భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బాలభీముడు జన్మించాడు. మండ లంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన ముంగర మమత కాన్పు కోసం ప్రభుత్వ ఆస్ప త్రికి రాగా, వైద్యులు ఆమెకు సాధారణ ప్రస వం చేశారు. ఆమె 4.5కిలోల బరువు ఉన్న మగ శిశువు జన్మించాడు. సహజంగా అప్పుడే జన్మించే శిశువులు రెండు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని, 4.5కిలోల బరువు ఉండటం అరుదైన ఘటనగా ఆస్పత్రి గైనకాల జిస్టు మౌనిక తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.


