ఏబీఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది.
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసును ముట్టడించింది. ఏబీఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు నిరసనకు దిగారు.
ధర్నాలో వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, లక్ష్మీ పార్వతి, విశ్వరూప్, శ్రీకాంత్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మార్గాని భరత్, కారుమూరి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. విలువలు దిగజార్చేలా ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు.
మహిళలను రాధాకృష్ణ అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని చెప్పారు. మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


