HYD: న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం | Food Poison Effect 17 Members Sick At Jagathgirigutta During New Year Celebrations, More Details Inside | Sakshi
Sakshi News home page

HYD: న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం

Jan 1 2026 11:42 AM | Updated on Jan 1 2026 1:33 PM

Food Poison Effect 17 Members Sick At Jagathgirigutta

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని జగద్గిరిగుట్ట పరిధిలో వెలుగుచూసింది.

వివరాల మేరకు.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్‌లో న్యూ ఇయర్‌ సందర్భంగా 17 మంది కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్యం తాగి.. బిర్యానీ తిన్నారు. అనంతరం, వీరంతా అస్వస్థతకు గురయ్యారు. కాసేపటికే వీరిలో పాండు(53) మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న మిగతా వారిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement