళిత, గిరిజనులు, పేద, మధ్యతరగతి కుటుంబాల భూములు కబ్జాకు గురయ్యయాని, ప్రభుత్వ భూముల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లపైకి మార్చుకున్నారని, దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం తగ్గించేలా ఉందని, వెంటనే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
గంగపుత్రుల సంక్షేమానికి పాటుపడాలి
● గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపటి సైదులు తొర్రూరు: గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపటి సైదులు కోరారు. డివిజన్ కేంద్రంలోని తిరుమల గార్డెన్లో ఆదివారం గంగపుత్ర సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సైదులు మాట్లాడుతూ.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న గంగపుత్రులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. చేపల వృత్తిదారులకు కోల్డ్ స్టోరేజీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదుమల సంపత్కుమార్, కోశాధికారి అనుమాస సత్యనారాయణ, నాయకులు అంబటి వెంకన్న, ఆనంద్కుమార్, పద్మావతి, రాములు, సాంబయ్య, కిరణ్, వెంకన్న, పిల్లి నాగరాజు, సంతోష్ పాల్గొన్నారు. వ్యవసాయరంగాన్ని పరిరక్షించండి నెహ్రూసెంటర్: దేశానికి అన్నంపెట్టే రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని పరిరక్షించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కోటేశ్వర్రావు, మండల వెంకన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయరంగంపై ఆధారపడిన రైంతాగానికి నష్టం చేసే లా, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. రైతులు, కార్మికులకు నష్టం కలిగించేలా చట్టాలను సవరిస్తూ తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. సంఘం గ్రామ, మండల, జిల్లా మహాసభలను పూర్తి చేసుకోవాలని, ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్లో జాతీయ మహాసభలను నిర్వహించనున్ననట్లు ఆయన పేర్కొన్నారు. ఐలయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ ఉన్నారు. -
కానరాని టీఫైబర్ సేవలు
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026కొనసాగుతున్న ఇంటర్నెట్ ప్రాజెక్టు పనులు ● కనెక్షన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం ● పలుచోట్ల తుప్పుపడుతున్న పరికరాలు ● గ్రామాల్లో అందని ద్రాక్షలా సేవలుగూడూరు: అతి తక్కువ ఖర్చుతో ప్రతీ పల్లెకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ ఫైబర్ సేవల ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ఒకే కనెక్షన్ ద్వారా ఫోన్, ఓటీటీ, టీవీ ఇతర సేవలు అందించాలని రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు క్షేత్రస్థాయిలో కనెక్షన్లులు ఇవ్వకపోవడంతో టీ ఫైబర్ సేవలు పల్లె ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. భూగర్భ కేబుల్తో కనెక్షన్లు.. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి దశ కింద ప్రభుత్వం రెండేళ్ల క్రితం లక్షలు ఖర్చు చేసి టీ ఫైబర్ సెట్లను అమర్చింది. వాటికి విద్యుత్ సరఫరా కోసం ఖరీదైన సోలార్ ప్యానళ్లను కూడా ఏర్పాటు చేశారు. భూగర్భ కేబుళ్లు వేసి పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్సీలకు అనుసంధానం చేసినా ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. ఈమేరకు గూడూరు మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో టీ ఫైబర్ సెట్లతో పాటు సోలార్ ప్యానళ్లను బిగించారు. అందులో గూడూరు మండల పరిషత్తో పాటు గూడూరు, చిన్న ఎల్లాపురం, భూపతిపేట, వెంగంపేట, కోబల్తండా, మర్రిమిట్ట, మచ్చర్ల, బ్రాహ్మణపల్లి, అయోధ్యపురం, బొల్లెపల్లి, రాములుతండా, పడమటితండాలో ఏర్పాటు చేశారు. అదే విధంగా జిల్లాలోని రైతు వేదికల్లో టీ ఫైబర్ నెట్ ద్వారా టీవీలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ గూడూరు మండలంలో ఒక్క భూపతిపేట రైతు వేదికకు మాత్రమే టీ ఫైబర్ నెట్ కనెక్షన్ ఇచ్చారు. మిగిలిన జీపీలు, రైతు వేదికల్లో పరికరాలన్నీ దుమ్ముపట్టిపోతున్నాయి. ఇక గూడూరు వంటి మండల కేంద్రంలో కూడా ఈ సేవలకు సంబంధించిన పరికరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. టీ ఫైబర్నెట్ గ్రిడ్తో ప్రయోజనాలు.. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఒక ఇంట్లో ఒకే కనెక్షన్తో ఫోన్, ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలు పొందవచ్చు. ప్రత్యేక సెటప్బాక్స్ల ద్వారా సాధారణ టీవీలను కూడా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చని, కీ బోర్డు మౌస్ ఉంటే చాలు ప్రత్యేకంగా కంప్యూటర్లు కొనాల్సిన పనిలేదని సమాచారం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వాడడంతో ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు తమ ఐడీల ద్వారా గూగుల్ క్లాసులు వినడం, హోంవర్క్ పనులు సులభంగా చేసుకోవచ్చు. పేపర్ లెస్ సేవలకు ఆటంకం టీ ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో కాగితరహిత (పేపర్ లెస్) పాలన సాధ్యమవుతుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, పనులు త్వరగా పూర్తవుతాయి. ఏప్రిల్ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉందని, ఈ సేవలు ఎప్పుడు అందుతాయనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని సంబంధిత ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. -
నేడు ‘షైన్’ స్కాలర్షిప్ టెస్ట్
హసన్పర్తి : మండలంలోని ఎర్రగట్టు గుట్ట సమీపంలో గల షైన్ పబ్లిక్ స్కూల్లో నేడు (ఆదివారం) మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనున్నట్లు షైన్ విద్యా సంస్థల చైర్మన్ ఎం.కుమార్ యాదవ్, ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 4వ తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఈ టెస్ట్కు అర్హులని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఆయా తరగతులకు సంబంధించిన ప్రశ్నలు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఆంగ్లంలో ఇవ్వడం జరుగుతుందని వివరించారు. విజిలెన్స్ విచారణ హన్మకొండ : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని దేవోజి తండా సబ్స్టేషన్ బోరు నీటిని హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి సాగు నీటి అవసరాలకు వినియోగించడంపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నెల 24న సబ్ స్టేషన్ బోరు పరుల పాలు, దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎన్పీడీసీఎల్ అధికారి అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. వాగులో పడి ఒకరి మృతి బయ్యారం : అలిగేరు వాగులో పడి ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన శనివారం మండలంలోని చింతోనిగుంపు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొనక రాములు (53) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. శుక్రవారం గొర్రెలను మేపేందుకు వెళ్లి సాయంత్రం వాటిని అలిగేరు వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు గుంతలోపడి మునిగాడు. శనివారం ఉదయం వాగు ప్రాంతలో ఓ గుంతలో తేలిన మృతదేహం తేలడంతో అది రాములుదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. సిగ్నల్ లోపం.. నిలిచిన వందేభారత్ రైలు స్టేషన్ఘన్పూర్ : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ స్టేషన్ఘన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పాతగేటు వద్ద శనివారం సాయంత్రం నిలిచిపోయింది. సిగ్నల్లో సాంకేతిక లోపం వల్ల సాయంత్రం 4:15 నుంచి 4:25 నిమిషాల వరకు స్టేషన్ఘన్పూర్లో వందేభారత్ రైలును నిలిపారు. అనంతరం సాంకేతిక లోపాన్ని సరిచేసి కాజీపేట వైపునకు పంపారు. -
కేయూలో యూత్ పార్లమెంట్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగంలో శనివారం విద్యార్థులకు యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ విభాగం అధిపతి డాక్టర్ భారవిశర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అజ్మీరా శంకర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు పర్యవేక్షణలో ఈ మాక్ యూత్ పార్లమెంట్ను నిర్వహించారు. విద్యార్థి కృష్ణసౌజన్య లోక్సభ స్పీకర్గా, పి.మహేందర్, ఎల్.సాయికుమార్, ఎన్.సురేష్, అకింత వివిధ శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భారత్పై ప్రభావం, యువతపై సామాజిక మాధ్యమాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉంది అనే అంశాలపై చర్చించారు. విద్యార్థులకు పార్లమెంట్లో తీసుకునే నిర్ణయాలు, బిల్లులు, చట్టాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూత్ పార్లమెంట్ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ మాక్ పార్లమెంట్లో ఉత్తమ ప్రదర్శన కనపర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అన్వేష్కు సన్మానం మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల స్టేట్ డైరెక్టర్గా పదోన్నతి పొందగా గణిత విభాగం అధ్యాపకులు, విద్యార్థులు ఆయనను సన్మానించారు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు -
కలెక్టర్ను కలిసిన టీఎస్ఈఈయూ నేతలు
హన్మకొండ: హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 నాయకులు కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని హనుమకొండ కలెక్టరేట్లో టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షడు దొనికల సదయ్య, కార్యదర్శి చిట్ల ఓదేలు, వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్యగౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఇష్టారాజ్యం
మహబూబాబాద్ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 202 Iఇచ్చేవారికే దిక్కులేదు..! మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో తాగునీటితోపాటు వివిధ అవసరాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలోని మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతుండడంతో ఉద్యోగులు, సిబ్బంది ముక్కు మూసుకుని విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఉద్యోగులు ఒకటి, రెండుకు బయటకి పరుగులు తీయాల్సిందే. కనీసం కార్యాలయంలోని చేతి పంపు బోరు కూడా పనిచేయడంలేదు. ప్రజల అవసరాలకు, తాగునీటిని అందించాల్సిన కార్యాలయానికే నీటి సరఫరా లేకపోవడం ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేవిషయంపై జిల్లా మిషన్ భగీరథ ఈఈ సురేందర్ ను వివరణ కోరగా రెడ్యాలలో రోడ్డు మరమ్మతు పనుల నేపథ్యంలో పైపులైన్ డ్యామేజ్ వల్ల కార్యాలయంతోపాటు పలు గ్రామాలకు నీటి సమస్య ఉందని తెలిపారు. -
‘క్రీస్తు జ్యోతి’లో టెక్నోజిల్–2026 ప్రారంభం
జనగామ : మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నోజిల్–2026 మహోత్సవ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను కళాశాల డైరెక్టర్ విజయపాల్రెడ్డి ప్రారంభిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాల కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఉదయం టెక్నోజిల్ క్విజ్, రంగోలి, ఐడియాథాన్, స్లో బైక్ రేస్ పోటీలు నిర్వహించారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగంలో మొదటి, ద్వితీయ సంవత్సరంలో 60 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. రంగోలి పోటీల్లో 10 గ్రూపులు పాల్గొని మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా ముగ్గులు వేశారు. 80 మంది విద్యార్థులు స్లో బైక్ రేస్లో డ్రైవింగ్ ప్రతిభ కనబరిచారు. ప్రతిభ కనబరిచిన వారిని కళాశాల డైరెక్టర్ విజయపాల్రెడ్డి, ప్రి న్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో టెక్నోజిల్ కన్వీనర్ డాక్టర్ పీ.యూ అనిత, వంశీకృష్ణ, అమరేందర్ పాల్గొన్నారు. -
పుట్టలమ్మ కుంటలో చేపలు మృత్యువాత?
