ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

Dec 26 2025 8:36 AM | Updated on Dec 26 2025 8:36 AM

ఎంబీఏ

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా జాతర పోస్టర్‌ ఆవిష్కరణ అయ్యప్ప స్వాములకు బిక్ష మంత్రి శ్రీధర్‌బాబు చిత్రపటానికి పాలాభిషేకం కంకర కష్టాలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 27నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌ తెలిపారు. యూజీసీనెట్‌, టీజీసెట్‌, టీజీటెట్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు.

భూపాలపల్లి రూరల్‌: నేడు (శుక్రవారం) మెదక్‌ జిల్లాలో జరిగే కేవల్‌ కిషన్‌ ముదిరాజ్‌ జాతర పోస్టర్‌ను ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆవిష్కరించారు. బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించిన ఇలాంటి మహనీయుడిని స్మరించుకోవడం సమాజంలోని ప్రతీ ఒక్కరి కర్తవ్యం అన్నారు. భవిష్యత్‌ తరాలకు వీరి చరిత్ర తెలియజేయాలన్నారు. జాతరకు ముదిరాజ్‌ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ నాయకులు చాడ కృష్ణస్వామి, వేముల రాజమౌళి, చిలకలపాణి, కొలిపాక మల్లయ్య, బోయిని సాంబయ్య, వెంగళ ఆంజనేయులు పాల్గొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి పట్టణం మంజూర్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అయ్యప్పస్వాములకు మహా అన్న ప్రసాదం(బిక్ష) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.–పద్మ దంపతులు ప్రత్యేకపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములు భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలిసి బిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు అయ్యప్ప స్వాములతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కాటారం: దామెరకుంట మానేరుపై వంతెన నిర్మాణంతో పాటు పలు రోడ్ల నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించడాన్ని హర్షిస్తూ మండలకేంద్రంలోని ప్రధాన కూడలిలో గురువారం కాంగ్రెస్‌ శ్రేణులు మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దామెరకుంట మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్లు, కాటారం నుంచి సబ్‌స్టేషన్‌పల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.3 కోట్లు, సుబ్బయ్యపల్లి నుంచి ప్రతాపగిరి వరకు రూ.3.50కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్‌బాబు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. మంథని నియోజకవర్గంతో పాటు కాటారం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మంత్రి శ్రీధర్‌బాబు ముందుకు వెళ్తున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్‌, యూత్‌ మండల అధ్యక్షుడు చిటూరి మహేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

టేకుమట్ల: మండలంలోని రామకిష్టాపూర్‌(టి) శివారు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి అంకుషాపూర్‌కు వెళ్లే దారి కంకర తేలడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలల క్రితం రోడ్డు మరమ్మతుకు రూ.10లక్షల నిధులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో నిత్యం దారిగుండా పంట పొలాలకు వెళ్లే రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు.

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా1
1/3

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా2
2/3

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా3
3/3

ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement