breaking news
Marriage
-
పటాన్ చెరులో పరువు హత్య!
సాక్షి,హైదరాబాద్: ప్రేమ పేరుతో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి ఓ యువకుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన పటాన్ చెరులో వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.పటాన్ చెరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ అదే ప్రాంత బీబీఏ విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్కూల్ వయస్సు నుంచే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రేమ వ్యవహారం సదరు యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారి మధ్య ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పెళ్లి చేస్తామని నమ్మించి పోలీసుల ప్రకారం..యువతి కుటుంబ సభ్యులు ముందుగా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ‘మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఇదే విషయం గురించి మాట్లాడుకుంది. ఇంటికి రావాలని శ్రవణ్ని తమ ఇంటికి పిలిపించారు. పెళ్లి మాట నమ్మిన శ్రవణ్ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే యువతి కుటుంబ సభ్యులు శ్రవణ్పై దాడి దిగారు. క్రికెట్ బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో శ్రవణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.పోలీసుల దర్యాప్తు ప్రారంభంసమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రవణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరువు హత్య కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.స్థానికులు ఆగ్రహం ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడి ప్రాణం తీసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
ప్రముఖ బుల్లితెర భామ, బిగ్బాస్ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ డిసెంబర్ 5న జరిగింది.కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.రూపల్ త్యాగి కెరీర్..హమారీ బేటియూన్ కా వివాహ్ సీరియల్తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది. View this post on Instagram A post shared by Roopal Tyagi (@roopaltyagi06) -
శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి : బరాత్, వైభవంగా వేడుక
యూపీలోని బదౌన్కు చెందిన ఈ యువతి ఏకంగా శ్రీకృష్ణుడినే పెళ్లాడింది. శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే యువతి, సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడినే భర్తగా ప్రకటించుకుంది. గ్రామమంతా తరలివచ్చి ఈ పెళ్లి తంతును ఆసక్తిగా తిలకించడం విశేషం.ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల మహిళ హిందూ సంప్రదాయ వేడుకలో కృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకోవడం విస్తృత చర్చకు దారితీసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన పింకీ శర్మ కుటుంబం, బంధువులు, గ్రామ నివాసితులు సమక్షంలో సంప్రదాయ బద్ధంగా ఈ వివాహ తంతునుముగించారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైయూర్ కాశీమాబాద్ గ్రామంలో జరిగిన ఈ ప్రత్యేకమైన వేడుక పలువురి దృష్టిని ఆకర్షించింది.దైవిక వరుడితో సాంప్రదాయ వివాహంఈ సందర్భంగా పింకీ ఇంటిని అలంకరించారు. ఆమె సమీప బంధువు ఇంద్రేష్ కుమార్ వరుడిలా అలంకరించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. దాదాపు 125 మందితో ఊరేగింపుగా తరలి వచ్చారు.పింకీ విగ్రహాన్ని తన చేతులతో ఎత్తుకొని ఆచారాల కోసం వేదికపైకి అడుగుపెట్టింది. ఆమె దేవుడితో దండలు మార్చుకుంది, తరువాత సిందూర వేడుక జరిగింది. వేడుకల్లో భాగంగా బృందావనం నుండి వచ్చిన కళాకారులు భక్తి నృత్యాలు చేశారు. మొత్తం గ్రామం అంతా వివాహ విందును సిద్ధం చేశారు. పింకీ ఏడు సాంప్రదాయ వివాహ రౌండ్ల కోసం కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి పవిత్ర అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది. వీడ్కోలు వేడుక మరుసటి రోజు ఉదయం జరిగింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తోంది.बदायूं की पिंकी शर्मा ने भगवान श्रीकृष्ण जी से की शादीबदायूं जिले के इस्लामनगर थाना क्षेत्र के गांव ब्यौर कासिमाबाद में 28 साल की पिंकी शर्मा ने श्रीकृष्ण की प्रतिमा के साथ धूमधाम से विवाह कर लिया। पूरे गांव ने घराती की भूमिका निभाई और परिवार ने विवाह की पूरी रस्में पूरी कीं pic.twitter.com/dtT9fjfARU— Arjun Chaudharyy (@Arjun5chaudhary) December 7, 2025వధువు తండ్రి ఏమన్నారంటే ఆమె తండ్రి సురేష్ చంద్ర మాట్లాడుతూ, పింకీ చిన్నప్పటి నుండి కృష్ణ భగవానుడుఅంటే ఆమెకు ఎంతోభక్తి ఉండేదనీ,తరచుగా బృందావనానికి తనతో పాటు వచ్చేదని చెప్పారు. తన కుమారుల మాదిరిగానే కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని వాగ్దానం చేశానని చెప్పాడు. ఆమె తల్లి రామేంద్రి మాట్లాడుతూ, ఈ ఆలోచన మొదట్లో అసాధారణంగా అనిపించినప్పటికీ, పింకీ ఇది భక్తి భావంతో కూడుకున్నది కనుక కుటుంబం అంగీకరించిందని అన్నారు.ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్బంగారు ఉంగరం దాదాపు నాలుగు నెలల క్రితం, ఆమె దైవిక జోక్యంగా భావించిన ఒక అనుభవాన్ని అనుభవించిందట. బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు, ఒక బంగారు ఉంగరం ఆమె కండువాలో పడింది. దీంతో ఇది వరమని పింకీ నమ్మింది. అందుకే తానిక ఏ మానవుడిని వివాహం చేసుకోనని, కృష్ణుడిని మాత్రమే వివాహం చేసుకుంటాని నిర్ణయించుకుంది. ఇటీవలి అనారోగ్యంగా ఉన్నపుడు బృందావనం ద్వారా బరువైన కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పరిక్రమను పూర్తి చేసి తరువాత కోలుకుంది. ఇది తన వివాహానికి మరొక సంకేతంగా భావించిందట. తన జీవితం దేవునికి అంకితమని పింకీ వెల్లడించింది. తన జీవితంలో విద్యాతోపాటు, , భక్తి ,కృష్ణుడికి లొంగిపోవడంలోనే తనకు శాంతి అని తెలిపింది. కాగా ఇలా కృష్ణుడ్ని వివాహ మాడిన ఘటనలు యూపీలో గతంలోకూడా నమోదైనాయి. చదవండి: మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు -
మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు?
స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల మధ్య పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత పలాష్ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్ టాపిక్గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్ ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్లో ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని ఫోటోల వైరల్గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్ ఇక్కడ ముఖానికి మాస్క్తో, భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీకాగా మెహిందీ, సంగీత్ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్ పెళ్లి స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్ ప్రైవేట్ చాట్స్, స్క్రీన్షాట్లు అంటూ మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.ఇదీ చదవండి: రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం -
మీకు తెలియని హిందూ వివాహ రకాలు..
-
సమంత రెండో పెళ్లి.. ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా?
ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు.. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది.అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. కొందరేమో వీరి వయస్సుల గురించి చర్చిస్తే.. మరికొందరు డేటింగ్, పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కావడం.. రాజ్ నిడిమోరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్ గ్రౌండ్ గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో సామ్-రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి?.. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. కొద్ది కాలంలోనే స్టార్ హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది సామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.సమంత ఆస్తులే ఎక్కువ.. ఇక రాజ్ నిడిమోరు ఆస్తుల విషయానికొస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ దాదాపు రూ.85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాజ్ కంటే సమంతనే 29 శాతం అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్ అంచనా వేస్తున్నారు.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టింది. -
రాజ్తో సమంత రెండో పెళ్లి.. ఇంత ఏజ్ గ్యాప్ ఏంటి సామీ..!
గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్కు నేటితో చెక్ పడింది. సామ్-రాజ్ ఎక్కడా కనిపించినా డేటింగ్ రూమర్స్ వైరలయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరు మరింత సన్నిహితంగా మెలగడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం దాదాపు ఫిక్సయిపోయారు. అందరూ అంచనాలను నిజం చేస్తూ రెండో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది సమంత. ఊహించిందే అయినప్పటికీ.. సామ్ స్టార్ హీరోయిన్ కావడంతో హాట్ టాపిక్గా మారింది. ఎట్టకేలకు ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.ఇక పెళ్లి విషయం పక్కనపెడితే అందరి నోటా ఒకటే చర్చ నడుస్తోంది. రెండో పెళ్లి ఓకే.. కానీ వీరిద్దరు వయస్సు మధ్య తేడా ఎంత అనేది ప్రశ్న. ప్రేమ, పెళ్లికి వయసుతో పనేంటని అందరూ అంటూనే ఉంటారు. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్య వయసు తేడా అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సామ్- రాజ్ ఏజ్ గ్యాప్ ఎంతనేది కూడా నెట్టింట చర్చ మొదలైంది. పెళ్లి చేసుకునే జంటకు పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని అందరూ అనడ మనం వింటుంటాం. మరి వీరి మధ్య ఏంత తేడా ఉంది? అసలు సమంత- రాజ్ మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసుకుందాం.సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. ఈ లెక్కన సమంతకు ప్రస్తుతం 38 ఏళ్లు. అయితే రాజ్కు సంబంధించిన అఫీషియల్ పుట్టినరోజు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజ్ 1975 ఆగస్టు 4వ తేదీన తిరుపతలో జన్మించారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనకు ఇప్పుడు 50 ఏళ్లు. ఈ లెక్కన సామ్- రాజ్కు మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 12 సంవత్సరాలు. వయస్సుల పరంగా చూస్తే ఇద్దరి మధ్య ఇంత అంతరం ఉండడం చర్చకు దారితీసింది. దీంతో సమంత నిర్ణయంపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రేమకు వయస్సుతో పనిలేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరి మధ్య పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. సమంత రూత్ ప్రభు 2017లో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021లో వివాహాబంధానికి గుడ్ బై చెప్పేసింది. తాజాగా మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. రాజ్ నిడిమోరును పెళ్లాడింది. రాజ్ సైతం గతంలో శ్యామలి దేను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. సామ్- రాజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు. -
జడ్జి‘మెంటల్స్’కు ఇచ్చిపడేసిన ప్రేమ జంట
సోషల్ మీడియా వచ్చిన తరువాత మనుషుల్లోని అపరిచితుడు అనేక రూపాల్లో బయటపడుతున్నాడు. ప్రతీ వాడూ జడ్జి‘మెంటల్’ అయిపోతాడు. పెచ్చుమీరుతున్న ఆన్లైన్ ట్రోల్స్ గురించి తలుచుకున్నపుడు ఇలాంటి ఆలోచనే వస్తుంది ఎవరికైనా. పెళ్లి చేసుకున్నా,విడాకులు తీసుకున్నా, తమ అభిప్రాయాల్ని ప్రకటించుకున్నా...వేధింపులే..నోటికొచ్చినట్టు కామెంట్స్ రాసేయడమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యతలు, మనోభావాలు ఇవేవీ పట్టించుకోరు. వచ్చామా? కమెంట్ చేశామా..వికృతం అనందం పొందామా? అంతే.. కానీ మధ్యప్రదేశ్కు చెందిన జంట మాత్రం తమను అవమానించిన ట్రోలర్స్కు ఇచ్చిపడేశారు.11 ఏళ్ల ప్రేమ తరువాత మధ్యప్రదేశ్కు చెందిన ప్రేమ జంట రిషబ్, సోనాలి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి సంబంధించినఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపాల్సింది పోయి, ఆన్లైన్లో పిచ్చి పిచ్చి కామెంట్లతో వారిని ఆనందాన్ని, ఉత్సాహాన్ని దూరం చేశారు. రిషబ్ షేర్వానీలో ప్రకాశవంతమైన గులాబీ రంగు శాలువా సఫాతో మెరిసిపోగా, మెజెంటా లెహంగాలో సోనాలీ చాలా అందంగా కనిపించారు. అయితే వరుడు నల్లగా ఉన్నాడంటూ నోరు పారేసుకున్నాడు."బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం," అని ఒకరు, డబ్బు కోసమే ఈ పెళ్లి అని మరొకరు వ్యాఖ్యానించారు. "దీదీ, ఇలా చేయడం అవసరమా అని ఒకరు, బహుశా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్టుందని మరో యూజర్ ఎగతాళి చేశారు. ఈ ట్రోలింగ్ తీవ్ర కావడంతో, పోస్ట్ 30 లక్షలకు పైగా వీక్షణలను దాటేసింది. అయితే ఈ ట్రోలింగ్ను కలర్-షేమింగ్ను వ్యతిరేకిస్తూ, వారి నిజమైన ప్రేమకు, అనురాగానికి మంచి మద్దతు కూడా లభించడం ఊరటనిచ్చే అంశం.ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?ట్రోలర్స్కు కొత్త జంట సమాధానంమామధ్య ఉన్న దూరం ఇన్నాళ్లకు ముగిసింది. వాళ్లు ఏమన్నా మాకేమీ బాధలేదు. ఈ క్షణాన్నిమేము అస్వాదిస్తున్నామని సోనాలి ట్రోలర్స్ను తిప్పి కొట్టింది. రిషబ్ కూడా అదే విధంగా స్పందించారు. సోనాలిని పెళ్లాడే క్షణాలకోసం 2014 నుంచి ఎదురు చూస్తున్నానని, ఆమెను పెళ్లికూతురుగా చూసినప్పుడు కన్నీళ్లను ఆపుకోవడం తన తరం కాలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఉద్యోగం పుకార్లను ప్రస్తావిస్తూ, "మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు కానీ నేను నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. ఇపుడు నాకు మంచి ఆదాయమే ఉంది. కానీ నాకు ఏమీ లేనప్పుడే ఆమె నన్ను ప్రేమించింది, నా కాలేజీ రోజుల నుంచే నా శరీర రంగు, ఆకారం కంటే. ఆమె నన్ను నన్నుగానే ఇష్టపడింది. నాకు వెన్ను దన్నుగా నిలిచింది...వాళ్ల కమెంట్స్ అస్సలు పట్టించుకోను అని అన్నారు. అలాగే రిషబ్ తన చర్మం రంగు కారణంగా జీవితాంతం వివక్షను ఎదుర్కొన్నా అంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బాహ్య సౌందర్యంతో సంబంధం లేకుండా.. నమ్మకమే పునాదిగా నిలబడిన ప్రేమను పరస్పర విశ్వాసం, అనురాగాలతో రిషబ్-సోనాలి కొత్త ప్రయాణం దిగ్విజయంగా సాగిపోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. -
'తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు'.. జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ రోజుల్లో యువత, పెళ్లి అనే కాన్సెప్ట్పై మాట్లాడింది. ముంబయిలో జరిగిన 'వీ ది ఉమెన్' అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె నేటి యువతరం, పెళ్లి అనే విషయాలపై స్పందించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పెళ్లి అనేది ముగిసిన అధ్యాయంలా కనిపిస్తోందని తెలిపింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోమని తాను మాత్రం యువతకు సలహాలు ఇవ్వనని జయా బచ్చన్ వెల్లడించింది. తన మనవరాలు నవ్య నవేలి నందా వివాహం చేసుకోవాలని చెప్పనని పేర్కొంది.జయా బచ్చన్ మాట్లాడుతూ..'నా మనవరాలు నవ్య కూడా వివాహం చేసుకోవడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకోమని నేను సలహా కూడా ఇవ్వను. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లి అనేది ముగిసిన అధ్యాయం. నవ్య మరికొన్ని రోజుల్లో 28 ఏళ్లు నిండుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచాలో యువతులకు సలహాలు ఇచ్చే పెద్దదాన్ని కాదు. ఎందుకంటే నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ తరం చిన్న పిల్లలు చాలా తెలివైనవారు. వారు మిమ్మల్ని మించిపోతారు. ఈ రోజుల్లో వివాహం, చట్టబద్ధత అనే రిలేషన్ నిర్వచించాల్సిన అవసరం లేదు.ఇక జయా బచ్చన్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీలో వామికా గబ్బి, సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్రల్లో నటించారు. -
'వివాహానికి కాలం చెల్లింది'..! అందుకే మనవరాలికి కూడా..: జయ బచ్చన్
ప్రస్తుతం వివాహం అనే పదం ఎలా విలువలేని బంధంగా మారుతోందో చూస్తున్నాం. అదీగాక నేటి యువత వివాహం అనే బంధంలో చాలా చకచక నిర్ణయాలు తీసుకుని ఎలా విచ్ఛినన్న చేసుకుంటున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఈ జనరేషన్ తీరు భవిష్యత్తుకి భరోసా నిచ్చేలా వెల్ సెటిల్మెంట్ తర్వాతే పెళ్లి అని అంటున్నారే గానీ బంధాన్ని పదిలంగా కలకాలం నిలిచేలా మైండ్ని స్ట్రాంగ్ ప్రిపేర్ చేసుకోవడంలో ఫెయిలవ్వుతున్నారనేది నిపుణుల వాదన. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నటి జయబచ్చన్ వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారాయి. పైగా ఆమె వివాహాన్ని కాలం చెల్లిందిగా పేర్కొనడం సర్వత్ర చర్చనీయాంశమైంది. అందులోనూ ఎంపీ, సీనియర్ నటి జయబచ్చన్ ఇలా మాట్లాడటంపై సంప్రదాయవాదులు వ్యతిరేకించగా, స్వేచ్ఛ కోరుకునే మహిళామణులు మాత్రం ఆమెకు మద్దతు పలకడం విశేషం. ఇంతకీ ఆమె ఏం అన్నారు. అది కరెక్టేనా అంటే..ప్రముఖ నటి జయా బచ్చన్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివాహాన్ని కాలం చెల్లినది(Outdated Institution)గా పేర్కొన్నారు. అందుకే తన మనవరాలు నవేలి నందా వివాహం చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని అన్నారు. తన మనవరాలు జనరేషన్లో ఉన్న యువత నమ్ముతుందే చెబుతున్నానని అన్నారామె. ఎందుకంటే వివాహ వ్యవస్థ చాలా వేగంగా మారిపోతోందని అన్నారు. ఇది అభ్యంతరంగా అనిపించినా..అదే నిజం!నవ్య గనుక తన కెరీర్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇంటి బాధ్యతలకు పరిమితమవ్వడం మీకు ఓకేనా అని అడిగినప్పుడూ జయ ఈ విధంగా వ్యాఖ్యానిచ్చారామె. ఏమాత్రం సంకోచం లేకుండా నవ్య వివాహం చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఆధునిక సంబంధాలకు చట్టపరమైన ముద్ర అవసరం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి కలిసి ఉంటే సరిపోతుందని ఆమె నొక్కి చెప్పారు. ముందుగా యువత జీవితాన్ని ఆస్వాదించమని సలహా ఇచ్చారు. మాతరంలోని సంబంధాలతో ఈ తరం అనుభవిస్తున్నది చాల భిన్నంగా ఉంది. ఇది అభ్యంతరంగా అనిపించినా..నిజానికి దీర్ఘాకాలిక సంబంధాలను నిలబెట్టుకోవాలంటే శారీర ఆకర్షణ, అనుకూలత చాలా ముఖ్యం కానీ ఈ తరం అది నిజమేనా కాదా అని ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే ప్రేమ కలకాలం కొనసాగాలంటే కొంత సర్ధుబాటు కూడా అవసరం. అది లేకపోతే బంధాన్ని నిలబెట్టుకోలేరని చెప్పుకొచ్చారు జయ. అలాగే ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాలా తెలివైనవారు. వారు మనల్ని మించిపోయేలా ఉంటారు అని ఆమె తెలిపారు. తరాల మధ్య ఆలోచనా విధానంలో వచ్చిన అపారమైన మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు . గతంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులు, సామాజిక కట్టుబాట్లు నేటి యువతకు సరిపోవని, ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితాలను, సంబంధాలను తమకు నచ్చిన విధంగా నిర్వచించుకునే స్వేచ్ఛ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.పెళ్లిపై ఆలోచనలు నిజంగా మారుతున్నాయా? నివేదికల ప్రకారం..భారతదేశంలో మహిళ సగటు వివాహ వయసు 2023లో 22.9 సంవత్సరాలకు పెరిగింది. ఇది మునుపటి కంటే కొంచెం ఎక్కువ. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విద్య, కెరీర్ లేదా వ్యక్తిగత వృద్ధి కోసం వివాహాన్ని ఆలస్యం చేస్తోంది యువత. అదే విధంగా ఒకప్పుడూ ఎక్కువమంది మహిళలు 18 ఏళ్లకు ముందే వివాహం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక స్వాతంత్ర్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా వివాహంపై యువత ధోరణిలో పెనుమార్పులు వచ్చినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక జయబచ్చన్ వ్యాఖ్యలు చాలా బోల్డ్గా ఉన్నా..ఇప్పటికే జరుగుతున్న మార్పునే ప్రతిబింబించారని చెప్పొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇక జయ ఉద్దేశ్యం వివాహ తప్పనిసరి కాదు, కానీ శారీరక అనుకూలత, స్నేహం,సామాజిక బాధ్యత కంటే ముఖ్యమైనది. అలాగే పిల్లలను పెంచడానికి తప్పనిసరిగా సాంప్రదాయ నిర్మాణాలు అవసరం లేదనేది ఆమె అభిప్రాయం. దీన్ని చాలామంచి మహిళామణులు స్వాగతించగా, చాలామంది సంప్రదాయవాదులు ఇది సరైనది కాదని మండిపడుతున్నారు.(చదవండి: రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్మాస్టర్ టైటిల్! అసలేంటి గేమ్..) -
సమంత రెండో పెళ్లి ఫోటోలు వైరల్..
-
Coimbatore: 30 మంది అతిథుల సమక్షంలో.. సమంత రెండో పెళ్లి!!
-
‘నాకు పెళ్లైందోచ్..’ 62 ఏళ్ల ఆస్ట్రేలియా ప్రధాని
62 ఏళ్ల వయసులో ఆ దేశ ప్రధాని మళ్లీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ‘నాకు పెళ్లైందోచ్..’ అంటూ ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆరేళ్లుగా పబ్లిక్గా ఈ జంట డేటింగ్లో ఉండగా.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కావడం విశేషం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన గర్ల్ఫ్రెండ్ జోడీ హైడెన్ (Jodie Haydon)ను ఆయన పెళ్లాడారు. కాన్బెర్రాలోని ఆంథోనీ (Anthony Albanese) అధికారిక నివాసం ది లాడ్జ్ తోటలో కొద్దిమంది మధ్య ఈ వేడుకలు జరిగాయి. తన పార్ట్నర్ చేతిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఆంథోనీ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Married💍❤️💍 pic.twitter.com/mSzojtBF2I— Anthony Albanese (@AlboMP) November 29, 2025జోడీ హైడెన్(47) అడ్వొకేట్తో పాటు ఆర్థిక నిపుణురాలు కూడా. 2019లో మెల్బోర్న్లో జరిగిన ఓ బిజినెస్ డిన్నర్లో ఆంథోనీ అల్బనీస్ను తొలిసారి ఈమె కలుసుకున్నారు. దాదాపు అదే సమయంలో అల్బనీస్ తన భార్య(మొదటి) కార్మెల్ నుంచి విడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆల్బనీస్-హైడెన్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 2022లో ఫెడరల్ ఎన్నికల ప్రచారంలో అల్బనీస్ వెంట జోడీ హైడెన్ సందడి చేశారు. ప్రధాని పదవి చేపట్టాక అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు. దుబాయ్, మాడ్రిడ్, స్పెయిన్, పారిస్ పర్యటనల్లో పాల్గొన్న ఆమె.. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు, 2023లో నాటి అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందుకూ ఆల్బనీస్ వెంట ఆమె కనిపించారు. ఈ క్రమంలో వారి ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేశాయి. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రధాని హోదాలో ఓ వ్యక్తి వివాహం చేసుకోవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో యూకే ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ 2021లో క్యారీ సైమండ్స్ను వివాహం చేసుకున్నారు. -
శుభ కార్యాలకు విరామం!
పెళ్లికి అతి ముఖ్యమైనది ముహుర్తం. బలమైన ముహుర్తంలో వివాహం చేసుకుంటే నూరేళ్ల జీవితం సుఖమయం అవుతుందన్నది అందరి నమ్మకం. అందుకే వివాహ తంతులో ప్రతి కార్యక్రమానికి ముహుర్తాలు చూసుకుంటాం. అందుకు పురోహితులు, పండితుల చుట్టూ తిరుగుతాం. అలాంటి ముహుర్తాలకు శుక్రవారం నుంచి బ్రేక్ పడనుంది. ఈ నెల 30న ప్రారంభమయ్యే శుక్రమౌఢ్యమి (మూఢం) వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య వరకు కొనసాగనుంది. అప్పటి వరకు శుభ కార్యాలకు విరామం ఏర్పడుతుంది. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకుని సిద్దంగా ఉన్న వారు మంచి ముహుర్తాల కోసం మూఢమి ముగిసే వరకు వేచి ఉండాల్సిందే. జిల్లాలో కల్యాణ మండపాల్లో పెళ్లి బాజాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు 80 రోజుల పాటు వినిపించవుమాఘమాసమూ మూఢంలోనే... మాఘమాసం ఎప్పుడొస్తుందా అని వివాహాలు చేసుకునేవారు ఆశగా ఎదురు చూస్తారు. ఎందుకుంటే ఆ మాసంలో బలమైన ముహుర్తాలు ఉంటాయి. అయితే ఈసారి మాఘమాసం మూఢంలో కలవడంతో ఒక్క ముహుర్తం కూడా లేదు. అంతే కాదు..గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, వసంతపంచమి,మాఘ పౌర్ణమి వంటి ముఖ్యమైన తిథులు కూడా మూఢంలో కలిసిపోయాయి.వ్యాపారులకు గడ్డుకాలం శుభకార్యాలకు బ్రేక్పడనున్న ఈ 80 రోజులు వ్యాపారులకు గడ్డుకాలమనే చెప్పాలి. మదనపల్లెలో నీరుగట్టువారిపల్లెలో పట్టుచీరల వ్యాపారులు అధికంగా ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్లో పట్టుచీరలకు మంచి డిమాండ్ ఉంటుంది. మౌడ్యమి చీరల వ్యాపారం పెద్దగా ఉండకపోవచ్చు. మండపాలు, ఫంక్షన్ హాల్స్, వస్త్రదుకాణాలు, స్వర్ణకారులు, నగల షాపుల యజమానులు, డెకరేషన్ , క్యాటరింగ్, ఫోటో, వీడియో గ్రాఫర్లు, టెంట్ హౌస్, పూల వ్యాపారులు, ట్రావెల్స్, లైటింగ్, డీజె బాక్సుల అద్దెకిచ్చేవారు ఇలా శుభకార్యాలపై ఆధారపడ్డ అన్ని రంగాల వారు ముఖ్యంగా పురోహితులు తీవ్రంగా నష్టపోనున్నారు.శుభ సూచికం కాదు ఒక గ్రహం సూర్య కిరణాల్లో కనుమరుగవడాన్ని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మూఢం అంటారు. గ్రహశక్తులు బలహీనమవడంతో శుక్రగ్రహం సూచించే ఫలితాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలకు గురుడు ఎంత ప్రధాన కారకుడో,శుక్రుడు కూఆ అంతే ప్రభావం కలవాడు. శుక్రుడు బలహీనమైతే సంబంధాలు వివాహ జీవితం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడుతాయమని పండితులు చెబుతున్నారు. శుక్రమౌడ్యం ఉన్న కాలంలో శుభకార్యాలు జరుపుకోవడం శుభసూచికం కాదని అంటున్నారు. ఒక్క ముహుర్తం కూడా లేదుశుక్రమౌఢ్యమి ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. 28న ఉద యం వివాహాలకు ఒక ముహుర్తం మాత్రమే ఉంది. ఆ తరువాత నుంచి ఫిబ్రవరి 17 వరకు ఒక్క ముహుర్తం కూడా లేదు. ఈసారి మాఘ మాసం కూడా మూఢంలోనే కలిసిపోయింది. నిశి్చతార్థాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు,ఇతర శుభకార్యాలు జరుపుకునే వారు మూఢమి ముగిసే వరకు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ఈ 80 రోజుల్లో మంచి ముహూర్తాలు లేవు. –ఆలూరి ఫణికుమార్శర్మ, పురోహితులు, మదనపల్లెసంపాదన తగ్గిపోతుందిపెళ్లిళ్ల సీజన్ ఉంటే సంపాదన ఉంటుంది. ముహుర్తాలు ఉంటే పూలకు డిమాండ్ ఉంటుంది. ఈ సారి శుక్రమౌఢ్యమి 80 రోజులు రావడంతో చేతిలో పని తగ్గిపోతుంది. దీనిపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడకతప్పదు. –ఎంబీఎస్ బాషా, పూలవ్యాపారి, మదనపల్లె -
వింత ఆచారం అబ్బాయి వధువుగా.. అమ్మాయి వరుడిగా..!
ప్రకాశం జిల్లా: మండలంలోని కొలుకుల గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు వింత ఆచారంతో వివాహం జరిపించారు. ఈ వివాహాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం బత్తుల శివగంగరాజు, నందిని వివాహం పెద్దలు వైభవంగా జరిపించారు. అయితే తర తరాలుగా వస్తున్న తమ కుల ఆచారం ప్రకారం వరుడు శివగంగరాజుకు చీర, రవిక, మెడలో నగలు, చేతికి గాజులు ధరింప చేసి పెళ్లికుమార్తెగా, వధువు నందినికి పంచె, చొక్క, తలపై కండువ, చేతికి వాచి పెట్టి అచ్చం పెళ్లి కుమారుడిగా అలంకరించారు. వీరిని ఇరువైపులా బంధువులు గ్రామ వీధుల్లో ఊరేగింపుగా గంగమ్మ, ఎల్లమ్మ దేవతలు కొలువై ఉన్న దేవాలయం వద్దకు తీసుకొని వెళ్లి అక్కడ పొంగళ్లు చేసి నైవేద్యం పెడతారని ఆ గ్రామ పెద్దలు తెలిపారు. బత్తుల వంశంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని మరచిపోకుండా వివాహాలు జరుపుతుంటామని, వివాహం అయిన మరుసటి రోజు దేవతలకు నైవేద్యం పెట్టేందుకు గుడివద్దకు వరుడు వధువు దుస్తులు, వధువు వరుడి దుస్తులు వేసుకొని వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటారని వారు తెలిపారు. -
రాప్తాడులో జననేతకు బ్రహ్మరథం (ఫొటోలు)
-
ప్రియుడితో తెలుగు సీరియల్ నటి ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి
శ్రీకాకుళం కల్చరల్: వివాహాల విషయంలో దేశాల హద్దులు కూడా చెరిగిపోతున్నాయి. శ్రీకాకుళానికి చెందిన శ్రీరంగనాథ్ సాహిత్, బెల్జియంకు చెందిన కెమిలీ శనివారం బలగ రోడ్డులోగల శాంతి కన్వెన్షన్ హాల్లో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. సాహిత్ శ్రీకాకుళంలో పుట్టి ఇక్కడే చదువుకొని కంప్యూటర్ ఇంజినీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను పనిచేస్తున్న కంపెనీ ద్వారా లండన్ దేశానికి వెళ్లగా అక్కడ బెల్జియంకు చెందిన కెమిలీ పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువచ్చింది. ఇరు కుటుంబాల వారు పెళ్లికి సమ్మతించడంతో ఈ అరుదైన పెళ్లికి శ్రీకాకుళం వేదికగా నిలిచింది. వరుడి తల్లి తిరునగరి పద్మావతి హిందీ టీచర్గా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నారు. నగరంలోని హయాతినగరంలోని సాయిభవానీ నగర్కాలని మొదటి లైన్లో నివాసం ఉంటున్నారు. -
సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్న IAS అధికారులు
-
విశాఖ: ఐఏఎస్ జంట ఆదర్శ విహహం
విశాఖపట్నం: ఆర్భాటాలు, అట్టహాసాలకు దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు ఎంతో నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా పనిచేస్తున్న టి. శ్రీపూజ, మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆదిత్య వర్మ శుక్రవారం విశాఖపట్నంలో ఒక్కటయ్యారు.విశాఖలోని కైలాసగిరి శివాలయంలో పూలమాలలు మార్చుకుని సాంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై, కొత్త వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వారు నేరుగా వన్టౌన్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ దగ్గరుండి ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్లకు చెందిన ఈ ఇద్దరి వివాహం పెద్దలు కుదిర్చినదే అని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. ఖరీదైన పెళ్లిళ్లు సాధారణమైపోయిన ఈ రోజుల్లో, ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచింది. -
స్మృతి WEDS పలాశ్
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ తొలిసారి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మనసిచ్చిన వాడితో రేపు మనువాడబోతోంది. ఇన్నేళ్లుగా ఒకలా రేపటి రోజు ఒకలా స్మృతి కనిపించబోతోంది. జట్టు జెర్సీతో మైదానంలో ప్యాడ్లు, గ్లౌజ్లు, క్యాప్తో ఓపెనర్గా క్రీజులోకి వచ్చే ఆమె... రేపు మాత్రం అరుదైన డిజైనర్ లెహెంగా, నుదుటన పాపిట బిళ్ల, బుగ్గన చుక్క, మోచేతుల దాకా గాజులు, అరచేతి నిండా పండిన గోరింటాకు, కాళ్లకు పారాణితో వధువులా ముస్తాబై కమనీయ కళ్యాణ వేదికకు రానుంది. మధ్యప్రదేశ్కు చెందిన సంగీత దర్శకుడు, డైరెక్టర్ పలాశ్ ముచ్చల్తో స్మృతి కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరు త్వరలోనే ఒక్కటవుతారనే వార్తలు నెట్టింట తెగ షికార్లు చేశాయి. ప్రపంచకప్ తర్వాత ముహూర్తం ఖాయమనే ముచ్చట్లూ వినిపించాయి. చివరకు అన్నట్లే ప్రపంచకప్ ముగిసిన వెంటనే స్మృతి ఇంట పెళ్లి బాజా మోగనుంది. తన హోటల్ ‘ఎస్ఎం 18’ (స్మృతి మంధాన 18 జెర్సీ నంబర్)లో భారత జట్టు సహచరుల సందడితో పెళ్లి కోలాహలం ఎప్పుడో మొదలైంది. హల్దీ, మెహందీ వేడుకల్లో సహచరుల చిందులు, చిలిపి అల్లర్లు నెట్టింట కనువిందు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలతో పాటు డీవై పాటిల్ స్టేడియం మధ్యలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పలాశ్ పిచ్ వద్దకు తొడ్కొని రావడంతోపాటు మోకాళ్లపై కూర్చోని ఆమెకు చేసిన పెళ్లి ప్రతిపాదన వీడియో కూడా నెట్టింట క్రికెట్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 19 లక్షలు లైక్లు, 12 వేలపైచిలుకు కామెంట్లు, లెక్కలేనన్ని శుభాకాంక్షలు ఇన్స్టాలో వెల్లువెత్తాయి. ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే జంట స్మృతి మంధాన, పలాశ్లకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
కెరీర్, వివాహం రెండు వేర్వేరు కాదు..! మరోసారి ఉపాసన పోస్ట్ దుమారం..
రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెనుదూమరం రేపుతున్నాయి. రోజురోజుకి ఆ వ్యాఖ్యలపై చర్చ తారస్థాయికి చేరిపోతోంది. సర్వత్రా తీవ్రస్థాయిలో ఆమె మాటల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె మహిళలు కూడా తమ కెరీర్లో దూసుకుపోవాలి, అదే ప్రగతి శీల అన్న కోణంలో చేసిన వ్యాఖ్యలు..నిపుణులు, వైద్యులను కలవరపరిచాయి. ఆమె యువతకు ఇచ్చిన సందేశం..అవాస్తవం, హానికరం అంటూ ఫైర్ అవుతున్నారు. మొన్న దీనిపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ..యుంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చిన సందేశం చూశాం. అది మరువక మునుపే తాజాగా వైద్య నిపుణులు, ఐఐటీ-ఐఐఎం గ్రాడ్యుయేట్లు సైతం ఉపాసన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇంతకీ నిపుణులు, గ్రాడ్యుయేట్లు ఏం అంటున్నారంటే..ఢిల్లీ ఎయిమ్స్ వైద్యురాలు దత్తా వివాహం ఆశయానికి అడ్డంకి కాదని నొక్కి చెప్పారు. అన్ని విధాల మద్దతు ఇచ్చే భాగస్వామి ఉంటే..కెరీర్, పిల్లలు రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చని, అదేమంతా కష్టం కాదని అన్నారామె. ఉపాసన వ్యాఖ్యలు యువతను పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని ఫైర్ అయ్యారు. యుక్త వయసుని వృధా చేసుకునే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అంతేగాదు తగిన వయసులో పెళ్లి చేసుకుంటే..పేరెంట్స్గా మారేందుకు, అలాగే తాతమామలకు కూడా సంతోషాన్ని అందిస్తుందని అన్నారు. తమ మనవళ్లు లేదా మనవడితో స్పెండ్ చేసే సమయం వారికి దొరుకుతుందని అన్నారు. అంతేగాదు ఉపాసన చిన్న వయసులో పెళ్లిచేసుకుందని, తర్వాత కెరీర్ని నిర్మించుకుందని అన్నారు. అందువల్ల ఆమె చెప్పిన సందేశం..సగటు యువతికి అత్యంత భినమైనదని అన్నారు. అయిన ధనవంతుల ఆలోచనలను ఎవ్వరూ గుడ్డిగా నమ్మోద్దని అన్నారు. అసలు మహిళలను సంపాదనకు ప్రాధాన్యత ఇవ్వమని, వివాహం, మాృతత్వం వంటి వాటిని వాయిదా వేయమని సూచించకూడదు. కెరీర్లో బాగా సెటిల్ అవ్వడం..అంటే ఓపక్క వయసు దాటిపోయాక పిల్లలు కనాలనుకోడం కాదని, అలా చేస్తే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. అలాగే ఎగ్స్ను ఫ్రీజ్ చేసుకున్నంత మాత్రన కచ్చితంగా బిడ్డలు పుట్టేస్తారన్న గ్యారంటీ లేదని చాలా మంది వైద్యలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాదు ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లు, పలువురు వైద్యులు ఉపాసన వ్యాఖ్యలు తప్పుడు సందేశాన్ని ఇస్తున్నాయని, ఇవి యువతకు ప్రమాదకరం అంటూ మండిపడ్డారు. మరికొందరు నిపుణులు నిజానికి వివాహం, కెరీర్ రెండిటిని డిఫరెంట్ ఛాయిస్లుగా చూడోద్దని సూచించారు. ఇది భార్యభర్తల బలోపేతమైన భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న అంశమని, ఆ విషయాన్ని ఉపాసన తెలుసుకోలేకపోయిందంటూ విమర్శించారు. ఇక ఉపాసన సైతం ఈ పోస్ట్లపై స్పందించారు. సరైన భాగస్వామి దొరికే వరకు వేచి చూడటం, పిల్లలను ఎప్పుడు కనాలి అనేదానిపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఎలా తప్పువుతుందని ప్రశ్నించారామె. I too advise people to marry early—not out of duty or anything like that.Having kids early makes life easier and gives your parents as much time as possible to enjoy their grandchildren. https://t.co/Cjmead5UhA— Deepan Shanmugasundaram (@deepan_civileng) November 19, 2025 తన ఉద్దేశ్యం మరింతమంది మహిళలను శ్రామికశక్తిలోకి తీసుకురావాలని యజమానులకు పిలుపునిచ్చానే తప్ప ఇందులో ఎలాంటి అనుచిత సందేశం లేదని వివరణ ఇచ్చింది. అలాగే తన వ్యక్తిగత కారణాల వల్లే 29 ఏళ్ల వయసులో తన ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకున్నట్లు వివరించింది. తాను కేవలం వివాహానికి ముందు కెరీర్పై మహిళలు దృష్టిపెట్టి..ఆర్థిక స్వేచ్ఛ పొందాలనేది తన అభిప్రాయమని నర్మగర్భంగా చెప్పారామె. ఏదిఏమైన ఉపాసన వ్యాఖ్యలు సదుద్దేశ్యంతో చేసినప్పటికీ..అటు వైద్యనిపుణులు, ఇటు ఐఐటీ గ్రాడ్యుయేట్లు నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవ్వడం గమనార్హం.(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్) -
అమ్మాయిలూ... వింటున్నారా..?!
పెళ్లికి మాత్రమే కాదు సంబంధంలోనూ ’సమానత్వం’ కోరుకునే జనరేషన్ ఇది. ఒకప్పటి రోజుల మాదిరి ‘వయసు వచ్చింది పెళ్లికి రెడీ‘ అనే రోజులు కావివి. పెద్ద అంకెల్లో సంపాదన, సొంత ఇల్లు.. ‘సెట్ అయ్యాకే‘ పెళ్లి అంటున్నారు అబ్బాయిలు. పెద్దలు చూశారు, ఓకే అనేశారు అనడానికి వీలు లేదు. భవిష్యత్తు అంచనాలతోపాటు వాస్తవాలకు చేరువగా ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయన వరుణ్ వయసు 30. వయసు దాటిపోతోంది అని ఇంట్లో వాళ్లు ఎంత పోరుతున్నా మంచి ప్యాకేజీ, సొంత ఇల్లు, కారు కొన్నాకే పెళ్లి అని చెప్పాడు. ఇవి ఉంటేనే మంచి సంబంధాలు వస్తాయని తల్లిదండ్రీ కూడా పెద్దగా ఒత్తిడి తేవడం లేదు. వరుణ్ లాంటి వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ‘ఇవి మంచి విషయాలే కానీ, ఇంకా చాలా విషయాలను పట్టించుకుంటూ మరీ ఆలస్యం చేయడం వల్ల మ్యాచ్లు కుదర్చడం చాలా కష్టంగా మారింది..’ అంటున్నారు పెళ్లిళ్లు కుదిర్చే పెద్దలు. ఇంతకీ అమ్మాయిల గురించి అబ్బాయిలకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, డిమాండ్స్ ఏంటి? భయాల మాటేమిటి? .. వధూవరుల ఎంపికలో సంబంధాలను చేరువ చేస్తున్న మ్యారేజీ బ్యూరోల వాళ్లు చెబుతున్న విషయాలు ఇవి..అబ్బాయిల ‘ఎక్స్పెక్టేషన్స్’...ఒకప్పుడు అమ్మాయికి వంట వచ్చా, పాటలు పాడుతుందా, కుట్లు, అల్లికల మాటేమిటి..? అని అడిగేవారు. ఇంటి పట్టున ఉంటే చాలు.. అనేవారు. ఒకప్పటితో పోల్చితే అబ్బాయిలకు ఇప్పుడు స్పష్టమైన కండిషన్స్ ఉంటున్నాయి. ఇద్దరికి నెలలు – రోజుల తేడా ఉన్నా సరే. అమ్మాయికి మంచి చదువు, ఉద్యోగం ఉండాలి ఫ్రెండ్లీ నేచర్ మస్ట్. అర్ధం చేసుకునే స్వభావం ఉండాలి. కుటుంబంతో కలిసిపోయేలా మాట్లాడాలి. అవసరం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోగలగాలి. మైండ్ సెట్ అవ్వాలి. ఎమోషనల్ సపోర్టర్గా ఉండాలి.గౌరవించాలి. అహం ఉండకూడదు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినదై, ఆర్థికంగా స్థితిమంతులు అయి ఉండాలి.అన్ అఫిషియల్ డిమాండ్స్బయటకి మాత్రం ‘కట్నం గురించి పెద్దగా పట్టించుకోం’ అంటారు. లోపల పెద్దల మాటా మంతితో డబ్బు, బంగారంతోపాటు స్థిరాస్తి ఇస్తే మరీ బెటర్. పెళ్లి ఖర్చులు అమ్మాయి వాళ్లే భరించాలి. అమ్మాయి కుటుంబం ‘మమ్మల్ని బాగా చూసుకుంటుందా..లేదా’ అనే గమనింపు.ఇవి చాలా రియల్ ... ప్రస్తుత రోజులను గమనించి భయపడుతున్న సంఘటనలు అబ్బాయిలలో ఉంటున్నాయి. వాటిలో... ఫైనాన్షియల్ ప్రెషర్ భయం వరుడిలోనే ఎక్కువ. ‘పెళ్లి తరువాత అన్ని బాధ్యతలు నాపైనే పడతాయా?‘ ఇది ప్రతీ అబ్బాయి లోపలుండే నిజమైన భయం. అందుకే, అమ్మాయి కూడా సంపాదనాపరురాలైతే మంచిదనుకుంటున్నారు.‘హాబీలు, పర్సనల్ స్పేస్, వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందేమో.. !! అందుకే, ‘నా ఇష్టాలు ఇవి.. ’ అని ముందుగానే చెప్పేస్తున్నారు.. కొత్తగా పెళ్లయ్యి దంపతుల మధ్య తలెత్తుతున్న వివాదాలు, ఒకటి రెండు చేదు సంఘటనలను దృష్టిలో పెట్టుకొని.. తమ భావి జీవితం వారిలాగే దెబ్బతింటుందేమో అనే భయం ఈ తరం అబ్బాయిలలో పెరిగింది. అందుకే, పాస్ట్ రిలేషన్స్ ఏమైనా ఉంటే సంకోచం లేకుండా ఇప్పుడే చెప్పచ్చు అని నిక్కచ్చిగా చెప్పేవాళ్లూ ఉన్నారు. ‘నేను గుడ్ హజ్బండ్ కాలేకపోతే?‘,‘ఆమె హ్యాపీగా ఉండకపోతే?’ ఇవి బయటకు చెప్పని ఆందోళనలు. అందుకే, ‘నాకే చెడు అలవాట్లు లేవు..’ అని ముందే కమిట్ అవుతున్నవాళ్లూ ఉన్నారు. ‘పెళ్లి తరువాత ఇరువైపుల కుటుంబాల మనోభావాలు కలవకపోతే... మధ్యలో నేను నలిగిపోతానా?!’ అని ఆలోచిస్తున్నవారూ ఉన్నారు. ఇప్పటి అబ్బాయిలు అమ్మాయిల మాదిరిగానే భావోద్వేగాలున్నవారే. రియలిస్టిక్ అంచనాలు పెట్టుకునే వాళ్లు. రిలేషన్షిప్లో సురక్షితమైన వైబ్ను కోరుకుంటున్నారు.సోషల్ మీడియా కంపారిజన్స్..ఇన్స్టాగ్రామ్, రీల్స్, కపుల్ గోల్స్... సోషల్మీడియా హైప్స్ చూసి చాలామంది అబ్బాయిలు–అమ్మాయిలు కూడా ఫెయిరీటేల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ‘ఫలానా కపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు’ అనే మాటలు రావడంతో ఈ కంపారిజన్ తమపైన పడుతుందేమో!.. అని భయపడుతున్నవారూ ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయి జీతం ఎంత అనే విషయం అడగకూడదు అనేవారు. కానీ, ఇప్పుడు ముందు ‘ఇయర్లీ ప్యాకేజీ’ ఓకే అయితేనే సంబంధం గురించి ఆలోచిస్తున్నారు. అబ్బాయిలు కూడా తమ ఆర్థిక ప్రణాళిక గురించి ముందే చెబుతున్నారు. ఖర్చులు ఎవరు, ఎలా పెట్టాలి, భవిష్యత్తు కోసం చేసే పొదుపు గురించిన ఆలోచనలూ పెరిగాయి. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధిఆలస్యం ఎందుకు అవుతుందంటే...పెళ్లిలో కుటుంబాల ప్రభావం చాలా ఎక్కువ. ఇరువైపుల కుటుంబాలు కాబోయే వధూవరుల చదువు, ఇయర్లీ సం΄ాదన, కులం, గోత్రం, ప్రాంతం, లుక్, వివాహ జాతకం, కంపాటబిలిటీ నెంబర్ల స్కోర్.. ఇవన్నీ బాగుంటేనే రెండువైపుల వాళ్లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇందులో .. ఇచ్చి పుచ్చుకోవడాలు, బడ్జెట్ డిమాండ్లు, పర్సనాలిటీ, కమ్యూనికేషన్, మైండ్సెట్ .. ఇవన్నీ ఒక పెళ్లిని సెట్ చేయడంలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అబ్బాయి–అమ్మాయి సమానత్వం అనుకున్నా వరులు మాత్రం ‘అబ్బాయి అంటే అబ్బాయే!‘ అనే అటిట్యూడ్ చూపిస్తున్నవాళ్లూ ఉన్నారు. దీంతో పెళ్లి సెట్ అయ్యే టైమ్కి అబ్బాయికి–అమ్మాయికి 30–35 ఏళ్లు దాటుతున్నాయి. – కవిత, కె.ఆర్ మ్యారేజీ బ్యూరో, హైదరాబాద్జాతకాల ప్రభావం పెరిగింది..పరిచయస్తులు, బంధువర్గంలోనే వివాహ సంబంధాలను కుదుర్చుతున్నాను. రెండువైపులా చదువు, మంచి కుటుంబం, ఆర్థిక విషయాల్లో స్థిరత్వానికి బాగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. వీటి తర్వాత జాతకాలదే ప్రాముఖ్యత. ఇద్దరూ అందానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. కెరియర్ విషయంలో అమ్మాయి సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ సంబంధాన్నే ఎక్కువ కోరుకుంటున్నారు. అబ్బాయిలు మాత్రం ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇతర ప్రొఫెషన్స్ వైపు చూస్తున్నారు. వీటికి తోడు అమ్మాయివైపు ఆర్థిక స్థితిగతులను అంచనావేసే ముందడుగువేస్తున్నారు. – కొత్తపల్లి రమేష్రెడ్డి, రిటైర్డ్ ఏఆర్సిఐ, హైదరాబాద్ -
కూతుర్ని రూ. 20 లక్షలకు తెగనమ్మి.. తండ్రి జల్సాలు
ఎన్టీఆర్ జిల్లా: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతురినే బేరానికి పెట్టిన ఘటన గణపవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి భార్యతో విడాకులు తీసుకుని మద్యానికి బానిసయ్యాడు. తనకున్న పొలాన్ని కూడా అమ్ముకుని వచ్చిన సొమ్ముతో తాగి జల్సాలు చేస్తున్నాడు. తన స్నేహితుడైన బెల్లంకొండ నాగరాజును బావమర్ది అని సంబోధిస్తూ.. ఇద్దరూ కలిసి తాగుతూ, తిరుగుతూ ఉండేవారు. ఈ క్రమంలో నాగరాజు తన 15ఏళ్ల కుమార్తెతో వివాహం జరిపిస్తానని చెప్పి పలు దఫాలుగా జమలారెడ్డి వద్ద నుంచి రూ.20లక్షలు వరకు దండుకుని కారు తదితరాలు కొనుక్కున్నాడు. ఆ విధంగానే ఎవరికీ తెలియకుండా జమలారెడ్డికి ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. అయితే ఆ మైనర్ బాలిక కాపురానికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి నాగరాజు మరోసారి తనకు డబ్బు కావాలని జమలారెడ్డిని అడగడంతో కుమార్తెను కాపురానికి తీసుకొస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో నాగరాజు తన కుమార్తెను జమలారెడ్డి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయాడు. జమలారెడ్డి మైనర్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక తండ్రి నాగరాజు, జమలారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఇరువురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
నాలుగేళ్ల తర్వాత తండ్రైన సింగర్.. ఆలస్యంగా రివీల్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అఖిల్ సచ్దేవా తండ్రిగా ప్రమోషన్ పొందారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా రివీల్ చేశారు. ఈ నెల ఆరో తేదీన తన భార్య బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా కూతురి రూపంలో మా అమ్మ తిరిగొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. సింగర్ అఖిల్ సచ్దేవా.. బాలీవుడ్లో సన్ మేరే హమ్ సఫర్, తేరా బన్ జౌంగా, చన్నా వే వంటి పాటలతో ఫేమ్ తెచ్చుకున్నారు.వీరిద్దరు డిసెంబర్ 7 2020న జైపూర్లోని సమోదే హవేలీలో తాన్యా గుల్లా, అఖిల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదారేళ్ల పాటు డేటింగ్ ఉన్న ఈ జంట పెళ్లి జీవితం ప్రారంభించారు. ఆరేళ్ల క్రిత నా కచేరీకి వచ్చిన తాన్య మొదటి చూపులోనే నచ్చేయడంతో అలా మా పరిచయం మొదలైందని గతంలో సింగర్ వెల్లడించారు. View this post on Instagram A post shared by Nasha Boy (@sachdevaakhilnasha) -
పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి
బెట్టియా: బీహార్లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తున్న అతిథులు రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, అటుగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి వారిని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ లౌరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా, చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందాడు. బాధితుల్లో చాలా మందిని గుర్తించడం కష్టతరంగా మారిందని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన మొత్తం 16 మందికి తొలుత ప్రథమ చికిత్స అందించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెట్టియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నార్కటియాగంజ్లోని మాల్దహియా పోఖారియా నుండి బిషున్పూర్వాకు ఈ వివాహ అతిథుల బృందం వచ్చినట్లు సమాచారం. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత, పలువురు అతిథులు రోడ్డు పక్కన గుమిగూడి ఉండగా, అదుపు తప్పిన ఒక కారు వారిపైకి దూసుకెళ్లడం ఈ విషాదానికి కారణంగా నిలిచింది. కారు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు -
వాడే నాకు కరెక్ట్ : చాట్జీపీటీ వరుడొచ్చేశాడు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం. చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియోలవర్తో బ్రేకప్...ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్కాస్టింగ్తో చెప్పింది.A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025 అయితే ప్రేమలో పడాలని చాట్జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్ని క్లాస్గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్కు "హనీమూన్"కి వెళ్ళింది ఫిక్టోసెక్సువాలిటీఈ సంఘటన జపాన్లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్' -
భార్య బెడ్ రూమ్లో సీసీ కెమెరాతో నిఘా పెట్టిన సాఫ్ట్వేర్ భర్త
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పెళ్లయి ఆరు నెలలు నిండకముందే వరకట్న వేధింపులకు ఓ అబల బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు కుమార్తె అంజలి (19)ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి ఉపేందర్–ఉమ దంపతుల కుమారుడు సాయికుమార్కు ఇచ్చి ఈ ఏడాది మే 14న వివాహం జరిపించారు. రెండెకరాల పొలం, ఐదు తులాల బంగారం, రూ.10 లక్షల నగదు వరకట్నంగా అందజేశారు. హైదరాబాద్లో ఇంటీరియల్ డెకరేషన్ పని చేస్తున్న సాయికుమార్ భార్యను స్వగ్రామంలోనే ఉంచి తరచూ వచ్చి వెళ్లేవాడు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో మరికొంత కట్నం తేవాలని భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు నిరంజని, ఆమె భర్త మోహన్ప్రసాద్ వేధించసాగారు. దీంతో వెంకటేశ్వర్లు కుల పెద్దల వద్ద మాట్లాడగా.. ఇకపై మంచిగా చూసుకుంటానని సాయికుమార్ చెప్పినా ఆ రోజు నుంచి అంజలికి వేధింపులు మరింత పెరిగాయి. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఆమెను గృహ నిర్బంధం చేశారు. గ్రామంలో ఎవరితో మాట్లాడకుండా కట్టుదిట్టం చేయగా అంజలి మానసిక క్షోభకు గురైంది. సాయికుమార్ ఆదివారం మరోసారి ఘర్షణ పడడంతో మనస్తాపానికి గురైన అంజలి ఇంట్లోనే పురుగులమందు తాగింది. వెంటనే సాయికుమార్ ఇల్లెందు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. కానీ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అంజలి మృతి చెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సాయికుమార్, అతడి కుటుంబసభ్యులు ఇల్లెందుకు చేరుకుని పోలీసులకు సరెండర్ అయ్యారు. అంజలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అత్తింటివారిపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు. -
బాబోయ్.. ఇలాంటి పెళ్లాం పగోడికి కూడా వద్దు!
వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లిసంబంధం. యువ దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటుండగా, భర్త ఆఫీస్ పోయేటప్పుడు భార్య ఆ రోజు వరకు ఉన్న ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాలింగ్ ఎంత ఉందో నోట్ చేసుకోవడంతో పాటు, కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఆఫీసుకు సెలవు పెట్టి బయటకు వెళ్లినా అనుమానించడం సాధారణమైంది. తనతో పెళ్లి ఇష్టం లేకే ఇలా చేస్తోందని భర్త భావించాడు. అసలు విషయమేమిటో బోధపడక ముందు వీరి పంచాయితీ పెద్దల వరకు, అట్నుంచి మహిళ పోలీస్స్టేషన్కు చేరింది.ఇద్దరు ఉన్నత చదువులు పూర్తి చేశారు. మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సోషల్మీడియాలో ఏర్పడిన స్నేహం పెళ్లివరకు వచ్చింది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన ఇద్దరి మధ్య నెలకొన్న అనుమానాలతో ఆరు నెలలకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఠాణాకు చేరారు. ఇలా పెరిగిన సోషల్మీడియా వినియోగం, మైక్రో కుటుంబాలతో సర్ది చెప్పేవారు లేక కుటుంబాలు కూలుతున్నాయి.సాక్షి పెద్దపల్లి: నూరేళ్లు సాఫీగా సాగాల్సిన భార్యాభర్తల జీవితం పట్టుమని నెలలు కూడా ఉండట్లేదు. అనుమానం, వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం, చిన్నపాటి తగాదాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కారణాలు ఏవైనా.. కారకు లు ఎవరైనా.. అన్నింటా ఆమే సమిదగా మారు తోంది. వేధింపులు, చిత్రహింసలు, భరించలేని స్థాయికి చేరుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోజుకు పదుల సంఖ్యలో జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. మద్యానికి బానిసవడం, అదనపు కట్నం, ఆస్తి కోసం ఇలా కారణమేదైనా మహిళకు వేధింపులు తప్పడం లేదు. మరికొన్ని కేసుల్లో ఆలుమగల మధ్య తలెత్తిన గొడవలను సరిదిద్దాల్సిన పెద్దలు రెచ్చగొడుతున్నారు. తమవారిదే పైచేయి కావాలనే పట్టుదలతో దంపతుల మధ్య ఎడబాటు పెంచుతున్నారు. మూడో వ్యక్తి జోక్యంతోనే సంసారాన్ని చేతులారా చేసుకుంటున్నారని సైకాలజిస్టులు నాశనం చెబుతున్నారు.నాలుగు నెలల్లో..జిల్లాలోని మహిళా సంబంధిత కేసుల సత్వర పరిష్కారం కోసం జిల్లాకేంద్రంలో మహిళ పోలీస్ స్టేషన్కు జూన్లో ప్రారంభించారు. 144 రోజుల్లో 475 కేసులు నమోదు కాగా, అందులో 395 కేసులను పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్క రించారు. 45 మందిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయ గా, 90మంది కేసులను విత్ర్డా చేసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ ను రోజూ పదుల సంఖ్యలో బాధితులు ఆశ్రయిస్తున్నారంటే సమస్య ఏస్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆధిపత్య ధోరణి, పెద్దల జోక్యం, అనుమానాలతో రాణా మెట్లు ఎక్కుతున్నారు.పోలీసులు ఏం చెబుతున్నారంటే?కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులు కనిపించవు. కానీ, ఒకరికొకరు బద్ద శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో పది, ఇరవై ఏళ్లుగా సంసారం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అధికశాతం పెళ్లయిన ఏడాది నుంచి మూడేళ్ల లోపువారే ఎక్కువ గా స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పంథాలకు పోతున్నారు. ఎక్కువగా మొబైల్ వినియోగం పెరగడం, భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవలను భూతద్దంలో చూడడం తో అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతు న్నారు. వారికి దశల వారీగా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ సాధ్యమైనంత వరకు ఇద్దరినీ కలిపేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.కౌన్సెలింగ్ ఇస్తున్నాంప్రధానంగా మద్యం కారణంగా గొడవలు, వరకట్న వేధింపులు, అనుమానాలతో గొడవ లు పడుతున్న కేసులు ఎక్కువగా వస్తు న్నాయి. సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే దంపతులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. ఆలుమ గల బంధం ఎంతో పవిత్రమైంది. ఏమైనాసమస్యలుంటే పరిష్కరించుకోవాలి. - కె.పురుషోత్తం, సీఐ, మహిళా పోలీస్ స్టేషన్ -
రష్మిక - విజయ్ పెళ్లి.. డేట్, వేదిక ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Cine Gossips (@thecinegossips) -
నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు
‘పెళ్లి చూసి చూడు..ఇల్లు కట్టి చూడు’ అనేది ఇప్పటికీ నూటికి నూరుపాళ్లు నిజం అనిపించే మాట. దీనికి ఇండియాలో కొనసాగుతున్న ట్రెండ్ మరింత ఆజ్యం పోస్తుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అనేదిఒకప్పటి మాట. ఇవాల్టి పెళ్లి ళ్ల ట్రెండ్ దీన్ని దాటేసి మరింత ముందుకు పోయింది. లక్షలకు, లక్షలకు కుమ్మరించి, హంగూ ఆర్భాటాలతో నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్, షూట్లు, ఖరీదైన బట్టలు, డైమండ్ నగలు, ఖరీదైన రిసార్ట్లు, పెళ్లి పందిటిలో స్క్రీన్లు,డ్రోన్ కెమెరాలు, ఇక భోజనాల సంగతి సరేసరి ఇంత తతంగం లేనిది ఏ మధ్య తరగతి ఇంట్లో పెళ్లి జరగడంలేదు. తాజాగా ఒక పెళ్లి కొడుకు 10 డిమాండ్లు మాత్రం సంచలనంగా నిలిచాయి. అవేంటో చూద్దామా..అసలే రానున్నది అంతా పెళ్లిళ్ల సీజన్. మన దేశంలో కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇప్పటి తరం లో కొంత మార్పు వచ్చినప్పటికీ గిప్ట్లు, కానుకలు పేరుతో తెరవెనుక, ఒప్పందాలు, భారీ ఎత్తు లావాదేవీలు జరిగిపోతూనే ఉంటాయి. అబ్బాయి తరపు కుటుంబం గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు అమ్మాయి తరబు కుటుంబాలు శక్తికిమించి ఖర్చు చేస్తాయి, తమ కుమార్తె సంతోషంగా ఉంటుంది కదా అని అప్పు చేయడానికైనా వెనుకాడరు. కానీ ఒక వరుడు మాత్రం కట్నం వద్దు కానీ 10 కోరికలు అంటూ షేర్ చేసిన డిమాండ్లు అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి. 10 డిమాండ్లు ఏంటంటే..ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉండకూడదు.అతని వధువు లెహంగాకు బదులుగా చీర ధరించాలిపెళ్లిలో బిగ్గరగా, అసభ్యకరమైన సంగీతానికి బదులుగా, వాయిద్య సంగీతం ఉండాలి.దండలు మార్చుకునే సమయంలో ప్రశాంతంగా తామిద్దరమే ఉండాలి. దండలు మార్చుకునేటపుడు ఎవరైనా వరుడ్నిగానీ, వధువును గానీ పైకి ఎత్తడం లాంటి చేస్తే..తక్షణం వాళ్లు వేదికను వీడాల్సి ఉంటుంది.పెళ్లికి సంబంధించి ఇతర తంతులో కూడా ఫోటోగ్రాఫర్లు ,వీడియోగ్రాఫర్లు జోక్యం అస్సలు ఉండకూడదు.వేడుక ప్రారంభమైన తర్వాత పూజారిని అస్సలు ఎవరూ అడ్డుకోకూడదు.తాను , తన వధువు ఫోటోగ్రాఫర్లు అడిగి పిచ్చి పిచ్చి పోజులు ఇవ్వబోం.వివాహం పగటిపూట జరగాలి. సాయంత్రం నాటికి బధాయి(వధువును అత్తారింటికి సాగనంపే వేడుక) అన్ని సర్దుకోవాలి. తద్వారా అర్థరాత్రి కార్యక్రమాలు 'అతిథులకు అసౌకర్యం' లాంటివి ఉండవు.పెళ్లి తరువాత, వధూవరులు హగ్గులు, కిస్లు ఇలాంటివేవీ ఉండకూడదు.అంతేకాదు ఇది అగ్ని దేవుడి సాక్షిగా జరిగే పవిత్ర పవిత్ర వివాహం, సినిమా షూట్ కాదు."నెటిజన్లు ఏమన్నారంటే..!ఈ డిమాండ్లు కొందరికి న్యాయంగా అనిపించినప్పటికీ, మరికొందరు మాత్రం వీటిని తోసిపుచ్చారు. కొంతమంది అతను చెప్పింది సహేతుకమే అన్నారు. అయితే కట్నం తీసుకోకపోవడం అక్షరాలా చట్ట విరుద్ధం.. అదేదో నువ్వు గొప్పవ్యక్తిలా ఫోజులివ్వనక్కర లేదు అని ఒకరు, వివాహంలో సరదాగా గడపాలని అందరూ కోరుకుంటారు బ్రో అని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. పెళ్లి కూతురు పెళ్లిలో ఎలాంటి దుస్తులు ధరించాలో, పెళ్లి కొడుకు ఎందుకు డిసైడ్ చేయాలి అని కొందరు విమర్శించారు. "ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాకే అసహనానికి లోనైతే అతను పెళ్లి చేసుకుని ఇతరుల జీవితాలను పాడుచేయకూడదు ఒక యూజర్ అన్నారు. మరికొందరు అతన్ని సమర్థిస్తూ, "ఇది చాలా బాగుంది !!! వివాహం అనేది ఒక పవిత్ర బంధం, ఇన్స్టాగ్రామ్ లైక్ల కోసం కాదు !!!" అని అన్నారు. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. సతీసమేతంగా హాజరైన నిర్మాత
ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా దిల్ రాజు ఇంట కూడా శుభకార్యం జరిగింది. ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు సోదరి కుమార్తె పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు.ఈ పెళ్లి వేడుక ఫోటోలను దిల్ రాజు సతీమణి తేజస్విని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. పెళ్లిలో దిల్ రాజుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అక్క పెళ్లిలో కష్టపడుతున్న తమ్ముడు అంటూ దిల్ రాజు కుమారుడిని వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. దిల్ రాజు అన్న కుమార్తె కీర్తన పెళ్లి హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. -
సలార్ సినిమాటోగ్రాఫర్ పెళ్లి.. సందడి చేసిన కేజీఎఫ్ హీరో..!
కేజీఎఫ్ హీరో యశ్ (yash) తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రముఖ కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినిమాటోగ్రాఫర్ భూవన్ గౌడ వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించిన యశ్.. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. ఎంటర్ప్రెన్యూరర్ నిఖితను పెళ్లాడారు. భువన్ గౌడ, నికిత వివాహానికి కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరయ్యారు.కాగా..హీరో యశ్, భువన్ గౌడ కేజీఎఫ్ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఈ సినిమాలకు గానూ అతను ప్రశంసలు అందుకున్నారు. కాగా.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' తో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్ చిత్రానికి కూడా పనిచేశాడు. జూనియర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీకి కూడా భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నాడు. అంతేకాకుండా కన్నడలో 'లోడ్డే', 'రథావర', 'భరాతే' వంటి చిత్రాలకు పనిచేశాడు.కాగా.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కేజీఎఫ్ హీరో యశ్ (yash) ప్రస్తుతం టాక్సిక్(toxic) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే!
కేరళలోని కవస్సేరిలో జరిగిన ఒకముచ్చటైన పెళ్లి నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీపావళి నాడు పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు లావణ్య , విష్ణు వివాహం సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అయితే అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఆ విశేషమేమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మ్యారేజ్ హాలులోనే పంచాయితీ అధికారి ద్వారా వివాహ ధృవీకరణ పత్రాన్ని అందుకోవడమే ఈ స్టోరీలోని ప్రత్యేకత. అదీ డిజిటల్ విధానం ద్వారా. పెళ్లి అయిన మరుక్షణమే ఈ నూతన జంట మ్యారేజ్ రిజిష్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకుంది. కేరళలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'K-SMART' అనే డిజిటల్ వేదిక ద్వారా ఇది సాధ్యమైంది. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్కు ఇదొక మైలు రాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు. వివాహం జరిగిన వెంటనే, ఈ జంట K-స్మార్ట్ వీడియో KYC వ్యవస్థ ద్వారా వారి వివాహ రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారు. అంతేకాదు దీపావళి సెలవు రోజు అయినప్పటికీ కవస్సేరి పంచాయతీ అధికారులు దరఖాస్తును రియల్ టైమ్లో ప్రాసెస్ చేసి ఆమోదించడం, సర్టిఫికెట్ను నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా జంటకు అందించడం విశేషం. పంచాయతీ సభ్యుడు టి వేలాయుధన్ నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కవస్సేరి పంచాయతీ సిబ్బంది వారి అంకితభావానికి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.Kerala sets an example !! In Kawassery, Kerala, Lavanya and Vishnu got married and registered their marriage instantly through Video KYC.The Panchayat member even handed over a digitally verified certificate with their photo on the same day.Respected Panchayati Raj Minister… pic.twitter.com/HGAnoU5cu0— Sreekanth B+ve (@sreekanth324) October 23, 2025దీంతో చాలా మంది కాబోయే జంటల్లో ఇది ఎంతో సంతోషాన్ని నింపింది. ఎందుకంటే పెళ్లి తరువాత, వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు, ఫోటోలు, సర్టిఫికెట్లు పట్టుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగి కష్టాలేమీ లేకుండానే, ఆన్లైన్ వెరిఫికేషన్ కావడం, క్షణాల్లో సర్టిఫికెట్ రావడం సంతోషమే కదా. కేరళ ఒక ట్రెండ్ సెట్ చేసిందంటూ కొనియాడుతున్నారు ప్రజలు'K-SMART' అనే డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, వీడియో KYC ద్వారా వివాహ నమోదును పూర్తి చేయవచ్చు . తక్షణమే డిజిటల్లీ సైన్డ్ సర్టిఫికెట్ పొందవచ్చు. వీడియో KYCలో జంటలు, సాక్షులు ఆధార్ ఆధారిత OTP లేదా ఇమెయిల్ ద్వారా తమ గుర్తింపును వీడియో ద్వారా ధృవీకరించుకోవచ్చు. ఇది పూర్తయిన తరువాత డిజిటల్ సంతకం చేసిన వివాహ ధృవీకరణ పత్రాలు జారీ అవుతాయి. వీటిని వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ విధానం ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (NRIs) ఎంతో సౌకర్యవంతంగా ఉంది, ఎందుకంటే వారు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. కె-స్మార్ట్ ప్రారంభించినప్పటి నుండి, కేరళ 1.5 లక్షలకు పైగా వివాహ రిజిస్ట్రేషన్లు నమెదయ్యాయి. దాదాపు 63 వేలు వీడియో KYC ద్వారా పూర్తయ్యాయి. -
పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. ముహూర్తం ఫిక్స్!
టాలీవుడ్లో హీరో నారా రోహిత్ (Nara Rohith) పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన ప్రియురాలు శిరీష మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ఇటీవలే శిరీష సోషల్ మీడియా వేదికగా పసుపు దంచే కార్యక్రమం అంటూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి.తాజాగా నారా రోహిత్- శిరీషల పెళ్లి వేడుకకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు వీరి గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోనే గ్రాండ్గా జరగనుంది.(ఇది చదవండి: నారా రోహిత్ పెళ్లి సందడి.. హీరోయిన్ ఇంట హల్దీ ఫంక్షన్)ఆ సినిమాతో శిరీషతో పరిచయం..నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.రోహిత్ కెరీర్..బాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్. సోలో మూవీతో హిట్ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు.Two hearts. One destiny. Infinite memories ahead ❤️The beautiful journey of #NaraRohith & Sireesha begins with a celebration as grand as their love story 💍A 4-Day grand wedding festivities to be held in Hyderabad with the Muhurtham on 30-10-25 ❤️Here’s to forever filled… pic.twitter.com/AqGedliw78— Ramesh Bala (@rameshlaus) October 22, 2025 -
‘త్వరలో రాహుల్ పెళ్లి.. స్వీట్స్కు ఆర్డర్’?.. సంబరంగా చెప్పిన దుకాణదారు
న్యూఢ్లిలీ: దేశమంతటా దీపావళి వేడుకలు ఎంతో ఆనందంగా జరిగాయి. ఈ సందర్భంగా చాలామంది పరస్పరం స్వీట్లను పంచుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. దీపావళి వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుకు మరోమారు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక మిఠాయి దుకాణం యజమాని ఆ వివరాలు వెల్లడించారు.దీపావళి వేళ ఓల్డ్ ఢిల్లీలోని ప్రముఖ ఘంటేవాలా స్వీట్స్ దుకాణానికి మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్తో జరిగిన సంభాషణను యజమాని సుశాంత్ జైన్ మీడియాకు తెలిపారు. ముందుగా ఆయన రాహుల్ గాంధీని భారతదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా అభివర్ణించారు. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, తనకు అతని వివాహ స్వీట్ల ఆర్డర్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దుకాణానికి ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబంతో అనుబంధం ఉందని, వారికి స్వీట్లు కావాల్సినప్పుడు తామే అందిస్తామని తెలిపారు. पुरानी दिल्ली की मशहूर और ऐतिहासिक घंटेवाला मिठाइयों की दुकान पर इमरती और बेसन के लड्डू बनाने में हाथ आज़माया।सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है - ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।दीपावली की असली मिठास सिर्फ़ थाली में नहीं, बल्कि रिश्तों और समाज… pic.twitter.com/bVWwa2aetJ— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025రాహుల్ తమ దుకాణానికి రాగానే తాను.. ‘రాహుల్ జీ.. దయచేసి త్వరలోనే పెళ్లి చేసుకోండి. మీ వివాహ స్వీట్ల ఆర్డర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని’ అన్నానని తెలిపారు. రాహుల్ తమ దుకాణంలోకి వచ్చిక అతని తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ను గుర్తుచేసుకుంటూ, అతనికి ‘ఇమారి’ స్వీట్ ఇష్టమని చెప్పారన్నారు. అలాగే ఆయన దానిని తయారు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రాహుల్కు బేసన్ లడ్డూ ఇష్టమని తెలుసుకున్న తాను.. అతనితో దానిని కూడా తయారు చేసేందుకు కూడా ప్రయత్నించమని చెప్పానని సుశాంత్ జైన్ తెలిపారు.దుకాణానికి వచ్చిన రాహుల్ అక్కడి సిబ్బంది ఆప్యాయంగా పలుకరించారు. పండుగను ఎలా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ‘పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ దుకాణంలో ఇమార్తి, బేసన్ లడ్డూలు తయారుచేశాను. ఈ షాపులోని శతాబ్దాల నాటి తీపిదనం ఇప్పటికీ మనసుకు హత్తుకునేలా ఉంది. అసలైన దీపావళి గొప్పదనం స్వీట్లలోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది" అని రాహుల్ రాశారు. -
పత్రికలు పంచాక ముఖం చాటేసిన ప్రియుడు..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఐదేళ్ల పాటు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ముహూర్తం పెట్టి.. పెళ్లి కార్డులు పంచాక ప్లేటు ఫిరాయించాడు. ఇదేమని అడిగితే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గ్యాంగ్ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు. ఈ గ్యాంగ్ పేరుతో ఇప్పటికే ఇసుక, ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రూరల్ పోలీసు స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయక తప్పలేదు. వివరాల్లోకి వెళితే..విశాఖ జిల్లా పరవాడ మండలానికి చెందిన యువతి శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో గల పెద్దమ్మ ఇంటిలో ఉంటుంది. రజక సామాజిక వర్గానికి చెందిన ఆమెకు ఆమదాలవలస మండలం గోపీనగర్కు చెందిన మెట్ట శరత్ చంద్రతో పరిచయం ఏర్పడింది. విశాఖలో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయానికి ఆ అమ్మాయి మైనర్. వారి ప్రేమ ప్రయాణం కొనసాగుతున్న తరుణంలోనే శరత్ చంద్ర సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారాడు. అతనికి ఇన్స్టాలో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ప్రేమాయణం కొన్నాళ్లు నడిచాక పెళ్లి చేసుకోమని ఆ యువతి కోరింది. ఎప్పటికప్పుడు అతడు నమ్మిస్తూ వచ్చాడు. ఒక రోజు గట్టిగా నిలదీసేసరికి రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివని, పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని మాట మార్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి తను నివాసం ఉంటున్న పెద్దమ్మ ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులు గమనించి రిమ్స్కు సకాలంలో తీసుకెళ్లి చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసుల వరకు వ్యవహారం వెళ్లింది.ఈ సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి ఒప్పందం జరిగింది. 100 రూపాయల బాండ్ పేపర్లో ఒప్పందం చేసుకున్నట్టు లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. పెద్ద మనుషులు కూడా సంతకాలు చేశారు. యువతి తల్లిదండ్రులు కట్న కానుకల కింద రూ. 3లక్షల నగదు, 4తులాల బంగారం, 20సెంట్లు భూమి ఇచ్చేందుకు కూడా అంగీకారపత్రం రాసుకున్నారు. ఈ మేరకు అక్టోబర్ 10న వివాహం ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికార్డులు కూడా ముద్రించి బంధువులకు, స్నేహితులకు యువతి కుటుంబ సభ్యులు పంచారు. కట్నం డబ్బులు అడ్వాన్సుగా ఇచ్చేందుకు యువతి కుటుంబ సభ్యులు గోపీనగర్ గ్రామానికి వెళ్లగా శరత్ చంద్ర ఆయన కుటుంబంలోని వారు పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కూన రవికుమార్ పేరు చెప్పి గ్యాంగ్గా చెలామణి అవుతున్న చైతన్య అనే యువకుడి ప్రోద్బలమే దీనికి కారణమని తెలిసింది. వాళ్లు ఏం చేయలేరని, మామయ్య వెనకున్నారని భరోసా ఇవ్వడంతోనే శరత్ చంద్ర కుటుంబం కఠిన నిర్ణయం తీసుకున్నట్టు గుర్తించారు. ఎంత నిలదీసినా అటువైపు నుంచి ఒకటే సమాధానం రావడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో చేసేది లేక యువతి కుటుంబ సభ్యులు శరత్ చంద్ర ఇంటి వద్ద వద్ద ఆందోళనకు దిగారు. అయినప్పటికీ పెళ్లికి ససేమిరా అనడంతో శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన శరత్ చంద్రతో పాటు అతడి తల్లిదండ్రులు, అతడికి సహకరించిన స్నేహితులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఎమ్మెల్యే కూన రవి పేరు చెప్పి జడిపిస్తున్నారు..ఎమ్మెల్యే కూన రవికుమార్ మేనల్లుడట. మెట్ట శ్రీను అట, చైతన్య అట, కిల్లి సాయి, చల్లా వాసు ఇంటికొచ్చి జడిపిస్తున్నారు. తేల్చుకుని రండని కూన రవికుమార్ పంపించారట. మమ్మల్ని భయపెడుతున్నారు. కూన రవి సర్. మేము పేదవాళ్లం. ఐదేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. మా పిల్లను ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు. మాకు డబ్బు వద్దు, కేసులు వద్దు, న్యాయం కావాలి. ఆ అబ్బాయితో పెళ్లి చేయాలి.– రమణమ్మ, యువతి పెద్దమ్మ -
రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ హీరోయిన్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ అర్చన కవి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు రిక్ వర్గీస్ను ఆమె పెళ్లాడింది. ఈ విషయాన్ని ప్రముఖ టీవీ హోస్ట్ ధన్య వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు, అభిమానులు అర్చనకు విషెస్ చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. అర్చన కవికి ఇది రెండో వివాహం. ఆమె గతంలో 2016లో హాస్యనటుడు, యూట్యూబర్ అబీష్ మాథ్యూను వివాహం చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేశారు. విడాకులు తీసుకుని కొత్త జీవితాలను ప్రారంభించారు. డివోర్స్ అయిన నాలుగేళ్ల తర్వాత అర్చన మరోసారి పెళ్లి పీటలెక్కింది. అయితే రిక్ వర్గీస్ తనకు ఓ డేటింగ్ యాప్లో పరిచయమయ్యాడని గత ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.ఇక సినిమాల విషయానికొస్తే.. 2009లో నీలతామర అనే రీమేక్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతంలో పలు సినిమాలు చేసిన అర్చన ఇటీవలే ఐడెంటిటీ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టోవినో థామస్, త్రిష కృష్ణన్ కూడా నటించారు. అర్చన అంతకుముందు మమ్మీ అండ్ మీ, బెస్ట్ ఆఫ్ లక్, సాల్ట్ అండ్ పెప్పర్, మజవిల్లినాట్టం వారే, అరవాన్, మోనై అంగనే ఆనాయి, డే నైట్ గేమ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఎ కల్లన్ లాంటి మలయాళ సినిమాల్లో మెప్పించింది. అంతేకాకుండా ఎంతే ప్రియా గణంగల్, బ్లడీ లవ్, టాక్ విత్ ఆర్చీ, ట్రావెల్, సుందరి నీయుమ్ సుందరన్ జానుమ్ వంటి షోలలో కనిపించింది. -
ఇండోనేషియా భామతో తమిళ యువకుడి పెళ్లి
అన్నానగర్: తమిళనాడలోని తిరువారూర్ జిల్లాలోని ముత్తు పెట్టి సమీపంలోని కరయంగడు గ్రామానికి చెందిన సోమసుందరం. ఇతని భార్య వాసుకి, వీరి కుమారుడు యోగాదాస్ (30), ఇతను గత పదేళ్లుగా సింగపూర్లోని ఒక ప్రైవేట్ కంపె నీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇండోనేషియాలోని అమానుషన్ బరాతకు చెందిన డేని యల్ టీపు-మాతా నియోసన్ థామ్పటి కుమార్తె డయానా టీపు(26) ఒకే కంపెనీలో పనిచేస్తోంది. ఈమె యోగాదాను గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని ఈ జంట. నిర్ణయించుకున్నారు. తమిళనాడు ఆలయంలో వివాహ వేడుకను నిర్వహించాలని యోగాదాస్ నిర్ణయించుకుని, వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి, బంధువులు, స్నేహితులు, గ్రామ స్తులందరికీ పంచిపెట్టారు. అనుకున్న ప్రకారం ఆదివారం అక్కడి కరై ముత్తు మారియమ్మన్ ఆలయంలో చాలా సరళంగా వివాహం జరిగింది. పట్టు చీర ధరించిన తమిళ మహిళలా కనిపించే డయానా టీషునకు యోగాదాస్ తాళి కట్టాడు. ఈ వేడుకలో బంధువులు, గ్రామ స్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! -
నీ కాబోయే భార్యతో నాకు ఎఫైర్ ఉంది..!
రాప్తాడు రూరల్: నేడు, రేపు (శనివారం, ఆదివారం) పెళ్లి. ఇరు కుటుంబాల్లోనూ ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ఇంతలో వరుడికి అందిన ఫోన్కాల్తో పెళ్లి కాస్త పెటాకులైంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామంలో ఓ యువతికి, మరో ప్రాంతానికి చెందిన యువకుడికి పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయమైంది. శనివారం ముహూర్తం, ఆదివారం తలంబ్రాలకు నిర్ణయించుకుని రెండు కుటుంబాల్లోనూ అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసుకున్నారు. ఇంతలో మన్నీల గ్రామానికి చెందిన వివాహితుడైన బాలచంద్ర.. వరుడి ఫోన్ నంబరు సేకరించుకుని శుక్రవారం కాల్ చేశాడు. ‘నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు. నీ ఇష్టం. కావాలంటే మేమిద్దం కలిసి ఉన్న ఫొటో కూడా పంపుతాను చూడు’ అంటూ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటో పంపాడు. దీంతో పెళ్లికొడుకుతో పాటు వారి కుటుంబ సభ్యులు కంగుతిని పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. దీంతో వధువు తరఫు కుటుంబసభ్యులు, బంధువులు లబోదిబోమంటూ ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురి పెళ్లి చెడిపోవడానికి కారణమైన బాలచంద్ర కుటుంబ సభ్యులపై దాడి చేశారు. -
హిందూ బాలికపై అత్యాచారం, పెళ్లి
కరాచీ: పాకిస్తాన్లో హిందువులు సహా మైనారిటీ వర్గాలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్స్కు చెందిన ఓ 15 ఏళ్ల హిందూ బాలికను తనను ఓ వృద్ధుడు అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నాడని కోర్టుకు పేర్కొంది. తన కుటుంబాన్ని చేరుకునే అవకాశం కల్పించాలని వేడుకుంది. గత నెలలో జరిగిన ఈ ఘటనపై మిర్పూర్ఖాస్ జిల్లాలోని సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. తుది తీర్పు వెలువడే వరకు ఆమెను సురక్షితంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది. గత నెలలోతన కుమార్తెను తమ నివాసానికి సమీపంలో ఉండగా షార్ వర్గానికి చెందిన కొందరు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి నిర్మల్ మెఘ్వార్ పేర్కొంది. ‘అప్పటి నుంచి ఆ వర్గం వాళ్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు. కోర్టుకు నా కుమార్తె బర్త్ సర్టిఫికెట్ అందివ్వకుండా అడ్డుకున్నారు. మొదటి వాయిదా విచారణకు వచి్చన సమయంలో కోర్టు వద్దే మాపై దాడి చేశారు. నా కుమార్తె గురువారం ధైర్యంతో కోర్టులో వాంగ్మూలం ఇచి్చంది’అని ఆమె పేర్కొంది. దీంతో, పెళ్లి జరిపించిన కాజీని, ఇద్దరు సాకు‡్ష్యలను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో హిందువులు, క్రైస్తవులు సహా మైనారిటీ వర్గాలకు చెందిన కనీసం వెయ్యి మంది బాలికలకు ఇలా బలవంతంగా పెళ్లిళ్లవుతున్నాయని అంచనా. -
గ్రాండ్గా నార్నే నితిన్ పెళ్లి వేడుక.. బామ్మర్ది పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ సందడి!
మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్.. గతేడాది శివానీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. తాజాగా ఇవాళ జరిగిన పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో సందడి చేశారు. పెళ్లికూతురి బ్యాక్ గ్రౌండ్ ఇదే..కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో గతేడాది నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాల కంటే ముందుగానే ఆయన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) అనే మూవీలో నటించారు. అదే నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం కావడం విశేషం. Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025 -
టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. ఎన్టీఆర్ బామ్మర్ది మ్యారేజ్ డేట్ ఫిక్స్!
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో కలిసి వేడుకలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్ కూడా హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. -
విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు, కొడుక్కి పాలాభిషేకం
విడాకులు (Divoce) అంటేనే అదేదో వినకూడని మాటలాగా, కళంకం అన్న భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్ఫర్తలతో, ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే.. అభిప్రాయాలు కలవన్నప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు.. స్త్రీపురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలు అనేది నేటి మాట. విడాకులు అనేవి అటు మహిళలకుగానీ, ఇటు పురుషులకు గానీ జీవితంలో ఒక ముగింపు కాదని ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనలో గతంలో కూడా చూశాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి, విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారాత్ ఊరేగించి, ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువుర్ని ఆలోచింప జేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభాషేకం, కొత్తబట్టలిచ్చి.. కొత్త జీవితానికి నాంది పలకమని ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్. స్టోరీ ఏంటి అంటే..ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్, భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మర్చిపొమ్మనే సంకేతంగా శుద్ధిగా సంకేతంగా భావించే పాలతో కొడుకుని శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు అతను. బట్టలు, షూ, వాచీ.. ఇలా అన్నీ కొత్తవే అతనికిచ్చింది. అంతేకాదు ‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే ‘120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన అని అర్థం వచ్చేలా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉండటం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి, తానూ తినిపించాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్స్టాలో వైరల్ అయ్యింది.చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? Man celebrates divorce with ritual, sweets, and a cake reading “Happy Divorce 120g gold 18L cash.” sharing a caption: “I’m single, happy, free my life, my rules.” Urges others to celebrate themselves.pic.twitter.com/Rrhhlpqoqx— Ghar Ke Kalesh (@gharkekalesh) October 7, 2025 ‘‘120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు తీసుకోలేదు. కానీ నేను ఇచ్చాను.. ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను’’అని పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టూ డివోర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అనికొందరు కమెంట్ చేశారు. జీవితంలోతీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి, చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినపుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చు -అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. -
పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
కుమార్తె వివాహ అవసరాల కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్ల పాటు పెట్టుబడి చేయాలన్నది ప్రణాళిక. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జి. దేవిగుప్తామన దేశంలో వివాహ వేడుకలన్నవి భారీ ఖర్చుతో కూడుకున్నవి. ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. కనుక రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు తటస్థ మార్గాన్ని అనుసరించొచ్చు. ఇందులో భాగంగా 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి.డెట్ విషయంలో షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం కోసం గోల్డ్ ఈటీఎఫ్ల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదల రూపంలో రాబడి సమకూర్చుకోవచ్చు. వివాహ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్లను విక్రయించి ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు. నేను దీర్ఘకాలం కోసం స్మాల్క్యాప్ ఫండ్స్లోనే నూరు శాతం ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది సరైనదేనా? – నిరంజన్ దాస్స్మాల్క్యాప్లో పెట్టుబడులు పెట్టుకునే ముందు దీర్ఘకాలం ఒక్కటే చూడకూడదు. మార్కెట్ దిద్దుబాట్లలో స్మాల్క్యాప్ పెట్టుబడుల గణనీయమైన కుదుపులకు లోనవుతుంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కనుక పెట్టుబడుల కోసం స్మాల్క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. కాకపోతే ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి కనుక, మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్క్యాప్ పథకాలకు కేటాయించుకోకపోవడమే మంచిది. చిన్న కంపెనీ దిగ్గజ కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో చిన్న కంపెనీల్లో సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది.స్మాల్క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువే ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. అందుకే మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్క్యాప్ కంపెనీల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్మాల్క్యాప్ కంపెనీల్లో అయితే నేరుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే చిన్న కంపెనీల్లో ఏ ధరలో కొనుగోలు చేశారన్నది రాబడులను నిర్ణయిస్తుంది. పైగా ఈ విభాగంలో వైఫల్యాలు, మోసాల రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. నిపుణులైన ఫండ్ మేనేజర్లు వీటన్నింటినీ పరిశీలిస్తూ వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు అమలు చేస్తుంటారు. కనుక మొత్తం పెట్టుబడుల్లో స్మాల్క్యాప్ విభాగానికి పరిమితంగానే కేటాయింపులు చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది? -
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ అవికా గోర్ (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. గ్రాండ్గా వెడ్డింగ్
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం ముద్దుగుమ్మ సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.కాగా.. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అవికా.. తెలుగులోనూ పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో పరిచయంలోనే హిట్ కొట్టిన ఈమె.. తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ లాంటి తెలుగు మూవీస్ చేసింది, ప్రస్తుత 'షణ్ముఖ' సినిమాలో చేస్తోంది. అసలు విషయానికొస్తే.. 2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్ని ఓ సందర్భంలో అవికా కలిసింది. అలా ఏడాది పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ 2020 నుంచి దాదాపు ఐదేళ్లుగా ప్రేమాయణం కొనసాగించారు. తాజాగా ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. సోషల్ మీడియాలో పోస్ట్
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు బెన్నీ బ్లాంకోను పెళ్లాడింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్లో స్నేహితులు, సన్నిహితులు, పలువురు హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు టేలర్ స్విఫ్ట్, పారిస్ హిల్టన్, మార్టిన్ షార్ట్, ఆష్లే పార్క్ లాంటి హాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. తాజాగా సింగర్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.కాగా.. సింగర్ సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నారు. ఈ జంట గతేడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 12న ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన ఎంగేజ్మెంట్ ఫొటోలు తెగ వైరలయ్యాయి.బెన్నీ బ్లాంకో ఎవరు?బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్లో తమ రిలేషన్ను అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Selena Gomez (@selenagomez) -
ప్రియుడిని పెళ్లి చేసుకున్న పాప్ సింగర్ సెలెనా (ఫొటోలు)
-
ప్రేమజంట పెళ్లి.. వధువుపై కేసు
దొడ్డబళ్లాపురం: యువకున్ని వివాహం చేసుకున్న యువతిపై కేసు నమోదు చేసిన సంఘటన మాగడి తాలూకా కుదూరులో జరిగింది. వివరాలు.. సౌమ్య (19), వసంత్(19) అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. సౌమ్య తరఫు పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా జూలై 11న ఇద్దరూ మాగడిలోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. చట్ట ప్రకారం వధువుకి 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లు నిండాలి.అయితే ఇక్కడ పెళ్లికొడుకు వయసు 19 ఏళ్లే కావడంతో అతని కుటుంబీకులు సౌమ్యపై కుదూరు పోలీస్స్టేషన్లో బాల్య వివాహం చట్టం కింద ఫిర్యాదుచేయగా కేసు నమోదయింది. -
సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ
కెరీర్ పోతుందేమోనని భయంతో చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరు. కానీ ఓ దశ వచ్చిన తర్వాత మాత్రం బిజినెస్మ్యాన్ లేదంటే ఎవరో ఒకరిని వివాహం చేసుకుని సెటిలైపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఏజ్ పెరిగిపోతున్నా సరే సింగిల్గానే ఉండిపోతుంటారు. అలాంటి వారిలో హీరోయన్ అమీషా పటేల్ ఒకరు. ఈ బ్యూటీ 50 ఏళ్లు. అయినా సరే గ్లామర్ విషయంలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాల్ని చెప్పుకొచ్చింది.'నన్ను పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. అయితే వాళ్లందరూ వివాహం తర్వాత నటన మాసేసి పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని కండీషన్ పెట్టారు. ఇలాంటవన్నీ నచ్చక చాలామంది ప్రపోజల్స్ రిజెక్ట్ చేశాను. ప్రేమించే వ్యక్తులు ఎప్పుడూ కెరీర్లో రాణించేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. సినిమాల్లోకి రాకముందే నేను ఒకరితో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాను. మా ఇద్దరి కుటుంబ నేపథ్యం, ఇష్టాయిష్టాలు కలిశాయి. అయితే నేను నటిగా మారతానని చెప్పాను. పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి పార్ట్నర్గా వద్దని అతడి చెప్పేసరికి ప్రేమని వదులుకున్నాను. కెరీర్ని ఎంచుకున్నాను'(ఇదీ చదవండి: కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. దీపికకు నాగ్ అశ్విన్ కౌంటర్)'అలా అని నేనేమి పెళ్లికి వ్యతిరేకం కాదు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ నాకు మంచి కుటుంబాల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. తనలో సగం వయసున్న వారు కూడా డేటింగ్కి రమ్మని పిలుస్తున్నారు. దానికి నేను కూడా రెడీ. కాకపోతే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది.'కహోనా ప్యార్ హై' అనే హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమీషా.. తెలుగులోకి 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లో నటించింది. కొన్నేళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ఈమె.. 2023లో వచ్చిన 'గదర్ 2' మూవీతో హిట్ అందుకుంది. గతేడాది 'తౌబా తేరా జల్వా' అనే సినిమాలో చివరగా కనిపించింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది.(ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?) -
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్రూమ్లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
అతనితో పెళ్లి వార్తలు.. స్పందించిన జాన్వీ కపూర్!
ఇటీవలే పరమ్ సుందరితో అభిమానులను అలరించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. అంతలోనే మరో మూవీతో అలరించేందుకు సిద్ధమైంది. సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. వరుణ్ ధావన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు జాన్వీ కపూర్ కూడా హాజరైంది.ఈ సందర్భంగా జాన్వీ కపూర్కు తన పెళ్లి గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ స్పందించారు. ప్రస్తుతానికి తనకైతే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ఇప్పుడు నా దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని తెలిపింది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉందని వెల్లడించింది. దీంతో తనపై వస్తున్న మ్యారేజ్ రూమర్స్కు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ.అయితే గతంలో ఆమె.. శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే వీరిద్దరు చాలాసార్లు జంటగా కనిపించడంతో రూమర్స్ వినిపించాయి. గత ఇంటర్వ్యూలో తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్లో బోనీ కపూర్, ఖుషీ కపూర్తో పాటు శిఖర్ పేరును కూడా చెప్పడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా.. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. టాలీవుడ్లో రామ్ చరణ్ సరసన పెద్దిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. -
పెళ్లి, తల్లి అయితే ఏంటి.. దూసుకెళ్తున్న హీరోయిన్లు!
హీరోయిన్ల కెరీర్ అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనే నానుడి ఇండస్ట్రీలో ఉంది. పెళ్లికి ముందు ఫుల్ క్రేజ్తో దూసుకెళ్లే నాయికల కెరీర్ మిసెస్ అయ్యాక జోరు తగ్గుతుందని, అవకాశాలు అరకొరగా వస్తాయని అంటుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ‘మిసెస్ అయితే ఏంటి?’ అని ఇండస్ట్రీ అనుకుంటోంది... పెళ్లయ్యాకా కెరీర్లో దూసుకెళ్లాలని హీరోయిన్లు అనుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత చాన్స్లు వచ్చినా అక్క, చెల్లి, వదిన... వంటి పాత్రలకే వారిని పరిమితం చేస్తుంటారనే వారూ ఇండస్ట్రీలో లేకపోలేదు. కానీ ఈ పరిస్థితి కూడా మారింది. ప్రస్తుతం మాత్రం పెళ్లి అయినా కెరీర్లో ఏ మాత్రం జోరు తగ్గకుండా దూసుకెళుతున్నారు పలువురు హీరోయిన్లు. మిసెస్ అయినా క్రేజ్, చాన్స్ల విషయంలో తగ్గేదే లే అంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా ఆయా భాషల హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగు పెట్టినా, తల్లిగా ప్రమోషన్ పొందినా అవకాశాల్లో మాత్రం జోరు చూపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్లో విజయవంతంగా దూసుకుపోతున్న హీరోయిన్లు ఎవరో ఓ లుక్ వేద్దాం. ఇష్టంతో... తెలుగు చిత్ర పరిశ్రమకు ‘ఇష్టం’తో (2001) వచ్చారు శ్రియ శరణ్. ఆ తర్వాత ‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, ఎలా చెప్పను, నేనున్నాను, ఛత్రపతి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు శ్రియ. అదే విధంగా మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారామె. కెరీర్ జోరుగా ఉన్న సమయంలోనే 2018 మార్చి 19న ఆండ్రీ కోస్చీవ్తో పెళ్లి పీటలెక్కారు శ్రియ. అయితే వివాహం తర్వాత కూడా ఆమె వరుస చాన్స్లు అందిపుచ్చుకున్నారు. 2021 జనవరి 10న ఓ ΄ాపకు జన్మనిచ్చారు శ్రియ. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఆమె 2022 నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన సూర్య ‘రెట్రో’ (ప్రత్యేక పాట) సినిమా మే 1న విడుదలైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ చిత్రం శుక్రవారం ΄ాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సజ్జా తల్లిగా అంబిక ΄ాత్రలో నటించారు శ్రియ. ఆమె ΄ాత్రకి మంచి ఆదరణ వస్తోంది. ఇంకా శ్రియ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. తన తొలి సినిమా (ఇష్టం) లానే కెరీర్ అంటే ఉన్న ఇష్టంతో సినిమాల్లో కంటిన్యూ కావాలనుకుంటున్నారు శ్రియ. జోరుగా చందమామ రెండు దశాబ్దాలుగా అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కాజల్ అగర్వాల్. ‘క్యూ! హో గయా నా’ (2004) అనే బాలీవుడ్ మూవీలో అతిథి ΄ాత్రలో కనిపించిన ఈ బ్యూటీ తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కళ్యాణం’ (2007) సినిమా ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. అయితే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ (2007) చిత్రంతో ఓవర్ నైట్ ΄ాపులర్ అయ్యారు కాజల్. ఆ సినిమా తర్వాత ఆమెని టాలీవుడ్ చందమామ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఆ తర్వాత తెలుగులో ‘మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్, సారొచ్చారు, నాయక్, బాద్షా, టెంపర్, ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారామె. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఈ బ్యూటీ 2020 అక్టోబరు 30న గౌతమ్ కిచ్లుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేశారు ఈ బ్యూటీ. 2022 ఏప్రిల్ 19న ఓ బాబుకి జన్మనిచ్చారు కాజల్. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఈ చందమామ సెకండ్ ఇన్నింగ్స్లోనూ మళ్లీ అదే జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ది ఇండియా స్టోరీ, రామాయణ: పార్ట్ 1, రామాయణ: పార్ట్ 2’ వంటి హిందీ మూవీస్తో పాటు ‘ఇండియన్ 3’ అనే తమిళ సినిమా చేస్తున్నారు. అదే జోరు చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా కెరీర్ని సొంతం చేసుకున్నారు నయనతార. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్ని సంపాదించుకున్నారామె. ‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్గా కంటిన్యూ అవుతున్నారు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ తానేంటో నిరూపించుకుంటున్నారు. హీరోయిన్గా జెట్ స్పీడ్లో దూసుకెళుతున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పెళ్లి పీటలెక్కారు నయన్. 2022 జూన్ 9న వీరి వివాహం జరిగింది. వారికి ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరీర్లో స్లో అయినప్పటికీ నయన్∙మాత్రం ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్నారామె. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అరడజనుకు పైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. బిజీ బిజీగా... ‘గిల్లి’ (2009) సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు రకుల్ప్రీత్ సింగ్. ‘కెరటం’ (2011) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారామె. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ (2013) సినిమాతో తెలుగులో తొలి హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. ఆ తర్వాత ‘లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి పలు హిట్ మూవీస్ చేశారు. తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన ఈ బ్యూటీ హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి, ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త, నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 2024 ఫిబ్రవరి 21న ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత కూడా వరుస చాన్స్లతో కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారామె. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మేరే హస్బెండ్ కి బీవీ’ చిత్రంతో సందడి చేశారు రకుల్. ప్రస్తుతం హిందీలో ‘దే దే ΄్యార్ దే 2, పతీ పత్నీ ఔర్ ఓ 2’ వంటి మూవీస్తో బిజీ బిజీగా ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్. అలాగే కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘ఇండియన్ 3’లో రకుల్ నటించారు. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. షార్ట్ బ్రేక్ తర్వాత... ‘అందాల రాక్షసి’ (2010) సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయమయ్యారు లావణ్యా త్రి΄ాఠి. ఆ తర్వాత ‘మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా’ వంటి పలు హిట్ మూవీస్లో యాక్ట్ చేశారామె. తెలుగులోనే కాదు... పలు తమిళ చిత్రాల్లోనూ నటించారు లావణ్య. 2023 నవంబరు 1న హీరో వరుణ్ తేజ్ని ప్రేమ వివాహం చేసుకున్నారు లావణ్య. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాలు చేశారు. లావణ్య నటించిన తమిళ చిత్రం ‘టన్నెల్’, తెలుగు సినిమా ‘సతీ లీలావతి’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అథర్వా మురళి, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్పై ఎ.రాజు నాయక్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా లావణ్యా త్రి΄ాఠి, దేవ్ మోహ¯Œ జంటగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(‘శివ మనసులో శృతి’) సినిమాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 10న లావణ్యా త్రి΄ాఠి ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుని, మళ్లీ సినిమాలతో బిజీ అవుతారని ఊహించవచ్చు. పెళ్లయిన వెంటనే ప్రమోషన్తో... ‘పైలెట్స్’ (2000) సినిమాతో బాలనటిగా మలయాళంలో అడుగుపెట్టారు కీర్తీ సురేశ్. 2013లో విడుదలైన ‘గీతాంజలి’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మలయాళ, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2016లో విడుదలైన ‘నేను శైలజ’ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యారామె. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్, ఉప్పు కప్పురంబు’ వంటి పలు సినిమాల్లో నటించారు. దివంగత నటి సావిత్రి బయోపిక్గా రూపొందిన ‘మహానటి’ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు కీర్తి. వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న ఆమె... తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ని 2024 డిసెంబరు 12న వివాహం చేసుకున్నారు. గోవాలో హిందు, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం హనీమూన్కి కూడా వెళ్లకుండా తాను కథానాయికగా నటించిన తొలి హిందీ చిత్రం ‘మేరీ జాన్’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో మెడలో పసుపుతాడుతో పాల్గొని, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. పెళ్లి తర్వాత కూడా కీర్తీ సురేశ్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నటించిన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ఈ ఏడాది జూలై 4న రిలీజ్ అయింది. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా, కన్నివెడి’ వంటి తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి. టాప్ ప్లేస్లో... బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ్ర΄ాజెక్టులను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె. ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక ΄ారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే ΄ాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా ఉంది. భలే జోరు... అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు ఆలియా భట్. ‘సంఘర్‡్ష’ (1999) సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసిన ఆమె ఇప్పటికీ కెరీర్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. హీరోయిన్గా బిజీ బిజీగా ఉన్న సమయంలోనే హీరో రణబీర్ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ 14న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే కెరీర్ కంటిన్యూ చేశారు ఆలియా. వరుస అవకాశాలు అందిపుచ్చుకుని తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ నిరూపించారామె. రణబీర్ కపూర్–ఆలియా భట్లకు రాహా అనే పాప ఉంది. 2022 నవంబరు 6న వీరు తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందారు. పాప పుట్టిన తర్వాత సినిమాలకు కొంచెం విరామం ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ బిజీ బిజీ అయ్యారు. వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆల్ఫా, లవ్ అండ్ వార్’ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే... 2022లో రిలీజైన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్కి జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక బ్రేక్ లేకుండా... హీరోయిన్ కియారా అద్వానీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం బాలీవుడ్లోనే కాదు... టాలీవుడ్లోనూ ఈ బ్యూటీకి యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఫగ్లీ’ (2014) అనే సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కియారా దశాబ్దానికి పైగా దూసుకెళుతున్నారు. మహేశ్బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో వరుస అవశాలతో దూసుకెళుతున్న సమయంలోనే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్నారామె. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు కియారా. ఆమె నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది జనవరి 10న, ‘వార్ 2’ మూవీ ఆగస్టులో విడుదలైంది. ఈ ఏడాది జూలై 15న ఒక పాపకు జన్మనిచ్చారామె. ప్రస్తుతం ఆమె చేతిలో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే కన్నడ– ఇంగ్లిష్ చిత్రం ఉంది. పెళ్లి, తల్లయిన కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నారు కియారా. అయితే ఇక బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. వీళ్లే కాదు... ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, కాజోల్, రాణీ ముఖర్జీ, జ్యోతిక, కత్రినా కైఫ్, విద్యాబాలన్, యామి గౌతమ్, మౌని రాయ్.. ఇలా పలువురు హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా అవకాశాలు అందుకుంటూ తమ జోరు చూపిస్తున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
మటన్ ముక్క లేక ఆగిన పెళ్లిళ్లు..!
-
కల్లు ఇవ్వలేదని వివాహిత ఆత్మహత్య
వనపర్తి జిల్లా: కల్లు ఇవ్వలేదని వివాహిత ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. మండలంలోని రేమద్దులకు చెందిన భవానీ(26)కి మేనమామ అయిన మండ్ల రాములుతో 9ఏళ్ల కిందట వివాహమైంది. భవానీకి తరచుగా కల్లు తాగే అలవాటు ఉంది. అదేక్రమంలో ఆదివారం కల్లు తీసుకురావాలని భర్తకు చెప్పగా సాయంకాలం తీసుకొస్తానని చెప్పి భర్త కూలీ పనికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. కల్లు తీసుకొస్తానని చెప్పి తీసుకురాకపోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూలీ పనికి వెళ్లిన భర్త మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి చూడగా.. ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉన్న భార్య శవాన్ని కిందకు దించాడు. భవానీకి రోజూ కల్లుతాగే అలవాటు ఉండటం, కల్లు తాగకపోతే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేదని, భర్త కల్లు తెచ్చి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది క్షణికావేశంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తల్లి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పొద్దున మూడింటిదాకా పబ్జీ.. పెళ్లయిన నెలకే విరక్తి చెందిన భార్య
అ..అతడు.. ఆ.. ఆమె.. ఇద్దరూ పక్కపక్కనే ఉండే అక్షరాలు. నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన ఆలుమగలు. ఒకరికొకరం అనుకుంటూ ముందుకు నడవాల్సిన వారి మధ్య దూరం పెరుగుతోంది. కలిసి నడవాల్సిన పాదాలు తడబడుతున్నాయి. సర్దుకుపోలేమంటూ విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. మనస్సును మరింతగా మురిపించాల్సిన గిల్లికజ్జాల స్థానంలో అనుమానపు బీజాలు పడుతున్నాయి. చిలిపి చేష్టలు..అల్లరిగా గడపాల్సిన భార్యభర్తలు తమ జీవితాలను అల్లరిపాలు చేసుకుంటున్నారు. పని ఒత్తిడిలో మాటలు దూరమై.. కాపురాలు కాలదన్నుకునేంతవరకు వెళుతున్నారు. సరిదిద్దే పెద్దలు లేక ఎడముఖం..పెడముఖంగా సాగుతున్నారు. చివరకు ఈ కాపురం మావల్ల కాదంటూ విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు అర్బన్: పెళ్లంటే.. ప్రీ వెడ్డింట్ షూట్. ఎంగేజ్మెంట్ షూట్. బ్యాచ్లర్ పార్టీ. సంగీత్, మెహందీ.. ఆకాశమంత పందిరి.. మేళ తాళాలు. మూడుముళ్లు. మరి ఆ మూడు ముళ్లు పడిన మూడు నెలల తరువాత..? విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం. ఎంత వైభవంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో.. అంతే తొందరగా విడాకులకు సైతం ఉబలాట పడుతున్నారు. విడిపోయాక.. అదే జంట వాళ్లతోనే ప్రేమలో కూడా పడుతున్నారు. ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే కనిపిస్తున్న ఈ పోకడ.. ఇప్పుడు చిత్తూరు లాంటి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అర్థం కావడంలేదు ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతరానికి వైవాహిక బంధం అంత సులువుగా అర్థం కావడంలేదు. ప్రేమ, పెళ్లి వరకు ఉంటున్న ఆసక్తి.. పెళ్లి తరువాత కొనసాగనంటోంది. ప్రేమికులుగా ఉన్నపుడు బాధ్యత ఉండదు. మూడుముళ్లు పడేటప్పుడు వరి్ణంచడానికి వీలుకాని మధుర క్షణాలు.. అటు తరువాత నిలకడగా ఉండడంలేదు. దీనికి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమేనని మానసిక వైద్య నిపుణులు, మధ్యవర్తిత్వం చేసే కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు. పెళ్లయిన కొత్త జంటలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే, మరొకరు ఇంట్లో ఒంటరిగా ఉండలేక.. కుటుంబ సభ్యులతో మనస్తత్వం కలవక.. విడాకులవైపు అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగులైతే ఇక్కడ కూడా చాలా జంటల్లో సమస్య తలెత్తుతోంది. ఇంటి పనుల్లో ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోవడం, పనిచేసే ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి, సమస్యలు భాగస్వామిపై చూపించేసి.. ఇక కలిసి ఉండలేమని నెలల్లోనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఒక్క చిత్తూరు నగరంలోనే గత ఎనిమిది నెలల్లో 183 మంది విడాకుల కోసం కోర్టు మెట్లక్కారు. ఇందులో పెళ్లయిన సంవత్సరంలోపు విడాకుల కోరుకుంటున్న వారి సంఖ్య 32 శాతం ఉండడం వివాహ బంధంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తోంది.విడగొడుతున్న ‘సెల్’ భూతం దంపతులు విడిపోతుండటానికి ప్రధాన కారణం మాత్రం సెల్ఫోన్గా తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలు అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో గడుపుతుండడం, తన భాగస్వామిని పట్టించుకోకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడడం, కొందరు అవధుల్లేని విశృంఖల కోరికలు కోరడం లాంటివి అవతలి వ్యక్తికి జీవితంపై విరక్తి పుట్టిస్తోంది. ఇటీవల చిత్తూరు పోలీసుల వద్దకు కౌన్సెలింగ్కు వచ్చిన ఓ జంట ‘మాకు పెళ్లయ్యి 38 రోజులయ్యింది. నా భర్త వేకువజామున 3 గంటల వరకు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడు. ఒక రోజు, రెండు రోజులు.. కానీ ప్రతిరోజూ ఇదే తంతు. ఇతనితో కలిసి ఉండడం నావల్ల కాదు..’ అంటూ 22 ఏళ్ల యువతి తన ఆవేదనను వ్యక్తం చేయడం అక్కడున్న కౌన్సెలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పడకగదిలోకి సెల్ఫోన్ తీసుకెళ్లడం తమ ప్రేమానురాగాలు, దాంపత్యజీవితాన్ని మూడో వ్యక్తికి చూపించడమే అవుతుందని చాలా మందికి అర్థం కావడంలేదు. సర్దుకుంటున్న వాళ్లు చాలా తక్కువ.. విడాకుల కోసం న్యాయస్థానం మెట్లకెక్కుతున్న జంటలకు మేము కౌన్సెలింగ్ ఇస్తుంటాం. ఈ మధ్య ఒకటి గమనించాం. దంపతులు సర్దుకోవడం, మళ్లీ కలిసి ఉండడం అనే ప్రస్తావనను ఏమాత్రం ఒప్పుకోనంటున్నారు. ఆర్థిక స్తిరత్వం ఉన్నవాళ్లు అస్సలు కలిసి ఉండడానికి ఇష్టపడడంలేదు. మారుతున్న తరాలకు మధ్య స్వేచ్ఛ, ఒంటరితనం, నచ్చినట్టు బతకడం, భర్త–భార్య ఒకరినొకరు ప్రశ్నించకుండా ఉండాలనుకోవడం లాంటివి ఎక్కువగా కోరుకుంటున్నారు. – చక్రవర్తిరెడ్డి, న్యాయవాది, చిత్తూరు చట్టపరంగానే.. వివాహ బంధం గొప్పదే. కానీ ఒకరిపై ఒకరికి తప్పకుండా గౌ రవం, నమ్మకం ఉండాలి. అవిలేకుండా చాలా మంది విడిపోవడానికి మొగ్గు చూపిస్తున్నా రు. ఇంట్లో గొడవ అని వచ్చే దంపతులకు మంచీ– చెడు చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇక కలిసి ఉండలేము, కేసులు పెట్టండి అని కొందరు వస్తుంటారు. మెయింటెనన్స్, భరణం కోసం వచ్చేవాళ్లకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాం. – టి.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీ
కన్నడ బుల్లితెర యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత, ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్లో ఈ వివాహం జరిగింది. ఈ జంట సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో అభిమానులుఫుల్ ఖుషీగాఉన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.అనుశ్రీ సాంప్రదాయ నారింజ రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. నెక్లెస్, రాణి హార్, కమర్బంద్, మాంగ్ టీకా, ఝుంకాలు, బ్యాంగిల్స్ , ఇతర టెంపుల్ జ్యుయల్లరీతో అందంగా మెరిసిపోయింది. మరోవైపు, వరుడు రోషన్ బంగారు కుర్తాను , మ్యాచింగ్ ధోతీని ధరించాడు. అనుశ్రీ - రోషన్ వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలుఅనుశ్రీ - రోషన్ వివాహానికి మెహందీ, హల్ది లాంటి ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారుఘీ సన్నిహిత వేడుకల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సన్నిహితులు హృదయపూర్వక శుభాకాంక్షలతో వెల్లువెత్తాయి.అనూశ్రీ భావోద్వేగం: రోషన్ మంగళసూత్రాన్ని కట్టుకుంటుండగా అనుశ్రీ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకుంది. కన్నడనాట అనుశ్రీ తన టాలెంట్, యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను, పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొంది. మంగళూరులో జన్మించిన అనుశ్రీ, చిన్నతనంలోనే తండ్రి విడిచి పెట్టడంతో తల్లితో పాటు పెరుగుతూ అనేక కష్టాలను ఎదుర్కొంది. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. కరియర్లో నిలదొక్కుకుని తన తల్లి కోసం ఒక ఇల్లు కూడా నిర్మించింది, ఆమె సోదరుడు తన సొంత హోటల్ వ్యాపారాన్ని స్థాపించాడు. తన కుటుంబం బాధ్యతలను నెరవేర్చిన ఇన్నాళ్లకు అనుశ్రీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. భార్యగా తన కొత్త పాత్రను స్వీకరించింది. -
బాయ్ ఫ్రెండ్తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్
ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష కుమారుడు వివాహ వేడుకలో బాక్సింగ్ సంచలనం మేరీ కోమ్ (Mary Kom స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచారు. బాక్సింగ్ రింగ్ను శాసించిన లెజెండ్మేరీ కోమ్ గోల్డెన్సిల్క్ చీర, నిండుగా నగలు, తలనిండా పూలతో ట్రెడిషనల్ లుక్లో కనిపించి ఫ్యాన్స్తో పాటు పలువుర్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన లుక్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో మేరీ కోమ్ షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కిర్రాక్ ఫోజులతో బాక్సింగ్ రింగ్లోనే కాదు..బ్యూటీలో కూడా క్వీన్ అనిపించుకుంది. అంతేకాదు ఆమె పక్కన నడిచిన వ్యక్తికూడా చర్చల్లో నిలిచాడు.మేరీ కోమ్ ముస్తాబైంది ఇలా View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom)ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టిన మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్..అద్భుతమైన బాక్సర్ ఒలింపిక్ మెడల్ విజేతగా నిలిచారు. ఒక సాధారణ క్రీడాకారిణి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ గెలిచిన ఏకైక బాక్సర్. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకుని భారత క్రీడా ప్రపంచంలోనే కాకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ .మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనారు. 2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్ను పెళ్లి చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలు. అయితే విభేదాల కారణంతో గత ఏడాది భర్తతో విడిపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించారు.ఎవరీ హితేష్ చౌదరి కాగాభర్తతో విడాకుల తరువాత తన వ్యాపార భాగస్వామి హితేష్ చౌదరి( Hitesh Choudhary))తో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి.మేరీ కోమ్ లేదా హితేష్ చౌదరి ఇద్దరూ బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ, గతంలో అనేక సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ తాజాగా పెళ్లి వేడుకలో కూడా సందడి చేశారు. ఉమ్మడి వ్యాపార వెంచర్ స్పోర్టీ ఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ హితేష్ చౌదరి సీఎండీగా ఉన్నారు. -
పీటీ ఉష కొడుకు పెళ్లి : స్పెషల్ ఎట్రాక్షన్గా మేరీ కోమ్
ప్రముఖ అథ్లెట్ , రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, వి. శ్రీనివాసన్ ల కుమారుడు డాక్టర్ విఘ్నేష్ ఉజ్వల్ పెళ్లి పీటలెక్కాడు. సోమవారం లే మెరిడియన్ హోటల్లో జరిగిన విలాసవంతమైన వేడుకలో అశోక్ కుమార్ -షిని కుమార్తె కృష్ణను సాంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. కొచ్చిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడా, రాజకీయ, చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, నటుడు శ్రీనివాసన్, కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ , ఎంపి జాన్ బ్రిట్టాస్ ఉన్నారు.“ఈ వివాహం తన కొడుకు జీవితంలో తదుపరి దశ. తల్లిగా తన జీవితంలో ఎంతో ఆనందమైన క్షణాలు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేననీ, నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత తనకు నచ్చిన, మెచ్చిన అమ్మాయిని తన భాగస్వామిగా చేసుకున్నాడని పీటీ ఉష వెల్లడించారు. స్విట్జర్లాండ్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్పోర్ట్స్ మెడిసిన్లో డిప్లొమా సంపాదించారు. ప్రస్తుతం అతను పి.టి. ఉష కేరళలో స్థాపించిన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్లో స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by P.T.Usha (@ptushaofficial) అందంగా మెరిసిన వధూవరులు విశాలమైన బంగారు జరీ అంచు, క్లిష్టమైన మోటిఫ్లతో నేసిన కంజివర్మ చీరలో నవ వధువు అందంగా కనిపించింది. మ్యాచింగ్ బ్లౌజ్, సాంప్రదాయ ఆభరణాలతో ఆమె ముగ్ధమనోహరంగా కనిపించింది. ముఖ్యంగా, చక్కటి నక్షి డిజైన్తో రూపొందించిన చోకర్తో , పొడవాటి లేయర్డ్ నెక్లెస్తో జత చేసింది. ఇంకా అందమైన టెంపుల్ మాంగ్-టీకాతో పాటు మ్యాచింగ్ చెవిపోగులు, కమర్బంధ్, వంకీ , ఉంగరాలు ధరించింది. సింపుల్ మేకప్ ,గ జ్రాతో అలంకరించిన జడ ఆమెకు అందంగా అమరాయి. మరోవైపు, వరుడు విఘ్నేష్ లేత గోధుమరంగు టోన్ గల కుర్తా, ధోతీ మరియు కండువాలో అందంగా కనిపించాడు.పి.టి. ఉష కొడుకు పెళ్లిలో మేరీ కోమ్ స్పెషల్బాక్సింగ్ రింగులో పంచులతో విరుచుకుపడి ప్రత్యర్థులను మట్టి కరిపించి, బంగారు పతకాలతో మురిపించిన మేరీ కోమ్ ఈ పెళ్లిలో ట్రెడిషనల్లుక్లో ఆకట్టుకున్నారు. గోల్డెన్ సిల్క్ చీర, ఆభరణాలు, తలలో మల్లెలతో కేరళ స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షించారు అంతేకాదు, కల్యాణానికి వచ్చినఅందరి ప్రశ్నలకు సంతోషంతో సమాధానాలిస్తూ కనిపించారు .తాను కేరళ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాననీ వడ, ఇడ్లీ, సాంపార్ అన్నీ బెస్ట్అని మేరీ కోమ్ చెప్పుకొచ్చారు.. కేరళలో అందరూ చోట్ ఇష్టపడతారు, ఐ లైక్ చావల్, ఐ ఆమ్ ఏ రైస్ ఈటర్ అని చెప్పారు. మరి ఫిట్ నెస్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించినపుడు.. మితంగా తింటూ పరవాలేదు అని సమాధానమిచ్చారు. -
అర్థం చేసుకోవాలి... అనర్థాలు నివారించుకోవాలి
పెళ్లి మంత్రాల్లో ఏ అర్థం ఉందో తెలుసుకోరు చాలామంది. పెళ్లిలో ఎలాంటి విధానంతో మెలగాలో తెలుసుకోరు ఎంతకాలమైనా. బడిలో ఒకటో తరగతి నుంచి పాఠాలు చదువుతారుగాని పెళ్లిలో ఏ అవగాహన పాఠాలు చదవకుండానే నెట్టుకొచ్చేయాలనుకుంటారు. వర్తమానంలో దంపతుల మధ్య జరుగుతున్న అనర్థాలు ప్రతి ఒక్కరినీ ఆగి, తమ వైవాహిక జీవనాన్ని తరచి చూసుకోమని కోరుతున్నాయి. సరి చేసుకుని ఆనందమయం చేసుకోమంటున్నాయి.న్యూస్పేపర్లు తెరిస్తే భార్యాభర్తల విడాకులు, హత్యోదంతాలు, ఆత్మహత్యలు... సోషల్ మీడియాలో చూస్తే వీధికెక్కి రచ్చ చేసుకోవడం, ఇంటి గుట్టు బయటపడేయడం... వివాహం వార్తగా మారడం... వివాహ గొడవలే ప్రధాన వార్తలుగా చలామణి కావడం చూస్తుంటే మనం ఎటువంటి సమాజం నుంచి ఎటువంటి సమాజానికి చేరుకుంటున్నామనేది పరిశీలించుకోవాలి.గతంలో ఎలా ఉండేది?నలభై, యాభై ఏళ్ల క్రితం వివాహ వ్యవస్థలో ఘోరమైన ఉదంతాలు ఇంత విస్తృతంగా కనిపించేవి కాదు. దంపతులు, పిల్లలు, అవ్వా తాతలు... కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. భార్యాభర్తల కీచులాటలు టీకప్పులో తుఫానులా ఉండేవి. చెప్పాలంటే కొందరు భార్యాభర్తల గొడవలు వీధిలో ఉన్నవారికి నవ్వులాటగా ఉండేవి. అంటే భార్యాభర్తలు చీటికి మాటికి కీచులాడుకోవడం నవ్వదగ్గ విషయంగా, వారి చేతగాని విషయంగా ఉండేది. విడాకులు అనే మాట చాలా అరుదుగా వినవచ్చేది. విడాకుల నిర్ణయానికి ఇటువైపు వర్గం, అటువైపు వర్గం వ్యతిరేకంగా నిలిచేది. యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం విడిపోవడానికి పట్టుపట్టడంలో ఉండేది కాదు.ఇవాళ ఎలా ఉంది?వివాహ వ్యవస్థను గౌరవించకపోవడం, ఒకరి పట్ల ఒకరు చూపాల్సిన నిజాయితీ లోపించడం, పిల్లల మీద కక్ష తీర్చుకోవడం, సమస్యకు బదులుగా భార్యనో భర్తనో నిర్మూలించడమే ఏకైక పరిష్కారం అనుకోవడం, వివాహం జీవితానికి ఒక గుదిబండగా మారిందని దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెడు మార్గాలు వెతకడం, హాయిగా ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఆ నునుపైన కొండలపై మరింత హాయిగా గడపాలనుకోవడం... ఇవన్నీ అందమైన జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. పరేషానీలోకి నెట్టేస్తున్నాయి. మానసిక, శారీరక కష్టాలు తెచ్చి భవిష్యత్తును చావు దెబ్బ తీస్తున్నాయి.మీ వివాహం సమస్యల్లో ఉంటే–మీ వివాహం సమస్యల్లో ఉంటే మీ వివాహ బంధంలో ఈ విషయాలను చెక్ చేసుకోండి.1. నిజాయితీ: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీతో ఉన్నారా? నిజమైన ప్రేమతో ఉన్నారా? నిజమైన ప్రేమ పొందేలా మీ చర్యలు ఉన్నాయా? ప్రేమను ప్రదర్శిస్తున్నారా? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఒకసారైనా చెప్పగలుగుతున్నారా. ప్రేమ వివాహానికి మూలం. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు ప్రేమ పొందలేరు.2. కమ్యూనికేషన్: మీ మనసులో ఉన్నది స్పష్టంగా మీ జీవిత భాగస్వామికి చెబుతున్నారా? చెప్పి వారికి అది అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారా? అన్నీ మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే అది హింస కిందకు వస్తుంది. మౌనంతో హింసించే విధానం మానుకుంటే వివాహంలో మాట, మంచి మాట మెల్లగా వస్తాయి.3. వింటున్నారా?: వినడం తెలిస్తే సగం సమస్యలు పోతాయి. మీ జీవితభాగస్వామి ఏదైనా చెప్పబోతే మధ్యలోనే తుంచేస్తే, ఎదురు చెప్తే ఇక ఏమీ ముందుకు వెళ్లదు. ఎదుటి వారు చెప్తున్నది పూర్తిగా విని, సమయం తీసుకొని అందులోని మంచి చెడు పట్ల మీ అభిప్రాయం మెత్తగా, స్పష్టంగా చెప్పగలిగితే, అరవడాలు కరవడాలు లేకుండా మాట్లాడుకోగలిగితే చాలు. వివాహం వర్థిల్లుతుంది.4. గౌరవం ఉండాలి: ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు ఇష్టపడతాడంటే ఆ మనిషి తనను గౌరవిస్తున్నాడని తెలిసినప్పుడే. మనం వెళితే గౌరవించి టీ ఇచ్చే ఇంటికే మనం వెళ్తాం తప్ప ముఖాన తలుపు వేసే వారింటికి వెళతామా? భార్యాభర్తల విషయం కూడా అంతే. చులకన భావం వివాహానికి ప్రథమ విరోధి. భార్య/భర్త ఒకరినొకరు చులకన భావంతో చూస్తే వివాహం చులకనకు లోనవుతుంది. ఆ తర్వాత హేళన, ఆపైన తిట్టు, అటుపై కొట్లాట, తదుపరి నువ్వెంతంటే నువ్వెంత అనే మాటలు వచ్చేస్తాయి. చులకన వద్దు.5. సహానుభూతి: పని చేసి అలసిపోయి ఉంటాడేమో, వంటపని, ఇంటి పనితో డస్సిపోయిందేమో అని ఒక నిమిషం పరస్పరం ఆలోచిస్తే... సానుభూతి అందిస్తే ఎంతో ఓదార్పుగా ఉంటుంది. అలసిపోయి ఉన్న జీవిత భాగస్వామిని ‘ఆ.. పెద్ద చేశావులే’ అనే ఒక్క మాటతో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సహానుభూతి చూపితే అది పెద్ద సహాయం చేస్తుంది. ఎమోషనల్ ఇంటిమసీ చాలా ముఖ్యం.6. హద్దులు: మీరు వివాహం చేసుకున్నారు కాని ΄÷లంలో పని చేసే ఎద్దును తెచ్చుకోలేదు. వివాహంలో హద్దులు ఉంటాయి. భార్య/భర్తల పర్సనల్ స్పేస్లో ఎంతవరకు వెళ్లాలో తెలుసుకొని ఉండాలి. ఉమ్మడి ఇష్టాలను కలిసి నిర్వహించుకోవాలి.7. ఆర్థికం: ఆర్థిక విషయాలలో భార్యాభర్తల మధ్య అవగాహన అన్నింటి కంటే ముఖ్యం. అప్పులు, అధిక ఖర్చులు ఇద్దరిలో ఎవరు చేసినా ఆ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ప్రతి పైసా గీచిగీచి లెక్క అడిగినా ప్రమాదమే. ఇంటి ఖర్చు, ΄÷దుపు, బాధ్యతలకు అవసరమైన సహాయం... వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అంతటా అనుకూలమే.ఈ ఏడు సలహాలు వివాహం ముందుకెళ్లడానికి ఏడడుగులు.పెళ్లి అర్థం కాకుండా పెళ్లెందుకు చేసుకున్నారు?పెళ్లి బొమ్మలాట కాదు. అది పెద్ద బాధ్యత. జీవితాన్ని ఫలవంతం చేసే దశ. ఒంటరి మనిషికి కుటుంబం అనే అందమైన బాంధవ్యాన్ని ఇచ్చే వరం. సంతానాన్ని ఇచ్చి ఎనలేని తృప్తినిచ్చే మార్గం. వివాహంలో అడుగుపెట్టాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యి అన్నీ ఆలోచించుకుని ఉండాలి. కాని గతంతో పోలిస్తే ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లేదు. అమ్మాయి, అబ్బాయిల ఇష్టాయిష్టాలు తమకు తాము పట్టించుకోకపోవడం, కుటుంబాలు నిర్లక్ష్యం చేయడం, పొంతన కుదురుతుందో లేదో చూడకపోవడం, అబ్బాయికి అమ్మాయికి ఉన్న ఉపాధి మార్గాలు వారిని కలిపి ఉంచుతాయా... ఎక్కువ పని గంటల వల్ల గాని, ఇతర ఊర్లకు వెళ్లి పని చేయడం వల్లగాని గ్యాప్ తెస్తాయా చూడకపోవడం... డబ్బు పట్ల ఎవరికి ఎంత ఆశ, అత్యాశ ఉంది... అబ్బాయి/అమ్మాయి గురించి ఆరా తీస్తే వారు పెద్దలకు, సంప్రదాయాలకు ఇచ్చే విలువ ఏ మాత్రం ఉంటుంది... ఇవన్నీ చూడకుండానే చేసేస్తున్నారు. దాని వల్ల సమస్యలు వెంటనే బయల్దేరుతున్నాయి. -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.గియా తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్ జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్ కే.. నా ఘాట్ కే లాంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Gia Manek (@gia_manek) -
70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!
బాలీవుడ్, హాలీవుడ్ రంగం ఏదైనాలబ్రిటీల పెళ్లిళ్లు, వయస్సు-అంతరాయాలు చర్చ సర్వ సాధారణం. తాజాగా స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ తనకంటే పెద్దదైన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం, 51 ఏళ్ల బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా విడాకులు , మళ్లి పెళ్లి వార్తల నడుమ 70 ఏళ్ల వయసులో కబీర్ బేడి నాలుగో పెళ్లి అదీ తన కూతురువయసున్న అమ్మాయిని చేసుకున్న వార్త చర్చల్లో నిలుస్తోంది. వయసులో తనకంటే చిన్నవాళ్లను వివాహం చేసుకోవడంపై చర్చను మళ్ళీ లేవనెత్తింది: ప్రేమలో వయస్సు నిజంగా ముఖ్యమా, లేదా పరస్పర అవగాహన ముఖ్యమైనదా? అనే హాట్ టాపిక్గా మారింది.కబీర్ బేడి ప్రేమకథప్రముఖ నటుడు కబీర్ బేడీ తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన గొప్ప నటుడు. వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని విమర్శలనెదుర్కొన్నాడు. 2016లో తన 70 పుట్టి రోజు సందర్భంగా తనకంటే దాదాపు 30 ఏళ్లు చిన్నదైన పర్వీన్ దుసాంజ్ను వివాహమాడటం ఆయన కుటుంబంలో కూడా విమర్శలకు తావిచ్చింది. అయితే పదేళ్ల పరిచయం, ప్రేమ తరువాత తామీ నిర్ణయం తీసుకున్నామని పర్వీన్ తన జీవితంలోకి రావడంఎంతో సంతషాన్నిచ్చిందనీ అందుకే పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేశాడు. 2005లో వీరు తొలిసారి కలుసుకున్నారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి గడిపిన తర్వాత, కబీర్ బేడి 2011లో రోమ్ పర్యటన సందర్భంగా ప్రపోజ్ చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో 2016, జనవరి 15న ముంబై సమీపంలోని అలీబాగ్లో ఒక ప్రైవేట్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. నటి , కబీర్ బేడీ కుమార్తె పూజా బేడి కంటే పర్వీన్ ఐదేళ్లు చిన్నది.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుప్రేమకు నిజంగా వయసు అవసరమా?ప్రేమ ఏ వయసులోనైనా వస్తుందనీ, ప్రేమకు హద్దులు లేవు; సామాజిక అంచనాలు లేదా వయస్సు తేడాలు దానిని పరిమితం చేయలేవని నిపుణులు చెబుతున్న మాట. ఇదే విషయాన్ని నటి మలైకా అరోరా ఇటీవల స్పష్టం చేసింది. పెళ్లి విషయంలో తానేమీ తలుపులు మూసుకోలేదని, జీవితం ఏ దశలోనైనా కొత్త అవకాశాం రావచ్చని స్పష్టం చేసింది.నిపుణుల ప్రకారం వయస్సు వ్యత్యాసాలు అంతర్గతంగా సమస్యాత్మకమైనవి కావు. ఒక జంట కావాల్సింది ముఖ్యమైన భావోద్వేగ, మానసిక అనుకూలత. పరస్పర అవగాహన. ఇవి లేనపుడు మాత్రమే సమస్యలు సవాళ్లు వస్తాయనేది వారు చెబుతున్న మాట. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట, మిలింద్ సోమన్- అంకితా కోన్వర్ లాంటి సెలబ్రిటీల నిజమైన ప్రేమ బంధానికి ఇదే కారణమని ఉదాహరిస్తున్నారు.పెళ్లి ఈ పునాదులపైఇద్దరి మధ్యా స్పష్టమైన కమ్యూనికేషన్నమ్మకం, పరస్పర గౌరవం భావోద్వేగ మద్దతు (emotional support)ఈ ప్రధానమైన అంశాలు, విలువల ఆధారంగా చాలా జంటలు వారి వయస్సు అంతరంతో సంబంధం లేకుండా బలమైన బంధాన్ని కొనసాగించ గలుగుతారని, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అవగాహనే ముఖ్యమని రిలేషన్షిప్ కౌన్సెలర్లు, సామాజిక, మానసిక నిపుణులు చెబుతున్నామాట. -
సంసారం సాఫీగా ఉండాలంటే ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి: నటుడు
దాంపత్య జీవితం బాగుంటే..జీవితం సాఫిగా హాయిగా సాగిపోతుందని చెప్పొచ్చు. అంతేగాదు అటు కెరీర్ పరంగానూ, ఫ్యామిలీ పరంగా హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటాయి. పైగా జీవితాన్ని మంచిగా లీడ్ చెయ్యొచ్చు. అయితే ఈ విషయంలో అందరు ఎక్కువగా పొరపాటులు చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరూ సమానంగా బ్యాలెన్స్ కావాలి. అప్పుడే సంసారం అనే నావా సాపీగా సాగుతుంది. ఇందులో ఎవ్వరో ఒక్కరూ తేడాగా ప్రవర్తించినా.. అంతే పరిస్థితి. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ జాన్ అబ్రహం మాత్రం ఈ మూడు నియమాలు పాటిస్తే..దాంపత్య జీవితాన్ని పటిష్టంగా మార్చుకోవచ్చని చెబుతున్నాడు.జాన్ అబ్రహం వైవిధ్యభరితమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. ఆయన నటుడిగా, నిర్మాతగా ఎంత మంచి మంచి చిత్రాలు చేసినా..వ్యక్తిగత జీవితం మాత్రం అత్యంగ గోప్యంగా ఉంటుంది. అసలు పబ్లిక్గా కనిపించడం కూడా అత్యంత అరుదే. అలాంటి వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ ప్రియా రంచల్ అనే అమ్మాయిని 2014 యునైటెడ్ స్టేట్స్లో వివాహం చేసుకున్నాడు. అదికూడా ప్రైవేట్గా ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా బంధువుల సమక్షంలో చేసుకున్నారు. ఆ విషయం కూడా బయటకు పొక్కనీయలేదు జాన్. ఒక న్యూఈయర్కి శుభాకాంక్షలు చెబుతూ ప్రియా జాన్ అని సంతకం చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అదీగాక ఈ జంట పబ్లిక్గా కనిపించడం కూడా అరుదే కాబట్టి తెలిసే ఛాన్స్ తక్కువ కూడా. 11 ఏళ్ల వైవాహికబంధంలో ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఆనందంగా లైఫ్ని లీడ్ చేస్తోంది ఈ జంట. ఆయన ఇటీవల ఒక సంభాషణలో వివాహ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వైవాహిక జీవితం స్ట్రాంగ్గా ఉండాలంటే మూడు నియమాలు పాటించాలంటూ కొన్ని టిప్స్ షేర్ చేశాడు. నా సినిమాలకు, వ్యక్తిగత జీవితంతో సబంధంలేదు. అందుకే తాను మూవీ షూటింగ్ అయిపోగానే వెళ్లిపోతా..అక్కడ ఎక్కడ తన గురించి, ఫ్యామిలీ గురించి ప్రస్తావించనని అన్నారు. అలాగే నా పేరు గాసిప్స్ హెడ్లైన్కి వెళ్లేలా ఎలాంటి ప్రచారక్తరను నియమించుకోలేదని చెబుతున్నాడు. ఎందుకంటే తన షూటింగ్స్ ముగించుకుని నేరుగా తన ఇంటికి వెళ్లిపోతానని అన్నారు. అలాగే తన భార్య కూడా ఈ గోప్యతను పాటిస్తుందని చెప్పాడు. ఎక్కడ తన గురించి ప్రస్తావన చేయదు. అదే మా దాంపత్యాన్ని బలోపేతం చేస్తుందని అన్నాడు. ఇక్కడ ఒకరంటే ఒకరికి గాఢమైన నమ్మకం..పెట్టుకున్న నియమాన్ని బ్రేక్ చేయకుండా గౌరవించడం అనేవి బంధాన్ని దృఢంగా మారుస్తుందని చెబుతున్నాడు అబ్రహం. మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ప్రైవసీని కూడా మనం కాపాడాలని, మన కెరీర్ వాళ్ల జీవితాన్ని ఇబ్బందులో పెట్టేలా చేయకూడదనేది తన ఉద్దేశ్యమని అంటున్నాడు. ఇక జాన్ భార్య ప్రియా అత్యంత విజయవంతమైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, పైగా ఆమె కూడా మీడియాకి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతుందట. ఏ జంట అయిన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచితే..ఎలాంటి చిక్కుల్లో పడరు. రిలేషన్ కూడా స్ట్రాంగ్ ఉంటుందనేది నటుడు జాన్ చాలా చక్కగా వివరించారు.(చదవండి: స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..) -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. అనంతపురం జన సంద్రం
-
కాపురం చేస్తూనే.. రెండో పెళ్లికి సిద్ధం
తూర్పు గోదావరి: ఓ మహిళతో కాపురం చేస్తూనే.. పెళ్లి పేరుతో మరో యువతిని మోసం చేసేందుకు యత్నించి, తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. సీఐ బీఎన్ పట్నాయక్ వివరాల మేరకు, గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతికి, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి వీరవెంకట సత్యనారాయణతో ఇటీవల వివాహం కుదిరింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వధువు ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరో గంటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కనిపించడంలేదంటూ వధువు బంధువులకు రాత్రి ఏడు గంటల సమయంలో సమాచారం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె బంధువులు అసలు వివరాలు సేకరించారు. అంతకు ముందే సత్యనారాయణకు పెళ్లయి, కాపురం చేస్తున్నాడని, అందుకే పెళ్లికి రాకుండా అదృశ్యమైనట్టు సమా చారం అందింది. దీంతో వధువు కుటుంబానికి న్యా యం చేయాలంటూ ఆమె బంధువులు ఆందోళన చేశా రు. సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ పట్నాయక్ తెలిపారు. -
జగ్గారెడ్డి కూతురి పెళ్లిలో ప్రముఖుల సందడి (చిత్రాలు)
-
గ్రాండ్గా మధు ప్రియ సిస్టర్ పెళ్లి వేడుక.. ఫోటోలు పంచుకున్న సింగర్!
టాలీవుడ్ సింగర్ మధు ప్రియ చెల్లి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఇవాళ ఆమె సిస్టర్ శృతి ప్రియ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మధుప్రియ. తన చెల్లి పెళ్లిలో ఫుల్ ఎనర్జిటిక్గా డ్యాన్స్ చేసింది సింగర్. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.కాగా.. సింగర్ మధు ప్రియ తన సిస్టర్ శృతి ప్రియ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వేడుక వరకు తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంది. నిశ్చితార్థం వేడుక రోజు ఫోటోలను అభిమానులతో పంచుకుంది.కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది. View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Ramu Rathod (@ramurathod__official) -
చెల్లి పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుకలో సింగర్ మధుప్రియ
సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే తాను దగ్గరుండి చెల్లికి నిశ్చితార్థం చేసిన మధుప్రియ.. ప్రస్తుతం పెళ్లి పనుల్లోనూ బిజీ అయిపోయారు. తాజాగా తన చెల్లెలు శ్రుతిప్రియ పెళ్లి వేడుక సంబురాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవాళ నిర్వహించిన హల్దీ వేడుక వీడియోలను పోస్ట్ చేశారు. చెల్లి పెళ్లి కూతురైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.(ఇది చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్)కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది. అయితే 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మధుప్రియ.. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) -
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మహిళా సైనికురాలు.. కారణం ఏంటంటే?
చెన్నై: ఓ మహిళా సైనికురాలు కన్నీరుమున్నీరలయ్యేలా విలపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘తాను దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తుండగా.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని వాపోయారు. అగంతకులు తన పెళ్లికోసం కొనుగోలు చేసిన బంగారంతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు దోచుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమిళనాడులోని నారాయణపురం గ్రామానికి చెందిన కళావతి జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తుండగా.. జూన్ 24న నారాయణపురం తన గ్రామంలోని ఇంట్లో దొంగతనం జరిగింది.ఇదే విషయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యవసాయం నిమిత్తం నాతల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఆ సమయంలో అగంతకులు నా ఇంటి తాళం పగలగొట్టి, నా పెళ్లి కోసం దాచుకున్న ఆభరణాలన్నీ దొంగిలించారు. దొంగతనం జరిగిన రోజైన జూన్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ జూన్ 25న ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్నారని ఎవరూ దర్యాప్తుకు రాలేదు. తర్వాత వేలిముద్రలు సేకరించి జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’అని కళావతి వీడియోలో పేర్కొన్నారు.ఆ వీడియో వైరల్గా మారింది. సైనికురాలి వీడియోను తమిళనాడు బీజేపీ నేత అన్నామలై షేర్ చేస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికురాలి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అయితే,ఆ వీడియోపై వెల్లూరు జిల్లా పోలీసులు స్పందించారు.జూన్ 24న కళావతి తండ్రి కుమారసామి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, కళావతి పెళ్లి కోసం పక్కన ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదు, ఒక పట్టు చీర దొంగతనం జరిగింది. జూన్ 25న భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వేలిముద్రల నమూనాలు సీసీటీవీ ఫుటేజ్లను సేకరించామని పోలీసులు తెలిపారు.అనుమానితుల సెల్ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDRలు) తిరిగి పొందడానికి వారు టవర్ డంప్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. జూన్ 29న, ఫిర్యాదుదారుడు తన ప్రకటనను సవరించి దొంగిలించబడిన ఆభరణాల బరువు 22.5 తులాలని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదంలో నిజమెవరిదో తేలాలంటే, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. A CRPF jawan from Tamil Nadu, serving with honour at our nation’s borders in J&K, is forced to take to social media on police inaction on the case of jewellery theft from her residence near Katpadi in June this year. What kind of governance forces a woman in uniform to beg for… pic.twitter.com/BnU6WtT99l— K.Annamalai (@annamalai_k) August 4, 2025 -
పాక్ క్రికెటర్తో మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీతోనూ పెళ్లి: తమన్నా
మిల్కీ బ్యూటీ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా. తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదు. ఈ ఏడాదిలో ఓదెల-2 మూవీతో అభిమానులను పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తనపై వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది.గతంలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్తో తమన్నా పెళ్లి అంటూ వచ్చిన కథనాలపై స్పందించింది. ఇలాంటి వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయని గుర్తు చేసుకుంది. ఓ ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవంలో అబ్దుల్ రజాక్తో కలిసి ఫోటో దిగడంతో ఇలాంటి రూమర్స్ వచ్చాయని తెలిపింది. తనకు కేవలం అబ్దుల్ రజాక్తో మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీతోనూ తనకు ముడిపెట్టారని వివరించింది. నా జీవితంలో విరాట్ను కేవలం ఒక్కసారి మాత్రమే కలిశానని తమన్నా వెల్లడించింది. ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా, బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఇలాంటి వాటిని మరిచిపోవడానికి కాస్తా సమయం పడుతుందని తెలిపింది. -
కలసి తింటూ.. బరువెక్కుతున్నారు
చుక్క లాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి! ఒకరితో ఒకరికి పెళ్లయింది. పెళ్లికి ముందు ‘ఎవరికి వారు’గా ఉన్నవారు, పెళ్లి తర్వాత ‘ఒకరి కోసం ఒకరు’ అన్నట్లుగా మారిపోయారు. మంచిదే కదా! మంచిదే కానీ.. వాళ్లలో మెల్లగా మార్పు మొదలైంది! గొడవలా? కాదు. మనస్ఫర్థలా? కాదు. ఉద్యోగాల్లో పడి ఒకరికొకరు టైమ్ ఇవ్వటం లేదా? కాదు.. కాదు! మరేంటి సమస్య? ఏంటంటే – ఇద్దరూ బాగా లావైపోయారు! అవునా!! అవును. దేశమంతటా ఇదే ధోరణి కనిపిస్తోందట! కలిసి తినటమే దంపతులను ఊబకాయులుగా మార్చేస్తోందట.⇒ అయ్యో రామా, భార్యాభర్తలు కలిసి తినటం కూడా తప్పేనా? తప్పు కాదు కానీ, ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తమ ఆహారపు అలవాట్లు మార్చుకునే క్రమంలో ‘సయోధ్య’తో ఒకే రకమైన ఆహారం తీసుకోవటం వల్ల ఇద్దరూ కూడా క్రమేణా బరువు పెరిగే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐ.సి.ఎం.ఆర్.) అంటోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.) దగ్గరున్న డేటాలో 50 వేలమందికి పైగా దంపతుల ఆహార అలవాట్ల వివరాలను విశ్లేషించిన ఐ.సి.ఎం.ఆర్., ఆ దంపతులలో 27.4 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు కనుగొంది. ఈ ధోరణి ప్రధానంగా పట్టణ, సంపన్న వర్గాలలోని దంపతులలో కనిపించిందని తాజా అధ్యయనం వెల్లడించింది.⇒ దంపతుల ఆహార స్వేచ్ఛ..: సాధారణంగా భారతీయ కుటుంబాలలో అందరికీ కలిపి ఒకే మెనూ ఉంటుంది. అన్నం, నూనెతో వండే కూరలు, వేపుళ్లు ఉంటాయి. అయితే పెళ్లయిన వారికి కొత్తగా ‘ఆహార స్వేచ్ఛ’ వస్తుంది. దంపతులలో ఎవరికి ఇష్టాలు వారికున్నా, ఒకరికి ఇష్టమైన దానికి మరొకరు ఇష్టపడటంతో ఇద్దరూ కలిపి ఒకే విధమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఈ కారణంగా దంపతులు లావయ్యే అవకాశం ఉందని ఐ.సి.ఎం.ఆర్. అధ్యయనం విశ్లేషించింది.దాంపత్య భోజనంబు..అధ్యయనంలోకి తీసుకున్న ప్రతి నాలుగు జంటల్లో ఒక జంట ఊబకాయులేనని ఐ.సి.ఎం.ఆర్. గుర్తించింది. భార్యాభర్తల్లో వివాహం ముందు వరకు ఆహారం, జీవనశైలుల విషయంలో ఎవరికి వారికి విభిన్న అభిరుచులు ఉంటాయి. వివాహం తర్వాత ఇదంతా మారిపోతుంది. ఆఫీస్లో పని ఒత్తిడి, ప్రయాణ అసలట వారి వారి ఆహారపు అలవాట్లను కలగాపులగం చేసేస్తాయి. ఇద్దరూ ఆర్డర్ పెట్టి ఫుడ్ తెప్పించుకోవటం ఎక్కువౌతుంది. ఒకరి కోసం ఒకరు మేల్కొని ఉండటం, లేట్ నైట్ ఆఫీస్ ప్రజెంటేషన్లు ఇవ్వటం, వారాంతపు విహారాలు.. ఇలాంటివన్నీ కలిసి దంపతుల జీవన శైలిని మార్చేస్తాయి. దాంతో సరైన నిద్రా, తగిన శారీరక శ్రమా లేకపోవటంతో 30ల వయసుకే దంపతులు లావైపోతున్నట్లు ఐ.సి.ఎం.ఆర్. గుర్తించింది.అతి పెద్ద అధ్యయనం‘ఐ.సి.ఎం.ఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్’, ‘టెరి స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’, ఇతర సంస్థల పరిశోధకులు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 (2019–21) దగ్గరున్న దేశవ్యాప్త డేటా నుంచి 52,737 జంటల ఆహార తీరుతెన్నులను, వారి ఆరోగ్యాలను విశ్లేషించారు. వారిలో 27.4 శాతం జంటల్లో ఊబకాయ స్థితి ఉండటాన్ని గమనించారు. ‘కరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ న్యూట్రిషన్’లో ప్రచురణ అయిన ఈ అధ్యయన ఫలితాలు.. భారతదేశ దంపతులు కలిసి తింటూ, కలిసి బరువు పెరగటాన్ని గుర్తించింది. ఇది దేశంలోనే ఈ తరహా అతిపెద్ద అధ్యయనం.ప్రథమ స్థానంలో కేరళఅధ్యయనానికి ఎంచుకున్న అరలక్షకు పైగా జంటలలో ప్రధానంగా.. కేరళ, మణిపూర్, ఢిల్లీ, గోవా, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలలోని పట్టణ, సంపన్న కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు లావు పెరగటం కనిపించింది. కేరళ దంపతులలో అత్యధికంగా 51.3 శాతం వరకు ఊబకాయులు ఉండగా ఆ శాతం జమ్మూ కశ్మీర్లో 48.5, మణిపూర్లో 47.9, ఢిల్లీలో 47.1, గోవాలో 45 శాతం, తమిళనాడులో 42.7, పంజాబ్లో 42.5గా ఉంది. అత్యంత ధనికులైన వారిలో దాదాపు సగం (47.6 శాతం) జంటల్లో అధిక బరువు లేదా ఊబకాయం కనిపించింది. పేదలలో అది కేవలం 10.2 శాతం మాత్రమే కావడం గమనార్హం.ఇద్దరూ లావవటం ఎలా సాధ్యం?భార్యాభర్తలు సాధారణంగా జన్యుపరంగా సంబంధం కలిగి ఉండరు. అయినప్పటికీ ఒకే విధమైన ఆరోగ్య పరిస్థితులలోకి – అది ఊబకాయం, రక్తపోటు, ఇతరత్రా – ఏదైనా కావచ్చు, ఇద్దరూ ఒకేలా ఎలా మారి పోతారు? దీనికి సమాధానంగా – ‘ఉమ్మడి జీవనశైలి (టీవీ చూడటం, వార్తా పత్రికలు చదవటం వంటి అలవాట్లను కూడా కలిపి), ఆహారం, సామాజిక–ఆర్థిక స్థితి, పర్యావరణం, భావోద్వేగ అంశాల కారణంగా ఇది జరుగుతుంది’ అని ఐ.సి.ఎం.ఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ప్రధాన అధ్యయన రచయిత డాక్టర్ ప్రశాంత్ కుమార్ సింగ్ చెబుతున్నారు. -
విడాకులు మీ సమస్యకు పరిష్కారం కాదు!
నా పెళ్లయి సంవత్సరం అవుతోంది. నేనూ నా భర్త, బెంగళూరులో ఉంటాం. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మా అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే కూతురిని. నన్ను మా ఇంట్లో ఒక రాకుమారి లాగా పెంచారు. కానీ మా అత్త గారింట్లో నన్నెవరూ పట్టించుకోవడం లేదు! నా భర్త వాళ్ళ అమ్మ మాటకే విలువ ఇస్తాడు. నామాట అసలు వినడు. అత్తగారు అక్కడి నుంచే మా ఆయనకి డైరెక్షన్ ఇస్తుంది. మా ఆయన సంపాదించే డబ్బులు ఖర్చు పెట్టుకునే స్వాతంత్య్రం నాకు లేదు. ఆయన కూడా ఏదైనా కొనమంటే... ఉన్నదానితో సర్దుకోమంటాడు. మా అత్తగారింటికి వెళితే నాకు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. ఆమె టార్చర్ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. ఈ విషయం గురించి కూడా మా మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాకు ఇంక వేరే సమస్యలు ఏం లేవు. మా అమ్మ వాళ్ళేమో విడాకులు తీసుకుని వచ్చేయమని అంటున్నారు. నా భర్త మంచివాడు, తనంటే నాకు చాలా ఇష్టం. నా భర్తని నేను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పి నా కాపురాన్ని నిలబెట్టండి! – ప్రత్యూష, బెంగుళూరుఇది మీ ఒక్కరి సమస్యే కాదు! చాలా కుటుంబాల్లో అత్త – కోడలు మధ్య ఈ రకమైన ఒత్తిళ్లు, మనస్పర్థలు సర్వసాధారణం! కొడుక్కి గడ్డాలు, మీసాలు వచ్చినా తన వేలు పట్టుకుని నడిపించాలి అనుకుంటారు చాలా మంది తల్లి తండ్రులు. ఆ ఆలోచనలతోనే వారి జీవితాల్లో అతిగా జోక్యం చేసుకుంటారు. ఇవన్నీ పెళ్లికి ముందు బాగానే ఉన్నా, పెళ్లి తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. పిల్లల జీవితంలో ఒక భాగ స్వామి వచ్చాక వారి నిర్ణయాలను వారే తీసుకునే స్వాతంత్య్రం ఇవ్వాలి తల్లిదండ్రులు! ఒక తల్లి తన కోడలిని బయట నుంచి వచ్చిన అమ్మాయిలా కాకుండా, తన కొడుకుతో జీవితాంతం తోడుండే, ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించాలి, అలాగే భర్త కూడా తన కుటుంబాన్ని వదిలి వచ్చిన భార్యని గౌరవించడం కనీస బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి.. ఇక్కడ మనం గమనించాల్సంది. ‘సంసారం అంటే ఒకరినొకరు నియంత్రించుకోవడం కాదు, ఒకరి నొకరు అర్థం చేసుకోవడం‘. మీ భర్త తన తల్లిని గౌరవించడం తప్పు కాదు. కానీ అదే సమయంలో మిన్ముల్ని చిన్నచూపు చూడడం కూడా తగదు. మీరు మీ భర్తను పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకోవాలనుకోవడం కూడా సరైనది కాదు. మీ తల్లితండ్రులు మీకు విడాకులు తీసుకోమని సలహా ఇస్తున్నా, అది ఈ సమస్యకి పరిష్కారం కానే కాదు! మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ భర్తని గెలవాలంటే ముందు మీరు మీ అత్తగారిని గెలవాలి. అది ద్వేషంతో కాదు, ప్రేమతో, మీ మృదువైన మాటలతో కాస్త తెలివిగా ఆలోచించి, ఆమెతో మాట్లాడితే ఆమె కూడా కొన్ని విషయాల్లో మారతారు. నిదానంగా ఆమె కూడా మీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను కోపంతో, ఆవేశంతో కాకుండా ఓపికతో, చాకచక్యంగా ఎదుర్కొంటే మీ సమస్య పరిష్కారమవుతుంది. మీ భర్తతో మీరు ప్రశాంతంగా ఈ అంశం గురించి మాట్లాడండి. ఏదైనా అవసరం అయితే మీకు సహాయం చేయడం కోసం మానసిక నిపుణులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆల్ ది బెస్ట్!.(చదవండి: ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..) -
ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?.. చాహల్ ప్రియురాలి పోస్ట్ వైరల్!
గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఆర్జే మహ్వశ్. ఆమె టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఒక్కసారిగా పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ చాహల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ మరిన్ని కథనాలు వెలువడ్డాయి.తాజాగా ఇంగ్లాండ్లో ఈ జంట సందడి చేశారు. ఓకే లోకేషన్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో మరోసారి మహ్వశ్-చాహల్ డేటింగ్పై వార్తలొచ్చాయి. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ సైతం ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ ప్రేమజంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ నెల అంటే జూలై 31 తన పెళ్లి జరగనుందని ఓ ఛానెల్లో వార్తలొచ్చాయి. ఈ ఫోటోలు కూడా నా పెళ్లికి సంబంధించినవే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు పారిపోయాడు.. మరి ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఫన్నీగా పోస్ట్ చేసింది. తాజాగా తీసుకున్న ఫోటోషూట్ పిక్స్ను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. అయితే తన క్యాప్షన్లో జూలై 31 బదులు జూన్ 31 అని రాయడం మరింత నవ్వులు తెప్పిస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!
ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి.. హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. కున్హట్ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు. Astonishing! Two real brother marry a Same Girl 👇In Shillai area of Sirmaur district, two real brothers have married the same girl. This has become a topic of discussion in the entire region. This tradition is ancient in the Giripar region but in today's modern era, due to the… pic.twitter.com/8fIOaeQtjs— Akashdeep Thind (@thind_akashdeep) July 19, 2025హట్టి తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ట్రాన్స్ గిరి రీజియన్లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్ ట్రైబ్(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట. అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు. హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి. తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి. -
పెళ్లి చేసుకునే ఆలోచన లేదు!
‘‘ఇప్పుడు నా వయసు 24 ఏళ్లే. నా కెరీర్ ఇప్పుడేప్రారంభం అయింది. 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు’’ అని హీరోయిన్ శ్రీలీల చెప్పారు. ‘పెళ్లి సందడి’(2021) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఆమె బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అలాగే తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారామె. ‘ఆషికి 3’ సినిమాలో కార్తీక్ ఆర్యన్కి జోడీగా నటిస్తున్నారు శ్రీలీల. అయితే వీరిద్దరి రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా బాలీవుడ్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత జీవితం వంటి విషయాలపై మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నాకు 24 సంవత్సరాలు. కెరీర్ పరంగా ఇంకా ఎన్నో కలలున్నాయి.ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాను. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేందుకు సమయం లేదు. నా జీవితంలో పెళ్లి అనేది 30 ఏళ్ల తర్వాతే జరుగుతుంది. అప్పటి వరకు ‘మీ వివాహం ఎప్పుడు?’ అని నన్ను ఎవరూ అడగొద్దు. ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, నిజంగా అలాంటిదేం లేదు. నాపై వచ్చిన పుకార్లన్నీ అసత్యం. నేను ఎక్కడికెళ్లినా మా అమ్మ నా వెంట ఉంటుంది. అమెరికా వెళ్లినప్పుడు కూడా నాతోనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరితో ప్రేమలో పడగలను? నిజంగా ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే మా అమ్మ మాతో కలిసి ఉండగలదా? ప్రస్తుతానికి నా తొలిప్రాధాన్యం కెరీర్కే. పెద్ద సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాల్లో బాగా నటించి, ప్రేక్షకుల మెప్పు పొందేందుకు కష్టపడుతున్నాను. నా కంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి.. వాటిని సాధించిన తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాను’’ అని తెలిపారు శ్రీలీల. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మాస్ జాతర, ఉస్తాద్ భగత్సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’, హిందీలో ‘ఆషికి 3’ వంటి సినిమాలు చేస్తున్నారు. -
కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య... ఒంటిపై సూసైడ్ నోట్
లక్నో: మరింత కట్నం తేవాలంటూ అత్తింటి వారు పెట్టే వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమంటూ భర్తతోపాటు అత్తింట్లో వాళ్ల పేర్లను ఒంటిపై రాసుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మనీషా అనే యువతికి 2023లో నోయిడాకు చెందిన కుందన్తో పెళ్లయింది. మొదట్లో అంతా సాఫీగానే వారి కాపురం సాగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. పెళ్లప్పుడు బుల్లెట్ బైక్ను కొనిచ్చారు మనీషా తల్లిదండ్రులు. అయితే, ఎస్యూవీ కావాలంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేయనారంభించారు. తమకు అంత స్థోమత లేదని చెప్పడంతో మనీషా తల్లిదండ్రులు తెలపడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం చేశారు. ‘అన్నం పెట్టకుండా పస్తులుంచుతున్నారు. గదిలో ఉంచి తాళం వేస్తున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కుందన్ బెదిరిస్తున్నాడు’అని మనీషా తన చేతిపై రాసుకుంది. వేధింపులు తట్టుకోలేక మనీషా 2024లో పుట్టింటికి చేరుకుంది. అక్కడున్నా వేధింపులకు మాత్రం అంతం లేకుండాపోయింది. ఇటీవల కుందన్, అతడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు గ్రామ పెద్దను తీసుకువచ్చి విడాకుల పత్రాలపై సంతకం చేయాలంటూ మనీషాను, ఆమె కుటుంబాన్ని ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోయేసరికి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘నా మరణానికి భర్త కుందన్, మరుదులు దీపక్, విశాల్లే కారణం. పంచాయితీ సమయంలో వారు నా కుటుంబానికి హెచ్చరికలు చేశారు’అంటూ మనీషా తన కాలిపై రాసుకుంది. ‘మంగళవారం రాత్రి మేడపైన పడుకునేందుకు వెళ్లిన మనీషా పురుగుమందు తాగింది. ఉదయానికి విగతజీవిగా కనిపించింది’అని కుటుంబీకులు చెప్పారు. అత్తింటి నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులను తాళలేక డిప్రెషన్తో బలవన్మరణం చెందిందన్నారు. చనిపోయేముందే శరీరంపై ఆమె ఈ మేరకు రాసుకుందన్నారు. మనీషా మరణానికి విష ద్రావకమే కారణమని పోస్టుమార్టంలో తేలిందని ఏఎస్పీ ఎన్పీ సింగ్ చెప్పారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. -
ఇది కదా హ్యూమన్ స్పిరిట్ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు
కౌలాలంపూర్: నేటి సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి మచ్చుతునక ఈ ఉదంతం. జూలై 5న మలేషియాలోని నెగెరి సెంబిలాన్ రాష్ట్రంలోని టంపిన్ పట్టణంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భారతీయ కుటుంబం వివాహ వేడుకను నిర్వహిస్తుండగా, అదే వీధిలో చైనా కుటుంబం 94 ఏళ్ల మహిళకు అంత్యక్రియలు నిర్వహించింది.చైనా కుటుంబానికి చెందిన వాంగ్ అనే రాజకీయ నాయకుడు తన తల్లి మరణాన్ని ‘జాయ్ఫుల్ ఫ్యూనరల్’గా పేర్కొన్నారు. అంటే, వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం చైనా సంస్కృతిలో శుభంగా భావిస్తారు. అయితే, తన తల్లి మరణంతో వాంగ్ భారతీయ కుటుంబాన్ని సంప్రదించారు. ‘రాత్రి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు ఉండవు. మీరు మీ వేడుకను కొనసాగించవచ్చు అని వారికి భరోసా ఇచ్చారు. దీంతో భారతీయ కుటుంబం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించింది. సంగీతాన్ని తగ్గించి, అతిథులను అంత్యక్రియల ప్రదేశానికి దూరంగా వాహనాలు పార్క్ చేయమని సూచించింది.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది నిజమైన మలేషియన్ స్పిరిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సాంస్కృతిక భిన్నత్వం ఉన్నా.. పరస్పర గౌరవం, సానుభూతి ఎలా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయో ఇది ఒక అద్భుత ఉదాహరణగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు. -
పెళ్లి చేసుకోండి.. సెలవులిస్తాం
ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ వ్యక్తిగత జీవనాన్ని మెరుగుపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వంలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెళ్లి కోసం 10 పనిదినాల పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తమ పౌరులకు పని-జీవిత సమతుల్యత, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి దుబాయ్ ప్రకటించిన ఈ నూతన సెలవు విధానం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది.దీనికి సంబంధించి యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిక్రీ జారీ చేశారు. ఈ కొత్త ఆదేశాలు వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న యూఏఈ పౌరులందరికీ వర్తిస్తాయి. ఇందులో దుబాయ్ ప్రభుత్వ విభాగాలు, న్యాయాధికారులు, సైనిక సిబ్బంది, ఫ్రీ జోన్లు, స్పెషల్ డెవలప్మెంట్ జోన్లు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్సీ) వంటి సంస్థలు ఉన్నాయని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. భవిష్యత్తులో అదనపు కేటగిరీల ఉద్యోగులను కవర్ చేయడానికి విస్తరణకు కూడా ఈ డిక్రీ అనుమతిస్తుంది.కొత్త వివాహ సెలవుకు అర్హత పొందడానికి ఉద్యోగులు వారి ప్రొబేషనరీ వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. అలాగే తాము పెళ్లి చేసుకోబోయే వారు కూడా యూఏఈ పౌరులే అయి ఉండాలి. 2024 డిసెంబర్ 31 తర్వాత అయిన వివాహాలకే ఇది వర్తిస్తుంది. ఈ వివాహ ఒప్పందాన్ని యూఏఈ అధీకృత సంస్థలు అధికారికంగా ధృవీకరించాలి. వెరిఫికేషన్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ కాపీ అవసరం. పెళ్లి జరిగిన రోజు నుంచి ఈ సెలవులను ఒకసారి కానీ, విడదలవారీగా కానీ ఉపయోగించుకోవచ్చు. వివాహ సెలవుల కాలంలో ఉద్యోగికి వర్తించే అన్ని అలవెన్సులు, ఆర్థిక ప్రయోజనాలతో సహా పూర్తి వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. -
మూడు ముళ్లకెందుకులే తొందర!
సాక్షి, అమరావతి: పెళ్లి విషయంలో దేశంలోని యువత ధోరణి మారుతోంది. యుక్త వయస్సు రాగానే పెళ్లి కోసం ఆరాటపడే యువకులు ఇప్పుడు కనిపించడంలేదు. ఒకప్పుడు 23 నుంచి 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం సహజంగా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకునేందుకు యువత ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా యువకుల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ మార్పుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత అభిరుచి మేరకు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ‘బెటర్ హాఫ్ ఏఐ’ అనే సంస్థ 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువతపై చేసిన సర్వేలో సుమారు 68శాతం మంది యువకులు ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోకూడదనే అభిప్రాయంతో ఉన్నట్లు తేలింది. ఆ కారణంతోనే పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారని స్పష్టమైంది.అమ్మాయిలు దొరకడం లేదుచాలా ప్రాంతాల్లో యువకులకు జోడీగా అమ్మాయిలు దొరకని పరిస్థితి నెలకొంది. చదువుకున్న అమ్మాయిల్లో 65 శాతం మంది తమకు సమానంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నారు. చదువు, ఉద్యోగంలో కొంచెం వెనుకబడ్డ యువకులకు పెళ్లి సంబంధాలు రావడం లేదని విజయవాడకు చెందిన ఒక మ్యారేజీ బ్యూరో ప్రతినిధి భవానీ శంకర్ చెప్పారు. ప్రధానంగా కొన్ని సామాజికవర్గాలు, కులవృత్తిపై ఆధారపడివారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది.ఐటీ రంగంలో ఉన్నవాళ్లు అదేరంగంలో ఉన్న వారి కోసమే చూస్తున్నారు. అందులోనూ తమ ఉద్యోగ స్థాయికి తగ్గట్టు ఉన్నారో... లేదో.. చూస్తుండడంతో సంబంధాలు వెంటనే కుదరడంలేదు. ఇలా వివిధ అభిరుచులు, కారణాల వల్ల అన్నిచోట్లా తల్లిదండ్రులు సంబంధాల కోసం పరితపించే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పని చేయని వారికి సంబంధాలే రావడంలేదని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మ్యారేజీ బ్యూరో నిర్వాహకుడు రామారావు చెప్పారు. తమకు సరిపోయే జోడీ దొరక్కపోవడంతో పెళ్లిని చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో అయితే పెళ్లి కంటే సహజీవనం పట్ల ఆకర్షణ కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులపై భారం లేకుండా...» ‘బెటర్ హాఫ్ ఏఐ’ సర్వే ప్రకారం 70 శాతం మంది యువకులు పెళ్లి ఖర్చును తామే భరించాలనుకుంటున్నారు. తల్లిదండ్రులపై భారం మోపకుండా జీవితం ప్రారంభించాలని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. » జీవితంలో ఇంకా స్థిరపడలేదు... స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే భావన అబ్బాయిల్లో బలంగా ఉంటోంది.»గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటంతో యువకులు కాస్త త్వరగా పెళ్లికి ఒప్పుకుంటున్నారు. అయితే, వారికి సరైన జోడీ దొరకడం కష్టంగా మారుతోంది. ూ చదువు, కెరీర్లో ఎదగాలన్న లక్ష్యం కూడా పెళ్లిని రెండవ ప్రాధాన్యతగా మార్చుతోంది.» పట్టణాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక స్వావలంబన, కెరీర్పై ఫోకస్, సరైన భాగస్వామిని ఎంచుకోవాలన్న కారణాల వల్ల పెళ్లి ఆలస్యమవుతోంది. -
అత్త పాపిట తిలకం దిద్ది.. !
పాత పరిచయాలు.. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేర్చడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ తరహా నేరాలపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా.. తన బార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని చితకబాది వివాహం జరిపించిన ఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రాక్షస వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం.బీహార్ సుపౌల్ జిల్లాలో దారుణం జరిగింది. తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడ్ని చితకబాది.. అతనితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. పైగా ఆ వివాహం జరిపించింది అతని మామనే కావడం గమనార్హం. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకుడు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భీంపూర్ పీఎస్ పరిధిలో జీవ్ఛాపూర్ వార్డు నంబర్ 8కి చెందిన 24 ఏళ్ల మిథిలేష్ కుమార్ను జులై 2వ తేదీన కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లారు. మిథిలేష్ను తన ఇంటికి తీసుకెళ్లిన మామ శివ్చంద్ర తన ఇంట్లో పంచాయితీ పెట్టాడు. శివచంద్రకు భార్య రీటా దేవి, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే రీటాదేవితో వివాహేతర సంబంధం ఉందని చెబుతూ మిథిలేష్ను చితకబాదాడు. అదే సమయంలో ..అక్కడికొచ్చిన జనాలు రాడ్లు, కర్రలతో మిథిలేష్ను కొట్టారు. మరికొందరు గ్రామస్తులు ఇటు రీటాను చితకబాదారు. ఆపై బలవంతంగా మిథిలేష్తో రీటా నుదుట సిందూరం దిద్దించి.. వివాహం జరిగినట్లు శివ్చంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు. ఈలోపు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా.. శివ్చంద్ర అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. తీవ్ర గాయాలతో మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE— ABP News (@ABPNews) July 8, 2025 -
'ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్నా.. కానీ'.. అమిర్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో.అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమిర్ ఖాన్.. మూడో పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ, నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా? మేము ప్రస్తుతం భాగస్వాములని.. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కలిసి ఉన్నామని.. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు.కాగా.. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో తన రిలేషన్ను అఫీషియల్గా ప్రకటించారు. అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా.. గౌరీకి(46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇప్పటికే అమిర్ ఖాన్ 1986లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో. -
ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్
అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్కు వెళుతున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..పెరంబూర్లోని అంబేడ్కర్ నగర్కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది.అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్ఫోన్కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది.ఈ క్రమంలో బ్యూటీ సెలూన్కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
వధువు సోదరి, వరుడు సోదరుడు ‘చమ్మక్ చల్లో..’ వైరల్ వీడియో
పెళ్లిళ్లలోఅందమైన అమ్మాయిలు, టీనేజ్ కుర్రాళ్లదే సందడి అంతా.వధూవరులు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే, వీరుమాత్రం ‘కళ్లు కళ్లు కలిసేనే...’ ‘కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్ఫ్యాట్యుయేషన్’ అంటూ ఆనందం, ఆశ్చర్యంతో ఉత్సాహంగా స్టెప్లు లేస్తారు. అలాంటి డ్యాన్స్ ఒకటి నెట్టింట తెగ వైరలవుతోది.పెళ్లిళ్లలో సంగీత్ వేడుక అనేది పెళ్లికి ముందు జరిగే వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబాలు కలిసి ఆడిపాడతారు. అయితే ఒక పెళ్లి వరుడి సోదరుడు,వధువు సోదరి ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. బాలీవుడ్ హిట్ మూవీ రా.వన్లోని సూపర్సాంగ్ ‘ చమ్మక్ చల్లో’’ కి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అబ్బాయి సూట్లో, అమ్మాయి లెహంగాలో అందంగా మెరిసిపోతూ, చక్కటి డ్యాన్స్ వేసి అక్కడున్నవారినందర్నీ మెస్మరైజ్ చేశారు. View this post on Instagram A post shared by WeddingDreamCo | Wedding Content Creator Chennai (@weddingdreamco) ఈ వీడియోను @weddingdreamco ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, 8.6 మిలియన్ల వీక్షణలు , 902వేల లైక్స్తో తెగ వైరల్గా మారింది. నెటిజన్లు ప్రశంసలు, కామెంట్లతో సందడిచేశారు. ‘‘వార్నీ..వీళ్లిద్దరూ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్టున్నారు. అందుకే పేరెంట్స్ను ఒప్పించడానికి వారు వారి అన్నయ్యలను వివాహం కోసం ఏర్పాటు చేసుకున్నారు.” ‘‘అమ్మాయి డ్యాన్స్తో చంపేసింది’’, అని ఒకరంటే.. ‘హే.. వాళ్లిద్దరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు. అబ్బాయి అయితే ఒక్కసారి కూడా టచ్ చేయకుండా డ్యాన్స్చేశారు అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.వధూవరుల తోబుట్టువులు పెళ్లిలలో ఇలాంటి డ్యాన్సులతో అతిథుల మనసు దోచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు నెట్టింట సందడి చేశాయి. -
కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోంది
రిలేషన్షిప్ ఎన్ని కొత్తపోకడలు పోయినా పెళ్లితోనే ఆ బంధానికి భద్రత అనుకునేవాళ్లే ఎక్కువ!అందుకే పెళ్లికి జాతకాలు,శాలరీ ప్యాకేజ్లు, ఆస్తులు, అంతస్తులు చూసుకున్నా...హక్కులు–బాధ్యతలు, ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలు, పరస్పర గౌరవం, నమ్మకాలు, అండర్స్టాండింగ్, కంపాటబులిటీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి! కాపురానికి కమ్యూనికేషన్ అత్యంత అవసరమని గ్రహించాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్, మానసిక, న్యాయ నిపుణులు.. ఈ తరం కూడా! ఆ అభిప్రాయాలతోనే ఈ క్యాంపెయిన్ను నేటితో ముగిస్తున్నాం! ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరుపెళ్లికి సంబంధించి మన దగ్గర రెండు విధానాలున్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా జీవించడం, రెండు.. ఆచార వ్యవహారాలకనుగుణంగా ఉండటం. ఈ రెండోరకంలో పెద్దల నిర్ణయాలు, సమాజ కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిరకంలో రాజ్యాంగం వ్యక్తులకు ఏ హక్కులనైతే ఇచ్చిందో అవన్నీ కూడా జీవితభాగస్వాములకు అమలవుతాయి. రాజ్యాంగ పరంగా భార్యభర్తలు ఇద్దరూ సమానమే! కానీ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువల పరంగా ఆలుమగలిద్దరూ సమానం కాదు. అయినా అమ్మాయి చదుకోవాలి, ఉద్యోగం ఉండాలి, కట్నకానుకలు ఇవ్వాలి అనే అంచనాలూ ఉంటాయి. కానీ అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధమైన వాటిల్లో కూడా భర్త సం΄ాదన మీద హక్కు కోరుకుంటున్న భార్య .. ఆయన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతల విషయంలో మాత్రం మిన్నకుంటోంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఏ పెళ్లిలో అయినా! అందుకే ఏ విధానంలోనైనా జీవితభాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హక్కుల విషయంలో పరస్పర గౌరవంతో ఉండాలి. ఏరకమైన బాధ్యతలనైనా సమానంగా పంచుకోవాలి.– బీఎన్ నాగరత్న, ప్రెసిడెంట్ దలీప్ ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?గ్యాప్ పెరిగిపోతోంది పెళ్లికి కమ్యూనికేషన్ అండ్ టైమ్ చాలా ముఖ్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం కాపురాల్లో అవి రెండూ మిస్ అవుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే జంటల్లో మేము నోటీస్ చేస్తున్న ప్రధాన సమస్య అదే. భార్య, భర్తలిద్దరిలో ఒకరికి డే షిఫ్ట్ ఉంటే, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటోంది. వీకెండ్లో మాత్రమే ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అదీ ఎవరి ఫోన్లలో వాళ్లు! దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి΄ోతోంది. అండర్స్టాండింగ్ కొరవడుతోంది. మనం అనే భావన లేకుండా నాది అనే ఈగోనే వాళ్ల మ్యారిటల్ లైఫ్ని డామినేట్ చేస్తోంది. దీనివల్ల పిల్లల సంగతి అటుంచి వాళ్లు కలిసి కాపురం చేసే పరిస్థితే కనబడట్లేదు. అందుకే పెళ్లిని నిలుపుకోవాలంటే ఈకాలం జంటలకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్. దీని కోసం ఇద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. – డాక్టర్ ప్రశాంతి ఉప్పునూతలపేరెంట్స్కూ కౌన్సెలింగ్ అవసరంపెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం, బంధం, సాన్నిహిత్యం వంటివి పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల అంగీకారంపై ఆధారపడి ఉండలే తప్ప కుటుంబాల కలయిక కోసం పెళ్లిళ్లు జరగకూడదు. పెళ్లివ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యామని చెప్పుకోవాలి. పెళ్లి బంధంలో ఉండాల్సిన పరస్పర గౌరవం లాంటి ఎన్నో విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. దాంతో పెళ్లి తర్వాత గృహహింస లాంటి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విడాకుల వరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవలసిన పరిస్థితులను తరచుగా చూస్తున్నాం. పెళ్లికి ముందే అందరికీ సరైన రీతిలో లీగల్ – సైకలాజికల్ అవగాహన కల్పించినట్లయితే వివాహ వ్యవస్థ నిలబడడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అందులో భాగంగా ‘అంగీకారం’ అంటే ఛిౌnట్ఛn్ట – వ్యక్తిగత స్వేచ్ఛ, సేఫ్టీ వంటి అంశాలను బోధించాలి. లేకపోతే వైవాహిక జీవితమంతా వైధింపుల మయమవుతుంది. పెళ్లి చేసుకునే వారికే కాదు, వారి తల్లిదండ్రులకూ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం. చాలామటుకు పెళ్లిళ్లలో తల్లిదండ్రుల జోక్యం వల్ల సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు కూడా తెగేదాకా వెళ్తున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది ఈ ఎడ్యుకేషన్ తప్పనిసరి అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా.. డొమెస్టిక్ వ్యవహారంలో మాత్రం జెండర్ రోల్స్లో పెద్దగా మార్పు లేదు. ఇంటి పనులు, పేరెంటింగ్లో అబ్బాయిలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు. భర్తతో సమానంగా సం΄ాదిస్తున్నా ఇల్లు, పిల్లల బాధ్యత ఆమెదే అన్న సంప్రదాయ భావనలోనే ఉన్నాం ఇంకా. దీనివల్ల ఆడపిల్లల మీద అదనపు భారం పడుతోంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. అసలు మనదగ్గర వైవాహిక జీవితానికి సంబంధించి ఎడ్యుకేషనే లేదు. పెళ్లికి కులగోత్రాలు, జీతం, ఆస్తి, అంతస్తే ముఖ్యం అనుకుంటారు. ఇంటి బాధ్యత దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా అమ్మాయి, అబ్బాయి అంచనాలు, ప్రణాళికలు, పరస్పర గౌరవ నమ్మకాలు, ఎమోషనల్, ఫిజికల్ కంపాటబులిటీ లాంటివాటి మీద చర్చే ఉండదు. అసలు అలాంటి వాతావరణం తల్లిదండ్రుల మధ్యే కనబడదు కాబట్టి ఆ సంభాషణలు ఇంట్లో వినపడవు. కానీ ఈ తరం అమ్మాయి, అబ్బాయిలూ మాత్రం ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లికి ముందు పెళ్లి తంతు, హనీమూన్కి ప్లాన్ చేసుకోవడం కన్నా పెళ్లి తర్వాత గడపబోయే సహజీవనం మీద శ్రద్ధ పెట్టాలి. జీతం, ఆస్తిపాస్తుల గురించి పెద్దలు ఎలాగూ చూస్తారు కాబట్టి.. పెళ్లి మీద ఇద్దరి అవగాహన, ఇంటి పనుల నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా ఇద్దరి ప్లాన్స్, సామర్థ్యాలు, కంపాటబులిటీల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలర్స్ సాయం తీసుకోవాలి. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకునే వీలు లేక΄ోతే ముఖ్యమైన వాటి గురించైన ప్రాథమిక సమాచారం తీసుకుని పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు కౌన్సెలింగ్కు ప్లాన్ చేసుకోవాలి. కాపురం సజావుగా సాగేందుకు ఇద్దరికీ అనుకూలమైన ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్ పైపై బంధంగానే ఉంటుంది పెళ్లికి కేవలం జాతకాలు, శాలరీలతోనే చూస్తున్నవాళ్లు వాళ్ల ప్రధాన క్రైటీరియా అయిన కం΄ాటబులిటీని మాత్రం మ్యాచ్ చేయట్లేదు. కంఫర్టబుల్ లైఫ్ అండ్ డీసెంట్ లైఫ్ ఉండాలి.. కాదనట్లేదు. కానీ వైవాహిక జీవితానికి కావల్సిన చిన్న చిన్న విషయాలను కూడా మాట్లాడుకోవట్లేదు. ప్రేమ గురించిన వెంపర్లాట కనపడుతోంది తప్ప గౌరవం గురించి కాదు. రెస్పెక్ట్ ఉంటేనే కదా ప్రేమ ఉండేది! ఇలాంటివి అంటే మ్యాచ్ కాక΄ోతే, పరస్పర గౌరవం, కం΄ాటబులిటీ లేక΄ోతే పెళ్లి సఫకేటింగ్ చాంబర్లా మారుతుంది.. ముఖ్యంగా మహిళలకు. ఒక్కమాటలో చె΄్పాలంటే పెళ్లి అనేది రెండు కుటుంబా ప్రాపర్టీని రెట్టింపు చేసేదిగా, కుల అహంకారాన్ని ప్రిజర్వ్ చేసేదిగా, క్లాస్ని మెయింటేన్ చేసేదిగానే ఉంది. ఒక ప్రిస్టేజ్ సింబల్. ΄ాతికేళ్లు వచ్చాయా పెళ్లి చేసుకున్నామా .. ముప్పై ఏళ్లొచ్చాయా పిల్లల్ని కన్నామా.. సెటిల్ అయ్యామా అనే చూస్తున్నారు కానీ సంతోషంగా ఉన్నామా అని చూడట్లేదు. హారోస్కోప్ లో పద్దెనిమిదో ముప్పై ఆరో గుణాలు (ఛత్తీస్గుణ్) కలుస్తున్నాయా అని చూస్తున్నారు తప్ప పెళ్లిచేసుకోయే జంట కాబోయే తల్లిదండ్రులు కూడా కదా! వాళ్లు పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేదా.. పేరెంటింగ్ బాధ్యతలను ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు లాంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించట్లేదు. ఇవేవీ లేని పెళ్లి పైపై బంధంగానే ఉంటుంది. దానికన్నా అన్మ్యారీడ్గా ఉండటమే బెటర్. – హిమబిందు, సోషల్ యాక్టివిస్ట్పరిణతే ప్రామాణికం పెళ్లిని సమాజమెప్పుడూ వయసుకి సంబంధించిన అంశంగా చూస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు పుడితే వృద్ధ్యాపంలో తోడుగా ఉంటారనే ఆధారపడే మనస్తత్వం అందులో కనిపిస్తుంది. అంతేకానీ పరిణతి, ΄ోషించే శక్తిసామర్థ్యాలను ్ర΄ామాణికంగా చూడట్లేదు. మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన అభి రుచులూ వేగంగా మారుతున్నాయి. భాగస్వామి వాటన్నిటినీ తీర్చలేక΄ోయినా కనీసం అర్థం చేసుకొని, గౌరవించే స్థాయిలో అయినా ఉండాలి. ఇటీవల జరిగిన అస్సాం, గద్వాల్ సంఘటనలను బూచిగా చూపించి పెళ్లికి ఆడవారి మనస్తత్వమే అడ్డు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ నేరాల్లో నిందితులకు సహకరించింది మగవారే అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ముందు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎదుటివారినీ అర్థం చేసుకునే ఓర్పు కావాలి. – కెన్సారో వీవా, ఆంట్రప్రెన్యూర్ -
పాక్ నటిగా పరిచయమై టోకరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సుదీర్ఘకాలం తర్వాత మాట్రిమోనియల్ ఫ్రాడ్ చోటు చేసుకుంది. సోషల్మీడియాలోని మాట్రిమోనియల్ గ్రూప్ ద్వారా పాకిస్థాన్కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీగా పరిచయమైన సైబర్ నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆపై తల్లికి అనారోగ్యం, వైద్య ఖర్చుల పేరు చెప్పి రూ.21.73 లక్షలు కాజేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బహదూర్పురా ప్రాంతానికి చెందిన యువకుడు (29) ఓ సోషల్మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న మాట్రిమోనియల్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. అతడికి 2023 మార్చిలో ఆ గ్రూపు ద్వారానే పాకిస్థాన్కు చెందిన ప్రముఖ నటి ఫాతిమా ఎఫెండీ పేరుతో సైబర్ నేరగాడు పరిచయం అయ్యాడు. తన ఖాతాలకు డీపీగా సదరు నటి ఫొటోను పెట్టుకోవడంతో అతను పూర్తిగా నమ్మేశాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసిన తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ అసలు కథ మొదలుపెట్టాడు. ఓ దశలో నగర యువకుడిని పూర్తిగా నమ్మించడానికి ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్ పేరుతోనూ చాటింగ్ చేశాడు. ఈ సందర్భలోనూ తన సోదరిని మీకు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. ఇలా కొంతకాలం చాటింగ్స్ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పాడు. దానికి ఆధారంగా అంటూ కొన్ని నకిలీ పత్రాలనూ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వైద్యం కోసం భారీగా ఖర్చు అవుతోందని నమ్మబలికాడు. పాకిస్థాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తన వద్ద నగదు అందుబాటులో లేదని సందేశం ఇచ్చాడు. వైద్య ఖర్చుల కోసం సాయం చేస్తే... కొంత తక్షణం, మరికొంత కొన్నాళ్లకు స్థిరాస్తులు విక్రయించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అవసరమైతే వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. అతడిని పూర్తిగా నమ్మించడం కోసం తొలుత చిన్న మొత్తాలు బదిలీ చేయించుకుని, వాటిని కొన్ని రోజులకు తిరిగి చెల్లించేశాడు. తాను సంప్రదింపులు జరుపుతోంది, లావాదేవీలు చేస్తోంది పాకిస్థాన్కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీతోనే అని నగర యువకుడు పూర్తిగా నమ్మేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు కోరినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వెళ్లాడు. ఇలా దఫదఫాలుగా రూ.21,73,912 చెల్లించాడు. ఆ తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు యువకుడికి సంబంధించిన అన్ని సోషల్మీడియా హ్యాండిల్స్, ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నెంబర్లు, సోషల్మీడియా ఖాతాలతో పాటు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ల ఆ«ధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్: పెళ్లి పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి
పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. పరస్పర ప్రేమాభిమానాలు, గౌరవ, నమ్మకాలు కూడా! వీటిల్లో ఏది లోపించినా విడాకుల దారే కనిపిస్తోంది ఈ తరానికి! కారణం... ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ లేకపోవడమే అంటున్నారు నిపుణులు. దాని అవసరం గురించే ఈ కథనం..పెళ్లి అంటే సినిమాల్లో చూపించినట్లో.. సోషల్ మీడియాలోపోస్ట్ చేసే ఫొటోలు, వీడియోల్లాగానో ఉండదు! రిలేషన్ షిప్స్లో ఎన్ని కొత్తట్రెండ్స్ కనిపిస్తున్నా పెళ్లంటే మన దగ్గర రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారమే ఇంకా! పెట్టుపోతల దగ్గర్నుంచి అప్పగింతల దాకా పెళ్లిలో ఉన్న తంతే దానికి నిదర్శనం! సంప్రదాయ వివాహ వ్యవస్థలో ఇమడాలనుకుంటున్న యూత్.. తమ నేపథ్యాల నుంచి జీవన శైలులు, విలువల దాకా రెండు కుటుంబాల మధ్య ఉన్న భిన్నత్వాన్ని అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇదివరకైతే ఉమ్మడి కుటుంబాలుండేవి.ఆ వాతావరణం, పెద్దవాళ్ల సుద్దుల ద్వారా అలాంటివన్నీ తెలిసేవి. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే! అబ్బాయితోపాటు అమ్మాయీ ఆర్థికంగా స్వతంత్రురాలైంది. జెండర్ రోల్స్, కుటుంబ విలువలూ మారాయి. దాంతో సాంస్కృతిక సర్దుబాట్ల నుంచి ఆర్థిక వ్యవహారాలు, కంపాటబులిటీ దాకా అన్నీ సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. విడాకుల సంఖ్యను పెంచుతున్నాయి. అది మన సంప్రదాయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ క్రమంలో పెళ్లికి ముందే వాటన్నిటి గురించి ముఖ్యంగా కాపురంలో ఉండాల్సిన సర్దుబాట్లు, సమ్మతి, పరస్పర గౌరవం, బాధ్యత, నమ్మకం .. ఒక్కమాటలో చెప్పాలంటే వైవాహిక జీవితం మీద పూర్తి అవగాహనను కల్పించే ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ అవసరమని చెపుతున్నారు నిపుణులు.ఇదీ చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి! క్రాష్ కోర్స్..ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది పెళ్లి బంధానికి క్రాష్ కోర్స్ లాంటిదంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్. అన్నిరకాలుగా చూసి పెళ్లికి సిద్ధపడ్డా.. ఆ ప్రయాణం నల్లేరు మీద నడకేమీకాదు. కానీ సంసారం ఒడిదుడుకులకు లోనైప్పుడు జాగ్రత్తగా ఎలా ప్రయాణించాలో ఈ ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ నేర్పుతుంది అంటున్నారు మానసిక విశ్లేషకులు. అందుకే ఈడు –జోడు, సంపాదన, ఆస్తి– పాస్తులు ఒక్కటే సరిపోవు. జీవిత భాగస్వామి బలాబలాల నుంచి పర్సనల్ – ప్రోఫెషనల్ లక్ష్యాలు, క్లిష్టపరిస్థితులను, భావోద్వేగపరమైన విభేదాలను హ్యాండిల్ చేసే తీరు దాకా, దైనందిన జీవితంలోని పనులు, ఆర్థిక బాధ్యతలు, జీవితభాగస్వామికున్న అంచనాల దాకా అన్నిటినీ పరిశీలించాలి. దానికి ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ చోటిస్తుంది.చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోభేదాబీప్రాయాలుంటే సర్దుబాట్లకున్న మార్గాలను చర్చించేలా చేస్తుంది. బలహీనతలు సహా భాగస్వామిని అంగీకరించగలమా లేదా అనే స్టేబులిటీని పరీక్షించుకునే అవకాశాన్నిస్తుంది. మొత్తమ్మీద పెళ్లిలోనిప్రాక్టికల్ప్రాబ్లమ్స్ మీద అవగాహన కల్పిస్తుంది. దీనివల్ల పెళ్లి తర్వాత వచ్చే సమస్యలను వాగ్వాదాలతో కాకుండా చర్చలతో పరిష్కరించుకునే సహనం అలవడుతుందం టున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్. ఈ కౌన్సెలింగ్లో కంపాటబులిటీ లేదని తేలితే ఆ సంబంధం పెళ్లిదాకా వెళ్లకుండా ఆగిపోతుంది. కాబోయే భాగస్వామిలో ఏమి చూడాలి, ఎలాంటి ఆలోచనా తీరున్న వ్యక్తి అయితే తనకు కుదురుతుంది లాంటివన్నీ తెలిసి భాగస్వామి ఎంపిక ఈజీ అవుతుంది.యువతా మొగ్గుచూపుతోంది..సామాజిక కట్టుబాటు కంటే కూడా మానసిక, భావోద్వేగ సరిజోడీని కోరుకుంటున్న ఈ తరం ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ వైపు మొగ్గు చూపుతోంది. అవతలి వ్యక్తి గురించి సరైన అవగాహన లేకుండా పెళ్లిలోకి దిగి.. జోడీ కుదరక పరస్పర ఆరోపణలతో విడాకులకు వెళ్లే బదులు ఈ కౌన్సెలింగ్ ద్వారా పెళ్లి బంధాన్ని కాపాడుకునే ఎబిలిటీని పెంచుకోవడం మంచిది కదా అని అబీప్రాయ పడుతోంది. పరస్పర గౌరవం, నమ్మకంతో కూడిన బలమైన బం«ధాన్ని ఏర్పరచుకునే వీలును ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ కల్పిస్తుందని సామాజిక విశ్లేషకులూ చెబుతున్నారు. – సరస్వతి రమపరస్పర గౌరవం లేకపోవడం, ఇరుకుటుంబ పెద్దల జోక్యం, ఆధిపత్యపోరు, అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, వరకట్నం, గృహహింస వంటివి సగానికి పైగా విడాకుల కేసుల్లో సాధారణ కారణాలు. శృంగార సమస్యలు, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం కూడా ఈ మధ్య ఎన్నో విడాకులకు కారణాలుగా చూస్తున్నాం. ఇలాంటి ఎన్నో అంశాలను ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ ద్వారా సమస్యలుగా మారకుండా చూడొచ్చు. అయితే ఈ కౌన్సెలింగ్లోనే చట్టాలపైనా అవగాహన కల్పిస్తే హక్కుల గురించి తెలిసి, హక్కులు – వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఒక బ్యాలెన్స్ క్రియేట్ అయ్యి.. కలహాలు, కలతల్లేకుండా కాపురాలు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. – సుధేష్ణ మామిడి, హైకోర్ట్ న్యాయవాది -
కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
50 ఏళ్ళ వయసులో ఒక చైనా మహిళ తన కొడుకు స్నేహితుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇపుడు ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ కథేంటో తెలుసుకుందాం పదండిఆగ్నేయ చైనాకు చెందిన ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు "సిస్టర్ జిన్". తన కొడుకు రష్యన్ క్లాస్మేట్ను పెళ్లాడింది. 30 ఏళ్ళ వయసులో మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న ఆమె కొడుకు, కుమార్తెను స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్, డ్రైవర్ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డౌయిన్లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 13,000 మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.ఆరేళ్ల ప్రేమ తరువాత పిల్లల ఆమోదంతో కొడుకు కైకై రష్యన్ ఫ్రెండ్ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్స్ను ఇంటికి ఆహ్వానించినపుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. సిస్టర్ జిన్ వంటలకు ఆతిథ్యానికి ఫిదా అయిన డైఫు తన సెలవులను పొడిగించుకున్నాడు. చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత చైనీస్ భాషను కూడా మాట్లాడే డైఫు, జిన్తో టచ్లో ఉంటూ, అనేక గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకున్నాడు. అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన వివాహం తదితర కారణాల రీత్యా జిన్ తొలుత వ్యతిరేకించినా, ఆ తరువాత ఇవేవీ వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు. కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను స్వీకరించింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. (యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?)చివరికి జూన్8న తన ప్రెగ్రెన్నీని ప్రకటించింది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదమే కానీ, డైఫుతో జీవితం చాలా బావుంది అంటూ సిస్టర్ జిన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది ఆన్లైన్ వినియోగదారులు వీరి వివాహ చట్టబద్ధతను ప్రకశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
పెళ్ళైన ఇన్ని రోజులకి ఫోటోలు షేర్ చేసిన అఖిల్.. మ్యారేజ్ పిక్స్ వైరల్
-
పెళ్లి కోసం ‘రీల్స్’లో ఆస్తి చూపించాడు.. వివాహమైన రెండు గంటలకే..
జబల్పూర్: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలపై హత్యలకు తెగబడుతున్న మహిళల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఇటువంటి ఘటనలను విన్నవారు విస్తుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జబల్పూర్కు చెందిన ఇంద్ర కుమార్ తివారీ(45)ని పెళ్లి పేరుతో వంచించి, అతనిని అంతమొందించిన సాహిబా బానో అనే మహిళను ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరెస్టు చేశారు.జూన్ 6న ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లోని హటా ప్రాంతంలోని ఒక కాలువలో ఒక పురుషుని మృతదేహం బయటపడిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. తొలుత ఈ మృతదేహం ఎవరిదైనదీ తెలియలేదు. దర్యాప్తులో కొన్ని వారాల తర్వాత జబల్పూర్లో అదృశ్య వ్యక్తితో ఈ మృతదేహాన్ని పోల్చి చూడగా, అది ఇంద్ర కుమార్ తివారీ మృతదేహమని తేలింది.ఈ హత్య వెనుక సూత్రధారి సాహిబా బానో అని, ఆమె ఖుషీ తివారీగా పేరు మార్చుకుని ఇంద్రకుమార్ను ఆకట్టుకున్నదని పోలీసులు తెలిపారు. పెళ్లికాని ఇంద్రకుమార్ ఇటీవల తనకు గల భూమి వివరాలను చెబుతూ ఒక రీల్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన సాహిబా బానో ఆ భూమిని దక్కించుకోవాలనే ఆశతో, అతనిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.సోషల్ మీడియాలో అతనిని సంప్రదించి, తన పేరు ఖుషీ తివారీ అని పరిచయం చేసుకుని, గోరఖ్పూర్కు రావాలని ఆహ్వానించింది. తర్వాత తన ఇద్దరు సహచరుల సహాయంతో ఇంద్రకుమార్ను వివాహం చేసుకుంది. కొన్ని గంటల తర్వాత తివారీని హత్య చేసి, అతని మృతదేహాన్ని తన సహచారుల సాయంతో కాలువలో పడేసింది. ఈ కేసులో పోలీసులు సాహిబాతో ఆమెకు సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరేళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. తొలి ఫొటో షేర్ చేసిన లారెన్
ఆరేళ్ల డేటింగ్ తర్వాత ఆ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు జెఫ్ బెజోస్, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీ చారిత్రక నగరం వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లివేడుకకు హాలీవుడ్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. పెళ్లి తాలుకా ఫస్ట్ ఫొటోను లారెన్ స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థపాకుడిగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జెఫ్ బెజోస్(61) కొనసాగుతున్నారు. 2019 నుంచి జర్నలిస్ట్ అయిన లారెన్(55)తో ఆయన డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2023లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరగ్గా.. శుక్రవారం(జూన్ 27న) వీళ్ల వివాహం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దాషియన్, కోలే కర్దాషియన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.వివాహం తర్వాత ఈ ఇన్స్టా పేజీకి తన పేరును లారెన్ శాంచెజ్ బెజోస్గా మార్చుకున్న ఆమె.. గతంలో తాను చేసిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు పోస్ట్లను షేర్ చేశారు. జెఫ్ బెజోస్ (Jeff Bezos), లారెన్లు 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. లారెన్తో ఎంగేజ్మెంట్ టైంలో 2.5 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్గా అమెజాన్ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.వైవాహిత జీవితానికొస్తే.. మెకెంజీ స్కాట్ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. మెకెంజీ స్కాట్ ఒక ప్రముఖ అమెరికన్ రచయిత్రి, దాతృత్వవేత్త. అమెజాన్ స్థాపన ప్రారంభ దశలో ఈమె కీలక పాత్ర పోషించారు. విడాకుల సమయంలో ఆమెకు సుమారు 38 బిలియన్ డాలర్లు విలువైన అమెజాన్ షేర్లు లభించాయి. విడాకుల అనంతరం మెకెంజీ స్కాట్ తన సంపదలో పెద్ద భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పటివరకు రూ. లక్ష కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారామె. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో పనిచేస్తున్న 360 లాభాపేక్షలేని సంస్థలకు ఆమె సహాయం అందించారు. ఈ జంటకు నలుగురు పిల్లలు(ఒకరిని దత్తత తీసుకున్నారు). ఆపై లారెన్ సాంచెజ్తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహం చేసుకున్నారు. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్తో డేటింగ్ మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) -
'నా జీవితంలో అత్యుత్తమమైన రోజు'.. పెళ్లి తర్వాత అఖిల్ పోస్ట్
అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని ఆయన పెళ్లాడారు. ఈ నెల ఆరో తేదీన వీరిద్దరు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో టాలీవుడ్ తారలు, సన్నిహితులు సందడి చేశారు.పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. తాజాగా పెళ్లి తర్వాత తొలిసారి తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
నీలిమ 12 పెళ్లిళ్ల వ్యవహారం.. సీఐ ఏమన్నారంటే?
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమకు చెందిన నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుందనే ఆరోపణలపై రామచంద్రపురం సీఐ వెంకట నారాయణ స్పందించారు. నీలిమ పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. తమ విచారణలో 12 పెళ్లిళ్లకు సంబంధించిన ఎటువంటి కచ్చితమైన ఆధారాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదన్నారు. గుర్రం రాజేశ్వరి, నీలిమ మధ్య ఉన్న పాత గొడవలు నేపథ్యంలో ఇరువురు ఒకరిపై కేసులు పెట్టుకున్నారు. కోర్టుల్లో ఆ కేసుల్లో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది.వారిరువురి మధ్య ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీలు కారణంగానే నీలిమపై అమలాపురం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోందని సీఐ అన్నారు. పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై నీలిమ కూడా స్పందించింది. తాను పన్నెండు పెళ్లిళ్లు అంటూ తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఒక పెళ్లి మాత్రమే చేసుకున్నానని పేర్కొంది. మిగిలిన పదకొండు మంది ఎవరో నిగ్గు తేల్చాలని.. లేనిపక్షంలో ఆరోపణలు చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపింది. -
నటి ఊర్మిళను రెండో పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల సురేష్
-
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఇదెక్కడి ఆచారం రా నాయనా?.. హీరోకు ఏకంగా గిన్నె ఇచ్చారట!
బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా ఇటీవలే జాట్ మూవీలో కనిపించారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతోంది. అయితే బాలీవుడ్లో పలు సినిమాల్లో మెప్పించిన రణ్దీప్ హుడా రెండేళ్ల క్రితం తన ప్రియురాలు లిన్ లైస్రామ్ను పెళ్లాడారు. 2023లో మణిపూర్కు చెందిన లిన్ లైస్రామ్ను సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.తాజాగా ఆ పెళ్లి వేడుకలో తనకెదురైన విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. మణిపూరి సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో తనకు మూత్ర విసర్జన కోసం గిన్నె ఇచ్చారని రణదీప్ హుడా గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా ఈ పెళ్లి తంతు తనకు అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని తలపించేలా చేసిందని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఆ సంఘటనను రణ్దీప్ హుడా వివరిస్తూ..' పెళ్లిలో నాతో పాటు ఒక సహాయకుడు ఉన్నాడు. ఒక ట్యూటర్ లాగా. నేను నా వస్తువులను తలపై పెట్టుకున్న తర్వాత ఇక తలను వంచడం సాధ్యం కాదు. అప్పుడే నాకు ఒక గిన్నె, గొడుగు ఇచ్చారు. అప్పుడు మనల్ని ఓ ప్రదేశంలో ఉంచుతారు. అక్కడికి అందరూ వచ్చి మనల్ని చూడాలి. ఆ సమయంలో మనం చాలా గౌరవంగా కనిపించాలి. అయితే నేను గిన్నె దేనికోసం అని వారిని అడిగాను. మీరు మూత్ర విసర్జన చేయవలసి వస్తే.. మీకిచ్చిన ఆ గొడుగు తెరిచి అక్కనే మూత్ర విసర్జన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవుడు కాబట్టి అక్కడి నుంచి కదల్లేరన్నాడు. వాళ్ల సంస్కృతి చాలా కఠినమైనది. అలాగే చాలా సిస్టమాటిక్ కూడా " అని తనకెదురైన విచిత్ర అనుభవాన్ని వివరించారు.తన పెళ్లి గురించి మాట్లాడుతూ. 'నా పెళ్లి సమయంలో మణిపూర్లో ఒక పెద్ద సమస్య తలెత్తింది. కానీ మేమిద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఒక అమ్మాయి ఇంట్లో వివాహం చేసుకోకపోతే అది కూడా వివాహమేనా అని అక్కడే వివాహం చేసుకుంటానని తాను దృఢంగా చెప్పాను. ఈ పెళ్లి విషయంలో తనకు అస్సాం రైఫిల్స్లో బ్రిగేడియర్గా ఉన్న తన స్నేహితుడు సాయం చేశాడు. మీరు రండి పెళ్లి నేను జరిపిస్తాను అన్నాడు. దీంతో మేము దాదాపు 10 నుంచి 12 మంది అక్కడికి చేరుకున్నాం.' అని తెలిపారు. అయితే మేము లిన్ లైస్రామ్ ఇంటికి చేరుకున్నప్పుడు మంచి శాఖాహారం తిన్నారని.. వివాహం చేసుకునే ముందు వారి దేవుళ్లందరినీ పూజించారని గుర్తు చేసుకున్నాడు. అలాగే నా స్నేహితులు కూడా వివాహానికి తీసుకొచ్చావా? పవిత్ర తీర్థయాత్రకు తీసుకువచ్చావా? అంటూ తనతో జోక్ చేశారని రణ్దీప్ హుడా వెల్లడించారు. -
Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలంటే కొన్ని చిట్కాలు పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలిఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి. నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా! -
‘నన్ను పెళ్లి చేసుకో’ అని కోరిన అభిమాని.. హీరోయిన్ ఫన్నీ రిప్లై
‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఓ అమ్మాయిని ఓ అబ్బాయి డైరెక్ట్గా అడిగితే తడబడే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. కానీ మాళవికా మోహనన్లాంటి అమ్మాయిలైతే అదే స్పీడుతో సమాధానం ఇచ్చేస్తారు. సరదాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో కబుర్లు చెప్పాలనుకున్నారు ఈ బ్యూటీ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ఓ అభిమాని ‘నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగాడు... అంతే... ‘నాకు దెయ్యాలంటే భయం’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు మాళవిక. అలా ఎందుకు చెప్పారంటే, అతని ‘ఎక్స్’ ఖాతా పేరు ‘ఘోస్ట్’ అని ఉంది. ఆ పేరుని వాడుకుని, ఇలా సరదాగా మాళవిక చెప్పారు. రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది. -
అమ్మాయిలూ.. బహుపరాక్!
వివాహం అంటే నూరేళ్ల పంట. తమ పిల్లలు నిండు నూరేళ్లు ఆనందదాయకమైన జీవితం గడపాలని ఇరు కుటుంబాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల గురించి ఆరాలు తీస్తారు. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండి, ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఇంటర్నెట్ జమానాలో ఇవి మాత్రమే సరిపోదని అంటోంది ఓ అమ్మాయి. ఆ యువతి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిది మంచి ఉద్యోగం. మంచి కుటుంబ నేపథ్యం. అందుకే ఇంట్లో వాళ్లు నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. అయితే అతడి గురించి కుణ్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. నా స్నేహితుడి ఐడీతో ఆన్లైన్లో అతనితో చాట్ చేశా. అలా.. సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్ల ద్వారా అతను వ్యవహరించే తీరు బయటపడింది. అతని తీరు నన్ను కంగుతినేలా చేసింది. కాబోయేవాడు మంచి సంపాదనపరుడైతే చాలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అయినా కూడా సరిపోదు. అంతరంగికంగా అతడి తీరు ఎలా ఉంటుందనే చెప్పి డిజిటల్ తనిఖీలు కూడా అత్యంత ముఖ్యమే. నేను ఎదుర్కొన్న అనుభవాన్ని నా కుటుంబ సభ్యులకు వివరించి చెప్పా. అతనితో నా పెళ్లి రద్దు చేయించుకున్నా అని ఆమె ఆ పోస్టులో వివరించింది. అందువల్ల.. అమ్మాయిలూ బహుపరాక్. పెద్దలు కుదిర్చిన సంబంధాలపై గౌరవం ఉంటే సరిపోదు. నిండు నూరేళ్ల సంతోషంగా ఉండాలంటే అతని డబ్బు, స్టేటస్ కంటే అతడి వ్యక్తిత్వాన్ని బయటపెట్టే డిజిటిల్ తనిఖీ అనేది ఈ కాలంలో అత్యంత ముఖ్యం. అంటూ ఆ యువతి పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఈరోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినవాళ్లతోనే, బంధువులతోనో అయిపోతోంది. కానీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ తరహా విచారణలోనూ మార్పులు కూడా తప్పనిసరి అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. సోషల్ మాధ్యమాల పరంగా అబ్బాయి మంచోడు అనుకుంటేనే.. పెళ్లికి సుముఖత చూపాలని, లేదంటే వద్దని సూచిస్తోంది ఆ అమ్మాయి. డిజిటల్ తనిఖీలు కూడా ముఖ్యమే అని మరో యువతి వ్యాఖ్యానించింది. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!) -
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
ముండ్లమూరు (కురిచేడు): పెళ్లి పేరుతో ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిపై ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ముండ్లమూరు ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముండ్లమూరు మండలంలోని బట్లపల్లి గ్రామానికి చెందిన మహిళకు చీమకుర్తిలోని గాం«దీనగర్కు చెందిన వ్యక్తితో 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో చట్టప్రకారం విడిపోయారు. దీంతో ఆ మహిళ బట్లపల్లి గ్రామంలోని పుట్టింటికి చేరింది. తన పెద్దమామ కుమారుడు యద్దనపూడి సుధాకర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేందుకు ఆ మహిళ అంగీకరించింది. కానీ, ఇరువైపుల పెద్దలు అంగీకరించకపోవటంతో వివాహం నిలిచిపోయింది. కానీ, సుధాకర్ మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఎలాగైనా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుందామని చెప్పాడు. ఇక్కడి పెద్దలు అంగీకరించడం లేదని, హైదరాబాద్ వెళ్లి వివాహం చేసుకుందామని చెప్పడంతో అతనితో కలిసి ఆ మహిళ హైదరాబాదు వెళ్లింది. అక్కడ ఓ గది అద్దెకు తీసుకుని మంగళసూత్రం, మెట్టెలు తెచ్చి చూపించి గుడికి వెళ్లి పెళ్లిచేసుకుందామని చెప్పాడు. కానీ, మంచి రోజు కాదని, మంచి రోజు చూసి చేసుకుందామని చెప్పి తిరిగి రూంకు తీసుకొచ్చాడు. రూంలో మోజు తీర్చుకున్నాడు. ఊరు వెళ్లి పెళ్లి చేసుకుందామంటూ తిరిగి ఒంగోలు తీసుకొచ్చాడు. తన బంధువుల ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు, బంధువులకు జరిగిన విషయం చెప్పాడు. వారంతా కలిసి గత ఏప్రిల్ 30న వివాహం చేయాలని నిర్ణయించి ఆ మహిళను ఆమె పుట్టింటికి పంపారు. ఆ తర్వాత ఏమైందోఏమోగానీ వివాహం చేసుకునేది లేదని, నీకు దిక్కున్నచోట చెప్పుకోమని, మళ్లీ ఫోన్ చేస్తే చంపేస్తానంటూ సుధాకర్ బెదిరించాడు. ఆ మేరకు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. సుధాకర్ను అతని తల్లిదండ్రులు, అన్న, మేనమామ దాచిపెట్టారని, సుధాకర్తో పాటు వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కెరీర్, జాబ్ అంటూ వివాహాలు చేసుకోకుండా చాలామంది సింగిల్స్గానే బతికేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వాళ్లయితే ఏకంగా 40 పదుల వయస్సు దాటినా సింగిల్గానే ఉంటున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, త్రిష, ప్రభాస్ లాంటి అగ్రతారలేందరో ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో 40 పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో మరో బాలీవుడ్ భామ దివ్య దత్తా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.దివ్య పెళ్లి బంధం గురించి మాట్లాడుతూ.. “మీరు మంచి భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడం చాలా బాగుంటుంది. అదే పెళ్లి లేకపోతే జీవితం ఇంకా అందంగా సాగుతుంది. అందుకే పెళ్లి చేసుకోవడం కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిది. నాపై చాలా మంది పురుషులు శ్రద్ధ పెడుతుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తా అంతే. కానీ మీరు కనెక్ట్ అయితేనే రిలేషన్లో ఉండాలి. ఆ వ్యక్తి మీ చేయి పట్టుకోగలడని మీరు భావించాలి. ఒకవేళ అది జరగకపోతే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా కోసం నేను ఉన్నా.' అని మాట్లాడింది.దివ్య దత్తా ఇంకా మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కేవలం ఎవరైనా నాతో ప్రయాణించగల సహచరుడిగా ఉండటానికి ఇష్టపడతా. అది లేకపోయినా నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. నా ప్రాణ స్నేహితుడు నాకు ఒక కోట్ పంపాడు. 'నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నావు' కదా అని అడిగాడు. దానికి నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయానని చెప్పా. మంచి భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణం కావాలని అవసరం లేదు. గతంలో నాకు కూడా ఆ అపోహ ఉండేది." అని పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ.ఇక సినిమాల విషయానికొస్తే దివ్య దత్తా చివరిసారిగా ఛావా చిత్రంలో కనిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం దివ్య అర్జున్ రాంపాల్తో కలిసి నాస్టిక్లో కనిపించనుంది. ఈ సినిమాకు శైలేష్ వర్మ దర్శకత్వం వహించారు. -
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
బోయినపల్లి (కరీంనగర్): భార్య వివాహేతర సంబంధంతో అవమానంగా భావించిన ఓ భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగింది. తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది.వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. కాగా అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చాడు. ఈ క్రమంలో కావేరి ‘నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్తోనే ఉంటా’అని భర్తతో తేల్చిచెప్పింది.దీంతో మనస్తాపం చెందిన హరీశ్ మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆదేశాలతో బావిలోని నీటిని మోటార్లతో తోడేయగా, హరీశ్ మృతదేహం లభ్యమైంది. హరీశ్ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కావేరి, రక్షణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. -
అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్ రిపీట్.. అచ్చం నాన్నలాగే..
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్తో అఖిల్కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే. #KingNagarjunaAmala #AkhilZainab Same pattern... ❤️ pic.twitter.com/R2z5vyH8uw— NagaKiran Akkineni (@NagaKiran60) June 8, 2025 -
నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భర్త రహస్యంగా రెండో వివాహం చేసుకుంటున్నట్లు తెలుసుకున్న భార్య.. నేరుగా కల్యాణమండపం చేరుకొని అతన్ని బయటకు ఈడ్చుకు వచ్చి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఈ ఘటన చిత్రదుర్గ లో ఆదివారం చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా అరసీకెరె తాలూకా తిప్పఘట్టకు చెందిన కార్తీక్ నాయక్కు నాలుగేళ్ల క్రితం దావణగెరె జిల్లా న్యామతి తాలూకా ముశేనాళ గ్రామానికి చెందిన తనూజాతో వివాహం జరిగింది. అయితే భార్యకు తెలియకుండా రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. చిత్రదుర్గలోని గాయత్రి కల్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తనూజాకు తెలియడంతో ముహూర్తం సమయానికి వెళి కార్తీక్ను పెళ్లి పీటల మీద నుంచి ఈడ్చుకు వచ్చి చెప్పుతో చితకబాదింది. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన వారు కంగుతిన్నారు. సంఘటనకు సంబంధించి చిత్రదుర్గ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లి పేరుతో మాయలేడీ మోసం
కృష్ణలంక(విజయవాడతూర్పు)/అనంతపురం: తనకు పెళ్లి కాలేదని చెప్పిన ఒక మహిళ, అమాయకపు యువకుడిని పెళ్లి చేసుకుని మోసం చేసి కనిపించకుండా పోయిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన మైలవరపు రాజశేఖరరెడ్డి బెంగళూరులోని ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా తన పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడైన కృష్ణారెడ్డి ద్వారా గుంటూరుకు చెందిన మల్లేశ్వరి, మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే ఇద్దరు మధ్యవర్తులు పరిచయమయ్యారు. ఒక మంచి యువతిని ఇచ్చి పెళ్లి చేస్తామని మధ్యవర్తులు ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డిని నమ్మించారు. కరుణావతి అనే యువతికి తల్లిదండ్రులు లేరని, ఎదురు కట్నంగా నగదు ఇస్తే పెళ్లి చేస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన రాజశేఖరరెడ్డి ఆ యువతి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎదురుకట్నంగా అతను మధ్యవర్తులకు రూ.2 లక్షలు చెల్లించి తన గ్రామంలోనే ఈ నెల ఒకటో తేదీన కరుణావతిని వివాహం చేసుకున్నాడు. ఈనెల 6న తన నాయనమ్మకు ఆరోగ్యం క్షీణించిందని, చనిపోయే పరిస్థితిలో ఉందని కరుణావతి భర్తకు చెప్పడంతో ఇద్దరు కలిసి బయలుదేరి శనివారం ఉదయం విజయవాడ బస్టాండ్కు చేరుకున్నారు.బస్టాండ్లో టాయిలెట్కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కరుణావతి ఎంతకూ తిరిగి రాలేదు. ఆమె సెల్ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది. ఎంతసేపటికీ ‘తన భార్య’ తిరిగి రాకపోవడంతో రాజశేఖరరెడ్డి కృష్ణలంక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. వివరాలు తెలుసుకున్న సీఐ నాగరాజు, ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేశారు. ఆ టీమ్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించారు. అయితే కొండపల్లి ప్రాంతానికి చెందిన ఈ మాయ‘లేడీ’కి అప్పటికే వివాహం జరిగి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది. -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో తన బ్రైడల్ లుక్ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
అక్కినేని ఇంట పెళ్లి సందడి
-
Trinamool: ఎంపీ రహస్య వివాహం
-
ఎంపీ మహువా మొయిత్రా రహస్య వివాహం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) మరోమారు వార్తల్లో నిలిచారు. ఆమె మే మూడవ తేదీన రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీగానీ, మహువా మొయిత్రా గానీ వెల్లడించలేదు. ఈ విషయమై మీడియా ప్రముఖ టీఎంసీ ఎంపీని అడుగగా, ఆయన తనకు తెలియదని చెప్పారు. The other Operation Sindoor: Trinamool MP @MahuaMoitra marries in quiet wedding in Germany https://t.co/AALx1OgY5Y pic.twitter.com/Yugc1cWsfV— The Telegraph (@ttindia) June 5, 2025అయితే వార్తా సంస్థ ‘ది టెలిగ్రాఫ్’ ప్రచురించిన ఫోటోలో మహువా మొయిత్రా బంగారు రంగు చీరలో మెరిసిపోతూ, భర్త పక్కన కనిపించారు. వారి వివాహం జర్మనీలో జరిగినట్టు తెలుస్తోంది. మహువా మొయిత్రా భర్త పేరు పినాకి మిశ్రా. ఆయన బిజు జనతాదళ్కు చెందిన నేత. పూరీ లోక్సభ సభ్యునిగా పనిచేశారు. 50 ఏళ్ల మహువా మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్ను వివాహం చేసుకున్నారు. తరువాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె ప్రముఖ న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్తో దాదాపు మూడేళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. గతంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే.. మహువా డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో నిజానిజాలను నైతిక విలువల కమిటీ తేల్చిచెప్పింది. ఆ దరిమిలా మహువా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇది 2023 డిసెంబర్లో జరిగింది. ఇది కూడా చదవండి: అన్నివైపుల నుంచి తోపులాట.. ప్రత్యక్ష సాక్షులు -
ఆలుమగలకు 5 కారణాలే విలన్లు
పెళ్లి భార్యాభర్తలను దగ్గరకు చేయాలి. రోజులు గడిచే కొద్ది అనుబంధం పెరగాలి. ఆకర్షణ నిలవాలి. ‘కాని నేడు చాలా పెళ్లిళ్లలో ఆలుమగల మధ్య నిర్లిప్తత చోటు చేసుకుంటోంది’ అంటున్నారు డాక్టర్ సప్నా శర్మ. పూణెలో చాలా గుర్తింపు పొందిన ఈ మేరేజీ కౌన్సిలర్ ఆలుమగల మధ్య ఆకర్షణ నశించడానికి ఐదు ముఖ్యకారణాలను తెలియచేస్తున్నారు అవి...‘గతంలో మనకున్న ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు పాఠశాలలుగా ఉండేవి. పెద్దవాళ్లు కష్టసుఖాల్లో ఎలా సర్దుకుపోయేవారో, ఒకరికి ఒకరు సపోర్ట్ ఎలా ఇచ్చేవారో గమనించి పిల్లలు నేర్చుకునేవారు. కాని ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. పైగా పిల్లలకు తల్లిదండ్రులు చదువు తప్ప వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టనీకుండా చేస్తున్నారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి గురించి, భార్యాభర్తలు ఉండవలసిన తీరు గురించి, పెళ్లి డిమాండ్ చేసే బాధ్యతల గురించి, అత్తమామలు ఇతర అనుబంధాలు తెచ్చే ఒత్తిడి గురించి ఏమాత్రం తెలియచేయకుండా సంసారంలో పడేస్తే వాళ్లు కన్ఫ్యూజ్ కారా?’ అంటున్నారు డాక్టర్ సప్న శర్మ.నాగపూర్లో జన్మించి ఐ సర్జన్గా పని చేసి తర్వాతి రోజుల్లో పర్సనాలిటీ కోచ్గా, మోటివేషనల్ స్పీకర్గా, మేరేజ్ కౌన్సిలర్గా గుర్తింపు పొందిన సప్న శర్మ భారతీయ ఆలుమగల మధ్య వస్తున్న ఘర్షణలకు కారణాలను అర్థం చేసుకుంటూ వాటిని తిరిగి సమాజానికి చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఆలుమగల మధ్య జీవితం నిస్సారం అనిపించడానికి ఐదు కారణాలను ఆమె తెలియ చేస్తున్నారు. అవి ఇవి:1. అనురాగానికి ఆటంకాలు పెళ్లయిన స్త్రీ, పురుషులు ఒకరితో మరొకరు ప్రేమగా బహిరంగంగా కనిపించడంపై మన సమాజంలో కనపడని నిషేధాజ్ఞలు ఉన్నాయి. పెళ్లయి జీవితం మొదలుపెట్టాక ఇంట్లో అత్తామామలో తల్లిదండ్రులో ఉంటే భార్యాభర్తలు సరదా భాషణం చేయడం, ఒకరినొకరు తాకడం తప్పు అనే భావన ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ప్రేమగా ఉండటం ఏ అర్దరాత్రో తలుపు చాటున చేయవలసిన పనిగా మారుతుంది. అసలు భార్యభర్తలు తమ ప్రేమను ప్రదర్శించడానికి అవకాశమే లేనప్పుడు ప్రేమ జనించే అవకాశం ఎక్కడ? ఇది ఒక పెద్ద సమస్య.2. దొరకని ఏకాంతంభారతదేశంలో పెళ్లయ్యాక యువ జంట ఎక్కడికి ఆఖరుకు సినిమాకు వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటారు. కలిసి ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిందే తప్ప వీరు తమ మానామ తాము వెళ్లడం దోషంగా చెప్పబడుతుంది. ఇక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలి నాలుగు రోజులు విహారంగా వెళ్లడం దాదాపు చోద్యంగా, పాపంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే, ప్రేమను పెంచుకునే అవకాశాలే లేని కుటుంబ వ్యవస్థ వల్ల వారి మధ్య బంధం తప్ప ప్రేమతో కూడిన బంధం ఉండటం లేదు.3. ఆసక్తి లేకపోవడంవీటన్నింటి దరిమిలా భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఆసక్తి పోతోంది. చక్కగా తయారవడం అనేది బయటకు వెళ్లేటప్పటి సంగతిగా భావిస్తారు. మంచి బట్టలు, నగలు అన్నీ బయట వారికి చూపించడానికే. ఇంట్లో ఉన్నప్పుడు దారుణమైన బట్టలతో, సింగారం లేకుండా భార్య భర్తకు కనపడుతుంటుంది. భర్త కూడా ఏ పైజామో వేసుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి అవతారాల్లో భార్యాభర్తలు ఒకరి ఎదుట మరొకరు ఉంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుంది?4. ఫిట్నెస్ను పట్టించుకోకపోవడంపెళ్లి అయ్యే వరకు అబ్బాయి, అమ్మాయి ఎంతో కొంత ఫిట్నెస్ గురించి దృష్టి పెట్టినా మన దేశంలో పెళ్లయ్యాక ఆకారాలు ఎలా ఉన్నా పర్లేదులే అనే నిర్ణయానికి వస్తారు. ఫిట్నెస్ను పూర్తిగా వదిలేస్తారు. స్త్రీలు పిల్లలు పుట్టాక తిరిగి శరీరాన్ని ఫిట్గా మార్చుకుందాం అనుకోరు. పురుషులు బరువు పెరిగి, బొజ్జలు పెంచి వికారంగా ఉన్నామని తెలిసినా వ్యాయామం మాట ఎత్తకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యాభర్తలు లోలోపల ఒకరిపై మరొకరు అసంతృప్తిని పెంచుకుంటారు.5. ఒకరి ఆసక్తులు మరొకరివైభార్యాభర్తలు భౌతిక ఆకర్షణను కోల్పోయినా మానసికంగా దగ్గరగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. భర్త ఆసక్తులు భార్యకు పట్టకపోవడం భార్య ఇష్టాలు భర్తకు రుచించకపోవడం ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఉమ్మడి అభిరుచులే లేకపోతే వారి మధ్య అనుబంధం పెనవేసుకోవడం కష్టమవుతుంది. భర్తను భార్య మెచ్చుకోకపోగా సూటిపోటి మాటలు అనడం, భార్యను కాంప్లిమెంట్ చేయడం... హగ్ చేసుకోవడం భర్త ‘అహాని’కి అడ్డుగా మారడం... ఇవి మానసిక బంధానికి విఘాతంగా మారుతున్నాయి.భార్యాభర్తలే కాదు ఇంటి పెద్దలు కూడా ఈ కారణాలను కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ల మధ్య గమనిస్తూ సరి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి.అప్పుడే వివాహం నూరేళ్ల బంధం అవుతుంది. -
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్గా సంగీత్తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!)ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది. -
కుమార్తెను అమెరికా నుంచి రప్పించాలని తండ్రి వేడుకోలు
పంజగుట్ట(హైదరాబాద్): భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక, అమెరికాలో చిక్కుకున్న తన కుమార్తెను కాపాడాలని ఓ తండ్రి వేడుకుంటున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు గులాం అఫ్జల్, న్యాయవాది విజయ్కుమార్ మాట్లాడుతూ... తన కూతురు ఫాతిమా హస్నాకు 2007లో గుల్బర్గాకు చెందిన డబీరుద్దీన్ అనే డాక్టర్తో వివాహం జరిగిందన్నారు. వివాహం అయిన తరువాత అమెరికాకు వెళ్లిపోయి అక్కడ 58 రోజులపాటు బాగానే ఉన్నారని తెలిపారు. తరువాత డబీరుద్దీన్ కేవలం అమెరికా వెళ్లేందుకే ఫాతిమాను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో ఇద్దరి మధ్య తగాదాలు జరిగాయని తెలిపారు. దీంతో వెంటనే ఆమె భారతదేశానికి వచ్చి అతనిపై కేసులు వేసి చట్టపరంగా విడాకులు తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగ నిమిత్తం తిరిగి అమెరికాకు వెల్లిన ఫాతిమాను డబీరుద్దీన్ వేధింపులకు గురిచెయ్యడమే కాకుండా ఆమెపైనే తనను మోసం చేసి అమెరికాకు తీసుకువచ్చిందిని అమెరికాలో తప్పుడు కేసులు పెట్టాడని తెలిపారు. దీంతో అమెరికా చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేసి డబీరుద్దీన్కే భరణం ఇవ్వాలని చెప్పడంతో గత 10 సంవత్సరాల నుంచి ఫాతిమా ఉద్యోగం చేసుకుంటూ భరణం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై కేసులు ఉండటంతో ఇండియాకు రాలేని పరిస్థితి ఉందని అటు భరణం ఇవ్వలేక తన పింఛన్ డబ్బులు కూడా పంపించాల్సి వస్తుందని గులాం అఫ్జల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన కుమార్తెను భారత్కు రప్పించాలని, అలానే డబీరుద్దీన్పై కూడా ఇక్కడ తన కూతురు పెట్టిన కేసులు ఉన్నందున అతన్ని కూడా ఇండియాకు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. -
జోదా- అక్బర్ల పెళ్లి పచ్చి అబద్ధం: రాజస్థాన్ గవర్నర్
జైపూర్: అక్బర్కు సంబంధించిన చరిత్రలోని ఒక అంశంపై రాజస్థాన్ గవర్నర్ హరిబావ్ బగాడే(Rajasthan Governor Haribav Bagade) సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ చరిత్రకారుల ప్రభావం కారణంగా నాడు జోధా బాయి- మొఘల్ చక్రవర్తి అక్బర్ల వివాహంతో సహా పలు ఉదంతాలు భారతదేశ చరిత్రలో తప్పులతో నమోదయ్యాయని గవర్నర్ హరిభావ్ పేర్కొన్నారు.రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ బగాడే మాట్లాడుతూ అక్బర్ నామాలో జోధా.. అక్బర్ల వివాహానికి సంబంధించిన ప్రస్తావన లేదన్నారు. అయితే జోధా - అక్బర్లు వివాహం చేసుకున్నారని చెబుతారన్నారు. ఈ కథనంపై ఒక సినిమా కూడా రూపొందించారన్నారు. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని, అయితే అది అబద్ధమని గవర్న్ర్ పేర్కొన్నారు.భర్మల్ అనే రాజు ఒక పనిమనిషి కుమార్తెను దత్తత తీసుకుని, ఆమెను అక్బర్కిచ్చి వివాహం జరిపించారంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు.. 1569లో అమర్ పాలకుడు భర్మల్ కుమార్తె - అక్బర్ల వివాహానికి సంబంధించిన చారిత్రక కథనంపై మరోమారు చర్చను లేవనెత్తాయి. బ్రిటిష్ వారు మన దేశానికి చెందిన వీరుల చరిత్రను మార్చివేశారు. కొంతమంది భారతీయ రచయితలు బ్రిటిష్ వారికి ప్రభావితమయ్యారని గవర్నర్ పేర్కొన్నారు.రాజ్పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్(Maharana Pratap).. అక్బర్కు సంధిని కోరుతూ లేఖ రాశాడనే చారిత్రక వాదనను కూడా ఆయన ఖండించారు. మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడలేదన్నారు. చరిత్రలో అక్బర్ గురించి అధిక సమాచారం ఉన్నదని, మహారాణా ప్రతాప్ గురించి తక్కువగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. అయితే పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతోందని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో మన సంస్కృతిని, అద్భుతమైన చరిత్రను కాపాడుకుంటూ పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గవర్నర్ హరిభావ్ బగాడే పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్ నష్టాలకు కొలంబియా సంతాపమెందుకు?: శశిథరూర్ -
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్- జైనాబ్ పెళ్లి తేదీ ఫిక్స్!
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన త్వరలోనే ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వినిపిస్తోన్న టాక్ ప్రకారం వచ్చేనెలలోనే అక్కినేని ఇంట పెళ్లిభాజాలు మోగనున్నాయి. అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. -
అక్కినేని వారి పెళ్లి పిలుపు
-
జూన్-6న అఖిల్ మ్యారేజ్
-
44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్ ఏంటంటే..
ఇక కనపడదు అనుకున్న కూతురు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లి ఆనందం మాటలకందనిది. ఏ దేవుడి ఇచ్చిన వరం అనే భావన కచ్చితంగా కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది ఈ తల్లికి.దక్షిణకొరియాకి చెందిన హాన్ టే మే 1975లో ఆరేళ్ల కూతురుని ఇంటి వద్ద వదిలేసి మార్కెట్కి వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే కూతురు క్యుంగ్-హా అదృశ్యమై ఉంది. దాంతో ఆమె కూతురు కోసం గాలించిన ప్రాంతం అంటూ లేకుండా కళ్లు కాయలు కాచేలా వెతికింది. అయితే ప్రయోజనం శూన్యం. ఇక విసిగి వేసిరిపోయినా ఆమె ..ఇక తన కూతురు కనిపించిదనుకుని ఆశలు వదులేసుకుంది. అయితే 2019లో అనూహ్యంగా కమ్రా అనే డీఎన్ఏ మ్యాచ్ ద్వారా తన కూతురుని తిరిగి పొందగలిగింది. ఇది విదేశీ కొరియన్ దత్తత తీసుకున్న వారి డీఎన్ఏతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనుసంధానం చేసే కమ్యూనిటీ. దీని సాయంతో తన బిడ్డను కలుసుకుంది. కాలిఫోర్నియాలో నర్పుగా పనిచేస్తున్న బెండర్తో హెన్ టే డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. గుర్తింపు నిర్థారించుకోవడానికి బెండర్, హాన్టే ఫోన్ కాల్లో ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెండర్ సియోల్కి వెళ్లి తన తల్లి హాన్ టేని కలవగానే భావోద్వేగానికి గురయ్యారు. కానీ హాన్ టేకి అదంతా సభ్రమాశ్చర్యంగా ఉంది. నిజమేనా..? కాదా అనే సందిగ్ధంలో ఉండిపోయింది. అయితే బెండర్ జుట్టుని తాకి అది తన కూతురే అని నిర్థారణ చేసుకుని ఆలింగనం చేసుకుంది. 30 ఏళ్లుగా హెయిర్ డ్రస్సర్గా పనిచేస్తున్న హాన్ టే ఆ అనుభవంతోనే కూతురు జుట్టుని తాకి తన బిడ్డే అని నిర్థారించుకుంది. ఈ మేరకు హాన్ టే కూతురు క్యుంగ్ మాట్లాడుతూ..ఒక వింత మహిళ తన వద్దకు వచ్చి నీ తల్లికి ఇక నీ అవసరం లేదంటూ..తనను రైల్వేస్టేషన్కి తీసుకువెళ్లిపోయిట్లు తెలిపింది. అక్కడ పోలీసు అధికారులు తనను ఎత్తుకుని ఒక అనాథశ్రమంలో ఉంచారని, అక్కడ నుంచి అమెరికాకు తరలించారని తెలిపింది. అయితే అక్కడ వర్జీనియాలో ఒక జంట తనను దత్తత తీసుకుందని చెప్పుకొచ్చారామె. ఇక హాన్ టే ఇన్నాళ్ల తన మనో వేదనకు గానూ..దక్షిణ కొరియాలో కొనసాగుతున్న విదేశీ దత్తత కార్యక్రమాన్ని సవాలు చేస్తూ.. ప్రభుత్వంపై దావా వేసింది. అలాగే తన కుమార్తె కనపడక ఎంత నరకయాతన అనుభవించానో చెప్పలేను, ఓ పిచ్చిపట్టినదానిలో క్షోభను అనుభించానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా వచ్చిన దక్షిణ కొరియా ప్రభుత్వాలు పారిశ్రామిక లబ్ధి కోసం ఇలా పిల్లలను పెద్ద ఎత్తున సామూహికంగా ఎగుమతి చేసినట్లు ఆరోపణలు రావడమేగాక విచారణలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతునట్లు తేలింది. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
పటిష్ట భద్రత నడుమ పెళ్లికి హాజరైన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆయన తన స్నేహితుడైన అయాజ్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ పెళ్లికి అతని సోదరుడు సోహైల్ ఖాన్, మేనల్లుడు నిర్వాన్ కూడా పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లికి హాజరైన సల్మాన్ ఖాన్ తన అత్యంత భద్రతా నడుమ కనిపించారు. పెళ్లి జంటను ఆశీర్వదించేందుకు వై ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చారు. అయితే మే 20న తన నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్స్లో ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సల్మాన్ పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. ఇషా చాబ్రియా అనే 36 ఏళ్ల మహిళ నటుడి ఇంట్లోకి ప్రవేశించడండో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాంద్రా కోర్టులో హాజరుపరిచగా.. ఆమెను 14 రోజుల రిమాండ్కు తరలించారు.ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ చివరిసారిగా రష్మిక మందన్నతో కలిసి సికందర్ మూవీలో కనిపించారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించి సాజిద్ నదియాద్వాలా నిర్మించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, అంజిని ధావన్,జతిన్ సర్నా కూడా నటించారు. ఈ ఏడాదిలో మార్చి 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమిగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లిలో గొడవ.. వరుణ్ణి కిడ్నాప్ చేసిన డ్యాన్సర్లు
పట్నా: అక్కడ అంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది. అతిథులంతా ఉత్సాహంగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఉత్సాహాన్ని రెండింతలు చేసేందుకు డ్యాన్సర్లను పిలిపించారు. అంతా సవ్యంగా సాగుతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డ్యాన్సర్లంతా కలిసి వరుణ్ణి కిడ్నాప్ చేశారు. అతిథులంతా అవాక్కయ్యారు. బీహార్(Bihar)లోని గోపాల్గంజ్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. సాధు చౌక్ మొహల్లాలో పెళ్లిలో వినోదం కోసం పిలిచిన డాన్స్ టీమ్ వరుణ్ణి కిడ్నాప్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బైకుంఠపూర్ పరిధిలోని దిఘ్వా దుబౌలీలో సురేంద్ర శర్మ కుమార్తె వివాహం జరుగుతోంది. వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరేగింపుగా వస్తున్న మగపెళ్లివారిని ఆహ్వానించేందుకు డాన్స్ బృందాన్ని పిలిపించారు. అయితే వీరికి స్థానికులతో ఏదో విషయమై గొడవ జరిగింది. చివరికి అది హింసాత్మకంగా మారింది. సదరు డ్యాన్స్ బృందం ఆగ్రహంతో వధువు ఇంటిలోనికి చొరబడి, అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. ఈ నేపధ్యంలో వధువు, ఆమె తల్లి విద్యావతి దేవితో సహా పలువురు మహిళలు గాయపడ్డారు. అంతటితో ఊరుకోకుండా వారు వధువు ఇంటిలోని ఆభరణాలు, విలువైన వస్తువులు, ఖరీదైన దుస్తులను దోచుకుని ఉడాయించారు. విషయం తెలుసుకున్న వరుడు డ్యాన్స్ బృంద సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే వారు అతన్ని చావబాది, బలవంతంగా వ్యాన్లోనికి ఎక్కించుకుని, తమతో పాటు తీసుకుపోయారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు(Local police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వధువు షాక్లో ఉంది. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్ -
ఏడు నెలల్లో 25పెళ్లిళ్లు!
-
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
రామగుండం(కరీంనగర్): స్థానిక తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస ఆశ్రమం నుంచి అత్తారింటికి వెళ్లే సమయం సమీపిస్తోంది. పెళ్లి కూతురు ముఖంలో ఓ వైపు చిరునవ్వు, మరోవైపు ఆశ్రమ సంరక్షకులను, తోబుట్టువును విడిచి వెళ్తున్నాననే బాధ.. పెద్దపల్లి కలెక్టరేట్లోని దేవాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ వేడుక జరిపిస్తున్నారు. కాగా, 2021 మార్చి 15వ తేదీన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గుంజ విజయలక్ష్మి అనే యువతికి హైదరాబాద్లోని ఓ వ్యాపారితో వీరేందర్నాయక్ వివాహం జరిపించగా, నక్క మానస వివాహం రెండోది. 16ఏళ్ల క్రితమే ఆశ్రమంలో చేరిన అక్కాచెల్లెలు.. సుమారు 16ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు నక్క మానస, నక్క లక్ష్మి సంరక్షణ కోసం ఇంటగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సరీ్వస్(ఐసీపీఎస్) అధికారులు స్పందించి రామగుండంలోని తబితా ఆశ్రమంలో చేరి్పంచారు. ఆనాటి నుంచి ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్నాయక్–విమల దంపతులు వారికి తల్లిదండ్రులుగా మారారు. నక్క మానస డిగ్రీ పూర్తి చేయగా, నక్క లక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర.. ఆశ్రమంలో చేరిన సమయం నుంచి చదువులో, ఇంటిపనిలో చురుగా ఉంటోంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం తదితర గుణగణాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మానస. ఐదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసించగా ఆరు నుంచి పదో తరగతి వరకు మేడారం గురుకుల విద్యాలయంలో చదివి టెన్త్9.8 జీపీఏ, ఎల్లంపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ గ్రూపులో 895 మార్కులు, కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంత చెప్పినా తక్కువే చిన్నప్పటి నుంచి అమ్మానాన్న విమల, వీరేందర్నాయక్ అని తెలుసు. కానీ ఓ ఆశ్రమంలో సంరక్షకులుగా మాత్రం నాకు తెలియదు. చిన్నప్పటికీ నా బాధ్యతలు, కష్ట సుఖాలు అన్నీ వారితోనే పంచుకునే దాన్ని. ఇప్పుడు నాకు ఓ వ్యాపారితో వివాహం చేస్తుండడంతో నేను ఇల్లాలిగా మారుతున్నా. అప్పుడు నా చెల్లి నక్క లక్ష్మి, నాతోటి మిత్రులు, నా అమ్మనాన్నలు (సంరక్షకులు)విడిచి వెళ్లలేక పోతున్నా. నా వివాహం కలెక్టర్ జరిపిస్తుండడం మరీ విశేషం. – నక్క మానస, పెళ్లి కూతురు ఆనందమో.. బాధో తెలియడం లేదు పెళ్లీడుకొచ్చిన యువతికి వివాహం జరిపించడం నా కర్తవ్యం. అందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ఊహకందని విషయం. బాల్యం నుంచే మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసి కన్యాదానం చేయడం ద్వారా గుండెలు బరువెక్కుతున్నాయి. పెళ్లి కూతురు చెల్లి లక్ష్మి మరింత ఆవేదనకు లోనవుతుంది. ఆశ్రమంలో పెద్ద మనిగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే కూతురు నక్క మానస. భవిష్యత్తులో ఆమె కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – వీరేందర్నాయక్, తబితా ఆశ్రమ నిర్వాహకుడుఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు -
ఇద్దరూ దివ్యాంగులైనా.. ‘వివాహ కానుక’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం కానుక ప్రకటించింది. వికలాంగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా.. ‘వికలాంగుల వివాహ కానుక’పథకం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు మాత్రమే దివ్యాంగులు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుండగా, ఇకపై ఇద్దరూ దివ్యాంగులైనా పథ కం వర్తిస్తుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మందికి ప్రయోజనం సాధారణ వ్యక్తులు దివ్యాంగులను వివాహం చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులకు ప్రభుత్వం రూ.1 లక్ష అందజేస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో వివాహం చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ దివ్యాంగులు ఉంటున్నారు. వీరికి ఈ పథకం వర్తించటంలేదు. దీంతో నిబంధనలు మార్చి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున వినతులు అందాయి.దీంతో గతేడాది ఏప్రిల్ 18న ఈ శాఖ అధికారులు పథకం నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా నిబంధనలను సవరించింది. ఇకపై దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ జంటలోని మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది. ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని అనితా రామచంద్రన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.పదేళ్ల పోరాట ఫలితం: ముత్తినేని వీరయ్య వికలాంగుల వివాహ కానుక పథకం నిబంధనలు సడలించాలని పదేళ్లు పోరాటం చేశామని, ప్రస్తుత ప్రభు త్వం స్పందించి ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మంగళవారం ఒక ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. -
'అనుకున్నదే అయింది.. విశాల్తో పెళ్లిపై హీరోయిన్ అఫీషియల్ ప్రకటన'
కోలీవుడ్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. తాజాగా విశాల్ పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడంతో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సాయి ధన్సిక అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన మూవీ యోగిదా ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాను విశాల్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వేదికపై వెల్లడించింది.అవును.. నేను, విశాల్ మంచి స్నేహితులం.. మేమిద్దరం కలిసి నడవబోతున్నాం.. ఈ ఏడాది ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేసింది సాయి ధన్సిక. ఈ ప్రకటనతో అటు విశాల్ ఫ్యాన్స్.. ఇటు సాయి ధన్సిక అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు విశాల్కు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. కోలీవుడ్కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.ఇటీవలే హింట్ ఇచ్చిన విశాల్..ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. Official Actor #Vishal is going to marry #SaiDhanshika on August 29, 2025 💍♥️pic.twitter.com/ePWoIljAuA— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 19, 2025 -
ఆ హీరోయిన్తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!
కోలీవుడ్ స్టార్, నిర్మాత విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పలు సార్లు ఆయన పెళ్లిపై వార్లలొచ్చినా ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే తన పెళ్లి ఉంటుందని గతంలో విశాల్ ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పెళ్లి చర్చ ఆగడం లేదు. తాజాగా ఆయన పెళ్లిపై కోలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది.విశాల్ త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సాయిధన్సిక కానీ.. విశాల్ కానీ స్పందిచంలేదు. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరూ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. కాగా.. కోలీవుడ్కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఇవాళే ప్రకటిస్తాడా?..కోలీవుడ్లో రూమర్స్ వినిపిస్తోన్న వేళ విశాల్, సాయి ధన్షికతో వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త నిజమేనని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. సోమవారం సాయంత్రం జరగనున్న సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమా కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్లోనే తనతో సాయి ధన్సిక వివాహ ప్రకటన ఉండొచ్చనే వార్తలొస్తున్నాయి. -
తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
గుడి సేవకులు.. దేవుడిచ్చిన బంధాలు
పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం. కర్నూలు కల్చరల్: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం. అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. వాట్సాప్ గ్రూపులో 1,500 పైనే సభ్యులు మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది. ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీలో పెళ్లి కూతురు‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం. -
చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ హరితేజ..!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్ హరితేజ. గతేడాది బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టి అభిమానులను అలరించింది. దాదాపు పదివారాల పాటు హౌస్లో ఉండి ఫ్యాన్స్ను అలరించింది. సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్గా వ్యవహరించింది. గతేడాది రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా మెప్పించింది.అయితే తాజాగా తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది హరితేజ. వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లి పెళ్లి వైభోగం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది హరితేజ. అయితే తన సిస్టర్ పెళ్లి ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా మరోసారి ఫోటోలను పంచుకుంది. కాగా.. హరితేజ కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2021లో భూమి అనే కూతురు జన్మించింది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)
-
పెళ్లి పేరుతో.. టోకరా
సాక్షి, పుట్టపర్తి : గతంలో పెళ్లంటే... పెద్దలు కూర్చుని బంధువర్గాల్లో ఈడు, జోడు చూసి సంబంధం కుదుర్చేవారు. ఎక్కువగా బంధువర్గాల్లోని అమ్మయిలతోనే వివాహం జరిపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. ఫలితంగా 30 ఏళ్లు దాటి.. 40 ఏళ్లకు సమీపిస్తున్నా.. పెళ్లి సంబంధాలు వెతుకుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. దీంతో ‘పెళ్లి కాని ప్రసాద్’ లను లక్ష్యంగా చేసుకుని కొందరు యువతులు, మ్యారేజీ బ్యూరో నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో బంగారు నగలు, నగదు చేజిక్కించుకుని ఉడాయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆస్తి రాయించుకుని అడ్డం తిరుగుతున్నారు. వయసు మీరితే మోసపోయినట్లే.. అప్పట్లో అబ్బాయిలకు 21, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే వివాహం జరిపించే వాళ్లు. అయితే ప్రస్తుతం ఉద్యోగాల వేటలో పడి 30 ఏళ్లు దాటినా పెళ్లి సంబంధాలు చూడటానికి యువకులు మొగ్గు చూపటం లేదు. ఆ తర్వాత ఏదో ఉద్యోగం లభించాక పెళ్లి సంబంధాలకు వెళ్తే...అమ్మాయిల కోర్కెల చిట్టా చూసి ఖిన్నులవుతున్నారు. రూ.లక్షల్లో జీతంతో పాటు అత్తమాత బాదరబందీ ఉండకూడదంటూ షరతులు పెడుతున్నారు. దీంతో యువకులు నచ్చిన భాగస్వామి కోసం మ్యారేజీ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. ఇదే అదునుగా మధ్యవర్తులు ఇతర ప్రాంతాల అమ్మాయిలను ఒప్పించి.. ఒకట్రెండు నెలలు కాలయాపన చేసి.. ఆలోపు డబ్బులు, ఆస్తులు లాగేసుకుని పరారవుతున్నారు. కొన్ని సామాజిక వర్గాల్లో మరీ కష్టం.. కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉంది. మండలానికి నాలుగైదు కుటుంబాలు ఉండే కులాల్లోని యువకులకు పెళ్లి పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ఆస్తి తక్కువగా ఉండే అగ్రవర్ణ యువకులదీ ఇదే పరిస్థితి. ఫలితంగా యువకులు... ఎవరైతే ఏంటి..పెళ్లయితే చాలు అనే పరిస్థితికి వచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లి సామాజికవర్గం ఏదైనా సరే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లిచేసుకుని వస్తున్నారు. అయితే రెండు, మూడు నెలల్లోనే సదరు యువతులు టోకరా వేసి బంగారం, నగదుతో ఉడాయిస్తున్నారు. ⇒ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచుపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మ్యారేజీ బ్యూరో ద్వారా భీమవరానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. సంబంధం కుదిర్చిన ఇద్దరు వ్యక్తులకు రూ.4 లక్షలు చెల్లించాడు. అయితే వివాహం తర్వాత సదరు యువతిని రైలులో భీమవరానికి తీసుకువెళ్లగా.. రైల్వే స్టేషన్ నుంచే ఆమె ఉడాయించింది. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. పెళ్లి చేసిన మధ్యవర్తుల నంబర్లూ పనిచేయలేదు. దీంతో బాధితుడు తిరిగివచ్చి.. హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన 2024 అక్టోబరులో వెలుగు చూసింది.⇒ నాలుగు నెలల క్రితం ధర్మవరానికి చెందిన ఓ యువతిని పుట్టపర్తిలో పని చేసే ఓ ఉద్యోగి పెళ్లి చూపులు చూశాడు. ఆ వెంటనే సదరు యువతి బంధువులు పెళ్లిపత్రికలు ప్రింట్ చేయించారు. తాను పెళ్లికి అంగీకారం తెలపకుండానే పత్రికలు ఎలా ప్రింట్ చేయించారని అడగ్గా... తనను మోసం చేశాడని రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని సదరు యువతి నాలుగు నెలల క్రితం నానా రభస చేసింది. దీంతో ఆ ఉద్యోగి అప్పటి నుంచి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. -
జూమ్ కాల్తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది. -
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
సాక్షి,పెద్దపల్లి: బాజాభజంత్రీలు.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. తరలివచ్చే అతిథుల సమక్షంలో ఓ అనాథ యువతి వివాహం జరిపించేందుకు పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పో యి రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో మానస, తన చెల్లితో కలిసి 16 ఏళ్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘనాథపల్లికి చెందిన రాజేశ్తో ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ యువతికి పెళ్లిపెద్దగా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్రావు, అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈనెల 21న యువతి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. -
ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
అనంతపురం: ఊహించని విధంగా పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. వారం క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో బంధువు ఒకరు చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు. రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో పెళ్లి ఆగింది. వరుస ఘటనలతో మనస్తాపం చెందిన లక్ష్మీనరసమ్మ తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సమంత పెళ్లి మళ్లీ జరుగుతుందా?
-
రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!
అనాథ అయితేనేం.. ఒక పెద్ద కుటుంబమే ఆమెకు అండగా నిలబడింది. పెద్దలంతా, ముఖ్యంగా మహిళలంతా పెద్దిదిక్కులా మారి ఆమెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు ఇందులోనే భాగంగా హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండేళ్ల వయసులో అనాథలా రైల్వే స్టేషన్లో దొరికిన యువతి పెళ్లివార్త ఇపుడు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. రాంగోపాల్పేట్: రెండేళ్ల వయసులో రైల్వే స్టేషన్లో దొరికి పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చింది. నిర్వాహకులే కుటుంబ సభ్యులై అన్నీ చూసుకున్నారు. పాయల్కు రెండేళ్ల వయసున్నపుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండగా పోలీసులు హిల్స్ట్రీట్ పాఠశాల ఆవరణలోని ఆశ్రయ్ రెయిన్బో హోంకు అప్పగించారు. రెండేళ్ల వయసు నుంచి అక్కడే ఉంటూ డిగ్రీ ఆమె ఇక్కడే పూర్తి చేసింది. ఇదీ చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!ఆ తరువాత ఆప్థమాలజీ కోర్సు పూర్తి చేసి ఓ ఆప్టికల్ షాపులో ఉద్యోగం చేస్తుంది. చందానగర్కు చెందిన యువకుడిని ఇష్టపడింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లిచేయాలని నిర్ణయించారు. ఆశ్రమం నిర్వాహకులు గ్రేస్.. కార్పొరేటర్ కొంతం దీపిక మరికొంత మంది దాతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. బుధవారం రాత్రి ఆశ్రమం ఆవరణలో ఉత్సాహంగా మెహిందీ ఫంక్షన్ నిర్వహించారు. వైభవంగా ఆ మూడు ముళ్ల వేడుకను పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.చదవండి: వెయిటర్ టు కరోడ్పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ -
రెండో పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన జాను లిరి!
ఫోక్ డ్యాన్సర్ జాను లిరి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జాను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్గన్ని పెళ్లి చేసుకోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..‘ఆశ్విరదించండి’ అని రాసుకొచ్చింది.కాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ సింగర్ దిలీప్ దేవ్గన్ కూడా ఇన్స్టాలో ఓ వీడియాని విడుదల చేశారు. ‘అందరికి నమస్కారం. నా పాటలు ఆదరించి, నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మీత్రులకు నమస్కారం. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఓ ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరినొకరు ఇష్టం పడ్డాం. కలిసి బతుకాలనుకుంటున్నాం. అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. జాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నావారికి ధన్యవాదాలు’ అన్నారు.(ఇది చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి)నిన్న ఎమోషనల్.. నేడు గుడ్ న్యూస్ఫోక్ సాంగ్స్కు అదిరిపోయే స్టెప్పులేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న జాను.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో’ విన్నర్గా నిలిచి మరింత ఫేమస్ అయింది. నెట్టింట ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అదే సమయంలో జానుపై ట్రోలింగ్ కూడా భారీగానే పెరిగింది. ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్పై కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ విమర్శలను భరించలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ నిన్న ఓ వీడియోని షేర్ చేసింది. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటంటూ..అందులో పేర్కొంది. చాలా మంది నెటిజన్స్ జాను ఎమోషనల్ వీడియోపై స్పందిస్తూ..ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక నేడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాననే విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) -
భారత జవాన్కు భార్యగా పాకిస్తానీ మహిళా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుల వీసాలను భారత్ రద్దు చేయడం.. ఆసక్తికర కథనాలను కళ్ల ముందు ఉంచుతోంది. పదిహేడేళ్లుగా భారత్లో ఉంటూ ఇక్కడి ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తి తిరిగి అక్కడికి వెళ్లిపోవడం లాంటివి మీడియాకు ఎక్కాయి. అయితే భారత జవాన్ను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకున్న ఓ పాకిస్థానీ మహిళకు హోంశాఖ ఝలక్ ఇవ్వగా.. బార్డర్ దాటే చివరి నిమిషంలో కోర్టు నుంచి ఊరటతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది.పీటీఐ కథనం ప్రకారం.. పాక్ పంజాబ్కు చెందిన మినాల్ ఖాన్కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఆమె లాయర్ అంకూర్ శర్మ కోర్టు నుంచి స్టే ఆదేశాలతో అక్కడికి చేరుకున్నారు. తన వీసాను పొడిగించాలని ఆమె కేంద్ర హోం శాఖ వద్ద విజ్ఞప్తి చేసుకుందని.. అది ఇంకా పెండింగ్ లోనే ఉందని.. కాబట్టి కోర్టు ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను తరలించడంపై నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆమె బస్సు దిగి వెనక్కి వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తరఫున వాదించిన అంకూర్ శర్మ బీజేపీ అధికార ప్రతినిధిగా గ్రేటర్ కశ్మీర్ ఓ కథనం ఇచ్చింది. అంతేకాదు ప్రధాని మోదీకి మినాల్ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రముఖంగా ప్రచురించింది.‘‘మేం రూల్స్ అన్నీ ఫాలో అయ్యాం. సుదీర్ఘ వీసా కోసం నేను ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా. అది త్వరలోనే వస్తుందని అధికారులు మాకు చెప్పారు కూడా. ఆలోపు దాడి జరిగింది. నా భర్త నుంచి నన్ను విడదీసే ప్రయత్నం జరిగింది. నాలాగే.. ఎంతో మంది తమ తల్లులు, తండ్రుల నుంచి విడిపోవాల్సిన పరిస్థితి. ఇది మానవత్వం అనిపించుకోదు. ప్రధాని మోదీకి మేం చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మాలాంటి వాళ్లకు న్యాయం చేయమని అని ఆమె గ్రేటర్ కశ్మీర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మినాల్పై అనుమానాలు?ఇదిలా ఉంటే.. మినాల్ ఖాన్ ఎపిసోడ్ సోషల్ మీడియాకు ఎక్కడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒక జవాన్ను పాకిస్థాన్ మహిళను, అదీ ఆన్లైన్లో పరిచయంతో వివాహం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ వీసా ముగిసిన తర్వాత కూడా నెలపైనే ఆమె ఎక్కడ నివసించగలిగిందని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ట్రాప్ అయి ఉండొచ్చని.. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. మినాల్కు మద్దతుగానూ పలువురు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులను వెనక్కి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు తొలుత ఏప్రిల్ 29వ తేదీని గడువుగా ప్రకటించి.. ఆ తర్వాత మరొక రోజు పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీతో అట్టారీ వాఘా సరిహద్దును మూసేశారు. గత ఆరో రోజులుగా 786 మంది పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోగా, అందులో 55 మంది దౌత్యవేత్తలు, సహాయ సిబ్బంది ఉన్నారు. అలాగే.. పాకిస్థాన్ నుంచి 1,465 భారతీయులు తిరిగి వచ్చారని కేంద్రం ప్రకటించింది. -
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?
ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన మరిచిపోకముందే మరో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ బామ్మ, వరుసకు మనవడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్కు గురి చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అతడిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉద్దేశం మరేదైనా ఉందా? అసలేం జరిగింది తెలుసుకుందాం.ఉత్తర్ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. బందుత్వాలు, మానవ విలువలకు తిలోదకాలిచ్చి మనవడి వరసయ్యే వ్యక్తిని ఓ బామ్మ పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంద్రావతి తన 30 ఏళ్ల మనవడు ఆజాద్తో పారిపోయి గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకుంది. సింధూరం పూసుకుని , పవిత్ర అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, గ్రామం నుండి పారిపోయారు. ఇందుకోసం నలుగురు పిల్లలు, భర్త ( ఇద్దరు కుమారులు ,ఇద్దరు కూతుళ్లు) కుటుంబాన్ని వదిలేసింది. ఇంతవరకూ ఓకే గానీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే...?ట్విస్ట్ ఏంటంటే..?వారిద్దరూ అంబేద్కర్నగర్లో నివసించేవారు. ఈక్రమంలోనే ఇంద్రావతి, ఆజాద్ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహత్యం కారణంగా వీరిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఇంద్రావతి భర్త చంద్రశేఖర్, వారు పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం చూశాడు. వద్దని వారించాడు. నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. వారి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇద్దరూ దానికి సుతరామూ అంగీకరించలేదు. ఇక అంతే తమకు అడ్డురాకుండా ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం ఇద్దరూ కలిసి కుట్రపన్నారు. ఇంద్రావతి ఆజాద్తో కలిసి వారికి విషం ఇవ్వడానికి కుట్ర పన్నిందని ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ ఆరోపణ.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!ఇదే చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా ఆజాద్ను పెళ్లి చేసుకోవడంతో పాటు, తనతోపాటు తన నలుగురు పిల్లల్ని హత మార్చేందుకు వారిద్దరూ కుట్ర చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో తన భార్యకు పెద్ద కర్మ నిర్వహించి "చనిపోయినట్లు" ప్రకటించాలని నిర్ణయించు కున్నాడు. కాగా ఇంద్రావతి చంద్రశేఖర్కు రెండో భార్య. ఉద్యోగరీత్యా అతను ఎక్కువ క్యాంప్లకు వెళ్లేవాడట. ఈ సమయంలో ఇంద్రావతి, అజాద్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా? -
Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రికత్తకి దారి తీసింది. ఈ సంఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.ఇందులో అట్టారి-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం. ఈ ఆంక్షల నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్ కలల వివాహం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు.రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్కు అట్టారీ సరిహద్దు దాటి పాకిస్థాన్లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వరుడి బంధువు చాలామంది ఇప్పటికే పాకిస్థాన్కు చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ పాకిస్తాన్పై ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసి వేయడంతో వధువు ఇంటికి వెళ్లే అవకాశాలు మూసుకు పోయాయి. దీంతో సైతాన్సింగ్ ఏం చేయాలోఅర్థం కావడం లేదంటూANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు.#WATCH | Shaitan Singh, a Rajasthan citizen, who was scheduled to cross the Amritsar's Attari border to enter Pakistan for his wedding today, says, " What the terrorists have done is wrong...We are not being allowed to go (to Pakistan) as the border is closed...Let us see what… pic.twitter.com/FEEuf1GxZG— ANI (@ANI) April 24, 2025"ఉగ్రవాదులు చేసింది తప్పు... సరిహద్దు మూసివేతో(పాకిస్తాన్కు) వెళ్లడానికి అనుమతించడం లేదు... ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం." అన్నారు. అటు సైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ, "పర్యాటకులపై (పహల్గామ్లో) జరిగిన దాడి చాలా తప్పు. దురదృష్టకర దాడి భారతదేశంలోని అనేక మంది అమాయక పౌరుల జీవితాలతో తమ కుటుంబాన్ని ప్రభావితం చేసిందన్నారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు : ఎవరీ నటుడు కాగా ఈ ఉగ్రదాడి తరువాత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన ఇతర చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించడం , ఇస్లామాబాద్లో దౌత్య సిబ్బందిని తగ్గించడం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ-రాజౌరి-పూంచ్ జాతీయ రహదారిపై సైనిక నిఘా పెరిగింది, చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగుతోంది. -
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
ఆదిలాబాద్ జిల్లా: వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలా మంది యువకులు ‘పెళ్లి కాని ప్రసాద్లు’గా మిగిలిపోతున్నారు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఒక వైపు పరిస్థితులు ఇలా ఉంటే.. మరో వైపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపి, ఇద్దరినీ ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు. జైనూర్ మండలం అడ్డెసరాకు చెందిన ఆత్రం రంభబాయి, భాద్రుషావ్ దంపతుల కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన సెడ్మకి సోమిత్రబాయి, భీంరావ్ల కుమార్తె జంగుబాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గోడం రంభబాయి, యాదోరావ్ కుమార్తె సోన్దేవితో చత్రుషావ్కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది. విషయం తెలుసుకున్న జంగుబాయి రాయిసెంటర్ను ఆశ్రయించింది. రాయిసెంటర్ పెద్దలు 15 రోజుల క్రితం మూడు కుటుంబాలతో చర్చించారు. యువతులిద్దరూ చత్రుషావ్తో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దీంతో గురువారం బంధువుల సమక్షంలో వరుడి స్వగృహంలో వీరికి వివాహం జరిపించారు. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో సిర్పూర్(యూ) మండలం గుంనూర్ (కె)కు చెందిన ఓ యువకుడు కూడా ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం తెలిసిందే. -
కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం బన్నీ జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఓ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి చేశారు. తన కజిన్ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ పెళ్లికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను టీమ్ అల్లు అర్జున్ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Bunny anna : Yesesaava 😳🤣@alluarjun #AA22 pic.twitter.com/6MWEZ36JjK— Allu Babloo AADHF (@allubabloo) April 24, 2025 Icon Star @alluarjun attended his cousin’s wedding, joining the family in the special celebration. ✨#AlluArjun pic.twitter.com/HFR29rUZp1— Team Allu Arjun (@TeamAAOfficial) April 23, 2025 -
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత పొదుపు చేయాలని అందరూ అనుకుంటారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద బహుశా కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. మనదేశంలో ముఖ్యంగా.. ఆడపిల్లల గురించి ఆలోచించేవారి సంఖ్య కొంత ఎక్కువే. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఆలోచించేవారు ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఎంచుకోవచ్చు. ఇందులో రోజుకు రూ. 121 పొదుపు చేస్తే.. పెళ్లి చేసే నాటికి రూ. 27 లక్షలు చేతికి వస్తాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రవేశపెట్టిన 'ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ'.. తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో మీరు రోజుకు 121 రూపాయలు డిపాజిట్ చేస్తే.. నిర్దిష్ట సమయం తరువాత రూ. 27 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చేతికి అందుతాయి. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు, వచ్చే బోనస్ ఎంత అనేదానిపై ఆధారపడి ఉంటుంది.➤కనీస రోజువారీ పెట్టుబడి: రూ. 121➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 27 లక్షల వరకు (ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు & బోనస్ ఆధారంగా)➤పాలసీ కాలపరిమితి: 13 నుంచి 25 సంవత్సరాలుఇదీ చదవండి: ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?ఉదాహరణకు.. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మీరు రోజుకు రూ. 121 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. అలా మీరు 25 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే.. వచ్చే ఎల్ఐసీ ద్వారా బోనస్లు, లాయల్టీ వంటి వాటితో కలిపి మీ మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 27 లక్షలు దాటవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారు తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు, కుమార్తె వయస్సు కనీసం ఒక సంవత్సరం ఉండాలి.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ అనేది ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కిందికి వస్తుంది. కాబట్టి వినియోగదారులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీదారు స్కీమ్ మెచ్యూరిటీ కాలానికి ముందే కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల మరణిస్తే.. కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు అందుతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం గడువు ముగిసిన తరువాత మొత్తం రూ. 27 లక్షలు నామినికీ అందిస్తారు.ఎల్ఐసీ కన్యాదాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి.. ఐడెంటిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ఋజువు, కుమార్తె బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి అవసమవుతాయి. ఈ పథకం గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లేదా సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. -
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
పెదవడ్లపూడి(మంగళగిరి): ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. -
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
ఖమ్మం: ‘సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) వచ్చిన రోజే నా పెళ్లికి ముహూర్తం ఖరారు చేస్తా’ అంటూ కారేపల్లి మండలం మేకలతండాకు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త అంటున్నాడు. మేకలతండాకు చెందిన భూక్యా గణేష్కు ఇటీవల పెళ్లి నిశ్చితార్థం అయింది. కాగా, గణేష్కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నా, సీఎం రేవంత్రెడ్డి అన్నా చాలా ఇష్టం. అందుకే.. రేవంత్రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ భీష్మించాడు. ఆయనకు కుదిరిన రోజే పెళ్లి తేదీ ఖరారు చేస్తా అంటున్నాడు. ఎలాగైనా సీఎంను రప్పించాలంటూ ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్కు వినతిపత్రం అందించాడు. దీంతో అతడి వినతిపై ‘రెస్పెక్టెడ్ సీఎం సార్, ప్లీజ్ కైండ్లీ అటెండ్ ది మ్యారేజ్.. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ సింగరేణి మండల్, ప్లీజ్ ఎనీ డేట్ డు ఫిక్స్’ అని రాసి సంతకం చేసిన ఎమ్మెల్యే సీఎం ఆఫీస్కు పంపించారు. కాగా గణేష్ పెళ్లికి సీఎం వస్తారా? అప్పటిదాకా అతడు పెళ్లి చేసుకుంటాడా లేదా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.గణేష్ వినతిపై సీఎంను రావాలని కోరుతూ రాసిన ఎమ్మెల్యే (ఇన్ సెట్) వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్కు వినతి పత్రం అందజేస్తున్న గణేష్ -
నాకు నువ్వు వద్దు!
నగరానికి చెందిన ఓ యువజంటకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అన్యోన్యంగా సాగాల్సిన వీరి కాపురంలో పెళ్లయిన నెలరోజులకే చిచ్చు మొదలైంది. ఇంట్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలు వీరి గొడవకు ప్రధాన కారణంగా మారాయి. గొడవ పెద్దదై ఈ యువజంట పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.నగరానికి చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన యువతితో గతేడాది వివాహం జరిగింది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కొన్నాళ్లకు ఆధిపత్య పోరు మొదలైంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు జీవిస్తూ.. విడాకుల కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకని ఆరా తీసిన పోలీసులు, న్యాయవాదులు ఆ జంట చెప్పిన కారణంతో అవాక్కయ్యారు. దీనికి పూర్తి కారణం ఇరువురి తల్లిదండ్రుల అతిజోక్యమేనని కౌన్సెలింగ్లో పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరావిు..! అని ప్రమాణాలు చేసుకుని ఒకటవుతున్నారు. అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. మూడుముళ్లతో వివాహ బంధంలో అడుగిడుతున్నారు. జీలకర్ర.. బెల్లం తలపై పెట్టుకుని ఒకరికొకరు నూరేళ్లు కలిసుంటామని బాస చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో కష్టాసుఖాలను సమానంగా పంచుకోవల్సిన కొందరు కొత్త జంటలు ‘ఆధిపత్య’ పోరుతో ఆదిలోనే తమ నూరేళ్ల సంసార జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. మూణ్నాళ్లకే ‘నాకు నువ్వు వద్దు’ అంటూ.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కోర్టుల్లో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రోజురోజుకు ఠాణామెట్లు ఎక్కుతున్న జంటల సంఖ్య పెరుగుతుండగా.. జిల్లా కోర్టులోనూ విడాకుల కేసుల సంఖ్య అదేస్థాయిలో కొనసాగుతోంది. – కరీంనగర్క్రైంచిన్న చిన్న కారణాలతో..⇒నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాయి. ⇒బతుకుపోరులో.. ఉద్యోగాల వేటలో పెళ్లయిన వెంటనే దూర ప్రాంతాల్లో జీవిస్తూ.. వేరు కాపురాలు పెడుతున్నారు.⇒ ఉమ్మడి కుటుంబం ఊసే లేకపోతుండగా.. దంపతుల మధ్య అహం, అపార్థం, అనుమానాలు పెరుగుతున్నాయి. ⇒నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన విషయాలు రోడ్డెక్కుతున్నాయి.⇒ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి.⇒పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి పెళ్లి చేసుకు న్నా.. చాలా జంటల్లో అదే తీరు కనిపిస్తోంది.అవగాహన అవసరం⇒కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు ఇరువురి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. సమస్యను ఓపిగ్గా విని, పరిష్కారానికి కృషి చేయాలి.⇒అలా కాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల నే రెచ్చగొడుతుండడం బాధ కలిగించే అంశమని మహిళా పోలీసు స్టేషన్కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.⇒అనుమానం, హింస, దాంపత్య బంధం విలువ తెలియకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, హంగుఆర్భాటాలకు పోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, చిన్న కారణాలతోనే విడాకుల వరకు వెళ్తున్నారని, ఆవేశంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వివరించారు.⇒ప్రేమ వివాహం చేసుకున్న వారు సైతం చాలామంది కొన్నాళ్లకే ఠాణామెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ⇒విడాకులు తీసుకుంటున్న, పోలీసుస్టేషన్కు వస్తున్న జంటల్లో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉంటున్నారని ఓ సీనియర్ కౌన్సిలర్ పేర్కొన్నారు.ఆధిపత్య ధోరణి వద్దు దాంపత్య జీవితానికి విలువ తెలియక చాలా మంది విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహం అనంతరం ఎలా వ్యవహరించాలి..? ఎలా ఉండాలనే విషయాలపై పెద్దలు అవగాహన కల్పించాలి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే దాంపత్య జీవితంలో ఎలా ఉండాలనే విషయాలు తెలిపే ప్రి మారిటల్ కౌన్సెలింగ్ తప్పనిసరి అని నా భావన.– అట్ల శ్రీనివాస్రెడ్డి, సైకాలజిస్ట్తొందరపాటుతోనే..దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ తరం పిల్లలకు దాంపత్య బంధం విలువ సరిగా తెలియడం లేదు. పెళ్లయ్యాక ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో స్వేచ్ఛాయుత వాతావరణానికి అలవాటు పడి ఒకరి మాట ఒకరు వినడం లేదు. చిన్న గొడవకే ఠాణాకు వస్తున్నారు. అనుమానం, తల్లిదండ్రుల మితివీురిన జోక్యం, దురలవాట్లు, గృహహింస, కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం మా వద్దకు వచ్చే దంపతుల మధ్య గొడవకు ప్రధాన కారణాలు. – శ్రీలత, మహిళా పోలీస్స్టేషన్ సీఐ, కరీంనగర్ -
నటి అభినయ దంపతులను ఆశీర్వదించిన ఓంకార్, సముద్రఖని (ఫోటోలు)
-
పెళ్లిపీటలపై వధువు తల్లి.. అప్పుడే మొదలైంది అసలు కథ!
లక్నో: ఓ పెళ్లి పందిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. వధువు బదులు ఆమె తల్లి పెళ్లి పీఠలెక్కింది. పెళ్లి తంతులో వధువు తన అసలు పేరు బదులు మరో పేరు పలకడంతో పక్కనే ఉన్న వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా.. అసలు విషయం బయటపడింది. దీంతో తాను మోసపోయానని వరుడు గ్రహించాడు. వధువు బదులు ఆమె తల్లి ఎందుకు ఉందని ప్రశ్నించారు. వధువు తరుఫు కుటుంబ సభ్యులు బెదిరించడంతో పెళ్లి పంచాయితీ పోలీస్స్టేషన్కు చేరింది.పోలీసుల వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ (uttar pradesh) మీరట్లో (meerut) బ్రహ్మపురికి చెందిన వరుడు (22)కు శామలీ జిల్లావాసి వధువు (21)తో పెళ్లి కుదిరింది. కుదుర్చుకున్న సమయానికి పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. పెళ్లి తంతు మొదలైంది. అయితే, సరిగ్గా అప్పుడే వధువు తన పేరు చెప్పాల్సి ఉంది. బదులుగా ఆమె తల్లి పేరు చెప్పింది. ఇదేంటని బిత్తరపోయిన పెళ్లి కొడుకు వధువు ధరించిన ముసుగును తొలగించాడు.అంతే, వధువు బదులు ఆమె తల్లి ఉందని చూసి కంగుతిన్నాడు. ఇదే విషయాన్ని పెళ్లి పెద్దల్ని ప్రశ్నించాడు. పెళ్లి పెద్దలు సైతం వధువు తల్లికి మద్దతు పలికారు. వధువు తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందేనని వరుడిని హెచ్చరించారు. లేదని అల్లరి చేస్తే రేప్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన వరుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.‘నాకు వధువు బదులు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు కుట్ర చేశారు. పెళ్లి కోసం రూ.5లక్షలు ఖర్చు చేశా. మీరే న్యాయం చేయండి’ అంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు -
అమ్మాయికి అంకుల్తో పెళ్లి.. ఆగింది ఇలా..!
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో శనివారం తెల్లవారుజామున ఒక పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. రామాలయం వద్ద గల విశ్రాంతి మంటపంలో జరుగుతున్న ఒక వివాహంలో వధువు గట్టిగా విలపించడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆమె వద్దకు వెళ్లి ప్రశ్నించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆమె తెలిపింది. తన వయసు 22 ఏళ్లు అని, తన కంటే 20 ఏళ్లు పెద్దయిన వ్యక్తితో తనకు వివాహం జరిపిస్తున్నారని విలపించింది. దీంతో సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆ పెళ్లిని నిలిపివేసి, వధూవరులను, ఇరువైపులా పెళ్లి పెద్దలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఎస్సై శ్రీహరి రాజు వధువును ప్రశ్నించగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, పెళ్లి కొడుకు వయసు 42 ఏళ్లు అని తెలిపింది. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని చెప్పి వధూవరుల కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. పెళ్లి చేయించేందుకు అంగీకరించిన పురోహితుడిని కూడా మందలించారు. కాగా.. వధూవరులిద్దరిదీ నెల్లూరు జిల్లానే. వధువు ఉతుకూరుకు, వరుడు కందుకూరుకు చెందినవారు. బలిజ సామాజికవర్గానికి చెందిన వధువు కుటుంబీకులు పేదవారు. అమ్మాయికి పెళ్లి చేసే స్థోమత లేక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వరుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించినట్టు తెలిసింది. దీనిపై ఎవ్వరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్, సునీతా దంపతుల కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఐఐటీలో క్లాస్మేట్, ప్రియుడు సంభవ్ జైన్ను వివాహమాడింది హర్షిత. బంధుమిత్రుల సమక్షంలో నిన్న (ఏప్రిల్ 18) ఢిల్లీలోని కపుర్తల హౌస్లో వైభవంగా ఈ మూడుముళ్ల వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వివాహానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.డిల్లీ మాజీ సీఎం కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్హంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణితో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన హిట్ చిత్రం పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. ఏప్రిల్ 20న ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!అందంగా వధూవరులుతన వెడ్డింగ్ డే కోసం, ఎరుపు లెహంగాలో గోల్డెన్ కలర్ వర్క్ బ్లౌజ్తో కళకళలాడింది. ఆమె ధరించినవీల్కూడా హైలైట్గా నిలిచింది .సంభవ్ తెల్లటి రంగు షేర్వానీ, తలపాగా నల్ల సన్ గ్లాసెస్ క్రిస్పీగా, రాయల్గా కనిపించాడు.ఇక అరవింద్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, సునీత పింక్ చీర, కమర్బంద్, గులాబీ రంగు చూడీల సెట్, చక్కటి హెయిర్ బన్తో అత్తగారి హోదాలో హుందాగా కనిపించారు.ఎవరీ సంభవ్ జైన్హర్షిత, సంభవ్ IIT ఢిల్లీలో కలుసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. 2018లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గురుగ్రామ్లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో పనిచేసింది హర్షిత. ఆ తరువాత సంభవ్తో కలిసి, బాసిల్ హెల్త్ అనే స్టార్టప్ను మొదలు పెట్టింది. కస్టమర్లకు ఆరోగ్యకరమైన, అనుకూలీకరించిన భోజనాన్ని అందించడమే దీని లక్ష్యం.. హర్షిత కన్సల్టెంట్గా పనిచేస్తున్నపుడు మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు ఈ ఆలోచన ఆమె మనసులోకి వచ్చిందట. ఇక హర్షిత సోదరుడు పుల్కిత్ కూడా IIT ఢిల్లీలో చదువుతున్నాడు.