స్టేషన్ఘన్పూర్ : ఘన్పూర్ శివారు పుట్టలమ్మ కుంట చెరువులో దాదాపు రెండు టన్నుల చేపలు అనుమానాస్పదంగా మృత్యువాత పడిన సంఘటన శనివారం జరిగింది. స్టేషన్ఘన్పూర్ మత్స్యసొసైటీ నాయకులు, మత్స్యకారుల కథనం ప్రకారం.. పుట్టలమ్మ చెరువులో చేపలు ఈసారి భారీగా పెరిగాయని, ఒక్కొ చేప కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు వచ్చాయని తెలిపారు. అయితే శనివారం ఉదయం చూసేసరికి వందల సంఖ్యలో చేపలు మృతిచెంది నీటిపై తేలుతూ ఉన్నాయని పేర్కొన్నారు. అసలేం జరిగిందో తెలియడం లేదని, ఎవరైనా కుట్రపూరితంగా నీళ్లలో విషగుళికలు కలిపి ఉంటారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.5లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఈ విషయమై మత్స్యశాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఘన్పూర్ మత్స్యసొసైటీ చైర్మన్ నీల సోమన్న, నాయకులు గోనెల ఐలోని, అనిల్కుమార్, వెంకన్న, మాజీ ఎంపీటీసీలు మునిగెల రాజు, గోనెల రాజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూ.5లక్షల మేర నష్టం ఆదుకోవాలని మత్స్యకారుల వేడుకోలు -
సాంకేతిక విద్యకు చిరునామా..
కాశిబుగ్గ : వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకుని ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సాంకేతిక విద్యతో విశిష్ఠ గుర్తింపు పొందిన ఈ విద్యా సంస్థ, చిన్నస్థాయి నుంచి ప్రారంభమై నేడు మహావృక్షంగా అభివృద్ధి చెందింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు మార్గదర్శకంగా నిలిచింది. చిన్న షెడ్డుతో మొదలై.. కళాశాల ప్రారంభంలో నగరంలోని అజంజాహి మిల్లులోని ఒక షెడ్డులో 120 మంది విద్యార్థులతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రీకల్ కోర్సులతో తరగతులు ప్రారంభమయ్యాయి. అనంతరం వరంగల్లోని ఎన్ఐటీ (ఆర్ఈసీ) తరగతులు కూడా తొలినాళ్లల్లో ఇదే కళాశాలలో నిర్వహించారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులుగా ఎదిగి కళాశాలకు గుర్తింపు తీసుకు వచ్చారు. బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, జెన్కో, ఎన్పీడీసీసీఎల్, హెచ్సీఎల్, డీఆర్డీఓ, ఇస్రో, ఐడీపీఎల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1995 జూలై నుంచి.. 1995 జూలై 10న పదెకరాల విస్తీర్ణంలో పాలిటెక్నిక్ కళాశాల నూతన క్యాంపస్కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కళాశాలలో 1,620 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 1995–96లో ఈసీఈ, కంప్యూటర్ కోర్సులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కళాశాలలో ప్రవేశాలకు అధిక డిమాండ్ ఉండేది. గ్రంథాలయంలో సుమారు 25 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ ప్రక్రియలు సైతం ఇక్కడే నిర్వహించారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే వారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఈ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించడం విశేషం. నేడు పాలిటెక్నిక్ కళాశాలలో వేడుకలు కళాశాల ప్రాంగణంలో నేడు(ఆదివారం) ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుక వచ్చేందుకు ఈ మహా సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నేడు 70 వసంతాల వేడుకలు -
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ చిన్నగూడూరు: పదో తరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 45 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్షకు 8,165 మంది విద్యార్థులు హాజరు కాగా, 99.89 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అన్ని విద్యాసంస్థల్లో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. గ్రామసభలను ఘనంగా నిర్వహించాలి మహబూబాబాద్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల గ్రామసభలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ప్రజాపాలన, తదితర విషయాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో లబ్ధిదారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు. -
నేడు విలవిల
నాడు జలకళ.. ● పాకాల ఏటిలో తేలిన రాళ్లు గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని పాకాల ఏరు వానాకాలంలో చెక్డ్యాం పైనుంచి పొంగి ప్రవహిస్తూ కనువిందు చేసేది. కానీ ప్రస్తుతం వేసవికాలం ప్రారంభంలోనే ఏరు ఎండిపోయి రాళ్లు తేలి కనిపిస్తుంది. పాకాల ఏరు నాడు జలకళతో నిండుకుండలా మారగా, నేడు బండలు తేలి నీళ్లు లేక వెలవెలబోతోంది. పాకాల ఏటి పరివాహక ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన వరి పంట ఎండిపోయే దశకు చేరుకుంది. వేసవికాలంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోతే గార్ల మండలంలో పశువులు, మూగజీవాలు, ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం దాపురించింది. జిల్లా అధికారులు తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
పోలీస్ రేంజ్ కార్యాలయ భవనం ప్రారంభం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ రేంజ్ పరిపాలన కార్యాలయ నూతన భవనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం ప్రారంభించారు. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ రేంజ్ కార్యాలయంలో వరంగల్ రేంజ్ పోలీస్ అధికారులకు సంబంధించిన శాఖాపరమైన పరిపాలన కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. పోలీస్ అధికారులు సమస్యలపై రేంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, పరిపాలన పనితీరులో పారదర్శకంగా, బాధ్యతాయుత పని తీరు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, రేంజ్ కార్యాలయం సూపరింటెండెంట్ యుగేంధర్, ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, సురేంద్రతో పాటు ఆర్. ఐలు, ఇన్స్పెక్టర్లు ఇతర రేంజ్ కార్యాలయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
● డీఏఓ సరిత కేసముద్రం: పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తే శారీరకశ్రమతోపాటు ఖర్చులు తగ్గుతాయని జిల్లా వ్యవసాయ అధికారి సరిత అన్నారు. మున్సిపాలిటీ పరిధి ధన్నసరి పీఏసీ ఎస్ను శనివారం ఆమె సందర్శించి, యూరియా నిల్వలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు మాన్యువల్గా పంటలకు మందులు పిచికారీ చేయడానికి బదులుగా, డ్రోన్లను వినియోగించాలని తద్వారా పురుగులు, తెగుళ్లను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ వెంకన్న, సాంకేతిక వ్యవసాయ అధికారి చాయారాజ్, ఏఈఓ దారావత్ రాజేందర్ పాల్గొన్నారు. -
20 కేజీల గంజాయి పట్టివేత
రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం..ఒడిశా రాష్ట్రం నుంచి వరంగల్కు గంజాయిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని ఎండు గంజాయితోపాటు కారును స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా కలిమిల తాలూకాకు చెందిన విక్రమ్ మండేల్, గౌత మ్ మండేల్, విప్రోజిత్ మండేల్ కారులో 20 కేజీల ఎండు గంజాయిని తరలిస్తున్నారు.ఈ క్రమంలో రహదారిపై కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి లభ్యం కాగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి గంజాయిని తూకం వేసి నిర్ధారణ అనంతరం కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పంచాయతీ సెక్రటరీ అజీజ్పాషా, హెడ్ కానిస్టేబుళ్లు రవీందర్, ఏలియా, పోలీసులు హరి, తూళ్ల సంపత్, గణేష్, ప్రవీణ్, సుమన్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 2 కేజీల గంజాయి.. కేసముద్రం : ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకు వచ్చిన 2 కేజీల గంజాయిని తరలిస్తున్న మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధికి చెందిన నలుగురిని కేసముద్రంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపల్ పరిధి ముత్యాలమ్మగూడెనికి చెందిన ఎస్కె రఫీ, జుజ్జూరు రఘు, జమాండ్లపల్లికి చెందిన సముద్రాల శ్రీనాథ్, బెస్తవాడకు చెందిన పిట్టల సాయికుమార్ కలిసి కొన్ని నెలలుగా ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి మహబూబాబాద్, కేసముద్రం చుట్టుపక్కల యువతకు గంజాయి విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నెలరోజులుగా వారిపై పకడ్బందీ సమాచారం సేకరించారు. ఈ క్రమంలో కేసముద్రం బైపాస్రోడ్డు వైపు నలుగురు కలిసి రెండు కేజీల గంజాయిని తీసుకెళ్తుండగా, వారిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాయపర్తిలో కారుతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
కళాశాలలో చదవడం అదృష్టం
పాలిటెక్నిక్ కళాశాలలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడి పూర్వ విద్యార్థులందరూ దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకు వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. రూ.28 కోట్లతో నూతన భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – ఈవీ శ్రీనివాసరావు, అధ్యక్షుడు ప్రిన్సిపాల్గా నాకు గర్వకారణంసుధీర్ఘ చరిత్ర ఉన్న ఈ పాలిటెక్నిక్ కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేయడం గర్వకారణంగా ఉంది. మేధావుల నిలయంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కనులపండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. – డాక్టర్ బైరి ప్రభాకర్, ప్రిన్సిపాల్ -
జీవశాస్త్రానికి అంత్యంత డిమాండ్
మహబూబాబాద్ అర్బన్: జీవశాస్త్రానికి అత్యంత డిమాండ్ ఉందని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇస్తారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రి కళాశాలలో గురువారం జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం ఆధ్వర్యంలో జీవశాస్త్రాల్లో బహుముఖ పరిశోధనపై జాతీయ సెమినార్ ముగింపు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్తారి హాజరై మాట్లాడారు. మెమోరీ, ఎపిజెనెటిక్స్, న్యూరల్ మెమోరీ వంటి అభివృద్ధి చెందుతున్న అంశాలను పరిశీలిస్తే జీవిశాస్త్రంలో రాణించవచ్చాన్నారు. ప్రొఫెసర్లు వెంకయ్య, నారాయణ మాట్లాడుతూ.. మానవ సంక్షేమానికి మాలిక్యులర్ సాంకేతికతను తెలుసుకోవాలని, పరిశోధనలను, మౌలిక ప్రదర్శనలను విశ్లేషించాలని సూచించారు. అనంతరం జాతీయ సదస్సులో పాల్గొన్న వారికి కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్నాయక్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మరిపెడ ప్రిన్సిపాల్ జీవన్కుమార్, కన్వీనర్ అనిల్, అధ్యాపకులు మసూద్ఆహ్మద్, శ్రీనివాస్, సాంబశివరావు, అన్నపూర్ణ, హతీరాం, సుమలత, ఉపేందర్, ఖాసీంషా, సుమన్, రవితేజ, సంతోష్ పాల్గొన్నారు. -
ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
