రక్షణలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

రక్షణలో భాగస్వాములు కావాలి

Dec 13 2025 7:52 AM | Updated on Dec 13 2025 7:52 AM

రక్షణలో భాగస్వాములు కావాలి

రక్షణలో భాగస్వాములు కావాలి

మల్హర్‌: ఓపెన్‌ కాస్ట్‌లో ఉద్యోగులు, కార్మికులు రక్షణలో భాగస్వాములు కావాలని సేప్టీ కమిటీ కన్వీనర్‌ వెంకటరమణ సూచించారు. 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలో తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ మైన్‌ను వెంకట్వేర్‌రావు సందర్శించి, రక్షణ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడాతూ.. ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణలో రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు. కార్మికుల రక్షణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద రహిత ఓపెన్‌కాస్ట్‌ మైన్‌గా నిలిచేలా ప్రతీ ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఓపీ, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ ప్రకారం సంస్థ నియమ నిబంధనలను అనుసరించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని వివరించారు. కార్యక్రమంలో మైన్‌ ఏజెంట్‌ జీవన్‌కుమార్‌, సభ్యులు జాకీర్‌ హుస్సేన్‌, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, జెన్‌కో జీఎం మోహన్‌రావు, ఏఎమ్మార్‌ వైస్‌ ప్రెసిడెంట్లు శ్రీధర్‌, కేఎస్‌ మూర్తి, మైన్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, సేప్టీ అధికారి సురేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement