breaking news
Jayashankar
-
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లా ప్రజలకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 2026 సంవత్సరలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే అధికారులు, అనధికారులు బొకేలు, పుష్పగుచ్ఛాలకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, పరీక్ష ప్యాడ్స్ను అందించాలని కలెక్టర్ కోరారు. ‘ఆపరేషన్ స్మైల్’ విజయవంతం చేయాలిభూపాలపల్లి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో కూడిన రెండు టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా హోటళ్లు, దాబాలు, దుకాణాలు, పరిశ్రమలు, ఇటుకబట్టీలు, నిర్మాణ పనులు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైన బాలలు పనిలో ఉన్నట్లు గుర్తిస్తే డయల్ 100, చైల్డ్లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ వీసీలో అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఉన్నారు. అనంతరం ఏఆర్ ఎస్సై రవీందర్, డీసీఆర్బీ ఏఎస్సై సాంబయ్య ఉద్యోగ విరమణ పొందగా వారిని జిల్లా పోలీ స్ కార్యాలయంలో ఎస్పీ సత్కరించారు. శేషజీవితం ప్రశాంతంగా గడపాలని ఆకాక్షించారు.ఓసీ–3లో వేబ్రిడ్జి ప్రారంభం గణపురం: గణపురం మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నూతనంగా నిర్మించిన వేబ్రిడ్జిని భూపాలపల్లి సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వేబ్రిడ్జి నిర్మాణంతో బొగ్గు రవాణా, కొలతల ఖచ్చితత్వం మెరుగు పడుతుందన్నారు. తద్వారా ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శక పెరుగుతుందన్నారు. భూపాలపల్లి ఆర్డీఓగా హరికృష్ణభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్డీఓగా హరికృష్ణ బదిలీపై వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న రవి హనుమకొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ కాగా ఆయన స్థానంలో నేడు (గురువారం) హరికృష్ణ బాధ్యతలు స్వీకరించే ఆకాశం ఉంది. ముగిసిన నాపాక బ్రహ్మోత్సవాలుచిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక ఆలయంలో మూడు రోజులుగా వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారం నాటికి ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు కార్యక్రమంలో భాగంగా భక్తులు నవధాన్యాలు సమర్పించి మొక్కుల చెల్లించుకున్నారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో డప్పు చప్పుల్లు, యువకుల కేరింతల మధ్య ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్, అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేశ్చార్యులు, డైరెక్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేడారం జాతర చైర్పర్సన్గా ఇర్ప సుకన్య? ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర కమిటీని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. తాడ్వాయికి చెందిన ఇర్ప సుకన్యను జాతర కమిటీ చైర్పర్సన్గా నియమించనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జాతర కమిటీలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. చైర్పర్సన్తో పాటు కమిటీ డైరెక్టర్లుగా మహిళలను నియమించనున్నట్లు సమాచారం. -
సంక్షేమం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కోఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేట్ ఈడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వి ద్యార్థుల భద్రత, విద్య, భోజనం, వైద్య సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం, అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ ఫలితాల కోసం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు పంపకూడదని, వసతి గృహాల్లోకి బయటి వ్యక్తులు రానివ్వొద్దన్నారు. ప్రతీ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని, షీటీమ్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ వసతి గృహాల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలపై శాఖల అధికారులు నివేదికలు అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని, ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొరికిశాల, భూపాలపల్లి అర్బన్ పాఠశాల ఘటనపై కలెక్టర్ తగిన చర్యలు తీసుకున్నారన్నారు. అన్ని శాఖల సమన్వయంతో.. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్శర్మ, స్నేహశబరీష్, సత్యశారదలు మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో వసతి గృహాల్లో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అద్దె భవనంలో ఉంటున్న హాస్టళ్లకు బిల్లులు రాకపోవడంతో యాజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హాస్టళ్లలో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంత్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పీఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ పోస్ట్మెట్రిక్ హాస్టల్ను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు అధికారులు హాస్టళ్లలో పర్యటించాలి మెనూ ప్రకారం భోజనం అందించాలి ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సేవలు
భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందుతాయని, త్వరలో జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మారై మిషన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎమ్మారై మిషన్ కొనుగోలు కోసం సీఎస్ఆర్ నిధుల నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు అందించిన చె క్కును బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎమ్మె ల్యే, కలెక్టర్ స్వీకరించారు. అనంతరం వారు మా ట్లాడారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రీజినల్ హెడ్ వెంకటేష్ చల్వర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా అంశంపై కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక రవాణా కూపన్లలో అక్రమాలకు పాల్పడితే ఎంపీడీఓలు కఠి నంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్శర్మ, మున్సిపల్ అధికారులతో పెండింగ్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేవిధంగా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆస్పత్రిలో త్వరలో ఎమ్మారై మిషన్ ఏర్పాటు ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ -
సన్నాలకే సై
● ఇప్పటికే నార్లు పోసిన అన్నదాతలు● జిల్లాలో 97,570 ఎకరాల్లో సాగు అంచనా భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగిలో సన్నరకం ధాన్యం సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. వర్షాలు సంవృద్ధి కురవడంతో చెరువులు, కుంటల్లో నీరు ఉంది. ప్రభుత్వం కూడా సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుంది. దీంతో ఎక్కువ మంది అన్నదాతలు సన్నాల సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకుని ప్రైవేట్ కంపెనీల విత్తనాల కొనుగోలు చేసి నార్లు పోసుకుకున్నారు. అక్కడక్కడ నార్లు ఎదిగిన చోట నాటు కూడా వేస్తున్నారు. జిల్లాలో 97,570 ఎకరాల్లో సాగు.. జిల్లాలో ఈ యాసంగిలో 97,570 ఎకరాల వరకు వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 22,000 ఎకరాల్లో దొడ్డు రకం, 18,500 వేల ఎకరాల్లో ఆడ మగ రకం సాగు చేస్తున్నారు. 57,070 వేల ఎకరాలకు పైగా సన్నాలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. సాగు నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో సన్నాల సాగు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ దొడ్డురకం ధాన్యం సాగు చేసి మిల్లర్లను బతిమి లాడే బదులు భోజనానికి ఉపయోగించే సన్నరకం ధాన్యాన్ని సాగు చేస్తే కొంతమేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. సన్నరకానికి రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉండడంతో ఎగుమతి చేసే అవకాశం ఉంది. మద్ద తు ధర దక్కకపోతే బియ్యంగా మార్చి విక్రయిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతలు సన్నాల సాగుకే మొగ్గు చూపుతున్నారు. నిండుకుండలా చెరువులు.. మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలోని గణపు రం, భీంఘన్పూర్ సరస్సులతో పాటు 840కి పైగా చెరువుల్లో నీరు చేరి చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ ఏడాది యాసంగి సాగుకు నీటి కొరత ఉండదని రైతులు భావిస్తున్నారు.ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో 70 శాతం రైతులు సన్న రకం ధాన్యం సాగుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నార్లు పోసుకున్నారు. వెదజల్లే పద్ధతి ద్వారా పంట నాటు వేసుకుంటే ఖర్చులు ఆదా అవుతాయి. – బాబురావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
నిబంధనలకు అనుగుణంగా ఎరువుల విక్రయం
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు కాటారం: ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. మండలకేంద్రంలోని ఎరువుల దుకాణాలు, డీలర్ అవుట్లెట్లను మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఫైవ్స్ యాప్ ద్వారా ధృవీకరించారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, బిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. అధిక ధరలకు ఎరువుల విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ పూర్ణిమ, ఏఈఓలు పాల్గొన్నారు. -
వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
భూపాలపల్లి: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే వేడుకలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతుందన్నారు. 31వ తేదీ రాత్రి జనవరి 1వ తేదీన జిల్లా కేంద్రం, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్, స్పీడ్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. పోలీసుశాఖ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని చెప్పారు. రోడ్లపై కేక్ కటింగ్లు చేయడం, టపాకాయలు వెలిగించడం, బైక్ రేసింగ్లు నిర్వహించడం చట్టప్రకారం నేరమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంకీర్త్ పేర్కొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పర్సనల్ మేనేజర్కు సన్మానం
భూపాలపల్లి అర్బన్: ఏరియా పర్సనల్ మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్యాంసుందర్ను మంగళవారం సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు సన్మానించారు. జీఎం కార్యాలయంలోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ లైసన్ అధికారి భూక్య మోహన్, బ్రాంచ్ కార్యదర్శి హేమనాయక్, నాయకులు సికిందర్సింగ్, రాములు, శ్రీనివాస్, రవికుమార్, శోభన్, బలరాం, రమేష్, శ్రీను పాల్గొన్నారు. ఎస్టీ లైజన్ అధికారిగా భూక్య మోహన్ ఏరియా సింగరేణి ఎస్టీ లైజన్ అధికారిగా భూక్య మోహన్ను నియామకమయ్యారు. జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రావు ద్వారా నియామక పత్రాన్ని అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి ముందుంటానని, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఏరియా అఽధికారులతో మాట్లాడుతానన్నారు. -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు బుధవారం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు ఎల్ఎండీ నుంచి... ఉమ్మడి వరంగల్లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు మొత్తం ప్రతిపాదించింది నీటి కేటాయింపుదేవాదుల 4,66,600 1,95,095 11.30 ఎస్పారెస్పీ 2,29,623 1,57,038 12.88 (బిలో ఎల్ఎండీ) ఎస్సారెస్పీ–2 96,671 83,039 6.82చీఫ్ ఇంజినీరు ములుగు సర్కిల్ పరిధిలో ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్ శాఖ సన్నద్ధం వారబందీ పద్ధతి అమలు -
అంగడి అంగడి..
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో సంత నిర్మాణం కోసం పదేళ్ల క్రితం చేసిన ప్రతిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. పాలకులు మారినా సంత నిర్మాణం మాత్రం కావడం లేదు. శాశ్వత స్థలం కేటాయించి సంతలో సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం.. భూపాలపల్లి పట్టణం సుభాష్కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనకాల గ్రౌండ్లో ప్రతీ గురువారం వారాంతపు సంత సాగుతోంది. పట్టణ ప్రజలతో పాటు పరిసర, సమీప గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తారు. కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, మాసాలాలు, పండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సంతలో సరైన స్థలం, వసతులు లేక రోడ్లపైన వ్యాపారాలు నిర్వహించడంతో అటు అమ్మకందారులు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపల్ అఽధికారులు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు, కొనుగోలుదారులకు కనీసం తాగునీటి సౌకర్యం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. మహిళల ఇబ్బందులు చెప్పుకోలేకుండా ఉన్నాయి. గంప చిట్టి పేరుతో వ్యాపారుల నుంచి రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. రోడ్లపైనే అమ్మకాలు.. పట్టణంలో దాదాపు 30వేల కుటుంబాలు, సమీప గ్రామాల ప్రజలు ఈ వారాంతపు సంతపైనే ఆధారపడి ఉంటారు. ప్రతీ వారం జరిగే ఈ సంతలో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. సంతలో అమ్మకందారులకు సరైన వసతులు లేకపోవడంతో రోడ్లపైనే విక్రయాలు జరపడంతో రోడ్లన్నీ జనంతో నిండిపోతున్నాయి. అంబేడ్కర్ సెంటర్ నుంచి సుభాష్కాలనీ వైపు కేటీకే 1వ గని, ఓసీపీ–2లకు బొగ్గు, ఇసుక లారీలు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయాల్సి వస్తుంది. భయపెడుతున్న పశువులు సంతలో పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కూరగాయలను తినడమే కాకుండా వ్యాపారులు, కొనుగోలుదారులను పొడుస్తున్నారు. వెనకాల నుంచి వచ్చి చేతిలో సంచులను నోటితో లాగి అందులో ఉన్నవాటిని సైతం తింటున్నాయి. పశువులు సంత లోపలకి రాకుండా చూడాల్సిన మున్సిపల్ సిబ్బంది అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగడిలో ప్రతీ వారం లక్షల్లో వ్యాపారం నడుస్తోంది. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. గ్రామాల్లో జరిగే అంగడి కూడా ఇంత అధ్వానంగా ఉండదు. అధికారులు స్పందించి వినియోగారులకు, అమ్మకందారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. సంతకు రావాలంటేనే భయమేస్తోంది. మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తోంది. సంతలో పశువులు, మేకలు తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. – మద్దెల విజయ్, భూపాలపల్లి కొనుగోలు, అమ్మకందారులకు ఇక్కట్లు పట్టించుకోని మున్సిపల్ అధికారులు -
కల్యాణం కమనీయం
హాజరైన భక్తులుచిట్యాల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండలంలోని నైన్పాక గ్రామం నాపాక ఆలయంలో మంగళవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ సీతారామలక్ష్మణ స్వామి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఉదయమే అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు. మహిళలు, పిల్లలు కోలాటాలు, భజన ప్రదనర్శలతో పాటు కూచిపూడి నాట్యం చేయడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విజేతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్, ప్రధాన అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేష్ చార్యులు, రాకేష్ పాల్గొన్నారు. దర్శించుకున్న పలువురు ప్రముఖులు మాజీ ఎమ్మెలే గండ్ర వెంకటరమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, డీసీఓ వాల్యూనాయక్, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, ఆర్ఐ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ తదితరులు దర్శనం చేసుకున్నారు. కల్యాణాన్ని తిలకించారు. కోలాటం వేస్తున్న మహిళలు ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు -
నాపాక బ్రహ్మోత్సవాలు షురూ
చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక ఆలయంలో బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేశ్చార్యులు ఆధ్వర్యంలో ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, హోమం చేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య దంపతులతో పాటు మండలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు నక్క భాస్కర్ ( నైన్పాక), బుర్ర చంద్రకళ(గిద్దెముత్తారం), కాసు రమ–కుమార్( వెంచరామి), కాసం మాధవి–రాజిరెడ్డి (అందుకుతండా), పాశం పుష్పలత– కుమార్ (వరికోల్పల్లి ) నైన్పాక మాజీ ఎంపీటీసీ కట్టెకోళ్ల రమేశ్తో పాటు పలు గ్రామాలకు చెందిన దంపతులు పాల్గొన్నారు. నేడు ఉత్తర ద్వార దర్శనం.. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు కోలాటాలు, భజన ప్రదర్శనలతో పాటు కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. నేడు ఉత్తర ద్వార దర్శనం భక్తుల కోలాటాలు, కూచిపూడి భరతనాట్యం -
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
భూపాలపల్లి రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని 56మంది నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కారం చూపడం అధికారుల బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డ్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. సమృద్ధిగా యురియా నిల్వలు జిల్లాలో సమృద్ధిగా యురియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ రోజు మండల ప్రత్యేక అధికారులు, టాస్క్ఫోర్స్ టీములు, డివిజన్ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతీరోజు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా అమ్మకాలు ప్రారంభించాలని సూచించారు. ప్రతీ స్టాక్ పాయింట్ వద్ద ప్రారంభ, ముగింపు నిల్వలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో సహకార శాఖ ద్వారా 10 కేంద్రాలున్నాయని, అదనంగా 22 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రైతులకు ఏమైనా సమస్య ఉంటే 78930 98307 కంట్రోల్ రూం నంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి బాబురావు, సహకార అధికారి వాల్యానాయక్ పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లా లక్ష్యం టీబీ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే మెషిన్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానిత టీబీ కేసులను స్క్రీనింగ్ చేసేందుకు జిల్లాకు అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే మెషిన్ మంజూరు చేశారని తెలిపారు. ఈ ఎక్స్రే మెషిన్ ప్రధాన ఉద్దేశం జిల్లాలో గ్రామస్థాయిలోనే అనుమానిత టీబీ గ్రస్తులకు ఎక్స్రే పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, క్షయ వ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ దేవేందర్, డాక్టర్ రాజేష్, డీపీఓ చిరంజీవి, టీబీ సూపర్వైజర్ శ్రీకాంత్, రేడియోగ్రాఫర్ సుధాకర్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
సా..గుతున్న చిన్న కాళేశ్వరం పనులు..
కాటారం సబ్ డివిజన్లోని పంట పొలాలకు సాగునీరు అందించాలనే సదుద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నేటికీ పూర్తి కావడం లేదు. రూ.499 కోట్ల వ్యయంతో 2008 సెప్టెంబరు 19న ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.370 కోట్లు ఖర్చు చేసి 70 శాతం పనులను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 4.5 టీఎంసీల నీటిని తరలించి 45,280 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నప్పటికీ భూసేకరణలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. -
చకచకా కోర్టు పనులు..
జిల్లాకేంద్రంలో సమీకృత కోర్టు సముదాయ భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కోర్టులు నాలుగేళ్లుగా అద్డె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలు ఇరుకుగా ఉండటం, కనీస సౌకర్యాలు లేక కోర్టు ఉద్యోగులు, అడ్వకేట్లు, కోర్టులను ఆశ్రయించే వారు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.37 కోట్లతో నిర్మించనున్న సమీకృత కోర్టు భవనాల నిర్మాణ పనులకు గత నెల 1వ తేదీన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్సింగ్ శంకుస్థాపన చేశారు. నూతన సంవత్సరంలో భవనం అందుబాటులోకి వచ్చే విధంగా నిర్మాణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. -
తొలిదశల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్..
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్ధేశంతో జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవనం నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ శివారులో రూ.196 కోట్లతో అక్టోబర్ 10న భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ పనులు నేటికీ భూమి చదును దశలోనే ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి గతేడాది జూలై 25న శంకుస్థాపన చేశారు. 60 గుంటల్లో పరిశ్రమలు, 37.69 ఎకరాల్లో 197 ప్లాట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. -
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..
ఫోన్ ఇన్లో మాట్లాడుతున్న డీఎంహెచ్ఓ చల్లా మధుసూదన్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే పలు రకాల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియో, సైనసైటిస్ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు వస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్లో ప్రజల సమస్యలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ప్రశ్న: చలి తీవ్రతకు ఎటువంటి జాగ్రతలు పాటించాలి (అజయ్, సాదన్రెడ్డి, కాటారం) డీఎంహెచ్ఓ: చలి తీవ్రతకు గురికాకుండా ఉండేందుకు నూలు, ఉన్ని దుస్తువులను ధరించాలి. చెవులు, ముక్కు నుంచి చల్లటి గాలి శరీరంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. వేడివేడి భోజనం తినాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ప్రశ్న: చిన్న పిల్లలు ఎటువంటి జాగ్రతలు పాటించాలి (దేవేందర్రావు, రేగొండ)డీఎంహెచ్ఓ: ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లల చేతులకు గ్లౌజులు, మాస్కులు, స్వెటర్లు వేయాలి. వేడి అన్నం తినిపించారు. వేడి నీరు తాగే విధంగా చూసుకోవాలి. ఆస్తమా లాంటివి ఉన్నట్లయితే నెబులైజర్ వినియోగించాలి. ప్రశ్న: చిట్యాల సీహెచ్సీలో వైద్యులను నియమించాలి. ప్రతీ వారం స్పెషలిస్టులతో పరీక్షలు చేయించాలి (బుర్ర వెంకటేష్, బుర్ర తిరుపతి, చిట్యాల)డీఎంహెచ్ఓ: చిట్యాల మండల కేంద్రంలోని సీహెచ్సీలో డాక్టర్ల నియమాకంపై కలెక్టర్, డీసీహెచ్ఎస్లు దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు డాక్టర్లను నియమించారు. ప్రశ్న: రోజుల తరబడి పిల్లలకు దగ్గు, జలుబు తగ్గడం లేదు. (పసన్నకుమారి, టేకుమట్ల)డీఎంహెచ్ఓ: శీతాకాలం నేపథ్యంలో వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు అధికంగా వస్తాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఆస్తమా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు నెబులైజర్ వినియోగించాలి. వెచ్చదనంగా ఉండే దుస్తులను వేయాలి. ప్రశ్న: గర్భిణులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి (అంబాల కిరణ్, టేకుమట్ల)డీఎంహెచ్ఓ: చలిని తట్టుకునేందుకు గర్భిణులు కొంత మంది పొద్దంతా ఎండలోనే ఉంటారు కానీ అలా ఉండొద్దు. ఉదయం 9గంటలలోపు మాత్రమే ఎండలో ఉండాలి. దీంతో డీ విటమిన్ వస్తుంది. ఉదయం 10గంటల తరువాత, సాయంత్రం ఐదు గంటలలోపు మాత్రమే ప్రయాణాలు చేసుకోవాలి. లూజుగా ఉండే దుస్తువులను ధరించాలి. చలితో జ్వరం, జలుబు బారిన పడే ప్రమాదం ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఎంహెచ్ఓ డాక్టర్ చల్లా మధుసూదన్ప్రశ్న: ఆస్తమా ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి (వెంకటేష్, కొడవటంచ)డీఎంహెచ్ఓ: నూలు, ఉన్ని ఉన్న దుస్తువులు ధరించాలి. చలి ఉండే సమయంలో గదిలో నుంచి బయటకు రావద్దు. ముక్కు, చెవుల నుంచి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. వేడి అన్నం తినాలి. వ్యాధి తీవ్రతను బట్టి నెబులైజర్ వినియోగించుకోవాలి. ఉదయం 10గంటల తరువాతనే బయటకి రావాలి. చల్లటి గాలిలో పడుకోకూడదు. బీపీ ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. -
అమ్మానాన్నా.. మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్న.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవడంతో భావన, మేఘన రా ణి అక్కడికక్కడే మృతిచెందారు. మీ అమ్మాయిలు మృతిచెందారని సోమవారం తెల్లవారుజామున అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత.. గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
వైద్యసేవల్లో భేష్
జీజీహెచ్లో మెరుగునపడిన సదుపాయాలుభూపాలపల్లి: జిల్లాలో వైద్యరంగంలో మెరుగైన సేవలు అందుతుండగా పలు రంగాల్లో మాత్రం అభివృద్ధి పనులు, సేవలు నత్తనడకన సాగుతున్నాయి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తుండగా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, ఇండస్ట్రియల్ పార్కు భూమి చదును దశలోనే ఉంది. మెరుగైన వైద్య సేవలు.. మెడికల్ కళాశాల అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి. మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.20 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. 340 బెడ్లకు సరిపడా అదనపు గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పేషెంట్లకు అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు ఈ ఏడాది జనవరి 27న వెంటిలేటర్ సౌకర్యాన్ని కల్పించారు. రూ.3.40 కోట్లతో సీటీ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఇటీవలే ప్రారంభించారు. ఇటీవల ఎన్సీడీ స్కానింగ్ సెంటర్, ట్రాన్స్జెండర్ క్లినిక్, సెంట్రల్ డ్రగ్ స్టోర్లను ప్రారంభించారు. నిర్మాణంలో మెడికల్ కళాశాల భవనం చురుకుగా సాగుతున్న సమీకృత కోర్టు భవనాల పనులు నత్తనడకన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి -
అడవుల రక్షణ అందరి బాధ్యత
● కాటారం ఫారెస్ట్ రేంజ్ అధికారి స్వాతి కాటారం: అడువులను రక్షించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని కాటారం ఫారెస్ట్ రేంజ్ అధికారి స్వాతి అన్నారు. కాటారం మండలం ఆదివారంపేట, గుమ్మాళ్లపల్లి, ఒడిపిలవంచ గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో అటవి సంరక్షణ, జంతు సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ అడవికి ముప్పు మానవాళికి ముప్పు అన్నారు. అడవుల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఒడేటి రంజిత్కుమార్, భక్తు శరత్కుమార్, నరివెద్ది మాధవి, డిప్యూటీ రేంజర్ సురేందర్, ఎఫ్బీఓ రాజేందర్ పాల్గొన్నారు. -
వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్ను శనివారం జిల్లాకేంద్రంలో ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు. జనవరి 3నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లోని శంషాబాద్లో నిర్వహించనున్నట్లు వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరేపల్లి సుజిత్ తెలిపారు. మహాసభకు జిల్లా నుంచి విద్యార్థులు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గుజ్జుల ప్రేమ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవితేజ, సిరి, శశ్వంత్, వరుణ్ పాల్గొన్నారు. -
మేడారంలో ఎస్పీ పర్యటన
ఏటూరునాగారం: నేడు ఆదివారం కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా చర్యల్లో భాగంగా ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం మేడారం పర్యటించారు. గద్దెలకు భక్తులు చేరుకునే మార్గాలు, దర్శనం అనంతరం బయటకు వెళ్లే ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే వాహనాలను మళ్లించాలన్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పెడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే గద్దెల వద్ద జరుగుతున్న సాలారం పనులు పరిశీలించారు. కోళ్ల షాపులకు దరఖాస్తుల ఆహ్వానం ఏటూరునాగారం: మేడారం మహా జాతరలో కోళ్ల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు గిరిజనులు, గిరిజన మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి ఐటీడీఏ ఏటూరునాగారం, మేడారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఉచితంగా దరఖాస్తులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ దరఖాస్తులను జనవరి 15వ తేదీ సాయంత్రం 5గంటలోపు సమర్పించాలని సూచించారు. ఒక్కో షాపునకు రూ.16వేలు ఐటీడీఏ ఏటూరునాగారం పేరుతో డీడీ తీయాలని వెల్లడించారు. షాపు పెట్టాలనుకునే దుకాణం దారుడు షాపు ఎక్కడ నిర్వహిస్తున్నాడనే లొకేషన్, ఆధార్కార్డు, ప్లాట్ యజమాని వివరాలను విధిగా దరఖాస్తు ఫారంతో జత చేసి ఇవ్వాలని సూచించారు. అనంతరం అర్హులైన వారికి జనవరి 22వ తేదీలోపు దరఖాస్తులను పరిశీలించి లైసెన్స్, ప్రొసిడింగ్స్ అందజేస్తామని వివరించారు. -
నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి
భూపాలపల్లి రూరల్: సర్పంచ్లు నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. మహిళా సర్పంచ్లు ఇందిరాగాంధీ స్ఫూర్తితో గ్రామపాలన చేయాలన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పుష్పగార్డెన్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డుసభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ల విధులు, ఆదాయ వనరులు సమకూర్చుకొనుట, పంచాయతీల ఏర్పాటు విధానం, పాలనా విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి పంచాయతీలే వేదికలని అన్నారు. వంద శాతం సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించాలని తెలిపారు. గ్రామాల్లో సోలార్ సెట్లను ఏర్పాటు చేసి విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలని సూచించారు. సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే తమకు తెలపాలని చెప్పారు. మహిళా శక్తిని మించి ఏదీలేదని, మహిళా సర్పంచ్లు ఉక్కు మహిళ ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా పాలన అందించి ప్రజల మెప్పు పొందాలన్నారు. ప్రతీ నెల నిబంధనల ప్రకారం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అధికారులతో, ప్రజలతో సఖ్యతగా మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులను సన్మానించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 146 మంది లబ్ధిదారులకు రూ.1,46,16,936 కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, భూపాలపల్లి, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, శ్రీదేవి, పార్టీ రాష్ట్ర నాయకులు రాంనర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, నాయకులు అప్పం కిషన్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్ల శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
నేర నియంత్రణలో చురుగ్గా పనిచేయాలి
● ఎస్పీ సంకీర్త్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నేర నియంత్రణలో పోలీస్ అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం జిల్లాస్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవారీ సమీక్షలో భాగంగా జిల్లాలో నేర నియంత్రణ, శాంతి–భద్రతల పరిరక్షణ, ప్రజలకు అందించిన సేవల విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది కనబరిచిన పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో నాణ్యమైన, బాధ్యతాయుతమైన దర్యాప్తు జరగడం వల్లనే బాధితులకు న్యాయం చేకూరుతుందన్నారు. నేరస్తులకు తప్పనిసరిగా శిక్ష పడేలా అధికారులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే సంవత్సరంలో కూడా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, జాప్యం లేకుండా విచారణ పూర్తి చేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి సొత్తు రికవరీ చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసింగ్ను కఠినంగా అమలు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, జిల్లాలోని ఎస్సైలు పాల్గొన్నారు. -
హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్ జనరల్
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి కుటుంబ సబ్యులతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ఈఓ మహేశ్, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
మేడారానికి బస్సు సర్వీసులు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో భూపాలపల్లి నుంచి మేడారానికి ముందస్తుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ రోజు ఉదయం 8గంటలకు, 9గంటలకు, సాయంత్రం 4గంటలకు, 5గంటలకు రాత్రి 10గంటలకు భూపాలపల్లి నుంచి మేడారానికి సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. తిరుగు ప్రయాణంలో మేడారం నుంచి ఉదయం 10:40గంటలకు, 11:40గంటలకు సాయంత్రం 6:45 గంటలకు రాత్రి 7:45గంటలకు బస్సులు ఉంటాయన్నారు. భూపాలపల్లి నుంచి గణపురం, ములుగు, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరమైతే అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామన్నారు. హరేకృష్ణ రథోత్సవం భూపాలపల్లి అర్బన్: బంజారాహిల్స్ గోల్డ్న్ టెంపుల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో హరినామ నగర సంకీర్తన రథోత్సవం నిర్వహించారు. స్థానిక హన్మాన్ దేవాలయం నుంచి జయశంకర్ సెంటర్ వరకు సంకీర్తన చేపట్టారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ రథయాత్రను ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి జెండాఊపి ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కృష్ణగీతాలు, డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేపట్టారు. శ్రీవారి నామస్మరణం, హరేకృష్ణ కీర్తనలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామప్పలో భక్తుల సందడి వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు వివరించారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య... భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు తాజా మాజీ వార్డు కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త రాజలింగమూర్తి(49) హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో తన ఇంటికి బైక్పై వెళ్తున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసును సవాల్గా తీసుకున్న జిల్లా పోలీసులు నాలుగు రోజుల్లోనే ఏడుగురు నిందితులను, తదనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. 9మందికి జీవిత ఖైదు... 2021 జూన్ 19న కాటారం మండలం గంగారం గ్రామంలో భూ తగాదా విషయంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో 9 మంది నిందితులకు ఈ నెల 23వ తేదీన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులోని నిందితులు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడాదిలో కోర్టు వెలువరించిన తీర్పుల్లో ఇదే అతి పెద్దది. సైబర్ కేసులు 87 నమోదు.. జిల్లాలో ఈ ఏడాదిలో ఈ నెల 26వ తేదీ వరకు సైబర్ నేరాలు జరిగినట్లుగా 537 మంది ఫిర్యాదు చేశారు. అందులో 87 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. నమోదైన కేసులకు సంబంధించిన బాధితులకు రూ. 9.54 లక్షలను పోలీసులు తిరిగి ఇప్పించినట్లు తెలిసింది. మహిళలపై తగ్గిన హత్య, లైంగిక దాడులు ● గతేడాదికంటే తగ్గిన రోడ్డు ప్రమాదాలు ● జిల్లాలో పెరిగిన చోరీలు ● సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య ● జిల్లా ప్రజలకు తప్పని సైబర్ మోసాలు ప్రమాదాలు, మరణాలు.. 2023 2024 2025 రోడ్డు ప్రమాదాలు 196 223 217 మరణాలు 90 74 79 గాయాలు 95 124 213జిల్లాలో గతేడాదితో పోలిస్తే చోరీల సంఖ్య పెరగగా.. మహిళలపై వరకట్న వేధింపులు, గృహహింస, హత్యలు, లైంగిక దాడులు కొంతమేరకు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా కొంత మేరకు తగ్గగా, గంజాయి కేసులు గతంలో మాదిరిగానే నమోదయ్యాయి. పోలీసులు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది సైబర్ నేరాల బారిన పడ్డారు. ఈ ఏడాదిలో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. – భూపాలపల్లిచోరీ కేసులుకేసులు 2023 2024 2025 చోరీ కేసులు 86 108 118 ఛేదించిన కేసులు 30 36 56 చోరీ సొత్తు(రూ.) 1,58,44,603 77,75,945 1,20,49,700 రికవరీ సొత్తు(రూ.) 22,72,880 24,85,400 31,87,595మహిళలపై దాడుల కేసులు... 2023 2024 2025 వరకట్న వేధింపులు, గృహహింస 121 145 117 మహిళలపై హత్యలు 1 6 4 లైంగిక దాడులు 14 18 10 వరకట్న హత్యలు 1 0 1గంజాయి కేసుల వివరాలు.. 2023 2024 2025 నమోదైన కేసులు 12 23 23 పట్టుబడిన గంజాయి విలువ(రూ.లక్షలు) 2,97,300 45,98,900 33,00,000 అరెస్ట్ అయిన వారు 30 78 64చోరీ సొత్తు రికవరీ అంతంతే.. జిల్లాలో ఈ ఏడాది 118 చోరీ కేసులు నమోదు కాగా చోరీ సొత్తు అంతంత మాత్రంగానే రికవరీ అయింది. గతంతో పోలిస్తే చోరీ కేసులను ఛేదించిన సంఖ్య ఈ ఏడాది పెరిగింది. -
రేపు సాక్షి ఫోన్ ఇన్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటున్నా ఉదయం, సాయంత్రం చలి ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలతో పాటు సాధారణ పౌరులు దగ్గు, జలుబుతో పాటు జ్వరం బారిన పడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స వివరాలు తెలుసుకునేందుకు నేరుగా జిల్లా వైద్యారోగ్యాశాఖ అధికారి డాక్టర్ చల్ల మధుసూదన్ కు ఫోన్ చేసే అవకాశాన్ని ‘సాక్షి’ కల్పిస్తోంది. ప్రజలు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి సందేహాలను తీర్చుకోవడమే కాక సలహాలు తీసుకోవచ్చు. తేది 29–12–2025 (సోమవారం) సమయం: మధ్యాహ్నం 3 గంటల నుంచి 4గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 94403 25816 -
గంగదేవిపల్లిని సందర్శించిన ప్రతినిధులు
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్రెడ్డి, బత్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, రఘునాథధపల్లి మండలం ఖిలాషాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వారా ఆదర్శంగా నిలిచి దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూసం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 202
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి -
భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రౌటింగ్
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నూతనంగా గ్రానెట్తో ఫ్లోర్ నిర్మాణం పనులు చేపట్టారు. జాతర సమయంలో భక్తులు బంగారం(బెల్లం), కొబ్బరి, నీళ్లతో జారీ పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రానెట్పై గ్రౌటింగ్ చేయించే పనులను మొదలు పెట్టారు. దీనివల్ల కాలుకు గ్రిప్ లభించి కిందపడకుండా ఉంటారు. వృద్ధులు, చిన్నారులకు సైతం ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం ఈ సారి మొబైల్ మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జాతరలో భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలైన ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, స్నానఘట్టాల రోడ్డు, చిలకలగుట్ట ప్రాంతంలో ప్లాస్టిక్తో కూడిన మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. జాతరలో మొత్తం 1,020 మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
మేడారంలో ఈ–కానుక
ఏటూరునాగారం: మేడారంలో గతంలో భక్తులు హుండీల్లో నగదు వేసేవారు. కంప్యూటర్ యుగానికి అనుగుణంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ– కానుకల సర్వీసులను మొదలు పెట్టారు. గతంలో కేవలం జాతర సమయంలో ఎక్కువగా ఈ –కానుకులు చెల్లించేది. ఇప్పుడు సాధారణ సమయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో డిజిటల్ పేమెంట్లను కానుకల రూపంలో అమ్మవారికి చెల్లించే విధంగా ఈ–కానుక స్కానర్లను ఏర్పాటు చేశారు. దీంతో పలువురు భక్తులు కానుకలు హుండీలో వేస్తుండగా మరికొందరు నగదు రహితంగా డిజిటల్ పేమెంట్లు చేసి అమ్మవారికి కానుకలు చెల్లిస్తున్నారు. -
కనులవిందుగా పంబారట్టు
● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ కాటారం: కాటారం మండలకేంద్రంలో శుక్రవారం అయ్యప్పస్వామి పంబారట్టు కార్యక్రమం కనులవిందుగా కొనసాగింది. శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఎక్కించి ఆలయం నుంచి గారెపల్లి చౌరస్తా మీదుగా పురవీధుల గుండా తిప్పుతూ అత్యంత వైభవోపేతంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా భక్తులు మొక్కులు సమర్పించారు. అయ్యప్ప మాలాధారణ స్వాములు, భక్తిపాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరి నదిలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు బచ్చు అశోక్గుప్తా, ఆలయ అర్చకులు గుండూరి భానుప్రసాద్శర్మ, జీవీ శాస్త్రి, ఆలయ కమిటీ బాధ్యులు పీచర రామకృష్ణారావు, మద్ది నవీన్, అయిత వెంకన్న, పెండ్యాల రంజిత్కుమార్, జక్కు మొగిలి, పసుల రాంచంద్రం, గంగిరెడ్డి లచ్చిరెడ్డి, ముస్కమల్ల సత్యం, మాలాధారణ స్వాములు పాల్గొన్నారు. -
సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలు
భూపాలపల్లి అర్బన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భావ వేడుకలు జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్(పార్టీ కార్యాలయం)లో జిల్లా నాయకులతో కలిసి పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 100 సంవత్సరాల చరిత్రలో అనేక ఉద్యమాలు చేసి ప్రజల మన్నన పొందుతున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. పట్టణంలోని వివిధ కాలనీలలో పార్టీ నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సోత్కు ప్రవీణ్కుమార్, సతీష్, సుగుణ, శ్రీకాంత్, జోసెఫ్, సుధాకర్రెడ్డి, జోగేష్, సింహాద్రి, లావణ్య, కృష్ణ, రాజు, అస్లాం, రమేష్చారి పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం ఏర్పాటుకు నేడు (శనివారం) జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, అబ్జర్వర్లు సతీష్, గజేంద్ర హాజరవుతారని చెప్పారు. భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కట్ట రాంచంద్రమూర్తి ఎన్నికయ్యారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం జిల్లా కమిటీ ఎన్నికల అధికారి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కుందూరు గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పడగాల అయిలయ్య, ఉపాధ్యక్షులుగా గడ్డం పోషయ్య, ఠాకూరు విక్రమ్సింగ్, కట్ల రమణారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా అడప రాజయ్య, కోశాధికారిగా జరుపుల ధన్సింగ్నాయక్, సహాయ కార్యదర్శులుగా కొండబత్తుల రాజేందర్, పి.నారాయణరెడ్డి, మార్త వెంకటరమణ, లక్ష్మణ్రావు, కార్యదర్శులుగా రామారావు, మహేందర్రెడ్డి, రామునాయక్ నియామకమయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను సన్మానించారు. ములుగు రూరల్: మేడారం మహాజాతరకు ముందస్తుగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ 2 డిపో మేనేజర్ రవిచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ బస్స్టేషన్ నుంచి ఉదయం ఆరు గంటల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపిస్తామని వివరించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. మేడారం తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం బస్సులు గద్దెల వరకు వెళ్తున్నాయని వివరించారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో వచ్చే నెల 11న నిర్వహించనున్న ఆదివాసీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. మేడారంలో అమ్మవార్ల గద్దెల వద్ద సమ్మేళనం కరపత్రాలను నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణకు ఆదివాసీ తెగల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీలు, ఆదివాసీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో హాజరై సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చందా మ హేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, తుడుం దెబ్బ ప్రచార కార్యదర్శి మలకం సమ్మయ్య, తాడ్వాయి మండల అధ్యక్షుడు చందా నవీన్, మండల ప్రధాన కార్యదర్శి తాటి సురేష్, మండల ఉపాధ్యక్షుడు చర్ప జునేష్, పిట్టల నగేష్ పాల్గొన్నారు.తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్కుమార్ -
యూరియా ఆన్లైన్..
జిల్లా వివరాలు..కాటారం: అన్నదాతకు యూరియా కష్టాలు తప్పనున్నాయి. పంట సాగు సమయంలో ఎరువుల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాలు, విక్రయ కేంద్రాల ఎదుట సమయం వృథా చేసుకొని నిరీక్షించాల్సిన అవసరం ఇక లేదు. పంటలకు అవసరమయ్యే ఎరువులను ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాసంగి సీజన్ నుంచే ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. మొదటగా ఫర్టిలైజర్ దుకాణాల నుంచి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సాగు విస్తీర్ణంతో సరఫరా.. రైతులు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఎకరానికి మూడు బస్తాలు ఇచ్చేలా ప్రణాళికలు రూ పొందించారు. వీటిలో ఒక ఎకరం నుంచి రెండు ఎ కరాల్లో సాగుచేసే వారికి రెండు దఫాల్లో ఎరువులను సరఫరా చేయనున్నారు. 5నుంచి 20 ఎకరా ల్లో సాగుచేసే వారికి మూడు దఫాల్లో, 20 ఎకరాల పైన సాగుచేసే వారికి నాలుగు దఫాలుగా ఎరువులు అందించనున్నారు. అవసరం ఉన్న రైతులు విడతల వారీగా యాప్లో బుక్ చేసుకున్న తర్వాత సంబంధిత ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడికి లాగిన్ తెలి పిన వెంటనే కావాల్సిన ఎరువులు ఇచ్చేలా ఏర్పా ట్లు చేశారు. ప్లేస్టోర్ ద్వారా ఈ ప్రత్యేక యాప్ను రైతులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నిల్వ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.. ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ యాప్తో ఎరువుల నిల్వ ఎక్కడెంత ఉందో ఇట్టే తెలుసుకునే సౌలభ్యం కల్పించారు. రైతులు సమీపంలోని ఇతర షాపుల్లో ఉన్న యూరియా నిల్వలను కూడా తెలు సుకోవచ్చు. రైతులు అవసరమైన యూరియా బస్తాలను తమకు అనుకూలమైన డీలర్ వద్ద ముందే బుక్ చేసుకునే వీలుంటుంది. బుక్ చేసుకున్న తర్వా త నిరీక్షణ లేకుండా యూరియా పొందవచ్చు. అన్ని వర్గాల రైతులకు వెసులుబాటు.. ఎరువుల బుకింగ్ కోసం తయారుచేసిన ప్రత్యేక యాప్ ద్వారా ప్రతీ రైతుకు యూరియా కష్టాలు తప్పనున్నాయి. కౌలు, పోడు పట్టాలు పొందిన రైతులకు సైతం సేవలు అందేలా సర్కారు యాప్ను రూపొందించింది. కౌలు రైతులు భూ యజమాని ఆధార్ ధృవీకరణతో యూరియా బుక్ చేసుకునేలా అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ యాప్పై జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సైతం యాప్ వినియోగం, బుకింగ్ చేసుకునే విధానంపై శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు వివరించారు. ఏఓలు, ఏఈఓలు రైతులకు అవగాహన కల్పించేలా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.యాసంగి సాగు విస్తీర్ణం అంచనా (ఎకరాల్లో..) వరి 98,000మొక్కజొన్న 30,000పెసర 150ఇతర పంటలు 300 రైతులకు తప్పనున్న కష్టాలు ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశంజిల్లావ్యాప్తంగా 12 మండలాలు ఉండగా 2.27 లక్షల మేర భూమిలో సాగు జరుగుతోంది. 341 ఫర్టిలైజర్ దుకాణాలు ఉండగా.. 1,19,784 మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గడిచిన ఖరీఫ్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. రోజుల తరబడి ఎరువుల దుకాణాలు, స్టాక్ పాయింట్ల వద్ద క్యూ లైన్లు కట్టి నిరీక్షించారు. యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో రైతులకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం ఈ యాప్నకు శ్రీకారం చుట్టింది. ఈ యాసంగి సీజన్ నుంచే యాప్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘కాళేశ్వరం’ బస్టాండ్ నిర్మాణంపై రగడ
కాళేశ్వరం: కాళేశ్వరంలో బస్టాండ్ నిర్మాణంపై రగడ జరుగుతోంది. రెవెన్యూ, అటవీశాఖ మధ్య సమన్వయం లోపించినట్లు కనిపిస్తోంది. ప్రజా అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసింది. అప్పటి నుంచి అటవీశాఖ తమ ఫారెస్టు భూమి అంటూ అడ్డు తగులుతోంది. మంత్రి చొరవతో.. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్భాబు ప్రత్యేక దృష్టితో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో బస్టాండ్ నిర్మాణానికి రూ.3.96కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూలైలో గోదావరి నదికి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో బస్టాండ్ త్వరితగతిన నిర్మాణం జరగాలని ఆలోచన చేస్తున్నారు. అత్యాధునిక హంగులతో నిర్మాణం చేయాలని, అవసరమైతే డిపో నిర్మాణం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. కొదిపాటి స్థలంతో.. ప్రస్తుతం కాళేశ్వరంలో బస్టాండ్ చిన్నపాటి స్థలంలో ఉంది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు ఇతర చోట స్థలం కావాలని రెవెన్యూ అధికారులకు విన్నపించారు. దీంతో రెవెన్యూ అధికారులు కాళేశ్వరంలోని హనుమాన్ నగర్ ప్రాంతంలోని 129 సర్వేనంబర్లో 4.24 ఎకరాల స్థలం ఆర్టీసీకి అప్పగించారు. దీంతో అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ఆర్టీసీ డీఎం ఇందు, అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ సమాయత్తం అవుతున్నారు. మట్టిపరీక్షలు చేపట్టడానికి బుధవారం ఆర్టీసీ అధికారులు, ఇంజనీర్లతో కలిసి తరలివచ్చారు. అటవీశాఖ రేంజర్ రవికుమార్, ఫారెస్టు సెక్షన్ అధికారి ఆనంద్, మమత సిబ్బందితో వచ్చి తమ శాఖ భూమి అంటూ అడ్డుకున్నారు. తహసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ వారితో వాదించినా ససేమిరా అన్నారు. ఇరు శాఖలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు మట్టి పరీక్షలు సేకరించారు. నిర్మాణంపై నీలినీడలు.. బస్టాండ్ సమీపంలోని సాకి కుంటలో బస్టాండ్ నిర్మాణం జరుపాలని పలువురు తెరపైకి తీసుకువస్తున్నారు. గతంలో ఆ కుంటలో పోలీస్స్టేషన్ నిర్మాణం జరుగాల్సి ఉండగా సీడబ్ల్యూసీ అధికారులు అడ్డుచెప్పడంతో మరోచోట నిర్మాణం జరిగింది. మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక చొరవ తీసుకొని అటవీ, రెవెన్యూశాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎఫ్ఎస్ఓ ఆనంద్ను సంప్రదించగా.. అటవీశాఖ భూమి కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆర్టీసీ డీఎం ఇందును సంప్రదించగా.. తమకు ఎవరూ అడ్డుతగలలేదని.. మట్టి పరీక్షలు చేపట్టామని తెలిపారు. రూ.3.96కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం అటవీ, రెవెన్యూశాఖల సమన్వయలోపం ఎట్టకేలకు మట్టి పరీక్షలు చేసిన ఆర్టీసీ అధికారులు -
అంగన్వాడీలకు మరుగుదొడ్లు
మద్దులపల్లి పంచాయతీ భవనంలో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ కాళేశ్వరం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఒంటికి, రెంటికి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చిన్నారులకు ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో నిర్మాణాలను చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది. స్వచ్ఛభారత్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం నిధులను వినియోగించాలని ఆదేశించింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.52 వేలు వెచ్చించనున్నారు. ఇందులో కేంద్రం వాటా 70 శాతం (రూ.36,600), రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం (రూ.15,600) నిధులను సమకూర్చనున్నారు. దీంతో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. స్కూల్ కాంప్లెక్సుల్లో నిర్వహించే కేంద్రాలకు స్వచ్ఛభారత్ మిషన్, ఐసీడీఎస్ ద్వారా ఇతర చోట్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని అధికారుల ద్వారా తెలిసింది. అందరికీ ఇబ్బందే.. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చిన్నారులు ఆరు బయటకు వెళ్తున్నారు. కేంద్రాలకు వచ్చిన గర్భిణులు, బాలింతలు, టీచర్లు, ఆయాలు కూడా ఒంటికి, రెంటికి వెళ్లాలంటే అవస్థలు తప్పడంలేదు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధుల ద్వారా నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో అన్ని కేంద్రాల్లో అందరికీ ఇబ్బందులు తప్పనున్నాయి.మండలాలు 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులు భూపాలపల్లి, మహదేవపూర్ అంగన్వాడీ కేంద్రాలు 644 పక్కా భవనాలు 186 అద్దె భవనాలు 244 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నవి 214 టీచర్లు 604 టీచర్ల ఖాళీలు 40 ఆయాలు 524 ఆయాల ఖాళీలు 120 చిన్నారులు 22,079 మూడేళ్లలోపు పిల్లలు 11,973 మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 9,691 గర్భిణులు 2,591 బాలింతలు 1,696గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఎంపీడీఓకు దరఖాస్తు చేయాలి. పలానా అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు అవసరమని తీర్మానం చేయాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వచ్చిన ప్రతిపాదనలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిస్తారు. వాటిని కలెక్టరుకు పంపిస్తే పరిశీలించి మంజూరు చేస్తారు. పనులను ప్రతీ దశలో ఫొటో తీసి పంపాల్సి ఉంటుంది. వాటిని ఎంపీడీఓలు తనిఖీచేసి కలెక్టర్కు పంపితే నిధులు విడుదల చేస్తారు. ఈ విషయమై డీడబ్ల్యూఓ మల్లీశ్వరిని ఫోన్ద్వారా సంప్రదించగా.. డీఆర్డీఏ ద్వారా స్కూల్ కాంప్లెక్సుల్లో నిర్వహించే అంగన్వాడీలకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరయ్యాయి. ఐసీడీఎస్ ద్వారా 150 వరకు కేంద్రాలను గుర్తించాం. 64 మరుగుదొడ్లకు మంజూరు చేశారని, 47కు మంజూరు రావాల్సి ఉందన్నారు. నిధులు మంజూరుచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటికి, రెంటికి తప్పనున్న ఇబ్బందులు తీరనున్న అంగన్వాడీల కష్టాలు -
ధాన్యం సేకరణ 62.36 శాతమే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వానాకాలం సేద్యం రైతులకు అచ్చి రాలేదు. పరిస్థితులు అనుకూలించి అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పంట వేసింది మొదలు చేతికందే వరకు వరుస వర్షాలు కురవడం, పైరుకు తెగుళ్లు సోకడంతో ఈ సీజన్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు అంచనాల మేరకు ధాన్యం రాలేదు. కేంద్రాలు మూసివేసే దశకు చేరినా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఽఈ నెల 24వ తేదీ నాటికి ధాన్యం సేకరణ 62.36 శాతానికే చేరింది. 10.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికీ 6.48 లక్షల మె.టన్నులే సేకరించారు. ధాన్యం సేకరణ అంచనాలు తారుమారు... వానాకాలం సీజన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 15.83 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 8,78,376 ఎకరాల్లో వరి వేస్తారని భావించగా, ఎనిమిది లక్షల ఎకరాల వరకు సాగయినట్లు అధి కారులు ప్రకటించారు. ఈ మేరకు 10,39,815 మె.టన్నులు ధాన్యం రైతులనుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రతిపాదించింది. కొనుగోలు సీజన్ ప్రారంభం కాగానే ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో 1,360 కేంద్రాలను తెరిచారు. కొనుగోళ్లు మందకొడిగా మొదలైనా తర్వాత పుంజుకుంటాయని భావించారు. కానీ, ఈ నెల 24వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతులనుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 85.59 శాతం సేకరణ జరగ్గా, అత్యల్పంగా జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 40.42 శాతంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరసన నిలిచే ఉమ్మడి వరంగల్లో ఈసారి ధాన్యం దిగుబడి, సేకరణ గణనీయంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగుబడిపై అకాలవర్షాల ప్రభావం.. వానాకాలం ధాన్యం దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు అకాల వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, పంటలకు సోకిన తెగుళ్లు (కాటుక), యూరియా కొరతగా రైతులు చెబుతున్నారు. వీటి వల్ల వరి పంట నీట మునగడం, మొలకెత్తడం, గింజ రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి గణనీయంగా తగ్గిందని, రైతులు నష్టపోయారని అధికారులు సైతం అంటున్నారు. ఇదే సమయంలో పైరుకు ’కాటుక’ వంటి తెగుళ్లు సోకడం వల్ల మొత్తంగా ఉత్పత్తి 40శాతం వరకు తగ్గిందని, ఇందుకు కొన్ని ప్రాంతాల్లోనుంచి వచ్చిన నివేదికలే ఉదాహరణగా చెబుతున్నారు. మోంథా తుపాను ప్రభావంతో వరి ఈసారి ఆశించినంత దిగుబడి రాలేదు. సకాలంలో యూరియా కూడా అందకపోవడం పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. నాకున్న ఐదు ఎకరాల్లో వరినాటు వేస్తే 78 బస్తాలు వడ్లు పండాయి. వర్షాలతో వరి నేలకొరగడంతో చేను కోయడానికే మిషన్ ఖర్చులు రూ.24 వేలు అయ్యాయి. దీనికితోడు పొలం దున్నకం, నాటు, ఎరువులకు, ఇతరత్రా ఖర్చులు పోను ఏమీ మిగల్లేదు. – హింగే మనోహర్, రైతు, పీచర, వేలేరు ఉమ్మడి జిల్లా రైతుకు అచ్చిరాని వానాకాలం సాగు 10.40 లక్షల టన్నులు సేకరణ లక్ష్యం.. 1,360 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు వచ్చింది 6.48 లక్షల మె.టన్నులే కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం.. దిగుబడి తగ్గడమే కారణం రైతులను ముంచిన అకాలవర్షం.. మొదలైన యాసంగి సీజన్ జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ ఇలా..(ధాన్యం మె.టన్నుల్లో) -
వాహనాలు కనిపించట్లే..
మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి–పర్లపల్లి బీటి రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో రోడ్డు వెంట ప్రయాణించే ప్రయాణికులు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా గుంతలను పూడ్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – మొగుళ్లపల్లిమొగుళ్లపల్లి మండల కేంద్రం నుంచి బంగ్లాపల్లి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా భారీగా చెట్లు ఉన్నాయి. బంగ్లాపల్లి, వేములపల్లి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట భయపడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని కోరుతున్నారు. – మొగుళ్లపల్లిగోవిందరావుపేట: పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సులో గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. మూడు రోజులు క్రిస్మస్ సెలవులు రావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో లక్నవరం జలాశయం కిటకిటలాడింది. -
ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 27నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. యూజీసీనెట్, టీజీసెట్, టీజీటెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. భూపాలపల్లి రూరల్: నేడు (శుక్రవారం) మెదక్ జిల్లాలో జరిగే కేవల్ కిషన్ ముదిరాజ్ జాతర పోస్టర్ను ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆవిష్కరించారు. బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించిన ఇలాంటి మహనీయుడిని స్మరించుకోవడం సమాజంలోని ప్రతీ ఒక్కరి కర్తవ్యం అన్నారు. భవిష్యత్ తరాలకు వీరి చరిత్ర తెలియజేయాలన్నారు. జాతరకు ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ నాయకులు చాడ కృష్ణస్వామి, వేముల రాజమౌళి, చిలకలపాణి, కొలిపాక మల్లయ్య, బోయిని సాంబయ్య, వెంగళ ఆంజనేయులు పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణం మంజూర్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అయ్యప్పస్వాములకు మహా అన్న ప్రసాదం(బిక్ష) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.–పద్మ దంపతులు ప్రత్యేకపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములు భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలిసి బిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు అయ్యప్ప స్వాములతో పాటు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాటారం: దామెరకుంట మానేరుపై వంతెన నిర్మాణంతో పాటు పలు రోడ్ల నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్బాబు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించడాన్ని హర్షిస్తూ మండలకేంద్రంలోని ప్రధాన కూడలిలో గురువారం కాంగ్రెస్ శ్రేణులు మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దామెరకుంట మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్లు, కాటారం నుంచి సబ్స్టేషన్పల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.3 కోట్లు, సుబ్బయ్యపల్లి నుంచి ప్రతాపగిరి వరకు రూ.3.50కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్బాబు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. మంథని నియోజకవర్గంతో పాటు కాటారం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మంత్రి శ్రీధర్బాబు ముందుకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, యూత్ మండల అధ్యక్షుడు చిటూరి మహేశ్గౌడ్ పాల్గొన్నారు. టేకుమట్ల: మండలంలోని రామకిష్టాపూర్(టి) శివారు ఆర్అండ్బీ రోడ్డు నుంచి అంకుషాపూర్కు వెళ్లే దారి కంకర తేలడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలల క్రితం రోడ్డు మరమ్మతుకు రూ.10లక్షల నిధులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో నిత్యం దారిగుండా పంట పొలాలకు వెళ్లే రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
దర్శనాలు నిలిపివేత.. ఆరుబయట పూజలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు మే డారానికి భారీగా తరలివచ్చారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పున:ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పూజారులు దర్శనాల నిలిపివేత ప్రకటించిన విషయం తెలిసిందే. సమాచారం అందని భక్తులు వంద సంఖ్యలో మేడారా నికి తరలివచ్చారు. పూజా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులను గద్దెల వద్దకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు బయటనే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని పక్కనే ఉన్న చెట్టు వద్ద పసుపు, కుంకుమ, ఒండిబి య్యం సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు పూర్తయిన తర్వా త మధ్యాహ్నం 2 గంటల సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. దీంతో భక్తులు సమ్మక్క– సారలమ్మ గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి, పోలీసులు భక్తులను గద్దెల ప్రాంగణంలో రాకుండా చర్యలు తీసుకున్నారు. -
పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
కాటారం: నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ఏవీఎస్ ఫంక్షన్హాల్లో బుధవారం కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్లకు అభినందన, సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో అవినీతి రహిత పాలన అందించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం విలాసాగర్ కాంగ్రెస్ యూత్ నాయకులు పూసాల శశికాంత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజ బాబు, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, చీమల సందీప్, వేమునూరి ప్రభాకర్రెడ్డి, చిటూరి మహేశ్గౌడ్, పంతకాని సమ్మయ్య, ఆంగోతు సుగుణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు కాళేశ్వరం: మహాదేవపూర్ మండల కేంద్రంలోని నాగేంద్రగిరి శ్రీఆనంద ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల సమక్షంలో స్వామివారికి అభిషేకం చేసి, ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురిసి, రైతాంగానికి మంచి దిగుబడులు లభించి, రాష్ట్రం వ్యవసాయంగా, ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ప్రార్ధించినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత వేగం పెరగాలని, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
క్రీడలతో మానసికోల్లాసం
భూపాలపల్లి అర్బన్: క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం పెరుగుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం సింగరేణి వర్క్ పిపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో రీజియన్ స్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు కేవలం ఆనందం మాత్రమే కాదని, మన ఆరోగ్యానికి, పట్టుదలకు దారితీసే మంచి మార్గమన్నారు. క్రీడల ప్రాముఖ్యతను మనస్ఫూర్తిగా గ్రహించి, పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలన్నారు. సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యువ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి కోల్ ఇండియా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది శ్యాంసుందర్, శ్రావణ్కుమార్, శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, జనరల్ కెప్టెన్ మల్లేశ్, భూపాలపల్లి అథ్లెటిక్ కెప్టెన్ బానోత్ రమేష్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎం రాజేశ్వర్రెడ్డి రీజియన్ స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభం -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
భూపాలపల్లి అర్బన్: పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండల పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను సమగ్రంగా పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజ లు పోలీస్స్టేషన్కు వచ్చినప్పుడు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు, త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజల విశ్వాసాన్ని పంపొందించే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని గ్రీన్వుడ్ పాఠశాల విద్యార్థులు హన్మకొండలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్ –14 ఖోఖో బాలుర, బాలికల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ బాలుర విభాగంలో కే.ప్రశాంత్, బాలికల విభాగంలో వి.అక్షర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ందని, ఈనెల 29, 30, 31న వికారాబాద్లోని తాండూర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. హెచ్ఎం చీర్ల శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్ ఆకుతోట రాజకుమార్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కాళేశ్వరం: ఈనెల 28న రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు అలీంఖాన్, రాజశేఖర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీబీఎల్ఏ (తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ లెక్చరర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మంథనిలోని పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకార సౌజన్యంతో హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని, డిగ్రీ విద్యార్థినులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందన్నారు. మాతా సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర, నేటి సమాజానికి అన్వయింపుశ్రీ అనే అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుందన్నారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.50వేలు, రెండో బహుమతి రూ.25వేలు, మూడో బహుమతి రూ.15వేలు, ప్రోత్సాహక బహుమతులు రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9492883648, 9491595813, 8466975572 నంబర్లలో సంప్రదించాలని కోరారు. భూపాలపల్లి రూరల్/మొగుళ్లపల్లి: జిల్లాలోని పలువురు న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర న్యాయశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల అశోక్రెడ్డి, మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన మోరే శశికిరణ్రెడ్డిలను తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా నియామకమయ్యారు. రాబోయే మూడు సంవత్సరాల పాటు తెలంగాణ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించనున్నారు. తమ నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ములుగు రూరల్: మేడారం జాతర సందర్భంగా ఆది దేవత గట్టమ్మ వద్ద భక్తుల సౌకర్యార్థం దుకాణాల ఏర్పాటుకు దేవాదాయశాఖ అధి కారులు బుధవారం వేలం పాటలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వే లం పాటలకు వ్యాపారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేలం పాటల్లో కొబ్బరికాయ దుకాణం రూ.12.80లక్షలు, పసుపు–కుంకుమ రూ.4.20 లక్షలుగా పాట నిర్ణయించినట్లు తెలి పారు. అనిల్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్వహణలేని ‘వనాలు’
భూపాలపల్లి రూరల్: వృక్ష సంపదను పెంచి గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు గత ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజలకు ప్రయోజనం ఉందా.. లేదనేది పక్కన బెడితే నిధులు మాత్రం రూ.లక్షలు ఖర్చయ్యాయి. బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటులో భాగంగా అధికారులు హడావుడిగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కలు నాటించారు. కొన్నిచోట్ల ఆదరబాదరగా స్థలాలను గుర్తించిన అధికారులు.. నామమాత్రంగా మొక్కలు నాటించి మమ అనిపించారు. ఒక్కో బృహత్ ప్రకృతివనంలో దాదాపు 3వేల నుంచి 30 వేలలోపు మొక్కలు నాటినట్లు లెక్కలు చూపించి రూ. 2.26 కోట్లు ఖర్చు చేశారు. అయితే ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన స్థలాలు చౌడు, గుట్ట నేలలు కావడంతో నాటిన మొక్కలు చాలా వరకు పెరగడం లేదు. గ్రామాలకు దూరంగా ఏ ర్పాటు చేయడంతో తదితర మండలాల్లో నాటిన మొక్కలు కనిపించకపోగా.. బోర్డులు, గేట్లను ఎత్తు కు పోయారు, పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. 11 మండలాల్లో ఏర్పాటు జిల్లాలోని 11 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ప్రతీ మండలానికి బృహత్ వనాన్ని కేటాయించారు. తర్వాత వాటి సంఖ్యను 5కు పెంచారు. జిల్లాలో మొత్తం 55 బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. 5 ఎకరాల పరిధిలో వనాలు పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా ఏర్పా టు చేసి, కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను తినేస్తున్నాయి.బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నేరేడు, చింత, సీతాఫలం, మారేడు, తంగేడు, కానుగ, టీకోమా, నిమ్మ, గుల్మహార్, జామ, మామిడి, బేరు, వెదురు, పనస వంటి మొక్కలతో పాటు భారీ వృక్షాలుగా ఎదిగే మొక్కలను నాటారు. అయితే ప్రస్తుతం అక్కడక్కడ జామ ఇతర మొక్కలు తప్ప ఇతర మొక్కలు కనిపించడం లేదు. బృహత్ వనాలను సంరక్షించేందుకు వానాకాలం మినహా మిగతా రోజుల్లో ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పట్టడానికి ఇద్దరు కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితంలేదు. బోర్డులు, గేట్లను ఎత్తుకెళ్లిన వైనం రూ.లక్షల్లో ప్రజాధనం వృథా జిల్లాలో 55 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు -
జయశంకర్ భూపాలపల్లి
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏసుక్రీస్తు బోధనలు ఆదర్శం7భూపాలపల్లి రూరల్: ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మంజూరునగర్లోని కల్వరి చర్చిలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్కట్చేసి వేడుకలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమఅధికారి మల్లీశ్వరి, పార్టీ అర్బన్ అధ్యక్షుడు దేవన్, పాస్టర్లు పాల్గొన్నారు. -
త్వరలో ‘మున్సిపల్’ పోరు..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందన్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు... 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. పుర’పీఠాలపై ప్రధాన పార్టీల గురి... మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లతో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీలలో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలలోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. మున్సిపాలిటీ జనాభా వార్డులు(2011 ప్రకారం)పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30 జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుమున్సిపాలిటీ జనాభా వార్డులు ములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16 -
సాగు విస్తీర్ణం అంచనా..(ఎకరాల్లో..)
వరి 98,000 మొక్కజొన్న 30,000 పెసర 150ఇతర పంటలు 300● నారుమళ్లు సిద్ధంచేసిన రైతులు ● పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు కాటారం: పంట సాగు పెట్టుబడి కోసం రైతులకు ప్రతీ సీజన్లో ప్రభుత్వం ద్వారా అందుతున్న సాయం ఈ సీజన్లో ఇప్పటికీ అందలేదు. యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు పంట సాగుకు సిద్ధమవుతున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. రైతులు ఇటీవల వానాకాలం పంట సాగు పూర్తిచేసి ధాన్యం విక్రయిస్తున్నారు. మరో పక్క యాసంగి కోసం పొలాలు చదును చేసి నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో రైతులకు దుక్కి దున్ని, పొలాలు సిద్ధం చేసుకోవడం, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవడం కోసం కొంత డబ్బు అవసరం పడుతుంది. దీంతో రైతులు ప్రభుత్వం ద్వారా అందే రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 2.70లక్షల ఎకరాల భూమి.. జిల్లాలో 2.70 లక్షల ఎకరాల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉండగా 1,13 లక్షల మంది రైతులు ఉన్నారు. వానాకాలం సీజన్లో సుమారు 2.40 లక్షల ఎకరాల భూమిలో పత్తి, వరి, ఇతరత్రా పంటలు సాగు చేశారు. యాసంగి సీజన్లో పత్తి సాగు ఉండకపోగా కేవలం 1.28 లక్షల భూమిలో వరి, మొక్కజొన్న కూరగాయల పంటలు సాగు జరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టాన్ని చవిచూశారు. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం సైతం అందలేదు. ఈ యాసంగి సీజన్లో సకాలంలో పంటలు సాగు చేసుకుందామంటే సాగుకు పెట్టుబడి కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏటా పెరుగుతున్న ఖర్చులు.. ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు సాగుచేయాలనే తపనతో రైతులు వివిధ కంపెనీల మాయమాటలు నమ్మి రైతులు అధికంగా విత్తనాల కోసం డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్క ఎకరాకు విత్తనాల కోసమే రూ.5వేల నుంచి రూ6.వేల వరకు చెల్లిస్తున్నారు. ఇక దుక్కులు దున్నడం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు నివారణ మందులు, నాటుకు ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు వస్తోంది. పెట్టుబడి సాయం సకాలంలో చేతికి అందితే వాటికి కొంత కలుపుకొని పంట సాగులో ముందుకు వెళ్లవచ్చని రైతులు ఆశపడుతున్నారు.రైతులకు పెట్టబడిలో సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.6వేలు పెట్టుబడి సహాయం అందిస్తూ వచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7500 పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్పు చేసి ఎకరాకు రూ.6వేల చొప్పున అందిస్తూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడితో రూ.6వేలు రైతులకు ఎటూ సరిపోవడం లేదు. -
మరింత లాభాల్లోకి తీసుకురావాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థను అధికారులు, కార్మికులు నిరంతరం శ్రమించి మరింత లాభాల్లోకి తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏరియాలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికులకు సకాలంలో వేతనాలు అందిస్తూ వారి ఆరోగ్యం, సంక్షేమ పట్ల ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల బోనస్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళాలతో పాటు స్కిల్డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటివరకు సుమారు 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ప్రతీ కార్మికుడు 8గంటల పాటు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సంస్థపైన ఉందన్నారు. పట్టణంలో మున్సిపాలిటీతో కలిసి కోతులు, కుక్కల బెదడను నివారించాలని కోరారు. సీఎస్ఆర్ నిధులతో ఈ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఏరియాలో 100లక్షల టన్నుల టార్గెట్ భవిష్యత్కాలంలో ఏరియాలో 100లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో తాడిచెర్ల ఓసీ–2, వెంకటాపూర్ పీవీఎన్ఆర్ ప్రాజెక్ట్, భూపాలపల్లిలో ఓసీపీ–1 కింది భాగంలో అండర్గ్రౌండ్ ఏర్పాటు, ఓసీపీ–2 విస్తీర్ణతతో ఏరియాకు మరో వంద సంవత్సరాల భవిష్యత్త్ ఉందన్నారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితో ఇప్పటికి విద్యుత్ ఉత్పత్తి చేపడుతుందని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కుడా సింగరేణి విస్తరించిందన్నారు. కర్ణాటకలో త్వరలో బంగారం, కాపర్ వెలికితీతకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీఎం కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జీఎం రాజేశ్వర్రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జీఎం సింగరేణి పతాకావిష్కరణ చేపట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి వారు వేదికపై కేక్ కట్ చేశారు. అనంతరం ఉత్తమ అధికారులు, కార్మికులకు బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏరియా సేవ అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్రెడ్డి, అధికారులు కవీంద్ర, జోతి, రవికుమార్, నజీర్, ఎర్రన్న, శ్యాంసుందర్, ప్రాతినిధ్య సంఘాల నాయకులు మధుకర్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
మేడారం..ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
జిమ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సీఈఆర్ కబ్ల్లో ఏర్పాటు చేసిన నూతన జిమ్ సెంటర్ను కార్మికులు, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను మంగళవారం జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని మరింత మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు వేసినట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థ అభివృద్ధికి మూలాధారమని తెలిపారు. శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, పని సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే ఆధునిక వసతులతో జిమ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉద్యోగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవ అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి, అధికారులు కవీంద్ర, జోతి, ఎర్రన్న, రవికుమార్, శ్యాంసుందర్, రమేశ్, మధుకర్రెడ్డి పాల్గొన్నారు.ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
భూపాలపల్లి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివస్ కార్యక్రమం నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పదిమంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, ప్రతీ దరఖాస్తుకు సరైన న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. వెంకటస్వామి సేవలు మరువలేనివి.. ప్రముఖ నాయకుడు, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివని ఎస్పీ సంకీర్త్ అన్నారు. వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వెంకటస్వామి తన జీవితాన్ని పూర్తిగా సమాజసేవకు అంకితం చేశారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఆహార వ్యాపార నిర్వాహకులకు ఈ నెల 24వ తేదీన లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా గెజిటెట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆహార వ్యాపార నిర్యాహకులు తప్పని సరిగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. లైసెన్స్ గడువు ముగిసిన వారు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని రూం నంబర్ ఎఫ్–19లో సంప్రదించాలన్నారు. వివరాల కోసం జిల్లా ఆహార భద్రత అధికారి 70327 16925, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ 99858 20544 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. మొగుళ్లపల్లి: మండలంలోని మెట్టుపల్లికి చెందిన మర్రి శ్రీనివాస్(38) సికింద్రాబాద్ రైల్వేశాఖలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. వారం క్రితం విధి నిర్వహణలో ఉండగా పోల్ నుంచి కిందపడిపోయారు. దీంతో సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. వైద్యులు కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవాలు ఐదుగురికి అందించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రత్నకుమారి, కూతురు సంహిత, కుమారుడు గీతాన్ ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న సంజీవరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఏరియా అధికారులు సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో జీఎం రాజేశ్వర్రెడ్డి, అధికారులు మౌనం పాటించారు. 2007లో సింగరేణిలో జరిగిన ఇంటర్నల్ క్లరికల్ పరీక్షల్లో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికై పలు విభాగాల్లో పనిచేసి సూపరింటెండెంట్గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందడం తీరనిలోటన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎర్రన్న, రవికుమార్, రాజేశ్వర్, శ్యాంసుందర్, ప్రదీప్, క్రాంతికుమార్, శ్రావణ్కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక ఏకపక్షంగా చేశారంటూ 8 మంది వార్డుసభ్యులు సోమవారం ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. 12 మంది వార్డు సభ్యులకు గాను కేవలం సర్పంచ్ చాట్ల విజయతో పాటు నలుగురు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి అర్బన్: విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరంగా మారందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొమవారం నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశానికి సమ్మారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లాలో జరిగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత సమావేశాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి, నాయకులు రాజేందర్, శ్రీధర్, రమేశ్, రఫీపాషా, రమాదేవి, రామయ్య పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణ పూర్తిచేయాలి
భూపాలపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం జిల్లాలోని తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, ఓటరు మ్యాపింగ్ తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. మీ డబ్బు.. మీ హక్కు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా ‘మీ డబ్బు.. మీ హక్కు’ అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకొని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 4న గుజరాత్లోని గాంధీనగర్లో జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందన్నారు. బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమం చేపట్టారని తెలిపారు. పర్యాటక బ్రోచర్ ఆవిష్కరణ.. జిల్లాకేంద్రంలో ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ పర్యాటక బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యాటక ప్రదేశాల సమాచారంపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకశాఖ 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్ చేయడానికి ప్రోత్సాహకుల నుంచి పర్యాటక ప్రాంతాలను పర్యాటక శా ఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఈ పోటీలను నిర్వహిస్తుందన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశం స్పష్టంగా కనిపించేలా మూడు ఫొటోలు, 60 సెకండ్ల వీడియో 100 పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జనవరి 5లోగా గూగుల్ ఫామ్లో పర్యాటక వెబ్సైట్కు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
మోరంచ మళ్లీ ఉప్పొంగితే..
భూపాలపల్లి: భారీ వర్షాలు కురిసి వాగులు ఉప్పొంగి, చెరువు కట్టలు తెగినప్పడు ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. 2023 జూలై 27న భూపాలపల్లి మండలంలోని మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లిలో 280 ఇళ్లు నీట మునిగాయి. గ్రామానికి చెందిన నలుగురు వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరోమారు ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం మోరంచపల్లి గ్రామంతో పాటు, మోరంచవాగులో మాక్ డ్రిల్ నిర్వహించాయి. వాగులు ఉప్పొంగినప్పుడు పశువులు, మనుషులు నీటిలో కొట్టుకుపోతే, ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్లుగా డ్రిల్ నిర్వహించారు. అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించారు. వరద ప్రభావిత కాలనీలను ఎలా తరలించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఎస్పీ సంకీర్త్, అధికారులు పాల్గొన్నారు. -
గణితంపై భయం వీడాలి
● ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల కాటారం: విద్యార్థులు గణితం పట్ల భయం వీడి ఆసక్తి పెంచుకోవాలని కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సూచించారు. మండలకేంద్రంలోని ఆదర్శ హైస్కూల్, గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాల, కేజీబీవీ పాఠశాలల్లో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదర్శ హైస్కూల్లో మ్యాథమెటికల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థినులు గణితశాస్త్రంకు సంబంధించిన ప్రాజెక్టులు, నమూనాలు, ఆకృతులు తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ దశ నుంచే విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హైస్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్రావు, కరస్పాండెంట్ కార్తీక్రావు, కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీత, గురుకులం ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మిల్లర్లు కోత విధిస్తే ఊరుకునేది లేదు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి మిల్లర్లు అడ్డగోలుగా కోత విధిస్తే ఊరుకునేది లేదని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండలం దామెరకుంట, మల్లారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను సోమవారం చైర్పర్సన్ పరిశీలించారు. ధాన్యం నిల్వ, కొనుగోలు ప్రక్రియ, రవాణాపై ఆరా తీశారు. చైర్పర్సన్ వెంట మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేశ్రెడ్డి, దేవదాసు, మహేశ్, సురేందర్ పాల్గొన్నారు. -
నైతిక విలువలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: నైతిక విలువలు పాటించి రాజీమార్గంలో సాగాలని, వివాదాలకు తావులేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోదరాభావంతో కలిసి మెలిసి జీవించినప్పుడు వివాదాలు తలెత్తవని, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. పంతాలకు పోయి కేసుల పాలై పోలీస్స్టేషన్ల, కోర్టుల చుట్టూ తిరిగితే నష్టమే తప్ప లాభం ఉండదని, మనశ్శాంతి, డబ్బు, సమయాన్ని కోల్పోవలసి వస్తుందని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగే లోక్ అదాలత్లో కేసుల్లోని ఇరువర్గాల వారి అంగీకారంతో కేసులను కొట్టివేసినట్లు.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, డీఎస్పీ సంపత్రావు, బార్ అసోసియేషన్ సభ్యులు మహేందర్, శ్రవణ్రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, సీఐ నరేష్, ఎస్ఐలు సాంబమూర్తి, సుధాకర్, న్యాయవాదులు, కాక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాజీమార్గంలో పయనించి కేసులు పరిష్కారం చేసుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు -
కల్వర్టు నిర్మించాలి
మల్హర్: మండలంలోని కొండపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కుంభంపల్లి గ్రామం నుంచి మానేరు సమీపంలో పొలాలకు, శ్మశానవాటికకు వెళ్లడానికి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారిలో ఒర్రె మాటు నిత్యం నీళ్లు ఉండటంతో రైతులు అటుగా పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతిమయాత్ర కార్యక్రమాలకు, పొలం పనులకు వెళ్లడానికి వర్షాకాలం సీజన్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కుంభంపల్లి మాటుపై కల్వర్టు నిర్మించి, రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సర్పంచ్లకు సవాళ్లు
మూడేళ్లుగా పంచాయతీలకు రాని నిధులు భూపాలపల్లి: కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు గ్రామాల్లో సమస్యల పరిష్కారం సవాల్గా నిలువనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్నేళ్లుగా నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ లోపం, విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల్లో గెలుపొందేందుకు కొందరు సొంత మేనిఫెస్టోలు రూపొందించుకొని హామీలు గుప్పించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో ఇచ్చిన హామీలు మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన ఎలా చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం.. జిల్లాలోని గ్రామాల్లో సమస్యలు విలయతాండవం ఆడుతున్నాయి. గత పాలకవర్గాలు 2019 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 1వ తేదీ వరకు అధికారంలో ఉన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వాల నుంచి నిధులు సక్రమంగా రాకపోయినప్పటికీ సర్పంచ్లు చేసేదిలేక వీధి దీపాలు, తాగునీటి బోర్ల మరమ్మతులు చేయించారు. వివిధ పథకాల్లో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు ఆ బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్లంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడేళ్లుగా 15, 16వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. జిల్లాకు ఏడాదికి రూ.15 కోట్ల చొప్పున మూడేళ్లలో రావాల్సిన రూ.45 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఫండ్స్ లేని కారణంగా జిల్లాలోని సగానికి పైగా పంచాయతీల్లో చెత్త సేకరణ ట్రాక్టర్లు మూలన పడి ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీధి దీపాలు, తాగునీటి బోర్ల విద్యుత్ బిల్లులు భారీ మొత్తంలో పేరుకుపోయి ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సైడ్ కాలువలు, రోడ్లపై చెత్త పేరుకుపోయి ఉంది. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునే వారే కరువయ్యారు. పలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం కొత్త సర్పంచ్లపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. సొంత మేనిఫెస్టో, హామీల అమలు ఎలా..? జిల్లాలోని 12 మండలాల్లో 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో గెలుపొందిన వారు నేడు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఎన్నికైన వారిలో పలువురు సర్పంచ్, వార్డుసభ్యులు ఎన్నికల సమయంలో గెలుపు కోసం సొంత మేనిఫెస్టోలు రూపొందించుకొని హామీలు గుప్పించారు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీర్చడం, వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, కుల సంఘాలకు భవనాల నిర్మాణం, దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని హామీలు గుప్పించారు. కొందరైతే ఏకంగా పింఛన్లు మంజూరు చేయిస్తామని, పంట పొలాలకు రహదారులు ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపు కోసం వారి పరిధిలో సాధ్యం కాని హామీలను సైతం ఇచ్చారు. నిధులు లేక ఇప్పటికే సమస్యల వలయంలో ఉన్న గ్రామాల్లో కొత్త సర్పంచ్లు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారోననే చర్చ గ్రామాల్లో నెలకొంది. మూలనపడిన చెత్త ట్రాక్టర్లు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తం పెండింగ్లో భారీగా విద్యుత్ బిల్లులు చిన్నచిన్న అభివృద్ధి పనులకు సైతం నిధులు కరువు నేడు కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం -
పంచాయతీ పట్టని ఓటర్లు!
ఓటుకు దూరంగా 2.93 లక్షల మందిఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలు : 1,682● 21.17 లక్షల మందికి ఓటేసింది 18.25 లక్షల మంది ● 87 శాతానికే పరిమితమైన ఓట్లు.. మూడు విడతల్లోనూ ఇదే పరిస్థితి ● పోలింగ్ శాతం తగ్గడంపై సర్వత్రా చర్చ.. ఇదే అంశంపై ఉన్నతాధికారుల ఆరాఓటేయని వారి శాతం : 13.82పోలింగ్ శాతం : 86.182,92,63821,17,18818,24,580మొత్తం ఓటర్లుపోలైన ఓట్లుసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 89 నుంచి 94 శాతం వరకు పోలింగ్ నమోదవుతుందని అధికారులు సైతం భావించారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించడంతోపాటు.. ఓటు సద్వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 21,17,188 మంది ఓటర్లు ఉండగా 18,24,580 (86.18 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామలో ఎక్కువగా నమోదు.. ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఓటు శాతం 87.07 దాటలేదు. 2,92,608 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జనగామలో ఓటింగ్ ఎక్కువగా నమోదైంది. మొదటి విడతలో అత్యధికంగా జనగామ జిల్లాలో 87.39 శాతం, రెండో విడతలో 88.52 శాతం కాగా, మూడో విడతలో 88.48 శాతంగా నమోదైంది. మూడో విడతలో మహబూబాబాద్లో 88.52 శాతం ఓట్లు పోలయ్యాయి. మండలాల వారీగా చూస్తే కూడా 8 మండలాలు మినహా ఏ మండలంలోనూ 90 శాతాన్ని మించి ఓటుహక్కు వినియోగించుకోలేదు. 1,682 గ్రామ పంచాయతీల పరిధిలో 21,17,580 మంది ఓటర్లకు 18,24,580 మంది (86.18 శాతం) ఓట్లు వేయగా.. 2,92,638 (13.82 శాతం) మంది ఓటుకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఓట్ల శాతం ఎందుకు తగ్గినట్లు..? పోలింగ్ శాతం తగ్గడంపై ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ కాకుండా.. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో మరిన్ని ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు పోలింగ్ బూత్స్థాయి అధికారులు (పీబీఎల్ఓలు) డివిజన్, జోనల్ ఇన్చార్జ్లు, రూట్ ఆఫీసర్ల వరకు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. ఓట్ల శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లను కొన్ని తొలగించలేదని ప్రాథమికంగా గమనించినట్లు చెబుతున్నారు. మృతుల పేర్లు జాబితాలో కొనసాగడంతోపాటు స్థానికేతరుల పేర్లను తొలగించకపోవడం వల్ల పోలింగ్ శాతంగా తగ్గినట్లు భావిస్తున్నామని, వాటన్నింటిపై కసరత్తు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఏయే జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది.. అందుకు కారణాలు ఏమిటన్న విషయాలతో పాటు తక్షణమే తొలగించాల్సిన ఓటర్ల జాబితాను కూడా ఈ మేరకు జిల్లాల వారీగా సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపేందుకు ఓ నివేదికను అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం. -
ఆవిర్భావ దినోత్సవం రద్దు అన్యాయం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో నిధుల కొరత నెపంతో ఈ నెల 23న ఏరియా స్థాయిలో జరగాల్సిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని యాజమాన్యం రద్దుచేయడం అన్యాయమని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వేలబోయిన సుజేందర్ తీవ్రంగా ఖండించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలు నిర్వహించేందుకు తక్కువ బడ్జెట్ మంజూరు చేసిందన్నారు. దీనిపై కార్మికులు చాలా ఆగ్రహంగా ఉన్నారని.. కార్మికులు కష్టపడి లాభాలు తెస్తుంటే, తమ పండుగ లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని జరపకుండా నిధుల కోత విధించడం సరైనది కాదన్నారు. రాజకీయ నాయకుల మెప్పుల కోసం సింగరేణి నిధులను దుబారా చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పెద్ద మొత్తంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను నిధుల కొరతతో ఎలా నిర్వహిస్తారో వేచి చూడాలన్నారు. సింగరేణి యాజమాన్యం, కార్మికుల శ్రేయస్సు కోసం వెచ్చించాల్సిన నిధులను ప్రభుత్వ అవసరాలకు, మంత్రుల మెప్పుకోసం, ఫుట్బాల్ ఆటల కోసం వెచ్చిస్తుందన్నారు. సింగరేణి కార్మికుల ఆత్మగౌరవ పండుగలాంటి ఆవిర్భావ దినోత్సవాన్ని నిధుల కొరతతో నిర్వహించలేమని చెప్పడం సింగరేణి అస్తిత్వానికి ఆటంకంగా ఉందని యాజమాన్య వైఖరి విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి, నూతన బొగ్గు గనుల, భూనిర్వాసిత ప్రాంతాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సింగరేణి నిధులను యాజమాన్యం తన ఇష్టానుసారంగా మళ్లించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే సింగరేణి ఆవిర్భావ వేడుకలను గతంలో మాదిరిగా ఘనంగా నిర్వహించడం కోసం తగినన్ని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి యాజమాన్యం సింగరేణి నిధులను దుబారా చేయడం మానుకొని, కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి, పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, పాండ్రాల మల్లయ్య, కడారి శంకర్, నారాయణ, శీలం రాజు, ఓరం లక్ష్మణ్, అల్లం శ్రీనివాస్, భాస్కర్, శ్రీరాములు, రాజు, సాగర్, కొత్తూరు మల్లేష్ పాల్గొన్నారు. -
రామాలయంలో పారాయణం
కాళేశ్వరం: ధనుర్మాసం సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయంలో ఆలయ అర్చకులు ఆరుట్ల రామాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పాశురం చొప్పున పారాయణం పఠిస్తున్నారు. ఆదివారం శ్రీసీత సమేత రామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఫిట్ ఇండియా కార్యక్రమం భూపాలపల్లి అర్బన్: జిల్లా యువజన సర్వీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిట్ ఇండియా మిషన్ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలో నిర్వహించినట్లు డీవైఎస్ఓ చిర్ర రఘు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేడ్కర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు సండేస్ ఆన్ బైస్కిల్ అనే కార్యక్రమం విద్యార్థులతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రఘు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా కోట్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది శివసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక కాటారం: మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన నిఖిల్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్లో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్స్ అండర్ 18 పోటీల్లో పెద్దపల్లి జిల్లా జట్టు తరఫున నిఖిల్ అత్యంత ప్రతిభ కనబర్చాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 4 వరకు కర్ణాటకలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో నిఖిల్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. గురుకులం విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఖోఖో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అద్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి కుమార్, ప్రిన్సిపాల్ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం, పీడీ మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. 24న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు భూపాలపల్లి అర్బన్: జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పసుల లక్ష్మణ్, పక్కల రాజబాబు ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్హర్ మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్సాహమున్న మహిళలు, పురుషులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 85 కేజీలోపు బరువు ఉండాలని సూచించారు. క్రీడాకారులు ఆధార్కార్డుతో పాటు కబడ్డీ కిట్ను వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని ఈ నెల 26నుంచి ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 86393 46695, 90106 77080 ఫోన్నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర
భూపాలపల్లి రూరల్: పేదల ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతధంగా కొనసాగించాలని, పథకాల నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్కాలనీలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఉపాధిహమీ పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గాంధీ విగ్రహం ఎదుట ధర్నా -
నామమాత్రంగానే..
కాటారం: సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచే దిశగా సాంకేతిక పద్ధతిలో విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ బోధన పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం గొప్ప ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన డిజిటల్ బోధనకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన ఇన్ఫాస్ట్రక్చర్ లేకపోవడంతో ఏఐ బోధన అమలు కష్టతరంగా మారింది. ఏఐ బోధనకు ప్రత్యేకంగా ల్యాబ్తో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సి ఉంటుంది. పాఠశాలల్లో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు నామమాత్రంగా డిజిటల్ బోధనను ముందుకుసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ బోధన అమలుకు నోచుకోవడం లేదు. అందుబాటులో లేని సౌకర్యాలు.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏఐ ద్వారా విద్యాబోధన చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటగా జిల్లాలోని ఆరు పాఠశాలలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఇందులో భూపాలపల్లి మండలం గుర్రంపేట, కమలాపూర్, కాటారం మండలం చింతకాని, దేవరాంపల్లి, మహదేవపూర్ మండలం అంబట్పల్లి, టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో వసతులు లేకపోవడంతో ఏఐ తరగతుల నిర్వహణ కష్టతరంగా మారింది. డిజిటల్ ఆధారిత బోధనలో కంప్యూటర్లు కీలకం అయినప్పటికీ ఏ పాఠశాలలోనూ కంప్యూటర్లు అమర్చలేదు. ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు జరగలేదు. దీంతో సమీపంలోని హైస్కూల్లో కంప్యూటర్లను వినియోగిస్తూ విద్యార్థులకు ఏఐ బోధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్ సౌకర్యం సైతం లేకపోవడంతో ఉపాధ్యాయుల వద్ద ఉన్న మోబైల్స్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో ఏఐ బోధన అంతంత మాత్రంగానే కొనసాగుతున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ బోధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కృతిమ మేథస్సు (ఏఐ) విద్యా బోధన పద్ధతిని ప్రవేశపెట్టింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఈ విధానం ద్వారా బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ మూడు తరగతుల నుంచి పది మంది విద్యార్థులను ఎంపిక చేసి వారానికి రెండు రోజుల పాటు తెలుగు, మరో రెండు రోజుల పాటు గణితం బోధించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విద్యాబోధన చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధించాలి. విద్యార్థి పాఠాలను అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది ఏఐ గుర్తిస్తుంది. విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థం కానట్లయితే సరళమైన మార్గంలో ఏఐ బోధన చేస్తుంది. ఇలా ప్రతీ విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను లెక్కకట్టనుంది. అనంతరం విద్యార్థులపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలన్నది ఏఐ విద్యాబోధన ముఖ్య ఉద్దేశం. ఏఐ బోధన సక్రమంగా జరిగేలా.. జిల్లాలోని ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. పలు పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – రాజేందర్, డీఈఓముందుకుసాగని ఏఐ బోధన పూర్తిస్థాయిలో అందుబాటులో లేని మౌలిక వసతులు హైస్కూల్కు సంబంధించిన కంప్యూటర్లతో ల్యాబ్ నిర్వహణ ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు జిల్లాలో ఆరు పాఠశాలల్లో నిర్వహణప్రాథమిక పాఠశాలలు 317 ప్రాథమికోన్నత పాఠశాలలు 44 ఉన్నత పాఠశాలలు 69 విద్యార్థుల సంఖ్య 19,788మరో 30 పాఠశాలల ప్రతిపాదన.. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు పాఠశాలలతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు కలిగిన మరో 30 పాఠశాలల్లో ఏఐ బోధన అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రతిపాదిత పాఠశాలల్లో సైతం ఇన్ఫాస్ట్రక్చర్ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన అనంతరం ఏఐ బోధన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. -
ఇప్పుడేం చేద్దాం?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్ లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్ లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది. పీఏసీఎస్లకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం భూపాలపల్లి రూరల్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార పరపతి సంఘాలు రద్దయిన నేపథ్యంలో పాలకవర్గం స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు జిల్లా సహకార శాఖ అధికారి వాల్యానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, చిట్యాల సొసైటీలకు స్పెషల్ ఆఫీసర్గా రిజిస్ట్రార్ రాజు, గణపురం, చెల్పూర్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎల్లయ్య, జంగేడు, తాడిచర్లకు సీనియర్ ఇన్స్పెక్టర్ రిలీఫ్, రేగొండ, మొగుళ్లపల్లి సొసైటీలకు స్పెషల్ ఆఫీసర్గా డిప్యూటీ రిజిస్ట్రార్ శైలజను నియమించినట్లు తెలిపారు. సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్ పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్పై మళ్లీ మొదలైన చర్చ 2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లుమొత్తం సహకార సంఘాలు: 99 డైరెక్టర్ స్థానాలు: 1,260 ఏకగ్రీవంగా ఎన్నికై నవి: 509 ఎన్నికలు జరిగినవి: 751 -
రూ.203 కోట్ల నిధులు మంజూరు
కాటారం: మంథని నియోజకవర్గంలోని మంథని–ఆరెంద మానేరు మీదుగా దామెరకుంట వరకు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్ల నిధులు విడుదలైనట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని మండలం ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 కిలోమీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుంచి బ్రిడ్జి వరకు మరో వైపు దామెరకుంట రోడ్డు వరకు 9.530 కిలో మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంథనితో పాటు ఇతర మండలాల ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాకు, మహారాష్ట్ర, కాళేశ్వరం దేవాలయానికి ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి వీలుగా ప్రజలకు రవాణా భారం తగ్గించేందుకు బ్రిడ్జి నిర్మాణానికి సంకల్పించినట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం ద్వారా మంథని, పెద్దపల్లి జిల్లా నుంచి కాళేశ్వరం వెళ్లడానికి 25 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మానేరుపై బ్రిడ్జి నిర్మాణం పట్ల ఈ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేయడంతో పాటు మంత్రి శ్రీధర్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. -
నవగ్రహాల వద్ద శనిపూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన నవగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా శనిపూజలు నిర్వహించారు. శనివారం ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం నవగ్రహాల వద్ద పూజలు చేసిన అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తజనం సందడి నెలకొంది. లారీల అడ్డగింత మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ లారీలను డేంజర్ జోన్ నిర్వాసితులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. డేంజర్ జోన్ ఎస్సీ కాలనీ ఇంటి సమీపంలో ఓపెన్ కాస్ట్ మట్టి పోస్తుండటంతో వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో అనారోగ్యాల బారిన పడుతున్నామని అన్నారు. రెండు రోజుల్లో అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని మైన్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ మూర్తి హామీ ఇచ్చారు. నేడు జాతీయ లోక్ అదాలత్ భూపాలపల్లి అర్బన్: నేడు(ఆదివారం) జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గంలో కేసులను తొలగించుకునేందుకు లోక్ అదాలత్ చక్కటి అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీసులు, న్యాయవాదులు సహకరించి క్షక్షిదారులు అఽధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని సూచించారు. ధనుర్మాసం ప్రత్యేక పూజలు గణపురం: మండలకేంద్రంలోని శ్రీపట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ పట్టాభి సీతారామచంద్ర భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత ఆలయంలో ప్రతీ సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ తెలిపారు. అందులో భాగంగా స్వామి వారిన ప్రత్యేకంగా అలంకరించినట్లు చెప్పారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవాలన్నారు. చెక్ డ్యాం పరిశీలన మల్హర్: జిల్లా సరిహద్దులోని వల్లెకుంట–పెద్దపల్లి జిల్లా మంథని అడవి సోమన్పల్లి మానేరుపై నిర్మించిన డ్యామేజ్ అయిన చెక్డ్యాంను స్టేట్ ఫొరెన్సిక్ టీమ్, క్లూస్ టీం సభ్యులు శనివారం పరిశీలించారు. ఈనెల 17న చెక్ డ్యాం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు కొయ్యూరు స్టేషన్లో ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టగా శనివారం ఈ ఘటనపై చెక్ డ్యాం డ్యామేజీ అయిన ప్రదేశాన్ని ఫొరెన్సిక్, క్లూస్ టీం సభ్యులు చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించి నమూనాలు సేకరించారు. సదరు నివేదిక ఆధారంగా చెక్ డ్యాం కూలిపోయిందా.. కూల్చేశారో తెలియనుంది. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్, ఎస్సై–2 రజన్కుమార్, మహదేవపూర్ ఎస్సై పవన్ ఉన్నారు. -
ప్రమాదాల నివారణకు ప్రణాళికలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి అర్బన్: రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పోలీస్, రవాణా, ఆర్టీసీ, వైద్య, విద్యా, సంక్షేమ శాఖలు, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, మున్సిపల్, పంచాయతీరాజ్శాఖల అధికారులతో నిర్వహించిన రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న రహదారి ప్రమాదాలపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాలకు కారణాలు గుర్తించి వాటి నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి అవసరమైన ఇంజనీరింగ్ మార్పులు చేపట్టాలని, వేగ నియంత్రణ, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రహదారి భద్రతా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పోటీలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో గుర్తించిన 10 బ్లాక్ స్పాట్లను పోలీస్, రవాణా, రహదారుల అధికారులు పరిశీలించి ఇంటర్ వెన్షన్స్ తయారు చేయాలని సూచించారు. రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2026 జనవరిలో చేపట్టనున్న రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణకు శాఖల వారీగా కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పీ నరేష్కుమార్, ఆర్టీఓ సంధాని, ఆర్టీసీ డీఎం ఇందు, ఆర్అండ్బీ ఈఈ రమేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, జాతీయ రహదారుల డీఈ కిరణ్, ఐఆర్డీ డీఆర్ఎం లక్ష్మణ్, అన్ని శాఖల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నియంత్రించడమే లక్ష్యంగా జనవరి మాసంలో నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై శనివారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, శాంతి భద్రతల ఏడీజీ మహేష్ భగవత్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోరంచపల్లిలో మాక్డ్రిల్ వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై ఈ నెల 22న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మోరంచపల్లిలో నిర్వహించనున్న మాక్డ్రిల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ప్రకటనలో తెలిపారు. మాక్డ్రిల్లో వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు, పారిశ్రామిక ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే విధానాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, మున్సిపల్, పరిశ్రమల శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. -
వైభవోపేతంగా కల్యాణ మహోత్సవం
భూపాలపల్లి అర్బన్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీకోదండ రామాలయంలో శనివారం నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదోక్త విధానాలు, ఆగమ శాస్తోక్త్ర నియమాలను అనుసరించి మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణలు, సంప్రదాయ ఆచారాలతో ఈ కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. భూపాలపల్లి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి దివ్య దర్శనం చేసుకొని, కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి అపార కృపాశీస్సులను పొందారు. భక్తుల సౌకర్యార్థం సింగరేణి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ దేవస్థానానికి చెందిన అర్చక స్వాములు, వేద పండితులు, సిబ్బంది సమన్వయంతో శాస్తోక్త్రంగా కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించారు. ఈ కల్యాణోత్సవంలో జిల్లా ప్రధాన నాయమూర్తి రమేష్బాబు, జడ్జిలు నాగరాజు, దిలీప్కుమార్, అఖిల, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఇతర శా ఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలెన్నో.. పరిష్కరించండి
ఐనవోలు: ఐనవోలు మల్లన్న జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ఎండోమెంట్ అధికారులు సమష్టిగా పనిచేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జాతర నిర్వహణపై శనివారం హనుమకొండ కలెక్టరేట్లో వివిధ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భక్తుల కోణంలో చర్చించి వారికి అవసరమయ్యే సౌకర్యాలు కల్పించడంపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డార్మెటరీ నిర్మాణానికి గతంలోనే ఆమోదం.. మల్లన్న ఆలయంలో కమ్యూనిటీ హాల్ కం డార్మెటరీ హాల్ నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) గతంలో ఆమోదం తెలిపింది. బేస్మెంట్ వరకు పనులు జరిగి నిధులు మంజూరు లేకపోవడంతో నిలిచిపోయింది. మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయించాలి. గతంలో ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ, నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు చేయడంతోపాటు గతంలో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐమస్ట్ లైటింగ్ టవర్స్ రిపేర్ చేయించాలని కోరుతున్నారు. భక్తుల డిమాండ్లు ఆలయ ప్రాంగణంలో పట్నాలు, ఇతరత్రా ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక లైన్ ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలి. ● సేవా టికెట్ కొనుక్కున్న భక్తుల నుంచి ఒగ్గు పూజారులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి. ● మల, మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడుతుండగా భక్తులకు సరిపోయే విధంగా సులభ్ కాంప్లెక్స్లు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. ● భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి గదులు, పెద్ద డార్మెటరీ హాలు నిర్మించాలి. ● ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలి. ● ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా మరమ్మతులు చేపట్టాలి, ఆర్కియాలజి శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. ఆలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పేరిణి నృత్య మండపాన్ని ఆధునీకరించాలి. ● రాజగోపురం, కోనేరు ఏర్పాటు, ఆలయం చుట్టూ ఉన్న నేల బయ్యారాన్ని నిపుణుల సాయంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. ● పూర్వం ఊరగుట్టపైనే మల్లికార్జునస్వామి వెలిశాడని ఐనవోలువాసుల నమ్మకం. ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరఫున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊర గుట్ట, కింద ఉన్న చెరువును అభివృద్ది పరిచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష మల్లన్న భక్తుల్లో ఉంది. ● జాతర ప్రాంగణంలో 10 స్నాన ఘట్టాలు ఉండగా సీ్త్రల డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ● గత జాతరలో నీటి సరఫరాలో ఇబ్బందుల కారణంగా 10 హెచ్పీ మోటార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● 40 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, రెండు అదనపు హైమాస్ట్ లెటింగ్ టవర్స్, భద్రతపరంగా మరో 50 సీసీ టీటీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అగ్నిమాపక వాహనం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. ● ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ స్టేషన్ను మరో చోటకు మార్చాలి. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో పోలీసులు పట్టుకున్న, యాక్సిడెంట్ వాహనాలను ఉంచడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, వెంటనే మరోచోటకు తరలించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఈఓ కందుల సుధాకర్ కోరుతున్నారు. నేడు ఐనవోలు జాతర నిర్వహణపై సమావేశం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్న కలెక్టర్ అభివృద్ధిపై దృష్టిసారించాలంటున్న భక్తులు -
22న విపత్తుల నిర్వహణపై మాక్డ్రిల్
భూపాలపల్లి అర్బన్: ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి ఈ నెల 22వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాల్లో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్నివేళలా సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణ పొందేలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని తెలిపారు. గత వర్షాకాలం జిల్లాలో కురిసిన వర్షాలకు సంభవించిన వరదలు వల్ల తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. అప్రమత్తత, ముందస్తు ప్రణాళికలు, విపత్తుల అంచన, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాల సమన్వయ చర్యలు, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతో నష్టాలు లేకుండా వరదలను ఎదుర్కొన్నామని వివరించారు. మున్ముందు నష్టాలు కలుగకుండా సన్నద్ధంగా ఉంటామన్నారు. ప్రజ లకు విపత్తుల సమయంలో రక్షణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, అదనపు ఎస్పీ నరేష్, ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, ఫైర్ అధికారి శ్రీనివాస్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
కంకర వేశారు.. తారు మరిచారు
రేగొండ: మండలంలోని రేపాక గ్రామంలో బస్టాండ్ నుంచి గ్రామ శివారు వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై ప్రతీ రోజు రైతులు, వాహనదారులు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. నూతన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామంలో సుమారుగా మూడు కిలోమీటర్ల వరకు సంవత్సరం క్రితం కంకర వేశారు. కంకర వేసి దానిపై తారు వేయకపోవడంతో వాహనదారులకు, రైతులకు తిప్పలు తప్పడం లేదు. కంకర ఉండడంతో ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు అదుపు తప్పి పడిపోయి ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ దారి గుండా అధిక సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో దుమ్ము లేచి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
నేడు శ్రీలక్ష్మినరసింహస్వామి కల్యాణం
భూపాలపల్లి అర్బన్: ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట) ఆధ్వర్యంలో నేడు(శనివారం) జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలోని శ్రీసీతారామాంజనేయస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మినరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉత్సవ విగ్రహాల రథంతో పట్టణంలోని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అధికారులతో కలిసి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. మంజూర్నగర్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా కలెక్టర్ రాహుల్శర్మ కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా జిల్లాకు రథం రావడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, ఏఓ మురళీధర్, అధికారులు పాల్గొన్నారు. -
నేడు కొత్త కోర్టుల ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో నేడు(శనివారం) రెండు నూతన కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్సింగ్ వర్చ్యువల్గా ప్రారంభిస్తారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నామవారపు రాజేశ్వర్రావు, జస్టిస్ బిఆర్ మధుసూదన్రావు వర్చ్యువల్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్ను కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రావణ్రావు, విష్ణువర్ధన్రావు, శివకుమార్, రమేష్నాయక్, రాకేష్, వెంకటస్వామి, దివ్య పాల్గొన్నారు. మల్హర్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగో మహాసభను విజయవంతం చేయాలని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొయ్యూరు సెంటర్లోని కొమురం భీం విగ్రహ వద్ద కరపత్రాలను శుక్రవారం పీక కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28, 29 తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మహాసభకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్యల రాష్ట్ర కార్యదర్శి బాపు, ఆదివాసీ మహిళా నాయకురాలు గడ్డం సమ్మక్క, దళిత నాయకురాలు మేకల కళ, బీసీ మహిళా నాయకురాలు నర్సక్క పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: ఈనెల 21న తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80 వసంతాల అభ్యుదయోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్తో కలిసి కార్యాలయంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండెం మధుసూదన్, కూచనపల్లి రవీందర్ మాట్లాడుతూ ఈ నెల 21న హైదరాబాద్లో విద్యా సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుకుమార్, రాజు, వేణుగోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టేకుమట్ల: గ్రూప్ త్రీ ఫలితాల్లో మండలంలోని రామకృష్ణపూర్ (టి)గ్రామానికి చెందిన కూలీ కొడుకు బొంపెల్లి బాలకృష్ణ మంచి ర్యాంకు సాధించి గురుకుల విద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. మండలంలోని రామకృష్ణపూర్ (టి) గ్రామానికి చెందిన బొంపెల్లి గోవిందం–విమల దంపతులది రెక్కడితేగానీ డొక్కాడని కుటుంబం. నిత్యం కూలి పని చేసుకుంటూ కుమారుడు బాలకృష్ణను ఉన్నత చదువులు చదివించారు. బాలకృష్ణ చదువులో కష్టపడుతూ సివిల్స్ కోసం సన్నద్ధమయ్యాడు. సివిల్స్ రాకపోవడంతో గ్రూప్ వన్, టూ, త్రీకి సన్నద్ధమయ్యాడు. గ్రూప్ త్రీలో 1,061 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు. -
సింగరేణి సంస్థ నిర్వీర్యానికి కుట్ర
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కాలరీస్ సంస్థను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ–2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను జెక్కోకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాడిచర్ల బొగ్గు బ్లాక్ను ఈ విధంగానే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల సింగరేణికి జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఇప్పుడు మణుగూరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనే ప్రయత్నాలు చేపడుతోందన్నారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, పండ్రాల మల్లయ్య, స్వామి, రమేష్, శంకర్, నారాయణ, రాజు, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ -
రైతులకు యాప్పై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి రూరల్: రైతులకు ఎరువుల పంపిణీ కోసం యాప్పై అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఏఈఓలకు సూచించారు. యూరియా యాప్, తదితర అంశాలపై భూపాలపల్లి మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో గురువారం మండలంలోని కొంపెల్లి రైతువేదికలో ఏఈఓలతో పాటు, మండలంలోని ఫర్టిలైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలతో పాటు మండలంలోని ఫర్టిలైజర్ డీలర్లు పాల్గొన్నారు. చిట్యాల: చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా మండలంలోని కై లాపూర్ గ్రామానికి చెందిన దానవేణి రమేశ్ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లారీ ఓనర్ల సభ్యులు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా డుడ్డేడి రమేష్, కోశాధికారిగా ముదిరికోళ్ల రాజును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల లారీ ఓనర్ల సభ్యులు అంబాల రాజు, మేతే శ్రీనివాస్, రాకేష్, బోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణి గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల వేలం పాటలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఎందుకు పోరాటాలు నిర్వహించడం లేదన్నారు. భేషరతుగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాములు, కుమారస్వామి, రాజన్న, కుమారస్వామి, జనార్దన్, జైపాల్, ప్రసాద్ పాల్గొన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ సర్పంచ్గా హసీనభానో బుధవారం గెలిచారు. ఆమె మహదేవపూర్ జెడ్పీటీసీగా 2014లో పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల్లో మహదేవపూర్ సర్పంచ్గా హసీనభానో గెలుపొందగా, ఆమె భర్త అక్భర్ఖాన్ గతంలో మహదేవపూర్ ఎంపీపీగా, సర్పంచ్గా పదవులు చేపట్టి ప్రజల మనసును దోచుకున్నారు. ప్రస్తుతం ఆమె సర్పంచ్గా 528 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో రోడ్ల వెంట షాపుల ముందు ఏర్పాటు చేసుకున్న పందిళ్లను తొలగించాలని అధికారులు చిరు వ్యాపారులను కోరారు. ఈ మేరకు నాలుగైదు రోజుల నుంచి చిరువ్యాపారులకు చెప్పినా తొలగించకపోవడంతో గురువారం అధికారులు జేసీబీ సాయంతో తొలగించేందుకు వెళ్లారు. దీంతో చిరువ్యాపారులు ఒక రోజు సమయం ఇస్తే తామే తొలగిస్తామని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. ములుగు: పీఆర్టీయూ బలోపేతానికి సంఘం నాయకులు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వేం యాకూబ్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్టీయూ నుంచి సూర్యనారాయణ, మోహన్లాల్లు పీఆర్టీయూలో చేరగా సంఘం సభ్యత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండలాధ్యక్షుడు సానికొమ్ము ముకుందారెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. -
పుణ్యస్నానాలు.. మొక్కులు
● మేడారానికి భారీగా తరలివచ్చిన భక్తులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు జరుగుతున్న సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా దగ్గరుండి చూడాలని సిబ్బందిని అదేశించారు. -
రాజకీయ కక్ష సాధింపు చర్య
కాళేశ్వరాలయంలో దేవాదాయ, ఎన్పీడీసీఎల్ శాఖల నిర్లక్ష్యం భక్తులకు శాపంగా మారనుంది. రామాలయం వెనుకాల భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన మరుగుదొడ్ల ఎదుట విద్యుత్స్తంభం ప్లోరింగ్తో కలిసి, ఎర్త్ వైర్ బండరాళ్లకు కట్టి ఉంచి నిర్మాణం చేశారు. దీంతో అధికారులు, ఇంజనీర్ల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు ఎర్త్వైర్కు విద్యుత్ సరఫరా జరిగితే ప్రమాదం పొంచి ఉంది. అఽధికారుల స్పందించి తొలగించాలని భక్తులు కోరుతున్నారు. – కాళేశ్వరంభూపాలపల్లి రూరల్: నేషనల్ హెరాల్డ్ కేసు.. కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో గురువారం సింగరేణి ఏరియా ఆస్పత్రి సెంటర్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ సీబీఐ, ఈడీలతో కాంగ్రెస్ నాయకులను, గాంధీ కుటుంబాన్ని వేధించాలని బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. పేరు మార్చి ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
‘పంచాయతీ‘పై పోస్టుమార్టం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. పార్టీ గుర్తు లేనప్పటికీ.. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఏ మేరకు సక్సెస్ అయ్యారు? ఎక్కడ, ఎందుకు పంచాయతీ స్థానాలు తగ్గాయి? పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి కారణాలు ఏంటి? అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే జరిగిందా? అలాగైతే రెబల్స్ ఎందుకు బరిలో ఉన్నారు? ఓటమికి వెన్నుపోట్లు కారణమా? అలాగైతే ఏయే జిల్లాల్లో ఈ వెన్నుపోట్లు ప్రభావం చూపాయి? అన్న కోణాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విశ్లేషిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఫలితాలపై విశ్లేషణ.. విడతల వారీగా వెలువడిన ఫలితాలపై ప్రధాన పార్టీలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్లో 1,682 గ్రామ పంచాయతీలకు మూడు వితల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కలిపి అధికార కాంగ్రెస్ 1,036 పంచాయతీలను గెలుచుకోగా, బీఆర్ఎస్ 479 స్థానాలతో వెనుకబడింది. బీజేపీ 31 స్థానాలు, ఇతరులు 136 గ్రామ పంచాయతీలు దక్కించుకున్నారు. మొదటి విడతలో 555 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 333, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, ఇతరులు 57 మంది గెలుపొందారు. రెండో విడతలో 563కు కాంగ్రెస్ 332, బీఆర్ఎస్ 181 గెలుచుకుని పుంజుకుంది. బీజేపీ 9, ఇతరులు 41 దక్కించుకున్నారు. మూడో విడత 564 స్థానాలకు 371 కాంగ్రెస్, 150 బీఆర్ఎస్, 5 బీజేపీ, 38 మంది ఇతరులను ప్రజలు సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. ఇంకొంత దృష్టి సారిస్తే మరిన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకునే అవకాశం ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి తగ్గడంపై ఎక్కడ లోపం జరిగింది? అన్న కోణంలో బీఆర్ఎస్ అగ్రనేతలు నియోజకవర్గ స్థాయి నాయకులను ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఎందుకు తగ్గాయి.. ఎక్కడ పెరిగాయి? ఫలితాలపై ఆరా తీస్తున్న అన్ని పార్టీల నాయకులు గెలుపు గుర్రాల ఎంపికలో ఏమరుపాటు.. చాలాచోట్ల ఫలితాలు తారుమారు పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోట్లు.. రెబల్స్గా బరిలో నెగ్గిన పలువురు భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు వెన్నుపోట్లు, రెబల్స్.. అధిష్టానాలు సీరియస్ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు, కొరవడిన సమన్వయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సీరియస్గానే స్పందించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 65 చోట్ల కాంగ్రెస్, 34 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులపై ఆయా పార్టీలకు చెందిన వారు రెబల్స్గా బరిలోకి దిగారు. 41 చోట్ల కాంగ్రెస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. మిగతా 24 చోట్లపార్టీ అభ్యర్థులు గెలిచినా.. నానా తిప్పలుపడి 30 నుంచి 50 ఓట్ల మెజార్టీనే వచ్చింది. అదేవిధంగా 20 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందగా, 14 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అతికష్టం మీద గెలిచారు. జనగామ, హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా ఇలాంటివి చోటు చేసుకున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధి ష్టానం కూడా భవిష్యత్లో ఇలాంటి పరిణామాలకు తావులేకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికలు రానున్న దృష్ట్యా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యనేతలను అప్రమత్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. -
గ్రానైట్ రాళ్లపై గ్రైండింగ్తో ఇబ్బందులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయిపరిచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కమ్రంలో ఆ రాళ్లపై గీతలు, ఎత్తువంపులు తొలగించడానికి గ్రైండింగ్ పనులు చేస్తుండడంతో దుమ్ము ఎగిసిపడుతోంది. గ్రైండింగ్ పనులతో గురువారం అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో భక్తులు దుమ్ముతో ఇబ్బందులు పడ్డారు. పనులు నిర్వహిస్తున్న సమయంలో నీటి స్ప్రే చేయకుండా గ్రైండింగ్ చేపట్టడమే కారణమని భక్తులు అంటున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ పనులు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ముతో శ్వాసకోశ సమస్యలు కూడా వ్యాపిస్తాయని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దుమ్ము రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
నేడు, రేపు బాల వైజ్ఞానిక ప్రదర్శన
ములుగు: జిల్లా కేంద్రంలోని బండారుపల్లి మోడల్స్కూల్లో 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన నేడు, రేపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ కొరకు స్టెమ్ అనే ప్రధాన అంశాన్ని ఆధారంగా తీసుకొని విద్యార్థులు సుస్థిరమైన వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ), అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతలు, వినోదకరమైన గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, జల సంరక్షణపై సృజనాత్మకత ప్రాజెక్టులు, నమూనాలు ప్రదర్శించాలని సూచించారు. 2024–25 విద్యా సంవత్సరానికి ఇన్స్పైర్ పథకం కింద ఎంపికై న 20 ప్రాజెక్టులతో పాటు బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సుమారు 500 ఎగ్జిబిట్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్భథం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరింతగా అభివృద్ది చెందుతాయని వివరించారు. జిల్లా ప్రజలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సందర్శించి బాల శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్లు అర్షం రాజు, శ్యాంసుందర్ రెడ్డి, రజిత, శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు తిరుపతి, సోమారెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థ రెడ్డి -
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
151 స్థానాలు ‘చేతి’లోకి.. జిల్లాలోని 12 మండలాల్లో 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలకు గాను మూడు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ఇందులో 21 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్ధతుదారులు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. దీంతో మిగిలిన 226 సర్పంచ్ స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. భూపాలపల్లి నియోజకవర్గం, కాటారం డివిజన్లో మూడు దఫాలుగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థుల్లో 130 మంది గెలుపొందారు. ఎన్నికల అనంతరం రేగొండ మండలంలో గెలుపొందిన ఓ సర్పంచ్ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఏకగ్రీవం 21, గెలుపొందిన 130, పార్టీలో కలిసిన ఒక అభ్యర్థితో కలిపి కాంగ్రెస్ సర్పంచ్ల సంఖ్య 152కు చేరుకుంది. బీఆర్ఎస్కు 68 స్థానాలే.. జిల్లాలో వాడీవేడిగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 68 స్థానాలకే పరిమితం అయింది. ఎన్నికల అనంతరం భూపాలపల్లి మండలంలోని ఓ సర్పంచ్ ఇటీవల బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ సర్పంచ్ల సంఖ్య 69కి చేరుకుంది. కాగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచినప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గంలోని రెండు ప్రధాన మండల కేంద్రాల సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోవడం గమనార్హం. చిట్యాల మండలంలో ఏకగ్రీవం పోనూ, పోటీ జరిగిన స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమానంగా 10 చొప్పున సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నాయి. ఆరింటికే బీజేపీ పరిమితం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. జిల్లాలో మాత్రం ఉనికిని చాటుకోలేకపోయింది. భూపాలపల్లి నియోజకవర్గంలో తమ పార్టీ మద్ధతుదారులు ఐదుగురు, కాటారం మండలంలో ఒకరు గెలుపొందారు. మొత్తంగా ఆరింటికే బీజేపీ పరిమితమైంది. స్వతంత్రుల సంఖ్య కంటే బీజేపీ తక్కువ స్థానాలను కై వసం చేసుకుంది. స్వతంత్రులు, రెబల్స్ హవా.. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులు, తమ పార్టీల నుంచి మద్ధతు లభించక రెబల్స్గా బరిలో నిలిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను చేజిక్కించుకన్నారు. మల్హర్ మండలంలో ఒక స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవం కాగా, జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన రెబల్స్, స్వతంత్రులు 22 మంది బరిలో నిలిచి గెలుపొందారు. మొత్తంగా స్వతంత్రుల సంఖ్య జిల్లాలో 23కు చేరుకుంది. టేకుమట్ల, కాటారం మండలాల్లో అత్యధికంగా ఐదుగురు చొప్పున స్వతంత్రులు సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. భూపాలపల్లి మండలంలోని ఒక స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఇటీవల బీఆర్ఎస్లో చేరగా, రేగొండ మండలంలోని ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
అఽధికారులకు అభినందనలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీడీఓలు, డీపీఓతో పాటు ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని గురువారం అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిబంధనల కచ్చితమైన అమలు ఎన్నికల విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన సందర్భంగా డీపీఓ, ఎంపీడీఓలు కలెక్టర్ రాహుల్ శర్మను శాలువాతో సన్మానించారు. విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు అందించిన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
సమన్వయంతోనే ఎన్నికలు విజయవంతం
కాటారం: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నే మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో కలుపుకొని 84.02 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విజయవంతంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, పాత్రికేయులకు, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు కలెక్టర్ కాటారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, కొత్తపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సరళిపై ఆరా తీసి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి ఉన్నారు. పోలింగ్ సరళి పరిశీలన మల్హర్: చివరి విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం మండలంలో తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు. ఆయన వెంట ఎన్నికల డీఎస్పీ నారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
తొలి ఓటు అభివృద్ధికి..
కాళేశ్వరం: జిల్లాలో బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పలువురు యువకులు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పల్లె ప్రగతికి ఓటేయడానికి వచ్చి తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. జీపీ ఎన్నికల్లో ఓటు హక్కు రావడం.. మొదటిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. గ్రామ ప్రథమ పౌరుడి ఎన్నికలో డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటేశా. ప్రజల కోసం పని చేసే వ్యక్తులను ఎన్నుకుంటే మేలు జరుగుతుంది. – ఎండీ.సమీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ బీటెక్ పూర్తి చేశా. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వచ్చాను. గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా న్యాయంగా ఓటు వేశా. – దూది చంద్రశేఖర్, కాళేశ్వరం నాన్న కాళేశ్వరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నా తొలి ఓటును ఆయనకు వేయడానికి చైన్నె నుంచి వచ్చా. మొదటిసారిగా ఓటు వేయడం.. అది నాన్నకు వేయడం మరచిపోలేని జ్ఞాపకం. నాన్న (మోహన్రెడ్డి) సర్పంచ్గా గెలవడం ఆనందంగా ఉంది. – వెన్నపురెడ్డి దీక్షిత్రెడ్డి, కాళేశ్వరం మల్హర్: మొదటి సారి ఓటు హక్కు వచ్చింది. తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. ప్రతీ ఎలక్షన్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటా. – ఎల్.అవినాష్, తాడిచర్ల, మల్హర్ ● -
చివరి విడత ప్రశాంతం
కాటారం: జిల్లాలో చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. అధికారులు, పోలీసుల ముందస్తు ప్రణాళికతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు సజావుగా సాగాయి. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయడంతో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో భాగంగా కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 84.02 శాతం పోలింగ్ నమోదైంది. మహాముత్తారం మండలంలో అత్యధికంగా 86.42, కాటారంలో అత్యల్పంగా 82.28 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు మండలాల్లో 98,052 మంది ఓటర్లు ఉండగా 82,382 మంది త మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా మండలాల్లో పోలింగ్ సరళి, కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అడిషనల్ కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ పరిశీలించారు. మందకొడిగా మొదలై... పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ నిర్వాహణకు సిబ్బంది తెల్లవారు జామునే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్కు సిద్ధం చేయగా శీతాకాలం కావడంతో చలి కారణంగా ఓటర్లు ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్ సరళి మందకొడిగా సాగగా 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద కొంత సమయం వరకు ఓటర్లు బారులుదీరారు. కాటారం మండలంలో చిద్నెపల్లి, ధన్వాడ, జాదారావుపేట, ఒడిపిలవంచ, విలాసాగర్తో పాటు మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లో ఉదయం 11.30 గంటల లోపే పోలింగ్ పూర్తయింది. పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంటలోగా పోలింగ్ పూర్తి కాగా అలోపు కేంద్రంలోకి వచ్చిన ఓటర్లను ఓటు వేయడానికి అధికారులు అనుమతించారు. నాలుగు మండలాల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 26.11 శాతం, 9 నుంచి 11 గంటల వరకు 61.64 శాతం, పోలింగ్ ముగిసే సమయం 1 గంట వరకు 84.02 శాతం పోలింగ్ నమోదైంది. 40,328 మంది పురుషులు, 42,046 మంది మహిళలు, 8 మంది ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాత్కాలిక గుడారాల్లో పోలింగ్ కేంద్రాలు.. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో పోలింగ్ నిర్వాహణకు సరైన కేంద్రాలు లేకపోవడంతో తా త్కాలికంగా గుడారాలు వేసి పోలింగ్ నిర్వహించారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా గదులు లేకపోవడంతో టెంట్లతో గుడారాలు వేసి పలు వార్డుల కోసం తాత్కాలిక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో టెంట్లు వేయడంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా బయటకు కనిపించింది. ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల నిర్వాహణలో పోలీస్ మార్క్.. పలు శాఖల అధికారుల సమన్వయంతో మూడో విడత ఎన్నికలు సజావుగా కొనసాగాయి. మండల పరిషత్ అధికారులు ఎన్నికల నిర్వాహణ కోసం తగిన ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి లోటుపాట్లు కానరాలేదు. ఎన్నికల సిబ్బంది సమయానుకూలంగా ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. కాగా ఎన్నికల నిర్వాహణలో పోలీస్ మార్క్ ప్రత్యేకంగా కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అసంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఎస్సైతో పాటు 6 నుంచి 8 మంది వరకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓటు వేసిన వారిని వెంటనే కేంద్రాల నుంచి బయటకు పంపించడంతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు.మండలం మొత్తం పోలైన శాతం ఓట్లు ఓట్లుకాటారం 30,785 25,331 82.28 మహదేవపూర్ 25,434 21,462 84.38 మహాముత్తారం 20,286 17,532 86.42 మల్హర్ 21,547 18,057 83.80మరిన్ని ఎన్నికల వార్తలు 8లోuతుది విడత సర్పంచ్లు వీరే 9లోu 84.02 శాతం పోలింగ్ నమోదు పోలింగ్ సరళి, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ -
హస్తం హవా
కాటారం: గ్రామ పంచాయతీ ఎన్నికల తుదిపోరులో హస్తం హవా కొనసాగింది. మొదటి, రెండు విడతల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోగా మూడో విడతలోనూ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో ఇతరులు నిలిచారు. మంత్రి శ్రీధర్బాబు సొంత మండలం కాటారం గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెయ్యికి పైగా ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలిచినప్పటికీ నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ కొంత మేర ఉనికిని చాటుకుంది.జిల్లాలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరిగాయి. 81 సర్పంచ్ స్థానాలకు గాను ఒకటి కాంగ్రెస్ మద్దతుదారుడు, రెండు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంతో చేజిక్కించుకున్నారు. మిగిలిన 78 స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 53 మంది, బీఆర్ఎస్ 17, ఇతరులు 7, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందారు.మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు కాటారం 14 4 1 5 మహదేవపూర్ 14 3 0 1 మహాముత్తారం 15 9 0 0 మల్హర్ 11 1 0 3 మొత్తం 54 17 1 9 రెండో స్థానంలో బీఆర్ఎస్ పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
కాటారం: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలీస్శాఖ ద్వారా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, సజావుగా జరిగేలా 570 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాలను విడిచిపెట్టరాదని ఆదేశించారు. రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని ఫలితాలు ప్రకటించిన అనంతరం గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే కార్యక్రమాలు నిర్వహించడం పూర్తి నిషేధం అన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
తుది పోరు నేడే..
కాటారం: గ్రామపంచాయతీ ఎన్నికల తుది పోరుకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది. నేడు (బుధవారం) ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మూడో విడతలో భాగంగా సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు మంగళవారం సాయంత్రం వరకు చేరుకొని పోలింగ్ ప్రక్రియకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. నాలుగు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సర్పంచ్ బరిలో 297 మంది.. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 81 సర్పంచ్, 696 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మల్హర్ మండలంలో రెండు, మహాముత్తారంలో ఒకటి సర్పంచ్ స్థానాలు, మొత్తంగా 126 వార్డు సభ్యుల స్థానాలు ఏకగీవ్రం కావడంతో 78 సర్పంచ్, 570 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 297 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,423మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగు మండలాల్లో 99,578 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది.. మూడో విడత ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది మంగళవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కాటారంలో బీఎల్ఎం గార్డెన్, మహదేవపూర్, మహాముత్తారం మండలకేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, మల్హర్లో తాడిచర్ల జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సిబ్బందికి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు. పోలీస్ భద్రత నడుమ పోలింగ్ సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. విధుల్లో 1,887 మంది.. 1,887 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. కాటారం మండలంలో 252 మంది పీఓలు, 322 మంది ఓపీఓలు, మహదేవపూర్లో 194 మంది పీఓలు, 257 మంది ఓపీఓలు, మహాముత్తారంలో 235 మంది పీఓలు, 250 మంది ఓపీఓలు, మల్హర్లో 154 మంది పీఓలు, 223 మంది ఓపీఓలు విధుల్లో ఉండనున్నారు. అధికారుల పరిశీలన.. మూడో విడతలో భాగంగా ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. కాటారంలో కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణీంద్రరెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ, మహాముత్తారం, మల్హర్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, మహదేవపూర్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేశ్కుమార్ పరిశీలించారు. పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.మూడో విడతకు ఏర్పాట్లు పూర్తి● స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ● కలెక్టర్ రాహుల్శర్మ కాటారం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో కొనసాగనున్న ఎన్నికలకు సంబంధించి కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో కొనసాగిన ఎన్నికల సామగ్రి పంపిణీని ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మూడో దశలో భాగంగా 78 గ్రామపంచాయతీలు, 570 వార్డుల్లో ఎన్నికల కోసం 696 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1,887 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారని అదనంగా 15 మంది జోనల్ అధికారులు, 30 మంది రూట్ అధికారులు, 32 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 35 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ కోసం 825 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. పొరపాటుకు తావులేకుండా నిష్పక్షపాతంగా, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగించాలని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్ సూచించారు. మూడో విడత ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ ప్రత్యేక అధికారి శ్వేత, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, అధికారులు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో ఎన్నికలు 78 సర్పంచ్, 570 వార్డు స్థానాలకు.. పోలింగ్కు సర్వం సిద్ధం రెమ్యూనరేషన్ పెంచాలని పోలింగ్ సిబ్బంది నిరసన ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, అధికారులు మొదటి, రెండో విడత ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడానికి కృషిచేసిన ఎన్నికల సిబ్బంది మూడో విడత రెమ్యూనరేషన్ విషయంలో అసహనానికి గురయ్యారు. విధుల్లో పాల్గొనే పీఓలకు రెండు రోజులకు కలిపి రెమ్యునేషన్ రూ.1500 ఇవ్వనున్నట్లు సమాచారం ఉండటంతో రూ.2500 ఇవ్వాలని సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. రెమ్యూనరేషన్పై స్పష్టత ఇచ్చే వరకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేది లేదని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దనే కూర్చుండిపోయారు. మహాముత్తారంలో పీఓలు వీ వాంట్ జస్టిస్ అంటూ స్టేజ్ ఎదుట నినదించారు. సుమారు రెండు గంటల పాటు సిబ్బంది తమ నిరసన కొనసాగించగా చివరకు రూ.2వేలు అందిస్తామని అధికారులు ప్రకటించడంతో బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సామగ్రితో వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. దీంతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ఆలస్యమైంది. -
ధన ప్రవాహం
భూపాలపల్లి అర్బన్: పల్లెపోరు చివరి దశకు చేరింది. నేడు (బుధవారం) జరగనున్న మూడో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ పోరు మొదలైనప్పటి నుంచి అభ్యర్థులు ఇవే చివరి పంచాయతీ ఎన్నికలు మళ్లీ ఎప్పుడూ ఉండవన్న రీతిలో డబ్బును ఖర్చు చేస్తున్నారు. చివరికి గ్రామపంచాయతీల్లో వార్డుమెంబర్లుగా పోటీలో ఉన్న వారు కూడా లక్షల్లో ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎంత ఖర్చు అయినా ఫరవాలేదు కానీ గెలిచి తీరాలని అభ్యర్థులు మొదటి, రెండో విడతలో విపరీతంగా ఖర్చు చేశారు. జీవనోపాధిగా ఉన్న ఆటో, డీసీఎంలు అమ్మి కొంతమంది పోటీ చేస్తే, మరికొంత మంది పొలాలు, చేలు అమ్మి పోటీ చేశారు. గ్రామంలో పరువు కోసం పాకులాగే పెద్దమనుషులు కూడా తాము నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన రెండు దశల్లోనూ గ్రామాల్లో డబ్బు, మద్యం ఏరులైపారింది. ప్రస్తుతం జరగనున్న మూడో దశ బరిలో ఉన్న అభ్యర్థులకు మొదటి రెండు దశల్లో ఖర్చులను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే డబ్బు తీసుకుని ఓటు వేద్దాం అనుకుంటున్న ఓటర్లకు ఇప్పుడు రికవరీల భయం పట్టుకుంది. ఒకవేళ డబ్బులు ఇచ్చిన వ్యక్తి గెలవకుంటే ఇచ్చిన డబ్బు తిరిగి అడుగుతారనే భయం కూడా కొంత మంది ఓటర్లలో ఉంది. విచ్చల విడిగా ధన ప్రవాహం సర్పంచ్ అయితే కనీసం రూ. 5 లక్షలు, వార్డు మెంబర్ అయితే రూ.20,000 ఖర్చు కావాల్సిందే అన్న రీతిలో ఎన్నికలు సాగాయి. బరిలో ఉన్న వ్యక్తులు ఆ మాత్రం ఖర్చు చేయకుంటే బయటపడరనే ఉద్దేశం ఇటు అభ్యర్థుల్లో, అటు ప్రజల్లో ఉన్నట్టుంది. అందుకే గడిచిన రెండు దశల్లో అభ్యర్థులు విపరీతంగా ఖర్చుచేశారు. కొన్ని పంచాయతీల్లో రూ.30లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లు కలిసి వచ్చిన వారు, పంచాయతీ బరిలో ఉన్నవారు చాలా మంది ఉన్న భూములను అమ్మి మరీ ఖర్చు పెట్టారు. ఉన్న ఎకరం, అర ఎకరాన్ని కూడా ఎన్నికల్లో తాకట్టుపెట్టారు. ముఖ్యంగా మొదటి రెండో విడతలో ఎన్నికలు పూర్తయిన భూపాలపల్లి, చిట్యాల, గణపురం మండలాలతో పాటు నేడు జరగనున్న కాటారం, మహదేవపూర్లోనే ఎక్కువగా ఖర్చు పెట్టారనేది ప్రజల్లో ఉన్న మాట. పెద్ద గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామాల్లో పెద్ద మనుషులుగా ఉన్న వారి మాటే చెల్లుబాటు అవుతోంది. రికవరీల భయం ఓడిపోయిన అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు ఎక్కడ అడుగుతారనే భయం కొంత మందిలో నెలకొంది. ఇటీవల జిల్లాలోని ఓ మండలంలో ఓటమి పాలైన అభ్యర్థి దాడికి పాల్పడగా, కొన్ని జిల్లాల్లో ఓడిన అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు రికవరీ చేశారనే వార్తలు రావడంతో కొంత మంది డబ్బు తీసుకోవడానికి జంకుతున్నారు. ఎన్నికల ముందు రోజు రాత్రి నుంచి ఉదయం వరకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల ముందురోజు ఇంటింటికీ తిరిగి తలుపు తట్టి మరీ ఓటుకు ఇంత చొప్పున డబ్బులు పంచుతున్నారు. వద్దంటున్న కొంత మందికి బలవంతంగా చేతిలో పెడుతున్నారు. మరికొంత మంది మా ఇంట్లో ఇంత మంది ఓటర్లు ఉన్నారని బహిరంగంగానే పోటీలో ఉన్న వారికి చెప్పి డబ్బులు తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. రెండు దశల్లో కూడా ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం డబ్బులు తీసుకోవడానికి కొంత మంది జంకుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ నేడు మూడో దశలోనూ అదే పరిస్థితి ఆస్తులు అమ్మి మరీ పోటీలో ఉన్న అభ్యర్థులు -
రాత్రంతా బేరాలు..
కాళేశ్వరం: జిల్లాలో మొదటి విడత, రెండో విడత పోలింగ్ ఫలితాలను అనుభవంగా తీసుకుంటూ, మూడో విడడతలో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా మంథని నియోజకవర్గంలోని కాటారం సబ్డివిజన్లోని సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. పోలింగ్కు ముందు అర్ధరాత్రి 12గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడన్న సమాచారాన్ని వారి నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటూ, అంతకంటే 10శాతం నుంచి 20 శాతం ఎక్కువ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో తెల్లవారుజాము వరకు ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు, మరికొన్ని కీలక గ్రామాల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎలక్షన్ కమిషన్ నిఘా, అనేక బృందాలు 24 గంటల పాటు నిఘా ఉంచినప్పటికీ, ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు ఎలా పంచారనే దానిపై సామాన్య ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఓటములే పాఠాలు.. మొదటి, రెండో విడతలో కొన్నిచోట్ల గెలుపు వాకిట నిలిచిన అభ్యర్థులు చిన్న చిన్న తప్పిదాలతో ఓటమి పాలవ్వడంతో, మూడో విడతలో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదన్న ఆలోచనతో డబ్బుల పంపిణీతో పాటు రాత్రింబవళ్లు కాళ్లబేరాలు, వ్యక్తిగత సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. డబ్బులు, మద్యం, ఇతర గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ జోరుగా సాగినట్లు తెలిసింది. గెలుపు కోసం పడరాని పాట్లు పడుతూ లక్షలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదు. మొదటి, రెండో విడతలో ఓడిన అభ్యర్థుల అనుభవాలే గుణపాఠం కీలక గ్రామాల్లో ఓటుకు రూ.2 వేల నుంచి 3వేలు -
వేలంలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్కుమార్ మాట్లాడారు. కోలిండియా వ్యాప్తంగా 41బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రభుత్వం వేలంవేసే ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అందులో భాగంగా మణుగురు ఏరియాలోని డిప్సైట్ బొగ్గు బ్లాక్ను వేలంలో పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలైన ఆదాని, ఏఎంఆర్, మేఘా కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే ఏడు కంపెనీలు టెండర్ఫారాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనేందుకు వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోకు వేలం వేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. మణుగురు ఓసీని సింగరేణి దక్కించుకోకుంటే మణుగురులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో వేలంలో పాల్గొనడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే జెన్కో సంస్థ వేలం నుంచి విరమించుకోవాల ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్, మాతంగి రామచందర్, చంద్రమౌళి, సత్తి, కుమారస్వామి, బాబురావు పాల్గొన్నారు. -
మైన్స్ రెస్క్యూ బృందాల సేవలు కీలకం
భూపాలపల్లి అర్బన్: ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే మైన్స్ రెస్క్యూ బృందాల సేవలు అత్యంత కీలకమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అన్నారు. 54వ ఆలిండియా మైన్స్ రెస్క్యూ కాంపిటిషన్ నాగ్పూర్లో జరిగిన పోటీల్లో సింగరేణి రెస్క్యూ సిబ్బంది పాల్గొని పతకాలు సాధించిన సందర్భంగా మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి, అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఈ విజయానికి ఉద్యోగుల క్రమశిక్షణ, కఠిన శిక్షణ, అంకితభావమే ప్రధాన కారణాలని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించడం ద్వారా సింగరేణి సంస్థ ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింత పెరిగిందన్నారు. భవిష్యత్లో ఇలాంటి పోటీల్లో సింగరేణి ఉద్యోగులు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మైన్స్లో భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ఈ విజయం ఇస్తుందని చెప్పారు. యువ ఉద్యోగులు ఈ రెస్క్యూ బృందాల విజయాల నుంచి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. పతకాలు సాధించిన వారిలో భాను, మధు, శ్యామ్, ప్రమోద్, మహిళా రెస్క్యూ సిబ్బంది గాయత్రి, కృష్ణవేణి, మౌనిక ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, రెస్క్యూ ఇన్చార్జ్ పూర్ణచందర్ పాల్గొన్నారు. -
నిట్లో వర్క్షాప్ ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్పూర్ పాల్గొన్నారు. కుష్ఠువ్యాధి నిర్మూలనకు పాటుపడాలిములుగు రూరల్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు పాటుపడాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గోపాల్రావు సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో కుష్ఠువ్యాధిగ్రస్తుల గుర్తింపుపై వైద్య సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఐకమత్యంతో పనిచేసి జిల్లాను కుష్ఠ్టువ్యాధి రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. కుష్ఠువ్యాధిపై సమాజంలో మహిళా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్చంధ సంస్థలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. -
ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి కాటారం : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నమోదైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు, ఎన్నికల సామగ్రి, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ను భద్రపర్చాలని తెలిపారు. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్కు పూర్తి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, ఆర్ఓలు ఉన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాల నివారణ
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణిలో ఆధునిక పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను వినియోగిస్తూ ప్రమాదాల నివారణ చేపడుతున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియాలోని సింగరేణి వర్క్షాపులో రక్షణ కమిటీ కన్వీనర్ దామోదర్రావు ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జీఎం మాట్లాడుతూ రక్షణ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. ప్రతీ ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ బాగుంటుందని, ప్రతిఒక్కరూ మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎర్రన, దామోదర్, రాహల్, సుధాకర్, నాగసాయి. కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభను వెలికితీసేందుకు వెల్బేబీ షో చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వెల్బేబీ షోను నిర్వహించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో వెల్బేబీ షో ఏర్పాటు చేశారు. జీఎం, ఏరియా సేవ అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శిశువుల ఆరోగ్యం సమాజ భవిష్యత్కు పునాది అని, పుట్టిన మొదటి రోజు నుంచే సరైన వైద్య సంరక్షణ, పోషణ అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్లో కూడా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, వైద్యులు, కార్మిక సంఘాల నాయకులు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి -
ప్రలోభాల పర్వం
ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారంకాటారం: గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత ఘట్టం తుది దశకు చేరుకుంది. జిల్లాలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మూడో విడతలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు కొనసాగనున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. మూడో విడతలో భాగంగా నాలుగు మండలాల్లో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 9న అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు జరిగింది. అభ్యర్థుల ప్రచారాలు సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. వారం రోజుల పాటు మైకుల హోరు.. అభ్యర్థులు, నాయకుల ప్రసంగాల జోరుతో సందడిగా ఉన్న పల్లెలు ప్రస్తుతంగా ప్రశాంతంగా మారిపోయాయి. ఓటింగ్కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేకంగా ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమదైన స్థాయిలో ఓటర్లకు ప్రలోభాలు ఎరవేస్తూ ఓటును దక్కించుకునే పనిలో ఉన్నారు. నగదు, మద్యం, మాంసం పంపిణీ చేస్తూ ఓటర్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. 4 మండలాలు.. 81 సర్పంచ్ స్థానాలు జిల్లాలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో కొనసాగనున్నాయి. నాలుగు మండలాల్లో 81 సర్పంచ్ స్థానాలు, 696 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తుది జాబితా అనంతరం మూడు సర్పంచ్ స్థానాలు, 126 వార్డు సభ్యుల స్థానాలు ఏకగీవ్రం కావడంతో 78 సర్పంచ్ స్థానాలకు, 570 వార్డు స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. 297 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,423 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రలోభాలు షురూ.. ఓటింగ్కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు గెలుపు కోసం నానా పాట్లు పడుతున్నారు. అభ్యర్థులు తమ తమ గ్రామపంచాయతీల్లో ఓటర్లను పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఓటర్లను నేరుగా కలుస్తూ నగదు, మధ్యం పంపిణీ చేయడం ప్రారంభించారు. పెద్ద గ్రామపంచాయతీల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేలు, చిన్న గ్రామ పంచాయతీల్లో రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా పంపిణీ చేయడం మొదలు పెట్టారు. కాటారం, గంగారం, మహాముత్తారం మండలం మహాముత్తారం, నర్సింగాపూర్, మీనాజీపేట, బోర్లగూడెం, మహదేవపూర్ మండలం మహదేవపూర్, కాళేశ్వరం, అంబట్పల్లి, మల్హ ర్ మండలం తాడిచెర్ల, అన్సాన్పల్లి, వలెంకుంట, కొయ్యూర్, ఎడ్లపల్లి గ్రామపంచాయతీల్లో పోటీ హోరాహోరీ ఉండగా డబ్బు, మందు, ఇతర గిఫ్టులు ప్రభావం చూపనున్నాయి. హోరాహోరీగా ప్రచారం.. మూడో విడత గ్రామపంచాయతీల్లో ప్రచారం సోమవారం చివరి రోజు హోరెత్తించారు. సర్పంచులు, వార్డు సభ్యులు గెలుపు కోసం ఇంటింటా తిరిగి ఓట్లు అభ్యర్థించారు. పలు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు పోటా పోటీగా ర్యాలీలు నిర్వహించారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి తమ సొంత మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. వలస ఓటర్లను రప్పించే పనిలో... కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు వలుస ఓటర్లపై నిఘా పెట్టారు. పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను ఓటింగ్ రోజు రప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అధిక మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లో ఒకే చోట ఉంటే అభ్యర్థులు అక్కడికే వెళ్లి నేరుగా వారిని కలుస్తున్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న యువ ఓటర్లకు రవాణా చార్జీలు సైతం పంపించి వారిని ఓటు కోసం ఇక్కడకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం దుకాణాలు క్లోజ్ మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రం నుంచి కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని మద్యం దుకాణాలు మూసుకున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత పది వైన్ షాపులకు ఎకై ్సజ్ అధికారులు సీల్ వేశారు. బెల్టు దుకాణాలు, మద్యం సరఫరాపై పోలీస్, ఎకై ్సజ్ అధికారులు దృష్టి సారించారు. రేపు కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో పంచాయతీలకు పోలింగ్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు గెలుపు కోసం నానా పాట్లు నగదు, మందు, మాంసం పంపిణీ -
శాంతిభద్రతలకు విఘాతం కలగొద్దు
● మద్యం, నగదు పంపిణీపై దృష్టిసారించాలి ● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి/కాళేశ్వరం : కాటారం సబ్డివిజన్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగొద్దని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. సోమవారం ఆయన కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లుతో కలిసి మహదేవపూర్ మండలంలో పర్యటించారు. కాళేశ్వరంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును పరిశీలించి, పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి భద్రత ఏర్పాట్ౖలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక దృష్టిసారించాలని, నిరంతర తనిఖీలు కొనసాగించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవన్నారు.పోలింగ్ ముగిసిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సంబురాలు నిర్వహించడం నిషేధించామని ఎస్పీ సంకీర్త్ పేర్కొన్నారు. ఎస్పీతో కాళేశ్వరం, మహదేవపూర్ ఎస్సైలు తమాషారెడ్డి, పవన్కుమార్, రెండో ఎస్సై సాయిశశాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫలితాలు మెరుగుపడేనా?
భూపాలపల్లి అర్బన్: ఇన్చార్జ్ అధికారుల పాలన, అంతకుమించి పనిఒత్తిడి, హెచ్ఎం, ఉపాధ్యాయులకు సర్వేలు తదితర బోధనేతర పనులు అప్పగించడంతో ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారు కావడంతో విద్యార్థులతోపాటు ఉసాధ్యాయులకు కూడా పరీక్షగా మారింది. ఎంఈఓలు, డీఈఓ ఇన్చార్జ్లే.. విద్యాశాఖలో ఎంఈఓల నుంచి డీఈఓ వరకు ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పాఠశాలల్లో బోధన పనుల కంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల విధులు వంటివి అధికంగా నిర్వహిస్తున్నారు. అసలే ఇన్చార్జ్ల పాలన ఆపై వివిధ రకాల విధులతో బోధన, విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడినట్లు కనిపిస్తోంది. గతేడాది పదో తరగతి, ఇంటర్మీడియట్లలో చెప్పుకోదగిన ఫలితాలు రాలేదు. ఈ ఏడాది సబ్జెక్ట్ టీచర్లు ఉన్నా ఇతర పనులు ఎక్కువ కావడంతో పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మెరుగైన ఫలితాల కోసం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సాయంత్ర వేళ గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 122 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల నుంచి 3,548 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరితోపాటు మరో 8 మంది సప్లిమెంటరీ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 22వ స్థానంలో నిలువగా 92.96శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 56.46శాతం, ద్వితీయ సంవత్సరంలో 72.7 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 6వ స్థానం లభించింది. ఫిబ్రవరి 25నుంచి ఇంటర్ పరీక్షలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ 1,644 మంది విద్యార్థులు, సెకండియర్లో 1,566 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలుజిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. స్లిప్ టెస్టులను నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. గతేడాదికంటే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరుగుతుంది. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారు ఇన్చార్జ్ పాలనలో కొనసాగుతున్న విద్యాశాఖ గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత పెరిగేనా?మార్చి 14నుంచి పదో తరగతి..పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జనవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తామని, అనంతరం వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంటున్నారు. -
రెండు ఓట్లతో గెలుపు
వెంకటాపురం(ఎం) : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన జాటోత్ గణేష్ ప్రత్యర్థిపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో జర్పుల హేమాపై గణేష్ రెండు ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. తొలుత ఒక్క ఓటుతోనే గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగా, రీకౌంటింగ్ కావాలని ప్రత్యర్థి హేమా కోరడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ తలెత్తడంతో సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై రాజు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇరువురి మధ్య వీడియో చిత్రీకరిస్తూ ఓట్లను లెక్కించారు. చివరిగా రెండు ఓట్లు ఎక్కువ రావడంతో గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో జాటోత్ రుక్మాబాయిపై ఒక్క ఓటు తేడాతో జాటోత్ గణేష్ భార్య లతశ్రీ ఓడిపోయారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో గణేష్ రెండు ఓట్లతో గెలుపొందడం కొసమెరుపు. గడువులోగా పనులు పూర్తిచేయాలిపంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని జీపీ ఎన్నికలు సోమవారం మేడారంలోని అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, పగిడిద్దరాజు, గోవిందరాజు నూతన గద్దెల రాతి నిర్మాణం పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు. జనావాసాల మధ్య సెల్టవర్ వద్దుగోవిందరావుపేట : జనావాసాల మధ్య సెల్టవర్ నిర్మించొద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఓ వైపు గుడి, మరోవైపు పాఠశాలలు ఉండగా వాటి నడుమ సెల్ టవర్ నిర్మాణానికి ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రేడియేషన్ వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలను టవర్ కంపెనీ విస్మరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థాని కుల కథనం ప్రకారం.. టవర్ నిర్మాణం చేపట్టిన సంస్థ ప్రజలతో ఎలాంటి అవగాహన సమావేశం నిర్వహించలేదని, గ్రామసభ లేదా స్థానిక సంస్థ అనుమతి తీసుకోలేదని, పాఠశాలలు, దేవాలయం ఉన్న విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాల కోసమే కంపెనీ వ్యవహరిస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రజలు సెల్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకోని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ టవర్ వద్దు పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. -
యమబాధలు తొలగి.. ముక్తి పొంది
కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్ప్రదేశ్లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ..అలహాబాద్లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు. ఆయా రాష్ట్రాల నుంచి సుమారుగా 600మంది సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులతో కలిసి గోదావరి పరిక్రమణ (ప్రదక్షిణ) యాత్రలో భాగంగా కాళేశ్వరం క్షేత్రానికి విచ్చేశారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డిలు పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఉద్యోగి జేబునుంచి నగదు చోరీ కాళేశ్వరాలయ ఉద్యోగి జేబులో నుంచి రూ.48వేల నగదును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన పీఠాధిపతి మలూక్ రాజేంద్రదాస్జీ వస్తున్న క్రమంలో ఆలయ ఉద్యోగి రాజశేఖర్ తన ప్యాంటు జేబులో రూ.48వేల నగదు పెట్టుకున్నాడు. దీంతో భక్తజనం గుండా ఓ గుర్తుతెలియని వ్యక్తి తన జేబులోని నగదును దొంగిలించాడు. అక్కడి సీసీ కెమెరాలో ఉద్యోగి వద్దకు దొంగ వచ్చే వరకు మాత్రమే నిక్షిప్తమైంది. తర్వాత జేబు చూసుకొని ఉద్యోగి కంగుతిన్నాడు. ఈఓ మహేష్కు తెలుపడంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు దేవస్థానం గదుల కిరాయికి సంబంధించినవని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. అంత్య పుష్కరాల్లో స్నానాలు చేయాలి యూపీలోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్జీ -
ఎన్నికల విధులు అత్యంత కీలకం
భూపాలపల్లి : ఎన్నికల విధులు అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండోదశలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 73 మంది పీఓ, ఓపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విధులకు హాజరు కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు వివరించారు. నిర్దేషిత గడువులోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడోవిడతకు ఏర్పాట్లు చేయాలి.. స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి ఎన్నికలు జరుగనున్న కాటారం, మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాల రెవెన్యూ, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా 16న పోలింగ్ సామగ్రి పంపిణీ, 17న పోలింగ్, 2 గంటల తదుపరి ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. విధులు కేటాయించిన సిబ్బంది 16వ తేదీ ఉదయం 10 గంటల వరకు మెటీరియల్ పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన సిబ్బందికి మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు నిర్వహించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మూడో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు గైర్హాజరైన 73 మందికి షోకాజ్ నోటీసులు కలెక్టర్ రాహుల్ శర్మ -
నేటితో మూడో విడత ప్రచారానికి తెర
సబ్ డివిజన్లో ఇలా..కాటారం మహాముత్తారం మహదేవపూర్ మల్హర్ 106 93 56 421523718 47 39347142439388465కాళేశ్వరం: మంథని నియోజకవర్గంలోని కాటారం సబ్డివిజన్లో గ్రామపంచాయతీ ఎన్నికల జోష్ తారాస్థాయికి చేరుకుంది. మూడో విడతలో మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 12 రోజులుగా హోరెత్తిన ప్రచారం నేడు (సోమవారం) సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది. 81 పంచాయతీల్లో 297 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండడంతో గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. మల్హర్ మండలంలో దుబ్బపేట, చిన్నతూండ్ల జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. 79పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీ నేతలు గ్రామాలను చుట్టేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ర్యాలీలు, సమావేశాలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అధికారులు భద్రత, పోలింగ్ ఏర్పాట్లను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో 10 మద్యం దుకాణాలు బంద్ చేయడానికి ఎకై ్సజ్శాఖ సిద్ధమైంది. ఇప్పటికే గ్రామాల్లో రహస్యంగా మద్యం డంపింగ్, స్టాక్ తరలింపుతో పోరు మరింత వేడెక్కింది. నేటితో ముగింపు.. సోమవారం సాయంత్రం పోలింగ్కు 48 గంటల ముందు ప్రచార నిషేధం అమల్లోకి రానుండడంతో అభ్యర్థులకు మద్దతుగా పలువురు జిల్లా స్థాయి నాయకులు తిరుగుతూ అభివృద్ధి హామీలు ఇస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వతంత్రులు ప్రజల వద్దకు వెళ్లి తమ తరఫున నిలిచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతిచోట పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తోంది. ఆటోలు, ఇతర వాహనాలకు మైకుల మోతతో దద్దరిల్లిన గ్రామాలు నిశబ్ద ప్రచారం, ప్రలోబాలు మొదలు పెట్టనున్నారు. నేడు మద్యం దుకాణాలు బంద్ కాటారం సబ్డివిజన్లోని 10 మద్యం దుకాణాలను బంద్ చేయడానికి ఎకై ్సజ్శాఖ అధికారులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 17న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ పూర్తయి విజేతలకు ధృవపత్రాలు అందించే వరకూ వైన్షాపులు మూసి ఉంచాలి. ప్రచార సమయంలో చివరి రెండు రోజులు కీలకం కావడంతో కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మద్యం డంపింగ్ చేశారు. 90ఎంఎల్, క్వార్టర్లు, ఆఫ్, ఫుల్ బాటిళ్లు భారీగా స్టాక్ చేసుకుని, పోలింగ్కు ముందు రోజు ఓటర్లకు పంపిణీ చేసేందుకు రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. హోరాహోరీగా ర్యాలీలు, ఊరేగింపులు నాలుగు మండలాల్లో 79 జీపీలు, బరిలో 297 మంది సర్పంచ్ అభ్యర్థులు మల్హర్ మండలంలో ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవం నేడు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాల బంద్ -
85.25 శాతం
23,921 83.24భూపాలపల్లి 28,737రెండో విడతలో పోటెత్తిన ఓటర్లు ● ఉదయం 9గంటల నుంచి 11 గంటల మధ్య పెరిగిన పోలింగ్ శాతం 24,068 84.55చిట్యాల28,4664,015 86.38పలిమెల4,648భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. 9 గంటలకు పెరిగిన పోలింగ్.. జిల్లాలోని భూపాలపల్లి, పలిమెల, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయినప్పటికీ తొలుత పోలింగ్ అంతంత మాత్రంగానే జరుగగా.. 9 గంటల నుంచి 11 గంటల వరకు ఊపందుకుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 26.40 శాతం.. 9 గంటల నుంచి 11 గంటల వరకు 62.37, పోలింగ్ ముగిసే సమయం ఒంటిగంట వరకు 85.25 శాతం నమోదైంది. మహిళల ఓటింగ్ 84.65 శాతం నమో దు కాగా.. పురుషుల శాతం 85.89 నమోదైంది. టేకుమట్ల మండలంలో అధిక శాతం.. జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎన్నికలు జరుగగా భూపాలపల్లి మండలంలో 83.24 శాతం పోలింగ్ నమోదు కాగా, టేకుమట్ల మండలంలో అధికంగా 88.72 శాతం నమోదైంది. అత్యధికంగా కలికోటలో 91.88 శాతం చిట్యాల మండలం వరికోల్పల్లిలో 93 శాతం, టేకుమట్ల మండలం కలికోట జీపీలో అత్యధికంగా 94.4 శాతం పోలింగ్ నమోదైంది. 18,522 88.72టేకుమట్ల20,877 పోలైన ఓట్లు పోలింగ్ శాతం -
కాళేశ్వరంలో సాధువుల బస
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు బస చేశారు. గోదావరి పరిక్రమణ(ప్రదక్షిణ)యాత్రలో భాగంగా యానాం నుంచి ఆదివారం రాత్రి ఉత్తర్ప్రదేశ్లోని వ్రిందావన్ పీఠాఽనికి చెందిన మలూక్పీత్ శ్రీరాజేంద్రదాస్జీ మహారాజ్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు సుమారుగా 500 వరకు స్థానిక దేవస్థానం 86 గదులు, ఇతర వసతి రూముల్లో రాత్రి బస చేశారు. అంతకు ముందు ఆ బృందంలోని ఓ శిశ్యుని గృహంలో అల్పాహారం తీసుకున్నారు. సోమవారం(నేడు) ఉదయం ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయనున్నారు. తరువాత శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తారు. వారికోసం కొంత మంది ముఖ్యులకు పూర్ణకుంభస్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో రాత్రిపూట దేవస్థానం వద్ద సాధువులతో పాటు వారి వాహనాలతో సందడి నెలకొంది. గోదావరి పరిక్రమణ యాత్రకు తరలివస్తున్న సాధువులు నేడు కాళేశ్వరాలయంలో పూజలు -
మేడారంలో భక్త జనసందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛతీస్గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్యాప్ కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహఫంక్తి భోజనాలు చేసి సందడి చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి మొదలైన భక్తుల తాకిడి సాయంత్రం వరకు కొనసాగింది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కిటకిటలాడారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎస్సై శ్రీకాంత్రెడ్డి సమ్మక్క గద్దె వద్ద భారీకెడ్లను ఏర్పాటు చేసి భక్తులను క్రమపద్ధతిలో దర్శనానికి పంపించారు. వేలాది మంది ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వద్దకు వచ్చే దారిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు పోలీసులు వాహనాలను మళ్లీంచారు.జాతరలా తరలివచ్చిన భక్తులు వేలాదిగా వచ్చిన ప్రైవేట్ వాహనాలు కోలాహలంగా గద్దెల ప్రాంగణం -
నేడు వెల్బేబీ షో
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు (సోమవారం) వెల్బేబీ షోను నిర్వహించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఉదయం 10గంటలకు నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు నిర్వహించినట్లు తెలిపారు. పాల్గొనేవారు ఉద్యోగుల ఐడీ కార్డు, తమ పిల్లల జనన ధృవీకరణ పత్రం, రోగ నిరోధక కార్డులను తీసుకురావాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత కాటారం: కాటారం నుంచి మహాముత్తారం వైపుగా కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం ఆదివారం మండలంలోని పోతుల్వాయి బ్రిడ్జి వద్ద పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు మహాముత్తారం వైపుగా వెళ్తున్న కారును తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలను గుర్తించారు. రూ.20వేల విలువైన 142 మద్యం సీసాలను స్వాధీనపర్చుకున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం తరలిస్తున్న వలెంకుంటకు చెందిన కొండ శ్రావణ్, కొర్లకుంటకు చెందిన బొబ్బిలి వినోద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రామప్పలో యునెస్కో భారత రాయబారి వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పారిస్ నుంచి వచ్చిన యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ వి.శర్మ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, (ఏఎస్ఐ) రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు. యునెస్కోకు సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్కు విశాల్ వి.శర్మ చైర్మన్గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు. ఇటీవల ఢిల్లీలోని ఎరక్రోటలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్కు కూడా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కోకు చెందిన ఐసీహెచ్ జాబితాలో చేర్చారు. 2021లో రాయబారి విశాల్ వి.శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఇన్కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) కార్యక్రమానికి హైదరాబాద్కు వచ్చిన ఆయన.. పరిరక్షణ చర్యలను సమీక్షించేందుకు జిల్లాలో పర్యటించారు. ఏఎస్ఐ నుంచి డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ హెచ్.ఆర్. దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజనీర్ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ రోహిణి పాండే అంబేడ్కర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాగోజీరావు తదితరులు పాల్గొన్నారు. హేమాచలంలో భక్తజనం మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రం వందలాది మంది భక్త జనంతో ఆదివారం కిటకిటలాడింది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుల నియామకంకాజీపేట: అఖిల భారతీయ బ్రాహ్మణ సేవా సంఘం (చాణ్యక్య దళ్)ను పటిష్టంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతనంగా జిల్లా అధ్యక్షులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శాస్త్రి తెలిపారు. కాజీపేటలో ఆదివారం సంఘం సభ్యులతో కలిసి జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. చిలుకపాటి వెంకటశివకుమార్ (హనుమకొండ), గూడా వెంకటరమణ శర్మ (వరంగల్ అర్బన్), కాంచనపల్లి సిద్ధేశ్వర శర్మ (వరంగల్), యల్లంబట్ల కరుణాకర శర్మ (జనగామ), కొట్లావజ్జుల రామమూర్తి శర్మ (మహబూబాబాద్), విరాళ చంద్రశేఖర్ శర్మ (సిద్దిపేట), చిన్నోజుల లక్ష్మిరాజాం శర్మ (రాజన్న సిరిసిల్ల), జి.శ్రావణ్ కుమార శర్మ (జయశంకర్ భూపాలపల్లి)ను నియమించారు. ఈ మేరకు నూతన అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేసి అభినందించారు. -
పారితోషికం చెల్లింపులో కోత!
● అన్నంకు బదులుగా ఉప్మా భూపాలపల్లి అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన పీఓలకు చెల్లించాల్సిన పారితోషికం చెల్లింపులో అధికారులు కోత విధించారు. పీఓగా విధులు నిర్వర్తించిన అధికారులకు రూ.2వేలకు బదులుగా కేవలం రూ.1500మాత్రమే చెల్లించారు. ఇతర జిల్లాలో రూ.2వేలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులు ట్రైనింగ్, రెండు రోజులు ఎన్నికల విధులు నిర్వర్తించిన పారితోషికం తక్కువగా చెల్లించడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీఓలను పలువురు అడగగా కలెక్టర్ ఆదేశాల మేరకే పారితోషికం తగ్గించి ఇస్తున్నట్లు ఎంపీడీఓ సమాధానం ఇచ్చారు. పోలింగ్ ముగించుకొని బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రిని తిరిగి అధికారులకు అప్పగించిన తరువాత సిబ్బంది అన్నం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టేకుమట్ల, చిట్యాల మండలాల్లో ఆదివారం రాత్రి సిబ్బందికి అన్నంకు బదులుగా నాటు రవ్వతో చేసిన ఉప్మా పెట్టి ఇంటికి పంపడం పట్ల ఎన్నికల సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. -
రెండోసారి పైచేయి
2వ దఫా ఎన్నికల్లోనూ అధికార పార్టీదే హవా రెండో విడత సర్పంచ్లు వీరే.. ఎన్నికల మరిన్ని వార్తలు 9లో.. 8లో..భూపాలపల్లి: రెండో విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయ డంఖా మోగించింది. ఏకగ్రీవాలతో పాటు అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలువగా, మూడో స్థానంలో స్వతంత్రులు నిలిచారు. 46 స్థానాల్లో కాంగ్రెస్.. జిల్లాలోని భూపాలపల్లి, పలిమెల, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని 85 గ్రామ పంచాయతీలకు రెండో దఫా ఎన్నికలు జరిగాయి.ఇందులో 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంతో చేజిక్కించుకున్నారు. మిగిలిన 75 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 36మంది, బీఆర్ఎస్ 30మంది, బీజేపీ ఇద్దరు, స్వతంత్రులు ఏడుగురు గెలుపొందారు. పలిమెల మండలం కాంగ్రెస్ వశం.. పలిమెల మండలంలో 8 గ్రామ పంచాయతీలు ఉండగా పలిమెల మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా మిగిలిన ఏడు పంచాయతీల్లో ఆరు కాంగ్రెస్, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 2 ఓట్ల తేడాతో విజయం భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మండలం పెద్దాపూర్ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు మూ ల స్రవంతి కాంగ్రెస్ రెబల్ మద్దతుదారు ముక్కెర సునీతపై రెండు ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, బంధువులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఐదు ఓట్ల తేడాతో.. టేకుమట్ల: మండలంలోని ఆశిరెడ్డిపల్లి సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి జక్కుల కుమారస్వామి 5 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ మద్దతుదారుపై విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారు వెలిశెట్టి సురేష్కు 179 ఓట్లు రాగా.. జక్కుల కుమారస్వామికి 184 ఓట్లు వచ్చాయి. భూపాలపల్లి చిట్యాల పలిమెల టేకుమట్ల12 13 0 1 15 10 1 0 7 0 0 1 12 7 1 5కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఏకగ్రీవంతో కలిపి ఎవరికి ఎన్ని 10 సర్పంచ్ స్థానాల ఏకగ్రీవంతో పాటు 36 స్థానాల్లో గెలుపు బీఆర్ఎస్కు 30, బీజేపీకి 2, ఇతరులు ఏడు స్థానాల్లో విజయం -
గుడులు కట్టిస్తాం.. బడులు బాగు చేస్తాం
మేడారంలో బస్టాండ్ క్యూలైన్ పనులు షురూఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఆర్టీసీ బస్టాండ్లో క్యూలైన్ పనులు శనివారం ప్రారంభించారు. 28 ఎకరాల ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని చదును చేయడంతోపాటు జిల్లాల వారీగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కోసం తడుకలతో గదులను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు సీసీ పుటేజీల కోసం తాత్కాలికంగా జీఐ షీట్స్ రేకులతో గది ఏర్పాటు చేశారు.మీరేదంటే అదే!పరకాల మండలానికి చెందిన ఓ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజల డిమాండ్ నెరవేర్చేందుకు అడిగిందే తడవుగా గుడి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇది తెలిసిన మరో అభ్యర్థి సైతం ఆ సామాజిక వర్గం ఓటర్ల వద్దకు వెళ్లి తన సంసిద్ధతను వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇద్దరూ తేల్చుకునేలోపే రెండో విడత ప్రచారం ముగిసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ మండలాల్లో వివిధ గ్రామాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు గుడులు, బడుల మరమ్మతులకు హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మూడో విడత ప్రచారానికి రేపు తెరపడనుండగా.. నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో అభ్యర్థుల హామీల పరంపరతో ప్రచారం కొనసాగుతోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో రోజులు గడిచినా కొద్ది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పీక్కు చేరుతోంది. ‘మీరేం అడిగితే అది చేస్తాం. అభివృద్ధికి పాటుపడతాం. గుడులు కడతాం, బడులు బాగు చేస్తాం’ అంటూ అలవి కాని హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 15న (సోమవారం) సాయంత్రం 5 గంటలకు మూడో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. వ్యూహాలతో ముందుకు వెళ్తూ.. మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 53 ఏకగ్రీవమయ్యాయి. 502 చోట్ల ఈనెల 11న పోలింగ్ నిర్వహించారు. 333 జీపీలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, సీపీఐ 1, ఇతరులు 56 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. కొంచెం ఎఫర్ట్ పెడితే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తుండగా, మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ సైతం తమ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. ఇదే సమయంలో మొదటి విడతలో తలెత్తిన లోపాలను గుర్తించిన ఆ మూడు పార్టీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 564 పంచాయతీలకు 57 ఏకగ్రీవం కాగా, 507 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి శనివారం రాత్రే అధికారులు, సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. జోరుగా ప్రలోభాలు.. పంపకాలు రెండో విడత అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు శనివారం రాత్రి నుంచే విచ్చలవిడిగా ధనప్రవాహానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామ పంచాయతీలను బట్టి ఓటుకు రూ.500ల నుంచి రూ.2,500ల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఫుల్బాటిల్.. కిలో చికెన్ చొప్పున చాలా గ్రామాల్లో సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ సాగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఎన్నికల సంఘం కళ్లుగప్పి విచ్చల విడిగా పోల్ చిట్టీలతో పాటు డబ్బుల్ని పంపిణీ చేసేలా ఏర్పాటు చేసుకున్న కొందరు నాయకులు చాలా గ్రామాల్లో రెండో విడత కోసం శనివారం రాత్రంతా కొనసాగించారు. ఇదిలా ఉండగా, రెండో విడత పోలింగ్ సందర్భంగా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఎన్నికలను సజావుగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దన్నారు. కాగా ఆదివారం పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని బ్రాందీషాపులు, బార్లను అబ్కారీశాఖ అధికారులు శనివారం సాయంత్రం మూసివేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల పాట్లు డబ్బు, మద్యం కానుకల ఎర గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు రెండో విడతకు నేడు పోలింగ్.. 564లో 57 ఏకగ్రీవం 507 పంచాయతీలకు హోరాహోరీ ‘రెండో’ పోరులో గెలిచేదెవరో? పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి భారీగా భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు -
హోరెత్తిస్తున్న మైకులు !
కాళేశ్వరం: మూడో విడత ఎన్నికల్లో భాగంగా పల్లెల్లో సర్పంచ్, వార్డుసభ్యుల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే గడువు ఉండడంతో బరిలో నిలిచిన వారు ప్రచారాన్ని తీవ్రం చేశారు. కాటారం సబ్ డివిజన్లోని కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాల్లో సర్పంచ్లుగా పోటీచేస్తున్న వారు ఆటోలు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసి మైకులతో హోరెత్తిస్తున్నారు. కాలనీలు, వార్డుల్లో వాహనాలను తిప్పుతూ ఓటర్లను ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కాలినడకన ఓ వైపు ఇంటింటా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు వాహనాల ప్రచారం ఊపందుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాహనాలతో మైకులు అమర్చి ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయిలో ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. పోటాపోటీ ప్రచారంతో ఓటరు ఆలోచనలో పడుతున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 17న మూడో విడతకు పోలింగ్ ఉండగా, 15న సాయంత్రం వరకు ప్రచారానికి తెర పడనుంది. దీంతో మైకుల మోతతో పల్లెలు దద్దరిల్లుతున్నాయి. -
ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఎస్సైతో మాట్లాడుతున్న ఎస్పీ సంకీర్త్ పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ● కలెక్టర్ రాహుల్ శర్మ చిట్యాల: మండలంలోని అన్ని గ్రామాలలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ కోరారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించిన సామగ్రిని శనివారం మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో పరిశీలించి మాట్లాడారు. ఆదివారం జరిగే పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులను కోరారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మల్లేశ్వరి, ఎంపీడీఓ జయశ్రీ, తహసీల్దార్ షేక్ ఇమామ్బాబా, ఎంపీఓ రామకృష్ణ, ఏపీఓ హలీంపాషా పాల్గొన్నారు. శాంతి భద్రతలు కట్టుదిట్టం చేయాలి: ఎస్పీ సంకీర్త్ ఎన్నికలకు భారీ బందోబస్తు నిర్వహిస్తూ శాంతి భద్రతల పట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సంకీర్త్ అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహించాలని అన్నారు. ఇబ్బందులు ఉంటే సంబందిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట సీఐ మల్లేష్, ఎస్సై శ్రావన్కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో కార్మికులపై మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1వ గనిలో కొంత మంది మైనింగ్ అధికారులు కార్మికులను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు తెలిపారు. ఫిల్లింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికులపై అనవసరమైన ఒత్తిడి, అవమానకరమైన ప్రవర్తన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. హాజరు విషయంలో కార్మికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. ప్రశ్నించిన కార్మికులను వ్యక్తిగతంగా వేధిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రత్నం అవినాష్, దేవరకొండ మధు, కుమారస్వామి, మల్లారెడ్డి, మొగిలి, రమేష్, పాష పాల్గొన్నారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. భూపాలపల్లి, కాటారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 451 మంది విద్యార్థులకు గాను 314 మంది పరీక్షకు హాజరుకాగా 137 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. క్రీడలతో ఆరోగ్యం ఏరియా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సునీత భూపాలపల్లి అర్బన్: క్రీడలు గెలుపోటములకే కాకుండా ఆరోగ్యం, ఉత్సాహానికి ఉపయోగపడతాయని ఏరియా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సునీత తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో మహిళలకు వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించారు. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. క్రీడా పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదని, మనలో ఉన్న సహకారం, క్రమశిక్షణ, ఆరోగ్యం, ఉత్సాహం వంటి విలువలను మరొకసారి మనకు గుర్తు చేస్తాయన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలే అని గెలుపోటములు సహజమన్నారు. ధైర్యం, కలిసికట్టుగా ముందుకు సాగే తపన అదే నిజమైన విజయమని చెప్పారు. సేవ సభ్యులు సేవాభావం, అంకితభావం సంస్థకు, సమాజానికి అమూల్యమైనవని అన్నారు. క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, ఉత్సాహంగా పాల్గొన్న సేవ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈనెల 23న జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బహుమతులను అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, స్పొర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, సేవా కార్యదర్శి రుబీనా, సభ్యులు పాల్గొన్నారు. -
నేడే రెండో విడత తీర్పు
నాలుగు మండలాల్లో 75 సర్పంచ్, 547 వార్డు స్థానాలకు ఎన్నికలుభూపాలపల్లి అర్బన్: పోలింగ్ సామగ్రిని సరి చూసుకుంటున్న సిబ్బంది భూపాలపల్లి: రెండో దశ గ్రామపంచాయతీ పోరుకు అంతా సిద్ధమైంది. జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల నాలుగు మండలాల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనుండగా, నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. బరిలో 1,560 మంది అభ్యర్థులు.. భూపాలపల్లి, చిట్యాల, పలిమెల, టేకుమట్ల మండలాల్లో మొత్తం 85 జీపీలు, 694 వార్డులు ఉండగా అందులో 10 సర్పంచ్ స్థానాలు, 147 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 75 సర్పంచ్, 547 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 244, వార్డులకు 1,316 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై ఒంటిగంటకు ముగుస్తుంది. తదుపరి కౌంటింగ్ నిర్వహించి గెలుపొందిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. విధుల్లో చేరిన పోలింగ్ అధికారులు.. ఎన్నికల నిర్వహణ అధికారులు శనివారమే విధుల్లో చేరారు. ఉదయం ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో మెటీరియల్ను తీసుకొని అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ స్టేషన్లకు చేరుకొని రాత్రి అంతా సిద్ధం చేసుకున్నారు. ఉదయం ఏడు గంటలకు సజావుగా ఎన్నికల నిర్వహణను ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో 1,846 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది, అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు.. రెండో దశ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023 లోని సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, ఓటర్లను ప్రలోభపరిచే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. 10 సర్పంచ్, 147 వార్డులు ఏకగ్రీవం ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం -
పల్లెల్లో చలి పంజా
మంచు తెరలను చీల్చుతూ ఉదయిస్తున్న సూర్యుడు తెల్లవారుజామున మంచుతో కప్పేసిన పొగమంచురెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో వాతావరణం హీటెక్కింది. మరో వైపు పల్లెల్లో చలి పంజాతో గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి పగటిపూట 28 డిగ్రీలు, రాత్రి పూట 13.5 డిగ్రీలకు తగ్గి చల్లనిగాలులు వీస్తున్నాయి. శనివారం కాళేశ్వరంలో తెల్లవారుజామున మంచుదుప్పటి కప్పేసింది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చలికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం ఆరు దాటితే చలి తీవ్రత పెరగడంతో మూడో విడతలో పల్లెల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రాత్రిపూట ప్రచారాలకు ఆటంకం కలుగుతోంది. – కాళేశ్వరం -
ఇసుక పనుల్లో మతలబేంటి?
ములుగు: మేడారం జంపన్నవాగులో ఇసుక లెవలింగ్ పనులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. జంపన్నవాగులో భక్తుల సౌకర్యార్థం ఇరిగేషన్శాఖకు రూ.4.96కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.1.29 కోట్లతో ఇసుక లెవలింగ్ పనులు చేస్తున్నారు. ప్రతీ ఏటా మహాజాతర సమయంలో గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు నుంచి జంపన్నవాగులోని భక్తుల పుణ్యస్నానాల కోసం నీటిని విడుదల చేస్తారు. రెడ్డిగూడెం నుంచి చిలకలగుట్ట వరకు వాగు సమాంతరంగా ఉండేందుకు ఇసుకను లెవలింగ్ చేస్తున్నారు. ఇసుక చదును పనుల్లో లోపాలు ఉన్నాయా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఇసుక లెవలింగ్ పనులను సంబంధించిన ఎస్టిమేషన్ పత్రాలను, రికార్డులను ఇరిగేషన్శాఖ నుంచి తీసుకున్నట్లు తెలిసింది. వాగులో ఇసుక చదును పనులపై విజిలెన్స్ బృందం శనివారం మేడారానికి వస్తున్నారనే సమాచారం ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారుల నుంచి మొదలుకుని కింది స్థాయి వరకు మేడారానికి ఇసుక పనులకు సంబంధించిన అన్ని రికార్డులతో మేడారానికి వచ్చినట్లు సమాచారం. పనులు నిలిపివేత మేడారం జంపన్నవాగులో ఇసుక చదును పనులను శనివారం నిలిపివేశారు. విజిలెన్స్ బృందం అధికారులు తనిఖీ నిర్వహించేంత వరకు పనులు ఆపేవేయాలని ఆదేశించడంతోనే నిలిపివేసినట్లు తెలుస్తోంది. భక్తుల జల్లు స్నానాల కోసం స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ నల్లాలను ఏర్పాటు చేస్తున్నారే తప్ప ఇసుక చదును పనులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. ఈనెల 12న మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్కలు వచ్చిన సమయంలో ఇరిగేషన్శాఖ అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడంతోపాటు సమీక్ష సమావేశానికి కొంత ఆలస్యంగా హాజరు కావడంతో మంత్రి ఆగ్రహించినట్లు తెలిసింది. జంపన్నవాగు ఇసుక లెవలింగ్ పనులపై విజిలెన్స్ అధికారుల ఆరా? -
భార్యకు ఉరివేసి.. ఆత్మహత్య
గణపురం: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి భార్యకు ఉరివేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. గణపురం ఎస్ఐ రేఖ అశోక్ కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన రామాచారి (55)కి గతంలో జరిగిన రెండు పెళ్లిళ్లలో ఒక భార్య చనిపోగా, మరొకరికి విడాకులిచ్చాడు. మైలారం గ్రామానికి చెందిన సంధ్యను 20 ఏళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. వీరి కుమార్తె వైష్ణవి (19) గణపురం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సహకరించావంటూ భార్య సంధ్యతో రామాచారి తరచూ గొడవ పడుతున్నాడు. దీంతోపాటు రామాచారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రామాచారి శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యకు తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఫోన్లో రికార్డు చేసి స్టేటస్గా పెట్టుకుని.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన సంధ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి రామాచారి ఇంటికి వెళ్లి చూడగా సంధ్య, రామాచారిలు మృతి చెంది ఉన్నారని ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లి సెగ్గోజు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
ప్రలోభాలు షురూ..
రెండో విడతలో జరుగనున్న భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల మండలాల్లో వలస ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి వారు జీవనోపాధి, ఉద్యోగ, ఉపాధి రీత్యా హనుమకొండ, హైదరాబాద్ పట్టణాల్లో నివసిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు వంద మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా గెలుపుపై ప్రభావం చూపనుంది. దీంతో వలస ఓట్లపై ప్రధాన పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు దృష్టి సారించారు. పట్టణాల్లో ఉన్న వారికి రవాణా ఖర్చులతో పాటు ఓటుకు రూ.వేయి నుంచి రూ.1,500 ఇస్తామని చెప్పి.. తప్పకుండా ఓటు వేసేందుకు రావాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు ముందస్తుగా ఆన్లైన్ పేమెంట్లు సైతం చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. గ్రామంలో కోతులు, కుక్కల బెడదను తీరుస్తామని, కుల సంఘాలకు చెందిన దేవాలయాలు నిర్మిస్తామని, ప్రతీ కాలనీకి సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. మొదటి దఫాలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాలను కై వసం చేసుకున్నారు. దీంతో రెండో విడతలో అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రేపు భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల మండలాల్లో ఎన్నికలు గెలుపు కోసం అభ్యర్థుల పడరాని పాట్లు ఓటుకు నోటుతో పాటు మద్యం, చీరలు, వస్తువుల పంపిణీ గ్రామాల్లో ఎక్కడ చూసినా విందులే వలస ఓటర్లకు ప్రత్యేక ఆఫర్లు -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
రేగొండ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవులగుట్టలను సీసీఎఫ్ కాళేశ్వరం ప్రభాకర్, ఎస్పీ సంకీర్త్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రాపెల్లింగ్, ట్రెక్కింగ్లో పాల్గొన్నారు. ప్రతాపగిరి గుట్టను సందర్శించిన పీసీసీఎఫ్ కాటారం: కాటారం అటవీశాఖ రేంజ్ పరిధిలోని ప్రతాపగిరి గుట్టను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ శుక్రవారం సందర్శించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి కాలినడకన గుట్టపైకి చేరుకున్నారు. గుట్ట చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఏకో టూరిజంగా తీర్చిదిద్దడానికి అనుగుణంగా ఉండే అంశాలపై పీసీసీఎఫ్ జిల్లా అటవీశాఖ అధికారులతో చర్చించారు. నివేదికను తయారు చేసి పంపించాలని ఆదేశించారు. పీసీసీఎఫ్ వెంట కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి, ఎఫ్డీఓ సందీప్, కాటారం ఎఫ్ఆర్ఓ స్వాతి, డిప్యూటీ రేంజర్ సురేందర్, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు. -
కొడుకు చేతిలో తండ్రి హత్య
గూడూరు: మద్యం మత్తులో గొడవపడిన తండ్రిని కుమారడు కొట్టి చంపిన ఘటన మానుకోట జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ శివారు హఠ్యతండాలో గురువారం అర్ధరాత్రి జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఠ్యతండాకు చెందిన ధారావత్ నందీరాంనాయక్ (45) భార్యా పిల్లలతో హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నందీరాం గొడవ చేస్తున్నాడు. గొడవ వద్దని చెప్పిన భార్యపై మద్యం మత్తులో రోకలితో దాడి చేయడానికి యత్నించాడు. గుర్తించిన కుమారుడు కృష్ణ అదే రోకలితో తండ్రి ఛాతిపై కొట్టాడు. వెంటనే కింద పడి స్ప్రృహకోల్పోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు గూడూరు సీహెచ్సీకి తరలించారు. వైద్యుడు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి ధారావత్ సోమ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘మంత్రిపై చర్యలు తీసుకోవాలి’
ములుగు రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సాయంత్రం 5 గంటలు దాటి న తర్వాత సభలు, సమావేశాలు, మైక్లతో ప్రచారం నిర్వహించకూడదు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జాకారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
రెండో దశ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు 13వ తేదీన పోలింగ్ మెటీరియల్ పంపిణీ, 14వ తేదీన పోలింగ్, ఓట్లు లెక్కింపు తదితర అంశాలపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి రెవెన్యూ, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్న మండలాల్లో గ్రామాల వారీగా మూడు భాగాలుగా విభజించి ఇన్చార్జ్లను నియమించాలన్నారు. వెబ్ క్యాస్టింగ్ లేని చోట మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డీపీఓ శ్రీలత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ పూర్తి.. రెండో విడత జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 14వ తేదీన జరుగనున్న భూపాలపల్లి, టేకుమట్ల, చిట్యాల, పలిమెల మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహించే పీఓ, ఓపీలకు శుక్రవారం కలెక్టర్ చాంబర్లో మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ప్రత్యేక పోర్టల్ రూపకల్పన.. జిల్లాలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణను మరింత సులభతరం చేసి పారదర్శకతను పెంచే దిశగా ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇరిగేషన్, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, పంచాయతిరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖలకు ఏ పథకం కింద ఎంత నిధులు కేటాయించబడ్డాయి, ఏ పనులు చేపట్టారు, వాటి పురోగతి ఎంత, పూర్తి చేయాల్సిన గడువు, ప్రారంభం కాని పనులు, కాంట్రాక్టర్ల సమస్యలు, స్థల సంబంధిత ఇబ్బందులు వంటి అన్ని అంశాలను ఒకే వేదికలో సమగ్రంగా పొందుపరుస్తూ పోర్టల్ రూపొందించామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. అనుమతులు లేకుంటే చర్యలు.. జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ కిరణ్ పాల్గొన్నారు. ఓటర్లకు ఇబ్బంది రానివ్వొద్దు అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు కలెక్టర్ రాహుల్ శర్మ -
రక్షణలో భాగస్వాములు కావాలి
మల్హర్: ఓపెన్ కాస్ట్లో ఉద్యోగులు, కార్మికులు రక్షణలో భాగస్వాములు కావాలని సేప్టీ కమిటీ కన్వీనర్ వెంకటరమణ సూచించారు. 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలో తాడిచర్ల ఓపెన్కాస్ట్ మైన్ను వెంకట్వేర్రావు సందర్శించి, రక్షణ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడాతూ.. ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణలో రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు. కార్మికుల రక్షణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద రహిత ఓపెన్కాస్ట్ మైన్గా నిలిచేలా ప్రతీ ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఓపీ, సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం సంస్థ నియమ నిబంధనలను అనుసరించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని వివరించారు. కార్యక్రమంలో మైన్ ఏజెంట్ జీవన్కుమార్, సభ్యులు జాకీర్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, జెన్కో జీఎం మోహన్రావు, ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీధర్, కేఎస్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేప్టీ అధికారి సురేష్బాబు పాల్గొన్నారు. -
కార్మికులకు ఈఎస్ఐ అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ తప్పనిసరిగా అమలు చేయాలని ఈఎస్ఐ బ్రాంచ్ మేనేజర్ రమేష్ తెలిపారు. ఏరియాలోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకం(ఈఎస్ఐ)పై శుక్రవారం స్థానిక జీఎం కార్యాలయంలో కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తప్పనిసరిగా ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రమాదాలు జరిగినప్పడులు ప్రయోజనాలు ఉండవని చెప్పా రు. ఈఎస్ఐ ఉండటం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కాంట్రాక్టర్లకు కలిగే చట్టపరమైన పరిణామాలు, ఈఎస్ ఐ నిబంధనల ప్రకారం విధించే పెనాల్టీలు, బకాయిల వసూలు, తనిఖీలలో లోపాలు కనబడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఏజీఎం రవికుమార్, పీఎం శ్యాంప్రసా ద్, గనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు గోదావరి పరిక్రమణ యాత్ర పేరిట ఈనెల 14న ఆదివారం కాళేశ్వరం రానున్నారు. 15న సోమవారం ఉదయం ముందుగా త్రివేణి సంగమగోదావరిలో పుణ్యస్నానాలు చేయనున్నారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేస్తారని ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరస్వాములు 500మంది వరకు తరలి రానున్నారని తెలిసింది. దీంతో వారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ములుగు రూరల్: రైతులకు నష్టం చేస్తున్న అబ్బాయిగూడెం ఇసుక రీచ్ను నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం అబ్బాయిగూడెం రైతులు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ అబ్బాయిగూడెంలోని ఇసుక రీచ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతుల పంటలకు నష్టం కలిగేలా విద్యుత్ స్తంభాలను విరగొట్టారని వివరించారు. దీంతో రైతుల పంట పొలాలు ఎండి పోతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్ను నిలిపి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తోట నాగేశ్వర్రావు, బొల్లె రాంబాబు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విచారణలో నిందితుడు దోషిగా తేలడంతో న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో బండారుపల్లి గ్రామానికి చెందిన కొడబోయిన మహేందర్ పోక్సో కేసు 2020లో అదే గ్రామానికి చెందిన ఎల్పుల రవితేజపై ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు విచారణ దర్యాప్తు అధికారిగా దేవేందర్రెడ్డి, ఎస్సై ఫణి, కోర్టు మానిటరింగ్ డీఎస్ కిశోర్, కోర్టు లియాసోనింగ్ అధికారి ఎస్సై లక్ష్మణ్, కోర్టు సీడీఓ స్రవంతిలను ఎస్పీ అభినందించారు. మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిస్టతను ఆర్చకులు వివరించి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మన సనాతన ధర్మం అన్నారు. మల్లూరు కేసీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: వయోవృద్ధుల సంక్షేమం, వారి పరిరక్షణ కోసం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్ తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను శుక్రవారం జడ్జి దిలీప్కుమార్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమం, పరిరక్షణ చట్టాన్ని అనుసరిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, ఆర్డీఓ రవి, గవర్నమెంట్ లీడర్ బొట్ల సుధాకర్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ శ్రీనివాస్, కంప అక్షయ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్, న్యాయవాదులు కనపర్తి కవిత, సంగెం రవీందర్ పాల్గొన్నారు. కాటారంలో.. కాటారం: వయోవృద్ధుల సంక్షేమం, పరిరక్షణ కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉపయోగపడుతుందని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్.దిలీప్కుమార్నాయక్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను జడ్జి దిలీప్కుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, స్పెషల్ పిపి విష్ణువర్ధన్, అసిస్టెంట్ పీపీ శివకుమార్ పాల్గొన్నారు. -
లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీటు వస్తే నవోదయమే.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతి పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
బందోబస్తులో సమస్యలు రావొద్దు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: పోలీసు బందోబస్తు విషయంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎం.టీ(పార్క్)విభాగం, డాగ్ స్క్వాడ్ యూనిట్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులు, రోజువారీ మెయింటనెన్స్ రిజిస్టర్, ఫ్యూయల్ వినియోగ వివరాలు, వాహనాల స్థితిగతుల గురించి సమగ్రంగా పరిశీలించారు. బందోబస్తు బాధ్యతల్లో వాహనాలకు సమస్యలు లేకుండా పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డాగ్ స్క్వాడ్ విషయంలో కేనైన్ల ఆరోగ్య పరిస్థితి, ట్రెయినింగ్ రికార్డులు, స్పందన సామర్థ్యం, విభాగం పనితీరు, పరికరాల లభ్యతను పరిశీలించి యూనిట్ను మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంకీర్త్ ఆదేశించారు. -
పెద్ద పంచాయతీలే టార్గెట్
భూపాలపల్లి అర్బన్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రభావం ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో భూములు అమ్ముకుని మరీ పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. కొంతమంది హోదా కోసం, మరికొంత మంది రాజకీయ బలం కోసం ఇలాంటి పరిస్థితులు తొలిపోరులో కనిపించాయి. గెలిచిన వారు ఉత్సాహంగా ఉంటే, ఓడినవారు తాము ఖర్చు చేసిన డబ్బును వసూల్చేసే పనిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తొలి విడత ఎన్నికలు ధనప్రవాహం కనిపించింది. లక్షలు ఖర్చు పెట్టయినా కొన్ని పంచాయతీల్లో గెలిచేందుకు అభ్యర్థులు తహతహలాడుతున్నారు. మండలాలుగా ఉన్న గ్రామపంచాయతీల్లో, ఇతర పెద్ద పంచాయతీల్లో ఎలాగైనా గెలవాలని ఇటు పార్టీలతో పాటు అభ్యర్థులు భావిస్తున్నారు. దీనికి సాక్ష్యంగా తొలివిడత ఎన్నికలే కనిపిస్తున్నాయి. లక్షలు ఖర్చుపెట్టి ఓడిపోయిన వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరికొంత మంది ఓటర్లకు పంచిన డబ్బును వసూలుచేసే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏకగ్రీవమైనవి దాదాపుగా 19 పంచాయతీలు ఉంటే వాటిలో ఉన్నవన్ని చిన్నపంచాయతీలే కావడం విశేషం. పెద్దపంచాయతీల్లో అందరూ పోటీకే ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయం ఉన్న చోటే ఆసక్తి జిల్లాలో 12 మండలాలు ఉంటే వాటిలోని 11 మండల కేంద్రాలు పంచాయతీలుగానే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పంచాయతీలు ఆదాయం పరంగా, అభివృద్ధి పరంగా ముందున్నాయి. ఈ విధమైన అనుకూలతలు ఉన్న పంచాయతీల్లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు ఎక్కువ మొత్తంలో దాఖలయినప్పటికీ చివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు అన్ని మండలకేంద్రాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం, మహదేవపూర్, కాటారం, మల్హర్, దామెరకుంట, చిట్యాల, టేకుమట్ల గొర్లవీడు, చల్లగరిగే వంటి గ్రామపంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది. మొదటి విడత ఎన్నికలు జరిగిన గణపురం, చెల్పూర్, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి, రంగాపూర్ పంచాయతీల్లో తీవ్రమైన ఉత్కఠంలో ఎన్నికలు జరిగి గెలుపు నువ్వా నేనా అనే స్థాయిలో అందరి దృష్టిని ఆకర్శించాయి. కాళేశ్వరం, కాటారం, మహదేవపూర్, దామెరకుంట వంటి పంచాయతీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ను అనుకుని ఉండటం, ఇసుక క్వారీలు ఉండటంతో ఈ పంచాయతీలకు విపరీమైన పోటీ నెలకొంది. తాడిచెర్ల పంచాయతీ పరిధిలో జెన్కో బొగ్గు గనులు ఉండటంతో పోటీ నెలకొంది. గణపురం, చెల్పూర్ పంచాయతీలు జిల్లా కేంద్రం భూపాలపల్లిని అనుకుని ఉండటం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వంటివి ఉండటంతో ఈ పంచాయతీల్లో గెలిచిన వారి పంట పండినట్లేనని ప్రజలు అనుకుంటున్నారు. దీంతో ప్రధాన పార్టీల మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అన్నింటి కన్నా ముఖ్యంగా అందరి నోళ్లలో నానుతున్న కాళేశ్వరం పంచాయతీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ కూడా పోటీ ఎక్కువగా ఉంది. ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు అభివృద్ధి ప్రాజెక్ట్లు ఉన్న గ్రామపంచాయతీల్లో గెలవడానికి ఎంతైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. కాళేశ్వరం, కాటారం, మహదేవపూర్, తాడిచర్ల వంటి జీపీల్లో లక్షల్లో ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. పంచాయతీ రిజర్వేషన్లు ఖరారయినప్పటి నుంచే డబ్బులు సర్దుబాటు చేసుకునే పనిలో అభ్యర్థులు ఉన్నారు. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మండల స్థాయి నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల కన్నా సర్పంచ్గా గెలిచేందుకే మొగ్గు చూపిస్తుండటం విశేషం. గోదావరి పరివాహక గ్రామపంచాయతీల్లో ఇసుక క్వారీలు ఉండటం, దీంతో ఆదాయం కూడా పెద్ద ఎత్తున వస్తుందని పోటీలో ఉన్న అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. దీంతో ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థులు రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తొలి విడతలో అన్ని గ్రామపంచాయతీల్లో ధనప్రభావం కనిపించింది. ముఖ్యంగా పెద్ద గ్రామపంచాయతీల్లో కనీసం రూ.15 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు చేశారు. కొన్నిచోట్ల ఈ మొత్తం రెట్టింపు కూడా అయింది. ఉదాహరణకు జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామపంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి రూ.50లక్షల దాకా ఖర్చుచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత ఖర్చుపెట్టి ఓడిపోయిన అభ్యర్థి తన పంచిన డబ్బును వసూలు చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాకేంద్రానికి కొద్దిదూరంలో ఉన్న పంచాయతీల్లో ఓడిపోయిన అభ్యర్థులు తాము పంచిన డబ్బులను వసూలు చేసుకునే పనిలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది హోదా కోసం, మరికొంత మంది రాజకీయంగా పైచేయి సాధించడం కోసం లక్షల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారు. తొలివిడతలోనే ఇలా ఉంటే వచ్చే రెండో, మూడో విడత ఎన్నికల్లో ఎలా ఉంటుందో అని పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు, ప్రజలు అనుకుంటున్నారు. ఆదాయం, అభివృద్ధి ఉన్న జీపీల్లో గెలవాలని భావిస్తున్న అభ్యర్థులు తొలి విడతలో పెద్ద పంచాయతీల్లో ధన ప్రవాహం కొన్ని చోట్ల రూ.50లక్షల దాకా ఖర్చు చేసిన అభ్యర్థులు -
సాయంత్రం కాంగ్రెస్.. రాత్రి బీఆర్ఎస్
● కండువాలు మార్చిన నాయకులువెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్షనేతలు పోటీ పడుతుండడంతో విచిత్ర రాజకీయ సమీకరణాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్కు చెందిన కొంతమంది వ్యక్తులు గురువారం సాయంత్రం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గురువారం రాత్రి అదే నేతలను తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకుని పార్టీ కండువా కప్పి ఫొటోలు దిగారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మళ్లీ వారికే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోనే కొనసాగుతారని ఫొటోలు దిగి వారితో నినాదాలు చేయించారు. దీంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారో.. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అర్థంకాక ఇరుపార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. -
సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి స్టేషన్ఘన్పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్హోమ్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
కాటారం: ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా కొనసాగించడానికి పోలింగ్ స్టేషన్లకు కేటాయించిన పీఓ, ఏపీఓలు, సిబ్బంది కృషి చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ తెలిపారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో శుక్రవారం ఎన్నికల విధులపై పీఓ, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్, కౌంటింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్ పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ మాట్లాడుతూ పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పీఓ, ఓపీఓలు పాల్గొన్నారు. మహాముత్తారంలో.. మహాముత్తారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధులు, నిర్వహణపై అధికారులు పీఓ, ఓపీలకు అవగాహన కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని అభ్యంతరాలకు తావివ్వవద్దని వివరించారు. కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
వాహనాల దారి మళ్లింపు
ములుగు రూరల్: మల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై వంతెన మరమ్మతు పనుల్లో భాగంగా నేడు(శుక్రవారం) వాహనాలు దారి మళ్లిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు మల్లంపల్లి వంతెన మీదుగా వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు వివరించారు. లారీలు, ట్రక్కులు, వ్యాన్లు, గూడెప్పాడు–పరకాల– రేగొండ–జంగాలపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. కెనాల్పై బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఫ్రీకాస్ట్ గ్రిడర్ల ఏర్పాటుకు భారీ క్రేన్లతో పనులు చేపడుతున్న కారణంగా వాహనాలను దారి మళ్లించినట్లు కలెక్టర్ వివరించారు. -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
● కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్మెడల్కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: వివిధ ట్రేడ్లలో ఐటీఐ (ఎన్సీవీటీ) అప్రెంటిస్షిప్ శిక్షణకు సింగరేణి యాజమాన్యం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఏపీసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఎన్ఏపీఎస్ పోర్టల్లో నమోదై ఉంటేనే ఎస్సీసీఎల్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుందని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు www. apprenticeshipindia. org వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్లైన్ దరఖాస్తు జిరాక్స్ సెట్ను వీటీసీ కార్యాలయంలో అందించాలని తెలిపారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో స్థానిక న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదరహిత జీవితాలను గడిపేలా కక్షిదారులను ప్రోత్సహించాలని సూచించారు. రాజీమార్గం ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, డీప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ, న్యాయవాదులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: 56వ వార్షిక భద్రత పక్షోత్సవాలు ఏరియాలో కొనసాగుతున్నాయి. ఈ మేరకు గురువారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో భద్రత తనిఖీ బృందం పర్యటించారు. ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, భద్రత కమిటీ కన్వీనర్ శ్రీనాథ్ హాజరై ఉద్యోగులకు భద్రత చర్యలు, ప్రమాదాల నివారణ గురించి వివరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు లక్ష్మణ్, రాధాకృష్ణ, అఫ్సర్పాషా, కిరణ్కుమార్, అమర్నాథ్, శ్రీనివాసరావు, ఏరియా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: 2026 మార్చి 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల పరీక్ష ఉంటుందని తెలిపారు. భౌతిక, జీవశాస్త్రలకు మాత్రం ఉదయం 11 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రతి పరీక్షకు 4 నుంచి 5 రోజుల వ్యవధి ఉంటుందని విద్యార్థు ఈ విరామ సమయాన్ని వినియోగించుకుని పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని తెలిపారు. కాటారం : మండలంలోని గంగారం గ్రామానికి చెందిన బొమ్మన జైపాల్రెడ్డి రాజేశ్వరికావ్యల కూతురు శ్లోక ఫాల్గునరెడ్డి విభిన్న రంగాల్లో బహుముఖ ప్రతిభ కనబరుస్తూ మన్నలను పొందుతుంది. క్రీడలు, కళలు, వ్యక్తిత్వ అభివృద్ధి రంగాల్లో తనదైన ప్రతిభ చాటుతూ ముందుకెళ్తుంది. తాజాగా శ్లోక ఫాల్గునరెడ్డి బీసీసీఐ అండర్–19 వన్డే మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరగనున్న మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హెచ్సీఏ తెలంగాణ జట్టు తరఫున ఆడనుంది. గతంలో ఆమె లక్నోలో జరిగిన జాతీయ స్థాయి అండర్–14 మహిళా క్రికెట్ ఫైనల్లో ఉమ్మడి తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. శ్లోక ఫాల్గునరెడ్డి కేవలం క్రికెట్లోనే కాకుండా చెస్ జాతీయ స్థాయి పోటీల్లో, త్రోబాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చిన శ్లోక ఫాల్గునరెడ్డి నాట్య మయూరి ఇంటర్నేషనల్ అవార్డును అందుకోవడంతోపాటు 2024లో మిస్ హైదరాబాద్ టైటిల్ను గెలుచుకుంది. శ్లోక ఫాల్గునరెడ్డి మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికవడంపై తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. -
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
గణపురం: మెదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, గాంధీనగర్లో సీఎస్ఐ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నాదా..లేదా.. అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా నిష్పక్షపాతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన రేగొండ: మండలంలోని పలు గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి సునీల్ కుమార్, తహసీల్దార్ శ్వేత పాల్గొన్నారు.మరిన్ని ఫొటోలు, వార్తలు -
ఉమ్మడి జిల్లాలో ‘చెయ్యె’త్తిన ఓటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మద్దతుదారులకు జైకొట్టారు. రాత్రి 11 గంటలకు ఏకగ్రీవాలు కలిపి 555 గ్రామ పంంచాతీల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 333 కాంగ్రెస్ మద్దతుదారులు, 148 బీఆర్ఎస్, 17 బీజేపీ, ఒకటి సీపీఐ మద్దతుదారులు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. 56 చోట్ల రెబల్స్, స్వతంత్రులు గెలుపొందగా, వారిని సైతం పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఉదయం 9 గంటల నుంచి పోటెత్తిన ఓటర్లు ఉదయం 9 గంటల నుంచి పోటెత్తిన ఓటర్లు మధ్యాహ్నం వరకు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. పోలింగ్ సమయం 1 గంట దాటినా.. చాలాచోట్ల మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. మెజారిటీ గ్రామాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించారు. రాత్రి 11 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి వరంగల్లో మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 53 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 502 పంచాయతీలకు పోలింగ్, కౌంటింగ్ జరిగింది.జిల్లా గ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం ఆదర్స్ హనుమకొండ 69 33 19 08 01 08 వరంగల్ 91 63 24 – – 04 జేఎస్ భూపాలపల్లి 82 50 20 04 – 08 ములుగు 48 36 11 – – 01 జనగామ 110 64 26 – – 20 మహబూబాబాద్ 155 87 48 05 – 15 555 333 148 17 01 56 మొదటి విడతలో హనుమకొండ జిల్లాలో 69 పంచాయతీలకు గాను ఐదు జీపీలు ఏకగ్రీవం కాగా 4 గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఒక ఊరిలో సర్పంచ్ మాత్రమే అయ్యారు. వరంగల్ జిల్లాలో 91 గ్రామ పంచాయతీలకు 11 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. ములుగు జిల్లాలో 48 గ్రామ పంచాయతీలకుగాను 9, జనగామ జిల్లాలో 110 గ్రామ పంచాయతీలకు గాను 10 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 82 గ్రామ పంచాయతీలకు గాను 9 పంచాయతీలు, మహబూబాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకుగాను 9 ఏకగ్రీవం అయ్యాయి. రెండో స్థానంలో బీఆర్ఎస్... 56 మంది ఇతరుల విజయం స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మంతనాలు -
రండీ బాబు.. రండీ!
కాళేశ్వరం: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి ఓటర్లను కిక్కెక్కిస్తుంది. తొలి విడత ఎన్నికలు గురువారంతో ముగిసాయి. ఈనెల 14న రెండో, 17న మూడో విడత ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితోపాటు వార్డుల్లో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్తోపాటు చైన్నై, తమిళనాడు, ముంబాయి తదితర ప్రాంతాలు, ఇతర జిల్లాలో ఉన్న తమ గ్రామ ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వలస కూలీలు, సాఫ్ట్వేర్, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వారిని పోలింగ్ రోజున రప్పించడానికి రవాణా చార్జీలు భ్యర్థులు భరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఎన్ని ఓట్లు ఉంటే అంత మొత్తంలో ఖర్చులు భరించడానికి సిద్ధం అవుతున్నారు. పట్నం ఓటర్లే కీలకం నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, బంధువులు, గ్రామస్తులు ఎవరికి వారే పనుల్లో బిజీ అయ్యారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేశారు. ఓటరు లిస్టువారీగా తమ వైపు తిప్పుకునేందుకు ప్రాంతానికి ఒక్కో నాయకునికి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ‘అన్నా హైదరాబాద్లో ఉన్న మనోడు వచ్చాడా.. చైన్నై నుంచి బయలు దేరారా’ అనే చర్చలు పల్లెల్లో జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘అన్నా పోలింగ్ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి.. మీ అమూల్యమైన ఓటు వేయాలి..’ అంటూ వాట్సాప్లో మెసేజ్లు వెళ్లువెత్తుతున్నాయి. ఊరి ఓటర్లతోపాటు గెలుపులో పట్నం ఓటర్లు కింగ్ మేకర్లుగా మారనున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు.. ఎప్పుడు వస్తారు. ఖర్చు ఎంత అనే బిజీలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొంత మంది అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగుదలతో ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది. అందుకే అభ్యర్థులందరూ వారిపై గంపెడాశలు పెట్టుకుంటున్నారు. ఒక్క ఓటు చాలు.. ఒక్క ఓటు ఫలితాన్ని తారుమారు చేసే పరిస్థితి ఉంది. ప్రతి అభ్యర్థి వలస ఓటర్లను రప్పించుకోవడానికి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. గతంలో చివరి క్షణంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒక్క ఓటే పదుల సంఖ్యలో అభ్యర్థుల ఆశలను తలకిందులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. 14న రెండో విడతలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాలు, 17న మూడో విడతలో మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా విందు రాజకీయాలకు తెర లేపుతుండగా, పట్నంలో ఉన్న వలస వెళ్లిన వారికి సైతం తమవైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి ఆయా ప్రాంతాల్లో వారికి డిజిటల్ పే ద్వారా డబ్బులు పంపుతున్నారు. పట్నం ఓటర్లు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారనే లెక్కల మేరకు వారిని పోలింగ్ తేదీ వరకు వచ్చేవిధంగా ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలదన్నే రీతిలో సర్పంచ్ ఎలక్షన్లలో డబ్బుల ప్రవాహం ఏరులైపారుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టణాల్లో ఉంటున్నవారికి అభ్యర్థుల ఫోన్లు రవాణా చార్జీల చెల్లింపు? కొనసాగుతోన్న రెండు, మూడో విడతల ప్రచారం -
హస్తం హవా
భూపాలపల్లి: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు సత్తా చాటారు. పలు జీపీలను ఏకగ్రీవంతో చేజిక్కించుకోవడంతోపాటు బరిలో నిలిచిన స్థానాల్లోనూ అధిక స్థానాలను కై వసం చేసుకున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలువగా, నాలుగు స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అధికార పార్టీ జోరు.. తొలి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారు. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. అలాగే ఎన్నిక జరిగిన స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. గంటగంటకు పెరిగిన పోలింగ్.. గణపురం, రేగొండ, గోరికొత్తపల్లి, మొగుళ్లపల్లి మండలాల్లో గురువారం మొదటి విడత పంచాయ తీ ఎన్నికలు జరిగాయి. ఈ మండలాల్లో మొత్తం 1,07,690 మంది ఓటర్లు ఉండగా, 88,588 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. మొత్తంగా 82.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే పోలింగ్ ఉద యం 7 గంటలకు ప్రారంభం కాగా గంటగంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. గణపురం మండలంలో 77.05, కొత్తపల్లి గోరిలో 84.82, మొగుళ్లపల్లిలో 84.08, రేగొండలో 84.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు గణపురం 17 11 5 0 1 రేగొండ 23 11 6 1 5 కొత్తపల్లిగోరి 16 12 1 2 1 మొగుళ్లపల్లి 26 17 8 1 0 మొత్తం 82 51 20 4 7 అధిక సర్పంచ్ స్థానాలు అధికార పార్టీ కై వసం రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ పలుచోట్ల అర్ధరాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు గంటగంటకూ పెరిగిన పోలింగ్ శాతం -
శాస్త్రితోనే వేదశాస్త్రాలు పరివ్యాప్తం
హన్మకొండ కల్చరల్: తొలి వేద పాఠశాలను ఏర్పా టు చేసి, వేలాది మంది వేద పండితులను అందించిన విశ్వనాథ శాస్త్రి కృషితోనే వేద శాస్త్రాలు పరివ్యాప్తమయ్యాయని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వరంగల్ శంభునిపేటలోని నాగేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, ఆయుర్వేద ఆచార్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి జయంతోత్సవం వైభవంగా నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విశ్వనాథ శాస్త్రి పాదుకలకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో గురు వందనం, గురుచరణ పూజ, సభ నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, పురాణం మహేశ్వరశర్మ, నరసింహామూర్తి, ఎల్లంభట్ల సీతారామశాస్త్రి, రామకృష్ణ, రమేశ్శర్మ, నాగరాజు శర్మ, జాగర్లపూడి శ్రీరామశర్మ, అయ్యప్పశర్మ, ఫణిశర్మ, సాయి సుందరశర్మ, జగన్మోహనశర్మ, ఆర్యవైశ్య నాయకులు తోట నరసయ్య, గట్టు మహేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ విశ్వనాథ శాస్త్రి జయంత్యోత్సవం -
రాజ్యాంగ హక్కులపై అవగాహన అవసరం
భూపాలపల్లి అర్బన్: భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవాలని జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల విద్యార్థులకు సూచించారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్జి అఖిల హజరై మాట్లాడుతూ.. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనకు ఉందని ఎందరో మహనీయుల కృషి ఫలితంగా మానవ హక్కుల, విధుల రూపకల్పన జరిగిందన్నారు. ఎక్కడైతే హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ చట్టం న్యాయం పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపారు. జీవించే హక్కు సమానత్వ హక్కుతోపాటు విద్యాహక్కు కూడా ఉందని అన్నారు. చదువుతోనే ఏదైనా సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ పుప్పాల శ్రీనివాస్, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు సేవానాయక్, న్యాయవాది మంగళపల్లి రాజ్కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల -
అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
రేగొండ: ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. బుధవారం రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో కలెక్టర్ రాహుల్శర్మ క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. సమయానికి పోలింగ్ ప్రారంభమై, ముగిసేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం లెక్కింపు పూర్తి చేసి పరిశీలకుల అనుమతితో విజేతలను ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రేగొండ మండల ప్రత్యేక అధికారి సునీల్ కుమార్, తహసీల్దార్లు శ్వేత, లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓలు వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, ఎంఈఓ రాజు, రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ -
ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలి
కాళేశ్వరం: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లను ఆదేశించారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్, సురా రం, మహదేవ్పూర్, కాళేశ్వరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రైతులు తీసుకొస్తున్న ధాన్యం తేమ శాతం రోజువారీగా నిర్ధారించి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలను తప్పనిసరిగా 24 గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తేమ శాతం నమోదు రిజిస్టర్, డైలీ ప్రొక్యూర్మెంట్ అప్డేషన్ రిజిస్టర్లను పరిశీలించి, రికార్డుల నిర్వహణలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమయానుకూల సంరక్షణకు సంబంధించి అవసరమైన సూచనలు జారీ చేశారు. అనంతరం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టును పరిశీలించారు. ఆయన వెంట పౌరసరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఎం రాములు, డీసీఓ వాలియానాయక్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
మొగుళ్లపల్లి: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఎస్పీ సంకీర్త్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలీంగ్ స్టేషన్లను బుధవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సందర్శించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సీపేట పోలింగ్ స్టేషన్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.పోలింగ్ స్టేషన్లను సందర్శించిన ఎస్పీ -
యాక్షన్ ప్లాన్ రెడీ!
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకుగాను 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగి పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు గాను 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకుగాను 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు శ్రీస్కివంశ్రీ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు గాను 4,550లు, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500లు, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు గాను 1,500 ఎకరాలకే ఈ సారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఆన్అండ్ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు సాగు నీరు ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు అందించేలా ప్రణాళిక గతేడాదితో పోలిస్తే తగ్గిన 1,16,938 ఎకరాలు వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలు 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్ -
జోరందుకున్న రెండో విడత ప్రచారం
భూపాలపల్లి రూరల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇప్పటికే పోటాపోటీగా ఓట్ల వేట ప్రారంభించారు. రెండోవిడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న జరగనుంది. ఓటింగుకు 48 గంటల ముందే ప్రచారం నిలిపి వేయాల్సి ఉంటుంది. దీంతో బహిరంగ ప్రచారానికి ఒకరోజే మిగిలింది. సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల తరపున జిల్లా నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పల్లెల్లో మైకులు, రికార్డింగ్ ఆడియోలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేయిస్తున్నారు. గెలుపు కోసం వాడవాడల్లో ప్రతీగడపకు తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు, యువత ఓట్లు అధికంగా ఉన్న చోట్ల వారిపై ప్రత్యేక దృష్టి సారించి మద్దతు కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో మద్దతుదారులతో కలిసి అందుబాటులో ఉన్న ఓటర్లను కలుస్తున్నారు. వలస ఓటర్లకు ఫోన్లు.. గ్రామాల నుంచి పలు నగరాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారిలో అనేకమంది ఓటర్లు ఉన్నారు. ఊళ్లో ఓటు ఉండి విద్య, ఉపాధి, ఉద్యోగ రీత్యా హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాలకు వలస వెళ్లారు. ఆ ఓటర్లకు అభ్యర్థులు ఫోన్లు చేస్తూ బరిలో ఉన్నామని చెబుతూ మద్దతు కోరుతున్నారు. పోలింగ్ రోజు ఓటేసేందుకు గ్రామానికి రావాలని ముందుగానే ఓ మాట చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి కిక్కు.. అనుచరులతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈసారి తప్పకుండా తమనే గెలిపించాలని కోరుతున్నారు. మహిళా అభ్యర్థుల పక్షాన భర్తలు మందుండి ప్రచారం చేస్తున్నారు. అనుచరులతోపాటు ఓటర్లకు దావతులు ఏర్పాటు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం.పంచాయతీ ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇస్ర్ట్రాగాం తదితర సామాజిక మాధ్యమాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తును వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసి విస్తృతంగా పాటలు, వీడియోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా పల్లెల్లో ఎన్నికలతో వాట్సాప్ గ్రూపులు నిండిపోతున్నాయి. వేగం పెంచుతున్న సర్పంచ్ అభ్యర్థులు రంగంలోకి జిల్లాస్థాయి నాయకులు ఇంటింటికీ వెళ్తూ ఓటు అభ్యర్థిస్తున్న నేతలుభూపాలపల్లి, టేకుమట్ల, చిట్యాల, పలిమెల పంచాయతీలు 75 వార్డు స్థానాలు 547 సర్పంచ్ అభ్యర్థులు 254 వార్డు సభ్యుల అభ్యర్థులు 1,463


