అకాల వర్షం.. వడగళ్ల్ల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. వడగళ్ల్ల బీభత్సం

Apr 7 2026 7:25 AM | Updated on Apr 7 2026 7:25 AM

గంగారం: మండలంలోని మడగూడెంగ్రామంలో సోమవారం అకాల వర్షం కురిసింది. వడగళ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మక్కల రక్షణకు రైతుల పాట్లు

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో పాటు వాతావరణం పూర్తిగా చల్లబడి ఈదురుగాలులు మొదలయ్యాయి. దీంతో రైతులు అప్రమత్తమై మహబూబా బాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసుకున్న మక్కల రాశులపై టార్పాలిన్లు కప్పుకున్నారు. ఏ సమయంలో వర్షం కురుస్తుందోనని రైతులు ఆందోళన చెందుతూ తమ వ్యవసాయ ఉత్పత్తుల వద్ద కాపలా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement