breaking news
Students
-
వైజాగ్ క్రైమ్ ఫైల్స్!
సిటీ ఆఫ్ డెస్టినీలో రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతిభద్రతలు ఫిర్యాదులొస్తున్నా ప్రేక్షకపాత్రలోనే ఖాకీలు పసి మనసుల్లోనూ కక్షలు.. నడిరోడ్డుపై విద్యార్థుల గ్యాంగ్వార్ పోలీస్ విధుల్లో మితిమీరిన ‘రాజకీయ’ జోక్యం కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్థాల వినియోగంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం, మరోవైపు పోలీసుల నిర్లిప్తత విశాఖలో అశాంతికి కారణమవుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే పరిస్థితులు నగరంలో కనిపించకపోవడం విస్మయపరుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడం శాంతిభద్రతల వైఫల్యానికి ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖాకీలపై ఖద్దరు పెత్తనం! పోలీసులపై అధికార పార్టీ నేతల పెత్తనం శ్రుతిమించుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ కంటే నేతల ఆదేశాలు పాటించడానికే ప్రాధాన్యమివ్వాల్సిన దుస్థితి నెలకొంది. నిందితులను అదుపులోకి తీసుకుంటే వెంటనే నేతల నుంచి ఒత్తిళ్లు రావడం, నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై బదిలీ వేటు వేస్తామని బెదిరించడం నిత్యకృత్యమైంది. తమకు నచ్చిన సీఐలను వేయలేదని ఏకంగా సిటీ పోలీస్ బాస్పైనే నేతలు ఫిర్యాదులు చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయి.బీచ్రోడ్డులో మాస్్కలతో దౌర్జన్యం! విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన ఘటన నగరంలో రౌడీయిజానికి అద్దం పడుతోంది. నంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో, ముఖాలకు మాస్క్లు ధరించి వచ్చిన కొందరు దుండగులు ఏకంగా ఓ ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అక్కడున్న షెడ్డును, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ దాడి వెనుక అధికార పారీ్టకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు వారిని పట్టుకోలేకపోయారు.బాజీ జంక్షన్లో విద్యార్థుల వీరంగం 2024 ఆగస్టు 6వ తేదీన బాజీ జంక్షన్ వద్ద ఓ కళాశాల విద్యార్థులు ఏకంగా నడిరోడ్డుపై తీవ్ర ఘర్షణకు దిగారు. వీధి రౌడీల్లా కొట్టుకోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస పోలీస్ పర్యవేక్షణ, చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే విద్యార్థులు సైతం ఇలా రోడ్డెక్కి దాడులకు తెగబడుతున్నారు.రుషికొండ వద్ద అర్ధరాత్రి బీభత్సం రామానాయుడు స్టూడియో సమీపంలోని ఓ ప్రైవేట్ స్థలంలో సుమారు 20 మంది దుండగులు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. నంబర్ ప్లేట్లు కనిపించకుండా తెల్లకాగితాలు అంటించిన వాహనా ల్లో వచ్చి ఈ దమనకాండకు తెగబడ్డారు. భూ ఆక్ర మణే లక్ష్యంగా ముందుగా విద్యుత్ వైర్లు కత్తిరించి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడున్న వాచ్మెన్లను కారులో బంధించి తిప్పుతూ, గెస్ట్ హౌస్, కాంపౌండ్ వాల్ను నేలమట్టం చేశారు. రాత్రే ఆ శిథిలాలను లారీల్లో తరలించారు.శాంతి ఆశ్రమం భూముల్లో రౌడీషీటర్ల హల్చల్ శాంతి ఆశ్రమం భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆగడాలు ఆగలేదు. ఆ భూములను శాంతి ఆశ్రమానికే అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ, రౌడీïÙటర్లు పట్టపగలే రంగంలోకి దిగి నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనపై కేసులు నమోదైనా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. చివరికి నిందితులకు బెయిల్ రాకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారిని అదుపులోకి తీసుకున్నారు.పెందుర్తి భూకబ్జా దాడి ఘటనలోనూ అదే తీరు నగరంలో భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ భూములను ఆక్రమిస్తున్నారని బాధితులు, రైతులు స్థానిక పీఎస్లలోనూ, పోలీస్ కమిషనర్కూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటీవల పెందుర్తిలో జరిగిన ఎన్నారై స్థలం వివాదంలో జనసేన నేతలు చేసిన దాడి వ్యవహారంలోనూ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.మధురవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్! మధురవాడ: నగరంలో శాంతిభద్రతల వైఫల్యం పాఠశాల విద్యార్థులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మారికవలస, వాంబే కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య 10 రోజుల క్రితం వివాదం మొదలైంది. పాఠశాలలో గొడవపడటంతో ఉపాధ్యాయులు సర్దిచెప్పినప్పటికీ.. వాట్సాప్లో పరస్పరం రెచ్చగొట్టే సందేశాలు పంపుకోవడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో 9, 10 తరగతుల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. గురువారం సాయంత్రం ఇరు వర్గాలు మారికవలస–తిమ్మాపురం రోడ్డుకు చేరుకున్నాయి. వారితో పాటు పూర్వ విద్యార్థులు, స్థానిక యువకులు కూడా చేరి కర్రలు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి శివశక్తినగర్లోనూ మరోసారి ఘర్షణ జరిగి ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటనపై మారికవలసకు చెందిన యర్రా చందు (19), జస్వత్ (20), రాంజగన్ తేజ (21)లతో పాటు మరో ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసినట్లు పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు. -
రాంచీలో బాహాబాహీ
రాంచీ: ఎంపిక పరీక్షల్లో అవకతవకలపై శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు తలపడ్డాయి. విద్యా ర్థుల నిరాహార దీక్షలు, తీవ్ర ఆందోళనల నడు మ జార్ఖండ్ పబిŠల్క్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం సోరెన్ ప్రకటించగా, అందుకు సంబంధించిన ఆదేశాలపై గురువారం స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం తన చర్యను సరైన రీతిలో సమర్థించుకోకపోవడమే హైకోర్టు ఆదేశాలకు కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు జేపీ ఎస్సీ–జేఎస్ఎస్సీ రిఫామ్స్ మంచ్ సారథ్యంలో ర్యాలీగా నగరంలోని ఆల్బర్ట్ చౌక్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోరెన్, రాహుల్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు, అధికార జేఎంఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. విద్యార్థులు ముందుగా అనుమతించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ర్యాలీ చేపట్టడంతోపాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారని పోలీసులు ఆరోపించారు. ఈ సమయంలో మంచ్ నేత కునాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్పృహతప్పి పడిపోవడంతో సదర్ ఆస్పత్రిలో జాయిన్ చేశారని మరో నేత పియూశ్ కుమార్సింగ్ చెప్పారు. పోలీసులు విద్యార్థినులపైనా బలప్రయోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. హజారీబాగ్, గిరిదిహ్లోనూ విద్యార్థులు సీఎం సోరెన్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు యత్నించడం, జేఎంఎం కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణలకు దారి తీసింది. -
ఉద్యమానికి విరామం
రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం గత 25 రోజులుగా ఉద్యమిస్తున్న వేలాది మంది పరీక్షార్థులు, విద్యార్థులు రాంచీలోని జైపాల్సింగ్ ముండా స్టేడియంలో తమ నిరసనకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. పాత పరీక్షల రద్దు, జేపీఎస్సీ,జేఎస్ఎస్సీల్లో అస్తవ్యçస్త విధానాలు, పరీక్ష విధానంలో లోపాలను రూపుమాపాలంటూ తాము చేసిన డిమాండ్ల, పలు అంశాలను రెండు నెలల్లోపు పరిష్కరించాలని హేమంత్ సోరెన్ సర్కార్కు ఉద్యమనేతలు బుధవారం అల్టిమేటమ్ ఇచ్చారు. 22 నియామక పరీక్షలను, పబ్లిక్ సర్వీస్కమిషన్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నిర్వహించిన మరో 23 పరీక్షలను రద్దుచేస్తున్నట్లు సోరెన్ ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఉద్యమనేతలు ఇలా కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘మా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం. నియామక పరీక్షల్లో అక్రమాలపై సమగ్రస్థాయిలో దర్యాప్తుతోపాటు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి రెండు నెలల గడువిస్తున్నాం. ఆలోపు ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిచేయకపోతే మళ్లీ ఉద్యమాన్ని మొదలెడతాం’’అని జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి పియూశ్ కుమార్ సింగ్ స్పష్టంచేశారు. ఉద్యమానికి విరామం ప్రకటించిన నేపథ్యంలో గత 15 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రూపేశ్ కుమార్ పాల్, సవితా కుమారీ, రాహుల్ క్రాంతిలు దీక్షను విరమించారు. 26 రోజుల ఉద్యమధాటికి ప్రభుత్వం 22 రిక్రూట్మెంట్ ఎగ్జామ్లను, 23 ఇతర పరీక్షలను రద్దుచేసిందని మంచ్ నేత రవీంద్ర పాశ్వాన్ చెప్పారు. ‘‘ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలను బయటపెట్టిన ప్రజావేగు(విజిల్బ్లోయర్), ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ సంతోష్ కుమార్ మస్తానాను సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి. గత పరీక్షల రద్దు నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయే వారి మీద మాకు సానుభూతి ఉంది. ఈ విషయంలో తప్పు అంతా ప్రభుత్వానిదే’’అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. -
విద్యార్థుల గొంతు నులిమి..
మహబూబాబాద్: విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను అడ్డుకునే క్రమంలో పోలీసులు ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి స్కీం’లో విలీనం చేసే అంశాన్ని వెన క్కి తీసుకోవాలని, జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థి నాయకులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 97ద్వారా డిప్లామా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల పాలిటెక్నిక్ డిప్లామా విద్యకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత తగ్గుతుందన్నారు. కాగా, విద్యార్థులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు విద్యార్థుల గొంతును సీఐతోపాటు పోలీసులు పట్టుకోవడం, ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్, కోశాధికారి గుగులోత్ సూర్యప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు రోడ్డెక్కితే గొంతు పిసికి చంపేస్తారా : హరీశ్రావు ‘విద్యార్థులు రోడ్డెక్కితే గొంతు పిసికి చంపేస్తారా అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఇదేనా మీరు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు అంటూ బుధవారం ఒక ప్రకటనలో నిలదీశారు. విద్యార్థులపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా, ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే లాఠీలు.. హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మద్యం సేవిస్తే బైక్ స్టార్ట్ కాదు.. బైక్కు కొత్త సిస్టమ్
ఓ ఆలోచన అందరినీ కదిలిస్తుంది. ఓ ప్రయోగం సమాజానికి ఉపయోగపడుతుంది. ఓ ఆవిష్కరణ నవశకానికి నాంది పలుకుతుంది. నేటి ఆధునిక యుగంలో విపరీతమైన పోటీ వాతావరణం విద్యార్థులకు సవాల్ విసురుతోంది. నవీన ప్రయత్నాలతో ప్రతిభను ప్రదర్శించాల్సిన ఆవశ్యకతను కల్పిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్యలకు చెక్ పెట్టేలా పలమనేరులోని మదర్థెరిస్సా కళాశాల విద్యార్థులు సరికొత్తగా ఓ డివైజ్ను కనిపెట్టారు.చిత్తూరు: మద్యం సేవించి బైక్ నడపడంతో చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది యువత, విద్యార్థులే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసు శాఖ ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా, భారీ జరిమానాలు విధించినా నియంత్రించడం కష్టంగానే మారింది. తరచూ పత్రికల్లో వచ్చే ఇలాంటి వార్తలను చూసి చలించిన పలమనేరులోని మదర్ థెరిసా ఇంజినీరింగ్ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. మద్యం సేవించి మోటార్ సైకిల్ ఎక్కితే స్టార్ట్ కాని కొత్త సిస్టమ్ను కొనుగొన్నారు. మద్యం సేవిస్తే స్టార్ట్ కాని బైక్ ముందు విద్యార్థులు ముగ్గురు విద్యార్థుల ప్రతిభ కళాశాలకు చెందిన శ్యాంప్రసాద్, జస్వంత్, నందశివకుమార్ అనే బీటెక్ (ఈసీ విభాగం)విద్యార్థులు ఈ డివైజ్ను కనుగొన్నారు. వాహనదారుడు మద్యం సేవించి హెల్మెట్ ధరించగానే సెన్సార్లు గుర్తించి బైక్ స్టార్ కాకుండా చేస్తాయి. అయితే హెల్మెట్ ధరించకుంటే బైక్ అసలు స్టార్ట్ కాదు. దీంతో హెల్మెట్ ధరించగానే లిక్కర్ స్మెల్ను డివైజ్ పసిగడుతుంది. మరోవైపు అన్నీ సక్రమంగా ఉన్నా ఏఐ ద్వారా బైక్ బల్బు ముందు మరో మైక్రో కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది ముందున్న ప్రాంతాన్ని వీడియో తీస్తుంది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తిస్తుంది. దీంతో హిట్ అండ్ రన్ కేసులను సులభంగా గుర్తించవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా రూ.5వేలు మాత్రమే ఉంటుంది. కేవలం సామాజిక ప్రయోజనాల కోసమే దీన్ని తయారు చేసినట్టు విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ఈ డీవైజ్పై పేటెంట్ను పొందుతామని చెబుతున్నారు. ఇది పూర్తిస్థాయిలో విజయవంతం అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశముంటుంది. గతంలో మరో ఆవిష్కరణ గతంలో ఇదే కళాశాలకు చెందిన విద్యార్థి పెట్రోలుతో పనిలేకుండా కేవలం సోలార్, కరెంటు, డైనమోల సాయంతో నడిచే ఈ–బైక్ను రూ.15వేల వ్యయంతో తయారుచేశాడు. ప్రస్తుతం మార్కెట్లో ఈ–బైక్లు హల్చల్ చేస్తున్నా.. పదేళ్ల క్రితమే ఇదే కళాశాల విద్యార్థి ముజామిల్ ఆవిష్కరించాడు. తన తండ్రి అల్లాబక్ ్ష తోపుడుబండిపై అరటిపళ్లను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామాల్లో సైకిల్పై వచ్చే విద్యార్థుల బాధలను చూసి ఎలాగైనా ఈ –సైకిల్ను తయారు చేయాలని భావించాడు. ఇందుకోసం ఓ పాత సైకిల్ను రూ.1,500 కొన్నాడు. దీనికి సోలార్ పెనాల్, 12 వోల్టుల రెండు బ్యాటరీలు, 240 వోల్ట్స్ కలిగిన హబ్మోటార్, దానికి రెగ్యులేటర్, బ్యాటరీ ఇండికేటర్, స్టెప్పార్మోటార్, ఎక్స్లేటర్ కొన్ని కేబుళ్లను సైకిల్కు అమర్చాడు. దీనికోసం అయిన ఖర్చు రూ.13,500. మొత్తం రూ.15వేలతో దీన్ని తయారుచేశాడు. ఇది మూడు రకాల శక్తులతో పనిచేస్తోంది. పైన అమర్చిన సోలార్ ప్లేట్లలో సౌరశక్తి ఉత్పత్తి అయి బ్యాటరీకి చేరుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు కరెంటును నింపుకోవడంతో కరెంటు బ్యాటరీకి చేరుతుంది. సైకిల్ చక్రాలు తిరిగినపుడు డైనమో ద్వారా ఉత్పయ్యే కరెంటు బ్యాటరీకి చేరుతుంది. ఇలా మూడు ఉత్పత్తులు ద్వారా శక్తిని తయారు చేసి దీనిద్వారా మోటారు సాయంతో ఇది నడిచేలా తయారు చేశాడు. ఓసారి బ్యాటరీ ఫుల్ అయితే 40 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. అప్పట్లో ఈ ప్రయాగం సంచలనంగా మారింది. నేడు ఈ–సైకిళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇక మద్యం సేవించి బైక్ ఎక్కితే స్టార్ట్ కాని బైక్లు భవిష్యత్తులో రావచ్చేమో.ప్రతిభకు ప్రశంసలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆటోమేటిక్ బైక్ ఆఫ్ డివైజ్ను తయారుచేసిన విద్యార్థులపై కళాశాల చైర్మన్ రవీంద్రబాబు, అకడమిక్ అడ్వైజర్ రాజేంద్ర రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు వారికి ఆర్థిక సాయం అందించారు. ప్రాజెక్టు అభివృద్ధి, పేటెంట్ కోసం చేయూతనందిస్తామని భరోసా ఇచ్చారు. -
భోపాల్ రోడ్లపై కదం తొక్కిన విద్యార్థులు
భోపాల్: ఇటీవల కాలంలో జెన్-జీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత సంపాదించిందో తెలిసిందే. నీట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో ముగిసింది. అయితే జెన్-జీ యువతకున్న పవరేంటో ఈ ప్రొటెస్ట్తో దేశం మెుత్తం తెలిసింది. కాగా ఇప్పుడు తాజాగా వారి తర్వాత తరం జెన్ అల్పా ఉద్యమ బాట పట్టారు. భోపాల్లోని తమ స్కూల్ విలీనానికి నిరసనగా రోడ్లెక్కారు.భోపాల్లోని రీజినల్ స్కూల్ ‘జెన్ ఆల్ఫా’ ఈ రోజు (బుధవారం) విద్యార్థులు నిరసనకు దిగారు. డెమాన్స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్ (DMS)లను కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS)లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలీనంతో తమ విద్యాసంస్థకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, విద్యా ప్రయోగాల లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.DMS స్కూల్స్ అంటే ఏమిటి?డెమాన్స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్స్ను రీజినల్ స్కూల్స్గానూ పిలుస్తారు. ఇవి 1965 డిసెంబర్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. భోపాల్, అజ్మీర్, మైసూరు, భువనేశ్వర్ నగరాల్లో ఈ ప్రయోగాత్మక పాఠశాలలను ఏర్పాటు చేశారు. కొత్త బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడం, విద్యారంగంలో వినూత్న విధానాలను ప్రయోగించడం, వాటి ఫలితాలను పరిశీలించడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశంగా ఉంది.ఈ పాఠశాలలను KVSలో విలీనం చేయడం వల్ల వాటి ప్రత్యేక విద్యా విధానం, ప్రయోగాత్మక స్వభావం దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థులు, పాఠశాలతో సంబంధం ఉన్న సభ్యులు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ మారితే విద్యా ప్రయోగాలు, పరిశోధనలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. నిరసన అనంతరం విద్యార్థులు తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రీజినల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.కే. గుప్తాకు సమర్పించారు. విలీన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.తమ డిమాండ్లపై అధికారులు త్వరగా స్పందించకపోతే ఆందోళనను దశలవారీగా తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. శాంతియుత నిరసనలు కొనసాగించడంతో పాటు సంబంధిత అధికారులు, శాఖల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రయోగాత్మక విద్యా కేంద్రాలుగా ఉన్న ఈ సంస్థలను మరింత బలోపేతం చేయాలని, వాటి అసలు లక్ష్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. భోపాల్లో ప్రారంభమైన ఈ నిరసన.. రీజినల్ స్కూల్స్ను KVSలో విలీనం చేసే ప్రతిపాదనపై విద్యార్థుల నుంచి వస్తున్న తొలి బహిరంగ వ్యతిరేకతగా నిలిచింది.भोपाल में ‘Gen Alpha Protest’! Regional School को केंद्रीय विद्यालय में मर्ज करने के प्रस्ताव के खिलाफ 300 से ज्यादा छात्र सड़क पर उतरे, बोले—“Save DMS” #GenAlpha #Bhopal #KhabarMirror pic.twitter.com/e7F4rH4sWY— Khabar Mirror (@KhabarMirror) August 19, 2026 -
సర్కారు బడులకు రాం రాం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమేపి పడిపోతోంది. ఇక ప్రహరీ కూలి విద్యార్థులు మృత్యువాత పడుతున్న దుర్ఘటనలు కూడా లేకపోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంతో పోలిస్తే బాబు రెండేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య సుమారు ఆరు లక్షల మేర తగ్గినట్టు శాసన మండలి సాక్షిగా విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఒప్పుకోవడం గమనించదగ్గ అంశం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. విద్యార్థుల సంఖ్య తగ్గుదల ఇలా ... ‘యూడైస్’ విద్యా సమాచార వ్యవస్థ వివరాల మేరకు 2023–24లో వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,031 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33 శాతంగా తేలింది. 2025–26లో చంద్రబాబు పాలనలో 34,92,791కి పడిపోయింది. అంటే 41.40 శాతానికి తగ్గింది. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 34,61,612 మాత్రమే. దీనిని 2023–24తో పోల్చి చూడగా, మొత్తం 5,88,419 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. 2023–24లో 52 శాతం ఉన్న ప్రైవేటు పాఠశాలల వాటా ప్రస్తుతం 56.57 శాతానికి పెరిగింది. విద్యారంగాన్ని పటిష్టం చేసిన వైఎస్ జగన్... వైఎస్ జగన్ హయాంలో నాడు–నేడు కార్యక్రమం అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. మౌలిక వసతులు సమకూర్చారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని బలోపేతం చేశారు. డిజిటల్ తరగతులను అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఇంగ్లిష్ మీడియం, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, ట్యాబ్లు పంపిణీ చేశారు. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంతోపాటు జగనన్న కానుకలో భాగంగా విద్యార్థి కిట్లను అందించారు. అమ్మ ఒడి పథకాన్ని అందించి పేద విద్యార్థులను పాఠశాలలకు రప్పించారు. అయితే వీటన్నింటికి చంద్రబాబు ఈ రెండేళ్లలోనే మంగళం పాడేశారు. ఫలితంగానే విద్యాప్రమాణాలతోపాటు, విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుందనే ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. -
కేసులను ఎత్తేయాల్సిందే
న్యూఢిల్లీ: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత వేళ విద్యార్థులపై పోలీసులు మోపిన కేసులను రద్దుచేసేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తంచేసినా అందుకు మోదీ ప్రభుత్వం సముఖంగా లేదని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘జూలై 25న సీజేపీకి మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ దిశలో ఆలోచనచేసిన సుప్రీంకోర్టు ఎదుట ప్రభుత్వం మోకాలడ్డొద్దు. అలా చేస్తే సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ రెండ్రోజుల్లో సమావేశమై మళ్లీ జాతీయస్థాయి ఉద్యమానికి రంగం సిద్ధంచేస్తుంది’’అని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితా ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరితే ప్రభుత్వం ఆ జాబితాను ఉద్దేశపూర్వకంగా అందజేయలేదు. జాబితా ఇస్తే ఆ కేసులన్నింటినీ 142వ అధికరణం ద్వారా దఖలుపడిన అధికారం ద్వారా రద్దుచేస్తామని కోర్టు మంగళవారం మూడు సార్లు గుర్తుచేసి, జాబితా అడిగినా ప్రభుత్వం సమర్పించలేదు. ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయాలకు తగ్గట్లే దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులు మాట ఇచ్చి తప్పారు. యావత్ భారత దేశ యువత నమ్మకంతో ఆటలాడతామంటే మేం చూస్తూ ఊరుకోం. ఇకనైనా కోర్టు నియమించిన హైపవర్ కమిటీలో సీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. పోలీసుల దారుణాలను వివరించే అవకాశం ఇవ్వాలి’’అని దాస్ కోరారు. -
దారికొచ్చిన జార్ఖండ్!
కేంద్ర విద్యామంత్రి రాజీనామా కోరుతూ వినూత్న తరహా నిరసనలతో, నిరాహార దీక్షలతో ఢిల్లీ జంతర్ మంతర్లో ఊహించని విజయం సాధించిన జెన్ జీ... రాంచీలో సైతం ఘన విజయం సాధించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (జేఎస్ఎస్సీ–సీజీఎల్) పరీక్షను రద్దు చేయటానికి ఎట్టకేలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటనతో ఉద్యమకారుల శిబిరం ఆనందోత్సాహాలతో పొంగిపోగా... రాష్ట్రంలో గత పన్నెండేళ్ల నుంచీ జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయనీ, వాటిపై కూడా చర్యలు తీసుకోబోతున్నామనీ ఆయన చెప్పటం వేలాదిమంది ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేసింది. ఆ నియామకాలన్నీ రద్దు చేస్తారా... చేస్తే దానికి అనుసరించే విధానమేమిటన్న ప్రశ్న ఇప్పుడందర్నీ వేధిస్తోంది. వీరుగాక తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారున్నారు. అన్నీ పూర్తయి నియామకాల కోసం ఎదురుచూస్తున్న మరో 1,975 మంది వీరికి అదనం. తగిన విద్యార్హతలు గలవారంతా ప్రభుత్వోద్యోగం కోసం వెంపర్లాడతారు. ప్రయత్నం ఫలిస్తే జీవితంలో శాశ్వతంగా స్థిరపడిపోవచ్చని ఆశపడతారు. ఆ ఉద్యోగ భద్రత అలాంటిది మరి. కానీ ప్రభుత్వోద్యోగాలు వందల్లో ఉంటే, పోటీపడేవారు లక్షల్లో ఉంటారు. అందుకే తమ చదువులు ఎంతవరకూ పనికొస్తాయన్న భయాందోళనలు అభ్యర్థుల్లో సహజంగానే ఉంటాయి. ఈ పరిస్థితిని శిక్షణ సంస్థలు సొమ్ముచేసుకుంటాయి. లక్షలమంది వేలకు వేలు ఖర్చుచేస్తారు. తీరా ప్రశ్నపత్రాలు లీకయ్యాయని తెలిశాక అలాంటివారి గుండె రగిలిపోదా? ఈ ఆగ్రహావేశాలనుంచే జెన్ జీ ఉద్యమం పురుడు పోసుకుంది. కేంద్ర స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష అయినా, ఇప్పుడు జార్ఖండ్లో జరిగిన ఉద్యోగ నియామకాలైనా వివాదాస్పదంగా మారింది అందుకే. సమాజంలో, జీవితంలో అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో అన్యాయం జరిగిందనుకున్నప్పుడు ఉద్యమాలు పోటెత్తడం అనివార్యమని గ్రహించక, యువత డిమాండ్లను అవగాహన చేసుకోక తమకు అలవాటైన పద్ధతుల్లో ఉద్యమాల్ని అణిచేద్దామని ఢిల్లీలోనూ, రాంచీలోనూ పాలకులు ప్రయత్నించారు. రెండుచోట్లా పాలక కూటములు వేర్వేరు. అవి పరస్పరం ప్రత్యర్థి పక్షాలు. అయినా వారి చర్యల్లో సారూప్యత కనబడటం గమనించదగ్గది. రెండుచోట్లా చివరకు పాలకులు వాస్తవం గ్రహించక తప్పలేదు.జార్ఖండ్లో ఉద్యోగ నియామక పోటీ పరీక్షలన్నిటినీ టీఎస్సార్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేటు లిమిటెడ్(టీడీపీఎల్) నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంస్థ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) కోసం ఇంతవరకూ 10 పరీక్షలు, జెఎస్ఎస్సీకి 5 నిర్వహించింది. వీటిద్వారా బ్లాక్ సప్లయ్ ఆఫీసర్ మొదలుకొని డిప్యూటీ కలెక్టర్, టీచర్, సివిల్ జడ్జీ, ప్రాసిక్యూటర్ వరకూ అనేక పోస్టులు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్రిశంకు స్వర్గంలో పడ్డామనీ, జనం దృష్టిలో నేరగాళ్లుగా మిగులుతామనీ వారంతా గొల్లుమంటున్నారు. తమ నిర్లక్ష్యంతో, కొన్నిసార్లు కుమ్మక్కుతో యువత ఆశయాలపై చన్నీళ్లు చల్లుతున్నామని పాలకులు గుర్తించటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తోంది. టీడీపీ నేతలు క్రీడా ధ్రువీకరణ పత్రాలివ్వటం, సర్కారు ఉద్యోగాలు పంచడం వింత. జాతీయస్థాయి పతక గ్రహీతలు కూడా వారిముందు బలాదూరే! కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ కళ్లు మూసుకుంది. జార్ఖండ్లో ఉద్యమవీరుల పార్టీగా ప్రతిష్ఠ పొందేందుకు నానారకాల ప్రయత్నం చేసిన పక్షమే అక్రమాలెక్కడంటూ దబాయింపులకు దిగుతోంది. దగాపడిన డీఎస్సీ అభ్యర్థులు చానెళ్లలో తమ గోడు వినిపిస్తుంటే... ప్రశ్నపత్రాల లీక్ మొదలుకొని ర్యాంకుల ప్రకటన, నియామకాల వరకూ సర్వం సందేహాలకు తావిస్తుంటే టీడీపీకి ‘తందాన తాన’ పక్షంగా మిగిలింది. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తే ఫస్ట్ ర్యాంకర్ అని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా అతగాడి పేరు డేటానుంచి మాయం చేయటం దేన్ని సూచిస్తోంది? జార్ఖండ్ను చూశాకైనా బుద్ధి తెచ్చుకుని తప్పు గ్రహించక పోతే కూటమి పక్షాలకు ఏపీ జనం టోకున బుద్ధి చెప్పటం ఖాయం. -
పాఠశాలల్లో సమస్యలు.. హైకోర్టుకు 20 వేల పోస్ట్కార్డులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న తీవ్రమైన మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ రాష్ట్రంలోని జిల్లాలకు చెందిన సుమారు 20,000 మంది విద్యార్థులు నేరుగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్కార్డులు రాసి తమ నిరసనను, ఆవేదనను వ్యక్తపరిచారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21A (విద్యా హక్కు) ప్రకారం తమకు న్యాయం చేయాలని ఈ చారిత్రాత్మక ప్రచార ఉద్యమం ద్వారా విద్యార్థులు కోరుతున్నారు.రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులైన సురక్షితమైన తాగునీరు, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం, సైన్స్ లాబొరేటరీలు, లైబ్రరీలు, ఆట స్థలాలు మరియు క్రీడా సాగగ్రి అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు తమ సొంత చేతిరాతతో ఈ లేఖలను రాశారు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక క్లాసులు ఖాళీగా ఉంటున్న విషయాన్ని కూడా వారు ఈ ఉత్తరాలలో ప్రస్తావించారు.కోర్టు ఈ లేఖలను సుమోటోగా స్వీకరించి, ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా (PIL) పరిగణించాలని నిర్వాహకులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.‘నా పేరు శ్రావణి, నేను ఐదవ తరగతి చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ హై కోర్ట్ న్యాయమూర్తి గారికి తెలియజేయడమేమనగా మా పాఠశాలలో తరగతి గదులు లేవు, మాకు మంచినీటి సరఫరా లేదు, మాకు కంప్యూటర్లు లేవు. మాకు ఇవన్నీ కల్పించాలి. థాంక్ యు!’‘నా పేరు వైష్ణవి, నేను పడవ తరగతి చదువుతున్నాను. నేను గువ్వలదిన్నె గ్రామం నుండి నందిన్నె స్కూల్ కి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. ఉదయం 4 కిలోమీటర్లు, సాయంత్రం 4 కిలో మీటర్లు కాలి నడకతో వస్తున్నాం. బస్సు సౌకర్యం లేనందున కొంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. అందుకోసం మాకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం.’ఈ పోస్ట్కార్డుల ద్వారా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల విద్యార్థుల వాస్తవ పరిస్థితులు అత్యున్నత న్యాయస్థానానికి నేరుగా చేరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం,(TSCPCR), విద్యాశాఖ వెంటనే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్వాహక బృందం డిమాండ్ చేస్తోంది. -
Viral Video: విద్యార్థినుల మధ్య తీవ్ర ఘర్షణ..
-
మెగా డీఎస్సీ స్కామ్కు సమాధానమేది
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 కుంభకోణంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ప్రజల్లోకి వెళ్లడం.. నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత, జెన్జీ దీనికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు నిద్ర పట్టడం లేదు. అందుకే దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఆపసోపాలు పడుతున్నారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారించాలనే డిమాండ్లు రోజురోజుకీ వెల్లువెత్తుతుండటంతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును కాపాడేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం అసెంబ్లీలో తండ్రి, కుమారుడు డీఎస్సీ అక్రమాలను సమర్థించుకుంటూ తప్పుదోవ పట్టించేలా కళ్లార్పకుండా అబద్ధాలు వల్లె వేశారని, అడ్డగోలు వాదనలు వినిపించారని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అని నిలదీస్తున్నారు. ‘‘ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను ఔట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? పతకాలు లేకపోయినా కేవలం పార్టిసిపేట్ చేస్తే ఉద్యోగాలిస్తారా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? సొంత పార్టీ నేతలే క్రీడా ధృవీకరణ పత్రాలు ఇవ్వటాన్ని నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటారు? మెగా డీఎస్సీపై 336 కేసులు వేశారంటూనే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయించడం ఏమిటి? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియోపై తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదుతో సరిపుచ్చి అసలు సూత్రధారులెవరో బయట పడకుండా తొక్కిపెడుతున్నదెవరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయనే. ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారించాలి’’ అని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. కీలక ప్రశ్నలకు లోకేశ్ సమాధానం చెప్పకుండా సవాళ్లు విసరటాన్ని, సభ సాక్షిగా వ్యక్తిగత దూషణలకు దిగటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమకు సమాధానం చెప్పాల్సిందేనని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజే స్పోర్ట్స్ కోటాలో నియామకాలకు అర్హత పరీక్ష ఎత్తివేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ ఒకరికేఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నల అప్లోడ్, డిజిటల్ నిర్వహణ అత్యంత గోప్యంగా జరగాలి. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను ఎస్సీఈఆర్టీ రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ ఇక్కడ డీఎస్సీ కన్వీనర్ను పక్కనపెట్టి ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండు బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు బీజం పడింది ఇక్కడే. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టడం వెనుక ఉద్దేశమేంటి?‘వెరిఫికేషన్కు రాలేదు’.. మరి కాల్ లెటర్ ఏది?మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి ధ్రువపత్రాల పరిశీలనకు రాలేదని, అందుకే పోస్టు ఇవ్వలేదని లోకేష్, చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాకమ్మ కబుర్లు కాదా? ఎందుకంటే.. మెరిట్ జాబితాలో ఆ అభ్యర్థి పేరు తీసేశారు.. అభ్యర్థి డేటాను మాయం చేశారు.. కాల్ లెటర్ ఇవ్వలేదు.. ఇక అలాంటప్పుడు ధృవపత్రాల పరిశీలనకు ఎలా వస్తాడు? అసలు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాలేదని చెబుతున్న వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? అతడు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది.అవన్నీ గోల్మాల్ కాక మరేంటి?కీలక బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం..అతడికి టాప్ ర్యాంకు రావడం.. ఆ తర్వాత పోస్టు ఇవ్వకపోవడం.. అతడి వివరాలను మాయం చేయడం.. ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికీ అర్థం పేపర్ లీక్ అయిందని అంగీకరించినట్లే కదా? పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐతో విచారణ జరగాలి.కలెక్టరేట్లు డమ్మీ.. పారదర్శకత ఎక్కడ?గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. మెగా డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ జాబితాలు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు. బహిరంగంగా జాబితాలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సందేశాలు పంపించే కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అసలు పారదర్శకత ఎక్కడ ఉంది? సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్లకు వెళ్తే పైకి వెళ్లండని, మాకు సంబంధం లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?వన్ టు వన్ పిలిచి.. ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. నిబంధనల ప్రకారం మెరిట్, రోస్టర్ ఆధారంగా ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. అంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఓపెన్లోకి వస్తారా? రిజర్వేషన్లోకి వస్తారా? ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికులు వంటి వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే తెలుసు. అందుకే 1 : 1 కింద పిలిచారు. మరి ధృవపత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? వారిని తిరస్కరించిన జాబితాలో కూడా ఎందుకు చూపలేదు? ప్రశ్నిస్తే సర్దుబాటు అంటున్నారు. ఎవరి కోసం ఈ సర్దుబాటు? వీటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా?క్రీడాకారుల ప్రతిభ చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. పతకాలు చూడలేదు. కేవలం ఆటల్లో పాల్గొన్న ధృవపత్రం ఉంటే చాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. బాల్ బ్యాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 270 మందికి పతకాలు లేకపోయినా కేవలం పాల్గొన్నందుకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అంతర్ కళాశాల పోటీల్లో పాల్గొన్న 99 మందికి ఉద్యోగాలు రాగా.. వారిలో 86 మందికి పతకాలు, ట్రోఫీలు లేవు. అంతర్ జిల్లా పోటీల్లో 59 మందికి ఉద్యోగాలు రాగా వారిలో 18 మందికి కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చారు.ధృవపత్రాలు ఇచ్చేదీ.. ధృవీకరించేదీ వారేనా?సాఫ్ట్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో సంఘం అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ భరత్ ఉన్నారు. వాళ్లే ధృవపత్రాలు ఇచ్చి.. వాళ్లే ధృవీకరించి.. వాళ్లే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎలా వచ్చింది? అంటే నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగలేదా? జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఉద్యోగాలు రాకుండా.. కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు రావడం న్యాయమా?ఒక్కో పోస్టుకు రూ.15–20 లక్షల బేరసారాలా?స్పోర్ట్స్ కోటా పోస్టులకు ఒక్కొక్కదానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ప్రభుత్వ చిహ్నాన్ని ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్తో వదిలేశారు. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ స్పష్టంగా ఉన్నా ఎఫ్ఐఆర్లో పేరు వెల్లడించకుండా అనుమానితుడిగా మాత్రమే పేర్కొనడం ఎందుకు? ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే దానికి సమాధానం లేదు. నిజాలు తేలాలంటే సీబీఐ విచారణే..మెగా డీఎస్సీ వ్యవహారంలో ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు.. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రవేశం నుంచి టాప్ ర్యాంకు వరకు.. మెరిట్ జాబితా మార్పుల నుంచి కాల్ లెటర్ల వరకు.. స్పోర్ట్స్ కోటా నుంచి బేరసారాల ఆరోపణల వరకు అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విచారణ జరిగితే నిష్పక్షపాతంగా నిజాలు బయటకు వస్తాయా? స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున దీనిపై స్వతంత్ర విచారణ అవసరమని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై మూడో పక్షం దర్యాప్తు జరగాలని స్పష్టంచేస్తున్నారు. సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని, దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్న డిమాండ్పై చంద్రబాబు సర్కారు ఎందుకు స్పందించడంలేదు?అవుట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంకర్ఈ ప్రక్రియలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు సాధించారు. టీజీటీ తెలుగు పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించాడు. అంటే ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకు వెళ్లింది? ఎంతమందికి చేరింది? లీకైన ప్రశ్నాపత్రం పొందినవారు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ తేలాల్సి ఉంది. నిజంగానే మెరిట్తో ర్యాంకు సాధించి ఉంటే అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? లోకేశ్ వీటికి సమాధానం చెప్పలేదు.స్పోర్ట్స్ కోటా.. మరో పెద్ద కుంభకోణంమెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాను మరో పెద్ద కుంభకోణంగా మార్చారు. గతంలో రెండు శాతం ఉన్న క్రీడా కోటాను మూడు శాతానికి పెంచారు. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే కేవలం క్రీడా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారు. కొన్ని పోస్టులకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ధ్రువపత్రం సమర్పించవచ్చనే మినహాయింపులు కూడా ఇచ్చారు. అనుకున్న వారికి పోస్టులు ఇచ్చిన తర్వాత మళ్లీ నిబంధనలు మార్చి పాత జీవోలను రద్దు చేశారు. నిజంగా మంచి జీవోలు అయితే వాటిని ఎందుకు రద్దు చేశారు? తన వివరణలో లోకేశ్ ఈ అంశాలను ప్రస్తావించనేలేదు. -
ఈ చావుకు బాధ్యులెవరు?
ఆంధ్రప్రదేశ్, చిత్తూరు: పండుగైనా, పుట్టిన రోజైనా, రాజకీయ నేతల పర్యటనలైనా ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. అభిమానం ముసుగులో మృత్యువుతో చెలగాటం ఆడుతున్నామన్న ఆలోచనను యువకులు విస్మరిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే క్రమంలో కనీస భద్రతా ప్రమాణాలను పాట్టించడం లేదు. దీంతో ఎంతో భవిష్యత్ ఉన్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ తీగలు తగిలి గోకుల్, విఘ్నేష్ అనే ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకొన్న తాజా దుర్ఘటనే ఇందుకు నిదర్శనం. ఇలాంటి ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహించాలి?.. ఆర్భాటాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నేతలా?.. నిబంధనలు అమలు చేయని అధికారులా?.. అభిమానం పేరిట హద్దులు దాటుతున్న యువకులా?.. పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపని తల్లిదండ్రులా? ఎవరు.. ఎవరు అన్న ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.పుత్తూరు పట్టణంలో గత శుక్రవారం చోటు చేసుకొన్న గోకుల్, విఘ్నేష్ అనే విద్యార్థుల అకాల మరణంపై పెద్ద చర్చే జరుగుతోంది. అది ఒక ప్రమాదం కాదని, ఈ దుర్ఘటనను ఇద్దరు విద్యార్థులు విద్యుత్ తీగలు తగిలి మృతి అంటూ ఒక వార్తగా చదవరాదని పలువురు వాదనలు చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ, సామాజిక ఒత్తిళ్లు ఒకవైపు, అధికారుల నిర్లక్ష్యం మరోవైపు ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇందులో యువకుల తొందరపాటు, తల్లిదండ్రుల పర్యవేక్షణా లోపం కూడా ఉందంటూ వివరిస్తున్నారు.ఫ్లెక్సీలు కట్టడం చిన్న పని కాదు పండుగలు, ఉత్సవాలు, తిరునాళ్లు, జాతరలు, రాజకీయ నాయకుల పర్యటనలు అంటూ ప్రతి కార్యక్రమానికీ రోడ్డు పక్కన ఫ్లెక్సీల ఏర్పాటు సాధారణ విషయంగా మారిపోయింది. అయితే వీటిని ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఫోల్స్, రహదారి పక్కన ఉండే గోతులు, వాహనాల ఎత్తు వంటి పలు విధాలుగా మృత్యువు పొంచి ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించి యువకులు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు నడుం బిగించాల్సి ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది.రాజకీయ నేతలు చేయాల్సింది ఏమిటీ?నాయకులు, ప్రజాప్రతినిదులు సైతం తమ అభిమానులు ప్రమాదకర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. పరిమిత పరిమాణం, పరిమిత సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలన్న సూచనలు చేయాలి. తమ స్వాగతం కోసం మరొకరి ప్రాణం పోకూడదన్న బాధ్యతగా రాజకీయ నేతలు వ్యవహరించాలి.అధికారుల బాధ్యత ఏదీ? పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫ్లెక్సీల నియంత్రణలో అధికారుల పనితీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్, పోలీస్, విద్యుత్ శాఖ అధికారుల బాద్యత ఎంతో కీలకం. అయితే వీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రమాదాలకు పరోక్షంగా అవకాశం కల్పిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.అధికారులు పరిశీలించాల్సిన అంశాలుఫ్లెక్సీ ఎక్కడ ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు?విద్యుత్ పోల్స్, తీగలు ఎంత దూరంలో ఉన్నాయి?రహదారిలో వాహనాలకు అడ్డు తగిలే అవకాశం ఉందా?ఫ్లెక్సీ పరిణామం, నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా?గాలి, వానకు ఫ్లెక్సీ కూలితే పాదచారులకు, ప్రయాణికులకు ప్రయాదం జరిగే అవకాశం ఉందా?ఫ్లెక్సీ ఏర్పాటు సమయం, కాల పరిమితి ఎంత? ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని తర్వాత ఫ్లెక్సీ ఏర్పాటుకు తగిన రుసుం వసూలు చేసి అనుమతివ్వాలి. -
లక్నో వీధుల్లో ‘జెన్ ఆల్ఫా’ ఆగ్రహం.. నిరసనలకు కారణాలివే!
లక్నో: పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల సమస్యలపై ఉత్తరప్రదేశ్లోని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. లక్నోలోని దుబగ్గ ప్రాంతంలోని జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ విద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ బాలాగంజ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.అయితే, మూడు రోజుల క్రితం కూడా ఇదే పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల కొరత, పాఠశాలలోని వసతులపై నిరసనకు దిగారు. ఆ సమయంలో కన్నౌజ్ వెళ్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అధికారులు తమ కాన్వాయ్ను నిలిపి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులను త్వరగా నియమిస్తామని హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో విద్యార్థులు మరోసారి రోడ్డుపైకి వచ్చారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.ఈ విద్యార్థుల నిరసనలు కేవలం ఉత్తరప్రదేశ్కే పరిమితం కాలేదు. ఫతేపూర్, హమీర్పూర్, బిహార్, రాజస్థాన్లోని బార్మేర్, జాలోర్, మధ్యప్రదేశ్లోని ఛింద్వారా, సిరోంజ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ పాఠశాల విద్యార్థులు వివిధ సమస్యలపై ఆందోళనలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.హమీర్పూర్లో గ్రామానికి రహదారి లేకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 'చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలనుకుంటున్నాం.. కానీ పాఠశాలకు వెళ్లే దారే ఇలా ఉంటే ఎలా' అని విద్యార్థులు వారి ఇబ్బంది పరిస్థితులను చెప్పుకొచ్చారు. మరోవైపు అల్వార్లో పాఠశాల పైకప్పు దెబ్బతినడంతో భద్రతపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. కన్నౌజ్లో పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో విద్యార్థులు ఆ భోజనాన్ని బహిష్కరించినట్లు సమాచారం.అయితే, ఉత్తరప్రదేశ్ నుంచి పలు రాష్ట్రాలకు చేరుకున్న ఈ విద్యార్థుల ఆందోళనలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రత, నాణ్యమైన భోజనం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యార్థులు స్వయంగా రోడ్డెక్కడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. -
సమస్య వైపు పరుగెత్తు!
నేను చాలా ప్రసంగాలు చేశాను. కానీ ఇది నాకు వ్యక్తిగతమైనది. 1986 చలికాలంలో మిట్లో చేరాను. నా తల్లిదండ్రులు నన్ను నెక్ట్స్ హౌస్ హాస్టల్లో దింపి వెళ్లారు. అప్పుడు నాకు 17 ఏళ్లు. నేను తైవాన్లో పుట్టాను. అమెరికాలోని క్వీన్స్ ప్రాంతంలో పెరిగాను. గణితంలో నేను దిట్ట అని నమ్మేదాన్ని! కానీ రెండు వారాల్లోనే ఒక విషయం అర్థమైంది: ఎంఐటీలో గణితంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు! మొదటి అసైన్మెంట్లను చూస్తూ అనుకున్నాను: ‘అయ్యో! ఇవి ఎంతో కష్టంగా ఉన్నాయి!’ నేను కాలేజీకి (ఫ్రెష్మన్ ఇయర్కు) వచ్చేవరకు ఎప్పుడూ రాత్రంతా నిద్రలేకుండా చదవడం లేదా పనిచేయడం అనేది లేదు. మిట్లో చేరాక ఆ అనుభవం కొత్తగా ఉన్నా... క్లాస్మేట్స్తో కలిసి పని చేయడం సరదాగా అనిపించింది. మిట్ మనల్ని ఊహించిన దానికంటే ఎంతో ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన మార్గాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు సమస్యలతో కుస్తీ పడతారు. ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒకటి రెండు సర్క్యూట్లు పేలిపోవచ్చు. కానీ ఏదోలా చివరకు ఆ పని పూర్తవుతుంది. అప్పుడు మీరే స్వయంగా ఏదో ఒకటి తయారు చేయగలరని మీకు అర్థమవుతుంది. సెమీకండక్టర్లతో ప్రేమమిట్లో డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) చదువుతున్నప్పుడే రీసెర్చ్లో పనిచేసే అవకాశం రావడం నా జీవితాన్నే మార్చేసింది. ఎక్స్–రే లిథోగ్రఫీ మాస్క్ బ్లాంక్స్ తయారు చేయడం ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం. అప్పట్లో దాని అర్థం ఏమిటో కూడా నాకు పూర్తిగా తెలి యదు. కానీ నా మొదటి ‘బన్నీ సూట్’ (క్లీన్ రూమ్లో వేసుకునే ప్రత్యేక దుస్తులు) వేసుకుని... చిన్న 2–అంగుళాల వేఫర్లపై పరికరాలు తయారు చేయడం ప్రారంభించాను. ఆ వేఫర్లు సున్నితంగా ఉంటాయనీ, పొరపాటున కూడా వాటిని పగలగొట్టకూదడనీ త్వరగానే గ్రహించాను. నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. వాటిలో ఎక్కువ శాతం మేము ఆశించిన విధంగా పనిచేయలేదు. పద్ధతి మార్చుకుని, మళ్లీ ప్రయత్నించాం. నేను తరగతి గదిలో టెక్నాలజీ గురించి చదవడం మాత్రమే చేయలేదు; కొత్త విషయాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న ఒక బృందంలో భాగమయ్యాను. నాకైతే అప్పట్లో ఒకటే ఆలోచనొచ్చింది. వావ్, మనం ఇంత చిన్న వస్తువులను కూడా తయారు చేయగలమా? కానీ ప్రపంచాన్నే మార్చగల శక్తిమంతమైన చిన్న పరికరాలు ఇవి. అప్పుడే నేను సెమీ కండక్టర్లతో ప్రేమలో పడ్డాను. అక్కడే నేను సమస్యలను ఎలా పరిష్కరించాలో అసలు సిసలు పాఠాలు నేర్చుకున్నాను. ఆ రంగా నికి కొత్తగా వచ్చిన విద్యార్థి స్థాయి నుంచి, స్వయంగా ఆ రంగానికి కొత్త విషయాలు అందిస్తున్న వ్యక్తిగా మారాను. ఆ ప్రయాణంలో, నా మీద నాకు నమ్మకం కలగడం మొదలైంది. అది నాకు ఎప్పుడూ అన్ని సమాధానాలూ తెలుసనే అతివిశ్వాసం కాదు; అసలు సమాధానం ఇప్పుడే తెలియకపోయినా దాన్ని నేను కనుగొనగలను అనే ఆత్మవిశ్వాసం. మిట్ నాకు సెమీకండక్టర్ ఫిజిక్స్ కంటే పెద్ద విషయాన్ని నేర్పిందని నాకు అర్థమవుతోంది. మైండ్ అండ్ హ్యాండ్ మిట్ మోటో ‘మైండ్ అండ్ హ్యాండ్’ కేవలం ఒక నినాదం అనుకున్నాను. కానీ అది మిట్ ప్రత్యేకతను సరిగ్గా తెలియజేస్తుందని భావిస్తున్నాను. మిట్ మనకు లోతుగా ఆలోచించడం నేర్పిస్తుంది. ఏదైనా తయారు చేయడం, ఆలోచనలను పరీక్షించడం, మొదటి ప్రయోగం లేదా ఐదో ప్రయోగం కూడా విఫలమైనా ఆగిపోకుండా ముందుకు సాగడం నేర్పిస్తుంది. ఒకప్పుడు అసాధ్యమని పించిన సమస్యలను కూడా మీరు పరిష్కరించగలరని మీపై మీకే నమ్మకం కలిగేలా చేస్తుంది. నేను క్యాంపస్ వదిలి వెళ్లిన చాలా కాలం తర్వాత కూడా అదే భావనతో ఉన్నాను. నేను ఐబీఎంలో చేరినప్పుడు,మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినట్లు అనిపించింది. ఐబీఎంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. అప్పట్లో నాకు 25 ఏళ్లు.అంత పెద్ద కంపెనీలో నేను ఎలా మార్పు తీసుకురాగలను అని ఆశ్చర్యపోయాను. కానీ త్వరగా ఒక ముఖ్యమైన విషయం తెలుసు కున్నాను. ఇంజినీరింగ్ మీ వయసును పట్టించుకోదు. మీ ఆలోచ నలు పనికొస్తాయా లేదా అనేదే చూస్తుంది. నా మెంటార్లలో ఒకరు నాకు చెప్పిన ఒక మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేదు: అత్యంత కష్టమైన సమస్యల వైపు పరు గెత్తుకుంటూ వెళ్లు! అప్పట్లో అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. కాలక్రమేణా, నా జీవితంలో లభించిన అత్యుత్తమ సలహా అదేనని అర్థమైంది. కష్టమైన సమస్యలే మీ అసలు సత్తా ఏమిటో మీకు తెలియజేస్తాయి. కొంచెం వెనక్కు వెళ్తే... 12 ఏళ్ల క్రితం, ఆ పాఠాన్ని నిజ జీవితంలో పరీక్షించి చూసే అవకాశం వచ్చింది. నాకు ఏఎండీ సంస్థకు సీఈఓ అయ్యే అవకాశం లభించింది. ఆ ఉద్యోగంలో చేరడం రిస్క్ అని నా మెంటార్లలో కొందరు భావించారు. కానీ ఇది నా డ్రీమ్ జాబ్ (కలల ఉద్యోగం). నిజంగా ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై,సాంకేతిక రంగంలో కొత్త టెక్నాలజీతో పనిచేసే అవకాశం. భవి ష్యత్తులో అత్యంత కీలకమైన సాంకేతికత హై–పెర్ఫార్మెన్స్ కంప్యూ టింగ్ (అధిక పనితీరు గల కంప్యూటింగ్) అని మేము దీర్ఘకాలికంగా నమ్మాం. మా ప్రతిభావంతులైన బృందానికి పెద్ద ఆలోచనలు చేసే స్వేచ్ఛను ఇచ్చాం. తదుపరి కొన్ని సంవత్సరాలలో, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లను తయారు చేయడానికి వీలుగా మేము టెక్నాలజీని అభివృద్ధి చేశాం. భవిష్యత్ను నిర్ణయించేది మనుషులే!గడచిన కొన్ని దశాబ్దాలలో మనం అనేక సాంకేతిక మార్పులను చూశాం. ఇప్పుడు ఏఐ విప్లవానికి ప్రారంభంలో ఉన్నాం. ఏఐ మనుషులను భర్తీ చేయదు. బదులుగా, ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. వైద్యం, శాస్త్రం, ఇంధనం, వాతావరణం– ఏ రంగంలోనైనా, మనం గడిచిన ముప్పై ఏళ్లలో కనుగొన్న దానికంటే ఎక్కువ విషయాలను రాబోయే పదేళ్లలోనే కనుగొనవచ్చు. అయితే భవిష్యత్తు ఎలా ఉండాలనేది సాంకేతికత నిర్ణయించదు, మనుషులే నిర్ణయిస్తారు. శక్తిమంతమైన పరికరాలను ఎలా ఉపయోగించాలో తెలిసిన మనుషులు ప్రపంచానికి అవసరం లేదు. వాటిని ‘దేని కోసం’ ఉపయోగించాలో తెలిసిన మనుషులు కావాలి. నన్ను ఎవరైనా కెరీర్ సలహా అడిగితే, ఒకటే చెబుతుంటాను: కష్టపడి పనిచేయండి, కానీ అదృష్టం కూడా ముఖ్యం అని గ్రహించండి. కాలక్రమేణా నేను ఒక విషయాన్ని నమ్మడం మొదలు పెట్టాను. గొప్ప వ్యక్తులు తమ అదృష్టాన్ని తమంతట తామే సృష్టించుకునే మార్గాలను వెతుక్కుంటారు. అదృష్టం అంటే సరైన సమయంలో, సరైన స్థలంలో ఉండటమే కాదు. ఒక కష్టమైన పని చేయ డానికి రిస్క్ తీసుకోవడం. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం. మీకు తెలిసిన విషయాల హద్దులు దాటి కొత్త సమస్యలను ఎంచుకోవడం. మిమ్మల్ని మరింత మెరుగుపరిచే వ్యక్తుల మధ్య ఉండటం. ‘అవును.. మనం ఈ ప్రపంచాన్ని మార్చగలము’ అని నమ్మడం. మీరు ఎంచుకునే సమస్యల విషయంలో పెద్ద ఆశయాలు కలిగి ఉండండి. అన్నింటికంటే కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రండి! -
జార్ఖండ్లో విద్యార్థుల రణరంగం: 20న సీఎం నివాసం ముట్టడి!
రాంచీ: జార్ఖండ్లో జేపీఎస్సీ , జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనలు శనివారంతో 23వ రోజుకు చేరుకోగా, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆరోపిస్తూ, తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆగస్టు 20న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి.ఈ నిరసనల్లో భాగంగా ఆగస్టు 16న జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లా కేంద్రాల్లో సీఎం సోరెన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేయాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ నాయకుడు రవీంద్ర పాశ్వాన్ మాట్లాడుతూ ‘మేము సీఎం రాజీనామాను కోరుతున్నాం. ముఖ్యమంత్రి స్పందించకపోతే, రాహుల్ గాంధీ జేఎంఎం కూటమి నుంచి మద్దతు ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇటీవల అసెంబ్లీ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఉద్రిక్తతలకు దారితీసింది.మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ సహా మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను రంగంలోకి దించుతామని తెలిపింది. అయితే, కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న విద్యార్థుల డిమాండ్ను మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదు. సీఐడీ దర్యాప్తులో భాగంగా జేపీఎస్సీ మాజీ చీఫ్ ఎల్. ఖియాంగ్టెను పోలీసులు అరెస్టు చేశారు.ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధి కోసం అమాయక విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి ప్రలోభాలకు లోనుకావొద్దని సోరెన్ సూచించారు.ఇది కూడా చదవండి: ప్రమాదంలో ‘జెన్ జీ’: పార్టీలు, విహారయాత్రలకు భారీగా అప్పులు? -
21వ రోజుకు విద్యార్థుల నిరసన
రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరుకున్నాయి. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్ర చేపడతామని విద్యార్థులు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరంగా యాత్రతో తమ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో మరింత పారదర్శకతను తేవాలని, పలు పరీక్షలను రద్దు చేసి, సీబీఐ లేదా రా్రõÙ్టతర రిటైర్డ్ జడ్జీలతో విచారణ జరిపించాలనే డిమాండ్లతో విద్యార్థులు నిరసనలను కొనసాగిస్తుండటం తెల్సిందే. ఈ నెల 10వ తేదీన చలో అసెంబ్లీ సందర్బంగా జరిగిన నిరసనలకు సంబంధించి పోలీసులు 300 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు పెట్టారు. కాగా, గత 13 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఆస్పత్రిలో చేరిన జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికార్ మోర్చా(జేఎల్కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతో ఆరోగ్యం విషమంగా మారింది. ఆయనతోపాటు దీక్ష చేపట్టిన మరో నలుగురు విద్యార్థులకు కూడా సదర్ ఆస్పత్రిలోనే చికిత్సలు అందుతున్నాయి. -
రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ
-
ఇక మేమందరం వారిని కర్రలతో తరుముతాం: విద్యార్థులు
రాంచీ: నగరంలో నిరసన చేపట్టిన జేపీఎస్సీ, జేఎస్సీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు తీసుకున్న చర్యల్లో పలువురు అభ్యర్థులు గాయపడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్ అంతటా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. నియామకాలకు సంబంధించిన డిమాండ్లపై శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా చీకట్లో తమపై లాఠీచార్జ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వీడియోలు పోలీసుల చర్యపై చర్చను మరింత తీవ్రం చేశాయి. ఈ ఘటన తమ నిరసన దిశను ఎలా మార్చిందో తెలుసుకునేందుకు జాతీయ మీడియా రాంచీలోని ధుర్వా మోర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడింది.జేపీఎస్సీ అభ్యర్థి రూపేశ్ కుమార్ పాల్ ప్రస్తుతం 8వ రోజు నిరాహార దీక్షలో ఉన్నారు. పోలీసుల చర్య తమ సంకల్పాన్ని మరింత బలపరిచిందని ఆయన చెప్పారు. “పోలీసుల లాఠీలకు, వాటర్ కానన్లకు మేము భయపడము. మా డిమాండ్లు నెరవేరే వరకు నిరాహార దీక్ష, నిరసన కొనసాగుతుంది” అని ఆయన అన్నారు. 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న రూపేశ్.. 11వ, 12వ, 13వ, ఇప్పుడు 14వ జేపీఎస్సీ పరీక్షలు రాశానని చెప్పారు. ప్రతి నియామక ప్రక్రియలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.“నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాకు నలుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అదృష్టవశాత్తూ నా పెద్ద అన్నకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. అదే మా కుటుంబానికి అండగా నిలుస్తోంది. లేకపోతే నేను మళ్లీ పరీక్ష రాసే పరిస్థితిలో ఉండేవాడిని కాదు” అని చెప్పారు. ఆగస్టు 10 ఘటన తర్వాత మరింత మంది విద్యార్థులు నిరసన స్థలానికి చేరుకున్నారని, ప్రభుత్వంతో న్యాయమైన చర్చల కోసం కోర్ కమిటీ ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు.ఏళ్ల తరబడి నిరీక్షణ.. ఉద్యోగం లేదుబొకారో జిల్లాలోని కస్మార్ ప్రాంతానికి చెందిన హబీబా కూడా నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. 2017 నుంచి ఆలస్యమైన నియామక ప్రక్రియల మధ్య తాను చిక్కుకుపోయానని ఆమె చెప్పారు. పంచాయత్ కార్యదర్శి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత నియామక ప్రక్రియలోని పలు దశలు పూర్తి చేసినా, వయోపరిమితిలో ఒక్క రోజు తక్కువగా ఉండటంతో తన ఫలితాన్ని నిలిపివేశారని చెప్పారు.తన తండ్రి అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబం ఆ ఉద్యోగంపైనే ఆశలు పెట్టుకుందని ఆమె తెలిపారు. హబీబా 3 సార్లు జేపీఎస్సీ పరీక్ష కూడా రాశారు. అభ్యర్థుల డిమాండ్లు ఆమోదించే వరకు నిరసన కొనసాగిస్తానని చెప్పారు.వారు ఓట్ల కోసం వస్తే కర్రలతో.. మరో నిరసనకారుడు రాహుల్ కుమార్ పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం ఝార్ఖండ్ అంతటా విస్తరిస్తుందని హెచ్చరించారు. “ప్రభుత్వానికి లాఠీ భాషే అర్థమైతే మా యువత మౌనంగా ఉండదు. ఇప్పుడు ఝార్ఖండ్లో ప్రతి బ్లాక్లో, ప్రతి గ్రామంలో తిరుగుబాటు కనిపిస్తుంది” అని అన్నారు.“రాబోయే రోజుల్లో ఏ గ్రామంలోనూ, జిల్లాలోనూ, బ్లాక్లోనూ ఏ మంత్రి, ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించనివ్వము. వారు వస్తే మా యువత కర్రలతో తరిమేస్తుంది. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మమ్మల్ని కొట్టిన విధంగానే ప్రతిస్పందన ఎదురవుతుంది” అని అన్నారు. మేము ఉద్యోగాలు అడిగితే కర్రలతో మమ్మల్ని తరిమేశారు. ఇప్పుడు వారు ఓట్లు అడగటానికి వస్తే మేమూ కర్రలతో వారిని తరిమేస్తాం” అని చెప్పారు.చర్చల డిమాండ్ దేవేంద్ర నాథ్ మహతో నేతృత్వంలో, రాహుల్ క్రాంతి, రూపేశ్ కుమార్ పాల్, హబీబా, సవితా కుమారి పాల్గొంటున్న నిరాహార దీక్ష రాంచీలో కొనసాగుతోంది. తమ డిమాండ్లు ఉద్యోగాలకే పరిమితం కావని, నియామకాల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కూడా జరగాలని నిరసనకారులు చెబుతున్నారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. -
టీచర్కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ఆల్ఫా
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు!ఉత్తరప్రదేశ్లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.జెన్ ఆల్ఫా అంటే ఎవరు?జెన్జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు.ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.#Jabalpur में Gen Alpha का धरना प्रदर्शन.चीन-अमेरिका हमारे देश की शिक्षा व्यवस्था सुधारने के लिए इन छात्रों को Funding कर रहा है- कट्टर अंधभक्त pic.twitter.com/3IVFzMuuFC— NEYU MADHYAPRADESH (@NEYU4MP) August 13, 2026ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది. -
జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి యత్నం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో రణరంగంగా మారిన విద్యార్థుల ఉద్యమంలో పరీక్షార్థులపై పోలీసులు విచక్షణారహిత లాఠీచార్జ్ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో, బీజేపీ అనుబంధ అఖిలభారత విద్యార్థి పరిషత్ అసెంబ్లీ బయట తీవ్రస్థాయిలో తమ నిరసనను వ్యక్తంచేశాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ(జేఎస్ఎస్సీ)ల ఉద్యోగ నియామక ప్రక్రియలు, పరీక్షల్లో సంస్కరణల సాధన కోసం పరీక్షార్థులు సోమవారం రాంచీలో చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం తెల్సిందే. మంగళవారం వందలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు పాత విధానసభ నుంచి కొత్త శాననసభకు నడుచుకుంటూ, బస్సులో ర్యాలీగా రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాట ఎక్కువవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు 110 మంది కార్యకర్తలను అరెస్ట్చేశారు. వీరిలో మహిళా కార్యకర్తలూ ఉన్నారు. తోపులాటలో ఒక అమ్మాయి, అబ్బాయి స్పృహతప్పి పడిపోయారు. ‘‘నియామక ప్రక్రియలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుంటే కారణంలేకుండా చాలా మందిని పోలీస్ వ్యాన్లలోకి పడేశారు. పలువురికి గాయాలయ్యాయి’’అని ఏబీవీపీ కార్యకర్త కుమార్ దివ్యాన్షు చెప్పారు. లాఠీచార్జ్ను ఖండిస్తూ బీజేపీ ఇచి్చన బంద్ పిలుపుమేరకు జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, కళాశాలలు, పాఠశాలలు మూసేశారు. వ్యాపారసముదాయాలు మూసేయడం, ప్రజారవాణా వ్యవస్థలు స్తంభించడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీలో నిరసనలుఉద్యమిస్తున్న పరీక్షార్థులపై పోలీసులు లాఠీలకు పనిజెప్పడమేంటంటూ సోరెన్ సర్కార్ను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను స్తంభింపజేశారు. దీంతో ఉదయం సభ మొదలైన కొన్ని నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. 12 గంటలకు మొదలైనా నినాదాలు ఆగకపోవడంతో 2 గంటలవరకు వాయిదావేశారు. 2 గంటలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు పోటాపోటీగా వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరీక్షల రద్దు, సంస్కరణల విషయంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని సభలో సీఎం హేమంత్ ప్రకటించారు. ‘‘ఉద్యమకారులను బీజేపీ తమ రాజకీయ పనిముట్లుగా వాడుకోవాలని చూస్తోంది. మా ప్రభుత్వం ఇప్పటికే ఉద్యమకారుల చాలా డిమాండ్లను అంగీకరించింది. నియామక పరీక్షల విధానంలో సంస్కరణలకూ ఓకే చెప్పా. బీజేపీ ఒక పరాన్నజీవి. స్వప్రయోజనాల కోసం పరీక్షార్థులను వాడుకోవాలని చూస్తోంది. బీజేపీ విషయంలో ఉద్యమకారులు జాగ్రత్తగా ఉండాలి’’అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ నినాదాల హోరు పెంచారు. దీంతో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే సభను స్పీకర్ నిరవధికంగా వాయిదావేశారు. రాంచీలో విద్యార్థుల మౌన ప్రదర్శననియామక పరీక్షల్లో అక్రమాలను ఎత్తిచూపుతూ జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ సంస్కరణ ల మంచ్ విద్యార్థులు, పరీక్షార్థులు మంగళవారం సాయంత్రం రాంచీలో మౌన ప్రదర్శన చేశారు. నిరాహార దీక్ష జరుగుతున్న జైపాల్సింగ్ స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక వరకు వందలాది మంది విద్యార్థులు మౌన ప్రదర్శనగా వెళ్లారు. ఉద్యమం, నిరాహార దీక్షలు మొదలై 17 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మౌన ప్రదర్శన చేపట్టారు. జూలై 25వ తేదీన విద్యార్థుల ఉద్యమం ఆరంభమైన విషయం విదితమే. ఆరుగురు ఉద్యమనేతలు నిరాహార దీక్షకు కూర్చోగా వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చేరి్పంచారు. -
క్రితం వరకు వేరు.. ఒక్క వర్షంతో ఒక్కటయ్యారు. వాటే సీన్!
కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతుంటాయి.. కాసేపటి క్రితం వరకు ఒకరినొకరు ఎదుర్కొన్నవారే.. ఆ తర్వాత ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. రాంచీలో నిరసనల సందర్భంలో వర్షం కారణంగా కనిపించిన ఈ దృశ్యం కూడా అలాంటి ఆసక్తికర ఘటనే..!రాంచీలో జేపీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు.అయితే, అదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం నుంచి రక్షించుకునేందుకు విద్యార్థులు గొడుగులు తెరవగా.. వారిని అడ్డుకుంటున్న కొందరు పోలీసు సిబ్బంది కూడా అదే గొడుగుల కిందకు చేరారు.కాసేపటి క్రితం వరకు లాఠీలు, వాటర్ క్యానన్లతో విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. ఇప్పుడు అదే విద్యార్థుల గొడుగుల కిందకు చేరి వర్షం నుంచి తలదాచుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసు, నిరసనకారుల మధ్య కనిపించిన ఈ మానవీయ దృశ్యాలు అక్కడున్న వారిని ఆశ్చర్యంతోపాటు ఎంతో ఆకట్టుకున్నాయి.ప్రకృతి ముందు అందరూ సమానమేనని చాటిచెప్పిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను వ్యక్తిగత శత్రువులుగా చూడలేదనే విషయాన్ని ఈ దృశ్యాలు చాటిచెప్పాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏ ర్యాంకుకు ఏ కాలేజీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు కోసం విద్యార్థుల దృష్టి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించే కన్వీనర్ కోటా కౌన్సెలింగ్పై పడింది. ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈనెల 13 నుంచి రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ మొదలవుతోంది. గతేడాది కౌన్సెలింగ్లో ఏ స్థాయి ర్యాంకులకు ఎక్కడ సీట్లు దక్కాయన్నది ఈసారి విద్యార్థులకు మార్గదర్శకంగా మారనుంది. నీట్ ఫలితాల్లో ఎన్టీఏ ఇచ్చే దేశవ్యాప్త ర్యాంకే ఏఐఆర్ కాగా, తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ కోటాకు దరఖాస్తు చేసిన అర్హులైన అభ్యర్థులకు కాళోజీ వర్సిటీ స్థానికత, కేటగిరీ, రిజర్వేషన్లు తదితర నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించి స్టేట్ మెరిట్ ర్యాంకు ఇచ్చింది. ఈ లెక్కన రాష్ట్రం నుంచి 38,021 మంది ఏఐఆర్ కింద అర్హత పొందారు. అధికారిక మెరిట్ జాబితాలో ఒకే అభ్యర్థికి స్టేట్ మెరిట్తోపాటు ‘నీట్ ర్యాంకు’రెండూ వేర్వేరు. ఉదాహరణకు ఈ సంవత్సరం ఆలిండియా కోటాలో 13వ ర్యాంకు వచ్చిన వీరయ్య గారి సాహూకు స్టేట్ మొదటి ర్యాంక్ వచ్చింది. గత సంవత్సరం కౌన్సెలింగ్ మెరిట్ జాబితాలో ఒక అభ్యర్థికి రాష్ట్ర మెరిట్ 1,989 కాగా నీట్ ర్యాంకు 65,090గా ఉంది. ఈ లెక్కన స్టేట్ ర్యాంకుతో సంబంధం లేకుండా జాతీయ స్థాయి ర్యాంక్స్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కడ అవకాశం? గాందీ, ఉస్మానియా, కాకతీయ వంటి పాత ప్రభుత్వ వైద్య కళాశాలలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. 2025 తొలి దశలో ఉస్మానియాలోనే ఓసీ అభ్యర్థులకు 681; 2,915 వంటి అత్యుత్తమ ‘నీట్’ఆలిండియా ర్యాంకుల వద్ద సీట్ల కేటాయింపు జరిగింది. అయితే కేటగిరీ ఆధారంగా కటాఫ్లో భారీ తేడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకేటగిరీలు, ఈడబ్ల్యూఎస్, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలు కలిసినప్పుడు అదే కాలేజీలో సీటు పొందిన చివరి ర్యాంకు మారుతుంది. 2025లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పాత ప్రభుత్వ కాలేజీలతో పోలిస్తే చివరి ర్యాంకులు దిగువకు వెళ్లాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కొత్త జిల్లాల వైద్య కళాశాలల్లో చివరి రౌండ్లలో సీట్ల కోసం పోటీ తగ్గింది. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగితే లక్ష నుంచి 1.5 లక్షల పరిధిలోని ర్యాంకులు కొన్ని ప్రభుత్వ కాలేజీలకు పోటీ పడే అవకాశం ఉంది. రిజర్వేషన్ కేటగిరీల్లో ఈ పరిధి మరింత దిగువకు వెళ్లవచ్చు. ప్రైవేట్ ‘ఏ’కేటగిరీలో భారీ పరిధి ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో గతేడాది చివరి దశల్లో గణనీయంగా దిగువ ర్యాంకులకు కూడా సీట్లు వచ్చాయి. 2025 స్ట్రే వేకెన్సీ అలాట్మెంట్లో చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఓసీ కేటగిరీకి 2,05,624 ఆలిండియా ర్యాంకు వద్ద సీటు వచ్చింది. అదే దశలో నోవా ఇన్స్టిట్యూట్లో బీసీ–బీ విద్యార్థికి 2,20,307 ర్యాంకు, సురభి కాలేజీలో ఎస్టీ అభ్యర్థికి 2,70,751 ర్యాంకు వరకు సీటు దక్కింది. అలాగే మహావీర్ ఇన్స్టిట్యూట్లో బీసీ–ఈకి 2,58,041, బీసీ–డీకి 2,11,285, సీఎంఆర్ కాలేజీలో బీసీ–బీకి 2,47,404, అరుంధతి ఇన్స్టిట్యూట్లో బీసీ–బీకి 2,35,806, బీసీ–ఏకు 2,76,991 ర్యాంకుల వరకు అలాట్మెంట్లు నమోదయ్యాయి. మైనారిటీ కళాశాలల్లో చూస్తే.. 2025లో షాదన్లో బీసీ–ఈ కేటగిరీకి 2,17,212, డెక్కన్ కాలేజీలో 1,85,372 ర్యాంకు వద్ద సీటు వచ్చింది. డాక్టర్ వీఆర్కే ఉమెన్స్ కాలేజీలో బీసీ–ఈ మహిళలకు 3,57,746 ర్యాంకుకూ సీట్లు దక్కాయి. ఈ ఏడాది ర్యాంకుల వారీగా అంచనా గతేడాది చివరి దశ ఫలితాలను తీసుకుంటే 50 వేలలోపు ఆలిండియా ర్యాంకులు ఉన్నవారికి ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, రిమ్స్తోపాటు ఎయిమ్స్ వంటి జాతీయ కళాశాలల్లో సీట్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. 50 వేలు– లక్ష మధ్య ర్యాంకులకు ఇతర ప్రభుత్వ కాలేజీల్లో అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 1–1.5 లక్షల మధ్య ర్యాంకులు కొత్త ప్రభుత్వ కాలేజీలు, మెరుగైన ప్రైవేట్ ‘ఏ’కేటగిరీ కాలేజీలను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అలాగే 1.5–2 లక్షల ఆలిండియా ర్యాంకుల మధ్య ఉన్నవారికి కొత్త ప్రభుత్వ కాలేజీల చివరి దశలు, ప్రైవేట్ ‘ఏ’కేటగిరీ ముఖ్యమైన అవకాశాలుగా చెప్పుకోవచ్చు. 2–2.5 లక్షల ఏఐఆర్ మధ్య ఉన్నవారు ప్రైవేట్ కన్వీనర్ కోటాలో ముఖ్యంగా చివరి దశలను ఆశించవచ్చని చెబుతున్నారు. అలాగే, 2025లో బీసీ–ఏకి 2.76 లక్షల వరకు సీట్లు వచ్చిన ఉదంతాలున్నాయి. -
జార్ఖండ్లో ‘జంతర్ మంతర్’
ఉన్నత చదువులకూ, ఉద్యోగాలకూ పోటీ పరీక్షలు నిర్వహించే ప్రభుత్వాలు వాటిల్లో అవకతవకలు బయపడినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, విశ్వసనీయ సంస్థలతో దర్యాప్తు చేయించటానికి మొండికేయటం ఈమధ్య కనబడుతున్న వింత ధోరణి. సోమవారం జార్ఖండ్లోని రాంచీలో నిరుద్యోగ యువత, విద్యార్థులు ‘అసెంబ్లీ ముట్టడి’ నిర్వహించినప్పుడు చానెళ్లలో కనబడిన దృశ్యాలు విస్తుగొలిపాయి. హఠాత్తుగా చూసినవారికి అది జంతర్ మంతరో, జార్ఖండో తెలియని స్థితి ఏర్పడింది. జార్ఖండ్లో జేఎంఎం నాయకత్వానగల పాలక కూటమిలో కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కానీ తమ డిమాండ్లు నెరవేరటం కోసం రాంచీలో యువత 16 రోజులుగా పోరాడాల్సి వస్తోంది. ఉద్యమకారుల డిమాండ్లలో 98 శాతం నెరవేర్చామని జార్ఖండ్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. గత నెల 22న ఈ వ్యవహారంలో పదవి నుంచి తప్పుకొన్న జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) చైర్మన్ ఎల్. ఖియాంగ్టేను తాజాగా అరెస్టు చేశారు. కమిషన్లోని ముగ్గురు సభ్యులు గవర్నర్కు రాజీనామాలు సమర్పించారు. కానీ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ అయిన సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది.నిరుద్యోగ యువతతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వాల స్పందనెలా ఉంటుందో జంతర్ మంతర్తోపాటు జార్ఖండ్ ఉద్యమం కూడా నిరూపించింది. సర్కారీ కొలువు లభించాలని యువతీయువకులు ఎంతగానో తపిస్తారు. అందుకోసం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి చదువుల్లో మునిగిపోతారు. శిక్షణ కోసం వేలకు వేలు వెచ్చిస్తారు. తీరా ప్రశ్నపత్రం లీకయిందంటే, అయోగ్యులు పైపైకి ఎగబాకారని తెలిస్తే... ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు చెప్పనలవికాని వేదనను అనుభవిస్తారు. వారి కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఒక పెద్ద కుంభకోణం బయటపడిన వెంటనే చిత్తశుద్ధిగల ప్రభుత్వమైతే సంబంధిత మంత్రి చేత రాజీనామా చేయిస్తుంది. ఆ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్టు చేస్తుంది. పరీక్ష ఫలితాలను రద్దుచేస్తుంది. ఇందుకోసం యువత రోడ్డెక్కాల్సి వచ్చిందంటే పాలకులు సిగ్గుపడాలి. తప్పు జరిగిందని తెలిసినా జార్ఖండ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు డిమాండ్ను ఎందుకు తిరస్కరిస్తోంది? అదొక్కటే కాదు... ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై, వేలంపాటలపై సీబీఐతో దర్యాప్తు చేయించడానికి మొండికేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరసనలపై రౌడీ ఎమ్మెల్యేలతో దాడులు చేయిస్తోంది. ఈ వ్యవహారంలో విద్యామంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడటానికి జంకి, ప్రభుత్వాధికారుల్ని ముందుకు తోస్తున్నారు. మరోవైపు చర్చకు సిద్ధమని సవాళ్లు విసురుతున్నారు. సాక్షాత్తూ అభ్యర్థులే తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుంటే... ఇలా బీరాలు పోవడం ఆయన గారికి సిగ్గనిపించడం లేదు. కేంద్రంలో తమ కూటమి ఏలుబడే ఉన్నా, సీబీఐ దర్యాప్తు అనగానే ఏపీ సర్కారు నిలువెల్లా వణుకుతోంది. యువత ఉద్యమాల సందర్భంగా రాజకీయ పక్షాల ద్వంద్వవైఖరి తేటతెల్లం అయింది. జంతర్ మంతర్ ఆందోళనపై ముద్రలేసి, దాన్ని నీరుగార్చాలని చూసిన బీజేపీ చివరాఖరికి తన వైఖరిని మార్చుకుంది. కానీ జార్ఖండ్ ఆందోళనలో అది చురుగ్గా పాల్గొంటున్నది. ఢిల్లీ ఉద్యమంలో మౌనప్రేక్షకపాత్ర వహించి ఆఖరి దశలో మేల్కొన్న కాంగ్రెస్... జార్ఖండ్లో పాలక కూటమిలో ఉంటూ కూడా ప్రభుత్వానికి నచ్చజెప్పలేకపోయింది. పైగా మీ డిమాండ్లేమిటో చెప్పండని పదిరోజులైనాక కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఉద్యమకారుల్ని అడిగారు. ఏపీలో పాలక కూటమిలో ఉన్న బీజేపీ అక్కడి డీఎస్సీ నియా మకాల స్కామ్పై నోరెత్తదు. కానీ జార్ఖండ్లో మాత్రం నేనున్నానంటూ ముందు కొస్తుంది. ఇవన్నీ యువత గుర్తించరనుకోవటం ఆ పక్షాల తెలివితక్కువతనం. వెంటనే ప్రభుత్వాలు ఉన్నతస్థాయి దర్యాప్తునకు సిద్ధపడి లీకుల వెనకుండే మాఫియాలనూ, వారికి అండదండలందించే బడా నేతలనూ బయటకు లాగాలి. ఇతర వాగ్దానాల సంగ తలావుంచి కనీసం పరీక్షలైనా సక్రమంగా నిర్వహించలేకుంటే యువత క్షమించదు. -
సీబీఐ విచారణకు పట్టు
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(జేపీఎస్సీ) నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, లేకపోతే పోరాటం ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు. జేఎస్ఎస్సీ–సీజీఎల్ పరీక్షలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్ మినహా, 98 శాతం డిమాండ్లను అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య ఆదివారం జరిగిన ఆరోవిడత చర్చలు విఫలమయ్యాయి. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో సహా చాలావరకు డిమాండ్లు నెరవేరాయని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ అన్నారు.సీబీఐ విచారణ జరగాలన్న డిమాండ్ నెరవేరే వరకు రాజీ పడబోమని స్పష్టంచేశారు. ఆగస్టు 10న అసెంబ్లీ వరకు తలపెట్టిన ర్యాలీని కొనసాగిస్తామని ప్రకటించారు. జేఎస్ఎస్సీ–సీజీఎల్ పరీక్ష హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించామని, దానిపై సీబీఐ విచారణ జరపాలన్న విద్యార్థుల డిమాండ్ను అంగీకరించలేమని సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ వెల్లడించారు. ‘‘విద్యార్థులతో మేము సానుకూల చర్చలు జరిపాం. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణకు ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ఇప్పుడు ఆందోళనను విరమించుకోవాలా వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలి’’అని చెప్పారు. ఇకపై పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా ఒక ఫాస్ట్–ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టంచేశారు. ఆందోళన విరమించకపోవడం దురదృష్టకరం విద్యార్థుల డిమాండ్లలో చాలావాటికి అంగీకరించామని, అయినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవడం దురదృష్టకరం అని జార్ఖండ్ ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లలో చాలావరకు తాము అంగీకరించినప్పటికీ, వారు ఆందోళనను విరమించడానికి సిద్ధంగా లేకపోవడం సరైంది కాదని అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం తమకు లేదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఆందోళనను పక్కనపెట్టి, చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.పరీక్షల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై విద్యార్థుల నుంచి సూచనలు కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్ను ప్రారంభించిందని, అలాగే ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందిస్తుందని వివరించారు. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీకి నిరసనకారులు చేపట్టనున్న ర్యాలీ దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ముగ్గురు జేపీఎస్సీ సభ్యుల రాజీనామా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ)కు చెందిన ముగ్గురు సభ్యులు అజీత భట్టాచార్య, అనీమా హన్స్దా, జమాల్ అహ్మద్ ఆదివారం రాజీనామా చేశారు. జేపీఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారు పదవుల నుంచి తప్పుకున్నారు. ముగ్గురు సభ్యుల రాజీనామాను గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సహా అక్రమాల ఆరోపణలకు సంబంధించి విచారణ కోసం ఆ ముగ్గురు సభ్యులకు సీఐడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. జూలై 22న జేపీఎస్సీ చైర్పర్సన్ ఎల్.ఖియాంగ్టే రాజీనామా సమరి్పంచారు. ఆయనను సీఐడీ అధికారులు ఇప్పటివరకు నాలుగుసార్లు ప్రశ్నించారు. -
కాంగ్రెస్ కంటే సీజేపీనే బెటర్: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చేపట్టిన విద్యార్థి నిరసనల ప్రచార కార్యక్రమం ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేదని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అంగీకరించారు. ముంబైలో జరిగిన ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్’ (ఐఐఎంయూఎన్) 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ అంశాలపై తాము ముందుగానే గళం విప్పినప్పటికీ, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనలకు వచ్చిన జనసందోహం తమ ప్రచారానికి రాలేదన్నారు.తాము లేవనెత్తిన అంశాలనే సీజేపీ కూడా జంతర్ మంతర్ వద్ద ప్రస్తావించిందని, రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో మమేకమయ్యామని శశిథరూర్ గుర్తుచేశారు. అయితే, తమ వ్యూహంలో ఎక్కడ లోపం జరిగిందో, యువత (జెన్ జీ) నాడిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమలమయ్యామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై జూన్ 20 నుంచి సీజేపీ చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఇది కూడా చదవండి: ‘వర్షం కురిసిన ఉదయం’.. వందకి రూ. 400 ఇస్తామన్నా.. -
‘అవును భాయ్.. నేను సాహెబ్ కాదు.. నేతాజీనే’
రాంచీ: జార్ఖండ్లోని మధ్యతరగతి కుటుంబాల పిల్లల కలల్లో ప్రభుత్వ ఉద్యోగం ప్రధాన లక్ష్యం. జేపీఎస్సీ , జేఎస్సీఎస్సీ వంటి నియామక పరీక్షల్లో విజయం సాధించి అధికారి కావాలని వేలాది మంది యువత కష్టపడుతున్నారు. అయితే ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్షల రద్దు, నియామకాలలో జాప్యం వంటి ఆరోపణలు వారి కలలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాంటి వారిలో పాకూర్ జిల్లా ఇల్మీ గ్రామానికి చెందిన షహ్బాజ్ హుస్సేన్ ఒకరు. చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడైన షహ్బాజ్ పాఠశాలలో టాపర్గా నిలిచాడు. అనంతరం ఎంఎస్సీ, ఎంఎడ్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయంలో రెండో ర్యాంకు సాధించాడు. అధికారి కావాలనే లక్ష్యంతో రాంచీకి వెళ్లి చిన్న లాడ్జిలో ఉంటూ జేపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కానీ నియామక పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దు వంటి పరిణామాలు తన జీవితాన్ని మార్చేశాయని షహ్బాజ్ చెబుతున్నాడు.నియామకాల్లో పారదర్శకత కోసం జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న షహ్బాద్ తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు అందరూ తనను ‘సాహెబ్’ అని కాకుండా ‘నేతాజీ వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. అయినప్పటికీ నిజం కోసం గొంతెత్తడంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. నిజం మాట్లాడితే నాయకుడని అంటారంటే..‘అవును భాయ్ నేను నేతాజీనే’ అని షహ్బాజ్ వ్యాఖ్యానించారు.ఆర్థిక, మానసిక ఒత్తిడిరాంచీలోని లాడ్జీల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అద్దె, భోజనం, పుస్తకాలు, ఇతర ఖర్చులను భరించడం కష్టంగా మారిందని షహ్బాజ్ తెలిపారు. గ్రామానికి వెళ్లిన ప్రతిసారీ ఇంకెంతకాలం? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని, వాటికి సమాధానం చెప్పడం బాధాకరంగా ఉంటుందని అన్నారు. అనిశ్చితి, ఒత్తిడి కారణంగా తనతో పాటు సిద్ధమవుతున్న పలువురు స్నేహితులు చదువును మధ్యలోనే వదిలి గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తానూ అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలనిపించినా, తల్లిదండ్రుల నమ్మకం, చిన్ననాటి కలలు గుర్తుకొచ్చి మళ్లీ ముందుకు సాగుతున్నానని చెప్పారు.పారదర్శక నియామకాలకే డిమాండ్తాము వీధుల్లోకి రావడం అల్లర్లు సృష్టించడానికి కాదని, కష్టపడి చదివిన అభ్యర్థులకు న్యాయం జరగాలని మాత్రమే కోరుతున్నామని షహ్బాజ్ అన్నారు.నియామక పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు సకాలంలో న్యాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అక్రమాలపై విచారణ విశ్వసనీయంగా జరగాలని, వాస్తవాలు వెలుగులోకి రావాలని విద్యార్థులు ఆశిస్తున్నారని షహ్బాజ్ తెలిపారు. -
"జవాబ్ దేవో అమిత్షా" వర్షంలో ఎంపీల నిరసన
సాక్షి,ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులపై జరిగిన దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విపక్ష ఎంపీలు పార్లమెంటు ఎదుట ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. అమిత్షా కనపడడం లేదని పార్లమెంటు సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ఎంపీలు ప్రశ్నించారు. "అమిత్ షా జవాబ్ దేవ్" అని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. అయితే ఎంపీల నిరసన సమయంలో భారీగా వర్షం పడుతున్నా వెనక్కి తగ్గలేదు. వానకు తడుస్తూనే నిరసన చేపట్టారు.కాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకాకపోవడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. జూలై 20న ఢిల్లీలో 'నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లను ఉపయోగించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హోంశాఖ పరిధిలోని పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి.అయితే అమిత్ షా పార్లమెంట్కు దూరంగా లేరని, ఆయన రోజంతా పార్లమెంట్ హౌస్లోని తన ఛాంబర్ లోనే ఉంటూ అధికారిక విధులు నిర్వహిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గందరగోళమే కారణమని ప్రతిపక్షాలు నిరంతర నిరసనలతో సభను సజావుగా సాగనివ్వడం లేదని, సభను నడవనిస్తే అమిత్ షా వచ్చి ఖచ్చితంగా సమాధానం ఇస్తారని తెలిపారు. -
విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజీపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై జరిగిన హింసాకాండకు ముమ్మాటికీ అమిత్ షా బాధ్యుడని ఆరోపించారు. విద్యార్థుల విషయంలో ఏం జరిగిందో పార్లమెంట్లో వివరించే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. జూలై 20న పోలీసుల దాడికి గురైన విద్యార్థుల బృందంతో రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ నిరసనకారులను ఇప్పుడే కలిసి చర్చించానని తెలిపారు. రాజ్యాంగం, విద్యా వ్యవస్థ, భారతదేశ భవిష్యత్తు కోసం పోరాడిన వేలాది విద్యార్థులను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తమపై జరిగిన దాడి, తగిలిన దెబ్బలు, ఎదురవుతున్న బెదిరింపుల గురించి వారు వివరించారని పేర్కొన్నారు. వారు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం సాగించారని, భారతదేశం అనే భావనను, దేశ భవిష్యత్తును కాపాడారని రాహుల్ ప్రశంసించారు. లోపభూయిష్టమైన, కుప్పకూలిపోతున్న, నిష్ప్రయోజనమైన విద్యా విధానం గురించి ఫిర్యాదు చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వ్యవస్థనే మార్చాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. వారు హింసకు పాల్పడలేదని, దురుసుగా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ వారిపై దాడి చేసి, కొట్టి, బెదిరించారని ధ్వజమెత్తారు. ఆన్లైన్లో వేధిస్తున్నారు: రియా ఆహిర్ విద్యార్థుల బృందాన్ని కలిసిన ఫొటోలను రాహుల్ గాంధీ ఇన్స్టా గ్రామ్లో షేర్ చేశారు. ‘‘భారతదేశ భవిష్యత్తును చూడండి. యువత నిర్భయులు, నిర్మొహమాటంగా మాట్లాడుతారు. వారికి దేశభక్తి ఉంది. మరి ప్రధానమంత్రి, హోంమంత్రి సంగతి ఏంటి? పార్లమెంట్కు వచ్చే ధైర్యం గానీ, సమాధానాలు చెప్పే తెగింపు గానీ వారికి లేవు’’అని తన పోస్ట్లో పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ పక్కన సీజేపీకి చెందిన రియా ఆహిర్, నూతన్ టోపో, భరత్, ఫర్హానాజ్, ముస్కాన్ ఉన్నారు. వీరిలో మోడల్ రియా ఆహిర్ ముంబైలో విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసు వ్యాన్ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. తనకు ఆన్లైన్లో వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గాంధీ పక్కన నిల్చొని ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను 20 మంది పిల్లలను అక్రమ అరెస్టుల నుంచి కాపాడనని, ఇప్పుడు తనను ఆన్లైన్లో వేధిస్తున్నారని చెప్పారు. తాను ఎదుర్కొంటున్నది ట్రోలింగ్ కాదని, అది ఒక నేరమని స్పష్టం చేశారు. -
ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత! హాస్టల్లో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్, కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో నోబుల్ కాలనీలో ఉన్న షార్కి హోప్ గర్ల్స్ హాస్టల్లో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒంటిపై దద్దుర్లు రావడంతో పాటు చేతులు, కాళ్లు వంకర్లు పోవడం వంటి లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినులు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.విద్యార్థినులకు మధ్యాహ్నం సమయంలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు సమాచారం. అనంతరం సాయంత్రం 6.30 గంటల తర్వాత పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మైత్రి ఫౌండేషన్ సంస్థ స్పాన్సర్గా అందించిన ఆహారాన్ని వారు తీసుకున్నారు. తదనంతరం ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఘటనకు అసలు కారణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, విద్యార్థినుల అస్వస్థతకు వ్యాక్సిన్ కారణమని హాస్టల్ నిర్వాహకులు ఆరోపిస్తుండగా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వర్గాలు, హాస్టల్ నిర్వాహకుల వాదనలు భిన్నంగా ఉండటం చర్చనీయాంశమైంది.విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పేర్ని కిట్టు ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
క్లాసులకు ముందే కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. జాతీయస్థాయిలో ఎన్ఐటీ, ఐఐటీల్లో ఇప్పటికే అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తి అయింది. ఆగస్టు రెండోవారంలో క్లాసుల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్లాసుల కన్నా ముందు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి సూచించింది. తాజాగా అన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల్లో ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించింది.కొన్నేళ్లుగా ఎన్ఐటీలు, ఐఐటీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. మానసిక ఒత్తిడి వల్లే ఇవి జరుగుతున్నాయని గుర్తించింది. దీంతో ఈ ఏడాది నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నారు. విద్యార్థి సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాతే క్లాసులు మొదలు పెట్టాలని కూడా సూచించింది. దీనికి 15 రోజులు గడువు ఇవ్వాలని పేర్కొంది. విద్యార్థి ముభావంగా, నూన్యతభావంతో ఉంటే గమనించి, అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని తెలిపింది. పెరుగుతున్న ఆత్మహత్యలు ఐఐటీలు, ఎన్ఐటీల్లో విద్యార్థుల ఆత్మ హత్యలు పెరుగుతున్నాయి. 2021 నుంచి 2025 వరకూ 65 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఖరగ్పూర్ ఐఐటీలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువమంది బాలురే ఉంటున్నారు. చనిపోతున్న వారిలో మొదటి ఏడాది విద్యార్థులు 80 శాతం, మరో 20 శాతం ఆఖరి ఏడాది ఇంజనీరింగ్లో ఉన్నవారే. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2003 నుంచి 2025 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. సీఎస్ఈ, అనుబంధ కంప్యూటర్ బ్రాంచ్లకు చెందినవారే ఎక్కువగా ఉంటున్నారు. మరణాలు కూడా అత్యంత భయంకరంగా ఉంటున్నాయని అధ్యయనంలో తేలింది. ముంబై ఐఐటీలో 21 సంవత్సరాల విద్యార్థి హాస్టల్ టెర్రస్పై నుంచి దూకి చనిపోయాడు. సమస్య ఎక్కడ ? జేఈఈ, ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా ఆత్మహత్యల జాబితాలో ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడేనని ఐఐటీ ముంబై జరిపిన పరిశోధనలో తేలింది. ఇంటర్కు ఇంజనీరింగ్ విద్యకు సారూప్యత ఉండటం లేదు. ఇంటర్లో చాప్టర్స్ను బట్టీ పట్టిస్తున్నారు. జేఈఈలో మలి్టపుల్ చాయిస్ ప్రశ్నలు ఉండటం వల్ల తేలికగా సమాధానం ఇవ్వగలుగుతున్నారు. ఇంజనీరింగ్లో చాప్టర్లన్నీ విశ్లేషణాత్మకంగా ఉంటున్నాయి. వీటి మూలాలు ఇంటర్లో ఉంటాయి. వీటిపై పట్టులేకపోవడం వల్ల విద్యార్థులకు ఏమాత్రం అర్థం కావడం లేదు.బేసిక్ సరిగా లేకపోవడం వల్ల ఇతర విద్యార్థులతో వెనుకబడి పోయే పరిస్థితి ఏర్పడుతోంది. తొలి సెమిస్టర్లో మార్కులు తక్కువ రావడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు తల్లిదండ్రుల నుంచి ‘మార్కులు తక్కువ ఎందుకు వచ్చాయి’అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ విద్యార్థులను కుంగదీస్తున్నాయి. ఆఖరి సంవత్సరంలో బ్యాక్లాగ్స్ ఉండటం, ఉద్యోగ అవకాశాలపై ఆందోళన విద్యార్థులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని ఐఐటీల అధ్యయనంలో వెల్లడైంది. -
నారా లోకేష్ కు బిగ్ షాక్.. ప్లాన్ రెడీ చేసిన DSC అభ్యర్థులు
-
మద్యం మాస్టారు మాకొద్దు
శ్రీకాకుళం: రెండేళ్లుగా నిత్యం మద్యం సేవించి వస్తున్న మాస్టారు మాకు వద్దు అంటూ విద్యార్థులు, స్థానికులు బుధవారం గార మండలం అంబళ్లవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుడు నీలాపు రామారావు గతంలో మద్యం మత్తులో ఉండటంతో స్థానికులు ఎంఈవో, డీఈఓలకు ఫిర్యాదు చేశారు. అయినా తీరు మారకపోవడంతో రెండేళ్ల కిందట ఎంఈఓకి రెడ్హ్యాండెడ్గా పాఠశాలలోనే పట్టుబడటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. అయితే టీడీపీ నాయకుల సిఫారసులతో మరలా అదే స్కూల్ టీచర్గా కొనసాగిస్తున్నారు. మరలా మద్యం మత్తులో రావడంతో పలుమార్లు ఎంఈఓ నక్క రామకృష్ణకు తెలిపినా రాజకీయ జోక్యంతో చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం 18 మంది విద్యార్థులు, మాజీ సర్పంచ్ అరవల రామారావు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు. ఎంఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయుడిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. -
అమ్మో.. అమెరికా వీసా
సాక్షి, హైదరాబాద్: యూఎస్ వీసాలు అందక అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యార్థి వీసాల జారీలో యూఎస్ ముప్పు తిప్పలు పెడుతోంది. కొన్ని యూనివర్సిటీలు ఒక వైపున ఐ–20 జారీ చేయడం లేదు. మరోవైపు సెప్టెంబర్ 15లోగా అడ్మిషన్లు పూర్తి చేస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఇంకోవైపు వర్సిటీల నుంచి ఐ–20 లెటర్లు వచి్చన 70 వేల మంది విద్యార్థులకు ఇంత వరకూ వీసా స్లాట్లు బుక్ అవ్వలేదని ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. స్లాట్లు ఇచ్చి వీసాకు పిలిచినా చిన్నచిన్న కారణాలతోనే వీసా తిరస్కరిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. భారత్ నుంచి ఏటా 3.20 లక్షల మంది అమెరికా వెళ్తుంటారు. వీరిలో 1.90 వేల మంది విదేశీ విద్య కోసం వెళ్లేవారే. ఈ సెప్టెంబర్ నుంచి అమెరికాలో ఫాల్ సీజన్ మొదలవుతుంది. ఆగస్టు నుంచే అక్కడ వర్సిటీలు ప్రవేశాలు మొదలుపెడతాయి. విద్యార్థులు ఆరు నెలల ముందే వీసా కోసం సిద్ధమవుతుంటారు. ఎందుకీ పరిస్థితి? విద్య కోసం వెళ్లే విద్యార్థులకు అమెరికా ఎఫ్–1 వీసా ఇస్తుంది. ఇది పొందాలంటే ముందుగా యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. వర్సిటీలపై అమెరికా ప్రభుత్వం రెండేళ్లుగా నిఘా పెంచింది. సవాలక్ష నిబంధనలు తీసుకొచ్చింది. విద్యార్థి నేపథ్యం తెలియకుండా ప్రవేశం కలి్పంచినా, ఆ విద్యార్థి అమెరికా దృష్టిలో చెప్పబడే అసాంఘిక శక్తులతో సంబంధం ఉన్నట్టు తేలినా వర్సిటీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతోపాటే చదవు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉండే గ్రేస్ పీరియడ్ను 60 నుంచి 30 రోజులకు తగ్గించింది.నాలుగేళ్ల పీహెచ్డీ కోర్సుకు అదనపు అనుమతులు కావాలనే షరతు పెట్టారు. పీహెచ్డీ అనుకున్న కాల వ్యవధిలో పూర్తి చేస్తామనే భరోసా తీసుకోవాలనే నిబంధన విధించారు. దీంతో వర్సిటీలు కూడా జాగ్రత్త పడాల్సి వస్తోంది. విద్యార్థులకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతే ఐ–20 పత్రాలు ఇస్తున్నాయి. వీసాలకు ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు వర్సిటీల ప్రవేశాలపై కూడా ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి. వీసా దగ్గర తిప్పలే స్టూడెంట్ వీసా తీసుకోవడం కష్టంగానే మారింది. ఐదేళ్లుగా విద్యార్థి ఉపయోగించిన సాషల్ ఖాతాలను ఇమ్మిగ్రేషన్ పరిశీలిస్తోంది. కొన్ని సందర్భాల్లో పబ్లిక్గా కనిపించే పోస్టులపైనా వాకబు చేస్తున్నారు. గతంలో కోర్సు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. ఇలాంటి విద్యార్థులకు వర్సిటీలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి అనుమతించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనికి వర్సిటీలు భయపడుతున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థి ఎలాంటి చర్యలకు పాల్పడినా వర్సిటీలే బాధ్యత వహించాలనే నిబంధన తెచ్చారు.దీంతో వర్సిటీలు వెనక్కి తగ్గుతున్నాయి. వీసా సమయంలో ఆర్థిక పత్రాలన్నీ పరిశీలించడానికి ఎక్కువ సమయం పడుతోంది. ప్రతీ విద్యార్థి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాల్సి రావడంతో వీసా స్లాట్ల సంఖ్య తగ్గిపోతోంది. అమెరికాలో చదువుకునే సమయం, ఆ తర్వాత గ్రేస్ పీరియడ్లో నివసించడానికి అవసరమైన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో విద్యార్థులు చూపిస్తారు. ఈ మొత్తం ఎక్కడ్నుంచీ వచి్చందనేది లోతుగా పరిశీలించిన తర్వాతే వీసాలు ఇస్తున్నారు. మరోవైపు విద్యార్థి ఇంటర్వ్యూ సమయంలో ఏమాత్రం సరైన సమాధానం ఇవ్వలేదని భావించినా వీసా తిరస్కరిస్తున్నారు. అన్నీ పంపాం.. ఇంకా లెటర్ ఇవ్వలేదు ఎంఎస్ కోసం యూఎస్ వెళ్లాలని ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్నా. వీసాకు దరఖాస్తు చేశాను. వర్సిటీ ఇంకా ఐ–20 లెటర్ ఇవ్వలేదు. వారిని మెయిల్లో సంప్రదిస్తే ఇంకా పరిశీలనలో ఉందంటున్నారు. సెపె్టంబర్ నుంచే అకడమిక్ ఈయర్ మొదలువుతంది. ఆగస్టులో వెళ్తే తప్ప మేం అక్కడ అన్ని ఏర్పాట్లూ చూసుకోలేం. – వీసం పల్లవి, హైదరాబాద్ రోజుకో సమాచారం అడుగుతున్నారు అమెరికా యూనివర్సిటీ లెటర్ కూడా వచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు రోజుకో లెటర్ అడుగుతున్నారు. సోషల్ ప్లాట్ఫాంలో పెట్టిన సాధారణ పోస్టులపైనా వివరాలు ఇవ్వమన్నారు. బ్యాంకు ఖాతాలోకి వచ్చిన డబ్బులు, మాకు అప్పు ఇచి్చన వారి వివరాలు కోరారు. వారి బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ అడిగారు. అప్పు ఇచ్చిన వారు భయపడుతున్నారు. అసలు అమెరికా వెళ్లగలమా? లేదా? అనే ఆందోళనలో ఉన్నాం. – మహ్మద్ షరీఫ్, వరంగల్ -
ఆహారం కలుషితం.. 78 మందికి పైగా వైద్య విద్యార్థులకు అస్వస్థత
తిరుపతి తుడా: తిరుపతిలో మూడు వైద్యకళాశాల్లో ఆహారం కలు షితం కావడంతో 78 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, శ్రీవేంకటేశ్వర వైద్యకళాశాల (స్విమ్స్), శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థులయ్యారు. ఈ మూడు కాలేజీల్లోని విద్యార్థులకు స్విమ్స్లోని సెంట్రల్ క్యాంటీన్ నుంచి ఆహారం సరఫరా అవుతుంది. సోమవారం మధ్యాహ్నం ఆకుకూర పప్పు వడ్డించిన క్యాంటీన్ నిర్వాహకులు రాత్రిపూట కూడా అదే వడ్డించారు. ఆకుకూరను సరిగా శుభ్రపరచకుండా వండారని, మధ్యాహ్నం వండినదాన్నే రాత్రికి కూడా పెట్టటంతో అప్పటికే కలుషితమైన దాన్ని తిని తమకు వాంతులు, విరేచనాలు అయ్యాయని పలువురు విద్యార్థులు తెలిపారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో 20 మంది విద్యారి్థనులు, ఎనిమిది మంది విద్యార్థులు.. మొత్తం 28 మంది అస్వస్థులయ్యారు. స్విమ్స్, శ్రీ పద్మావతి కళాశాలల్లో 50 మందికిపైగా ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు.ఆయుర్వేద విద్యార్థుల్లో 17 మందిని అంబులెన్స్లో టీటీడీ సెంట్రల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. చికిత్స పొందుతున్నవారిని టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అవడంతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో తిరిగి వసతిగృహాలకు పంపించినట్లు తెలిపారు. స్విమ్స్, పద్మావతి కాలేజీల్లో అస్వస్థులైనవారికి పద్మావతి ఆస్పత్రిలో గోప్యంగా వైద్యం అందించినట్లు తెలిసింది.అబ్బే అదేం లేదు.. ముగ్గురే అస్వస్థులయ్యారు.. స్విమ్స్, పద్మావతి విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు నిరాధారమని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్విమ్స్ హాస్టల్లో మొత్తం 1,147 మంది వైద్యవిద్యార్థులు ఉన్నారని తెలిపారు. 27వ తేదీ రాత్రి సమయంలో ఎంబీబీఎస్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థులయ్యారని అంగీకరిస్తూనే.. ఫుడ్ పాయిజనింగ్ అయిందనటం సరికాదని ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు స్విమ్స్, పద్మావతి కాలేజీల్లో 70 మందికి పైనే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని స్విమ్స్ వర్గాలు తెలిపాయి. -
కదంతొక్కిన యువజనం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. టెట్, డీఎస్సీ రాత పరీక్ష లేకుండా ఏకంగా జీవోలు జారీ చేసి, తమ వారికి దొడ్డి దారిన ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని నిప్పులు చెరిగారు. అర్హులను పక్కనపెట్టి, డిగ్రీలు లేని వారికి సైతం ఉద్యోగాలివ్వడం బరితెగింపునకు పరాకాష్ట అని.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి బకాయిలతో సహా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రీతిలోనే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. అందరి నోట అదే డిమాండ్ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్ని జిల్లా కేంద్రాలు మంగళవారం యువత ప్లకార్డులతో నిర్వహించిన ర్యాలీలతో హోరెత్తాయి. పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలను, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తు అరెస్ట్లు చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేశారనీ, మీరెప్పుడు చేస్తారని లోకేశ్ను నేతలు సూటిగా ప్రశ్నించారు. గుంటూరులో నిరుద్యోగుల బాధలను స్కిట్ రూపంలో ప్రదర్శించారు. రాజమండ్రిలో పోలీసులు అడ్డుకోవడంతో నేతలు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసుల వలయాన్ని దాటుకుని ర్యాలీ కొనసాగించారు. శ్రీకాకుళంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్.. మహిళలు, నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని.. మంత్రి లోకేశ్ రాజీనామా చేసేంత వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. -
విద్యార్థులపైకి ఏకే–47
పట్నా: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ దిశగా ‘చలో సంసద్ ర్యాలీ’కి పిలుపునివ్వగా ఆ ర్యాలీకి మద్దతుగా శనివారం బిహార్లో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఉద్యమకారుల పైకి పోలీసులు ఏకంగా ఏకే–47 మారణాయుధాన్ని ప్రయోగించిన వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజికవేత్తలను లాఠీచార్జ్తో రెచ్చగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి చివరకు ఏకే–47 గన్ను పోలీసులు వినియోగించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? పట్నా, సరణ్ జిల్లాలోని ఛాప్రా, సివాన్, ఔరంగాబాద్, భాగల్పూర్, సమస్తీపూర్, నవాడా, పూరి్ణయా, నలందా, బోజ్పూర్, మధుబని, షేక్పురాల్లో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థి ర్యాలీలు జరిగాయి. అయితే సివాన్ పట్టణంలో జరిగిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక్కడ జేపీ చౌక్ ప్రాంతంలో జాతీయరహదారి గుండా రాకపోకలను నిలిపేశారు. దుకాణాలను మూసేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ర్యాలీగా వెళ్తున్న తమను అడ్డుకున్న పోలీసులపైకి ఉద్యమకారులు రాళ్లతో దాడిచేశారు. ట్రాఫిక్ పోలీస్బూత్లను ధ్వంసంచేశారు. విద్యార్థుల రాళ్ల దాడిలో సివాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పురన్ కుమార్ ఝా గాయపడ్డారు. దీంతో బాష్పవాయుగోళాలు ప్రయోగించాలని ఆయన ఆదేశించారు. అయితే ఉద్యమకారులు రాళ్ల వర్షం కురిపించడంతో వారిని నిలువరించేందుకు జిల్లా నిఘా విభాగానికి చెందిన అభిషేక్ పటేల్ అనే కానిస్టేబుల్ తన వద్ద ఉన్న ఏకే–47ను విద్యార్థుల పైకి ఎక్కుపెట్టారు. నాలుగు రౌండ్లు కాలుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో తాజాగా ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఝా ప్రకటించారు. నాలుగు రౌండ్ల కాల్పుల్లో అటుగా వెళ్తున్న కుమార్ గోండ్ ఒక వ్యక్తి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే ఉద్యమకారులు నాటుబాంబులు విసిరేయడంతోనే ఈ కాల్పుల ఘటన జరిగిఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. వాళ్లేమైనా ఉగ్రవాదులా?న్యూఢిల్లీ: బిహార్లో నీట్ లీకేజీ నిరసనోద్యమంలో విద్యార్థులపైకి పోలీసులు ఏకే–47 గన్ను ఎక్కుపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మోదీ సర్కార్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నిలదీశారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్పెట్టారు. ‘‘మోదీ ప్రభుత్వసారథ్యంలో యావత్ పోలీస్వ్యవస్థ విద్యార్థులను హతమార్చే స్థాయికి దిగజారింది. బిహార్లో ఏకే–47 గన్ను విద్యార్థులపైకి గురిపెట్టారు. వందలాది మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్చేశారు. మోదీజీ.. విద్యార్థులపై ఒక్క ఎఫ్ఐఆర్ నమోదుకాబోదన్న మీ వాగ్దానం ఏమైంది? ఢిల్లీలో పెల్లెట్ గన్స్ వాడితే బిహార్లో ఏకంగా ఏకే–47ను వాడా రు’’అని అన్నారు. ఏకే–47 గురిపెట్టిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. ‘‘మీ అమ్మాయిలను నిరసనలకు ఎందుకు పంపించారు? అని తల్లిదండ్రులను కొందరు నేతలు మందలిస్తున్నారు. అమ్మాయిలు ఉద్యమంలో పాల్గొనకూడదా? ఏకే47, పెల్లెట్ గన్స్ వాడొచ్చా? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? ’’అని ప్రియాంక నిలదీశారు. కాల్పుల ఘటనపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై రాజ్యస భ సభ్యుడు, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా బిహార్లో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్మంతర్లో నిరసనకారులపై జరిగిన లాఠీచార్జి తదితర ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. -
నెగ్గాల్సిన ఇతర పరీక్షలు
యాభై రోజులుపైగా ఢిల్లీలో మహోధృతంగాసాగి, దేశం మొత్తాన్ని సుడిగాలిలా చుట్టేసిన జంతర్ మంతర్ ఉద్యమం ఉపశమించిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఆధ్వర్యాన ఆరుగురు సభ్యుల టాస్క్ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. అంతేకాదు... పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలెట్టి చకచకా సాగుతున్న ఈ పరిణామాలు... ఆగ్రహంతో రగులుతున్న జెన్ జీ తరాన్ని దగ్గర చేసుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే. నీట్ పేపర్ లీకయిందనీ, మరోసారి ఆ పరీక్ష నిర్వహణ తప్పదనీ తేలిన వెంటనే ఇంతే వేగంగా స్పందించివుంటే బహుశా ఈ స్థాయిలో ఆందోళన జరిగివుండేది కాదేమో! ఆ మాటకొస్తే ఎన్నో యేళ్లుగా ఈ లీకులు వినబడుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేదు. 2024 నీట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత మాత్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. అది ఇచ్చిన నివేదిక అతీగతీ ఏమైందో తెలియదు. ఇంత నిస్తేజంగా ప్రభుత్వాలున్నప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో సమస్యేమంటే కేంద్రం ఒక్కటే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లీకుల విషయంలో నిర్లిప్తంగానే ఉంటాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఒకపక్క సాగుతుండగానే పంజాబ్లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఎన్డీయే కూటమి ఏలుబడిలోనే సాగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే పెద్ద కుంభకోణంగా మారింది. నోటిఫికేషన్ విడుదలనాడే స్పోర్ట్స్ కోటా నియామకాలకు అర్హత పరీక్ష అవసరం లేదంటూ రెండు జీవోలు తీసుకురావటం ఆ ప్రభుత్వ బరితెగింపునకు చిహ్నం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏపీ విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. నందన్ నిలేకని విద్యాధికుడు. ఐటీ రంగంలో పేరెన్నికగన్నవారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలుకోసమంటూ తీసుకొచ్చిన ఆధార్ కార్డుల రూపకర్త ఆయనే. నిలేకని మాదిరే ఇతర సభ్యులు సైతం వారి వారి రంగాల్లో నిష్ణాతులు. పరీక్షల నిర్వహణకు ఇప్పుడ నుసరిస్తున్న విధానాల్లోని లోటుపాట్లు అధ్యయనం చేసి, ఎలాంటి సంస్కరణలు అవసరమో వీరు సూచిస్తారు. అడుగడుగునా చోటుచేసుకోవటానికి ఆస్కారం ఉన్న అవకతవకలనూ, అనైతిక పద్ధతులనూ నివారించటానికి ఏం చేయాలో చెబుతారు. వీటన్నిటికన్నా ముందు అసలు పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి జాతీయ సంస్థ అవసరమా అనే సంగతి నిగ్గుదేల్చటం అవసరం. ఒక సంస్థకు దాని సామర్థ్యానికీ, వనరులకూ మించిన బాధ్యతల్ని అప్పగించటం సరైందేనా? ఆలోచించాలి. రెండేళ్లనాటి రాధాకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలేమిటో, దాని సిఫార్సులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు లేదా? కాక్రోచ్ ఉద్యమం సాగుతుండగానే 2024 నీట్ లీక్ ప్రధాన నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని సీబీఐ ప్రకటించటం మరో వైచిత్రి. ఇక విద్యార్థులపై అత్యంత ఘోరంగా బలప్రయోగానికి పూనుకున్నవారిపైనా చర్యలుండాలి.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని చెప్పటం హర్షించదగ్గది. ఇది కేంద్ర స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల మాటెలవున్నా తమ ఏలుబడిలోని ప్రభుత్వాలైనా జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ఎన్డీయే పెద్దలకుంది. ప్రధాని హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని, రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ల స్థాయిలో ఉద్యమిస్తే తప్ప డీఎస్సీ అవకతవకల వంటివి పట్టించుకోబోరన్న సంకేతాలు వెళ్లరాదు. అందుకే దేశంలో యువత మనసు గెలవాలంటే నెగ్గాల్సిన పరీక్షలు చాలానే ఉన్నాయని కేంద్రం గుర్తించాలి. -
వీకెండ్ క్లాస్లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా
సండే క్లాస్లో స్టూడెంట్స్ అందరూ బిజీగా ఉన్నారు. లంచ్ బ్రేక్ అవుతున్నా కూడా అందరూ క్లాస్లో మునిగి పోయారు. ఇది చూసిన ఒక ప్రొఫెసర్కి ఒక ఆలోచన తట్టింది. ఆ విద్యార్థుల కోసం ఏకంగా డామినోస్ (Domino’s) పిజాలను ఆర్డర్ చేశారు. ఈ స్వీట్ జెస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.IIM షిల్లాంగ్ విద్యార్థి రోహన్ సాహా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సాధారణంగా ఐఐఎమ్లలో వీకెండ్స్లో కూడా క్లాసులు జరగడం సహజమే, కానీ ఈ సమయంలో కొందరు ప్రొఫెసర్లు ఆ కష్టాన్ని అర్థం చేసుకుంటారు అని రోహన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rohan Saha (@rohan_ntshh) వీకెండ్ క్లాసులను కొందరు ప్రొఫెసర్లు ఆ తరగతులను ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తారు! అలా ప్రొఫెసర్ అరుణి సర్ ఎంతో దయాహృదయుడు. షెడ్యూల్ వల్ల మేం లంచ్ మిస్ అవుతున్నామని తెలుసుకుని, మా అందరి కోసం పిజాలు ఆర్డర్ చేశారు. థాంక్యూ సర్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. వీడియోలో క్లాస్రూమ్లో డామినోస్ పిజా బాక్సుల వరస కనిపిస్తుంది. విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా వచ్చి తమ పిజా స్లైసులను ఆరగించారు. నెటిజన్ల కామెంట్స్ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ప్రొఫెసర్ అరుణిపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ పాత కాలేజ్ రోజులను గుర్తుచేసుకుంటూ రకరకాల కామెంట్లు చేశారు. చాలా అక్కీ స్టూడెండ్స్. నిజంగా ఆ ప్రొఫెసర్ చాలా గ్రేట్ అంటూ కొందరు ఆయన్ని పొగిడేశారు. "ఈ ప్రొఫెసర్ పూకీ (Pookie) లాంటివారు" అని మరొకరు కామెంట్ చేశారు.ఒకవేళ మీరు ఆ రోజే డైటింగ్ చేస్తుంటే పరిస్థితి ఏంటి?" అని ఒకరు జోక్ చేయగా, "నేను తప్పుడు సబ్జెక్టులను ఎంచుకున్నాను అని మరొకరు ఫన్నీగా స్పందించారు. మరికొందరు తమ ప్రొఫెసర్లతో పోల్చు కున్నారు. అదే మా ప్రొఫెసర్ అయితేనా మళ్లీ వచ్చే ఆదివారం కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయేవారు అని ఒకరంటే, మనకెందుకు దొరకరు భయ్యా ఇలాంటి ప్రొఫెసర్లు దొరకరు మరికొందరు సరదాగా జెలస్ ఫీలవ్వడం విశేషం. ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది -
నిరసన చేస్తే కొట్టడం ఏంటి? లాఠీ ఛార్జ్ పై సుప్రీంకోర్టు సీరియస్
-
ఆగని ‘నీట్’ బలవన్మరణాలు.. జాబితాలో..
న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’పేపర్ లీక్, పరీక్షా విధానంలోని లోపాల కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, సమస్యల పరిశీలన కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, పరీక్షా వివాదాలు, మానసిక ఒత్తిడి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న విషాదకర ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని అహిల్యానగర్కు చెందిన అంకితా సాంగ్లే అనే విద్యార్థిని రీ ఎగ్జామ్లో తక్కువ మార్కులు రావడంతో, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇదే రకమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న పలువురు విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.ప్రదీప్ మేఘవాల్ (రాజస్థాన్): జుంఝును జిల్లాకు చెందిన 22 ఏళ్ల ఈ యువకుడు, మే 2026లో నీట్ యూజీ పరీక్ష రద్దు కావడంతో సీకర్లో ఆత్మహత్య చేసుకున్నారు.ఋతిక్ మిశ్రా (ఉత్తర ప్రదేశ్): లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థి, పరీక్షలో గందరగోళం, మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.సిద్దార్థ్ హెగ్డే (గోవా): 17 ఏళ్ల ఈ విద్యార్థి మే 2026లో నీట్ పరీక్ష రద్దయిన తర్వాత తీవ్ర మనోవేదనతో ప్రాణాలు తీసుకున్నారు.భాగ్యశ్రీ (కర్ణాటక): కలబుర్గికి చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని పీయూసీ బోర్డు పరీక్షలో 92 శాతం మార్కులు సాధించినప్పటికీ, నీట్ ఆందోళనలతో మే 2026లో బలవన్మహత్వానికి పాల్పడ్డారు.అంశిక పాండే (ఢిల్లీ): ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఈ పరీక్షార్థిని మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు విడిచిపెట్టారు.ఉమేష్ మాలీ(రాజస్థాన్): సీకర్లో నీట్ ప్రిపరేషన్ చేస్తున్న ఈ 22 ఏళ్ల యువకుడు జూన్ 15న ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారు.రేణు మీణా (రాజస్థాన్): అన్వర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ ప్రతిభావంతురాలైన విద్యార్థిని జూన్ 2026లో నీట్ వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.రియా కుమారి థాపా (ఉత్తరాఖండ్): డెహ్రాడూన్కు చెందిన 23 ఏళ్ల ఈ అభ్యర్థి జూన్ 2026లో పేపర్ లీక్ ఆందోళనలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.శివానీ యాదవ్ (ఉత్తర ప్రదేశ్): లక్నోకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని పరీక్ష రద్దు, వివాదాలతో ఆత్మహత్య చేసుకున్నారు.కహాన్ పటేల్ (గుజరాత్): అహ్మదాబాద్కు చెందిన 17 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 18, 2026న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ప్రాణాలు వదిలారు.ఆకాంక్ష చతుర్వేది (మధ్య ప్రదేశ్): మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని నాగ్పూర్లో ఆత్మహత్య చేసుకున్నారు.రీమా బేగం (అస్సామ్): 21 ఏళ్ల ఈ నీట్ అభ్యర్థి జూన్ 2026లో మానసిక ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.అవంతిక మౌర్య (మధ్య ప్రదేశ్): ఇండోర్కు చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో భవనంపై నుంచి పడి మృతి చెందారు.జతిన్ కుమార్ (ఉత్తర ప్రదేశ్): ఘజియాబాద్కు చెందిన 22 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 2026లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఎస్. గోపిక (తమిళనాడు): సేలం జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 19, 2026న రీ-టెస్ట్ ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.షేక్ సనా (తెలంగాణ): హైదరాబాద్కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న జరగాల్సిన రీ-నీట్ పరీక్షకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నారు.వెత్రియానందం (తమిళనాడు): హోసూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జూన్ 2026లో పరీక్షా వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.సిమ్రన్ (హర్యానా): హిసార్కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న పునఃపరీక్షకు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.రోషిణి (తమిళనాడు): ధర్మపురి జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 2026లో పరీక్షా ఒత్తిడి కారణంగా బలవన్మహత్వానికి పాల్పడ్డారు.అంకితా సాంగ్లే (మహారాష్ట్ర): అహిల్యానగర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! -
కలకలం.. నలుగురు పాఠశాల విద్యార్థినులు అదృశ్యం
సంగారెడ్డి : జిల్లాలోని ఇస్నాపూర్లో ఒకేసారి నలుగురు పాఠశాల విద్యార్థినులు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. బీహార్ రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలు ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈనెల 23వ తేదీన యథావిధిగా పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన విద్యార్థినులు, సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించగా, ఆ రోజు వారు అసలు స్కూల్కే రాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు.బాధిత కుటుంబాలు బీహార్కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులను కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియా కుమారి (12)లుగా గుర్తించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
రెండు పాఠశాలల్లో పాచిపోయిన ఆహారం.. 71 మంది బాలికలకు అస్వస్థత
చింతూరు/కోటవురట్ల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిదర్శనమిది. గతంలో పలు కేజీబీవీల్లో, ఆశ్రమ గిరిజన పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైనా, వాటి నిర్వహణలో లోపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా శుక్రవారం జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా మధ్యాహ్నం వండిన పప్పు, కూరలనే రాత్రికి కూడా పిల్లలకు పెట్టడంతో పాచిపోయిన ఆ ఆహారం తిని రెండు పాఠశాలల్లో 71 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.పోలవరం జిల్లా వీఆర్ పురం మండలం సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 41 మంది, అనకాపల్లి జిల్లా కోటవురట్ల కేజీబీవీలో 30 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోములగూడెంలో పాచిపోయిన పప్పు సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ – టీచర్స్ సమావేశం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వండిన పప్పు మిగిలిపోవడంతో విద్యార్థినులకు రాత్రి కూడా దానినే వడ్డించినట్లు తెలిసింది. మధ్యాహ్నం మిగిలిన పప్పుతో పాటు బంగాళదుంప కూర తిన్నామని, అర్ధరాత్రి నుంచి కడుపు నొప్పి ప్రారంభం కావడంతో మాత్రలు వేసుకున్నామని విద్యార్థినులు చెప్పారు.శనివారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు అధికం కావడంతో చింతూరు సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ బాధిత విద్యార్థినులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల కోరిక మేరకు మధ్యాహ్నం మిగిలిన పప్పును రాత్రి కూడా పెట్టారని ఆయన చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నొఖ్వాల్ చెప్పారు. కోటవురట్లలో పాడైపోయిన కూరలు కోటవురట్ల కేజీబీవీలో శుక్రవారం జరిగిన పేరెంట్–టీచర్స్ మీటింగ్కు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం వంకాయ, బంగాళాదుంప కూరలను పెట్టారు. మిగిలిపోయిన కూరలను రాత్రికి కూడా విద్యార్థినులకు పెట్టారు. శనివారం ఉదయం కిచిడీ తిన్న కొద్ది సేపటికే 30 మంది విద్యార్థినులు విరేచనాలు, వాంతులతో విలవిల్లాడిపోయారు. వీరిలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.కె.వెంకటాపురం పీహెచ్సీ వైద్యాధికారి కేజీబీవీకి చేరుకుని చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బొట్టా సత్యవతి, గాలి జయలక్షి్మ, గుడివాడ విజయలక్ష్మి, గెడ్డం పూజిత, గజ్జి జాహ్నవిలను కోటవురట్ల సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగతా 25 మందికి కేజీబీవీలోనే పీహెచ్సీ వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కేజీబీవీకి పరుగు పరుగున వచ్చారు. పాచిపోయిన ఆహారం వల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్టు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో కొన్ని..⇒ 2026 ఫిబ్రవరి 7 : పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 103 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉడకని ఇడ్లీలు, చాలా రోజులుగా నిల్వ ఉన్న శనగ పిండితో చేసిన బొంబాయి చట్నీ తినడం వల్ల ఆస్పత్రిపాలయ్యారు. ⇒ 2026 ఏప్రిల్ 1 : అన్నమయ్య జిల్లా పుంగనూరులోని మున్సిపల్ పాఠశాలలో బల్లి పడిన భోజనం తిని ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ⇒ 2026 ఏప్రిల్ 21 : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆహారం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ⇒ 2026 జూలై 8 : కడపలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ లేడీస్ హాస్టల్లో 30 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. దోశలు, చట్నీ తిన్న వారు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. -
వీడియోలు కాదు, యాక్షన్ కావాలి : రాహుల్ గాంధీ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై దేశ రాజదాని నగరం న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ,విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విడుదల చేస్తున్న వీడియోలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియోలు కాదు, విద్యార్థులపై కోరుతున్న డిమాండ్లపై చర్యలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాడికి గురైన విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.23 రోజులుగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థ అవినీతికి ప్రతీక అని విమర్శించారు. ఆయనను వేరే శాఖకు మార్చడం కాకుండా, ప్రభుత్వం నుంచే పూర్తిగా తొలగించాలని (మంత్రివర్గం నుండి తీసేయాలని) విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.మోదీ రాత్రివేళల్లో చేసే వీడియో సందేశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులకు ప్రధాని హామీలు, వీడియోలు వద్దని, తక్షణ చర్యలే కావాలని స్పష్టం చేశారు.मोदी जी, करोड़ों छात्रों का भविष्य बर्बाद करने के बाद अब आधी रात की Reel से उनका वक़्त बर्बाद मत कीजिए।प्रधान बर्ख़ास्त। दोषियों पर कार्रवाई। छात्रों से माफ़ी।इससे कम कुछ भी मंज़ूर नहीं। pic.twitter.com/RWrLLDD0WC— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 అలాగే ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ ప్రయోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఒక విద్యార్థిని చూపిస్తూ... విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులే ఈ దేశపు భవిష్యత్తు అని మోదీ దేశానికి గతం అని గతం ఎన్నటికీ భవిష్యత్తును ఓడించలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా AISA ప్రతినిధి నేహా బోరా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో విద్యా వ్యవస్థపై చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
అనంతపురంలో హైటెన్షన్ విద్యార్థులు అరెస్ట్
-
అనంతపురంలో హైటెన్షన్.. విద్యార్థులు అరెస్ట్
-
మీ 20మంది విద్యార్థులు చనిపోయారు..! ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి
-
తల్లికి మళ్లీ మోసం!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వంలో ప్రారంభించిన అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అనే పేరు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడుస్తోంది. ఎన్నికలకు ముందు ‘‘నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఒక్కొక్కరికీ రూ.15 వేలు’’ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఆయన పరివారం.. అవసరం తీరిన తర్వాత తల్లులకు వెన్నుపోటు పొడిచారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా నిధులు విదిల్చి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం తొలి ఏడాది ఎగవేసిన దానిని దాచిపెట్టి, రెండవ ఏడాది అరకొరగా ఇచ్చినదానినే తొలి ఏడాదిగా, ప్రస్తుత విడతను రెండో ఏడాదిగా చెప్పుకుంటున్నారు. ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎదురు చూసి మోసపోయిన తల్లులు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అర్హులు, అనర్హుల జాబితాలు ఉంచడంతో అందులో తమ పేరును వెతుకుతున్నారు. నమ్మశక్యం కాని సాకులతో, బతికున్న పిల్లలు చనిపోయినట్లుగా, ఇద్దరు పిల్లలుంటే ఒక్కరినే చూపి, మరొకరిని వదిలేసినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు మార్కు మోసపు ప్రకటన : మొదటి ఏడాది తల్లికి వందనం పూర్తిగా ఎగ్గొట్టి.. అరకొరగా ఇచ్చిన రెండో ఏడాదిని మొదటి ఏడాదిగా చెప్పుకుంటూ నిస్సిగ్గుగా చంద్రబాబు ప్రభుత్వం ‘ఈనాడు’లో ఆర్భాటంగా ఇచ్చిన ప్రకటన నిలిచిపోయిన వెబ్సైట్ తమకు అన్ని అర్హతలు ఉన్నా, ఎందుకు డబ్బులు ఎగవేశారో తెలియక తల్లులు సచివాలయాలకు వెళితే అక్కడ వారి గోడు వినేవారే లేరు. ఒక వేళ విందామని ఎవరైనా అనుకున్నా కూడా ప్రభుత్వం వారికి ఆ అవకాశం ఇవ్వడం లేదు. అర్జీలు నమోదు చేసేందుకు అవకాశమే లేకుండా సంబంధిత వెబ్సైట్ను శుక్రవారం నిలిపి వేసింది. ఆన్లైన్లో చూస్తే కొంత మంది విద్యార్థుల వివరాలు కనిపించడం లేదు. ఇదేమిటని తల్లులు అడుగుతుంటే, తమకు తెలియదని సచివాలయ సిబ్బంది తెల్లముఖం వేస్తున్నారు. కొందరు పై స్థాయి అధికారులకు చెప్పినా వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. దీంతో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. నలుగురు పిల్లల్లో ఒక్కరికీ ఇవ్వలేదు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని జక్కరవలస గ్రామానికి చెందిన జానకి, సవర వెంకటరావు దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో నలుగురు చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి డబ్బులు క్రమం తప్పకుండా ఇచ్చారు. పిల్లల చదువులకు ఉపయోగపడ్డాయి. ఈ ప్రభుత్వం ఇంట్లో పిల్లలందరికీ తల్లికి వందనం డబ్బులు వేస్తామని చెప్పింది. కానీ ఒక్కరికీ రావడం లేదు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. నలుగురు పిల్లలకు కలిపి రూ.15 వేల చొప్పున రూ.60 వేలు రావాలి. ఒక్క రూపాయి కూడా పడలేదు. ఉన్నది ఎంత మంది? ఇచ్చింది ఎంత మందికి? యునిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ–యూడైస్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. వీరికి రూ.15 వేల వంతున ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది 2024–25లో పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 2025–26లో 67.27 లక్షల మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ వాస్తవంగా ఇచ్చింది మాత్రం రూ.6,377 కోట్లే. ఆ అరకొర నగదు కూడా పడని వారి సంఖ్య గత ఏడాది 21 లక్షలు.ఈ ఏడాదీ అదే పరిస్థితి. మూడేళ్లలో తల్లులకు రూ.39,338.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా, గత ఏడాది జమ చేసింది రూ.6,377 కోట్లు, ఈ ఏడాదీ జమ చేస్తున్నదీ దాదాపు అంతే. ఎందుకంటే ఈ ఏడాది కూడా అరకొరగానే ఇస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం రూ.26,584 కోట్లు బకాయి పడింది. యూడైస్ ప్రస్తుత డేటా ప్రకారం తీసుకున్నా, ఈ ప్రభుత్వం అశ్రద్ధ, వైఫల్యం వల్ల విద్యార్థుల సంఖ్య 84.55 లక్షలకు తగ్గింది.ఈ లెక్కన తీసుకున్నా కూడా ఈ ఏడాది (2026–27) రూ.12,684.5 కోట్లు ఇవ్వాలి. అయితే ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటూ రూ.10,090 కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే ఈ మొత్తం కూడా పంపిణీ చేయరని క్షేత్ర స్థాయిలో పరిస్థితి స్పష్టం చేస్తోంది. కొంత మంది పిల్లలకు రూ.7, 8 వేలు మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అది కూడా ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికే ఇచ్చి.. మరొకరికి ఇవ్వని పరిస్థితి. చేతల్లోనూ కోతలు చంద్రబాబు ప్రభుత్వం మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ కోతలు కోస్తోందని తల్లికి వందనం లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు పంచాయతీ పరిధిలోని గంజి ఆదిలక్ష్మి, దాసరి వరలక్ష్మి, శ్రీలక్ష్మిలకు రూ.10,900 చొప్పున మాత్రమే జమ అయింది. మిగతా డబ్బులు ఎప్పుడు వేస్తారని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మండలంలో చాలా మందికి ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. ఉలవపాడు–1 సచివాలయం పరిధిలో 97 మంది అర్హులకు మొండి చేయి చూపారు. అమ్మానాన్న లేరు.. ముగ్గురికీ రాలేదుమా తల్లిదండ్రులు కొమ్మిరి శ్రీవాణి, కొమ్మిరి జనార్ధనలకు మేము ముగ్గురు పిల్లలం. ముగ్గురం చదువుతున్నాం. తల్లికి వందనం అర్హుల జాబితాలో మా పేర్లు లేవు. మా అమ్మా నాన్న చనిపోయారు. మా కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మా తాత కొమ్మిరి నాగమల్లప్ప స్కూల్ దగ్గరికి, సచివాలయం ఆఫీసర్ దగ్గరికి తిరుగుతూ ఉన్నా ఎవరూ సమాధానం చెప్పడం లేదు. దయవుంచి తల్లి, తండ్రి లేని మాకు న్యాయం చేయాలి. - కొమ్మిరి కీర్తన,మాతాశ్రీ, శ్రావణీంద్ర, గుడుపల్లి, అన్నమయ్య జిల్లా. కూలీ కుటుంబానికి అర్హత లేదా? మా నాన్న బాలకృష్ణ, అమ్మ సంధ్య కూలి పని చేస్తారు. మేము ముగ్గురు పిల్లలం. ఒకరు పాతమేఘవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, మిగతా ఇద్దరం చిన్న మరువాడ ప్రాథమిక పాఠశాలలో ఐదు, మూడో తరగతులు చదువుతున్నాం. తల్లికి వందనం పథకం కింద మాలో ఒక్కరికి కూడా డబ్బులు రాలేదు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. - సంధ్య పిల్లలు, చిన్న మరువాడ, సంతబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా ఇద్దరు ఉంటే ఒక్కరికే..కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ పంచాయతీ భరత్ నగర్కు చెందిన గొల్ల లలిత, నాగిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరు 3, మరొకరు 1వ తరగతి. వీరిలో ఒకరికే వచ్చింది. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుతున్నప్పటికీ ఒకరి పేరు అర్హుల జాబితాలో లేదు. ఒకే ఇంట్లో ఇద్దరు చదివే పిల్లలుంటే ఒకరికి మాత్రమే ఇచ్చి, మరొకరికి ఎందుకివ్వలేదని అడిగితే సమాధానం చెప్పే వారే లేరు. తల్లికి ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎగ్గొట్టారనడానికి ఈ కుటుంబమే నిదర్శనం. వీరికి ఎందుకు ఇవ్వలేదు?ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడుకు చెందిన వేముల సుహాసిని కుమారుడు శ్రీ చరణ్ తిరువూరులోని ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనర్హుల జాబితాలో చేర్చారని తల్లి సుహాసిని వాపోయారు. బాలుడి తండ్రి నరసింహారావు తిరువూరులో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయినా ఈ ‘తల్లి’కి వందనం దక్కలేదు.ఇస్తామని చెప్పి మాట తప్పారు నా భర్త లేకపోయినా నాలుగు ఇళ్లలో పని చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటున్నా. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా తల్లికి వందనం రాలేదు. సచివాలయానికి వెళ్లి అడుగుతుంటే ఏమీ చెప్పడం లేదు. ప్రభుత్వం పేదలను ఇలా ఇబ్బంది పెట్టడం మంచిదికాదు. చెప్పిన మాట మేరకు అందరికీ ఇవ్వాలి. – నూకరత్నం, సామర్ల కోట, కాకినాడ జిల్లా..నిజాయితీగా వ్యవహరించాలి మాకు ఇద్దరు పిల్లలు. కీర్తి 10వ తరగతి, మైథిలి 9వ తరగతి చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి కింద డబ్బులు పడ్డాయి. ఏ లెక్కన తీసుకున్నా ఈ పథకానికి మాకు పూర్తి అర్హత ఉంది. కానీ అన్యాయంగా డబ్బులు జమ చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. నిజాయితీగా పథకం అమలు చేయలేనప్పుడు హామీలు ఇవ్వకూడదు.– కందుల సుభాషిణి, నరసాయపాలెం, యర్రగొండపాలెం మండలం, మార్కాపురం జిల్లా సాకులు చెప్పి ఎగ్గొడతారా? మా కుమారుడు బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి పథకం క్రమం తప్పకుండా అందింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక తల్లికి వందనం నగదు జమ కావడంలేదు. ఈ విషయమై ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఏవో సాకులు చెప్పి డబ్బులు ఎగ్గొట్టడం దారుణం. – రమీజా, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరుజిల్లా రూ.8,800 మాత్రమే పడ్డాయి నా కుమారుడు గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలకు గాను రూ.8,800 మాత్రమే బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. మా గ్రామానికి చెందిన కంటా సుగుణ అనే మరో మహిళకు రూ.10,800 జమైంది. ఇలా చాలా మందికి తక్కువ డబ్బులు వేశారు. రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇలా సగం సగం ఇవ్వడం బాగోలేదు. మిగతా బకాయిలు వెంటనే ఇవ్వాలి. – పోరాపు దేవుడమ్మ, పోరాపుబాడవ, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా నిరుపేదలకూ ఇవ్వరా? మాకు ఇద్దరు పిల్లలు. పెద్దకుమారుడు షణ్ముఖవేలు పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం, చిన్నకుమారుడు మోకేష్ పిచ్చాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మాది రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం. నేను ఆటో డ్రైవర్ కాగా, నా భార్య ఉపాధి హామీ పథకం కూలీ. మా పిల్లలకు తల్లికి వందనం నగదు బ్యాంకులో జమ కాలేదు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. నిరుపేదలైన మాకు ఆ డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలి. – కుప్పం, అప్పంపేట, పిచ్చాటూరు మండలం, తిరుపతి జిల్లా మిగతా సొమ్ము ఏమైంది? మా కుమార్తె కేజీబీవీలో 10వ తరగతి, కుమారుడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద ఒకరికి రూ.13 వేలు, మరొకరికి రూ.8,800 జమ అయింది. సచివాలయ జాబితా పరిశీలిస్తే ఇద్దరికీ రూ.13 వేలు జమ అయినట్లు చూపిస్తోంది. కానీ మిగిలిన సొమ్ము ఎందుకు పడలేదో ఎవరూ సమాధానం చెప్పడం లేదు. – వాన గుణవతి, సారవకోట, శ్రీకాకుళం జిల్లా బతికున్నా.. చంపేశారు మాటలు రాని ఓ గిరిజన బాలుడు బతికున్నా చంద్రబాబు ప్రభుత్వం చంపేసింది. ఆన్లైన్లో విద్యార్థి మరణించినట్లుగా నమోదు కావడంతో రెండేళ్లుగా తల్లికి వందనం పథకం అందడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం టి.కె.జమ్ము పంచాయతీ పరిధిలోని చినదొడిజ గ్రామానికి చెందిన ఆరిక పాపారావు కుమారుడు ఆరిక జీవన్స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ.. బాలుడిని అనర్హత జాబితాలో చూపారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండడంతో తల్లిదండ్రులు సచివాలయంలో సంప్రదించారు. ఆన్లైన్ రికార్డుల్లో విద్యార్థి మరణించినట్లు చూపుతోందని వారు తెలిపారు. తొలుత తమ కుమారుడు బతికున్నట్లు చూపిస్తే చాలని తండ్రి పాపారావు వేడుకున్నాడు. ఇది తమ పరిధిలో లేదని, ఉన్నతాధికారులను కలవాలని సచివాలయ సిబ్బంది చెప్పారు. వీరు ఏం పాపం చేశారు? వారిద్దరూ కవలలు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. కళ్లు లేని, కాళ్లు కదపలేని 80 ఏళ్ల తాత వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. ఈ కవల విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన ఇజ్జాడ హేమ, తవిటినాయుడు దంపతుల కుమారులు ఇజ్జాడ షణ్ముఖరావు, పురుషోత్తంనాయుడులు జి.సిగడాం మోడల్ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో 80 ఏళ్ల వయసు గల తాత లక్ష్మి నాయుడు సంరక్షణలో ఉంటున్నారు. ఇద్దరు మనవళ్లకు కాసిన్ని డబ్బులు వస్తే సాయంగా ఉంటుందని ఆశించారు. దాని కోసం ఎంతో ప్రయత్నించారు. తీరా పడకపోయే సరికి.. తల్లికి వందనం డబ్బులు తమకు ఎందుకు పడలేదు బాబు అంటూ దీనంగా అడుగుతున్న తీరు పలువురి కంట నీరు తెప్పించింది. కొందరికే ఇవ్వడం దుర్మార్గం తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు కొందరికి మాత్రమే డబ్బులు వేయడం దుర్మార్గం. నాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం దారుణం. హామీలు ఇచ్చేటప్పుడు ఊదరగొట్టారు. అమలుకు వచ్చే సరికి చేతులెత్తేస్తున్నారు. – వేమిరెడ్డి శ్రీలక్ష్మి, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా -
సోషల్ మీడియాని ఊపేస్తున్న కాక్రోచ్... GEN-Z కొత్త ట్రెండ్
-
విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్
నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా ఆగ్రహం రాజుకుంటోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. ఢిల్లీ నుంచి కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో జంతర్మంతర్కు తరలివస్తూ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు లాఠాచార్జీ చేసినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది . తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థుల నిరసనలకు మద్దతు పలికాడు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగిన అంశమేనని పేర్కొన్నాడు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశకు లోనవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. స్వతహాగా తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పుడే తనకు నూరి పోసిన మాటలను సచిన్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘ఓటములు ఎదురైనా పర్వాలేదు, కానీ మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి. జైహింద్’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్లో రాసుకొచ్చాడు.కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అని సచిన్ అభిప్రాయపడ్డాడు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.సచిన్తో పాటు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో పాటు కోహ్లి, శుబ్మన్ గిల్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు పార్లమెంట్ కూడా అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతాపార్టీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. pic.twitter.com/3a8WRHhWIK— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026 -
బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది..
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండించడంతోపాటు నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్భవన్ కార్యక్రమం గురువారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు లోక్భవన్కు వెళ్లే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. మ్యూజియం రోడ్డు, బందరు రోడ్డులో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటుచేశారు. పోలీసులు భారీగా మోహరించారు.శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్భవన్కు వెళ్తున్న విద్యార్థులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి విద్యార్థులు, యువకులు భారీగా మ్యూజియం రోడ్డు నుంచి బందరు రోడ్డుకు చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు. అయినా విద్యార్థులు బారికేడ్లను నెట్టుకుంటూ లోక్భవన్కు వెళ్లేందుకు బందరు రోడ్డు వెంట పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారి వెంటపడ్డారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు పోలీసులు విద్యార్థులను రోడ్డుపై పడేసి కాలర్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. రోడ్డుకేసి కొడుతూ బూటుకాళ్లతో తన్నారు. విద్యార్థినులు, యువతులపైనా విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరిద్దరు పోలీసులు విద్యార్థి సంఘాల కండువాలు కప్పుకుని మరీ విద్యార్థులపై దాడికి పాల్పడడం గమనార్హం. ఏఎస్సై రవికుమార్ ఓ విద్యార్థిపై దాడి చేయడంతో మిగిలిన విద్యార్థులు ఆయనను అడ్డుకున్నారు.రోడ్డుపై బైఠాయింపు అనంతరం.. విద్యార్థి సంఘాల ప్రతినిధులను లోక్భవన్కు తీసుకెళ్తామని, గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు అధికారులు నమ్మబలికారు. అయితే, అపాయింట్మెంట్ ఇప్పించే వరకు వెనక్కు వెళ్లేది లేదంటూ మ్యూజియం రోడ్డులో విద్యార్థులు భైఠాయించారు. గంట తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదని, వెనక్కు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. లోక్భవన్కు వెళ్లేందుకు విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు మరోసారి వారిపై దాడి చేశారు. ఈడ్చిపడేస్తూ మ్యూజియం రోడ్డులోకి నెట్టేశారు.పోలీసుల దాడిని విద్యార్థులు ప్రతిఘటించారు. పోలీసుల తీరు, చంద్రబాబు సర్కారు వైఖరిపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్నకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం జరపతలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్ చలో’ర్యాలీలో హింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని చూడటం తీవ్ర వేదన కలిగించే విషయమని సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవడం కంటే వారి ఉద్దేశాలను ప్రశ్నించడం ఎందుకు సులభంగా అనిపిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆమె గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జంతర్మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో ఎటువంటి ఆధారాలు లేకుండా ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తొందరపాటు వద్దని సూచించారు. విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిష్టను మీడియాలో మసకబార్చేలా చూపడం ఒక విద్యావేత్తగా తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వెల్లడించారు. ఆందోళనకారులు అసాధారణమైన సహనం, క్రమశిక్షణ, సంయమనం ప్రదర్శించారని అంగ్మో కొనియాడారు. అలాగే సమస్యలను ప్రభుత్వం ఆలకించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. సొంత విద్యార్థులనే అంత త్వరగా అపనమ్మకంతో చూసే వ్యవస్థ ఎలాంటిదని తాను తరచుగా ఆలోచిస్తుంటానని ఉద్ఘాటించారు. మన పిల్లలు రక్షణకు అర్హులు అని తేల్చిచెప్పారు. వారిని ప్రతినాయకులుగా చిత్రీకరించవద్దని కోరారు. వారు చెప్పేది అందరూ వినాలని వెల్లడించారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చే కుట్రలతో విద్యార్థులను అణచివేస్తామంటే సహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. -
నేటి యువత చూపుతున్న నైతిక శక్తి
ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతున్న విద్యార్థుల నిరసన... శాంతియుతంగా వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం ఉన్న వారే ఒక దేశపు ప్రజాస్వామ్య గాథను రాస్తారనే చిరస్థాయి సూత్రాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. బ్రిటిష్ పాలనలో జరిగిన స్వదేశీ ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు; స్వాతంత్య్రం తరువాత గుజరాత్లోని నవనిర్మాణ ఉద్యమం నుంచి 1970ల జేపీ (జయప్రకాశ్ నారాయణ్) జేపీ ఉద్యమం వరకు... వ్యవస్థ న్యాయమార్గం నుంచి తప్పిపోతోందని భావించిన ప్రతిసారీ విద్యార్థులు సవాలు విసిరారు. వారి పాత్ర తరగతి గదులకే పరిమితం కాలేదు. జంతర్ మంతర్ నిరసన ఆ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే.సత్యాగ్రహ శక్తిసామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అనేక వీడియోల్లో, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు హింసతో ప్రతిస్పందించకుండా నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. తమపై ఏమి జరిగినా శాంతియుతంగానే ఉంటామని కొందరు పోలీసుల ఎదుట నిలబడి చెప్పారు. వారు తెలుసుకుని చేసినా, తెలియక చేసినా అది మహాత్మా గాంధీ ‘సత్యాగ్రహం’గా అభివర్ణించిన సత్యశక్తినే ప్రతిబింబించింది. ‘మానవాళి చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం అహింస’ అని గాంధీజీ అన్నారు. ఆయన దృష్టిలో సత్యాగ్రహి లక్ష్యం ప్రత్యర్థిని ఓడించడం కాదు, సమాజ అంతరాత్మను మేల్కొల్పడం. జంతర్ మంతర్ నిరసన ద్వారా విద్యార్థులు సరిగ్గా ఇదే చేశారు. విద్య అంటే అసలు ఏమిటన్న మరింత లోతైన ప్రశ్నను కూడా ఈ నిరసన లేవనెత్తుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావప్రకటన స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశ మయ్యే హక్కును హామీ ఇస్తోంది. ఎందుకంటే భయపడకుండా అధికారాన్ని ప్రశ్నించగల విజ్ఞానవంతులైన పౌరులపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అందువల్ల భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి మినహాయింపు కాదు; దాని ప్రాథమిక అవసరాల్లో అది ఒకటి. ఏ రాజకీయ సిద్ధాంతం అధికారంలో ఉన్నా, ప్రజా శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే కావచ్చు. కానీ అదే సమయంలో శాంతియుత నిరసనను దేశానికే ముప్పుగా పరిగణించకుండా చూడటం కూడా ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అనేది గుర్తెరగాలి.ధర్మబద్ధమైన కార్యాచరణ‘ప్రభుత్వాలు తాత్కాలికమైనవి; ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వ తమైనవి’ అని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దేశాన్ని విమర్శించినట్టుగా భావించడం... భారత స్వాతంత్య్ర ఉద్యమం నెలకొల్పాలనుకున్న రాజ్యాంగ సంస్కృతినే బలహీన పరుస్తుంది. ఇది ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న ‘సనాతన ధర్మం’ వైపునకు తీసుకువెళుతుంది. ప్రస్తుత రాజకీయ చర్చల్లో సనాతన ధర్మాన్ని కేవలం మతపరమైనదిగా చిత్రీకరిస్తున్నారు. కానీ భారతీయ శాస్త్రీయ తాత్విక సంప్రదాయంలో దానికి ఎంతో విస్తృతమైన అర్థం ఉంది. ‘ధర్మం’ అంటే సమాజాన్ని నిలబెట్టేది– న్యాయం, సత్యం, కరుణ, కర్తవ్యం, నైతిక క్రమం. అది కేవలం ఆచారాలు, కర్మకాండలు కాదు; నైతిక ప్రవర్తన.ధర్మం లేని అధికారానికి చెల్లుబాటు ఉంటుందా అనే ప్రశ్న మహాభారతంలో చాలాసార్లు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు అధికారంపై మమకారంతో అన్యాయాన్ని చూడలేకపోయాడు. దుర్యోధనుడి దురాశ ఒక రాజ్యాన్నే నాశనం చేసింది. భీష్ముడు జ్ఞానవంతుడూ, నిష్కళంకుడూ అయినప్పటికీ, చక్రవర్తి పట్ల తన విధేయత కారణంగా అధర్మాన్ని ఎదిరించలేక విషాదపాత్రగా మిగిలాడు. న్యాయాన్ని వదిలిపెట్టిన పాలకులు చివరకు తమను తామే నాశనం చేసుకుంటారని విదురుడు పదేపదే హెచ్చరిస్తాడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అధికారాన్ని సమర్థించడం కాదు; ధర్మ బద్ధమైన కార్యాచరణకు మద్దతు ఇవ్వడం. ఈ సందేశం శాశ్వత మైనది. ధర్మం రాజకీయ అధికారానికి మించినది. పాలకుల చెల్లు బాటు నైతిక పాలన పట్ల వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది.ఈ అవగాహన భారత రాజ్యాంగంతో కూడా సారూప్యత కలిగి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, న్యాయం వంటి విలువలు భారతీయ నాగరికతపై పాశ్చాత్య ప్రపంచం రుద్దినవి కావు. ఉప నిషత్తుల నుంచి బుద్ధుడి వరకు, అశోకుని నుంచి బసవన్న వరకు, కబీర్ నుంచి అంబేడ్కర్ వరకు... భారతీయ తాత్విక సంప్రదా యాల్లో ఇవి లోతుగా ప్రతిధ్వనిస్తాయి. భారత రాజ్యాంగ నైతికత, భారత నాగరికత నైతిక సంప్రదాయం పరస్పర విరోధాలు కావు; అత్యుత్తమ రూపంలో అవి ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.పూర్తికాని స్వాతంత్య్ర పోరాటంభారతదేశం 1947లో రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే ఆ స్వేచ్ఛకు నైతిక పునాదులను కాపాడుకునే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా మాత్రమే నిలవదనీ, ప్రజా అంతరాత్మ ద్వారానూ నిలుస్తుందనీ గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సమాధానం కేవలం అధికార కేంద్రాల్లో దొరకదు. స్వతంత్ర ఆలోచనను పెంపొందించే తరగతి గదుల్లో, జవాబుదారీతనాన్ని ఆహ్వానించే సంస్థల్లో, భయానికి సత్యాన్ని బలివ్వని పౌరుల్లో అది కనిపిస్తుంది. అధికా రాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు; గణతంత్రంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచే చర్య అని జంతర్ మంతర్లో యువత గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు నిరసన స్వరం కాదు, పౌరుల మౌనం!డా‘‘ రఘు చలిగంటివ్యాసకర్త ఫ్రౌన్హోఫర్ హెచ్హెచ్ఐ (జర్మనీ)సీనియర్ పరిశోధకుడు, ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ’ వ్యవస్థాపకుడు -
విజయవాడలో హైటెన్షన్.. విద్యార్థులు అరెస్ట్
-
ఉద్యమం... ఉధృతం
న్యూఢిల్లీ: పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం బుధవారం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పరీక్షార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలతో కోలాహలంగా మారింది. వాళ్లు చేసే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. బ్యాక్ప్యాక్లతో కొందరు కొన్ని రోజులపాటు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చారు. సొంతంగా బ్యానర్లు సిద్ధంచేసుకుని, ప్లకార్డులు పట్టుకుని ఉద్యమస్థలికి చేరుకున్నారు. కొందరు పోలీస్బారికేడ్లను ఊతంగా చేసుకుని కూర్చోగా కొందరు సమీపంలోని చెట్లు ఎక్కి మొత్తం ఉద్యమప్రాంగణాన్ని ఆసక్తిగా గమనించారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారని, ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్కు స్వల్పగాయమైందని పోలీసులు ఆరోపించారు. మూతబడిన మెట్రోస్టేషన్లు.. ఎలాంటి అనూహ్య పరిణామాలు జరక్కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఢిల్లీ అధికార యంత్రాంగం ఢిల్లీలో 17 మెట్రో స్టేషన్లను కొన్ని గంటలపాటు మూసేసింది. లోక్ కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్్థ, జన్పథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీవో, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజీ స్టేడియం, ఝాన్దేవాలన్ స్టేషన్లను మూసేశారు. ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తూ... ఉద్యమ స్ఫూర్తి పలు రాష్ట్రాల్లోనూ నిరసనకారులు పుణికిపుచ్చుకుని రాష్ట్ర రాజధానుల్లో ర్యాలీలు చేపట్టారు. బిహార్లో ‘లోక్భవన్ మార్చ్’పేరిట గవర్నర్ హౌస్కు ర్యాలీగా వెళ్లిన ఉద్యమకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించి విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీచార్జ్ సైతం చోటుచేసుకుంది. తమిళనాడులోనూ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఉద్యమసంఘాలు కోయంబత్తూర్ తదితర చోట్ల ఢిల్లీ లాఠీచార్జ్ను నిరసిస్తూ ర్యాలీలు చేపట్టాయి. -
విద్యార్థులు ఉగ్రవాదులు కాదు
న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా చట్టబద్ధమైనవని, వాటిపై రాజీ పడటానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీట్–యూజీలో అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. నిరసనకు దిగిన విద్యార్థులు ఉగ్రవాదులు కాదని.. వారు కేవలం నిష్పక్షపాతమైన విద్యా వ్యవస్థ కావాలని కోరుతున్నారని చెప్పారు. పరీక్షల్లో అక్రమాల వల్ల నష్టపోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాలన్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యా వ్యవస్థ రిగ్గింగ్కు గురైందని, అది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియోను రాహుల్ ప్రదర్శించారు. ప్రభుత్వం, పాలకులు భయాందోళనలో ఉన్నారని, అందుకే విద్యార్థులను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే.. విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలి..‘‘ప్రధానమంత్రి నివాసం వద్ద మంగళవారం శాంతియుత నిరసనలో పాల్గొన్న నన్ను బలవంతంగా ఈడ్చేశారు. భౌతిక దాడి చేశారు, నిర్బంధించారు. అవన్నీ నేను లెక్కచేయను. అవి చాలా చిన్న విషయాలు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేయడమే నా పని. ఇప్పుడున్న విద్యా వ్వవస్థ వల్ల పేదలు ఇబ్బంది పడుతుండగా, ధనవంతులు పేపర్ లీక్లతో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా మారాలి. విద్యార్థులు లేవనెత్తిన మూడు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్య పేరిట దోచుకుంటున్నారు మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. భద్రతా దళాలు వారిపై ఆయుధాలు గురిపెట్టడానికి, దాడి చేయడానికి విద్యార్థులు చేసిన తప్పేంటి? వారు ఈ దేశం తమకు ఇవ్వాల్సిన వాటిని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. న్యాయబద్ధమైన విద్యా వ్యవస్థ కావాలని అంటున్నారు. విద్యా వ్యవస్థలో లోపాల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతులేని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మన విద్యా వ్యవస్థ నేడు లోపాలమయంగా మారిన సంగతి అందరికీ తెలుసు. గత దశాబ్ద కాలంలో 152 సార్లు ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. కానీ, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. విద్యా వ్యవస్థ వైఫల్యం కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. సమాజంలో ఒక వర్గం వ్యక్తులు మన విద్యా వ్యవస్థను, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. మన దేశంలో కుటుంబాలు విద్య కోసం చేసే వార్షిక వ్యయం రూ.1.32 లక్షల కోట్లు. ఇది రూ.1.4 లక్షల కోట్ల విద్యా బడ్జెట్కు దాదాపు సమానం. విద్య పేరిట కుటుంబాలను దోచుకుంటున్నారు. దేశంలో తయారీ రంగం మూతపడింది, పరిశ్రమల్లో అవకాశాలు లేవు, కార్పొరేట్ ఉద్యోగాలు లేవు. ఇక మిగిలిన ఏకైక మార్గం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే. అవి కూడా దక్కకుండా విద్యావ్యవస్థను ధ్వంసం చేశారు’’ అని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.జితేంద్ర సింగ్ గురించి చర్చ అనవసరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తనపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. జితేంద్ర సింగ్ను ‘అప్రస్తుత వ్యక్తి’గా అభివరి్ణంచారు. నీట్–యూజీపై చర్చకు రాహుల్ తొలుత అంగీకరించి, తర్వాత మాట మార్చారని, ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారని జితేంద్ర సింగ్ మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ బుధవారం స్పందించారు. ‘‘జితేంద్ర సింగ్ తనకు నచ్చిన ఎలాంటి విషయాన్నైనా ఊహించుకోవచ్చు. అలా ఊహించుకోవడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దాని గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఆరోపణల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన గురించి చర్చ నిరర్థకమని పేర్కొన్నారు. పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్ ప్రతి ప్రభుత్వంలోనూ నాయకత్వం మానసికంగా కుప్పకూలిపోయే సమయం వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. పోలీసులు నాతో ఎలా ప్రవర్తించారనేది నాకు అనవసరం. నేను పట్టించుకోను. నాతో ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించినా పట్టించుకోను. విద్యా వ్యవస్థపై, పత్రాల లీకేజీలను అరికట్టడంపై, పిల్లలకు చెల్లించాల్సిన ఖర్చులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నా విషయంలో నచ్చింది చేసుకోండి. ఐదు రెట్లు కాదు కదా పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్. పోలీసులు నాతో ప్రవర్తించిన తీరువల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. దెబ్బలు తినడం నాకు అలవాటే. అది సమస్యేమీ కాదు. ఇప్పుడంతా బాగానే ఉంది. ఒకటి రెండు దెబ్బలు తినడం పెద్ద విషయం కాదు. ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులు నన్ను ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి తొలగించారు. అయితే, ఈ ప్రభుత్వాన్ని తొలగించమని నా చెవిలో చెప్పారు. ఆ భావన వారిలో ఉంది. జరిగిన దానిపై పోలీసులు కూడా సంతోషంగా లేరు. విద్యార్థులపై దాడి చేయడం దేశ భవిష్యత్తుకు వ్యతిరేకమైన నేరమని వివేకవంతులైన కొందరు పోలీసు సిబ్బంది భావిస్తున్నారు. నిరసనకారుల్లో తమ పిల్లలను చూసుకుంటున్నారు. -
గళమెత్తిన విద్యార్థి, మేధోవర్గం
-
అదే వేదిక.. అదే పోరు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో తమ డిమాండ్ల సాధనకు బయల్దేరిన వేలాది మంది కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక, విద్యావేత్తలను లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో చెదరగొట్టి, జంతర్మంతర్ వద్ద దీక్షాస్థలిని తొలగించినా ఉద్యమకారులు మళ్లీ మొదటి నుంచి తమ ఉద్యమాన్ని ఆరంభించారు. సోమవారం సాయంత్రం కార్యకర్తలందరినీ దీక్షాస్థలి నుంచి తరిమికొట్టినా మంగళవారం మధ్యాహ్నంకల్లా అందరూ మళ్లీ అదే దీక్షాస్థలికి వచ్చి నిరసనను మొదలెట్టారు. ‘‘పోలీసుల దాష్టికం చూశాక ఉద్యమం మరింత ఉధృతమైంది. సోమవారం కంటే ఎక్కువ మంది ఈరోజు దీక్షాస్థలికి చేరుకున్నారు. డజన్ల మంది విద్యార్థుల ఆత్మహత్యల బలిదానాలతో ఈ ఉద్యమం మొదలైంది. దీనిని వృథాగా పోనివ్వం.మా డిమాండ్లు నెరవేరేదాకా పోరాడతాం’’ అని ఉద్యమకారులు పునరుద్ఘాటించారు. నిరసన కార్యక్రమం మంగళవారం 32వ రోజుకు చేరిన సందర్భంగా జంతర్మంతర్లో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రసంగించారు. ‘‘సోమవారం చర్చల పేరిట మోదీ సర్కార్ మా సమయాన్ని వృథాచేసింది. కుట్రప్రకారం మా ప్రతినిధులు అశుతోష్, సౌరవ్ దాస్లను ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా నివాసానికి పిలిపించి అక్కడ వారిని నిలువరించారు. వాళ్ల మొబైల్స్ లాక్కున్నారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు వీధుల్లో విద్యార్థులను తలలు పగలగొట్టారు’’అని దీప్కే ఆగ్రహం వ్యక్తంచేశారు.లాఠీచార్జ్, అణచివేతతో తమ ఐక్యతను పోలీసులు చెదరగొట్టలేరని దీప్కే అన్నారు. ఆస్పత్రిలో వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని దీప్కే ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో సీజేపీ కార్యకర్తలు దీక్షాస్థలికి చేరుకున్నారు. వాంగ్చుక్ దీక్షకు గుర్తుగా జంతర్మంతర్ వద్ద ఆయన చిత్రపటాన్ని, రాజ్యాంగ ప్రతి, చర్కాను పెట్టారు. సీజేపీ నుంచి విజేత దహియా బయటకు.. సోమవారం పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న వేళ ప్రతిఘటించాల్సిందిపోయి జంతర్మంతర్ వద్ద తాపీగా బర్గర్ తింటూ కన్పించిన పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను సీజేపీ బయటకు పంపేసింది. ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సీజేపీ మంగళవారం ప్రకటించింది. దహియా సోమవారం బర్గర్ తింటున్న వీడియో బయటకు రావడంతో పలువురు నిరసనకారులు ఆయన నిబద్ధతను ప్రశ్నించారు. దీనిపై దహియా స్పందించారు. ‘‘రెండ్రోజులుగా అందరిలా రోడ్లపై నిద్రలేని రాత్రులు గడిపా. ఆకలేసి బర్గర్ తినడం కూడా తప్పేనా?’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. గాయాలతో వెంటిలేటర్పై విద్యార్థినిన్యూఢిల్లీ: చలో సంసద్ సందర్భంగా సోమ వారం పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగంలో గాయపడిన 23 ఏళ్ల విద్యార్థిని సాక్షి ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బాష్పవాయువు ప్రయోగం తర్వాత నిరసనకారులు పరుగులు తీయడంతో ఏర్పడిన తొక్కిసలాట వంటి పరిస్థితుల్లో ఆ యువతి ఊపిరి ఆడక ఇబ్బంది పడినట్లు భావిస్తున్నారు.ఆమె ముఖం, ఛాతీ, మెడ భాగాల్లో గాయాలైనట్లు సాక్షి కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటిలేటర్పై ఉన్నప్పటికీ చికిత్సకు స్పందిస్తోందని తెలిపారు. నిరసన జరిగిన సమయంలో ఆ యువతి తన బంధువుతో కలిసి అక్కడే ఉంది. ఆమె బంధువు కాలికి కూడా గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్పూర్ ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి సాక్షి అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు అభ్యసిస్తోంది. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. -
సీజేపీ ప్రొటెస్ట్లో విద్యార్థినులపై పోలీసుల అసభ్య వైఖరి : నెట్టింట దుమారం
నీట్ పేపర్ లీక్, విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా, ఆత్మహతల్యకు పాల్పడ్డ నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారంలాంటి డిమాండ్స్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ‘సంసద్ చలో’ మార్చ్ (పార్లమెంట్ మార్చ్) సందర్భంగా పోలీసులు ఉద్యమ కారులపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై స్వయంగా పోలీసులే రాళ్లు రువ్వడం, లాఠీలతో విరుచుకుపడటం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. ముఖ్యంగా మహిళా నిరసనకారులు, విద్యార్థినుల, పోలీసుల వైఖరి, ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహిళలు, విద్యార్థినుపై పోలీసులు వారిపై అమానుషంగా ప్రవర్తించారని ప్రతిపక్షాలు, ఉద్యమకారులు ఆరోపణలు చేశారు. కొంతమంది విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్పై కావాలనే దాడిచేశారని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇదేనా బేటీ బచావ్ అంటూ పలువురు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోపై దేశవ్యాప్తంగా మహిళల భద్రత మరియు ప్రజాస్వామ్య హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బాధ్యులపై పోలీసు అధికారులపై కఠిన చర్యలుతీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.मोदी सरकार का नारी सम्मान स्वयं देखिए।भाजपा को नारी केवल तब अच्छी लगती जब वह लाडली बहन योजना का धन लेके इनको वोट करे।जहां नारी अपने अधिकारों की बात करती है तब इनकी लाठी चलती है।#AAPHelplineForStudents#JointVenture#CJPProtestUpdate#OmegaStockWatch pic.twitter.com/EtLuNW368H— Cockroach Janta Party,Kanpur (@CJPknp) July 21, 2026నిరసనకారులను, విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లోకి ఎక్కించే క్రమంలో పలువురు మహిళల దుస్తులు చిరిగిపోయాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అనుమతి లేకుండా మార్చ్ నిర్వహిస్తున్నారనే నెపంతో పోలీసులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, బాష్పవాయువు ప్రయోగించి బాలికలపై తీవ్రంగా విరుచుకుపడ్డారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారులు మహిళలను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని ఒక మహిళా ఉద్యమకారిణి ఆరోపించింది. The Delhi Police intentionally attacked the private parts of girls, this is a shameful act by the police. Responsible police officer should be dismissed. pic.twitter.com/1g1gtCXgYQ— The Dalit Voice (@ambedkariteIND) July 21, 2026ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్అయితే ఈ ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు ఉన్నాయని, నిరసనకారులు అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసనకారులలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారని, ఆ క్రమంలో గుంపును చెదరగొట్టడానికి కనీస బలప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించామని స్పష్టం చేశారు. నెట్టివేతలు, బారికేడ్ల పైనుంచి పడిపోవడం మరియు తొక్కిసలాట లాంటి పరిస్థితుల వల్లే నిరసనకారులకు గాయాలయ్యాయని, కావాలని ఎవరిపై దాడి చేయలేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
నీట్లో భారీగా టాప్ స్కోరర్లు
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 ఫలితాలు విడుదల కావడంతో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆలిండియా ర్యాంకులు, మార్కుల ఆధారంగా సీటు అలాట్మెంట్పై అంచనాల్లో నిమగ్నమయ్యారు. గతేడాది నీట్ యూజీ ఫలితాలతో పోలిస్తే ఈసారి మార్కుల సరళి, పోటీలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. టాప్ స్కోర్లు సాధించిన వారి సంఖ్య అనూహ్యంగా పెరగడంతో కోరుకున్న చోట సీటు దక్కుతుందో లేదోనన్న ఆదుర్దా ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో కనిపిస్తోంది. దాదాపు రెండు రెట్లు పెరుగుదలగతేడాది నీట్లో అత్యుత్తమ స్కోర్ 686 దగ్గరే ఆగిపోయింది. ఈదఫా 715 వరకూ విద్యార్థులు స్కోర్ చేశారు. 501 ఆపైన స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే దాదాపు రెండు రెట్లు పెరిగిందని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో గతేడాది 501 ఆపైన 51,511 మంది స్కోర్ చేయగా ఈ దఫా ఏకంగా 89,341 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 38 వేల మంది విద్యార్థులు అదనంగా ఈ జోన్లోకి వచ్చారు. 401 నుంచి 500 మధ్య స్కోర్ చేసిన వారు గతేడాది కంటే ఈసారి 25 వేల మందికిపైనే పెరిగారు. టాప్ స్కోరర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్ సీట్ల కటాఫ్లు 15 నుంచి 30 మార్కుల మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.తొలుత ఆలిండియా..తర్వాత రాష్ట్ర కోటానేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన స్కోర్లు, ఆలిండియా ర్యాంక్ల ఆధారంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అంచనాల్లో తలమునకలయ్యారు. రాష్ట్రం నుంచి నీట్లో అర్హత సాధించిన విద్యార్థుల వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ జాబితా విడుదలైతే రాష్ట్ర స్థాయిలో ఎంబీబీఎస్ సీట్లకు నెలకొన్న పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించనుంది. అనంతరం ఆలిండియా కౌన్సెలింగ్కు ఎంసీసీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ను ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఎన్టీఏ నుంచి రాష్ట్ర అర్హుల జాబితా అందాక రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్కు హెల్త్ వర్సిటీ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆలిండియా తొలి విడత కౌన్సెలింగ్ ముగిశాక రాష్ట్ర స్థాయిలో తొలి విడత మొదలవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద హెల్త్ వర్సిటీ భర్తీ చేస్తుంది. ప్రైవేట్లో మిగిలిన 50 శాతం సీట్లలో 35 శాతం బీ, 15 శాతం సీట్లను సీ కేటగిరీల కింద వర్సిటీనే నింపుతుంది. ఇక 2023–24 నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆలిండియా కోటా 15 శాతం పోను మిగిలిన 85 శాతం సీట్లలో సగం కన్వీనర్, సగం సెల్ఫ్ ఫైనాన్స్కు కేటాయిస్తారు. -
సీసీటీవీ, సీట్ బెల్టులు, జీపీఎస్..
ముంబై: విద్యార్థుల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం స్కూలు బస్సులకు కఠిన నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కూలు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, సీట్ బెల్టులు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను తప్పని సరి చేసింది. స్కూలు బస్సులు, వ్యానులు, విద్యా సంస్థల బస్సుల కనీస చార్జీలను సైతం తామే నిర్ణయిస్తామని తెలిపింది. 2011 నాటి నిబంధనలను మారు స్తూ మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ (రెగ్యులే షన్ ఫర్ స్కూల్ బస్సెస్) (మొదటి సవరణ) నిబంధనలు–2026ను ఈ నెల 16వ తేదీన నోటిఫై చేసింది. కిలోమీటర్కు చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసే చార్జీల బేస్ రుసుమును ఆర్టీఏలు ఖరారు చేస్తాయని తెలిపింది. గతంలో ఇలాంటి నిబంధనేదీ లేక పోవడం గమనార్హం. నెలవారీ లేదా మూడు నెలలకు గాను ప్రాంతీయ రవాణాధికారి నిర్ణయించే రుసుముకు 10 శాతానికి తక్కువ కాకుండా, 10 శాతానికి మించకుండా వసూలు చేయవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. నిబంధనల అమలు, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారం అంశాలపై స్కూల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ పరిశీలన జరిపి జిల్లా స్కూల్ బస్ సేఫ్టీ కమిటీలకు మూడు నెలలకోసారి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా, కొత్తగా జీపీఎస్ లైవ్ ట్రాకింగ్, పానిక్ బటన్, సీసీటీవీ నిఘా, డిజిటల్ అటెండెన్స్, ఆటోమేటిక్ అలెర్టులు తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉంచటం తప్పనిసరి చేసింది. సీసీటీవీ ఫుటేజీని కనీసం 30 రోజులపాటు భద్రపర్చాలి. మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాలని నోటిఫికేషన్లో సూచించింది. బస్సులోని అన్ని సీట్లకు బెల్టులను అమర్చేలా నవీకరించాలని కోరింది. బస్సుల్లో అగ్ని ప్రమాదం పై అలారమ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం తప్పనిసరని తెలిపింది. ఐదో తరగతి వరకు విద్యార్థుల కోసం బస్సుల్లో మహిళా అటెండెంట్ను నియమించడం, అవకరాలు కలిగిన చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి చేసింది. -
విద్యార్థుల కోసం బాబు సర్కార్ పై YSRCP ఉద్యమ బాట
-
కొందరికే తల్లికి వందనం.. చంద్రబాబు సర్కార్ కొత్త రూల్స్!
-
వేడి ఒత్తిడితో చదువు చిత్తు!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశంలోని చాలా ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యాసం, ఆరోగ్యం, శ్రేయస్సును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఓ తాజా సర్వే చెబుతోంది. గత ఏడాది వేసవి కన్నా ఈ ఏడాది వేసవి ఎక్కువ వేడి ఒత్తిడిని కలిగించిందని స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్వై (క్రైౖ ) నిర్వహించిన ‘ఫీలింగ్ ద హీట్’అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణ సహా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3,096 మంది 10–17 ఏళ్ల బడి పిల్లలు ఎదుర్కొన్న వేడి ఒత్తిడి బాధలపై ‘క్రై’సర్వే చేసింది. ఎల్నినో పరిస్థితులు ప్రపంచ ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏపీలో అత్యధికంగా 88 శాతందేశంలో గత వేసవిలో వేడి సంబంధిత ఇబ్బందుల కారణంగా దాదాపు పది మందిలో ఏడుగురు పిల్లలు పాఠశాలలకు లేదా పాఠాలకు దూరమయ్యారు. అధిక వేడి తమ ఏకాగ్రతను దెబ్బతీసిందని 76 శాతం మంది చెప్పారు. డీహైడ్రేషన్, తలనొప్పి, తీవ్రమైన అలసట, కళ్లు తిరగటం, నిద్ర పట్టటంలో ఇబ్బంది వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. రోజువారీ కూలి పనులు లేదా శారీరక శ్రమ చేసే పేద కుటుంబాల్లో బడి పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా అధిక వేడి బాధల బారిన పడుతున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 68 శాతం మంది పాఠశాలకు లేదా సాధారణ కార్యకలాపాలకు హాజరు కాలేకపోయారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 88 శాతం మంది హాజరు కాలేదు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ కాగా పశ్చిమ బెంగాల్లో వీరి సంఖ్య దాదాపు 72 శాతంగా ఉంది.76% మందిలో ఏకాగ్రత తగ్గింది తెలంగాణలో 65–70% మంది పాఠశాల విద్యార్థులు ఎండ తీవ్రత భరించలేక స్కూళ్లకు సెలవు పెట్టారు లేదా క్లాసులకు వెళ్లలేదు. విపరీతమైన ఉక్కపోత వల్ల పాఠాలపై 76% మంది విద్యార్థులు ఏకాగ్రతతో దృష్టి పెట్టలేకపోయారు. తగినంత నీరు అందక శారీరకంగా నీరసించటం, తలనొప్పితో ఇబ్బంది పడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల ఇళ్లలో రాత్రి పూట విద్యుత్ కోతలు, ఉక్కపోత వల్ల పిల్లలు సరిగ్గా నిద్రపోలేకపోయారు. దీనివల్ల మరుసటి రోజు బడిలో వారు చురుగ్గా ఉండలేకపోయారు. సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి ఉష్ణోగ్రత రికార్డులు వేడి ఎంత పెరుగుతోందో మనకు స్పష్టం చేస్తుండగా, ఆ వేడి స్కూలు పిల్లల జీవితాలను దెబ్బతీస్తోందో వారే మనకు చెబుతున్నారని ‘క్రై’ముఖ్య కార్యనిర్వహణాధికారి పూజా మర్వాహా అన్నారు. వేడి నివారణ కార్యాచరణ ప్రణాళికలు, వాతావరణ మార్పును ఎదుర్కొనే వ్యూహాలను రూపొందించేటప్పుడు విధాన రూపకర్తలు ఈ అధ్యయన ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. -
కొందరికే ‘తల్లికి వందనం’
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ‘‘నీకు 15 వేలు.. నీకు 15 వేలు... ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు’’ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఏరు దాటాక రకరకాల సాకులతో తల్లికి వందనం పథకాన్ని మమ అనిపిస్తున్నారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా నిధులు విదిల్చి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురుచూస్తున్న తల్లులకు నిరాశనే మిగిల్చారు.రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 22.65 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగవేయనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకం అమలుకు గురువారం రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. మొత్తం 64.76 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రకటించారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా.. అందులో పాఠశాలల నిర్వహణ పేరుతో రూ.2 వేలను మినహాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. తల్లులకు చంద్రబాబు బకాయి రూ.22,840.68 కోట్లు..యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్యూడైస్ (యూడీఐఎస్ఈ) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67.27 లక్షల మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ..66 లక్షల మందికి రూ. 6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే, ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించారు.తమ ఖాతాలలో అరకొరగా నగదు జమ అయ్యిందని పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అరకొర నగదు కూడా పడని వారి సంఖ్య గత ఏడాది 21 లక్షలు. మూడేళ్లలో తల్లులకు రూ. 39,338.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా గత ఏడాది జమ చేసింది..రూ. 6,377 కోట్లు, ఈ ఏడాది జమ చేస్తారని చెబుతున్నది రూ. 10,120.78 కోట్లు..అంటే తల్లులకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి రూ. 22,840.68 కోట్లన్నమాట. ఈ ఏడాదైనా నగదు పూర్తిగా జమ చేస్తారా లేక గత ఏడాది మాదిరిగా తల్లుల ఖాతాలలో అరకొరగా వేస్తారా అనేది చూడాల్సి ఉంది.అర్హతల పేరుతో కఠిన నిబంధనలు⇒ గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉండాలి.⇒ కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరి.⇒ 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమికి మించి ఉండకూడదు.⇒ ట్రాక్టర్, ఆటో మినహా నాలుగు చక్రాల వాహనం ఉంటే అర్హత ఉండదు.⇒ నెలకు 300 యూనిట్లకు మించిన విద్యుత్ వినియోగం ఉండకూడదు.⇒ 1,000 చదరపు అడుగులకు మించిన మున్సిపల్ ఆస్తి ఉండకూడదు.⇒ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనర్ లేదా ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి ఉంటే పథకం వర్తించదు.⇒ ఐటీఐ, పాలిటెక్నిక్, ఆర్జీయూకేటీ వంటి కోర్సుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. ⇒ అనాథలు, వీధి పిల్లలకు ప్రత్యేక నిబంధనలు..⇒ కొత్తగా మొదటి తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను ఆగస్టు 25 వరకు జాబితాలో చేర్చనున్నారు.నిధుల విడుదల షెడ్యూల్ ఇలాజూలై 22: తొలి విడత నిధుల విడుదల, అర్హులు,అనర్హుల జాబితాల ప్రదర్శన.ఆగస్టు 3 వరకు: ఫిర్యాదుల స్వీకరణ.ఆగస్టు 30: అదనపు అర్హుల జాబితా విడుదల, నిధుల చెల్లింపు. జగన్ మానసపుత్రికగత ప్రభుత్వంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో పేదల అవస్థలను కళ్లారా చూసి, పిల్లల చదువులు భరోసా ఇవ్వాలని సంకల్పించారు. అధికారంలోకి రాగానే ‘అమ్మ ఒడి’ పేరుతో మానసపుత్రికగా సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి తల్లికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. అదే పథకానికి తల్లికి వందనం అంటూ పేరు మార్చేసి పథకాన్ని తామే కొత్తగా ప్రారంభించినట్లు చంద్రబాబు, లోకేశ్ ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా పూర్తి నగదు ఇస్తామని ఇదే లోకేశ్ ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా గొంతు చించుకుని మరీ ప్రకటించారు. మరి ఇప్పుడు అదేమయ్యిందో ఆయనకే తెలియాలి. సీఎం చంద్రబాబు సైతం అమ్మ ఒడి పథకానికి కరెంటు బిల్లుతో సంబంధం ఏమిటని, తాము అధికారంలోకి వస్తే అలాంటి నిబంధనలేవీ ఉండవని చెప్పారు. ఇప్పుడు అంతకు మించి నిబంధనలు పెట్టి అనేక మందికి నిధులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. -
సరికొత్త.. సుపరిపాలన!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సంప్రదాయ కార్యాలయ పరిపాలన నుంచి ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్ (క్షేత్రస్థాయి పాలన) వైపు కలెక్టర్లు అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం.. శాఖల మధ్య సమన్వయం పెంచడం.. ప్రభుత్వ యంత్రాంగాన్ని బాధ్యతాయుతంగా పనిచేయించే వ్యవస్థను బలోపేతం చేయడం.. సాంకేతికత వినియోగంతో సేవల సులభతరం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని వినూత్న ఆలోచనలతో మెరుగైన పాలనకు శ్రీకారం చుడుతున్నారు. మూస ధోరణికి స్వస్తి పలికి పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ తాము ఎంచుకున్న విభాగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. తమదైన శైలిలో ముందుకుసాగుతున్నారు. జిల్లాలు వేరు, సమస్యలు వేరు, ప్రాధాన్యతలు వేరు.. అయినా లక్ష్యం ఒక్కటే అంటూ గుడ్ గవర్నెన్స్ దిశగా తమదైన ముద్ర వేసుకున్న పలువురు ఐఏఎస్లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. యాదాద్రి: ప్రజావాణి సంస్కరణ గ్రీవెన్స్ సెల్ అర్జీలకు ఆయా ప్రభుత్వ శాఖల సమన్వయంతో సత్వర పరిష్కారం చూపేలా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదుదారుల సమస్యపై వారి ఎదుటే స్పష్టత ఇవ్వడం.. ఆ తర్వాత నిర్ణయం అమలు చేసేలా ‘యూ’ఆకృతిలో అధికారులకు సీట్లు ఏర్పాటు చేశారు. మండలాలు, మున్సిపాలిటీల ఫీల్డ్ స్టాఫ్తో నిత్యం టచ్లో ఉంటూ కలెక్టరేట్కు వచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. ఫిర్యాదులను డిజిటలైజేషన్చేసేందుకు హెల్ప్ డెస్క్ పేరిట కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్ రికార్డుల్లో నమోదు ద్వారా దరఖాస్తుదారులకు రశీదు ఇస్తున్నారు, ఆ ఫైల్ ఏ దశలో ఉందో సులభంగా ఆన్లైన్లోనే ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా దళారుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా సంబంధిత అధికారులను కలిసి సమస్యలను వివరించేలా ప్రతి డెస్క్ వద్ద అధికారి పేరు, హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్: పాఠశాల విద్యపై ఫోకస్ ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఔపోసన సామర్థ్యాలను పెంచడంతోపాటు మౌలిక వసతుల కల్పనపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వారంలో ఒకట్రెండు రోజులు ఆకస్మికంగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలల వారీగా తాగునీరు, ట్యాంకులు, టాయిలెట్లు, తరగతి గదులు, భోజన వసతి వంటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. మౌలిక వసతులు సరిగా లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించిన త్రిపాఠి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.21 కోట్లు కేటాయించారు. పీఎంశ్రీ కింద ఎంపికైన స్కూళ్లకు మరో రూ. 36 లక్షలు, నిర్వహణ కింద ఒక్కో పాఠశాలకు రూ.10 వేల చొప్పున మంజూరు చేశారు. పొలాలు, గ్రామాల శివారులోని పాఠశాలల్లో పాముల బెడద నివారణకు మెష్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. జనగామ: మహిళా సాధికారత, విద్య, వ్యవసాయం అడ్మిని్రస్టేషన్ పరంగానే కాకుండా సామాన్యుల గోస వినే అధికారిగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేరు తెచ్చుకున్నారు. జనగామకు చెందిన దివ్యాంగుడు పర్శ సాయి తల్లిదండ్రులు తమ సమస్యను వివరించిన గంటలోగా టాటా ఏస్ వాహనం కొనుగోలుకు రూ.4 లక్షల రుణ చెక్కు అందించారు. రాష్ట్రంలో తొలిసారిగా 62 మంది మహిళలకు రైతు సేవా కేంద్రాలు (ఎరువుల షాప్లు) కేటాయించి ఒక్కో యూనిట్కు రూ.5 లక్షల రుణం అందించారు. డీఆర్డీఏ–సెర్ప్, వ్యవసాయ శాఖల సమన్వయంతో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఫాస్ట్ మ్యాథ్స్–కంప్లీట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా అకడమిక్ ఎక్సలెన్స్ ఇనిíÙయేటివ్ ద్వారా సర్కారు స్కూళ్లలో బోధన, మూల్యాంకన ప్రక్రియను ఏకరీతిలో అమలు చేస్తున్నారు. నకిలీ సీడ్స్, ధరల నియంత్రణకు నిగ్రాని కమిటీలు ఏర్పాటు చేశారు. వేగం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకే.. ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా ప్రవేశపెట్టిన ఈ సరికొత్త సిస్టం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. పెండింగ్ సమస్యలను పూర్తిగా సున్నాకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం. భవిష్యత్లో దరఖాస్తుదారుడే స్వయంగా తన అప్లికేషన్ స్థితిని తెలుసుకునేలా శాశ్వత కౌంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నాం. – అనురాగ్ జయంతి, కలెక్టర్, యాదాద్రి భువనగిరి పాఠశాలల బలోపేతానికి ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగంగా వసతులు మెరుగుపర్చి విద్యార్థులకు మెరుగైన విద్యనందించడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే మెరుగుపరుస్తున్నాం. అన్ని స్కూళ్లలో ప్రతి రోజు తాగునీరు, టాయిలెట్ల నిర్వహణతోపాటు ప్రతి శుక్రవారం పారిశుధ్య పనులు చేపడుతున్నాం. – ఇలా త్రిపాఠి, కలెక్టర్, నిజామాబాద్ -
8 మంది టీచర్లు.. 9 మంది విద్యార్థులు
వీణవంక (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోతోంది. హెచ్ఎంతో పాటు 8 మంది ఉపాధ్యాయులుండగా ఒకరు డిప్యుటేషన్పై ఇతర స్కూల్కు వెళ్లారు. దీంతో హెచ్ఎంతో కలిపి ఏడుగురు ఉపాధ్యాయులుండగా.. విద్యార్థులు తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. 6వ తరగతిలో ఇద్దరు, ఏడులో ఒకరు, ఎనిమిదిలో ఇద్దరు, తొమ్మిదిలో ఒకరు, పదిలో ముగ్గురు విద్యార్థులున్నారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ బోర్డుతో పాటు అన్నీ మౌలిక వసతులున్నా విద్యార్థుల్లేరు. రెండేళ్లుగా విద్యార్థులు సరిపడా లేకున్నా ఉపాధ్యాయులు మాత్రం కొలువు తీయడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొంది ఇప్పుడు విద్యార్థుల్లేని దుస్థితి నెలకొంది. పాఠశాలకు ఆనుకొని కూత వేటు దూరంలో మోడల్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలను అందులో కలపాలని అధికారులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై హెచ్ఎం శ్రీనివాస్ను వివరణ కోరగా వేసవి సెలవుల్లో ఇంటింటికీ తిరిగాము కానీ విద్యార్థులు రాలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎంఈవో శోభారాణిని వివరణ కోరగా గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో మోడల్ స్కూల్ ఉందని, దీంతో విద్యార్థులు ఆ స్కూల్కే వెళ్తున్నారని అందుకే సంఖ్య తగ్గిందని తెలిపారు. -
తాడికొండ గురుకులంలో విద్యార్థుల గెంటివేత
తాడికొండ : ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏపీ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన 480 మంది పేద విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. తాడికొండ ఏపీ గురుకుల సెంటర్తో పా టు, విశాఖ జిల్లా మేదాద్రి గడ్డ, తిరుపతి జిల్లా కోట ప్రాంతాల్లోని గురుకులాలను ఎక్సెలెన్స్ సెంటర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ సెంటర్లలో ప్రస్తుతం ఉన్న విద్యార్థులను వేరే గురుకులాలకు తరలించి ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పేరుతో ఇంటర్తో పాటు, జేఈఈ, నీట్కు శిక్షణ ఇచ్చేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.ఇందులో భాగంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ‘మీ పిల్లలను ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేస్తున్నాం.. వచ్చి తీసుకెళ్లండి’.. అంటూ మేసేజ్లు పంపడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తాడికొండ గురుకుల పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ను నిలదీయడంతో పాటు.. రాస్తారోకో నిర్వహించారు. తమ పిల్లలను ఇక్కడ చదివించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి.. రాస్తారోకో విరమింపజేశారు. -
తెరిచి నెల.. యూనిఫాం ఓ కల!
