breaking news
Marriage
-
రొనాల్డో భార్య ఆస్తుల విలువ ఎంతంటే?!
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా జార్జినా రోడ్రిగ్స్తో సహ జీవనం చేస్తున్న ఈ పోర్చుగల్ స్టార్.. తాజాగా ఆమెతో వివాహ బంధంలో అడుగుపెట్టాడు. పెళ్లి విషయాన్ని రొనాల్డో స్వయంగా ప్రకటించాడు.జార్జినా చేతిలోన చెయ్యేసి పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రొనాల్డో పెళ్లి విషయాన్ని తెలియజేశాడు. ఇందులో ఇద్దరి వేళ్లకు వివాహ ఉంగరాలు ఉన్నాయి. కాగా రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుట్బాల్ దిగ్గజంగా ఎదిగిన అతడు.. ఫాలోయింగ్, సంపాదనలోనూ మిగిలిన అథ్లెట్ల కంటే ఎంతో ముందున్నాడు.రొనాల్డోకు వేల కోట్ల ఆస్తివివిధ నివేదికల ప్రకారం.. రొనాల్డో నికర ఆస్తి విలువ పది- పన్నెండు వేల కోట్ల రూపాయల పైమాటే అని అంచనా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇన్స్టాలో అతడికి అత్యధికంగా 672 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ముందుగా రొనాల్డో పిల్లలకు తల్లిగా.. తాజాగా భార్యగా అతడి జీవితంలో చెరగని ముద్ర వేసిన జార్జినా రోడ్రిగ్స్ వృత్తి, ఆమె నికర ఆస్తి విలువ తదితర సంగతులు తెలుసుకుందామా?!స్పానిష్ తల్లి, అర్జెంటినియన్ తండ్రికి జన్మించిన 32 ఏళ్ల జార్జినా.. స్పెయిన్లో పెరిగింది. క్యాథలిక్ స్కూల్లో చదివిన ఆమె చిన్ననాటి నుంచే బలెరినా డాన్సర్ కావాలని కలలు కన్నది. అయితే, మాడ్రిడ్కు మకాం మార్చిన తర్వాత ఆమె రాత కూడా మారిపోయింది.సేల్స్ అసిస్టెంట్గామాడ్రిడ్లోని గూచి స్టోర్లో సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయంలోనే తొలిసారి 2016లో జార్జినా రొనాల్డోను కలిసింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వ్యక్తిగత కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టిన జార్జినా.. మోడల్గా రాణించింది. గూచి, ప్రడా, చానెల్ వంటి ప్రముఖ విలాసవంతమైన బ్రాండ్లతో కలిసి పనిచేసింది.సంపాదనా మార్గాలు ఇవిసోషల్ మీడియాలోనూ జార్జినాకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇన్స్టాలో ఆమెకు 77 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సెలబ్రిటీ ఇన్ఫ్ల్యూయెన్సర్గా తనదైన శైలిలో రాణిస్తూ ఇక్కడా సంపాదన మార్గాలను పెంచుకుంది. ఈ క్రమంలోనే వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది.శిరోజ సౌందర్యాన్ని పరిరక్షించే క్లినిక్కు సహ వ్యవస్థాపకురాలిగా జార్జినా నిలిచింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టింది. సొంతంగా ఓ ఫ్యాషన్ లేబుల్ను కూడా స్థాపించింది.ఇక నెట్ఫ్లిక్స్లో ఐ యామ్ జార్జినా పేరిట రియాల్టి సిరీస్లోనూ ఆమె భాగమైంది. రొనాల్డో భాగస్వామిగా, అతడి పిల్లలకు తల్లిగా, యువ వ్యాపారవేత్తగా తన జీవితం ఎలా ఉంటుందో ఈ సిరీస్ ద్వారా జార్జినా ప్రేక్షకులకు చూపించింది.నికర ఆస్తి ఎంతంటే?ఈ క్రమంలో మోడలింగ్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సోషల్ మీడియా కొలాబరేషన్లు, మీడియా, వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా జార్జినా కూడా బాగానే సంపాదించింది. 2025 నివేదికల ప్రకారం జార్జినా నికర ఆస్తి విలువ వంద నుంచి నూట ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. కాగా రొనాల్డో భాగస్వామిగానే కాకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న జార్జినా.. అధికారికంగా అతడి భార్యగా మారడంతో మరింత పాపులర్ అయింది.చదవండి: ‘రొనాల్డోతో బ్రేకప్.. భారీగా డబ్బు ఆఫర్ చేశారు’ -
'వివాహం'పై కిరణ్ బేడీ షాకింగ్ వ్యాఖ్యలు..!
మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ ఏ విషయాన్ని అయినా చాలా ముక్కుసూటిగా నిష్కపటంగా చెబుతుంటారు. మహిళల సమస్యల విషయానికి వస్తే, ఆమె ఏమాత్రం భయపడకుండా, సాంప్రదాయాలను సవాలు చేసేలా..చాలా సూటిగా మాట్లాడతారు. నెల రోజుల క్రితం అభిషేక్ వ్యాస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో, భారతీయ మహిళలకు వివాహం ఎలాంటిదో చాలా ఓపెన్గా చెప్పారు. ప్రతి ఆడపిల్ల ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా మాట్లాడారు. మరి అవేంటో చూద్దామా..!పెళ్లి చాలా అందంగా ఉంటుంది, పెళ్లి ఊరేగింపు అట్టహాసంగా, వైభవంగా ఉంటుంది అంతే..అని అన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ మహిళకు చాలా సురక్షితమైన, ప్రేమగా, అండగా నిలిచే ఇంటిని వెళ్లిపోవాల్సి వస్తుంది కాబట్టి అది ఆమెకు 'మానసిక క్షోభే' అని నర్మగర్భంగా చెప్పారామె. అంతేగాదు ఒక మహిళ తన పుట్టింటిని విడిచి వెళ్లడమే కాకుండా, తన అత్తమామలను కూడా సొంత తల్లిదండ్రుల్లా చూడాలని ఆశిస్తారని, ఇది చాలా హాస్యాస్పదమైనదని అన్నారు. ఎందుకంటే అది ఆచరణ సాధ్యమైనది కాదని తేల్చి చెప్పారు. అసలు ఎవరైనా ఏదో ఒక మహిళను 'అమ్మా' అని పిలవగలరా? అది అసలు సాధ్యమేనా అని నిలదీశారు. వాస్తవం ఏంటంటే అసలు ఎవరూ అలా చేయలేరు, కానీ పెళ్లైన భారతీయ మహిళపై అలా చేయమని ఒత్తిడి చేస్తుంటారని అన్నారు. కొత్తగా పెళ్లయిన మహిళ తన భర్త ఇంటి వాతావరణం ఎలా ఉన్నా సరే, దానికి అనుగుణంగా సర్దుకుపోవాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే పెళ్లి అన్న రెండు అక్షరాలతో ఆమె ఇంటికి 'యజమాని'గా మారుతుంది కాబట్టి అని అన్నారు. అయినా ఒక మహిళ గృహిణిగా ఉండాలనుకుంటుందా లేదా అనే విషయాన్ని కుటుంబాలు అసలు ఆలోచించవని అన్నారు. ఒకవేళ వివాహిత ఉద్యోగం చేస్తుంటే, ఇంటి పనుల కోసం సహాయకులను (domestic help) నియమించుకోవచ్చని ఆమె సూచించారు. వివాహానికి ముందే జంటలు ఈ విషయం గురించి ఎందుకు చర్చించరని డాక్టర్ బేడీ ప్రశ్నించారు. అలాగే పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం కొనసాగిస్తానని, ఇంటి పని కోసం సహాయకులను నియమించుకుంటానని, ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకుంటూ ఇంటిని నడుపుకోవచ్చని మహిళ స్పష్టంగా చెప్పాలని అన్నారు. తద్వారా ఆమెకు తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. నిజానికి పురుషులు తమ ఉద్యోగాలను వదలాల్సిన అవసరం ఉండదు కానీ మహిళలకే ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. చాలా సందర్భాల్లో మహిళలు వారి సొంత నిర్ణయంతోనే ఉద్యోగాలు వదిలేస్తుంటారని..ఇది ముమ్మాటికి వాళ్ల తప్పిదమేనని అన్నారు. ఎందుకంటే తాము కూడా సంపాదించి, తమ నిబంధనల ప్రకారం ఇంటిని నడపాలని వారు భావించరు. ఇద్దరూ ఆర్థికంగా సహకరించుకుంటూ మెరుగైన జీవితాన్ని గడపవచ్చని వాళ్లసలు ఆలోచించరు.అలాగే ప్రపంచ బ్యాంక్ 2024 నివేదిక ప్రకారం, మహిళలు "వివాహపరమైన ప్రతికూలత"ను (marriage penalty) ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నాయి. భారతదేశంలో పిల్లలు లేకపోయినప్పటికీ, వివాహం తర్వాత మహిళల ఉపాధి రేటు 12% తగ్గుతుంది. అశోక యూనివర్సిటీ నివేదిక ప్రకారం, దాదాపు 73% మంది భారతీయ మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత తమ ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇక్కడ పెళ్లయిన మహిళ త్వరలోనే ఇల్లు, కుటుంబం, భర్తను చూసుకునే వ్యక్తిగా మారిపోతుందని డాక్టర్ కిరణ్ బేడీ అన్నారు. ఇప్పుడు అదే మహిళ ఉద్యోగం కూడా చేస్తానంటే..ఆమెకు వివాహ జీవితం కష్టమైపోతుందని అన్నారు. ఇక్కడ ఆడపిల్లలు తెలుకోవాల్సింది ఏంటంటే..భర్త నుంచి తగిన మద్దతు లభించడం లేదని భావిస్తే, పెళ్లి తర్వాత కూడా తమ తల్లిదండ్రులతో కలిసి జీవించేంత ధైర్యం, ఆర్థిక స్వాతంత్ర్యం మహిళలకు ఉండాలని ఆమె అన్నారు. పెళ్లి తర్వాత తల్లిదండ్రులను చూసుకోవడానికి వారితో కలిసి ఉండాలనుకునే మహిళను తక్కువగా చూడకూడదని, పైగా అటువంటి నిర్ణయాన్ని అభినందించాలని డాక్టర్ బేడీ పేర్కొన్నారు. (చదవండి: మూతపడిపోవాల్సిన వ్యాపారాన్ని కూతురు నిలబెట్టింది..! ఇవాళ అదికాస్తా..) -
అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: సారా టెండుల్కర్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి తారసపడేంత వరకు పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రుల మధ్య బలమైన స్నేహ బంధం ఉందని.. అదే వారి అన్యోన్య దాంపత్యానికి పునాది అని పేర్కొంది.కాగా సచిన్ టెండుల్కర్ కెరీర్ తొలి నాళ్లలోనే డాక్టర్ అంజలితో ప్రేమలో పడ్డాడు. క్రికెటర్గా నిలదొక్కుకున్న తర్వాత ఇరుకుటుంబాలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వయసులో సచిన్ కంటే అంజలి ఆరేళ్లు పెద్ద. అయితే, ఇదేమీ వారి ప్రేమకు అడ్డంకి కాలేదు.అక్క కంటే ముందే తమ్ముడి పెళ్లిముప్పై ఏళ్లకు పైగా వివాహ బంధంలో కొనసాగుతున్న సచిన్- అంజలి నేటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా తొలుత కుమార్తె సారా.. ఆ తర్వాత అర్జున్ జన్మించారు. సారా న్యూట్రీషనిస్ట్. అదే విధంగా మెడల్, కంటెంట్ క్రియేటర్గా కొనసాగుతూ.. వెల్నెస్ బిజినెస్లోనూ అడుగుపెట్టింది.మరోవైపు.. అర్జున్ క్రికెటర్గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, అక్క సారా కంటే ముందే అర్జున్ పెళ్లి పీటలెక్కాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెప్పిన సానియా చందోక్తో ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. అయితే, 28 ఏళ్ల సారా ఇప్పటికీ సింగిల్గానే ఉంది.అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాఈ నేపథ్యంలో తాజాగా వోగ్ ఇండియాతో మాట్లాడిన సారా టెండుల్కర్ తన కాబోయే భర్త ఎలా ఉండాలన్న అంశంపై స్పందించింది. ‘‘నా తల్లిదండ్రులు భార్యాభర్తలు అవడానికంటే ముందు మంచి స్నేహితులు. ఇంట్లో వాళ్లిద్దరి సరదాగా గొడవపడుతూ ఉంటారు. వారిద్దరిని చూస్తే ముచ్చటేస్తుంది.వారి బంధం అత్యద్భుతంగా అనిపిస్తుంది. నాకు కూడా అలా స్నేహంగా ఉండే భాగస్వామి రావాలని కోరుకుంటున్నా. నా ప్రాణ స్నేహితులంతా నా సోల్మేట్స్ అనే చెప్తాను. అయితే, నా పార్ట్నర్ను రొమాంటిక్ సోల్మేట్గా చూస్తాను’’ అని సారా పేర్కొంది.ఇక జెన్ జీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘చాలా మంది త్వరత్వరగా నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి సమయం దగ్గరపడినపుడు ఒకవేళ.. సదరు వ్యక్తి తనకు సరైన భాగస్వామి అని అనిపించకపోతే.. నిర్భయంగా ఆ బంధాన్ని రద్దు చేసుకుంటున్నారు.నచ్చకపోతే ఎంగేజ్మెంట్ కూడా రద్దుముందు తరాల వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు భయపడేవారు. కానీ జెన్ జీ నిక్కచ్చిగా తమ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తమకు ఏదైనా విషయం లేదంటే వ్యక్తి నచ్చలేదు.. సదరు వ్యక్తిలో తప్పు ఉందని భావిస్తే వెంటనే ఆ బంధం నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు.జెన్ జీ ఆత్మవిశ్వాసం, సాధికారిత తమలో ఎక్కువని విశ్వసిస్తున్నారు’’ అని సారా పేర్కొంది. తాను కూడా తొందరపడి పెళ్లి బంధంలో అడుగుపెట్టబోనని.. సరైన పార్ట్నర్ దొరికినపుడే వివాహం చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్తో సారా టెండుల్కర్ ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఇలాంటి వదంతులను పట్టించుకోనని సారా కొట్టిపారేసింది.చదవండి: ఆ పేరంటే ద్వేషం: ప్రధాని మోదీతో బాక్సర్ -
గుట్టు చప్పుడు కాకుండా హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్
-
తణుకు అబ్బాయి.. రష్యా అమ్మాయి
పశ్చిమగోదావరి: తణుకు అబ్బాయి.. రష్యా దేశ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తణుకు పట్టణానికి చెందిన సిర్రా బ్రహ్మయ్య కుమారుడు జానకి రామ్ పాల్, రష్యా దేశానికి చెందిన అనస్తాసియా డానిలోవా వివాహం శనివారం స్థానిక వీకే ఫంక్షన్ హాలులో క్రైస్తవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం జానకి రామ్ పాల్ బైబిల్ కోర్సులో శిక్షణ పొందేందుకు రష్యా దేశానికి వెళ్లారు.అక్కడ అనస్తాసియా డానిలోవాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, అనంతరం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు కూడా సానుకూలంగా అంగీకరించారు. దీంతో రష్యా నుంచి వచ్చిన అనస్తాసియా కుటుంబ సభ్యులు, తణుకుకు చెందిన రామ్ పాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. -
ఫొటోలు సరిగా తీయలేదని...
పెళ్లంటే పందిళ్లు ... సందళ్లు... తప్పెట్లు... తాళాలు... రెండు మనసుల కలయికే కాదు, జీవితంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాల వేడుక. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచి కలకాలం గుర్తుండేలా వాటికి శాశ్వత రూపం ఇచ్చేవి ఫొటోలు, వీడియోలు. ప్రీ వెడ్డింగ్ షూట్ల నుంచి పెళ్లిలో బంధువుల సందడి, ఆప్యాయ ఆలింగనాలు, వధువును అత్తారింటికి పంపే తల్లిదండ్రుల కంటతడి వరకు ప్రతి ఆనంద క్షణాలూ భావోద్వేగాలూ కాలగర్భంలో కలిసి పోకుండా అవి పదిలంగా ఉంచుతాయి. అందుకే నేటి పెళ్లి తంతులో ఈ ఖర్చు తప్పని సరైంది. లక్షలకు చేరింది.అయితే వీటి చిత్రీకరణలో పొరపాటు జరిగితే; ఆ జ్ఞాపకాలను సరిగా బంధించకపోతే; ఫొటోలు, వీడియోలు ఆశించిన స్థాయిలో రాకపోతే; ఒప్పందం అమలు చేయకపోతే; మానసిక వేదనే మిగులుతుంది. అయితే ఓ జంట ఇలా వేదనతో సరిపుచ్చుకోలేదు. ఒప్పంద ఉల్లంఘనపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. తమ మనో వేదనకు మూల్యం చెల్లించేలా ఆదేశించాలని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పరిహారాన్ని ఇప్పించాలని వేడుకుంది. సేవల్లో లోపంతో పాటు భావోద్వేగాలను ఫోరం అర్థం చేసుకుని తీర్పు వెలువరించింది.కేరళకు చెందిన ఓస్టిన్ ఊమచెన్, కావ్య సంతోష్ ఇద్దరూ వైద్యులు. వీరిద్దరికి పెళ్లి నిశ్చయం అయింది. కొచ్చిలోని పికోలో వెడ్డింగ్స్ సంస్థ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పెళ్లి ఫొటోలు, వీడియోలు చూశారు. తమ వివాహ వేడుకను అలాగే పదిలపరుచుకోవాలని భావించి, ఆ సంస్థను సంప్రదించారు.ఒప్పందం... ఉల్లంఘన...బ్రైడ్ అండ్ గ్రూమ్ సైడ్ ప్యాకేజీని ఆ జంట ఎంచుకుంది. ఆ ప్యాకేజీ కింద అందించే సేవలను సంస్థ వివరించింది. మొత్తం రూ.95 వేలకు వారి మ«ధ్య ఒప్పందం కుదిరింది. రూ.10 వేలు అడ్వాన్స్గా, పెళ్లిరోజు మరో రూ. 70 వేలు చెల్లించారు. 2024లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం డ్రోన్ కెమెరా ద్వారా పెళ్లిని షూట్ చేయలేదు. ఆ విషయాన్ని ముందుగా తెలియజేయలేదు. దీంతో మరొకరిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ జంట వాదన. మరోవైపు వధువు ఇంట్లో జరిగే వివాహ తంతును చిత్రీకరించేందుకు వెళ్లాల్సిన క్యాండిడ్ ఫొటోగ్రాఫర్ వెళ్లలేదు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మూడు వెడ్డింగ్ రీల్స్ ఊసే ఎత్తలేదు. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత హైలైట్స్ వీడియోను వాట్సాప్ ద్వారా పంపారు. యూఎస్బీలో ఇచ్చిన వెడ్డింగ్ స్టోరీ కరెప్ట్ అయింది. ఫొటోలు, వీడియో ఎడిటింగ్ పరమ నాసిగా ఉన్నాయి. ముఖ్యమైన వేడుకల ఫొటోలు, ఆనంద క్షణాలు క్యాప్చర్ కాలేదు. ఇలా ఒప్పందంలోని పలు అంశాలను సంస్థ ఉల్లంఘించింది.ఫోరంలో ఫిర్యాదుఒప్పందాన్ని సంస్థ ఉల్లంఘించిందంటూ ఆ జంట కొట్టాయంలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. అయితే కమిషన్ జారీ చేసిన నోటీసులకు పికోలో వెడ్డింగ్స్ సంస్థ స్పందించలేదు. చివరకు ఓ దినపత్రికలో పబ్లిక్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆ సంస్థ కమిషన్ ఎదుట హాజరు కాలేదు. దీంతో ఎక్స్పార్టీగా ఫోరం కేసును కొనసాగించింది. ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించింది. హెలీకామ్(డ్రోన్) సేవలను అందించనందుకు బిల్లులో ఆ మేరకు తగ్గిస్తూ సంస్థ రశీదు ఇవ్వడాన్ని కోర్టు గుర్తించింది. యూఎస్బీ కరెప్ట్ అయిన విషయాన్ని పరిశీలించి నిర్ధారించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం ఇటువంటి చర్య ‘సేవల్లో లోపం’ పరిధిలోకి వస్తుందని ఫోరం స్పష్టం చేసింది.తీర్పు ఇలా...సంస్థకు చెల్లించిన మొత్తాన్ని ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వాలని ఫోరం ఆదేశించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2.50 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 10,000 చెల్లించాలని ఆదేశిస్తూ ఫోరం తీర్పు వెలువరించింది. నిర్ణీత గడువులోగా ఈ మొత్తం అందించకపోతే 9% వడ్డీ చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పు కేవలం ఓ జంటకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిన కేసు మాత్రమే కాదు. వృత్తి పరమైన సేవలు అందించే ప్రతి సంస్థపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే తీర్పు. ఈ తరహా ఒప్పందాలు కేవలం వ్యాపార లావాదేవీలు కావని, విశ్వాసం, జవాబుదారీతనం, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.- దిలీప్ మాదిరెడ్డి -
టీవీ నటిని పెళ్లాడిన భారత క్రికెటర్.. ఫొటోలు వైరల్
భారత క్రికెటర్ రమణ్దీప్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. బుల్లితెర నటి చార్లీ చౌహాన్ను పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్లీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయడంతో వైరల్గా మారాయి.కేకేఆర్ ఆల్రౌండర్గా..ఈ క్రమంలో నూతన వధూవరులు రమన్దీప్ సింగ్- చార్లీ చౌహాన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చండీగఢ్లో 1997లో జన్మించిన రమణ్దీప్ సింగ్.. క్రికెట్పై మక్కువతో బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్లో పంజాబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 2022లో అరంగేట్రం చేశాడు.ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్కు ఆడుతున్న రమణ్దీప్ సింగ్.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 38 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 299 పరుగులు తీయడంతో పాటు.. ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ మీడియం పేసర్.టీమిండియా తరఫున అరంగేట్రంఇక ఐపీఎల్లో సత్తా చాటిన రమణ్దీప్ సింగ్కు 2024లో టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఇప్పటికి రెండు మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం 15 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీయగలిగాడు.ఎవరీ చార్లీ చౌహాన్?చార్లీ చౌహాన్ బుల్లితెర నటి. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ సిరీస్లో ఏలా అనే పాత్రతో ఆమె గుర్తింపు పొందింది. ఆ తర్వాత కైసీ యే యారియాన్లో ముక్తి వర్ధన్ అనే పాత్ర పోషించింది. అదే ఎంటీవీ రోడీ సీజన్ 7లోనూ చార్లీ పాల్గొంది.నటుడు కున్వార్ అమర్తో కలిసి నచ్ బలియే అనే డ్యాన్స్ ప్రోగ్రామ్లోనూ చార్లీ భాగమైంది. గతంలో వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇక యే హై ఆషికి 4 వంటి షార్ట్ ఫిలిమ్స్లోనూ చార్లీ నటించింది.కేవలం నటనకే పరిమితం కాకుండా సంగీతం, రైటింగ్లోనూ చార్లీకి ప్రవేశం ఉంది. పలు మ్యూజిక్ ఆల్బమ్స్కి ఆమె రచయితగా పనిచేసింది. అయితే, రమణ్దీప్ సింగ్తో చార్లీ ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఎనిమిదేళ్లుగా మేము.. ఇప్పుడిలా.. శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాము’’ అని చార్లీ చౌహాన్ ఇచ్చిన క్యాప్షన్ను బట్టి ఇది నిజమని తేలింది.చదవండి: మూడేళ్లుగా తిరుతుగున్నా... ప్లీజ్ సాయం చేయండి: పంత్ -
'చిన్న వయసులోనే పెళ్లిచూపులు.. నేను తప్పించుకున్నా'
ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీటౌన్లో సుపరిచితమైన పేరు. ఇటీవలే ఆమె ఇష్క్నామా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షెహనాజ్.. ప్రేమ అంటే ముఖ్యమైన వ్యక్తులకు సమయం, స్వేచ్ఛ ఇవ్వడమేనని అన్నారు. అయితే పెళ్లిళ్లకు తాను దూరంగా ఉండేదాన్ని అని వెల్లడించారు.ప్రేమ, పెళ్లి సంబంధాలపై తన అభిప్రాయాలను షెహనాజ్ గిల్ వెల్లడించారు. మా కుటుంబంలో పెళ్లి చూపులు చిన్న వయసులోనే చూసేవారని తెలిపింది. అమ్మాయిలకు చాలా చిన్న వయసు నుంచే త్వరలో పెళ్లి అవుతుందని చెప్పేవారని గుర్తు చేసుకుంది. అలా వరుడి కోసం అన్వేషణ చాలా ముందుగానే మొదలవుతుందని పేర్కొంది. మా బంధువుల్లో ఒకరు నాకు పెళ్లి చేయాలని చూసింది.. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదని తెలిపింది. పెళ్లిళ్లకు వెళ్తే సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నిస్తారని షెహనాజ్ వెల్లడించింది. అందుకే నేను ఎక్కువగా పెళ్లిళ్లకు వెళ్లడం కూడా మానేసేదాన్ని అని తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పుడు నా కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని.. ఇప్పుడు అందరూ నా వెంట పడుతున్నారని నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. షెహనాజ్ గిల్ నటించిన 'ఇష్క్నామా' చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదలైంది. -
క్రియేటివిటీ పీక్స్.. స్పైడర్ మ్యాన్ జంటకు పెళ్లి
హాలీవుడ్లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్ నుంచి తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.10 వేల కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ మూవీకి ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. మనదేశంలోనూ కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో స్పైడర్ మ్యాన్ జంట టామ్ హాలెండ్, జెండయాకు సంబంధించిన ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరిద్దరికీ ఏకంగా దక్షిణాది సంప్రదాయంలో పెళ్లి చేసిన వీడియో ఆసక్తిగా మారింది. ఈ పెళ్లి వేడుకలో సూపర్ హీరోస్, అవెంజర్స్ సందడి చేయడం.. దగ్గరుండి పెళ్లి వంటలు, భోజనాలు చేయడం చూస్తుంటే ఆడియన్స్కు నవ్వులు తెప్పిస్తోంది. ఈ ఫన్నీ ఏఐ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Hafiz (@ihafix) -
స్టార్ హీరోయిన్తో ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి.. చిరంజీవినే చెప్పాడు
ప్రముఖ సీనీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) పర్సనల్ గురించి గత మూడు, నాలుగు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్ హీరోయిన్ని ఆయన సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడట. ఈ విషయాన్ని అప్పట్లో చిరంజీవినే మీడియాకు లీకు చేశాడని బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేశ్ చెప్పారు. తాజాగా ఆయన ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి గురించి చిరంజీవినే తనతో చెప్పాడని అన్నారు.‘ఓ రోజు చిరంజీవి దగ్గరకు వెళ్తే.. 'హేయ్ జ్యోతి... ఊర్మిళను రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకుంది రాయలేదని చిరంజీవి నాతో అన్నారు. వారికి పెళ్లి ఎప్పుడు జరిగింది? అని నేను ఆయన్ను అడిగాను. ఆంధ్రప్రదేశ్ో ఓ ప్రముఖ ఆలయంలో ఊర్మిళను తీసుకెళ్లి ఆర్జీవీ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. మీ దగ్గర ప్రూఫ్ ఏంటని అడిగాను. వారి పెళ్లి చేసిన పూజారి ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. నేను ఆర్టికల్ రాయడానికి ముందే ఊర్మిళకు ఫోన్ చేశా. ఆమె ఏడుస్తూ.. ‘ నా గురించి మీరు అలా ఎలా రాస్తారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నా గురించి మీకు తెలుసు కదా’ అని అన్నారు. ఇదే విషయం ఆర్జీవీకి కాల్ చేస్తే 'నో కామెంట్' అని అన్నారు. దీంతో ఇద్దరి సైడ్ నుంచి స్టోరీ రాశాను’ అని జ్యోతి వెంకటేశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సీక్రెట్ పెళ్లిపై అటు ఊర్మిళా కనీ, ఇటు ఆర్జీవి కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.ఆర్జీవీతో పెళ్లి జరిగిందో లేదో తెలియదు కానీ.. 2016 లో మోహ్సిన్ అక్తర్ మీర్ ని ఊర్మిళ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఊర్మిళ సింగిల్ గానే ఉంటుంది. అప్పట్లో ఆర్జీవీ, ఊర్మిళ కాంబో ఓ సంచలనం. వీరిద్దరి కాంబోలో వచ్చిన గాయం, రంగీలా, సత్య, అంతం, దౌడ్ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. Jyothi Venkatesh spills tea on SECRET marriage of Ramgopal verma with urmila mamdodkat🤯They married in Temple, Chiranjevii leaked temple priest's direct phone number to expose the secret wedding👀When asked Urmila, she started crying & Ram Gopal Varma replied "no comments" pic.twitter.com/xxeGrfMudP— Chota Don (@choga_don) July 30, 2026 -
జనాభా తగ్గించండ్రా అంటే చైనా వాళ్ళు ఏం తగ్గించారో చూడండి!
-
ఇద్దరు పిల్లల తల్లిని లేపుకెళ్లిన 21 ఏళ్ల కుర్రాడు..!
చిత్తూరు జిల్లా: నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత ప్రియుడితో కలిసి కొత్త కాపురం పెట్టగా బంధువులు పట్టుకున్న సంఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం బెగ్గిలిపల్లిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శాంతిపురం మండలంలోని బిఎం గొల్లపల్లికి చెందిన శోభకు గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాబు ఉన్నారు. ఈ నేపద్యంలో శోభ(27)కు సామాజిక మాధ్యామాల ద్వారా గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్(22)తో పరిచయమైంది. ఈ పరిచయం ముదిరి ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. దీంతో నెల రోజుల క్రితం శోభ ఇంటి నుంచి పరారు కావటంతో తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపద్యంలో శోభ మరో యువకుడితో కలిసి బెగ్గిలిపల్లిలో ఉంటున్నట్టు గుర్తించిన చిరంజీవి తరపు బంధువులు ఆ ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైన శోభ బలవంతంతో ఆమెను పెళ్లి చేసుకున్నానని బాలాజీ నాయక్ చెప్పాడు. తను చెప్పినట్టు వినకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరించటంతో ఆమెతో ఉన్నానన్నాడు. తన భర్త అనుమానంతో వేధింపులకు పాల్పడటంతో ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచమైన బాలాజీ నాయక్ను ఇష్టపడి తనతో తాళి కట్టించుకున్నానని శోభ చెప్పింది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు పోలీసులు తలలు పట్టుకొంటున్నారు. -
వార్ని..అమెరికా సైనికుడ్ని వివాహం చేసుకుంటే ఇన్ని బెనిఫిట్సా!
వాషింగ్టన్: అమెరికా ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అమెరికన్ సైనికుడిని పెళ్లి చేసుకోవడం వల్ల తమకు లభించే మూడు ప్రధాన ప్రభుత్వ ప్రయోజనాల గురించి ఆమె వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అబ్బా.. ఇన్ని సౌకర్యాలా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.భారతీయ మహిళ పేరు మేఘనా. ఆమె అమెరికా ఆర్మీలో పనిచేస్తున్న సైనికుడు మైఖేల్ లేలాండ్ హిల్ను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికన్ సైనికుడిని వివాహం చేసుకుంటే లభించే ప్రయోజనాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మైఖేల్ లేలాండ్ హిల్ మాట్లాడుతూ.. ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఎడ్యుకేషన్ అని చెప్పారు. అమెరికాలో సైనిక కుటుంబాలకు అందుబాటులో ఉన్న కొన్ని విద్యా ప్రయోజనాల కింద అర్హతను బట్టి ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం, భత్యాలు లభిస్తాయని వివరించారు. కొన్ని విద్యా పథకాల కింద నెలవారీ భత్యం కూడా లభిస్తుందని తెలిపారు.రెండో ప్రధాన ప్రయోజనం హెల్త్ ఇన్సూరెన్స్ అని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్తో పాటు ఇతర సైనిక ఆరోగ్య పథకాల ద్వారా అర్హులైన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.మూడో ప్రయోజనంగా వీఏ హోమ్ లోన్ సౌకర్యాన్ని ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా అర్హులైన మాజీ సైనికులు, సేవలో ఉన్న సైనికులు తక్కువ ముందస్తు చెల్లింపుతో లేదా కొన్ని సందర్భాల్లో డౌన్ పేమెంట్ లేకుండానే గృహ రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రుణానికి సంబంధించిన కొన్ని ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. వేలాది మంది కామెంట్లు చేశారు. చాలా మంది భారతీయులు దీనిని భారత సాయుధ దళాల్లో అందించే సౌకర్యాలతో పోల్చారు. -
వద్దు బాబోయ్ ఈ ఆడంబరాలు..
భారతీయ వివాహాలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆడంబరం, వైభవం, భారీ ఖర్చులు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ‘బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్’ సంస్కృతి మరింత శృతిమించింది. కొద్ది గంటలు లేదా కొన్ని రోజుల పాటు జరిగే వేడుకల కోసం రూ.లక్షలు ఖర్చు చేయడం పరిపాటైపోయింది. అయితే, ఈ ఆడంబరాల సంస్కృతిపై ఒక యువతి అభిప్రాయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.జీవితంలో ఘోరమైన తప్పు ఇదే!ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రణతి తన రాబోయే వివాహం కోసం రూ.30 లక్షలు ఖర్చు చేయాల్సి రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది అత్యంత ఘోరమైన తప్పిదం అన్నారు. సామాజిక నిబంధనలు, సమాజం విధించిన ఆచారాల కోసమే తాను ఈ ఖర్చు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె పలు వ్యాఖ్యలు చేశారు.‘20 ఏళ్ల వయసున్నవారు తమ కష్టార్జితంలో లేదా సంపదలో మెజారిటీ భాగాన్ని కేవలం ఒక్క రోజు వేడుక కోసం ఎందుకు ఖర్చు చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. రూ.30 లక్షలు అనేది కేవలం పెళ్లి బడ్జెట్ మాత్రమే కాదు.. అది ఒక సొంతింటి డౌన్ పేమెంట్! ఒక కొత్త వ్యాపారానికి మొదటి పెట్టుబడి. మహిళల కోణంలో ఆలోచిస్తే ఏళ్ల తరబడి చేసే ఎస్ఐపీల మొత్తం. కానీ, సమాజం కోసం మనం దీన్ని వృథాగా ఖర్చు చేస్తున్నాం’ అన్నారు.ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తున్న ఆడంబరాలుఈ మొత్తాన్ని ఆదా చేసుకుంటే ఒక వ్యక్తి జీవిత గమనమే మారిపోతుందని ప్రణతి అన్నారు. ఆ నిధి ఇచ్చే ఆర్థిక వెసులుబాటుతో..నచ్చని ఉద్యోగాన్ని నిర్దాక్ష్యణ్యంగా వీడవచ్చు.మానసిక ప్రశాంతత లేని చెడు బంధాల నుంచి విముక్తి పొందవచ్చు.కెరీర్లో అవసరమైనప్పుడు విరామం తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది.‘మనం పుట్టినప్పుడే తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని మన పేరిట పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. మనకు 25 ఏళ్లు వచ్చేసరికి వారు కేవలం పెళ్లి మాత్రమే కాదు, ఆర్థిక స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చినవారవుతారు. వివాహాలు జ్ఞాపకాలను మాత్రమే ఇస్తాయి. కానీ సంపద ఎన్నో సౌకర్యాలను ఇస్తుంది. అందుకే ఆడంబరమైన పెళ్లిళ్లకు నేను స్వస్తి పలుకుతున్నాను’ అని ఆమె స్పష్టం చేశారు.భారతదేశంలో వివాహం అనేది కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు, అదొక సామాజిక హోదాగా మారింది. అయితే, సమాజం చూపించే ఆడంబరాల ఉచ్చులో పడి యువత తమ భవిష్యత్తు ఆర్థిక భద్రతను, ప్యాషన్లను బలిపెడుతోందనడానికి ప్రణతి లేవనెత్తిన పాయింట్లు నిదర్శనం. వివాహ వేడుకల ఆడంబరం కంటే ఆ తర్వాత ప్రారంభమయ్యే జీవితానికి అవసరమయ్యే ఆర్థిక స్థిరత్వానికే నేటి యువత ప్రాధాన్యమివ్వాలని నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Pranati’s Brain (@pranati.2000)ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
జంతర్ మంతర్ నుంచి నేరుగా పెళ్లి మండపానికి దీప్కే?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (30)కి వరుసగా పెళ్లి సంబంధాలు వస్తున్నాయని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. అభిజీత్ దిప్కే తల్లి అనితా దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సీజేపీ ఆందోళన ప్రారంభం కాకముందు కూడా పెళ్లి సంబంధాలు కొన్ని వచ్చాయని, జంతర్ మంతర్ వద్ద ఆందోళన తర్వాత వాటి సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. అభిజీత్ బోస్టన్లో ఉన్న సమయంలో అతడి గురించి పెళ్లి విషయం గురించి కుటుంబ సభ్యులు మాట్లాడారని, కానీ తన ప్లాన్స్ గురించి ఆయన పెద్దగా చెప్పలేదని ఆమె తెలిపారు. "దాని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. చిరునవ్వు మాత్రమే నవ్వాడు. తల్లిదండ్రులుగా పెళ్లి చేసుకోవాలని మేము ఒత్తిడి చేస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మళ్లీ ప్రస్తావించి, తుది నిర్ణయం ఆయనకే వదిలేస్తాం" అని ఆమె తెలిపారు. ఇప్పుడు దీప్కే అంటే చాలా మంది అమ్మాయిలు పడిచస్తుండడంతో ఆయన జంతర్ మంతర్ నుంచి నేరుగా పెళ్లి మండపానికే వెళ్తాడేమోనని నెటినన్లు అంటున్నారు.ఉద్యమం కొనసాగుతుంది..సీజేపీ ఉద్యమం కొనసాగుతుందని ఆ సంస్థ నేతలు అంటున్నారు. ఆందోళన విరమించడం ఉద్యమానికి ముగింపు కాదని దీప్కే తెలిపారు. ఎక్స్లో చేసిన పోస్టులో, సీజేపీ "ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది" అని పేర్కొంటూ, నిరసన ముగింపు "కేవలం ఆరంభం మాత్రమే" అని చెప్పారు.పరీక్షల వివాదం సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత గరిష్ఠ పరిహారం అందిస్తామని కేంద్రం తెలిపింది.విద్యా సంస్కరణల కోసం సీజేపీ ప్రచారం కొనసాగిస్తుందని, ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్తామని కూడా సీజేపీ నాయకులు సూచించారు. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ, పాలనలో సంస్కరణల కోసం ప్రయత్నిస్తూనే యువతను ప్రభావితం చేసే అంశాలను సంస్థ ప్రస్తావిస్తుందని చెప్పారు.ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రస్తుతం తమ ప్రాధాన్యం కాదని, యువత సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించేలా చూడటంపైనే దృష్టి ఉందని కూడా దాస్ తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాన్ని సీజేపీ నాయకుడు రాంకా పూర్తిగా తోసిపుచ్చనప్పటికీ, దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఒత్తిడి కొనసాగించడమే తక్షణ లక్ష్యమని చెప్పారు. -
భార్య జైనాబ్పై ట్రోలింగ్.. అఖిల్ స్పందన
గతేడాది జూన్లో అక్కినేని అఖిల్–జైనాబ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చాలా సాదాసీదాగా జరిగిన ఆ పెళ్లి వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరిపై కొంతమంది ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా జైనాబ్ వయసు, ఆమె మతం వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. తాజాగా ఈ విషయంపై అఖిల్ స్పందించాడు. తనకు, తన భార్యకు మధ్య ఉన్న వయసు వ్యత్యాసం, ఆమె మతం వంటి విషయాలు తనకు అసలు సమస్యగా అనిపించలేదని ఆయన స్పష్టం చేశాడు. పెళ్లికి ముందే వీటిపై తామిద్దరం మాట్లాడుకున్నాం. అప్పట్లో కొన్ని నెలల పాటు తనపై, తన భార్యపై నడిచిన ట్రోలింగ్ గురించి ఆలోచించాలా.. లేక రాబోయే నా 50 ఏళ్ల జీవితం గురించి ఆలోచించాలా.. నేను నా జీవితం గురించి ఆలోచించాను. ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి. తన భార్యగా మారిన తర్వాత ఇలాంటి నెగెటివ్ పోస్టులు వస్తాయని ముందే చెప్పాను.వాటిపై మానసికంగా సిద్ధంగా ఉండమని సూచించాను. జైనాబ్ అదే విధంగా పరిణతి చూపింది. తమ జంటపై వచ్చిన ప్రతి ట్రోలింగ్ను దీవెనగా తీసుకున్నాం. కులం, మతం, వయసు, ప్రేమ అన్నింటినీ దాటి తమ మధ్య అద్భుతమైన అవగాహన ఉందని చెప్పాడు. తాను మానసికంగా, శారీరకంగా కష్టకాలంలో ఉన్నప్పుడు జైనాబ్ అందించిన సపోర్ట్ను ఎప్పటికీ మరిచిపోలేను. అక్కడ్నుంచే తమ మధ్య అండర్స్టాండింగ్ మరింత బలపడింది. సోషల్ మీడియాలో కనిపించే ట్రోల్స్ నుంచి తనను రక్షించలేను. కానీ వాటిని తను ఎలా స్వీకరించిందనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో జైనాబ్ ఎంతో పరిణతి చూపింది. ఐదేళ్ల రిలేషన్షిప్లో తనను బాగా అర్థం చేసుకుందని అఖిల్ పేర్కొన్నాడు. అఖిల్ లెనిన్ మూవీతో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. -
కొత్తగా పెళ్లయ్యిందా? తొలి ఏడాదిలో చేయాల్సింది ఇదే..
నూతనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంటలకు తొలి ఏడాది ఎంతో మనోహరంగా, అదే సమయంలో బాధ్యతాయుతంగా సాగుతుంది. కొత్త జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు భావోద్వేగ అనుబంధంతో పాటు ఆర్థిక సమీకరణాలను చక్కదిద్దుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య ఆర్థిక పారదర్శకత లోపిస్తే భవిష్యత్తులో అనవసర మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి ఏడాదిలోనే తీసుకునే ఐదు కీలక ఆర్థిక నిర్ణయాలు దంపతుల జీవితానికి బలమైన, సురక్షితమైన పునాది వేస్తాయని చెబుతున్నారు.పారదర్శక సంభాషణ.. ఉమ్మడి బడ్జెట్ముందుగా ఇద్దరి ఆదాయాలు, ఉన్న రుణాలు, వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలపై ఒకరికొకరు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. నెలవారీ నిత్యావసర ఖర్చులు, పొదుపు కోసం స్పష్టమైన బడ్జెట్ను తయారు చేసుకోవాలి. ఉమ్మడి గృహ ఖర్చుల కోసం ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్, వ్యక్తిగత స్వేచ్ఛాయుత ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాలను నిర్వహించడం ఉత్తమం.అత్యవసర నిధి ఏర్పాటుజీవితంలో ఎదురయ్యే ఊహించని సవాళ్లను ఎదుర్కొనేందుకు కనీసం 3-6 నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా మొత్తాన్ని ద్రవ్యరూపంలో (లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్) ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టాలి. ఇది ఉద్యోగ మార్పులు లేదా ఆకస్మిక వైద్య అత్యవసర సమయాల్లో ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.ఇన్సూరెన్స్ కవరేజ్వివాహానంతరం హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అప్డేట్ చేసుకోవాలి. వేర్వేరు పాలసీల కంటే ఇద్దరినీ కవర్ చేసే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను ఎంచుకోవడం లేదా కంపెనీ అందించే గ్రూప్ ఇన్సూరెన్స్లో జీవిత భాగస్వామి పేరును చేర్చడం ప్రయోజనకరం. అలాగే, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్లలో భాగస్వామిని ప్రాథమిక నామినీగా మార్చడం మరచిపోకూడదు.అప్పుల నిర్వహణవివాహానికి ముందు ఉన్న వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలను వీలైనంత త్వరగా తగ్గించుకునే ప్రణాళిక రూపొందించుకోవాలి. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తూ ఇద్దరి సిబిల్ స్కోర్లను మెరుగుపరచుకోవడం భవిష్యత్తులో హోమ్ లోన్ వంటి పెద్ద రుణాలకు మార్గం సుగమం చేస్తుంది.దీర్ఘకాలిక లక్ష్యాలుసొంత ఇల్లు, విదేశీ పర్యటనలు, పిల్లల భవిష్యత్తు, రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మొదటి ఏడాది నుంచే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (సిప్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) వంటి సాధనాల్లో పెట్టుబడులు ప్రారంభించాలి.ఆర్థిక క్రమశిక్షణ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. దంపతులిద్దరూ క్రమం తప్పకుండా ప్రతి నెలా తమ ఆర్థిక స్థితిగతులను సమీక్షించుకోవాలి. పరస్పర సహకారంతో అడుగులు వేస్తే మొదటి ఏడాదే కాదు, రాబోయే సమస్త జీవితం సమృద్ధిగా, సుఖమయంగా మారుతుంది.ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే.. -
బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)
-
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే?
మీరట్ : ఒకే వ్యక్తిని ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై మద్దతు, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) సొంత అక్కాచెల్లెళ్లు. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా వీడియోలు రూపొందిస్తూ ఆదాయం పొందుతున్నారు. శ్యామ్పురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో జూలై 17న ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు ప్రకటించారు. ఆ వికాస్ ఎవరో కాదు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లుగా పనిచేస్తున్న ముగ్గురు అక్కా చెల్లెళ్లకు వికాస్ కెమెరా మెన్గా, కంటెంట్గా అనుగుణంగా భర్తగా నటించాడు. ఇప్పుడు ఆ రీల్ భర్తే.. రియల్ భర్తయ్యాడు. వివాహం అనంతరం విడుదల చేసిన వీడియోలో, చిన్నప్పటి నుంచి తాము ఎప్పుడూ కలిసి పెరిగామని, భవిష్యత్తులో కూడా విడిపోవాలని కోరుకోవడం లేదని అక్కాచెల్లెళ్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించడంతో, విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.వికాస్ కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకుని, వారిని విడదీయకుండా కలిసి ఉండేలా ఈ వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను తన అత్తగారి ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహంపై స్థానిక హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సనాతన సంప్రదాయాలకు, సామాజిక కట్టుబాట్లకు ఇది విరుద్ధమని పేర్కొంటూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని కోరాయి.ఇదిలా ఉండగా, వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న చాముండ మాత ఆలయ నిర్వహణ మాత్రం ఆ సమయంలో ఆలయంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, అక్కడ ఎలాంటి పూజారి లేరని స్పష్టం చేసింది.వివాదం నేపథ్యంలో స్పందించిన ముగ్గురు సోదరీమణులు మరో వీడియో విడుదల చేశారు. మేము ఏ తప్పూ చేయలేదు. ఇది ప్రేమతో తీసుకున్న నిర్ణయం. మేమంతా పెద్దవాళ్లమే. మేము సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులకు సమస్య ఏమిటి? అని ప్రశ్నించారు. అలాగే, పూర్వకాలంలో రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పుగా పరిగణించలేదే, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై పోలీసులు కూడా సమాచారం అందుకున్నట్లు హసన్పూర్ కొత్వాలి ఇన్చార్జ్ రాజేష్ కుమార్ తివారీ తెలిపారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, అధికారిక నమోదు వంటి విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. -
మా అమ్మానాన్న వస్తే మటన్ కాకుండా చికెన్ తెస్తారా?
నిజామాబాద్కు చెందిన ఓ యువతి ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. యువతి తల్లిదండ్రులు ఈ మధ్య కూతురు, అల్లుడి వద్దకు వెళ్లారు. అయితే తన తల్లిదండ్రులకు మటన్ వండకుండా చికెన్ వండారని భర్తతో గొడవపడింది. వారి మధ్య తలెత్తిన మనస్పర్థలు పోలీస్ స్టేషన్కు చేరాయి. పెళ్లయిన నాలుగు నెలలకే తనకు విడాకులు కావాలని అంటోంది ఆ యువతి.మోపాల్ మండలం న్యాల్కల్కు చెందిన సంధ్య తన భర్త ప్రశాంత్ను నిద్రమాతలను పొడిగా చేసి, టాయిలెట్ క్లీనర్ను ఇంజక్షన్ ద్వారా ఎక్కించి గత నెల 30వ తేదీన హత్య చేసింది. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన భర్త ఇక తిరిగి వెళ్లేది లేదని చెప్పడంతో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉంటాడని ఈ ఘాతుకానికి పాల్పడింది.ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన స్వరూప వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరిగాయి. అయినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త మహిపాల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్తది సహజ మరణమని నమ్మించేందుకు యతి్నంచిన స్వరూప చివరకు కటకటాలపాలైంది.నిజామాబాద్అర్బన్: దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు పెద్దవి అవుతున్నాయి. అనుమానాలు, ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశం సంసారాలు ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కారణమేదైనా జీవితాంతం కలిసి ఉంటామని ఏడడుగులు వేసిన దంపతులు తమ సంసార జీవితాలను మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు మార్చుకుంటున్నారు. పెళ్లయిన మూడు నుంచి నాలుగు నెలల్లోనే కొన్ని జంటలు విడాకుల కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టుల గడపలు తొక్కుతుండడం గమనార్హం. గత మూడేళ్లలో మహిళా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నాయి. 2024లో 463, 2025లో 537 ఫిర్యాదులు, ఈ ఏడాది ఈనెల 17 నాటికి 349 ఫిర్యాదులు నమోదయ్యాయి. దంపతులకు కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీసులు తప్పనిసరి పరిస్థితి ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన భర్తల హత్య, ఆత్మహత్యల కేసులు కలకలం రేపాయి. ఈ ఘటనలకు వివాహేతర సంబంధాలు కారణమయ్యాయి. సోషల్ మీడియా ప్రభావం.. జ్ఞానాన్ని పెంచడంతోపాటు ఆనందాన్ని పంచాల్సిన సోషల్ మీడియాను అడ్డగోలుగా ఉపయోగిస్తూ చాలా మంది పక్కదారి పడుతున్నారు. సెల్ఫోన్ చేతిలో ఉంటే తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని భర్తపై భార్య.. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చాలా ఇళ్లలో మామూలు విషయం మారిపోయింది. రీల్స్ చేయడం, ఆన్లైన్లో పరిచయమైన వారితో చాటింగ్ వంటివి సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. కొన్ని పరిచయాలు ఒకరికొకరు ఆకర్షితులై వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే హత్యలు చోటు చేసుకుంటున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న పిల్లలను చంపిన ఘటనలూ ఉన్నాయి. సమన్వయమే ముఖ్యం భార్యాభర్తల మధ్య సమన్వయం, ఓపిక ఎంతో ముఖ్యం. అనుమానాలు ఉంటే ఇద్దరూ మాట్లాడుకుని నివృత్తి చేసుకోవాలి. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకంతో ఉంటే సంసారం సుఖంగా సాగుతుంది. సమన్వయం లేకపోవడం వల్లే అనుమానం పెరిగి విడాకుల వరకు వెళ్తున్నారు. చాలా కేసుల్లో కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పుతున్నాం. లేనిపక్షంలో కేసుల వరకు వెళ్తోంది. – శ్రీలత, సీఐ, మహిళా పోలీసు స్టేషన్ -
పెళ్లి పేరుతో.. పలుసార్లు శారీరకంగా దగ్గరయ్యాడు..!
తమిళనాడు: రెండేళ్ల పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లికి యువకుడు నిరాకరించిన క్రమంలో ఓ ప్రైవేటు వైద్యశాల నర్సు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జేజే నగర్ ప్రాంతానికి చెందిన దేవరాజ్ కుమార్తె జయలక్ష్మి(23). ఈమే నర్సుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో జయలక్ష్మి తిరువేలాంగాడు ప్రాంతానికి చెందిన యువకుడిని రెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వివాహం చేసుకుంటానని నమ్మించి పలుసార్లు దగ్గరైనట్లు తెలిసింది. అయితే గత కొద్ది రోజుల నుంచి యువకుడు జయలక్ష్మికి దూరంగా వుండడంతో పాటూ వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం. దీంతో జయలక్ష్మి తనను పెళ్లిచేసుకోవాలని ఘర్షణ పడింది. బుధవారం మరోసారి ఫోన్లో తననూ పెళ్లి చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్
ఐఏఎస్ (IAS) అధికారిణిని పెళ్లి చేసుకోవాలన్న ఉత్తరప్రదేశ్లోని ఒక యువకుడి కల ఖరీదైన పీడకలగా మారింది. ఎంతో ఘనంగా పెళ్లయిన కొద్ది గంటల్లోనే రాత్రికి రాత్రే వధువు కోటి రూపాయలకు పైగా విలువైన నగలు, విలువైన వస్తువులతో పరారైన ఘటన కలకలం రేపింది. నెట్టింట ఈ వింత పెళ్లి మోసం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఏమైంది?ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఫరీద్పూర్ పరిధిలో గల పచోమి గ్రామానికి చెందిన అభిషేక్ పెళ్లి చేసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్నే పెళ్లి చేసుకోవా లనుకున్నాడు. సాధన అనే ఒక కిలాడీ తనను తాను ఐఏఎస్ అధికారిణిగా పరిచయం చేసుకుంటూ, సోషల్ మీడియాలో ప్రొఫైల్ను చూసి వెనుకా ముందు ఆలోచించకుండా భలే ఛాన్స్లే అనుకుంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా పెళ్లిదాకా తీసుకొచ్చాడు. అటు తమ ఇంటికి ఐఏఎస్ అధికారిణి కోడలిగా రాబోతుందనే ఆనందంతో అభిషేక్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఎంతో సంతోషంగా అంగీకరించారు. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. అయితే, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.శోభనం రాత్రే 'కోటి రూపాయల' తో జంప్ఎఫ్ఐఆర్ (FIR) వివరాల ప్రకారం... పెళ్లయిన తర్వాత వధువు సాధన అత్తారింటికి చేరుకుంది. అక్కడ కుటుంబ సభ్యులు ఆమెకు పెద్ద ఎత్తున బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇచ్చారు. అయితే, పెళ్లి జరిగిన మొదటి రాత్రి (శోభనం రాత్రి) భర్త అభిషేక్ నిద్రిస్తున్న సమయంలో, సాధన ఇంట్లోని విలువైన నగలు, నగదును బ్యాగ్లో సర్దుకుని అక్కడి నుండి పరారైంది. ఉదయం చూసేసరికి దాదాపు రూ. 1 కోటి విలువైన వస్తువులతో వధువు కనిపించకుండా పోవడంతో వరుడి కుటుంబం లబోదిబోమంది.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందిమోసపోయామని గ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సాధన, ఆమె తండ్రి ,మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ నకిలీ ఐఏఎస్ వధువును పట్టుకోవడానికి బరేలీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.ఇదీ చదవండి: 25 ఏకరాల భూమి కొన్న స్టార్ హీరో, ధర ఎంతో తెలుసా?వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పొరుగున ఉన్న బుదౌన్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితురాలు సాధనను అదుపులోకి తీసుకున్నారు. ఈమె వెనుక ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా గతంలో కూడా ఎవరినైనా ఇలాగే ఐఏఎస్ పేరుతో మోసం చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నకిలీ ఐఏఎస్ ప్రొఫైల్, వివాహ మోసాల నెట్వర్క్ విస్తృతిపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తుండటంతో, ఈ కేసు స్థానికంగా విస్తృత చర్చనీయాంశ మైంది. -
ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల గౌరీ స్ప్రాట్ను వివాహం చేసుకోవడంపై యోగా గురువు బాబా రాందేవ్ స్పందించారు. ఈ వివాహంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మతం ఏదైనా సరే.. ఒక వ్యక్తి మూడు లేదా నాలుగు వివాహాలు చేసుకోవడాన్ని తాను సమర్థించనని ఆయన స్పష్టం చేశారు.‘ఏబీపీ న్యూస్’నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 61 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ మరో వివాహం చేసుకోవడంపై స్పందిస్తూ ‘ఈ వయసులో కొత్త చిక్కులు ఎందుకు? గత భాగస్వాములతో ఇంకా గౌరవం, అనుబంధం ఉంటే వాటినే కొనసాగించాలి’ అని రాందేవ్ సూచించారు. కుటుంబ విలువల గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఒకే వివాహం చేసుకుని, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని, స్థిరమైన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవాలని ఆయన హితవు పలికారు.సమాజంలో ద్వేషాన్ని పక్కనపెట్టి, పరస్పర గౌరవంతో జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఆమిర్ ఖాన్ మూడో వివాహంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా విమర్శలు గుప్పించారు. సినీ తారలు యువతకు ఆదర్శంగా ఉండాలని, అయితే దీనికి భిన్నంగా వారి వ్యక్తిగత నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయని, భిన్నమైన అభిప్రాయాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: అయోధ్య విరాళాల వివాదం.. ట్రస్ట్ కోశాధికారి సరికొత్త వాదన! -
జర్నలిస్ట్ను పెళ్లాడిన ‘ఆర్జీ కర్’ దర్శకుడు.. రూమర్లకు ఎండ్కార్డ్!
కోల్కతా: ప్రముఖ బీజేపీ నేత, సినీ దర్శకుడు శంకుదేబ్ పాండా తాజాగా టెలివిజన్ జర్నలిస్ట్, రిపబ్లిక్ బంగ్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వర్ణాలి మితా సర్కార్ను కోల్కతాలో వివాహం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం సంప్రదాయ బెంగాలీ పద్ధతిలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి రిలేషన్షిప్పై వస్తున్న ఊహాగానాలకు ఈ పెళ్లితో తెరపడింది. ఈ వివాహ వేడుకకు రాజకీయ, వినోద, మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. Congrats 👏 Sankudeb Panda & Swarnli Sarkar Definitely Love Marriage ❤️ pic.twitter.com/GnMzvkTTVT— SANDIP HALDER (@HALDERSAN) July 12, 2026వివాహ వేడుకలో శంకుదేబ్ పాండా ఎరుపు రంగు కుర్తా, ధోవతి ధరించగా.. స్వర్ణాలి మితా సర్కార్ సాంప్రదాయ బంగారు ఆభరణాలు, ఎరుపు రంగు బనారసి చీరలో మెరిసిపోయారు. పెళ్లికి ముందు జరిగిన ‘గాయే హోలుద్’వేడుక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. శంకుదేబ్ పాండా రాజకీయాలతో పాటు సినిమా రంగంలోనూ కొనసాగుతున్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచారం, హత్య ఉదంతం ఆధారంగా ఆయన త్వరలో ‘అభయ శక్తి’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రాణా సర్కార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక పరిణామాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ఒక ఉద్యమమని శంకుదేబ్ పేర్కొన్నారు. వివాహ బంధంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆయన, త్వరలోనే ఈ సినిమా పనుల్లో బిజీ కానున్నారు.ఇది కూడా చదవండి: అయోధ్య విరాళాల గోల్మాల్: ఆరెస్సెస్ నమ్మకం ఇదే.. -
దత్తత హిందూ సోదరికి, ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో జరిగిన ఒక వివాహం మత సామరస్యానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ముస్లిం యువకుడైన బబ్లూ సిద్ధిఖీ, తన పెంపుడు సోదరి దీపాన్షి వివాహ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు.హైందవ సంప్రదాయాల ప్రకారం జరిపించిన తీరు స్థానికంగానే కాక సోషల్ మీడియాలోనూ ప్రశంసలందుకుంటోంది.తండ్రి తరువాత తండ్రికొన్నేళ్ల క్రితమే దీపాన్షి తల్లిదండ్రులు చనిపోయి ఒంటరిగా మిగిలిపోయింది. దీంతో పొరుగున ఉండే బబ్లూ సిద్ధిఖీ, ఆమెను తన సొంత చెల్లెలిలా ఆదరించాడు. బబ్లూ కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు లేరనే వెలితి ఆమెకు తెలియకుండా బబ్లూ కుటుంబం ఆమె జీవితంలో ప్రతి అడుగులో తోడుగా నిలిచింది. ఆమెకు యుక్తవయసు రావడంతో పెద్దమనసు చేసుకొని వైభంగా పెళ్లి చేశారు. కాళ్లు క డిగి కన్యాదానం చేసి చక్కటి విందు ఇవ్వడం విశేషంగా నిలిచింది. జులై 8న హిందూ సంప్రదాయాల ప్రకారం ఉఝానిలోని ఎస్ఎస్ గ్రీన్ ప్యాలెస్లో దీపాన్షి, కమల్కాంత్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంల అత్యంత పవిత్రమైన 'కన్యాదానం' క్రతువును బబ్లూ సిద్ధిఖీ స్వయంగా నిర్వహించాడు. దాదాపు 800 మంది అతిథులకు భోజన వసతులతో పాటు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ మిన్న‘‘దీపాన్షి చిన్నప్పటి నుంచి నా సొంత చెల్లెలా చూసుకున్నా. తమ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. ప్రేమ, నమ్మకంతో ఏర్పడే బంధాలు రక్తసంబంధాల కంటే తక్కువేమీ కావు. ఏ ఆడపిల్ల కూడా తన పెళ్లి రోజున ఒంటరినని బాధపడకూడదు. ఒక సొంత అన్నగా చెల్లెల్నిఎంత గౌరవంగా, సంతోషంగా అత్తవారింటికి పంపాలో, అలాగే పంపించాను" అని బబ్లూ సిద్ధిఖీ గర్వంగా చెప్పాడు.కన్నీళ్లు పెట్టుకున్న వధువుపెళ్లి సమయంలో దీపాన్షి పలుమార్లు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. బబ్లూ భయ్యా, వారి కుటుంబం సొంత కూతురి కంటే మిన్నగా చూసుకున్నారు. తల్లిదండ్రులు లేరనే బాధ నాకు కలగనివ్వలేదు. సామాజిక, మతపరమైన వ్యత్యాసాల కంటే ప్రేమాభిమానాలే గొప్పవని మా అన్న నిరూపించాడు అంటూ భావోద్వేగానికి లోనైంది. నీరు నిండిన కళ్ళతో వారికి కృతజ్ఞతలు తెలిపింది.ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!నెటిజన్ల ప్రశంసలుఈ పెళ్లికి హాజరైన స్థానికులు బబ్లూ సిద్ధిఖీ మానవత్వాన్ని, మతసామరస్యాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు . సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ కావడంతో, నెటిజన్లు "నిజమైన భారతదేశం అంటే ఇదే" అంటూ ఈ అన్నాచెల్లెళ్ల బంధాన్ని, బబ్లూ సంస్కారాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. మతాల పేరుతో సమాజంలో విభేదాలు తలెత్తుతున్న ఈ రోజుల్లో బబ్లూ మతంకంటే మానవత్వం మిన్న అని చాటిచెప్పాడు అంటూ కొనియాడు తున్నారు. ఇదీ చదవండి: సీక్రెట్గా ప్రియుడ్ని పెళ్లాడిన బిగ్ బాస్ ఫేమ్ : స్పెషాల్టీ ఏంటంటే A Muslim man named Bablu (Riyasat) Siddiqui in Badaun, Uttar Pradesh, organised a lavish, fully traditional Hindu wedding for his adopted Hindu sister Deepanshi, personally performing her kanyadaan and hosting more than 800 guests with food and refreshments. pic.twitter.com/6CGEaM1VT1— Shakeel Yasar Ullah (@yasarullah) July 10, 2026 -
సీక్రెట్గా ప్రియుడ్ని పెళ్లాడిన బిగ్ బాస్ ఫేమ్ : స్పెషాల్టీ ఏంటంటే
ప్రముఖ టీవీ నటి, బిగ్బాస్ ఓటీటీ -2 ఫేమ్ పాలక్ పుర్స్వానీ తన చిరకాల ప్రియుడితో ఏడడగులు వేసింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్లో ప్రియుడు రోహన్ ఖన్నాను పెళ్లాడింది. అంతేకాదు వీరి పెళ్లి 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం ముందు జరిగిన తొలి ఆధ్యాత్మిక వివాహంగా నిలుస్తోంది. అత్యంత సన్నిహిత వివాహ వేడుకకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఇవినెట్టింట సందడిగా మారాయి.కోయంబత్తూరులోని సద్గురు ఈషా ఫౌండేషన్లో ఆ పరమశివుని విగ్రహం ముందు జరిగిన ఈ వేడుక నెట్టింట అందరి దృష్టిని ఆకరిస్తోంది. సాధారణంగా వివాహ వేడుకలో వధువు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ వీరి పెళ్లి వేడుక అందుకు భిన్నంగా నిలిచింది. 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం నేపథ్యంలో ఆ జంట నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by J P Palak (@palak.purswani)కాగా 2014లో టీవీ నటిగా కరియర్ను ప్రారంభించిన పాలక్ పుర్స్వానీ 'రూహానియత్', 'బడే భయ్యా కి దుల్హనియా', 'యే రిష్తే హై ప్యార్ కే', 'ఏక్ ఆస్థా ఐసీ భీ', 'మేరీ హానికారక్ బీవీ' 'బడీ దేవరాణి' లాంటి సీరియల్స్, షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. 2019లో ఆమె 'నాచ్ బలియే 9', 2023లో 'బిగ్ బాస్ OTT సీజన్ 2'లో కూడా పాల్గొంది. పాలక్ - రోహన్ లవ్స్టోరీవీరి బంధం 2024లో మొదలైంది. ఏడాది తిరగకముందే, టర్కీ పర్యటనలో రోహన్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. గత ఏడాది ఏప్రిల్లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా తమ పెళ్లి కబురును, ఫోటోలను ఒక ఉమ్మడి పోస్ట్ ద్వారా పంచుకున్నారు ఈ లవ్బర్డ్స్. "కొన్ని ప్రేమకథలను ఆ దేవుడే రచిస్తాడు. మా ప్రేమకథను మహాదేవుడు ఎంపిక చేశారు. రెండు ఆత్మలు... శాశ్వతంగా ఒక్కటయ్యాయి. 26.06.26." అంటూ పోస్ట్ చేశారు. పాలక్ ఎరుపు , గులాబీ రంగుల కలయికతో ఉన్న పెళ్లి లెహెంగాలో ఎంతో అందంగా కనిపించగా, వరుడు భర్త రోహన్ లేత గోధుమ రంగు (బీజ్) షెర్వానీలో మెరిశాడు. -
రెండో పెళ్లి చేసుకున్నారో.. ప్రభుత్వ ఉద్యోగం ఊడినట్లే
గౌహతి: అస్సాం రాష్ట్రంలో ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే (బహుభార్యాత్వం) సంస్కృతికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. బహుభార్యాత్వాన్ని అవలంబించే వ్యక్తులకు ఇకపై ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని, అలాగే ఈ పద్ధతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదనలు ప్రవేశపెట్టింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు కేవలం అర్హులకు చేరడమే కాకుండా, సమాజంలో సమగ్రత, నైతిక విలువలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, లింగ న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే ఏ పురుషుడు కూడా ఇకపై ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు అర్హుడు కాడని ఆయన ప్రకటించారు.ఈ కొత్త విధానంలో భాగంగా 'అస్సాం సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1964' కు సవరణలు చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది. దీని ప్రకారం, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే, చట్టప్రకారం వారిని ఉద్యోగం నుండి నేరుగా తొలగిస్తారు.సమాజంలో బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించడానికి, ఏదైనా క్రిమినల్ చట్టం కింద నేరస్థుడిగా తేలిన వ్యక్తికి కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిలిపివేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. -
ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారని...
సిద్దిపేట అర్బన్: తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని, ఎలాగైనా పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఆ అమ్మాయి గ్రామంతో పాటు.. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గ్రామంలో పోస్టర్లు అంటించాడు. అభ్యంతకరమైన పోస్టర్లు అంటించి అమ్మాయి పరువు తీసేందుకు ప్రయత్నించిన ఆ యువకుడితో సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సిద్దిపేట త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు వివరాలు వెల్లడించారు. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేష్ (29) అర్బన్ మండలం ఎన్సాన్పల్లికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. యువతి తల్లిదండ్రులు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీన్ని జీర్ణించుకోలేని యువకుడు వివాహం ఆగిపోవాలనే ఉద్దేశంతో యువతితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోస్టర్లు సృష్టించాడు. ఆ అమ్మాయి గ్రామంతో పాటు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గ్రామంలో పోస్టర్లు అతికించాడు. ఈ విషయమై త్రీటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా నేరం ఒప్పుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్ సహా అతనికి సహకరించిన వన్నెల అశ్విత్కుమార్, బండి భానుప్రసాద్, రేఖ, బురుజుకింది ఈశ్వర్, రాజబోయిన నవీన్కుమార్ ఉన్నారు. -
క్యాన్సర్తో కొడుకు మృతి: కోడలికి కన్యాదానం చేసిన మామగారు
కోడళ్లను వేధించే అత్తమామల గురించి విన్నాం. కానీ కోడల్ని కన్న కూతురి కంటే మిన్నగా భావించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అత్తామామల గురించి తెలుసా? క్యాన్సర్ మహమ్మారి కొడుకును బలితీసుకుంటే, వారు కోడలికి అండగా నిలిచారు. అంతేకాదు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. కన్నీళ్లు తెప్పించే ఈ సంఘటన సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. పలువురి ప్రశంసలు అందుకుంటోంది.కొన్ని సంబంధాలు కేవలం రక్త సంబంధాలు కాదు. అవి ప్రేమ, ఆప్యాయతలకు సంబంధించినవ అని ఈ ఘటన నిరూపించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకుంది. మరో ఇంటికి కోడలిగా తమ కోడలిని అత్తారింటికి సాగనంపిన క్షణాన, అక్కడున్నవారంతా ఆనంద భాష్పాలు రాల్చారు.మధ్యప్రదేశ్కు చెందిన దినేష్ బైరాగి కుమారుడు కపిల్కు, ప్రియాంకతో 2018లో వివాహం జరిగింది. ప్రియాంక తన ఉన్నత చదువులను పూర్తి చేసి ఆ తరువాత 2023లో అత్తగారింట్లో అడుగుపెట్టింది. వచ్చిన కొద్ది రోజులకే ఆమె తన ప్రేమపూర్వక ప్రవర్తనతో కుటుంబ సభ్యుల మనసు గెలుచుకుంది. అంతా హ్యాపీగాగడిచిపోతుందనుకుంటున్న తరుణంలో దురదృష్టవశాత్తూ, ఆమె వచ్చిన కొన్ని నెలలకే భర్త కపిల్ క్యాన్సర్ బారిన పడ్డాడు. కానీ ప్రియాంక భయపడిపోలేదు. ఆ కష్టకాలంలో క తన భర్తకు కొండంత అండగా నిలిచింది. కానీ, 2024లో కపిల్ క్యాన్సర్తో పోరాడుతూ మరణించాడు. ఆ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) కోడలు కాదు.. కూతురు మామగారి గొప్ప నిర్ణయంచిన్న వయసులోనే భర్తను కోల్పోయి సమాజంలో కష్టాల పాలౌతున్న వారిలా తమ ప్రియాంక జీవితం ముగిసిపోకూడదని ఆమె మామ దినేష్ బైరాగి భావించారు. కొడుకు చనిపోయినంత మాత్రాన కోడలి పట్ల తమ బాధ్యత తీరిపోలేదంటూ భార్యను కూడా ఒప్పించారు. ప్రియాంకకు మారు మనువు చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి వద్ద ప్రస్తావించగా, ఆ కుటుంబం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సాధారణంగా భర్త చనిపోతే అత్తగారింటితో బంధాలు తెగిపోయే ఈ రోజుల్లో, కోడలి భవిష్యత్తు కోసం అత్తమామలే ఇంతటి నిర్ణయం తీసుకోవడం వారిని ఆశ్చర్యపరిచింది. ప్రియాంక కోడలు కాదు, తమ కూతురు అని దినేష్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్తండ్రిగా కన్యాదానందినేష్ బైరాగి విదిషా జిల్లాలోని అరారి ఖేజ్దా గ్రామానికి చెందిన గోవింద్ బైరాగీతో వివాహం నిశ్చయించారు. వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. వ్యక్తిని ప్రియాంక కోసం సంబంధం చూశారు. ఈ పెళ్లికి సంబంధించిన ప్రణాళికలు, నిర్వహణ మరియు ఖర్చులన్నీ దినేష్ స్వయంగా భరించారు. పెళ్లి వేడుకలో అత్యంత భావోద్వేగ క్షణం ఏంటంటే, స్వయంగా మామగారే తండ్రి స్థానంలో కూర్చుని ప్రియాంకకు 'కన్యాదానం' చేశారు. పెళ్లికొడుకు చేతిలో ప్రియాంక చేయి పెట్టి, ఆమె కొత్త జీవితం సంతోషంగా సాగాలని ఆశీర్వదించారు.తండ్రి భావోద్వేగంఈ సందర్భంగా ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ బిడ్డ పునర్వివాహ బాధ్యతను ఆమె అత్తమామలు పూర్తిగా తీసుకుని సమాజానికి ఇంత గొప్ప ఆదర్శాన్ని అందిస్తారని తాను కలలో కూడా ఊహించలేదంటే కంటతడిపెట్టుకున్నారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
'అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు.. బలవంతంగా చేస్తున్నారు'
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి చేస్తున్నారు..’అంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పోస్టర్లు వెలిశాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువతి, అదే జిల్లాకు చెందిన ఓ యువకుడు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు ఈ పోస్టర్ల ద్వారా తెలిపారు. ఆ యువతికి పెళ్లి ఇష్టం లేకపోయినా ఆమె తల్లిదండ్రులు తంగళ్లపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారని, తమ ప్రేమ విషయం ఆ పెళ్లి కొడుకుకు తెలిసినా 16 తులాల బంగారం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ప్రేమికుడు ఆరోపించాడు. ఈ పోస్టర్ల అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. కాగా అమ్మాయి తరఫు వారు ఆ యువకుడిపై సిద్దిపేటలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)
-
రెడ్ బెనారసీ డ్రెస్లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!
నెట్టింట ఎక్కడ చూసినా కపూర్ ఫ్యామిలీ కొత్త పెళ్లికూతురు అన్షులా కపూర్ గురించి విశేషాలే. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నటుడు అర్జున్ కపూర్ సోదరి అన్షులా తన ప్రియుడు రోహన్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహ వేడుక ముగిసిన తరువాత జరిగిన కాక్టైల్ పార్టీకి తగ్గట్టుగా అందంగా అలంకరించుకుంది. బనారసీ బ్రోకేడ్ డ్రెస్, మెడలో పచ్చల నెక్లెస్తో సమకాలీన ఫ్యాషన్ స్టైల్ను చాటుకుంది. ఈ సందర్భంగా ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.అన్షులా ఇలా రాశారు : పెళ్లైన మహిళగా ఇది నా తొలి సాయంత్రం, ఈ కొత్త ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈ లుక్కు సిందూరి ఎరుపు రంగు మాత్రమే సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఈ ఔట్ఫిట్ గురంచి అమిత్ (ప్రముఖ డిజైనర్)తో మాట్లాడు తున్నపుడు. తన ఆహార్యం వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవాలని అనిపించింది. దానికి తగ్గట్టుగానే శిల్పం లాంటి 'కార్సెట్ సిల్హౌట్' (sculptural corseted silhouette) గా మార్చేశారు. చీర కొంగును సరికొత్త మోడ్రన్ కోట్యూర్ స్టేట్మెంట్గా రీ-డిజైన్ చేశారు. ఇది మన సంప్రదాయానికి గౌరవాన్ని ఇస్తూనే, ఆధునికతను అద్భుతంగా చాటిచెప్పింది. నా దృష్టిలో మా పెళ్లి అంతా కూడా ఇలాగే సాగింది. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ మూలాలను (సంప్రదాయాలను) గుండెల్లో భద్రంగా దాచుకుంటూనే... భవిష్యత్తులోకి అంతే ఆనందంగా, మనస్ఫూర్తిగా అడుగుపెట్టడం! అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)> ఇదీ చదవండి: అన్షులా-రోహన్ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే! కాగా ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో సోమవారం (జూలై 6న) అన్షుల్ - రోహన్ వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దివంగత తల్లిని గుర్తు చేసుకుంటూ 42 ఏళ్ల నాటి ఆమె దుప్పట్టాను ధరించడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
అన్షులా-రోహన్ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే!
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత మోనా శౌరిల కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడి రోహన్ థక్కర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సన్నితుల సమక్షంలో పంజాబీ, గుజరాతీ సంప్రదాయాల మేళవింపుతో వైభవంగా ఈ వీరి వివాహ వేడుకు ముగిసింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులను అలరించాయి. అదే సందర్భంలో అన్షులా మనసు దోచుకున్నరోహన్ ఎవరు? అతని ఆస్తిపాస్తులేంటి అనే వివరాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.అన్షులా-రోహన్ లవ్ స్టోరీఅన్షులా-రోహన్ దాదాపు మూడేళ్ల క్రితం 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఒక తెల్లవారుజామున 1:15 గంటలకు మొదలైన వీరి చాటింగ్, ఉదయం 6 గంటలదాకా సాగిందట. అలా మొదలైన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. పరిచయమైన మూడేళ్లకు సరిగ్గా అదే సమయానికి ఆమెకు అన్షులాకు ప్రపోజ్ చేశారు. 2023లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. జూలై 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. అక్టోబర్ 2025లో గోర్ ధానా వేడుక చేసుకున్నారు. కపూర్ కుటుంబం సమక్షంలో జూన్లో వీరిద్దరూ దంపతులుగా మారాయి. మూడేళ్ల క్రితం 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఒక మంగళవారం తెల్లవారుజామున 1:15 గంటలకు మొదలైన వీరి చాటింగ్, ఉదయం 6 గంటలదాకా సాగిందట. అలా మొదలైన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. పరిచయమైన మూడేళ్లకు సరిగ్గా అదే సమయానికి రోహన్ అన్షులాకు ప్రపోజ్ చేశారు. 2023లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2025 జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో గోర్ ధానా వేడుక చేసుకున్నారు. కపూర్ కుటుంబం సమక్షంలో జూన్లో వీరిద్దరూ దంపతులుగా మారాయి. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)ఎవరీ రోహన్ థక్కర్రోహన్ బహిరంగంగా కనిపించే సెలబ్రిటీ కానప్పటికీ రోహన్ స్క్రీన్రైటర్గా పాపులయ్యారు. ఆయన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్కు చెందిన డిజిటల్ కంటెంట్ సంస్థ 'ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్' (Dharmatic Entertainment) లో ఫ్రీలాన్స్ రైటర్గా పనిచేస్తున్నారు. ముంబైలో 1993 అక్టోబర్ 12న పుట్టాడు. తల్లితండ్రులలు, సోదరుడు హృదయ్ ఠక్కర్ ఉన్నారు. కానీ రోహన్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి 'ప్లేరైటింగ్ అండ్ స్క్రీన్రైటింగ్'లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే యూసీఎల్ఏ (UCLA) లో కూడా స్క్రీన్రైటింగ్ కోర్సు చేశారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఆయన అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా రంగాలలో పనిచేశారు. ప్రస్తుతం ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లో వెబ్ సిరీస్లు, సినిమాలకు కథలు రాస్తున్నారు 'ది నవలిస్ట్' (2016), 'నెవర్ టూ లేట్' (2016), 'నింబస్' (2018) వంటి లఘు చిత్రాలకు రచయితగా , స్క్రిప్ట్ సూపర్వైజర్గా అతనికి క్రెడిట్ లభించింది. రోహన్ థక్కర్ నికర ఆస్తి విలువ సుమారు 8.5 కోట్ల రూపాయలు పై మాటేనని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.అన్షులా కపూర్ గురించి..బాలీవుడ్లో పాపులర్ ఫ్యామిలీ కపూర్ కుటుంబానికి చెందిన అన్షులా, సెలబ్రిటీలను అభిమానులతో కలుపుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేసే 'ఫ్యాన్కైండ్' (Fankind) అనే సంస్థను నడుపుతున్నారు. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేసిన 'ది ట్రెయిటర్స్' (The Traitors) అనే రియాలిటీ షోలో కూడా ఆమె పాల్గొన్నారు.ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి, ఇది గమనించారా?
61 ఏళ్ల వయసులో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి హాట్ టాపిక్గా నిలుస్తోంది. ముంబైలోని బాంద్రాలో ఆమిర్ నివాసంలో జులై 5న ఆదివారం జరిగిన ఈ వివాహానికి మొదట భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావు, కుమార్తె కూడా హాజరు కావడం విశేషంగా నిలిచింది. అయితే, ఈ పెళ్లిలో మరో విషయం కూడా ఆసక్తికరంగా నిలిచింది. కొత్త పెళ్లికొడుకుగా ఆమిర్ ఖాన్ కేవలం ఒక కాలికి 'ఘుంగ్రూ' (మువ్వల పట్టీ) ధరించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింగ తెగ వైరల్గా మారాయా? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?ఇటీవలి సెలబ్రిటీల పెళ్లిళ్లలో వధువులతో పోటీగా పెళ్లి కొడుకులు కూడా మహిళలు ధరించే ఆభరణాలను ధరించడం ఒక ఫ్యాషన్గా మారింది. అందులో భాగంగానే ఆమీర్ ఖాన్ కూడా ఒక కాలికి పట్టీ ధరించాడా లేక ఇది ఏదైనా వివాహ సంప్రదాయమా? తన గత రెండు పెళ్లిళ్ల సమయంలోనూ కూడా అతను ఇలాగే చేశాడా? అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్పై గాయని మండిపాటుఆమిర్ దృష్టిలో ఫ్యాషన్ అంటే కేవలం ప్రత్యేక సందర్భాల్లో ఏదో ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించడం మాత్రమే కాదు; దానికి ఖచ్చితంగా ఒక పెర్సనల్టచ్ కూడా ఉంటుంది అనడానికి ఈ గజ్జెల పట్టీ ఒక ఉదారణ అంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఆమిర్ తెలుపు రంగు ధోవతితో, తలపాగా చాలా స్పెషల్గా కనిపించాడు. అంతేకాదు ఆయన ఎంచుకున్న ఆభరణాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఏది ఏమైనా ఒక పురుషుడు కేవలం ఒక కాలి పట్టీని ధరించడం ఫ్యాషన్ ప్రపంచంలో ఒక కొత్త ట్రెండ్ అనే చెప్పాలి.Aamir Khan got married to Gauri Spratt today.But what is that thick metal anklet-like ornament he is wearing on one of his legs? Why is Aamir Khan wearing it? Is it part of any particular tradition or wedding ritual? pic.twitter.com/UlqXMYPXB5— Saffron Chargers (@SaffronChargers) July 5, 2026 > సాధారణంగా కాలి పట్టీ అనేది స్త్రీలు ధరించే ఆభరణం, అందుకే ఆయన ఎంపికపై చర్చ మొదలైంది. ఏ ఆభరణం ఎవరికి పరిమితం అనేది పెద్ద విషయం కాదు ,కానీ ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా ఏదైనా చేసి ప్రత్యేకతను చాటుకోవడానికి ఆమిర్ ఫ్యాషన్ విషయంలో ప్రయోగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు దశాబ్దం క్రితం, అంటే 2017లో, ఆమిర్ ఖాన్ ముక్కు కుట్టించుకున్నారు. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్రంలో 'ఫిరంగి మల్లా' అనే మోసగాడి పాత్రకోసం ముక్కు కుట్టించుకున్నారట. అయితే ఇది కేవలం పాత్ర కోసం మాత్రమే కాదనీ, దీని వెనుక వ్యక్తిగతమైన ప్రేరణ ఉందని పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. తన స్కూల్ రోజుల నాటి సింధీ ఫ్రెండ్ ముక్కుకు పోగు ధరించేవాడట. ఈ ప్రేరణతోనే తన పాత్ర కోసం ఒక ముక్కుపోగును ఆమిర్ స్వయంగా దానిని డిజైన్ చేసుకున్నాడట. ఇదీ చదవండి : ఆమీర్ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం View this post on Instagram A post shared by Irfan Pathan (@irfanpathan_official) -
ఆమీర్ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కుండపోత వర్షాలు, బలమైన గాలుల మధ్య అంబానీ భద్రతా కాన్వాయ్ ముందు ఒక చెట్టు కూలిపోవడంతో, కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాపిక్లో కొద్దిసేపు ఆగిపోవాల్సి వచ్చింది. అంబానీ కుటుంబం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో వివాహ వేడుకకు వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్
-
డాన్స్ వివాదం.. నా కూతురిని ఆపే హక్కు నీకు లేదు
మార్కాపురం: పెళ్లి వేడుకల్లో చిన్నచిన్న కారణాలతో వివాదాలు తలెత్తడం కొత్తేమీ కాదు. అయితే పెళ్లి ఊరేగింపులో పెళ్లికూతురిని డాన్స్ చేయొద్దని వరుడు అడ్డు చెప్పాడనే కారణంతో పెళ్లికూతురు తండ్రి ఏకంగా పెళ్లినే రద్దు చేయించాడు.. వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చినగానిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా, శనివారం రాత్రి వధూవరుల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ వధూవరులను కూడా నృత్యం చేయాలని కోరారు.ఈ క్రమంలో పెళ్లికూతురు డాన్స్ చేయడానికి సిద్ధమవుతుండగా, వరుడు ఆమెను వారించినట్లు తెలుస్తోంది. ఈ విషయం పెళ్లికూతురు తండ్రికి ఆగ్రహం తెప్పించింది. "పెళ్లికి ముందే నా కూతురిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే, పెళ్లి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?" అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం తన కుమార్తెను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో వివాహం నిలిచిపోయింది.ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ విభేదాలు తొలగకపోవడంతో పెళ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అనంతరం కట్నం, కానుకలకు సంబంధించిన వ్యవహారాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.పెళ్లి జరగడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా, డాన్స్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా వివాహం రద్దు కావడం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. -
ప్రియురాలితో అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ఇవాళ అఫీషియల్గా ఒక్కటయ్యారు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ నివాసంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తమ వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ పెళ్లికి కేవలం దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.కాగా.. గతేడాది అమిర్ ఖాన్ తన బర్త్ డే సందర్భంగా ప్రియురాలిని పరిచయం చేశారు. తాను 25 ఏళ్లుగా తెలిసినప్పటికీ.. గత రెండేళ్లుగా డేటింగ్ ప్రారంభించామని అమిర్ ఖాన్ వెల్లడించారు. గతంలో అమిర్ ఖాన్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2021లో విడిపోగా.. ఓ కుమారుడు ఆజాద్ ఉన్నారు.మరోవైవు బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్.. వెల్నెస్ అండ్ బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో సెలూన్ యజమాని అయిన రీటా స్ప్రాట్ కుమార్తెనే గౌరీ. గతంలో 2004లో లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్లో ఫోటోగ్రఫీలో కోర్సును గౌరీ అభ్యసించారు. ఆమె ప్రస్తుతం ముంబైలో ఒక బిబ్లంట్ అనే సెలూన్ నడుపుతున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్!
యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సెలబ్రిటీ జంట సిద్ధూ పవన్, సోనియా సింగ్. వీరిద్దరు బుల్లితెరపై చేసే హడావుడి అంతా ఇంత కాదు. పలు షోలలో జంటగా పాల్గొంటూ.. తమదైన కామెడీ మాటలతో నవ్విస్తుంటారు. ముఖ్యంగా సోనియా అమాయకంగా చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్ నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఓ రియాల్టీ షోలోనూ ఈ జంట పాల్గొని తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కలిసే ఉన్నప్పటికీ.. వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. దీనిపై తాజాగా సోనియా స్పందించారు. త్వరలోనే పెళ్లి చేసుకోతున్నట్లు వెల్లడించారు.తాజాగా ఓ న్యూస్ చానల్ నిర్వహిస్తున్న ఓ టాక్ షోలో పాల్గొన్న సోనియాని పెళ్లి ఎప్పుడు అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘ఏమో.. పెళ్లయిపోయిందేమో.. నేను చెప్పట్లేదేమో’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఆమె. అనంతరం అసలు విషయాన్ని వెల్లడిస్తూ.. ‘సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 1:45 గంటలకు మా పెళ్లి జరగనుంది’ అని చెప్పింది.యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సోనియా.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.'విరూపాక్ష'సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో కామెడీ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడుదలైన 'నాగబంధం' సినిమాలో కూడా సోనియా కీలక పాత్రలో నటించారు. -
61 ఏళ్ల వయసులో మూడో వివాహానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో
-
పెళ్లిపై భయం.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది: హీరోయిన్
ప్రస్తుతం మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న నటి ఐశ్వర్య లక్ష్మి. ఈ మలయాళీ భామ నిర్మాత కూడా. ముఖ్యమైన దక్షిణాది కథానాయికల్లో ఈమె ఒకరు. 2017లో మాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2019లో యాక్షన్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్కు దిగుమతి అయ్యారు. ఆ తరువాత ఇక్కడ జగమేతంతిరం, కార్గీ, పొన్నియిన్ సెల్వన్, కట్టాకుస్తీ, మామన్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఇటీవల టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈ 34 ఏళ్ల పరువాల బ్యూటీ ఇప్పటికీ అవివాహితేనన్నది గమనార్హం. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పే ఐశ్వర్య లక్ష్మి వివాహం పైనా తనకు నమ్మకం లేదని, ఇంతకు ముందు పలు మార్లు చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటిది ఇటీవల అమ్మతనంపై ఇష్టాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఈ తాజాగా కట్టా కుస్తీ–2 చిత్రంలో నటుడు విష్ణు విశాల్కు జంటగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. భార్యాభర్తల అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో కుస్తీ క్రీడాకారిణిగా ఐశ్వర్య లక్ష్మి నటించారు. సమీప కాలంలో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ భామ తన వివాహానికి సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ వివాహం అనే వ్యవస్థపై తనకు చాలా సమస్యలు ఉన్నాయన్నారు. అయితే కట్టాకుస్తీ–2 చిత్రంలో ఒక చిన్నారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తనలో అమ్మతనం కలిగిందన్నారు. తనకోసం వచ్చేవాడు మంచి తండ్రి అవుతాడా తనను వదిలి వెళ్లిపోకుండా ఉంటాడా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. కనీసం తనను శ్రద్ధగా చూసుకునే వ్యక్తితో తాను ఒక బిడ్డను కనాలని కోరుకుంటున్నానని నటి ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె సంబరాల ఏటి గట్టు అనే తెలుగు చిత్రంతోపాటు మలయాళంలో ఆషా అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ప్రియురాలితో మూడో పెళ్లి.. అతిథులకు ప్రత్యేక మెను..!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈనెల 5న తన ప్రియురాలు, బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ను పెళ్లాడనున్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక చాలా సింపుల్గా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే జరగనుందని వెల్లడించారు. ఈ వివాహాన్ని అత్యంత దగ్గరి బంధువులతోనే చాలా సీక్రెట్గా జరుపుకోనున్నారు. ఈ పెళ్లికి కేవలం 100-150 మంది మాత్రమే అతిథులు మాత్రమే హాజరవుతారని అమిర్ ఖాన్ సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తైనట్లు వెల్లడించారు. అతిథులకు ప్రత్యేక భోజనాల మెను సిద్ధం చేసినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. అమిర్, గౌరీ మెను విషయంలో తమకు ఇష్టమైన వంటకాల తయారీని స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. వీరిద్దరు అతిథులకు ఇచ్చే విందు స్పెషల్గా ఉండాలని భావిస్తున్నారట.ఈ పెళ్లికి అమిర్ ఖాన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్, డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి కూడా హాజరవుతారని తెలుస్తోంది. కాగా.. అమిర్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు.#WATCH | Mumbai | On his marriage plans, actor Aamir Khan says, "I am getting married on July 5, and the wedding will take place at home with close family and friends. We seek everyone's blessings and hope that we remain happy forever..." (02.07) pic.twitter.com/GXhBqEaDcH— ANI (@ANI) July 3, 2026 -
పెళ్లి చేసుకోకు.. పురుగు మందు తాగి చచ్చిపో..!
చీపురుపల్లిరూరల్(గరివిడి): భవిష్యత్తు గురించి ఎన్నో కలలు..ఆశలతో పెళ్లిపీటలు ఎక్కి ఏడడుగులు నడవాల్సిన యువతి ప్రేమపేరుతో మోసపోయింది. చివరకు కసాయి ప్రియుడి బెదిరింపులు, బ్లాక్మెయిల్తో ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన గరివిడి మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహితుడై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి ఆ యువతితో సన్నిహితంగా మెలిగి, అనంతరం ఆమెకు వివాహం కుదరడంతో పెళ్లిని అడ్డుకునేందుకు తీవ్ర వేధింపులకు గురి చేశాడు. కసాయి ప్రియుడి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ను తట్టుకోలేక యువతి పురుగు మందు తాగేయడంతో కుటుంబసభ్యులు గమనించి విజయనగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామానికి చెందిన యువతి బలగం అఖిలకు ఇటీవల కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మాజీ ప్రియుడు కోరాడ రామునాయుడు ఆమెను ఫోన్లో పదేపదే సంప్రదిస్తూ పెళ్లి చేసుకోకు..పురుగు మందు తాగి చచ్చిపో..నేను పురుగు మందు పంపిస్తున్నా, తీసుకుని తాగు అంటూ తీవ్రంగా మానసికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా పొరపాటున పెళ్లిపీటలు ఎక్కితే మన ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ఈ బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి మంగళవారం ప్రియుడు పంపించిన పురుగు మందు తాగేసి అపస్మాకర స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా కీ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి తండ్రి బలగం రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలితో మూడో పెళ్లి.. అమిర్ ఖాన్ షాకింగ్ నిర్ణయం..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. గతేడాది తన ప్రియురాలిని పరిచయం చేసిన 60 ఏళ్ల హీరో మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. బెంగళూరుకు చెందిన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను పెళ్లాడనున్నారు. ఈ నెల 5న వీరిద్దరి పెళ్లి జరగనుంది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే ఈ జంట ఒక్కటి కానున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు.అయితే పెళ్లి తర్వాత గ్రాండ్ రిసెప్షన్ వేడుక ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. కేవలం అమిర్ ఖాన్ ఇంట్లో అత్యంత సన్నిహితులకు మాత్రమే ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ వేడుకను కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలోనే ప్రైవేట్గా జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని సన్నిహితులు ఒకరు వెల్లడించారు. ఇటీవల ఇంటర్వ్యూలోనూ అమిర్ ఖాన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. మా ఇంట్లోనే కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహిత స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని తెలిపారు. మేమిద్దరం చాలా నిరాడంబరంగా చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నామని అమిర్ పేర్కొన్నారు. కాగా.. జూలై 5న ఈ జంట పెళ్లిబంధతో ఒక్కటి కానున్నారు. కాగా.. గతేడాది తన బర్త్ డే సందర్భంగా అమిర్ ఖాన్ ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశారు.కాగా.. అమిర్ ఖాన్కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా.. ఇద్దరితోనూ విడిపోయారు. అమిర్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు, వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. మరోవైపు ప్రియురాలు గౌరీ స్ప్రాట్కు సైతం ఓ కుమారుడు ఉన్నారు. ఆమె కూడా తన భర్తకు విడాకులిచ్చింది. -
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. కాస్తా లేట్ అంతే..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. జూన్ నుంచే ముహుర్తాలు షురూ కావడంతో పెళ్లిళ్ల సందడి మొదలైంది. తాజాగా మరో నటుడు పెళ్లీపీటలెక్కారు. తమిళ, మలయాళ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరవింద్ ఆకాశ్ ఓ ఇంటివాడయ్యారు. ఈయన దాదాపు 50 ఏళ్ల వయసులో తన ప్రియురాలు సారాను పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక మలేసియాలోని కౌలాలంపూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు వైభవ్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అరవింద్.. పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కాగా. అరవింద్ ఆకాశ్ కోలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చెన్నై 600028, గోవా, సరోజ, మంకథ, బిర్యానీ, మాస్ ఎంగిర మసిలమణి, చెన్నై 600028 II, మానాడు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల్లో కనిపించారు. అరవింద్ ఎక్కువగా వెంకట్ ప్రభు డైరెక్ట్ మూవీస్లో నటించడం విశేషం. తమిళంతో పాటు మలయాళ చిత్రసీమలోనూ అరవింద్ ఆకాశ్ మెప్పంచారు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'నందనం' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రకు బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మలయాళంలో కూట్టు, వాంటెడ్, వజ్రం, పొన్ముడిపుళయోరతు, మమ్మీ అండ్ మీ, ప్రజాపతి లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే పృథ్వీరాజ్-బాసిల్ జోసెఫ్ నటించిన 'గురువాయూరంబాల నడయిల్' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. కాగా.. అరవింద్ చివరిసారిగా 2024లో విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో నటించారు. Love wins at 50! 💍❤️Popular South actor #AravindAkash tied the knot with his partner Sarah in an intimate ceremony in Malaysia. The Chennai 600028 and Mankatha squad flew down to Kuala Lumpur to celebrate the mini-reunion! Slide to see Venkat Prabhu, Vaibhav, and Premgi… pic.twitter.com/2ustvzuvfi— Abhay Mani Diwakar (@theabhayd) July 2, 2026 -
పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు
అహ్మదాబాద్: హిందూ వివాహాల విషయంలో గుజరాత్ హైకోర్టు కీలకమైన తీర్పును ప్రకటించింది. పెళ్లికి రిజ్రస్టేషన్ ఒక్కటే సరిపోదని తేల్చిచెప్పింది. వివాహం అనేది కేవలం పాటలు, నృత్యాల వేడుక మాత్రమే కాదని పేర్కొంది. సప్తపది వంటి సంప్రదాయ ఆచారాలను పాటించకుండా ఒక జంట కేవలం రిజిస్ట్రేషన్తో ఒక్కటైతే అది చట్టబద్ధమైన వివాహంగా పరిగణించలేమని వెల్లడించింది. ఈ మేరకు జూన్ 23న తీర్పునిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతికపరమైన వైవిధ్యాలు ఉన్నప్పటికీ.. పెళ్లి తంతులో సంప్రదాయ ఆచారాలు, పద్ధతులు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్వభావాన్ని శుద్ధి చేసి, పరివర్తన చెందేలా చేస్తాయని వెల్లడించింది.తమ వివాహాన్ని చెల్లనిదిగా ప్రకటించడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు చెందిన కౌశల్ సోనార్ అనే వ్యక్తి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ ఐలేష్ వోరా, జస్టిస్ ఆర్.టి.వచానీతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. గత ఏడాది నవంబర్లో ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది. మూడు ముళ్లు, ఏడు అడుగులు వంటి ఆచారాలను పాటించడమే హిందూ వివాహానికి పునాది అని తేల్చిచెప్పింది. పవిత్రమైన అగ్నిసాక్షిగా వధూవరులు కలిసి ఏడు అడుగులు వేసే సప్తపది వంటి ఆచారాలు వివాహానికి ఒక పవిత్ర సంస్కారాన్ని, ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. ఏమిటీ కేసు? తాను ఎవరినీ పెళ్లి చేసుకోకపోయినా ఓ యువతి తన భార్యగా చెలామణి అయ్యేందుకు ప్రయత్నించిందని యూకేలో నివసించే కౌశల్ సోనార్ ఆరోపించాడు. ఆ యువతి అహ్మదాబాద్లో నివసిస్తోందని, ఆమె తన తల్లిదండ్రులను సంప్రదించి, తనను వివాహం చేసకున్నట్లుగా ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిందని చెప్పాడు. ఆ తర్వాతే ఆమె గురించి తనకు తెలిసిందని అన్నాడు. చట్టబద్ధంగా జరిగిందని యువతి చెబుతున్న ఈ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టును కోరాడు. ప్రతివాదిని తాను వివాహం చేసుకోలేదని, ఎలాంటి హిందూ ఆచారాలు, వేడుకలు నిర్వహించలేదని, ఆమెతో భర్తగా ఎప్పుడూ కలిసి జీవించలేదని పేర్కొన్నాడు.తన సమ్మతి లేకుండా, మోసపూరితంగా వివాహ పత్రాలపై తన సంతకం తీసుకున్నారని ఆరోపించాడు. తమ మధ్య ఎటువంటి వివాహ సంప్రదాయాలు, వేడుకలు జరగలేదని, తాము ఎప్పుడూ భార్యాభర్తలుగా జీవించలేదని ప్రతివాది అయిన యువతి కూడా ఫ్యామిలీ కోర్టు ముందు అంగీకరించింది. అయినప్పటికీ కౌశల్ సోనార్ పిటిషన్ను కొట్టివేయడం ద్వారా ఫ్యామిలీ కోర్టు పొరపాటు చేసిందని హైకోర్టు పేర్కొంది. వివాహం పవిత్రమైన విధి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్–7ను హైకోర్టు ప్రస్తావించింది. హిందూ వివాహాన్ని సంపూర్ణమైనదిగా, చట్టబద్ధమైనదిగా మార్చడానికి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని జరపడం గురించి ఈ సెక్షన్ చెబుతున్నట్లు గుర్తుచేసింది. వివాహానికి సంబంధించిన ఆచారాలు, వేడుకలు ఏవీ నిర్వహించబడలేదు కాబట్టి ఈ కేసులో హిందూ వివాహానికి ఉండాల్సిన ప్రాథమిక, అత్యవసరమైన అంశం లోపించినట్లు వెల్లడించింది. ‘‘హిందూ సంప్రదాయంలో భార్యను భర్తలో సగభాగంగా(అర్ధాంగిగా) పరిగణిస్తారు.అదే సమయంలో ఆమెను తనదైన ప్రత్యేక గుర్తింపు కలిగిన వ్యక్తిగా, వివాహ బంధంలో సమాన భాగస్వామిగా కూడా గుర్తిస్తారు. హిందూ చట్టం ప్రకారం వివాహం అనేది ఒక పవిత్ర సంస్కారం. ఇది ఒక కొత్త కుటుంబానికి పునాదిగా నిలుస్తుంది. హిందూ వివాహం అంటే ఒక పవిత్రమైన విధి. భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక వ్యవస్థ. కాబట్టి వివాహ బంధంలోకి ప్రవేశించే ముందు యువతీయువకులు ఆ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్న పవిత్రతను అర్థం చేసుకోవాలి. వివాహం అంటే కేవలం పాటలు, నృత్యాలు, విందులు వినోదాలు చేసుకొనే సందర్భం మాత్రమే కాదు.అదొక వాణిజ్యపరమైన లావాదేవీ కూడా కాదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు వ్యక్తిగత బంధంలోకి ప్రవేశించి భవిష్యత్తులో కుటుంబాన్ని నిర్మించుకోవడానికి సంబంధించిన ఒక పవిత్రమైన, కీలకమైన ఘట్టం. వివాహం ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే అది ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితకాలం నిలిచే, గౌరవప్రదమైన, సమానమైన, పరస్పర అంగీకారంతో కూడిన ఆరోగ్యకరమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలను సక్రమంగా పాటించినప్పుడు, ఇది ఒక వ్యక్తి మోక్షాన్ని పొందడానికి సహాయపడే సంఘటనగా కూడా పరిగణిస్తారు. అందుకే రిజిస్ట్రేషన్ జరిగి, మ్యారేజ్ సరి్టఫికెట్ ఉన్నంత మాత్రాన అది చట్టబద్ధమైన పెళ్లిగా భావించలేం’’ అని హైకోర్టు తేల్చిచెప్పింది. -
జబర్దస్త్ ఫైమా పెళ్లి.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..!
జబర్దస్త్ కామెడీ షో క్రేజ్ తెచ్చుకున్న ఫైమా ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత చివరికీ మూడుముళ్లతో ఒక్కటయ్యామని ఎమోషనలైంది. తన ప్రియుడు ప్రవీణ్తో ఏడడుగులు వేసింది. సంప్రదాయంగా జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి వేడుకలో జబర్దస్త్ కమెడియన్స్ సందడి చేశారు. ఈ పెళ్లి జరిగి అప్పుడే వారం రోజులు పూర్తయింది. తాజాగా ఫైమా తన పెళ్లిలోని అరుదైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకటే సందర్భం.. ఇద్దరు తల్లుల వేదన అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. మెట్టినింటికి వెళ్తున్న కూతురుని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఫైమా తల్లి కన్నీటి పర్యంతమైంది. తన కుమార్తెని హత్తుకుని బోరున ఏడుస్తూ కనిపించింది. ఫుల్ ఎమోషనల్గా ఉన్న వీడియోను ఫైమా తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అమ్మ ప్రేమకు ఏది సాటి రాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
కూతురి పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న ఖుష్బు
కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక పెళ్లి ఇటీవలే గ్రాండ్గా జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, త్రిష, తమన్నా, రాధికా , సుహాసిని, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఈ పెళ్లికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తన కూతురి మెడలో వరుడు తాళి కడుతున్న సమయంలో ఖుష్బు సుందర్ ఫుల్ ఎమోషనల్గా కనిపించింది. ఈ వీడియోలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. వారి చిన్న కుమార్తె ఆనందిత కూడా అక్క పెళ్లిని చూసి ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. ఖుష్బు- సుందర్ల పెద్ద కూతురు అవంతిక సుందర్.. శ్రవణ్ శ్రీనివాసన్ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక జూన్ 25న గ్రాండ్గా జరిగింది. View this post on Instagram A post shared by Spize Events (@spizeweddingsandevents) -
నేను బాలికని, నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు
బెంగళూరు: ‘నేను బాలికని, నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. సహాయం చేయండి’ అని బాలల సహాయ కేంద్రానికి ఫోన్ చేసిన ఒక బాలికను అధికారులు రక్షించారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని శివపుర గ్రామంలో జరిగింది. మలవల్లి గ్రామానికి చెందిన ఒక బాలికకు శివపుర గ్రామానికి చెందిన యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆ బాలికను ఏడు రోజులుగా ఆ యువకుని ఫామ్హౌస్లో ఉంచారు. ఈ సమయంలో బాలిక బాలల సహాయ కేంద్రానికి ఫోన్ చేసి, ‘నేను మైనర్ని, ఇక్కడ నేను సమస్యలను ఎదుర్కొంటున్నాను‘ అని చెప్పింది. శివపుర గ్రామ పంచాయతీ పీడీఓ శిల్ప ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు స్థానిక అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఫామ్హౌస్కు వెళ్లి బాలికను రక్షించారు. తల్లిదండ్రుల వద్ద ఉంచితే ప్రమాదమని శిశుగృహానికి తరలించినట్లు తెలిపారు. -
ఈ ఏడు రోజులే అత్యంత బలమైన ముహూర్తాలు!
హిందూ సంప్రదాయంలో ఏ పని తలపెట్టిన శుభ ముహూర్తాలు చూసుకోవడం ఆనవాయితీ. కొత్త వస్తువులు, వాహనాలు కొనాలన్నా మంచి రోజులు ఉండాల్సిందే. అలాంటిది జీవితంలో అత్యంత ప్రధానమైన వివాహాలు, గృహప్రవేశాల విషయంలో నక్షత్ర, రాశి బలాలకు సరిపడా ముహుర్తాలపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంటుంది. అయితే గత మే 14న అధిక జ్యేష్టమాసం ప్రారంభం కావడంతో నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. తాళికట్టు శుభవేళ.. ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది. 16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. జూన్ 27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు ఉన్నాయని అంటున్నారు. వ్యాపారాలు కళకళ.. నెలరోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్లు, డెకరేషన్, పూల వ్యాపారులు, పురోహితులు, బంగారం షాపులు, వస్త్రవ్యాపారులు, ఫొటోగ్రాఫర్ల వ్యాపారాలు మందగించాయి. చాలా మంది కారి్మకులకు ఉపాధి కరువైంది. జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ అనుబంధ వ్యాపారాలన్నీ ఊపందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల వరకు వివాహాలు నెల రోజుల తర్వాత ముహూర్తాలు మొదలవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వధూవరులకు కావలసిన వస్త్రాలు, పట్టుచీరలు కొనేందుకు తల్లిదండ్రులు, బంధువులు షాపులకు క్యూ కడుతున్నారు. కిరాణా దుకాణాలలో కూడా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ‘బంగారం’ లాంటి చాన్స్ పెళ్లికి ముఖ్యమైనది బంగారం. దాని ఖరీదు పెరుగుతున్నా తప్పని సరిగా బంగారం పెట్టాల్సిందే. స్వర్ణాభరణాల ధరలు పెరుతున్నా పెళ్లికి అతిముఖ్యంగా కావలసిన తాళిబొట్టు, మట్టెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు బంగారం షాపుల వద్ద చేరి వీటిని ముందుగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. మరికొందరు బంగారం ముక్క కొనుగోలు చేసి తమకు తెలిసిన తయారీదారుని వద్ద వెళ్లి ఆర్డర్ ఇస్తున్నారు. జ్యేష్టమాసం విశేషమైంది జ్యేష్టమాసం అన్ని మాసాలలోకి విశేషమైంది. బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. నిజ జ్యేష్ట మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తారు. చాలా మంది వివాహాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం ముహూర్తాల కోసం వస్తున్నారు.. నెలరోజులుగా ముహూర్తాలు లేక చేతిలో పనులు లేవు. ఎట్టకేలకు శుభ ముహూర్తాలు మొదలు కావడంతో వివాహాది శుభకార్యాలు చేయించుకునేందుకు మావద్దకు వస్తున్నారు. తేదీలు ముందుగా బుక్ చేసుకుంటున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు, శ్రీకాకుళం -
తండ్రి చివరి కోరిక : వీడియో కాల్లోనే పెళ్లి, అంతలోనే..!
ఒకవైపు కన్నకూతురి పెళ్లి కళ్లారా చూడాలన్న కన్నతండ్రి కోరిక, మరవైపు అనూహ్యంగా తీవ్ర అనారోగ్యం బారిన తండ్రి. చివరికి ఆసుపత్రి బెడ్పై నుంచే వీడియో కాల్లో కూతురి పెళ్లి చూసి సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చాడు. కానీ అంతలోనే తీవ్ర విషాదం అలుముకుంది.బిహార్లోని సీతామఢీ జిల్లా సోన్బర్సాకు చెందిన లాల్బాబు మహతో ఒక ట్రావెల్ కంపెనీలో బస్సు కండక్టర్గా సుదీర్ఘకాలం పనిచేశారు. తన చిన్న కూతురు నిధి కుమారి వివాహాన్ని ఘనంగా జరిపించాలని ఎన్నో కలలు కన్నారు. ఈ శుభఘడియ కోసం ఏళ్లుగా ఎదురు చూశారు. అయితే పెళ్లికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీనితో ఆయన్ను లక్నోలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. లాల్బాబు మహతో చివరి కోరిక తీర్చేందుకు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన భార్య మీనూ దేవి, కుమారుడు రాజేష్ కలిసి ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా నిధి పెళ్లి చూసే ఏర్పాటు చేశారు.అలా కూతురి వివాహ వేడుకను ఆసుపత్రి బెడ్పై నుండి వీడియో కాల్ ద్వారా వీక్షించారు. ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని హల్దీ వేడుక, పూలదండలు మార్చుకోవడం, ప్రధాన వివాహ ఘట్టం వరకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూసి తన కోరిక నెరవేర్చుకున్నారు. కొత్త పెళ్లికూతురిగా కుమార్తె అలా అత్తగారింటికి వీడ్కోలు తీసుకున్న మరుక్షణమే ఒక తండ్రి గుండె ఆగిపోయింది. ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా ఆమె కూతురి వీడ్కోలు వేడుక ముగిసి, ఇల్లు వదిలి వెళ్తుండగా ఆ తండ్రి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలాగా చివరి శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామం కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది కంట కన్నీరు తెప్పించింది. (ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన సైనికులు వీరే!)ఒకేరోజు చెల్లి పెళ్లి.. తండ్రి మరణంలాల్బాబు కుమారుడు రాజేష్ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒకవైపు చెల్లి వీడ్కోలును, మరోవైపు తండ్రి మరణాన్ని చూడాల్సి వచ్చింది. నిధి సీతామఢీ జిల్లాలోని మోహన్పూర్కు చెందిన తన భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అత్తగారింటికి బయలుదేరి వెళ్లడం, మరోవైపు తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆ అన్న ఆవేదనకు అంతులేకుండా పోయింది. లాల్బాబు మహతోకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇదీ చదవండి: కాటేసిన పామును బిస్కెట్ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్ -
ఖుష్బు సుందర్ కుమార్తె వెడ్డింగ్.. టాలీవుడ్ తారల సందడి
ప్రముఖ నటి ఖుష్బు సుందర్ ఇంట శుభకార్యం జరిగింది. ఆమె కూతురు పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కోలీవుడ్తో పాటు టాలీవుడ్ సినితారలు సందడి చేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. అంతేకాకుండా టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, నాగార్జున కూడా హాజరయ్యారు. కోలీవుడ్ భామ త్రిష సైతం ఈ పెళ్లి వేడుకలో మెరిసింది. కాగా.. ఖుష్బు సుందర్ తమిళంతో పాటు తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన స్టాలిన్ చిత్రంలో ఖుష్బు సుందర్ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో మెగాస్టార్కు అక్క పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రాజకీయాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తోంది. ముగ్గురు మొనగాళ్లు in Goa#Chiranjeevi,#Nagarjuna & #Vanktesh attends #KhushbuSundar Daughter's marriage in GoaVintage Style - Vetaran Swag pic.twitter.com/6vPg2xjK6h— Taraq(Tarak Ram) (@tarakviews) June 25, 2026 #Khushbusundar గారి కుమార్తె వివాహా వేడుకకు హాజరయ్యేందుకు గోవా కు బయలుదేరి వెళ్లిన#Chiranjeevi #Nagarjuna కుటుంబాలు.@KChiruTweets @iamnagarjuna pic.twitter.com/3oMV1ZZZ0M— SZN (@Suzenbabu) June 24, 2026 -
గ్రాండ్గా ఫైమా పెళ్లి వేడుక.. తాళి కట్టు వేళ కన్నీటి పర్యంతం..!
జబర్దస్త్ ఫైమా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ను పెళ్లాడింది. తొమ్మిదేళ్ల ప్రేమ, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నామని ఫైమా ఎమోషనల్గా రాసుకొచ్చింది. తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ తారలు, అభిమానులు ఫైమాకు శుభాకాంక్షలు చెప్పారు.తాజాగా ఫైమా మరో వీడియోను షేర్ చేసింది. చాలా సింపుల్గా చేసుకున్నానని తెలిపిన.. ఇవాళ హల్దీ వేడుక చేసుకున్న వీడియోను పోస్ట్ చేసింది. రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత సంప్రదాయం ప్రకారం మరోసారి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రియుడు ప్రవీణ్ మెడలో మూడు ముళ్లు వేసిన వీడియోను కూడా పంచుకుంది. తాళి కట్టు వేళ తన భావోద్వేగాలను ఆపుకోలేపోయింది. ఏడుస్తూ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
తొమ్మిదేళ్ల ప్రేమ.. ఈ రోజుతో ఒక్కటయ్యాం: జబర్దస్త్ ఫైమా సర్ప్రైజ్
జబర్దస్త్ షోతో ఫేమస్ అయినవాళ్లలో ఫైమా ఒకరు. తన కామెడీ పంచ్లతో అభిమానులను ఆకట్టుకుంది. బిగ్బాస్ గత సీజన్లో ఆడే అవకాశం దక్కించుకుని మంచిగా సెటిలైపోయింది. తాజాగా ఫైమా ఫ్యాన్స్కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ను ఫైమా పెళ్లాడింది. తామిద్దరం తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నామని తెలిపింది. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఈ రోజు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టామని ఫైమా సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సహచరులు ఫైమాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫైమా తన ఇన్స్టాలో రాస్తూ..' వారు మమ్మల్ని అనుమానించారు. మమ్మల్ని విమర్శించారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకినీ అధిగమించి బలంగా నిలిచింది. లెక్కలేనన్ని పోరాటాలు. అంతులేని సహనం. వదిలేయడానికి వేయి కారణాలున్నా.. మేము ప్రతిరోజూ ఒకరినొకరు ఎంచుకున్నాం. ఫైనల్గా ఈ రోజు మేము భార్యాభర్తలం అయ్యాం' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
పెళ్లికి దూరమవ్వడానికి కారణాలు ఇవే అంటున్న లేటెస్ట్ జనరేషన్
-
రేపే వివాహం.. నిప్పులు పోసిన పోకిరీ
కర్ణాటక: మైసూరు జిల్లాలోని టి.నరసిపుర తాలూకాలోని కెంపయ్యన హుండి గ్రామంలో ఘోర దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులు, కూతురు మరణ వాంగూల్మం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివన్న–నాగరత్న దంపతులు, వారి కుమార్తె రక్షిత (20) మృతులు. అదే గ్రామానికి చెందిన ఉల్లాస్ గౌడ అనే వ్యక్తి ఈ కుటుంబాన్ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విలన్.. ఉల్లాస్గౌడ శివన్న, నాగరత్న దంపతులు కూతురు రక్షితకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ నెల 24న ఆ యువతి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఉల్లాస్గౌడ రక్షితను ప్రేమించానని, తానే పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ రక్షిత, ఆమె తల్లిదండ్రులు అతనిని అంగీకరిచలేదు. కానీ ఆ యువకుడు రక్షితను వెంటాడుతూ వేధిస్తున్నాడు. రక్షితతో పెళ్లి నిశ్చయమైన యువకునికి చెడు సందేశాలను పంపసాగాడు.తాను ఆమెను ప్రేమించానని, నీవు పెళ్లి చేసుకోరాదని బెదిరించాడు. గ్రామంలోనూ ఇదే మాదిరిగా ప్రచారం చేయసాగాడు. దీంతో పెళ్లి రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. తీవ్ర ఆవేదన చెందిన రక్షిత, ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. పెళ్లి వేడుకతో కళకళలాడాల్సిన ఇల్లు స్మశానంలా ఏడుపులతో మార్మోగింది. వరుణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలాదండి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వారి డెత్నోట్ను స్వా«దీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఉల్లాస్గౌడను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు. -
మెదక్ ఇన్స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్
సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారతాయో తెలిపే ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలతో ప్రేమ నాటకం ఆడిన ఓ కేటుగాడు, ఇద్దరు యువతులను మోసం చేసి మొత్తం రూ.12 లక్షలతో పాటు తులం బంగారం దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి, ఏక్లాస్పూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా “సాత్విక్ రెడ్డి”, “రిత్విక్ రెడ్డి” అనే పేర్లతో ఉన్న ఖాతాల ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నారు. మాటలతో నమ్మకం సంపాదించిన ఆ వ్యక్తి, తనను తాను ప్రేమలో ఉన్నవాడిగా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కథలు అల్లుతూ దశలవారీగా వారి వద్ద నుంచి నగదు, బంగారం తీసుకున్నాడు. కొంతకాలానికి అనుమానం రావడంతో బాధితులు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం ఇది పూర్తిగా మోసమని తేలడంతో టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీల వెనుక ఉన్నది ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య అని గుర్తించారు. సోషల్ మీడియాలో హ్యాండ్సమ్ లుక్తో, వేరే పేర్లతో పరిచయాలు పెంచుకుని పలువురిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.సోషల్ మీడియా పరిచయాల్లో అజాగ్రత్తగా నమ్మకం పెట్టుకోవద్దని, వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
శ్రీముఖి నీ పెళ్లెప్పుడు?.. యాంకర్ ఫుల్ క్లారిటీ..!
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తళుక్కున మెరిసింది. పట్టుచీరలో కనిపించి తన గ్లామర్తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్కు హాజరైన శ్రీముఖిని మరో స్టార్ యాంకర్ సుమ తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేసింది.మామూలుగా బంగారం ఎప్పుడు కొంటారని శ్రీముఖిని సుమ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ పెళ్లిళ్ల సమయంలో బంగారం ఎక్కువగా కొంటారని చెప్పింది. మరి నీ పెళ్లెప్పుడు అంటూ సుమ మరో ప్రశ్న వేసింది. దీనికి శ్రీముఖి సరదాగా సమాధానం ఇచ్చింది. సమంతను చూపిస్తూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజై పెద్ద బ్లాక్బస్టర్ అయ్యాక నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నా అని నవ్వుతూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. దీంతో శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సమంత నటించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీముఖ కీలక పాత్ర పోషించింది. -
ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి
బిహార్లోని నలంద జిల్లా, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విచిత్రమైన పెళ్లి నెట్టింట సందడి చేస్తోంది. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న 36 ఏళ్ల వివాహిత మహిళ., తనకంటే 12 ఏళ్ల చిన్నోడు, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమాయణం. గత కొంతకాలంగా గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో అనుకోని ట్విస్ట్. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అసలేమైంది?కట్వా రసూల్పూర్ గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన వివరాలు...శుక్రవారం రాత్రి ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది,సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. దీంతో ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళను, ఆమె ప్రియుడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు మహిళ భర్తను, ఆమె ప్రియుడి తండ్రిని కూడా విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను వెల్లడించింది. దీని తరువాత, ఇరు పక్షాల మధ్య చర్చోప చర్చలు జరిగాయి. View this post on Instagram A post shared by tvn99urdu News 24/7 (@tvn99urdu)ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!చివరికి మరుసటి రోజు, శనివారం, ఆ మహిళ భర్త వీరి పెళ్లిక అంగీకరించి, స్థానిక గుడిలో ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి ఆ వారి ముగ్గురు పిల్లలు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పిల్లలు తమ తల్లితో వెళ్ళడానికి నిరాకరించి, తమ తండ్రితోనే ఉండాలని కోరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం, పెళ్లి తర్వాత ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి, తన కొత్త భర్తతో కలిసి పంజాబ్లోని లూథియానాకు వెళ్లిపోయింది. ఇది కులాంతర వివాహంగా నివేదించబడుతున్నందున, ఈ సంఘటన ఆ ప్రాంతంలో విస్తృత చర్చకు దారి తీసింది.ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! -
మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ
-
ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో
-
అనంత్తో పెళ్లి.. అంబానీ కోడలి ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ కుటుంబానికి కోడలైన రాధికా మర్చంట్ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (IIMUN) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వివాహ బంధంలో సమానత్వం, పరస్పర గౌరవం, మహిళల ఆర్థిక స్వేచ్ఛ ప్రాముఖ్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.అనంత్ అంబానీతో వివాహంపై..అనంత్ అంబానీతో తన దాంపత్య జీవితం గురించి మాట్లాడుతూ, ఒక విజయవంతమైన వివాహానికి ‘ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు’ అన్న భావన కంటే పరస్పర గౌరవమే ముఖ్యమని చెప్పారు. ప్రతి సంబంధంలో రాజీలు సహజమేనని, కొన్ని సందర్భాల్లో అనంత్ తన అభిప్రాయాన్ని పక్కన పెడతారని, మరికొన్ని సందర్భాల్లో తాను రాజీ పడతానని పేర్కొన్నారు. అయితే, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకునేంత వరకు ఆ బంధం సమానత్వంతోనే కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై మాట్లాడిన రాధికా, కుటుంబ నేపథ్యం ఎంత గొప్పదైనా, జీవిత భాగస్వామి ఎంత సంపన్నుడైనా, ప్రతి మహిళ తన సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. “మీరు ఎవరి కుమార్తె అయినా, ఎవరి భార్య అయినా, మీ జీవితంలో ఎంత సౌకర్యంగా ఉన్నా సరే, మీ నిర్ణయాలు మీరే తీసుకునే శక్తి ఉండాలంటే ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం” అని ఆమె అన్నారు.అది ప్రమాదకరంఆర్థికంగా పూర్తిగా ఇతరులపై ఆధారపడటం ప్రమాదకరమని హెచ్చరించిన ఆమె, జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని పేర్కొన్నారు. “మీకు బయటపడే అవకాశం లేనంతగా ఏదైనా పరిస్థితికి బంధించబడకండి” అని రాధిక సూచించారు.సమాజంలో నిజమైన లింగ సమానత్వం సాధించాలంటే మహిళలకు విద్య, ఉపాధి, వ్యాపారం, ఆస్తుల సృష్టి వంటి రంగాల్లో మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాధిక అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక సాధికారత లేకుండా సంపూర్ణ సమానత్వం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక స్వేచ్ఛ కుటుంబాల్లో నిర్ణయాధికారాన్ని పెంచుతుందని, వ్యక్తిగత గౌరవాన్ని బలోపేతం చేస్తుందని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు. View this post on Instagram A post shared by Isha Ambani Piramal (@ishaambani)ప్రముఖ వ్యాపారవేత్తలు వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్ 1994లో ముంబైలో జన్మించారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, భారతీయ శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ పొందారు. ప్రస్తుతం కుటుంబానికి చెందిన ఆరోగ్య సంరక్షణ వ్యాపార సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. అనంత్ అంబానీతో గత ఏడాది జరిగిన ఆమె వివాహం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం పొందింది. -
అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు
-
ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!
ఉత్తర ప్రదేశ్లో మరో ఊహించని పరిణామం గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. పెళ్లికి ముందు రాత్రే వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఎలాగో ఒప్పించి, వధువు చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ పెళ్లి కొడుకును వెక్కిరించింది. ఇక ఈ తరువాతి పరిణామాలు ఒక్కోటి సినిమా రేంజ్లో చక చకా జరిగిపోయాయి. చివరికి ఈ వివాదం మరింత ఉద్రిక్తమై కాల్పుల దాకా చేరింది.ఉత్తరప్రదేశ్లోని బిత్థ్రి ప్రాంతంలోని షాజహాన్పూర్-బరేలీ రోడ్డుపై ఉన్న ఒక బ్యాంకెట్ హాల్లో శనివారం పెళ్లి వేడుక ఉత్సాహంగా జరుగుతోంది. వధూవరులిద్దరూ అందంగా ముస్తాబయ్యారు. అతిథులందరూ ఎవరి హడావిడిలో వారు తిరుగుతూ, విందు భోజనానికి సిద్దపడుతున్నారు. పెళ్లి కొడుకు తన బృందంతో (ఊరేగింపుగా), అటు వధువు కుటుంబ సభ్యులు కూడా సందడి ఉన్నారు. ఇంతలో కలకలం రేపింది. హాజరైన అతిథులకు భోజనాలకు బదులు దాడులు మొదలయ్యాయి. ఈ గందరగోళం మధ్య కాల్పులుకు దారి తీసింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ట్విస్టుల మీద ట్విస్టులుసరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వధువు రాలేదు. పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగలతో సహా వధువు రాత్రికి రాత్రే ప్రియుడితో ఉడాయించింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆమె చెల్లెల్ని వధువు స్థానంలోకూర్చోబెట్టడానికి ఒప్పించి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు ముగిద్దాం అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు మారిపోయిందన్న విషయాన్ని గమనించిన పెళ్లి కొడుకు ‘నాకీ పెళ్లి వద్దు పొమ్మన్నా’డు.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అయితే ఎలాగోలా పెద్దలంతా సంప్రదింపులు జరిపే వరుడిని పెళ్లికి ఒప్పించాడు. ఇక్కడ మళ్లీ ట్విస్ట్. ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగి, అంతా చక్కబడింది అనుకునే లోపే, వధువు చెల్లెలి ప్రియుడుఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ లొల్లి షురూ. చినికి చినికి గాలివానలా మొదలైన ఈ వ్యవహారం భౌతిక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో పలువురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకున్నట్టు గానీ, ఎవరిపైనా కేసులు నమోదు చేసినట్టు గానీ సమాచారం లేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు -
పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగిన ఒక వింత పెళ్లి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన సొంత అత్తనే వివాహం చేసుకున్న ఘటన పలువుర్ని విభ్రాంతికి గురి చేసింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, అక్బర్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, సదరు వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి, ఆమె తల్లిని కోర్టు వివాహం చేసుకున్నారట. అంతేకాదు తమ వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతిలో పట్టుకుని, తమ బంధాన్ని అంగీకరించాలని , తమ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ జంటకు వివాహానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కుమార్తె వివాహం జరిగిన తర్వాత అత్తా-అల్లుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సమాచారం. అయితే ఆ వ్యక్తి భార్య స్పందన ఏంటి అనేదానిపై స్పష్టతలేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలుఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకుఎటువంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. అలాగే అధికారులు ఎటువంటి చట్టపరమైన చర్యల గురించి వెల్లడించలేదు. दामाद ने बेटी से रिश्ता तोड़ मां से किया शादीयूपी के कानपुर में एक अनोखा मामला सामने आया है, जहां एक युवक ने अपनी पत्नी से अलग होने के बाद अपनी सास के साथ कोर्ट मैरिज कर ली।इस घटना के बाद इलाके में तरह-तरह की चर्चाएं हो रही हैं। pic.twitter.com/fcaNnYNle5— Priya singh (@priyarajputlive) June 8, 2026నెటిజన్ల మాత్రం ఈ వివాహం గురించి తెలిసి బంధాలు, నైతిక విలువలు మంటగలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేయగా, వావి వరుసలు మర్చిపోతున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వివాదాస్పద ప్రేమకథ మాత్రమే కాదు, ఒక కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసిన పరిస్థితి. మధ్యలో నలిగిపోయే వారే అసలైన బాధితులు, కుటుంబ అనుబంధం హద్దులు దాటింది. కామమే గెలిచింది, కుటుంబం ఓడిపోయిందని మరొకరన్నారు. సొంత రక్తమే వినాశనానికి కారణమైతే, ఇక ఎవరిని నమ్మాలి?" పాపం..ఆమె కుమార్తె పరిస్థితి ఏంటి అని ఆరాతీస్తున్నారు. కాగా 2024లో బీహార్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ ఘటనలో భార్య మరణం తరువాత, అతను అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అతను తన 55 ఏళ్ల అత్తగారు గీతా దేవితో సన్నిహితమయ్యాడు. ఒక రోజు, అతను గీతతో ఏకాంతంగా ఉండగా అతని మామగారు వారిని రెడ్-హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత, ఆ వ్యక్తి గ్రామస్తులందరి సమక్షంలో గీతను ప్రేమిస్తున్నట్లు అంగీకరించి, ఆమెను వివాహం చేసుకున్నాడు. -
మైనార్టీ తీరకుండానే మనువు
సాక్షి, అమరావతి: చట్టబద్ధమైన వయసు తీరకుండానే అబ్బాయిలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 15.9 శాతం మంది అబ్బాయిలు 21 ఏళ్లు నిండకుండానే ఓ ఇంటివారవుతున్నారు. ప్రతి వంద మంది అబ్బాయిల్లో 16 మంది మైనర్లుగానే పెళ్లి చేసుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–6 నివేదిక వెల్లడించింది. 2023–24 సమయానికి చేసిన సర్వేలో దేశంలోని 15.9 శాతం మంది బాలురు మైనార్టీ తీరకుండానే వివాహం చేసుకున్నట్టు గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం, పట్టణ, నగరాల్లో 9.7 శాతం అబ్బాయిల మైనర్ వివాహాలు జరుగుతున్నట్టు తేల్చింది. ఈ తరహా వివాహాలు 2019–21లో 17.7 శాతం ఉండగా, 2023–24 నాటికి కొంత తగ్గుముఖం పట్టాయి. అబ్బాయిల మైనర్ వివాహాల్లో బిహార్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలోని 25–29 ఏళ్ల పురుషుల్లో 29.6 శాతం మంది 21 ఏళ్లలోపు వివాహాలు చేసుకున్నారు. బిహార్లో అబ్బాయిల మైనర్ వివాహాలు ఏకంగా జాతీయ సగటుకు దాదాపు రెట్టింపు ఉన్నాయి. రాజస్థాన్లో 28.5 శాతం, మధ్యప్రదేశ్లో 25 శాతం, గుజరాత్లో 24.3 శాతం చొప్పున అబ్బాయిల్లో మైనర్ వివాహాలున్నట్టు వెల్లడైంది. రాజస్థాన్లో అమ్మాయిల్లో 24.6 శాతం మైనర్ వివాహాలు ఉన్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఆ రాష్ట్రంలో కంటే అబ్బాయిల్లో మైనర్ వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 9.7 శాతం, తెలంగాణలో 5.7 శాతం చొప్పున 2023–24లో 21 ఏళ్లలోపే వివాహాలు నమోదయ్యాయి. పల్లెలను మించి పట్టణాల్లో.. బాల్య వివాహాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయనే భావన ఉంది. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి కొన్ని రాష్ట్రాల్లో రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనూ అబ్బాయిలకు 21 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా బాలుర మైనర్ వివాహాలు 12.5 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్య ఏకంగా 15.1 శాతం, గ్రామీణంలో 12.1 శాతం మాత్రమే కావడం గమనార్హం. నాగాలాండ్లో సైతం పట్టణాల్లో 13.8 శాతం, గ్రామాల్లో 8.2 శాతం మేర మైనర్ బాలుర వివాహాలు నమోదయ్యాయి. -
ఎవరినీ ప్రేమించలేదు.. పెళ్లి ఆలోచన ఇప్పుడు లేదు: హీరోయిన్
ఈ తరం హీరోయిన్ల ఆలోచనా ధోరణియే వేరు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నారనే చెప్పాలి. ప్రేమ, పెళ్లి విషయం ఎత్తితేనే అందుకు చాలా సమయం ఉందంటున్నారు. యంగ్ హీరోయిన్ నికిలావిమల్ ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో బాల నటిగా పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో కథానాయికిగా నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి శ్రమిస్తున్నారు. తమిళంలో వెట్రివేల్, కిడారి, పంచుమిట్టాయి, తంబి, పోర్ తొళిల్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల మారిసెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన వాళై చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళం తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న నికిలా విమల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ తన మనసులో ఇప్పటివరకూ ఎవరూ లేరని, తానెవరినీ ప్రేమించడం లేదని తెలిపారు. పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు. ప్రేమ, పెళ్లి వంటివి పెద్ద విషయం కాదు అని, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు చూసుకో వచ్చునని అన్నారు. ఇప్పుడు తన ఆలోచనలు అంతా సినిమా చుట్టూనే అని నికిలా విమల్ చెప్పారు. -
పెళ్లి తేదీ ఫిక్స్?
బాలీవుడ్లో ప్రస్తుతం జోరుగా ప్రచారం అవుతున్న వార్తల్లో ఆమిర్ ఖాన్–గౌరీ స్ప్రాట్కి సంబంధించిన పెళ్లి వార్త ఒకటి. చెప్పాలంటే ఇదే హాట్ టాపిక్. గత ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో జరిగిన ప్రీ–బర్త్డే వేడుకలో ఆమిర్ ఖాన్ మొదటిసారిగా గౌరీని మీడియాకు పరిచయం చేశారు. దాంతో 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్, ఆమిర్ ప్రేమలో ఉన్నారన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు తమ ప్రేమను వివాహ బంధం వరకూ తీసుకెళ్లాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. జూన్ 5న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ వేడుక చాలా నిరాడంబరంగా జరగనుందని టాక్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారట. ముంబైలోని ఆమిర్ నివాసంలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మ«ధ్య ఈ వివాహం జరగనుందని భోగట్టా. ఆమిర్ ఖాన్ స్నేహితులు, బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఆమిర్కి ఇది మూడో వివాహం అని తెలిసిందే. గతంలో రీనా దత్తాతో వివాహం జరగ్గా, వారికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు ఆమిర్. ఈ దంపతులకు ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమిర్, కిరణ్ రావు 2021లో తమ విడాకులను ప్రకటించారు. ఇక గౌరీ స్ప్రాట్కు ఇది రెండో వివాహం. గత వివాహం ద్వారా క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఆమెకు ఉన్నాడు. ఇదిలా ఉంటే... ఇటీవల (మార్చి 14) తన 61వ పుట్టినరోజు వేడుకను గౌరీ స్ప్రాట్తో కలిసి చేసుకున్నారు ఆమిర్. ఈ వేడుకకు ఆయన మాజీ భార్యలు రీనా, కిరణ్ కూడా హాజరు కావడం విశేషం. -
ముచ్చటగా మూడోసారి.. ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆరు పదుల వయసులో తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను పెళ్లాడనున్నారు. అయితే ఈ పెళ్లిని చాలా సింపుల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈనెల జూన్ 5న వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అమిర్ ఖాన్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట ఇటీవలే తమ బంధాన్ని అఫీషియల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరిద్దరు ఇప్పటికే తమ పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. వీరి పెళ్లికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యే అవకాశముందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఈ జంట ఇరు కుటుంబాల మద్దతుతోనే పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.కాగా.. ఆమిర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత కిరణ్ రావుతో 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్లో ఉన్న అమిర్ ఖాన్.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జూలై 5న జరిగిన రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోనున్నారు. గతేడాది ముంబయిలో జరిగిన ఒక బర్త్డే వేడుకల్లో తన ప్రియురాలు గౌరీని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గౌరీ స్ప్రాట్కు ఇప్పటికే క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్లీడర్స్తో క్రికెటర్ల బంధం!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వరుసగా సంచలన విషయాలు వెల్లడిస్తూ వస్తున్నాడు. ఇటీవలే ‘హ్యూమన్ బాంబే’ అనే పాడ్కాస్ట్కు లలిత్ మోదీ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే లక్నో సూపర్జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై విరుచుకుపడిన లలిత్ మోదీ తాజాగా ఐపీఎల్ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చీర్ లీడర్స్తో క్రికెటర్ల ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలను బయపెట్టడం ఆసక్తి రేపింది. చీర్లీడర్స్ ఐపీఎల్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే వారిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నాడు. టోర్నమెంట్ సమయంలో జరిగే మైదానం వెలుపలి వివాదాలలో అధికభాగం ముందు రాసుకునే స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని తెలిపాడు. ఐపీఎల్ చూసే వీక్షకుల రేటింగ్లు పడిపోతే, హైప్ సృష్టించడం కోసం ఐపీఎల్ థింక్-ట్యాంక్ ఉద్దేశపూర్వకంగా మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు చీర్ లీడర్తో సంబంధం కొనసాగిస్తున్నాడన్న వార్తను తానే వ్యాప్తి చేశానంటూ లలిత్ మోదీ బాంబు పేల్చాడు.అయితే కొందరు క్రికెటర్లు చీర్లీడర్స్తో ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నట్లు వార్తలు సృష్టించడం లాంటివన్నీ ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించాడు.ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించడం, వారు వ్యూయర్షిప్ కోసం దానికి మరింత హంగులు అద్ది రేటింగ్స్ను పెంచుకోవడానికి ఆయుధంలా వాడుకునేవారు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ చీర్ లీడర్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తాము బహిరంగపరిచిన మాట వాస్తవమే. కానీ కొన్ని చానెళ్లు మాత్రం దిగజారి డికాక్ చీర్లీడర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ రాసుకొచ్చాయి. ఇది వారి టీఆర్పీ రేటింగ్ను పెంచేసి ఉండొచ్చు.. కానీ ఒక క్రికెటర్ కెరీర్కు ఇదొక మాయని మచ్చలా మిగిలిపోతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సౌతాఫ్రికా డికాక్ ఆ చీర్లీడర్నే పెళ్లి చేసుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో చీర్ లీడర్స్ను పెళ్లి చేసుకున్న క్రికెటర్ల గురించి ఒక లుక్కేద్దాం.👉డికాక్, షాషా హర్లీ..సౌతాఫ్రికా సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, షాషా హర్లీల ప్రేమకథ, వివాహబంధంలోకి అడుగుపెట్టడం ఒక చిన్నపాటి సినిమా కథలాగా ఉంటుంది. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ జరిగిన సమయంలో డికాక్ హైవైల్డ్ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. అదే జట్టుకు షాషా హర్లీ చీర్లీడర్గా పనిచేసినట్లు సమాచారం. టోర్నీ జరిగిన సమయంలోనే డికాక్తో షాషా హర్లీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు రిలేషన్షిప్లో మునిగి తేలారు. 2015లో నిశ్చితార్థం చేసుకున్న డికాక్, షాషాహర్లీలు మరుసటి ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కియారాకు స్వాగతం పలికారు. అప్పటినుంచి డికాక్ ఏ టోర్నీకి వెళ్లినా షాషా హర్లీ తన వెంటే వస్తూ అతన్ని ఉత్సాహంగా ఉంచుతుంది.👉మహ్మద్ షమీ, హసిన్ జహాన్..చీర్లీడర్ను పెళ్లిచేసుకున్న మరో క్రికెటర్ మహ్మద్ షమీ. 2012 ఐపీఎల్ సీజన్లో మాజీ మోడల్ హసీన్ జహాన్ చీర్లీడర్గా పనిచేసింది. ఈ సీజన్లోనే షమీ మొదటిసారి ఆమెను కలిశాడు. మాటల మధ్యలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత 2014 జూన్ 6న మొరాదాబాద్లో కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హసీన్ జహాన్ చీర్ లీడర్ పాత్రకు ఫుల్స్టాప్ పెట్టింది. 2015లో ఈ దంపతులు ఐరా షమీకి స్వాగతం పలికారు. అయితే నాలుగేళ్లకే వీరి వివాహబంధం ముగిసింది. షమీపై శారీరక వేధింపులు, గృహహింస కేసులు పెట్టిన హసీన్ జహాన్ షమీతో విడాకులు తీసుకొని విడిపోయింది. అలా క్రికెటర్లలో చీర్ లీడర్స్ను పెళ్లి చేసుకున్న ఇద్దరిలో ఒకరు తమ వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటే.. మరొకరు మాత్రం వివాహబంధం విచ్ఛిన్నం కావడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. చదవండి: గంభీర్ తప్పుకోనున్నాడా? టీమిండియాకు కొత్త కోచ్! -
పెళ్లి వేడుకలో దీపిక- రణ్వీర్ సింగ్ జంట.. పిక్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తమ బంధువుల పెళ్లి వేడుకలో వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో దీపికా భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. రణవీర్ ఎరుపు రంగు కుర్తా పైజామాలో కనిపించగా.. దీపిక కలర్ఫుల్ సంప్రదాయ చీరలో మెరిసింది. ఇది రణ్వీర్ సింగ్ కజిన్ వెడ్డింగ్ అని తెలుస్తోంది. దీపిక- రణ్వీర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వీరిద్దరు తమ రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఇటీవలే తమ కుమార్తె దువాతో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ జంట నవంబర్ 2018లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు 2024లో దువాకు స్వాగతం పలికారు. ఇక సినిమాల విషయానికొస్తే దీపిక అట్లీ దర్శకత్వం వహిస్తోన్న 'రాకా' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు, రణ్వీర్ సింగ్ సైతం కల్యాణి ప్రియదర్శన్తో కలిసి జాంబీ అడ్వెంచర్ చిత్రం 'ప్రళయ్'లో నటించనున్నారు. అయితే 'డాన్ 3' నుంచి రణ్వీర్ తప్పుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ఇటీవలే దురంధర్ చిత్రాలతో బ్లాక్బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. Glimpses of #DeepVeer at Ranveer's cousins wedding 😍✨️🧿Emo babies 🥹 pic.twitter.com/CjmGcKy1n2— Versatile Fan (@versatilefan) June 2, 2026 -
ఇలాంటి గిఫ్ట్ పొందాలంటే అదృష్టం ఉండాలేమో! వైరల్ వీడియో
ఆధునిక పెళ్లిళ్లలో భారీ ఆర్భాటాలు, ధగధగలాడే నగలు, బరువైన పట్టుచీరలు, భారీ విందులే కాదు గిఫ్ట్, రిటన్ గిఫ్ట్లు చాలా ముఖ్యం. ఆత్మీయతలు, అనురాగాలు, పలకరింపులుకంటే.. వచ్చామా.. తిన్నామా.. ఫోటో తీయించుకున్నామా. అన్నట్టే ఉంటాయి సాధారణంగా. కానీ అస్సాంలో ఒక పెళ్లిలో చోటు చేసుకున్న ఘటన నెట్టింట అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది.అస్సాంలో ఒక మానసిక వికలాంగుడు ఆహ్వానం లేకుండా ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. అతను నిశ్శబ్దంగా అతిథులతో కలిసి భోజనం చేశాడు,ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు కూడా. అబ్బా.. పెళ్లి వారు ఎంత దయ గలవారు అనుకుంటున్నారా.. ఆగండి ఆగండి. ఇక్కడే మిమ్మల్ని ఆశ్చర్యపర్చే విషయం ఒకటి ఉంది.పెళ్లివారి కంటే తానే గొప్పవాడిని అని నిరూపించుకున్నాడు. ఎలా అంటారా? ఇదీ చదవండి: ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణంతన కడుపునిండింది కదా, ఆకలి తీరింది కదా అని కామ్ గా అక్కడినుంచి వెళ్లిపోలేదు అతగాడు. వెళ్లే ముందు తన చిరిగిన జేబులోంచి రూ.10 లు తీసి వదువుకి కానుకగా అక్కడున్న వారికి అందించాడు. ఈ దృశ్యం చాలా హృద్యంగా నిలిచింది. ఈ హార్ట్ టచింగ్ వీడియో ఆన్లైన్లో వేలాది మందిని కదిలించింది. దయ,మానవత్వంతో కూడిన మనిషి అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఎంత ఇచ్చామన్నది కాదు.. ఎంత ప్రేమగా మనస్ఫూర్తిగా ఇచ్చారనేదే ముఖ్యం అంటున్నారు. బహుశా తన జేబులో 10 రూపాయలే ఉండి ఉంటాయ్ అని మరికొందరు కామెంట్చేశారు.எதுவும் இல்லாமல்… இதயமெல்லாம் கொடுத்தார் Assam திருமணத்தில், தன்னிடம் அதிகம் இல்லாவிட்டாலும் ₹10 கொடுத்து வாழ்த்திய விருந்தினரின் gesture இணையத்தில் அனைவரின் மனதையும் கவர்ந்துள்ளது பணத்தின் அளவு இல்லை… மனத்தின் அன்புதான் முக்கியம் pic.twitter.com/3W19ynUTrp— Rajini (@rajini198080) May 28, 2026 ఇదీ చదవండి: ఈ వెహికల్ తెచ్చిన లక్ : నెలకు రూ. 45 వేలు -
విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!?
భారతదేశంలో విడాకులను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. పైగా చాలా జంటలు వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోయినా..సమాజం కోసం లేదా మరే ఇతర కారణాల వల్లనో కొనసాగతుంటారు. ఆ బంధం ఊపిరాడనంతగా చేస్తున్నా బలవంతంగా కలిసి ఉండేందుకే మొగ్గుచూపుతుంటారు. అయితే అలాంటి వివాహ బంధాన్నే భారత కుటుంబ వ్యవస్థ విజయవంతమైన వివాహ బంధంగా పేర్కొనడం విచిత్రం. ఇది నిజంగా ఎంత వరకు కరెక్ట్ అంటూ నిలదీశారు నాట్ డేటింగ్ యాప్ సీఈవో. అసలు విజయవంతమైన వివాహ బంధం అంటే అసలే ఏంటి అంటూ సోషల్మీడియా వేదికగా చర్చ లేవదీస్తూ..తన అభిప్రాయన్ని పంచుకున్నారు.ఆయన ఏమన్నారంటే..ఇటీవల కాలంలో అసంతృప్తికరమైన వివాహాలు, భావోద్వేగ అనుకూలత గురించిన సంభాషణలు ఆన్లైన్లో సర్వసాధారణంగా మారాయి. ఆ నేపథ్యంలో నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు సీఈవో జస్వీర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న వివాహంలో కొనసాగడాన్ని విజయవంతమైన వైవాహికి బంధంగా పరగణించాలా అనే ప్రశ్నను లెవనెత్తారు. చాలామంది తమ ఆనందం కోసం కాకుండా సామాజిక అంచనాల కారణంగా సంబంధాలను కొనసాగిస్తున్నారని వాదించారు. ఈ మేరకు జస్వీర్సింగ్ సోషల్ మీడియా ఎక్స్లో ఇలా రాశారు. భారత దేశానికి తక్కువ విడాకులు రేట్లు అవసరం లేదు. ఊపిరాడకుండే చేసే వివాహాలు తక్కువగా కావాలన్నారు. భారత్లో విడాకులు రేట్లు తక్కువగా ఉన్నాయనేది గొప్పగా విజయం సాధించనట్లుగా గర్వంగా చెబుతుంటారు. కానీ లక్షలాదిమంది తమ వివాహ బంధంలో మానసికంగా చచ్చిపోయి, బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు. వాళ్లంతా ప్రతిరోజూ తమ లోపల చనిపోతున్నారు. అందుకు ఉదాహరణ ట్విషా శర్మ ఉదంతమే. 30 ఏళ్ల వివాహం దాని విజయానికి తప్పనిసరిగా హామీ ఇవ్వదని, ఎందుకంటే కొంతమంది భాగస్వాములు నిజంగా కలిసి జీవించకుండా కేవలం ఒకరినొకరు భరిస్తారని పేర్కొన్నారు. సంతోషంగా లేని ఇద్దరు వ్యక్తులను దశాబ్దాల పాటు కలిసి ఉండమని బలవంతం చేయడం, విడాకుల కన్నా చాలా బాధాకరమైనది. మీరు ప్రతిరోజూ చిక్కుకుపోయినట్లుగా, మానసికంగా అలసిపోయినట్లుగా, ఒంటరిగా, ఊపిరాడనట్లుగా భావిస్తూ నిద్రలేస్తే, వాళ్లు ఒక వివాహాన్ని కాపాడటం లేదు. సమాజ పరువును కాపాడుతున్నారు, అని ఆ సీఈఓ పోస్ట్లో పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే భారతీయ కుటుంబాలు వివాహం అంటే సర్దుబాటు అని చెప్పి..కొనసాగించాడమే పరవు అని నొక్కి చెబుతుంది. ఆమె లేదా అతడు మానసికంగా లోలోపల కుంగిపోయినా అలా కాపురం చేస్తే..దాన్ని విజయవంతమైన వివాహం అనే చెబుతుంటారు. నిజం చెప్పాలంటే ఇది నిజంగా భావోద్వేగ బంధనం. ఇక్కడ విడాకులు నిషిద్ధంగా చూడకూడదు. జీవితాంతం దుఃఖంలో మునిగిపోవడమే నిషిద్ధం కావాలి అంటూ పోస్టుని ముగించారు. నెటిజన్లు ఆయన మాటలకు ఏకీభవిస్తూ భారతదేశంలో విడాకులను సాధారణీకరించాలి. మనకు విఫలమైన వ్యాపారాలు ఉన్నట్లే, విఫలమైన సంబంధాలు కూడా ఉంటాయని అంగీకరించాలి, సాధారణ విషయంగా పరిగణించాలి. అయితే భారతదేశం సంతోషంగా కలిసి జీవించడాని కంటే కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తుందని అదే అసలైన సమస్య అని పోస్టులు పెట్టారు. కాగా, ఈ చర్య మానసిక ఆరోగ్యం, విడాకులపై మారుతున్న అభిప్రాయాలను హైలెట్ చేసింది.(చదవండి: నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!) -
పెళ్లి కంటే ఆ పని చేయడం వందరెట్లు బెటర్: టాలీవుడ్ హీరోయిన్
స్వాతి అంటే గుర్తు పట్టరేమో కానీ.. కలర్స్ యాడ్ చేస్తే ఇట్టే పసిగడతారు. అంతలా ఆ పేరుతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. డేంజర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల తర్వాత మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ముఖ్యంగా పెళ్లి టాపిక్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని తన మనసులోని మాటను బయటకు చెప్పేశారు. ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపింది.ఈ రోజుల్లో ఎవరికీ కూడా కొంచే కూడా ఓపిక ఉండడం లేదని.. అందుకే ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లాడి ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం నాకు ఇష్టం లేదన్నారు. అందుకే ఎలా చింతా లేకుండా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని అన్నారు. ఎందుకంటే అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని.. ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమిస్తుందని హీరోయిన్ స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది. -
ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి.. అతనే ఫిక్సా?
గతేడాది నుంచి ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఓసారి వీరిద్దరు న్యూయార్క్లో జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కూడా వీరిద్దరి గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకీ ఎవరా ఇద్దరని అనుకుంటున్నారా? గతేడాది నుంచి వైరలవుతోన్న ఆ జంట మరెవరో కాదు.. ఒకరు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. మరొకరు ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్.గతంలో కావ్య మారన్- అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత అనిరుధ్ అదేం లేదంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి టాపిక్ వైరల్గా మారింది. ఈ సారి ఏకంగా వేదికలను కూడా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నారని లేటేస్ట్ టాక్ నడుస్తోంది.తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఇద్దరి కుటుంబాలు స్పెయిన్లో వీరి వివాహం జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి సంబంధించి అనిరుధ్ కానీ.. కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. గతంలో చాలాసార్లు రూమర్స్ రావడంతో ఇది కూడా అలాంటిదేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిరోజులు ఆగితే ఈ జంట రిలేషన్ గురించి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇక ఇద్దరి కెరీర్ పరంగా చూస్తే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్గా బిజీగా ఉన్నారు. కావ్య సైతం ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లతో ఫుల్ బిజీగా ఉంది. -
మెడలో నల్లపూసల దండ.. చేతికి మట్టిగాజులు.. కంగనా షాకివ్వనుందా?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కంగనా రనౌత్. కేవలం సినిమాలే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఈ బాలీవుడ్ భామకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఆమె మెడలో నల్లపూసలు, చేతులకు మట్టిగాజులు ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. కంగనా ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్గా పెళ్లి చేసుకుందా? అని తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కంగన సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారా? అని ఒకరు కామెంట్ చేయగా.. ఒకవేళ ఆమె పెళ్లి చేసుకుంటే గ్రాండ్గానే చేసుకుంటారని మరొకరు రాసుకొచ్చారు. అయితే ఏదైనా సినిమా షూటింగ్ కోసం అలా వేసుకున్నారా? మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కంగనా నల్లపూసల దండ, మట్టిగాజులతో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ పెళ్లి గురించి చర్చ ఆగేలా కనిపించడం లేదు.ఇక కంగనా సినిమాల విషయానికొస్తే తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ సీక్వెల్లో నటిస్తున్నారు. ‘క్వీన్ 2’ అనే టైటిల్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని క్యారెక్టర్ లుక్ కోసమే ఆమె ఇలా తయారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలిటిక్స్తో బిజీగా ఉన్న కంగనా.. మళ్లీ బాలీవుడ్లోకి కమ్బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. Kangana Ranaut was seen wearing a mangalsutra today.Has Kangana secretly got married? pic.twitter.com/wBCoNCZVLL— Mr SP (@Lonely_prabh) May 21, 2026 -
విరోష్ వెడ్డింగ్.. ఆ సీక్రెట్ రివీల్..!
ఈ ఏడాది టాలీవుడ్లో జరిగిన బిగ్గెస్ట్ గ్రాండ్ వెడ్డింగ్ విరోష్ జంటదే. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పెళ్లికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ ప్రియ మాగంటి ఓ సీక్రెట్ రివీల్ చేశారు. రష్మిక తన మంగళసూత్రాన్ని స్వయంగా డిజైన్ చేసుకున్నారని తెలిపారు. ట్రెండ్ను ఫాలో కావాలని విరోష్ జోడీ ముందు నుంచే అనుకోలేదన్నారు. దుస్తులు, ఆభరణాల నుంచి అన్నీ రొటీన్కు భిన్నంగా ప్లాన్ చేసుకున్నారని వెల్లడించారు. వీరిద్దరు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే వీరిద్దరు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ట్విషా శర్మ కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్ : మాజీ మిస్ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ప్రకారం ఆమెది హత్య కాదు, ఆత్మహత్యేనని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఇదే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మే 12న ట్విషా తన అత్తగారింటి టెర్రస్లో జిమ్ పరికరాన్ని ఉపయోగించి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా పోస్టుమార్టం ఫలితాలతో సరిపోలిందని కమిషనర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కోరితే రెండో పోస్టుమార్టం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు.అయితే ట్విషా తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు ఎదుర్కొన్నందువల్లే ఆమె ప్రాణం కోల్పోయిందని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ట్విషా శర్మ భర్త సమ్రత్ సింగ్ లాయర్ కాగా.. అత్త గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి. ప్రస్తుతం భోపాల్లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. అత్తగారు న్యాయవాద నేపథ్యం ఉన్నవారు కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ట్విషా తండ్రి ఆరోపించారు.కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేసు స్వతంత్రంగా, వేగంగా దర్యాప్తు జరుగుతోందని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ను కేవలం రెండు రోజుల్లోనే నమోదు చేశామని, నిందితుడు సమ్రత్ను పట్టుకోవడానికి బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. అరెస్టులో ఆలస్యం జరిగినా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు.ట్విషా శర్మ, సమ్రత్ సింగ్ల వివాహం 2024 డిసెంబర్లో జరిగింది. ఇద్దరి పరిచయం ఒక డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు ఈ విషాదానికి కారణమయ్యాయని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. ట్విషా శర్మ మరణించిన సమయంలో ఆమె భర్త సమ్రత్ సింగ్,పొరిగింటి వ్యక్తి, ఇంట్లో సహాయకుడు అనుమానస్పదంగా కనిపించారు. వీరు ముగ్గురూ ఆమెను మెట్లపై నుంచి కిందికి తీసుకువస్తూ,సీపీఆర్ చేసే ప్రయత్నాలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయింది. ట్విషా శర్మ మే 12న ఉదయం 7:20కి ఒంటరిగా మెట్లపైకి ఎక్కి టెర్రస్కి వెళ్లినట్ సీసీటీవీలో కనిపించింది.దాదాపు గంట తర్వాత ఆ ముగ్గురు పైకి ట్విషా ఉన్న రూమ్లోకి వచ్చారు. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ (రిటైర్డ్ జడ్జ్) ఓ గదిలోకి వెళ్లి, కొద్దిసేపటికి బయటకు వచ్చి కిందికి వెళ్లినట్లు కూడా ఫుటేజ్లో కనిపించింది.ట్విషా భర్త ప్రస్తుతం పోలీసుల నుంచి పరారీలో ఉన్నాడు. ట్విషా తల్లిదండ్రులు ఈ ముగ్గురి చర్యలు అనుమానాస్పదమని, వరకట్న వేధింపుల కారణంగా హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అని, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా అదే నిర్ధారిస్తున్నాయని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ట్విషా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దర్యాప్తుకు సిఫారసు చేశారు. -
మైనర్ ను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్
-
బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్పై కేసు
హుజూర్నగర్ : బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాయిని అనిల్ కుమార్ అనంతగిరి మండలం పాలేరు గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని వారి తల్లిదండ్రులు అనుమతితో ఈ నెల 9న పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు వచ్చింది. ఐసీడీఎస్ హుజూర్ నగర్ సెక్టార్ ఇన్చార్జి సారెడ్డి సోమమ్మ విచారణ చేయగా నిజమని తేలింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. -
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. కానీ ఆ ఇద్దరూ జీవితపు చివరి దశలో తోడును సంపాదించుకున్నారు. వారి ఆసక్తికర కథ ఇప్పుడు అందరి హృదయాలను దోచుకుంటోంది. కేరళలోని కొట్టాయం జిల్లాలో 76 ఏళ్ల థామస్, 74 ఏళ్ల లీలమ్మ తమ మిగిలిన జీవితాన్ని కలసి పంచుకోవాలని నిర్ణయించుకుని, పవిత్రమైన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వృద్ధాప్యంలో ఒంటరితనంతో కుమిలిపోవడం కంటే, ఒకరికొకరు అండగా నిలవడమే జీవితానికి అర్థం అని ఈ జంట నిరూపిస్తోంది.ఒంటరి పోరాటం.. థామస్ గతంకల్లర కన్నరతిల్ కు చెందిన కేసీ థామస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు, కేరళ పోలీసు విభాగంలో టెక్నికల్ వింగ్ ఆఫీసర్గా సేవలందించి పదవీ విరమణ పొందారు. 2020లో ఆయన భార్య కన్నుమూశారు. ఆయన కుమారుడు అలెక్స్ కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో స్థిరపడగా, వివాహం చేసుకున్న కుమార్తె మెర్సీ స్థానికంగా ఉంటూ, తండ్రి బాగోగులు చూసుకుంటోంది. పిల్లలు అండగా ఉన్నప్పటికీ, జీవితంలో ఆయనకు ఏదో తెలియని ఒంటరితపం వెంటాడుతోంది. ఆస్పత్రిలో పరిచయం.. కలసిన మనసులు కడుతురుతికి చెందిన లీలమ్మ 16 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులు జోమోన్, జైమోన్ ఇటలీలో స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితం ఓ ప్రైవేట్ హెల్త్కేర్ సెంటర్లో థామస్, లీలమ్మ తొలిసారిగా కలుసుకున్నారు. ఆమెతో ఏర్పడిన అనుబంధంతో థామస్ తన జీవితాన్ని పంచుకోవాలని ఆహ్వానించగా, మొదట్లో ఆమె అంగీకరించలేదు. కానీ నెలన్నర క్రితం ఆయన మళ్లీ ఫోన్ చేసి ప్రతిపాదించడంతో, పిల్లలతో మాట్లాడిన తర్వాత లీలమ్మ తన అంగీకారాన్ని తెలిపారు.థామస్, లీలమ్మల పిల్లలు అనుమతవ్వడంతో..ఇద్దరి పిల్లలు కూడా ఈ వివాహానికి మనస్ఫూర్తిగా మద్దతు పలకడంతో, సోమవారం సాయంత్రం కల్లరలోని సెయింట్ మేరీస్ పుతెన్పల్లి చర్చిలో థామస్, లీలమ్మల వివాహం జరిగింది. బంధువుల సమక్షంలో, థామస్ బంధువు ఫాదర్ అబ్రహం తరతట్టెల్ ఈ వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు థామస్ కుమార్తె కుటుంబంతో పాటు, పారిష్ వికార్ ఫాదర్ థామస్ కరింపుకలాయిల్ హాజరయ్యారు.ఇది కూడా చదవండి: భోజ్శాల: 700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతి -
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మీరా వాసుదేవన్ గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే. గోల్ మాల్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ.. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అంజలి ఐ లవ్యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా వాసుదేవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ప్రస్తావించింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానని తెలిపింది. ఇప్పుడైతే చాలా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడించింది. పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాలు వృథా చేశానని పేర్కొంది. అర్థం లేని మూడు పెళ్లిళ్లకు అనవసరంగా సమయాన్ని కేటాయించానని వెల్లడించింది. పెళ్లి విషయంలో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు.మూడోసారి కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని మీరా వాసుదేవన్ తెలిపింది. నాకు నచ్చిన పనులు, సేవ చేస్తూ ఆనందంగా ఉంటున్నట్లు వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపుతున్నానని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని వ్యక్తులతో సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.పర్సనల్ లైఫ్..కాగా.. మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్లో కెమెరామెన్ విపిన్తో లవ్లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 ఆగస్టులో విడాకుల విషయాన్ని ప్రకటించింది. దీంతో మూడు పెళ్లిళ్లు ఇలా పెటాకులయ్యాయి. -
కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు నవవధువు
సాక్షి,విశాఖ: వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని బంగారు జీవితం గడపాలని కలలు కన్నారు. కానీ ఆ దంపతుల ఆశలు అడియాసలయ్యాయి. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించింది. వరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వధువు, వరుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి.పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి మృతి చెందగా, వరుడు నర్సింగరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.బుధవారం రాత్రి 1.58 గంటలకు వాడచీపురు పల్లిలో రామేశ్వరి - నర్సింగరావు వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం జరిగిన కొన్ని గంటలకే గురువారం అత్తగారిల్లైన అగనంపూడికి బయల్దేరారు. మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. రాత్రి పెళ్లి, మరుసటి రోజు ప్రమాదంలో వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఘనంగా పెళ్లి చేసి కుమార్తెను సంతోషంగా అత్తగారింటికి సాగనంపిన తల్లిదండ్రులు, ఆమె మృతదేహాన్ని చూసి గుండెలవేసిలా రోదిస్తున్నారు. ఈ దృశ్యం స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. -
నవ వధూవరులను ఆశీర్వదించిన YS జగన్
-
పెళ్లి చేసుకుందామనుకున్నా.. నా మరదలినే ప్రేమిస్తావా..!
హైదరాబాద్: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్నగర్లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిïÙటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ కమెడియన్.. ఫైమా స్పెషల్ విషెస్
ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలోనే పలువురు టాలీవుడ్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రష్మిక, విజయ్ దేవరకొండ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో టాలీవుడ్ కమెడియన్, పటాస్ ప్రవీణ్ పెళ్లి చేసుకున్నారు. తను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశాడు. పలు ఆల్బమ్ సాంగ్స్లో చేసిన వంశిత అనే అమ్మాయిని పెళ్లాడారు. కాగా.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. ప్రవీణ్ విషయాకొనిస్తే పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై తన కామెడీ టైమింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో ఫైమాతో కలిసి ప్రవీణ్ ఎక్కువగా కనిపించారు. వీరిద్దరు కలిసి ఎన్నో స్కిట్స్ చేశారు. తాజాగా ఫైమా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. పెళ్లి రాలేకపోయినా వీడియో కాల్ ద్వారా విషెస్ చెప్పింది. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ప్రవీణ్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
'రష్మిక బాటలో మరో హీరోయిన్.. నాకు తెలుగబ్బాయే కావాలి'
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ మూవీ 'ప్రసన్న వదనం'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. ఆ తర్వాత చౌర్యపాఠం అనే చిత్రంలోనూ మెరిసింది. ఇటీవలే పాపం ప్రతాప్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం పాయల్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న మేకర్స్ తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రెస్మీట్కు హాజరైన పాయల్ రాధాకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను కన్నడకు చెందిన వ్యక్తినే.. కానీ పెళ్లి విషయంలో మాత్రం తెలుగువాడే కావాలని బోల్డ్ కామెంట్స్ చేసింది. తనకు గుర్తింపు, గౌరవం, ఉపాధిని ఇచ్చింది టాలీవుడ్ పరిశ్రమనేనని తెలిపింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంది. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు ఆర్థిక భరోసాను ఇచ్చిందని వెల్లడించింది. అందుకే తన లైఫ్ పార్ట్నర్ కూడా తెలుగు వాడే కావాలని కోరుకుంటున్నట్లు పాయల్ వెల్లడించింది.ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కన్నడ బ్యూటీలంతా తెలుగింటి కోడలైపోతున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే కన్నడ భామ రష్మిక మందన్నా.. మన తెలుగు హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ సైతం అదే బాటలో దూసుకెళ్తోంది. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది. తెలుగు కోడలిగా స్థిరపడాలన్న పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
వరుడి అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయం
బిహార్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. బంధుమిత్రులు, పెళ్లి వేడుకలతో కళకళలాడుతున్న ఉన్నట్టుండి విషాదంగా మారిపోయింది. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో అంతా నివ్వెర పోయారు. కానీ పుట్టెడు దుంఖాన్నిగుండెల్లో దాచుకుని ఆ శుభకార్యాన్ని జరిపించారు. అదేంటి.. అదెలా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు తెలియాంటే ఈ కథనం చదవాల్సిందే.ఒక వైపు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకును కోల్పోయిన బాధ, మరోవైపు బాధ్యతగా జరిపించిన పెళ్లి.. ఈ సంఘటన చూస్తుంటే కాలం ఎంత క్రూరమైనదో కదా అనిపించకమానదు. దంపతులిద్దరూ సంతోషకరమైన వేడుకగా కలకాలం గుర్తుంచు కోవాల్సిన మధురమైన క్షణాలు కాస్తా జీవితకాల దుఃఖంగా మారిపోవడం విధి విచిత్రమే. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటే ఇదేనేమో!వివరాల్లోకి వెళ్తే.. ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి జరిపించే సందడిలో ఉన్నాయి ఇరు కుటుంబాలు. ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. మరోవైపు వరుడు తన బంధుమిత్రులు, మేళతాళాలతో కలిసి పెళ్లి వేదిక వైపు ఊరేగింపుగా బయలుదేరాడు. అందరూ ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకొంటున్న సమయంలో, వరుడు ప్రయాణిస్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద తీవ్రతకు వరుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వార్త తెలియగానే అందరూ నిశ్చష్టులైపోయారు. సంతోషంతో నిండిపోవాల్సిన ఇరు కుటుంబాల్లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఆటపాటలతో సందడిగా ఉన్న వాతావరణం అంతా హాహాకారాలతో నిండిపోయింది. ఇక్కడే బంధవులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవంఅనూహ్య నిర్ణయంఅయితే, ఈ ఘోర విషాదం జరిగిన తర్వాత ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సామాజిక ఆచారాలు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వరుడి కుటుంబ సభ్యులు గుండెలు దిటవు చేసుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన వరుడి స్థానంలో, అతని తమ్ముడికి ఇచ్చి వధువుకు వివాహం చేయాలని నిర్ణయించారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి ఆగిపోకూడదనే ఉద్దేశంతో, పెళ్లి పీటల మీద తమ్ముడిని కూర్చోబెట్టి వివాహ క్రతువును పూర్తి చేశారు. విషాద ఛాయల మధ్యే ఆ వివాహం ముగిసింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే వధూవరులు ఈ తంతును ముగించారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. 🚨SHOCKING | Groom died in a horrific accident while on the way to his own wedding, after which the bride was married to his younger brother with the family's consent. Both cry inconsolably pic.twitter.com/KYow2jVOJ4— The Tatva (@thetatvaindia) May 7, 2026స్థానికుల భిన్నాభిప్రాయాలుఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సామాజిక ఒత్తిడి, ఆచారాల దృష్ట్యా ఆ కుటుంబం తీసుకున్నది చాలా కష్టమైన నిర్ణయమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. -
త్రిష- విజయ్ల పెళ్లెప్పుడు?.. తెగ వెతికేస్తోన్న నెటిజన్స్..!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు దళపతి విజయ్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని(108 స్థానాలు) నమోదు చేసింది. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ ఫోకస్ అంతా మేజిక్ ఫిగర్(118)కి కావాల్సిన సభ్యులను పోగు చేయడంపైనే పెట్టాడు. గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వస్తే.. ఈ రోజే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ పర్సనల్ లైఫ్ గురించి నెటిజన్స్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. హీరోయిన్ త్రిషతో పెళ్లి ఎప్పుడు? వారిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? వయసు తేడా ఎంత? తదితర అంశాలపై నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే విజయ్ సతీమణి సంగీత భర్తతో విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఓ నటితో ఆయన సహజీవనం చేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు నెట్టింట ట్రెండ్ అయింది. విజయ్-త్రిషలు ప్రేమలో ఉన్నారనే పుకార్లు ఎక్కువైయ్యాయి. అయితే అవి నిజమే అన్నట్లుగా అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు.అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిష బర్త్డే (మే 4) రోజే ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ భారీ విజయం సాధించడంతో వీరిద్దరి బంధంపై రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. విజయ్ సీఎం అయిన వెంటనే త్రిషను పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించాయి. మరికొంతమంది అయితే.. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టిపెడతాడని, ఐదారు నెలల తర్వాతే పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. ఏదేమైనా పెళ్లి మాత్రం చేసుకోవడం పక్కా అని తేలడంతో.. అందరూ విజయ్-త్రిషల వయసుపై గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అనేది చాలా మంది గూగుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. విజయ్ 1974 జూన్ 22న జన్మించాడు. ఆయనకు ప్రస్తుతం 51 ఏళ్లు. త్రిష 1983 మే 4న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ తేడా ఉంది. విజయ్, త్రిషలు 2004లో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం 'గిల్లి' (ఒక్కడు సినిమా రీమేక్)లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి, 'లియో' వంటి చిత్రాల్లో జంటగా నటించారు. వెండితెరపై వీరి జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే వీరిద్దరి రిలేషన్పై పుకార్లు రావడమే కానీ.. అధికారికంగా మాత్రం ఎక్కడ ప్రకటించలేదు. -
శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారు కానీ.., : రాజశేఖర్
సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. మొన్నటి వరకు హీరోగా మాత్రమే సినిమాలు తీసిన ఆయన..ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ మూవీలో శర్వానంద్ తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి.శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్..రాజశేఖర్, జీవితలది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. `తలంబ్రాలు`(1986) సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే జీవిత కంటే ముందు శ్రీదేవితో తనకు పెళ్లి ప్రపోజల్ వచ్చిందని గతంలో ఓ న్యూస్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పాడు. ఇదే విషయాన్ని తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ గుర్తు చేసింది. ‘జీవిత కంటే ముందు శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చిందట కదా.. నిజమేనా?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ‘నిజమే. శ్రీదేవి తండ్రికి, మా నాన్నగారికి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ చొరవతో ఇరువైపులా స్నేహితుల మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆమె మన మధ్య లేరు. అందుకే ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడం సరికాదు. వదిలేద్దాం’ అని రాజశేఖర్ చెప్పాడు.ఆర్టిస్ట్ అని శ్రీదేవిని రిజెక్ట్ చేశారుఅయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో రాజశేఖర్ వివరించాడు. ‘శ్రీదేవి నాన్నతో మా నాన్నకు మంచి స్నేహబంధం ఉండేది. కులం కూడా ఒకటే. దూరపు బంధువులు అవుతారు. అందుకే శ్రీదేవి ఫ్యామిలీ నుంచి నాకు పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అప్పటికీ నేను సినిమాల్లోకి రాలేదు. ఎంఎస్ చదవాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని మా నాన్న వాళ్లకు పెళ్లి.. వారి ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు. సినిమాల్లో నటించేవాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ని పక్కన పెట్టారు’ అని రాజశేఖర్ అన్నారు. -
గ్రాండ్గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మనవరాలి పెళ్లి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వీఆర్కే రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన మనవరాలు హిమశ్రీ వేమూరి వివాహా వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుక జన్వాడలోని నియో కన్వెన్షన్లో జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయికుమార్, అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ-మధుమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సందడి చేశారు.కాగా.. వీఆర్కే రావు భారత వైమానిక దళంలో కమాండర్గా పనిచేశారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా.. కళాకారుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగా బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నంది అవార్డ్ అందుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఆయన అందించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. -
అతనితోనే జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్లో రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్పై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకోనుందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లాడనుందని ఊహాగానాలొస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కనుందని లేటేస్ట్ టాక్. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు.తన కూతురు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలను బోనీ కపూర్ ఖండించారు. జాన్వీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో పెద్ది బ్యూటీపై వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడింది. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన జాన్వీ కపూర్.. శిఖర్తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు అర్థమైపోయింది. గతంలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను నాతో ఉంటే సేఫ్గా ఉంటాననే ఫీలింగ్ వస్తుందని జాన్వీ తెలిపింది. అతనికో నేను ఒక చిన్నపిల్లలా ఉండగలనని చెప్పింది. శిఖర్తో తప్ప మరెవరితోనూ నేను ఇంత సరదాగా గడపలేనని పేర్కొంది. -
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి రిసెప్షన్ లో చిరు ,మోహన్ బాబు
-
కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
ఘనంగా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి
-
'పిల్లల కోసం పెళ్లి అక్కర్లేదు'.. నిత్యామీనన్ బాటలో కట్టప్ప కూతురు
ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలను కనాలంటే పెళ్లి అవసరం లేదని అన్నారు. అది మన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తాజాగా నిత్యామీనన్ బాటలో స్టార్ నటుడి కుమార్తె నిలిచింది. ఇప్పటికే నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. తాజాగా నటుడు సత్యరాజ్ కూతురు దివ్య చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో హాట్టాపిక్గా మారాయి.వివాహ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని దివ్య తెలిపింది. వ్యక్తిగతంగా తాను పెళ్లి బంధాన్ని విశ్వసించనని పేర్కొంది. కేవలం మంగళసూత్రం కట్టడం వల్లనో లేదంటే ఉంగరాలు మార్చుకోవడం వల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను భావించడం లేదని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారం, ప్రేమతో కలిసి జీవించవచ్చని దివ్య స్పష్టం చేసింది. కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర, ధృవీకరణ పత్రం అవసరం లేదంటూ దివ్య సత్యరాజ్ కుండ బద్దలు కొట్టింది. -
'తిరుమలలో పెళ్లి జరగడం నా అదృష్టం..' బెల్లంకొండ
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన పెళ్లి వేడుక జరగనుంది. కావ్య రెడ్డి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరిద్దరు పెళ్లి ఈ రోజు రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ ఆసక్తకర కామెంట్స్ చేశారు. తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అదృష్టం, ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మా అమ్మ, నాన్నలు నాకు ఆ స్వామి పేరునే పెట్టారని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకునే అదృష్టం దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందన్నారు. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగానని తెలిపారు. నా ఫియాన్నీ వచ్చాక శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు. నా లైఫ్లో స్వామివారి పాదాల చెంత పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. -
జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు
ఇరాన్ వార్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఇండియాలో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళన తీవ్రంగానే ఉంది. దీనికి ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన నిదర్శనం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో కట్నకానుకలు, విందులో లేదా ఇతర డిమాండ్ల గురించి వింటుంటాం, కానీ ఇక్కడ ఒక వింత సంఘటన జరిగింది.రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్క పక్క పెళ్లి తతంగం జరుగుతుండగానే గ్యాస్ ధరలు పెరగడం లేదాకొరత ఏర్పడటం వంటి పరిస్థితులువస్తే, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కొడుకు అశోక్కు వచ్చిన సందేహం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. వరుడు అందరి ముందూ వధువుని పట్టుకుని ఒక ఊహించని ప్రశ్న వేశాడు.అసలు ఏం జరిగింది?అందరూ పెళ్లి సంబరాల్లో మునిగితేలుతుండగా, అకస్మాత్తుగా "ఒకవేళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే, నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేయగలవా?" అని అడిగాడు పెళ్లి కూతుర్ని కాబోయే భర్త. ఈ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లి సమయంలో ఇలాంటి ప్రశ్న ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.దీనికి వధువు సమాధానం విని అందరూ సంతోషంగా తెగ నవ్వు కున్నారు.వధువు సమాధానంవధువు ఏమాత్రం తడబడకుండా చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. తనకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం వచ్చని, అలా వండటానికి తనకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. వధువు ఇచ్చిన ఈ సమాధానంతో వరుడు సంతోషించి, పెళ్లి తంతును ముందుకు సాగించాడు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ కారులో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి కెమెరాతో వారి వద్దకు వెళ్తాడు. ముందు ముందు ఇబ్బంది రాకూడదనే ఈ ప్రశ్న అడిగానని వరుడు వివరణ ఇచ్చాడు. దీంతో వధువు ముసిముసిగా నవ్వుకుంది.నెటిజన్ల స్పందనఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన అని మెచ్చుకుంటున్నారు. ఈ కాలంలో పెళ్లి కూతురు దొరకడమే కష్టమంటే, ఇప్పుడు 'పొయ్యి టెస్ట్' కూడా మొదలుపెట్టారా?" అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు. మొత్తానికి, ఈ "కట్టెల పొయ్యి" ప్రశ్నదేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: చిన్నారుల కాళ్లు, చేతులు, కట్టేసి : డేకేర్ సెంటర్లో అమానుషం -
'పిల్లల కోసం పెళ్లే కానక్కర్లేదు'.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మెప్పించింది. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గతేడాది ఇడ్లీ కొట్టు, తలైవన్ తలైవి, కాదలిక్కా నెరమిల్లై చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. కేయూరీ ప్రొడక్షన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు.అయితే ఇటీవలే 39వ వసంతంలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ పెళ్లి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడింది. తాజాగా మరోసారి పెళ్లిపై నిత్యా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. గతంలో సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ముద్దుగుమ్మ.. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని అన్నారు. తాజాగా మరోసారి పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్పై మాట్లాడింది. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.పెళ్లికి.. పిల్లల్ని కనడానికి ఎలాంటి సంబంధం లేదని నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అందుకు పెళ్లి ఒక్కటే మార్గం కాదన్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పేం కాదని నిత్యామీనన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కేవలం లైఫ్లో ఓ పార్ట్ మాత్రమేనని.. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. పిల్లల్ని కనడానికి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సింగిల్ లైఫ్ను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు. -
టీడీపీ నేత ఇంట్లో పెళ్లి రగడ.. ఇరు కుటుంబాలపై కేసులు
హైదరాబాద్: పెళ్లి సంబంధం విషయంలో తలెత్తిన వివాదంలో రెండు కుటుంబాలపై కేసులు నమోదయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న సుధాకర్ పెండ్యాల, అతని కుమారుడు సాయి అక్షయ్ కుమార్ దివీస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్న టీడీపీ నేత, నోవా మెడికల్ కళాశాలల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు, డా.విజయ నిర్మల కుమార్తెతో సాయి అక్షయ్ కుమార్కు వివాహం కుదిరింది. ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించడంతో రూ.1 కోటి వరకట్నంతో పాటు ఖరీదైన బహుమతులు, బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన వాచీలు ఇచ్చారు. భారీగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఉద్యోగం విషయంలో అబద్దాలు చెప్పారని ఆరోపించారు. దీంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నామని సుధాకర్ తెలిపారు. తాము ఇచ్చిన కట్న కానుకలు, ఎంగేజ్మెంట్ కోసం పెట్టిన ఖర్చును వెనక్కి ఇవ్వాలంటూ కోరగా డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో పాటు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం ప్రారంభం చేస్తున్నారంటూ రెండ్రోజుల క్రితం నోవా మెడికల్ కాలేజ్ చైర్ పర్సన్ డా.విజయ నిర్మలతో పాటు సుమారు 70 మంది పెండ్యాల సుధాకర్ ఇంటివద్దకు వచ్చి హల్చల్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితులు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ పెళ్లి కూతురి తల్లి డా. విజయనిర్మలతో పాటు ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ పెండ్యాల సుధాకర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా విజయనిర్మల కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్
ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ శుభవార్త తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ నూతన దంపతులకు విషెసె చెబుతున్నారు. రణవీర్ సింగ్, కృతి సనన్, పరిణీతి చోప్రా, ఖుషీ కపూర్, శర్వరి, వాణి కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్నతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అయితే ఆమె తన భర్త వివరాలను వెల్లడించలేదు.కాగా.. షానూ శర్మ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్గా పనిచేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో వచ్చిన వార్-2 మూవీకి సైతం వర్క్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటుల కెరీర్ను తీర్చిదిద్దడంలో షానూ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రణ్వీర్ సింగ్ బ్యాండ్ బాజా బారాత్, వాణి కపూర్ మూవీ దమ్ లగా కే హైషాలో, అర్జున్ కపూర్ ఇషాక్జాదే చిత్రాలకు నటీనటులను ఎంపికచేసింది. అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడి మూవీకి క్యాస్టింగ్ డైరెక్టర్గా సేవలందించారు. గతేడాది రిలీజైన సైయారా మూవీకి అహాన్ పాండే, అనీత్ పడ్డాను షానూ శర్మనే ఎంపిక చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా మారింది. View this post on Instagram A post shared by Shanoo Sharma🌻 (@shanoosharmarahihai) -
అలాంటి వ్యక్తి దొరకాలి!
చూడగానే పక్కింటి అమ్మాయిలా స్క్రీన్ మీద మెరిసిన ‘సీతామహాలక్ష్మి’ మన మృణాల్ ఠాకూర్. తన మనసులో ఏమున్నా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆమె స్టయిల్. బాడీ ఇమేజ్ పోరాటాల నుంచి, తనపై వచ్చే గాసిప్స్ వరకు ప్రతి విషయాన్ని ధైర్యంగా పంచుకున్న ముచ్చట్లు ఇప్పుడు మీకోసం..గాసిప్స్? నవ్వేసి ముందుకెళ్తాను!నా పెళ్లి గురించి వచ్చే వార్తలు చూస్తే నాకే నవ్వొస్తుంది. ముఖ్యంగా ఒక తమిళ హీరోతో వచ్చిన పెళ్లి వార్తల్లో అస్సలు నిజం లేదు. అలాంటి వార్తలు చదివితే, ‘ఫిబ్రవరి 14 ఒక్కసారిగా ఏప్రిల్ 1 అయిపోయిందేమో’ అని అనిపిస్తుంది.ట్రోల్ చేసినా.. నిలబడ్డాను!బాడీ షేమింగ్ గురించి చాలా బాధపడ్డాను. నన్ను ‘మట్కా’ అని పిలిచినప్పుడు చాలా కుంగిపోయాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు గౌరవం ఉంది. ఎవరో నన్ను నిర్వచించడం కాదు. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాననేదే ముఖ్యం.బ్రేకప్ ఇచ్చిన బలంప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. నా కోసం ఎవరినీ వెతకడం లేదు. ఎందుకంటే, నాకు కియానూ రీవ్స్ లాంటి వ్యక్తి దొరికితే బాగుంటుంది అని అనిపిస్తుంది. గతంలో ఒక రిలేషన్ ఉంది. అయితే, నేను నటిని అనే నిజాన్ని అతను అంగీకరించలేక పోయాడు. ఆ బ్రేకప్ నన్ను మరింత బలంగా మార్చింది.అమ్మకు ఇచ్చిన మాట!చిన్నప్పుడొక బాధాకరమైన జ్ఞాపకం ఉంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేని రోజుల్లో, మా అమ్మను చుట్టాలు తమ కార్లలో కూర్చోనివ్వని సందర్భాలు చూశాను. అప్పుడే నేను ఒక మాట ఇచ్చాను. ‘ఒకరోజు నువ్వు ఊహించని కారు కొనిస్తాను’ అని. ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకున్నాను.చీకటి దశ నుంచి వెలుగులోకి!నా జీవితంలో ఒకప్పుడు చాలా కష్టమైన దశ వచ్చింది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఆలోచించేటప్పుడు చాలాసార్లు నిరాశగా అనిపించేది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం, నా పోరాటానికి నిదర్శనం. ప్రస్తుతం గ్లామర్ పాత్రలు చేసినా, టెలివిజన్ నుంచి వచ్చిన అమ్మాయి అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అదే నా పునాది.నేను సిద్ధంగా లేనప్పుడు నో వే!నా కెరీర్ మొదట్లో చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. కాని, ఆ పాత్రలకు నేను మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వాటిని వదిలేశాను. ఒకవేళ అప్పుడు బలవంతంగా చేసి ఉంటే, నన్ను నేను కోల్పోయేదాన్ని. అలాగే, కెరీర్ మొదట్లో కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తెలిసి, చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. అవకాశాలు కోల్పోయినా, నా విలువల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే నా అసలైన విజయం. -
పెళ్లిచేస్తే మా అబ్బాయి బాగు పడతాడా?
మా అబ్బాయి వయసు ఇరవై నాలుగు. మాది మేనరికం కావడం వల్ల అనుకుంటాను, చిన్నప్పటి నుంచి అతనికి నడక, మాటలు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. ఐదేళ్ల వయసులో స్కూల్కు పంపించాము. ఐదవ తరగతి వరకు బాగానే చదివాడు. కానీ ఆరవ తరగతి నుంచి విషయాలు గుర్తుంచుకోలేకపోవడం, సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడం జరుగుతుండేది. టీచర్లు మమ్మల్ని పిలిచి, అబ్బాయికి చదువు కష్టంగా ఉందని చెప్పేవారు. అయితే, మేము అతన్ని ఎలాగోలా పదోతరగతి పాస్ చేయించాము. తర్వాత ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేయించాము. అబ్బాయి చూడడానికి బాగుంటాడు. బైక్ కూడా బాగా నడుపుతాడు. మేము బయటకి పంపించి ఏదైనా తీసుకు రమ్మంటే తీసుకు వస్తాడు. కానీ తనంతట తానే నిర్ణయాలు తీసుకోలేడు. అతను సినిమా లేదా టీవీలో హీరోయిన్ ను చూసినప్పుడు, లేదా బయట ఆడవాళ్లను చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్ అవుతున్నాడు. మాకు ఆ విషయం అర్థమవుతోంది. ఇప్పుడు మేము అతనికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. పెళ్లి వల్ల అతని తెలివితేటలు పెరుగుతాయని మా చుట్టాలందరూ అంటున్నారు. పెళ్లి చేస్తే నిజంగా మా అబ్బాయి బాగుపడతాడా? దయచేసి మాకు సరైన సలహా ఇవ్వగలరు.– రామకృష్ణారావు, రాయచూరుమీ అబ్బాయి విషయంలో మీరు పడుతున్న తాపత్రయం అర్థమవుతోంది. మేనరికం వల్ల కలిగే జన్యుపరమైన ప్రభావాల వల్ల కొందరిలో శారీరక ఎదుగుదల బాగున్నా, మెదడు పరిణతి ఆశించిన స్థాయిలో ఉండదు. దీనినే ‘మేధోపరమైన వైకల్యం’ అంటాము. మీరు గమనించినట్లు చదువులో వెనుకబడటం, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కేవలం నిర్లక్ష్యం వల్ల వచ్చేవి కావు, అవి అతని మెదడు గ్రహణశక్తి పరిమితులను సూచిస్తాయి. మన సమాజంలో ‘పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది, తెలివి తేటలుపెరుగుతాయి’ అనే ఒక బలమైన అపోహ ఉంది. కానీ శాస్త్రీయంగా పెళ్లి వల్ల మేధోశక్తి పెరగదు, పైగా కొత్తగా వచ్చే సామాజిక వైవాహిక బాధ్యతలు అతనిపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. వైవాహిక జీవితంలో కేవలం శారీరక ఆకర్షణే కాకుండా, ఎదుటి వ్యక్తి భావాలను అర్థంచేసుకోవడం, ఆర్థికంగా కుటుంబాన్ని నడపడం, సమస్యలను పరిష్కరించుకోవడం వంటి ‘అడాప్టివ్ ఫంక్షనింగ్’ నైపుణ్యాలు చాలా కీలకం. కేవలం చూసేందుకు బాగున్నాడు కదా అని లేదా కోరికలు ఉన్నాయి కదా అని పెళ్లిచేయడం సరైన పరిష్కారం కాదు. ఇది ఇటు మీ అబ్బాయికి, ఇటు పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయికి కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందనేది పాత నానుడి. కానీ సరైన మానసిక పరిణితి లేని పెళ్లి కొత్త చిక్కులకు నాంది అనేది నేటి పరిస్థితి. మొదట స్థానికంగా ఉన్న మనోవైద్యుని సంప్రదించి అతనికి ఐక్యూ సోషల్ మెచ్యూరిటీ పరీక్షలు చేయించండి. అతని మానసిక వయసు ఎంతో తెలుసుకోవడం వల్ల, అతను ఒక సంసారాన్ని మోయగలడా లేదా అనేది స్పష్టమవుతుంది. ఆ నివేదికల ఆధారంగా నిపుణుల సలహాతో ముందడుగు వేయడం మీ అందరికీ శ్రేయస్కరం. అలాగే, పెళ్లి సంబంధం చూసేటప్పుడు అవతలి వారికి అన్నీ నిజాలు చె΄్పాలి. నిజం దాచి పెళ్లిచేస్తే, భవిష్యత్తులో రకరకాలైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరపడకండి. అన్ని వైపుల నుంచి ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోండి. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్,విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
వారం రోజుల్లో పెళ్లి.. బావిలో శవమై తేలిన యువతి
మరిపెడ రూరల్: ఆ ఇద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు.. కానీ విధి మరోలా తలచింది. రెండేళ్ల ప్రేమ, పెళ్లి కోసం చేసిన పోరాటం ఇవన్నీ కళ్లముందే ఉండగా, ఆ యువతి విగతజీవిగా మారింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి, అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఇటుకలగడ్డతండాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలివి. ప్రేమ యుద్ధం చేసి..: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య వెంకన్న, వినోద దంపతుల చిన్న కూతురు సంగీత (19), మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీర అరవింద్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను ఒప్పించే క్రమంలో సంగీత గతంలో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. చివరకు వారి ప్రేమను ఇరుకుటుంబాలు అంగీకరించి, ఈ నెల 29న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అరవింద్ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి సంగీత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సంగీత ఇటుకలగడ్డతండాలో ఒక్కతే ఉండగా అరవింద్ బైక్పై వచ్చి యువతిని తీసుకుని తండా శివారులోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మర్నాడు బుధవారం తండా శివారులోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం లభించింది. బావి సమీపంలో రక్తపు మరకలతో ఓ చెప్పులు కనిపించడంతో సంగీత మృతిపై పలు అనుమానాలకు తావిస్తోంది. కాబోయే భర్తే తమ కూతురిని అన్యాయంగా హత్య చేసి బావిలో పడేశాడని మృతురాలి తల్లిదండ్రులు వెంకన్న, వినోద ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావడంలేదు!
కడప అర్బన్: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. -
పెళ్లి విందులో మ్యాంగో జ్యూస్? 400మందికి అస్వస్థత
గుజరాత్లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక దుమారాన్ని రాజేసింది.పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 400 మందికి పైగా అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 400 మందికి పైగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. వీరిలో 60 మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) స్పందించింది.దాహోద్ జిల్లాలోని అభ్లోద్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి విందు భోజనం చేసిన తర్వాత, రాత్రి 11 గంటల సమయంలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆందోళన మొదలైంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాహోద్ కలెక్టర్ యోగేష్ నిర్గుడే తెలిపిన వివరాల ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉంది. పెళ్లి విందులో వడ్డించిన మామిడి రసం (Mango Juice) తాగడం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతిFSSAI సీరియస్కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర ఆహార కమిషనర్ను ఆదేశించింది. విందులో వడ్డించిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఆహార నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర అధికారులకు సహాయం చేస్తోంది. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI స్పష్టం చేసింది. -
పెళ్లి పేరిట సహచర కానిస్టేబుల్ మోసం
బంజారాహిల్స్: సహచర కానిస్టేబుల్ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పంజగుట్ట పోలీస్స్టేషన్లోనే సహచర కానిస్టేబుల్ కప్షా స్వప్నిల్(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్లోని తన గదిలో స్వప్నిల్తో గొడవ పడింది. పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరితో బ్రేకప్.. పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ..!
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమిళంతో పాటు తెలుగులో సినిమాలు చేసింది. చివరిసారిగా రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీలో కనిపించింది. ఇప్పటికైతే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. సినిమాలతో కాకపోయినా.. వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శృతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం.అయితే గతంలో బాయ్ఫ్రెండ్తో విడిపోయిన ముద్దుగుమ్మ.. సింగిల్గానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ గురించి కోలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. శృతి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన వాడితోనే మూడుముళ్లకు రెడీ అయినట్లు లేటేస్ట్ టాక్. వరుడిని కోసం ఆమె తండ్రి కమల్ హాసన్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూడగా.. అవీ వారికి నచ్చలేదని సమాచారం. వీలైనంత త్వరగా శృతి హాసన్కు మ్యారేజ్ చేయాలని కమల్ రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో లండన్కు చెందిన ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో శృతి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ బ్రేకప్ అయింది. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. -
స్టార్ హీరో కుమారుడితో పెళ్లి.. హీరోయిన్ మదర్ రియాక్షన్..!
కొత్త లోకా మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఈ కోలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. అంతేకాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించిన ముద్దుగుమ్మ.. 2022లో వచ్చిన 'హృదయం' చిత్రంలో నటించింది. ఈ మూవీలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు భార్యా, భర్తలుగా మెప్పించారు. తెరపై వీరద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మదర్ లిస్సీ ప్రియదర్శన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్కు హీరోయిన్ కల్యాణి మదర్ లిస్సీ ప్రియదర్శన్ రిప్లై ఇచ్చింది. కళ్యాణి, ప్రణవ్ పెళ్లి కోసం వెయిటింగ్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. అది తప్పుడు వార్త అంటూ లిస్సీ రూమర్స్కు చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్, డేటింగ్ లాంటి రిలేషన్స్ లేవని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కళ్యాణి ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో లేదని లిస్సీ తేల్చి చెప్పంది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వీరిద్దరి వెడ్డింగ్ రూమర్స్కు తెరపడింది. -
ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు, 40ఏళ్ల వితంతువు చేసిన పని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సోషల్మీడియా పరిచయం పెళ్లికి దారి తీసింది. మరి వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? నెటిజన్లు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఉదంతం గురించి తెలుసుకుందాంఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. 'రీల్స్' చాటింగ్ ద్వారా వీరి పరచయం కాస్తా ప్రణయంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇరు కుటుంబ సహ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా, గుడిలో పెళ్లి చేసుకున్నారు.కలిసి జీవితం మొదలుపెట్టారు. చివరికి ఈ విషయం అబ్బాయి తల్లికి తెలిసింది. ఆగ్రాలోని మహిళ ఇంట్లో ఇద్దరినీ గుర్తించారు. కానీ కుటుంబ సభ్యులు ఈ యువకుడిని ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనిపై నెటిజనులలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇది నిజమైన ప్రేమా లేక కేవలం తాత్కాలిక ఆకర్షణా? 19 ఏళ్ల వయసు వ్యత్యాసం, రహస్య వివాహం ఎంతవరకు నిలబడుతుంది అని కొందరు ప్రశ్నించగా, కుటుంబ మద్దతు లేకుండా ఇంత పెద్ద అడుగు వేయడం కష్టమే, అని ఒకరు వర్చువల్ చాటింగ్, రీల్స్ను చూసి నిజజీవితంలో నిజమని నమ్మితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని కొందరు వ్యాఖ్యానించారు. ఇన్స్టాలో పరిచయం అయిన ఒక మహిళ కోసం తన కుటుంబాన్ని, ఇంటిని త్యాగం చేశాడు. సోషల్ మీడియాలో కలిసిన ఒక అపరిచితుడి కోసం ఏ అబ్బాయి లేదా అమ్మాయైనా తమ తల్లిదండ్రులను, విలువలను పణంగా పెట్టడం పచ్చి అవివేకం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత దూరమైనా వెళతాయి అనేందుకు ఈ ఘటనే నిదర్శనం అని మరికొందరు వ్యాఖ్యానించారు ఇద్దరూ చట్టపరంగా వయోజనులే, కాబట్టి వారి వివాహం చట్టబద్ధమే. ఎలాంటి కష్టనష్టాలొచ్చినా వారే భరిస్తారు. కానీ వీరి సంబంధం కలకాలం నిలబడాలంటే అధిక భావోద్వేగ పరిపక్వత, బలమైన విశ్వాసం అవసరమని నిపుణులు చెబుతున్న మాట.ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే! -
పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే
ఒకప్పుడు ఒక ఇంటికి పిల్లను పంపించాలంటే అత్తగారు ఎలా ఉంటారో.. ఎలాంటి వారో అని తల్లిదండ్రులు అనుకునేవారు. అనేక మందిని విచారించి గాని పెళ్లి చేసేవారు కాదు. అత్త గయ్యాలి అయితే ఆ ఇంటిలోని మగ పిల్లలకు అస్సలు పెళ్లిళ్లు అయ్యేవి కావు. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మాట్లాడినా, మాట్లాడకున్నా తప్పు పట్టేవారు. దీన్ని ఆధారంగా తీసుకునే సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో అత్త అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. కాలం మారింది. కోడళ్లపై అత్తల పెత్తనం తగ్గింది. అత్తలు కోడళ్ల మాట విని మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అత్తామామలతో కలిసి ఉండలేమని, పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని యువతులు పెళ్లి చూపుల్లోనే తెగేసి చెబుతున్నారు. పలమనేరు : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తామామలు, అన్నదమ్ములు, కోడళ్లు, తోడి కోడళ్లు, ఆడ పడుచులు వారి మధ్య జరిగే గొడవ లు, ప్రేమాభిమానాలు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కనిపించేవి. ఈ నేపథ్యంలో అత్త ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచో ఉంది. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో సైతం ఉమ్మడి కుటుంబాలు వెతికినా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం వరకు గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడోగాని ఒకటి రెండు కూడా లేవు. వేరు కాపురాలు సర్వసాధరణంగా మారాయి. వారి వారి కుటుంబమే ముఖ్యమనే స్వార్థం పెరిగింది.పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే పెళ్లి కాగానే కొత్త కాపురం పెట్టడం నేడు ట్రెండ్గా మారింది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుడడం, లేదా భర్త ఉద్యోగం చేసే చోటుకు భార్య వెళ్లి వస్తుండడంతో వేరు కాపురాలు తప్పడంలేదు. కొందరు అమ్మాయిలు పెళ్లి అయినా అత్తామామలతో కలిసి ఉండబోమని, పెళ్లి అయ్యాక తమ ఇంటికి అత్తమామలు పెద్దగా రాకూడదంటూ ముందే చెబుతున్నారు. కాదు కూడదంటే పెళ్లి వయసు దాటుతుందనే భయంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువతులు తమ పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్లోనే అనేక షరతులు పెడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత అత్తామామలు ఉండకూడదని, తప్పనిసరిగా వేరుకాపురం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేరు కాపురాలు పెట్టాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు పడిన సందర్భాల్లో కనీసం వీరికి నచ్చజెప్పే పెద్దలు లేక కొందరి జీవితాలు తెగతెంపులకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే పెద్దలు, నాటి బంధాలు, బాంధవ్యాలకు నేటి తరం యూత్ దూరం చేసుకుంటోందనే మాట పెద్దతరం వారిలో వినిపిస్తోంది. -
కోటిన్నర కట్నం కోసం మధు మాస్టర్ ప్లాన్!
నల్గొండ జిల్లా : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
వధూవరులకు ‘దేవతాశీర్వాదం’
ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుకలో అరుదైన దృశ్యం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. సాధారణంగా జరిగే పెళ్లి వేడుకలకంటే భిన్నంగా, ఈ పెళ్లిలో దేవతలే దివి నుంచి దిగివచ్చినట్లుగా అనిపించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ పెళ్లిలో, పెళ్లి కూతురి బంధువులు శివపార్వతులు, మహావిష్ణుమూర్తుల వేషధారణలో వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వినూత్న ఆశీర్వాద కార్యక్రమం పెళ్లి వేడుకకు మరింత శోభను తీసుకొచి్చంది. పెళ్లికి వచి్చనవారు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. -
‘కుంభమేళా మోనాలిసా’ పెళ్లి.. చిక్కుల్లో సీపీఎం నేతలు
తిరువనంతపురం: ఆమధ్య కేరళలో జరిగిన ‘కుంభమేళా మోనాలిసా’ వివాహం తాజాగా సిపీఎం నేతలను చిక్కుల్లోకి నెట్టేసింది. నిన్నటి వరకు ఇది ‘రియల్ కేరళ స్టోరీ’ అంటూ మురిసిపోయిన సీపీఎం నేతలు ఇప్పుడు ఒక్కసారిగా మౌనం దాల్చారు. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటను అక్కున చేర్చుకుని, ఘనంగా ఆశీర్వదించిన కేరళ నేతలు.. ఆ వధువు మైనర్ అని తెలియడంతో కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘కుంభమేళా మోనాలిసా’ వివాహ ఉదంతం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ వివాహంపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో ‘కుంభమేళా మోనాలిసా’గా గుర్తింపు పొందిన యువతి.. ఫర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని ఇటీవల కేరళలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి వధువు కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేరళలోని అధికార సీపీఎం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఈ జంటకు అండగా నిలిచారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ స్వయంగా ఈ వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘ఇది అసలైన కేరళ స్టోరీ. మానవత్వాన్ని చాటిచెప్పే భూమిగా కేరళ ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇటువంటి వివాహాలను ప్రోత్సహించడం, ఆశీర్వదించడం సమాజ బాధ్యత అని కూడా ఆయన అన్నారు. మంత్రి వి శివన్ కుట్టి, ఎంపీ ఏ.ఏ. రహీమ్ తదితర ముఖ్య నేతలు కూడా ఈ వేడుకలో పాల్గొని పూలమాలలతో కొత్త జంటను సత్కరించారు.అయితే తాజాగా వధువు మైనర్ అని పేర్కొంటూ మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండటంతో, గతంలో ఘనంగా వేడుకల్లో పాల్గొన్న సీపీఎం నాయకులు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ‘పోక్సో’ చట్టం ప్రకారం మైనర్ల వివాహానికి సహకరించడం లేదా మద్దతు ఇవ్వడం నేరం. ఈ విధంగా చూస్తే పెళ్లికి సహకరించిన ప్రజాప్రతినిధులు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చని తెలుస్తోంది. వివాహ సమయంలో జంట సమర్పించిన పత్రాలను మాత్రమే పరిశీలించామని, ఆ పత్రాలు నకిలీవన్న విషయం తమకు తెలియదని ఆలయ అధికారులు, కొందరు నేతలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ సభలో దొంగల హల్చల్ -
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా?
ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది.సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలు పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజి్రస్టేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. యు.ఉపేంద్ర, జనన, మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి -
ఇంకో మార్గంలేకే ‘ఆత్మహత్య’
(హైదరాబాద్) గచ్చిబౌలి:‘‘పెళ్లి ఏర్పాట్లకు డబ్బు కోసం శక్తికి మించి ప్రయత్నించా. ఇంకో మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది’’ అని ఆత్మహత్యకు పాల్పడిన మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ‘‘23 మంది నుంచి తాను తీసుకున్న రూ.7.72 కోట్ల అప్పుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులు, కాబోయే భార్యకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోట్లోని వివరాల వెల్లడించారు. పెట్టుబడుల పేరిట చేసిన అప్పులను నా సోదరుడు మెట్ల సాయి పవన్కళ్యాణ్ తీర్చాలి. అయనకు పెట్టుబడి కోసం కొంత ఇచ్చాను కాబట్టి నన్ను మోసగాడిగా, అబద్ధాల కోరుగా మిగల్చకుండా అప్పులు తీర్చాలి. నేను ఎంతగానో ప్రేమించిన పెల్సియాకు అబద్దాలు చెప్పాను. క్యాన్సర్ వచ్చిందని తెలిసినా పెల్సియా నా వైపు నిలబడింది. వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయకపోయినా ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్లో తిరిగి ఇవ్వాల్సి ఉంది. అన్ని విధాల ప్రయత్నించినా విఫలమయ్యాను. నాకు క్యాన్సర్ వచ్చింది అబద్ధం కాదు, ఢిల్లీలో చికిత్స తీసుకుంటే నయమైంది. 2023లో మళ్లీ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో పెల్సియా(కాబోయే భార్య) నా వైపు నిలబడింది. ఆమె కారణంగా మూడు సంవత్సరాలు బతికాను. రెండు నెలలుగా పెళ్లిని నిలిపివేయడానికి ప్రయతి్నస్తున్నాను. డబ్బు ఇవ్వాల్సిన గడువు దగ్గర పడటం, పెళ్లికి ఖర్చులకు డబ్బు లేక పోవడంతో ఒత్తిడి భరించలేక నిర్ణయం తీసుకున్నాను. అందరూ నన్ను క్షమించండి’’ అని డెత్ స్టేట్ మెంట్లో పేర్కొన్నారు. ఆ మేసేజ్ను గచ్చిబౌలి పోలీసులు డెత్ స్టేట్మెంట్గా పరిగణిస్తున్నారు. మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులకు మృతదేహన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి తరలించారు. -
బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
-
పెళ్లి పీటలు ఎక్కనున్న అనుపమ?
-
అతన్ని పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కూడా కన్నాను : త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో త్రిష రిలేషన్తో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్కి హాజరవ్వడంతో.. ఈ పుకార్లు ఇంకా ఎక్కువైయ్యాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని..ఆమె సినిమాలకు గుడ్బై చెప్పి..రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ జరిగింది. దీనిపై త్రిష తనదైన శైలీలో స్పందించింది. చిత్రా లక్ష్మణ్ వాఖ్యలకు కౌంటర్గా ‘అవును నేను సినిమాలు మానేసి, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా?’ అని త్రిష ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్తో ఆమె సినిమాలు మానేసిందనేది పుకారు మాత్రమేనని తేలిపోయింది. త్రిష సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అమె ‘కరుప్పు’(తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్కు రెడీ అవుతుంది. దేవిధంగా మలయాళంలో మోహన్లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. -
‘ఐఐటీ బాబా’ మరో సెన్సేషన్ .. ‘ఎంత పని సేస్తివిరో..’
న్యూఢిల్లీ: లక్షల జీతం తెచ్చిపెట్టే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలివేసి, సన్యాసిగా మారి.. 2025 మహాకుంభ్ మేళాలో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన ‘ఐఐటీ బాబా’ గుర్తున్నారా? ఇప్పుడు ఆయన తన సన్యాస జీవితానికి స్వస్తి పలికి ఓ ఇంటివాడయ్యారు. ఐఐటీ బాంబేలో చదువుకున్న అభయ్ సింగ్.. ప్రీతిక అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ను వివాహం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని అఘంజర్ మహాదేవ్ ఆలయంలో శివరాత్రి పర్వదినాన వీరు ఒక్కటవ్వగా, ఫిబ్రవరి 19న కోర్టు మ్యారేజ్ జరిగింది. ఈ పెళ్లి వార్త కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తాజాగా అభయ్ సింగ్ తన భార్యతో కలిసి హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని తన సొంత గ్రామానికి చేరుకున్నారు. బ్యాంకులో కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో పాటు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడానికే ఇక్కడికి వచ్చినట్లు తనదైన కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయన మీడియాతో చెప్పాడు. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ (అభయ్ గ్రేవాల్).. ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ వైపు మళ్లి డిజైన్లో మాస్టర్స్ చేశారు. అనంతరం కెనడా వెళ్లి ఏటా రూ.36 లక్షల ప్యాకేజీతో మూడేళ్ల పాటు ఉద్యోగం చేశారు. కానీ అక్కడ తీవ్రమైన డిప్రెషన్కు గురికావడంతో.. జీవిత పరమార్థం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.కెరీర్ను వదిలేసి సన్యాసం స్వీకరించాడు. 2025 మహాకుంభ్ మేళాలో సన్యాసి దుస్తుల్లో ఉన్న అతను.. తాను ఐఐటీలో చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అప్పటినుంచి నెటిజన్లు ఆయనను ‘ఐఐటీ బాబా’ అని పిలవడం మొదలుపెట్టారు. గతంలో తన తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలు చూసి పెళ్లి వ్యవస్థపైనే తనకు నమ్మకం పోయిందని అభయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకో గర్ల్ఫ్రెండ్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోలేదని తెలిపారు. కుటుంబానికి దూరంగా సన్యాసిగా గడిపిన అతను ఇప్పుడు మనసు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం విశేషం. అభయ్ తాజా నిర్ణయంతో అతని తండ్రితో పాటు తల్లి షీలా దేవి కూడా ఎంతో సంతోషించారు. కొడుకు, కోడలిని ఇంటిలోనికి సాదరంగా స్వాగతించారు. ఇది కూడా చదవండి: ‘ఎప్పుడైనా పొమ్మంటారు’.. టెక్కీ కన్నీరు! -
పెళ్లి ఆగిపోయినా.. ఖర్చు మిగిలిపోదు!
భారతదేశంలో వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అదొక భారీ వేడుక. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే ఈ వేడుకలు, ఏదైనా అనుకోని కారణంతో ఆగిపోతే ఆ కుటుంబాలు ఆర్థికంగా కోలుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు ఇప్పుడు 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్' (Wedding Insurance)అందుబాటులోకి వచ్చింది.ఏమేమి కవర్ అవుతాయి?సాధారణంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రధానంగా నాలుగు అంశాల్లో రక్షణ కల్పిస్తాయి..క్యాన్సిలేషన్ లేదా వాయిదా: ప్రకృతి వైపరీత్యాలు (భారీ వర్షాలు, వరదలు), ఆకస్మిక అగ్నిప్రమాదాలు లేదా వధూవరుల కుటుంబాల్లో ఎవరైనా మరణించడం వంటి కారణాలతో పెళ్లి ఆగిపోతే, ఇప్పటికే చెల్లించిన అడ్వాన్స్లను బీమా కంపెనీ చెల్లిస్తుంది.ఆస్తి నష్టం: ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం జరిగి ఆస్తికి నష్టం వాటిల్లినా లేదా దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుంది.వ్యక్తిగత ప్రమాదాలు: వేడుక సమయంలో వధూవరులకు లేదా పాలసీలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులు భరిస్తుంది.పబ్లిక్ లయబిలిటీ: పెళ్లికి వచ్చిన అతిథులకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మూడవ పక్షానికి నష్టం జరిగితే ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.వధూవరుల్లో ఒకరు తప్పుకుంటే బీమా వస్తుందా?ఇది చాలా మందికి ఉండే సందేహం. ఒకవేళ వధూవరుల్లో ఎవరో ఒకరు పెళ్లి వద్దని వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? దీనికి సమాధానం 'లేదు'. వధూవరుల మధ్య గొడవలు రావడం, ఒకరు మరొకరిని ఇష్టం లేక వదిలేయడం (Cold Feet) వంటి కారణాలకు బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. అలాగే యుద్ధం, ఉగ్రవాద దాడులు లేదా వధూవరుల నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలకు కూడా బీమా వర్తించదు.ప్రీమియం ఎంత ఉంటుంది?వివాహ బడ్జెట్ను బట్టి ఈ పాలసీ ప్రీమియం నిర్ణయిస్తారు. సాధారణంగా పెళ్లి మొత్తం ఖర్చులో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ. 20 లక్షల బడ్జెట్తో పెళ్లి చేసుకుంటున్న వారు దాదాపు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మధ్య ప్రీమియం చెల్లించి సురక్షితం కావచ్చు.బీమా అందించే సంస్థలుభారతదేశంలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో (HDFC ERGO), ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard), బజాజ్ అలియంజ్ (Bajaj Allianz), ఫ్యూచర్ జనరాలి (Future Generali) వంటి సంస్థలు ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. పెళ్లి కార్డు ప్రింటింగ్ నుంచి క్యాటరింగ్, వెన్యూ బుకింగ్ వరకు అన్నిటికీ రసీదులు (Invoices) ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ సులభతరం అవుతుంది.లక్షల రూపాయల ఖర్చుతో కూడిన శుభకార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు, స్వల్ప ప్రీమియంతో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆర్థిక భద్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్.. -
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి
నిజామాబాద్ రూరల్: ఆ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు లేవని నిరూపించింది. శ్రీలంక అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన బొంత వెంకటేశ్ 2019లో దుబాయికి వెళ్లాడు. అక్కడ ఎల్టన్ ప్రాపర్టీ అనే కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీలంక దేశానికి చెందిన ఉమేక తారుషి వెంకటేశ్ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు తల్లితండ్రుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ ప్రేమ విషయాన్ని వెంకటేశ్ శ్రీలంకకు వెళ్లి తారుషి తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాడు. ఇటు వెంకటేశ్ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. దీంతో తారుషి, ఆమె తల్లితండ్రులు సేనాదిపతిగే నిలంతి పెరీరా, గలాని గమగె జనక ప్రియదర్శన సిల్వా లింగి తండాకు పది రోజుల క్రితం చేరుకున్నారు. శుక్రవారం ఇరు కుటుంబాల సంతోషాల మధ్య హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం వీరి వివాహానికి లింగి తండా వేదికగా మారనుంది. తమ ప్రేమ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెంకటేశ్ ‘సాక్షి’తో తెలిపారు. -
జస్ట్ తాళి కడుతుండగా షాకింగ్ న్యూస్, వరుడు మాత్రం !
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సరిగ్గా తాళి కట్టే సమయానికి కొన్ని నిమిషాల ముందు, వధువు పల్లవి అకస్మాత్తుగా పెళ్లిని ఆపేసింది. దీంతో పెళ్లి కొడుకుతోపాటు, అందరూ షాకయ్యారు. వధువు ఎందుకలా చేసింది? చివరికి ఏమైంది? ఇలాంటి మీ అనుమానాలకు, సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఈ కథనాన్ని చదివేయండి మరి.బంధువుమిత్రులు, బాజా భజంత్రీల మధ్య వరుడు వేణుగోపాల్ తాళి కట్టడానికి రెడీ అయ్యాడు. ఇంతలో సినిమా ఫక్కిలో నాకీ పెళ్లి ఇష్టం లేదంటూ భయపడుతూనే ధైర్యం చేసి మెల్లగా చెప్పింది వధువు పల్లవి. దీంతో అందరూ ఒకింత దిగ్భ్రాంతికి, మరింత గందర గోళానికి గురయ్యారు.అసలు ఏం జరిగింది? అపుడు అసలు విషయం తాపీగా చెప్పింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని, అయితే ప్రేమించిన వ్యక్తి వేరే కులానికి చెందినవాడని, అందుకే ఈ విషయాన్ని ముందుగా తన కుటుంబానికి చెప్పలేకపోయానని కళ్ళనీళ్లతో చెప్పింది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, వరుడికి, ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె తన మనసు మార్చుకోలేదు.వరుడు ఏం చేశాడు?అయితే వరుడి స్పందన మరింత విశేషంగా నిలిచింది. వధువు మానసకి పరిస్థితిని అర్థం చేసుకున్న వరుణ వేణుగోపాల్ ఆమె పట్ల సానుకూలంగా స్పందించాడు. తాను ప్రేమించని వారిని పెళ్లి చేసుకోమని ఎవరినీ బలవంతం చేయనని స్పష్టం చేశాడు. ఈ స్టోరీని ఒక ఎక్స్యూజర్ వరుడికి హ్యాట్యాఫ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో నెటిజనులనుంచి కూడా సానుకూల స్పందన లభించింది. In Karnataka's Hassan district, minutes before the wedding started, the bride Pallavi suddenly stopped it.Everyone was shocked and confused. She told her family that she didn't want to marry the groom Venugopala because she loved someone else. She explained that the person she… pic.twitter.com/h3u9kn8ejS— Aparajite (@amshilparaghu) April 2, 2026నెటిజన్లు స్పందనఈ క్రెడిట్కు పల్లవికి కూడా దక్కుతుంది. ఎలాగైతేనేం ధైర్యం చేసి తన ప్రేమకోసం ధైర్యంగా నిలబడింది. అలాగే వరుడు కూడా ఎలాంటి డ్రామా క్రియేట్ చేయకుండా పరిస్థితిని అర్థం చేసుక్నాడని ఒకరు, వావ్, ఇద్దరికీ అభినందనలు! తన ప్రేమ కోసం నిలబడిన పల్లవికి, పరిస్థితిని అర్థం చేసుకున్న వేణుగోపాలకు. ఇదే నిజమైన పరిణితి, గౌరవం అంటూ ఒకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఇంతదాగా ఎందుకు లాగాలని కొందరంటే.. ఒకే బెటర్ నెవర్ దేన్ లేట్, అబ్బాయ్ సేఫ్.. బతికిపోయాడు బిడ్డ ఇలాంటి ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తడం గమనార్హం. Pelli koduku frds : mavodu safe pic.twitter.com/l9fO731r4R— Charan (@charan14in) April 3, 2026 -
లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని (Marriages are made in heaven) చాలామంది విశ్వసించే మాట. ‘ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉన్నారో’ అని పెద్దలు కూడా తరచుగా అంటుంటారు. బిహార్లో ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే ఔరా, విధి రాత అని అనుకోకమానరు. విషయం పూర్తిగా తెలియాలంటే సినిమా లెవల్లో మలుపులు తీరిగిన ఈ కథనం చదవాల్సిందే.ఊహించని విధంగా, నిశ్చయించిన వరుడితో కాకుండా వేరొకరితో ఏడు అడుగులు వేసిందో వధువు. బిహార్లోని సిగోయిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోరారాచక్లో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఒకవైపు బంధుమిత్రులు ఆనంద సందోహాలు, మరోవైపు బాజా భజంత్రీల మధ్య పెళ్లి మండపంలో అంతా సందడిగా ఉంది. పెళ్లి పీటల మీద వరుడు కూర్చుని ఉండగా, వధువు మండపం వైపు వస్తోంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే పెళ్లి కొడుకుని పోలీసులు తీసుకెళ్లపోయారు. గెస్ట్లంతా గందరగోళంతో చూస్తుండగా, ఎన్నో ఆశలతో పెళ్లి మండపం అడుగుల వేస్తున్న వధువు నిశ్చేష్టురాలైపోయింది. గ్రామ పెద్ద జోక్యంతో వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనినిర్ణయించారు. దీంతో సినీ ఫక్కీలో వారిద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. పోలీసులు ఎందుకొచ్చారంటే..సియారాంపూర్కు చెందిన సంజయ్ యాదవ్ కుమారుడు, వరుడు అనిల్ కుమార్, మోరారాచక్కు చెందిన భీమ్ యాదవ్ (పంకజ్ ) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఉన్నట్టుండి ఈ పెళ్లి గురించి తెలిసిన అనిల్ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. తాను మొదటి భార్యనని, తనకు న్యాయం కావాలంటూ సిగోయిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా చూపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.దీంతో పెళ్లికొడుకుకు అప్పటికే రూబీ అనే మహిళతో వివాహం జరిగిందని గ్రామ పెద్ద అశోక్ యాదవ్కు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయాన్ని అమ్మాయి తండ్రికి తెలియజేయడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త గ్రామం అంతటా వేగంగా వ్యాపించింది. పోలీసులతో పాటు ఆ అమ్మాయి గ్రామానికి తిరిగి వచ్చి, అనిల్తో తన వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించింది. దీంతో గ్రామ పెద్ద ఇరు పక్షాల సుదీర్ఘ చర్చల అనంతరం, వధువు వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ ఉదయమే, ఇరు కుటుంబాల సమక్షంలో ఆ వివాహం జరిపించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తదనంతరం, అనిల్ రూబీ విషయాన్ని అంగీకరించి, ఆమెతో కలిసి జీవిస్తూ, ఆమెను సంరక్షిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో పోలీసులు అతన్ని విడుదల చేశారు. అలా కథ సుఖాంతం అయింది. -
బంధువుల పెళ్లిలో విరోష్ జోడీ.. భర్త ఒడిలో కూర్చున్న రష్మిక
విరోష్ జంట ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. విజయ్- రష్మికతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. తమ బంధువుల పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో విజయ్ తల్లి కూడా ఉన్నారు. ఇక రష్మిక.. విజయ్ ఒడిలో కూర్చుంది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా వివాహ వేడుకలో కనిపించారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. విజయ్- రష్మిక పెళ్లి వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవలే పెళ్లై నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ రష్మిక తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ టాలీవుడ్ కపుల్ రణబలి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) -
ప్రియురాలిని పెళ్లాడిన బిగ్బాస్ కంటెస్టెంట్
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో విరోష్ జంటతో అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు. మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్బాస్ కంటెస్టెంట్ రజత్ దలాల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలిని ఆయన పెళ్లాడారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా పేరు తెచ్చుకున్న రజత్ దలాల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.రజత్ దలాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు..పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. బిగ్బాస్-18 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ది 50 అనే రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఆమెకు 35, అతనికి 25 .. భర్తను వదిలేసి!
ఏలూరు జిల్లా: సోషల్ మీడియా ద్వారా ఓ వివాహితకు, యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. చివరికి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఉంగుటూరు మండలం యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) చేపల ప్యాకింగ్కు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రి రమ (35) అనే వివాహితతో మావుళ్లుకు ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే అప్పటికే ఆమెకు వివాహం కాగా ఇటీవల మావుళ్లు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమ తరుఫు బందువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. అప్పటి నుంచి మావుళ్లు తాడేపల్లిగూడెం మండల కడియద్దలోని తన చెల్లెలు ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తిరిగి రెండు రోజుల క్రితం రమ శ్రీకాకుళం నుంచి మావుళ్లు దగ్గరకు వచ్చేసింది. ఈ సమాజం వారిని బతకనీయదు అనుకున్నారో ఏమో ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి నాచుగుంట రేవు వద్దకు చేరారు. మావుళ్లు తన తమ్ముడు కి ఫోను చేసి విషయం చెప్పి నాచుగుంట వంతెన మీదనుంచి ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మావుళ్లు తమ్ముడు వచ్చేసరికి వంతెన వద్ద సెల్ఫోను, ఇతర సామాన్లు కనిపించడంతో పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది, చేబ్రోలు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్సై సూర్యభగవాన్, తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్, ఇతర అధికారులు గాలింపు చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి 10,30 గంటలకు మావుళ్ల మృతదేహం ఉంగుటూరు టోలు ప్లాజా సమీపంలో లభ్యమైంది. అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్టీఆర్ఎఫ్ బృందాలు గాలించగా రమ మృతదేహం చేబ్రోలు పోలీస్టేషన్ సమీపంలో గోదావరి కాలువలో గురువారం మధ్యాహ్నం 2 30 గంటలకు లభ్యమైంది. ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో మావుళ్లు మృతదేహనికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
'అప్పుడే నెల.. మీరు లేకుంటే నా పెళ్లి ఇలా జరిగేది కాదు'.. రష్మిక పోస్ట్
విజయ్- రష్మిక పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావడంతో ప్రత్యేక పోస్ట్ చేశారు. పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విజయ్ దేవరకొండతో పాటు రష్మిక సైతం పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అప్పుడే నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ..' అప్పుడే ఒక నెల గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. పెళ్లి చేసుకోవడం అనేది ఎంతో దూరపు కలలా అనిపించేది.. కానీ ఇప్పుడు మా పెళ్లి జరిగి నెల రోజులు పూర్తయ్యాయి. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అయితే పెళ్లి చేసుకోవాలని అనుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో మహిళలే నాకు అండగా నిలిచి, నా రక్షకుల్లా వ్యవహరించారు. నేను మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా. ఇది శాశ్వతంగా నిలిచిపోయే ప్రేమ. మీరందరూ లేకుంటే ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదు' తన వారిపై ప్రశంసలు కురిపించింది.ఐశర్య, మాగంటి ప్రియ, అర్పిత పేర్లను రష్మిక ప్రస్తావించింది. వారి గురించి తన అనుభవాలను పంచుకుంది. ఇవి మీ రోజులు.. అన్నీ మర్చిపోండి, హాయిగా ఉండండి.. అంటూ చెప్పిన మీ అందరికీ నా ధన్యవాదాలు.. మేము కూడా అలానే చేశామని రష్మిక తెలిపింది. మీరందరూ లేకుండా ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదని రాసుకొచ్చింది. నా జీవితంలో నన్ను ప్రశాంతంగా, నిలకడగా ఉండేలా చేసిన అందమైన మహిళలకు నా అభినందనలు.. ఇదే నా చిన్న ప్రపంచం అంటూ ఎమోషనలైంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
పెళ్లి తర్వాత తొలి వేకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్..!
టాలీవుడ్ జంట విజయ్-రష్మిక ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.తాజాగా పెళ్లి తర్వాత విరోష్ జంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధంచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరలవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ థాయ్లాండ్ ట్రిప్లో తామిద్దరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని రష్మిక తెలిపారు. ఈ మేరకు ఎయిర్బిఎన్బి (Airbnb) భాగస్వామ్యంతో రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. ‘ప్రశాంతమైన ఉదయం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పూల్ ఆటలతో ఇక్కడి కో సముయ్లోని ప్రాంతం మా సొంత ఇల్లులా అనిపించిందని తెలిపింది. ఆ రోజుల్లో మేము గడిపిన కొన్ని క్షణాలు’ అంటూ వీడియోను పోస్ట్ చేసింది. అయితే వీరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎక్కడా తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు. ఎన్నిసార్లు రూమర్స్ వినిపించినా వాటిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్గా హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలాసార్లు వీరిద్దరు ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చివరికీ పెళ్లి కొద్ది రోజుల ముందు మాత్రమే సోషల్ మీడియాలో అఫీషియల్గా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
సీక్రెట్గా సింగర్ని పెళ్లి చేసుకున్న నటి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై అటు బాద్షా కానీ, ఇటు ఇషా కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.ఆరేళ్ల క్రితమే విడాకులు.. ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్లో పలు బ్లాక్బస్టర్ సినిమాల్లో పాటలు పాడి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పీక్స్లో ఉండగానే.. జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ జంటకి ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈషాతో డేటింగ్.. విడాకుల తర్వాత పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్షా ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది. గతకొంత కాలంగా ఇద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.పెళ్లి ఫోటోలు వైరల్.. తాజాగా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్ బ్లెస్ యూ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) -
విజయ్-రష్మిక పెళ్లి.. గబ్బర్ సింగ్ టీమ్ ఆవేదన..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు, కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలు, స్వీట్స్ పంపిణీ చేసింది విరోష్ జంట.అయితే ఇటీవల ఓ చిన్నారి అభిమాని పెళ్లికి పిలవలేదని అలిగింది. నేను మీ ఫ్యాన్నే నన్ను ఎందుకు పిలవలేదు? ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవలే ఆ చిట్టి అభిమానిని ఇంటికి పిలిచి లంచ్ ఏర్పాటు చేశారు. ఆ చిన్నారికి ఇష్టమైన స్వీట్స్ కూడా వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే అలాగే తాజాగా తమను పెళ్లికి పిలవలేదని మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం వాళ్లు చిట్టి అభిమానులు మాత్రం కాదండోయ్. గబ్బర్ సింగ్ చిత్రంలో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ గ్యాంగ్. వీరంతా విజయ్ దేవరకొండకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ తెలిపారు. మేము కూడా ఆర్టిస్తులమే కదా అన్నా.. మమ్మల్ని ఎందుకు పెళ్లి పిలవలేదు అన్న అంటూ వీడియోలో వేడుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Mammalni kuda Bhojananiki intiki pilvandi ani aduguthunna Gabbarsingh Villan Team🔥@TheDeverakonda @iamRashmika #Virosh pic.twitter.com/2YQUdeovLp— THE RWDY🗿X (@TheDEVERA_fan) March 23, 2026 -
ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు?, 34 ఏళ్ల నటి షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోమనే చెబుతున్నారు. మరికొంతమంది అయితే తనకు నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటా..లేదంటే సింగిల్గానే ఉంటామని అంటున్నారు. తాజాగా కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా అదే కామెంట్ చేసింది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదని, తోడు కావాలనుకుంటే సహజీవనం బెటర్ అని చెబుతోంది ఈ 34 ఏళ్ల సుందరి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘గత 30 ఏళ్ల నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలను ఎన్నో చూశా. వారిలో సంతోషంగా జీవితం గడుపుతున్నవారు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామి కెరియర్లో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింపజేశాయి. ఒకప్పుడు అందరి అమ్మాయిల్లాగానే నేను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా ఫ్రొఫైల్ని మ్యాట్రిమోనీ వెబ్సైట్లోనూ పెట్టాను. అయితే నా ఫోటో చూసి ఫేక్ ప్రొఫెల్ అనుకున్నారు. అదే సమయంలో నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయింది.నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే భాగస్వామి కావాలి. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్ అవసరం లేదు. ఇద్ధరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే.. సహజీవనం చేయడం బెటర్. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్ విషయానికొస్తే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్ని ప్రారంభించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్ తేజ్కి జోడీగా నటిస్తోంది. -
త్వరలోనే విజయ్తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!
టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం.. ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు. అప్పటి నుంచి విజయ్, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.అలా హింట్ ఇచ్చిందా?త్రిష,విజయ్ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా విజయ్ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దీంతో విజయ్తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ..ఆమె లైక్ కొట్టిన పోస్ట్ని వైరల్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత పెళ్లివిజయ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. -
విజయ్- త్రిష ఎపిసోడ్పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
పెళ్లి పీటలెక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?
అరుంధతి మూవీతో జేజమ్మగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న బ్యూటీ అనుష్క శెట్టి. ఆ తర్వాత బాహుబలి మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ప్రభాస్ సరసన నటించిన ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే అప్పుడప్పుడు వీరిద్దరిపై పెళ్లి రూమర్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ బోలెడు కథనాలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్గానే మిగిలిపోయాయి.తాజాగా ఈ స్వీటీ అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఓ బిజినెస్మెన్ను పెళ్లాడనుందని సమాచారం. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్న అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అబ్బాయి కన్నడ కుటుంబానికి చెందినవారని.. వీరిద్దరి వివాహ నిశ్చయానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో అనుష్క పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది ఘాటీ మూవీతో అభిమానులను మెప్పించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే భారీ బడ్జెట్ సినిమాలో అనుష్క నటిస్తున్నారు. -
మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు
శివాజీనగర(బెంగళూరు): ఓ మహిళ (66) తన భర్త (77) అక్రమంగా రెండవ పెళ్లి చేసుకున్నాడని దాఖలు చేసిన కేసును హెకోర్టు కొట్టివేసింది. భర్త పర స్త్రీతో సంబంధం కలిగి ఉండడం వివాహానికి సమానం కాదు, కాబట్టి కేసు చెల్లదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి నటరాజ్ కేసును విచారించారు. వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కేసు వర్తిస్తుందన్నారు. తన భర్త మరో మహిళ (51)ను వివాహం చేసుకొన్నారు, ఆయన కుమారులు మద్దతుగా నిలిచారు అని మహిళ ఆరోపించారు. ఆ తరువాత మహిళ భర్త, కుమారులు, ఆ మహిళ కేసును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. చివరకు కేసు వీగిపోయింది. -
బిజినెస్ మెన్ ను పెళ్లాడబోతున్న అరుంధతి..!
-
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోలో ఇలా పేర్కొంది..తాను కలిసి జీవించిన గౌతమ్ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్తో జీవించిన కాలంలో తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది. అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది."నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు." అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది."Don't get married to anyone, but don't keep any girl in deception either"The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!Constable is arrested and send to Jail.99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026 ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్ జె.వి. గౌతమ్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్స్టోరీ గురించి వివరించాడు.అత్తయ్యకు దొరికిపోయాం..మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.నయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు ఇష్టంనయనిక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్ చెప్పుకొచ్చాడు. -
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మహా కుంభమేళా 2025లో పూసల దండలు అమ్ముకుంటూ ఫ్యామస్ అయిన మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle) మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రియుడు నటుడు ఫర్మాన్ ఖాన్ పెళ్లాడి ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈ పెళ్లి 'లవ్ జిహాద్' నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీనిపై ఈ జంట వివరణ ఇచ్చారు. గురువారం (మార్చి 12, 2026) తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పెళ్లిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.తాము తమ మతాలు మార్చుకోలేదని మోనాలీసా స్పష్టం చేసింది. తాను హిందువుగా, తన భర్త ముస్లింగానే కొనసాగుతామని మోనాలీసా వివరించింది. అలాగే 'లవ్ జిహాద్' ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చింది. ఈ వివాహం తన సొంత నిర్ణయమని తేల్చి చెప్పింది. తన తండ్రి తనతో పాటు కేరళకు వచ్చినప్పటికీ, ఈ పెళ్లి పట్ల ఆయన ఇంకా అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయనను ఒప్పించు కోగలననే ధీమా వ్యక్తం చేసింది. తన అత్త కొడుకుతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని, కానీ తనకు ఇష్టం లేక ఫర్మాన్ ఖాన్ను ఎంచుకున్నానని ఆమె చెప్పారు.తల్లి దండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన తమ మతాంతర వివాహానికి సంబంధించి విమర్శలపై స్పష్టత ఇస్తూ "ప్రేమలో మత మార్పిడి అవసరం లేదు" అని ఫర్మాన్ ఖాన్ ( Farman Khan)పేర్కొన్నాడు.. అలాగే మోనాలీసా మైనర్ అంటూ వస్తున్న వార్తలను ఫర్మాన్ ఖాన్ ఖండించారు. ఆమె ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను మీడియాకు చూపించారు. మోనాలిసా కోరుకున్న విధంగా ఆచారాలను అనుసరించడానికి తాను అంగీకరించాననీ, ఎందుకంటే ఆమె ఆనందాన్నే తన ఆనందమని చెప్పు కొచ్చాడు. ఈ సందర్భంగా తమకు కేరళ ప్రజల మద్దతు లభించడం సంతోషమని,మోనాలీసాకు ఇష్టమైతే అక్కడే స్థిరపడతా మన్నాడు.ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాకు చెందిన ఖాన్, ఇండోర్ నివాసి మోనాలీసా వివాహం కేరళలోని ఒక ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కేరళ ప్రభుత్వానికి చెందిన K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా నమోదైంది. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇందులో ఫర్మాన్ ఖాన్ విలన్గా, మోనాలీసా హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. -
ఘనంగా భట్టి తనయుని వివాహం
సాక్షి, హైదరాబాద్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య–సాక్షిల వివాహం శంషాబాద్ జీఎంఆర్ ఏరీనాలో గురువారం ఘనంగా జరిగింది, వధూవరులను ఆశీర్వదించడానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, సినీ తారలు వచ్చారు. వారందరినీ డిప్యూటీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుకకు హాజరైనవారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ సంతోశ్కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖుల్లో చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు. -
ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటి వాడయ్యాడు. 26 ఏళ్ల అర్జున్ వివాహం గురువారం సానియా చందోక్తో ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన దేశంలోని ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబం, భారత మాజీ క్రికెటర్లు ధోని, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, కైఫ్, జహీర్ ఖాన్, ఐసీసీ చైర్మన్ జై షా, సినీ తారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులంతా అతిథులుగా పెళ్లిలో పాల్గొన్నారు. ఆల్రౌండర్ అర్జున్ దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 77 మ్యాచ్లు ఆడాడు. -
విజయ్ దేవరకొండ & రష్మిక మందన్న రిసెప్షన్ విజువల్స్
-
జ్యోతిషుడు చెప్పిందే నిజమైంది: నటి అమలా పాల్
-
అభిమానులకు విజయ్- రష్మిక ప్రత్యేక విందు.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక తమ గ్రాండ్ వెడ్డింగ్ అభిమానులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవల సొంతూరుకి వెళ్లిన కొత్త జంట సత్యనారాయణవ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. తమ సొంతవారితో ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని నూతన దంపతులు తెలిపారు.తాజాగా విజయ్- రష్మిక అభిమానుల కోసం ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు. వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం వీరిద్దరు వారితో పాటే కలిసి భోజనం చేశారు. విజయ్కి రష్మిక భోజనం తినిపిస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈనెల 4న హైదరాబాద్లో వీరి గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. The Newlyweds #VijayDeverakonda and #RashmikaMandanna had lunch with fans.#VIROSH pic.twitter.com/VkRnVkgood— Gulte (@GulteOfficial) March 3, 2026 -
ఒకే వేదికపై ఇద్దరితో వివాహం వైరల్ అయిన థాయ్ పెళ్లి
-
ఒక భార్య... ఇద్దరు భర్తలు
బ్యాంకాక్: థాయ్లాండ్కు చెందిన 37 ఏళ్ల మహిళ దువాంగ్దువాన్ కెట్సారో వివాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కనుల పండువగా జరిగినందుకో లేక అట్టహాసంగా జరిగినందుకో కాదు..పెళ్లి జరిగిన తీరు విచిత్రంగా ఉండటమే అందుకు కారణం. కెట్సారో ఇటీవల జరిగిన వేడుకలో ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మనువాడింది. వీరిద్దరితో ఏళ్లుగా కొనసాగిస్తున్న బంధం నిజాయతీ, పరస్పర అంగీకారమే మూలమని ఆమె అంటోంది. గాయని, పాటల రచయిత అయిన కెట్సారో మొదటగా ఆస్ట్రియా వాసి రోమన్తో స్నేహం చేసింది. రిటైర్డు పోలీసు అధికారి అయిన రోమన్తో కలిసి పట్టాయా నగరంలో ఐదేళ్లపాటు కలిసి సహజీనం సాగించింది. ఆ సమయంలో వారి బంధం బలపడింది. తర్వాత, ఆస్ట్రియాకే చెందిన పోలీసు అధికారి మ్యాకీతో పరిచయమేర్పడింది. ఇతడికి దగ్గరైంది. వీరి ముగ్గురి మధ్య బంధం క్రమంగా ఒక అసాధారణ భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. ముగ్గురూ కలిసి కూర్చుని భవిష్యత్తులో కలిసి ఎలా ఉండాలనే విషయం చర్చించుకుని, ఒక నిర్ణయం తీసుకున్నారు. కాగా, కెట్సారోకు మొదటి వివాహం ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు మనవలు ఉన్నారు. తల్లిదండ్రులు, కుమార్తెలతోపాటు ఇతర కుటుంబసభ్యులకు సైతం ఆస్ట్రియా వాసులతో కొనసాగుతున్న బంధాన్ని గురించి తెలిపింది. పాటలు రాయడం, పాటడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరక ఇబ్బందులు పడుతున్న సమయంలో రోమన్, మ్యాకీలు తనకెంతో బాసటగా నిలిచారని కెట్సారో అంటోంది. తన కుటుంబానికి కూడా సాయపడ్డారని తెలిపింది. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని చెప్పగా కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలిపారని, వారు తన పట్ల చూపే శ్రద్ధ, అంకితభావమే ఇందుకు కారణమని పేర్కొంది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ పెళ్లికి ఆస్ట్రియా వరులు చెరో లక్ష బహాట్లు, మన కరెన్సీలో సుమారు రూ.29 లక్షలను కెట్సారోకు సమర్పించుకున్నట్లు సమాచారం. సమాజంలో మారుతున్న వివాహ సంబంధాలకు వీరి పెళ్లి తాజా ఉదాహరణగా భావిస్తున్నారు. -
నూరేళ్లూ చల్లగా ఉండాలని..
రాయవరం: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్లంటే ఇలానే మాట్లాడే వారు. ఫలానా వారి తోటలో కొబ్బరాకులు, పూలంటూ పురమాయించేవారు. ఇంటి వద్దే చలువ పందిళ్లు, మండపాల ఏర్పాటుతో ఐదు రోజుల పాటు చేసే పెళ్లిని పది కాలాల పాటు చెప్పుకొనేవారు. మళ్లీ ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేస్తూనే.. హంగూ ఆర్భాటాలు, అంగరంగ వైభోగాలతో దక్షిణాది సంప్రదాయానికి ఉత్తరాది మెరుగులు అద్ది, ఖర్చుకు వెనుకాడకుండా జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఏసీ కల్యాణ మండపాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జాబితా తయారీలో వధూవరులు పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? ఏ మండపంలో చేయాలి.. మెనూ ఏంటనేది వధూవరులే ఓ పెద్ద జాబితా తయారు చేసుకుంటున్నారు. జీవితకాలం గుర్తుండి పోయేలా వివాహాన్ని చేసుకోవాలని ఆశించే వధూవరులు పెళ్లికి వచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యుల రాకను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఏసీ కల్యాణ మండపంలోనే చేసుకోవాలని భావిస్తున్నారు. వాటి అద్దె, లంచ్, డిన్నర్, అలంకరణకు కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చేస్తున్నారని రాయవరం గ్రామానికి కల్యాణ మండపం నిర్వాహకుడొకరు చెప్పారు. ముందుగానే బుకింగ్ వివాహం నిశ్చయమైన వెంటనే ముందుగా పెళ్లి ఎక్కడ చేయాలనే దానిపై అధికంగా చర్చించుకుంటున్నారు. ఆలయాల వద్ద కాకుంటే కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఇస్తూ.. వెంటనే మండపాల బుకింగ్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల ముందుగా మండపం బుక్ చేసుకోకుంటే దొరకని పరిస్థితి ఉంది. విదేశాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అద్దె రెట్టింపు ఇస్తామని ఫోన్లు చేసి అడుగుతున్నారని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. పల్లెల్లో సైతం.. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడంటూ వివాహ వేడుకలకు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో పల్లెల్లో సైతం కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు కొత్త భవనాలను నిర్మిస్తుంటే.. మరికొందరు పాత భవనాలను కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఏ చిన్న శుభ కార్యం చేయాలనుకున్నా.. సమావేశాలు నిర్వహించాలనుకున్నా.. ఏసీ కల్యాణ మండపాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వివాహ ఆహ్వన పత్రికల్లో సైతం ఏసీ కల్యాణ మండపం అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నారు. వచ్చిన బంధువులు, స్నేహితులు అధిక సమయం ఉండాలంటే ఏసీ కల్యాణ మండపాలే ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న కల్యాణ మండపాల్ని ఏసీ కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఆర్భాటానికే ప్రాధాన్యం ఓ కల్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమారుడికి ఇటీవల పెళ్లి జరిపించారు. సుమారు 10 రకాల స్వీట్లు, నాలుగైదు రకాల స్పెషల్ రైస్, ఆకుపై 20 రకాల కూరలు (పొడులు, పచ్చళ్లతో కలిపి) ఉండాలని చెప్పారు. 2 వేల మందికి ఆర్డర్ ఇచ్చారు. ప్లేటు రూ.500 అయ్యిందని కల్యాణ మండపం నిర్వాహకుడు చెప్పారు. ఒక్క భోజనాలకే ఖర్చు రూ.10 లక్షలు అయ్యిందని చెప్పుకొనే విధంగా చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద, చిన్న కలిపి 200 వరకూ కల్యాణ మండపాలున్నాయి. అతి పెద్ద ఏసీ మండపమైతే అద్దె రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటోంది. భోజనాలకు మెనూను బట్టి ఆకుపై వేసిన రకాలను బట్టి రూ.300 నుంచి 450 వరకూ పడుతుంది. ఇక కల్యాణ మండపంలో పచ్చిపూల మండపం ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల నుంచి నుంచి తీసుకొచ్చిన పూలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణకు మరో రూ.లక్షన్నర వరకూ పెడుతున్నారు. ఇవి కాకుండా బాజాభజంత్రీలకు ఖర్చులు అదనం. బడ్జెట్ అధికమైనా తప్పదు ఏ శుభకార్యమైనా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నాం. ఇటీవల మా మనమరాలి ఓణీ ఫంక్షన్ను ఏసీ కల్యాణ మండపంలోనే నిర్వహించాం. ఒకప్పటి పరిస్థితికి, నేటి పరిస్థితికి చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా శుభకార్యాలు చేయాల్సిందే. –ద్విభాష్యం విజయప్రభాకర్, విశ్రాంత ఉద్యోగి, రాజమహేంద్రవరం ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు ఏ కార్యక్రమమైనా ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థిక పరిస్థితిని వెరవకుండా ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నారు. నాన్ ఏసీ అయితే ఏసీ కా దా.. అంటూ వచ్చిన వారు పెదవి విరుస్తున్నారు. –కొప్పిశెట్టి శ్రీనివాస్, వ్యాపారి, రాజమహేంద్రవరం డిమాండ్ ఎక్కువగానే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్యాణ మండపాలకు డిమాండ్ అధికంగానే ఉంది. రైస్ మిల్లును కల్యాణ మండపంగా మార్చాం. ముహూర్తాల సమయంలో డిమాండ్ మరింత అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటున్నారు. –మూర్తినీడి వెంకటరాజు, కల్యాణ మండపం నిర్వాహకుడు, రాయవరం -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్కు ఇన్స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)


