breaking news
Jayashankar
-
టీజీ ఎన్పీడీసీఎల్కు రూ.10 కోట్ల నష్టం
హన్మకొండ: మోంథా తుపాను ప్రభావంతో టీజీ ఎన్పీడీసీఎల్కు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ డివిజన్ పరిధిలోని నీట మునిగిన గోపాల్పూర్, యాదవనగర్ సబ్ స్టేషన్లను సందర్శించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎక్కడ విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని భారీ వర్షంలోనూ రేయింబవళ్లు పని చేసి సరఫరా పునరుద్ధరించామన్నారు. ఇప్పటి వరకు నీట మునిగిన 249 ట్రాన్స్ఫార్మర్లలో 246 పునరుద్ధరించామని, నీట మునిగిన 8 సబ్ స్టేషన్లలో 6 పునరుద్ధరించా మని, మిగతా 2 సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ వి ద్యుత్ సరఫరా అందించామని వివరించారు. 33 కే వీ ఫీడర్లు 44 ప్రభావితం కాగా 44 పునరుద్ధరించా మని,11 కేవీ ఫీడర్లు 116ల్లో సమస్యలు తలెత్తగా పరిష్కరించామన్నారు. 428 స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. తరచూ నీట మునిగే సబ్ స్టేషన్లను మా ర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం హనుమకొండ 100 ఫీట్ రోడ్లోని ప్రగతి నగర్ కాలనీ, మచిలీ బజార్ సెక్షన్ కాపు వాడలో జరుగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ డి.ఈ సాంబరెడ్డి, ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈ దర్శన్ కుమార్, ఎ.డి.ఈ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షంలోనూ వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
జఫర్గఢ్: రెండు రోజుల క్రితం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కోయినాచలం గ్రామ శివారులోని బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో గల్లంతైన యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడెపల్లికి చెందిన బరిగెల శివకుమార్ (ప్రేమికులు) బుధవారం రాత్రి బైక్పై జఫర్గఢ్ మండలం కోనాయిచలం వస్తుండగా మార్గమధ్యలో బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో పడ్డారు. చెట్టు కొమ్మల సాయంతో శివకుమార్ ప్రాణంతో బయటపడగా శ్రావ్య వరదలో కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం ఉదయం శ్రావ్య మృతదేహం నీటిపై తేలింది. గమనించిన పోలీసులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనాస్థలి వద్ద కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. -
రేపు ఎస్ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్
విద్యారణ్యపురి : ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ప్రత్యేక ప్రతిభా పరీక్ష సాట్ క్యూ ఎస్ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఎస్ఆర్ అకాడమీ చైర్మన్ వరదారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్ష ఇంటర్మీడియట్లో చేరబోయే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రం హనుమకొండలోని ఎస్ఆర్ ఎడ్యుసెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. సిలబస్ ఇలా ఉంటుందన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 10వ తరగతి స్థాయిలో మొత్తం 75 ప్రశ్నలు, ప్రతీ సబ్జెక్టుకు 25 మార్కులు ఉంటాయన్నారు. ఐఐటీ –జేఈఈ అండ్ నీట్లో కోచింగ్లో ప్రవేశం పొందే అర్హత ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ పరీక్షతో తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు ఉత్తమ స్కాలర్షిప్ అవకాశాలను పొందుతారన్నారు. పరీక్ష నమోదు కోసం విద్యార్థులు సమీపంలోని ఎస్ఆర్ బ్రాంచ్ లేదా 9642117378, 9154989356, 8886287456, 9154854700, 9642117330, 9642117830, 99642114698 నంబర్లలో సంప్రదించొచ్చని ఆయన తెలిపారు. -
మిన్నంటిన రోదనలు..
ఎంజీఎం/ కురవి : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారితోపాటు చికిత్స పొందుతున్న వా రిని చూసి గుండెలవిసేలా రోదించారు. హనుమకొండ–సిద్దిపేట ప్రధాన రహదారిపై హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో గురువారం అర్ధరాత్రి పెళ్లి వాహన్నాన్ని (బొలెరో) బోర్వెల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు రెడ్డబోయిన స్వప్న(15) అక్కడికక్కడే, రెడ్డబోయిన కళమ్మ(55), శ్రీనాథ్ (7) ఎంజీఎంలో చికిత్స పొందు తూ మృతి చెందారు. మిగతా 20 మందిలో 10మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని ఎంజీఎం తీసుకొచ్చారు. ఇందులో వృద్ధురాలు అనసూర్య, చిన్నారులు శివకుమా ర్, అక్షిత, సంజన, మారుతి చికిత్స పొందుతున్నా రు. మరో ఐదుగురు క్షతగాత్రులు ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. దీంతో బాధితులు ఎంజీఎం ఆస్పత్రిలో తమ వారిని చూసుకుని కన్నీరుమున్నీరుగా విలపించా రు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా పాలమాకుల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుటుంబం, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్పల్లికి చెందిన యువతితో కురవి లో మూడు రోజుల క్రితం వివాహం జరిపించారు. వధూవరులను తీసుకొని కుటుంబీకులు, బంధువులు బొలెరోలో తిరుగు ప్రయాణమయ్యారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారు ప్రాంతానికి చేరుకున్న సమయంలో కొందరు వాహనం దిగారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బోర్వెల్ వ్యాన్.. బొలెరోను ఢీకొంది. ఈ ఘటనలో స్వప్న అక్కడిక్కడే మృతి చెందగా, కళమ్మ, శ్రీనాథ్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదుగురు క్షతగ్రాతులు ఎంజీఎంలో, మరో ఐదుగురు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యాయం చేయాలని ధర్నా.. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్షతగాత్రుల బంధుమిత్రులు ఎంజీఎం ప్రధా న గేటు వద్ద ధర్నా నిర్వహించారు. మృతుల కు టుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎక్స్గ్రేషి యా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమయాని కి అక్కడికి చేరుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్కు ఘటనను వివరించి తమకు న్యా యం చేయాలని వేడుకున్నారు. అనంతర ఎమ్మె ల్యే.. వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్నారేతో కలిసి పోస్టుమార్టం గది ఉన్న మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.రోడ్డు ప్రమాద మృతులకు ఎంజీఎంలో పోస్టుమార్టం చికిత్స పొందుతున్న ఐదుగురు గుండెలవిసేలా రోదించిన బాధితులు న్యాయం చేయాలని ఆందోళన పరామర్శించిన వరంగల్ పోలీసు కమిషనర్, డోర్నకల్ ఎమ్మెల్యే క్షతగాత్రులను పరామర్శించిన వరంగల్ పోలీసు కమిషనర్..వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్న అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
రహదారులు ధ్వంసం
వరద తాకిడికి దెబ్బతిన్న వంద ఫీట్ల రోడ్డుహన్మకొండ: వరద తాకిడి కారణంగా హనుమకొండలోని వంద ఫీట్ల రోడ్డు మొత్తం ధ్వంసమైంది. గోపాల్పూర్ చెరువు నుంచి సమ్మయ్య నగర్ క్రాస్ వరకు రోడ్డు పూర్తిగా పాడైంది. వరద తాకిడికి కోతకు గురైంది. తారు లేచిపోయి అడ్డదిడ్డంగా పడింది. రహదారులపై గోతులు ఏర్పడ్డాయి. రూ.4 కోట్ల నష్టం వాటిల్లింది. రెండేళ్లు రోడ్డు మూసివేసి ఎంతో కష్టపడి, ప్రత్యేక శ్రద్ధ చూపి రోడ్డు నిర్మించామని, ఇప్పుడు ఆ రోడ్డును చూస్తే ఎంతో బాధేస్తోందని రహదారులు, భవనాల శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా హనుమకొండలోని గోకుల్ జంక్షన్ నుంచి ఇంజనీర్స్ కాలనీ వరకు నాలా రివిట్ వాల్ అక్కడ కూలిపోయింది. ప్రెసిడెన్సీ స్కూల్ ఎదురుగా నాలా పక్కన రోడ్డు కోతకు గురైంది. వంద ఫీట్ల రోడ్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాలనీల్లోనూ అంతర్గత రోడ్లు కోతకు గురయ్యాయి. -
పోక్సో కేసులో యువకుడికి 25 ఏళ్లు జైలు
మహబూబాబాద్ రూరల్ : పోక్సో కేసులో నేరం రుజువుకావడంతో ఓ యువకుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి టి.దేవా కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2018 నవంబర్ 1వతేదీన రాత్రి 10 గంటలకు కనిపించకుండా పోయింది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసముద్రం పోలీస్ స్టేషన్లో అప్పటి ఏఎస్సై వెంకటాద్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా విచారణ అధికారులుగా అప్పటి ఎస్సై బి.సతీశ్, మహబూబాబాద్ రూరల్ సీఐలు లింగయ్య, వెంకటరత్నం విచారణ అధికారులుగా వ్యవహరించారు. అప్పటి రూరల్ సీఐ జె.వెంకటరత్నం.. బాలిక కనిపించకుండాపోయిన ఘటనకు సంబంధించి కేసముద్రం మండలం కల్వల శివారు వెంకట్రాం తండాకు చెందిన భూక్య శ్రీనును అరెస్ట్ చేశారు. అప్పటి డీఎస్పీ నరేశ్ కుమార్ విచారణ అనంతరం కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సాక్షులను ప్రస్తుత డీఎస్పీ ఎన్.తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సీఐ పి.సర్వయ్య, కోర్టు లైజనింగ్ అధికారి, ఎస్సై జీనత్ బ్రీఫింగ్ ఇవ్వగా ప్రస్తుత కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారులు అశోక్ రెడ్డి, దేవా సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటయ్య వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ.. శ్రీనుకు 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పనికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు.. ● మొక్కజొన్న మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి ఇద్దరు కూలీలు మృతి ● ఏనుగల్లు శివారులో ఘటన పర్వతగిరి: పనికి వెళ్లొస్తూ ఇద్దరు కూలీలు తిరిగిరాని లోకాలకు చేరారు. మొక్కజొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు మాల్య తండాలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కథనం ప్రకారం.. మండలంలోని పంచరాయితండాకు చెందిన బానోత్ రాములు(57), బానోత్ హర్లా(48)తోపాటు మరికొంతమంది కూలీలు మొక్కజొన్న మిషన్లో పని చేయడానికి ఏనుగల్లు వెళ్లారు. పని పూర్తయిన అనంతరం అదే ట్రాక్టర్(నెంబర్ ప్లేట్ లేని)కు అమర్చిన మొక్క జొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్పై రాములు, హర్లా కూర్చున్నారు. ఈ క్రమంలో మాల్యాతండాకు చేరుకోగా ట్రాక్టర్కు ఉన్న బోల్డ్ ఊడడంతో ఇద్దరు కిందపడ్డారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన హర్లా అక్కడికక్కడే మృతి చెందాడు. రాములును హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై రాములు కుమారుడు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, తెలుగు సినీ దర్శకుడు వంగ సందీప్రెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. అర్చకులు భద్రకాళి శేషు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వరరావులు.. దర్శకుడు సందీప్రెడ్డికి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. సాయంత్రం దేవాలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది. -
విజిలెన్స్ అధికారులకు సహకరించాలి
హన్మకొండ: విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అక్టోబర్ 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం అడిషనల్ ఎస్పీ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో వివిధ ప్రభుత్వ శాఖల విజిలెన్స్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆయా శాఖల అధికారులు, పౌరులు తమ బాధ్యతగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సహకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలో అవకతవకలు, అవినీతి జరిగినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 14432కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేడు ఉదయం 6గంటలకు హనుమకొండ జేఎన్ఎస్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వాక్థాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొలని పిలుపునిచ్చారు. అనంతరం అధికా రులతో ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి.మల్లయ్య, ఇన్స్పెక్టర్లు బి.అనిల్కుమార్, కిశోర్, ట్రాన్స్ కోఇన్స్పెక్టర్ ఎం.డి.షాదుల్లా, ఏఓ ఎ.శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఎ.గౌతం, తహసీల్దార్లు లక్ష్మణ్, భాస్కర్, ఇంజనీర్లు విద్య, శ్రీనివాస్ నాయక్, మల్సూర్, యూనియన్ బ్యాంక్ విజిలెన్స్ ఆఫీసర్ కార్తీక్, టీజీఎస్ ఆర్టీసీ, ట్రాన్స్కో, కేటీపీఎస్, సివిల్ సప్లై, జీడబ్ల్యూఎంసీ, అటవీ శాఖ, డీసీసీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఏపీజీవీబీ, రవాణా శాఖ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రావు -
వరద ప్రభావిత బాధితులకు సీఎం పరామర్శ, భరోసా..
ఏరియల్ సర్వే తర్వాత హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు రోడ్డుమార్గాన మొదట సమ్మయ్య నగర్కు చేరుకున్నారు. వరద ప్రభావంతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి స్థానికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జరిగిన నష్టంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు. అక్కడే నాలా వంతెన వద్ద వరదకు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరదతో జరిగిన నష్టాన్ని పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి వివరించారు. అదేవిధంగా కాపువాడలో వరద ప్రభావం బారిన పడిన బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోతన నగర్లో వరద ముంపు బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. -
కోర్టులకు కొత్త భవనాలు
● జిల్లా కోర్టు సముదాయానికి నిధులు ● నేడు హైకోర్టు జడ్జి చేతుల మీదుగా శంకుస్థాపనభూపాలపల్లి అర్బన్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే తాత్కాలిక భవనాల్లో వసతులు లేకపోవడంతో సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించి.. న్యాయ నిర్మాణ్ ప్రణాళికలో భాగంగా జిల్లా న్యాయస్థానాల భవనాల నిర్మాణానికి రూ.81 కోట్లు కేటాయించింది. నేడు (శనివారం) హైకోర్టు జడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో 2020లో కోర్టులు ఏర్పాటుకాగా.. ఐదేళ్లుగా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కోర్టుల సంఖ్య 12కి పెరిగినా సొంత భవనాలు లేకపోవడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇబ్బందులుపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హైకోర్టు జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.81 కోట్లతో ఆధునిక భవనాలు.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో కోర్టు భవనాలు నిర్మించనున్నారు. ఇందులో 60 శా తం కేంద్రం, 40 శాతం రాష్ట్రం నిధులను భరిస్తా యి. జిల్లా కోర్టు సముదాయానికి రెవెన్యూ అధికా రులు 11.20 ఎకరాల భూమిని కృష్ణకాలనీ సమీ పంలో కేటీకే 6వ గని వద్ద కేటాయించారు. ఈ భవనాలు నాలుగు అంతస్తులతో, సెల్లార్తో ఆధునిక డిజైన్లో నిర్మిస్తారు. సెల్లార్లో 88 కార్లు, 62 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతీ అంతస్తు 43 వేల నుంచి 44 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో, మొత్తం కోర్టు భవనం 2,87,743.58 చదరపు అడుగులు ఉండేలా నిర్మించనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ భవనంలో ఫ్యామిలీ, పోక్సో కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారు. 2027 నాటికి పూర్తి నేడు హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ అపరేష్కుమార్సింగ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనుండగా.. హైకోర్జు జడ్జిలు ఈవీ వేణుగోపాల్, నామవరపు రాజేశ్వర్రావు పాల్గొననున్నారు. ఇప్పటికే కోర్టు భవనాల నిర్మాణ టెండర్ ప్రక్రియ పూర్తయింది. పనులు ప్రారంభమైన 24 నెలల్లో పూర్తిచేయాలని ఉన్నత న్యాయస్థానం లక్ష్యంగా నిర్ధారించింది. ఈ భవనాలు ఆధునిక సౌకర్యాలతో, తూర్పు అభిముఖంగా, విశాలమైన గాలి, వెలుతురు సౌకర్యాలతో నిర్మిస్తారు. నిర్మాణానికి సంబంధించిన మోడల్ స్టక్చ్రర్ ఇప్పటికే సిద్ధమైంది. -
చేజారిన పంట
శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025నిండా ముంచిన మోంథా తుపాను ● జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పంట నష్టం ● అధికారుల అంచనా ప్రకారం 3,704 ఎకరాలే.. ● పత్తి, మిర్చి, వరికి కోలుకోలేని దెబ్బ ● ఆందోళనలో అన్నదాతలుభూపాలపల్లి: మోంథా తుపాను జిల్లా రైతులను నిండా ముంచింది. పంటలు చేతికొచ్చే సమయంలో కురిసిన వానలతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. పత్తి, మిర్చి, వరిపంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పంటనష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు పత్తి 98,260 ఎకరాలు, వరి 1,14,653, మిర్చి 22 వేల ఎకరాల్లో సాగు చేశారు. పత్తిపంట సాగు చేసిన రైతులకు ఆది నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. గింజలు నాటాక సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రెండు, మూడుసార్లు గింజలు కొనుగోలు చేసి పోగుంటల్లో విత్తాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతరం పత్తి పూత, కాత దశలో ఉన్న సమయంలో సెప్టెంబర్ 28, 29 తేదీల్లో వర్షాలు కురిశాయి. దీంతో ఏరేదశలో ఉన్న పత్తి నల్లబారింది. కాయలు మురిగిపోయాయి. పూత రాలిపోయింది. దీంతో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే మోంథా తుపాను రావడంతో ఉన్న పంట సైతం పూర్తిగా దెబ్బతింది. కాయలు, పూత రాలిపోవడంతో అయోమయంలో పడ్డారు. చేసేదిలేక పత్తిపంటను పూర్తిగా తొలగించి మొక్కజొన్న సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే తుపాను ప్రభావం జయశంకర్ జిల్లాపై తక్కువగానే చూపింది. తుపాను కారణంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. పత్తి, మిర్చి, వరిపంటలు దెబ్బతిన్నాయి. వర్షం, ఈదురుగాలులకు మిర్చి మొక్కలు, వరిపైరు నేలవాలింది. కాగా, జిల్లా అధికారులు దెబ్బతిన్న పంటలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలోని ఆరు మండలాల్లోని 59 గ్రామాలకు చెందిన 2,524 మంది రైతుల పత్తి, వరి పంటలు 3,704 ఎకరాల్లో దెబ్బతిన్నట్లుగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. కాగా అధికారులు పూర్తి స్థాయిలో క్షేత పర్యటన చేస్తే పంటనష్టం అంచనా పెరిగే అవకాశం ఉందని ప్రజలు, రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఉద్యానవనశాఖకు సంబంధించి 54 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. రేగొండ మండలంలో 25, గోరికొత్తపల్లి మండలంలో 24 ఎకరాల్లో మిర్చిపంట, రేగొండ మండలంలో 3 ఎకరాలు, గోరికొత్తపల్లిలో రెండెకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సునీల్ వెల్లడించారు. కాగా కాటారం డివిజన్ పరిధిలోని మహదేవపూర్, కాటారం మండలాల్లో సైతం మిర్చి పంట పాక్షికంగా దెబ్బతింది.మండలం వరి పత్తి మొత్తం టేకుమట్ల 1,445 4 1,449 కొత్తపల్లిగోరి 106 0 106 మల్హర్ 289 0 289 చిట్యాల 150 0 150 మొగుళ్లపల్లి 1,341 0 1,341 మహదేవపూర్ 180 189 369 మొత్తం 3,511 193 3,704 -
కాకతీయుల శిల్పసంపద అద్భుతం
ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రమేష్బాబు గణపురం: కాకతీయుల పాలనలో నిర్మించిన ఆలయాల శిల్పసంపద ఎంతో అద్భుతమని, ఈ వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి చిట్టూరి రమేష్బాబు అన్నారు. కార్తీక శుక్రవారం సందర్భంగా ఆయ న కోటగుళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుధ్రాభిషేకం చేశారు. ఆలయంలో పూజల అనంతరం ఆయనకు అర్చకులు నాగరాజు శాలువా, పూల దండలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు. హారతి వేదికకు గొడుగు ఏర్పాట్లు కాళేశ్వరం: ఈ ఏడాది మే నెలలో కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాల సమయంలో కాశీపండితులచే అట్టహాసంగా గోదావరిహారతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. పుష్కరాల సమయంలో ఏడు హారతి వేదికలు నిర్మించారు. ప్రస్తుతం ఏడు వేదికలపై తొమ్మిది హారతులను ఇచ్చేందుకు గొడుగు ఏర్పాట్లు చేస్తున్నారు. సరస్వతీనది పుష్కరాల నుంచి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతి రోజు మూడు హారతులతో హారతి కార్యక్రమాన్ని దేవస్థానం పండితులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్తీకమాసంలో ముఖ్యమైన పంచరత్నాల్లో భాగంగా (నేడు) శనివారం నుంచి పౌర్ణమి వరకు పంచతర్న హారతి కార్యక్రమం ఉండనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఇనుముతో గొడుగులు ఏర్పాటు చేస్తున్నారు. పనులను ఈఓ మహేష్ పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం పూర్తి చేయాలి రేగొండ: ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయాలు అందించేందుకు నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ అన్నారు. మండలంలోని సుల్తాన్పూర్, చెన్నాపూర్, మడ్తపల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి చిరంజీవి, మండల వైద్యాధికారి హిమబిందు ఉన్నారు. అసంక్రమిత వ్యాధులపై అవగాహన చిట్యాల: మండలంలోని ఒడితల పీహెచ్సీలో అసంక్రమిత వ్యాధులపై ఏఎన్ఏంలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్ఓ మధుసూదన్ హాజరై మాట్లాడారు. అసంక్రమిత వ్యాధులు అంటు వ్యాధులు కావని అన్నారు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. మానవ జీవన శైలి, ఆహార అలవాట్లు జన్యపరంగా సంక్రమిస్తాయని వివరించారు. అనంతరం ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా ఏఎన్ఎంల పని తీరు పరిశీలించి మరింత మెరుగు పరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్, పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక, ఏఎన్ఏంలు పాల్గొన్నారు. -
భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహు ల్ శర్మ అధికారులను ఆదేశించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాలువల నిర్మాణానికి భూసేకరణ, ఎంజాయ్మెంట్ సర్వేపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా కంపెనీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెనాల్స్ నిర్మాణానికి మొత్తం ఎంత మంది రైతుల భూములు ప్రభావితం అవుతున్నాయి.. ఎన్ని ఎకరాల భూమి అవసరం అవుతుందనే అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రైతులకు పరిహారమందించే ప్రక్రి య పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. రైతులతో చర్చలు జరిపి, భూసేకరణకు సంబంధించిన సమాచారం స్పష్టంగా వివరించాలని చెప్పారు. రెవెన్యూ రికార్డుల్లో వచ్చే మార్పులను సమన్వయంతో నమోదు చేయాలని సూచించారు. దేశ సమగ్రతను కాపాడాలి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరు దేశ సమగ్రతను కాపాడాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమానికి ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది టేకుమట్ల: వర్షాలకు తడిసిన ధాన్యం, దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మండల కేంద్రంతోపాటు, మండలంలోని కుందనపల్లి, ఎంపేడులో తుపానుతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
కాటారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదన పు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని ధన్వాడ, శంకరాంపల్లి, రేగులగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి, బిల్లుల చెల్లింపు వివరాల గూర్చి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ని ర్మాణాల స్థితిగతులపై మండల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరికాటారం: రైతులు, పశుపోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ముందస్తుగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి అన్నారు. కాటారంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. మండలంలో ఎన్ని పశువులకు టీకాలు వేశారు. టీకాల ప్రక్రియ నిర్వహణపై ఆరా తీశారు. పశువైద్యులు, సిబ్బంది అన్ని గ్రామాల్లోని పశువులకు టీకాలు వేయాలని ఆదేశించారు. గాలికుంటు వ్యాధి లక్షణాలపై పశుపోషకులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండల పశువైద్యాధికారి రమేశ్, డాక్టర్ ధీరజ్, పశువైద్య సహాయకులు తుంగల రాజశేఖర్, గోపాలమిత్ర శ్రీనివాస్, పశుమిత్ర నజీమా పాల్గొన్నారు. పశువులకు టీకా వేయించాలి కాళేశ్వరం: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి అన్నారు. మహాదేవపూర్ మండలంలో కొనసాగుతోన్న గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. టీకా ప్రక్రియను, కోల్డ్ చెయిన్ నిర్వహణను, చెవి పో గుల ప్రక్రియను, భారత్ పశుధాన్ మొబైల్ యాప్ లో ఆన్లైన్ అప్లోడ్ విధానం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. గాలికుంటు నివారణ టీకా పశువులను వైరల్ వ్యాధుల నుంచి రక్షించడంలో, రైతుల ఆర్థిక నష్టాలను నివారించడంలో ఉపకరిస్తుందన్నారు. పశువైద్య సహాయ శస్త్ర వైద్యుడు రాజబాపు, పారా స్టాఫ్ తిరుపతి, నాగభూషణం, గోపాల మిత్రులు రాజబాపు, బాన య్య, సిబ్బంది లక్ష్మణ్, లావణ్య, రమేశ్ ఉన్నారు. -
ఆక్రమణలపై ఉక్కుపాదం
● ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు ● వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం● చెరువులు, నాలాల ఆక్రమణల వల్లే తరచూ నగరం ముంపు ● పది మంది స్వార్థం.. వేల ఇళ్ల మునకకు కారణం.. ● స్మార్ట్ సిటీ నిధులను సద్వినియోగం చేయండి.. ● అధికారులకు సీఎం దిశానిర్దేశం ● వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే ● ముంపు కాలనీల వాసులకు పరామర్శ ● హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని, చెరువులు, నాలాల ఆక్రమణలు కూడా ముంపునకు కారణాలని, ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలతో జరిగిన పంటలు, ఆస్తి, ప్రాణనష్టాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో జిల్లాల కలెక్టర్లు సమీక్ష నిర్వహించి ఆ నివేదికలను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలని సూచించారు. చెరువులు, నాలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. మోంథా తుపాను వరదలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ హాల్లో ముఖ్యమంత్రి.. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలి సి రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అధికా రులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో జరిగిన నష్టం అంచనాపై ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. పంట ఆస్తి ప్రాణ నష్టాలపై నిర్ధిష్ట నమూనాలో అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు. శాశ్వత పరిష్కారం చూడాలి.. ఆక్రమణలు తొలగించాలి.. వరంగల్ నగరం ముంపుపై శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని, అన్ని విభాగాల అధికారులు కలిసి పనిచేయాలన్నారు. నాలాల కబ్జాలను తొలగించాల్సిందేనని.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దన్నారు. దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని, ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో ఒక కో–ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలని, వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైందని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాగా, హనుమకొండ , వరంగల్ జిల్లాలు, గ్రేటర్ వరంగల్లో నష్టాన్ని ముఖ్యమంత్రి, మంత్రులకు కలెక్టర్లు స్నేహ శబ రీష్, డాక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్పాయ్లు వివరించారు. సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, రాష్ట్రస్థాయి అధికారులు, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్, మహబూబాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు అద్వైత్కుమార్ సింగ్, రిజ్వాన్ బాషా అధికారులు పాల్గొన్నారు. -
కదిలిస్తే కన్నీరే..
జిల్లాలో పంటలు వర్షార్పణం● అన్నదాతలను ముంచేసిన మోంథా తుపాను ● వరి, పత్తి, మిరప పంటలకు నష్టంమోంథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీవర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. చేతికొచ్చిన పంట కళ్లముందే వర్షార్పణమైంది. వరిచేలు నీట మునిగాయి. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి రాలిపోవడమే కాకుండా నల్లబడిపోయింది. మిరప పంటకూ తీవ్ర నష్టం వాటిల్లింది. భారీవర్షంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆరుగాలం శ్రమించి కష్టపడి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని కోరుతున్నారు. -
కోటగుళ్లలో అదనపు కలెక్టర్ పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని చెప్పారు. ఆమె వెంట ఎంపీఓ శ్రీనివాస్ ఉన్నారు. భూపాలపల్లి: సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని నేడు(శుక్రవారం) రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, యువత, ప్రజలు, వ్యాపారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే కోరారు. భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షకు 60 మంది దరఖాస్తు చేసుకోగా 39 మంది, ఇంటర్మీడియట్ పరీక్షకు 76 మంది దరఖాస్తు చేసుకోగా 54 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. రీ వెరిఫికేషన్ కోసం నవంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒక్కో సబ్జెక్ట్కు రూ.1200 చెల్లించాల్సి ఉంటుదని తెలిపారు. వివరాలకు స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. భూపాలపల్లి అర్బన్: నిత్య జీవితంలో నీతి నిజాయితీగా ఉండటమే కాకుండా పారదర్శకంగా సేవలందించాలని సింగరేణి సంస్థ మాజీ సీఎండీ వీఎన్ శర్మ, విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ కోరారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సింగరేణి సీఎండీ బలరాం వారితో కలిసి గురువారం సింగరేణి భవనం నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజిలెన్స్ వారోత్సవాలు కేవలం వారం రోజులకు పరిమితం కాకుండా నిబద్ధతతో పని చేయాలన్నారు. ప్రతీ వ్యక్తి కేవలం వృత్తి జీవితంలో కాకుండా నిత్య జీవితంలోనే నీతి, నిజాయితీలో అత్యున్నత ప్రమాణాలను పాటించినప్పుడే అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేయడమే కాకుండా ప్రజలకు పారదర్శక సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, అధికారులు ఎర్రన్న, జోతి, రవీందర్, రాజేశ్వర్, శైలెంద్రకుమార్, మారుతి, పోషమల్లు పాల్గొన్నారు. చిట్యాల: మండలంలోని అంగన్వాడీ టీచర్స్ సమయపాలన పాటించాలని జిల్లా ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ మల్లేశ్వరి అన్నారు. గురువారం మండలంలోని నైన్పాక సెక్టార్లోని ఒడితల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్లేశ్వరి హాజరై మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు కచ్చితంగా సమయపాలన పాటించాలని కోరారు. ఆయాలు క్రమం తప్పకుండా పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. పిల్లలకు ఫ్రీ స్కూల్ కార్యక్రమాలన్నీ ఆటాపాట, కథల ద్వారా నేర్పించాలని అన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. ఆన్లైన్ వర్క్స్ ఎప్పటికప్పడు పూర్తి స్ధాయిలో చేయాలని చెప్పారు. అనంతరం ఇద్దరు పిల్లలకు అన్నప్రసాన చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు పాల్గొన్నారు. -
విద్యావిధానంలో నాణ్యత పెంపునకు కృషి
భూపాలపల్లి: విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని విద్యా విధానాల్లో నాణ్యత పెంపునకు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మధ్యాహ్న భోజనం, ఆధార్ నమోదు, విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, ఆహార నాణ్యత తనిఖీలు, పీఎం శ్రీ పనుల పురోగతి, భవిత తదితర కార్యక్రమాలపై గురువారం కలెక్టర్ చాంబర్లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, హాజరు, మధ్యాహ్న భోజన పథక అమలు, డిజిటల్ విద్య, ఫలితాల విశ్లేషణ వంటి అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు క్రమం తప్పక పాఠశాలలు తనిఖీ చేయాలని సూచించారు. ఆ అంశాలపై నివేదికలు పోర్టల్లో నమోదు చేయాలని తెలిపారు. యూ డైస్ నివేదిక ప్రకారం 26 బాలుర, 13 బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 24 బాలురు, 14 బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉపయోగకరంగా లేవని ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఈ పాఠశాలలకు ప్రతిపాదనలు ఇవ్వాలని గత సమావేశంలో చెప్పానని ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల హాజరును రోజువారీగా పర్యవేక్షించాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచేలా టీచర్లు ప్రత్యేక పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పెంపొందించాలని అన్నారు. పాఠశాలల నిర్వహణ ఖర్చులకు ధృవీకరణ నివేదికలు ఇవ్వాలని తెలిపారు. తన పర్యటనలో కంప్యూటర్స్ పరిశీలించానని, చాలాచోట్ల పనిచేయడం లేదని, మరమ్మతులు నిర్వహించి విద్యార్థులకు ఉపయోగంలోకి తేవాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ఏడాదిన్నరగా ఎదురుచూపు
కాళేశ్వరం: కాళేశ్వరం ట్రస్టుబోర్డు(పాలకవర్గం) నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్థానిక ఎన్నికల తరువాతే నియామకం జరుగుతుందని ఆశించినప్పటికీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఆశావహులకు నిత్యం మంత్రి శ్రీధర్బాబు చుట్టూర ప్రదక్షిణలు తప్పడం లేదు. ప్రభుత్వం పాలకవర్గానికి నోటిఫికేషన్లు వేయడం, రద్దు చేస్తుండడంతో ఆశావహులు, భక్తులు అయోమయంలో పడుతున్నారు. పెరిగిన ఆదాయం.. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కాళేశ్వరం ఒకటి. కాళేశ్వరాలయం వార్షికాదాయం రూ.6కోట్లకు చేరింది. దీంతో ఇటీవల దేవాదాయశాఖ 6ఏ ఆలయం నుంచి ఏసీ(అసిస్టెంట్ కమిషనర్) హోదా పెంపుపై ఈఓకు పత్రాలు అందించారు. దీంతో ఆదాయ, వ్యయాలు, ఉద్యోగుల సంఖ్య, ఇతర వ్యవహారాలన్నీ కమిషనర్ కార్యాలయానికి పంపారు. ఏసీ హోదా పెరిగితే క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ఉద్యోగులు, ఇతర సౌకర్యాలు మెరుగవుతాయి. ప్రస్తుతం గ్రేడ్–2 ఈఓ ఆలయంలో విధులు నిర్వర్తిస్తుండగా.. ఏసీ స్థాయి పెరిగితే ఐఏఎస్ స్థాయి అధికారి ఈఓగా వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో ఆలయ అభివృద్ధి జరగనుంది. ఆ స్థాయిలో ఉండే చైర్మన్, పాలకవర్గం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి శ్రీధర్బాబు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. 3వ సారి కూడా.. ఆగస్టు 21న రీ నోటిఫికేషన్కు దేవాదాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 14మంది డైరెక్టర్లు, ఒక ఎక్స్అఫీషియో మెంబర్(అర్చక)తో 15 మంది సభ్యులతో నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో 20 రోజు ల గడువుతో ఆశావహులు దరఖాస్తు చేశారు. వా రిపై పోలీసు విచారణ కూడా పూర్తి చేశారు. సుమారుగా 30మంది వరకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. కానీ ఇప్పటికీ పాలకవర్గం నియామకంపై ఎ లాంటి ఉత్తర్వులు రాకపోవడంతో మూడవసారి కూడా నీలినీడలు వెంటాడుతున్నాయి. త్వరగా పా లకవర్గం నియమిస్తే ఆలయ అభివృద్ధి జరిగి, ఆ లయ వ్యవస్ధ బాగుపడుతుందని భక్తుల నమ్మకం. అస్తవ్యస్తంగా.. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులకు మధ్య సమన్వయ లోపం ఉంది. వారిపై అజమాయిషీ చేసి భక్తులకు సేవలందించే పాలకవర్గం లేకపోవడంతో ఇష్టారీతిన ఆలయ వ్యవస్థ కుంటుపడుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఎవరికీ సమయ పాలనపై పట్టింపు లేదు. కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గం ఏర్పాటుపై మాకు సమాచారం లేదు. ఆశావహులు దరఖాస్తులు చేశారు. వారిపై పోలీసు విచారణ జరిగింది. ఎప్పుడు ఉత్తర్వులు వస్తాయనేది తెలియదు. – ఎస్.మహేష్, ఈఓ, కాళేశ్వరం దేవస్థానంకాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది ఆగస్టులో ట్రస్టుబోర్డు నియామకానికి దేవాదాయ శాఖ నోటిఫికేషన్ వేసింది. అప్పుడు 20 రోజుల నిర్ణీత గడువులోగా 40 వరకు దరఖాస్తులు దాఖలయ్యాయి. అనివార్య కారణాలతో ఆ ఉత్తర్వులు రద్దుచేశారు. తరువాత ఈ ఏడాది జనవరి 5న ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మళ్లీ రీ నోటిఫికేషన్ను దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆశావహుకులు 90కి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన కుంభాభిషేకానికి ట్రస్టుబోర్డు వేస్తారని ఆశించి భంగపడ్డారు. అదే నెలలో ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఈ రెండు ఉత్సవాలకు ట్రస్టుబోర్డు ఉంటుందని సంబరపడ్డ నేతలకు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు తగిలింది. రూ.6కోట్లకు ఆలయ వార్షికాదాయం 3వ సారీ ఆశావహులకు నిరాశేనా.. -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
మొగుళ్లపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం ఆమె పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను తీసుకొని నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అన్ని విధాలుగా తోడ్పడుతుందన్నారు. అలాగే మండల కేంద్రంలోని ఎంజేపి గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందజేస్తున్న మెనూను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ లక్ష్యంతో కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకి విద్య ప్రాముఖ్యతను వివరించారు. స్టాక్ రూం, డైనింగ్హాల్ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీఓ సురేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ శారద, పంచాయతీ కార్యదర్శి నరేష్ ఉన్నారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఏక్యూ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై బుధవారం ఆయన కలెక్టరేట్లో రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు ఎఫ్ఏక్యూ నిబంధనలు అనుసరించి కొనుగోలు చేపట్టాలన్నారు. ఈ సీజన్లో 44,396 హెక్టార్లలో వరి పంట సాగు అయిందని.. దాదాపు 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చ అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులు, మిల్లర్లకు సూచించారు. కొనుగోలు జరిగిన వెంటనే ఏపీఎంలు, సహకార సంఘాల సీసీలు రైతుల వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలని, గరిష్టంగా 48 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమయ్యేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యాన పంటలపై అవగాహన పెంచాలి జిల్లాలో ఉద్యాన పంటలపై మరింత అవగాహన పెంచాలని, రైతులకు సాంకేతిక సమాచారం సమయానుకూలంగా చేరేలా ఉద్యానదర్శిని పుస్తకాలు ఉపయోగపడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులకు ఉద్యాన దర్శిని పుస్తకా లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో రైతులకు ఆధునిక పద్ధతులు, పంట సంరక్షణ, మార్కెట్ సదుపాయాలు, రాయితీల వివరాలు క్షేత్రస్థాయిలో విస్తరణాధికారులు రైతులకు తెలియజేయాలన్నారు. ఉద్యానదర్శిని పుస్తకంలోని సమాచారాన్ని గ్రామస్థాయికి చేర్చి ప్రతి రైతును ప్రయోజనవంతులను చేయాలని సూ చించారు. డీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉద్యాన, వ్యవసాయ, సహకా ర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కోఆపరేటివ్ అధికారి వాలియా నాయక్ మాట్లాడుతూ.. ప్రతీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)కు గౌరవ ఏపీసీ నిర్దేశించిన విధంగా 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, మండలాల వారీగా రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారులు పథకాల లక్ష్యాలు, రాయితీలు, ప్రయోజనాలు, రైతులకు అందే లబ్ది గురించి ప్రజెంటేషన్ రూపంలో వివరణ ఇచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్, పౌరసరఫ రాల అధికారి కిరణ్కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియానాయక్, వ్యవసాయ అధికా రి బాబురావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
చోరీకి పాల్పడ్డ ఇద్దరి అరెస్టు
గణపురం: మండలంలోని నగరంపల్లి గ్రామానికి చెందిన తండ్రి, కుమార్తె గుర్రం శ్రీనివాస్, గుర్రం సౌజన్య దొంగలించిన బంగారాన్ని విక్రయించడానికి వెళ్తుండగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గణపురం ఎస్ఐ అశోక్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల కట్టయ్య ఇంట్లో ఈఏడాది జూన్లో చోరి జరిగిందని గణపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గుర్రం సౌజన్య, గుర్రం శ్రీనివాస్లు 1.9 గ్రాములు బంగారు ఉంగరం, 6 గ్రాముల బంగారు కమ్మలు విక్రయించడానికి పరకాలకు తీసుకెళ్తుండగా నగరంపల్లి క్రాస్ వద్ద అనుమానం వచ్చి విచారించగా తాము తమ బంధువైన కట్టయ్య ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. గతంలో పరకాలలో శ్రావణ్ జ్యూవలరీ షాప్ ఓనర్ శ్రావణ్కు 2.1 తులాల నెక్లెస్ విక్రయించినట్లు తెలిపారు. ఈక్రమంలో మిగతా సొమ్మును విక్రయించడానికి వెళ్తున్నట్లు తేలడంతో వారి వద్ద ఉన్న బంగారం స్వాధీనం చేసుకొని వీరితోపాటు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
జిల్లాను తాకిన మోంథా తుపాను
భూపాలపల్లి అర్బన్: మోంథా తుపాను బుధవారం జిల్లాను తాకింది. బుధవారం ఉదయం నుంచి జిల్లాలో ఈదురుగాలులు వీచాయి. మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చిరుజల్లులు మొదలయ్యాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ముసురుతో జిల్లా తడిసి ముద్దయింది. పత్తి, మిర్చి, వరి పంటలు వర్షంతో తడిసిపోయాయి. పత్తి, మిర్చి పూత రాలిపోయింది. వరి పైరు నెలవాలింది. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్– 2, 3, తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ల్లో రెండో షిఫ్టులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మోంథా తుపాను ప్రభావం నేపథ్యంలో భద్రత చర్యలో భాగంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం టెలికాన్ఫరెన్ఫ్ నిర్వహించి అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, వ్యవసాయశాఖ, జిల్లా వైద్యాధికారి, ఆస్పత్రుల సమన్వయం అధికారి, విద్యుత్, విద్యా, ప్రణాళిక, సంక్షేమశాఖ అధికారులు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాల దృష్ట్యా అత్యవసర చర్యలు, సహాయక చర్యలు, ప్రమాద నివారణ చర్యలపై సూచనలు జారీ చేశారు. జిల్లాలో వాగులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలు, ప్రమాద సూచన కేంద్రాలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు. మోంథా తుపాను ప్రభావం దృష్ట్యా భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు(గురువారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్శర్మ వెల్లడించారు. వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకొని విద్యార్థులు, చిన్నారుల భద్రతా చర్యలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బంది తమ పరిధిలోని విద్యార్థులకు సమాచారం అందించాలని తెలిపారు. మండలం వర్షపాతం రేగొండ 69.5 కొత్తపల్లి గోరి 65.5 మొగుళ్లపల్లి 40.8 టేకుమట్ల 29.8 చిట్యాల 26.0 భూపాలపల్లి 20.0 మల్హర్రావు 16.9 గణపురం 14.5 మహాముత్తారం 12.8 కాటారం 6.9 మహదేవపూర్ 5.8 పలిమెల 1.3 బుధవారం ఉదయం నుంచి మొదలైన ముసురు ఓపెన్కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి వర్షం నేపథ్యంలో నేడు విద్యాసంస్థలకు సెలవు భూపాలపల్లి రూరల్: మోంథా తుపాను ప్రభావంతో బుధవారం జిల్లా కేంద్రంలో ముసురు వర్షం కురవడంతో చిరువ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. అంబేడ్కర్ సెంటర్ బోసిపోయింది. తుపాను మరో రెండు, మూడు రోజులపాటు కొనసాగనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కాగా, బుధవారం జిల్లాలో 25.8 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. -
మరింత శక్తివంతంగా..
భూపాలపల్లి రూరల్ : మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో వారికోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికలతో కొత్తగా మహిళా సంఘం గ్రూపులు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ బ్యాంక్ రుణాలు అందించేలా కృషి చేస్తున్నారు. గతంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు 60 ఏళ్లు దాటితే వారిని గ్రూపులోంచి తొలగించేవారు. ప్రస్తుతం ఉన్నవారిని అలాగే ఉంచాలని, లేకుంటే వారికి ఒక ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందుకుతగిన చర్యలు చేపడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఆనందం.. గతంలో 60 ఏళ్లు దాటాయంటే మహిళలను గ్రూపు నుంచి తొలగించేవారు. దీంతో వారు పొదుపు చేసుకునే అవకాశం ఉండేదికాదు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందించే పథకాలు వర్తించేవి కాదు. తాజాగా ప్రభుత్వం కచ్ఛితంగా వృద్ధులకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని ఆదేశించడంతో ఆదిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రా మ మహిళాసంఘాల ఆధ్వర్యంలో కొత్తగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితో పాటు 15 నుంచి 18 ఏళ్ల మధ్య బాలికలతో కూడా సంఘాలను ఏర్పాటు చేసి వారికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు, సామాజిక మాద్యమాల ద్వారా మోసాలు, అత్యాచారాలు, ఇతరత్రా అంశాలపై వారికి చై తన్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దివ్యాంగుల కోసం సైతం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 12 మంది ఉంటే వారికి ఒక గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. వీరందరికీ బ్యాంక్ రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో రుణాలు.. ఈనెల 12వ తేదీనుంచి 14వ తేదీ వరకు గ్రామాల వారీగా జాబితా రూపొందించి మహిళా సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, బాలికలను గుర్తించారు. 56 నూతన మహిళ (వృద్ధులు)లను సంఘాలు 449 సభ్యులుగా చేర్చారు. అదేవిధంగా 24 దివ్యాంగుల సంఘాల్లో 67 మంది సభ్యులను చేర్చారు. వారికి సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనం గురించి వివరించారు. సంఘాల్లో చేరిన సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేసి, వారికి బ్యాంకుల నుంచి రుణాలు అందించనున్నారు. మండలం సంఘాలు సభ్యులు భూపాలపల్లి 787 8,162 చిట్యాల 799 8,215 గణపురం 802 8,365 కాటారం 865 8,787 మహదేవపూర్ 752 7,722 మల్హర్రావు 690 7,060 మొగుళ్లపల్లి 809 8,640 మహాముత్తారం 663 6,716 పలిమెల 169 1,753 రేగొండ 1,201 13,590 టేకుమట్ల 602 6,176 మొత్తం 8,139 85,186 వృద్ధులు దివ్యాంగులు, కిశోర బాలికలతో గ్రూపుల ఏర్పాటు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చేలా చర్యలు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్న అధికారులు జిల్లాలో మహిళా సమాఖ్య సంఘాలు 8,139 సంఘాల్లో సభ్యులు 85,186 మంది -
‘దామిని’తో అప్రమత్తం
రేగొండ: రైతులు తమ పంట పొలాల్లో సాగు చేస్తున్న క్రమంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడే సమయంలో పిడుగులు పడి ప్రాణాలు కోల్పోతుంటారు. పిడుగుపాటును ముందే గ్రహించి అప్రమత్తమై ప్రాణపాయం నుంచి తప్పించుకునేందుకు భారత వాతావరణ శాఖ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న భారతీయ ఉష్ణ మండల శాసీ్త్రయ మెటారాలజీ ఇనిస్టిట్యూట్ (ఐఐటీఎం–పూణే), భూ వ్యవస్థ విజ్ఞాన సంస్థ (ఈఎస్ఎస్ఓ) ద్వారా దామిని యాప్ను అభివృద్ధి చేశారు. యాప్ పని విధానం దామిని యాప్ జీపీఎస్ లోకేషన్ ఆధారంగా పని చేస్తుంది. మీరు పని చేసే ప్రాంతానికి గరిష్టంగా 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉంటే ముందే నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ సమాచారం మూడు గంటల ముందుగానే అలెర్ట్ రూపంలో రావడంతో పిడుగుపాటుతో ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రత తగ్గే అవకాశం ఉంది. రంగుల సంకేతం ఇలా.. ఎరుపు రంగు : ఏడు నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. పసుపు రంగు : మరో 10 –15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే సర్కిల్ పసుపు రంగులోకి మారుతుంది. నీలం రంగు : 15 – 25 నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే సర్కిల్ నీలం రంగులోకి మారుతుంది. ఎలా ఉపయోగించాలంటే.. ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్లో దామిని లైటింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత పేరు, మొబైల్ నంబర్, అడ్రస్ పిన్కోడ్తో రిజిష్టర్ చేసుకోవాలి. జీపీఎస్ లోకేషన్ తెలుసుకునేందుకు యాప్కు అనుమతివ్వాలి. మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో.. లేదో.. తెలుసుకునేందుకు వీలుగా మూడు రంగులను చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరున్నచోట ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తోంది. పిడుగుపాటును ముందే గుర్తించే ప్రత్యేక యాప్ యాప్లో మూడు రంగుల ద్వారా సంకేతాలు -
ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించాలి
ఎస్ఎస్తాడ్వాయి: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మెనూ తప్పనిసరిగా పాటించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశించారు. మండల పరిధిలోని ఊరట్టం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్ట్నగర్, కర్లపల్లిలో ని ఆశ్రమ పాఠశాలలను పీఓ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని టాయిలె ట్లు, నీటి సరఫరా, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, ఫ్యాన్లు, డ్రైయినేజీ, నీటి ఎద్దడి సమస్యలపై వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ తుపాను కారణంగా గిరిజన సంక్షేమశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు వి ద్యుత్ స్తంభాలకు తగలకుండా చూడాలని సూచించారు. అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్లొద్దని వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై వైద్యాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏఎన్ఎంలు 24 గంటలు అందుబా టులో ఉండాలని ఆదేశించారు. మార్గదర్శకాల ప్ర కారం విద్యార్థులకు ఖచ్చితంగా మెనూను పాటించాలని పీఓ అధికారులకు తెలిపారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
నియామకం
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గడ్డం రాధాకృష్ణను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజన్న బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. రాధాకృష్ణ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి అప్పగించినందుకు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక భూపాలపల్లి అర్బన్: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి స్టాలిన్నాయక్ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుత్నున స్టాలిన్నాయక్ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్లో, క్రాస్ కౌంట్రీ రేస్ట్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎన్నికై నట్లు వెల్లడించారు. 2026 ఫిబ్రవరిలో హరియాణాలోని రోహతక్లో జరిగే పోటీలో పాల్గొననున్నట్లు ఇన్చార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తెలిపారు. హారతి వేదికకు గొడుగు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన సరస్వతీనది పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్ వద్ద దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇవ్వడానికి ఏడు వేదికలు నిర్మించిన విషయం తెలిసిందే. ఏడు వేదికలపై తొమ్మిది హారతులు పండితులచే ఇచ్చేందుకు పుష్కరాల సమయంలో గద్దెలు నిర్మించగా, పూర్తిస్థాయిలో పైన గొడుగులు, ఇతర పరికరాలు ఏర్పాటు చేయలేదు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు అప్పటి నుంచి ప్రతీ రోజు గోదావరి హారతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కాగా, మిగిలిన పనులను పూర్తి చేయడానికి గద్దెలపై ఇనుప రాడ్డులతో గొడుగు, ఇతర పరికరాలు కాళేశ్వరం చేరాయి. రెండు రోజుల్లో పనులు ప్రారంభం అవుతున్నాయని ఈఓ మహేష్ బుధవారం తెలిపారు. శెభాష్.. విద్యుత్ ఉద్యోగులు భూపాలపల్లి రూరల్ : భూపాలపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు డీసీసీ బ్యాంకు వద్ద ట్రాన్స్ఫార్మర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉద్యోగులు బుధవారం రాత్రి వర్షంలోనూ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి సరఫరా పునరుద్ధరించారు. దీంతో పట్టణవాసులు, వ్యాపారులు తదితరులు.. విద్యుత్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. లైన్మన్ దేవేందర్రెడ్డి, ఏఎల్ఎంలు మహేష్, రవి, ఉమాన్ ఉన్నారు. రామప్పను సందర్శించిన జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ జనరల్ ఎల్పీ సింగ్ బుధవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట జీఎస్ఐ డైరెక్టర్ మంజు, గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. జాతర పనులకు ఆటంకం ఎస్ఎస్తాడ్వాయి: వర్షంతో మేడారం జాతర అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పనులు నిలిచిపోయాయి. సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం(ప్రహరీ), మేడారంలో రోడ్ల విస్తరణ, డ్రైయినేజీ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. వర్షం ఇలాగే మరో రెండురోజులు పడితే జాతర అభివృద్ధి పనులు నిచిపోయి పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. -
దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దు
చిట్యాల: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని శాంతినగర్ శివారులోని అంజనీ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో సీసీఐ కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను పోత్సహించవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుకొచ్చేటప్పుడు తేమ లేకుండా చూసుకోవాలని అన్నారు. సీసీఐ కేంద్రాలలో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీన్కుమార్, సీసీఐ అధికారి పట్టాభిరామయ్య, మార్కెట్ సెక్రటరీ లా షరీఫ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ.రఫీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, చిలుకల రాయకొంరు, దొడ్డి కిష్టయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం -
నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలి
భూపాలపల్లి అర్బన్: అవినీతికి తావులేకుండా నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, ప్రాజెక్ట్, ప్లానింగ్ జీఎం సాయిబాబు కోరారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియాలోని జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యాలయ అధికారులు, సిబ్బందితో కలిసి విజిలెన్స్ వారోత్సవాలను ప్రారంభించారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవినీతి సంస్థ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకి అని, ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను నిజాయితీతో నిర్వర్తించడం ద్వారా మంచి పరిపాలన సాధ్యమవుతుందన్నారు. పారదర్శకత, సమర్ధత, ధర్మబద్ధత వంటి విలువలను వృత్తి జీవితంలో పాటించడమే విజిలెన్స్ లక్ష్యమన్నారు. ప్రతిఉద్యోగి తనకు కేటాయించిన 8 గంటల పనిని బాధ్యతతో నిర్వర్తించకపోవడం కూడా (విజిలెన్స్) బాధ్యతారాహిత్య చర్యలో భాగమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, ఎర్రన్న, జోతి, రవీందర్, రాజేశ్వర్, శైలేంద్రకుమార్, మారుతి, పోషమల్లు, కార్మిక సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్ పాల్గొన్నారు. -
గ్రూపులు కట్టిన వారికే..
భూపాలపల్లి: మద్యంషాపుల నిర్వహణ ఎంపిక ప్రక్రియకు తెరపడింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 59 మద్యంషాపులకు 1,863 దరఖాస్తులుగా రాగా 57 షాపులకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని మంజూర్నగర్లో గల ఇల్లందు క్లబ్ హౌజ్లో కలెక్టర్ రాహుల్ శర్మ సమక్షంలో డ్రా ప్రక్రియను వీడియోగ్రఫీ మధ్య పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి పాల్గొన్నారు. మాధవికే మల్లంపల్లి షాపు.. రెండు జిల్లాల్లో అత్యధికంగా ములుగు జిల్లాలోని మల్లంపల్లి మద్యంషాపునకు 77 దరఖాస్తులు రాగా, ఈ షాపు ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. డ్రా ప్రక్రియలో వెంకటాపురం మండలానికి చెందిన రెడ్డిమల్ల మాధవికి షాపు దక్కింది. నేడు నోటిఫికేషన్.. ములుగు జిల్లాలోని గెజిట్ నంబర్ 49 చల్వాయి, గెజిట్ నంబర్ 50 గోవిందరావుపేట మద్యంషాపులకు మూడు చొప్పున మాత్రమే దరఖాస్తులు రావడంతో ఎకై ్సజ్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం లాటరీ డ్రాను నిలిపివేశారు. ఆ రెండు షాపులకు నేడు(మంగళవారం) నోటిఫికేషన్ విడుదల అవుతుందని, వచ్చే నెల 1వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించి, 3వ తేదీన లాటరీ డ్రా నిర్వహిస్తామని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ వెల్లడించారు. గతంలో మద్యం షాపులను నడిపిన, కొత్తగా రంగంలోకి దిగిన వారు గ్రూపులుగా ఏర్పడి రెండు జిల్లాలోని షాపులకు 50 నుంచి 150 వరకు దరఖాస్తులు సమర్పించారు. అధిక సంఖ్యలో అప్లికేషన్లు వేసిన వీరికే అవకాశం దక్కింది. సింగిల్ డిజిట్లో వేసిన వారికి షాపులు రాలేదు. ఇదిలా ఉండగా మద్యం డాన్లుగా పేరొంది, వందకు పైగా దరఖాస్తులు సమర్పించిన కొందరికి ఒక్కషాపు కూడా డ్రాలో తగలకపోగా, ఒకరిద్దరికి ఒకటి, రెండు షాపులు మాత్రమే తగిలాయి. డ్రాలో షాపులను దక్కించుకున్న వారు సంతోషంతో బయటకు రాగా, డ్రా తగలని వారు నిరాశతో వెనుదిరిగారు. మాధవికి మల్లంపల్లి వైన్స్ ఆ రెండు షాపులకు మళ్లీ దరఖాస్తుల ఆహ్వానం -
న్యాయవాదులు విధుల బహిష్కరణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల వైఖరిని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీహాల్లో కోర్టు సముదాయం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో అగ్రిమెంట్ చేసుకొని నెలకు రూ.64,988 అద్దె కుదుర్చుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఏరియా సింగరేణి అధికారులు నవంబర్ 5వ తేదీ నుంచి కార్మికులకు ఫంక్షన్లు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించడం సరైనది కాదన్నారు. అఽధికారులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కమ్యూనిటీహాల్ను కోర్టు సముదాయం ఏర్పాటు చేసుకునేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసచారి, శ్రావణ్రావు, రవీందర్, రాజ్కుమార్, శివకుమార్, కవిత, రవీందర్, ప్రశాంత, సుధారాణి, సురేష్కుమార్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లా స్థాయి యువజనోత్సవాల పోటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్చార్జ్ డీవైఎస్ఓ రఘు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జానపద నృత్యం, పాట, సైన్స్ మేళా, లైఫ్ స్కిల్స్ కాంపోనెంట్, కథా రచన, కవిత్వం, ప్రకటన, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 15నుంచి 19 సంవత్సరాలలోపు యువకులు, కళాకారులు దరఖాస్తులను డీవైఎస్ఓ కార్యాలయంలో అందించాలని సూచించారు. వివరాలకు 96180 11096, 81251 13132 ఫోన్ నంబర్లలో సంపద్రించాలన్నారు. టేకుమట్ల: బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతి అన్నారు. నవంబర్ 1న చలో హైదరాబాద్ వాల్పోస్టర్ను సోమవారం మండలకేంద్రంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. అనంతరం భిక్షపతి మాట్లాడుతూ తెలంగాణలో బీసీల హక్కులను సాధించుకునే వరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ సభ్యుడు సంగి రవి, జిల్లా ఇన్చార్జ్ బచ్చల రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ఓంకార్, తాళ్లపల్లె రమేష్గౌడ్, పుల్యాల భగత్, జీడి రాజకొంరయ్య, పాల్గొన్నారు. కాటారం: పశు పోషకులు తప్పనిసరిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా లు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్ట ర్ కుమారస్వామి అన్నారు. కాటారం మండలం కొత్తపల్లి, వీరాపూర్ గ్రామాల్లో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామానికి వెళ్లి పశువులకు టీకాలు వేయాలని మండల పశువైద్యాధికారులను, సిబ్బందిని ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రమేశ్, డాక్టర్ ధీరజ్, సహాయకులు తుంగల రాజశేఖర్, కిషన్, గోపాలమిత్ర శ్రీనివాస్, పశుమిత్ర నజీమా పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం 2025–26 విద్యా సంవత్సరానికి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుటకు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థిని, విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌతాఫ్రికా దేశాలలో ఉన్న అగ్ర యూనివర్సిటీలకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ములుగు రూరల్: నేడు (మంగళవారం) నిర్వహించనున్న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
గైర్హాజరుపై సీరియస్
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల గైర్హాజరుపై సింగరేణి యాజమాన్యం సీరియస్గా ఉంది. ఏడాదిలో 150 మస్టర్ల కన్నా తక్కువ ఉంటే విచారణ ఎదుర్కొనేలా నిబంధనలు రూపొందించింది. ఈమేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. కొత్త నిబంధనల ప్రకారం... మొత్తం ఉద్యోగుల్లో సుమారు 25శాతం వరకు గైర్హాజరు అవుతున్నారని గుర్తించింది. ఇది సంస్థకు ఇబ్బందికరమని భావిస్తోంది. దీనిప్రభావం బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై పడుతోందని చెబుతోంది. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది గైర్హాజరు శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చే స్తోంది. దీర్ఘకాలికంగా విధులకు రాని ఉద్యోగులకు ఉచిత విద్యుత్, నీరు, వైద్యసౌకర్యాలు అందిస్తున్నా కంపెనీకి వారి సహకారం ఉండడం లేదంటోంది. వచ్చేనెల 5వ తేదీన గుర్తింపు.. భూగర్భగనుల్లో పనిచేసే ఉద్యోగులు ప్రతీనెల 16 కన్నా తక్కువ, ఉపరితల ఉద్యోగులు 20 మస్టర్ల కన్నా తక్కువ చేస్తే వచ్చేనెల ఐదో తేదీన గుర్తించాలని సింగరేణి ఆదేశాలు జారీచేసింది. భూగర్భగనుల్లో మూడు నెలల పాటు ఇలాగే హాజరు ఉంటే గని మేనేజర్ స్థాయి అధికారి, మూడునెలల తర్వాత ఏరియాస్థాయి కమిటీకి పంపించాలని ఉత్తర్వులు జారీఅయ్యాయి. గైర్హాజరై కౌన్సెలింగ్కు హాజరు కాకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 190/240 కన్నా తక్కువ మస్టర్లు ఉన్న ఉద్యోగుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. 150 మస్టర్లు లేకుంటే గైర్హాజరే.. ఏడాదిలో నిర్ణీత 150 మస్టర్లు లేకుంటే గైర్హాజరు కార్మికుడిగా గుర్తిస్తారు. గతంలో వంద మస్టర్లు ఉండగా ప్రస్తుతం దానిని 150 మస్టర్లకు పెంచింది. 150కన్నా తక్కువ మస్టర్లు ఉన్న కార్మికుల పేర్లను ఆయా గనుల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 31నాటికి చార్జిషీట్, ఫిబ్రవరి–15లోగా కార్మికుల వివరణ, వివరణ సంతృప్తిగా లేకుంటే మార్చి 15 నాటికి విచారణ పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కౌన్సెలింగ్ నిర్వహించి ఏప్రిల్ 30 నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయనున్నట్లు సింగరేణి ప్రకటించింది. గైర్హాజరు సమస్య సింగరేణి అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ విషయంలో ఉద్యోగులు ఆలోచించాలి. ఏడాదిలో కనీసం 150మస్టర్లు పూర్తిచేయకుంటే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆదేశాలను అన్ని ఏరియాల్లో కఠినంగా అమలు చేయాలని ఆదేశించాం. – ఏనుగు రాజేశ్వర్రెడ్డి, ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ గైర్హాజరు విచారణ ఎదుర్కొనే కార్మికులపై చర్యల గురించి ప్రతీనెల నిర్వహించే సమీక్షలో ఏరియా స్థాయి జీఎంలు పర్యవేక్షించాలని యాజమాన్యం సూచించింది. గైర్హాజరు తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జీఎంలకు అధికారాలు కట్టబెట్టింది. ఈ విషయంలో ఏరియాల స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించవద్దని ఆదేశించింది.సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రభావం ఏడాదిలో 150 మస్టర్లు ఉండాలి లేదంటే ఉద్యోగానికి భద్రత ఉండదు ఉత్తర్వులు జారీచేసిన సింగరేణి తక్కువ మస్టర్లు నమోదైతే కౌన్సిలింగ్ అయినా మారకుంటే కఠిన చర్యలుమొత్తం కార్మికులు 5,300 100 మస్టర్ల లోపు గైర్హాజరు 1,200మంది 150 మస్టర్ల లోపు గైర్హాజరు 2,000మంది -
మూడు రోజులు తుపాన్ ప్రభావం
భూపాలపల్లి: రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో తుపాన్ ప్రభావం ఉన్నందున జిల్లా యంత్రాంగం, ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, తుపాను ప్రభావంపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు పలు సూచనలు చేసిన అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 1.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని ఐదు జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు కార్యక్రమాలు చేపడుతామన్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం మార్కెట్లోకి రావచ్చనే అంచనా దృష్ట్యా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు తుపాను ప్రభావం ఉన్నందున గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, డీసీఎస్ఓ కిరణ్కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియానాయక్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు.. ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
సింగరేణి కమ్యూనిటీ హాల్లో కోర్టు సముదాయం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభాష్కాలనీ రోడ్డులోని సింగరేణి కమ్యూనిటీహాల్లో తాత్కాలిక కోర్టు సముదాయం ఏర్పాటు చేయనున్నట్లు భూపాలపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు తెలిపారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్కుమార్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి అద్దె ప్రతిపాదికన ఒప్పందం కుదిర్చినట్లు తెలిపారు. అతి త్వరలోనే కోర్టు సముదాయం నందు అన్ని కోర్టు సేవలు ఒకే చోట ఉండటం వలన కక్షిదారులకు, పోలీసు, అన్ని ప్రభుత్వ శాఖలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, ఎస్పీ కిరణ్ఖరే, కార్మిక సంఽఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ సభ్యులు సంగెం రవీందర్, మంగళపల్లి రాజ్కుమార్, శివకుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ అవసరాలకు అప్పగించొద్దు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభాష్కాలనీ రోడ్డులోని సింగరేణి కమ్యూనిటీహాల్ను ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయించకుండా కార్మికుల అవసరాలకు వినియోగించాలని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బెతేల్లి మధుకర్రెడ్డి డిమాండ్ చేశారు. కమ్యూనిటీహాల్ ఎదుట ఆదివారం ఐఎన్టీయూసీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుకర్రెడ్డి మాట్లాడారు. కార్మికుల సౌకర్యార్ధం నిర్మించి సింగరేణి కమ్యూనిటీహాల్లను ఎనిమిదేళ్లుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వినియోగించారన్నారు. దీంతో కార్మికులు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల ఇబ్బందులు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అవసరాలకు అద్దెకు ఇవ్వవద్దని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయినప్పటికీ కలెక్టర్, సింగరేణి అధికారులు హాల్లను ఇతరులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయడం సరి కాదన్నారు. ఈ సమావేశంలో నాయకులు జోగు బుచ్చయ్య, రాజేందర్, నర్సింగరావు, హుస్సేన్, శంకర్, వేణుగోపాల్, రమేష్ పాల్గొన్నారు. -
కాళేశ్వరాలయంలో కార్తీకశోభ
● రూ.3.20లక్షల ఆదాయం కాళేశ్వరం: కార్తీకమాసాన్ని పురస్కరించుకొని మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం కార్తీకశోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. గోదావరి మాతకు పూజలు చేసి దీపాలు వదిలారు. సైకత లింగాలను తయారు చేసి పూజించారు. అనంతరం స్వామివారి ఆలయంలో రూ.3,00, రూ.1,000 టికెట్ అభిషేక పూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్ష వత్తులు వెలిగించి లక్షముగ్గులు వేశారు. దీపారాదనలు చేఽశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. వివిధ పూజలు, ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.3.20లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. రాత్రి గోదావరికి హారతి కార్యక్రమం వేదపండితులతో నిర్వహించారు. -
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో వచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తుల రద్దీతో మేడారం సందడిగా మారింది. -
ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!
వరంగల్: పండించిన పత్తిని మద్దతు ధరకు రైతులు అమ్ముకునే పరిస్థితులు కానరావడం లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈదుస్థితి ఏర్పడింది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 ఇస్తామని సీసీఐ వెల్లడించింది. ప్రతీ అదనపు శాతానికి రూ.81 కోత ఉంటుందని ఇప్పటికే పేర్కొంది. అది కూడా 12 శాతం వరకే. అంతకుమించితే కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరబెడదామంటే అనువైన పరిస్థితులు లేవు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మార్కెట్కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా అమ్మడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్.. పత్తి అమ్మేందుకు ఈ సీజన్ నుంచి సీసీఐ కపాస్ కిసాన్ యాప్ను అమలులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రైతులు తమ పత్తిని సీసీఐకి అమ్మాలంటే కచ్చితంగా మార్కెట్ యార్డుకు రాకముందే యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అందులో తేదీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే యార్డుకు రావాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొదట పత్తి కొనుగోళ్లు వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏ, బీ కేంద్రాల్లోనే ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు.. సీసీఐ నిర్దేశించిన దానికంటే పత్తిలో తేమ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు మార్కెటింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో 28, హనుమకొండలో 3, జనగామ 15, మహబూబాబాద్ 6, భూపాలపల్లి 5, ములుగులో 3 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా సోమవారం లాంఛనంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాలతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తెలిపారు. పత్తిలో తేమ శాతం కారణంగా మిగిలిన కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పత్తిలో తేమ 8 శాతం ఉంటే మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,,866, 12 శాతం ఉంటే 7785.60 ధర చెల్లిస్తారు. పాత పద్ధతితోనే రైతుకు మేలు గతంలో సీసీఐ కొనుగోలు చేసిన పద్ధతితోనే రైతులకు ఇబ్బందులు ఉండవు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత కేంద్రానికి తీసుకువస్తే తేమ ఎక్కువ ఉందని అంటే రైతు సరుకు వాపస్ తీసుకుపోవాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా చార్జీలు అదనంగా భరించాలి. రైతు ఇష్టం ఉన్న కేంద్రంలో అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో పలుచోట్ల ఈపద్ధతిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్లో గొడవలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. రైతు పట్టా పాస్బుక్, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకునే కొనుగోలు చేస్తే బాగుంటుంది. – బొమ్మినేని రవీందర్రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అకాల వర్షాలతో పత్తిలో అధిక తేమ 12 శాతం మించితే కొనుగోలు చేయలేమంటున్న సీసీఐ నేడు ఏనుమాముల మార్కెట్లో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపత్తి మద్దతు ధర క్వింటాలు : రూ.8,110 బహిరంగ మార్కెట్లో ధర: రూ.6,500 నుంచి రూ. 7వేల వరకు ఉమ్మడి జిల్లాలో సాగైన పత్తి విస్తీర్ణం : 5.23 లక్షల ఎకరాలు దిగుబడి అంచనా : 41.90 లక్షల క్వింటాళ్లు -
భయం గుప్పిట్లో అటవీ గ్రామాలు
● చిరుత పులి సంచారంతో ఆందోళనలో ప్రజలుకాటారం: చిరుతపులి సంచారంతో కాటారం, మహాముత్తారం మండలాల్లోని అటవీ గ్రామాల్లో భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆకస్మికంగా చిరుత పులి ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మహాముత్తారం మండలం జీలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పర్లపల్లి గ్రామ సమీపంలో గొర్రెల మందపై శనివారం తెల్లవారుజామున చిరుత దాడి చేసి రెండు గొర్రెలను చంపివేసిన విషయం విదితమే. అకస్మాత్తుగా చిరుతపులి దాడికి పాల్పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత గ్రామానికి సమీపం నుంచి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు పాదముద్రలు గుర్తించారు. దీంతో చిరుతపులి ఈ అటవీప్రాంతంలోనే ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రైతులు, పశువుల కాపర్లు, ప్రజ లు అటవీ ప్రాంతానికి వెళ్లడానికి జంకుతున్నారు. కాటారం రేంజ్ పరిధిలోనే పులి సంచారం.. మహాముత్తారం మండలం పర్లపల్లిలో దాడికి పాల్పడిన చిరుతపులి ప్రస్తుతం కాటారం అటవీశాఖ రేంజ్ పరిధిలోనే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జీలపల్లి అటవీ ప్రాంతం నుంచి కాటారం మండలం ప్రతాపగిరి అడవుల్లోకి చిరుత ప్రవేశించి ఉంటుందని చర్చ జరుగుతుంది. చిరుత సంచారానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వర్షం కురవడంతో అటవీ ప్రాంతంలో ఆనవాళ్లు, పాదముద్రలు పూర్తి స్థాయిలో కానరావడం లేదు. దీంతో పులి ఎటు నుంచి ఎటు వెళ్లిందనే స్పష్టత రావడం లేదు. అసలు చిరుత ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎంత కాలం నుంచి ఈ అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుందనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. చిరుతపులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాటారం రేంజ్ అధికారి స్వాతి ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేకంగా వాల్పోస్టర్లు తయారు చేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి పూట రైతులు, కాపర్లు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని పులికి హాని తలపెట్టే కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎఫ్ఆర్వో స్వాతి హెచ్చరించారు. -
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: మండలంలోని బుగులోని జాతరలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర పనులను ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలను జాతర ప్రారంభమయ్యేలోపు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతో బుగులోని జాతరను రాష్ట్ర స్థాయి జాతరగా మార్చే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్రావు, వీరేందర్, రమణారెడ్డి, విజేందర్, తిరుపతి, వీరబ్రహ్మం, సంతోష్, వెంకటేష్ పాల్గొన్నారు. -
పాండవుల గుట్టను అభివృద్ధి చేయాలి
రేగొండ: పాండవుల గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డీవైఎఫ్వై జిల్లా అధ్యక్షుడు తిరుపతి అన్నారు. ఆదివారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను కేయూ పరిశోధన విద్యార్థులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పాండవుల గుట్టల అభివృద్ధి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారిందని విమర్శించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పర్యాటకులకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ పరిశోధక విద్యార్థులు రమేష్, ప్రసాద్, తిరుపతి, పసుల వినయ్ కుమార్ పాల్గొన్నారు. -
లక్కు ఎవరికో..
భూపాలపల్లి: మద్యం షాపులకు నేడు లక్కీ డ్రా నిర్వహించనుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ షాపు ఎవరికి దక్కుతుందోనని మద్యం వ్యాపారులు టెన్షన్ టెన్షన్గా ఉన్నారు. లక్కీ డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 10 గంటల నుంచి ప్రారంభం.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 59 ఏ4 మద్యంషాపులకు 1,863 అప్లికేషన్లు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 55.89 కోట్ల ఆదాయం వచ్చింది. గత సారి కంటే ఈ సారి అప్లికేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ దరఖాస్తు రుసుము పెంచడంతో ఆదాయం మాత్రం పెరిగింది. నేటి ఉదయం 10 గంటలకు చల్వాయి, గోవిందరావుపే మినహా 57 షాపులకు జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్లో గల ఇల్లందు క్లబ్ హౌజ్లో లాటరీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ సమక్షంలో నిర్వహించనున్న ఈ ప్రక్రియకు ఎకై ్సజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి రంగంలోకి రియల్ ఎస్టేటర్లు.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో ఆ వ్యాపారం చేసే వారంతా మద్యం వ్యాపారానికి మొగ్గుచూపారు. జిల్లాతో పాటు హనుమకొండ, వరంగల్, జనగామ తదితర పట్టణాలకు చెందిన వారు కాళేశ్వరం, మల్లంపల్లి, టేకుమట్ల, భూపాలపల్లి పట్టణంలోని మద్యంషాపులకు భారీగా అప్లికేషన్లు దాఖలు చేశారు. కొత్తగా టెండర్లు వేసిన వీరంతా మొదటి అవకాశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డాన్లలో గుబులు.. కొంతకాలంగా మద్యం వ్యాపారంలో డాన్లుగా పేరొందిన పలువురు భారీ మొత్తంలో అప్లికేషన్లు సమర్పించారు. బెల్లుషాపులు ఎక్కువగా నడిచే, కౌంటర్ ఎక్కువయ్యే షాపులను గుర్తించి ఒక్కో షాపుకు పదికి పైగానే దరఖాస్తులు అందజేశారు. ముగ్గురు నలుగురు వ్యాపారులైతే ఏకంగా వంద చొప్పున దరఖాస్తులు చేసినట్లు సమాచారం. గతంలో ఒకటి రెండు షాపులను దక్కించుకున్న వారు గ్రూపులుగా ఏర్పడి ఈసారి అధిక సంఖ్యలో అందజేశారు. వీరంతా నేడు జరుగనున్న లాటరీ డ్రాలో లక్కు ఎవరిని వరించనుందోనని ఉత్కంఠతో ఎదరుచూస్తున్నారు. కొందరైతే ఏకంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకొని వేడుకొని వచ్చారు. మల్లంపల్లి షాపుపైనే అందరి దృష్టి.. ములుగు జిల్లాలోని మల్లంపల్లి మద్యంషాపునకు అత్యధికంగా 77 అప్లికేషన్లు వచ్చాయి. ఇక్కడి షాపులో రోజుకు సుమారు రూ.5 లక్షల మద్యం విక్రయాలు జరుగుతాయి. ఈ షాపు పరిధిలో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతాయి. మ ద్యం డాన్లు, రియల్ వ్యాపారులు ఈ షాపుపై అధి కంగా అప్లికేషన్లు వేశారు. దీంతో లాటరీ ప్రక్రియలో ఈ వైన్స్ ఎవరికి వస్తుందనే ఆసక్తి నెలకొంది. నిలిచిన ఆ రెండు షాపుల డ్రా.. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి తక్కువగా చల్వాయి వైన్స్ గెజిట్ నంబర్ 49కి మూడు, గోవిందరావుపేట గెజిట్ నంబర్ 50 షాపునకు మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి. దీంతో ఎకై ్సజ్ కమిషనర్, హైదరాబాద్ ఆదేశాల మేరకు ఆ రెండు షాపుల డ్రాను నేడు నిలిపివేస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎంట్రీ పాస్ ఉంటేనే అనుమతి.. మద్యం దుకాణాలను దరఖాస్తు చేసుకున్న వారు రశీదు, ఎంట్రీ పాస్తో లాటరీ ప్రక్రియకు హాజరు కావాలి. ఎంట్రీ పాస్ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించం. దరఖాస్తుదారులు రాలేని పక్షంలో వారి నుంచి అనుమతి పొందిన వారు ఎంట్రీ పాస్తో హాజరు కావాలి. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడి
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఒంటరి మనుషుల మోముల్లో చిరునవ్వు నింపుతున్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట.. పండ్లు.. కడుపు నిండా భోజనం ఇటీవల పెరిగిన సేవా దృక్పథం -
కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు. -
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప, నవగ్రహాల వద్ద శని నివారణ పూజలను భక్తులు శనివారం అధికంగా నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తుల సందడి నెలకొంది. కార్తీక సందడి.. కార్తీకమాసం సందర్భంగా కాళేశ్వరం ఆలయంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారి గర్బగుడిలో అభిషేక పూజలు చేశారు. అనంతరం శ్రీశుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్షవత్తులు వెలిగించి లక్ష ముగ్గులు వేశారు. దీంతో భక్తుల సందడి కనిపించింది. -
రామప్ప శిల్పకళా సంపద మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ అన్నారు. ఉమ్మడి వరంగల్లోని పర్యాటక క్షేత్రాల సందర్శనకు వచ్చిన ఆయన శనివారం మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ములుగు డీఈ పులుసం నాగేశ్వర్ రావు, ఏడీఈ వేణుగోపాల్, అధికారులు పురుషోత్తం, రమేశ్, కిశోర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అక్రమాలకు అడ్డుకట్ట
కాటారం: ఉపాధి హామీ పథకంలో గతంలో జరిగిన అక్రమాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నూతన సంస్కరణలను అమల్లోకి తీసుకొస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూలీలకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్ఆర్ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాబ్కార్డులను ఆధార్కార్డులతో అనుసంధానం చేయడంతో పాటు కూలీకి సంబంధించి ఫొటోలు, జాబ్కార్డు, ఆధార్ వివరాలు సేకరించి ఈ ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తిచేయని కూలీలు ఉపాధి పనులకు దూరం కానున్నారు. గతంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలను దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట.. ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్లో కూలీల ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్ఏలు) నకిలీ, పాత ఫొటోలను అప్లోడ్ చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. పనులకు హాజరుకాకున్నా పాత ఫొటోలు పెడుతున్నారు. ఒకరి పేరుపై మరొకరు పనులకు వెళ్లినా హాజరు వేస్తున్నారు. ఈ అక్రమాలు సామాజిక తనిఖీల్లో బయటపడుతున్నాయి. నిధులు పక్కదారి పట్టినట్లు తేలినా రికవరీ అంతంత మాత్రంగానే ఉంటుంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. 72శాతం ఈకేవైసీ పూర్తి.. జిల్లాలో ఇప్పటి వరకు 72 శాతం కూలీల ఈ కేవైసీ పూర్తి అయినట్లు అధికారుల లెక్కలు చెప్పుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత యాక్టివ్ కూలీలు పనికి రాగానే ఒకసారి, పనులు పూర్తయిన తర్వాత మరోసారి ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. కూలీల వివరాలు యాప్లో నమోదు కాకపోతే పనులకు వెళ్లినా హాజరు వేయలేరు. పని ప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతంలో తీసిన ఫొటోను అప్లోడ్ చేస్తే జీపీఎస్ సిస్టం గుర్తిస్తుంది. తప్పుడు హాజరుగా నిర్ధారిస్తుంది. ఈకేవైసీ వందశాతం పూర్తయితే ఈజీఎస్లో అవకతవకలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మస్టర్ విధానానికి స్వస్తి.. గతంలో ఉపాధిహామీ పనులు జరిగే ప్రదేశాల్లో రాత పద్ధతిలో మస్టర్లు వేసేవారు. ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీల హాజరు తీసుకొని మస్టర్ వేసేవారు. ఎవరు వచ్చారనే విషయం తెలియక, పనులకు హాజరుకాని వాళ్లకు సైతం మస్టర్ వేసిన సందర్భాలు ఉండేవి. అలాంటివి మళ్లీ చోటు చేసుకోకుండా ఇకనుంచి ఉపాధిహామీలో మ్యానువల్ మస్టర్ విధానానికి స్వస్తి పలికి ఆన్లైన్ ద్వారా ప్రత్యేక యాప్లో మస్టర్లు వేయనున్నారు. పకడ్బందీగా వివరాలు నమోదు.. ఉపాధిహామీలో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కూలీల ఈకేవైసీకి శ్రీకారం చుట్టాం. ప్రతి కూలీ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది ఈకేవైసీ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగిస్తూ వివరాలు నమోదు చేస్తున్నారు. – బాలకృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిఉపాధి కూలీలకు ఈకేవైసీ కూలీల ఫొటోలు, ఆధార్, జాబ్కార్డుల సేకరణ యాప్లో వివరాల నమోదుజిల్లాలో ఉపాధిహామీ వివరాలు.. మండలాలు – 12 గ్రామపంచాయతీలు – 244 ఉపాధిహామీ బ్లాక్లు – 12 జాబ్కార్డుల సంఖ్య – 1,09,843 కూలీల సంఖ్య – 2,41,667 ఈకేవైసీ పూర్తయిన కూలీల సంఖ్య – 1,76,000 (సుమారు) -
రేపు మద్యంషాపులకు లాటరీ డ్రా
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మద్యంషాపుల నిర్వహణ కోసం రేపు(సోమవారం) లాటరీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 59 షాపులకు గాను 1,863 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. కలెక్టర్ రాహుల్ శర్మ సమక్షంలో భూపాలపల్లి పట్టణంలోని ఇల్లందు క్లబ్హౌజ్లో డ్రా నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, దరఖాస్తుదారులు లేదా వారి ద్వారా అనుమతి పొందిన వారిని మాత్రమే కార్యక్రమం లోపలికి అనుమతిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. రీజియన్ స్థాయి ఫుట్బాల్ క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్ పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ రీజియన్ స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలను శనివారం బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థ క్రీడలను ప్రోత్సహిస్తుందని సింగరేణి క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోలిండియా స్థాయిలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, శ్రీనివాస్, కోచ్లు, క్రీడాకారులు దేవయ్య, అంజయ్య, మల్లేష్, పురుషోత్తం, రాహుల్ పాల్గొన్నారు. కోటగుళ్లను సందర్శించిన ఇంగ్లండ్ దేశస్తులు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను ఇంగ్లండ్ దేశానికి చెందిన దంపతులు మిచెల్ రిచర్డ్, ఎలిజబెత్ శనివారం సందర్శించారు. ఆలయ చరిత్ర, శిల్పకళా నైపుణ్యాన్ని వారికి రామప్ప గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించారు. అనంతరం వారు ఆలయంలోని శిల్పాలను వారి వెంట తెచ్చుకున్న కెమెరాలలో బంధించారు. ఆలయ శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. దాడి ఘటనలో అరె స్ట్ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని బిట్స్ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటనలో బజరంగ్దల్ నాయకుడు శ్యామ్లాల్పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసినట్లు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు యాజమాన్యానికి రాలేదన్నారు. వారికి ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే పోలీసులు, షీ టీంలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలపై ప్రజాసామ్య పద్ధతిలో మాత్రమే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, లేదా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. విద్యాసంస్థలపై దాడి చేసి ఆస్తి నష్టం కలిగించడం, విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడం చట్ట విరుద్ధమన్నారు. నాలుగు రోజుల క్రితం చేసిన దాడి కేసులో యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలిగితే 100కు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంఏటూరునాగారం: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాధిక, ములుగు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల, వైద్యురాలు అన్మిష అన్నారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్లో శనివారం నుంచి ములుగు డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ నెల 31 వరకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో 50మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని దత్తత తీసుకొని చెత్తాచెదారం తొలగించి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, మూత్రం, మల విసర్జన బయట ఎక్కడబడితే అక్కడ చేయొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మంజుల, జ్యోతి, సుకన్య, అరుణ, కేర్ టేకర్ సరిత, ఏఎన్ఎం పుణ్యవతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
యువత సన్మార్గంలో నడవాలి
● కాళేశ్వరంలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్కాళేశ్వరం: యువత బాగా చదువుకొని, సన్మార్గంలో నడవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో శనివారం సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై జి.తమాషారెడ్డి ఆధ్వర్యంలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో 2కే రన్ నిర్వహించారు. డీఎస్పీ, సీఐ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. యువత, విద్యార్థులు, వర్తకసంఘం, ఆటో యూనియన్, పలు పార్టీల నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి, గుట్కా, గుడుంబా మత్తు పదార్థాలకు బానిసలుగా మారొద్దన్నారు. చదువు పట్ల శ్రద్ధ వహించి, ఉన్నత శిఖరాలు అందుకోవాలని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆటల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు. అనంతరం 2కే రన్ విజేత రేవెల్లి సతీష్కు ప్రథమ, నుముల రాకేష్కు ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎస్ఐఆర్ రివిజన్
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)ను పకడ్బందీగా తయారు చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. ఎస్ఐఆర్ తయారీపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో భాగంగా కేటగిరి ఏని బీఎల్ఓ యాప్ ద్వారా ధృవీకరిస్తామని, కేటగిరి సీ, డీ లను లింక్ ద్వారా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈఆర్ఓ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి త్వరితగతిన మ్యాపింగ్ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
పచ్చదనమే..
మల్హర్: మండలంలోని చిన్నతూండ్ల నుంచి పెద్దతూండ్ల క్రాస్ వద్దకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం కనువిందు చేస్తోంది. గతంలో నాటిన మొక్కలను సంరక్షించడంతో ప్రస్తుతం చెట్లుగా మారాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలతో పాటు పొలాలకు వెళ్లే రైతులను చెట్లు ఆకట్టుకుంటున్నాయి. దీంతో కొందరు చెట్ల కింద కొంతసేపు సేదదీరి వెళ్తున్నారు. ఘనంగా పెద్దమ్మ తల్లి గుడి వేడుకలు మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో ముదిరాజ్ల ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మతల్లి గుడి వార్షికోత్సవాన్ని ముదిరాజ్ కులస్తులు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు బోనాలతో కుటుంబ సభ్యులతో కలిసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వనం ఒదేలు, రావి శెట్టి రమేష్, నీరటి మహేందర్, చెక్క శ్రీధర్, బోళ్ల సాంబమూర్తి, దేవునూరి కొమురయ్య ఉన్నారు. 27 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న కరాటే, యోగా, బాస్కెట్బాల్, టగ్ ఆఫ్ వార్, టేబుల్ టెన్నిస్, మల్కంబ్, సాఫ్ట్ టెన్నిస్, గట్క, తంగ్తా మార్షల్ ఆర్ట్స్, 28వ తేదీన హ్యాండ్బాల్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్డ్ రెజ్లింగ్, సైక్లింగ్, స్కేటింగ్, బేస్బాల్, బీచ్ వాలీబాల్, 29న ఖోఖో, బాక్సింగ్, స్విమ్మింగ్, రగ్బీ, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, ఫెన్సింగ్, కలారీ పయట్టు, కురేష్, అథ్లెటిక్స్, 30న క్యారమ్స్, ఉషు, క్రికెట్, నెట్బాల్, సాఫ్ట్బాల్, జూడో, లాన్టెన్నిస్, జిమ్నాస్టిక్స్, షూటింగ్ క్రీడల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హాస్టళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పీజీ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం(2025–26) ప్రవేశాలు పొందిన ఫస్టియర్ విద్యార్థులు హాస్టళ్లలో వసతి, మెస్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. హెచ్టీటీపీఎస్//కేయూకాలేజెస్.కో.ఇన్,/హాస్టల్స్ /న్యూఅడ్మిషన్స్లో ఫీజు చెల్లించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, రశీదు జత చేసి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. దీంతోపాటు సంబంధిత విభాగాధిపతి ద్వారా కాలేజీ అలాట్మెంట్ ఫార్మ్, హాస్టల్ అడ్మిషన్ రశీదును ప్రిన్సిపాల్ ఆఫీస్ నుంచి అడ్మిషన్ రశీదును సమర్పించాలని పేర్కొన్నారు. -
ఏటా నష్టమే..
కాళేశ్వరం: ఓ వైపు రైతులు తమ పత్తి పంటకు తెగుళ్లు సోకి పలు పురుగుల మందులను వేసి పంటను కాపాడుకున్నారు. మరో వైపున పత్తి కాత, పూత దశకు రావడంతో అడవి పందులు, కోతులు ఆశించడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో పంటలను రాత్రి వేళల్లో ధ్వంసం చేస్తుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా మారింది. రూ.లక్షల్లో పెట్టుబడికి ఖర్చు చేసి నిండా మునుగుతున్నామని, సంబంధిత అటవీశాఖ నుంచి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పత్తి పంటకు దెబ్బ.. జిల్లాలో 98,780 ఎకరాల్లో పత్తిపంటను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టారు. అడవి పందులు, కోతులు పత్తిపంటను నాశనం చేస్తున్నాయి. కాయ దశలో పత్తి చేనులోకి చొరబడి పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు పంటను వదిలేసుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం రక్షణ చర్యలు తీసుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల మహదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో ఆకుదారి రాజయ్య నాలుగు ఎకరాల్లో పత్తి పంటను సాగుచేసి పందులు, కోతులు పూర్తిగా తొక్కి ధ్వంసం చేయడంతో మేకలు, గొర్రెలు తోలుకు వచ్చి మేతకు వదిలేశాడు. దీంతో కోలుకోలేని విధంగా రైతుకు నష్టం వాటిల్లింది. మద్దులపల్లికి చెందిన పోతుల తిరుపతి ఐదెకరాల్లో పత్తిపంటను వేయగా.. రెండెకరాల వరకు పందులు, కోతులు తొక్కి ధ్వంసం చేశాయి. ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. అంతకుముందు తెగుళ్లతో ఇబ్బంది రూ.లక్షల్లో పెట్టుబడి ఖర్చులు పట్టించుకోని సంబంధిత అధికారులు -
‘ఏసీబీ’ దడ.. ‘సైబర్’ వల
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసీల్దారు బండి నాగేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో కొద్ది రోజుల క్రితం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో దాడులు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరస్తులు నర్సంపేట డివిజన్కు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ను ఏసీబీ పేరిట బెదిరించి రూ.3.50 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరిలో రవాణాశాఖ వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్పైన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఆ తర్వాత మహబూబాబాద్ కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. దీంతో రవాణాశాఖ అధికారులు కొందరు ఏసీబీ భయంతో వణికిపోతున్నారని పసిగట్టిన సైబర్ నేరస్తులు.. వరంగల్ ఎంవీఐ, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఆర్టీఓ తుమ్మల జయపాల్రెడ్డిని టార్గెట్ చేయగా, ఆయన రూ.10 లక్షలు సమర్పించుకున్నారు. ఈ నెల 21న మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. ... అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిన వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన కొందరు అధికారులకు కంటిమీద కునుకు కరువైంది. కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలువురు అవినీతి అక్రమాల ఆరోపణలపై ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఈ క్రమంలో ప్రతి పనికీ బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కొన్ని శాఖల అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా రంగంలోకి దిగుతున్న సైబర్ నేరస్తులు ఆ అక్రమార్కులకు వలవేసి రూ.లక్షలు కొల్లగొడుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఆ ఐదు శాఖలే టార్గెట్... ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా జరిగిన దాడులను పరిశీలిస్తే.. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, నీటిపారుదల శాఖలకు చెందిన వారే ఎక్కువున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో పని చేసిన ఉన్నతాధికారులు కొందరు ఏసీబీ దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వాస్తవానికి రెవెన్యూ, రవాణా, పోలీసు, రిజిస్ట్రేషన్శాఖల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అత్యధికంగా కరెప్షన్కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు తగ్గట్టుగానే ఏసీబీకి చిక్కడం గమనార్హం. డిప్యూటీ తహసీల్దార్ మొదలు ఆర్డీఓ వరకు.. ఎంవీఐ మొదలు డీటీసీ వరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులపై ఏసీబీ దాడులను ఎదుర్కోవడం అవినీతి అక్రమాలకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో వారు ఏసీబీ అధికారులను మచ్చిక చేసుకునేందుకు మార్గాలు వెతుక్కునే క్రమంలో సైబర్ నేరస్తుల వలలో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటుండటం చర్చనీయాంశమవుతోంది. అయినా మార్పులేదు.. రవాణాశాఖలో అదే తీరు రవాణాశాఖలో ఇన్చార్జ్ల పాలన ఇంకా కొనసాగుతోంది. ఓ వైపు ప్రక్షాళన జరుగుతున్నా.. మరోవైపు అవినీతి ఊడలు బారుతోంది. కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ కోసం పోటీపడి తెచ్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి తెరవెనుక సీనియర్లు చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టును సీనియర్లు ఉంటే వారికే ఇవ్వాల్సి ఉంది. ఆరోపణలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో 1994 బ్యాచ్కు చెందిన సీనియర్లున్నా.. 2012 బ్యాచ్కు చెందిన వారిని ఆ పోస్టులో నియమించారు. ఇదిలా ఉంటే చాలాచోట్ల తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు లెర్నింగ్ మొదలు.. ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైట్, గూడ్స్ వాహనాల లైసెన్స్ల జారీ, తదితరాలపై అంతకు ముందున్న రేట్లకు రెట్టింపు వసూలు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఇదిలాఉండగా వరంగల్ సంఘటనతో ‘ఏసీబీ అధికారులు ఎవరికీ ఫోన్ చేయరని.. సైబర్ నేరస్తుల వలలో పడవద్దని.. ఏదన్న ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1064కి ఫోన్ చేయాలి’ అని తాజాగా ఏసీబీ అధికార వెబ్సైట్లో అలర్ట్ పెట్టింది.అవినీతి అధికారులకు కంటిమీద కునుకు కరువురూ.10 లక్షలు సైబర్ నేరస్తులకు సమర్పించుకున్న తుమ్మల జయపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు అసలేం జరిగిందన్న వివరాలు ఇలా ఉన్నాయి.. జయపాల్ రెడ్డి వరంగల్లో ఎంవీఐగా, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఆర్టీఓగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండలోని హంటర్రోడ్డులో ఉన్న ఆయనకు ఈ నెల 15న మధ్యాహ్నం 12.30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి 98868 26656 (ఈ నంబర్ ట్రూ కాలర్లో ఏసీబీ అని వస్తుంది) నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఏసీబీ (అవినీతి నిరోధక బ్యూరో) నుంచి డీఎస్పీగా పరిచయం చేసుకుని, అవినీతి కేసు నమోదు చేశామని జయపాల్ రెడ్డికి తెలియజేశాడు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. ఆ తర్వాత కాల్ చేసిన వ్యక్తి ఫిర్యాదుదారుడికి డబ్బులు పంపాలని చెప్పి మొదట రూ.75 వేలు 77606 40948 మొబైల్ నంబర్కు బదిలీ చేయమని సూచించాడు. ఆ తరువాత సైబర్ నేరగాడు చెప్పినట్లు జయపాల్ రెడ్డి రూ.75 వేలతో పాటు మరో రూ.25 వేలు పాయల్ మేఘనకు పంపాడు. తదనంతరం మరో రూ.లక్ష పంకజ్ కుమార్కు, రూ. 2 లక్షలు దివ్య పేరిట ఉన్న మొబైల్ నంబర్ (97097 65940)కు పంపాడు. మరో రూ.5 లక్షలు బెంగళూరులోని సదాశివనగర్ బ్రాంచ్లో ఓ కాంట్రాక్టర్ పేరుతో ఉన్న ఖాతా నంబర్ 477825001010847701 (ఐఎఫ్ఎస్సీ కోడ్: కే ఏఆర్బీ0000908)కు పంపాడు. మూడు మొబైల్ నంబర్లు (98868 26656, 95919 38585, 98804 72272) ద్వారా మొత్తం రూ.10 లక్షలు జయపాల్ రెడ్డితో ట్రాన్స్ఫర్ చేయించాడు. మోసపోయానని గ్రహించడానికి ఆరు రోజులు పట్టిన జయపాల్రెడ్డి చేసేది లేక తెలియని వ్యక్తులపై చర్య తీసుకోవాలని మిల్స్కాలనీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 318(4) బీఎన్ఎస్, 66–డీ ఐటీఏ–2000–2008ల కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరస్తులు కాజేసిన రూ.10 లక్షల కథ తాయిలాలతో మచ్చిక చేసుకునేందుకు అడ్డదారులు ఇదే అదునుగా రంగంలోకి సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో ఫోన్ బెదిరింపులు.. ఫోన్, అకౌంట్ పే ల ద్వారా వసూళ్లు ఒకేరోజు రూ.10 లక్షలు కాజేసిన వైనం.. తాజా బాధితుడు మహబూబాబాద్ ఆర్టీఓ -
క్రీడలతో దేహదారుఢ్యం
భూపాలపల్లి అర్బన్: క్రీడలతో కేవలం ఆనందం మాత్రమే కాకుండా శారీరక దృఢత్వానికి, పట్టుదలకు దారితీసే మంచి మార్గమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సింగరేణి వర్క్పీపుల్స్, గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26వ వార్షిక క్రీడ పోటీల్లో భాగంగా గురువారం సింగరేణి విభాగాల క్రికెట్ పోటీలను ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడల ప్రాముఖ్యత ను మనస్ఫూర్తిగా గ్రహించి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ క్రీడలను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలన్నా రు. కోలిండియా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికా రులు గుండు రాజు, శ్రావణ్కుమార్, నాగేశ్వర్రావు, ప్రసాద్, దేవేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
చిట్యాల: ఏపీఎంతో మాట్లాడుతున్న కలెక్టర్, భూపాలపల్లి అర్బన్: నిర్మాణాలను పరిశీలిస్తున్న విజయలక్ష్మి చిట్యాల: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం మండలంలోని ముచినిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 45 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 25 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందజేయాలని ఏపీఎంకు సూచించారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు, తదితర అంశాలపై గృహ నిర్మాణ శాఖ, డీఆర్డీఓ, ఎంపీడీఓలతో రెండు రోజులలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, తహసీల్దార్ షేక్ ఇమామ్బాబా, ఎంపీడీఓ జయశ్రీ, ఏపీఏం రాజేందర్, ఆర్ఐ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచాలి రేగొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. మండలంలోని లింగాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, పాఠశాల, నర్సరీ, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాఠాలు చదివించారు. విలువలతో కూడిన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంవటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం మున్సిపాలిటీ స్పెషల్ అధికారి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన విధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇంటి నిర్మాణం పూర్తిచేసిన వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణంలో అలసత్వం వహించవద్దన్నారు. అధికారుల నుంచి తగు సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టీపీఓ సునీల్, వార్డు అధికారులు, జవాన్లు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
పోలీసుల విధులపై అవగాహన ఉండాలి
భూపాలపల్లి: పోలీసుల విధులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాలు, గంజాయి వాడకంతో కలిగే అనర్థాలు, ట్రాఫిక్ నియమాలు, భరోసా, షీ టీమ్, సెక్యూరిటీ, ఆంటీ నార్కోటిక్ డ్రగ్ విభాగం, డాగ్ స్క్వాడ్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఎలా ఇవ్వాలి, విచారణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే విషయాలను వివరించారు. కొన్ని సాంకేతిక పరికరాల వినియోగాన్ని ప్రాక్టికల్ డెమో రూపంలో చూపించారు. డయల్ 100 విధానం, కాల్ అందిన వెంటనే పోలీసులు ఎలా స్పందిస్తారో వివరించడంతో పాటు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పోలీసు అధికారులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆయుధాలు, పోలీస్ చట్టాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యం, ఫింగర్ ప్రింట్ పరికరాలు, ట్రాఫిక్ సేఫ్టీ, సైబర్ భద్రత వంటి అంశాలపై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ డి.నరేష్కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
మద్యం షాపులకు 1,658 దరఖాస్తులు
భూపాలపల్లి: మద్యంషాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. అప్లికేషన్ల సంఖ్య గతంలో కంటే తగ్గినప్పటికీ దరఖాస్తు రుసుం పెంచిన కారణంగా ఆదాయం మాత్రం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరించగా 1,658 దరఖాస్తులు వచ్చి రూ.49.74 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ కారణాలతో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచింది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు వరకు 1,817 దరఖాస్తులు అందగా.. రూ. 54.51 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. పెరిగిన ఆదాయం.. 2023–2025 సంవత్సరంలో భూపాలపల్లి, ములు గు జిల్లాలోని మద్యంషాపులకు 2,161 దరఖాస్తులు రాగా రూ.43 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏ డాది దరఖాస్తు రుసుం రూ.3 లక్షలకు పెంచడంతో 1,817 దరఖాస్తులకు రూ. 54.51 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తు రుసుంపెంచడంతో అప్లికేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం పెరిగింది. అత్యధికంగా.. అత్యల్పంగా.. ములుగు జిల్లాలోని మల్లంపల్లి మద్యంషాపునకు అత్యధికంగా 77 దరఖాస్తులు వచ్చాయి. గోవిందరావుపేట, రంగాపూర్ జీపీ పరిధిలోని షాపునకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. చల్వాయి షాపునకు ఒకటి మాత్రమే రాగా, జేఎస్బీ 49 నంబరు గల చల్వాయి(వి) షాపునకు ఒకటి, జేఎస్బీ 53 నంబరు గల తాడ్వాయి, మేడారం, ఊరట్టం షాపునకు రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. సర్కారుకు రూ.54.51కోట్ల ఆదాయం అప్లికేషన్లు తగ్గినా.. పెరిగిన ఆదాయం గడువు పెంపుతో వచ్చిన దరఖాస్తులు 159 -
ఉద్యోగులు సమయపాలన పాటించాలి
మొగుళ్లపల్లి: ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజస్టర్, లేబర్ రూమ్, ఆయుష్, యోగా రూమ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి వాక్సినేషన్, టీబీ సీజన్ వ్యాధుల గూర్చి ఎన్సీడీ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మధుసూదన్ -
నేరాల నియంత్రణకు కృషి
టేకుమట్ల: నేరాల నియంత్రణకు కృషి చేయాలని, శాంతి భద్రతలు కాపాడాలని డీఎస్పీ సంపత్రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని పెండింగ్ వాటిపై దృష్టి సారించాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఖచ్చితమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. ప్రజా ఫిర్యాదులో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సీఐ మల్లెష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ సంపత్రావు -
వేరుకుళ్లు, నల్లతామర
భూపాలపల్లి రూరల్: ప్రకృతి వైపరీత్యాలు ప్రతీ సంవత్సరం వెంటాడుతుండగా.. మిర్చి రైతులకు కన్నీళ్లే దిక్కవుతున్నాయి. ఈ సారైనా కలిసి వస్తుందనే ఆశతో సాగుచేసిన వారికి మళ్లీ నిరాశే ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలు వారి పాలిటశాపంగా మారాయి. వర్షాల ప్రభావంతో పంటకు తెగుళ్లు ఆశించాయి. ప్రధానంగా విల్ట్ (వేరుకుళ్లు) తెగులుతో కాండం, మొక్కలు, ఆకులు ఎండిపోయా యి. ఎదగని పంటకు తోడు పూత దశలో ఆశిస్తున్న తెగుళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గే అవకాశం.. ఈసారి అధిక వర్షాలతో వర్షపు నీరు చేనులో నిలిచి ఉండడంతో వేరుకుళ్లు (విల్ట్) తెగులు మిర్చి పంటను ఆశించింది. దీంతోపాటు నల్లతామర, నల్లి పురుగు ఉధృతితో పంటలకు నష్టం వాటిల్లుతోంది. భూపాలపల్లి, చిట్యాల, మహాముత్తారం తదితర మండలాల్లో బ్లాక్ త్రిప్స్ (నల్ల తామర పురుగు), మైట్స్ (నల్లి పురుగు) ఉధృతి ఎక్కువగా ఉంది. మిర్చి పంటకు నారు కుళ్లు, ఆకుముడత, తెల్ల దోమ తెగుళ్లకుతోడు బూడిద తెగులు మొదలైంది. దీంతో దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగొండ మండలంలోని గూడెపల్లి, భాగిర్థిపేట, దుంపిల్లపల్లి, పొనగండ్ల, రేపాక, తిరుమలగిరి తదితర గ్రామాల్లో మిరప పంటను అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం మిరప పూత దశలో ఉంది. అధిక వర్షాలతో మిరప మొక్కలు జాలు పట్టి పోయాయి. ప్రధానంగా వేరుకుళ్లు తెగులు ఆశిస్తే మొక్క దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రేగొండ మండలంలో 2,500, కొత్తపల్లిగోరిలో 1,800 ఎకరాలకు పైగా మిర్చి సాగు చేశారు. వాడిపోయి చనిపోతున్న మొక్కలు పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్న రైతులు పత్తాలేని ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో 7,360 ఎకరాల్లో సాగుమిర్చి సాగులో జిల్లాకు మంచి పేరుంది. గతేడాది నల్ల తామర ప్రభావంతో మిర్చి దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోపడంతో రైతులు నష్టాలు చవిచూశారు., వానాకాలానికి సంబంధించి 2023లో జిల్లాలో 24,400 ఎకరాల్లో సాగు కాగా 2024లో 20,145 ఎకరాలు ఈ సంవత్సరం (2025) ఇప్పటి వరకు కేవలం 7,360 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో గతేడాది 20,145 ఎకరాల్లో మిర్చి సాగు కాగా.. ఈ ఏడాది కేవలం 7,360 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలకు చెందిన క్రీడాకారుడు సున్నం చరణ్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్లోని పటాన్చెరువులో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 17 వాలీబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి వరంగల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. జట్టు తరఫున ఆడిన చరణ్ అత్యంత ప్రతిభ కనబర్చడంతో సెలక్షన్ కమిటీ సభ్యులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ జైపాల్, పేట సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న చరణ్ను ప్రిన్సిపాల్తో పాటు వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేష్, ఉపాధ్యాయులు అభినందించారు. పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్భూపాలపల్లి అర్బన్: పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు పోలీసుల విధులు, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, ఫింగర్ ప్రింట్స్ కమ్యూనికేషన్ల గురించి వివరించారు. విద్యార్థులకు చెడు వ్యసనాలకు గురికావొద్దని సీఐ నరేష్కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిములుగు రూరల్: చిన్నారులకు సకాలంలో తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్ అన్నారు. మండల పరిధిలోని జంగాలపల్లి ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విపిన్కుమార్ మాట్లాడుతూ టీకాల ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకా డ్యూలిస్టు ఇచ్చిన అనంతరం ఎంసీహెచ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రణధీర్, పోషకాహార జిల్లా ప్రోగ్రామ్ అధికారి శ్రీకాంత్, డెమో సంపత్ తదితరులు పాల్గొన్నారు. అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలివాజేడు: విద్యార్థుల్లో విద్యా అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన పలు పాఠశాలలతో పాటు కేజీబీవీని తనిఖీ చేశారు. స్వయంగా విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. కేజీబీవీలో భోజనం చేసిన అనంతరం డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా డీఆర్ని రాయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేయాలని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ నమోదులో వాజేడు మండలం 100శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో ఉందన్నారు. బడికి రాని పిల్లలను బడిలో చేర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉల్లాస్ జిల్లా సమన్వయకులు కృష్ణబాబు, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి ధర్నాను విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఈనెల 24న హైదరాబాద్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ నాయకుడు కొత్తూరు రవీందర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధర్నా పోస్టర్లను జేఏసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జపల్లి మహర్షి, రేణుకుంట్ల మహేష్, మల్లయ్య, మంత్రి రాకేష్, బోయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కార్తీక సందడి షురూ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటిరోజు బుధవారం భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున త్రివేణి సంగమ గోదావరిలో ఫుణ్యస్నానాలు చేశారు. గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వదిలారు. స్వా మి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. ఉసిరి చె ట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్ష ముగ్గులు వేసి, లక్షవత్తులు వెలిగించారు. అంతకుముందు ప్రాకార దేవతలను దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరినదికి నదీహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వెలిగిన ఆకాశ దీపం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆల యం ధ్వజస్తంభం వద్ద కార్తీకమాసం మొదటి రోజు ఆకాశ దీపానికి ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ విశేష పూజలు చేశారు. బుధవారం రాత్రి ధ్వజస్తంభంపైకి ఆకాశ దీపం వెలిగించి పైకి ఎత్తారు. నెల రోజుల పాటు ప్రతీ రోజు దీపాన్ని వెలిగిస్తారని పండితులు తెలిపారు. -
సస్యరక్షణ చర్యలు పాటించాలి
వెంకటాపురం(కె) : పంటల సంరక్షణకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ విజయభాస్కర్, శాస్త్రవేత్తలు రాజ్కుమార్, సౌందర్యలు అన్నారు. మండల పరిధిలోని బెస్తగూడెం, నూగూరు గ్రామాల్లో బుధవారం శాస్త్రవేత్తలు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. వరిలో డబ్ల్యూజిల్ –962 రకాన్ని పరిశీలించారు. వరి కంకి పాలు పోసుకోవటం, గింజ నిండే దశలో ఉండడం వల్ల కంకినల్లి, గింజమచ్చ వస్తుందని గమనించినట్లు తెలిపారు. దాని నివారణకు లీటర్ నీటికి స్పెరైమెసిన్ 1 మిల్లీ లీటర్, ప్రాపికోనజల్ 1 మిల్లీ టీటర్ నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలని సూచించారు. మిర్చి పంటను వేరుకుల్లు, ఆకుముడత తెగుళ్లు ఆశిస్తున్నాయని వాటి నివారణకు లీటర్ నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాముల చొప్పున కలిసి పిచికారీ చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారి నవీన్, శ్యామ్ తదితరులు ఉన్నారు. -
దామెరకుంట గురుకులంలో విచారణ
కాటారం: మండల పరిధిలోని దామెరకుంట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులకు గాయాలైన ఘటనపై బుధవారం సాంఘిక సంక్షేమ గురుకులాల డిస్ట్రిక్ కోఆర్డినేటర్ (డీసీఓ) భిక్షపతి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. ఘటన జరిగే ముందు విద్యార్థుల మధ్య ఏదైన గొడవ జరిగిందా, ఉపాధ్యాయుల మధ్య ఏమైనా విభేదాలు జరుగుతున్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులకు గాయాలైన సంఘటన వారి తల్లిదండ్రులకు ఎందుకు తెలియపర్చలేదని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను డీసీఓ ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, వారి మధ్య విభేదాలు ఉన్నట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. గాయాలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఇదిలాఉండగా విద్యార్థులకు గాయాలైన సంఘటనలో పాఠశాల సిబ్బంది ఓ విద్యార్థినిని మందలించడంతో సదరు విద్యార్థిని సైతం గాయపర్చుకున్నట్లు తెలిసింది. డీసీఓ వెంట పాఠశాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ ఉన్నారు. ఉపాధ్యాయుల, సిబ్బంది అత్యుత్సాహం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంత పెద్ద ఘటనలు జరిగినప్పటికీ అవి తల్లిదండ్రుల వరకు చేరకుండా విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తూ దాచిపెడుతున్నారు. దామెరకుంట సాంఘిక సంక్షేమ పాఠశాలలో గతంలో కూడా ఇదే తరహా ఘటనలు జరిగినా సిబ్బంది బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. వారి నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి పలుమార్లు ఫోన్ చేసిన హౌస్ మేడమ్స్, ఉపాధ్యాయులు ఏ మాత్రం స్పందించరని ఆందోళన చెంది పాఠశాలకు వస్తే అడ్డగోలు నిబంధనలతో తమను లోనికి అనుమతించరని పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పాఠశాల నిర్వాహణపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన! -
