breaking news
Students
-
విద్యా రంగం బతికే భరోసా ఏది?
ప్రభుత్వ విద్యా సంస్థల్లో నమోదు పెంచడానికి ఎవరికి తోచిన విధంగా వారు ఉచిత సలహాలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో అవేవీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచలేకపోతున్నాయి. ప్రభుత్వ విద్యారంగ గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకసారి పరిశీలన చేస్తే... 1990వ దశకం వరకు మన దేశంలో ప్రభుత్వ విద్యా రంగం పటిష్ఠంగా ఉండేది. నూటికి తొంభై ఐదు మంది విద్యార్థులు ప్రభుత్వ బడులలోనే చదివేవారు. బడులన్నీ విద్యార్థులతో కళకళలాడేవి. ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత ప్రపంచ వాణిజ్యం కొరకు ‘ప్రపంచ వాణిజ్య ఒప్పందం (గాట్)–1994’లో మన దేశం చేరిన నాటినుండి విద్యారంగంలో ప్రయివేటు పెట్టుబడులు విపరీతంగా పెరిగి, విద్య కుడా లాభాలను ఆర్జించిపెట్టే ఒక సరుకుగా మారింది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా నేడు వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాకానుక’, ‘జగనన్న గోరుముద్ద’, ‘విద్యాకానుక కిట్’ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. వెఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనా కాలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టారు. ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, అధునీకరించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఇంతటితో సరిపెట్టుకోక, ఇప్పటి వరకు ప్రయివేటు పాఠశాలల్లో ధనవంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్ను ప్రభుత్వ బడుల్లో అమలుకు ఆదేశాలు ఇచ్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రపంచంలో అత్యుత్తమ బోధనకు పేరొందిన ఐబీ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో అమలుచేయడానికి ఏపీ స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్తో ఒప్పందం చేసుకోవడం ఊహకు కూడా అందని చారిత్రక ఘట్టం. అయితే, ఆ ప్రభుత్వం మారగానే ‘అమ్మ ఒడి’ భరోసాను భంగపాటుకు గురిచేసి రద్దుచేశారు. ‘తల్లికి వందనం’ అని పథకం పేరు మార్చినా పాఠశాలల్లో నమోదు శాతం పెరగడం లేదు. జూన్ నెల ముగింపు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ బడుల్లో ఒకటో తగతిలో విద్యార్థుల తక్కువ నమోదు వెక్కిరిస్తున్నది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతెన్నులే ఇందుకు కారణం. దేశంలోనే సంపద సృష్టిలో, జీఎస్టీ వసూళ్లలో మొదటి వరుసలో ఉన్నామని చెప్పుకొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు... విద్యా ప్రగతి సూచికలో మాత్రం కింది స్థానానికి దిగజారాయి. ఉచిత భోజన వసతితో కూడిన గురుకులాలలో కూడా పిల్లలు అంతగా చేరడం లేదంటే కారణం ప్రభుత్వం సరైన సౌకర్యాలు ఏర్పరచక పోవడం, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడమే అని చెప్పక తప్పదు. తెలంగాణలో పాఠశాల విద్యను, ఇంటర్ విద్యను కలపాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇది మరో సంక్షోభానికి దారితీయవచ్చు. పాఠశాల విద్యాశాఖ ఆరేడు ఎన్జీఓలతో ‘సీఎస్సార్’ పథకం కింద ఎంఓయూ కుదుర్చుకోవడం చూస్తే... రెగ్యులర్ క్లాసుల బోధనకు కలిగే ఆటంకాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కడబడటం లేదు. ప్రభుత్వాలు మారగానే విద్యారంగం తీవ్రమైన ఒడుదొడుకులకు గురవుతోంది. గత ప్రభుత్వాల బ్రాండ్ కొనసాగింపుకన్నా తమ ప్రభుత్వ బ్రాండ్ ఉండాలనే తలంపు నేడు విద్యారంగానికి శాపంగా పరిణమిస్తున్నది. వెరసి చూస్తే విద్యారంగం ఒక విషవలయంలో చిక్కుకున్నట్లు గోచరిస్తున్నది.అడ్మిషన్ల లేమితో ప్రాభవం కోల్పోతున్న ప్రభుత్వ పాఠశాలలకు... పరిశ్రమలకు కల్పించే ఉద్దీపన చర్యలు తక్షణ అవసరం. ఒకవైపు ప్రయివేటు పాఠశాలల్లో కృత్రిమ మేధ సహాయంతో పాఠాల బోధన, మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా సరళీకృత ఆర్థిక, వ్యాపార, సాంకేతిక విధానాలు విస్తృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి సమాజంలో పేద పిల్లల భవిష్యత్తును నిర్ణయించే ఇంగ్లీష్ విద్యతో పాటు, ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల కోర్సుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% ప్రత్యేక రిజర్వేషన్కు భరోసా ఇచ్చే చట్టం చేయాలి.మామిడి నారాయణ వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపక చైర్మన్ ‘ 94410 66032 -
పర్యవేక్షణ కరువై పెడదారి
వారం క్రితం అనంతపురం రూరల్ పరిధిలోని నారాయణపురం చెక్డ్యాం సమీపంలో తపోవనం హైస్కూల్ల్ పిల్లలు ఐదుగురు మద్యం తాగుతున్నారు. ఆ బ్యాచ్లోని ఓ విద్యార్థి తండ్రి వీరి తతంగాన్ని కనిపెట్టాడు. తన కుమారుడిని పట్టుకొచ్చి బాగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి అందరి పేర్లూ చెప్పాడు. విస్కీ తాగినట్టు వెల్లడించాడు. అనంతపురం నగరంలోని పొట్టిశ్రీరాములు పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసిన విద్యారి్థ.. ఇటీవల స్కూల్లో టీసీ తీసుకుని 3వ రోడ్డులో ఉన్న ఓ హైస్కూల్ల్లో చేరాడు.బడిలో ఈ విద్యార్థి ఇటీవల గంజాయి తాగుతుండగా ఉపాధ్యాయుడు గుర్తించాడు. తల్లిదండ్రులను పిలుస్తా అని హెచ్చరిస్తే.. ‘‘పిలువు, నన్ను వాళ్లేం చేయగలరు’’ అంటూ విద్యార్థి ఎదురుతిరిగే సరికి ఉపాధ్యాయుడు భయపడి విషయాన్ని అంతటితో వదిలేశాడు. విద్యార్థుల్లో పెడ ధోరణలు ఎంతగా పెరిగాయో ఈ రెండు ఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న విపరీత ధోరణులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ళ్లలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులు కూడా తమకెందుకులే అని పట్టించుకోకపోవడం తదితర కారణాలతో పిల్లలు పెడదారి పడుతున్నట్లుగా తెలుస్తోంది. 14 ఏళ్లకే మద్య సేవనం... తపోవనం హైస్కూలు విద్యార్థులు మద్యం సేవించిన ఘటన అనంతపురం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ముగ్గురు, ఎనిమిదో తరగతి చదువుతున్న వారు ఇద్దరు ఉన్నట్లు తెలుసుకుని పలువురు విస్తుపోతున్నారు. మరోవైపు జిల్లాలో కొన్ని చోట్ల విద్యార్థులు పాఠశాలలకు గంజాయి తెచ్చుకుని సేవిస్తున్నారు. మరికొన్ని చోట్ల సెల్ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తూ గడుపుతున్నారు. కో ఎడ్యుకేషన్ ఉన్నచోట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి బాలిక ఓ బాలుడికి ప్రేమలేఖ రాసిన ఉదంతం బయటపడింది. ఈ క్రమంలో పిల్లలను స్కూళ్లకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల్లో ఉదాసీన వైఖరి పిల్లలను ఏమంటే ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న భయంతో ఉపాధ్యాయులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది టీచర్లే క్రమశిక్షణ తప్పి క్లాసులకు వస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. సమయానికి స్కూలుకు వెళ్లకపోవ డం, వెళ్లినా క్లాసులు తీసుకోకపోవడం విద్యార్థులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి కారణమవుతోంది. ఇక పిల్లల తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటుండడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు లేక శాపంగా పరిణమిస్తోంది. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి పిల్లల్లో పెడధోరణులను కాండాక్ట్ డిజార్డర్ అంటారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన కారణం. తల్లిదండ్రు లకు మద్యం అలవాటు ఉన్నా ఇలా జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల కూడా పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రుల ద్వారానే పిల్లల్లో పరివర్తన రావాలి. –డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణులు, అనంతపురం -
అవస్థలుబడి
ఎమ్మిగనూరు టౌన్: విద్యాభివృద్ధికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా రూపుదిద్దుకున్నాయి. నాడు–నేడులో భాగంగా కల్పించిన మౌలిక సదుపాయాలతో అడ్మిషన్ల సంఖ్య కూడా మునుపెన్నడూ లేనివిధంగా పెరిగింది. దశాబ్దాలుగా శిథిలమైన పాఠశాలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో చూడచక్కన రూపాన్ని సంతరించుకుని విద్యార్థులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో జగనన్న విద్యా కానుకతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడంతో తల్లిదండ్రులు ప్రయివేట్ చదువులను మాన్పించి ప్రభుత్వ పాఠశాల దిశగా అడుగులు వేయించడం విశేషం. విద్యార్థినుల అడ్మిషన్లలో రాష్ట్రంలోనే మొదటిస్థానం ప్రస్తుత విద్యాసంవత్సరంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జెడ్పీ పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య 3,680. వీరిలో ఒక్క 6వ తరగతిలోనే కొత్తగా 850 మంది విద్యార్థినులు ప్రవేశం పొందడం విశేషం. ఫలితంగా ఈ ఒక్క తరగతికే 11 సెక్షన్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థినుల సంఖ్య పరంగా ఈ పాఠశాల రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. 7వ తరగతిలో 680 మంది విద్యార్థినులకు 10 సెక్షన్లు, 8వ తరగతిలో 750 మందికి 10 సెక్షన్లు, 9వ తరగతిలో 700 మందికి 10 సెక్షన్లు, 10వ తరగతికి 9 సెక్షన్లతో బోధన సాగిస్తున్నారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా 94 మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంకా 5 హిందీ, 6 ఒకేషనల్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదైనా పూర్తికాని అదనపు తరగతి గదులు గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా రెండవ విడత నాడు–నేడు కింద 12 అదనపు తరగతి గదుల నిర్మాణానికి పూనుకుంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను పూర్తిగా విస్మరించింది. ఈ కారణంగా విద్యార్థినులు పాఠశాల ఆవరణలోని చెట్ల కింద, వరండాల్లో అష్టకష్టాలు పడుతూ చదువుకుంటున్నారు. ఇదే సమయంలో విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నేల చదువులు తప్పడం లేదు. ఒకే తరగతి గదిలో కొందరు డెస్్కలపై, మరికొందరు నేలపై కూర్చోవడం వల్ల వివక్షను ఎదుర్కొంటున్నారు. 3,630 మంది విద్యార్థినులకు 22 మరుగుదొడ్లే.. రాష్ట్రంలోనే విద్యార్థినుల సంఖ్య పరంగా ఈ పాఠశాల మొదటిస్థానంలో ఉంది. మొత్తం 3,630 మంది విద్యార్థినీలు ఉన్న ఈ పాఠశాలలో 22 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా విద్యార్థినీలు అత్యవసరమై మరుగుదొడ్లను ఉపయోగించుకోవాల్సి వస్తే క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంది. సంఖ్యకు అనుగుణంగా మరో 20 మరుగుదొడ్లు అవసరం కాగా, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించని పరిస్థితి. ఇక విద్యార్థినుల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ కేవలం నలుగురు మాత్రమే ఆయాలు పని చేస్తున్నారు. ఈ కారణంగా పాఠశాలలో పారిశుద్ధ్య లోపం కొట్టిచ్చినట్లుగా కనిపిస్తోంది. నాడు–నేడు రెండో విడతకు రూ.2.08కోట్లు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడత నాడు–నేడు కింది టాయిలెట్స్ ఇతర మౌలిక సదుపాయాలకు రూ.1.01కోట్లు మంజురు కాగా ఆయా పనులన్నీ పూర్తయ్యాయి. ఇక రెండో విడత నాడు–నేడు కింద 20 అదనపు తరగతి గదులకు రూ.2.08కోట్లు మంజూరయ్యాయి. కాగా అందులో 8 తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయా గదుల బయట ప్లాస్టింగ్ చేయకపోయినా సున్నం కొట్టించి వాటిలోనే తరగతులను నిర్వహిస్తున్నారు. మిగిలిన 12 గదుల నిర్మాణాలు పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఏడాది కాలంగా ప్రస్తుత ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం గమనార్హం.పాఠశాలలో అన్నీ సమస్యలే.. ⇒ ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ గత ఏడాది నుంచి పనిచేయక మూలనపడింది. ⇒ విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినీలు ఇంటి నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ⇒ మధ్యాహ్న భోజన సమయంలో వెక్కిళ్లు వస్తే వీళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ⇒ వర్షాకాలంలో పాఠశాల ఆవరణ తడిచి ముద్దవుతోంది. ⇒ గ్రౌండ్లోనూ వర్షం నీరు నిలుస్తుండటంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.ఈ విద్యార్థినులు మరుగు దొడ్లను వినియోగించుకునేందుకు ఇలా క్యూలో నిల్చొన్నారు. పాఠశాలలో 3,630 మంది విద్యార్థినులు ఉండగా 22 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఇలా క్యూలో నిల్చొని వీరు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం.పాఠశాల విద్యలోనూ రాజకీయమే..గత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యలోనూ రాజకీయం చొప్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ఏడాది కాలంగా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఈ కారణంగా విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం మా పాఠశాలలో విద్యార్థినీల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదుల్లేవు. నాడు–నేడు కింద నిలిచిపోయిన 12 తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు నివేదించాం. పాఠశాల అభివృద్ధికి దాతలు కూడా ముందుకొస్తున్నారు. అధికారుల ఆదేశాలతో అవసరమైతే వారి సహకారం కూడా తీసుకొంటాం. అదనపు మరుగుదొడ్లు అత్యవసరం. – కృష్ణమూర్తి, ప్రధానోఫాధ్యాయులు, ఎంఎస్, జెడ్పీ బాలికల హైస్కూల్, ఎమ్మిగనూరుప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందో?మరుగుదొడ్లకు వెళ్లేందుకు కూడా విద్యార్థినులు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి చూస్తే ఈ ప్రభుత్వం ఎంతటి దిగజారుడు పాలన సాగిస్తుందో అర్థమవుతోంది. విద్యార్థుల విషయంలో కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం వీటిని పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏడాది గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం మేల్కోకపోవడం దారుణం. – బుట్టా రేణుక, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మిగనూరు -
పల్లె బడిలో ఏఐ పాఠాలు
పట్టణాలు, నగరాలకు దీటుగా కృత్రిమ మేధస్సు (ఏఐ –ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సాంకేతిక బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుమూల గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకు సమానస్థాయిలో ఆధునిక బోధన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. సర్కార్ టీ ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవడంతో ఉపాధ్యాయులు ఏఐ ఆధారంగా చదువు చెబుతున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు అదనపు సమాచారం అందించి వారి మేధకు పదును పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్ ఇందుకు వేదికైంది. – ముత్తారం (మంథని)మద్రాస్–ఐఐటీ నుంచి కోర్సు!స్థానిక ఉపాధ్యాయులకు గూగుల్తో ఏఐ బోధనలో శిక్షణకు ఇప్పించేందుకు టీ–ఫైబర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మద్రాస్ ఐఐటీ కళాశాల నుంచి కోర్సు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. టీ ఫైబర్ బృందం సోషల్ మీడియా వేదికగా దీనిపై ప్రచారం చేయడంతో అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పర్ఫ్లెక్సిటీ ఏఐ కో–¸ûండర్, సీఈవో అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ ఉచిత ఏఐ టూల్ను వినియోగించుకుని విద్యార్థులు విజ్ఞానం మెరుగుపర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ మార్పురావడం గొప్పవిషయమని చెప్పారు.పైలెట్ ప్రాజెక్టుగా మూడు గ్రామాలు.. టీ–ఫైబర్, పయనీర్ ఈల్యాబ్స్ కంపెనీ భాగస్వామ్యంతో పల్లెల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని మూడు గ్రామాల్లోని పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు జెడ్పీ హైస్కూళ్లను దీని కింద ఎంపిక చేసింది. అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో టీ–ఫైబర్ నెట్ నిర్వాహకులు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి రెండు మానిటర్లు ఇవ్వగా.. ప్రభుత్వం ఇటీవల మరోమూడు కేటాయించింది. గత జూన్లో ఏఐ ఆధారిత పర్ప్లెక్సిటీ టూల్స్ ద్వారా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆధునిక బోధన ప్రారంభించారు. కార్పొరేట్కు దీటుగాఏఐ, పర్ప్లెక్సిటీ టూల్ సాయంతో బోధన ప్రారంభించాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పల్లె పాఠశాలలో ఆధునిక విద్య ఇస్తుండటంతో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. ఏఐ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. మరో 20 కంప్యూటర్లు, మైక్రోఫోన్స్ అందిస్తే ఏఐ బోధన మరింత సులువవుతుంది. – ఇరుగురాల ఓదెలు, హెచ్ఎం, అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్రక్తం ఎందుకు గడ్డ కట్టదుపర్ఫ్లెక్సిటీ ఏఐ టూల్ ద్వారా రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఎందుకు గడ్డ కట్టదనే ప్రశ్నకు సమాధానాన్ని సొంతంగా తెలుసుకున్నా. బయాలజీలో ఎర్ర, తెల్లరక్త కణాలు, కణ ఫలదీకరణ, నిర్మాణం, వాటి విధుల గురించి వివరంగా తెలుసుకున్నా. టీచర్ల బోధన తర్వాత అర్థం కాని విషయాలు, సందేహాలను పర్ప్లెక్సిటీ టూల్ నివృత్తి చేస్తోంది. – ఉప్పు మన్విత, తొమ్మిదో తరగతిగణితంలో అన్ని పద్ధతులుఏఐ టూల్తో విద్యార్థి శక్తిని అంచనావేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పర్ప్లెక్సిటీ యాప్లో గణితంలోని అన్ని పద్ధతులు పొందుపర్చడాన్ని సులువుగా నేర్చుకోవచ్చు. చిత్రపటాలతో అర్థమయ్యే రీతిలో ఏఐ వివరిస్తోంది. – మార్త కోమలత, పదోతరగతిఉపయోగం తెలుసుకున్నాఏఐ పర్ప్లెక్సిటీలో నిక్ (ఆ్రస్టేలియాకు చెందిన ఈయన అరుదైన వ్యాధితో జని్మంచారు) గురించి సార్ను అడిగా. అంగవైకల్యం ఉన్నా.. విధిరాతను కూడా ఎలా మార్చుకోవచ్చో ఏఐ టూల్తో తెలుసుకున్నా. నిక్ చికెన్ లెగ్ను ఉపయోగించి నీటి గ్రావిటి బ్యాలెన్స్ చేసుకునే విధానం గురించి కూడా నేర్చుకున్నా. – చిగురు మధులాస్య, పదోతరగతి -
‘మాక్’తో మేల్కొలుపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విద్యార్థులకు అనేక అనుభవాలను నేర్పింది. ఆప్షన్ల ఎంపికలో అతి విశ్వాసం పనికిరాదని స్పష్టం చేసింది. మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే వీలుంది. ఆప్షన్లు ఇవ్వడంలో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకుంటారు. దీంతో ఈ నెల 18న చేపట్టే అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే జాగ్రత్తగా అప్షన్లు మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. 2 వేల ర్యాంకుకూ సీటు రాలే..మాక్ సీట్ల కేటాయింపులో 83,054 సీట్లకు 77,154 సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు 95 వేల మంది విద్యార్థులు ఆప్షన్లపై కసరత్తు చేశారు. అయితే, 16,905 మంది ఆప్షన్లు ఇచ్చినా సీట్లు పొందలేకపోయారు. వీళ్లంతా తక్కువ కాలేజీలు, కొన్ని బ్రాంచీలను మాత్రమే ఎంచుకున్నారు. మొదటి దశ కౌన్సెలింగ్ కాబట్టి జేఈఈ ద్వారా జాతీయ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా రాష్ట్ర ఎప్సెట్కు దరఖాస్తు చేశారు. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల మంచి ర్యాంకు వచ్చినా వారికి సీటు రాలేదు. ఒక విద్యార్థినికి ఎప్సెట్లో 2 వేల ర్యాంకు వచ్చింది. అయినా మాక్ సీట్ల కేటాయింపులో సీటు రాలేదు. ఒక విద్యార్థికి 50 వేల ర్యాంకు వచ్చినా టాప్ 15 జాబితాలో ఉన్న కాలేజీలో సీఎస్ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. ఇతను ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది.జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలిఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25లో 16 వేల మంది పెరిగి, 1.07 లక్షలకు ఇంజనీరింగ్ ప్రవేశాలు చేరాయి. కాబట్టి ఎప్సెట్ అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చినవాళ్లు ఈసారి వాటిని పెంచుతారు. మంచి ర్యాంకులు ఉండి సీట్లు వచ్చిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో మార్పులు కోరుకుంటారు. కాబట్టి మాక్లో వచ్చిన సీటు అసలు కేటాయింపులో ఉండకపోవచ్చు. 20 వేల ర్యాంకుపైన వచ్చిన విద్యార్థుల దీన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని, ఇందుకు తగ్గట్టుగా ఆప్షన్ల ఎంపికపై కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం..
ఎటపాక: కూటమి ప్రభుత్వంలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం నానాటికీ నాసిరకంగా మారుతోంది. ఇటీవల మధ్యాహ్న భోజనంలో బొద్దింకలు, పురుగులు రాగా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భోజనం వికటించి 21మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సరిగా ఉడకని భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 139 మంది చదువుకుంటున్నారు. మెనూ ప్రకారం శుక్రవారం మధ్యాహ్న భోజనంలో 122 మందికి పులిహోర, టమాట చట్నీ, కోడిగుడ్డు, చిక్కీ అందించారు. పులిహోర సరిగా ఉడకకపోవడంతో చాలమంది విద్యార్థులు తినకుండానే బయట పారబోశారు. కొద్ది సమయం తరువాత పులిహోర తిన్న విద్యార్థుల్లో కొందరికి కడుపులో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన 21 మంది విద్యార్థులను పాఠశాల పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. బాధితుల్లో మూడు, నాలుగు తరగతులకు చెందిన రామలక్ష్మి, ప్రేమిక, లోకేశ్కు వాంతులు కూడా అవుతుండటంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. కాసేపటికి వీరంతా కోలుకున్నారు. వంట కారి్మకుల నిర్లక్ష్యం కారణంగా తరచూ భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఎంఈఓ సరియం రాజులు పాఠశాలకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ఎంఈఓను చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్ ఆదేశించారు. మరోవైపు.. అస్వస్థతకు గురైన విద్యార్థులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వంటòÙడ్డు లేకపోవడంతో వంట చేసే సమయంలో పురుగులు పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని.. రాజకీయాలకు తావులేకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. -
అయిననూ.. మీరు నాన్లోకల్!
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్ ప్రవేశాల వేళ లోకల్, నాన్లోకల్ కోటా విభజన విద్యార్థుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. పదో తరగతి వరకు ఏపీలోనే చదివి.. తెలంగాణలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులను నాన్లోకల్ (స్థానికేతరులు)గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన ఏపీ విద్యార్థులు ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వారికి స్థానిక కోటా వర్తించడం లేదు. స్థానికేతర కోటా పొందడానికి వీలులేకుండా వారి భవిష్యత్తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది.ఏడాదంతా ఏం చేసినట్టు?భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. దీనిద్వారా తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించాలనేది దీని ఉద్దేశం. దీనినే 2014 రాష్ట్ర విభజన సమయంలోనూ మరో పదేళ్లపాటు కొనసాగించేలా రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ఉస్మానియా, ఆంధ్ర(ఏయూ), శ్రీవెంకటేశ్వర (ఎస్వీయూ) రీజియన్ల వారీగా స్థానికతను (లోకల్ 85 శాతం, నాన్లోకల్ 15శాతం) ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. గతేడాది జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసింది. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్లోకల్ 15 శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. కానీ, కూటమి ప్రభుత్వం కాలయాపన చేసి.. ఈ ఏడాది ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో హడావుడిగా జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీనిపై ఎవరికీ అవగాహన కల్పించకపోవడం గమనార్హం.న్యాయస్థానంలో సవాల్?ఉన్నత విద్యాశాఖ స్థానికతను సవరిస్తూ ఇచ్చిన జీవోలు చట్టం ముందు నిలవలేవని, న్యాయస్థానంలో సవాల్ చేస్తే.. పాత విధానాన్ని అమలు చేసేలా తీర్పు వస్తుందని.. దీనివల్ల తెలంగాణలో చదివినప్పటికీ ఎటువంటి చిక్కులు లేకుండానే ఏపీలో నాన్లోకల్ కోటా వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. స్థానికత అంశం ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత విద్యా సంస్థల వరకు వర్తిస్తుంది.కానీ, ఒక్క ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రవేశ పరీక్షలకు సంబంధించి మాత్రమే స్థానికతను మార్పుచేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పదేళ్లపాటు ఏపీలో నివసిస్తున్నట్టు చూపిస్తే స్థానికేతర కోటాలో కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ,్థ తల్లిదండ్రులకు నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుంటే.. సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల స్టడీ సర్టిఫికెట్స్ ఏపీలో ఉంటే కౌన్సెలింగ్కు అనుమతిస్తామని ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ అధికారులు చెబుతున్నారు. చదువు లేని తల్లిదండ్రులున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఈఏపీ సెట్ హెల్ప్లైన్ నంబర్లకు ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
కంప్యూటర్ కోర్సుల వైపే..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలిదశ కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరుకుంది. వెబ్ ఆప్షన్లు గురువారంతో ముగియగా ఈ నెల 13న మాక్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి మరో రెండు రోజుల గడువు లభించనుంది. ఈ నెల 18న తొలి దశ సీట్ల భర్తీ ఉంటుంది. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చిన వారి సంఖ్య లక్ష దాటింది. దాదాపు 40 వేల ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 78 శాతం మంది కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకున్నారు. ఇందులోనూ ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచీలకు ప్రాధాన్యమిచ్చారు. సివిల్, మెకానికల్, ఈసీసీ, ఈఈఈ, సీఈసీ వంటి కోర్సుల్లో మెజారిటీ విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా సీఎస్సీనే ఎంపిక చేసుకున్నారు. మిగతా కోర్ గ్రూపులకు పదవ ప్రాధాన్యతనిచ్చారు. ఓపెన్ కేటగిరీకి 10 వేల లోపే.. ప్రాధాన్యత క్రమాన్ని పరిశీలిస్తే కంప్యూటర్ కోర్సుల్లో పోటీ కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 171 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్లో పాల్గొన్నాయి. వాటి పరిధిలో కన్వీనర్ కోటా సీట్లు 76,795 ఉండగా అందులో 68 శాతం కంప్యూటర్, ఎమర్జింగ్, ఐటీ కోర్సులే ఉన్నాయి. తొలి దశలో 500 ర్యాంకు వరకు విద్యార్థులు కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇచ్చారు. వెయ్యి ర్యాంకు దాకా విద్యార్థులు సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సులతోపాటు ఇతర బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. వాళ్లంతా జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంపస్ కాలేజీలను ఎంచుకున్నారు. 2 వేల లోపు ర్యాంకు విద్యార్థులు టాప్–10 కాలేజీలకు పోటీపడగా 5 వేల లోపు ర్యాంకు విద్యార్థులు టాప్–20 కాలేజీలకు ప్రాధాన్యమిచ్చారు. 10 వేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాత్రం అన్ని కాలేజీలను, అన్ని బ్రాంచీలను ఆప్షన్లుగా పెట్టుకున్నారు. అయితే వారిలో 70 శాతం మంది కంప్యూటర్ కోర్సులకే తొలి ప్రాధాన్యమిచ్చారు. ఈసారి నాన్–లోకల్ కోటా ఎత్తేయడంతో ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు వస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. టాప్–10 కాలేజీల్లో జనరల్ కేటగిరీలో సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సుల్లో 4 వేల లోపు ర్యాంకు వరకు సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర కాలేజీల్లో 10 వేలలోపు ర్యాంకు వరకు సీట్లు పొందే వీలుందని భావిస్తున్నారు. ఫీజులపై రగడ.. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఖరారైన ఫీజులను నిలిపేయడం, పాత ఫీజులనే అమలు చేయాలనే నిర్ణయాన్ని సీబీఐటీ కాలేజీ న్యాయస్థానంలో సవాల్ చేసింది. కాలేజీకి సానుకూలంగా కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే అధికారులు కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. కోర్టు దీనిపై శుక్రవారం విచారించే వీలుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇతర కాలేజీలు కూడా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు చేపడతారా లేక వాయిదా వేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. సాంకేతిక విద్యా విభాగం అధికారులు మాత్రం కౌన్సెలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెబుతున్నారు. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సర్కార్బడిలో ఐఐటీ పాఠాలు
సిరిసిల్ల కల్చరల్: డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న అధునాతన సాంకేతిక కోర్సులు సర్కార్ బడి విద్యార్థులకు కూడా చేరువ కానున్నాయి. దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్ తన సాంకేతిక కోర్సుల విస్తరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెప్పనుంది. స్థానిక గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యాధునిక సాంకేతిక కోర్సుల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచి్చంది.ఆన్లైన్ విధానంలో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐఐటీ మద్రాస్ లేఖ రాసింది. స్కూల్ కనెక్ట్లో భాగంగా ఐఐటీ మద్రాస్ సిరిసిల్లలోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో భాగస్వామ్యమైంది. ఈ–మెయిల్ ద్వారా ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేఖలు పంపింది. ఐఐటీ మద్రాస్, సెంటర్ ఫర్ ఔట్రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శివనగర్, గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకుంది. ఇవీ కోర్సులు.. డేటా సైన్స్ అండ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంజినీరింగ్, బయోలాజికల్ సిస్టమ్స్, మేథ్స్ అన్ప్లగ్డ్ గేమ్స్ అండ్ పజిల్స్, పర్యావరణం, ఫన్ విత్ మేథ్స్ అండ్ కంప్యూటింగ్, లా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, హ్యుమానిటీస్ వంటి పది కోర్సులను రెండు నెలలపాటు బోధిస్తారు. ముందుగానే చిత్రీకరించిన వీడియోలను ప్రతి సోమవారం పోర్టల్లో ఉంచుతారు. ఐఐటీ ప్రొఫెసర్లతో ప్రతి శనివారం ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను వారు నివృత్తి చేస్తారు. ఫలితంగా ఆయా కోర్సుల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటారు.విద్యార్థులకు విస్తృత ప్రయోజనాలు ఐఐటీ మద్రాస్తో అనుసంధానానికి ఎంపికవడం వ్యక్తిగతంగా సంతోషంగా ఉంది. ఇది మా పాఠశాల విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుంది. అత్యాధునిక కోర్సుల మౌలికాంశాలపై శిక్షణ పిల్లల కెరీర్ నిర్మాణానికి ఉపకరిస్తుంది. డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్తతరం సాంకేతికతల్లో సర్కార్ బడి పిల్లలు సత్తా చాటుతారు. – చకినాల శ్రీనివాస్, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుపేద బిడ్డలకు టెక్నాలజీ చేరువవుతుంది ప్రభుత్వ బడిలో చదివే పేద విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేసేందుకు ఈ స్కూల్ కనెక్ట్ ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్ తరగతులతోపాటు అక్కడి ప్రొఫెసర్లతో నేరుగా సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించడం విద్యార్థులకు వరంగా భావించాలి. ఇంజినీరింగ్ కోర్సుల్లో మాత్రమే లభ్యమయ్యే అంశాలను పాఠశాల స్థాయిలోనే నేర్చుకునే అరుదైన అవకాశం ఇది. – లోకిని శారద, హెచ్ఎం, గీతానగర్ జెడ్పీ హైస్కూల్ -
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలన్నారు.. ఏమైంది’
సాక్షి,కాకినాడ జిల్లా: ‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చారు. కానీ ఇప్పుడు కూటమి నేతలకు చెప్పిన మాటలకు చేసే చేతలకు అసలు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా, హంసవరం జడ్పీ,మోడల్ స్కూల్స్లో మెగా పేరెంట్స్ సమావేశంలో రచ్చ జరిగింది. విద్యార్ధుల తల్లిదండ్రుల తరపున తల్లికి వందనంపై సర్పంచ్ మేరి అధికారులను ప్రశ్నించారు. చాలా మందికి తల్లికి వందనం రూ.8వేలే అందినట్లు చెప్పారు.తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దీంతో మేరీ మాట్లాడుతుండగా..అధికారులు మైక్ కట్ చేశారు. కంగుతిన్న టీడీపీ నేతలు ప్రభుత్వం పరువుపోతుందంటూ మేరి చేతిలో మైకును లాక్కున్నారు. -
Andhra Pradesh: సర్కారు బడికి బైబై!
వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్రోల్మెంట్ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్రోల్ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ 60 నుంచి 33కి తగ్గిపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్కు మంగళం.. సీబీఎస్ఈ, ఐబీ విధానం ఔట్... టోఫెల్ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్లు నిలిపివేత.. డిజిటల్ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఏడాదిలో తారుమారు..బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చిదిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. బడుల విలీనంతో...మాజీ ముఖ్యమత్రి వైఎస్ జగన్పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు. నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబియ్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు! రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు. చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్ జగన్ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మార్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు. -
చంద్రబాబు పై అదిరిపోయే ముసలి కొంగ కథ
-
కొలిక్కిరాని పాలిసెట్
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ గందరగోళం ఇంకా కొనసాగుతోంది. వెబ్సైట్ నుంచి తుడిచిపెట్టుకుపోయిన డేటాను రికవరీ చేసేందుకు సాంకేతిక విద్యా విభాగం అష్టకష్టాలు పడుతోంది. ఏం జరుగుతోందనేది మాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. సీట్ల కేటాయింపు ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. వచ్చేవారం దీనిపై స్పష్టత రావచ్చని సంకేతాలిస్తున్నారు. ఈ గందరగోళంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకునేందుకు ఆదివారం కొంతమంది విద్యార్థులు పాలిసెట్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అనుమతి లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై వివరాలు సేకరిస్తోంది. నిఘా వర్గాలు కూడా అసలేం జరిగిందని వాకబు చేస్తున్నాయి. పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీన చేపట్టాల్సి ఉంది. ఈలోగా పాలిసెట్ వెబ్ ఆప్షన్ల డేటా మొత్తం ఎరైజ్ అయిన విషయం బయటకు పొక్కింది. దాదాపు 22 వేల మంది విద్యార్థులు పాలిటెక్నిక్ సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పదేపదే ఎర్రర్స్ డేటా రికవరీ కోసం సాంకేతిక విద్యా విభాగం శనివారం రాత్రి నుంచి పరుగులు పెడుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఉద్యోగులను కొన్నాళ్లు ఆఫీసుకు రావద్దని ఆదేశించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ప్రత్యేక సాంకేతిక బృందాలను రంగంలోకి దించి సాఫ్ట్వేర్ పొరపాట్లను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. డేటాను బ్యాకప్ ద్వారా రికవరీ చేసినప్పటికీ, ఆప్షన్ల విషయంలో సెకన్లలోనే డేటా స్క్రీన్ మీది నుంచి మాయమవుతున్నట్లు తెలిసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెట్టేటప్పుడు సర్వర్లు, హార్డ్ డిస్్కలను ఫార్మాట్ చేస్తారు. గుడ్ గవర్నెన్స్ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రాథమిక హార్డ్ డిస్్కల్లో కొన్ని రకాల బగ్స్ ఏర్పడినట్టు తెలిసింది. క్యాంపు కార్యాలయంలోని కంప్యూటర్స్లో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ డ్రైవ్లు వాడితే ఇలాంటి బగ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. లేదా ఆప్షన్ల డేటాను నెట్వర్క్ ద్వారా ఇతరులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నా సమస్య రావచ్చని తెలిపారు. ఇలా చేయగలిగే అవకావం కేవలం క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికే ఉంటుందని చెబుతున్నారు. ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అప్షన్లు తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయా? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఇదంతా ఓ కొలిక్కి రావాలంటే మరికొన్ని రోజులు పట్టొచ్చని అంటున్నారు. సీట్ల కేటాయింపు వచ్చేవారం చేపడతామని అధికారులు తెలిపారు. దీన్ని బట్టి సమస్య తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. రంగంలోకి నిఘా వర్గాలు ప్రభుత్వ ఆదీనంలో ఉండాల్సిన డేటా రాత్రికి రాత్రే తుడిచి పెట్టుకుపోవడంతో ప్రభుత్వ వర్గాలు షాక్కు గురయ్యాయి. దీనిపై ప్రభుత్వం నిఘా వర్గాల సమాచారం కోరినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు రాత్రి నుంచి సాంకేతిక విద్య వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నాయి. ప్రాథమిక సమాచారాన్ని ఆదివారం ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. మరోవైపు సీట్ల కేటాయింపు ఆలస్యం కావడం, దీనిపై సరైన వివరణ లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. పాలిసెట్ క్యాంపు కార్యాలయం ఉండే సాంకేతిక విద్యా విభాగానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు అవరసమని ప్రభుత్వానికి నివేదించాయి. దీంతో సమీప పోలీసుస్టేషన్లతో పాటు, స్పెషల్ బ్రాంచీతో సమన్వయం చేసుకోవాలని అధికారిక ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. క్యాంపు అధికారులు ఏం చెబుతున్నారు? పాలిసెట్ ఫీజుల వ్యవహారమే సీట్ల కేటాయింపు ఆలస్యానికి కారణమని అధికారులు అంటున్నారు. గత ఏడాది నవంబర్లో ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులు పెరిగాయి. రూ.15 వేల నుంచి రూ.39 వేల వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.3,800 మాత్రమే ఫీజు వచ్చింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.15 వేలు ఇస్తుంది. కానీ, మిగిలిన రూ.24 వేలు విద్యార్థులు చెల్లించాలా? ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందా? అనే విషయంలో స్పష్టత రాలేదని చెబుతున్నారు. దీనికోసమే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇదే నిజమైతే ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం తెలియదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. -
పాలిసెట్ డేటా ఎరేజ్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్య విభాగంలో గందరగోళం నెలకొంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. విషయం తెలుసుకునేందుకు మీడియా శనివారం రాత్రి వరకూ ప్రయత్నించినా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. కిందిస్థాయి సిబ్బంది కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం సాఫ్ట్వేర్లో ఏదో సమస్య వచ్చిందని తెలిపారు. మరికొందరు వెబ్సైట్లో విద్యార్థుల డేటా మొత్తం ఎగిరిపోయిందని చెప్పారు. తాము చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దంటూ వారు వేడుకున్నారు. దీన్నిబట్టి సరిదిద్దలేని తప్పులేవో సాంకేతిక విద్య విభాగంలో జరిగినట్టు తెలుస్తోంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఏమైంది? పాలిసెట్ సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీనే ఉంటుందని కౌన్సెలింగ్ షెడ్యూల్లో సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. కానీ 4వ తేదీ రాత్రివరకూ ప్రకటించలేదు. కౌన్సెలింగ్ క్యాంపు అధికారులను వివరణ కోరితే పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉందని ఒకసారి, ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత రావాల్సి ఉందని మరోసారి బదులిచ్చారు. శనివారం ఉదయమే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పాలిటెక్నిక్ సీట్ల కోసం దాదాపు 22 వేల మంది ఎదురు చూస్తున్నారు. శనివారం రాత్రివరకు సీట్లు ఖరారు చేయలేదు. దీనిపై అధికారులు స్పందించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వేల మంది విద్యార్థుల డేటా తారుమారైనట్టు తెలిసింది. సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. విద్యార్థులు వెబ్సైట్లో పెట్టిన ఆప్షన్లు మొత్తం మారిపోయినట్టు తెలిసింది. దీనిపై సిబ్బంది, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం, ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్య మరింత జటిలమైందని తెలియవచ్చింది. సిబ్బంది అజాగ్రత్తే దీనికి కారణమని తెలుస్తోంది. దీనివల్లే సీట్ల కేటాయింపు ఆగిపోయినట్టు సమాచారం. ఇంజనీరింగ్ కథేంటి? ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఆదివారం నుంచి మొదలవ్వాలి. అన్ని యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు కాలేజీలు, సీట్లు, కోర్సుల వివరాలను ప్రభుత్వానికి పంపాయి. ఎక్కువ ప్రైవేటు కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ కూడా శనివారం మధ్యాహ్నం గుర్తింపు వివరాలన్నీ సాంకేతిక విద్యా మండలి కార్యాలయానికి పంపింది. వీటిని అప్లోడ్ చేస్తేనే విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. కానీ, శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియ పూర్తవ్వకపోవడంతో అసలు వెబ్ ఆప్షన్లు ఉంటాయా? షెడ్యూల్ను అనుసరిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక విద్య ఉన్నతాధికారి, ఎప్సెట్ క్యాంప్ అధికారి, జేఎన్టీయూహెచ్ రిజి్రస్టార్ శనివారం ఉదయం 11 గంటల నుంచే విద్యాశాఖ కార్యదర్శి వద్ద సమావేశమయ్యారు. పాలిసెట్ డేటా గందరగోళం అవ్వడంపై కొంత సీరియస్గానే చర్చ జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై గంటల తరబడి చర్చించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత శనివారం రాత్రి ముఖ్యమంత్రి నివాసానికి అధికారులు వెళ్లి చాలా సమయం చర్చించడంతో అసలేం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది. -
హైస్కూల్లో విద్యార్థులకు పురుగుల బియ్యం
-
20 మంది విద్యార్థులుంటే కొత్తగా పాఠశాల
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు విద్యను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. గ్రామాలు, పట్టణాల్లోని శివారు కాలనీల్లో 20 మంది విద్యార్థులున్నచోట ప్రభుత్వ పాఠశాల లేకుంటే వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇటీవల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, తాజాగా పాఠశాల విద్య డైరెక్టర్ అన్ని జిల్లాల డీఈవోలు, మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాలల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు.విద్యార్థులుండి పాఠశాలు లేనిచోట వెంటనే ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 359, గ్రామీణ ప్రాంతాల్లో 212 పాఠశాలలు అవసరమని అధికారులు నివేదిక రూపొందించారు. కొన్ని పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను కొత్తగా ఏర్పాటు చేసే పాఠశాలలకు పంపాలని సూచించారు. -
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం నుంచి మొదలవుతుంది. విద్యార్థులకు ఇదే కీలకం. ఆప్షన్ల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. బ్రాంచీ, కాలేజీని ఎంపిక చేసుకునేది ఇప్పుడే. కౌన్సెలింగ్ ప్రక్రియ గత నెల 28 నుంచి మొదలైంది. తొలి దశ కౌన్సెలింగ్ కోసం 7వ తేదీ వరకు రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకుని, ధృవపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. దీనికి 10వ తేదీ వరకు గడువు ఉంటుంది. శుక్రవారం సాయంత్రం వరకు 92,013 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 55,120 మందికి సర్టీఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చే నాటికి దాదాపు 2 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది.ఇంకా తేలని కాలేజీలు, సీట్ల లెక్క వెబ్ ఆప్షన్ల సమయంలో కౌన్సెలింగ్లో పాల్గొనే అన్ని కాలేజీలు, వాటిల్లో బ్రాంచీలు, సీట్ల వివరాలు ఆన్లైన్లో ఉంచాలి. కానీ, ఇప్పటివరకు జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) నుంచి సాంకేతిక విద్య విభాగానికి అఫిలియేషన్ వివరాలు అందలేదు. దీంతో సీట్ల సంఖ్యపై స్పష్టత కొరవడింది. జేఎన్టీయూహెచ్ పరిధిలో 139 అనుబంధ గుర్తింపు కాలేజీలున్నాయి. ఈ ఏడాది ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ సంస్థ డీమ్డ్ హోదా పొందింది. దీని పరిధిలోని కాలేజీలు కౌన్సెలింగ్లో ఉండే అవకాశం లేదు. మరో రెండు కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేశాయి.రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ వర్సిటీలకు చెందిన కాలేజీలు 19 ఉన్నాయి. మొత్తం 175 కాలేజీలు గత ఏడాది కౌన్సెలింగ్లో పాల్గొన్నాయి. ఈ సంవత్సరం కొత్తగా పాలమూరు, శాతవాహన, కొత్తగూడెం హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కాలేజీలు కౌన్సెలింగ్లో పాల్గొంటాయి. దీంతో 176 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సెలింగ్ జాబితాలో ఉంటాయి. వీటి పరిధిలో 89,970 సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. శనివారం సాయంత్రానికి గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల వివరాలు సాంకేతిక విద్య విభాగానికి పంపుతామని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. విద్యార్థుల అవగాహనకు మాక్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు ఈసారి కొత్తగా మాక్ కౌన్సెలింగ్ చేపడుతున్నారు. ఈ నెల 13వ తేదీన విద్యార్థులకు సీటు, బ్రాంచీ వివరాలతో మెసేజ్ వస్తుంది. దీన్నిబట్టి కాలేజీలు, బ్రాంచీలను ఈ నెల 15వ తేదీ వరకు మార్చుకునే వీలుంది. 15న సీట్ల కేటాయిస్తారు. కొత్త సీట్లు లేనట్టే డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గింపు.. కంప్యూటర్స్, ఎమర్జింగ్ కోర్సుల్లో సీట్లు పెంపు కోసం దాదాపు 100 కాలేజీలు దరఖాస్తు చేయగా ప్రభుత్వం తిరస్కరించింది. సర్కారు ఓకే చెప్పి ఉంటే దాదాపు 20 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో పెరిగేవి. ప్రభుత్వం ఒప్పుకోకపోవటంతో ఈసారి సీట్లు పెరిగే వీలు లేదు. మరోవైపు పాత ఫీజులనే వసూలు చేయా లని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపైనా స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంజనీరింగ్ అయిపోయే వరకు ఇదే ఫీజు ఉంటుందా? ఒక వేళ ఫీజు పెంచితే కొత్త ఫీజు మధ్యలో వసూలు చేస్తారా? అనే స్పష్టత కోరుతున్నారు. అంతా సిద్ధం చేశాం వెబ్ ఆప్షన్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. సాంకేతిక సమస్యలొచ్చినా యంత్రాంగం తక్షణమే స్పందిస్తుంది. వెబ్ ఆప్షన్లు ఇచ్చే నాటికి అఫిలియేషన్ కాలేజీలు, సీట్ల వివరాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీనివాస్, ఎప్సెట్ క్యాంప్ ఆఫీసర్జాబితా రెడీ చేశాం అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాం. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అన్నీ పరిశీలించి గుర్తింపు ఇచ్చాం. తుది జాబితాను సాంకేతిక విద్యకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. సీట్ల పెంపు ప్రతిపాదనేమీ లేదు. – డాక్టర్ కె విజయకుమార్ రెడ్డి, జేఎన్టీయూహెచ్ రెక్టార్ -
హలో మేడం.. ఈ ఫైలింగ్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో విద్యార్థులు తికమక పడుతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో సవాలక్ష సందేహాలొస్తున్నాయి. దీంతో ఎప్సెట్ క్యాంప్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. ఇంజనీరింగ్తోపాటు పాలిసెట్, ఇతర సాంకేతిక కోర్సుల కోసం సాంకేతిక విద్యామండలి ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటే ఈ–మెయిల్స్ కూడా స్వీకరిస్తున్నారు. మరోవైపు క్యాంపు కార్యాలయంలో అనుమానాలు నివృత్తి చేసే ఏర్పాట్లూ చేశారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ విరామం లేకుండా ఫోన్కాల్స్ వస్తున్నాయి. రోజుకు కనీసం ఆరువందలకు తగ్గకుండా ఫోన్ కాల్స్, వందల కొద్దీ ఈ–మెయిల్స్ అందుతున్నాయి. క్యాంపు కార్యాలయానికీ రోజుకు వంద మంది వరకూ వస్తున్నారు. వీరందరికీ సమా ధానం చెప్పేందుకు ప్రత్యేక సిబ్బందిని నియ మించారు. ఫోన్కాల్స్, మెసేజ్, మెయి ల్స్కు ఎలా సమాధానం ఇవ్వాలనే అంశాలపై వారికి ముందే శిక్షణ ఇచ్చారు. ఎన్నో అనుమానాలుటోల్ ఫ్రీ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్పై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయని క్యాంప్ కార్యాలయ అధికారులు తెలిపారు. షెడ్యూల్ విడులైన తర్వాత స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు, కౌన్సెలింగ్కు సంబంధించిన విధివిధానాలపై ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమంది అప్లికేషన్లు నింపడంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఏదైనా డేటా తప్పుగా ఇస్తే సరిచేస్తారా అని ముందే ప్రశ్నిస్తున్నారు. కుల ధ్రువీకరణ, ఆదాయ పత్రాలను ఎలా పొందాలని, ఎప్పుడు తీసుకున్నవి చెల్లుతాయని అడుగుతున్నారు. ప్రతీ దశలోనూ స్లాట్ బుక్ చేసుకోవాలా అనే ప్రశ్నలు వేస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎక్కడకు వెళ్లాలి? ఏఏ సరి్టఫికెట్లు తీసుకెళ్లాలని కొంతమంది అడుగుతున్నారు. స్లాట్ బుకింగ్, ఆప్షన్ల సమయంలో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలూ కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఆప్షన్లు మొదలు కాకున్నా, ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని? ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది స్లాట్ బుకింగ్ కోసం ఏ గేట్ వే ద్వారా డబ్బులు చెల్లించాలని, మరికొంతమంది గేట్ వే ద్వారా చెల్లిస్తుంటే ఎర్రర్ వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ క్యాంపు కార్యాలయం సిబ్బంది ఓపికగా సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచీ ఫోన్లు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి నాన్–లోకల్ తీసివేయడంతో తాము ఏ కేటగిరీ కింద సీటు పొందొచ్చని ప్రశ్నిస్తున్నారు. కాల్ సెంటర్కు మంచి స్పందన వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. కౌన్సెలింగ్కు వెళ్లే విద్యార్థి ప్రతీ సందేహాన్ని నివృత్తి చేసుకుంటున్నారు. ఇది మంచి స్పందనే. సాంకేతిక విద్య వెబ్లోకి వెళ్తే ఎప్సెట్ కౌన్సెలింగ్ వివరాలు తెలుస్తాయి. అంతేకాదు, గత ఏడాది ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వచ్చాయనేది అందుబాటులో ఉంచాం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ టోల్ ప్రీ నంబరులో సిబ్బంది అందుబాటులో ఉంటారు. 7660009768– 79 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. – శ్రీనివాస్, ఎప్సెట్ క్యాంప్ ఆఫీసర్ ప్రతీ సందేహానికి సమాధానం విద్యార్థులు ఫోన్లో కౌన్సెలింగ్కు సంబంధించిన అనేక సందేహాలు అడుగుతున్నారు. మేం ఇచ్చే సమాధానాల తర్వాత సంతృప్తి చెందుతున్నారు. కొన్నిసార్లు స్లాట్ బుకింగ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు వెంటనే వాటిని నివృత్తి చేస్తున్నాం. తిరిగి లాగిన్ అయ్యేలా చేస్తున్నాం. – శ్యామల, టోల్ ఫ్రీ నంబర్ సిబ్బంది మెయిల్స్ అన్నీ పరిశీలిస్తాం రోజూ వందల్లో మెయిల్స్ వస్తున్నాయి. విద్యార్థులు అడిగే ప్రశ్నల్లో కొన్నింటికీ ఎప్సెట్ వెబ్సైట్లో సమాచారం ఉంటుంది. ఆ లింక్ను వారికి పంపుతున్నాం. సాంకేతిక సమస్యలు ఉంటే ఆయా విభాగాలకు పంపి, తక్షణమే పరిష్కరించేలా చేస్తున్నాం. – నవ్య, ఈ–మెయిల్స్ పరిశీలించే ఉద్యోగి -
విద్యార్థులకు విషపు అన్నమా! ఉప్మాలో జెర్రి... భోజనంలో బొద్దింక
నాడు జగన్ పాలనలో బడి పిల్లలకు ‘గోరు ముద్ద’లతో పౌష్టికాహారం అందించారు. నేడు కూటమి పాలనలో ‘పురుగుల’ అన్నం పెడుతున్నారు. ఒకటో తారీకున పాయకారావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల వసతి గృహంలో బొద్దింక భోజనాన్ని సాక్షాత్తు హోం మంత్రి అనితే రుచి చూశారు. మూడో తేదీన ఇలాంటిదే మరో సంఘటన. తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులకు పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. 64 మంది తినగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖలో తీసుకొస్తానంటున్న విప్లవాత్మక మార్పులు ఇవేనా? అని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులు తినే ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. ఈ రెండు ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న భోజన వసతి ఏమేర ఉందో తేటతెల్లమవుతోంది. అసలేం జరిగిందంటే... తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో గురువారం ఉదయం ప్రార్థన జరుగుతుండగా ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారికి సపర్యలు చేసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం తిన్న ఉప్మాలో జెర్రి వచ్చిందని విద్యార్థినులు వైద్యులకు తెలియజేశారు.విద్యార్థుల కథనం మేరకు.. తెలుగుగంగ కాలనీలోని బీసీ కళాశాల వసతి గృహంలో 84 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురువారం ఉదయం 64 మంది విద్యార్థులకు ఉప్మాను అల్పాహారంగా అందించారు. యోష్ణ అనే విద్యార్థిని తనకు పెట్టిన ఉప్మాలో జెర్రి వచ్చిందని తోటి విద్యార్థులకు చూపించింది. దాంతో విద్యార్థులు ఎవరు ఉప్మా తినకుండా అక్కడ పడేసి కళాశాలకు బయలు దేరి వెళ్లిపోయారు.అయితే ప్రార్థన సమయంలో ఎం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న యోష్ణ కళ్లు తిరిగి కిందపడిపోయింది. కడుపు నొప్పితో వాంతులు అయ్యేలా ఉన్నాయని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మునికుమారి, ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న అధ్యాపకులకు చెప్పారు. అధ్యాపకులు వెంటనే వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు. -
బాలికల విద్య భ్రష్టు!
గత శాసనసభ సమావేశాల్లో హైస్కూల్ ప్లస్(ఇంటర్)లలో ప్రవేశాల్లేవని.. ఫలితాలు రావడం లేదని, వాటిని రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ సెలవిచ్చారు. ఈ నెపంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)లు రిటైరైన చోట కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు తాజా బదిలీల్లోనూ ఇక్కడ పని చేస్తున్న పీజీటీలను బదిలీ చేశారేగానీ, వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చేపట్టలేదు. ఈ స్కూళ్లు విజయవంతమవుతుండటంతో వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాలికల విద్యను భ్రష్టుపట్టిస్తోంది. గ్రామీణ బాలికలకు స్థానికంగా ఇంటర్ విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్న లక్ష్యంతో 2022లో రెండు విడతల్లో 504 హైస్కూల్ ప్లస్లను ప్రారంభించగా, వాటిలో ఒకటి బాలికల కోసం, మరొకటి కో–ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే, వైఎస్ జగన్పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒకొక్కటిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా హైస్కూల్ ప్లస్ల్లో పని చేస్తున్న పీజీటీలను ఇటీవల బదిలీల్లో బయటకు పంపి, వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆయా స్కూళ్లల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జీఓ నంబర్ 117 రద్దులో భాగంగా హైస్కూల్ ప్లస్లను రద్దు చేస్తామని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ జీఓ ఉపసంహరణ మార్గదర్శకాలు, ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైస్కూల్ ప్లస్లను ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పగిస్తామని ఒకసారి.. కాంట్రాక్టు టీచర్లను నియమిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోక పోవడం చూస్తుంటే వీటిని నిర్వీర్యం చేసి.. ఎత్తేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇట్టే తెలుస్తోంది. కుట్రలో కీలక అడుగు⇒ నిజానికి.. రాష్ట్రంలోని 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా గత ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. రెండో విడతలో మరో 210 హైస్కూళ్లతో కలిపి మొత్తం 504 హైస్కూల్ ప్లస్లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, కేజీబీల్లో సైతం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ⇒ వీటిల్లోని విద్యార్థుల ఇంటర్ తరగతుల బోధనకు సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు 1,850 మందిని పీజీటీలుగా నియమించింది. ఇప్పుడు వీరిలో సగం కంటే ఎక్కువ మందిని కూటమి ప్రభుత్వం బదిలీ చేసి, వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా తన కుట్రలో కీలక అడుగు వేసింది. దీంతో ఈ ఏడాది హైస్కూల్ ప్లస్ల్లో చేరిన విద్యార్థులకు బోధనా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లోనూ వాటిల్లో ప్రభుత్వం పీజీటీలను కేటాయించక పోవడంతో అక్కడ బోధన కుంటుబడింది. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా ప్రభుత్వమే వెనుక ఉండి తతంగం నడిపిస్తుండటం దుర్మార్గానికి పరాకాష్ట. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని రొట్టవలస హైస్కూల్ ప్లస్లో మ్యాథ్స్, బోటనీ, జువాలజీ పీజీటీలు పదోన్నతిపై ఇతర స్కూళ్లకు బదిలీ అయ్యారు. హరిపురం హైస్కూల్ ప్లస్లోని జువాలజీ పీజీటీ ఏడాది క్రితం రిటైరైనా ఇప్పటిదాకా నియమించలేదు. ఉర్లాం హైస్కూల్ ప్లస్లో నాలుగు పీజీటీ ఖాళీలను భర్తీ చేయలేదు. చిత్తూరు జిల్లాలో 10 హైస్కూల్ ప్లస్లలో 35 పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులున్నా హైస్కూల్ ప్లస్లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనడానికి ఇలాంటి ఉదాహరణలు ప్రతి మండలంలోనూ కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందాయి. స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో విద్యా రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చారు. పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకున్నాయి. ఫలితంగా నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమివ్వడం చూశాం. ఎన్నో జాగ్రత్తలతో విద్యార్థుల యూనిఫాం కిట్ పంపిణీ చేశారు. ⇒ ఇప్పుడివన్నీ గతం. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన విద్యా సంబంధిత పథకాలు, కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. పాఠశాలల్లో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడింది. డిజిటల్ క్లాస్ రూమ్లు, టోఫెల్ క్లాసులకు టాటా చెప్పింది. సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేసింది. గోరుముద్దను ఘోరంగా మార్చింది. సీబీఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబులు అక్కర్లేదంది. ⇒ దీంతో ఫలితాలు పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. తద్వారా ప్రైవేటు యాజమాన్యాలకు మేలుచేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఇట్టే తెలిసిపోయింది.ప్రభుత్వ చదువులపై విశ్వాసం పోతోంది గత ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థుల కోసం హైస్కూల్ ప్లస్ పేరిట ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. అవి బాగా విజయవంతమయ్యాయి. కానీ, కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. వీటిల్లో బోధనకు పీజీటీల్లేరు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అభద్రతాభావనకు లోనై ప్రభుత్వ చదువులపై విశ్వాసం కోల్పోతున్నారు. హైస్కూల్ ప్లస్లను ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో తేల్చాలి. పీజీటీ ఖాళీలను అర్హతగల స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలి. – వి.రెడ్డి శేఖర్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ -
kerala: స్కూళ్లలో ‘జుంబా’ వార్.. ఆరోగ్యానికే అంటున్న విద్యాశాఖ
తిరువనంతపురం: పాఠశాల విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించడానికి, వారు మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా ఉండేందుకు కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జుంబా శిక్షణను అందిస్తోంది. అయితే ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ శిక్షణపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేరళలోని పాఠశాలల్లో జుంబా ఫిట్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంపై రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు పాఠశాలల్లోని విద్యార్థులకు జంబాలో శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధమంటూ కేరళ సున్నీ యువజన సంఘం (ఎస్వైఎస్) రాష్ట్ర కార్యదర్శి అబ్దుస్సమద్ పూక్కొట్టూర్ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి టికె అష్రఫ్ కూడా దీనిని వ్యతిరేకించారు. బాలురు, బాలికలు పొట్టి దుస్తులు ధరించి సంగీతానికి అనుణంగా గెంతులు వేయడం ఏమిటి? ఇది నృత్యం చేసే సంస్కృతి కాదని, ఇటువంటి పాఠశాలలో తన కుమారుడిని తాను జాయిన్ చేయనని అన్నారు. ఉపాధ్యాయునిగా తాను ఈ తరహా నృత్యాన్ని పాఠశాలలో అమలు చేయనివ్వనని, దీనికి ప్రతిగా ఏ చర్య తీసుకున్నా, తాను సిద్ధమేనని ఆయన అన్నారు. ముస్లిం సంఘాల నుండి ఎదురవుతున్న విమర్శల మధ్య కేరళ విద్యా శాఖ.. జుంబా నృత్యం అనేది మానసిక, శారీరక శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని పేర్కొంది. మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇది 2025. మనం ఆదిమ కాలంలో జీవించడం లేదు. ప్రతి ఒక్కరూ కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ -
Bangui: స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి
బంగుయ్: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగుయ్లోని బార్తెలెమీ బోగాండా హై స్కూల్లో గురువారం ( జూన్ 26)న ఘోర ప్రమాదం జరిగింది.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా విద్యార్థులు భయంతో పరుగులు తీయగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 260 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో 16 మంది బాలికలు ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 5,000 మంది విద్యార్థులు పరీక్షల కోసం అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. గాయపడిన విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఆ దేశ విద్యా చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా నిలిచింది.#Breaking Une #bousculade suite à une explosion de transformateur fait une dizaine de morts cet après-midi au lycée Barthélémy #Boganda de #Bangui en #Centrafrique 🇨🇫. De nombreux blessés ont été transportés vers des hopitaux proches. pic.twitter.com/5loUFDnh5n— KOUAM JOEL HONORE (@honore123) June 25, 2025 -
విద్యార్థులు మెచ్చిన ఆహారం
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు రైలులోకి ఆహారం అందించే వినూత్న తరహా ఫుడ్ ఆన్ ట్రైన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీ వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో ఈ ఆఫర్ను విద్యార్థులు ఉపయోగించుకున్న తీరుపై, తమ అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. స్విగ్గీ లిమిటెడ్ వెల్లడించిన ప్రకారం.. వెరైటీ వంటకాలకు ఓటువిద్యార్థులు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల్లో బిర్యానీ, బర్గర్స్, పనీర్ టిక్కా క్యూసాడిల్లా, స్పాగెట్టి, అగ్లియో ఒలియో వంటి ఇటాలియన్, అరబిక్, మెడిటేరియన్ ఫుడ్, కింగ్ ఫిష్ తవా ఫ్రై, చికెన్ కాషాభునా వంటి సీఫుడ్ టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఆరోగ్య స్పృహ కలిగిన పలువురు విద్యార్థులు, ఆరోగ్యకరమైన పాత్రలు, హోమ్స్టైల్ భోజనాల కోసం ది గుడ్ బౌల్ లంచ్బాక్స్లతో పాటు వీగన్ స్టైల్ వంటకాలను కోరుకున్నారు. బ్రాండెడ్ ఫుడ్ కోసం మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, సబ్వే, పిజ్జాహట్ నుంచి ఎంచుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులే ఎక్కువ.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు అత్యధికంగా నాగ్పూర్ స్టేషన్లో ఫుడ్ డెలివరీ చేయించుకున్నారు. రైళ్లలో ఆహారం కోసం దాదాపు 70శాతం ఆర్డర్లతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ఫుడ్ ఆన్ ట్రైన్ వినియోగించుకుని జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ బీహెచ్యూ వారణాసి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన విద్యార్థులు ముందున్నారు. రైళ్లలో ఆర్డర్ చేసేటప్పుడు విద్యార్థులు సమయపాలన పాటించలేదు. ఉదయం 7 గంటలకు అల్పాహారం నుంచి రాత్రి 11 గంటలకు లేట్నైట్ స్నాక్స్, డెజర్ట్ దాకా విద్యార్థులు రొటీన్కు భిన్నంగా ఆర్డర్లు చేశారు. -
24 మంది విద్యార్థినులతో ‘అనుచితం’.. ఉపాధ్యాయుడు అరెస్ట్
సిర్మౌర్: పవిత్రమైన ఉపాధ్యాయు వృత్తిలో ఉంటూ అనైతిక పనులకు పాల్పడుతున్నవారిని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇదే కోవలోకి వచ్చే ఉదంతమొకటి హిమాచల్ప్రదేశ్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ పాఠశాలలో 24 మంది బాలికలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఒక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసిన ఉదంతం హిమాచల్లోని సిర్మౌర్ జిల్లాలో చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కమిటీ సమావేశంలో విద్యార్థులు పాఠశాలలోని గణిత ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టంతో సహా వివిధ విభాగాల కింద కేసు నమోదు చేశారు.ఆ ప్రభుత్వ పాఠశాలలో శిక్షా సంవాద్ కార్యక్రమం సందర్భంగా, ఎనిమిది నుంచి పదవ తరగతి వరకూ చదువుకుంటున్న 24 మంది విద్యార్థినులు పాఠశాలలోని ఉపాధ్యాయుని వేధింపులపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడు తమను అనుచితంగా తాకారంటూ విద్యార్థులు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించారు. దీంతో ప్రిన్సిపాల్ వారి తల్లిదండ్రులను పిలిపించి, పిల్లలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి అడగగా, వారు తమకు తెలియదని చెప్పారు. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో పాటు ఆ ఉపాధ్యాయునికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యాశాఖ అధికారులు నిందితుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్ ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వాదనలను రికార్డ్ చేసి, వారంలోపు తన కార్యాలయానికి నివేదిక సమర్పించాలని ఆయన కోరారు. సిర్మౌర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ యోగేష్ రోల్టా మాట్లాడుతూ నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ట్రంప్ ఖాతాలోకి కాల్పుల విరమణ క్రెడిట్? -
హోరెత్తిన ‘యువత పోరు’
సాక్షి, అమరావతి: ఉద్యోగాల భర్తీ అంటూ ఉత్తుత్తి హామీతో... నిరుద్యోగ భృతి పేరిట నయవంచనకు పాల్పడిన కూటమి ప్రభుత్వంపై యువత, విద్యార్థులు కన్నెర్రజేశారు. అరొకరగా నిధులు విడుదల చేస్తూ.. విద్యా దీవెన, వసతి దీవెనపై కపట ప్రేమ చూపుతున్న సర్కారు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిలదీశారు. మాట తప్పి... వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. పోలీసుల అణచివేత చర్యలను ఎదుర్కొంటూ ముందుకు కదిలారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అప్పటివరకు యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అంటూ కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రచారానికే పరిమితమైంది. విద్యా దీవెన కింద రూ.4,200 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు... మొత్తం రూ.6,400 కోట్లకు గాను, రూ.750 కోట్లు విదిలించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనలను క్రమంతప్పకుండా ఠంఛనుగా అందించి పిల్లల చదువులకు అండగా నిలిచింది. 2024 జనవరి వరకు నిధులను క్లియర్ చేసింది. జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికం బిల్లులు ఏప్రిల్లో ప్రాసెస్ చేసి మేలో విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. అప్పటినుంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు క్వార్టర్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ సోమవారం ‘యువత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు కదంతొక్కారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు వందలాది మంది ప్లకార్డులు చేతబట్టి ‘బాబు వచ్చాడు... వాలంటీర్లను రోడ్డుపై నిలబెట్టాడు, ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు తొలగించాడు.. నిరుద్యోగ భృతి ఎప్పుడు?.. గ్రూప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇంకెప్పుడు... ప్రతి నిరుద్యోగికి రూ.36 వేలు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలి.. ఫీజులు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం... వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి’ అని నినదించారు. 20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని మండిపడ్డారు. వలంటీర్లను రోడ్డున పడేయడంతో పాటు ఇంటింటికి నిత్యావసర సరకులు అందిస్తున్న రేషన్ వాహనాలను నిలిపివేసి ఆపరేటర్ల జీవనోపాధిపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీ, యువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతతో కార్యక్రమం విజయవంతమైంది. కాకినాడలో ‘యువత పోరు’ ర్యాలీలో కదం తొక్కిన యువత, విద్యార్థులు ⇒ విజయవాడ ధర్నాచౌక్లో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత పోరు చేపట్టారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ధర్నాచౌక్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల శ్రీకాళేశ్వరరావు (కాళీ) అధ్యక్షతన జరిగిన యువత పోరులో మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), సింహాద్రి వికాస్, పలువురు అనుబంధ విభాగాల నాయకులు ప్రసంగించారు.ఆంక్షల నడుమ..⇒ ప్రకాశం జిల్లాలో యువత పోరుపై అడుగడుగునా పోలీసులు అంక్షలు విధించారు. కలెక్టరేట్ వద్ద ఉదయం నుంచే భారీగా బలగాలను దించారు. అంబేడ్కర్ భవనానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలూ రాకపోకలు సాగించకుండా కట్టడి చేశారు. అయినా జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంబేడ్కర్ భవనం వద్ద జరిగిన సభలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు ⇒ రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా కక్షసాధింపు రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. ఏలూరులో యువత పోరులో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. రిక్షా తొక్కుతూ..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో యువతీ, యువకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరుపై రిక్షా తొక్కుతూ పరిస్థితిని చాటి చెప్పారు. కలెక్టరేట్ వరకు ప్రభుత్వ తీరుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ తీశారు. ‘తూర్పు’న కదం తొక్కిన యువతరాజమహేంద్రవరంలో కలెక్టరేట్కు వెళ్తున్న యువత పోరు భారీ ర్యాలీని బొమ్మూరు సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, యువజన సంఘం నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలాపురంలో పోలీసులను దాటి మరీడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్సీపీ యువత పోరుకు తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అనుమతి లేదని చెప్పారు. కలెక్టరేట్కు బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు మూడుసార్లు అడ్డుకున్నారు. కలెక్టరేట్ సమీపాన బారికేడ్లు, రోప్ పార్టీలతో నిలువరించారు. మహిళా నేతలు, కార్యకర్తలను సైతం పోలీసులు వెనక్కు నెట్టేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను నెట్టుకుని ముందుకు వచ్చారు. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఆందోళనకు భారీగా తరలివచ్చిన యువత ⇒ కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయం, జెడ్పీ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు, విద్యార్థులు మూకుమ్మడిగా కలెక్టరేట్కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె, మహావీర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకూ చేరింది. అనంతరం డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ⇒ నంద్యాలలో యువత పోరుకు నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ⇒ తిరుపతిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, నగర అధ్యక్షుడు దినేష్రాయల్, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్రెడ్డి, చెంగల్రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా యువత, విద్యార్థులు యువత పోరులో పాల్గొన్నారు.శ్రీకాకుళంలో జడివానలోనూ...⇒ శ్రీకాకుళంలో జడివానకు పార్టీ శ్రేణులు యువతతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో జిల్లా పరిషత్ ఏరియా దద్దరిల్లింది. జనమంతా వానలోనే ర్యాలీగా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరి నుంచి బయల్దేరారు. గంటకుపైగా నిరసన తెలిపారు. గ్రీవెన్స్సెల్లో వినతిపత్రం అందజేశారు. ⇒ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓవైపు వర్షం, మరోవైపు పోలీసు ఆంక్షల వలయంలోనూ యువత పోరును విజయవంతం చేశారు. తమకు కావల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాలంటూ నినదించారు. ⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో యువత పోరు హోరెత్తింది. వర్షానికి వెరవకుండా గర్జించింది. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా యువత తగ్గలేదు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టరేట్లు దద్దరిల్లాయి.⇒ పాడేరులో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో యువత వర్షం సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.పల్నాడులో లాఠీ ప్రతాపంపల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వందలాది విద్యార్థులు, యువత శాంతియుత ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ నమ్మక ద్రోహన్ని ప్రశ్నించేందుకు జిల్లా నలుమూలల నుంచి యువత, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనగా... వారిపై లాఠీలు ఝళిపించారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. తొలుత వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు బయల్దేరిన ర్యాలీని ఎస్పీ ఆఫీసు ఎదుట బారికేడ్లతో అడ్డుకున్నారు. నాయకులతో పాటు 50 మందిని మాత్రమే కలెక్టరేట్ వైపు అనుమతిస్తామని చెప్పారు. దీనికి వైఎస్సార్సీపీ నాయకులు అంగీకరించడంతో బారికేడ్లను తెరిచారు. ఈ సమయంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బారికేడ్ల వద్ద ఉన్నవారిపై లాఠీలతో విరుచుకుపడడంతో యువత పరుగులు తీశారు. పారిపోయే ప్రయత్నంలో కిందపడినవారి పైనా పోలీసులు దాడి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు పి.గౌతమ్రెడ్డిలు దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.⇒ గుంటూరు జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు, యువతను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పడంతో పది మంది ముఖ్య నేతలను వినతిపత్రం అందజేసేందుకు అనుమతించారు. ⇒ బాపట్లలో భారీ నిరసనలతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. పోలీసులు ఆంక్షలు విధించినా యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అక్కడే బైఠాయించారు. రథం బజారు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. -
విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం
సాక్షి, అమరావతి : పలు డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఆ కాలేజీల్లోని విద్యార్థుల పరీక్ష ఫలితాలను నిలిపేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కాలేజీలు ఫీజు చెల్లించకుంటే, అందుకు విద్యార్థులు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నించింది. ‘ఫీజులు చెల్లించని కాలేజీలను ఉరి తియ్యండి. మేం ఎంతమాత్రం జోక్యం చేసుకోం.కానీ, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటామంటే మాత్రం చూస్తూ ఉరుకోం. మాకు విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. ఇంతకుమించి మాకు ఏదీ ముఖ్యంకాదు. ఫలితాలు వెల్లడించకుంటే అది విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరీక్ష ఫలితాలను వెల్లడించకుండా ఆపేస్తామంటే మాత్రం అంగీకరించే ప్రసక్తేలేదు. కాలేజీలు అఫిలియేషన్ ఫీజు చెల్లించకుంటే, అసలు ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఎందుకు అనుమతినిచ్చారు? చేరిన విద్యార్థులను మరో కాలేజీకి తరలించి ఉండాల్సింది.ఇవేవీ చేయకుండా విద్యార్థులను బాధ్యులుగా చేస్తూ వారి పరీక్ష ఫలితాలను నిలిపేయడం ఏంటి? మేం కాలేజీల వైపు లేం.. విద్యార్థుల పక్షానే ఉన్నాం. అసలు కోర్టుకొచి్చన డిగ్రీ కాలేజీలకు చెల్లించాలి్సన స్కాలర్షిప్పుల బకాయిలను ఇప్పటివరకు ఎంత మొత్తం చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాలి? తదితర వివరాలను మా ముందుంచండి’.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాగార్జున యూనివర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే..ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఆ కాలేజీలు నిబంధనల ప్రకారం చెల్లించాలి్సన అఫిలియేషన్ ఫీజు, పరీక్ష ఫీజులను చెల్లించలేదన్నారు. ఈ సమయంలో కాలేజీల తరఫు న్యాయవాది అనుపమాదేవి జోక్యం చేసుకుంటూ, పరీక్ష ఫీజులను చెల్లించామన్నారు. అఫిలియేషన్ ఫీజును మాత్రమే చెల్లించలేదని, కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే అందుకు కారణమని ఆమె తెలిపారు. . న్యాయమూర్తి స్పందిస్తూ.. కాలేజీలు ఫీజులు చెల్లించలేదన్న నెపంతో విద్యార్థుల పరీక్షల ఫలితాలను ఆపడానికి వీల్లేదన్నారు. బకాయిల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ రిజిస్ట్రార్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేశారు.ఫలితాల నిలుపుదలపై హైకోర్టుకు కాలేజీలు..తమ కాలేజీల్లో చదువుతూ 6వ సెమిస్టర్ పరీక్షలు రాసిన 2022–25 బ్యాచ్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను నాగార్జున యూనివర్సిటీ వెల్లడించకుండా నిలిపేయడాన్ని సవాలుచేస్తూ పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్.. వర్సిటీ రిజిస్ట్రార్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. -
యువతకు బాసటగా మరో పోరాటం
సాక్షి, అమరావతి: ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న సోమవారం రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు. కృతి లేదు.. భృతి లేదు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది. అమలు చేసేశామంటూ అబద్ధాలు నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ.. ఏటా జ్యాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. 2.60 లక్షల మందిని వలంటీర్ల ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంటివద్దకే రేషన్ బియ్యం, సరుకులు పంపిణీ చేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడం ద్వారా వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు వంటి 20 వేల మందిని రోడ్డున పడేశారు. బెవరేజస్ కార్పొరేషన్లో పనిచేసే 15 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను భారీ ఎత్తున తొలగించారు. ఏడాదిలోనే సుమారు 3 లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించారు. -
విశాఖలోని యోగా డేలో గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు
-
పాపం పసివాళ్లు.. యోగా డేలో విద్యార్థుల ఆకలి కేకలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యోగా డే సందర్భంగా విద్యార్థులు అవస్థలు పడ్డారు. సమయానికి తిండిలేక ఆకలితో అలమటించారు. అర్ధరాత్రి పస్తులతోనే గిరిజన విద్యార్థులు పడుకున్నారు భోజనాలు సరిపోక.. ఆకలి కేకలతో హాహాకారాలు చేశారు. గిరిజన విద్యార్థులను పట్టించుకోలేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. యోగా కోసం తీసుకెళ్లి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు.కాకినాడ జిల్లాలో కూడా యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఆకలి బాధలు పడ్డారు. పిఠాపురం, సామర్లకోట ప్రభుత్వ పాఠశాలల్లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నాసిరకం ఆహరం, అల్పాహారం సరఫరా చేశారు. జావ మాదిరిగా ఉన్న ఉప్మాను తినలేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం అన్నం, సాంబారు భోజనం సరఫరా చేశారు. కొందరు విద్యార్థులు భోజనం తినలేక ఆకలితో అలమటించారు.విద్యార్థులకు సరఫరా చేసిన ఆహారాన్ని పరిశీలించిన మానవ హక్కుల సంఘం నేతలు, విద్యా కమిటీ సభ్యులు.. పాఠశాల ఉపాధ్యాయులపై మండిపడ్డారు. నాసికరం ఆహారం సరఫరా చేసిన బెండపూడికి చెందిన అల్లూరి సీతారామరాజు ట్రస్ట్పై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యోగాంధ్రలో గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం విశాఖలో అట్టహాసంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు నిద్రాహారాలకు అలమటించారు. శుక్రవారం రాత్రి భోజనాలు సరిపోక.. ఆకలి కేకలతో హాహాకారాలు చేశారు. వసతి ఏర్పాట్లు లేకపోవడంతో మైదానం, బస్సుల్లో నిద్రపోయారు. ప్రభుత్వం గిన్నిస్ రికార్డుపై పెట్టిన శ్రద్ధ.. చిన్నారులకు భోజనం, వసతి ఏర్పాట్లపై పెట్టలేదు. దీంతో యోగాసనాలు చేయడానికి అల్లూరి జిల్లా నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భోజనాల కోసం గలాటా.. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా అల్లూరి జిల్లా నుంచి 25 వేల మంది విద్యార్థులను ప్రభుత్వం విశాఖకు తరలించింది. శుక్రవారం తెల్లవారుజామునే అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో చిన్నారులను ఎక్కించి మధ్యాహ్నం 12 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కు తీసుకొచ్చారు. వారికి అక్కడ సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఏయూలోని రోడ్డు మీదే భోజనాలు పెట్టారు. ప్లేటు తీసుకోవడం నుంచి తిన్నాక చేతులు కడుక్కోవడం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. తాగునీటి కోసం ఎండలో లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన యోగాసనాల కార్యక్రమం ఆలస్యమైంది. సాయంత్రం 4.45కు విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించారు. రాత్రి భోజనాలకూ అవే తిప్పలు.. బస్సుల్లో నిద్రపోయిన విద్యార్థులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాత్రి 8 గంటల వరకు పిల్లలు గ్రౌండ్లోనే ఉండిపోయారు. అనంతరం అక్కడకు భోజనాలు తీసుకురాగా, అవి సరిపోలేదు. సగం మందికి భోజనాలు అందలేదు. దీంతో 30 నిమిషాల పాటు భోజనాల కోసం విద్యార్థులు ఎగబడ్డారు. ఈ సమయంలో గలాటా జరిగింది. కొంత సేపటికి మళ్లీ భోజనాలు తీసుకొచ్చి వారికి అందించారు. అనంతరం వారిలో కొంత మందిని విశాఖ వ్యాలీ, పెందుర్తి ప్రాంతంలోని కళ్యాణ మండపానికి తరలించారు. లంబసింగితో పాటు మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వందల మంది విద్యార్థులు గ్రౌండ్లో, బస్సుల్లోనే నిద్రపోవాల్సి వచ్చింది. వీరందరినీ శనివారం వేకువజాము 4 గంటలకే సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించడం గమనార్హం. ప్రజాప్రతినిధులు, అధికారుల సేవల్లో జిల్లా యంత్రాంగం.. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు విశాఖకు వచ్చారు. అన్ని శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు 3రోజులు ముందుగానే నగరానికి చేరుకున్నారు. దీంతో జిల్లా అధికారులందరూ వారి సేవలోనే తరిస్తున్నారు. యోగాంధ్ర ఏర్పాట్లు, తరలించిన విద్యార్థుల పరిస్థితులను పట్టించుకునే దిక్కు లేదు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 6.30 గంటల నుంచి 7.50 వరకు జరగనుంది.ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం గంటలకు ముందు సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వలంటీర్లకు శిక్షణ ఇవ్వడం గమనార్హం. యోగాంధ్ర కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఇతర విషయాలను వివరించేందుకు 2 వేల మందికి శుక్రవారం రాత్రి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు, మూడు రోజులకు ముందే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. అధికారులందరూ కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సేవలో తరించడంతో ఈ కార్యక్రమంలో జాప్యం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
Au క్యాంపస్ లో ఆహార సౌకర్యాలు అస్సలు బాగోలేదు
-
మా స్కూల్ మాకే ఉంచాలి
జూపాడు బంగ్లా: ‘మా కాలనీలోని స్కూల్ను మాకే ఉంచాలి... మరో పాఠశాలలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు...’ అంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండ్లెం గ్రామ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండ్లెం గ్రామ దళితకాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను రెండు కిలోమీటర్ల దూరంలో కేజీ రోడ్డు పక్కన ఉన్న మెయిన్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. దీన్ని రద్దు చేయాలని గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పిల్లలను ఆ బడికి ఎలా పంపాలి? రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్ విద్యార్థుల ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇరాన్లో ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్న వేళ భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న విద్యార్థులను భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. తొలి దఫాలో ఈరోజు(గురువారం) ఉదయం 110 మంది విద్యార్తులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఢిల్లీ నుంచి తమ ప్రాంతానికి వెళ్లేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అందించిన బస్సులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. The Chief Minister has taken note of the request of the students evacuated from Iran regarding the quality of buses arranged to transport them from Delhi to J&K. The Resident Commissioner has been tasked with coordinating with the JKRTC to ensure proper deluxe buses are arranged.— Office of Chief Minister, J&K (@CM_JnK) June 19, 2025Operation Sindhu brings people home.110 Indian students evacuated from Iran under #OperationSindhu have safely arrived in New Delhi on a special flight from Yerevan, Armenia. MoS @KVSinghMPGonda received them at the airport. Government of 🇮🇳 remains committed to the safety of… pic.twitter.com/GwhI5R26DE— Randhir Jaiswal (@MEAIndia) June 19, 2025దీనిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం స్పందించింది. విద్యార్థులకు డీలక్స్ బస్సులు పంపేలా జమ్ముకశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. ఇరాన్లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన 110 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్బంగా ఆ విద్యార్థులలో ఒకరైన అలీ మీడియాతో మాట్లాడుతూ ఇది తమకు ఎంతో కష్టమైన ప్రయాణమని, టెహ్రాన్లో అధికంగా దాడులు జరిగాయన్నారు. భారత రాయబార కార్యాలయ అధికారులు తాము తొలుత అర్మేనియా సరిహద్దును దాటడానికి సహాయం చేశారని, అక్కడ తాము ఒక రోజు బస చేసిన తరువాత ఢిల్లీకి వచ్చామని తెలిపారు. కశ్మీర్ నివాసి షేక్ అఫ్సా మాట్లాడుతూ, తాము ఎంతగానో అలసిపోయామని, ఈ డొక్కు బస్సుల్లో తమ ఇళ్లకు వెళ్లడం ఎంతో కష్టమన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం సమసిపోవాలని కోరుకుంటున్నామని, ఇవి తమ చదువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. తమకు త్వరలో ప్రాక్టికల్ తరగతులు ఉన్నాయని, తాము ఇరాన్ తిరిగి వెళ్లవలసి ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: ‘యుద్ధం ఆపింది ఆయనే’.. పాక్ సైన్యాధ్యక్షునికి ట్రంప్ కితాబు -
టెహ్రాన్లో దారుణ పరిస్థితులు.. భారత విద్యార్థుల తిరుగుముఖం
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న తరుణంలో టెహ్రాన్(ఇరాన్)లోని భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన తొలి రోజున టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 140 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిని వర్శిటీ నుంచి సురక్షితంగా వెళ్లిపోవాలని అక్కడి సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేశారు.టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు క్షణక్షణానికి దిగజారుతున్నాయని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో తమకు భారీ పేలుడు శబ్దం వినిపించిందని, తాము కిటికీల నుండి బయటకు చూడగా, నల్లటి పొగ ఆవరించి ఉందన్నారు. ఆ తరువాత మరిన్ని పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని అన్నారు.తాము ఫైటర్ జెట్ల శబ్దం కూడా విన్నామని, ఆకాశం డ్రోన్లతో నిండిపోయిందని, శుక్రవారం సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు నిరంతరం శబ్దాలు వినిపించాయన్నారు. ఆ సమయంలో బ్లాక్అవుట్ కావడంతో డార్మిటరీ కింద కూర్చున్నామన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఆ సమయంలో తమకు సహకారం అందించారన్నారు. పేలుళ్లు జరిగిన వెంటనే తమ వైస్-డీన్ వచ్చి, ఏమీ జరగదని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం తమకు లేదన్నారు. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, వీలైనంత త్వరగా టెహ్రాన్ను ఖాళీ చేయాలనుకుంటున్నట్లు వైద్య విద్యార్థులు చెప్పారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ సమయంలో భారత విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారు గుర్తు చేశారు.ఇది కూడా చదవండి: టెహ్రాన్ను తక్షణం ఖాళీ చేయాలి: ట్రంప్ హెచ్చరిక -
ఇంటర్లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య
నస్పూర్/అక్కన్నపేట(హుస్నాబాద్)/జహీరాబాద్ టౌన్: ఇంటర్లో ఫెయిల్ కావడంతో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లోని జయశంకర్ కాలనీలో నివాసం ఉండే కోటేజీ కృష్ణార్జునరావు, ప్రవీణ దంపతుల చిన్న కూతురు అక్షయ సెకండియర్ గణితం ఫెయిల్ కాగా సప్లిమెంటరీ పరీక్ష రాసింది. సోమవారం వెలువడిన ఫలితాల్లోనూ పాస్ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ ఫ్యాన్కు ఉరేసుకుంది. తండ్రి గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్తండా గ్రామానికి చెందిన గుగులోతు కవిత–సూర్యనాయక్ దంపతుల రెండవ కుమార్తె హారిక (17) హనుమకొండ జిల్లా వంగర గురుకులంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. బాటనీ సబ్జెక్ట్లో ఫెయిలైంది. తిరిగి సప్లిమెంటరీ రాసినా పాస్ కాకపోవడంతో సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. రాయికోడ్ మండలం మహబత్పూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కృష్ణ కుమారుడు వెంకటరమణ(18)ఆర్ఎల్ఆర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సెకండ్ ఇయర్లో ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లోనూ ఒక సబెక్టులో ఫెయిల్ కావడంతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఎంబీబీఎస్ కటాఫ్పై ఉత్కంఠ
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2025 ఫలితాలు చర్చోపచర్చలకు దారితీశాయి. జాతీయ స్థాయి ర్యాంక్ల ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు ఏ మేరకు వస్తాయన్న అంచనాలు వేసుకోవడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తలమునకలయ్యారు. ఈసారి రాష్ట్రం నుంచి 57,934 మంది పరీక్ష రాయగా 36,776 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నీట్ రాసిన, అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. అదే విధంగా పేపర్ ఎంతో కఠినంగా ఉండటంతో గతేడాదికి పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ర్యాంక్లు దక్కాయి. దీంతో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కటాఫ్ మార్కులు బాగా తగ్గుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది ఏయూ రీజియన్లో ఓపెన్ కేటగిరిలో 601 మార్కులతో 75,427 ర్యాంక్ (నేషనల్) సాధించిన విద్యార్థికి ప్రభుత్వ (కన్వీనర్) కోటా చివరి సీటు దక్కింది. బీసీ, మైనార్టీల్లో 482 స్కోర్ వచ్చిన విద్యార్థుల వరకు సీట్లు వచ్చాయి. ఎస్వీయూ రీజియన్లో జనరల్ కేటగిరిలో 583 స్కోర్తో 93,186 ర్యాంకర్కు, బీసీల్లో 502 స్కోర్తో 2,01,883 ర్యాంకర్కు, ఎస్సీల్లో 500 స్కోర్తో 2,05,164, ఎస్టీల్లో 458 స్కోర్తో 2,69,020 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మెడిసిన్ సీటు వచ్చింది. గత ఏడాది ఉన్న సీట్లలోనే.. రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం లేదని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలో ఒక్క సీటు పెరిగే అవకాశం లేదు. ఇక ప్రైవేట్లో కొత్త కళాశాలలు, సీట్ల పెరుగుదల లేదని తెలుస్తోంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న 6,510 సీట్లలోనే 2025–26 విద్యా సంవత్సరంలోనూ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ప్రస్తుత నీట్ ఫలితాల సరళి, ఆల్ ఇండియా ర్యాంక్ల సరళిని ఓసారి గమనిస్తే.. నీట్ 2024లో టాప్ 100లోపు విద్యార్థులు 715–720 మధ్య స్కోర్ చేశారు. ఏకంగా 80,117 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా 600పైబడి స్కోర్ చేశారు. ఈసారి జాతీయ స్థాయిలో టాప్ స్కోర్ 686 దగ్గరే ఆగిపోయింది. 651 నుంచి 686 మధ్య 73 మంది, 601–650 మధ్య 1259 మంది, 551–600 మధ్య 10,658 మంది చొప్పున విద్యార్థులు నిలిచారు. ఈసారి టాప్ స్కోరర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 400 నుంచి 500 మధ్య ఎక్కువ మంది స్కోర్ చేశారు. దీంతో 2025–26 ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కటాఫ్లు 100 మార్కులకు పైబడి దిగిరానున్నాయి. ఇదిలా ఉండగా నీట్ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల సమాచారం ఎన్టీఏ నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఇంకా అందాల్సి ఉంది. ఎన్టీఏ నుంచి పిలుపు వస్తే విశ్వవిద్యాలయం ప్రతినిధి ఢిల్లీకి వెళ్లి నీట్ అర్హుల సమాచారాన్ని తీసుకురానున్నారు. ఇందుకు వారం రోజులు సమయం పట్టనుంది. కన్వీనర్ కోటాలో 4,046 సీట్లు ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. 2024–25 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఈ కళాశాలల్లో 6,510 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 475 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలో 4046 రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాలోకి, 1,989 సీట్లు యాజమాన్య (బీ, సీ) కోటాలోకి వస్తాయి. ఇక బీడీఎస్లో ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 1,540 సీట్లుండగా, ఆల్ ఇండియా కోటాలో 21, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 818, యాజమాన్య కోటాలో 700 సీట్లు భర్తీ చేస్తారు. -
విద్యార్థులు తగ్గుతున్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలగడం లేదు. దీంతో ప్రభుత్వ స్కూళ్లకు మూసివేత ప్రమాదం పొంచి ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 310 వరకు స్కూళ్లు జీరో ఎన్రోల్మెంట్తో మూతపడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సర్దుబాటు చేయగా దాదాపు 1,980 స్కూళ్లు మూతపడ్డాయి. ఇక విద్యా సంవత్సరంలోనూ మరిన్ని స్కూళ్లపైనా మూసివేత కత్తి వేలాడుతోంది. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసిద్దిపేటలో తెరుచుకున్నస్కూళ్లుసిద్దిపేట జిల్లాలో 12 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఈసారి తెరుచుకున్నాయి. అక్కన్నపేట మండలం రేగొండ ప్రాథమిక పాఠశాల గత ఏడాది జీరో ఎన్రోల్మెంట్తో మూతపడింది. టీచర్లు గ్రామంలో అవగాహన కల్పించి 35 మంది విద్యార్థులను చేర్పించారు. ఆ పాఠశాలను ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.అత్యధికంగా వరంగల్లో మూసివేత ⇒ 2024–25 విద్యా సంవత్సరంలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. 135 స్కూళ్లు విద్యార్థుల్లేక, తక్కువ మంది (పది మందిలోపే) విద్యార్థులు ఉండటంతో టీచర్లు, విద్యార్థుల సర్దుబాటుతో అవి మూత పడ్డాయి.⇒ ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 94 స్కూళ్లు మూతపడ్డాయి. నల్లగొండ జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 32, ఆసిఫాబాద్లో 34, నిర్మల్లో 48, నిజామాబాద్లో 38, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 89, కరీంనగర్ జిల్లాలో 50, రాజన్నసిరిసిల్లలో 18, జగిత్యాలలో 61, పెద్దపల్లిలో 29, హనుమకొండలో 41, మహబూబ్నగర్ జిల్లాలో 48, నాగర్కర్నూల్లో 15, వనపర్తిలో 33, గద్వాలలో 4, నారాయణపేటలో 37 స్కూళ్లు మూత పడ్డాయి. మూడేళ్లలో గణనీయంగా తగ్గిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతూనే ఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గడిచిన మూడేళ్ల గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారమే 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,09,212 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 23,71,772కు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 37,26,220కి పెరిగింది.ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్థులు ఖమ్మం జిల్లాలోనూ రామలింగాలపల్లి క్రాస్ రోడ్డు, ఆలియాతండా, గంగారంతండా కొత్తతండా పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఓవరాల్గా చూస్తే ఈ మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లలోనూ రెట్టింపు స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022–23లో ప్రభుత్వ స్కూళ్లలో 1,08,715 మంది విద్యార్థులు ఉంటే వారి సంఖ్య 2024–25లో 1,10,934కు పెరిగింది. ప్రైవేట్ స్కూళ్లలో గతంలో 1,22,781 మంది ఉంటే 1,26,421కి పెరిగింది. ఏటేటా పెరుగుతున్న జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఏటేటా పెరుగుతోంది. అక్కడక్కడ బడిబాటలో టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి ఒకటీ రెండు మూత పడిన స్కూళ్లను తెరిపిస్తున్నా, వందల సంఖ్యలో మూత పడుతూనే ఉన్నాయి. ⇒ 2021–22 విద్యా సంవత్సరంలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,086 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపునకు దగ్గరైంది. ⇒ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 2022–23 విద్యా సంవత్సరంలో 1,307కు పెరగగా, 2023–24 సంవత్సరంలో 1,745కు, 2024–25 సంవత్సరంలో వాటి సంఖ్య 1,980కి పెరిగింది. ⇒ ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట తర్వాత వాటిల్లో ఎన్ని తెరుచుకుంటాయో, ఈసారి ఎన్ని స్కూళ్లు మూత పడతాయో త్వరలోనే తేలనుంది. -
విద్యార్థులకు చెల్లని చెక్కులు
-
చెల్లని చెక్కులు పంచిన మంత్రి లోకేష్!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: షైనింగ్ స్టార్స్ పేరిట కూటమి ప్రభుత్వం పంచుతున్న చెక్ల విషయంలో దారుణం జరిగింది. స్వయంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పంచిన చెక్కులు చెల్లకుండా పోయాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై అధికారులను ఆరాలు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్(Shinig Stars Cheques) పేరుతో అవార్డులను ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. వారం కిందట పార్వతీపురంలో 90 మంది ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్వయంగా మంత్రి లోకేష్ రూ.20 వేల విలువైన చెక్లు అందించారు. అయితే ఆ చెక్లను బ్యాంక్లు వెనక్కి తిప్పి పంపించాయి. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు విద్యా శాఖ కార్యాయాల వద్దకు చేరి ఆరాలు తీశారు. అయితే ఆ చెక్లపై ఉన్న డీఈవో, ఎంఈవోల సంతకాలు సరిపోలేదని చెబుతూ బ్యాంకులు తిప్పి పంపినట్లు తేలింది. దీంతో మంత్రి లోకేష్ చేతుల మీదుగా జరిగిన వ్యవహారం కావడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ చెల్లని చెక్లు తీసుకుని విద్యార్థులను వెనక్కి పంపించేశారు. త్వరలోనే చెల్లే చెక్కులు పంపిణీ చేస్తామని వాళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎక్కడి వారు అక్కడే గప్చుప్! -
ఫీజు చెల్లింపులు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం పై ఆగ్రహం
-
ప్రభుత్వ బడుల్లో టెక్ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. దీంతో పాఠశాలల్లో ఆధునిక బోధన సదుపాయాలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ వాణిజ్యవేత్త నందన్ నీలేకని సారథ్యంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ సారథ్యంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగాయి. ఎంవోయూ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలు అందించే సేవలివీ.. –ఎక్స్టెప్ ఫౌండేషన్ 540 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్పై పని చేస్తుంది. 33 జిల్లాల పరిధిలో 5వేలకుపైగా పైగా ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరిస్తుంది. మూడు నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతోపాటు మ్యాథ్స్పై బేసిక్స్ను అందిస్తుంది. –ఫిజిక్స్వాలా ఇంటర్మీడియట్ విద్యార్థులను నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాలస్థాయి నుంచే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తుంది. –ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్పై శిక్షణ ఇస్తుంది. –ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. –పైజామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్పై శిక్షణ ఇస్తుంది. –ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది. -
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2025లో రాష్ట్రం నుంచి 36,776 మంది అర్హత సాధించారు. టాప్–100 మందిలో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం గత నెల 4వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 22,09,318 మంది హాజరైన ఈ పరీక్షలో 12,36,531 మంది అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి 59,219 మంది దరఖాస్తు చేసుకోగా, 57,934 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 36,776 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో టాప్–100లో ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వీరిలో 19వ ర్యాంకుతో దర్భా కార్తీక్ రామ్ కిరీటి రాష్ట్ర టాపర్గా నిలిచాడు. అలాగే, కొడవాటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంకు.. దేశిన సూర్యచరణ్ 59, పొదిలపు అవినాష్ 64 (ఓబీసీ), యర్రా సమీర్ కుమార్ 70 (ఓబీసీ), తుమ్మూరి శివ మణిదీప్ 92వ (ఓబీసీ) ర్యాంకులు సాధించారు. వీరుగాక కారు మంచి విక్రాంత్ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు.టాపర్గా రాజస్థాన్ విద్యార్థి ఈసారి నీట్ యూజీ పరీక్షలో టాప్–10 ర్యాంకులు ఉత్తరాది విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో 9 మంది బాలురు, ఒక బాలిక ఉన్నారు. రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ టాపర్గా నిలవగా, మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్‡్ష అవాధియా రెండో ర్యాంకు, మహరాష్ట్ర విద్యార్థి క్రిషంగ్ జోషి మూడో ర్యాంకు, ఢిల్లీకి చెందిన మృణాల్ కిషోర్ ఝా నాలుగో ర్యాంకు, అవికా అగర్వాల్ (ఢిల్లీ) ఐదో ర్యాంకు సొంతం చేసుకున్నారు. 73 మందికి అత్యుత్తమ మార్కులుఈ ఏడాది నీట్ మార్కుల సాధనలో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినట్టు ఎన్టీఏ వెల్లడించింది. 144 నుంచి 686 మార్కుల వరకు సాధించిన విద్యార్థులను ప్రకటించింది. ఇందులో 73 మంది 651 నుంచి 686 మధ్య మార్కులు సాధించారు. -
మద్యం షాపు తొలగించండి.. విద్యార్థుల నిరసనలు
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెలిశాయి. గుడి, బడి అనే తేడా లేకుండా.. మద్యం షాపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తరగతులను బహిష్కరించి.. నిరసనలు చేపట్టారు.శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం మండలం ఈదుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసనలకు దిగారు. మద్యం షాపు ఎత్తివేయాలని తరగతులు బహిష్కరించి విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు.. మద్యం దుకాణం నిర్వాహకులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మద్యం షాప్ తొలగించేంత వరకు తమ పిల్లలను బడికి పంపమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్గా మారాయి ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! View this post on Instagram A post shared by Vinay Sharma (@vinayshaarma)> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. -
తల్లికి వందనం మహా మోసం!
తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. – ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడుఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం. – ఎన్నికలప్పుడు నారా లోకేశ్విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్మెంట్పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా? వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్షిప్ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది. కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది. ఇచ్చేది 54,94,703 మందికే.. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్ ఇంటర్లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా. వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నాలుక మడతేసిన లోకేశ్!వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్ అప్లై అన్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా లోకేశ్ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు. పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు. -
బడి గంట మోగింది
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం మొదలవుతోంది. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గురువారం బడులు తెరుచుకోనున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని చోట్లా హడావుడి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు బడులను అలంకరిస్తున్నారు. స్టేషనరీ, యూనిఫామ్ షాపులు, షూస్ అమ్మే దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, బస్సులు విద్యార్థుల కోసం సిద్ధమవుతున్నాయి. అధికారుల్లోనూ హడావుడి మొదలైంది. వసతి గృహాలకు వెళ్లే విద్యార్థులు పెట్టేబేడాతో సన్నద్ధమవుతున్నారు. టీచర్లు తమ స్కూళ్లలో రిజిస్టర్లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులు వాట్సాప్ మెసేజీలతో ప్రభుత్వ టీచర్లను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 41,354 స్కూళ్లలో సందడి వాతావరణం కనిపించబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు కలిపి మొత్తం 62 లక్షల మంది విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరో పక్క వారం రోజుల్లో ప్రభుత్వ టీచర్ల సర్దుబాటు చేపడతామని అధికారులు అంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఉండేలా చేస్తామంటున్నారు. తక్కువ విద్యార్థులున్న చోట ఎక్కువ మంది టీచర్లు ఉంటే, వారిని టీచర్లు తక్కువగా ఉండి, విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపుతారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మందికిపైగా టీచర్లను సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. సర్కారీ స్కూళ్ల సన్నాహాలుప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను నడిపించాలన్నది విద్యాశాఖ లక్ష్యం. ఏడాదిగా దీనిపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యను కూడా అందించాలని నిర్ణయించారు. బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు 60 వేల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సరికొత్త బోధన మెళకువలను రిసోర్స్ పర్సన్స్ ద్వారా అందించామని విద్యాశాఖ ధీమాగా ఉంది. విద్యార్థులను ఆకట్టుకునే బోధన ప్రణాళికనూ రూపొందించామని చెబుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం కేలండర్ను పాఠశాల విద్య డైరెక్టరేట్ వెల్లడించింది. ప్రతీ రోజు విద్యార్థులకు యోగా నేర్పించాలని సూచించింది. ఆటలు, పాటలు, సాంస్కృతిక హంగులు స్కూళ్లలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాలల్లో చిన్న చిన్న రిపేర్లు వేసవిలోనే పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మౌలిక వసతుల లోపం ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెపుతున్నారు. స్కూళ్లు మొదలయ్యాక ఈ అంశంపై దృష్టి పెడతామని అంటున్నారు. ఇప్పటికే స్కూళ్లకు పుస్తకాలు, యూనిఫామ్లు చేరాయని, మొదటి రోజే వాటిని విద్యార్థులకు అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కొత్తగా చేరే విద్యార్థులకు కొంత ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపారు. మరో పక్క ఈ నెలాఖరు వరకు బడిబాట నిర్వహిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చేరేలా ఆకర్షిస్తారు. ఏఐ పాఠాలు.. కంప్యూటర్ ల్యాబ్లుపాఠశాల విద్యాస్థాయి నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం 3,412 స్కూళ్లను ఎంపిక చేశారు. పలు సంస్థలతో విద్యాశాఖ అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. 604 మండలాల్లో కంప్యూటర్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ విద్య, ఏఐ పాఠాలపై ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. వీటిపై గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రచారం కల్పించాలని, విద్యార్థులను ఆకర్షించాలని ప్రభుత్వం డీఈవోలకు సూచించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధనలో నాణ్యతా ప్రమాణాలపై జాతీయ సర్వే సంస్థలు కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక లెర్నింగ్ క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమిక విద్య స్థాయిలో తక్కువ ప్రమాణాలున్న వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
విద్యార్థుల సమస్యలపై రాహుల్ ఆవేదన.. ప్రధాని మోదీకి లేఖ
ఢిల్లీ: దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పులను తగిన సమయంలో అందించి, విద్యార్థులను ఆదుకోవాలని రాహుల్ కోరారు.దేశంలోని దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తప్పుబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థుల విద్యకు కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని గాంధీ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఇటీవల బీహార్లోని దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్ను తాను సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రమైన టాయిలెట్లు, అసురక్షిత తాగునీరు, మెస్ సౌకర్యాలు లేకపోవడం, లైబ్రరీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడాన్ని చూసినప్పుడు తనకు బాధ కలిగిందన్నారు. అలాగే అణగారిన వర్గాల విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లు అందించడంలో ఆలస్యం జరుగుతున్నదన్నారు. అక్కడి స్కాలర్షిప్ పోర్టల్ మూడు సంవత్సరాలుగా పనిచేయడంలేదని, 2021-22లో ఏ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ లభించలేదని రాహుల్ పేర్కొన్నారు. ఇటువంటి వైఫల్యాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే , దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని తాను భావిస్తానని ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు -
కార్పొరేట్స్కూళ్లలో ఫైనాన్షియర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్కూళ్లు మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులు భావించారు. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచాయి.అంతేకాదు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఈసారి కొత్త దందా ప్రారంభించాయి. నిర్ధారిత ఫీజులు సకాలంలో వసూలు చేసుకునే క్రమంలో ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో తల్లిదండ్రుల తరఫున తొలుత యాజమాన్యాల బినామీలైన ఈ ఫైనాన్షియర్లే ఫీజులు చెల్లించేస్తారు. ఆ తర్వాత వీరు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తారు. గడువు లోపు చెల్లించకపోతే వడ్డీ కూడా వసూలు చేసేలా ఈ కొత్త తరహా దందాకు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి.పుస్తకాలు, యూనిఫాం, యాప్ల పేరిట బాదుడు రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నారు. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరం ఉండటం లేదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. తల్లిదండ్రుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం మేర ఫీజులు పెరిగాయి. సాధారణ స్కూళ్ళలో కూడా రూ.50 వేల వార్షిక ఫీజు ఉంది. ఇక కార్పొరేట్ స్కూళ్ళు ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువులన్నీ తమ వద్దే కొనాలంటున్నాయి.ఓ కార్పొరేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఒక్క పాఠ్య పుస్తకాల వ్యయమే రూ.12 వేల వరకు ఉండటం గమనార్హం. మరోవైపు పాఠశాల సొంత ‘యాప్’ల పేరిట మరో దోపిడీకి కూడా కొన్ని యాజమాన్యాలు తెరలేపాయి. ఇందుకోసం ప్రతి విద్యార్థి నుంచి క్లాసు ఆధారంగా రూ.2,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు (Fees) నియంత్రిస్తామని, అడ్డగోలు దోపిడీకి కళ్లెం వేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఈ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ స్కూళ్లు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ఏర్పాటులో చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. చట్టం లేదు.. నియంత్రణ లేదు ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తేవాలని కొన్నేళ్ళుగా ఆలోచిస్తోంది. దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్ళను దీని పరిధిలోకి తేవాలని భావించింది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచే నిబంధన విధించే యోచనలో ఉంది.ఈ దిశగా గతంలో ఆచార్య తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత కూడా ఈ దిశగా కార్యాచరణకు పూనుకుంది. మంత్రులతో కమిటీ వేసింది. విద్యా కమిషన్ నుంచి నివేదిక కోరింది. మంత్రుల కమిటీ ఫీజుల నియంత్రణ దిశగా అధికారులతో సంప్రదింపులు చేపట్టింది. కానీ వీటిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. తిరుపతిరావు కమిటీ సిఫారసులు కనుమరుగుతిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ మేరకు కొన్ని సిఫారసులు చేసింది. ‘ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే..యాజమాన్యం ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా మాత్రమే ఉండాలి. వేతనాలు, స్కూల్లో మౌలిక వసతుల కోసం జరిపే కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరగాలి. 10 శాతానికి పైగా ఫీజు పెంచే స్కూళ్ళన్నీ విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలించాలి.ఎక్కడ తప్పు జరిగినా భారీ జరిమానా విధించాలి. అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దు చేయాలి..’అని సూచించింది. ఈ మేరకు 2018లో కమిటీ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసింది. ఈ నేపథ్యంలో 10 శాతం లోపు ఫీజులు పెంచిన దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. అయితే ఆ తర్వాత ఈ విధానం కనుమరుగైంది. కమిటీ సిఫారసులు కఠినంగా అమలు చేస్తే చాలా వరకు స్కూళ్లు 10 శాతం లోపే ఫీజులు పెంచేందుకు అవకాశం ఉంటుందని అంచనా.చట్టం తేవాలిప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏకంగా 25 శాతం పెంచారు. కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి వారికి ఈ ఫీజులు గుదిబండలా మారుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజులు నియంత్రించాలి. చిత్తశుద్ధితో చట్టాన్ని తెచ్చి అమలు చేయాలి. – పొలుసు సంజీవరావు, హైదరాబాద్ (విద్యార్థి తండ్రి)ప్రభుత్వ నియంత్రణ ఉండాలిప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఇష్టానుసారం పెంచుతున్నారు. మరోవైపు నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లలో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. వీటన్నింటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. – నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)వడ్డీ వసూలు చేస్తున్నారుఫీజులు, సకాలంలో చెల్లించకపోతే వడ్డీలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కుల పేరిట వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశి్నస్తే..అన్ని పాఠశాలలు ఇలానే చేస్తున్నాయంటున్నారు. మీకు ఇష్టం లేకపోతే టీసీ ఇచ్చేస్తాం తీసుకెళ్లండంటున్నారు. ఇలా వసూలు చేయడం చట్ట విరుద్ధం అని చెబుతున్న అధికారులు..ఈ పాఠశాలల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – ఆశ (విద్యార్థి తల్లి) -
'ప్రైవేటే షైనింగ్' స్టార్
విజయనగరం జిల్లా నుంచి షైనింగ్ స్టార్ అవార్డులకు 40 మంది జూనియర్ కాలేజీ విద్యార్థులను ఎంపిక చేయగా, వీరిలో 29 మంది ప్రైవేటు కాలేజీవారు. 11 మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల వారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇదే విధంగా అవార్డులకు ఎంపిక జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనలో ఏడాదికాలంలో ప్రభుత్వ విద్యను ఎంతగా దిగజార్చారో ఇదిఉదాహరణ మాత్రమే. సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్య అభాసుపాలవుతోంది. ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు దక్కాల్సిన గుర్తింపు ప్రైవేటు సంస్థలకు చెందుతోంది. తాజాగా ఇచ్చిన ‘షైనింగ్ స్టార్’ పురస్కారాలు దీనినే స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 4,168 పురస్కారాల్లో 3 వేలకు పైగా ఆ సంస్థల విద్యార్థులకే కట్టబెట్టారు. ప్రతి మండలంలో పదో తరగతిలో ఆరుగురు, ఇంటర్మీడియట్లో జిల్లాకు 36 మంది చొప్పున అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు.అయితే, గత విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు జూనియర్ కాలేజీ విద్యార్థులకే దక్కడంతో షైనింగ్ స్టార్లుగానూ వారే అధికంగా ఎంపికయ్యారు. అత్యంత గందరగోళంగా జరిగిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రైవేటుకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించలేదు. పైగా, ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకే షైనింగ్ స్టార్ అవార్డులు ఇచ్చింది. రూ.20 వేల నగదు, మెడల్తో పాటు అభినందన పత్రం బహూకరించారు. సోమవారం 26 జిల్లా కేంద్రాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. పదో తరగతిలో 600కి 500 పైన (సగటున 83.33 శాతం) మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులను మండలానికి ఆరుగురు చొప్పున, 70 శాతం మార్కులు సాధించిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపికచేసి అవార్డులను ఇచ్చారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ, ఒకేషనల్ గ్రూపుల్లో 830పైగా మార్కులు పొందిన 36 మందిని, 700 మార్కులు పొందిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను సత్కరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకే గుర్తింపు నాడు జగనన్న ఆణిముత్యాలు అధికం ప్రభుత్వ విద్యార్థులకే రాష్ట్రంలో ప్రతి పేదింటి బిడ్డ చదువులో రాణిస్తే పేదరికం పోగొట్టవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంక్షించారు. ఇంగ్లిష్ మీడియంలో చదివితే అద్భుతంగా రాణిస్తారని బలంగా నమ్మారు. దీనికోసం వైఎస్ జగన్ హయాంలో మనబడి నాడు–నేడు పథకంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అంతర్జాతీయ స్థాయి బోధనను అందించారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల వారిని తలదన్నేలా అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ‘జగనన్న ఆణిముత్యాలు’ కింద ఎంపికయ్యారు. కానీ, కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్పై కక్ష సాధించేందుకు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. ‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్నవారు అక్కడ చదువుకుంటారు, మేధావులుగా తయారవుతారు. మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’ అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. దీనికితగ్గట్లే 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రహసనంగా మార్చేశారు. వేలాదిమంది ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. -
నదీగర్భంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం
కాళేశ్వరం: వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు నదీగర్భంలో ఆదివారం లభ్యమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎగువన మూడవ బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రవాహ ప్రాంతంలో అంబట్పల్లికి చెందిన పట్టి వెంకట్స్వామి ఇద్దరు కుమారులు మధుసూదన్ (18), శివమనోజ్ (15), కర్ణాల సాగర్ (16), తొగరి రక్షిత్ (13), మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రామ్చరణ్ (17), అదే మండలం స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19)తో మేడిగడ్డ బ్యారేజీ చూసి గోదావరిలో ఈతకు వెళ్లి శనివారం సాయంత్రం 6 గంటలకు నీట మునిగారు. ఆ ఘటనలో పట్టి శివమణి (18) ప్రాణాలతో బయటపడ్డాడు. ముమ్మర గాలింపు.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భూపాలపల్లి ఏఎస్పీ నరేశ్కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి, డీడీఆర్ఎఫ్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించాయి. ఏడు గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఆరుగురి మృతదేహాల ఆచూకీ నీటమునిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల దూరంలో లభించింది. మృతదేహాలను వెలికి తీసి అంబులెన్స్ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మేడిగడ్డ ప్రాంతం శోకసంద్రంగా మారింది. -
ఈత రాకున్నా నదిలోకి వెళ్లి..
భూపాలపల్లి/కాళేశ్వరం: వారంతా విద్యార్థులు.. పైగా సమీప బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలుసుకున్నారు... ఎవరికీ ఈత రాకున్నా మేడిగడ్డను చూసి సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని నదిలోకి దిగారు. కానీ నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక ఒకరిని కాపాడబోయి ఒకరు మొత్తం ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోల్కొండ మల్లయ్య కుమార్తె త్రివేణి వివాహం ఈ నెల 5న జరిగింది. వివాహం అనంతరం సమీప బంధువులైన అదే గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్ (18), పట్టి శివమనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్ణాల సాగర్ (16)తోపాటు మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచరణ్ (17), స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19), పట్టి శివమణి.. మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్ వద్ద స్నానం చేసేందుకు శనివారం సాయంత్రం 6 గంటలకు వెళ్లారు. మోకాలి లోతు నీళ్లలో స్నానం చేసే క్రమంలో ఆడుకుంటుండగా తొలుత ఒకరు నీటమునిగారు. ఆపై ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఆరుగురు నీటమునిగారు. నది ఒడ్డునున్న పట్టి శివమణి వెంటనే పట్టి మధుసూదన్ను కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యంకాకపోవడంతో చివరకు ఒడ్డుకు వచ్చేశాడు. మిగిలిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. వద్దని వారిస్తున్నా వినకుండా... అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ ఉన్నారు. వారితోపాటు మిగిలిన ఐదుగురు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా వెంకటస్వామి అడ్డుకున్నాడు. నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉందని.. వెళ్లొద్దని వారించినా వినకుండా వారు వెళ్లా రు. దీంతో అతను కూడా వారితో అక్కడికి వెళ్లాడు. మోకాలి లోతు వరకు వెళ్లాక తిరిగి రావాలని పిలుస్తున్న క్రమంలోనే తన కుమారులు సహా ఆరుగురు ఒకరి వెనుక ఒకరు నీటము నగడంతో వెంకటస్వామి అచేతన స్థితిలో ఉండిపోయాడు. ఘటనాస్థలిలో 5,100 క్యూసెక్కుల నీరు.. కొద్ది రోజులుగా గోదావరి ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రమాదం జరిగిన మేడిగడ్డ ఎగువ భాగం మూడో బ్లాక్లో ప్రస్తుతం 5,100 క్యూసెక్కుల నీరు ఉంది. పిల్లలు నీటిని అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆరుగురు యువకుల గల్లంతు వార్త తెలుసుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి హసన్పర్తి: వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువులో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మునిగి మృతిచెందాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేష్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. అదే హాస్టల్లోని నలుగురు స్నేహితులతో కలిసి రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. గణేశ్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. -
ట్రంప్కు చుక్కెదురు.. హార్వర్డ్కు ఊరట
బోస్టన్: విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) ప్రవేశం నిషేధించిన వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చుక్కెదురైంది. ఆయన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విధిస్తూ బోస్టన్(మసాచుసెట్స్) ఫెడరల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో హార్వర్డ్కు తాత్కాలిక ఊరట లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నిర్ణయం సహేతుకం కాదని న్యాయస్థానంలో హార్వర్డ్ సవాల్ చేసింది. అయితే వాదనలు ఇరు పక్షాల వాదనలు వినడానికి ముందే జడ్జి అలిసన్ బర్రౌస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయం యూనివర్సిటీ ప్రతిష్టను, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తుందని వ్యాఖ్యానిస్తూ.. ఆ ఉత్తర్వులపై తాత్కాలిక నిషేధం విధిస్తునన్నట్లు ప్రకటించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 16వ తేదీన జరగనుంది.కాగా.. హార్వర్డ్లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఫెడరల్ కోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే యూనివర్సిటీలో చదవాలనుకొనే విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధిస్తూ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జిలో ఉన్న క్యాంపస్లో విదేశీ విద్యార్థులను హార్వర్డ్లో చేర్చుకోవడం వల్ల జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ముప్పుందని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అమెరికాలోనే అతి పురాతనమైన యూనివర్సిటీగా హార్వర్డ్కి పేరుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ యూనివర్సిటీ లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదం, యూదు వ్యతిరేకతకు నిలయంగా హార్వర్డ్ మారిందని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చే 2.2 బిలియన్ డాలర్ల కోత విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఆపై మరో 450 మిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని వైట్హౌజ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది కూడా. అదే సమయంలో విశ్వవిద్యాలయంలో జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఫెడరల్ అధికారులు విచారణ ప్రారంభించారని పేర్కొంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ (Alan Garber) తిప్పికొడుతూ వస్తున్నారు. ఏ రాజకీయ భావజాలంతో యూనివర్సిటీ పని చేయట్లేదని.. విద్యార్థులను ఎంపిక చేయడంలో తాము జాతిని కాకుండా వారి ప్రతిభ, ప్రత్యేక లక్షణాలను చూసి ఎంపిక చేస్తామని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదని.. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని పేర్కొంది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. మరోవైపు.. అమెరికా ప్రభుత్వం తమ విశ్వవిద్యాలయ కార్యకలాపాలలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ నిర్ణయాలపై హార్వర్డ్ దావా వేసింది. -
ఫీజుల కోసం హింసిస్తారా?
న్యూఢిల్లీ: మంచి మార్కులొచ్చే విద్యార్థులను ఉచిత బోధన పేరుతో గద్దల్లా తన్నుకుపోయే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజు సరిగా కట్టకపోతే కనీసం గేటు దాటి లోపలికి కూడా రానివ్వడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫీజు సవ్యంగా కట్టలేదన్న అక్కసుతో విద్యార్థులను బౌన్సర్లతో అడ్డుకోవడంపై మండిపడింది. విద్యాలయాల్లో ఇలాంటి పెడ ధోరణులను ఉపేక్షించే ప్రసక్తే లేదని జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఫీజు వివాదాన్ని సాకుగా చూపి విద్యార్థులను స్కూల్లోకి అనుమతించకపోవడం, అందరి ఎదుటా అవహేళన చేయడం క్షమార్హం కాదు. విద్యాలయాల్లో ఇలాంటి సంస్కృతి కొనసాగేందుకు వీల్లేదు. ఫీజు కట్టాలని బౌన్సర్లను పెట్టి మరీ బెదిరించడం విద్యార్థులను తీవ్రస్థాయిలో వేధించడమే. ఇది చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది వారి ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయడమే’’ అని పేర్కొంది. ఫీజులు సరిగా చెల్లించలేదని దేశ రాజధానిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 31 మంది విద్యార్థులను బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటోందని, బెదిరిస్తోందని నమోదైన కేసును ధర్మాసనం గురువారం విచారించింది. ఫీజు కట్టలేదని విద్యార్థుల పేర్లను రికార్డుల నుంచి తొలగించి డిబార్ చేసిన యాజమాన్యం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో వారిని తిరిగి చేర్చుకుంటామని విన్నవించింది. ఇకపై విద్యార్థులను తొలగించాలంటే నిబంధనల ప్రకారం తొలుత తల్లిదండ్రులకు ముందస్తు సమాచారమిచ్చి ఫీజు చెల్లింపుపై వారి వాదన విని్పంచేందుకు అవకాశం ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించింది. 2025–26 విద్యా సంవత్సరానికి పెంచిన ఫీజులో సగం చెల్లించాలని తల్లిదండ్రులకు సూచించింది. -
Junicorn Summit 2025: అంతర్జాతీయ వేదికపై పల్లె బాలల ప్రతిభ
సాన్ మార్కస్, టెక్సాస్: టెక్సాస్ స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించిన ISF గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ AI సమ్మిట్ 2025 చరిత్ర సృష్టించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్కి చెందిన గ్రామీణ ప్రాంతాల నుండి ఎంపికైన 50 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి తదితర రంగాల్లో చిన్నారులు రూపొందించిన ఆవిష్కరణలు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమ్మిట్కు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ISF) ఆధ్వర్యం వహించగా, వ్యవస్థాపకుడు డా. జె.ఎ. చౌదరి దూరదృష్టితో, ISF USA అధ్యక్షుడు అట్లూరి సమన్వయ నాయకత్వంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులకు విమాన ప్రయాణం, నివాసం, వర్క్షాపులు, డెమో డే వంటి సౌకర్యాలు ఉచితంగా అందించారు.ప్రత్యక్షంగా ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలుNaturaShe: బయోడిగ్రేడబుల్ సానిటరీ ప్యాడ్స్ – గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం రూపొందించిన ప్రయోగం.Sense Vibe: దివ్యాంగుల కోసం రూపొందించిన నావిగేషన్ పరికరం.Jalapatra: తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరంNGreenTech: ఈ-వేస్ట్ రీసైక్లింగ్ మోడల్.. వీటికి తోడు మరెన్నో ఆవిష్కరణలకు ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్, బ్రేకిత్రూ థింకర్, ప్రోటోటైప్, స్టోరిటెల్లింగ్ విభాగాల్లో ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డుగత నెలలో ఆకస్మికంగా కన్నుమూసిన రామ్ పుప్పాల జ్ఞాపకార్థం ‘రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు ISF USA అధ్యక్షుడు అట్లూరి ప్రకటించారు.లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు – 2025ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి గౌరవప్రదంగా అవార్డులు అందజేశారు.జయ్ తల్లూరి – ఇన్ఫ్రా & సామాజిక అభివృద్ధి,ప్రసాద్ గుండుమోగుల – డిజిటల్ ట్రావెల్ టెక్నాలజీ,స్వాతి అట్లూరి – కళా, సాంస్కృతిక సేవలు,నిశిత్ దేశాయ్ – న్యాయ రంగ మార్గదర్శకత, లాక్స్ చెపూరి – ఇన్నోవేషన్ అవార్డు – టెక్ టాలెంట్ డెవలప్మెంట్.పద్మా అల్లూరి, ప్రకాశ్ బొద్ధాలు ఈవెంట్ యాంకర్లు వ్యవహరించగా, డా. మహేష్ తంగుటూరు, సత్యేంద్ర, శేషాద్రి వంగల, విశాలా రెడ్డి నిర్వాహణలో ముఖ్యపాత్ర వహించారు. వందలాది వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారులు కలిసి ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమ్మిట్ అనంతరం విద్యార్థులు NASA స్పేస్ సెంటర్, Texas Science Museum, డల్లాస్, ఆస్టిన్ పరిధిలోని ఇన్నోవేషన్ హబ్లను సందర్శించే అవకాశం పొందారు. ఫాలో-అప్ మెంటారింగ్, పెట్టుబడులు, స్టార్టప్ స్కేలింగ్ అవకాశాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు.విజన్ 2030 – లక్ష్యంISF ప్రకటించిన దీర్ఘకాలిక విజన్ ప్రకారం, 2030 నాటికి లక్ష మంది గ్రామీణ యువ స్టార్టప్ వ్యవస్థాపకులను రూపొందించాలనే ధ్యేయంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు – ఒక సామాజిక ఆవిష్కరణ ఉద్యమం. ISF అధికారికంగా ప్రకటించిన ప్రకారం, జ్యూనికార్న్ సమ్మిట్ 2026 ను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు. -
టెన్త్ ఫెయిలయినా.. పాఠశాలకు వెళ్లొచ్చు
కర్ణాటక: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్)లో 3 పాఠ్యాంశాల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కూడా తెలిపింది. మళ్లీ పరీక్షలు రాసుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలను విధించింది. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మళ్లీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలి. మామూలు విద్యార్థులకు మాదిరే చేరవచ్చు, చదువుకోవచ్చు. అందరు విద్యార్థులకు లభించే సౌకర్యాలు ఈ విద్యార్థులకూ లభిస్తాయి. డ్రాపౌట్స్ను తగ్గించడానికి, ఫెయిలయ్యామని చదువు మానివేయకుండా ఈ వెసులుబాటును కల్పించినట్లు తెలిసింది. -
సంచలన నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం
-
పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్గా మారింది.ఉత్తరప్రదేశ్లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
‘నైపుణ్యం’గా నయా మోసం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో నైపుణ్య శిక్షణ వక్రమార్గం పడుతోంది. ముఖ్యంగా స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రైవేటు కాలేజీలు స్కిల్స్ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. కాలేజీతో సంబంధం లేని కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వకుండా కేవలం ఉద్యోగం పొందేందుకు చాట్ జీపీటీ, ఏఐ సంబంధిత టెక్నాలజీపైనే షార్ట్ కట్స్ బోధిస్తున్నాయి. ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు కాలేజీల్లో కాకుండా, స్కిల్ కేంద్రాల్లో బోధిస్తున్నారు. పరీక్షలు నిర్వహించడం, డిగ్రీలు ఇవ్వడం మాత్రం కాలేజీల్లో జరుగుతోంది. ఈ క్రమంలో కీలకమైన ఫ్యాకలీ్టని తగ్గిస్తున్నాయి.ఇదంతా చట్టవిరుద్ధమని గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. హైదరాబాద్లో ఉన్న రెండు డీమ్డ్ వర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్ వర్సిటీల ఆఫ్–క్యాంపస్పైనా ఇలాంటి ఫిర్యాదులొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఉద్యోగం వచ్చినా తిప్పలే.. ఇంజనీరింగ్ కాలేజీలు ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు పారిశ్రామిక భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. అప్పుడే విద్యార్థి కోడింగ్పై పట్టు సాధిస్తాడు. చాట్ జీపీటీ, ఏఐని తేలికగా ఉపయోగిస్తాడు. ఏఐ చేసే కోడింగ్, డీ–కోడింగ్ కచ్చితమైనదేనా? కాదా? అనేది సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పుడే తెలుస్తుంది. ఉదాహరణకు పైథాన్ నేర్చుకునే విద్యార్థికి ముందుగా సీ, సీ ప్లస్ ప్లస్పై కనీస పరిజ్ఞానం ఉండాలి. అప్పుడు ఏఐలోని లాంగ్వేజ్ అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు కాలేజీలు దీన్ని విస్మరించడంతో కేవలం ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్ను మాత్రమే నేర్పడంతో ఉద్యోగం వచ్చినా, పనిలో పురోగతి సాధించలేకపోతున్నారు. గత ఐదేళ్లలో ఐటీ కంపెనీల్లో 560 మంది కోడింగ్పై పట్టు లేకపోవడం వల్లే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఏఐకి ఫీడ్ చేసే డేటా ఆధారంగా వచ్చే కోడింగ్ను అర్థం చేసుకోకపోవడం వల్ల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్దఎత్తున డేటా గందరగోళం ఏర్పడినట్టు ఆ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తెలిపారు. ఏఐసీటీఈకి ప్రభుత్వం ఫిర్యాదు డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం నియంత్రణ అధికారం ఉండదు. అవి ఇచ్చే డిగ్రీల్లో నాణ్యతపైనా ప్రశ్నించే అధికారం అనుమతి ఇచ్చిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి కూడా ఉండదు. ఒక్కో విద్యార్థి నుంచి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు రూ. 16 లక్షల నుంచి రూ.24 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ బేసిక్స్ విస్మరించడం, సబ్జెక్టు అధ్యాపకులను తగ్గించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం ఏఐసీటీఈ దృష్టికి తేవాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో కొన్నేళ్లుగా ఎమర్జింగ్ కోర్సుల్లో తగ్గించిన ఫ్యాకలీ్ట, స్కిల్పై శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్థలకు ఉన్న అర్హతలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరనుంది. కోడింగూ కీలకమే: హరీశ్ చంద్రారెడ్డి, వైస్చైర్మన్, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. చాట్ జీపీటీ, జనరేటివ్ స్కిల్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉండాలి. అయితే, బేసిక్స్ నేర్పకుండా కేవలం స్కిల్పైనే దృష్టి పెడితే, భవిష్యత్లో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం కష్టం. సెల్ఫోన్ వాడే వ్యక్తికి దాని తయారీ తెలియనవసరంలేదు. వాడకం తెలిస్తే చాలు. కానీ దాన్ని తయారు చేసే ఇంజనీర్కు అన్నీ తెలిసి ఉండాలి. కోడింగ్, డీకోడింగ్లో ఏఐ తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత ఇంజనీర్దే. కాబట్టి ఇంజనీరింగ్లో బేసిక్ కోడింగ్పై శిక్షణ తప్పించడం సరికాదు. -
వసతులు కరువు.. చదువులు బరువు
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా 30,116 మంది పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నట్లు ఇటీవల విద్యా శాఖ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకు ప్రధాన కారణం అనేక పాఠశాలల్లో విద్యార్థులకు మౌలికసదుపాయాల కొరత ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. పాఠశాలకు స్వస్తి చెప్పిన విద్యార్థుల్లో అధిక శాతం బాలికలే ఉన్నారు. స్వచ్ఛమైన మరుగుదొడ్లు లేకపోవడం ఒక కారణమైతే కొన్ని పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లే లేవనే ఆశ్చర్యకరమైన విష యం బయటపడింది. 5,373 పాఠశాలల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. అదేవిధంగా 530 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. కొన్ని పాఠశాల ల్లో ఆడ పిల్లల కోసం స్వతంత్రంగా మరుగు దొడ్లు లేవు. అలాగే 5,127 పాఠశాలల్లో అసలు మరు గుదొడ్లు లేవనే విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో గత్యంతరం లేక పాఠశాల ప్రహరీ గోడకు అవతల ఆనుకుని ఉన్న దట్టమైన పొదల్లోకి లేదా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక మంది పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రయత్నాలు ఘనం.. ఫలితం శూన్యం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ధనవంతులతోపాటు అనేక మంది పేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోంచి డ్రాపౌట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోసాగింది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిదిద్డడం, మరగుదొడ్లకు మరమ్మతులు చేపట్టడం, తాగు నీరు, విద్యా బోధన మెరుగుపర్చడం ఇలా అనేక సదుపాయాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. దీంతో ప్రతీ ఊరు, పల్లెటూర్లలో తిరిగి విద్యార్థులకు కౌన్సెలింగ్, తల్లిదండ్రులకు మార్గదర్శనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు ప్రత్యేక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ కౌన్సెలింగ్, మార్గదర్శనం చేయడం ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 33,470 ఉండగా అదే 2024–25లో ఈ సంఖ్య 30,116 చేరింది. దీన్ని బట్టి గత విద్యా సంవత్సరంలో 3,354 మంది విద్యార్థుల సంఖ్య మాత్రమే పెరిగిందని స్పష్టమవుతోంది. అంటే ఇంకా 30,116 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉంటున్నట్లు తేలింది. విద్యార్థులు ఖాళీగా తిరగడంవల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం లేకపోలేదు. నేరాలకు కూడా పాల్పడతారని విద్యా శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ సంఖ్య తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో చేపట్టిన కౌన్సెలింగ్, మార్గదర్శక కార్యక్రమాలవల్ల కొంతమేర సత్ఫలితాలు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్లో పాఠశాలలు ప్రారంభమైన తరువాత 2025–26లో ఎంతమేర విద్యార్థుల సంఖ్య పెరిగిందనేది తెలుస్తోంది. దీన్ని బట్టి పాఠశాలకు ఇంక ఎంతమంది దూరంగా ఉంటున్నారనే దానిపై ఒక స్పష్టత వస్తుందని విద్యా శాఖ పేర్కొంది. -
మందలా చేరికలు.. మందకొడి బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టికి తీసుకెళ్లేదుకు సిద్ధమైంది. డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఏఐసీటీఈకి వివరించాలని నిర్ణయించింది. ఈ అంశంపై విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు గురువారం చర్చించారు.ప్రభుత్వ సూచనల మేరకు ఏఐసీటీఈకి లేఖ రాసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. డీమ్డ్ వర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న తీరు, దీనివల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని అందులో వివరించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎమర్జింగ్ కోర్సుల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రమాణాలు లేని బోధన జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.కాలం చెల్లిన కోడింగ్గత ఏడాది డీమ్డ్ వర్సిటీల నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులు కొన్ని రకాల కోడింగ్ మాత్రమే చేయగలుగుతున్నారు. ఏఐ వచి్చన తర్వాత పాతతరం కోడింగ్, డీకోడింగ్ అవసరమే లేకుండా పోయింది. అడ్వాన్స్డ్ కోడింగ్ను సాఫ్ట్వేర్ కంపెనీలు కోరుకుంటున్నాయి. ఇవేవీ డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో కన్పించడం లేదని సాంకేతిక విద్య అధికారులు అంటున్నారు. డ్రిస్కియేట్ మేథమెటిక్స్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్ లేబోరేటరీపై బేసిక్స్ తప్ప, ఏఐ సమాంతర బోధనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని గుర్తించారు. కొన్ని సంస్థల కోసం జరిగే ఇంటర్వ్యూల్లో కీలకమైన బిజినెస్ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్పై కనీస పరిజ్ఞానం కూడా విద్యార్థుల్లో ఉండటం లేదని టెక్ కంపెనీలు అంటున్నాయి. అడ్డగోలు ప్రవేశాలుతెలంగాణలో మొత్తం పదివరకు డీమ్డ్ వర్సిటీలున్నాయి. వీటిలో కొన్ని ఆఫ్ క్యాంపస్ బ్రాంచీలున్నాయి. డీమ్డ్ హోదా ఉన్న సంస్థలు తెలంగాణలో బ్రాంచీలు పెట్టాయి. భూమి, మౌలిక వసతులు, కొన్నేళ్లుగా సాధించిన ర్యాంకుల ఆధారంగా డీమ్డ్ హోదాను ఏఐసీటీఈ ఇస్తుంది. ఈ హోదా వచి్చన వర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. అడ్మిషన్లు కూడా వాళ్ల ఇష్టమే.ఇష్టానుసారం అన్ని బ్రాంచీల్లోనూ సీట్లు పెంచుకోవచ్చు. డీమ్డ్ హోదా కోసం సంస్థలు వ్యూహాత్మకంగా జాతీయ ర్యాంకులు వచ్చేలా చూసుకుంటున్నాయి. ర్యాంకులిచ్చే జాతీయ సంస్థలకు ఇవి అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు అన్స్కిల్డ్ ఉద్యోగాల్లో చేరినా, వాటిని ర్యాంకింగ్ డేటాలో స్కిల్డ్గానే చూపిస్తున్నాయి. ఇలా హోదా తెచ్చుకున్న తర్వాత నియంత్రణ లేకుండా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఒక్కో యూనివర్సిటీ ఇంజనీరింగ్లో ఏకంగా 3 వేలకుపైగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది.ఇందులో ప్రధానంగా డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులే ఉంటున్నాయి. అయితే, ఇంతమందికి సరిపడా ఫ్యాకల్టీ ఎలా తెస్తున్నారు? బోధించేవాళ్ల నాణ్యత ఎంత? అనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లో చదివిన విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ఇటీవల రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం డేటా తెప్పించి పరిశీలించింది. కంప్యూటర్ సైన్స్ చదివిన వారిలో కనీసం 32 శాతం కూడా సరైన ఉద్యోగాలకు ఎంపికవ్వడం లేదని గుర్తించారు.పనికి మాలిన ప్రాజెక్టులుప్రతీ కంపెనీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి అనుసంధానమయ్యాయి. దానిని నిర్వహించే ఉద్యోగ అర్హతలకు కొన్ని ప్రాజెక్టులు ఇంజనీరింగ్లోనే చేయాలి. అయితే, డేటా అనలిటిక్స్ లేబొరేటరీల్లో సాధారణ ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేస్తున్నారు. ఫీల్డ్ వర్క్లో చేసే ప్రాజెక్టుల్లో ఎక్కడా ఏఐ కోడింగ్, మాడ్యూల్స్పై అధ్యయనం చేసిన దాఖలాలు డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో ఉండటం లేదని సాంకేతిక విద్య అధికారి ఒకరు తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో ఎథి్నకల్ హ్యాకింగ్, థ్రెట్ ఇంటిలిజెన్స్, ఢిజిటల్ ఫోరెన్సిక్స్ వంటి సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం కన్పించడం లేదని అధికారులు సేకరించిన డేటా స్పష్టం చేస్తోంది. బోధన నాణ్యతమై ఆడిటింగ్ జరిగితే తప్ప డీమ్డ్ వర్సిటీలు చేస్తున్న అన్యాయం వెలుగులోకి రాదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్, ఐఐటీ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాది 14 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఏం చేస్తోంది?.. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తేలికగా తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని రాజస్థాన్ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణ జులై 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, రాజస్థాన్లో కోచింగ్ సెంటర్ హబ్గా పేరు పొందిన కోటాలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీసింది. -
ట్రంప్ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్’లో నో అడ్మిషన్
వాషింగ్టన్ డీసీ: ట్రంప్ పరిపాలనా విభాగం విదేశీ విద్యార్థులకు పిడుగుపాటు లాంటి వార్త వినిపించింది. ఇకపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం(Harvard University)లో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విశ్వవిద్యాలయంపై కొనసాగించిన దర్యాప్తు దరిమిలా ట్రంప్ పరిపాలనా విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ పంపారు.క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ఈ వివరాలను తెలియజేస్తూ వర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోగలగడం అనేది హక్కు కాదని, అది ప్రత్యేక అవకాశం అని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి ముందే హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ను తిరిగి పొందే అవకాశాన్ని వర్శిటీ కోరుకుంటే 72 గంటల్లోపు అందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలన విభాగం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుత విద్యార్థులను ఇతర విద్యాసంస్థలకు బదిలీ చేయవలసి వస్తుందని, లేదా వారి చట్టపరమైన హోదాను కోల్పోయేలా చేస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం(Department of Homeland Security తెలిపింది.దీనిపై స్పందించిన విశ్వవిద్యాలయం ఇది ట్రంప్ ప్రతీకార చర్య అని, ఈ నిర్ణయం విశ్వవిద్యాలయానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధమని, 140కిపైగా దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. కాగా గత ఏప్రిల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ను ఒక జోక్గా అభివర్ణించారు. హార్వర్డ్ను ఇకపై మంచి అభ్యాస ప్రదేశంగా కూడా పరిగణించలేమని, దానిని ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల జాబితాలో ఒకటిగా పరిగణించకూడదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకుంది. ఇది అక్కడి మొత్తం విద్యార్థులలో27 శాతం. ప్రస్తుతం భారతదేశానికి చెందిన 788 మంది విద్యార్థులు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. ఇది కూడా చదవండి: జ్యోతి పోలీస్ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 18న కాన్పూర్ ఐఐటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ అడ్వాన్స్డ్) రెస్పాన్స్ షీట్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఐఐటీ వర్గాలు తెలిపాయి. మే 26 లోపు కీ విడుదల చేసే వీలుంది. విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్ 2న ఆన్లైన్ ద్వారా ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 3 నుంచి ఎన్ఐటీ, ఐఐటీ ఇతర జాతీయ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) విడుదల చేస్తుంది. -
ఇంజనీరింగ్లో రెండు కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్లో మరో రెండు కొత్త కోర్సులు రాబో తున్నాయి. ఐఐటీ మద్రాస్ వీటిని అందుబాటులోకి తెస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో జరిగే జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్లో ఇవి ఉంటాయని మద్రాస్ ఐఐటీ తెలిపింది. మద్రాస్ ఐఐటీలోని అప్లైడ్ మెకానిక్స్, బయో మెడికల్ విభాగాలు ఈ కోర్సును డిజైన్ చేశాయి. ఒక్కో విభాగంలో 40 సీట్లు ఉంటాయని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు. ఇవీ కోర్సులు ⇒ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ రెండు కోర్సుల ప్రత్యేకతలను ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ (సీఈఎం) కోర్సు ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. సాధారణ ఇంజనీరింగ్ విద్య కు భిన్నంగా ఉండే ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్ టూల్స్పై పట్టు సాధిస్తాడు. సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్, డైనమిక్స్లో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేశారు. ⇒ బయోమెడికల్ ఇంజనీరింగ్ను మరింత బలోపేతం చేసేందుకు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ (ఐబీఎంఈ) ఉపయోగపడుతుంది. ఐవోటీ, ఏఐ, వెబ్ ఎనేబుల్డ్ మెడికల్ టెక్నాలజీని ఈ కోర్సు ద్వారా అందిస్తారు. మారుతున్న వైద్య రంగంలో మంచి ఉపాధికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. -
మిగులు టీచర్ల దిగులు
సాక్షి, అమరావతి: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, సర్దుబాటులో టీచర్లు భారీగా ప్రభావితమవుతున్నారు. వీరిలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవో–117 ద్వారా 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు సీనియర్ ఎస్జీటీల్లో అర్హులైన దాదాపు 7,500 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో పాటు 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసింది. అంతేగాక.. ఉపాధ్యాయ, విద్యార్థులు నిష్పత్తిని సైతం భారీగా పెంచడంతో అంతేస్థాయిలో స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఏర్పడింది. మిగులు టీచర్లను వివిధ రకాలుగా సర్దుబాటు చేయగా, ఇంకా 6,428 మంది గాలిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగాను, హెచ్వోడీ పూల్లోను ఉంచారు. అయితే, వీరిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటుపై విడుదల చేసిన ఉత్తర్వుల్లో 2,754 మందిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్వోడీ పూల్లో ఉంచారు. నిన్న 1,902.. నేడు 1772 మంది రాష్ట్రంలో సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన 2,754 పోస్టులను క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా కొత్తగా మార్పు చేశారు. వీరిని ఆయా క్లస్టర్లలోని సర్వీస్ ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు వీరిని ఉపయోగించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,815 క్లస్టర్లు ఉండగా, కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీరిని ఎలా ఉపయోగించుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. సర్దుబాటు ఉత్తర్వుల మేరకు జిల్లాల్లోని మిగులు పోస్టులను ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, క్లస్టర్ లెవెల్ మొబిలైజ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్, హెచ్వోడీ క్యాడర్, మున్సిపాలిటీ మేనేజ్మెంట్లకు బదలాయిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్దుబాటు అనంతరం ఇంకా 8 జిల్లాల్లో 1,772 పోస్టులు మిగులుగా ప్రకటించారు. ఇందులో 362 స్కూల్ అసిస్టెంట్లు, మరో 1,410 ఎస్జీటీలు ఉన్నారు. వీరు మంగళవారం హెచ్వోడీ పూల్కు అప్పగించిన 1,902 మందికి అదనం. వీరి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని డీఈవోలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పాఠశాల స్థాయిలో అవసరానికి అనుగుణంగా వృత్తి బోధకులు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీత ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని, 2024–25 విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల నమోదు ఆధారంగా అవసరమైన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మారిన పోస్టుల వివరాల మేరకు క్యాడర్ స్ట్రెంగ్త్ను అప్డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల పునర్ నిర్మాణానికి అనుగుణంగా పాఠశాల పేర్లను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ‘స్పెషల్’ టీచర్ల మాటేంటి? ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో సుమారు 700 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరినే సర్దుబాటు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇటీవల ప్రభుత్వం 2,260 రెగ్యులర్ టీచర్ పోస్టులను స్పెషల్ టీచర్ పోస్టులుగా మార్చింది. ఇందులో1,136 ఎస్జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే, కొత్త పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి పాఠశాలలోను స్పెషల్ టీచర్లను నియమించాలి. అలాగే, కేంద్ర ప్రభుత్వం 2022లో జారీచేసిన గెజిట్, రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతుల్లో ప్రతి 10 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్ను, ఉన్నత పాఠశాలల్లో 15 మందికి ఒక టీచర్ చొప్పున నియమించాలి. కొత్త పోస్టుల భర్తీ ఊసెత్తకుండా ఉన్న పోస్టులనే సర్దుబాటు చేయాలనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
సంక్షేమ విద్యార్థులకు స్మార్ట్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ లావాదేవీలు, డెబిట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంచేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ చార్జీల కింద నగదును అందిస్తోంది. వసతిగృహ సంక్షేమాధికారికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ నిధిని విడుదల చేస్తోంది. ఆ నిధి నుంచి విద్యార్థులకు చెల్లిస్తున్నారు. ఇకపై కాస్మెటిక్ చార్జీలను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి బ్యాంకు ఖాతాను తెరవనుంది. బ్యాంకు ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ కార్డు ద్వారా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించనుంది.ఈ స్మార్ట్ కార్డు డెబిట్ కార్డు మాధిరి పనిచేస్తుంది. ఈ కార్డుల వినియోగం వల్ల విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెరగడమే కాకుండా డిజిటల్ లావాదేవీల పైన చైతన్యం కలిగించినట్లవుతుంది. ఈ దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.విద్యార్థులకు అవసరమైన సబ్బులు, షాంపూలు ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు స్మార్ట్ కార్డులను వినియోగించేలా వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ కేంద్రాల ద్వారా కాస్మెటిక్ వస్తువులను కొనుగోలు చేసేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాలకు సరఫరా చేసే సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, బెడ్షిట్లు, కార్పెట్, బ్యాగులు తదితర సామగ్రి కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి, సెర్ప్ సీఈఓ దివ్య తదితరులు పాల్గొన్నారు. -
3 రోజులకో స్టార్టప్
సాక్షి, అమరావతి: ఆవిష్కరణల దిశగా గొప్ప ముందడుగు వేయడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ చరిత్ర సృష్టిస్తోంది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ), స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్ సంయుక్తంగా 2024–25లో ఏకంగా 104 స్టార్టప్లను అభివృద్ధి చేయడం విశేషం. ఈ స్టార్టప్లలో సగానికిపైగా ఐఐటీ మద్రాస్ కమ్యూనిటీ సభ్యులైన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు స్థాపించారు. మిగిలిన వాటిని బయట వ్యక్తులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ప్రారంభించారు. ఇది ఐఐటీ మద్రాస్లోని స్టార్టప్ అనుకూల వ్యవస్థను బలంగా చాటుతోంది. 12 ఏళ్లుగా ఐఐటీ మద్రాస్ శక్తివంతమైన డీప్టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిరి్మస్తోంది. ఇప్పటివరకు రూ.50,000 కోట్లకుపైగా సమష్టి విలువ కలిగిన 457 స్టార్టప్లు, 2 యూనికార్న్లను అందించింది.‘స్టార్టప్ మిషన్’ విజయవంతం.. గతేడాది ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ నిర్దేశించిన ‘స్టార్టప్ 100 మిషన్’ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇది ఏడాదికి సగటున 60 స్టార్టప్ల నుంచి 104కు చేరుకోవడం చరిత్రాత్మక విషయం. దీనికి తోడు ఐఐటీ మద్రాస్ ఏడాదిలో ఏకంగా 417 పేటెంట్లను దాఖలు చేసింది. అంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ పేటెంట్లు దాఖలైనట్లు లెక్క. ఈ స్టార్టప్ల్లో తయారీ, రోబోటిక్స్, ఆటోమోటివ్ మెటీరియల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్టెక్, స్పేస్, ఫార్మా, క్వాంటం టెక్నాలజీ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఐఓటీ, అగ్రిటెక్, కృత్రిమ మేధ వంటి ముఖ్యమైన డీప్ టెక్ రంగాల్లో సేవలందిస్తున్నాయి. ఇక్కడే ఇన్బౌండ్ ఏరోస్పేస్, మ్యాటరైజ్ వంటి నవ కంపెనీలకు ఐఐటీఎంఐసీ నుంచి తిరుగులేని సహకారం లభించడంతోనే సాధ్యపడింది. -
summer camps ఆటపాటలతో సమ్మర్ సందడి
వెంకటేశ్వరకాలనీ వేసవి సెలవుల్లో విద్యార్థులకు తెలియని విషయాలను తెలిసేలా... ఆహ్లాదంగా గడిపి వేసవి సెలవులను మరింత ఆనంద జ్ఞాపకాలుగా మిగిల్చుకునేందుకు ప్రభుత్వం బడుల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 80 మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్లో అటు కంప్యూటర్ నేర్చుకోవడంతో పాటు ఇటు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. లిటిల్స్టార్ హైస్కూల్, గతి హైసూ్కల్, సెయింట్ ఆల్ఫాన్సెస్ హైసూ్కల్, ప్రాక్టీసింగ్ హైసూ్కల్, పంజగుట్ట పడవ స్కూల్ తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్థానికులు ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్! ఈనెల 15వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు.. ఈ సమ్మర్ క్యాంప్ ఉదయం 8నుంచి 11గంటల వరకు ఉంటుందన్నారు. ఈ క్యాంపు ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కంప్యూటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, మెడిటేషన్, ఇంగ్లిష్, సైన్స్లో శిక్షణ ఇస్తున్నారు. గణితం ట్రిక్స్ ఇందులో నేర్పిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో ఆటల్లో కూడా తర్ఫీదు ఇస్తున్నారు. ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్బాబు ఈ సమ్మర్ క్యాంప్ కో–ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొనేలా చేసి విద్యార్థులకు వివిధ అంశాల్లో మెలకువలు స్తున్నారు. సమ్మర్ క్యాంప్ తమకెంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వచ్చే నెలా 10వ తేదీ వరకు పొడిగిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. -
బిక్కుబిక్కుమంటూ గడిపాం..
సాక్షి, న్యూఢిల్లీ/సంగారెడ్డి క్రైం: ‘భీకరమైన శబ్దాలు, మెరుపుల్లా డ్రోన్లు, ఆకాశం వైపు చూస్తే చాలు.. గుండె ఆగేంత భయం. భారత్–పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాము’అని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల నుంచి తాము సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 51 మంది, తెలంగాణకు చెందిన 17 మంది విద్యార్థులు సురక్షితంగా ఢిల్లీలోని ఉమ్మడి భవన్కు చేరుకున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు వేర్వేరుగా బస, భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా విద్యార్థులను విమానాలు, రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. వీరిలో కొందరు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ఓ పక్క భయం..ఇంకో పక్క రైల్వే దోపిడీ రెండు రాత్రులు డ్రోన్లు, కాల్పుల శబ్దాలతో గజగజలాడాము. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకోవడానికి పంజాబ్లోని పగ్వరా రైల్వే స్టేషన్కు వచ్చాం. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కాము. అయితే ఖాళీ లేకపోవడంతో వాష్రూమ్ బయట నిలబడ్డాం. టీసీ మమ్మల్ని తర్వాతి స్టేషన్ లుధియానాలో దించేశారు.రిజర్వేషన్ ఉన్నా ఏసీ కోచ్లో ఉన్నాం అనే కారణంతో ఐదుగురు నుంచి టీసీ రూ.4,500 వసూలు చేశారు. తర్వాత వచ్చి న ఇంటర్ సిటీ ఎక్కితే దానిలో రిజర్వేషన్ లేదు.. అని వాళ్లు మరో రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. ఓ పక్క యుద్ధ ప్రాంతం నుంచి బయటపడ్డామనుకుంటే, ఇంకో పక్క రైల్వే దోపిడీతో మోసపోయాం. –ఎస్.మధువర్షిత, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ హాస్టల్ చుట్టూ.. డ్రోన్లు పదుల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లు మా యూనివర్సిటీలోని హాస్టల్ చుట్టూ తిరిగాయి. ఆ శబ్దాలకు చెవులు గింగురుమనడమే కాదు, ఏం జరుగుతుందోనని భయపడిపోయా. ఉదయం రైల్వేస్టేషన్కు వచ్చేందుకు బస్సు దగ్గరకు వెళుతుండగా అప్పుడు కూడా మాపై నుంచి డ్రోన్లు వెళ్లాయి. –సీహెచ్ భానుకిరణ్, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్డ్రోన్ల శబ్దాలకు భయం వేసింది 8వ తేదీ రాత్రి చదువుకుంటున్నాం. ఒక్కసారిగా పైనుంచి భారీ శబ్దాలు.. అవి ఏమిటో మొదట మాకు అర్థం కాలేదు. హాస్టల్ యాజమాన్యం మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ రూమ్లో కూర్చోబెట్టింది. అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ డ్రోన్ల శబ్దాలు ఆగిపోవడంతో పడుకోవడానికి రూమ్లలోకి వెళ్లాము. పడుకున్న రెండు గంటల్లోనే మళ్లీ భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా హాస్టల్ రూమ్లలో గడిపాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. –ఎస్.జీవన జ్యోతి, ఐఐటీ జగతి (జమ్మూ)ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మేము చదువుకునే యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం రాత్రంతా బాంబుల శబ్దం రావడంతో ఏమి జరుగుతుందోనని భయం భయంగా గడిపాం. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం. పంజాబ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు బయలుదేరాం. – రంజిత్రెడ్డి, (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ ఒక్కసారిగా భయంకర శబ్దాలు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వర్సిటీ సమీపంలో ఒక్కసారిగా భయంకర శబ్దాలు రావడంతో భయం వేసింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో యుద్ధం జరుగుతోందని అర్థమైంది. సోషల్ మీడియా మాకు అందుబాటులో లేదు. –కూచ వెంకట బాలాజీ (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ -
మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్వర్క్లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విద్య పూర్తయ్యే సరికి ఉద్యోగం!
సాక్షి, హైదరాబాద్: యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే మరో వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ‘ప్లేస్మెంట్ సక్సెస్ ప్రోగ్రాం’కింద ఐదు నెలల శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ ఐయాన్ (టీసీఎస్ ఐయాన్) ముందుకొచి్చందని చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎస్ ఐయాన్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో హైదరాబాద్ జేఎన్టీయూ, టీసీఎస్ ఐయాన్ సంస్థల మధ్య విద్యార్థులకు శిక్షణకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పి యువతను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. తొలుత మంథని జేఎన్టీయూ విద్యార్థులకు శిక్షణ: ‘సాంకేతిక నైపుణ్యాలు లేకుండా డిగ్రీలతో ఉద్యోగాలు రావడం కష్టం. దీనిని అర్థం చేసుకున్నందునే శిక్షణపై దృష్టి సారించాం. చదువు పూర్తి చేసే సమయానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంలో నైపుణ్యం పెంచగలిగితే ఉద్యోగాలు ఇవ్వడం కోసం కంపెనీలు వాటికవే పరుగెత్తుకుంటూ వస్తాయి. టీసీఎస్ ఐయాన్ సంస్థ మొదటి దశలో ప్రతి ఐదు నెలల (20 వారాల)కు 100 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంది. ఆ సంస్థతో ఎంప్యానెల్ అయిన మూడు వేలకు పైగా కంపెనీలు వీరిలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాలు కల్పిస్తాయి. పైలట్ కార్యక్రమం కింద మొదట మంథనిలోని జేఎన్టీయూ కళాశాల విద్యార్థులను నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తాం..’ అని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంసిద్ధత కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి, స్కిల్ ఎడ్యుకేషన్ బిజినెస్ హెడ్ స్మృతి ముల్యే, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టి.కిషన్కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్పీటీఈఎల్ పరీక్షలు రాసిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
నూజివీడు: ఆర్జియూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లోని ఇంజినీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు సోమవారం నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) పరీక్షలను రాశారు. ఈ పరీక్షలకు నాలుగు క్యాంపస్లలో కలిపి 10,300 మందికిపైగా విద్యార్థులు హాజరైనట్టు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఎన్పీటీఈఎల్ కోర్సులను ఐఐటీలు, ఐఐఎస్సీ లాంటి దేశవాళీ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల భాగస్వామ్యంతో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ రంగంలో సైతం అతి వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఉన్నవారికే సాంకేతిక రంగంలో ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్రాస్ ఐఐటీ నిర్వహిస్తున్న 500కు పైగా ఎన్పీటీఈఎల్ కోర్సులను నేర్చుకునేందుకు నాలుగు ట్రిపుల్ ఐటీలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఆసక్తి కనబర్చడంతో మద్రాస్ ఐఐటీతో ఆర్జీయూకేటీ ఒప్పందం చేసుకుంది. యాక్సెలరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ నెట్వర్క్ అనాలసిస్, ఆప్టిమైజేషన్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్, ఆన్లైన్ ప్రైవసీ, బ్లాక్ చైన్, డేటాబేస్ సిస్టమ్స్, ఎథికల్ హ్యాకింగ్ తదితర అనేక సర్టిఫికెట్ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఐఐటీ మద్రాస్ రూపొందించిన ఈ కోర్సులు ప్రత్యేకమైనవి. విద్యార్థులు తమ సిలబస్ లేదా బ్రాంచ్కు సంబంధం లేకుండా, నేటి సాంకేతిక అవసరాలకు అనుగుణంగా అదనపు జ్ఞానం, నైపుణ్యాలను పొందడానికి ఈ కోర్సులు దోహదపడతాయి. ఈ కోర్సులను నేర్చుకోవడానికి సాధారణ ఫీజు రూ.1000 కాగా, ఆర్జీయూకేటీ విద్యార్థులకు రూ.500 రాయితీ ఇచ్చింది., మిగిలిన మొత్తం యాజమాన్యం చెల్లిస్తుండటంతో విద్యార్థులపై ఏమాత్రం ఆర్థిక భారం పడట్లేదు.విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన డైరెక్టర్ఇదిలా ఉండగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు. దీంతో పరీక్ష హాలులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తోటి విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు డైరెక్టర్ ఇలా పరీక్ష రాశారు. -
బయాలజీ ఈజీ... ఫిజిక్స్ టఫ్
సాక్షి ఎడ్యుకేషన్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ )– యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పెన్–పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 550 పట్టణాల్లో 5వేలకుపైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. దాదాపు 22.7 లక్షల మంది నీట్ యూజీ– 2025కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే...190 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 72,507 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 90 శాతానికి పైగా హాజరైనట్టు అధికారులు చెబుతున్నారు. 2024లో 77,849 మంది పరీక్ష రాయగా, 47,371 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది జరిగిన పరీక్షకు హాజరైన విద్యార్థులు బయాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని, ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ నుంచి ఎక్కువ ప్రశ్నలు నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్ అత్యంత కఠినంగా, కెమిస్ట్రీ మధ్యస్తంగా, బయాలజీ తేలిగ్గా ఉన్నట్టు పరీక్షకు హాజరైన విద్యార్థులతోపాటు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, బయాలజీతో పోల్చుకుంటే ఫిజిక్స్ కఠినంగా ఉంది. బయాలజీ, కెమిస్ట్రీల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లపై ప్రశ్నలు అడిగారు. 11వ తరగతితో పోలిస్తే.. 12వ తరగతి సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కనిపించాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల్లోనూ థియరీ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. రీజన్, అసెర్షన్ ఆధారిత ప్రశ్నలు సైతం అడిగారు. మెమరీ ఆధారిత ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎన్సీఈఆర్టీ సిలబస్ బేసిక్స్, కాన్సెప్ట్లు, ఫార్ములాలపై పట్టుతోపాటు అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. బయాలజీ సులభం బయాలజీ విభాగంలో బోటనీ నుంచి 45 ప్రశ్నలు, జువాలజీ నుంచి 45 ప్రశ్నలు చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడిగారు. బోటనీ, జువాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లపై ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా బయాలజీలో డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. జెనెటిక్స్, హుమ్యాన్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. థియరీ ఆధారిత, డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి. బోటనీ, జువాలజీ నుంచి పలు ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. దీంతో ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వచి్చనట్టు విద్యార్థులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చినప్పుడు ఈసారి బయాలజీ నుంచి ప్రామాణిక ప్రశ్నలు అడిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెమిస్ట్రీ మధ్యస్తం కెమిస్ట్రీ నుంచి అడిగిన 45 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండగా.. మొత్తమ్మీద ఈ విభాగం మధ్యస్తంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే గతేడాది అడిగిన ప్రశ్నలతో పోలిస్తే మాత్రం ఈసారి కెమిస్ట్రీ విభాగంగా కొంత కఠినంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీల కాన్సెప్ట్ల నుంచి ప్రశ్నలు అడిగారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 2 ప్రశ్నలు, కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్వలిబ్రియంల నుంచి 1 ప్రశ్న చొప్పున అడిగారు. కెమిస్ట్రీలోనూ అధికంగా ఎన్సీఈఆర్టీ నుంచి ప్రశ్నలు అడిగారు. కొన్ని పశ్నలు మాత్రమే అప్లికేషన్ ఆధారితంగా, లోతుగా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సినవి ఉన్నాయి. ఫిజిక్స్ క్లిష్టం ఫిజిక్స్ క్లిష్టంగా, ట్రిక్కీగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విభాగం నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో వీటికి సమాధానాలు సాధించడంలో సమయాభావం ఎదురైనట్టు చెప్పారు. ఫిజిక్స్ నుంచి అడిగిన 45 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు దాదాపు గంటర్నర సమయం పట్టినట్టు కొంతమంది విద్యార్థులు వెల్లడించారు. గతేడాది ఎక్కువగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగితే.. ఈ ఏడాది ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ప్రశ్నలు ఎదురైనట్టు పేర్కొంటున్నారు. బయాలజీ, కెమిస్ట్రీతో పోలి్చనప్పుడు ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఫిజిక్స్లో కాన్సెప్ట్లతోపాటు ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విభాగంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కాన్సెప్ట్లపై స్పష్టత తప్పనిసరిగా మారింది. ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నటిక్ ఎఫెక్ట్, కైనమేటిక్స్, థర్మోడైనమిక్స్ల నుంచి ఒక్కో ప్రశ్న చొప్పున; మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, యూనిట్ అండ్ డైమెన్షన్, రొటేషనల్ నుంచి 2 ప్రశ్నలు చొప్పున అడిగారు. -
EPCET కు హాజరైన విద్యార్థులు (ఫోటోలు)
-
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
‘వంక’లు లేవు వాగులు లేవు... చెప్పడానికి సాకులు లేవు. వేసవి సెలవులు వచ్చేశాయి. సోషల్ మీడియా బందీఖానా నుంచి పిల్లలను ఇప్పుడు రిలీజ్ చేయాలి. పుస్తకాలకు దగ్గరగా తీసుకురావాలి. విక్రమార్కుడి సింహాసనం ఎక్కిస్తే కథల దర్బారులోకి వారే ప్రవేశిస్తారు. వేసవి సెలవుల్లో ఉన్న 50 రోజుల్లో పిల్లలు పుస్తకాలు ఎందుకు చదవాలి, ఏవి చదవాలి? వేసవి శీర్షిక ‘వేసవి కాలమ్’లో మొదటి కథనం.పిల్లలకు బడి గంట ఇష్టమే. కాని స్కూల్ మొదలయ్యేప్పుడు కొట్టే గంట కంటే స్కూల్ వదిలేప్పుడు కొట్టే గంట ఎక్కువ ఇష్టం. ఆ గంట వినపడగానే పుస్తకాలు తీసుకుని క్లాస్ నుంచి పరిగెత్తుతారు. కొందరు ప్లేగ్రౌండ్కు వెళతారు. కొందరు ఇంటికి చేరి వెంటనే చుట్టుపక్కల ఫ్రెండ్స్ను పోగేస్తారు. ఎందుకు? ఇంకెందుకు... ఆటలు ఆడటానికి.ఇంట్లో నుంచి అమ్మ పిలుస్తున్నా... ఏదైనా తిని వెళ్లమని అరుస్తున్నా పిల్లలు లెక్క చేయరు. ఆడుతుంటారు. ఆడుతూ అరుస్తూ ఉంటారు. నవ్వుతూ ఉంటారు. పేచీ పెడుతూ ఉంటారు. ఓడుతూ ఉంటారు. గెలుస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ చెమట చిందిస్తూ ఉంటారు.పిల్లలూ చెమటా కవలలునేడు... పిల్లలకు చెమటే లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు ఆడటం లేదు కాబట్టి. ఆడే బదులు ఓ.టి.టి.లో, కంప్యూటర్లో, సోషల్ మీడియానో తమ బాల్యంతో ఆటలాడుకోవడానికి వీలు కల్పిస్తున్నారు కాబట్టి.దొంగ... పోలీస్‘దొంగ పోలీస్’ ఆట అందరికీ తెలుసు. ఇవాళ దొంగ పోలీస్ ఆట ఎంతమంది పిల్లలకు తెలుసు? ఎంత సింపుల్ ఆట ఇది! ఐదారు మంది పిల్లలు కలిసి పంటలు వేసి గెలుస్తారు. ఆఖరున మిగిలినవాడు పోలీస్ అయ్యి గోడ వైపు తిరిగి వంద లెక్కబెడతాడు. ఈ లోపు పిల్లలు దాక్కుంటారు. ఆ దాక్కున్న వాళ్లను పోలీస్ కనిపెట్టాలి. కనిపెట్టలేకపోతే పోలీస్ ఓడిపోతాడు. ఈ ఆట ఆషామాషీ ఆటనా? పిల్లల మెదడుకు తర్ఫీదు ఇస్తుంది.మున్ముందు జీవితంలో తారసపడబోయే వారిలో ఎవరు దొంగ.. ఎలాంటి దొంగ... వాడి వ్యవహార శైలి ఎలా ఉంటుంది... ఎవరు ఏ మేరకు తప్పించుకోలరు... అదొక్కటేనా? మన వ్యక్తిత్వంలో దొంగ పనులు ఎలా చోటు చేసుకుంటున్నాయి... వాటిని వెతికి పట్టుకొని జైలుకు పంపితే ఎంత మంచి విద్యార్థులం కాగలం... అసలు దొంగలా దాక్కునే బతుకు ఎంత నీచమైనది.... ఇవన్నీ పైకి చెప్పకనే నేర్పిస్తుంది.ఇవాళ్టి పిల్లలకు కామిక్ హీరో, యూట్యూబ్ గేమర్ తెలుసుకాని దొంగ పోలీస్ తెలీదు. పైగా పిల్లలు ఆ ఆట ఆడుతూ కనిపిస్తే పెద్దలే నవ్వి, జోకులేసి ‘మరీ ఈ ఆటలా’ అని ఆపించేలా ఉన్నారు.ఆట లేకుంటే ఆందోళనపిల్లలు ఆడేందుకు పుట్టారు. ఆడి ఆడి వారు పెద్దవాళ్లవ్వాలి. ఆటకు దూరమయ్యి కాదు. ‘పిల్లల చైల్డ్హుడ్ యాంగ్జయిటీకి వారు ఆటలకు దూరం కావడమే కారణం’ అంటారు జోనాథన్ హైడ్ అనే సోషల్ సైకాలజిస్టు. ఆటకు బదులు టీవీ, కంప్యూటర్, సోషల్ మీడియాకు బానిసైన ఏ పిల్లవాడైనా దృష్టి చెడి, నిద్ర చెడి, కల్మషం నింపే కలకలం రేపే కంటెంట్ను చూసి ఆందోళనకు గురవుతాడు. కదలిక లేని మెదలిక లేని కుర్చీలో కూలబడి కేవలం మెదడుకు ఒత్తిడి ఇవ్వడం ద్వారా మెదడుతో పాటు శరీరం కూడా శుష్కమయ్యి మెదడకు తగిన శక్తి ఇవ్వడంలో వెనుకబడుతుంది.వివాదాల ఇల్లుఅయితే తల్లిదండ్రులు చాలా నియమాలు పెట్టాలని చూస్తారు. టీవీ ఆఫ్ చేస్తారు. రౌటర్ కట్ చేస్తారు. ఓటీటీ రెన్యువల్ చేయరు. ఈ తల్లిదండ్రులే కోవిడ్ కాలంలో ఇవన్నీ అలవాటు చేశారు. ఇప్పుడు వద్దంటే పిల్లలు మానుతారా? ఆటలు ఆడి శ్రమ చేయడానికి ఇష్టపడకపోగా కుర్చీలో కూలబడి పొందే వినోదం కోసం తల్లిదండ్రులతో ఘర్షణ పడుతూ ఉంటారు. దాంతో ఇంట్లో ఆశాంతి నిండిపోతుంది. అందుకే జోనాథన్ హైడ్ ఏమంటారంటే ముందు పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయండి. తర్వాత ఆటల్లోకి తీసుకురండి అని.కట్టెల మోపు కథచనిపోయే ముందు ఒక తండ్రి తన నలుగురు కొడుకులకు ఒక్కొక్క కట్టె ఇచ్చి విరవమంటాడు. వాళ్లు విరుస్తారు. ఇప్పుడు నలుగురి చేతుల్లో ఉన్న కట్టెలను మోపుగా కట్టి విరవమంటాడు. కొడుకులు విరవలేకపోతారు. ‘కలిసి ఉంటే ఇలా బలంగా ఉంటారు’ అని చనిపోతాడు తండ్రి. కొడుకులు ఆ ఐకమత్యాన్ని పాటిస్తారు. కథలు ఎన్నో విషయాలు చెబుతాయి. నేర్పుతాయి. సూక్ష్మబుద్ధిని చూపుతాయి.సమస్యలు ఎదురైతే తెనాలి రామలింగడిలా దొంగల చేతే బావిలోని నీళ్లన్నీ చేదించి పాదులు తడుపుకునే తెలివితేటలను ఇస్తాయి. భారతదేశంలో నుంచి ప్రపంచం కథలను తీసుకుంటే మన పిల్లలకు మనం కథలను దూరం చేస్తున్నాం. పిల్లల నిపుణులు ఏమంటారంటే బొమ్మలున్న కథల పుస్తకాలు చిన్న పిల్లలకు కామిక్సు, గ్రాఫిక్ నవలలు టీనేజర్లకు ఇచ్చి వారికి పుస్తకాలు అలవాటు చేయమని. పుస్తకం చదివిన పిల్లలు ఆ కథను తోటి పిల్లలతో పంచుకోవాలనుకుంటారు. నలుగురు పిల్లలూ కథలు చెప్పుకోవడానికి కూడతారు. ఆ తర్వాత? ఆడుకుంటారు. ఇదీ ఆరోగ్యకరమైన బాల్యం అంటే.క్లాసులు... స్పెషల్ క్లాసులు...ఆటల బదులు మార్కులు, సాటి పిల్లలకు బదులు ట్యూషన్ క్లాసులు చుట్టుముట్టి పిల్లలను ఆందోళనలోకి నెడుతున్నాయి. కాలూ చేయీ కదపని దేహం బుద్ధిని ఎలా కదుపుతుంది? ఫిట్గా లేని శరీరం ర్యాంకులు ఎలా తెస్తుంది? ఆటలో పడి లేస్తారు పిల్లలు. అది అలవాటైతే చదువులో పడినా లేవడం తెలుసుకుంటారు. లేదా లేవడానికి కథల్లో చదివిన ఒక ఉదాత్త నాయకుడిని తోడు తెచ్చుకుంటారు. ఆటపాటలు లేకపోవడం వల్లే నేడు పిల్లలు ర్యాంకు రాకపోయినా ఫెయిల్ అయినా చాలా దూరం పోతున్నారు. సెలవులొచ్చాయి. ఆడించండి. చదివించండి. -కె. -
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ విద్య వన్నె తగ్గుతోంది. ఓవైపు ఏటికేటికీ తగ్గుతోన్న ప్రవేశాలు..కళాశాలల్లో అధ్యాపకుల కొరత ...ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంలో వెనుకబాటు..మరోవైపు కొత్త పుంతలు తొక్కుతోన్న అధునాతన ఇంజినీరింగ్ కోర్సులు..వెరసి పాలిటెక్నిక్ ఉనికికి సవాల్ విసురుతున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన పథకాన్ని పరిశీలిస్తే విషయం స్పష్టమవుతోంది. ఈ స్వయం ప్రతిపత్తి విధానాన్ని రెండేళ్ల కిందట అమలు చేయగా...ఇప్పటిదాకా మహారాష్ట్ర, కర్నాటకలోని ఐదు కళాశాలలు మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. 59 శాతం ప్రైవేటు యాజమాన్యాలే.. పాలిటెక్నిక్లో ప్రవేశాలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు సీట్ల సంఖ్య కూడా క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో ప్రైవేటు సంస్థలే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 2024–25లో ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థల జాబితా ప్రకారం దేశంలో 3566 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే వాటిలో 59 శాతం ప్రైవేటు యాజమాన్యాల చేతిలో ఉండటం గమనార్హం. ఆదర్శం..ఆ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాలిటెక్నిక్ విద్య ప్రారంభంలో ప్రభుత్వ హయాంలోనే నడిచేది. కాల క్రమేణా ప్రైవేటు పరం చేయడంతో కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో పాలిటెక్నిక్ విద్య నాసిరకంగా మారింది. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వమే నడిపిస్తోంది. వాటిలో గోవా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, లక్షద్వీప్, దాద్రా–నాగర్ హవేలీ ఉన్నాయి. ఇక్కడ పాలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరగలేదు. ఏటా క్షీణిస్తున్న ప్రవేశాలు..పాలిటెక్నిక్లో ఏటా సీట్ల భర్తీ కోసం కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే 2017–23 వరకు ఐదేళ్ల కాలంలో దాదాపు ఐదో వంతు (19.7 శాతం) సీట్లు తొలగించినట్టు తెలుస్తోంది. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు పూర్తయిన తర్వాత కూడా భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాలు సవరించిన సంగతి తెలిసిందే. అయిననప్పటికీ తగిన ఫలితం కనిపించట్లేదు. మరోవైపు పాలిటెక్నిక్ విద్యను ఢిల్లీ మాదిరిగా కొన్ని రాష్ట్రాలు నైపుణ్య విశ్వవిద్యాలయాల కిందకు తీసుకురావాలని భావిస్తున్నాయి. మరోవైపు ఫీజులు కూడా భారీగా పెరగడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల వైపు మరలుతున్నారు.మెరుగుపడాలంటే.. ⇒ పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి అంశంలో ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ⇒ ప్రభుత్వాలు కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలి. ⇒ స్వయం ప్రతిపత్తి హోదాకు నిర్దేశించిన అంశాలను సంతృప్తి పరచడంలో చాలా విద్యా సంస్థలు విఫలమవుతున్నాయి. దీన్ని అధిగమించాలి. ⇒ ముఖ్యంగా అధ్యాపకుల కొరత పాలిటెక్నిక్ విద్యను ప్రభావితం చేస్తోంది. ఈలోటును భర్తీ చేయాలి. ⇒ లైబ్రరీలు, ప్రయోగశాలలు, తగినన్ని వనరుల కల్పనపై దృష్టి సారించాలి. అలాగే వర్క్షాప్లు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి: ఆప్టా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం 117 జీవోకు ప్రత్యామ్నాయంగా తెస్తున్న మార్పులతో రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగి విద్యార్థుల చేరిక తగ్గిపోయి మూతబడే ప్రమాదముందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ పరిస్థితి రాకుండా ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు లేఖ రాసినట్టు ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు తెలిపారు. మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎంగా నియమించే కంటే వారిని యూపీ పాఠశాలలో నియమిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే, ఎస్జీటీలకు పదోన్నతి కలి్పంచి మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్ఎంలుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. -
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బడికి టాటా.. 50 రోజుల ఆట
సాక్షి, హైదరాబాద్: పరీక్షా కాలం ముగిసింది.. చదువుల ఒత్తిడి నుంచి పిల్లలకు విరామం లభించింది.. బడులకు టాటా చెప్పి ఆటపాటలతో సేదతీరే వేళయింది. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో దాదాపు 50 రోజులపాటు సందడే సందడి నెలకొననుంది. అయితే వినోదాల పేరిట పిల్లలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ దారితప్పకుండా తల్లిదండ్రులు ఇప్పుడే దృష్టి పెట్టాలని.. వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. అవసరమైన మార్గదర్శనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళిక రచించాలంటున్నారు. కాసేపు టీవీలు చూడనిచ్చినా కుటుంబ సభ్యులంతా కలిసి ఆడుకొనే ఆటలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.ఆన్లైన్కు బానిసలు కానివ్వొద్దుపట్టణాలు, నగరాల్లో పిల్లలకు ఆటస్థలాల కొరత వల్ల చాలా మంది సెల్ఫోన్లు, ఆన్లైన్ ఆటలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల 50 రోజుల్లో వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త అంజలా గౌరీ తెలిపారు. ఈ విధానం వల్ల రెండేళ్లలో మెదడు మొద్దుబారి విచిత్ర ధోరణి ప్రదర్శించిన 28 మందికి కౌన్సెలింగ్ ఇచి్చనట్లు చెప్పారు. రేయింబవళ్లు సెల్ఫోన్లకు పరిమితమవడం నిద్రలేమికి దారితీస్తుందని.. ఫలితంగా వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని హైదరాబాద్కు చెందిన మానసిక నిపుణులు అరోరీ వాగ్దేవి తెలిపారు. గతేడాది వేసవి సెలవుల్లో తన కుమారుడు అదేపనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల తిరిగి స్కూల్ తెరిచాక ఏడాదంతా పాఠ్యపుస్తకాలు చదవాలంటే ఒక రకమైన భయం పట్టుకుందని కూకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తల్లి పేర్కొన్నారు.బంధాల వైపు మళ్లించాలి పిల్లలకు అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లలో గడిపే అవకాశం ఇవ్వడం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటంతోపాటు పొడుపు కథల వంటివి వారి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలుగు భాషపై వరంగల్ స్కాలర్ వినీత్ భార్గవ్ జరిపిన పరిశోధనలో వెలుగులోకి వచి్చంది. నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మల అనుభవాల్లోంచి కథలు నేర్చుకొనే పిల్లల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని.. 100 మందిలో 82 మంది తరగతి గదుల్లోనూ చురుకుగా వ్యవహరించిన తీరును గుర్తించామని ఆయన పేర్కొన్నారు.దీంతోపాటు గ్రామీణ అనుబంధాలు, బంధువులతో మమేకమైనప్పుడు కలిగే అనుభూతులు విద్యార్థుల మానసిక ధోరణిలో మార్పు తెస్తున్నాయన్నారు. అనుబంధాలు పెంచుకొనే పిల్లల మానసిక ధోరణి ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటోందని భారత సైకాలజీ అసోసియేషన్ జరిపిన ఓ పరిశోధన తేల్చింది. 468 మందిపై అసోసియన్ ఆన్లైన్ సర్వే చేపట్టింది. ఎవరికి ఎవరు అనే ధోరణి నుంచి బయటపడిన పిల్లల్లో 332 మంది వేసవి సెలవుల్లో పెద్దవాళ్ల దగ్గర నేర్చుకున్న జ్ఞానమేనని తేలింది.జాగ్రత్తగా వ్యాయామంఆట విడుపులో భాగంగా పిల్లలు నిత్యం క్రికెట్, కబడ్డీ లాంటి రకరకాల క్రీడలు ఆడుతుంటారు. దీనివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా బలపడతారని వ్యాయామ కళాశాలలో విశేష అనుభవం ఉన్న జీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆటలతో స్నేహాలు మరింత మెరుగవుతాయని.. కొత్త స్నేహాలను చిగురింపజేస్తాయని పేర్కొన్నారు.అయితే ఈ క్రమంలో పిల్లలు ఘర్షణలు, విభేదాల వైపు మళ్లకుండా మార్గదర్శకుల పర్యవేక్షణలో వారు ఆటలు ఆడేందుకు వీలున్న గ్రౌండ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తూ సేదతీరుతుంటారు. అయితే ఇందులో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఇలాంటి ఘటనల్లో తీవ్రంగా గాయపడగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.⇒ వేసవి సెలవుల్లో పిల్లల్ని ఖాళీగా వదిలేస్తే ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడమో లేదా ఎండలో స్నేహితులతో తిరగడమో చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు నీతికథలు చెప్పాలి. గ్రామాల్లో ఇరుగుపొరుగు పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెట్టి వారికి లోకజ్ఞానం నేరి్పంచే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పిల్లలు కూడా ఇవే కోరుకుంటున్నారు. బోర్గా ఫీలవ్వడం లేదు. – కాకి వీరభద్రం, వనం వారి కృష్ణాపురం, ఖమ్మం జిల్లా⇒ కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పిల్లల్లో పెరిగింది. దాని గురించి నేర్పడానికి ఇదే మంచి తరుణం. వేసవిలో వారితో కూర్చొని ఏఐపై కసరత్తు చేస్తే పిల్లలు బోర్గా ఫీలవ్వరు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా మోటివేషన్ బాగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దలు చొరవ తీసుకొని ఆన్లైన్లో ఏఐపై శిక్షణ ఇప్పించాలి. – కంకిపాటి శేషుకుమార్, హైదరాబాద్ -
చిన్నారి హల్ సెల్
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మంచితోపాటు చెడు మిళితమై ఉండడంతోపాటు అతి వినియోగంతో అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలమనేరు: స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్కు బానిసైనట్టు స్మార్ట్ఫోన్ (Smartphone) కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు. మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఏటా15 శాతం పెరుగుతున్న సెల్ ఫోన్ వినియోగం గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉదాహరణే తీసుకుంటే... 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్వర్క్ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది.ఇదిగో సాక్ష్యం.. పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి.ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే స్మార్ట్ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్ర్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్ఫోన్లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.అనారోగ్య సమస్యలు తప్పవుసెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియాఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరుసోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ! ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు. -
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను సైతం ప్రకటించనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు www.sakshieducation.comతో పాటు https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడవచ్చు. అలాగే, వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు. -
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడి యెట్ ఫలితాల్లో ప్రభుత్వ గురు కులాలు మంచి ఫలితాలు కనబరి చాయి. ప్రైవేటు, కార్పొరేట్ కాలే జీలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీల్లో సగటున 80% ఫలితాలు నమోద య్యాయి.అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రం ఈసారి ఫలితాలు నిరాశే మిగి ల్చాయి. ఫస్టియర్లో 42 శాతం, సెకెండియర్లో 53 శాతానికి మాత్రమే రిజల్ట్ పరిమితమైంది. ఇక రూ.లక్షల్లో ఫీజులు తీసుకునే, గంటల కొద్దీ బోధన చేసే ప్రైవేటు కాలేజీల్లో 69.8 శాతం (ఫస్టియర్), 65.83 శాతానికే (సెకెండియర్) రిజల్ట్స్ పరిమితం కావడం గమనార్హం. -
ఎంపీసీలో టాప్ 996
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ ఫలితాల్లో ఈ సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో నలుగురు విద్యార్థులు 1,000కి 996 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు ముగ్గురు విద్యార్థులు 469 మార్కులు సాధించారు. ఫస్టియర్ బైపీసీలోనూ 440 మార్కులకు నలుగురు 339 మార్కులు సాధించారు. ఈ సంవత్సరం బైపీసీలో టాప్ మార్కులు 997గా నమోదయ్యాయి. ఇంటర్బోర్డ్ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టాపర్ల వివరాలు ఇలా.. మొదటి సంవత్సరం (ఎంపీసీ): సి.అక్షయ, పుప్పాలగూడ, హైదరాబాద్ 469/470; పుట్టపోగుల వర్షిణి, బాచుపల్లి, హైదరాబాద్ 469/470; మామిడి సంహిత, వనస్థలిపురం, హైదరాబాద్ 469/470.బైపీసీ: బి. లావణ్య, టీఎస్ఆర్జేసీ, మహబూబ్నగర్ 439/ 440; సయ్యద్ అర్షియా సమ్రీన్, మలక్పేట్, హైదరాబాద్ 439/440; హస్పాబేగం, టోలీచౌక్, హైదరాబాద్ 439/440 ; వాదుల వైష్ణవి, బాలానగర్, మహబూబ్నగర్ 439/440. సీఈసీ: ఎండీ ఫర్హాన్, గుర్రంగూడ, రంగారెడ్డి జిల్లా495/500; మునీబ్ అహ్మద్ ఖాన్, కార్వాన్, హైదరాబాద్ 494/500.హెచ్ఈసీ: తంగోరు వెన్నెల, సుదిమళ్ల ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ 494/500; జంగం గ్లోరీ, సికింద్రాబాద్ 493/500.మొత్తంగా ఇంటర్ టాపర్స్ ఎంపీసీ: ఇందూరి రషి్మత, రోటరీనగర్, ఖమ్మం 996/1,000 ; వారణాసి మనస్వి, జీడిమెట్ల, రంగారెడ్డి 996/1,000; కూనా రుతి్వక్, కొత్తపల్లి, కరీంనగర్ 996/1,000; పల్లెపంగ వసంత్కుమార్, సూర్యాపేట 996/1,000.బైపీసీ: జక్కు అంజన, కొత్తపల్లి, కరీంనగర్ 997/1,000; కేతావత్ అఖిల, పెంచికల్పాడ్, దేవరకొండ 996/1,000; డి జ్యోత్స్నశ్రీ, కరీంనగర్ 996/1,000.సీఈసీ: ఎనుబారి కెవిక్ జోష్, మేడ్చల్ 988/1,000; భక్తు గ్రీష్మ, భగత్నగర్, కరీంనగర్ 987/1,000.హెచ్ఈసీ: గుండెబోయిన ధనప్రియ, మదీనాగూడ, రంగారెడ్డి 983/1,000; ఓనీ అభినా‹Ù, శేరిలింగంపల్లి, రంగారెడ్డి982/1,000. కాగా, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.గ్రూప్స్ సాధించడమే లక్ష్యంపల్లెపంగు వసంత్ కుమార్, (996) ఎంపీసీ, ప్రతిభ జూనియర్ కళాశాల, సూర్యాపేట సూర్యాపేట: స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో గ్రూప్– వన్ ఆఫీసర్ కావాలన్నదే నా కల. నాన్న కానిస్టేబుల్ శీనయ్య, అమ్మ జానకమ్మల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించగలిగాను. ప్రతిభ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.నా లక్ష్యం డాక్టర్ నేను చదివిన కాలేజీ యాజమాన్యం అందించిన ప్రణాళికాబద్ధమైన బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి రాష్ట్రంలో టాపర్గా నిలవడం గర్వంగా ఉంది. నీట్ పరీక్షలో సత్తాచాటి సీటు సాధించడంతో పాటు వైద్య విద్య అభ్యసించడమే నా లక్ష్యం.– జె.అంజనా, కొత్తపల్లి, కరీంనగర్ (బైపీసీ 997/1000)సివిల్ సర్వెంట్గా..ఇంటర్ సెకండియర్లో అత్యుత్తమ మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. పటిష్ట ప్రణాళికతో చదివి రాష్ట్రస్థాయిలో అగ్రభాగాన నిలిచినందుకు సంతోషిస్తున్నా. రాబోయే కాలంలో ఉన్నత విద్యనభ్యసించి యూపీఎస్సీ సాధించి సివిల్ సర్వెంట్గా సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తా. – కె.రుత్విక్, కొత్తపల్లి, కరీంనగర్ (ఎంపీసీ996/1000) -
సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ
-
వేసవి సెలవులు.. విద్యార్థులకు ఆదాయ మార్గాలు..!
స్కూళ్లు, కాలేజీలకు విరామం వచ్చిన ఈ సమయం యువతకు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, స్వల్ప ఆదాయం సంపాదించడానికి మంచి అవకాశం. ఆదాయం, అనుభవం రెండింటికీ అనేక రంగాల్లో సమ్మర్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. సరైన దిశలో అడుగేస్తే, ఈ వేసవి తమ జీవితానికే మార్గనిర్ధేశం చేసేదిగా మారవచ్చని భావిస్తున్న విద్యార్థులు సెలవుల్లో పలు ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. వాటిలో కొన్ని.. కాల్ సెంటర్ / బీపీఓలు.. ఐటీ హబ్గా మారుతున్న నగరంలో పలు కంపెనీలు తాత్కాలిక కాల్ సెంటర్, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను అందిస్తున్నాయి. వీటికి 10వ తరగతి నుంచి ఇంటరీ్మడియట్ విద్యార్థులు సైతం అర్హులే. పనివేళలు షిఫ్ట్ ప్రాతిపదికన ఉండటంతో సెలవులు ముగిశాక కూడా అవసరం అనుకుంటే క్లాసుల వేళలతో సమన్వయం చేయవచ్చు. నెలకు రూ.20 వేల వేతనం అందుకోవచ్చు. ట్యూటరింగ్ /హోం ట్యూషన్లు.. పాతదే అయినా ఇప్పటికీ వన్నెతగ్గని ఉపాధి ఇది. ఇంటర్ లేదా డిగ్రీ చదువుతున్న యువత, పాఠశాల విద్యార్థులకు హోమ్ ట్యూషన్లు చెప్పడం ద్వారా నెలకు రూ.15 వేల వరకూ ఆదాయం వస్తోంది. కొంతమంది ఆన్లైన్ ట్యూటర్గా కూడా పని చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. రిటైల్, కస్టమర్ సర్వీస్ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ షోరూమ్స్లో కస్టమర్ సర్వీస్, క్యాషియర్, స్టాక్ మేనేజ్మెంట్ వంటి ఉద్యోగాలు వేసవిలో తాత్కాలికంగా లభిస్తాయి. వీటిలో నెలకు రూ.15 వేల వరకు వేతనం అందుతుంది. ఈ ఉద్యోగం వల్ల ప్రధాన లాభం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కంపెనీలూ రెడీ.. స్వల్పకాలిక ప్రాజెక్ట్ల కోసం వేసవి సెలవుల్లో విద్యార్థులను నియమించుకోవడం అనేది కొంత కాలంగా కంపెనీలు అనుసరిస్తున్న విధానం. నగరంలోని ప్రొఫెషనల్ రెగ్యులర్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ వేసవిలో తమ అధ్యయన రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపై పని చేయబోతున్నామని చెప్పారు. కళలు హ్యుమానిటీస్ నేపథ్యానికి చెందిన విద్యార్థులు కంటెంట్ రైటింగ్ నుంచి ఫీల్డ్ రీసెర్చ్ వరకు ఉద్యోగాలపై పని చేస్తుంటే, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి వచ్చిన వారు కంపెనీల ద్వారా అవుట్సోర్స్ చేసే ప్రాజెక్ట్లలో పని చేస్తున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రకారం, వేసవి ఉద్యోగాల ద్వారా నెలకు సగటున రూ. 20 వేల నుంచి రూ.35 వేల వరకు ఆదాయాలు ఉంటాయి. సెలవులు ప్రారంభం కావడానికి ముందే కళాశాలలు విద్యార్థులకు ఇలాంటి ఉద్యోగాలు అందుకోవడంలో సహకరిస్తున్నాయి.ఫుడ్ డెలివరీ అంతకంతకూ విస్తరిస్తున్న ఊబర్ ఈట్స్, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ సంస్థలకు ఎప్పుడూ ఉద్యోగుల అవసరం ఉంటుంది. డ్రైవింగ్ తెలిసిన యువతకు డెలివరీ బాయ్తో పాటు మరికొన్ని ఉద్యోగాలు కూడా లభిస్తాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించవచ్చు. ‘నేను ప్రస్తుతం ఒక ప్రసిద్ధ కంపెనీలో నెలకు రూ.12 వేల జీతంతో రెండున్నర నెలల పాటు ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇది తక్కువ జీతానికి పని చేసినట్లుగా అనిపించవచ్చు. అయితే ఈ అనుభవం దీర్ఘకాలంలో సహాయపడుతుంది.‘ అని నగరానికి చెందిన విద్యార్థి హరితా సింగ్ చెప్పింది. (చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు) -
కెనడా వర్సిటీల వైపు అమెరికా విద్యార్థుల చూపు
అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడియన్ విశ్వవిద్యాలయా లు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయ డం, యూనివర్సిటీ నిధులను తగ్గించడంవంటి చర్యల ఫలితంగా.. యూనివ ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొ లంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్లో ఉన్న యూబీసీ క్యాంపస్లో 2024తో పోలిస్తే మార్చి1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 27% పెరుగుదల నమోదైంది. ఈ సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్లను ఈవారం కూ డా తిరిగి తెరిచింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్ 2025 నాటికి యూఎస్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటర్లూ విశ్వవిద్యాలయంలో, సెపె్టంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకర్షణకు కారణాలు.. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోష ల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడా కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరిగిన క్యాంపస్ టూర్లు.. యూబీసీలో యూఎస నుంచి అండర్ గ్రాడ్యుయేయేషన్ అప్లికేషన్లు కేవలం 2% మాత్రమే పెరిగినా, అమెరి కన్–నిర్దేశిత క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. ఆసక్తి పెరుగుతోందని, ఎక్కువ మంది విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలను వాస్తవ అవకాశంగా చూస్తున్నారని ఇది సూచిస్తుంది. తమ క్యాంపస్లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి మూడు దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1,500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. -
కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు దుర్గతి
-
ఫీజుల షెడ్యూల్కు బూజు!
ఫీజు కోసం కూలీ పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు. బతుకుదెరువు కోసం అమ్మమ్మ వాళ్ల ఊరు కోసిగికి వచ్చాం. మా అమ్మ భాగమ్మ కూలీ పనులకు వెళుతూ నన్ను చదివిస్తోంది. సొంతిల్లు లేదు. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వర్క్కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైన చిరుద్యోగంతో బతుకుతా. – ఎం.రాకేష్, బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్, హెచ్.మురవణి, కర్నూలు జిల్లా.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు పాలనలో గతి తప్పిన ఫీజు రీయింబర్స్మెంట్, ఊసేలేని వసతి దీవెనతో పేద కుటుంబాల్లోని పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. ఒకపక్క విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఫీజులు చెల్లించకుండా పరీక్షల ముంగిట పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని కుటుంబాల్లో డబ్బులు కట్టలేక, అప్పులు పుట్టక కాలేజీ విద్యార్థులు కూలీలుగా మారుతున్న దుస్థితి దాపురించింది. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు జరిపి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దాదాపు రూ.18,663.44 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్యా సంస్థలకు వారే స్వయంగా చెల్లించడం ద్వారా జవాబుదారీతనానికి బాటలు వేసింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ సజావుగా, చింత లేకుండా సాగిన పిల్లల చదువులు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యాయి. విద్యార్థుల చదువుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ధోరణి అవలంబిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్షిప్ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థి కష్టపడి చదువుకుంటే ఎంత ఫీజు అయినా సరే చెల్లించేందుకు వెనుకాడలేదు. తద్వారా ఐదేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేలా చదువులకు పూర్తి అండగా నిలిచారు.మళ్లీ చేటు కాలం దాపురించింది..!గత ఐదేళ్లూ ఉజ్వల ప్రగతితో పురోగమించిన ఉన్నత విద్య ప్రతిష్ట కూటమి సర్కారు నిర్వాకాలతో మసకబారుతోంది. వెంటాడుతున్న ఫీజుల భయంతో విద్యార్థులు దినదిన గండంలా కళాశాలలకు వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు మెయింటెనెన్స్ ఖర్చులు అందక అలమటిస్తున్నారు. కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలినాలి చేసైనా, మెడలో పుస్తెలు తాకట్టు పెట్టైనా అప్పులు తెచ్చి కళాశాలలకు రూ.వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు ఈ దుర్గతి దాపురించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజుల చెల్లింపులపై షెడ్యూల్ విధానాన్ని గాలికొదిలేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకు జమ చేస్తామని ప్రకటించింది. త్రైమాసికం విధానాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది.ముగుస్తున్న విద్యా సంవత్సరం..షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు టీడీపీ కూటమి సర్కారు స్వస్తి పలికింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు చెల్లించాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.3,900 కోట్లు కూడా కలిపితే మొత్తం రూ.7,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఫీజుల కింద ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన రూ.300 కోట్లు పాక్షికంగా మాత్రమే జమ అయినట్లు కాలేజీలు చెబుతున్నాయి. ఇక 2025–26 విద్యా సంవత్సరానికి రూ.3,900 కోట్లు అవసరం అయితే బడ్జెట్లో కూటమి సర్కారు కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. బడ్జెట్లో తగిన మేరకు కేటాయింపులు చేయకపోవడం విద్యా వ్యవస్థపై సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. హాస్టల్ మెయింటెనెన్స్ డబ్బులేవి?కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకపక్క ఫీజుల గండంతోపాటు మరోపక్క వసతి దీవెన (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఎంటీఎఫ్) ఊసే లేకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో వసతి దీవెనలో విద్యార్థులకు ఖర్చుల కింద రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య స్లాబ్ పెట్టి మాత్రమే ఇవ్వగా వైఎస్ జగన్ పాలనలో ఆ విధానాన్ని తొలగించి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4,275.76 కోట్లు అందచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో ఖర్చుల కోసం పిల్లలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.నాడు నిశ్చింతగా చదువులు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పేదింటి తల్లిదండ్రుల పట్ల విద్యా సంస్థలు జవాబుదారీతనంతో నడుచుకోవడం, ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు త్రైమాసికాల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేలా షెడ్యూల్ను ప్రకటించింది. ఏటా షెడ్యూల్ ప్రకారం సకాలంలో నిధులను విడుదల చేస్తూ చింతలేని చదువులు అందించింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను ఏప్రిల్లో ప్రాసెస్ చేసి షెడ్యూల్ ప్రకారం మే నెలలో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకుండా, పిల్లల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ను తుంగలో తొక్కింది. 2024 ఏడాదికి సంబంధించి మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఏప్రిల్–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) నిధులను తొక్కిపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థులను నిలువునా ముంచేసింది.ఫీజుల అప్పు ప్రభుత్వమే తీర్చాలి ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. గత ప్రభుత్వలో టంచన్గా ఫీజు రీయింబర్స్మెంట్ అందేది. రెండేళ్ల పాటు చదువుకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంట్లో వాళ్లు అప్పు చేసి డబ్బు కట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేగానీ ఆ అప్పు తీరదు. మా అప్పును వడ్డీతో సహా తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – నిద్దాన తిరుమల ప్రసాద్, విద్యార్ధి, విజయనగరం జిల్లా మా పాలిట శాపం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇంజనీరింగ్ కళాశాలలకు ఇవ్వడం లేదు. కౌన్సిలింగ్లో ఉచిత సీటు వచ్చినా ఫీజు కింద రూ.22 వేలు చెల్లించాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం మాలాంటి పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. – రెడ్డి మహమ్మద్, ఈఈఈ, సెకండ్ ఇయర్ విద్యార్ధి, అన్నమయ్య జిల్లా అప్పులు చేయాల్సి వస్తోంది నూజివీడులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నా. నాన్న ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీ. జగనన్న విద్యాదీవెన పథకంతో రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు చెల్లించలేదు. ఇప్పటికే రూ.47 వేలు అప్పుచేసి కాలేజీకి కట్టాం. ఈ ఏడాది మళ్లీ అప్పు చేయాల్సి వస్తోంది. – జలసూత్రం మాధవి, విద్యార్థిని, వడ్లమాను, ఏలూరు జిల్లాపరీక్షలు వస్తున్నాయి.. భయంగా ఉంది శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాన్న లేడు. అమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఈనెల 22 నుంచి పరీక్షలున్నాయి. హాల్టికెట్ జారీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. కళాశాలకు రూ.35 వేల వరకు కట్టాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. – కె.మోహన్ కందా, డిగ్రీ విద్యార్ధి, శ్రీకాళహస్తి రెడ్బుక్లో విద్యార్థులూ ఉన్నారేమో! రామచంద్రపురంలోని కళాశాలలో బీటెక్ చదువుతున్నా. నాకు మూడు టర్మ్లకు రూ.38 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి. విద్యా సంవత్సరం అయిపోతున్నా ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. బహుశా విద్యా శాఖ మంత్రి రెడ్బుక్లో విద్యార్థులు కూడా ఉన్నారేమో! కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – కె.భాస్కర్, బీటెక్ విద్యార్ధి, రాజమహేంద్రవరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు డిగ్రీ పూర్తి చేశా. ఇంకా రూ.9 వేలు కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఫీజు మొత్తం చెల్లించాకే సర్టిఫికెట్లు తీసుకెళ్లమని చెబుతోంది. నాన్న అహమ్మద్ హుస్సేన్ దినసరి కూలి. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పీజీ చదవాలన్న కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రస్తుతం ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నా. – షేక్ రిజ్వాన్ బాషా, డిగ్రీ విద్యార్ధి, ప్రకాశం జిల్లా -
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్
ధర్మవరం: విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్.. అదేమని అడిగిన తల్లిదండ్రులకూ అదే చెప్పు చూపించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, పట్టణంలో జీనియస్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో గొట్లూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సనధ్వైజ్, జశ్విన్, భరత్ 2వ తరగతి చదువుతున్నారు. రెండు రోజుల క్రితం టీచర్గా విధులు చేపట్టిన అనిత, తరగతిలో ఈ ముగ్గురు విద్యార్థులు హోంవర్క్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసి చెప్పుతో కొట్టింది. బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వెళ్లి ప్రశ్నించారు. వారితోనూ ఆ టీచర్ అమర్యాదగా ప్రవర్తించారు. తాను కావాలని కొట్టలేదంటూనే.. ‘ఏదో అలా తగిలిందంటూ’ వారికి చెప్పు చూపించారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురై, పాఠశాల కరస్పాండెంట్ ప్రేమ్ కిషోర్ వద్దకు వెళ్లి వాగ్వివాదానికి దిగారు. అనంతరం పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. టీచర్ అనిత, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆడా, మగా పిల్లలు గ్రూపుగా కలిసి థాయ్ పాటకు అందంగా నృత్యం చేస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి. పిల్లల పిల్లల ఉత్సాహం , వారి ఆనందం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు నెటిజన్లు తన బాల్యం సంగతులను గుర్తు చేసుకున్నారు.తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఈ థాయ్ పాటకు డ్యాన్స్ చేశారు.మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్ , మిడిల్ స్కూల్, తెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్గా మారిపోయింది. హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ స్టెప్పులేశారు. ఒక అమ్మాయిల బృందం, ఒక అబ్బాయి నృత్యం చేస్తూ, తమిళంలో అన్ననా పతియా ఆపత కేథియా (నా సోదరుడిని చూశారా? నాన్నను అడిగారా?) థాయ్ సాహిత్యం అసాధారణంగా తమిళ భాషకు సారూప్యంగా ఉండటంతో విశేషంగా నిలిచింది. "వారు మీనియన్స్ లాగా కనిపిస్తున్నారు" అని ఒక యూజర్, "దేవా, దయచేసి నన్ను నా స్కూల్ రోజులకు తీసుకెళ్లండి" అని యూజర్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Suryan FM (@suryanfm) ఈ టీచర్ ఇన్స్టాలో ఖాతానిండా పిల్లల యాక్టివిటీస్, ఆటలు, పాటల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు వీరిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ముఖ్యంగా శివదర్శిని అనే అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదీ చదవండి: నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్తమిళ భాషలా ధ్వనించే అనన్ త పద్ చాయే అనే పాట ఇండియాలో చాలా ట్రెండింగ్. దీని ఒరిజినల్ ట్రాక్ను థాయ్ హాస్యనటుడు-గాయని నోయి చెర్నిమ్ పాడారని భావిస్తున్నారు. 2019లో ఇండోనేషియా ప్రదర్శనకారిణి నికెన్ సాలిండ్రీ తన ప్రదర్శనలలో దీన్ని పాడినపుడు ఇది ప్రజాదరణ పొందింది. -
Majji Srinivasa Rao: విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసిన పవన్..
-
‘కంచ’ పోరు ఆగదు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని శాశ్వతంగా కాపాడుకునేందుకు హెచ్సీయూ విద్యార్థులు చేస్తున్న అపూర్వ పోరాటంపై ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులు నిస్వార్థంగా, ఉదాత్త లక్ష్యాలతో చేపట్టిన ఈ ఆందోళన అద్భుతమని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ మేరకు విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దళారిలా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్ కోసం కంచ గచ్చిబౌలి స్థలం వేలాన్ని విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఎకో పార్క్ ఏర్పాటు, యూనివర్సిటీ తరలింపు వంటి ప్రతిపాదనలను ముందుకు తెస్తోందని ఆరోపించారు. 50 ఏళ్లకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, ఎకో పార్క్ కన్నా గొప్పగా ఈ క్యాంపస్ పర్యావరణ సమతుల్యతను కాపాడుతోందన్నారు. 400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలే ఉందని, ప్రభుత్వ బెదిరింపులను, దుష్ప్రచారాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. 400 ఎకరాల పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, విద్యార్థులకు అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించేదాకా పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పారు. -
నేటి నుంచి 1–9 తరగతుల పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి 1–9 తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్మెంట్–2) ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 1–8వ తరగతి వరకు ఉదయం 9–12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9–12.15 గంటల వరకు పరీక్షలుంటాయి. షెడ్యూల్ ఇదీ.. ⇒ ఉన్నత తరగతులకు (6–9) ఏప్రిల్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, 9న థర్డ్ లాంగ్వేజ్, 10న గణితం, 11న జనరల్ సైన్స్/ ఫిజికల్ సైన్స్, 12న బయాలజీ, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 16న కాంపోజిట్ కోర్సులైన సంస్కృతం/ హిందీ, అరబిక్, పర్షియా లేదా ఓఎస్ఎస్సీ పేపర్–1, 17న ఓఎస్ఎస్సీ లేదా కాంపోజిట్ కోర్సు పేపర్–2 పరీక్ష ఉంటుంది. ⇒ ప్రాథమిక తరగతులకు (1–5) ఏప్రిల్ 9న ఫస్ట్ లాంగ్వేజ్, 10న ఇంగ్లి‹Ù, 11న గణితం, 12న ఈవీఎస్ (3, 4, 5 తరగతులు), 15న ఓఎస్ఎస్సీ (3, 4, 5 తరగతులు) పరీక్షలు జరుగుతాయి. పది రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు..! మరో 10 రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ఈనెల ఒకటో తేదీ నుంచే ప్రారంభం కాగా, మొదటి సంవత్సరం ప్రవేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి హాల్టికెట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించి, ఫలితాలు వచ్చాక అడ్మిషన్ ఖరారు చేయనున్నారు. -
టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు
ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు.వీళ్లల్లో ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది?అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు గడ్డుకాలం మొదలైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరిమేస్తున్న ట్రంప్ యంత్రాంగం.. విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని, నైపుణ్యం లేనివారు ఏ దేశంలోనూ ముందుకెళ్లలేరని చెబుతున్నారు అమెరికాలో 30 ఏళ్లుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రవాసాంధ్రుడు వెంకట్ ఇక్కుర్తి (Venkat Ikkurthy). నైపుణ్యం ఉన్న ఎవరినీ ట్రంప్ కాదుకదా.. ఎవ్వరూ అడ్డుకోలేరని, నైపుణ్యం లేనివారిని ఎవ్వరూ రక్షించలేరని చెబుతున్నారాయన. గుంటూరు జిల్లాకు చెందిన వెంకట్కు డేటా సైంటిస్టుగా, అమెరికన్ యూనివర్సిటీల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా 30 ఏళ్ల అనుభవం ఉంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికాలో తాజా పరిస్థితి, భారత విద్యార్థుల స్థితిగతుపై ‘జూమ్ ఇన్’లో ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ట్రంప్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవు. అమెరికన్ చట్టాలనే కఠినంగా అమలు చేస్తున్నారు. తన దేశానికి మేలు చేయాలన్నదే ఆయన ఆలోచన. టారిఫ్లు వేయడం సర్వ సాధారణ విషయమే. కాకపోతే దీన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. భారత విద్యార్థులను అక్కడ వేధిస్తున్నారా? భారత్ నుంచి అమెరికాకు ఏటా 3.42 లక్షల మంది చదువుకోవడానికి వస్తున్నారు. ఇందులో సగం మంది తెలుగు విద్యార్థులే. భారత విద్యార్థులంతా తెలివైన వాళ్లే. కాకపోతే నిబంధనలు వదిలేస్తారు. ఇప్పుడదే సమస్యగా మారింది. నిజానికి అమెరికావాళ్లు భారత పౌరులను గౌరవిస్తారు. గోల్డెన్ హ్యాండ్స్ (Golden Hands) అంటారు. అలాంటి వాళ్లు విద్యార్థులను ఎందుకు వేధిస్తారు. యూనివర్సిటీల్లో పార్ట్టైం జాబ్ చేసే ఎవరినీ ఏమీ అనడం లేదు. అడ్డదారిలో మాల్స్, హోటల్స్, ఇళ్లల్లో పనిచేయడాన్ని అడ్డుకుంటున్నారు. అమెరికాకు వచ్చేది దీని కోసమా? అసలు సమస్య ఏంటి? 2016లో అమెరికాకు వచ్చిన భారతీయులు (Indians) 40 వేలకు మించి లేరు. వీళ్లతా ఐఐటీ, ఎన్ఐటీ, పేరున్న వర్సిటీల్లో చదివిన వాళ్లే. ఎంఎస్ పూర్తయిన తర్వాత వాళ్లల్లో సగం మందిని అమెరికా మంచి ఉద్యోగాలిచ్చి ఉంచేసుకుంది. ఇప్పుడు వీళ్లే అమెరికాకు గొప్ప ఆస్తి. నైపుణ్యం ఉన్న విద్యార్థులను అమెరికా ఎప్పుడూ వదులుకోదు. కానీ ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు. వీళ్లల్లో ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది? ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకే 295 జీఆర్ఈ స్కోర్ వస్తోంది. కానీ వీళ్లు 325 స్కోర్ తెచ్చుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? కన్సల్టెన్సీలు తప్పుడు మార్గంలో జీఆర్ఈ రాయిస్తున్నాయి. వీటిని అమెరికా అధికారులు గుర్తించలేరా? మెక్సికో లాంటి ప్రాంతాల నుంచి లేబర్ వీసాలపై వచ్చే నల్ల జాతీయుల ఉద్యోగాలు కూడా మనవాళ్లు చేస్తామని ముందుకొస్తున్నారు. కాల్పుల ఘటనలకు ఇవే ప్రధాన కారణాలవుతున్నాయి. అమెరికా విద్యలో నాణ్యత ఉందా? అమెరికాలో 25 వేల విశ్వవిద్యాలయాలున్నాయి. దాదాపు ఇవన్నీ ప్రైవేటువే. వీటిల్లో నాణ్యత ఉన్నవి కొన్నే. మిగతా వర్సిటీలు కన్సల్టెన్సీల ద్వారా విద్యార్థులను మభ్యపెట్టి చేర్చుకుంటున్నాయి. కొన్ని వర్సిటీలు ఫీజుల్లో 40 శాతం కన్సల్టెన్సీలకు ఇస్తున్నాయి. దీంతో కన్సల్టెన్సీలు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ వర్సిటీలు విద్యార్థులు చదివినా చదవకపోయినా డిగ్రీలు ఇస్తున్నాయి. అమెరికాలో ఉండే ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లు 26 చోట్ల వాడారు. దీన్ని అమెరికా అధికారులు ప్రశ్నించారు. తన బంధువు కోసం ఇచ్చిన డాక్యుమెంట్లను కన్సల్టెన్సీలు ఇలా దుర్వినియోగం చేశాయి. నాణ్యత లేని వర్సిటీల్లో నెలకు ఒక క్లాస్ జరుగుతోంది. మిగతా రోజుల్లో మనవాళ్లు చట్ట విరుద్ధంగా డబ్బుల కోసం పని చేస్తున్నారు. ఒక హోటల్లో గంటలకొద్దీ పనిచేసే విద్యార్థి ఎంఎస్ ఎలా చదువుతాడు? అతడికి నైపుణ్యం ఎందుకు ఉంటుంది? అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుంది? అమెరికన్లు పనిచేయరు.. భారతీయులను ట్రంప్ అడ్డుకుంటున్నారు.. ఎలా? నిజమే.. అమెరికన్లు రెస్టారెంట్లు, ఇళ్లలో పనిచేయరు. భారతీయులూ అలా చేయరనేది అమెరికన్ల నమ్మకం. అందుకే మెక్సికన్లకు ఈవీ–1 వీసా (అగ్రికల్చర్ లేబర్) ఇస్తారు. ఆ జాబితాలో భారత్ లేనేలేదు. అలాంటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం మంచిదేనా? కరోనా తర్వాత యాంత్రీకరణ పెరిగింది. దీంతో హోటళ్లు, పెట్రోల్ బంకులు సహా అన్నింటిలోనూ రోబోలు వస్తున్నాయి. ముందుముందు మనవాళ్లు పోటీపడే పార్ట్టైం ఉద్యోగాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే స్కిల్ ఉద్యోగాలు కూడా కష్టమే. ఇప్పుడు ఉద్యోగాల మాటేమిటి? నైపుణ్యం ఉన్నవాళ్లను ఎవరూ అడ్డుకోలేరు. అది లేనివాళ్లను ఎవరూ రక్షించలేరు. 2016కు ముందు వచ్చిన భారతీయుల పిల్లలకు ఇక్కడ పౌరసత్వం వచ్చింది. వాళ్లిప్పుడు ఉద్యోగాల వేటలో ఉన్నారు. కొత్తగా ఇండియా నుంచి వచ్చే పిల్లలకు అమెరికన్లు పోటీనే కాదు. పౌరసత్వం పొందిన భారత సంతతికి చెందిన వాళ్లే పోటీ. కాబట్టి నైపుణ్యం లేకుండా, డబ్బు సంపాదనే ధ్యేయంగా అమెరికా వస్తే ఇబ్బంది పడతారు. అమెరికా (America) వచ్చే ముందు ఒక్కసారి మీ నైపుణ్యం ఏమిటో? దేనికి సరిపోతారో బేరీజు వేసుకోండి. నైపుణ్యం పెరగాలంటే ముందుగా భారత విద్యా విధానంలో మార్పులు తేవాలి. ఇది అభివృద్ధి చెందిన దేశాల అవసరాలు తీర్చేలా లేదు. ఇంటర్వ్యూ: వనం దుర్గాప్రసాద్ -
చంద్రబాబుకు షాక్.. ఇంగ్లీష్ లో అదరగొట్టిన గురుకుల విద్యార్థులు
-
సెలవు చావుకొచ్చింది!
ఆదిలాబాద్రూరల్: సెలవు ఆ విద్యార్థుల చావుకొ చ్చింది. ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని వైజాగ్కు చెందిన కాంబ్డే దుర్గాప్రసాద్, సత్యభామ దంపతులు ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ఆదిలాబాద్కు వచ్చారు. మావల మండల కేంద్రంలోని 170 కాలనీలో గుడిసెలు వే సుకుని నివాసం ఉంటున్నారు. వారికి రాహుల్ (9) (నాలుగో తరగతి), విశాల్ ఇద్దరు కుమారులు. ఇద్దర్నీ మావల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్2లో చదివిస్తున్నారు. శనివారం పాఠశాలకు సెలవు ఉండడంతో రాహుల్, విశాల్, స్నేహితుడు చిప్పకుర్తి సంజీవ్ (10)తో కలిసి ఈత కొట్టేందుకు మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న ఎర్రకుంట చెరువు వద్దకు వెళ్లారు. రాహుల్, సంజీవ్ స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. విశాల్ చెరువు చుట్టుపక్కల ఆడుకుంటూ ఉన్నాడు. కొంత సేపటికి రాహుల్, సంజీవ్ నీటిలో మునిగిపోవడంతో గమనించిన విశాల్ విషయాన్ని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులకు స మాచారం అందించాడు. మావల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ మార్చురీకి తరలించారు.రెండు రోజుల్లో పుట్టిన రోజు..గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన చిప్పకుర్తి రాజ్కుమార్ కుమారుడు సంజీవ్ నానమ్మ తారా బాయి వద్ద ఉండి మావల పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. మరో రెండు రోజుల్లో అతని పుట్టినరోజు ఉంది. ఇందుకోసం తారాబాయి తన పింఛన్ డబ్బులతో కొత్త బట్టలు కొనిచ్చేందుకు తీసుకెళ్దామని అనుకుంది. అంతలోనే స్నేహితులు రావడంతో వారితో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికే ఈ విషాదకర వార్త తెలియడంతో తారాబాయి అక్కడికి చేరుకుని నా కోరిక తీరక ముందే వెళ్లిపోయావా.. అంటూ గుండెలు బాదుకుంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. -
కొంచెం సులభమే!
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ – 2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తంచేశారు. ఈసారి అడిగిన ప్రశ్నల్లో భిన్నత్వం కనిపించిందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. మొదటి సెషన్లో రసాయనశాస్త్ర ప్రశ్నలు తేలికగా ఉంటే, ఈసారి కఠినమైన ప్రశ్నలు వచ్చా యని తెలిపారు. న్యూమరికల్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు చెప్పారు. ఎన్సీఈఆర్టీ సిలబస్లోంచి ప్రశ్నలను ట్విస్ట్ చేస్తూ ఇచ్చినట్టు నిపుణులు వెల్లడించారు. సాధారణంగా ఫిజిక్స్లో మధ్యస్తంగా స్కోర్ చేసేందుకు అవకాశం ఉండేది. ఈసారి కెమిస్ట్రీతో పోలిస్తే ఫిజిక్స్ విభాగంలో కొంత సులభమైన ప్రశ్నలున్నట్టు సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. గణితంలో ఈసారి సుదీర్ఘ ప్రశ్నలు కొంత తగ్గినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ల నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు రాబట్టినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది రాస్తున్న ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది వరకు హాజరవుతున్నారు. బుధవారమే సీబీఎస్ఈ పరీక్ష కూడా ఉండటంతో, రెండూ ఎలా రాస్తారనే అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఎన్టీఏ సీబీఎస్ఈ పరీక్ష ఉన్న విద్యార్థుల స్లాట్ సమయాన్ని మార్చింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ వెసులుబాటు కల్పించింది. సబ్జెక్టులవారీగా ఇలా.. – మొదటి షిఫ్ట్ ప్రశ్నపత్రం ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని, ఫిజిక్స్ విభాగం క్లిష్టంగా, మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలు సుదీర్ఘంగా, మిగతా రెండు విభాగాలతో పోల్చితే కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. – ఫిజిక్స్లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, ఆప్టిక్స్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. న్యుమరికల్ ప్రశ్నల కారణంగా సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు తెలిపారు. రెండో షిఫ్ట్లో ఓ మోస్తరు కఠినమైన ప్రశ్నలు అడిగారు. మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్, మ్యాగ్నటిక్ ఫీల్డ్, యూనిట్ అండ్ డైమెన్షన్స్, రొటేషన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సర్ఫేస్ టెన్షన్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్, లాజిక్ గేట్, కైనమాటిక్స్ అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. – జనవరి సెషన్తో పోల్చితే కెమిస్ట్రీలో ఈసారి ఓ మోస్తరు క్లిష్టతతో ప్రశ్నలడిగారని అంటున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోంచి నేరుగా అడిగారు. రెండో షిఫ్ట్లో కూడా ఇదే తరహాలో ప్రశ్నలు అడిగారు. ఫిజికల్ కెమిస్ట్రీలో న్యుమరికల్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. మొదటి షిఫ్ట్ మాదిరిగానే రెండో షిఫ్ట్లో కూడా ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. – మ్యాథమెటిక్స్ విభాగంలో జనవరి సెషన్తో పోల్చితే ఈసారి ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని, 5 ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా ఆధారంగా అడిగారని చెబుతున్నారు. రెండో షిఫ్ట్లో కూడా ఈ విభాగం ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. వెక్టార్ అండ్ 3డి, మ్యాట్రిసెస్, డిటరి్మనెంట్స్, లీనియర్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, కానిక్ సెక్షన్, ఎలిప్స్, ఏరియా అండర్ కర్వ్, ప్రాబబిలిటీలకు రెండో షిఫ్ట్లో ప్రాధాన్యం లభించింది. మొదటి షిఫ్ట్లో మాత్రం అధిక శాతం ప్రశ్నలు పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్, బైనామియల్స్, సర్కిల్స్, లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ల నుంచి అడిగారు. గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా.. రెండో సెషన్లో మొదటి రోజు పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు.. గత ప్రశ్న పత్రాల నుంచే అడిగారు. వీటిని బాగా ప్రాక్టీస్ చేసిన వారు ఎక్కువ సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. ఫార్ములాలు, కాన్సెప్్టలపై అవగాహన ఉన్నవారు కూడా సమాధానాలు ఇచ్చేలా ప్రశ్నలున్నాయి. కెమిస్ట్రీలో మిక్స్డ్ కాన్సెప్ట్ కొశ్చన్స్ అడిగారు. మ్యాథమెటిక్స్లో 52–56 మార్కులు; ఫిజిక్స్లో 75–85 మార్కులు; కెమిస్ట్రీలో 60–65 మార్కులతో 99 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది. – ఎం.ఎన్. రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు. -
బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..
వికారాబాద్: ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక స్కూల్ భవనం పైనుంచి దూకి ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలిక ఘటనను మరువకముందే.. ఇదే స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థినులను బూతులు తిడుతూ, కొడుతున్న వీడియో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో నెల రోజుల కిందట ఓ పదో తరగతి విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలపాలైన బాలిక కాలు విరగగా ప్రాణాలతో బయటపడింది. ఇందుకు స్కూల్ సిబ్బంది వేధింపులే కారణమని బాధితురాలు తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఘటనను మరువక ముందే.. ముగ్గురు బాలికలను తన చాంబర్కు పిలిపించుకున్న ప్రిన్సిపల్ వారిని అసభ్యకరంగా తిడుతూ, ఇష్టానుసారం కొడుతున్న వీడియో వైరల్గా మారింది. జుట్టు ఎందుకు విరబోసుకున్నావ్.. యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు.. బయటకు ఎందుకు వెళ్లావ్ అంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ దాడి చేస్తున్న దృశ్యాలను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ బాలిక ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని మండిపడుతున్నారు.… pic.twitter.com/hnk2eHUV0W— Telugu Scribe (@TeluguScribe) April 1, 2025 -
భోజనం లేదు.. పుస్తకాల్లేవు!
సాక్షి నెట్వర్క్/అమరావతి: అరకొర వసతుల మధ్య పుస్తకాల్లేకుండానే నూతన విద్యా విధానంలో ఇంటర్మీడియట్ మొదలైంది. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మార్చి 20వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో తిరిగి పది రోజుల్లోనే రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులను కాలేజీలకు రప్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విఫలమయ్యారు.ఇంటర్మీడియట్ నూతన విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న విద్య, అకడమిక్ సంస్కరణలపై మార్చి 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఆదేశించినా అది విద్యార్థుల వరకు చేరలేదు. మంగళవారం ‘సాక్షి’ బృందం పలు కళాశాలలను సందర్శించగా, ఎక్కడా విద్యార్థుల హాజరు 10 శాతం మించలేదు. ఒకటో తేదీనే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో స్టూడెంట్ కిట్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేర లేదు. ఏ జిల్లాలోనూ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చిన దాఖలా లేదు. వచ్చిన అరకొర విద్యార్థులకు చాలాచోట్ల మధ్యాహ్న భోజనం పెట్టలేదు.కొన్ని చోట్ల ఈనెల 3వ తేదీ వరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఉండడంతో ఆయా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు కలిపి 801 ఉండగా, హైస్కూల్ ప్లస్లు 502, ప్రయివేట్ ఎయిడెడ్ కాలేజీలు 181 ఉన్నాయి. అయినప్పటికీ తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే నమోదైంది. తొలి ఏడాది పరీక్షలు రాసిన పది రోజుల్లోనే తిరిగి కాలేజీకి రావడం కొత్తగా ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఎండల తీవ్రత కారణంగా ఏప్రిల్లో తరగతులు సరికాదని మరి కొందరు పేర్కొన్నారు. అన్ని చోట్లా అరకొర హాజరే... ⇒ గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 401మంది విద్యార్థినులకు తొలిరోజు కేవలం 20 మందే హాజరయ్యారు. ఇక్కడ ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతుండడంతో ఉ.9 గంటలకు వచ్చిన విద్యార్థినులను అర్ధ గంటలోనే ఇళ్లకు పంపించారు. ⇒ ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలోకి 238 మంది విద్యార్థులు ప్రవేశించగా, మంగళవారం కేవలం 48 మందే వచ్చారు.⇒ ప్రకాశం జిల్లాలో 32 ప్రభుత్వ కళాశాలల్లో 2,200 మంది విద్యార్థులకు గాను, తొలిరోజు 120 మందే హాజరయ్యారు. ⇒ కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ కాలేజీలో 225 మంది విద్యార్థులకు గాను ఒక్కరూ హాజరుకాలేదు. చిప్పగిరి, హోళగుంద, గూడూరు, కోడుమూరు, కర్నూలు బి.క్యాంపు, మంత్రాలయం, నాగులదిన్నె, ఎమ్మిగనూరు కాలేజీల్లో ఒక్కరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 78 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ⇒ కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 171 మందికి కేవలం 29 మంది మాత్రమే వచ్చారు. ⇒ చిత్తూరు పీసీఆర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 258 మందికి గాను తొలి రోజు కేవలం 25 మంది హాజరయ్యారు. ఒకేషనల్ 196 మందికిగాను ఒక్కరూ హాజరు కాలేదు. పలమనేరు కళాశాలలో 339 మందికి 30 మంది, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100 మందికి 10 మంది వచ్చారు. అన్ని కాలేజీల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలల్లో 1,372 మంది విద్యార్థులకుగాను, 344 మంది మాత్రమే హాజరయ్యారు.⇒ నెల్లూరు జిల్లాలో 51 ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో 6 వేల మంది విద్యార్థులకు గాను తొలి రోజు 500 మంది మాత్రమే వచ్చారు. కేజీబీవీ, మోడల్, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 15 శాతం విద్యార్థులే హాజరయ్యారు.మధ్యాహ్న భోజనం లేదు మా స్వగ్రామం లద్దగిరి నుంచి ప్రతిరోజు 15 కి.మీ ప్రయాణించి వెల్దుర్తి కాలేజీకి రావాలి. సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. తొలిరోజు మధ్యాహ్న భోజనం పెట్టలేదు. ఇస్తామని చెప్పిన పుస్తకాలూ ఇవ్వలేదు. మా కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో సెకండియర్ వారు 78 మంది రావాలి. కానీ ఇద్దరమే వచ్చాం. అన్ని సౌకర్యాలు కల్పించాక తరగతులు ప్రారంభిస్తే బాగుండు. – దేవరాజు, సెకండియర్ సీఈసీ, లద్దగిరి, కర్నూలు జిల్లావేసవి సెలవులు ఇవ్వాలితొలి ఏడాది పరీక్షలు ముగిసిన పది రోజుల్లోనే సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభించడం కొత్తగా ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికే ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. వారితో పోటీ పడాలంటే ఇప్పటి నుంచే తరగతులు నిర్వహిస్తే సబ్జెక్టులపై అవగాహన పెరుగుతుంది. అయితే ఎండలు ముదిరిన నేపథ్యంలో వేసవి సెలవులు ఇస్తే బావుంటుంది. – కె.సాయికృష్ణ, సెకండియర్ హెచ్ఈసీ విద్యార్థి, ఏలూరుపుస్తకాలు త్వరగా ఇస్తే మేలుగతంలో జూన్ లో కళాశాలలు ప్రారంభమయ్యేవి. ఇప్పుడేమో పరీక్షలు రాసిన పది రోజుల్లోనే కళాశాలకు రప్పించారు. ఈ విధానం మంచిదేననిపిస్తోంది. కాకపోతే ఎండల తీవ్రత అధికంగా ఉంది. అన్ని కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెడితే బావుంటుంది. పుస్తకాలు కూడా త్వరగా ఇవ్వాలి. – సయ్యద్ సమీర్, సెకండియర్ సీఈసీ, నక్కాస్, కడప -
పోలీసు పహారాలో హెచ్సీయూ
గచ్చిబౌలి/రాయదుర్గం: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ అట్టుడుకిపోతోంది. క్యాంపస్ మొత్తం పోలీసు పహారాలో ఉంది. మరోవైపు ఆందోలనలు కొనసాగిస్తున్న విద్యార్థులు, మంగళవారం నుంచి పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సోమవారం సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టబోమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు..క్యాంపస్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.ప్రధాన రహదారి నుంచి క్యాంపస్ ప్రధాన ద్వారం వరకు స్టాపర్స్ అమర్చారు. ప్రధాన ద్వారం వద్ద యూనివర్సిటీ హస్టళ్ల ముందు గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ బందోబస్తును మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల రిమాండ్ పనులను అడ్డుకోవడం, తోపులాటకు దిగడంతో పోలీసు అధికారికి గాయాలయ్యాయంటూ టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హెచ్సీయూకు చెందిన ఇద్దరు పీహెచ్డి విద్యార్థులపై కేసు నమోదు చేశారు. పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, హెచ్సీయూ స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్ఎఫ్ఐ) ఎర్రం నవీన్, కంప్యూటర్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, ఏబీవీపీ నాయకులు రోహిత్ బొండుగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరిలించారు. వీరిపై బీఎన్ఎస్ 329 (3), 118(1), 132, 191(3), 351(3), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేటి నుంచి తరగతుల బహిష్కరణ హెచ్సీయూలో భూముల పరిరక్షణ కోసం మంగళవారం నుంచి తరగతులు బహిష్కరించి క్యాంపస్ లోని పరిపాలనా భవనం ముందు నిరవధిక నిరసన చేపట్టాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు హెచ్సీయూ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపునకు ఏఐఎస్ఏ, ఏఐఓబీసీఎస్ఏ, ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డీఎస్యూ, ఫ్రటర్నిటీ, ఎంఎస్ఎఫ్, పీ డీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఎస్ఐఓ, టీఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం శవయాత్ర హెచ్సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా క్యాంపస్లో సోమవారం సాయంత్రం రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి శవయాత్రను నిర్వహించారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్కూల్ యూనిఫాం.. ఇక పక్కా కొలతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫాం తయారీలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకొచ్చింది. సగటు కొలతలకు బదులు కచ్చితమైన కొలతలతోనే యూనిఫాం అందించాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థి కొలతలనూ టైలర్లు వ్యక్తిగతంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులంతా దీన్ని విధిగా పాటించాలని ఆదేశించింది. గతం మాదిరి కాదు... గతంలో యూనిఫాంకు కొలతలు తీసుకొనే పద్ధతి వేరుగా ఉండేది. విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజించే వారు. ఎత్తు, లావు ఆధారంగా 10 మందిలో ఒకరి కొలత తీసుకొని మిగతా వారికి కూడా అదే కొలతలతో కుట్టేవాళ్లు. దీనివల్ల కొందరికి పొట్టిగా, మరికొందరికి వదులుగా యూనిఫాం ఉంటోంది. దీంతో కొంత మంది విద్యార్థులు టైలర్ల దగ్గరకు వెళ్లి అవసరమైన సైజ్ మేరకు యూనిఫాంలో మార్పులు చేయించుకుంటున్నారు. నిరుపేద పిల్లలు మాత్రం ఇచ్చిందే వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ సిఫార్సులు, స్థానిక హెచ్ఎంల ఫిర్యాదుల దృష్ట్యా ప్రతి విద్యార్థికీ కచ్చితంగా కొలతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దుస్తులు పంపిణీ చేసిన తర్వాత విద్యార్థి నుంచి ఫిర్యాదు వస్తే తిరిగి దాన్ని సరిచేయాలని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి పూర్తిగా సంతృప్తి చెందితేనే స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ)కు బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు నిక్కర్ బదులు ఫ్యాంట్లు ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం వెల్లడించింది. 19.91 లక్షల మంది విద్యార్థులు.. రెండేసి జతలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 19.91 లక్షల మంది విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. ఇందుకు అయ్యే వస్త్రం కోసం ప్రభుత్వం రూ. 90 కోట్లు వెచ్చిస్తోంది. స్థానిక స్వయం సహాయక సంఘాల చేత యూనిఫాం కుట్టిస్తోంది. ఇందుకుగాను వారికి కుట్టుకూలి కింద రూ. 30 కోట్లు చెల్లించనుంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే యూనిఫాంను విద్యార్థులకు అందించాల్సి ఉంది. సాధ్యాసాధ్యాల మాటేమిటి? ప్రభుత్వ ఆదేశాలపై స్వయం సహాయక బృందాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలిచ్చేటప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులనూ తెలుసుకోవాలని కోరుతున్నాయి. ప్రభుత్వం వస్త్రం సేకరించి జిల్లాలు, మండలాలకు పంపేందుకే మే ఆఖరు వరకు సమయం పడుతుందని అంటున్నాయి. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే యూనిఫాం కుట్టి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టైలరింగ్ మహిళలు అంటున్నారు. అదీగాక.. ప్రతి విద్యార్థికి వస్త్రం సగటున అర మీటరే వస్తోందని.. దీనివల్ల కొందరికి సరిపోవట్లేదని చెబుతున్నారు. ప్రతి జతకు ప్రభుత్వం ఇచ్చే రూ. 75 కుట్టుకూలి కనీస వేతనంగా కూడా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక బృందంలో కనీసం నలుగురు చొప్పున ఉండే సభ్యులు పాఠశాలల చివరి పనిదినంలోగా కొలతలు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు సొంతంగా కొలతలు తీసుకొని పంపిస్తే తమకు తేలికగా ఉంటుందని చెబుతున్నారు. టెన్షన్ పెడితే ఎలా? ప్రభుత్వం ఇచ్చే కుట్టుకూలీ కనీసం ట్రాన్స్పోర్టు ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. వస్త్రం సగటున ప్రతీ విద్యార్ధికి 50 సెంటీమీటర్లే వస్తుంది. అదీగాక 15 రోజుల్లో కుట్టి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. మా పరిస్థితినీ ప్రభుత్వం ఆలోచించాలి. టెన్షన్ పెడితే ఎలా? ప్రతీ స్కూల్కు వెళ్ళి కొలతలు తీసుకొని, యూనిఫాం అందించాంటే 45 రోజులు పడుతుంది. అంత సమయం ఎక్కడిస్తున్నారు. కొలతలు వాళ్ళే తీసి ఇవ్వాలి. అప్పుడే సమయం కలిసి వస్తుంది. – ఎ. మాధవీగౌడ్ (టైలర్, కరీంనగర్) ఎక్కువ మంది టైలర్లను తీసుకుంటే సమస్యకు పరిష్కారం ప్రతి విద్యార్ధికి కచ్చితమైన కొలతలతో యూనిఫాం అందించాలనే నిర్ణయం సరైందే. సరిగా కుట్టలేదని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అయితే టైలర్ల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కుట్టడానికి ఎక్కువ మందిని పెడితే సమస్య పరిష్కారం అవుతుంది. – పరాంకుశం రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధాయుల సంఘం పూర్వ అధ్యక్షుడు) -
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
హెచ్సీయూ రణరంగం
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉగాది రోజున జేసీబీలతో వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్లోకి ప్రవేశించి భూములను చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసి వందలమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో అందరినీ ఈడ్చుకెళ్లి లారీల్లో పడేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. అరుపులు.. కేకలు.. అరెస్టులు ఆదివారం సెలవు దినం, ఉగాది పర్వదినం కూడా కావటంతో క్యాంపస్లో ఉదయం వాతావరణం ప్రశాంతంగానే మొదలైంది. కొద్ది సేపటికే పోలీసులు తండోప తండాలుగా వచ్చి క్యాంపస్లోని అన్ని అంతర్గత రోడ్లను ఆ«దీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. వర్సిటీ ప్రహరీ లోపలి భూములను జేసీబీలతో చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసిన విద్యార్థులు రోడ్లపైకి దూసుకొచ్చారు.దీంతో పోలీసులకు, విద్యార్థులకు తోపులా జరిగింది. విద్యార్థుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు ఏమాత్రం ఉపేక్షించకుండా కనిపించిన విద్యార్థిని కనిపించినట్లే వాహనాల్లోకి ఎక్కించి మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులను కూడా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు. మొత్తం 52 మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళికతో హెచ్సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని విక్రయించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతకాలంగాక్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం కూడా పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నట్లు ఆదివారం నాటి ఘటనను బట్టి తెలుస్తోంది. శనివారం రాత్రి నుంచే పోలీసులు క్యాంపస్లో కొద్దిమొత్తంలో మకాం వేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా చాలామంది విద్యార్థులు స్వగృహాలకు వెళ్లే అవకాశం ఉందని గురించి క్యాంపస్ను పూర్తిగా అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లోకి బయటి వారు రాకుండా ముందు జాగ్రత్తగా మెయిన్ గేటుకు తాళం వేశారు. లోపలివారిని బయటకు కూడా వెళ్లనీయలేదు. శనివారం రాత్రే విద్యార్థులకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో చాలామంది గాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేని«విధంగా హెచ్సీయూ క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా పీఎం విద్యాలక్ష్మీ రుణాలు
న్యూఢిల్లీ: ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మీ (పీఎం–విద్యాలక్ష్మీ) పథకాన్ని అందుబాటులోకి తెచి్చనట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేశంలోని టాప్ 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో (క్యూహెచ్ ఈఐ) ప్రవేశం పొందిన విద్యా ర్థులు ఈ పథకం కింద రుణం కోసం అర్హులు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ కూడా ఉంటుంది. విద్యార్థులు లేదా వారి కుటుంబాలు ఎటువంటి ఆస్తులను తన ఖాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు పీఎం–విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి విద్యా రుణం కోసం డిజిటల్గా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్కు 8,300కి పైగా బ్రాంచ్లు, 12 ప్రత్యేక విద్యా రుణ ఆమోద కేంద్రాలు, 119 రిటైల్ అస్సెట్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. అర్హులైన వి ద్యార్థులందరూ నాణ్యమైన విద్య పొందేందుకు అవ సరమైన ఆర్థిక తోడ్పాటు అందించ డం తమ లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ తెలిపారు. -
విదేశీ విద్యార్ధులపై అమెరికా మరో బాంబు
-
టెన్త్.. జవాబు పత్రాలు చిందర వందర
సాక్షి, హైదరాబాద్/కారేపల్లి: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖద్వారంగా భావించే పదో తరగతి పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల తరలింపుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పరీక్షలు నిర్వహించామా.. జవాబు పత్రాలు పంపించామా.. అంతే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో శనివారం వెలుగు చూసిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది.. ఏం జరిగిందంటే..: ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మోడల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోమట్లగూడెం(గాం«దీనగర్)లోని హైస్కూల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 28న ఫిజికల్ సైన్స్ పరీక్ష ముగిశాక జవాబు పత్రాలను కారేపల్లి పోస్టాఫీస్లో పార్శిల్ బుకింగ్ చేశారు. అక్కడి సిబ్బంది జవాబు పత్రాలను మూడు పార్శిళ్లు చేసి బ్యాగులో సీల్ వేసి కారేపల్లి బస్టాండ్లో ఖమ్మం వెళ్లే బస్ కండక్టర్కు అప్పగించారు. బస్సు ఖమ్మం పాత బస్టాండ్కు సాయంత్రం చేరుకుంది. అక్కడి నుంచి ఆర్ఎంఎస్ (రైల్వే మెయిల్ సర్వీస్) క్యాంప్ ఆఫీస్కు పంపించి, ఆ తర్వాత నిర్దేశిత మూల్యాంకన కేంద్రానికి చేరవేస్తారు. అయితే, శుక్రవారం సాయంత్రం జవాబుపత్రాల బ్యాగ్ను ఖమ్మం పాత బస్టాండ్లో బస్సు నుంచి కిందకి పడేయగా, డ్రైవర్ బస్సును కదిలించడంతో టైరు ఆ బ్యాగ్ పైనుంచి వెళ్లింది. దీంతో బ్యాగ్ చిరిగి కారేపల్లి మోడల్ స్కూల్లో పరీక్ష రాసిన విద్యార్థుల జవాబుపత్రాలు బయట పడ్డాయి. ఈ విషయం శనివారం బయటకురావడంతో కలకలం రేగింది. జవాబు పత్రాలన్నీ భద్రం.. జవాబు పత్రాలు రోడ్డుపై పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆర్ఎంఎస్ కార్యాలయానికి ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డీఈఓ సోమశేఖరశర్మ వెళ్లి ప్యాకేజీలను పరిశీలించారు. జవాబు పత్రాలన్నీ భద్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఈఓ తెలిపారు. ఇదే విషయమై కారేపల్లి పోస్ట్ మాస్టర్ ఝాన్సీ లక్ష్మిబాయిని వివరణ కోరగా.. పార్సిల్ బుకింగ్ చేయడం, ప్యాకర్ ద్వారా బస్సులో వేయడమే తమ బాధ్యత అని చెప్పారు. ఖమ్మం బస్టాండ్లో ఆర్ఎంఎస్ వారికి బ్యాగ్ అప్పగించే వరకు కండక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోస్టల్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ అంశంపై విద్యాశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ నివేదిక పంపారు. మూడు గంటలు ఆలస్యంగా.. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటకొచి్చన ఫొటోలను పరిశీలిస్తే బండిల్లోని పేపర్లు ఇప్పదీసి మళ్లీ పెట్టినట్టుగా ఉన్నాయి. ప్రతిరోజూ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. 1.30లకు జవాబు పత్రాలను పోస్టల్ శాఖకు అందజేయాలి. కారేపల్లి నుంచి ఖమ్మంకు రావడానికి గంట సమయం పడుతుంది. కానీ రాత్రి పొద్దుపోయాక ఖమ్మంకు జవాబు పత్రాలు వచి్చనట్టు తెలుస్తోంది. ఇంత ఆలస్యానికి కారణాలేంటి? ఈ ఒక్క కేంద్రమే కాదు.. జిల్లాలోని ప్రతీ పరీక్ష కేంద్రం నుంచి జవాబు పత్రాలు దాదాపు 3 గంటల ఆలస్యంగా వస్తున్నట్టు సమాచారం. ఆ మూడు గంటల్లో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించాం. రవాణా వల్లే బండిల్ పగిలిందని కలెక్టర్ చెప్పారు. డీఈవో చేత విచారణ చేయిస్తున్నాం. ఎక్కడైనా అవకతవకలు జరిగాయా అన్న కోణంలోనూ విచారణ చేపట్టాలని ఆదేశించాం. పరీక్షలపై విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది. – ఈవీ నర్సింహా రెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్. -
హెచ్సీయూ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్: హెచ్సీయూ భూముల వ్యవహారం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. వర్శిటీ భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ భూముల విక్రయాన్ని ఆపాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దాంతో సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసుల్ని భారీగా మోహరించారు.అసలు వివాదం ఎందుకంటే..!హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్చ్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్లైన్లో యాక్టివ్గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది. -
ఆరుగురు విద్యార్థులు అదృశ్యం
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే రోజు అదృశ్యమయ్యారు. స్కూల్కు వెళుతున్నామని చెప్పి నాలుగు రోజులైనా వారు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శుక్రవారం స్థానిక పోలీసులను అశ్రయించారు. ఇప్పటి వరకూ ఇల్లు, స్కూల్కు తప్ప వేరే ప్రదేశం తెలియని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ విద్యార్థులందరూ కనిపించకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో కొమరిగిరి కరుణ (8వ తరగతి), కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొమరిగిరి పృథ్వీవర్మ (6వ తరగతి), గంధం సతీష్ (8వ తరగతి), మర్రి సంతోష్ (7వ తరగతి), కొమరిగిరి పండు (6వ తరగతి), రామచంద్రపురంలోని ఎయిడెడ్ స్కూల్లో కొమరిగిరి మాధురి (7వ తరగతి) చదువుతున్నారు. ఈ ఆరుగురు విద్యార్థులూ ఈ నెల 24వ తేదీన పాఠశాలలకు యథావిధిగా వెళ్లారు. ఆ తరువాత తిరిగి రాలేదు. అప్పటి నుంచీ పరిసర ప్రాంతాల్లోను, బంధువుల ఇళ్ల వద్ద ఎంత గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ మూకుమ్మడిగా పోలీసు స్టేషన్కు చేరుకుని పరిస్థితి వివరించారు. విద్యార్థులందరూ కూడబలుక్కుని వెళ్లిపోయారా లేక వారిలో ఎవరైనా ప్రభావితం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో ఆ విద్యార్థుల ఫొటోలు ప్రదర్శించడంతో పాటు వివిధ పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్లు ఎస్ఐ అశోక్ చెప్పారు. -
మరీ ఇంత బద్ధకమా?
సాక్షి, హైదరాబాద్: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియలో పోస్టుమెట్రిక్ విద్యార్థులు బద్ధకం వీడడం లేదు. దరఖాస్తు కోసం నెలల తరబడి గడువు ఇచ్చినా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా గడువు తేదీని పలుమార్లు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైంది. ఇంటర్ మొదలు, డిగ్రీ, పీజీ, వృత్తివిద్య, సాంకేతిక విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31లోపు ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. పోస్టుమెట్రిక్ విద్యార్థులు దాదాపు12 లక్షల మంది ఉంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. నాలుగు నెలల పాటు అవకాశం కల్పించినా, సగం మంది విద్యార్థులు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తు గడువును మార్చి 31వరకు పొడిగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఏడు నెలల పాటు అవకాశం కల్పించినా, 10.3 లక్షల మంది మాత్రమే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 1.7లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదని సంక్షేమశాఖలు గుర్తించాయి. కాలేజీ యాజమాన్యాల నుంచి సేకరించిన సమాచారం అధారంగా ఆయా విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు నెలలు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మే 31వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల యాజమాన్యాల ఉదాసీనత పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలో కళాశాల యాజమాన్యాల బాధ్యత కీలకం. విద్యార్థుల దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రత్యేకంగా కాలేజీలో ఒక వ్యక్తిని నియమించి ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయించాలి. ఈ మేరకు సంక్షేమ శాఖలు కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నా, ప్రైవేట్ కాలేజీలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారంతా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సంక్షేమశాఖ అధికారులు తాజాగా కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.దరఖాస్తు ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో వాటి పరిశీలన సైతం ఆలస్యమవుతోందని సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తయితే కాలేజీల వారీగా పరిశీలన ప్రారంభించి వేగవంతంగా మంజూరు చేయవచ్చని సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో నెలకొన్న జాప్యంతో ముందుకు సాగని పరిస్థితి నెలకొందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. మరోవైపు వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో వారికోసమైనా గడువును పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. -
టీచర్లకు ‘ప్రవేశ’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: సమ్మర్లో సర్కారీ టీచర్లకు సరికొత్త పరీక్ష ఉండనుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించే పోటీని ప్రభుత్వం పెట్టబోతోంది. ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం ఇప్పటికే జరిగింది. ఇందులో భాగంగా ప్రతి టీచర్కూ విద్యార్థులను చేర్పించేందుకు టార్గెట్ పెడతారు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించి తీరాల్సి ఉంటుంది. ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ ఇస్తారు. ఇవి వారి సర్విస్ రికార్డులోకి ఎక్కుతాయి. పదోన్నతులు, బదిలీల సమయంలో వీటిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు.ఇక విద్యార్థుల కోసం క్షేత్రస్థాయికి వెళ్ళే టీచర్లకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఊరూరా ప్రచా రం చేపట్టాలని కూడా నిర్ణయించారు. వీటన్నింటికీ సిద్ధమవ్వాలని జిల్లా అధికారులకు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏటా వేసవిలో బడిబాట కార్యక్రమం చేపడుతున్నా..మొక్కుబడిగానే సాగు తోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చేరికలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎందుకు తగ్గుతున్నారు? ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు రానురాను తగ్గుతున్నాయి. 2022–23లో 28.80 లక్షలు చేరితే, 2024–25 నాటికి ఈ సంఖ్య 25.13 లక్షలకు తగ్గింది. అంటే 3.5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారన్న మాట. మరోవైపు ప్రైవేటు స్కూళ్ళలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. 22–23లో 30.17 లక్షల మంది ఉంటే, 24–25లో ఈ సంఖ్య 37 లక్షలకు చేరింది. అంటే దాదాపుగా 7 లక్షలు పెరిగారు. ఈ పరిస్థితిపై విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిది. దీనిపై ముఖ్యమంత్రి అధికారులతో ఇటీవల సమీక్షించారు. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిది.ప్రభుత్వ బడులపై విశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఇందులో టీచర్లూ కీలక పాత్ర పోషించేలా చూడాలని సూచించింది. ఇంకోవైపు ‘ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తోంది. మౌలిక వసతులూ కల్పిస్తున్నాం. ప్రైవేటు కన్నా, ప్రభుత్వ స్కూళ్ళలోనే అర్హత గల టీచర్లున్నారు. అయినా పిల్లలెందుకు చేరడం లేదు?’అని సీఎం అనేకసార్లు విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చేరికలను విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లల చేరికలు పెరిగేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. -
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్కు దిగారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని సీనియర్లు వేధించారు. విద్యార్థిపై బెల్ట్తో ముగ్గురు సీనియర్ల దాడి చేశారు. అనంతరం బాధితుడి నుంచి ఫోన్ లాక్కున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధిత విద్యార్థి పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
లండన్: నిరసనకారులకు దీదీ ఝలక్
లండన్: విదేశీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి నిరసన సెగ తాకింది. ఓ కాలేజ్ ఈవెంట్లో మమత ప్రసంగిస్తున్న టైంలో టీఎంసీ వ్యతిరేక నినాదాలతో అడ్డుపడ్డారు. అయితే వాళ్లకు అంతే ధీటుగా ఆమె సమాధానం ఇవ్వడంతో అక్కడి హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.గురువారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University)లోని కెల్లాగ్ కళాశాలలో బెంగాల్ పారిశ్రామికీరణ అంశంపై ఆమె ప్రసంగించారు. ఆ టైంలో కొందరు ఫ్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆమె ప్రసంగానికి అడ్డు పడ్డారు. ఆ ఫ్లకార్డుల మీద బెంగాల్ ఎన్నికల హింస, ఆర్జీకర్ ఘటన(RG Kar Incident), జాదవ్పూర్ యూనివర్సిటీ ఘటనలకు సంబంధించిన రాతలు ఉన్నాయి. మమత మాట్లాతున్న టైంలో.. టీఎంసీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు వాళ్లు. అయితే.. Mamata Banerjee faces protest at Oxford University, London during speech..SFI-UK held a demonstration in Kellogg College, Oxford against Mamata Banerjee's speech. #MamataBanerjee #UK #OxfordUniversity pic.twitter.com/uJinRxGhT2— Kapadia CP (@Ckant72) March 28, 2025వాళ్లకు ఆమె ధీటుగానే బదులిచ్చారు. ‘‘మీరేం చెప్పదల్చుకున్నారో గట్టిగా చెప్పండి. నాకేం వినిపించడం లేదు. మీరే చెప్పే ప్రతీది వినేందుకు నేను సిద్ధం. ఈ కేసు(ఆర్జీకర్ ఘటన) పెండింగ్లో ఉందని మీకు తెలుసా?. ప్రస్తుతం ఆ అంశం మా చేతుల్లో లేకుండా పోయింది. కేంద్రమే ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది రాజకీయాలకు వేదిక కాదు. మీ రాజకీయాలు ఇక్కడ కాదు. దమ్ముంటే మా రాష్ట్రానికి వచ్చి నాతో రాజకీయం చేయండి’’ అని సవాల్ విసిరారామె. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా కంగుతిన్నారు. నిరసకారుల్లో ఓ విద్యార్థిని ఉద్దేశించి.. ‘‘చూడు తమ్ముడూ.. అబద్ధాలు చెప్పకు. నీ మీద నాకు సానుభూతి ఉంది. కాకుంటే ఇక్కడ రాజకీయాలు చేసే బదులు బెంగాల్కు వెళ్లి మీ పార్టీని బలోపేతం చేసుకోండి. అప్పుడే వాళ్లు మాతో తలపడగలరు’’ అని అన్నారామె. ఆ మాటలతో వాళ్లు మరింత రెచ్చిపోయారు. దీంతో ఆమె మరోసారి స్పందిచాల్సి వచ్చింది. ‘‘నన్ను అవమానించడం ద్వారా మీ విద్యా సంస్థను మీరే అగౌరవపర్చుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చింది దేశం తరఫున ప్రతినిధిగా. దయచేసి మీ దేశాన్ని మీరే అవమానించకండి.’’ అన్నారు. #Breaking: WB CM #MamataBanerjee’s speech at Kellogg College, University of Oxford interrupted by questions on Abhaya/RG Kar case. Mamata Banerjee says, “This matter is sub judice, this case is with the central government. Do not do politics here, this platform is not for… pic.twitter.com/fwPYYYHPsW— Pooja Mehta (@pooja_news) March 27, 2025మమత మాటలతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ఆ టైంలో సభలో ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ.. ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రొత్సాహాం నన్ను మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చేలా చేసింది. దీదీ.. ఎవరినీ పట్టించుకోదు. దీదీ ఓ రాయల్ బెంగాల్ టైగర్. ఒకవేళ పట్టుకోవాలనుకుంటే.. పట్టుకోండి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఆపై నిర్వాహకులు, అక్కడున్న ఆడియొన్స్ సూచన మేరకు నిరసనకారులు బయటకు వెళ్లిపోగా.. దీదీ ప్రసంగం కొనసాగింది. ఆ టైంలో వేదికపై క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ కూడా ఉన్నారు. চিত্ত যেথা ভয়শূন্য, উচ্চ যেথা শিরShe doesn’t flinch. She doesn’t falter. The more you heckle, the fiercer she roars. Smt. @MamataOfficial is a Royal Bengal Tiger!#DidiAtOxford pic.twitter.com/uqrck6sjFd— All India Trinamool Congress (@AITCofficial) March 27, 2025 -
'పరీక్షల్లో' ప్రభుత్వం ఫెయిల్
సాక్షి, అమరావతి: ఇప్పటికే విద్యారంగ సంస్కరణలను నీరుగార్చి, చదువులను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు.. పరీక్షల వ్యవస్థను సైతం మూడు లీకులు.. ఆరు మాస్ కాపీయింగ్ల స్థాయికి దిగజార్చేసింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన నిర్వాకాలే దీనికి నిదర్శనం. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కష్టపడి చదివిన విద్యార్థులు విద్యా వ్యవస్థపైనే నమ్మకం కోల్పోతున్నారని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. కనీసం ప్రశ్న పత్రాల ముద్రణ సరిగా ఉందో లేదో కూడా పరిశీలించకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు. కార్పొరేట్ కాలేజీల సిలబస్కు అనుగుణంగా ప్రశ్నా పత్రాన్ని మార్చేసిన ఘనత కూటమి సర్కారులోనే కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది 10,58,893 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,49,884 మంది టెన్త్ విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలు రాసున్నారు. ప్రభుత్వ నిర్వాకాలు వారి భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏ పరీక్ష అయినా పకడ్బందీగా నిర్వహించారని, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 2022లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ విద్యాసంస్థల నేతృత్వంలో పేపర్ లీక్కు జరిగిన యత్నాలను సమర్థంగా అడ్డుకుని కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా, రికార్డు వేగంతో నిర్వహించి భర్తీ చేసిందని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మళ్లీ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.⇒ మార్చి 17 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసేలా మాస్ కాపీయింగ్ వ్యవహారాలు పలు చోట్ల వెలుగు చూశాయి. ఈనెల 21న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ, బీ కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్కు తెర తీశారు.లీకేజీలకు కేరాఫ్ బాబు పాలనటీడీపీ అధికారంలో ఉండగా 1995లో పదో తరగతి ప్రశ్నపత్రం, 1997లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీకై విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలో పదో తరగతి పేపర్ లీకైంది.పదవతరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల అరెస్ట్, వివరాలను తెలియజేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు టెన్త్ పేపర్ లీక్... 9 మంది అరెస్టుపదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు సంబంధించి వైఎస్సార్ జిల్లా పోలీసులు బుధవారం 9 మందిని ఖాజీపేట మండలం ఏటూరు గ్రామం అల్లాడుపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. వల్లూరు జడ్పీ హైసూ్కల్ కేంద్రంలో ప్రశ్నా పత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేసి చిట్టీలు తయారు చేశారు. వాటర్ బాయ్ సాయి మహేష్ షేర్ చేసేందుకు ఉపయోగించిన సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకున్నారు. కమలాపురం వివేకానంద ప్రైవేట్ స్కూల్ టీచర్ విఘ్నేష్రెడ్డి అలియాస్ విఘ్నేష్, కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి, మాథమేటిక్స్ టీచర్ శ్రీకాంత్రెడ్డి, బీసీ వెల్ఫేర్ గెస్ట్ టీచర్ శ్రావణి, టీచర్ మధుయాదవ్, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెంటెండ్ ఎం.రామకృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్ ఎం.రమణ వీరిలో ఉన్నారు. ప్రశ్నాపత్రం లీక్పై డీఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక్కడ విద్యార్థులకు స్లిప్పులు అందించడం.. పుస్తకాలు ముందుంచి జవాబులు రాస్తూ ఉపాధ్యాయులు పట్టుబడ్డ వ్యవహారం బట్టబయలైంది. దీంతో 11 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు హెచ్ఎంలు, రికార్డు అసిస్టెంట్ సహా మొత్తం 15 మందిని సస్పెండ్ చేశారు. ⇒ వైఎస్సార్ జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నపత్రం లీక్ చేసి వాట్సాప్లో తిప్పారు. ఈనెల 24న ఇక్కడ పదో తరగతి లెక్కల పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా కొద్దిసేపటికే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. స్కూల్లో ఓ వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పని చేస్తున్న వ్యక్తికి పంపినట్లు తేలింది. నిషిద్ధ ప్రాంతంలో వాటర్ బాయ్ వద్ద స్మార్ట్ ఫోన్ లభించడం విస్మయం కలిగిస్తోంది. ఉత్తీర్ణత పెరగాలంటూ ఒత్తిళ్లు..విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అస్తవ్యస్థ నిర్ణయాలతో చదువులను నీరుగార్చిన ప్రభుత్వం పరీక్షల్లో మాత్రం అత్యధికంగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ ఉపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిచ్చింది. ఒకపక్క ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జూన్లో ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్ వరకు సాగదీసింది. అయినా నూరు శాతం పూర్తి చేయలేదు. మరోపక్క ‘అర్జెంట్ రిపోర్టు’ పేరుతో రోజూ మెస్సేజులు పంపుతూ బోధనను గాలికొదిలేసింది. తీరా పరీక్షల నాటికి ఫలితాల కోసం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటూ టీచర్ల మెడపై కత్తి వేలాడదీసింది! మీరు ఏం చేసినా సరే.. గతంలో కంటే ఎక్కువగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ హెచ్చరించింది. తన గొప్పల కోసం పాస్ శాతం పెరగాలని విద్యాశాఖ మంత్రి ఆదేశిస్తుండగా.. ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ఆయా సబ్జెక్టుల్లో పర్సంటేజ్ పెరగకుంటే నోటీసులు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని స్లిప్పులు రాసే స్థితికి దిగజార్చారు. ఇంటర్ పేపర్లో తప్పులు.. ⇒ మార్చి 5న జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పేపర్లో ముద్రణ తప్పులు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం సృష్టించడంతో విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయారు. 8వ ప్రశ్న కింద ‘అడ్వర్టైజ్మెంట్ చదివి సమాధానాలు రాయాలని ఒక్క మార్కు ప్రశ్నలు ఐదు ఇచ్చారు. అయితే ప్రశ్నలో ఏముందో గుర్తించలేని రీతిలో ముద్రించారు. ఈ విషయాన్ని నెల్లూరులో గుర్తించి ఉన్నతాధికారులకు చేరవేసి సరిదిద్దేసరికి గంట సమయం గడిచిపోయింది. దీంతో కొన్ని చోట్ల బోర్డుపై రాయగా మరికొన్ని చోట్ల ప్రశ్నపత్రంలోని అంశాలను ఇని్వజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు. 13వ ప్రశ్న కూడా గందరగోళంగా ముద్రించడంతో విద్యార్థులు మొత్తం పది మార్కులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. ⇒ 15వ తేదీన సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్లో 14వ ప్రశ్న అకడమిక్ సిలబస్ నుంచి ఇవ్వగా విద్యార్థులు జవాబులు రాశారు. తీరా గంట గడిచిన తర్వాత ప్రశ్నలో తప్పుందంటూ మార్పు చేశారు. ఓ కార్పొరేట్ కాలేజీ ముద్రించుకున్న సిలబస్కు అనుగుణంగా దీన్ని మార్చినట్లు తెలిసింది. ⇒ మార్చి 11న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలోని పెనుమాక జూనియర్ కాలేజీలో ఓ ప్రైవేట్ కాలేజీకి మేలు చేసేలా మాస్ కాపీయింగ్ జరిగింది. 180 మంది విద్యార్థులకు ఇక్కడ సెంటర్ కేటాయించారు. ఇంటర్ రెండో ఏడాది గణితం, జువాలజీ, చరిత్ర పరీక్షలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఇక్కడ మాస్ కాపీయింగ్ ప్రారంభమైంది. ఈ ఘటన తాడేపల్లిలోని మంత్రి నివాసానికి కూతవేటు దూరంలో చోటు చేసుకోవడంతో రహస్యంగా ఉంచారు. సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, ఇని్వజిలేటర్లను మార్చి చేతులు దులుపుకొన్నారు. ⇒ ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అరగంట ఆలస్యంగా పేపర్ ఇవ్వగా ఎలాంటి అదనపు సమయం ఇవ్వకుండా నిర్దిష్ట సమయానికే తిరిగి తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దీన్ని ఇంటర్ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. సెల్ఫ్ సెంటర్లు...నిబంధనల ప్రకారం విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్ష సెంటర్ కేటాయించకూడదు. కానీ ఈ దఫా ఇంటర్ పరీక్షల్లో 1,535 సెంటర్లలో దాదాపు 300 సెల్ఫ్ సెంటర్లే ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు సైతం 800కిపైగా సెల్ఫ్ సెంటర్లే ఉండటం, వీటిలో అత్యధికం కార్పొరేట్ స్కూళ్లే కావడం గమనార్హం. -
విశాఖ బీచ్రోడ్డులో యువతతో కలిసి వైద్యురాలు స్టెప్పులు (ఫొటోలు)
-
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్ఫోర్స్
న్యూఢిల్లీ: ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా దృష్టిపెట్టింది. రెండేళ్ల క్రితం ఐఐటీ(ఢిల్లీ)లో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ల ధర్మాసనం సోమవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఆత్మహత్యల అంశంలో దర్యాప్తు చేయాలని సూచిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ వేర్వేరు ఉన్నతవిద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలచివేస్తున్నాయి. విద్యార్థులు తనవు చాలిస్తూ తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్న ఉదంతాలకు చరమగీతం పాడాల్సిందే. విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకోకుండా నివారించే సమగ్ర, విస్తృతస్థాయి, స్పందనా వ్యవస్థలను బలోపేతం చేయాలి. ప్రైవేట్ కాలేజీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే చట్టపరమైన, సంస్థాగతమైన వ్యవస్థ సమర్థంగా లేదు. ఒకవేళ ఉన్నా అందులో అసమానతలు ఎక్కువయ్యాయి. విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా నివారించే నివారణ వ్యవస్థ కావాలి. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవీంద్రభట్ సారథ్యంలో నేషనల్ టాస్క్ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నాం. ఇందులో రాష్ట్రాల ఉన్నతవిద్య, సామాజిక న్యాయం, సాధికారత, న్యాయ, మహిళ, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల గుర్తింపు, ఆత్మహత్యల నివారణకు సంబంధించి నియమనిబంధనల పటిష్ట అమలుపై ఎన్టీఎఫ్ ఒక సమగ్ర నివేదికను రూపొందించనుంది. ఈ నివేదిక తుది రూపు కోసం ఎన్టీఎఫ్ దేశంలోని ఎలాంటి ఉన్నత విద్యాసంస్థలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. ప్రస్తుత నిబంధనలకు తోడు అదనపు సిఫార్సులు చేసే అధికారమూ ఎన్టీఎఫ్కు ఉంది’’అని సుప్రీంకోర్టు పేర్కొంది.4 నెలల్లో మధ్యంతర నివేదికఎన్టీఎఫ్ తమ మధ్యంతర నివేదికను నాలుగు నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. 8 నెలల్లోపు సమగ్ర నివేదికను సమర్పించాలి. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు మరణిస్తే ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ హైకోర్టు గతేదాడి జనవరిలో నిరాకరించిన నేపథ్యంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాజాగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. 2018 నుంచి 2023 ఏడాది వరకు ఉన్నతవిద్యాసంస్థల్లో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి 2023లో ప్రకటించడం తెల్సిందే. ఈకాలంలో ఐఐటీల్లో 39, ఎన్ఐటీల్లో 25, కేంద్రీయ వర్సిటీల్లో 25, ఐఐఎంలలో నలుగురు, ఐఐఎస్ఈఆర్లలో ముగ్గురు, ఐఐఐటీల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
కర్నూల్ హాస్టల్ లో దారుణం.. చిన్న పిల్లలనే కనికరం లేకుండా
కర్నూల్: జిల్లాలోని కోడుమూరు ఎస్సీ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న పిల్లలు అని చూడకుండా ఏడో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులపై పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి విచక్షణా రహితంగా విరుచుకుపడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.తన బెల్టు తీసుకుని ఆ విద్యార్థులను చితకబాదాడు. తన మాట వినలేదని చెప్పి ఏడో తరగతి విద్యార్థులను దారుణంగా కొట్టాడు. దాడికి పాల్పడ్డ పదో తరగతి విద్యార్థి అనధికారంగా హాస్టల్ ఉంటున్నట్లు తెలుస్తోంది. -
విదేశీ విద్యార్థులకు షాక్ ఇస్తున్న అమెరికా
-
వైఎస్ ఇచ్చిన వరం.. మా బతుకు బంగారం
నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను ప్రభుత్వమే అందించి వారి కుటుంబాల్లో మార్పు తీసుకురావాలనే సత్సంకల్పంతో 2008లో వైఎస్ ఈ ట్రిపుల్ ఐటీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనాటి ఉమ్మడి కృష్ణాజిల్లా.. ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. అప్పట్లో ఇక్కడ చదువుకున్న మొదటి బ్యాచ్ (2008–14) విద్యార్థుల సమ్మేళనం శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాచ్ విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. 400 మంది విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను స్థాపించి ఉండకపోతే తమ భవిష్యత్తు సాదాసీదాగానే ఉండేదని, తమ జీవితాలు ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి పూర్వం, ట్రిపుల్ ఐటీ తరువాత అన్నట్లుగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు. ట్రిపుల్ ఐటీలవల్లే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. పలువురు విద్యార్థుల భావాలు వారి మాటల్లోనే.. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది 2008లో ట్రిపుల్ ఐటీలో చేరి ఈసీఈ బ్రాంచితో ఇంజనీరింగ్ పూర్తిచేశా. మా నాన్న సన్నకారు రైతు, రైతు కూలీ. చదువు పూర్తవగానే సెమీ కండక్టర్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఏఆర్ఎం సెమీ కండక్టర్స్ కంపెనీలో జాబ్చేస్తున్నా. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది. ట్రిపుల్ ఐటీవల్లే ఈ స్థాయిలో ఉన్నా. – నుగ్గు ఆదినారాయణ, గొల్లపల్లి, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్గా.. అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఏడాదికి రూ.36 లక్షల వేతనం వస్తోంది. ఈసీఈ చదివాక ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం ట్రిపుల్ ఐటీనే. వీటిని స్థాపించకపోయి ఉంటే సాదాసీదా చదువులు చదివేవాడిని. ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పిన వైఎస్ రాజశేఖరరెడ్డికి సెల్యూట్. – పక్కి కార్తీక్, గజపతినగరం, విజయనగరం జిల్లా ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది.. వైఎస్ రాజశేఖర్రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదువుకోవడంవల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ప్రస్తుతం ఇన్ఫర్మేటికల్ సంస్థలో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా. ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది. మా నాన్న రైతు కూలీగా పనిచేస్తూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీ లేకపోతే నేను మా ఊరిలోనే ఉండేవాడినేమో. – పప్పల సురేష్, గోరింట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా హెచ్పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్గా.. నా సొంతూరు విశాఖపట్నంలోని గాజువాక. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి బ్యాచ్లో నేను కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఆ తరువాత విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నా. మా నాన్న లారీ డ్రైవర్గా పనిచేసేవారు. ట్రిపుల్ ఐటీ అనేది లేకపోతే మేం లేం. ట్రిపుల్ ఐటీ అనేది మా జీవితంలో భాగమైంది. – భీశెట్టి గోపి, మేనేజర్, విశాఖ రిఫైనరీ, విశాఖపట్నం ఏడాదికి రూ.36 లక్షల వేతనం ట్రిపుల్ ఐటీ లేకపోతే చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడిని. ఈసీఈ చదివి ప్రస్తుతం ఒడెస్సా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా చేస్తున్నా. వేతనం ఏడాదికి రూ.36 లక్షలు వస్తోంది. మా నాన్న ప్రైవేటు టీచర్గా పనిచేసేవారు. ఇంజనీరింగ్ చేసిన తరువాత ఐఐఎం ఇండోర్లో ఎంబీఏ చదివి ఆ తరువాత ఉద్యోగంలో చేరా. – నంబూరు మధుబాబు, చల్లవానిపేట, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇస్రోలో సైంటిస్ట్గా విధులు నిర్వహిస్తున్నా..ప్రస్తుతం నేను తిరువనంతపురంలో ఇస్రోకు చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్–ఈ కేడర్లో పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీలో ఈసీఈ పూర్తిచేసి రగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశా. ఆ తరువాత ఇస్రోలో చేరా. ఆరేళ్లపాటు ట్రిపుల్ ఐటీలో మా భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. – కారుమూరి వంశీ, దేవరపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్టార్టప్ ప్రారంభించా.. మా నాన్న సన్నకారు రైతు. వ్యవసాయ కూలి పనులకూ వెళ్లేవాడు. ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ తరువాత ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేశా. తర్వాత ఏడాదికి రూ.45 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ జాబ్ చేశా. ప్రస్తుతం స్టార్టప్ ప్రారంభించా. వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ట్రిపుల్ ఐటీలు లేకపోతే మా కుటుంబ ఆరి్థక పరిస్థితికి పాలిటెక్నిక్ గాని, డిగ్రీ గాని మాత్రమే చదివేవాడిని. – పరిటాల శివాజీ, కారంపూడి, గుంటూరు జిల్లా రియాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ట్రిపుల్ ఐటీ లేకపోతే స్థానికంగా ఏదోక కాలేజీలో డిగ్రీ చదివి ఉండేవాడిని. ప్రస్తుతం టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో సౌదీలోని రియాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఏడాదికి రూ.72 లక్షల వేతనంతో పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు. మా అందరికీ లైఫ్ ఇచ్చారు. – సంజయ్ఖాన్, ఖాజీపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా చేస్తున్నా.. ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీలో రూ.30 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా చేస్తున్నా. ఇక్కడ ఆరేళ్ల పాటు చదవడం ఒక రకంగా స్వర్ణయుగం. ట్రిపుల్ ఐటీలో చదవడం వరం. ఇలాంటి విద్యాసంస్థను ఏర్పాటుచేయడం గొప్ప విషయం. – పసుపురెడ్డి వివేక్, హరిపురం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది.. మా నాన్న మోటార్ మెకానిక్. ట్రిపుల్ ఐటీలో సీఎస్ఈ చదివా. ఆ తరువాత కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తిచేశా. కొంతకాలం టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశా. ఆ తరువాత 2018 నుంచి గుంటూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎస్ఈ లెక్చరర్గా పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది. – గజ్జా ప్రణయని, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా -
రంగంలోకి అంగడి చదువు!
పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. చదువుకుంటున్న వారి పిల్లలు కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులను అనుసరించవలసి వస్తున్నది. వారిలో పదో తరగతి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వలస కారణంగా వారు కీలకమైన పదో క్లాసు పరీక్షలకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు గురించి వ్యవస్థ పట్టించు కోనట్టయితే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉన్నది. వారి భావి జీవితం వలసకూలి టైటిల్తో ముడిపడే ప్రమాదం ఉన్నది.‘‘ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు... ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’’ అంటాడు కవి బాలగంగాధర తిలక్. నిజంగా ప్రజల ఆలనాపాలనా చూడవలసిన ఏపీ సర్కార్కు మాత్రం అటువంటి సెంటిమెంట్లేవీ లేవు. ఇప్పుడు ఒక్క కన్నీటి బొట్టు రాలడం కాదు. మూర్తీభవించిన కన్నీరు దారిపొడుగునా ప్రవహిస్తున్నది. ‘‘జగన్ సర్కార్ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మా పిల్లలు తప్పకుండా పదో తరగతి పరీక్ష రాసేవార’’ని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన సార్వత్రిక విద్యను అమలు చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతగా మేధామథనం జరిపి పథకాన్ని రూపొందించి ఉంటారో ఈ విషాద పరిణామాన్ని చూస్తే అర్థమవు తున్నది.మన దేశంలో విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నది. అటు వంటి చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగం కూడా ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఇది మొక్కుబడి తతంగంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడికి వచ్చే పిల్లలకు అరకొర చదువు చెప్పడం ప్రభుత్వ స్కూళ్ల కర్తవ్యంగా మారి పోయింది. ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ఈ ధోరణి ఫలితంగా తామరతంపరగా ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టుకొచ్చాయి. స్థోమత ఉన్నవాళ్లంతా ప్రైవేట్ స్కూళ్లలో మెరుగైన విద్యను కొనుగోలు చేయడం, పేద పిల్లలు సర్కారు బడి చదువులతో పోటీలో నిలవలేకపోవడం... గత మూడు దశాబ్దాలుగా బాగా ఎక్కువైంది. ఈ ధోరణి పట్ల పలువురు ప్రగతిశీల సామాజిక వేత్తలు, మేధావులు అసహనాన్నీ, ఆందోళననూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఐక్యరాజ్య సమితి సైతం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీలు) పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా సమా నంగా అందుబాటులో ఉండాలని నాలుగో లక్ష్యంగా నిర్దేశించింది. మన్నికైన జీవన ప్రమాణాలతో మానవజాతి దీర్ఘకాలం పాటు ఈ భూగోళంపై మనుగడ సాగించాలంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అవసరమేనని మేధాప్రపంచం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. కానీ పాలకుల్లో చిత్త శుద్ధి లేకపోవడం ఈ లక్ష్యాలకు ఆటంకంగా మారింది. ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా ‘ప్లుటానమీ’ (సంపన్నులు శాసించే వ్యవస్థలు)లుగా పరివర్తనం చెందుతున్నాయని పలు వురు పొలిటకల్ ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద్ద కాలానికి ఈ పదప్రయోగం వ్యాప్తిలోకి వచ్చింది.సంస్కరణలు ప్రారంభమైన తొలి దశాబ్దిలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదనే వాదాన్ని ఆయన బలంగా వినిపించేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ డిమాండ్ను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమలుచేసిన తర్వాత ఈ అంశానికి సర్వత్రా ఆమోదం లభించింది. అలాగే ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే నియమం పెట్టింది కూడా చంద్రబాబే! మితిమీరిన ప్రైవేటీకరణ సూపర్ రిచ్ వర్గాన్ని సృష్టించడం, తిరిగి ఆ వర్గం మొత్తం ఆర్థిక – రాజకీయ వ్యవస్థలను ప్రభా వితం చేయడం ప్లుటానమీకి దారి తీస్తున్నది.ఇటువంటి వ్యవస్థల్లో సహజ వనరుల దగ్గ ర్నుంచి సర్వే సర్వత్రా ప్రైవేటీకరణే తారకమంత్రంగా పనిచేస్తుంది. విద్యారంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాద’ని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేసుకోవడం అవసరం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసు కుంటేనే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఎందుకనుకుంటున్నారో అర్థమవుతుంది. అమరావతి కోసం అరవై వేల కోట్ల రూపాయల అప్పును ఆగమేఘాల మీద పుట్టించగలిగిన వ్యక్తి, తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ‘తల్లికి వందనం’ ఎందుకు అమలుచేయలేకపోయాడో అర్థమవుతుంది. ఈ పూర్వరంగం అర్థం కానట్లయితే ఆర్థిక వెసులుబాటు లేకనే అమలు చేయలేకపోయారనే మోసపు ప్రచారానికి తలూప వలసి వస్తుంది.విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రజాస్వామికీకరణ చర్య లను చేపట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించింది. భాషా – సంస్కృతుల ముసుగులో పెత్తందారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చలించలేదు. సీబీఎస్ఈ సిలబస్ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. నగరాల్లో సూపర్ రిచ్ పిల్లలకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్ను పిల్లలందరికీ ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అమలుచేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. అంతర్జా తీయ స్థాయిలో మన పిల్లలు పోటీపడాలన్న తపనతో చేపట్టిన కార్యక్రమాలివి. డిజిటల్ యుగంలో తన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని పాఠశాలల్లో డిజిటల్ బోర్డు లను ఏర్పాటు చేయించారు. ఎనిమిదో క్లాసు నుంచి విద్యార్థుల చేతికి ట్యాబ్లను ఉచితంగా అందజేశారు.పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని తయారు చేయించిన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులపై పైసా భారం పడకుండా పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్లను పాఠశాలల ప్రారంభానికి ముందే సిద్ధం చేసి ఉంచేవారు. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులూ ఏకోపాధ్యా యుడే బోధించే పద్ధతికి స్వస్తిచెప్పి వారికి సబ్జెక్టు వారీగా బోధించే టీచర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ మూడు తరగతులను కిలోమీటర్ పరిధి లోపల ఉండే అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేశారు. ఫలితంగా ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సదుపాయం ఏర్పడింది. ఆ వయసు పిల్లల్లో గ్రాహ్యశక్తి బలంగా ఉంటుందన్న అధ్యయనాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్ కోతకు గురైనప్పటికీ పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు జగన్ తెరతీశారు.పేద – ధనిక తేడాల్లేని, లింగవివక్ష అసలే లేని ఒక నవ యుగ విద్యాసౌధ నిర్మాణం కోసం ఇన్ని ఇటుకల్ని పేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ పునర్నిర్మాణా నికి ఇంత వేగంగా అడుగులు వేసిన వ్యక్తి కూడా మరొకరు కాన రారు. కేరళ రాష్ట్ర విద్యారంగం మొదటి నుంచీ కూడా మిగతా దేశంతో పోల్చితే ఆరోగ్యంగానే ఉన్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా అది తన ప్రతిష్ఠను కాపాడుకోగలిగింది.చదువుల తల్లి సరస్వతిని అమ్ముకోవడం తరతరాలుగా మన సంస్కృతిలో తప్పుగానే భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్ర భాగవతం కర్త బమ్మెర పోతనామాత్యులే ఉదాహరణ. ‘‘బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల / కౌద్దాలికు లైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై’’ అన్నారు. తాను రాసిన కావ్యాన్ని సరస్వతిగా భావించి, దాన్ని రాజులకు అంకిత మివ్వడానికి ఆయన నిరాకరించారు. అలా వచ్చిన సొమ్ము పడుపువృత్తితో వచ్చిన సొమ్ముగా ఆయన అసహ్యించుకున్నారు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు చదువుల తల్లిని అంగట్లో నిలబెట్టి అమ్ముకుంటున్నారు. దానికి మనం ఎన్ను కున్న ఏలికలు వత్తాసుగా నిలబడుతున్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను విడిచిపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేరారు. ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం రద్దవుతుందన్న భయం ఒక కారణం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద డబ్బులొస్తా్తయనే నమ్మకం కూడా ఇంకో కారణం కావచ్చు. అట్లా మారిన విద్యార్థులు ఇప్పుడు ఫీజులు కట్టలేక అల్లాడు తున్నారు. ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేస్తారనే ప్రచారం, సీబీఎస్ఈ సిలబస్ను ఎత్తేయడం దేన్ని సూచిస్తున్నాయి? ఎని మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లలో కొత్త కంటెంట్ లోడ్ చేయలేదు. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద దాదాపు ఇరవై వేల స్కూళ్లలో సౌకర్యాలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా జగన్ ప్రభుత్వం మెరుగుపరిచింది. మిగిలిన స్కూళ్లలో ఆ కార్యక్ర మాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత చాలాచోట్ల నాసిరకంగా మారింది. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను ఎత్తేస్తారట! ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఏర్పడ్డ నమ్మకాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టు కున్నట్టు కనిపిస్తున్నది. మరోపక్క పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు అనుమతులిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మెడికల్ కాలేజీల సంగతి తెలిసిందే! మరోసారి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రైవేట్ జేగంట మోగుతున్నది. అంగడి చదువులు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. విద్యా విప్లవానికి గ్రహణం పట్టింది. ఈ ప్రభుత్వం మారితేనే గ్రహణం విడిచేది!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బతుకే ‘పరీక్ష’
మంత్రాలయం: బతుకుదెరువులో భాగంగా ఎంతో మంది పదవ తరగతి విద్యార్థులు పేదరికంతో పరీక్షలకు దూరమై చదువులకు వీడ్కోలు పలుకుతున్నారు. పనికోసం వలస (సుగ్గి) బాటలోనే విలువైన జీవితాలను పణంగా పెడుతున్నారు. తల్లిదండ్రులకు చదివించుకోవాలన్న ఆశ ఉన్నా, పేదరికం శాపంగా మారింది. పూట గడవని జీవులకు బతుకే ఓ పోరాటమైంది.జీవితమే ఓ పరీక్షగా మారింది. ఇదివరకెన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడం గమనార్హం. విద్యార్థులు చదువులకు దూరమవుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పేద కుటుంబాల విద్యార్థుల చదువులకు భరోసా ఇవ్వకుండా వేడుక చూస్తోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ ఏడాది 32,130 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.అందులో మొదటి రోజు తెలుగు, ఉర్దూ, కన్నడ సబ్జెక్టు పరీక్షలకు 700 మంది గైర్హాజరయ్యారు. వీరిలో మంత్రాలయం నియోజకవర్గం వారు 79 మంది, ఆదోనివారు 37 మంది ఉన్నారు. కోసిగి మండలం చింతకుంటకు చెందిన చిన్నారి పరీక్షకు హాజరు కాలేదన్న విషయం ఓ పత్రికలో చదివి తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి లోకేశ్.. సదరు చిన్నారిని గురువారం స్వగ్రామానికి పంపారు.రెండు సబ్జెక్టుల పరీక్షలు ముగిసిన తర్వాత ఆమెను ఇంటికి రప్పించారు. ఈ బాలిక మిగతా పరీక్షలకు హాజరైనా, మొదటి రెండు పరీక్షల్లో ఫెయిల్ కాకతప్పదు. ఇలాంటి విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. మరి వారందరి పరిస్థితి ఏమిటన్నది మంత్రి లోకేశ్ సెలవివ్వాలి. పేపర్లో వస్తేనే స్పందించే బదులు తొలుతే అందరూ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుని ఉంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రెండు సబ్జెక్టులకు దూరమైన చిన్నారి ⇒ ఈ విద్యార్థిని పేరు సన్నక్కి చిన్నారి. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన మారయ్య, కమలమ్మ దంపతుల రెండవ కుమార్తె. కోసిగి బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదవుతోంది. గుంటూరు జిల్లా కేంద్రం సమీపంలో మిరప కోతలకు తల్లిదండ్రులతోపాటు జనవరిలో వెళ్లింది.చిన్నారి కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు. కూలికి వెళితేనే నాలుగు మెతుకులు. ఈసారి కూలి పనులు లేకపోవడంతో మారయ్య ఇంటిల్లిపాది పని కోసం వలస పట్టారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనా చిన్నారిని మాత్రం పరీక్షలకు పంపలేదు. తోటి వారు వారించడంతో రెండు సబ్జెక్టుల పరీక్షలు అయిపోయాక తల్లి చిన్నారిని వెంటబెట్టుకుని ఊరు చేరుకుంది.వీరేంద్ర పరీక్షకు తండ్రి జబ్బు శాపం ⇒ ఈ ఫొటోలోని విద్యార్థి పేరు వీరేంద్ర. మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన భీమయ్య, ఉసేనమ్మ కుమారుడు. ప్రస్తుతం ఈ విద్యార్థి తండ్రికి జబ్బు చేసి స్వగ్రామంలోనే ఉండిపోగా.. తల్లితోపాటు వీరేంద్ర పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని గడితండా గ్రామంలో మిరప కోతలకు వెళాడు.పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తానని వీరేంద్ర మొర పెట్టుకున్నా, అమ్మ ఒప్పుకోలేదు. నాన్న అనారోగ్యంగా ఉండటంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని, పైగా పోయిన సంవత్సరాల్లాగా అమ్మ ఒడి కూడా రాలేదని వీరేంద్రను వారించడంతో మనసు చంపుకొని పనికి వెళ్లాడు. రెండు నెలలుగా అక్కడే పనులు చేసుకుంటున్నారు.పూట గడవని మాకు పరీక్షలెందుకని?⇒ ఈ ఫొటోలోని భార్యాభర్తల పేర్లు సులువాయి నరసింహులు, నీలమ్మ. వీరిది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని పల్లెపాడు గ్రామం. పచ్చ రంగు చొక్కా ధరించిన బాలుడు ఉరకుందు పదవ తరగతి, క్రీం కలర్ షర్టు ధరించిన బాలుడు వీరేంద్ర ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు సబ్జెక్టులు పూర్తయ్యాయి.బతుకుదెరువు కోసం తల్లిదండ్రులతోపాటు ఉరుకుందు సుగ్గి (పని కోసం వలస)కి వెళ్లడంతో పరీక్షలకు హాజరు కాలేదు. పూట గడవని తమకు పరీక్షలు ఎందుకనుకున్నారేమో తల్లిదండ్రులు పిల్లలను సైతం తమ వెంట తీసుకొని ప్రకాశం జిల్లా పురిమెట్లలో మిరప కోతలకు వెళ్లారు. తల్లిదండ్రుల పేదరికం ఈ విద్యార్థికి శాపంగా మారడం విచారకరం. వీరికి ఎకరా భూమి ఉంది. వానొస్తేనే పొలంలో కాసింత పచ్చదనం కనిపిస్తుది. లేదంటే బీడుగా వదిలేసి సుగ్గి బాట పట్టాల్సిందే.తల్లికి వందనం లేనందునే..ఇలా ఒక్క పదవ తరగతి విద్యార్థులే కాదు.. ఇతర తరగతులు చదివే విద్యార్థుల్లో చాలా మంది వలస వెళ్లారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 16 వేల మంది వరకు విద్యార్థులు వలస వెళ్లినట్లు అంచనా. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం అమలుతో విద్యార్థులు వలస వెళ్లిన దాఖలాలు చాలా తక్కువ.ఈసారి మాత్రం తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లడం గమనార్హం. తల్లికి వందనం పథకం అమలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని స్థానికులు వాపోతున్నారు. అంతేగాక సీజనల్ హాస్టళ్ల ఏర్పాటులోనూ కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం కూడా వలసలకు ఓ కారణం.నాగలక్ష్మికి పేదరికమే అడ్డు⇒ ఈ అమ్మాయి పేరు నాగలక్ష్మి. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన లింగమ్మ, భీమేష్ దంపతుల కుమార్తె. నాగలక్ష్మి తల్లితోపాటు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రం సమీపంలో మిరప కోతల్లో ఉండిపోయింది. మూడు నెలలుగా అక్కడ పొలం పనులకు వెళ్తోంది. ఈ బాలిక పెద్దకడబూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. పబ్లిక్ పరీక్ష రాసేందుకు సైతం హాజరు కాలేదు. సెంటు భూమి లేని నాగలక్ష్మి కుటుంబానికి కూలి పనులే శరణ్యం. గ్రామంలో పనులు ముగియడంతో తల్లితో కలిసి వలస వెళ్లడం గమనార్హం. -
నంద్యాల జిల్లాలో కీచక టీచర్
-
‘యువిక’.. భావి శాస్త్రవేత్తలకు వేదిక
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): అంతరిక్ష పరిశోధనలపై మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వారిని ప్రత్యేకంగా తమ ప్రాంగణాలకు ఆహ్వానించి నూతన ఆవిష్కరణలపై ఉత్సాహాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఈ విధమైన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఇస్రో పిలుపునిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో 100 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పలు పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. యువిక లక్ష్యాలు ఇవీ.. » భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం» విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం» అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడంఎవరు అర్హులంటే...ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు, ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇస్రో ప్రాధాన్యతనిస్తోంది. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2–10%, ఆన్లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10% వెయిటేజీ ఇవ్వనుంది. ఎన్సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5%, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 15% ప్రాధాన్యం ఇవ్వనుంది. పరీక్ష ఎక్కడంటే...ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 7 కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ). దరఖాస్తు ఇలా చేసుకోవాలి..నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. మొదటగా ఈ–మెయిల్ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తరువాత ‘యువికా’ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. మూడేళ్లలో వివిధ అంశాల్లో విద్యార్థి సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఏవైనా ఉంటే, వాటి జెరాక్స్ కాపీలపై విద్యార్థి సంతకం చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23 వరకు అవకాశముంది. ఎంపిక జాబితాను 2 విడతల్లో ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. యువికా శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటుగా అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది.కార్యక్రమం షెడ్యూల్ ఇలా..వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7నాటికి వడపోసి ఎంపికైన విద్యార్థుల జాబితాలను ఇస్రో విడుదల చేస్తుంది. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తుంది. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడుతోంది. మే 31న ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తుంది. ఎంపికైన విద్యార్థులను మే లో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తుంది. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తుంది. వారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి వారికి విజ్ఞానాన్ని అందిస్తారు.విద్యార్థులకు మంచి అవకాశం విద్యార్థులకు ఇస్రో వంటి సంస్థను సందర్శించటం, ఆయా పరిశోధనలపై అవగాహన పెంచుకోవటానికి ఇది మంచి అవకాశం. భావి శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతోన్న యువికా కార్యక్రమాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈవోలు, ఎంఈవోలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లాఅవగాహన కల్పిస్తున్నాం యువికాలో పాల్గొనేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబిషన్లు, పోటీ పరీక్షల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదేస్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ మైనం హుస్సేన్, జిల్లా సైన్స్ అధికారి -
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి లాంగ్వేజ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గాను 6,16,451 మంది(98.27 శాతం) హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. 1,545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో కాపీయింగ్కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు వెల్లడించారు.కాంపోజిట్కు బదులు జనరల్ పేపర్ రాసిన విద్యార్థిని!తెనాలిఅర్బన్ : పదో తరగతి పరీక్షల్లో అపశృతి దొర్లింది. కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సిన విద్యార్థిని జనరల్ తెలుగు పేపరు రాసింది. విద్యాశాఖ అధికారుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎంహెచ్ స్కూ ల్లో కే ధనశ్రీ ³దో తరగతి పరీక్షలు రాసేందుకు సోమవారం పాఠశాలకు వచ్చింది.ఆమె కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఇన్విజిలేటర్ పొరపాటున జనరల్ తెలుగు పేపరు ఇచ్చారు. విద్యార్థిని కూడా సకాలంలో గుర్తించకుండా పరీక్ష రాసేసింది. చివరి సమయంలో గుర్తించి.. విషయాన్ని ఇన్విజిలేటర్కు తెలియజేసింది. అప్పటికే సమయం మించిపోవడంతో చేసేది లేక ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి.. రాసిన పేపరును పరిగణనలోకి తీసుకునేలా చూస్తామని ఇన్విజిలేటర్ చెప్పారు. దీనిపై విచారణ జరిపిన డీఈవో సీవీ రేణుక.. ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని డీఈవో ప్రకటించారు. -
హైదరాబాద్ : స్కూల్ ఫెస్ట్లో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)
-
Andhra Pradesh: సర్కారు బడికి తాళం!
రాష్ట్రంలో సర్కారు బడికి తాళం పడుతోంది. గ్రామాల్లో 60 మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం కావడంతో వేలాదిగా పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. మిగిలిన వాటి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇకపై విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. భారీగా స్కూళ్ల సంఖ్యను తగ్గించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మండల విద్యాధికారుల ద్వారా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తోంది. పాఠశాలల కమిటీలను ఒప్పించాల్సిన బాధ్యత టీచర్లపైనే మోపింది. లేదంటే ఎంఈవోలు ప్రత్యక్షంగా కలెక్టర్లకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను నీరుగార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు నిర్వాకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది. పేదింటి తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని దృఢంగా విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏకంగా రూ.72 వేల కోట్లకుపైగా వెచ్చించి ఉత్తమ ఫలితాలను రాబట్టారు. దీంతో మన స్కూళ్ల ప్రతిభ ఐరాస వరకు వినిపించింది. అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, బైజూస్ కంటెంట్తో పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ తరగతులతో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు– నేడు ద్వారా కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దటంతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ నుంచి టోఫెల్, ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం మొదలైంది. ఇప్పుడు వీటన్నిటినీ నీరుగార్చిన టీడీపీ కూటమి సర్కారు స్కూళ్ల మూసివేత దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు పిడుగుపాటులా పరిణమించాయి. సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అక్కసుతో విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి టార్గెట్గా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది! గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విలీనమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 5 కి.మీ పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని చెప్పిన సర్కారు తరువాత ఎంఈవోల ద్వారా మౌఖికంగా 7 కి.మీ. పరిధికి పెంచి ఒత్తిడి పెంచుతోంది. అంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఇక చదువుకునేందుకు దూరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్కి వెళ్లాల్సిందే! లేదంటే ప్రైవేట్ స్కూళ్లే దిక్కు!! మోడల్ స్కూల్ అంటే ఏదో కొత్తది నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్లే! మోడల్ ముసుగులో స్కూళ్లను భారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. 32 వేలకు పైగా పాఠశాలలపై తీవ్ర ప్రభావంఉపాధ్యాయ సమావేశాల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా స్కూళ్ల విలీనానికి రంగం సిద్ధం చేసి మోడల్ స్కూళ్ల పేరుతో ఉన్న పాఠశాలల ప్రాణం తీసేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ ప్రైమరీ పాఠశాలకు మ్యాపింగ్ చేయాలంటూ ఎంఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. విలీనానికి అంగీకరించాల్సిందేని ఒత్తిడి పెంచుతున్నారు. ఈమేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి అంగీకార పత్రాలను తెప్పించాల్సిన బాధ్యత టీచర్లు, ఎంఈవోలకు కేటాయించారు. అలా చేయని వారు కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు. విలీనమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుండటంతో రాష్ట్రంలో వేలాదిగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1 – 5 తరగతులు కొనసాగుతున్న 32,596 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మందికి మించి ఎన్రోల్మెంట్ ఉంది. మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు 60 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే ఈ 83 శాతం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై విలీనం ప్రభావం పడనున్నట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల ఎన్రోల్మెంట్ లేదనే సాకుతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన టీడీపీ సర్కారు.. తాజాగా అస్తవ్యస్థ విధానాలతో పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోంది. దీంతో గ్రామాల్లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం నెలకొంది. ఒక్కో పంచాయతీలో సుమారు మూడు నుంచి నాలుగు ప్రాథమిక పాఠశాలలున్నాయి. పట్టణాల్లో పరిధిని బట్టి 30 వరకు స్కూళ్లున్నాయి. ఏ పాఠశాలలోనైనా 60 కంటే తక్కువ మంది ఉంటే ఐదు కి.మీ దూరంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిందే. 60 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పంచాయతీలో ఉన్న స్కూల్కి మోడల్ స్కూల్గా నామకరణం చేసి అక్కడకు తరలిస్తారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 100కి చేరుకోకుంటే పరిధిని ఏడు కి.మీ.కి పెంచి అమలు చేయాలని అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. విలీనాన్ని గ్రామస్తులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు వ్యతిరేకిస్తుండడంతో ఒప్పించే బాధ్యతను టీచర్లకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (ఫైల్) విలీన ఒత్తిడితో టీచర్ల బెంబేలు ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్ల కమిటీలను ఒప్పించలేక అటు ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ‘ఎస్’ అని ఆమోదం తెలుపుతూ తీర్మానం ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తామంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించడం లేదు. ఒక పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, ఎంపిక చేసిన పాఠశాలలో తరగతులు కలపటాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను ఆదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారుల బెదిరించటాన్ని తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గతంలో ప్రతి పాఠశాలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడు వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని, ఈ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకేనని మండిపడుతున్నారు. -
బాల్యంపై బులీయింగ్ పడగ
‘ఐ వాంట్ టు డై’.. ఐదో తరగతి చదివే ఒక బాలిక తన రెండు నోట్బుక్స్లో రాసుకున్న వాక్యం ఇది. హైదరాబాద్లోని అల్వాల్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఆ బాలిక బాగా పేరొందిన పాఠశాలలో చదువుతోంది. నోట్బుక్స్లో రామకోటి రాసినట్లుగా ‘ఐ వాంట్ టు డై’అంటూ రాసి పేజీలు నింపేసింది. వాటిని చూసి తల్లిదండ్రులుహడలిపోయి, మానసిక వైద్యులను సంప్రదించారు.కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులు సకాలంలో స్పందించకపోతే పాప ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని తెలిపారు. ఆ బాలిక మాత్రమే కాదు.. చాలామంది స్కూల్ పిల్లలు తరగతి గదిలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ఒకరిద్దరు పిల్లలను టార్గెట్ చేసి అనేక రకాలుగా వేధిస్తున్నారు. వారిలోని శారీరక లోపాలను ఎత్తిచూపుతూ ఏడిపిస్తారు. మానసిక వైద్య పరిభాషలో ‘బులీయింగ్’గా పిలిచే ఈ విష సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాలేజీల్లో ర్యాగింగ్ తరహాలో స్కూళ్లలో బులీయింగ్ భూతంపిల్లలను వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ విష సంస్కృతి 1.3 శాతం ఉంటే, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో 35 నుంచి 37 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ బులీయింగ్?ఐ వాంట్ టు డై అని రాసిన బాలిక తోటి విద్యార్థుల కంటే కాస్త లావుగా ఉంటుంది. దాంతో తరగతి గదిలో సహ విద్యార్థులు మొదట్లో ఆటపట్టించేవారు. క్రమంగా అంతా ఒక్కటై ఆమెను ఏకాకిని చేసి ఏడిపించడం మొదలుపెట్టారు. ఈ బులీయింగ్ అంతటితో ఆగలేదు. బాలిక చుట్టూ చేరి జడలు పట్టుకొని లాగుతూ ‘పిగ్టేల్’అంటూ ఏడిపించేవారు. ఈ వేధింపులపై క్లాస్ టీచర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా ఆ బాలికనే తిట్టింది. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ఫిర్యాదును పట్టించుకోలేదు.దీంతో ఆ బాలిక డిప్రెషన్లోకి వెళ్లింది. పైకి చూడ్డానికి ఇది సాధారణంగా ఏడిపించడం (బులీయింగ్)గానే కనిపిస్తుంది. కానీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో కొందరు టీచర్లే బులీయింగ్కు ఆజ్యం పోస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల రంగు, రూపు, ఆకృతి, నడక వంటి శారీరక అంశాలను లక్ష్యంగా చేసుకొని ‘బాడీషెమింగ్’కు పాల్పడుతున్నారు. ఏడేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల టీన్స్ వరకు బులీయింగ్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ఆధిపత్య పెంపకంతరగతిలో ఉన్న పిల్లలంతా ఒకేవిధమైన బులీయింగ్ స్వభావాన్ని కలిగి ఉండరు. వారిలో ఒక్కరో, ఇద్దరో కలిసి మిగతా వాళ్లందరినీ ఒక గ్రూపుగా సంఘటితం చేస్తారు. టార్గెట్ చేసిన బాలిక లేదా బాలుడిని ఏకాకిని చేస్తారు. మిగతా పిల్లలు తమ ప్రమేయం లేకుండానే ఆ జట్టులో చేరి ఏడిపిస్తుంటారు. తరగతిలో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఆ ఒకరిద్దరు పిల్లల ప్రవర్తన మిగతా పిల్లలను ప్రభావితం చేస్తుంది.తోటివారికంటే తామే గొప్పవాళ్లమనే భావన పిల్లల్లో కలగడానికి వారి తల్లిదండ్రుల ఆధిపత్య పెంపకమే (అథారిటేరియన్ పేరెంటింగ్) కారణమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతి గురించి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. బులీయింగ్ను అరికట్టాల్సిన టీచర్లే బాధితులను మరింత ఏకాకులను చేస్తున్నారు.స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఆ రోజు ఎలా గడిచిందనే విషయాన్ని తల్లిదండ్రులు కచి్చతంగా ఆరా తీయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బులీయింగ్కు గురయ్యే పిల్లలు సరిగ్గా తినకపోవడం, మాట్లాడకుండా ఉండిపోవడం, ఇంట్లోనూ ఒంటరిగా గడపడం వంటి లక్షణాలతో బాధపడుతారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. కలిసికట్టుగా ఎదుర్కోవాలి పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండాలి. కానీ కొందరు అందుకు భిన్నంగా డామినేటింగ్ కల్చర్లో పిల్లలను పెంచుతారు. దీంతో సహజంగానే ఆ పిల్లలకు అదే సంస్కృతి అలవడుతుంది. తాము అలా ఏడిపించడం వల్ల తోటి విద్యార్థి మనస్సును గాయపరుస్తున్నామనే భావన ఆ పిల్లల్లో ఏ మాత్రం కనిపించదు. ఒక సర్వే ప్రకారం తరగతి గదిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక విధమైన బులీయింగ్కు గురవుతున్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ యాజమాన్యం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. బులీయింగ్ లక్షణాలు ఏ రూపంలో కనిపించినా అరికట్టాలి. లేకపోతే పిల్లల భావి జీవితాన్ని ఇది కబళిస్తుంది. – డాక్టర్ సంహిత, మానసిక వైద్యనిపుణులు, సికింద్రాబాద్. -
వంట మనిషి ఇంట్లోనే బడి
కేసముద్రం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి ఇల్లే ప్రభుత్వ పాఠశాలగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని బ్రహ్మంగారి తండాలో 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సొంత భవ నం లేక నాటి నుంచి తండాలోని పలువురి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ ఉపాధ్యా యులు బడి నడిపిస్తూ వచ్చారు. మొదట్లో స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉండగా.. అద్దె ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది.ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తి స్తున్నారు. గత ఏడాది బడి నడిపించడానికి తండాలో అద్దెకు ఇల్లు దొరకలేదు. దీంతో పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో మధ్యాహ్నం భోజ నం వండిపెట్టే వంటమనిషి వినోద తన ఇంట్లో పాఠశాల నడిపించడానికి అంగీకరించింది. ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డుకు చుట్టూరా పరదా కట్టి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారు. ఎండతీవ్రతకు రేకుల షెడ్డు కింద కూర్చున్న పిల్లలు అల్లాడి పోతున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు– మన బడి’ కింద పాఠశాలకు భవనం మంజూరైనా పిల్లర్ల వరకే నిర్మాణం జరిగింది. -
విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం పెట్టిన హెడ్మాస్టర్
-
చంద్రబాబు ప్రభుత్వంపై YSRCP నేతల ఆగ్రహం
-
YSRCP Yuvatha Poru : కూటమి సర్కార్పై జనాగ్రహం..
-
బీట్స్తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!
‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం. -
ఒక విద్యార్థిని కోసం.. బీభత్సం చేసిన రెండు కాలేజీల ఇంటర్ విద్యార్థులు
సాక్షి,విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇంటర్ విద్యార్థులు ఘర్షణకు దిగారు. రెండు ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు భయబ్రాంతులకు గురయ్యారు.ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఓ విద్యార్థిని విషయంలో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. పరీక్షకు ముందు ఎగ్జామ్ సెంటర్ సమీపంలోని జిరాక్స్ సెంటర్ వద్ద ఓ కాలేజీ విద్యార్థినితో చిన్న వాగ్వాదం జరిగింది. అది చిలికి చిలికి.. కూల్ డ్రింక్ బాటిళ్లతో తలల పగలగొట్టేంత ఘర్షణకు దారి తీసింది.స్థానికులు వద్దని వారిస్తున్నా వినని విద్యార్థులు షాపుల్లో ఉన్న కూల్డ్రింక్ బాటిళ్లతో దాడులకు దిగడంతో భీతావాహ పరిస్థితి నెలకొంది. -
ఇది కదా జగన్ బ్రాండ్ అంటే
-
బడిని బాగు చేసేదెలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతుండటం, విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిస్థితిని మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముందుగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయాలని సూచించింది. ముఖ్యంగా చేరికలు తగ్గడంపై సర్వే చేయాలని చెప్పింది.దీంతో తొలిసారిగా తెలంగాణ విద్యా పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) రంగంలోకి దిగింది. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు జిల్లాలకు వెళ్లనున్నాయి. ఇందుకోసం తొలుత ఈ నెల 3, 4 తేదీల్లో మాస్టర్ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనానికి వెళ్లే బృందాలకు 6, 7 తేదీల్లో శిక్షణ ఇచ్చారు.ఒక్కో జిల్లాలో 100 స్కూళ్ల పరిశీలనజిల్లాకు దాదాపు 100 చొప్పున స్కూళ్లను ఈ బృందాలు పరిశీలిస్తాయి. మొత్తం ఆరు అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతాయి. స్కూళ్లలో అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్, సిలబస్ పూర్తి, ల్యాబొరేటరీ నిర్వహణ, అంతర్గత మూల్యాంకన విధానంపై అధ్యయనం చేస్తాయి. సర్వేలో భాగంగా దాదాపు 9 వేల పాఠశాలల్లోని విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. బృందాలు ఇచ్చే నివేదికలపై ముందుగా విద్యాశాఖ, ఆ తర్వాత ప్రభుత్వం లోతుగా సమీక్షించి చేపట్టవలసిన కార్యాచరణ సిద్ధం చేయనున్నాయి. ప్రమాణాలు పడిపోతున్నాయన్న ‘ఆసర్’రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని వార్షిక విద్యా స్థాయి నివేదిక (ఆసర్) ఇటీవల వెల్లడించింది. గత ఏడాది ఆసర్ అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. ఇటీవల ఈ నివేదికను అందజేసింది. రాష్ట్రంలోని 270 గ్రామాల్లో 5,306 ఇళ్లకు వెళ్లిన ఆసర్ బృందాలు 3 నుంచి 16 ఏళ్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, 14–16 ఏళ్ల వయసు విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించాయి. ఈ క్రమంలో పలు ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి. స్కూళ్లకూ ఫోన్లు.. ఆలోచనా శక్తే లేదు!చిన్నపాటి కూడికలు, తీసివేతల్లో కూడా పాఠశాల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. 96 శాతం విద్యార్థుల్లో ఆలోచన శక్తి, క్రియేటివిటీ పూర్తిగా లోపించింది. అంతా స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలకూ వీళ్లు ఫోన్లు తెస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో హాజరు శాతం 2022లో 75.50 శాతం ఉంటే, ప్రస్తుతం 73 శాతానికి పడిపోయింది. 62 శాతం పాఠశాలల్లో ఒకటో తరగతి పిల్లలను ఇతర తరగతులతో కలిపి కూర్చోబెట్టడం వల్ల విద్యాభ్యాసం ఏమాత్రం సాగడం లేదు. రానురాను 60 మంది కన్నా తక్కువ ఉన్న స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది. 2010లో ఇలాంటి పాఠశాలలు 17.20 శాతం ఉంటే 2024లో 45.20 శాతానికి చేరుకోవడం ఆందోళన కల్గించే అంశం. వచ్చే ఏడాదికల్లా విశ్వాసం కల్పించేలా..గత పదేళ్లలో ప్రభు త్వ స్కూళ్లల్లో చేరికలు 32 శాతం తగ్గిపోయాయి. 2014–15లో 24.85 లక్షల మంది సర్కారీ స్కూళ్లల్లో చేరితే, 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలుగా ఉంది. విద్యా ర్థులు ప్రైవేటు స్కూళ్లలో చేరుతుండటమే ఇందుకు కారణం. కాగా టీచర్ల సంఖ్య పెంచినా, మౌలిక వసతులు కల్పించినా, ఎందుకు ఈ పరిస్థితి ఉందనే దానిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ప్రైవేటు స్కూళ్లలో 2014–15లో 31.17 లక్షల మంది విద్యార్థులు ఉంటే, 2024–25లో ఈ సంఖ్య 36.73 లక్షలకు పెరిగింది. వీటన్నింటినీ అధ్యయనం చేసి, వచ్చే ఏడాదికి ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ సర్వే చాలా కీలకంరాష్ట్ర విద్యా రంగంలో తీసుకురావా ల్సిన మార్పులపై సరైన ఫీడ్బ్యాక్ కోసం తొలిసారిగా సర్వే చేపడుతున్నాం. క్షేత్రస్థా యిలో పరిస్థితి ఎలా ఉందనేది పరిశీలిస్తాం. దాని ఆధారంగా అవసరమైన మార్పులు, సంస్కరణలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. అందుకే ఈ సర్వే చాలా కీలకమైంది. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్యా డైరెక్టర్ఎక్కడ ఏం చేయాలో తెలుస్తుందిక్షేత్రస్థాయి సర్వేతో ఎక్కడ, ఎలాంటి మార్పులు తేవాలనేది వెల్లడవుతుంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి వీలవుతుంది. అధ్యయనాలతో సరిపెట్టకుండా స్కూళ్లకు అవసరమైన మేర నిధులు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు పోటీ కోణంలో విద్యా విధానం ఉంటే ప్రభుత్వ స్కూళ్లల్లోనూ ప్రవేశాలు పెరుగుతాయి. – పింగిలి శ్రీపాల్రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ, పీఆర్టీయూటీఎస్ నేత -
విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!
పత్రిక నిర్వహణ ఆషామాషీ కాదు. చేయితిరిగిన రచయితలు, పాత్రికేయులు సైతం పత్రికను స్వయంగా నిర్వహించాలంటే, వెనుకాడుతారు. అలాంటిది కొందరు హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో మాసపత్రికను తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ముప్పయిమూడు సంచికలను వారు విజయవంతంగా ప్రచురించారు. ఇటీవల ప్రచురించిన ముప్పయిమూడో సంచికను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ ఆవిష్కరించారు.లెక్కల మాస్టారి చొరవతో ప్రారంభంవిద్యార్థులు నడుపుతున్న ఈ మాసపత్రిక పేరు ‘మంగళ విద్యావాణి’. మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు, గణిత అవధాని అరుణ్శివప్రసాద్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో 2018లో ఈ పత్రికను ప్రారంభించారు. సొంత ఖర్చులతో తొలి సంచికను ప్రచురించారు. తొలి నాలుగు నెలలు 8 పేజీలు, ఆ తరువాత 12 పేజీలు, ప్రస్తుతం 16 పేజీలతో మాసపత్రిక నడుస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో 20, 24, 28 పేజీలతో కూడా సంచికను వెలువరించారు. మాసపత్రిక నిర్వహణలో ముఖ్యపాత్ర అరుణ్శివప్రసాద్దే. పత్రిక రూపకల్పన, ఆవిష్కరణ, దాతలను సంప్రదించడం వంటి కార్యక్రమాలను ఆయనే చూసుకుంటున్నారు. పత్రికను 16 పేజీలతో తేవడానికి రూ.4 వేలు ఖర్చవుతోంది. మాసపత్రిక ప్రచురణ ఖర్చులను దాతల నుంచి స్వీకరిస్తుంటారు. ప్రతి నెలా 250 ప్రతులను ముద్రిస్తున్నారు. ఈ పత్రికను పాఠశాలలో రెండువందల మందికి ఉచితంగా అందిస్తున్నారు. మిగిలిన ప్రతులను పరిసర ప్రాంతాలలోని ఉన్నత పాఠశాలలకు అందిస్తున్నారు. సొంత ముద్రణాలయం లేనందున ఇతరుల చేత డీటీపీ చేయించి, జిరాక్స్ చేసి పంపిణీ చేస్తున్నారు. కవర్పేజీ కన్నా సెంటర్ పేజీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సెంటర్ పేజీల్లో విద్యార్థులు గీసిన చిత్రాలు, పాఠశాల కార్యక్రమాల ఫొటోలను ప్రచురిస్తున్నారు.ఉపాధ్యాయుల సహకారంపత్రిక ప్రచురణలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అన్నివిధాలా సహకరిస్తున్నారు. పత్రికలో ప్రచురించే రచనలకు తగిన అంశాలపై సూచనలు చేయడమే కాకుండా, వాటిలో అక్షరదోషాల సవరణ బాధ్యతలను ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకుని, పూర్తిగా విద్యార్థులే ఈ పత్రికకు రచనలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు, మంత్రులు, వారి శాఖలు, శాస్త్రవేత్తల చరిత్రలు, క్రీడలపై కథనాలు, కవితలు వంటి రచనలతో పత్రికను ముచ్చటగా తీసుకొస్తున్నారు. విద్యార్థుల చిత్రలేఖనానికి ప్రత్యేకంగా పేజీని కేటాయించి, ప్రోత్సహిస్తున్నారు. చివరి పేజీలో పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల ఫొటోలను, వారి వివరాలను ప్రచురిస్తున్నారు.పఠనాసక్తిని పెంపొందించడానికే!: అరుణ్శివప్రసాద్ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికను ప్రారంభించాం. విద్యార్థుల్లో రచనాసక్తిని పెంపొందించడం, వారిలోని కళానైపుణ్యాన్ని వెలికి తీయడం, పోటీ తత్త్వాన్ని పెంపొందించడం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు విద్యార్థులు భవిష్యత్తులో ఎదుర్కొనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు దోహదపడేలా పత్రికను తీసుకొస్తున్నాం. సహకారం అందిస్తున్న దాతలుమంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వారా నడుపుతున్న ‘మంగళ విద్యావాణి’ పత్రిక మొదటి సంచికను వ్యవస్థాపకుడు అరుణ్శివప్రసాద్ సొంత ఖర్చులతో ప్రారంభించారు. తరువాత సహోపాధ్యాయులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, వివిధ పాఠశాలల యాజమాన్యంతో పాటు ఇతర దాతలు పత్రిక ముద్రణకు సహకరిస్తున్నారు. అమెరికాలో ఉన్న అరుణ్శివప్రసాద్ స్నేహితుడు పార్థసారధి సహకారంతో 18వ మాసపత్రికను 50 వేలతో గణిత సూత్రాలతో ప్రత్యేక సంచికగా విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిని ఉచితంగా పంపిణీ చేశారు.మేధావుల ప్రశంసలువిద్యార్థులే రచయితలుగా వ్యవహరిస్తూ మాసపత్రికను నడుపుతున్న మంగళపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే ప్రప్రథమమని పలువురు మేధావులు కొనియాడుతున్నారు. పాఠశాలలో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లె శ్రీనివాసులు, మాసపత్రికను ఆవిష్కరించేందుకు విచ్చేసిన విఠపు బాలసుబ్రమణ్యం ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా 25వ సంచికను ఆనాటి కలెక్టర్ సగిలి షన్మోహన్, 27వ సంచికను ప్రస్తుత ఎమ్మెల్యే మురళిమోహన్, ప్రముఖ శతావధాని ఆముదాల మురళి ‘మంగళ విద్యావాణి’ సంచికలను ఆవిష్కరించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. గత ఏడాది ‘హిందీ దివస్’ సందర్భంగా మాసపత్రికను పూర్తిగా హిందీలోనే ప్రచురించడాన్ని అభినందించారు. గత డిసెంబర్లో 28 పేజీలతో భారత గణిత శాస్త్రవేత్తల చరిత్రను గురించి ప్రత్యేక సంచిక వెలువరించడం ప్రశంసనీయమని కొనియాడారు. బాబన్నగారి శివశంకర్, బంగారుపాళెం(చదవండి: వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..) -
మిత్రుడ్ని చూసేందుకెళ్లి.. మృత్యుఒడిలోకి
సాక్షి, చెన్నై / నెల్లూరు(క్రైమ్): చెన్నైలోని ఓ కళాశాలలో చదువుతున్న మిత్రుడ్ని చూసి సరదాగా గడపాలని భావించారు. అనుకున్నదే తడవుగా అక్కడికెళ్లి ఉత్సాహంగా గడిపారు. వీరు ఒకటి సంకల్పంచగా, విధి మరోలా తలచి రోడ్డు ప్రమాద(road accident) రూపంలో ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న హృదయ విదారక ఘటన చెన్నైలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆనందం.. అంతలోనే ఆవిరి పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన ధనిష్ రెడ్డి (21) చెన్నై శివార్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్(B.Tech students) తృతీయ సంవత్సరం చదువుతున్నారు. నెల్లూరులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న శ్రేయాష్ (21), మరో ఇద్దరు విద్యార్థులు.. ధనిష్రెడ్డిని చూసేందుకు కారులో వచ్చారు. బుధవారం రాత్రి కలిసి, అర్ధరాత్రి వేళ వీరితో పాటు ధనిష్ కళాశాల మిత్రుడు జయంత్తో పాటు కారులో సిటీ వైపు బయల్దేరారు. మార్గమధ్యలో ఊరపాక్కం దాటగానే కిలాంబాక్కం బస్ టెర్మినల్కు కూతవేటు దూరంలో ముందుగా వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న కారు ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఘటన స్థలంలోనే ధని‹Ùరెడ్డి, శ్రేయాష్ మరణించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు, జయంత్ను చికిత్స నిమిత్తం పోతేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను చెంగల్పట్టు జీహెచ్కు తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రం చెన్నై శివార్లలో జరిగిన రోడ్డుప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టోన్హౌస్పేటకు చెందిన ప్రముఖ ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు సుధాకర్రెడ్డి కుమారుడు ఎర్రగుంట ధని‹Ùరెడ్డి, రితి్వక్ ఎన్క్లేవ్కు చెందిన న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాష్ మరణవార్తతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన చెన్నై వెళ్లారు. మృతదేహాలు నెల్లూరుకు గురువారం రాత్రి చేరుకున్నాయి. పలువురు ప్రముఖులు నివాళులరి్పంచి బాధిత కుటుంబాలను ఓదార్చారు. -
ఇంటర్మీడియట్ పరీక్షలు.. ప్రిపరేషన్ టిప్స్ మీకోసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 4 (బుధవారం) నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 15వందలకు పైగా కేంద్రాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.అయితే ఈ సమయంలో విద్యార్థలు కొన్ని ప్రిపరేషన్ టెక్నిక్స్ను అనుసరించాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీస్,సలహాలతో కీలకమైన ఈ ఇంటర్ పరీక్షల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాదు మంచి మార్కులు సాధించవచ్చు.దీంతో పాటు సమయం నియంత్రణ,స్మార్ట్ స్టడీ మెథడ్స్,ముఖ్యమైన ప్రశ్నలపై ఫోకస్,సిలబస్ పూర్తిగా రివైజ్ చేయడం,మాక్ టెస్ట్ రాయడం, గైడ్లను ఫాలో అవ్వడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర, సరిపడ ఆహారం తీసుకోవడం, పాజిటీవ్ థింకింగ్ లక్షణాలు అలవరుచుకోవాల్సి ఉంటుంది.👉 మరింత విశ్లేషణాత్మకమైన ఉత్తమ ప్రిపరేషన్ టిప్స్ కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి. -
విద్యాశాఖ మంత్రి.. విడ్డూర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) కార్పొరేట్ కళాశాలలపై తన ప్రేమను ప్రదర్శించారు. ఈ క్రమంలో విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన. విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై శాసన మండలిలో గురువారం చర్చ జరగ్గా.. ఇందుకు తల్లిదండ్రుల ధోరణినే కారణమనే రీతిలో మాట్లాడారాయన.మండలిలో విద్యార్ధుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఏపీలో రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్ధుల ఆత్మహత్యలే(Students Suicides) ఎక్కువ ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు. ఇటీవల ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. .. తీవ్రమైన ఒత్తిడితోనే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది. చక్రపాణి కమిటీని బయటపెట్టాలి. విద్యార్ధుల ఆత్మహత్యలను నియంత్రించాలి’’ అని అన్నారాయన.దీనికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(AP Education Minister Nara lokesh) బదులిచ్చారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. కాదనడం లేదు. కానీ, కార్పొరేట్ కళాశాలల్లో మాత్రమే కాదు యూనివర్శిటీల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొంత మంది తల్లిదండ్రులు ఫీజులు కట్టేస్తున్నాం.. ఇంక మీదే బాధ్యత అనేలా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులకూ బాధ్యత ఉంటుందని అన్నారాయన.రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాల్లో యాజమాన్యాల వేధింపులతో విద్యార్థులు బలవన్మరణాలు పాల్పడుతుంది చూస్తున్నాం. అయితే ఈ అంశాన్ని సొంత పార్టీ వాళ్లే లేవనెత్తితే.. యూనివర్సిటీల్లోనూ జరుగుతున్నాయంటూ చెప్పడం విడ్డూరం. -
సమాజ హితం కోసం.. సకినీ ఫౌండేషన్
సమాజ హితం కోసం తాను ఏదో చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. తనకు తోచిన మేరకు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాహాయం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆపదలో ఉన్న పలువురు బస్తీ వాసులకు ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నాడు. మురికి వాడల్లో నివసించే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే సమాజ సేవలోనూ ముందు వరుసలో ఉంటున్నాడు.. – గోల్కొండ నగరంలో అది పెద్ద లేబర్ అడ్డాల్లో టోలిచౌకీ లేబర్ అడ్డా ఒకటి. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా నగర పరిసరాల నుంచి ఎందరో నిరుపేదలు ఉపాధి కోసం స్థానిక లేబర్ అడ్డాలకు వస్తుంటారు. పని దొరకక వారిలో అనేక మంది రోజుల తరబడి పస్తులు ఉంటుంటారు. ఇది గమనించిన ఆసిఫ్ హుసేన్స్న్ సోహెల్ సూర్యనగర్ కాలనీలో మాషా అల్లా పేరిట కిచెన్ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిత్యం 250 మందికి మధ్యాహ్న సమయంలో భోజనం అందిస్తున్నాడు. వలస కూలీలకు అండగా.. ఆసిఫ్హుస్సేన్ సోహెల్ సేవలపై ప్రశంసలునగరంలో గోల్కొండకు చెందిన ఆసిఫ్హుస్సేన్ సోహెల్ సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. మురికివాడల్లో చదువుకు నోచుకోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పై చదువులకు ప్రైవేటు పాఠశాలల్లో చేరి్పంచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో పాటు ఆయా మురికి వాడల్లోని మహిళల సాధికారత కోసం సకీనా ఫౌండేషన్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి పథకాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. పేదల బస్తీలైన విరాట్నగర్ వంటి ప్రాంతాల్లో ఫ్యాషన్ డిజైనింగ్, ఫస్ట్ ఎయిడ్, జిగ్జాగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, వారి ఆర్థిక స్థితికి తోడ్పడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. కరోనా సమయంలో.. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కూలీలకు తాను అండగా ఉన్నానంటూ నిత్యావసరాలు అందించడంతో పాటు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఉచిత రవాణా కలి్పంచాడు. టోలిచౌకీ ముంపు కాలనీగా పేరుగాంచిన నదీమ్ కాలనీలో వరదల సమయంలో బోట్లతో రంగంలోకి దిగి ఎందరినో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వీటన్నింటికీ తోడుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ బస్తీలో రోగులకు వారి ఇంటి ముందే మందులు అందిస్తున్నారు. మున్ముందు కూడా సకీనా ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సోహెల్ చెబుతున్నారు. -
పుస్తకాలతో కుస్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియట్, పదో తర గతి పబ్లి క్ పరీక్షల సమయం దగ్గరపడటంతో విద్యార్థులు నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పిల్లల పరీక్షలపైనే తల్లిదండ్రులు దృష్టి పెట్టారు. హాస్టళ్లల్లో రాత్రింబవళ్లూ స్టడీ అవర్స్ నడుస్తున్నాయి. ప్రైవేటు కాలే జీలు, స్కూళ్ల హాస్టల్స్లో విద్యార్థులను చదివించడం కోసం ప్రత్యేక సిబ్బంది పని చేస్తున్నారు. విస్తృతంగా స్టడీ మెటీరియల్స్ ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి 9,96,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోని 417 ప్రభుత్వ కాలేజీల్లో 1.24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లకు ఇంటర్ బోర్డ్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. నెల రోజుల క్రితమే అన్ని చోట్లా సిలబస్ పూర్తయింది. 15 రోజులుగా రివిజన్ చేయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు.వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి ముఖ్యమైన ప్రశ్నలపై తర్ఫీదు ఇస్తున్నారు. టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి మొదలవుతాయి. 5.50 లక్షల మంది ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 1.40 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. వందశాతం పాస్ ఫలితాలపై స్కూళ్లు దృష్టి పెట్టాయి. విద్యాశాఖ అన్ని సబ్జెక్టులకూ స్టడీ మెటీరియల్స్ను స్కూళ్లకు పంపింది. నిద్రలేని రాత్రులు గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులకు నిద్ర కూడా కరవవుతోంది. ఉదయం 4 గంటలకే విద్యార్థులను నిద్ర లేపి గంటపాటు స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత సబ్జెక్టు అధ్యాపకులు ముఖ్యమైన చాప్టర్స్పై ప్రశ్నలు వేస్తున్నారు. సరైన సమాధానం రాకపోతే ఆ చాప్టర్పై శిక్షణ పెంచుతున్నారు. ఎవరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు? వారిని ఏ విధంగా ప్రిపేర్ చెయ్యాలనే అంశాలపై స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు రోజూ నివేదికలు కోరుతున్నాయి. పరీక్షలు అయ్యే వరకు ఎవరూ సెలవు పెట్టొద్దని ఆదేశాలు వెళ్లాయి.సబ్జెక్టు టీచర్లకు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పోటీ పెడుతున్నాయి. ఎక్కువ మంది మంచి జీపీఏ, ర్యాంకులతో పాసయ్యేలా చేస్తే ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆశ చూపుతున్నాయి. ఈసారి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు కూడా టార్గెట్లు పెట్టారు. సబ్జెక్టులవారీగా మంచి స్కోర్ చేసిన స్కూళ్లను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తల్లిదండ్రులు కూడా ఇదే స్థాయిలో పిల్లల చదువుపై దృష్టి పెట్టారు. పిల్లలకంటే ముందే నిద్రలేచి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలను కనిపెట్టుకుని ఉంటున్నారు. పరీక్షలపైనే దృష్టి ఇది కీలక సమయం. పిల్లలకు పరీక్షలయ్యే వరకు ఏ పనికీ వెళ్లదల్చకోలేదు. వారిని ఎలా చదివించాలనే అంశాలపైనే దృష్టి పెడుతున్నాం. వాళ్లకు ఏం కావా లో దగ్గరుండి చూసుకుంటున్నాం. కంటిమీద కును కు లేకున్నా వాళ్ల భవిష్యత్ కోసమే పనిచేస్తున్నాం. –ఎస్కే జబ్బర్ (విద్యార్థి తండ్రి, జడ్బర్ల)మార్కులు పెంచేలా ప్రిపరేషన్ ఒకటికి పదిసార్లు ముఖ్యమైన ప్రశ్నలపై తర్ఫీదు ఇస్తున్నాం. సబ్జెక్టువారీగా అధ్యాపకులను అందుబాటులో ఉంచుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న చాప్టర్స్పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. త్వరగా గుర్తుండిపోయేలా శిక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. –ఆర్ పార్వతిరెడ్డి (హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం)మెరుగైన ఫలితాల కోసంప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులూ మంచి ర్యాంకులు పొందేలా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. ముఖ్యమైన ప్రశ్నలతో పాటు, గతంలో వచ్చిన ప్రశ్నలను గుర్తించి.. ఈసారి తేలికగా పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు)క్షణం తీరిక ఉండటం లేదు పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు, టీచర్లకు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ప్రభుత్వం సరఫరా చేసిన దీపికల ద్వారా విద్యార్థి తేలికగా పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చూస్తున్నాం. – ఆర్ రాజగంగారెడ్డి (ప్రభుత్వ గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) -
తప్పుడు స్పెల్లింగ్తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో
ముంబై: విజయవంతంగా డిగ్రీ పూర్తిచేసి, తమ విద్యార్హత పట్టాలను అందుకున్న ఆ విద్యార్థులు తమ సర్టిఫికేట్లను చూసుకుని కంగుతిన్నారు. గతంలో విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు తప్పుగా ముద్రితం కావడం పొరపాటుగా జరుగుతుండేది. అయితే ఇప్పుడు కనిపించిన ఆ తప్పుడు ముద్రణ విద్యార్థులకు మింగుడుపడటం లేదు. దీంతో ఆ విద్యార్థులంతా తమ సర్టిఫికేట్లను తిరిగి యూనివర్శిటీకి సమర్పించారు.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ముంబై విశ్వవిద్యాలయం(Mumbai University) (ఎంయు) అందించే సర్టిఫికేట్లలో విద్యార్థుల పేర్లలో స్పెల్లింగ్ తప్పులు రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే ఈసారి విశ్వవిద్యాలయం పేరే మారిపోయింది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘ముంబై యూనివర్శిటీ’(ఎంయూ) అని ఉండాల్సిన స్థానంలో ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’(University of Mumbai)(యూఎం) అని ఉంది. డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికేట్లను యూనివర్శిటీ అధికారులు ఆయా కళాశాలలకు పంపారు. వీటిని చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్శిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక కళాశాల ప్రిన్సిపాల్ ఈ ఉదంతంపై స్పందిస్తూ ‘ముంబై యూనివర్శిటీ (ఎంయూ) ఇలా వర్శిటీ పేరునే తప్పగా రాయడం సిగ్గుచేటు. లోగోలోనే తప్పులు ఉన్నందున ఇవి నకిలీ సర్టిఫికేట్లుగా ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులు ఈ సర్టిఫికేట్లను(Certificates) ఉద్యోగాల కోసం లేదా తదుపరి చదువుల కోసం ఉపయోగిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఇటీవల ముంబై విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరిగింది. 2023-24లో 1.64 లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు. వీరికి సర్టిఫికేట్లను కూడా అందజేశారు.సర్టిఫికెట్ల ముద్రణను ముంబై యూనివర్శిటీ.. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక కంపెనీకి అప్పగించింది. ఇప్పుడు యూనివర్శిటీ ఈ తప్పును సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా విద్యార్థులకు కొత్త సర్టిఫికేట్లను అందించేందుకు సిద్ధమయ్యింది. ఈ ఉందంతంపై ఒక కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సర్టిఫికేట్ల ముద్రణలో తప్పులు వస్తున్నాయని, అయితే ఈ సారి జరిగింది పెద్ద తప్పేనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సర్టిఫికేట్లను ముద్రించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు వీలైనంత త్వరగా సరైన సర్టిఫికేట్లను అందించాలని కోరారు. ఇది కూడా చదవండి: Bangladesh: షేక్ హసీనా మాయం.. భారత్ సహకారం తుడిచివేత -
విద్యార్థుల మరణాలు దురదృష్టకరం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెట్(ఐఐఎంల)లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నివారణకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఐఐటీలు, ఐఐఎంల్లో గడిచిన 14 నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ తెలపడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఈ అంశానికి న్యాయపరమైన ముగింపు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల 2017లో, మహారాష్ట్రలోని టీఎన్ టోపీవాలా మెడికల్ కాలేజీ విద్యార్థిని పాయల్ తాడ్వి 2019లో బలవన్మరణం చెందారు. తమ విద్యాసంస్థల్లో కులపరమైన వివక్షను భరించలేకే ప్రాణాలు తీసుకున్నారంటూ వీరి తల్లులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాలున్నా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల వివరాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయని లాయర్ జైసింగ్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
సీట్లన్నీ మనోళ్లకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా సీట్లన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. గత పదేళ్లుగా అమలవుతున్న 15శాతం అన్–రిజర్వుడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు 15శాతం నాన్–లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ 15 శాతం కోటాలో ఏపీతో పాటు తెలంగాణ స్థానికులూ పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 2024తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో... ఈ 15శాతం కోటా గడువు ముగిసిపోయింది. ఈ లెక్కన గత విద్యా సంవత్సరంలోనే 15% కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అప్పటికే వివిధ ప్రవేశపరీక్షల ప్రకటనలు విడుదలవడంతో నాన్–లోకల్ కోటాను అమలు చేశారు. కమిటీ నివేదిక మేరకు సవరణలు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తాజాగా నాన్–లోకల్ కోటాకు సవరణలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి 1974లో తీసుకొచ్చిన నిబంధనలు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. దాని ప్రకారం.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని తెలంగాణ లోకల్ జోన్గా పేర్కొంటారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే స్థానికత కిందకు వస్తాయి. 85శాతం సీట్లు స్థానికులకు, 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాలు, తెలంగాణ విద్యార్థులకు కలిపి దక్కుతాయి. ఇప్పుడు ఈ 15శాతం సీట్లకు కూడా తెలంగాణ స్థానికత వర్తించేలా కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లభించలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల మేరకే తాజాగా జీవో ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్రపతి ఆమోదం లేకుండా జీవో ఇవ్వడం సరికాదని.. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. 60వేలకుపైగా విద్యార్థులకు నో చాన్స్ రాష్ట్రంలో ప్రధానంగా సాంకేతిక, ఫార్మా కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడుతున్నారు. నాన్–లోకల్ కోటా కింద ఈ విద్యార్థులు ఏటా దాదాపు 60 వేలకుపైగా కన్వీనర్ సీట్లు పొందుతున్నారు. వారంతా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇలా సీట్లు పొందే అవకాశం ఉండదు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ (టీజీఈఏపీసెట్)కు గతేడాది 3,54,803 మంది హాజరవగా.. అందులో ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు 49,071 మంది, అగ్రి, ఫార్మాకు 12,349 మంది కలిపి 61,420 మంది హాజరయ్యారు. ఎవరెవరు అర్హులు? – ఈ సవరించిన నిబంధనలు ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మా, బిజినెస్ అడ్మిని్రస్టేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తాయి. – ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని తెలంగాణ రీజియన్గా పరిగణిస్తారు. ఈ ప్రాంత విద్యార్థులను తెలంగాణ స్థానికులుగా పరిగణిస్తారు. వారు 85శాతం లోకల్, 15శాతం అన్–రిజర్వుడ్ కోటాకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు (నాలుగేళ్లు) విద్యాభ్యాసం చేసిన విద్యార్థులను కూడా స్థానికులుగానే గుర్తిస్తారు. – ఇక తెలంగాణ వెలుపల చదువుకున్న సమయాన్ని మినహాయించి మొత్తం పదేళ్లు రాష్ట్రంలో నివసించిన అభ్యర్థులు... తెలంగాణ వెలుపల ఉద్యోగ కాలాన్ని మినహాయించి మొత్తం పదేళ్లు రాష్ట్రంలో నివసించిన తల్లిదండ్రులున్న అభ్యర్థులు.. 15శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ స్థానికత ఉండి, ఇతర ప్రాంతాల్లో చదువుకున్న వారిని కూడా అన్–రిజర్వుడ్ కోటా కిందకు తెచ్చారు. – తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. – రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, లోకల్ బాడీ సంస్థలకు సంబంధించి తెలంగాణ పరిధిలో భార్య, భర్త (స్పౌజ్) పనిచేస్తే.. వారి పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. -
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆందోళన కొనసాగు తుండగానే కెనడా ప్రభ్తుత్వం కూడా షాకిస్తోంది. స్టడీ, వర్క్ వీసాలపై కొత్త రూల్స్ను అమలు చేయనుంది.. ఇటీవల తమ దేశంలోని ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన అమెరికా బాటలోనే కెనడా కూడా నడుస్తోంది.కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఒక పీడకలగా మారవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చాయి . ఉద్యోగులు, వలసదారుల వీసా స్థితిని ఎప్పుడైనా మార్చడానికి కెనడియన్ సరిహద్దు అధికారులకు విచక్షణాధికారాలను ఇస్తున్నాయి.జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయితే, పర్మిట్లు, వీసాలను తిరస్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. బస గడువు ముగిసిన తర్వాత వ్యక్తి కెనడాను విడిచిపెడతారని నమ్మకం లేకపోతే, గడువు ఉన్నప్పటికీ ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు లేదా వారి అనుమతిని రద్దు చేయవచ్చు. తాజా చర్యలు భారతదేశం నుండి వచ్చిన వారితో సహా పదివేల మంది విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతులు రద్దైన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ(ఎయిర్పోర్టు) నుంచే వెనక్కు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయులను ఎక్కువగా వెళుతున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి ట్రంప్ ఆంక్షల తరువాత కెనడాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం కెనడాలో సుమారు 4.2లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యనభ్యిస్తున్నారు.ఇక భారతీయ టూరిస్టుల విషయానికి వస్తే 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. మూడు నెలల క్రితమే (2024 నవంబర్), కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా SDS వీసా ప్రోగ్రామ్ను రద్దు చేసిన విషయం విదితమే. -
ఆలస్యానికి అతిథులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని
-
పిల్లల పరీక్షలు, పెద్దోళ్లకు అగ్నిపరీక్ష! ఈ విషయాలు గుర్తుంచుకోండి!
చెన్నైలో CBSE పరీక్షల సమయంలో స్కూల్ గోడ ఎక్కి, తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసి మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.ఇలాంటి ఘటనలు ఏ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి?🔹మన విద్యా వ్యవస్థ పిల్లలపై ఎంత ఒత్తిడిని పెడుతోంది?🔹తల్లిదండ్రుల ఆందోళన పిల్లల మనసుపై ఎలా ప్రభావం చూపుతోంది?🔹తల్లిదండ్రుల ప్రేమ వారికి బలాన్ని ఇస్తుందా, భయాన్ని పెంచుతుందా?ప్రతీ సంవత్సరం పరీక్షల సీజన్ వచ్చినప్పుడల్లా విద్యార్థుల కన్నా ఎక్కువగా ఒత్తిడిలో ఉంటున్న వారు తల్లిదండ్రులే. "తప్పక పాస్ అవ్వాలి!", "అగ్రశ్రేణి మార్కులు రావాలి!", "లేకపోతే భవిష్యత్తు అంధకారం!" – ఇవీ తల్లిదండ్రులలో నిండిపోయిన భయాలు. ర్యాంక్ కోసమే మన ప్రేమ అని పిల్లలకు అనిపించకూడదు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి తల్లిదండ్రులు చేయకూడనిది...❌ హెలికాప్టర్ పేరెంటింగ్:ప్రతీ చిన్న విషయాన్ని తల్లిదండ్రులు గమని…పిల్లలను ఎలా ప్రోత్సహించాలి?✅ పరీక్ష ఫలితాలు ఆశించినంత రాలేదనుకోండి. పిల్లలు దిగులుగా ఉన్నప్పుడు, "నీ ప్రయత్నం గొప్పది, మార్కులు మాత్రమే జీవితానికి అద్దం కాదు" అని చెప్పండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.✅ పిల్లలకు చదువు అంటే భయం కాకుండా ఆసక్తిగా ఉండేలా చేయండి. "ఏ విషయం నచ్చింది? ఏ ప్రశ్న ఆసక్తికరంగా అనిపించింది?" అని అడిగితే, పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే ప్రక్రియగా భావిస్తారు.✅ "నీ ఫ్రెండ్ అజయ్ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీవు ఎందుకు సాధించలేకపోతున్నావు?" అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చతాయి. ప్రతి ఒక్కరికీ తన ప్రయాణం ఉంటుంది. అందుకే పోల్చడం మానండి.✅ తప్పిదాలను సహజంగా అంగీకరించండి. "ఈసారి ఏమి తప్పైంది? తర్వాత ఎలా మెరుగుపరచుకోవచ్చు?" అనే విధంగా ప్రశ్నించడం ద్వారా పిల్లలు సమస్యలను అర్థం చేసుకొని, మెరుగుపడటాన్ని నేర్చుకుంటారు.గుర్తుంచుకోవాల్సిన విషయాలు📌 పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. అవి ఒక చిన్న అంచనా మాత్రమే.📌 పిల్లలకు భయం పోగొట్టండి. పరీక్షలు అంటే భయపడేలా కాకుండా, కొత్త విషయాలు నేర్చుకునే అనుభవంగా చూడమని ప్రేరేపించండి.📌 పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడితో విజయం సాధించడమే కాదు, ఆనందంగా ఎదగాలి.📌 గోడలు ఎక్కే తల్లిదండ్రులు కాకుండా, పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి.పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే మంచి అవకాశంగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల భవిష్యత్తును భయంతో నింపకుండా, ధైర్యంగా ముందుకు నడిపిద్దాం!మీకేమైనా కౌన్సెలింగ్ సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి.-సైకాలజిస్ట్ విశేష్ -
అవస్థల ‘అపార్’!
సాక్షి, హైదరాబాద్: ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ (అపార్)(APAAR)’.. ప్రతి విద్యార్థికి శాశ్వత గుర్తింపు నంబర్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విధానం. ఒకటో తరగతి మొదలు పన్నెండో తరగతి వరకు ప్రతి విద్యార్థి పూర్తి వివరాలను అపార్ వెబ్పోర్టల్లో నమోదు చేసిన తర్వాత.. వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య జనరేట్ అవుతుంది.. అదే అపార్ ఐడీ. విద్యార్థుల చదువుకు సంబంధించిన అన్నిరకాల వివరాలు, సర్టీఫికెట్లు అందులో నిక్షిప్తమవుతాయి.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతోంది. రాష్ట్రంలోని 40 వేల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల పరిధిలో సుమారు 65 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది సెపె్టంబర్లో అపార్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు 60 శాతం కూడా నమోదు పూర్తికాలేదు.మూడింటిలోనూ సరిపోలితేనే.. విద్యార్థి తొలుత పాఠశాలలో చేరినప్పుడు రాసిన అడ్మిషన్ రిజిస్టర్, అధికారులు ఆన్లైన్లో నమోదు చేసిన యూడైస్ ప్లస్ వివరాలు, ఆధార్లోని వివరాలు.. ఇలా మూడింటిలోనూ విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు సరిపోలితేనే అపార్ వెబ్పోర్టల్లో నమోదు చేసే వీలుంటుంది. ఏ ఒక్కదానిలో, ఏ వివరాల్లోనైనా తేడా ఉంటే అపార్ ప్రక్రియ పూర్తవడం లేదు. బర్త్ సర్టీఫికెట్లో పూర్తిగా వివరాలు లేకపోవడం, ఆధార్లో ఇంటిపేరుకు బదులు ఒక్క అక్షరమే ఉండటం, పుట్టినతేదీ తప్పుగా ఉండటం, పేరులో అక్షర దోషాలు వంటి సమస్యలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.వీటిని సవరించుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాలు సూచిస్తున్నాయి. వీలైనంత త్వరగా సర్టిఫికెట్లు తెస్తే అపార్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తామని ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న మధ్యవర్తులు, అధికారులతో చేతులు కలిపి.. అందినకాడికి దండుకుని సర్టీఫికెట్లు ఇప్పిస్తున్నారు.ఫిర్యాదు చేసేదెలా...? జనన ధ్రువపత్రాల జారీ, పొరపాట్ల సవరణకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అంతా మీసేవ కేంద్రాల ద్వారానే జరుగుతోంది. అయితే దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లను మాన్యువల్గా తీసుకురావాలనే సాకు చూపుతూ స్థానిక సంస్థల అధికారులు దరఖాస్తుల పరిశీలనను నిలిపివేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ఇతర దళారులు దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులతో కుమ్మక్కై వెంటనే సర్టీఫికెట్లు సిద్ధం చేసి ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ తంతు దరఖాస్తుదారులకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎలాగోలా త్వరగా పనికావాలన్న ఉద్దేశంతో దళారులను ఆశ్రయిస్తున్నారు.నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి అపార్ ఉద్దేశం మంచిదే అయినా వివరాల నమోదు ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఆధార్, యూడైస్, స్కూల్ రికార్డుల్లోని వివరాలన్నీ సరిపోలినప్పుడే పోర్టల్లో వివరాలను ఎంట్రీ చేయగలిగే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన మెజార్టీ పిల్లల స్కూల్ వివరాలు, ఆధార్ వివరాల్లో చిన్నపాటి పొరపాట్లు ఉన్నాయి.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకూ ఈ సమస్య ఉంది. సరైన వివరాలను నమోదు చేస్తే తప్ప వెబ్సైట్లో అపార్ వివరాలు జనరేట్ కావు. ప్రస్తుతం ఆధార్ తప్పనిసరి చేసినప్పటికీ.. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణతో వివరాల నమోదుకు అవకాశం కల్పించాలి. అప్పుడే అపార్ నమోదు ప్రక్రియ నూరుశాతం పూర్తవుతుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పించాం. కానీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కావడంతో మార్పులు చేసే వీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెబుతున్నారు. – సిద్దగోని గిరిధర్గౌడ్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ సంఘంబర్త్ సర్టిఫికెట్లో మార్పు కోసం రూ.5 వేలు తీసుకున్నారు మా ఇద్దరు పిల్లలకు సంబంధించి అపార్ వివరాలు నమోదుకావడం లేదని స్కూల్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. ఆధార్లో ఇంటిపేరు పూర్తిగా ఉంటే, జనన ధ్రువీకరణ పత్రంలో షార్ట్ ఫామ్లో ఉంది. దీంతో బర్త్ సర్టిఫికెట్లో వివరాలు మార్పించాలన్నారు. దీనికోసం స్థానికంగా ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లాను. గెజిటెడ్ సంతకం, అఫిడవిట్తోపాటు మున్సిపల్ కార్యాలయంలో పని పూర్తి చేయించేందుకు రూ.5 వేలు వసూలు చేశారు. వారం తర్వాత సర్టీఫికెట్ వచ్చింది. స్కూల్లో ఇచ్చి అపార్ వివరాలను నమోదు చేయించాను. – టి.యాకయ్య, జగద్గిరిగుట్ట, మేడ్చల్ జిల్లాఅన్ని ధ్రువపత్రాలు సమర్పించినా తిరస్కరించారుమా అబ్బాయి బర్త్ సర్టిఫికెట్లో తల్లిదండ్రుల పేర్లు ఇంటిపేరుతో కాకుండా ఒక్క మొదటి అక్షరంతో ఉన్నాయి. వాటిని మార్చి పూర్తి ఇంటిపేరు సరి చేయడానికి మీసేవ కేంద్రంలో దర ఖాస్తు చేశాను. ఆ పత్రాలను ప్రింట్ తీసుకుని ఎల్బీ నగర్ లోని మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాను. ఆధారాలను సమర్పించినా మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటూ మెలిక పెట్టి రెండు వారాల తర్వాత దరఖాస్తును తిరస్కరించారు. – బందె గిరిజ, ఎల్బీ నగర్, రంగారెడ్డి జిల్లా -
విద్యార్థులే వంట మాస్టర్లు!
ఉదయగిరి: చదువుకోవాల్సిన విద్యార్థులతో వంట పనులు చేయిస్తూ వేధిస్తున్నారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న ఈ వేధింపులు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 428 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు వంట చేసేందుకు ఇద్దరు కుక్లు, మరో ఇద్దరు సహాయకులు ఉన్నారు.కానీ ప్రతి రోజూ వంటతో పాటు ఇతర పనులు చేసేందుకు విద్యార్థులను 15 మంది చొప్పున బ్యాచ్లుగా విభజించారు. రొటేషన్ పద్ధతిలో వీరితో వంట పనులు చేయిస్తున్నారు. ఆదివారం చపాతీలు చేయాల్సి ఉంది. విద్యార్థులందరికీ కలిపి దాదాపు 1,300 చపాతీలు అవసరం. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే ఒక బ్యాచ్ విద్యార్థులతో చపాతీలు తయారు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.ఏడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ పుష్పరాజ్ను వివరణ కోరగా.. ఆదివారం నలుగురు వంట సిబ్బందిలో ఇద్దరు విధులకు హాజరవ్వలేదని చెప్పారు. దీంతో వంట పనులు విద్యార్థులతో చేయించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కాగా, కన్జ్యూమర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు తిరుపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులతో పనులు చేయిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.