తొర్రూరు : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ యూనియన్ చైర్మన్ ధరావత్ సికిందర్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆర్టిజన్, అన్మ్యాన్డ్, స్పాట్ బిల్లర్స్, పీస్ రేట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సికిందర్ మాట్లాడుతూ..విద్యుత్ సంస్థల్లో పనిచేసే అన్ని రకాల కార్మికులకు జీఓ 11ప్రకారం కనీస వేతనం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ పసుపులేటి మధు, కన్వీనర్ శ్రీనివాస్, కో చైర్మన్ నాగరాజు, కో కన్వీనర్ రమేష్, ప్రతినిధులు హరిప్రసాద్, ప్రకాశ్, వీరన్న, శ్రీను, వెంకన్న పాల్గొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మహేశ్ అన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు షబ్బీర్, నాయకులు సుశ్వాంత్, దిలీప్, సంజయ్, వినయ్, విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు. ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యం డోర్నకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తోందని డోర్నకల్ మున్సిపల్ చైర్ పర్సన్ కొండేటి రాజకుమారి తెలిపారు. గురువారం పలు వార్డుల్లోని ముస్లింలతో సమావేశమై రంజాన్ కానుకలను పంపిణీ చేశా రు. వైస్ చైర్మన్ లావణ్యశ్రీనివాస్, కౌన్సిలర్లు, ముస్లింలు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి.. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె, రేడియం జాకెట్, బూట్లు పంపిణీ చేశారు. అనంతరం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్కు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మాదా లావణ్యశ్రీనివాస్ వాటర్ ఫ్యూరిపయర్ బహూకరించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల తొలగింపునకు తీర్మానం బయ్యారం : బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులను తొలగిస్తూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. గురువారం సర్పంచ్ శాంతికిషన్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మెజార్టీ సభ్యులు ప్రస్తుత ఇందిరమ్మ కమిటీ సభ్యులను తొలగించి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని ప్రతిపాదనతో ఆమోదించారు. -
చేపల వలలో చిక్కుకుని మత్స్య కార్మికుడి మృతి
తొర్రూరు: చేపల వలలో చిక్కుకుని మత్స్య కార్మికుడు మృతి చెందిన ఘటన గురువారం డివిజన్ కేంద్రంలో జరిగింది. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు...తొర్రూరు పట్టణంలోని అలువాల మురళి (48) చేపల పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం ఎప్పటిలానే సాయంత్రం చేపల వేటకు స్థానిక పెద్ద చెరువుకు వెళ్లాడు. చేపల కోసం వల వేయగా అది అతడి కాళ్లకు చుట్టుకుని చెరువులో పడి మునిగాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది చెరువు వద్దకు వెళ్లి చూడగా వల చుట్టుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య గత కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా.. కుమారుడు ఉన్నాడు. మృతుడి సోదరుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జీజీహెచ్ టెక్నీషియన్ ఆత్మహత్యాయత్నం
నెహ్రూసెంటర్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డయాలసిస్ విభాగం టెక్నీషియన్ బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనిల్కుమార్ అనే వ్యక్తి డయాలసిస్ విభాగంలో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. ఓ వైద్యుడి వేధింపులతోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు. బాధితుడికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరగా డయాలసిస్ విభాగంలో జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చామని, విచారణ చేపడుతామని ఆయన తెలిపారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మామిడాల
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మామిడాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి కమల్ కుమార్, అసిస్టెంట్ ఎన్నిక ల అధికారులుగా జీ.సునీత, ఎం.ప్రవీణ వ్యవహరించారు. న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఎన్నికల అధికారి కమల్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్యనారాయణ గెలుపొందినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఉపాధ్యక్షుడిగా వి.హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జంగం సిద్ధార్థ, సహాయ కార్యదర్శిగా కొర్రమున్న, కోశాధికారిగా కాసాని మౌనిక, మహిళా ప్రతినిధిగా ఎన్.రాజమణి, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా బుర్ర శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా కట్కూరి శ్రీనివాస్, దర్శనం రామకృష్ణ ఎన్నికై నట్లు ప్రకటించారు. -
రాములోరి కల్యాణం చూతము రారండి
● నేడు శ్రీరామ నవమి మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా శ్రీరా మనవమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఆలయా ల్లో తగిన ఏర్పాట్లు చేశా రు. మానుకోట పట్టణంలోని గాంధీపార్కు ఎదుట రాములోరి కల్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ బాధ్యులు సర్వం సిద్ధం చేశారు. బ్రహ్మశ్రీ రాధాకృష్ణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకుడు ఎంవీ. కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం జరగనుంది. గురువారం ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, కమిటీ సభ్యులు పరిశీలించారు. -
ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంగా భవానీప్రసాద్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవానీ ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా బదిలీ చేయగా.. ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్న భవానీ ప్రసాద్ను వరంగల్ రీజినల్ మేనేజర్గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది. మొక్కజొన్నకు బోనస్ చెల్లించాలి గంగారం : మొక్కజొన్న పంటకు బోనస్ ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఇందులో భాగంగా మొక్కజొన్న పంటకు కూడా రూ.500 బోనస్ వెంటనే అందించాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు జరిపి క్వింటాకు ధర రూ.2,400 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యాపా రులు క్వింటాకు రూ.1600 మాత్రమే చెల్లిస్తున్నారన్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరతో మక్కలను కొనుగోలుచేయాలన్నారు. కార్యక్రమంలో అఖిల భారత మహబూబాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఈక భిక్షం, పీడీఎస్యూ జిల్లా నాయకుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పూత మొత్తం కాయకాదు ఈ ఏడాది గతంలో కంటే అధికంగా మామిడిపూత వచ్చింది. అయితే వచ్చిన పూత మొత్తం కాయగా మారదు. జిల్లాలో కొన్ని చోట్ల తామరపురుగు ప్రభావం ఉన్నప్పటికీ మామిడి దిగుబడి మాత్రం ఆశాజనకంగా వస్తుందనే అంచనాలో ఉన్నాం. – జినుగు మరియన్న, జిల్లా ఉద్యానవనశాఖాధికారి -
పురుగు మందుల వాడకం తగ్గించాలి
● చైనా మిర్చి వ్యాపారులు జాక్, యాన్మిన్ ● మానుకోట ఏఎంసీలో మిర్చి పరిశీలన మహబూబాబాద్ రూరల్: రైతులు మిర్చి సాగులో పురుగు మందుల వాడకం తగ్గించాలని చైనా దేశ మిర్చి వ్యాపారులు జాక్, యాన్మిన్ కోరారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును గురువారం సందర్శించి తేజ రకం మిర్చి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చైనా దేశంలో తేజ మిర్చి కంటే ఘాటు ఎక్కువగా, తక్కువగా ఉండే మిర్చిని పండిస్తారని, అయినా భారతదేశంలో పండే తేజ రకం మిర్చిని దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. చైనా ప్రజలు వంటల్లో భారతదేశ మిరప కారాన్ని ఉపయోగిస్తారని, గత సంవత్సరం చైనా దిగుమతి చేసుకున్న తేజ రకం మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండడంతో సుమారు 100 కంటైనర్లు వెనక్కి పంపించారన్నారు. రైతులు మిర్చిలో ఆకులు, గింజలు లేకుండా శుభ్రంగా ఉండే విధంగా, తేమ లేకుండా మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ మాట్లాడుతూ.. చైనా వ్యాపారులు ఇక్కడి మిర్చి శాంపిల్ తీసుకుని వెళ్లి పరీక్ష చేసుకుంటారని, ఆ పరీక్షలో పురుగు మందుల అవశేషాలు తక్కువగా ఉంటే దిగుమతి చేసుకుంటామని తెలిపారన్నారు. -
కఠిన చర్యలు తప్పవు
మహబూబాబాద్ రూరల్/నెహ్రూసెంటర్ : గంజాయి, మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, ఆటో అడ్డా, ఆర్టీసీ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తుపదార్థాల విని యోగంపై సోదాలు చేపట్టి గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. గంజాయి స్వాధీనం నెల్లికుదురు : మండలంలోని కాచికల్ స్టేజి వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా 40 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. తొర్రూర్ మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీ గంజాయి తాగుతూ కనిపించినట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయించే నెల్లికుదురుకు చెందిన సందీప్ పరారీలో ఉన్నట్లు, ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉపాధ్యాయుడికి గాయాలుమరిపెడ: బొలెరో వాహనం ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలైన సంఘటన మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సూర్య పెట్రోక్ బంక్ సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బి.రాజు విధులు ముగించుకుని బైక్పై మరిపెడకు వెళ్తున్నాడు. ఈక్రమంలో వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెలుతున్న బొలెరో వాహనం ఉపాధ్యాయుడి బైక్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఉపాధ్యాయుడు రాజు తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి
డోర్నకల్: నూతన పాలకవర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో కోరారు. డోర్నకల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం 2026–27 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్పై సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో హాజరై మాట్లాడారు. మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగించి సత్ఫలితాలు రాబట్టాలని కోరారు. పాలకవర్గాలు మున్సిపల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. అప్పుడే పాలనపై పట్టు వస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.52,96,85,000 ఆదాయం, రూ.52,92,20,000 వ్యయంతో బడ్జెట్ను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండేటి రాజకుమారి, వైస్చైర్మన్ మాదా లావణ్యశ్రీనివాస్, కమిషనర్ బి.నిరంజన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
వసూళ్లు అంతంతే..
మహబూబాబాద్: ఇంటి పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీలు తడబడుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండడంతో.. వందశాతం వసూళ్లపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాగా, పన్నుల వసూళ్లలో కొత్తగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీ జిల్లాలో మొదటిస్థానంలో ఉండగా మరిపెడ మున్సిపాలిటీ చివరిస్థానంలో ఉంది. పన్నుల వసూళ్లపైనే అభివృద్ధి ఆధారపడి ఉంది. అయితే సేకరణలో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల అభివృద్ధి కుంటుడుతోంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు.. రాష్ట్రవ్యాప్తంగా 131 మున్సిపాలిటీలు ఉండగా.. జిల్లాలోనే ఐదు ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు, డోర్నకల్లోని 15 వార్డుల్లో 10,869 మంది ఓటర్లు, తొర్రూరులోని 16 వార్డుల్లో 21,451మంది ఓటర్లు ఉన్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 15,945 మంది ఓటర్లు, మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 13,687 మంది ఓటర్లు ఉన్నారు. 2025 –26 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు) ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా అఽధికారుల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక సంవత్సరం జిల్లా వెనుకబడి ఉంది. మానుకోట మున్సిపాలిటీలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 75శాతం వసూలు చేయగా.. ఈసారి ఇప్పటి వరకు 60.88శాతానికే పరిమితమైంది. కేసముద్రం మున్సిపాలిటీ 68.57శాతం వసూలు చేసి జిల్లాలో టాప్లో ఉంది. మున్సిపల్ ఎన్నికల కారణంతోనే.. ఈఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల జరగడం వల్ల పన్నుల వసూళ్లలో ఆలస్యమైనట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ మానుకోట పన్నుల వసూళ్లలో మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. కమిషనర్ రాజేశ్వర్ పన్నుల వసూళ్లలో శ్రద్ధ పెట్టడం లేదని అర్థమవుతోంది. ఐదు రోజులు మాత్రమే.. ఈనెల 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కేవలం ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆలోపు బిల్ కలెక్టర్లతో పన్నుల వసూళ్ల వేగం పెంచితేనే కొంతమేర అయినా లక్ష్యం సాధిస్తారు. లేకుంటే జిల్లా వెనుకబడుతుంది. కాగా, పన్నుల వసూలు కమిషనర్లకు సవాల్గా మారింది. ఎన్నికల వల్లే పన్నుల వసూళ్ల శాతం తగ్గింది ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల వల్ల పన్నుల వసూళ్లు ఆలస్యమైంది. కానీ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పన్నుల వసూళ్ల వేగం పెంచాం. దాని వల్లే 60.88 శాతం వసూలు చేశాం. వేగం పెంచి వసూలు చేస్తాం. – రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిషనర్ ఇంటి పన్నుల సేకరణలో మరిపెడ మున్సిపాలిటీ చివరి స్థానం కేసముద్రం మున్సిపాలిటీ మెరుగు.. మానుకోట వెనుకడుగు అధికారులు నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న అభివృద్ధి ఐదు రోజులు మాత్రమే గడువుపన్నులపైనే ఆధారం.. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ఇతర ఖర్చులు పన్నుల వసూళ్లపైనే ఆధారపడి ఉంది. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 143మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఉన్నారు. సంఖ్య సరిపోవడం లేదు. కాగా, కార్మికుల సంఖ్య పెంచాలని సీడీఎంఏను కోరారు. అయితే సీడీఎంఏ మాత్రం ఇంటి పన్నులు పెంచుకుని అధిక ఆదాయం పొంది, కార్మికులను పెంచుకోవాలని వారికి వివరించింది. దీనిని బట్టి చూస్తే పన్నులపైనే అభివృద్ధి ఆధారపడి ఉంది. మున్సిపాలిటీ గృహాల డిమాండ్ వసూలు శాతం సంఖ్య (కోట్లలో) (కోట్లలో)కేసముద్రం 6,440 1.05 0.72 68.57 తొర్రూరు 6,712 4.85 3.27 67.42 మానుకోట 22,970 6.80 4.14 60.88 డోర్నకల్ 3469 1.43 0.74 51.75 మరిపెడ 5619 2.09 0.92 44.02 -
మామిడి రైతు విలవిల..
బయ్యారం: ఆరంభంలో ఆశాజనకంగా వచ్చిన పూతను చూసి మురిసిపోయిన మామిడి రైతు.. తామర పురుగు ఉధృతితో పిందె, కాయలు రాలుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని సంవత్సరాలుగా మామిడిరైతు నష్టాలపాలవుతున్నాడు. అయితే, ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కుతామని భావించిన మామిడి రైతు ఆశలను తామరపురుగు తుంచేసింది. మామిడి పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 13 వేల ఎకరాల్లో సాగు.. జిల్లాలోని 18 మండలాల పరిఽధిలో 13వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. ప్రస్తుతం పిందె నుంచి కాత దశలో పంట ఉంది. ప్రారంభంలో తామర పురుగు ఉధృతి పెరగడంతో ఎక్కువ సంఖ్యలో పూతతో పాటు పిందెలు రాలినట్టు రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు పగలు, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు కూడా మామిడి పంటపై ప్రభావం చూపినట్లు రైతులు చెబుతున్నారు.ముప్పావు వంతు పూత రాలిపోయిందిమామిడితోటలో మొదట వచ్చిన పూతతో లాభాలు వస్తాయనుకున్నాం. రోజురోజుకూ పూత, పిందె, కాయలు రాలడం పెరిగింది. ప్రస్తుతం రూపాయిలో పావులా వంతు మాత్రమే కాయలు వచ్చాయి. ఎన్ని మందులు కొట్టిన కాత నిలువలేదు. ఏటా ఏదో ఒకవిధంగా నష్టపోవాల్సి వస్తోంది. – కోడి శ్రీను, కౌలు రైతు, బాలాజీపేటఅక్కడక్కడ కాయలు ఉన్నాయి నాకున్న ఐదెకరాల మామిడి తోటలో పూత, పిందె రాలిపోగా ఇప్పుడు అక్కడక్కడ కాయలు ఉన్నాయి. ఈ కాయల కోసం కోతులు రాకుండా కాపలా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న కాయల డబ్బులు తోటకు కాపలా ఉన్న వారి జీతాలకే సరిపోయేలా లేవు. – పి.శ్రీరాములు, కొత్తపేట తోటల్లో తామర పురుగు ఉధృతి రాలుతున్న పిందె, కాయలు వరుస నష్టాలతో రైతుల్లో ఆందోళన -
లక్ష్యం చేరుకోవాలి
హన్మకొండ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో లక్ష్యం చేరుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వసూళ్ల వంద శాతం సాధించాలన్నారు. ఈ నెల 31 వరకు అన్ని 33 కేవీ ఫీడర్లలో జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ సర్వీస్ల మంజూరు వేగంగా పూర్తి చేయాలని కోరారు. ‘జుగా’ పథకంలో మౌలిక వసతులు పూర్తయిన వాటికి వెంటనే మీటర్లు అమర్చాలని సూచించారు. వేసవి కార్యాచరణలో భాగంగా ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు పనులు చేపట్టి ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ ఇంటర్ లింకింగ్ లైన్స్ పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈ లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, సీజీఎం ఆర్.చరణ్ దాస్, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, మల్లికార్జున్, కృష్ణ మోహన్, జయరాజ్, వెంకట కృష్ణ, ఉపేందర్, వేణుమాధవ్, వాసుదేవ్, ప్రభావతి, డి.ఈలు అనిల్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
పెట్రోల్, డీజిల్ కొరత లేదు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మొద్దని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురై ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో అనవసర రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలు గుతోందని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిఽధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేసి గందరగోళం సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ సన్ప్రీత్సింగ్ -
ఆగస్టు 21 నుంచి ఆర్థోపెడిక్ సర్జన్స్ సదస్సు
కాశిబుగ్గ: తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుంచి 23వతేదీ వరకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు బాధ్యులు తెలిపారు. సదస్సు సందర్భంగా బుధవారం ఎంజీఎంలో కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రస్థాయిలో జరగనున్న ఈ సదస్సు కోసం ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, నిపుణులు, పీజీ విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నా రు. ఇందులో పాల్గొనే నిర్వాహక సభ్యులు, వైద్యులు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని, ప్రస్తుతం ఎర్లీ బర్డ్ ఆఫర్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్ పి. విజయ్చందర్రెడ్డి, సెక్రటరీ రాంకుమార్రెడ్డి, కోశాధికారి దిడ్డి శ్రవణ్కుమార్, వైద్యులు జె.వెంకటేశ్వర్లు, సుధీర్కుమార్, అశోక్, డాక్టర్ డి.మహేశ్వర్, క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.