పాఠశాలల ఆకస్మిక తనిఖీ
మొగుళ్లపల్లి: మండలంలోని ఎంజేపీ, కేజీబీవీ, వి లేజ్ లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ను బుధవారం తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, జడ్జి చిలుకమారి పంచాక్షరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందంతో కలిసి వంట గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన భోజనంతో పాటు విద్యనందించాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎల్వీ మంగళపల్లి శ్రీనివాస్, ఎస్ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కాకతీయుల కళావైభవానికి నిదర్శనం రామప్ప
ములుగు: కాకతీయుల కళావైభవానికి నిలువెత్తు నిదర్శనం రామప్ప అని ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ చైర్మన్లు అరవింద్ కుమార్, విశ్వజిత్ కన్నా అన్నారు. కాకతీయుల కళా సంపదను వీక్షించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం అరవింద్కుమార్, విశ్వజిత్ కన్నా దంపతులు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలోని శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వారి గోత్రనామాలతో రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. గైడ్ విజయ్కుమార్ రామప్ప ఆలయ చరిత్ర, శిల్పకళ సంపద విశిష్టతను వారికి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకతీయుల చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాలను ఆనాటి వైభవాన్ని శిల్పకళ నైపుణ్యంతో కళ్లకు కట్టినట్లుగా చెక్కారని కొనియాడారు. అందుకే ఈ అద్బుతమైన కట్టడానికి యునెస్కో గౌరవం దక్కిందన్నారు. రాతిపై చెక్కిన ఇక్కడి శిల్పాల్లో జీవకళ ఉట్టి పడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇతిహాసాలు, చరిత్ర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయని వివరించారు. జీవకళ ఉట్టిపడే శిల్ప కళాకృతుల సౌందర్యానికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందేనని కితాబిచ్చారు. రాతి స్తంభాలకు సన్నని దారం పట్టే రంధ్రాలు ఉండటం విశేషమన్నారు. ఆలయం అంతటా చీకటిగా ఉన్నా గర్భగుడిలోని రామలింగేశ్వరుడి(శివలింగం) వద్ద వెలుతురు ఉంటుందని గైడ్ వివరించారని వెల్లడించారు. అనంతరం వారు సమీపంలోని రామప్ప చెరువులో బోటులో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాధించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డీఈ సదానందం, భాస్కర్, ఎస్. కల్యాణ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ చైర్మన్లు అరవింద్కుమార్, విశ్వజిత్ కన్నా -
వైభవంగా దీపావళి సంబురాలు
భూపాలపల్లి అర్బన్: వెలుగుల పండుగ దీపావళిని సోమ, మంగళవారాల్లో జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. ఇంట్లో, వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవి పూజలు, కేదారేశ్వర వత్రాలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే ప్రజలు తలంటుస్నానం ఆచరించి, హారతులను తీసుకుని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇళ్ల ముందు రంగవల్లులు, మామిడి, అరటి తోరణాలను ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. బొమ్మల కొలువులు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రతీ ఇంటా సంతోషాల కాంతులు విరబూశాయి. ఆకాశంలో వెలుగులు.. కేదారేశ్వర వత్రం ముగించుకున్న తర్వాత రాత్రివేళ టపాసుల మోతతో ఆకాశం వెలుగులతో నిండిపోయింది. క్రాకర్స్, లక్ష్మీ బాంబులు, రాకెట్స్, చిచ్చుబుండీ, భూ చక్రాల సవ్వడితో చిన్నారులు, పెద్దలు మురిసిపోయారు. కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి తమ ఆనందాన్ని పంచుకున్నారు. గృహాలు, వ్యాపార సంస్థల్లో లక్ష్మీపూజలు, కేదారేశ్వర వ్రతాలు పట్టణం, పల్లెల్లో బాణసంచా మోత -
రోగులకు పరీక్ష
ఇష్టారాజ్యంగా ల్యాబ్ల నిర్వహణప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న వైద్యుల కనుసన్నల్లోనే ల్యాబ్ల దోపిడీ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాబ్లు కూడా వైద్యులవే కావడంతో అవసరం లేకుండా రకరకాల పరీక్షలు చేయిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. గర్భిణులు, చిన్నపిల్లల నుంచి మొదలు ముసలివారి వరకు ఆస్పత్రికి ఏ చిన్న జబ్బుతో వచ్చినా పరీక్షల పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు విజిటింగ్ డాక్టర్లు కూడా అసిస్టెంట్లతో ల్యాబ్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.భూపాలపల్లి అర్బన్: వ్యాధిని నిర్ధారించే ల్యాబ్లు జిల్లాలో రోగులకు పరీక్ష పెడుతున్నాయి. అర్హత లేని టెక్నీషియన్లతో తప్పుడు రిపోర్టులు ఇస్తూ అబాసుపాలవుతున్నాయి. అనుమతులు లేకుండా నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. పరీక్షల పేరుతో అందిన కాడికి రోగుల నుంచి డబ్బులు దోచుకోవడమే లక్ష్యంగా ల్యాబ్లు పనిచేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండలకేంద్రాల్లో ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలను పూర్తిగా మరిచిపోయారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 27 ఆస్పత్రుల్లో అనుమతులు జిల్లాలో మొత్తంగా 27 ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ల్యాబ్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లు పాథాలజీ చదివిన వారి పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కొన్ని సెంటర్లు నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాబ్లో ఎంఎల్టీ పూర్తిచేసిన వారు ఉండాలి. కానీ పలు కేంద్రాల్లో అర్హులు కనిపించని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంతో పాటు కాటారం, చిట్యాల, గణపురం, మహదేవపూర్, కాళేశ్వరం, చెల్పూర్లలో అనుమతులు లేకుండా ల్యాబ్లు చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. కొంతకాలం ఆస్పత్రుల్లో అసిస్టెంట్లుగా పనిచేసి సొంత పరిజ్ఞానంతో జిల్లాలో ల్యాబ్లను ఏర్పాటు చేసుకొని ఆర్ఎంపీలు, పీఎంపీలు, ఇతర ఆస్పత్రుల డాక్టర్లతో కుమ్మౖకై రక్త నమూనాలను సేకరించి ల్యాబ్లో పరీక్షలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ఆర్ఎంపీ డాక్టర్ల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో, ఇతర సొంత గదుల్లో ల్యాబ్లను ఏర్పాటు చేసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్షలు చేసినట్లయితే ఇంత మొత్తం అంటూ ప్యాకేజీలు ప్రకటించి మరీ దందా నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ, చికున్గున్యా, మలేరియాతో పాటు బీపీ, షుగర్ బాధితులు ఎక్కువగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టింపు కరువు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు, వైద్యసేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆరోగ్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకున్నా, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆస్పత్రి లైసెన్స్ నుంచి మొదలు ల్యాబ్లో, డయాగ్నోస్టిక్ వరకు తనిఖీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులతో అనుసంధానమైన ల్యాబ్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. గత నెలలో చేపట్టిన తనిఖీల్లో అనుమతి లేని వాటిని గుర్తించి నోటీసులు జారీ చేశాం. అనుమతి ఉన్న వాటిలో అర్హత కలిగిన టెక్నీషియన్లను నియమించాలి. డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి మిషన్లు కేవలం ప్రైవేట్ ల్యాబ్, డాక్టర్లు రిపోర్టు ఇచ్చినట్లయితే చర్యలు తప్పవు. జిల్లావ్యాప్తంగా ల్యాబ్లలో తనిఖీలు నిర్వహిస్తాం. రోగులు వ్యాధి ప్రారంభంలో ఒక ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని కలిసి పరీక్షలు చేయించుకుంటుండగా.. తగ్గకపోవడంతో మరో ఆస్పత్రికి వెళ్తున్నారు. రెండింటి దగ్గరలో పరీక్షలు చేయించుకుంటుండగా రిపోర్ట్ మాత్రం రెండు రకాలుగా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఏది నమ్మాలో తెలియక రోగుల్లో గందరగోళం నెలకొంటుంది. రిపోర్టుల ఆధారంగా వైద్యం చేసుకునే ఈ రోజుల్లో రిపోర్టులను నమ్మలేని పరిస్థితులు దాపరించాయి.రోగుల గందరగోళంవైద్యుల కనుసన్నల్లోనే.. అర్హతలేని టెక్నీషియన్లు అడ్డగోలుగా డబ్బుల వసూలు వైద్యారోగ్యశాఖ తనిఖీలు శూన్యం -
నాణ్యతపై నజర్
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలోని పల్లెల్లోనే సంపద సృష్టించాలి. ఇందుకోసం కులవృత్తులను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే చేపపిల్లలను కొనుగోలు చేసి మత్స్యపారిశ్రామిక సంఘాల సమక్షంలో చెరువుల్లో విడుదల చేస్తుంది. అయితే గతంలో ఈ పంపిణీలో పలు అవకతవకలు జరిగినట్లు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. పిల్లలు నాసిరకంగా ఉన్నాయని.. లెక్కల్లో తేడా ఉందని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం చేపపిల్లల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో గత అనుభవాలను తలచుకుంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన చేపపిల్లలను చెరువుల్లో వదిలి తమ ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంపిణీకి అధికారుల కసరత్తు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు సంవృద్ధిగా కురిశాయి. చెరువుల్లో నీరు చేరగానే చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ టెండర్ల ప్రక్రియతో ఆలస్యం అయింది. మత్స్యకారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఎట్టకేలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని చేపపిల్లల పంపిణీకి కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26,357 చెరువులు చేపపిల్లలు వదిలేందుకు అనువైనవిగా గుర్తించారు. 35–40, 80–100 సైజు మొత్తం 8,386.24 లక్షల చేపపిల్లలు, రొయ్యలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగించారు. దీంతో జిల్లాల్లోని ప్రజా ప్రతినిధుల సమయం తీసుకొని చేపపిల్లలు చెరువుల్లో వదిలేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. గతంలో ఆరోపణలు గతంలో ఉత్పత్తి చేసే కేంద్రాలు లేకపోయినా.. కొందరు కాంట్రాక్టర్లు వేరే హేచరీలను చూపించి కాంట్రాక్టు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం కాకుండా నాసిరకం పిల్లలు పంపిణీ చేశారని, దీంతో పలు చెరువుల్లో ఆరు, ఏడు నెలలు గడిచినా.. చేపలు 500 గ్రాముల సైజుకు కూడా రాలేదనే ఆరోపణలు మత్స్యకారుల నుంచి వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చేపపిల్లలను చెరువుల్లో విడిచే సమయంలో తక్కువ పిల్లలు పోసి లెక్కలు ఎక్కువ చూపించినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అయితే వీటిని పరిశీలించాల్సిన అధికారులు కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం, ముడుపులు తీసుకొని చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు కూడా మత్స్యకారుల నుంచి వ్యక్తమయ్యాయి. నాసిరకం చేపపిల్లలు.. లెక్కల్లో తేడాలు.. ఎదగని పిల్లలతో మత్స్యకారుల ఇబ్బందులు గత అనుభవాలతో మత్స్యకారుల ఆందోళన ప్రస్తుతం చేపపిల్లల ఉచిత పంపిణీకి కసరత్తునాణ్యత పరిశీలించాలి ఆగస్టు నెలలో చేపపిల్లలు చెరువుల్లో పోస్తే వర్షం నీరు, పొలాల నుంచి వచ్చే మురుగు నీరు చేపలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. పిల్లల ఎదుగుదల ఉంటుంది. కానీ ఇప్పుడు ఆలస్యం అయింది. అయినా పిల్లల నాణ్యతను పరిశీలించి చెరువుల్లో పోయాలి. – కొత్తూరు రమేశ్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చీఫ్ ప్రమోటర్ -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
భూపాలపల్లి అర్బన్: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ఖరే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. అమరుల త్యాగానికి నివాళి అర్పించి స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 191 మంది పోలీసు అమరవీరుల పేర్లను అదనపు ఎస్పీ నరేష్కుమార్ చదివి వినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన నిజమైన వీరులను స్మరించుకునే రోజని, వా రి త్యాగం మరచిపోలేనిదన్నారు. పోలీస్ శాఖ ఎల్ల ప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. పోలీసు అమరవీరులు దేశానికి చేసిన సేవ అనితర సాధ్యమన్నారు. వారి త్యాగాలతోనే సమాజం శాంతియుతంగా కొనసాగుతోందన్నారు. ప్రతీ రోజు వారి సేవలను స్మరించుకుంటూ మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొనగా వారిని సత్కరించారు. అంతకుముందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ డీఎస్పీ సంపత్ రావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది, పోలీస్ సంఘం అధికార ప్రతినిధి యాదిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ఖరే పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం -
తెలంగాణ రైజింగ్ సర్వేలో పాల్గొనాలి
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రైజింగ్–2047 సిటిజన్ సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు ఉద్దేశించిన సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. భారతదేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి పలు సలహాలు, సూచనలు చేపట్టడానికి ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ –2047 సిటిజన్ సర్వేను చేపట్టిందన్నారు. ప్ర భుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25వ తేదీతో ముగుస్తుందని, జిల్లా ప్రజ లు తెలంగాణరైజింగ్ అనే వెబ్సైట్ను సంద ర్శించి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంభూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, కలెక్టర్ రాహుల్శర్మ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని చిట్యాల, కాటారం, శాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు పరిమిత సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరి గిన ప్రవేశ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోపు చిట్యాల గురుకుల పాఠశాలలో దరఖాస్తులను అందించాలన్నారు. నాణ్యమైన పెట్రోల్ అందించాలిమల్హర్: వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలని డీసీఎస్ఓ కిరణ్కుమార్, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీలత అన్నారు. విని యోగదారుల ఫిర్యాదు మేరకు మంగళవారం తాడిచర్ల హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్లో తనిఖీ చేపట్టా రు. గాలి పంపు, మంచినీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ నాణ్య త, వ్యత్యాసాన్ని పరిశీలించేందుకు నమూనాలను సేకరించారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవన్నారు. అనంతరం మల్లారం రైస్ మిల్లును పరిశీలించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ ఆర్ఐ సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిభూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి రూ.50కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేసినందున పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్ సెంటర్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రూ.50కోట్లతో రోడ్లు, కాల్వలు, తాగునీటి సౌకర్యం, పట్టణ సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అమృత్ సర్ పథకం కింద రూ.23 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల పాఠశాల విద్యార్థినులపై దాడి!
కాటారం: మండలంలోని దామెరకుంట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులకు గాయాలైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల గొంతు, చెవి భాగాల్లో గాట్లు కావడంతో దాడి జరిగిందా లేక కావాలని ఎవరైన చేశారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. కాటారం మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు దామెరకుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. గురువారం రాత్రి వారు తమ గదిలో నిద్రిస్తున్న సమయంలో గొంతు, చెవి భాగాల్లో పదునైన వస్తువుతో గాట్లు పెట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అర్ధరాత్రి కావడంతో సదరు విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం హెల్త్ సర్వీస్ (హెచ్ఎస్), ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడంతో వారిని హుటాహుటిన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లినట్లు సమాచారం. గాయపడిన ఓ విద్యార్థిని ఆస్పత్రి నుంచి తీసుకెళ్తున్న క్రమంలో తన తండ్రిని చూసి విషయం చెపుతాను అని చెప్పగా హెచ్ఎస్ వారించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని హెచ్ఎస్, ఉపాధ్యాయినులు విద్యార్థినులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల పాటు విషయం బయటకు రాకుండా దాచి ఉంచారు. కాగా ఆదివారం విజిటింగ్లో భాగంగా సదరు విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా వారికి లోపలికి అనుమతించలేదు. చివరకు గొడవకు దిగడంతో తల్లిదండ్రులను పాఠశాల లోపలికి పంపించగా విద్యార్థుల గాయాలను గుర్తించిన వారు అక్కడ ఉన్న హెచ్ఎస్, సిబ్బందిని నిలదీశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించి తల్లిదండ్రులనే దబాయించినట్లు తెలిసింది. సమస్య బయటకు రాకుండా సామరస్యంగా మాట్లాడుకుందామని పాఠశాలకు చెందిన వారు తల్లిదండ్రులతో సంప్రదింపులకు దిగినట్లు తెలిసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఎస్సై శ్రీనివాస్ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మిని వివరణ కోరగా రాత్రి సమయంలో విద్యార్థినులపై ఏదో పురుగు పాకడంతో అలా జరిగిందన్నారు. ఉదయం ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స చేయించామని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో తిరిగి పాఠశాలకు తీసుకొచ్చామన్నారు. ఘటనపై పలు అనుమానాలు! విద్యార్థినులకు గాయాలైన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినుల మధ్య ఏదైన ఘర్షణ చోటు చేసుకుందా.. లేక ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య విభేదాల కారణంగా విద్యార్థినులపై ప్రణాళిక ప్రకారం గాట్లు పెట్టారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అంత పకడ్బందీగా ఉండే బాలికల గురుకుల పాఠశాలలోకి బయట నుంచి ఇతరులు ఎవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో ఇది పూర్తిగా అంతర్గతంగా జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గొంతు, చెవి వద్ద గాయాలు ఆలస్యంగా వెలుగులోకి.. -
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం. – ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించాలి..పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే న్యాయం పోరాటం చేయాలి. బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛ హరించడమే. ఏపీ ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – ఆడెపు రవీందర్, అధ్యక్షుడు దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం, వరంగల్ అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలినెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. సాక్షిపై కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి. – గుగ్గిళ్ల పీరయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి -
వేధింపులు మానుకోవాలి..
నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – గుగులోత్ భీమానాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడుఇబ్బందులకు గురిచేయడం సరికాదు..వెంకటాపురం(కె): అధికారం ఉందనే అహంకారంతో జర్నలిస్టులు, మీడియా సంస్థను ఇబ్బందులకు గురిచేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సరికాదు. జర్నలిస్టుల గళాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్న చర్యలు తక్షణమే మానుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని సాక్షి జర్నలిస్టులు, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదు. – పర్శిక సతీశ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..స్టేషన్ఘన్పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాలో ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దాడులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికారంగంపై దాడి అనాగరికం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదు. – మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్ -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధికసంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు షెడ్లలో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. -
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
భూపాలపల్లి: జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్దల పర్యవేక్షణలో ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ దీపావళి ప్రతీ ఇంటా వెలుగులు నింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ‘ఏఐటీయూసీ వైఫల్యాలతో అన్యాయం’ భూపాలపల్లి అర్బన్: మైనింగ్ స్టాఫ్కు కొంతకాలంగా జరుగుతున్న అన్యాయానికి కారణంగా ఏఐటీయూసీ గుర్తింపు సంఘం వైఫల్యమేనని టీబీజీకేఎస్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రత్నం అవినాష్, మైనింగ్స్టాఫ్ ఇన్చార్జ్ చీకటి వంశీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘం మైనింగ్ స్టాఫ్ సమస్యల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మేనేజ్మెంట్తో చర్చలు జరపకుండా టీబీజీకేఎస్పై విషప్రచారం చేస్తూ కాలం గడుపుతోందని ఆరోపించారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో జేఎంఈటీలకు ఓవర్మెన్ ప్రమోషన్లు ఆలస్యం లేకుండా ఇప్పించినట్లు తెలిపారు. మొరం దందాను అరికట్టాలి చిట్యాల: మండలంలోని శాంతినగర్లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ శాంతినగర్ గుట్టలలో కొంతమంది నాయకులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. మట్టిని తరలించకుండా అధికారులు చూడాలని అన్నారు. ఆయన వెంట నాయకులు రాము, తదితరులు ఉన్నారు. గంజాయి స్వాధీనం కాటారం: గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకొని వారి దగ్గర నుంచి 1.57 కేజీల గంజాయిని ఆదివారం పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టంపేట గ్రామానికి చెందిన సుతారి శ్రీకాంత్, కమలాపూర్ గ్రామానికి చెందిన సోహెల్, మద్దులపల్లికి చెందిన మేకల అజయ్ కాటారం మండలంలోని పోతుల్వాయి బ్రిడ్జి వద్ద గంజాయి సేవిస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న ఎస్సై శ్రీనివాస్ అనుమానంతో వారిని ప్రశ్నించగా అజయ్ పారిపోయాడు. శ్రీకాంత్, సోహెల్ను విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద 1.57 కేజీల గంజాయి గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. గంజాయితో పాటు ఒక మొబైల్ స్వాధీనపర్చుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీకాంత్, సోహెల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వివరించారు. టేకు దుంగల స్వాధీనం ఏటూరునాగారం: ఏటూరునాగారం నుంచి వరంగల్ వైపు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను పట్టుకున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున మండల పరిధిలోని చిన్నబోయినపల్లి సమీపంలో జినాన్ పింక్ ఆప్ వాహనంలో తొమ్మిది టేకు దుంగలను పట్టుకెళ్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు ఆ వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేస్తుండగా డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలో ఉన్న టేకు దుంగల విలువ రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఈ దుంగలను ఏటూరునాగారం రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నారాయణ, ఎఫ్బీఓ ఖాజామొద్దిన్, జ్యోతి, అనూష, బేస్ క్యాంప్ సిబ్బంది సాంబ, ప్రశాంత్, మహేశ్, నాగేంద్ర, డ్రైవర్ హరీశ్ పాల్గొన్నారు. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలిములుగు రూరల్: కల్లుగీత కార్మికులు హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం 68వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జెండాలు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు. -
ఉమ్మడి జిల్లాలో తగ్గిన వైన్స్ దరఖాస్తుల ఆదాయం
జిల్లాల వారీగా మొత్తం 2023–25, 2025–27 సంవత్సరాల్లో దరఖాస్తులు, ఆదాయం వివరాలు● 294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ ● టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం31816,039294సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో 318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్లో 1,577, వరంగల్ రూరల్లో 910, జనగామలో 950, మహబూబాబాద్లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం.. వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు. రూ.320.7 కోట్ల టార్గెట్.. 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరో ఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. 292.49,754ఆదాయం (రూ.కోట్లలో)వైన్స్2025–27 దరఖాస్తులు2023–25 దరఖాస్తులుదరఖాస్తుల స్వీకరణ మూడు రోజులే..వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది. -
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..
భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ వద్ద పశువులు ఇప్పటికే విద్యుదాఘాతానికి గురయ్యాయి. రోడ్డుపై నిత్యం ప్రయాణికులతో పాటు పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి రోజూ వందలాది మంది విద్యార్థులు వస్తుంటారు. ప్రమాదం జరగకముందే విద్యుత్శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్కు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. – భూపాలపల్లి రూరల్ -
ప్రాచీన వైద్యంతో మెరుగైన జీవనం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: ప్రాచీన వైద్య పద్ధతుల ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కురిమిళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధన్వంతరి వైద్య నారాయణ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై వైద్య నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్ పాల్గొన్నారు. -
నేడు దీపావళి
రేపు కేదారేశ్వర నోములు ●పండుగకు ముస్తాబైన గ్రామాలు ●భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా నేడు (సోమవారం) ఉదయం దీపావళి, బోగి పండుగ హారతులు నిర్వహించి రేపు (మంగళవారం) సాయంత్రం ధనలక్ష్మి పూజలు చేపట్టుకోనున్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మొదటి రోజున వ్రతాలు, నోములు చేసుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెలుగుల పండుగ దీపావళి ధనలక్ష్మి పూజలు, కేదారేశ్వర నోముల కోసం సుదూర ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులంతా సొంత ఊళ్లకు చేరుకున్నారు. పట్టణంతో పాటు పల్లె లోగిళ్లు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పండుగ శోభ సంతరించుకుంది. అందాల ప్రమిదలు దీపావళి పండుగలో మట్టి ప్రమిదలకు ఎంతో విశిష్టత ఉంది. దీపాల కాంతుల్లో గృహాలు, ఆలయాలు మరింత శోభను సంతరించుకుంటాయి. వివిధ ఆకృతుల్లో ఆకట్టుకునేలా తయారు చేసిన ప్రమిదలు అందుబాటులోకి వచ్చాయి. రాజస్థాన్, కేరళ, ఢిల్లీ ప్రాంతాల్లో తయారైన వాటితో పాటు స్థానికంగా తయారుచేసిన ప్రమిదలను విక్రయిస్తున్నారు. డజన్ల చొప్పున విక్రయాలు చేపడుతున్నారు. బాణసంచాకు పెరిగిన ధరలు గతేడాది కంటే ఈ ఏడాది మరింతగా ధరలు పుంజుకున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. చిచ్చుబుడ్డీలు రూ.30నుంచి రూ.800 వరకు, కాకర పువ్వొత్తుల బాక్స్ రూ.250 నుంచి రూ.600 వరకు, స్టార్స్ రూ.20, 30, 40 సైజుల ఆధారంగా విక్రయించారు. ఇతర ప్రాంతాల నుంచి హోల్సేల్గా బాణసంచా తీసుకువచ్చేందుకు హోల్సెల్ వ్యాపారులకు సైతం భారీగా రవాణా, ఇతర చార్జీలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలు గతేడాదితో పోల్చుకుంటే అధికమని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల ప్రభావం ప్రత్యక్షంగా వినియోగదారులపై పడటంతో కొద్దిమొత్తంలో బాణసంచా కొనుగోలు చేసి వెళ్తున్నారు. వెలిసిన దుకాణాలు నోముల సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో తాత్కాలిక దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో మట్టి ప్రమిదలు, నోము దండలు, మట్టి బొమ్మలు, బంతిపూలు, పూజసామగ్రి దుకాణాలు ఏర్పాటు చేయగా వారాంతపు సంత స్థలంలో బాంబుల దుకాణాలను ఏర్పాటు చేశారు. పండుగకు ముందు నుంచే పట్టి ప్రమిదలు, బొమ్మలు, బంతి పూలు బాణసంచాలు కొనుగోలు చేస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్కేసుల నమోదు సరికాదు ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలురాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం వల్ల సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు దాడులను ఖండిస్తున్నాం.. జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కార్ తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శకంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. –పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్ రాష్ట్ర నాయకుడు, జనగామ ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిదికాదు సాక్షి దినపత్రిక, ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ -
క్రీడాకారులను అభినందించిన జీఎం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డబ్ల్యూసీఎల్ కంపెనీ నాగపూర్లో జరిగిన కోలిండియా ఇంటర్ కంపెనీ లెవల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన సింగరేణి క్రీడాకారులను శనివారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అభినందించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై శ్రీనివాసరెడ్డి, మీర్జా యాసిన్, బానోత్ రమేష్, అనుషను శాలువతో సత్కరించి అభినందించి మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించడంలోనే కాకుండా క్రీడలలోనూ అత్యుత్తమ ప్రతిభ చాటడం గర్వించదగిన విషయమన్నారు. సంస్థ తరఫున క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాల సాయం అందజేస్తున్నామని తెలిపారు. యువ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, అధికారులు, కార్మికులు గుండు రాజు, రాహుల్, శ్రీనివాస్, దేవయ్య, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పాక దేవయ్య పాల్గొన్నారు. -
బంద్ సక్సెస్
వాటాకోసం నినదించిన బీసీలుభూపాలపల్లి అర్బన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. బంద్కు అన్ని బీసీ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ సామాజిక వర్గాల నాయకులు మద్దతు తెలిపి బంద్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్దకు బీసీ జేఏసీ నాయకులు చేరుకొని ఆర్టీసీ బస్సులు బయటకి రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరువ్యాపారులు కూడా బంద్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పైడిపల్లి రమేష్, రమేష్, అజయ్, రామగిరి సదానందం, అశోక్, రాజేందర్, రవీందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ర్యాలీ జిల్లాకేంద్రంలోని హన్మాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్లకు గంతలు కట్టుకొని.. మోకాళ్లపై నిల్చుని నిరసన.. సీపీఐ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ సెంటర్లో పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. బీసీ జర్నలిస్టు సంఘాల నాయకులు అంబేడ్కర్ సెంటర్లో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పట్టణంలో బైక్ర్యాలీ చేపట్టి అంబేడ్కర్సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మద్దతు.. బంద్కు జిల్లాకేంద్రంలో ఎమార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. నల్ల కండువాలు ధరించి పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు మద్దతు తెలిసిన రాజకీయ పార్టీలు, సంఘాలు జిల్లాకేంద్రంలో జేఏసీ నాయకుల ర్యాలీ -
విక్రయదారులు నిబంధనలు పాటించాలి
● ఎస్పీ కిరణ్ఖరే భూపాలపల్లి అర్బన్: టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించాలని ఎస్పీ కిరణ్ఖరే ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కూరగాయల సంతలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను పరిశీలించి విక్రయదారులతో మాట్లాడారు. టపాసులు విక్రయించాలనుకునే వారు నిబంధనలు ప్రకారం సరైన లైసెన్స్ పొందాలన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పక్కన, పెట్రోల్ బంకుల సమీపాల్లో దుకాణాలు ఏర్పాటు చేయవద్దన్నారు. తహసీల్దార్, ఫైర్ సర్వీస్, పోలీస్శాఖ సూచించిన ప్రదేశాలల్లో లైసెన్స్ ఉన్న వ్యాపారులు షాపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తితో భేటీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబుతో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే శనివారం భేటీ అయ్యారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో కలిసి జిల్లాలో న్యాయ, పరిపాలన, రక్షణ పరమైన అంశాల గురించి చర్చించి న్యాయమూర్తి సూచనలు తీసుకున్నారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, సీఐ నరేష్ కుమార్, స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్ పాల్గొన్నారు. పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు అర్ఙునరావు రేగొండ: జిల్లాలో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయని, వాటి పరిరక్షణకు పురావస్తు శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు అర్ఙునరావు అన్నారు. శనివారం మండలంలోని పాండవుల గుట్టలు, బుగులోని గుట్టలు, మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాలను పురావస్తు శాఖ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాండవుల గుట్టల్లోని సహజ రాతి ఆకృతులు, పురాతన చిత్రాలు, ప్రకృతి పచ్చదనం ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ గుట్టలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మండలకేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఉప సంచాలకులు నాగరాజు, సాయి కిరణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
శనిపూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయంలో నవగ్రహాల వద్ద సామూహికంగా శనిపూజలు నిర్వహించారు. శనివారం ముందుగా గోదావరిలో స్నానాలు చేసి నవగ్రహాల వద్ద భక్తులు అధికంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరంలో భక్తుల సందడి నెలకొంది. సమాచారం ఇవ్వండి భూపాలపల్లి అర్బన్: అక్రమ మెడిసిన్ అమ్మకాలు చేపట్టినట్లయితే డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని వరంగల్ ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యాన్ని కాపాడే యుద్ధంలో పౌరులే కీలకమన్నారు. పరిసరాల్లో జరిగే అనార్ధాలను గుర్తించాలని సూచించారు. మందుల చీటీలు లేకుండా అబార్షన్ కిట్లు, నిద్ర మాత్రలు అనుమానా స్పద మందులు విక్రయించినట్లయితే 180059 96969 నంబర్కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరా లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. గంజాయి విక్రేతల అరెస్ట్ కాటారం: గంజాయి సేవించడంతో పాటు జల్సాల కోసం ఇతరులకు గంజాయి విక్రయిస్తున్న యువకులను పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం గారెపల్లికి చెందిన జాడి వివేక్, ఆకుల అఖిల్, జాడి గణేశ్, దయకి శ్రీకాంత్, సయ్యద్ అస్లాం, కాటారంకు చెందిన గంట పరిపూర్ణం గంజా యికి అలవాటుపడి స్నేహితులుగా మారా రు. ఇదే క్రమంలో మండలంలోని బయ్యారం గ్రామ సమీపంలో పోలీసులు పెట్రోలింగ్లో చేస్తుండగా ఆరుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు వెంబడించి పట్టుకొని వారి వద్ద గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన పెద్ది నిఖిల్రాజ్ అనే వ్యక్తి దగ్గర జాడి వివేక్ 950 గ్రాముల గంజాయి తీసుకొని రాగా అందులో 50 గ్రాముల వరకు గంజాయి సేవించి మిగితా గంజాయి విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఆరు నిందితుల వద్ద 900 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనపర్చుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏడుగురిపై కేసు నమోదు కాగా ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఒకరు పరారీలో ఉన్నట్లు ఎస్సై వివరించారు. ఆలయాలలో గుడి గంటల చోరీ ములుగు రూరల్: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవాడ రామాలయం, మాదవరావుపల్లి హనుమాన్ ఆలయంలో గంటలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామాలయంలో కంచుతో తయారు చేసిన నాలుగు గంటలు, హనుమాన్ ఆలయంలో ఒక గంటను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయంపై ఆలయ పూజారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
టెన్త్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
● డీఈఓ రాజేందర్ కాళేశ్వరం: విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ ఆదేశించారు. శనివారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పదవ తరగతి స్పెషల్ క్లాసెస్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. ఆయన వెంట ఎంఈఓ ప్రకాశ్బాబు, కాంప్లెక్స్ హెచ్ఎం బి.అన్నపూర్ణ, డీసీఈబీ సెక్రటరీ కిషన్రెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్, శ్యామ్, శ్రీధర్, సీఆర్పీ సతీష్ ఉన్నారు. -
రామప్పలో విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న టాంజనియా దేశానికి చెందిన 30 మంది అధికారులు సందర్శించారు. ప్రొఫెసర్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో వారు రామప్ప ఆలయానికి చేరుకొని రామలింగేశ్వస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు రవి, సాయికృష్ణ, నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం షాపులకు 1,500 దరఖాస్తులు
భూపాలపల్లి: మద్యం షాపులకు టెండర్లు హోరెత్తాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం రోజు నుంచి అప్లికేషన్లు అంతంత మాత్రంగానే రాగా.. చివరి రోజు శనివారం మాత్రం భారీగా వచ్చాయి. తొలుత వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి టెండర్లు వేయడం లేదని భావించినప్పటికీ, దరఖాస్తు రుసుం పెంచినందునే వెనుకంజ వేసినట్లు తెలిసింది. చివరకు పాత వ్యాపారులంతా రంగంలోకి దిగారు. ఒకేరోజు 879 అప్లికేషన్లు.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని భూపాలపల్లి, కాటారం, ములుగు, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో 59 మద్యం షాపులకు ప్రభుత్వం గత నెల 26వ తేదీ నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17వ తేదీ వరకు కేవలం 621 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. చివరి రోజు శనివారం రాత్రి 10.30 గంటల వరకు 879 వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో టెండర్లు వేసే వారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. దీంతో రెండు జిల్లాల్లో మొత్తం సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సర్కారు ఆదాయం పెరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం 2023లో రూ.2 లక్షల అప్లికేషన్ ఫీజులో మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా రెండు జిల్లాల నుంచి మొత్తం 2,161 అప్లికేషన్లు వచ్చాయి. వాటి ద్వారా రూ.43.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దరఖాస్తు రుసుమును రూ.3 లక్షలకు పెంచగా శనివారం రాత్రి 11 గంటల వరకు వచ్చిన అప్లికేషన్ల లెక్కల ప్రకారం ప్రభుత్వానికి సుమారు రూ.45 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అప్లికేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ సర్కారుకు ఆదాయం పెరిగింది. రెండు షాపులకు నిల్.. ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో ఎస్టీ కేటగిరికి రిజర్వ్ చేసిన గెజిట్ 49, 50 నంబరు గల మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 52, 53, 54, 55 షాపులకు ఒకటి చొప్పున రాగా 58వ షాపుకు రెండు చొప్పున అప్లికేషన్లు వచ్చాయి. కాగా ఆయా షాపులకు సైతం శనివారం రాత్రి వరకు దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు పోటెత్తిన అప్లికేషన్లు శనివారం ఒక్కరోజే 879.. అర్ధరాత్రి వరకు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ గతేడాది 2,161 రాక.. ఈ ఏడాది తగ్గినా.. పెరిగిన ఆదాయం -
వేధించడం అప్రజాస్వామికం
ప్రజా సమస్యలపై ప్రజలను చైత్యన పరుస్తున్న పత్రికలపై ప్రభుత్వాలు కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. పత్రికా స్వేచ్ఛను హరించడం విడ్డూరం. సాక్షి పత్రికపై, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తే సంజాయిషీ అడగవచ్చు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. తప్పుడు కేసులు పెట్టి వేధించొద్దు. నిరంకుశత్వంతో అణగదొక్కుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. – రాచర్ల శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
దాడి అమానుషం
నిజాలను నిర్భయంగా రాస్తూ ఎన్నో అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్న సాక్షి దిన పత్రిక ఎడిటర్, జర్నలిస్టుల మీద ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం అమానుషం. తెలంగాణ సామాజిక రచయితల సంఘం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను ఎత్తేయాలి. భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సమంజసం కాదు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను అడ్డుకోరాదు. పౌర సమాజం ఈ ఘటనను ఖండించాలి. – కామిడి సతీష్రెడ్డి, తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘సాక్షి’పై వేధింపులు సరికాదు
● జిల్లాకేంద్రంలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ ● పార్టీలు, ప్రజా, కుల, విద్యార్థి సంఘాల మద్దతు భూపాలపల్లి అర్బన్: ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై వేధింపులు, ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెడుతూ పత్రికా స్వేచ్ఛను హరించడం మానుకోవాలని జిల్లాకేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సభ్యులు డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెడుతున్న అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్న సాక్షి దినపత్రికపై ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అన్యాయాలు, కుట్రలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఎడిటర్ ధనంజయరెడ్డి మీద వరుసగా కేసులు పెట్టడంతో పాటు విచారణల పేరిట వేధింపులకు గురిచేయడం సరైంది కాదన్నారు. అక్రమ కేసులు బనాయించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు, భయబ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. ధర్నాకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు క్యాతరాజు సతీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల జోసెఫ్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పోతరాజు రవిభాస్కర్, సామంతుల శ్యామ్, ఎడ్ల సంతోషం, సామల శ్రీనివాస్, క్యాతం సతీష్, జల్ది రమేష్, ఎర్రం సతీష్, రాజు, మంతెన సమ్మయ్య, నరసయ్య, మోహన్, సారేశ్వర్, సుధాకర్, లక్ష్మారెడ్డి, ప్రవీణ్, సత్యనారాయణ, శ్రీనివాస్, మధు, శేఖర్, రవి, మహేందర్, జగన్, మున్నా పాల్గొన్నారు. -
భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సేకరణ, మ్యుటేషన్, పరిహార చెల్లింపులు, ప్రాజెక్టు పనుల పురోగతిపై శాఖల వారీగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, న్యాయంగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రాజెక్టు సంబంధిత ఫీల్డ్ స్థాయి సమస్యలను అధికారుల ద్వారా సమీక్షించి, తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
బార్డర్లో వాహన తనిఖీలు
కాళేశ్వరం: కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన సమీపంలోని బార్డర్ చెక్పోస్టు వద్ద కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. మూడు రోజుల కిందట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద మావోయిస్టుపార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ కీలక నేత ఆశన్నతో రెండువందల మంది వరకు ప్రభుత్వం వద్ద లొంగిపోయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ మిగిలిన కొంతమంది తలదాచుకునేందుకు ఇటువైపుగా తరలివస్తారనే అనుమానంతో పోలీసులు నజర్ వేశారు. అనుమానితులు, సానుభూతిపరులు భూపాలపట్నం, గడ్చిరోలి జిల్లాల నుంచి తెలంగాణ వైపునకు వచ్చే అవకాశం ఉన్నందున వాహన తనిఖీలు, సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల పత్రాలు, లైసెన్స్, చలాన్లు పరిశీలించారు. నంబర్ప్లేటు లేని వాహనాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆయన వెంట సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నాపాక ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల: మండలంలోని నైన్పాకలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం సందర్శించారు. అలయ అభివృద్ధి పనుల కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు, డిప్యూటీ డైరెక్టర్ నర్సింగం, టెక్నికల్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఉన్నారు. ధ్యానం దివ్య ఔషధం ● హార్ట్ఫుల్నెస్ జోనల్ కోఆర్డినేటర్ మాధవి భూపాలపల్లి అర్బన్: ధ్యానం శరీరంలోని అనేక రుగ్మతలకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని హార్ట్ఫుల్నెస్ యోగా సంస్థ జోనల్ కోఆర్డినేటర్ చింతకింది మాధవి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇల్లందుక్లబ్లో సింగరేణి అధికారులు, వారి కుటుంబ సభ్యులకు మూడు రోజుల ఉచిత యోగా, ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి యోగాసనాలు, ధ్యానం గురించి వివరించి ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చారు. యోగా, ధ్యానాలు ప్రతి మనిషిలోని 70వేల ఆలోచనలను సరళీకృతం చేయడమే కాకుండా వాటి ద్వారా వచ్చే అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని అన్నారు. ధ్యానం ద్వారా మనస్సు కుదుటపడుతుందని, తద్వారా శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయన్నారు. ఈ యోగా సాధన 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి ప్రారంభించగా భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ జిల్లా కోఆర్డినేటర్ చెరుకుపల్లి రవీందర్, నోడల్ కోఆర్డినేటర్ పొంగాని లక్ష్మణ్, వోడ్యాల శ్రీనివాస్, నరేష్, ప్రమీల, సవేరా, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాస ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ... పోషణ మాసంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 4వ స్థానం లభించడం అభినందనీయమని అన్నారు. చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత అంగన్వాడీ సిబ్బందిపై ఉందని చెప్పారు. ఇళ్లలో సహజసిద్ధంగా లభించే మునగ, కరివేపాకు వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలని, ఇవి శరీరానికి పుష్టి, శక్తిని అందిస్తాయని చెప్పారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. టీకాలు వేయించాలి.. పశువులకు టీకాలు తప్పకుండా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. జిల్లా పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా శిబిరాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పశువుల ఆరోగ్యం రైతు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి ముడిపడి ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆవులు, గేదెలు, దూడలు, ఎడ్లకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా పశు వైద్యాధికారి కుమారస్వామి పాల్గొన్నారు. -
ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావు అలియాస్ ఆశన్న
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది (110మంది మహిళలు, 98మంది పురుషులు) సహచరులతో కలిసి 153 ఆయుధా లతో ఆయన జగ్దల్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. ప్రధానంగా దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. భారీగా లొంగిపోయినట్లు ‘ఎక్స్’ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. చర్చల కోసం ప్రయత్నించి.. ఆపరేషన్ కగార్ ఉధృతం కావడం.. చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామ ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక దశలో ఒకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్గఢ్లోని ఓ మీడియా చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొర వ చూపాలని ఆయన కోరారు. అయినప్పటికీ దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. చర్చలతో ఫలితం లేదని లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అ భయ్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపే శ్ సహచరులు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు. మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్ ఏరియా డిప్యూటీ కమాండర్గా, కమాండర్గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆ తర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్వార్ పార్టీ నాయకత్వం యాక్షన్ టీంకు ఇన్చార్జ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్ని క్లైమోర్మైన్ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్లో ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులు ఉన్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్కు కూడా కొంతకాలం ఇన్చార్జ్గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్గఢ్, సౌత్బస్తర్, మాడ్ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు క్యాన్సర్తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్పూర్లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్ స్టూడెంట్ యూనియన్కు (ఆర్ఎస్యూ) నాయకత్వం వహించారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్ఎస్యూలో పనిచేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో.. దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానం -
బోధనేతర భారం
పాఠశాలల తనిఖీలకు ఉపాధ్యాయ కమిటీలపై వ్యతిరేకతభూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీకి ఉపాధ్యాయుల కమిటీల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వగా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనిఖీలకు ఉపాధ్యాయులతో కమిటీలు వేయడం ద్వారా ప్రతిభకలిగిన వా రు కమిటీలకు వెళితే అక్కడ పాఠాలు ఎవరు చెబు తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తని ఖీ బాధ్యతలు తీసుకున్న టీచర్లకు ఇక బడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో సర్కారు బడుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు.. పదేళ్ల సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులతో కమిటీలు వేయాలని విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి తనిఖీ కమిటీలు వేయనున్నారు. ప్రతీ వంద ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక్కటి చొప్పున ప్రతీ 50 ఉన్నత పాఠశాలలకు ఒక కమిటీని నియమించనున్నారు. ఈ లెక్కన జిల్లాలో 394 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 324, ఉన్నత పాఠశాలలు 70 ఉన్నాయి. ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు 4 కమిటీలు, ఉన్నత పాఠశాలలకు 2 కమిటీలు జిల్లాలో వేసే అవకాశం ఉంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత కమిటీలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు స్కూల్ అసిస్టెంట్, ఇద్దరు టీచర్లు ఉండనున్నారు. హైస్కూల్ కమిటీల్లో నోడల్ అధికారితోపాటు 8 మంది సభ్యులు ఉండనున్నారు. బోధనకు దూరం కమిటీల్లో నియమితులయ్యే ఉపాధ్యాయులు బోధనకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు బోధనకు దూరమైతే పాఠశాలల పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. ఉపాధ్యాయులపైనే ఉపాధ్యాయులు తనిఖీల కమిటీలతో పెత్తనంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కమిటీల వల్ల ఉపాధ్యాయుల్లో విభేదాలు పెరిగి లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తనిఖీ కమిటీల వల్ల సిలబస్ పూర్తయ్యే అవకాశం లేకుండాపోతుంది. జిల్లాలో వందకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట నుంచి ఎక్కువగా ఉన్నచోటకి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి విద్యాబోధన నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తనిఖీ కమిటీల్లో ఉపాధ్యాయులను నియమించడం కోసం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల పెదవి విరుపు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి తనిఖీ కమిటీలు 50 ఉన్నత పాఠశాలకు ఒక కమిటీ.. 100 పీఎస్, యూపీఎస్లకు తనిఖీకి మరో బృందం ఉన్నత పాఠశాలల్లో సిలబస్పై ప్రభావం -
ఇసుక అక్రమ రవాణాకు తావివ్వొద్దు
భూపాలపల్లి: ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై రెవెన్యూ, పోలీస్, అటవీ, మైనింగ్, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్లు లేకుండా ఇసుక రవాణా చే సే ట్రాక్టర్లను వెంటనే సీజ్ చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రీచ్ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాలన్నారు. ఇతర జిల్లాలు, ప్రాంతాలకు ఇసుక రవాణా నిషేధమని స్పష్టం చేశారు. జిల్లా సరిహద్దుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా పటిష్ట పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయా లన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తామన్నారు. భక్తులకు ఇబ్బంది రానివ్వొద్దు బుగులోని జాతర భక్తులకు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో దేవా దాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ బుగులోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం జాతర, బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేగొండ మండలం తిరుమలగిరిలో నవంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు అంతరాయం లేకుండా తాత్కాలిక మరమ్మతులు, రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, సింగరేణి భూ పాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. బుగులోని జాతర భక్తులకు సౌకర్యాలు కల్పించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
అమరుల సేవలు మరువలేనివి
భూపాలపల్లి: విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల సేవలు మరువలేనివని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల స్తూపాన్ని గురువారం ఎస్పీ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులు స్ఫూర్తిదాయకులని కొనియాడారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల రక్షణకు కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు వెంకటేశ్వర్లు, నాగార్జునరావు, నరేష్కుమార్, కర్ణాకర్, మల్లేష్, ఎస్సైలు పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు.. ఈ నెల 21వ తేదీ జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తామని ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పోలీస్స్టేషన్లలో ఓపెన్హౌజ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాల్లో భాగంగా పోలీసుల విధులు, షీ టీం, భరోసా, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల గురించి విద్యార్థులకు వివరిస్తామన్నారు. అలాగే ‘డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండడం’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని ఎస్పీ వెల్లడించారు.భూపాలపల్లి అర్బన్: కోల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో భూపాలపల్లి ఏరియా సింగరేణి క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. వీరు పలు పతకాలు సాధించినట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీనివాసరెడ్డి, మీర్జా యాసిన్ బేగం, బానోత్ రమేష్ బంగారు పతకాలు, అనూష వెండి పతకం సాధించినట్లు వెల్లడించారు. కాటారం: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లోకి తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటా చేరవేసి ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ సభ్యుడిపై ఉందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండ కిశోర్ అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, టిపిసిసి శ్రీనుబాబు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ మంథని నియోజకవర్గ అద్యక్షుడు చీమల సందీప్ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ధన్వాడలో నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాంధించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గూర్చి చర్చించారు. ఈ సందర్భంగా బండ కిషోర్, చీమల సందీప్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి యువతను పార్టీతో కలిపి ప్రజాసమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు. యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను రద్దు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల కమల్, పలు మండలాల అధ్యక్షుడు చిటూరి మహేశ్గౌడ్, గడ్డం క్రాంతి, రెబల్ రాజ్కుమార్, మోత్కూరి అవినాష్, సాధుల శ్రీకాంత్, వినీత్, వంశీనాయక్, నగేశ్, రాజు పాల్గొన్నారు. ములుగు రూరల్: విదేశాల్లో ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాని జిల్లా ఉపాధి కల్పన అధికారి తుల రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు చెందిన నమోదిత నియామక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత కలిగిన వారికోసం విదేశీ నియామక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు హోటల్ మేనేజ్మెంట్లో డిప్లమా, డిగ్రీ కలిగిన వారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు అనువైనవని వివరించారు. ఆసక్తిగల వారు tomcom, resume@ gmail. comకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
క్రీడానైపుణ్యాలను పెంపొందించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు చదువుతోపాటు క్రీడానైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీవైఎస్ఓ రఘు, క్రీడా కార్యదర్శి జయపాల్, పీడీలు రమేష్, సాంబమూర్తి పాల్గొన్నారు. జాతర విజయవంతానికి కృషి చేయాలి రేగొండ: బుగులు వేంకటేశ్వర స్వామి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర కోసం చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, పార్కింగ్, విద్యుత్, వైద్యసేవలకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్డబ్యూఎస్ ఈఈ శ్వేత, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ రాంప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం -
ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు
భూపాలపల్లి: నూతనంగా నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల వయసు పైబడిన ఓటర్లను గుర్తించి వారి నిజ వయస్సు ఆధారంగా సవరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో తగు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలన్నారు. బీసీ బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు నిలిచిపోయాయని, దీనికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోసఫ్, లా వణ్య, యాకూబ్, రమేష్, తిరుపతి, కష్ణ, మహేందర్, రజిత, యాకూబీ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
రేగొండ: మండలంలోని బుగులోని జాతరలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాల ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర పనులను అధికారులతో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో మెట్ల వెడల్పు, కోనేరు, మంచినీరు బావి నిర్మాణ పనులకు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి జాతరకు వచ్చే రోడ్లను రూ.5.5 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టనున్నామని, జాతర ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కోటంచలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఈఓ మహేష్, నాయకులు సంపత్రావు, రమణారెడ్డి, విజేందర్, తిరుపతి, వీరబ్రహ్మం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మరింత అంతరం!
ఓరుగల్లు కాంగ్రెస్లో తారస్థాయికి మంత్రుల మధ్య విభేదాలుసాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది.. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయా.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ దంపతుల నడుమ అగాధం పెరిగిపోయిందా.. మేడారం టెండర్లపై ఇటీవల కాలంలో కొండా మురళి హైకమాండ్కు ఫిర్యాదు చేశారన్న ప్రచారం మరింత గ్యాప్ను పెంచిందా.. వరంగల్ రాజకీయాలపై పార్టీ, ప్రభుత్వం దృష్టి సారించిందా.. అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చెబుతున్నారు. రోజురోజుకూ చినికి చినికి గాలివానగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలపై ఇటు అధిష్టానం.. అటు ప్రభుత్వం సీరియస్గా స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివాదాస్పదంగా వ్యాఖ్యలు.. మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతోంది. రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుల వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యేపై చేసిన బాడిషేమింగ్ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఆ తర్వాత తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా దంపతులపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం వరకు వెళ్లారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావులు టీపీసీసీ చీఫ్, సీఎంలకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కొండా సురేఖ, కొండా మురళీధర్రావులతో మాట్లాడింది. టీపీసీసీ చీఫ్, సీఎంల జోక్యంతో సద్దుమణిగినట్లే అనిపించినా.. అంతర్గతంగా ఇంకా రగులుతూనే ఉంది. ఇదే సమయంలో మేడారం సమ్మక్క–సారలమ్మల గద్దెల పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై కొండా మురళి ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారంపై సంప్రదించిన మీడియా ప్రతినిధులతో ‘నేను ఇంట్లోనే ఉన్నాను.. ఎవరిని కలవలేదు, ఫిర్యాదులు కూడా చేయలేదు’ అని మురళి స్పష్టం చేశారు. ఇవన్ని జరుగుతున్న సమయంలోనే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం వేటు వేయడం, బుధవారం హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలవకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారుల మితిమీరినతనంపై చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పరిధిలోని ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తూర్పులో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాయకుల బర్త్డే వేడుకలు జరపడం.. ఏ హోదా లేకున్నా ఎస్కార్టు ఇవ్వడంతోపాటు ఇతర కారణాలను చూపుతూ ఆయనపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నందిరాంనాయక్ స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాశ్ నాగర్లేకు ఏసీపీ బాధ్యతలు ఇచ్చారు. తాజాగా మంత్రి సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసే సుమంత్ను అ పదవినుంచి ప్రభుత్వం మంగళవారం తప్పించింది. 2023 డిసెంబర్నుంచి ఈ పదవీ బాధ్యతలు చూస్తున్న సుమంత్ అభివృద్ధి పనుల్లో మితిమీరిన జోక్యం.. ఇటీవల మేడారం పనుల వివాదానికి కూడా కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం విచారణకు ఆదేశించి.. ఆరోపణలు నిజమేనని తేలడంతో వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కొండా దంపతులు ప్రమేయం లేకుండా జరిగాయన్న ప్రచారం ఉండగా.. బుధవారం సీఎం పర్యటనకు హాజరు కాకపోవడంపైనా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చాలా ఏళ్లుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కొండా దంపతులకున్న రాజకీయ విబేధాలు, వైరం కారణంగానే సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. కాగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా పార్టీ, ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదారు రోజుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు నిఘావర్గాలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వైరల్గా మారిన మంత్రి పొంగులేటిపై ఫిర్యాదుల ప్రచారం వివాదాస్పదంగా కొండా దంపతుల వ్యాఖ్యలు... సీరియస్గా తీసుకుంటున్న ప్రభుత్వం మొన్న ఏసీపీ, నేడు ఓఎస్డీ.. వేటు వేయడంపై దుమారం ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా కొండా దంపతులు జిల్లా రాజకీయాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా...? -
ఉపాధికి ప్రణాళిక
2026–27 ఆర్థిక సంవత్సరానికి సిద్ధమవుతున్న కార్యాచరణ భూపాలపల్లి రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026–27 సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అక్కడి ప్రజల సమ్మతంతో పనులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఈ నెల మొదటి వారం నుంచి శ్రీకారం చుట్టిన అధికారులు ఈనెలాఖరులోగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ చివరి నాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు వంద రోజుల పని.. పథకంలో భాగస్వాములైన కూలీలందరికీ ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందులో భాగంగా ముందుగా గ్రామాలకు అవసరమైన పనులు గుర్తించడంతో పాటు ప్రజల అంగీకారం తప్పనిసరి కావడంతో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో పనులకయ్యే ఖర్చు వివరాలు తయారుచేసి తీర్మానాలను ఉపాధి హామీ వెబ్సైట్లో పొందుపరిచి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇప్పటినుంచే పనుల గుర్తింపు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో 2026–27లో చేపట్టే పనులను ఇప్పటినుంచే గుర్తించనున్నారు. జిల్లాలోని 248 గ్రామ పంచాయతీల్లో ఈ నెలాఖరులోపు గ్రామసభలు పూర్తిచేసి నవంబర్లో మండలాల వారీగా ప్రణాళిక తయారుచేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించనున్నారు. వాటిని క్రోడీకరించి రాష్ట్రస్థాయిలో ఆమోదానికి ప్రతిపాదిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం అడిగిన వారికి పని కల్పించే లక్ష్యంతో అమలుచేస్తున్న ఉపాధిహామీ పథకం నిర్వహణ ఇకనుంచి గ్రామం యూనిట్ వ్యక్తిగత అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఉపాధి పనులు జిల్లా యూనిట్గా తీసుకొని నిర్వహిస్తుండగా.. ఒక గ్రామంలో పనులు ఎక్కువగా.. మరో గ్రామంలో తక్కువగా జరుగుతున్నాయి. పథకం ఉద్దేశం ప్రకారం పని అడిగిన 14 రోజుల్లోగా పని కల్పించాల్సి ఉంది. ఎన్ఐసీ సాఫ్ట్వేర్ వివరాలు నమోదైతే పని కల్పించాల్సిందే.. లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.పనిదినాల లక్ష్యం 12.43 లక్షలు ఇప్పటివరకు పూర్తయినవి 7.61 లక్షలు కూలీలకు చెల్లింపులు రూ.35.80 కోట్లు జాజ్కార్డులు 1,98,060 కూలీల సంఖ్య 2,39,070 ఇప్పటికే గ్రామసభలకు శ్రీకారం స్థానికుల సమ్మతితో పనుల గుర్తింపు కొనసాగుతున్న ప్రక్రియపథకం ద్వారా సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వనమహోత్సవం, పల్లె క్రీడా మైదానాలు వంటి పనులు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు, కట్టుకాల్వల పనులు చేపట్టనున్నారు. ఈసారి భూగర్భజలాలు పెంచేలా ఇంకుడు గుంతలు, పంట కాల్వలు, మట్టిదారులు, కందకాల తవ్వకాలు, పశువుల పాకల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు..ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చే ఏడాది చేపట్టే పనుల్లో నీటి సంరక్షణ పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. వ్యవసాయ అనుబంధ మొక్కల పెంపకం, వ్యక్తిగత అభివృద్ధి పనులు, పశువుల కొట్టాల నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కోళ్లఫాం ఏర్పాటు, ఫిష్పాండ్ పనులకు ప్రాధాన్యం కల్పించాలి. గ్రామసభల అనంతరం నివేదిక రూపొందిస్తాం. –బాలకృష్ణ, డీఆర్డీఓ -
రెవెన్యూ శాఖకు జీపీఓలు కీలకం
భూపాలపల్లి: రెవెన్యూ శాఖకు జీపీఓలు కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నూతనంగా నియమితులైన జీపీఓ (గ్రామ పాలన అధికారి) లకు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. రెవెన్యూ విధులు అత్యంత కీలకమన్నారు. గ్రామస్థాయిలో ప్రతీ అంశంపై అవగాహన ఉండటం ప్రధాన బాధ్యతనన్నారు. భూముల సమస్యలు, రైతుల ఇబ్బందులు, ప్రజల అభ్యర్థనలను మొదటగా గుర్తించేది జీపీఓలేనన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 54 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలనలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, జీపీఓలు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు.. వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్రస్థాయిలో అధికారులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. నవంబర్ మొదటివారం నుంచి జిల్లాలో కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. వీసీలో ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
నేటినుంచి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి పోటీలను నేటి (గురువారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి లావుడియా జయపాల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో క్రీడాపోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరుకాన్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు అండర్– 14, 17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాటారం: కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి దేవ నవీన్ జాతీయ ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పేయింటింగ్ కాంపిటేషన్లో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. దీంతో గురు, స్టూడెంట్స్ పేరెంట్స్ ఇండియా జాతీయ స్థాయి సంస్థ ఉత్తమ విద్యార్థి అవార్డుకు ఎంపిక చేసింది. అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం, అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బుధవారం కరీంనగర్ కళాభారతీలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు గంగారపు మల్లేషం, ఉపాధ్యక్షుడు సుమలత చేతుల మీదుగా నవీన్కు అవార్డును ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, బలరాం, ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్, అధ్యాపకులు నవీన్ను అభినందించారు. పలిమెల: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్స్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన కార్మికుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న పోరాటానికి మద్దతుగా బుధవారం పలిమెల మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు 8 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోతే కార్మికుల కుటుంబ ఎలా గడిచేదన్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. అలాగే డైలీవేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్ది శేఖర్, పెద్ది మధునయ్య, పెద్ది చంద్రయ్య, కాపుల రవి, పెద్ది సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మల్హర్: మండలంలోని తాడిచర్ల అటవీ ప్రాంతంలోని పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పో లీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎస్పీ కిరణ్ఖరే ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో దాడి చేయగా పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.50,500 నగదు, 10 మొ బైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులు కొయ్యూరు పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఐ కోరారు. రేగొండ: పశు పోషకులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్ధక అధికారి కుమారస్వామి తెలిపారు. బుధవారం మండల కేంద్రంతో పాటు రంగయ్యపల్లిలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైందని, పశువులకు ఒకదాని నుంచి మరొక దానికి సంక్రమిస్తుందన్నారు. నవంబర్ 14వ తేదీ వరకు టీ కా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిటి గోపాలకృష్ణ మూర్తి, పశువైద్యాధికారులు మైథిలీ, అభిషేక్, గోపాలమిత్ర, రైతులు పాల్గొన్నారు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
● డీడబ్ల్యూఓ మల్లేశ్వరి మొగుళ్లపల్లి: బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ మల్లేశ్వరి, తహసీల్దార్ సునీత అన్నారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగరాణి, సూపర్వైజర్ మాధవి, సుజాత, అంగన్వాడీ టీచర్స్, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. మల్హర్: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ రాధిక అన్నారు. మండలంలోని మల్లారం కేజీబీవీలో బుధవారం పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలతో తయారు చేసిన పోషకాహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. పోషక విలువలతో కూడిన ఆహారంపై విద్యార్థులకు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ రక్తహీనతతో ఉండకుండా ఐరన్ ప్రోటీన్తో కూడిన ఆహారం తీసుకో వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సద్విని యోగం చేసుకోవాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు భవానీ, భాగ్యలక్ష్మి, ఎన్జీఓ సమ్మయ్య, పోషన్ అభియాన్ స్వప్న, ఏఎన్ఎంస్, ఆశలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
మామునూరు హద్దుల స్థిరీకరణపై దృష్టి
సాక్షి, వరంగల్: వరంగల్వాసుల చిరకాలకోరిక అయిన మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితులనుంచి సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో భూనష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఆ భూముల హద్దుల స్థిరీకరణకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఏఏఐ ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 30 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బిడ్లను వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కొన్ని డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ బిడ్ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపాయి. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తారని విమానాశ్రయ అధికారులంటున్నారు. మిగిలిన పరిహారానికి ప్రతిపాదనలు.. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 253 ఎకరాలను గుర్తించి ఆయా భూయజమానులతో దఫాలవారీగా సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి రూ.1.20కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిసింది. మిగిలింది కూడా సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు అంటున్నారు. భూపరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవి రాగానే అంతా క్లియర్ అవుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి భూమి బదలాయించనున్నారు. విమానాశ్రయం పునరుద్ధరణపై ప్రభుత్వ విభాగాల కసరత్తు ఇప్పటికే బిడ్లను పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 949.14 ఎకరాల హద్దులకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల ఆసక్తి ఇది ఫైనల్ కాగానే నివేదికను సిద్ధం చేసి ఏఏఐకి అప్పగింత పాత రోజులు గుర్తొచ్చేలా... కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్లో మామూనూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లోలాగానే వరంగల్లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ సంస్థల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్తో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో మామూనూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
గణపురం: వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్ సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని వైద్యులకు సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల తనిఖీల కోసం ఏర్పాటు చేస్తున్న తనిఖీ బృందాల ఏర్పాటును విరమించుకోవాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అశోక్, తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ తదితర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిని మెరుగుపరచడానికి ఉపాధ్యాయులను తరగతి గదులకు పరిమితం చేయాలన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలకు మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. కాలసర్ప నివారణ పూజలకు భక్తులకు అధికంగా హాజరయ్యారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరితీరాల్లో భక్తుల సందడి నెలకొంది. కాటారం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పెండెం మధుసూదన్ డిమాండ్ చేశారు. మండలంలోని పలు పాఠశాలల్లో మంగళవారం టీఆర్టీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ స్థానికత ఆధారంగా చేసుకొని 317 జీఓ బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేజీబీవీ, టీజీఎంఎస్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘ సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు పరంసింగ్, సమ్మయ్య, సతీశ్కుమార్, హట్కర్ రమేశ్నాయక్, మోహన్రావు, రేపాల వేణుగోపాల్ పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: నేటినుంచి నవంబర్ 14వ తేదీ వరకు జిల్లాలోని పశువులు, ఆవులు, గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేయనున్నట్లు జిల్లా, పశు, సంవర్ధక శాఖ అధికారి డాక్టరు కుమారస్వామి అసోడా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీకాలు వేసేందుకు 22 వైద్యబృందాలను ఏర్పాటు చేశామన్నారు. వ్యాధి సోకకముందే టీకాలు వేయించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చన్నారు. వెంకటాపురం(ఎం): రామప్పలో చేపట్టిన వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ మంగళవారం 7వ రోజుకు చేరింది. ఉదయం యోగ గురువు రాంబాబు వలంటీర్లకు యోగాసనాలు నేర్పించి యోగతో కలిగే ఉపయోగాలను వివరించారు. అనంతరం రామప్ప హరిత హోటల్లో రాష్ట్ర జల వనరుల అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్రావు కాకతీయుల గొలుసుకట్టు చెరువులు, వాటి వినియోగంపై వలంటీర్లకు వివరించారు. -
పత్తి పంట పోయింది..!
కాళేశ్వరం: ఎగువన కురిసిన వర్షాలతో మహదేవపూర్ మండలం అన్నారం టు చండ్రుపల్లి మధ్యలోని పంట పొలాలను ఈ ఏడాది గోదావరి బ్యాక్వాటర్ నాలుగుసార్లు ముంచింది. దీంతో పత్తి, వరి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికితోడు అడవి పందులు, కోతులు తిరుగుతూ పంటను నాశనం చేస్తున్నాయి. చండ్రుపల్లికి చెందిన రైతు ఆకుదారి రాజయ్య పత్తి పంట వైరస్ సోకి పూర్తిగా ఎర్రబారిపోయింది. అడవి పందులు పంటను ధ్వంసంచేస్తున్నాయి. మంగళవారం పత్తి చేనులో మేకలు, గొర్రెలను తోలాడు. రూ.లక్షన్నర అప్పు అయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. -
ఓసీపీల్లో ఉత్పత్తిని పెంచాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్–2,3 ప్రాజెక్ట్లను డైరెక్టర్ మంగళవారం సందర్శించారు. అనంతరం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి డైరెక్టర్ ఓపీఆర్ కాంట్రాక్టర్లు, డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితులు, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న సవాళ్లపై సమీక్షించారు. వర్షాల కారణంగా గనిలో నిల్వ ఉన్న నీటిని తక్షణమే తొలగించి ఉత్పత్తిని కార్యకలాపాలను వేగంగా పునరుద్ధరించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, సమర్థవంతమైన ఉత్పత్తి కొనసాగించాలన్నారు. అనంతరం ఏరియా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి 2025–26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై సమీక్షించారు. ఈ ఆయా కార్యక్రమాల్లో ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్సుందర్, మేనేజర్ రామాకాంత్, సీఎంఓ ఏఐ అధ్యక్షుడు నజీర్ పాల్గొన్నారు. -
మృతురాలి కుటుంబానికి మంత్రి పరామర్శ
కాటారం: మండలంలోని ఒడిపిలవంచలో ఇటీవల పిడుగుపాటుతో మృతిచెందిన ఇసునం లక్ష్మి కుటుంబాన్ని మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి లక్ష్మి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించడానికి ప్రభుత్వం, తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అద్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ సర్పంచ్ కోడి రవికుమార్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
అందుబాటులోకి కా పాస్ కిసాన్ యాప్..
పత్తి పంట అమ్ముకునే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కా పాస్ కిసాన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రైతులు పత్తి విక్రయానికి ముందు ఈ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు తమ జిల్లాలో ఏ మిల్లులో అయిన పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అనంతరం సదరు మిల్లులో విక్రయాలకు అనుగుణంగా తేది, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా రైతుకు తెలియజేస్తారు. రైతులు విక్రయాల కోసం పడిగాపులు కాయకుండా సమయానికి తీసుకెళ్లి పత్తి విక్రయించొచ్చు. ఇప్పటికే యాప్ విధానంపై వ్యవసాయశాఖ ఏఈఓలకు ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. వీరు రైతులకు వివరించనున్నారు. -
వరంగల్కు నేడు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంనుంచి డా క్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్నగర్లోని పీజీఆర్ గార్డెన్స్కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్య మంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీవెంట అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు 2 గంటలకు తిరుగు పయనం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న సీఎం -
పెద్దపులి.. పంటకు రక్ష!
కాళేశ్వరం: పెద్దపులి పంటకు రక్ష అంటే నిజంగా నమ్మలేకపోతున్నారా! అడవిలో ఉండాల్సిన పెద్దపులి పంటకు రక్షణగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా! కాదోండోయ్ పెద్దపులి బొమ్మతో రైతు తన పంటను రక్షించుకుంటున్నాడు. మహదేవపూర్ మండలం చండ్రుపల్లి గ్రామ శివారులోని పంట పొలాలను అడవి పందులు, కోతులు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతు బుడే లింగయ్య కొత్తగా ఆలోచన చేశాడు. అచ్చం పెద్దపులిలాగా ఉండే ఓ పెద్దపులి బొమ్మను తన మంచె వద్ద కాపలా కాస్తున్నట్లు పెట్టాడు. ఒక్కోసారి ఒక్కో చోట ఆ బొమ్మను పెట్టి పంటను రక్షించుకోవడానికి నానాపాట్లు పడుతున్నాడు. ప్రభుత్వం అడవి పందులు, కోతుల నుంచి పంటను రక్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాడు. -
కొనుగోళ్లకు సర్వం సిద్ధం
కాటారం: సాగులో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని రైతులు సాగు చేసిన పత్తి చేతికి రావడానికి సమయం ఆసన్నమైంది. జిల్లాలోని పలు మండలాల్లో మొదటి దశలో భాగంగా రైతులు పత్తిని సేకరిస్తున్నారు. రైతులు తమ చేలలో నుంచి సేకరించిన పత్తిని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటికే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసే జిన్నింగ్ మిల్లుల్లో వేబ్రిడ్జిలు, కంప్యూటర్లు, ఇతర వసతులను పరిశీలించారు. జిల్లాలో ఈ ఏడాది మూడు మండలాల పరిధిలోని ఐదు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటుచేసి పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. అందులో జిల్లాకేంద్రంలో ఒకటి, కాటారం మండలంలో రెండు, చిట్యాల మండలంలో రెండు సీసీఐ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే సీసీఐకి మార్కెటింగ్ అధికారులు నివేదిక అందించగా అనుమతులు సైతం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సీసీఐ ఆదేశాల మేరకు ఈ నెల 23న జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 98,870 ఎకరాల్లో పత్తి సాగు.. జిల్లాలోని 12 మండలాల్లో 98,870 ఎకరాల్లో రైతులు ఈ సీజన్లో పత్తి సాగు చేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. 11.80 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రైతుల నుంచి వచ్చిన పత్తిని నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో వచ్చే పత్తి కొంత తేమశాతం ఎక్కువగా ఉండి నాసిరకంగా ఉంటుందని సీసీఐ ద్వారా కొనుగోలు చేయడం కష్టతరం అవుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. తగ్గనున్న దిగుబడి.. పత్తి చెట్లు ఎదిగే దశలో అధిక వర్షాలు కురవడంతో జిల్లాలో చాలా చోట్ల పత్తి పంట దెబ్బతింది. తెగులు సోకడంతో పాటు వర్షానికి పత్తి కాయలు మురిగిపోవడం, రాలిపోవడంతో దిగుబడిపై అధిక ప్రభావం చూపనుంది. ఎకరాకు పత్తి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు సైతం దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. దీంతో లక్షలాది రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గితే సీసీఐ పత్తి కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పత్తి క్వింటాల్కు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు మద్ధతు ధర రూ.8110 ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం 8 ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభించనుంది. అంతకంటే తేమ శాతం ఒకటి ఎక్కువగా ఉంటే మద్ధతు ధర నుండి రూ.81.10 పైసలు తగ్గించి కొనుగోలు చేస్తారు. జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం కలిగి ఉన్న పత్తికి మద్ధతు ధర తప్పక అందుతుంది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి విక్రయించాలి. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. – ప్రవీణ్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఈ నెల 23 నుంచి ప్రారంభం సుమారు 11.80 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అంచనా -
క్రీడలతో మానసికోల్లాసం
భూపాలపల్లి: క్రీడలతో శారీరక దృఢత్వం పెంపొందడమే కాక మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో అటవీశాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్రావు, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు క్రీడలు ఆడటం మూలంగా విధుల పట్ల క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందుతాయని అన్నారు. అనంతరం జోన్ స్థాయి అధికారుల మధ్య వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, చెస్, క్యారం, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించారు. సాయంత్రం పర్యావరణ పరిరక్షణపై నాటకాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాళేశ్వరం జోన్ పరిధిలోని ఐదు జిల్లాల డీఎఫ్ఓలు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు.. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 41 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమయానికి చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి.. జిల్లాలో ప్రభుత్వ శాఖల పనితీరు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి శాఖాధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవులలో వెళ్లరాదని సూచించారు. ఏ అధికారి సెలవులో వెళ్లారో, ఫీల్డ్కు వెళ్లారో తెలియడం లేదన్నారు. సిబ్బంది హాజరు సక్రమంగా ఉండేలా ప్రతి అధికారి పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రస్థాయి రోల్ ప్లే, సైన్స్ డ్రామా పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన జిల్లాస్థాయి రోల్ ప్లే, సైన్స్ డ్రామా పోటీలలో జిల్లాలోని 15 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. రోల్ప్లే పోటీల్లో ప్రథమ బహుమతి మహదేవపూర్ బాలురు పాఠశాల, ద్వితీయ బహుమతి భూపాలపల్లి ఉన్నత పాఠశాల, తృతీయ బహుమతి సూరారం ఉన్నత పాఠశాల సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. సైన్స్ డ్రామాలో ప్రథమ బహుమతి కాటారం ఆదర్శ హైస్కూల్, ద్వితీయ బహుమతి దామెరకుంట టీజీడబ్ల్యూఆర్ఎస్, తృతీయ బహుమతి– మహదేవపూర్ బాలికల ఉన్నత పాఠశాల సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు వివరించారు. విద్యార్థులు సైన్స్, టెక్నాలజీలో ముందుండాలని, సోషల్ మీడియా, మొబైల్ వినియోగానికి దూరంగా ఉండాలని బర్ల స్వామి తెలిపారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మిప్రసన్న, సీనియర్ ఉపాధ్యాయులు మడక మధు, వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. -
పైరవీలు అవసరం లేదు
భూపాలపల్లి: ప్రజలు పైరవీలు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా దివస్ కార్యక్రమం నిర్వహించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 12 మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా దివస్కు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
‘సేవ్ పాలపిట్ట’ వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ముద్రించిన ‘సేవ్ పాలపిట్ట’ వాల్పోస్టర్ను గ్రీన్ వారియర్ జేవీఎస్ చంద్రశేఖర్తో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. పాలపిట్టలు రోజురోజుకూ అతరించిపోతున్నాయన్నారు. రేడియోషన్తో పాలపిట్టలకు ప్రాణహాని ఉందని తెలిపారు. వన్యప్రాణులు మన పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వన్యప్రాణుల ద్వారా పర్యావరణ సమతుల్యత, ప్రకృతి మూల్యాల పరిరక్షణ, దట్టమైన వర్షాలు, వాతావరణ నియంత్రణ వీటివల్ల సాధ్యం అవుతుందని వివరించారు. ప్రతి ఒక్కరు వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతగా పరిగణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, పర్యావరణ అధికారి పోషమల్లు పాల్గొన్నారు. -
శిక్షకుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఉచిత వృత్తి శిక్షణ కోర్సులను నేర్పించేందుకు శిక్షకుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ (డీటీపీ), మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లిషు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, జూట్ బ్యాగ్ల తయారీని నేర్పించాల్సి ఉంటుందన్నారు. ఓసీ ప్రభావిత గ్రామాల మహిళలు టైలరింగ్ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి, అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈ నెల 25వ తేదీలోపు జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో అర్హత ధృవపత్రాలతో కూడిన దరఖాస్తులను అందించాలని సూచించారు. పలిమెల: పోడు పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మహదేవపూర్ యూని యన్ బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ మహదేవపూర్, పలిమల మండలాలకు సంబంధించిన ఆదివాసీ రైతులు అటవీ పట్టా లు పొందినప్పటికీ బ్యాంకుల నుంచి పంట రుణాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రుణాలు ఇస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రమే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దమ్మూరు మాజీ ఉపసర్పంచ్ మడే సత్యనారాయణ, సంఘం నాయకులు పెద్ది శేఖర్, రామినేని రాజబాబు, తోలం భిక్షపతి, మేడే సురేష్, జనగామ ముత్తయ్య పాల్గొన్నారు. కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తయారు చేసిన సూక్ష్మ కళాకృతులకు గుర్తింపుగా అత్యంత ప్రముఖమైన క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు దక్కింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెన్సిల్ గ్రాఫైట్పై 0.4 మిల్లీమీటర్ల ఎత్తు 0.2 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ పతాకాన్ని సుమారు గంట పాటు శ్రమించి రజనీకాంత్ తయారు చేశారు. క్రెడిట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు వికాస్ బొండవే, పునీత్ మాదన్ సూక్ష్మ ఆకృతిని గుర్తించి రజనీకాంత్కు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఇంతకుముందు రజనీకాంత్ రెండు బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులతో పాటు అంతర్జాతీయ జాతీయ అవార్డులను కూడా సాధించారు. క్రెడిట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకున్న రజనీకాంత్ను ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, వార్డెన్ బలరాం, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. వెంకటాపురం(ఎం): 13వ శతాబ్దంలోనే కాకతీయులు ట్రిపుల్ టీ (టౌన్, టెంపుల్, ట్యాంక్) విధానాన్ని అనుసరించారని ప్రొఫెసర్ పాండురంగారావు వలంటీర్లకు వివరించారు. మండల పరిధిలోని రామప్పలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ సోమవారం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ టీ విధానంపై పలు వివరాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ సత్యనారాయణ రామప్ప ప్రాంత చరిత్ర, ఈ ప్రాంత ప్రజల జీవన విధానం, సాంస్కృతిక వైవిధ్యం గురించి వివరించారు. ప్రొఫెసర్ సీతారాములు స్ట్రెస్ ఎనాలిసిస్ ఆన్ హెరిటేజ్ స్ట్రక్షర్స్ ఎలా చేయాలో వివరించారు. అనంతరం పాండవుల గుట్ట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలో తెలుసుకున్న అంశాలను పవర్ పాయింట్ ద్వారా వలంటీర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కో ఆర్డినేటర్ శ్రీధర్రావు పాల్గొన్నారు. -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
రేగొండ: పోషక విలువలు గల ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు సంధ్య, సుజాత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. పోషకాహార లోపం సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. అంగన్వాడీ టీచర్లు బాలింతలు, గర్భిణులకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. పోషణలోపం లేని సమాజం నిర్మించడానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి -
టెన్త్పై ఫోకస్
చిట్యాల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులను పరిశీలిస్తున్న డీఈఓ రాజేందర్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండే విధంగా జిల్లా విద్యాశాఖ అఽధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడిపోయింది. జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణను వారం రోజుల క్రితం నుంచి ప్రారంభించారు. 3,600మంది విద్యార్థులు జిల్లాలోని 12 మండలాల్లోని 157 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో 3,600 మంది పదో తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రత్యేక తరగతు ల కార్యాచరణ ప్రణాళికలను జిల్లా ఇన్చా ర్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తయారు చేసి పా ఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ రోజు అదనంగా గంట పాటు ప్రతి రోజు సాయంత్రం 4.15గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహణను మండల విద్యాశాఖ అఽధికారులు, సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షణ చేసి ప్రగతిని డీఈఓకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా విద్యార్థుల సామర్ాధ్యలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు పాఠాల బోధనతో పాటు స్లిప్ టెస్టులు పెడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి పాస్ కావాలి. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి. రాష్ట్రంలో ప్రఽథమ స్థానం సాధించడానికి ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక తరగతుల కార్యాచరణ ప్రణాళికలను కచ్చితంగా కట్టుదిట్టంగా అమలు చేయాలి. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై పూర్తిస్థాయి పాఠాలు నేర్పించి వారి అనుమానాలను నివృత్తి చేయాలి. పక్కా ప్రణాళికలతో ప్రతి రోజు గంట పాటు అదనంగా చదివిస్తున్నాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓపదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ సాయంత్రం అదనపు క్లాసుల నిర్వహణ డిసెంబర్ 31వ తేదీ వరకు విద్యార్థులకు సిలబస్ను పూర్తిచేయాలి ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో సంబందిత ఉపాధ్యాయుడికి సెలవు మంజూరు చేయవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రతి అధ్యాయం పున:శ్చరణ చేయాలి. పరీక్ష మార్గదర్శకాలకు అనుగణంగా పాఠశాల స్థాయిలో పరీక్ష పత్రాలను తయారు చేయాలి. షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహించాలి చదువులో వెనుకబడిన పిల్లలకు సవరణాత్మక బోధన చేయాలి. ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులను గుర్తించి దత్తత చేసుకోవాలి. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సామర్ధ్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. -
మెరుగైన పాలన అందించడమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం జిల్లాలోని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. డీసీసీ అధ్యక్ష పీఠం ఆశిస్తున్న వారి గురించి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్సన్ అబ్రహం మాట్లాడుతూ.. సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమ లక్ష్యం కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయడమేనన్నారు. అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన నాయకుడినే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాహుల్గాంధీకి రెండు పర్యాయాలు పీఎంగా అవకాశం వచ్చినా, పదవిని వదిలేసి ఆ స్థానంలో సుముచితులైన వారికి కూర్చోబెట్టారన్నారు. 2029లో దోపిడీ దొంగల నుంచి ఈ దేశానికి విముక్తి కలిగేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అబ్జర్వర్ అఫ్సర్ జాసువి, సాగరికారావు, నాగేందర్రెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ సుబ్బారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం -
సారూ.. ఇంకెప్పుడిస్తారు?
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి భాస్కర్గడ్డ సమీపంలో 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి 2023లో పనులు పూర్తిచేసింది. అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని రద్దు చేసింది. సర్వే చేసి లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. అధికారులు సర్వేల పేరుతోనే రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారే తప్పా లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేయడం లేదు. దీంతో గదుల్లోని విద్యుత్ వైర్లు, బోర్డులు, డోర్లు, పైపులు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కిటికీల అద్దాలు, వంట గదుల్లో గ్యాస్ బండలు పగులగొట్టారు. పలు చోట్ల గోడలు కూడా పగుళ్లు పడుతున్నాయి. ఆకతాయిలు మద్యం తాగి ఖాళీ సీసాలు పడేస్తున్నారు. పంపిణీకి నోచుకోని భాస్కర్గడ్డ డబుల్ బెడ్రూం ఇళ్లు ● సర్వేల పేరుతో కాలయాపన ● ఆకతాయిలకు అడ్డాగా మారిన గృహాలు -
డీసీసీ పీఠం కోసం దరఖాస్తుల వెల్లువ
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష(డీసీసీ) పదవి కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 12 మండలాల నుంచి పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వారు జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు మాజీ మావోయిస్టు గాదర్ల అశోక్ అలియాస్ ఐతు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డితో పాటు చల్లూరి మధు, ఇస్లావత్ దేవన్, మండల తిరుపతిగౌడ్, పిప్పాల రాజేందర్, మొకిరాల మధువంశీక్రిష్ణ, క్యాతరాజు సాంబమూర్తి, అప్పం కిషన్, దబ్బెట రమేష్, గద్దె సమ్మయ్య, గూట్ల తిరుపతి డీసీసీ పీఠం కోసం దరఖాస్తులు అందజేశారు. డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం పార్టీ అధిష్టానం నియమించిన టీపీసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం ఆదివారం సాయంత్రం భూపాలపల్లికి వచ్చారు. సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోనున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అబీష్టం మేరకు మాజీ మావోయిస్టు గాదర్ల అశోక్కు డీసీసీ పదవి అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
మొగుళ్లపల్లి: డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ అమలుచేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాల్లోనూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు కట్టబెట్టాలని చెప్పారు. బీసీలకు సముచిత స్థానం కల్పించి మాట నిలుపుకోవాలని కోరారు. పాండవుల గుహలను సందర్శించిన విద్యార్థులు రేగొండ: వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంపునకు వచ్చిన విద్యార్థులు ఆదివారం మండలంలోని పాండవుల గుహలను సందర్శించారు. పాండవుల గుట్టకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ అధికారి డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ విద్యార్థులకు వివరించారు. అనంతరం పాండవుల గుహలలోని పలు ప్రదేశాలను తిలకించారు. మందుబాబులకు అడ్డాగా పాఠశాల భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్పల్లి ప్రాథమిక పాఠశాల రాత్రి సమయంలో మందుబాబులకు అడ్డాగా మారుతుంది. పాఠశాలకు గేటు లేకపోవడం, ప్రహరీ ఓ మూలన కూలిపోవడంతో రాత్రి సమయాల్లో పాఠశాలలోనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. పశువులు సైతం వస్తున్నాయి. పాఠశాలకు గేటుతో పాటు కూలిపోయిన ప్రహరీని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు టేకుమట్ల: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై దాసరి సుధాకర్ అన్నారు. శనివారం రాత్రి మండంలోని ఎంపేడు, రామకిష్టాపూర్(వి) చలివాగు, మా నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్లు ఉడుత వెంకటేష్, రొంట్ల అవినాష్రెడ్డి, అప్పని రమేష్పై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. కుంటుపడుతున్న అభివృద్ధి భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందన్నారు. దీంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ప్రవీణ్ కుమార్, సతీష్, సుగుణ, శ్రీనివాస్, జోసెఫ్, లావణ్య ,మహేశ్, రవికాంత్ పాల్గొన్నారు. -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్జైలు ఖైదీ ఆత్మహత్య..సబ్జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. -
మద్యం సిండికేటు
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏ4 వైన్స్ 59భూపాలపల్లి: మద్యం వ్యాపారులు ‘సిండికేటు’ అయ్యారు. గతంలో షాపులను దక్కించుకున్న వారు తిరిగి రంగంలో ఉండేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రూపుగా ఏర్పడి ఇతరులు దరఖాస్తులు చేసుకోకుండా తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రెండు జిల్లాల్లో 29 దరఖాస్తులే.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండగా శనివారం సాయంత్రం వరకు కేవలం 29 అప్లికేషన్లు మాత్రమే అందాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా భూపాలపల్లి సర్కిల్కు రాగా అత్యల్పంగా ఏటూరునాగారం, ములుగుకు వచ్చాయి. భూపాలపల్లిలో సిండికేటుకు యత్నాలు.. భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో 30 ఏ4 మద్యం షాపులకు ఎకై ్సజ్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఇక్కడ గతంలో షాపులను దక్కించుకున్న, మద్యం డాన్లుగా పేరొందిన వారు తిరిగి షాపులను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక్కో వ్యాపారి 50 నుంచి 100కు పైగా దరఖాస్తులు సమర్పించగా, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోకుండా సులువుగా షాపులను దక్కించుకునేందుకు సిండికేటుగా ఏర్పడి అప్లికేషన్లు వేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగంలోకి రియల్టర్లు.. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో రియల్టర్లంతా మద్యం వ్యాపారంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన రియల్టర్లు ఇక్కడి మద్యం షాపుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వారు సిండికేటు కావడంతో సమాలోచనలో ఉన్నట్లు సమాచారం. ములుగులో పెరిగే అవకాశం.. ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర, బొగత తదితర ప్రాంతాలు ప్రస్తుతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఇక్కడి మద్యం షాపులకు ఈసారి డిమాండ్ ఏర్పడనుంది. దీంతో ములుగు, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలోని మద్యం షాపులకు అప్లికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.300 అభిషేకం పూజలుషాపుల కోసం పాత వ్యాపారుల ఎత్తుగడలు సిండికేటుగా ఏర్పడి దక్కించుకునేందుకు యత్నాలు శనివారం వరకు కేవలం 29 దరఖాస్తులు -
ఉద్యోగాల ఎగవేతకు కుట్రలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కారుణ్య నియామకాలు చేపట్టకుండా సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల ఎగవేతకు కుట్రలు పన్నుతుందని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో బొగ్గు గని కార్మికులకు దీపావళి పీఎల్ఆర్ బోనస్ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెంచినట్లు చెప్పారు. మెడికల్ బోర్డు ఉద్యోగాల జాప్యం ఎందుకు జరుగుతుందో సింగరేణి యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కులను బొందపెట్టాలని సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోందన్నారు. సింగరేణిలో కార్మికులు అన్ఫిట్ అవుతున్నా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు యాజమాన్యం, ప్రభుత్వానికి లొంగుబాటు వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, రాసాకట్ల నర్సింగరావు, శంకర్, నారాయణ, మల్లేష్, రాజు, భాస్కర్ పాల్గొన్నారు. -
కంకరతేలి గుంతలమయంగా..
రేగొండ మండల పరిధిలోని బాగిర్థిపేట, కనిపర్తి, కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట, దామరంచపల్లి, గాంధీనగర్ బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర తేలి పెద్ద, పెద్ద గుంతలు తయారయ్యాయి. ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. – రేగొండ కంకర తేలిన వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట రహదారి -
బాలలు హక్కులను తెలుసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: బాలలు హక్కులను తెలుసుకొని వాటిని సాధించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్ నాయక్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపతిముర్మును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. బాలికలు నేడు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు. సమాజంలో పాతుకుపోయిన దురాచారా లను అధిగమించి ముందుకు సాగాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీపీ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసచారి, శ్రావణ్రావు, ఎస్ఓ ఈశ్వరి, న్యాయవాదులు పాల్గొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్ నాయక్ -
పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేలా చర్యలు
● మార్కెట్ చైర్పర్సన్ పంతకాని తిరుమలకాటారం: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఏఎంసీ ఆవరణలో పత్తి విక్రయాల్లో రైతులు పాటించాల్సిన సూచనలు తెలియజేస్తూ ముద్రించిన పోస్టర్ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తిరుమల మాట్లాడుతూ ఈ నెల చివరి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు పత్తి విక్రయాలకు సంబంధించి పలు సూచనలు పాటించాలని తెలిపారు. రైతులు విక్రయానికి ముందు కపాస్ కిసాన్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలని దీని ద్వారా తమ ఇష్టమైన మిల్లుకు పత్తి విక్రయించడానికి సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. రైతులు తాము వినియోగించే ఖాతాకు ఆధార్లింకు చేసుకోవాలని సూచించారు. పత్తికి మద్దతు ధర క్వింటాల్కు రూ.8110 ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఏఎంసీ కార్యాలయంలో ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్లో చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి లా షరీఫ్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్, ఆత్మకూరు కుమార్యాదవ్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాలసర్ప, శని పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ భూపాలపల్లి అర్బన్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, దిశ ములుగు ఆధ్వర్యంలో శనివారం భూపాలపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీహెచ్సీ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ ఉమాదేవి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, ఆస్పత్రి ఆర్ఎంఓలు డాక్టర్ దివ్య, డాక్టర్ రాజేష్, దిశ క్లస్టర్ మేనేజర్ జ్యోతి, మారి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సదానందం హాజరై వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రించడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది, మారి సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. టిప్పర్ యజమానుల సమ్మె భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్లకు రవాణా చార్జీలు పెంచాలని కోరుతూ.. టిప్పర్ యాజమానులు సమ్మె చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం కోల్ ట్రాన్స్ఫోర్ట్ టిప్పర్ ఓనర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీ–2,3, తాడిచర్ల ఓపెన్ కాస్టుల వద్ద టిప్పర్లను అడ్డుకొని డ్రైవర్లకు గులాబీ పువ్వు అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రొడ్డ రవీందర్ మాట్లాడుతూ.. భూపాలపల్లి నుంచి కేటీపీపీ, ఉప్పల్ బొగ్గు రవాణాకు పాత ధరలు గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. నూతనంగా ప్రతి టన్నుకు రూ.110, 120, 300 పెంచాలని కోరారు. దీనిపై పది రోజుల క్రితమే కోల్ ట్రాన్స్పోర్టర్లకు సమ్మె నోటీసు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రభాకర్, మహేందర్, రాకేష్, నర్సయ్య, లక్ష్మయ్య, రాములు, శ్రీరాములు, నర్సింహరెడ్డి, అశోక్, తిరుపతి పాల్గొన్నారు. రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని జర్మనీకి చెందిన డానియల్, వోలివా, సారియా కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని వారు శనివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ బాగుందని కొనియాడారు. అదేవిధంగా ఇంగ్లండ్కు చెందిన జొనాతన్ డేవిస్ సందర్శించగా రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ ఆయనకు వివరించారు. -
వంట వండేదెట్ల..?
● మధ్యాహ్న భోజన నిర్వాహకుల అవస్థలు ● నిలిచిన బిల్లులు.. పెరిగిన ధరలు ● అప్పులు చేసి నెట్టుకొస్తున్న ఏజెన్సీలు కాటారం: నెల నెలా సక్రమంగా బిల్లులు అందకపోవడం.. నిత్యావసర సరుకులు, కోడిగుడ్ల ధరలు పెరగడంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పెరిగిన కూరగాయలు, గుడ్లు, పప్పు దినుసులు, వంట చెరుకు, గ్యాస్ ధరలతో తమపై అధిక మొత్తంలో ఆర్థికభారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నాలుగు నెలలుగా నిలిచిన బిల్లులు.. జిల్లాలో 12 మండలాల్లో మొత్తం 432 పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ఒక పాఠశాలకు నెలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా సుమారు రూ.లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు వ్యయం అవుతుంది. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక్కో నెలకు సంబంధించి సుమారు రూ.46 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగు నెలలకు సంబంధించి కోటి 84లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన బిల్లులు అందలేదని నిర్వాహకులు చెబుతున్నారు. లక్షల్లో బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఏజెన్సీల మహిళలు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. బిల్లులు నెలవారీగా రాకపోవడం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, విపరీతంగా పెరిగిపోవడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కష్టతరంగా మారుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు.. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సన్నబియ్యం పౌరపరఫరాల శాఖ నుంచి సరఫరా చేస్తుండగా.. ఇతర సామగ్రి నిర్వాహకులు సమకూర్చుకుంటున్నారు. భోజనంలో ఆకుకూరలు, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందజేయాలి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు కుకింగ్ చార్జీల కింద ఒక్కొక్కరికి రూ.6.29 చెల్లిస్తారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.8.40 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కోడిగుడ్డుకు రూ.6 చెల్లిస్తుంది. కానీ ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ.7 ఉండగా దోసకాయలు, ఆలుగడ్డ, బీరకాయ, దొండకాయతో పాటు ఆకుకూర ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కూరగాయల ధర చూసినా కిలోకు రూ.60 కంటే తక్కువగా లేదు. కోడిగుడ్డుకు రూ.1 అదనంగా చెల్లించి విద్యార్థులకు పెట్టాల్సి వస్తుందని.. అధిక ధరలు వెచ్చించి కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. ధరలు పెరుగుతున్నప్పుడు అందుకు అనుగుణంగా బిల్లులు పెంచడం లేదని అంటున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో భోజన పథకం నిర్వహణ మరింత భారం అవుతుంది. బిల్లులు అందేలా చూస్తాం.. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు పెండింగ్లో లేకుండా అందేలా చూస్తాం. నిధులు మంజూరు కాగానే సంబంధిత ఏజెన్సీల ఖాతాల్లో జమఅయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం అందేలా చూస్తున్నాం. – రాజేందర్, డీఈఓప్రభుత్వ పాఠశాలలు 432 విద్యార్థులు 19,788 వంట నిర్వాహకులు 510 వంట ఏజెన్సీలు 415 -
– వెంకటాపురం(ఎం)
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. ఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్గా ఇండియా కల్చర్పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్గా బాగుంది. – హమీద్ దాస్, కోల్కతాపప్పు ధాన్యాల సాగు లాభదాయకం -
సమాచార హక్కు చట్టం వజ్రాయుధం
● సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శనివారం ఏరియా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఒక బలమైన సాధనమన్నారు. భూపాలపల్లి ఏరియాలో ఈ చట్టాన్ని అమలు చేయడంతో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అధికారులు కృషిచేయాలని సూచించారు. అనంతరం అఽధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, రవికుమార్, రాజేశ్వర్, ఎర్ర న్న, మారుతి, ప్రదీప్, కార్తీక్, రాజు పాల్గొన్నారు. -
ఇంకా మహదేవపూర్ కేంద్రంగానే..
పలిమెల: పలిమెల మండలం ఏర్పడి నేటికి పదేళ్లు అవుతున్నా మండలంలోని ప్రజలకు మాత్రం మెరుగైన పాలన ఇంకా అందడం లేదు. నేటికీ మండల కేంద్రంలో ఒక పోలీస్స్టేషన్ మినహా ఏ ఇతర కార్యాలయాలు లేవు. చిన్న మండలాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ప్రభుత్వ ఉద్దేశంతో మహదేవపూర్ మండలంలో ఉన్న పలిమెలను ఎనిమిది గ్రామపంచాయతీలతో కలిపి మండలంగా చేశారు. మండల ఏర్పాటు తొలి రోజుల్లో సంతోషించిన ప్రజలు సేవలు అందక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి కలెక్టర్ ప్రత్యేక చొరవ.. అక్టోబర్ 11, 2016లో పలిమెల మండలం ఏర్పాటైంది. అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళి ప్రత్యేక చొరవతో మండల కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉండేలా మండల కార్యాలయాల సమీకృత భవనాన్ని నిర్మించారు. కానీ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవనే కారణంగా చూపి అధికారులు మహదేవపూర్లోనే తిష్ట వేస్తున్నారు. తనిఖీలు ఉంటేనే.. కలెక్టర్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, మంత్రుల, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మండల పర్యటనకు వస్తే తప్పా అధికారులు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో అసలు మండలానికి చెందిన అధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అధికారాన్ని అనుభవిస్తున్నారే తప్పా ప్రజలకు మాత్రం ఉపయోగపడటం లేదని ప్రజలు బాహాటంగా అనుకుంటున్నారు. ఏం కావాలన్నా మహదేవపూర్కు.. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులకు కావాల్సిన రెవెన్యూ సేవలు(సర్టిఫికెట్లు), వ్యవసాయ శాఖ సేవలు, మండల పరిషత్కు సంబంధించిన సేవలు, తదితర సేవలకు ప్రజలు పాత మండల కేంద్రమైన మహదేవపూర్కు పరుగులు పెట్టాల్సిందే. ముకునూరు నుంచి మహదేవపూర్ వెళ్లాలంటే సుమారు 60 కిలో మీటర్లు ప్రయాణించాలి. తీరా అక్కడికి వెళ్లాక అధికారులు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి ఉంది. కులం సర్టిఫికెట్ కావాలంటే రూ.50లతో అయ్యే పనికి చార్జీలతో కలిపి రూ.500 కావాల్సిందే. అదే కార్యాలయాలు ఇక్కడే కొనసాగితే సులభంగా పనులు అవుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చుట్టుపు చూపుగా వచ్చిపోతున్న అధికారులు మెరుగైన పాలన అందని దుస్థితి ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
మానసిక ఆరోగ్యం ఉండాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు భూపాలపల్లి అర్బన్: శరీర అంగాలు అన్ని సరిగా ఉంటేనే సరిపోదని, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్బాబు తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హెచ్ఎంఆర్డీఎస్లోని దివ్యాంగ బాలలతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్, ఇతర వ్యసనాలకు అలవాటు పడినవారు, నేరాలకు పాల్పడే వారిలో చాలా మందికి మానసిక ఆరోగ్యం సరిగా ఉండదన్నారు. శరీరంపై చూపే శ్రద్ధతో పాటుగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం దివ్యాంగ పిల్లలకు పండ్లు, చాకోలెట్లు పంపిణీ చేశారు. హియరింగ్, ఎయిడ్స్, హెల్త్ క్యాంపు ఇతర ఏ సహాయం కావాలన్నా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, జీపీ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, హెచ్ఎంఆర్డీఎస్ సంస్థ నిర్వాహకులు రజిత, రాజయ్య, న్యాయవాదులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, దివ్యంగా విద్యార్థులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘ది హైపోతీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేదస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్లో 700 అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది 81.03 క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు సాధించడం గర్వంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో నిట్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాపక నాగరాజు, ములుగు జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని డీడీ జనార్దన్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో హెడ్ మాస్టర్, సబ్జెక్టు పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ చేయాలన్నారు. 2013 సంవత్సరంలో అప్గ్రేడ్ అయిన ఏయూపీఎస్ పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయాలన్నారు. -
పత్తిరైతు పరేషాన్!
అధిక వర్షాలతో పంట నష్టంకాళేశ్వరం: పత్తి రైతు ఈ సారి పరేషాన్లో పడ్డాడు. రోజుల తరబడి కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా తిన్నదని రైతులు వాపోతున్నారు. ముందుగా కాసిన కాయలన్నీ నల్లబడిపోయాయి. విచ్చుకున్న పత్తి తడిసి అందులో మొలకలు వస్తున్నాయి. వానలకు చీడ పీడలు, తెగుళ్ల ఉధృతి బాగా పెరిగింది. తెల్లదోమ, పచ్చ దోమ దాడి పెరిగిపోయింది. దీంతో మలిదశ పూత, కాతంతా రాలిపోతోంది. తెగుళ్లతో ఆకులపై నల్లని మచ్చలు, ఎర్రబారి చెట్టు కుంగిపోతోంది. మరో రెండునెలలు పచ్చగా ఉండాల్సిన చేలు పండుటాకులతో వెలవెలబోతున్నాయి. ఆకురాల్చి మొక్కలన్నీ మోడులవుతున్నాయి. రైతులు నివారణ చర్యలు చేపట్టలేకపోతున్నారు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు అంటున్నారు. అన్నారం టు కాళేశ్వరం వరకు గోదావరి ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లో వరదనీరు ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఎడతెరిపి లేని వర్షాలతో తమను నిండా ముంచాయని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గనున్న దిగుబడి.. ఈ ఏడాది జిల్లాలో 98,780 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడ పీడల కారణంగా దిగుబడులు సగానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. మొదటి కాసిన కాయలన్నీ నల్లబడ్డాయి. విచ్చుకున్న పత్తి బూజుపట్టి రంగు మారింది. మొదట్లో కాసిన కాయలే పెద్దగా ఉండి బరువు తగ్గుతాయని రైతులు అంటున్నారు. ఆకులు, ఆ కాయలన్నీ నల్లబడి నేలరాలడంతో పాటు దోమ పోటుతో రెండో దశ పూత, కాత నిలవడం లేదు. తెగుళ్లతో రెండునెలల ముందుగానే చేలన్నీ ఎండిపోతున్నాయి. పత్తిలో సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అలాంటిది నా లుగైదు క్వింటాళ్లు రావడమే కష్టమని రైతులు అంటున్నారు. పెట్టుబడులకు అప్పులు చేసి ఖర్చు చేశామని దిగుబడులు రాకపోతే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. నల్లబారి రాలిపోతున్న పూత, కాత విజృంభిస్తున్న తెగుళ్లు దిగుబడులపై ప్రభావం ఆందోళనలో రైతాంగంపత్తి ఆరుతడి పంట అడపాదడపా వర్షాలు కురిస్తే పత్తిచేలు ఆరోగ్యంగా ఎదిగి, ఆశించిన దిగు బడిని వస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై నెలల్లో తీవ్ర వర్షాభావం ఉండగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారం వరకు ప్రస్తుతం వర్షాలు దంచి భూమిలో అధిక తేమతో పత్తి పంటకు వేరుకుళ్లు, పారవిల్డ్ లాంటి తెగులు సోకి వేరు వ్యవస్థ దెబ్బతిని ఎదుగుదల నిలిచిపోయింది. బురదమయంగా ఉన్న చేలల్లో సూక్ష్మదాతు లోపం కనిపిస్తోంది. మెగ్నీ షియం, జింకు, బోరాన్ లోపం వల్ల పంట దెబ్బతింటోంది. రైతులు వర్షం భయంతో ఎరువులు వేయడం లేదు. పురుగు మందులు పిచికారి చేయలేకపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వంట చేతికొచ్చే సమయంలో దెబ్బతింటుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. -
దిగుబడి కష్టమే..
నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేఽశాను. రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చు అయింది. తీవ్ర వర్షాలతో దిగుబడి కష్టంగా మారింది. వేరు చక్కగా ఎదిగే సమయంలో అధిక వర్షాలతో రోగాలు అంటుకున్నాయి. పత్తి చేలు ఎర్రబడి ఎండిపోతున్నాయి. రోజుల వ్యవధిలోనే మాయదారి రోగం మొత్తం పాకింది. పత్తి మొక్కలు ఆకురాలి మోడులై కనిపిస్తున్నాయి. రెండోసారి వచ్చే పూత, కాతను దక్కించుకుందామంటే చీడపీడలు ముసురు కున్నాయి. ఇప్పటికే ఎరువులు వేశాం. మందులు కొట్టాం. ప్రతీసారి కంటే ఈ ఏడు ఎక్కువ పెట్టుబడి అయింది. దిగుబడులు చేతికొచ్చే సమయంలో వర్షాలు దెబ్బకొట్టాయి. – సల్పాల కుమార్, టేకుమట్ల (రామకృష్ణపూర్ టి) -
నిర్దేశిత వ్యవధిలో సమాచారం అందించాలి
భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘సమాచార హక్కు చట్టం–2005’ వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఎస్డీసీ రమేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి విద్యార్థులు చేసే పనిలో నిబద్ధతగా ఉంటూ, నైపుణ్యం పెంపొందించుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అధునాతన సాంకేతిక కేంద్రం (ఏటీసీ)ను కలెక్టర్ రాహుల్శర్మ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్లు, పరికరాలను పరిశీలించి వాటి పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధునాతన పరికరాలు ఏర్పాటు చేసినందున వాటిని సమర్థంగా ఉపయోగించి నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పక కళాశాలకు హాజరు కావాలని, ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చక్కటి నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూమ్లానాయక్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
నల్లమచ్చలు అధికం
మద్దులపల్లిలో మూడెకరాల్లో పత్తి సాగు చేశాను. మొత్తం రూ.లక్ష వరకు పెట్టుబడికి ఖర్చు అయింది. కానీ తీవ్ర వర్షాలతో పత్తి మొక్కలు దెబ్బతిన్నాయి. పత్తి నల్లబడింది. పత్తి కాయలు మురిగి పోతున్నాయి. మొక్కకు 30 నుంచి 40 కాయల వరకు పాడయ్యాయి. తెల్లదోమ, పచ్చ దోమ సోకింది. పూత, కాయంతా రాలిపోతోంది. చీడపీడల అదుపు కోసం మందులు పిచికారీ చేద్దామన్నా వానలతో చేయలేదు. ఈ సీజన్లో పెట్టబడులు రావడమే కష్టంగా ఉంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – బియ్యని శ్రీకాంత్, మద్దులపల్లి -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాలనుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు... వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్లు పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ)లు దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణలు, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్లు, జనగామ, మహబూబాబాద్లకు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్జాదవ్, జువ్వాడి ఇందిరారావులు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తఽథ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్లతోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేష్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవిందర్రావు, పిన్నింటి అనిల్రావు, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధులతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణలతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు)ల మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్లో ఇప్పుడున్న జె.భరత్చంద్రా రెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాథలతోపాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్లు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. భూపాలపల్లి రూరల్: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం ఈ నెల 13న సోమవారం జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీపడేవారు దరఖాస్తులను జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవ్వాలని చెప్పారు. జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు తమ దరఖాస్తులను వ్యక్తిగతంగా సమర్పించాలని ఆయన సూచించారు. తాను దరఖాస్తులు స్వీకరిస్తానన్నారు. ‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహులనుంచి దరఖాస్తుల స్వీకరణ 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
ఇసుక క్వారీ తనిఖీ
మల్హర్: మండలంలోని మల్లారంలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ కేంద్రాన్ని పెద్దపల్లి టీజీఎండీసీ పీఓ రాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక లోడింగ్, వేబ్రిడ్జి, వేబిల్లులను పరిశీలించారు. క్వారీ టార్గెట్ ఇప్పటి వరకు పంపిన ఇసుక వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేబ్రిడ్జి వద్ద లారీలు ఎక్కువ సమయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. లారీల సీరియల్ ప్రకారమే లోడింగ్ జరిగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులకు, టీజీఎండీసీ సిబ్బందిదేనని ఆయన వెల్లడించారు. -
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
గణపురం: గ్రామాలలో పోషణ లోపంతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమిబసు సూచించారు. మండలంలోని బుర్రకాయల గూడెం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి గురువారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం పరిశీలనకు వచ్చిన ఆమెకు చిన్నారులు పూలతో స్వాగతం చెప్పగా వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 140 మంది చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని.. వారికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషక ఆహారాన్ని అందించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం, కిషోర బాలికలకు అందిస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిషోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నట్లు అధికారులు తెలపగా.. సంతృప్తి వ్యక్తంచేశారు. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం పోషణ మాసంలో భాగంగా గర్భిణులకు సీమంతాలు చేశారు. గర్భిణులు ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి భూపాలపల్లి: పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధనకు రైతులకు అవగాహన కల్పించాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఆకాంక్షిత జిల్లాలో అభివృద్ధి సూచికలపై వైద్య, విద్య, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్డీఏ, పశు సంవర్థక శాఖల అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశంలో పా ల్గొని వివిధ రంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పౌసమి బసు మాట్లాడుతూ.. వైద్య, విద్యా రంగాల్లో గుణాత్మక మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలి రేగొండ: ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే దృక్పథంతో వైద్యులు పని చేయాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు అన్నారు. గురువారం భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, ఆస్పత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు, ఉప వైద్యాధికారులు శ్రీదేవి, ఉమాదేవి పాల్గొన్నారు. నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు బుర్రకాయల గూడెంలో అంగన్వాడీ కేంద్రం పరిశీలన -
పొగాకు వాడకం ప్రమాదం
ములుగు: పొగాకు తాగిన వారితో పాటు పక్కన ఉండి పీల్చేవారికి అంతే ప్రమాదమని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి బస్టాండ్ వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్ఓ గోపాల్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో యువత పొగాకు వాడకాన్ని విడిచిపెట్టేలా 60రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దన్నారు. పొగాకులోని నికోటిన్ పదార్ధం దూమపానానికి బానిసలుగా మారుస్తుందని తెలిపారు. పొగాకు తాగడం వల్ల ఊపిరితిత్తులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతిఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పవన్కుమార్, ప్రవీణ్రెడ్డి, శ్రీకాంత్, చంద్రకాంత్, డీపీఎంఓ సాంబయ్య, సీహెచ్ఓ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు