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లనూ మెరుగు పరుస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పింది. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, పుస్తకాలు.. అన్నీ అందిస్తామని ప్రకటించింది. దుస్తుల రంగు కూడా ఆకర్షణీయంగా కన్పించేలా మార్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్ళించేందుకు చేపట్టిన బడిబాటలోనూ టీచర్లు ఇవే అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది లక్ష వరకూ అడ్మిషన్లు పెరిగాయి. కానీ స్కూళ్లు తెరిచి నెల రోజులు కావొస్తోంది. కానీ ఇంతవరకూ యూనిఫాం అందలేదు. పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదు. యూనిఫాం కోసం ఆగస్టు నెలాఖరు వరకూ ఓపిక పట్టాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. యూనిఫాం కూడా ఇవ్వకపోవడంతో పిల్లలు పాత దుస్తులే ధరించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎందుకీ ఆలస్యం?: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42,901 పాఠశాలలున్నాయి. ఇందులో 12,126 ప్రైవేటు స్కూళ్లు కాగా. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది వరకూ విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఏడాదికి రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. కాగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇదే క్రమంలో విద్యార్థులకు బ్రాండెడ్ (మన్నికైన) దుస్తులు అందించేందుకు రూ.678.78 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించింది. ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల యూనిఫాం, దుప్పట్లు, బెడ్షీట్లు ఇవ్వాలంటే మొత్తం 2.97 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం. గతంలో ఈ వ్రస్తాన్ని స్థానిక చేనేత కారి్మకుల సహకార సంఘం నుంచి కొనుగోలు చేసేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ఎక్కువ భాగం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. సహకార సంఘానికి 30 శాతం వస్త్రం కొనుగోలుకు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది. కాగా ప్రైవేటు సంస్థలకు టెండర్ డాక్యుమెంట్ తయారు చేయడం, టెండర్లు పిలవడం, వాటిని ఖరారు చేయడం, అనుమతుల ప్రక్రియ సాఫీగా సాగలేదు. కొంత ఆలస్యమైంది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ చెల్లింపులోనూ జాప్యం జరిగినట్టు కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయి. సహకార సంఘాలకు ముందస్తుగా చెల్లించకపోయినా వస్త్రం మాత్రం సమకూర్చేవి. యూనిఫాంకు 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం కాగా.. కార్పొరేట్ స్కూళ్ళ తరహాలో ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీలను ఎంచుకుంటే ఏతావాతా..వస్త్రం ఇవ్వడంలోనే జాప్యం చోటు చేసుకుంది. మిల్లుల నుంచి వాటిని తెప్పించడం మరింత ఆలస్యమైంది. వాస్తవానికి కావాల్సిన వస్త్రం కూడా పూర్తిస్థాయిలో అందలేదని సమాచారం. కాగా ఎంత వచ్చింది అనే వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. పొలం పనులు వదిలేసుకుని కుట్టడం ఎలా? వస్త్రం రావడం ఆలస్యం కావడం, వచ్చిన తర్వాత కుట్టడానికీ సమయం పట్టే అవకాశం ఉండటంతో యూనిఫాంల పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకోక తప్పదని అధికారులే అంటున్నారు. యూనిఫాం కుట్టే బాధ్యత ఎక్కడికక్కడ స్వయం సహాక సంఘాలకు అప్పగించారు. వాస్తవానికి ఈ ప్రక్రియ స్కూళ్ళు మొదలైన సమయంలో చేపడితే ఇప్పటికే యూనిఫాం కుట్టడం పూర్తయ్యేది. అలాకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులు మొదలయ్యాక వస్త్రం ఇచ్చారని సంఘాల మహిళలు చెబుతున్నారు. కటింగ్ కోసం మండల కేంద్రానికి వెళ్ళడం, కటింగ్ పూర్తయిన తర్వాత వాటిని కుట్టడంపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫాంలు కుట్టే సామర్థ్యం మహిళా సంఘాలకు ఉందని చెప్పినా, ఫలితాలు మాత్రం ఈ దిశగా లేవని అధికారులు అంటున్నారు. ‘యూనిఫాం కుట్టేందుకు ఒక్కోదానికి రూ.75 ఇస్తారు. పొలం పనులు వదిలేసుకుని దీనిపైనే ఎలా ఆధార పడతాం’ అని మహిళలు అంటున్నారు. ఒక్కొక్కరు రోజుకు 10 వరకు యూనిఫాంలు కుట్టే అవకాశం ఉండగా, 27 లక్షల విద్యార్థుల కోసం 54 లక్షల యూనిఫాంలు అవసరం. కాగా ఆగస్టు నెలాఖరు వరకూ యూనిఫాం అందించడం సాధ్యం కాకపోవచ్చని పాఠశాల విద్య అధికారులు భావిస్తున్నారు. పుస్తకాలకూ ఇబ్బందే కేజీబీవీలు, గురుకులాల్లో పుస్తకాల పంపిణీ సరిగానే జరిగింది. ఇదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ (విద్యకు సంబంధించిన సమాచార వ్యవస్థ) లెక్కల ప్రకారం పుస్తకాలు, నోట్బుక్లు ఇచ్చారు. అయితే బడిబాట వల్ల, ఇతర మార్గాల్లో కొత్తగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిన వారికి మాత్రం ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా లక్షపైనే ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు చివరివరకూ కొత్త ప్రవేశాలకు సమయం ఉంది. ఇది ముగిసిన తర్వాతనే కొత్త వారి జాబితాను రాష్ట్ర కార్యాలయానికి పంపుతారు. అప్పుడు కొత్త పుస్తకాల ముద్రణకు టెండర్లు ఖరారు చేయాలి. దీంతో పాటు పేపర్ తెప్పించాలి. ఇప్పటికే పేపర్ సరఫరా చేసే సంస్థలకు రూ.150 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ముద్రించే కాంట్రాక్డు సంస్థలకూ రూ.కోట్లల్లోనే బకాయిలున్నాయి. ఇవి రాకుండా ముందుకెళ్ళేందుకు కాంట్రాక్టు సంస్థలు సుముఖంగా లేవని తెలుస్తోంది. దీనివల్ల పుస్తకాల పూర్తిస్థాయి పంపిణీలో కూడా తీవ్ర జాప్యమే చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. యూనిఫాం పంపిణీపై దృష్టి పెట్టాం.. యూడైస్ లెక్కల ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళల్లో 16 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేశాం. ఎక్కడా ఇబ్బంది లేదు. కొత్తగా చేరిన వారికీ అందిస్తాం. యూనిఫాం పంపిణీపై దృష్టి పెట్టాం. – డాక్టర్ నవీన్ నికొలస్ (పాఠశాల విద్య కమిషనర్) -
రెండో దశ కౌన్సెలింగ్పై ఆశలు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్తో నిరాశ కలిగిన విద్యార్థులు రెండో విడతపై ఆశలు పెట్టుకుంటున్నారు. వచ్చేవారం మొదలయ్యే మరో విడత కౌన్సెలింగ్కు సన్నద్ధమవుతున్నారు. సీట్లు వచ్చినా ఇష్టం లేని బ్రాంచీ, కాలేజీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మంచి కాలేజీ, బ్రాంచీలో సీట్లు వచ్చిన విద్యార్థులు మాత్రం ఆమోదం తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇది చేయని పక్షంలో కేటాయించిన సీటు రద్దవుతుంది. అయినప్పటికీ రెండో విడత కౌన్సెలింగ్కు వెళ్లే అర్హత ఉంటుంది. వాళ్ల ఆప్షన్లే కీలకం రాష్ట్రవ్యాప్తంగా 88,053 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, తొలి దశలో 79,891 సీట్లు కేటాయించారు. ఇంకా 8,162 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన వారిలో 10 వేల లోపు ర్యాంకు ఉన్నవాళ్లు 6,616 మంది మాత్రమే ఉన్నారు. 10 నుంచి 25 వేల ర్యాంకు వచ్చిన విద్యార్థులు 11,458 మంది ఉన్నారు. రెండో దశ కౌన్సెలింగ్లో 1–10 వేల లోపు ర్యాంకర్లు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేది తక్కువగానే ఉంటారు. వీళ్లంతా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు లేదా ఐఐటీల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది కాకపోతే ప్రైవేటు డీమ్డ్ కాలేజీలు తక్కువ ఫీజుతో వీరికి సీట్లు ఇచ్చే వీలుంది.దీంతో 20 వేలపైన ర్యాంకు ఉండే విద్యార్థులు రెండో దశలో ఇంకాస్త ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే, 75 వేల నుంచి లక్ష ర్యాంకు వచ్చిన విద్యార్థుల్లో 11,753 మందికి తొలి దశలో సీట్లు వచ్చాయి. వీరిలో చాలామందికి సివిల్, మెకానికల్ వంటి బ్రాంచీల్లో సీట్లు వచ్చాయి. పెద్దగా పేరున్న కాలేజీలు కూడా కావు. దీంతో వీరిలో 40 శాతం మంది విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో సీట్లకు ప్రయత్నిస్తారు. లక్షపైన ర్యాంకున్న విద్యార్థులకు తొలి దశలో 18,763 సీట్లు కేటాయించారు. వీరిలో కూడా కొంతమంది మెరుగైన బ్రాంచీల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతీ విద్యార్థి చూపంతా రెండో విడత కౌన్సెలింగ్పై ఉంది. మేనేజ్మెంట్ వల విద్యార్థులు ఎప్పటిలాగే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్, ఎమర్జింగ్ కోర్సులనే ఎంచుకున్నారు. ఈ బ్రాంచీల్లో 62,509 సీట్లు ఉన్నాయి. వీటిలో 58,376 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక మిగిలిన సీట్లు 4,133 మాత్రమే. ఇవి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సీట్లు. మేనేజ్మెంట్ సీట్లు 35 వేలకుపైగా ఉంటాయి. వీటిని భర్తీ చేసుకునేందుకు ప్రైవేటు యాజమాన్యాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ వంటి సీట్లకు భారీగా గిరాకీ ఉండటంతో ఈ సీట్లకు పెద్దఎత్తున డొనేషన్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.తొలి కౌన్సెలింగ్లో సీటు రాని వారిని గుర్తించి, మేనేజ్మెంట్ సీట్లలోకి తీసుకునేందుకు ఏజెన్సీలు, పీఆర్వోలు చురుగ్గా పనిచేస్తున్నారు. 25 వేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఎమర్జింగ్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరేందుకు తేలిగ్గా ఒప్పుకుంటారనేది మేనేజ్మెంట్ల ఆలోచన. లక్షకుపైగా ర్యాంకు ఉన్న విద్యార్థులు సివిల్, మెకానికల్తోపాటు ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో తక్కువ డొనేషన్తో చేర్చుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల విక్రయాలను త్వరగా ముగించేందుకు ప్రైవేటు యాజమాన్యాలూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రెండో దశ కౌన్సెలింగ్లోపే ఈ సీట్ల భర్తీ చేస్తే ఆశించిన మేర డిమాండ్ చేయొచ్చని భావిస్తున్నాయి. -
ఆస్ట్రేలియా వీసా ఫీజు 25 శాతం పెంపు
ఉన్నత చదువులు చదవాలన్నా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలన్నా నేడు భారతీయుల మొదటి ఛాయిస్ల్లో ఆస్ట్రేలియా ఒకటి. అయితే, తాజాగా ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లాలనుకునే లక్షలాది మంది భారతీయుల ఆశలపై ఆర్థిక భారాన్ని మోపింది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల వీసా దరఖాస్తు రుసుములను 25 శాతం వరకు పెంచుతూ ఆస్ట్రేలియా హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గత రెండేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ వీసా ఫీజు తాజా పెంపుతో అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాను అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా మార్చేసింది. నేషనల్ సెక్యూరిటీ బడ్జెట్ ఖర్చులను భర్తీ చేయడానికే ఈ పెంపు అని అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది అంతర్జాతీయ విద్యార్థులను ఒక ఆదాయ వనరులాగా వాడుకోవడమేనని నిపుణులు మండిపడుతున్నారు.కొత్తగా మారిన వీసా ధరల స్వరూపం (ఆస్ట్రేలియన్ డాలర్లలో)వీసా రకంపాత ఫీజుసవరించిన కొత్త ఫీజుపెంపు శాతంస్టూడెంట్ వీసా (సబ్క్లాస్ 500) (యూనివర్సిటీ, వొకేషనల్)2,0002,500 (సుమారు రూ.1.38 లక్షలు)25%తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసా (సబ్క్లాస్ 485) (వర్క్ పర్మిట్)4,6005,750 (సుమారు రూ.3.17 లక్షలు)25%ఇండిపెండెంట్ ELICOS (ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సులు)2,0002,0502.5%గమనిక: స్టూడెంట్ వీసా ఫీజులు 2024 జులైకి ముందు కేవలం 710 డాలర్లు మాత్రమే ఉండేవి. రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇది 710 నుంచి 1600, ఆపై 2000 డాలర్లు... ఇప్పుడు ఏకంగా 2,500 డాలర్లకు చేరింది. అంటే దాదాపు 252 శాతం పెంపు నమోదైంది!భారతీయులపై పడే ప్రభావం ఏమిటి?1. రీఫండ్ లేని భారీ రుసుము: ఆస్ట్రేలియా వీసా విధానంలో అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే.. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైనా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. లక్షల రూపాయలు పోసి దరఖాస్తు చేసుకున్న తర్వాత వీసా రాకపోతే ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు పెద్ద రిస్క్.2. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పెంపు నుంచి ఏషియన్(ఆగ్నేయాసియా దేశాల కూటమి) దేశాలకు, పసిఫిక్ దీవుల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చి పాత ఫీజులనే వర్తింపజేసింది. కానీ, ఆస్ట్రేలియాకు రెండో అతిపెద్ద విద్యార్థుల వనరుగా ఉన్న భారతదేశానికి ఎలాంటి మినహాయింపు లభించకపోవడం గమనార్హం.3. ఉపాధి వీసాలూ ఖరీదే: చదువు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియాలోనే ఉండి పని చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే ‘తాత్కాలిక గ్రాడ్యుయేట్ వర్క్ వీసా’ ఫీజు ఏకంగా 5,750 డాలర్లకు పెరగడం వల్ల అక్కడ స్థిరపడాలనుకునే యువతపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడనుంది.అంతర్జాతీయ విద్యారంగం స్పందనఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై ‘యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా’, భారతీయ విద్యా ప్రతినిధుల సంఘం (ఏఏఈఆర్ఐ) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించాలనుకుంటూ ప్రవేశ రుసుములను ఇంతలా పెంచడం ఆస్ట్రేలియా అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించాయి. వీసా ఫీజును ఒకేసారి కాకుండా అప్రూవల్ అయ్యాక రెండో విడతగా తీసుకునే ‘టూ-స్టేజ్ పేమెంట్’ విధానాన్ని తేవాలని భారతీయ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
-
సమస్యలతో చతికిల 'బడి'
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ పాఠశాల. గత విద్యా సంవత్సరంలో ఈ స్కూల్లో 723 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 606కు తగ్గిపోయింది. మరో 40 మంది విద్యార్థులు టీసీలు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, టీచర్లు బలవంతంగా ఆపారు. విద్యార్థుల్లో సగానికిపైగా పుస్తకాలు అందలేదు. బ్యాగులు, బూట్లు లేవు. కొద్ది మందికే ఇటీవల యూనిఫాం ఇచ్చారు. తాగునీటి కోసం ఇచ్చిన ఆర్వో ప్లాంట్ బిగించలేదు. దాంతో పిల్లలు చేతిపంపు నీళ్లు తాగుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా తయారయ్యాయి. బడులు తెరిచి నెలరోజులవుతున్నా విద్యార్థులను ఇంకా సమస్యలు వెక్కిరిస్తున్నాయి విద్యార్థి మిత్ర కిట్లకు మంగళం పాడేశారు. పాఠ్య పుస్తకాలు చాలా చోట్ల అందలేదు. నోటు పుస్తకాలు కొనుక్కోమంటున్నారు. బూట్లు లేవు. బెల్టులు గత ఏడాది ఎక్కడన్నా మిగిలితే టీచర్లు సర్దుబాటు చేస్తున్నారు. తాగునీటి కోసం గత ప్రభుత్వ హయాంలో అందించిన యంత్రాలను బిగించకుండా మూలన పడేశారు. బిగించిన చోట్ల మరమ్మతులుంటే చేయించడం లేదు. విద్యార్థులు చేతిపంపు నీళ్లే తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పచ్చడి మెతుకులైనా పర్లేదనుకుంటూ పిల్లలు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. రెండేళ్లక్రితం వరకు నిగనిగలాడిన నాడు–నేడు గదులు ఇపుడు రంగులు వెలిసిపోయాయి. పట్టించుకునే నాథుడు లేడు. ఇన్ని సమస్యల మధ్య సర్కారీ బడుల్లో చదువులు అథ:పాతాళానికి చేరుకున్నాయి. 2024లో 43 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య గతేడాది 32 లక్షలకు పడిపోయింది. ఈ ఏడాది 30 లక్షల మందికి తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఉపాధ్యాయులే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై ‘సాక్షి’ బృందం పరిశీలించగా విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అరకు... విద్యార్థిమిత్ర కిట్లు లేవు..అరకులోయ మండల కేంద్రంలోని కంఠ»ౌంషుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 417 మంది విద్యార్థులుండగా ఒక్కరికీ విద్యార్థి మిత్ర కిట్ ఇవ్వలేదు. పాఠశాల ప్రారంభం నుంచి చిక్కీల పంపిణీ లేదు. బూట్ల ఊసేలేదు. జీవీఎంసీ 39వ వార్డులోని ఎంవీడీఎం, క్వీన్మేరి పాఠశాలల్లో 1100 మంది విద్యార్థులున్నారు. ఒక్కరికీ విద్యార్ది మిత్ర కిట్ రాలేదు. పుస్తకాలు కూడా అరకొరగా ఇచ్చారు. ఎంవీడీఎం పాఠశాలలో మరుగుదొడ్లు సమస్య ఉండడంతో విద్యారి్ధనులు ఇబ్బంది పడుతున్నారు. భోజనం తర్వాత చేతులు కడుక్కునే వసతి కూడా లేదు. అవనిగడ్డ.. ఇంటి నుంచే భోజనం..అవనిగడ్డలోని ఏడో వార్డులో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల చాలా ముఖ్యమైనది. ఇది క్లస్టర్ పాఠశాల, అలాగే, హైసూ్కల్ ప్లస్ కూడా ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పదో తరగతి వరకు 186 మంది విద్యార్థులున్నారు. ఇందులో సగం మంది మధ్యాహ్న భోజనం ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. ఇక్కడా పుస్తకాల కొరత ఉంది. కిట్లు ఇవ్వనేలేదు. నాడు–నేడు పనులు పూర్తయినా రంగులు వేయించకపోవడంతో సిమెంటు మచ్చలు వెక్కిరిస్తున్నాయి. ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు టీసీలు తీసుకోకుండా ఉండేందుకు ప్రతినెలా రూ.8 వేలు సొంత డబ్బులు ఖర్చుచేసి పిల్లల తరలింపునకు టీచర్లే ఆటో నడుపుతున్నారు. ఇక్కడి ఆర్వో ప్లాంట్ పాడైపోయి రెండేళ్లవుతున్నా రిపేరు చేయించలేదు. కడప... భోజనం బాగోదుకడప నగరంలోని గాందీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 770 మంది విద్యార్థులుండగా, 8వ తరగతిలో 15 మందికి యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, లైన్ నోట్ బుక్స్ను అందలేదు. 10వ తరగతిలో 25 మందికి ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. పాఠశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో కొందరు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోగా, మరికొందరు ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకున్నారు. ప్రభుత్వం పెట్టే భోజనం బాగోవడం లేదని చెప్పారు. కడపలో మధ్యాహ్న భోజనం బాగోకపోవడంతో ఇంటి నుంచి తెచ్చిన భోజనం చేస్తున్న విద్యార్థులు పాడేరు... పాత బ్యాగులు.. యూనిఫాంలు..అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 330 మంది విద్యార్థులున్నారు. గతేడాది మిగిలిన స్టాక్లో సాక్సులు, బూట్లు ఇచ్చారు. యూనిఫాం క్లాత్, పుస్తకాల బ్యాగులు, బెల్టు ఇవ్వలేదు. 6,7 తరగతుల విద్యార్థులు నేలపై కూర్చుంటున్నారు. 8వ తరగతి విద్యార్ధులకు గతంలో ఇచ్చిన బెంచీలు పాడైపోతే బాగుచేయించలేదు. పిల్లలంతా చెక్క ముక్కలపై కూర్చుంటున్నారు. చాలీచాలని మరుగుదొడ్లతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్ఎం కార్యాలయం భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని పరిస్థితి. చిరిగిపోయిన బ్యాగును చూపిస్తున్న పాడేరు పాఠశాల విద్యార్థి భీమిలి.. అసంపూర్తిగా గదులు..భీమిలి మండలం తాటితూరు జడ్పీ హైసూ్కల్లో 218 మంది విద్యార్థులుండగా, పుస్తకాలు, గత ఏడాది మిగిలిన యూనిఫాం క్లాత్, బెల్టులు విద్యార్థులకు సర్దుబాటు చేశారు. బూట్లు, బ్యాగులు ఒక్కరికీ ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రారంభించిన మన బడి– మన భవిష్యత్తుతో చేపట్టిన అదనపు తరగతి గదులు, వంటగదుల నిర్మాణం నిలిచిపోయింది. స్కూల్లోని 10 యూనిట్ల టాయిలెట్లు వినియోగంలో లేకుండా పోయాయి. భీమిలి పాఠశాలలో అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణం తెనాలి.. ఇంకా పుస్తకాలు రాలేదు..తెనాలి పట్టణం, రూరల్ మండల పరిధిలో 77 ఎలిమెంటరీ, రెండు ప్రాథమికోన్నత, 18 ఉన్నత పాఠశాలల్లో 8,890 మంది విద్యార్థులున్నారు. వీరిలో 1200 మందికి పాఠ్య, నోటు పుస్తకాలు ఇవ్వలేదు. బూట్లు, బెల్టులు గతేడాది మిగిలిన స్టాక్లో కొందరు విద్యార్థులకు సర్దుబాటు చేశారు. వాటర్ ప్లాంట్ పాడై ఏడాది అవుతున్నా బాగు చేయలేదు. దీంతో చేతి పంపు నీటినే పిల్లలు తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం లోప భూయిష్టంగా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇళ్ల నుంచి లంచ్ బాక్స్లు తెచ్చుకుని తింటున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయులు తమ వేతనం నుంచి డబ్బు ఖర్చుచేసి వారానికి ఒకసారి బయట వ్యక్తులతో శుభ్రం చేయిస్తున్నారు.డబ్బులివ్వరు.. కిట్లు రావు... 2024–25 విద్యా సంవత్సరంలో 36 లక్షల మంది విద్యార్థులకు రూ.911 కోట్లతో గత ప్రభుత్వమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో∙2024 జూన్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి 35 లక్షల కిట్లు సరఫరా కోసం రూ.910 కోట్లతో టెండర్లు పిలిచారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 2024–25 బిల్లులు చెల్లించలేదని, అది చెల్లిస్తేనే వస్తువులు సరఫరా చేస్తామని ఆయా కంపెనీలు తేల్చి చెప్పాయి. దాంతో సమగ్ర శిక్షలోని కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.352 కోట్లు చెల్లించి, మిగిలిన మొత్తం చెల్లించేందుకు గడువు తీసుకోగా వస్తువులు సరఫరా చేశాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ముగిసేనాటికి ఇంకా 20 శాతానికి పైగా విద్యార్థులు కిట్లు లేకుండానే చదువులు పూర్తిచేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి కూడా 35 లక్షల మంది విద్యార్థులకు రూ.910 కోట్లతో కిట్లు కొనుగోలుకు టెండర్లు పిలవగా, రెండేళ్ల బాకీ రూ.1,372 కోట్లు ఇస్తేనే బిడ్డింగ్లో పాల్గొంటామని ఆయా కంపెనీలు చెప్పాయి. దీంతో నిధుల విడుదలకు ప్రభుత్వం జీవోలు ఇచ్చినా, డబ్బులు ఇవ్వలేదు. దీంతో కిట్లు సరఫరా కాలేదని తెలిసింది. నాడు బడి తెరిచిన రోజే కిట్లు పంపిణీ...ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా బడులు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లు ఇవ్వాలి. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీల నుంచి బిడ్లు ఆహా్వనించి టెండర్లు అప్పగిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆరు నెలల ముందే కిట్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యేది. కంపెనీలకు నిధుల చెల్లింపు సకాలంలో జరిగేది.. కిట్లు సకాలంలో పంపిణీ అయ్యేవి. సర్కారు బడిలో 1–10 తరగతులు చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు రూపాయి ఆరి్థక భారం ఉండకూడదని ‘జగనన్న విద్యా కానుక’ను 2020–21 విద్యా సంవత్సరం నుంచి అందించారు. ఏటా సగటున 43 లక్షల మంది విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే రూ. 2900 విలువైన కిట్లు పంపిణీ చేశారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ(హైస్కూల్), మూడు జతల యూనిఫాం క్లాత్, బెల్టు, టై అందించారు. వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మద్ధతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. నాలుగు విద్యా సంవత్సరాలు రూ.3366.53 కోట్లతో జగనన్న విద్యా కానుకలను అందించారు. -
విద్యార్థి దళం.. పోరు గళం
విజయనగరం గంటస్తంభం: ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం, హామీలు కాదు. .హక్కులు కావాలి, చేతగాని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డౌన్డౌన్’ అంటూ విద్యార్థులు నినదించారు. స్కాలర్షిప్ బకాయిల మంజూరు, హాస్టల్ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలో మంగళవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. దారిపొడవునా చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్లోకి వెళ్లి అధికారులకు వినతిపత్రమిచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులను పోలీసులు మెడపట్టి గెంటేయడంతో కొందరికి స్వల్పగాయాలయ్యాయి. -
అంచనాకొచ్చారు... ఆలోచన మార్చారు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో మాక్ సీట్ల కేటాయింపు తర్వాత వేగంగా ఆప్షన్లు మారుతున్నాయి. ఒక్క రోజులోనే 36 లక్షలకుపైగా ఆప్షన్లను విద్యార్థులు మార్చుకున్నారు. మార్పులు, చేర్పులకు మంగళవారం వరకూ గడువు ఉంది. ఇది ముగిసే నాటికి ఆప్షన్ల మార్పు మరో పది లక్షలు పెరిగే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు ఆప్షన్లు పెంచుతున్నారు. ఇంకొంతమంది తీసివేస్తున్నారు. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అనుబంధ ఎమర్జింగ్ బ్రాంచీల్లోనూ ఈ తేడా కన్పిస్తోంది. సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థుల్లో వేగం నిలకడగానే ఉంది. ఇవే బ్రాంచీలు కావాలని ఎంపిక చేసుకున్న విద్యార్థులు మార్పులకు ఇష్టపడటం లేదు. మెరుగైన కాలేజీ వైపే వాళ్లు చూస్తున్నారు. తొలి దశ కౌన్సెలింగ్కు రాష్ట్రవ్యాప్తంగా 89,785 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తంగా 55,14,891 ఆప్షన్లు అందాయి. సాంకేతిక విద్యామండలి ఈ నెల 4న మాక్ సీట్ల కేటాయింపు వెల్లడించింది. 175 కాలేజీల్లో 88,053 సీట్లు అందుబాటులో ఉంటే, 79,313 సీట్లను మాక్ ద్వారా కేటాయించారు. ఇంకా 8740 సీట్లు మిగిలిపోయాయి. అయితే ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులకే ఆప్షన్లు ఇచ్చారు. సీఎస్ఈ అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో 62,509 సీట్లు ఉంటే, 58,052 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో 4,457 సీట్లు మిగిలిపోయాయి. ఇప్పుడీ సీట్లు ఎక్కడ మిగిలిపోయే అవకాశం ఉందనే దానిపై ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు దృష్టి పెట్టారు. తమకన్నా పెద్ద ర్యాంకు వచ్చినా మంచి కాలేజీలో సీటు కోల్పోయిన విద్యార్థులు కాలేజీలు, బ్రాంచీల ఆప్షన్లు మార్చుకుంటున్నారు. ఇదే క్రమంలో 50 వేలపైన ర్యాంకు వచ్చినా అవగాహన లేకుండా 5 వేల లోపు కటాఫ్ ఉన్న కాలేజీలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇష్టం లేని బ్రాంచీల్లో సాధారణ కాలేజీల్లో సీట్లు వచ్చాయి. మాక్ తర్వాత వాళ్లు కూడా వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఆప్షన్లు మార్చుకుంటున్నారు. కాలేజీనా? బ్రాంచ్నా? మాక్ సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు పలు అంశాలపై అధ్యయనం మొదలు పెట్టారు. నిపుణులు, అధ్యాపకులు, కౌన్సెలింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వెబ్సైట్ ద్వారా శోధిస్తున్నారు. దీంతో మంచి కాలేజీలో సీటు వస్తే బ్రాంచీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫలానా కాలేజీల్లో సీఎస్ఈ రాదని తెలిసినప్పటికీ, తర్వాత శ్రేణిలో ఈసీఈ లేదా సివిల్ బ్రాంచీలను ఎంచుకుంటున్నారు. ఇలా మారిన ఆప్షన్లు దాదాపు 3.2 లక్షల వరకూ ఉన్నాయి. ఈసీఈ బ్రాంచీ చేయాలనుకుని, ర్యాంకు ప్రకారం సరైన ఆప్షన్ ఇవ్వని విద్యార్థులు 1.2 లక్షల మంది వరకూ ఉన్నారు. ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు బ్రాంచీ ప్రాధాన్యతగా ఆప్షన్లు మార్చుకుంటున్నారు. మొత్తం మీద ఈ నెల 10న వెల్లడయ్యే అసలు కౌన్సెలింగ్ సీట్ల కోసం భారీగా కసరత్తు చేస్తున్నారు. -
బడికెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులతో రోడ్డు కోసం దండం పెట్టేలా చేస్తున్న కూటమి ప్రభుత్వం!
-
కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ!
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దేశంలోని కంపెనీలు దూసుకుపోతున్నప్పటికీ ఉన్నత విద్యావ్యవస్థ మాత్రం పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మారలేక కొట్టుమిట్టాడుతోంది. యూకేకు చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ కంపెనీ క్యూఎస్ తాజాగా విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్–2027 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో విశ్వవిద్యాలయాల విద్య, మారుతున్న శ్రామిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల లభ్యత ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో.. భారత్ 89.4 స్కోర్తో స్వీడన్, జపాన్లను వెనక్కినెట్టి 13వ స్థానంలో నిలిచింది. అలాగే భవిష్యత్తు ఉద్యోగాల సన్నద్ధతలో భారత్ 5వ స్థానం సాధించింది. కానీ అదే సమయంలో మన కాలేజీలు మాత్రం ఇంకా పాత సిలబస్తోనే విద్యార్థులను బయటకు పంపుతున్నాయి. ఫలితంగా పరిశ్రమలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నా.. వాటికి సరిపోయే నైపుణ్యాలు గల అభ్యర్థులు దొరకడం లేదు. భారతీయ సాంకేతిక గ్రాడ్యుయేట్లపై పరిశ్రమలకు నమ్మకం క్రమంగా తగ్గుతోందని క్యూఎస్ గ్లోబల్ ఎంప్లాయర్ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారతీయ విద్యాసంస్థల ఎంప్లాయర్ రెప్యుటేషన్ స్కోర్ 2017లో 997గా ఉండగా 2026 నాటికి అది ఏకంగా 2,132కి (స్కోర్ పెరిగేకొద్దీ నాణ్యత తగ్గినట్టు) పడిపోయింది. వలసల ముప్పు.. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా శ్రామిక శక్తిని, విద్యార్థులను విదేశాలకు పంపుతున్న దేశం. 2030 నాటికి దాదాపు 10 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోనున్నట్లు అంచనా. ఈ పరిణామం మేధో వలసల ముప్పును తెచ్చిపెడుతోంది. దేశంలోని ప్రతిభావంతులను ఇక్కడే నిలుపుకుంటూ స్థానికంగా ఉన్న కోట్లాది మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. డ్రాగన్తో పోటీ.. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్–2027లో 92.5 స్కోర్తో చైనా 7వ స్థానంలో ఉంది. చైనా ఏటా లక్షలాది మంది స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. వారంతా నేరుగా ప్రభుత్వరంగ పరిశ్రమల్లోకి, సాంకేతిక సంస్థల్లోకి ప్రవేశించేలా అక్కడ పటిష్టమైన యంత్రాంగం ఉంది. దీనివల్ల వారి స్కిల్స్ అలైన్మెంట్ స్కోరు 98.0గా ఉంది. అయితే భారీ మౌలిక వసతులు ఉన్నప్పటికీ చైనా ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సూచీలో 80.2 స్కోరుతో వెనుకబడింది. చైనాలో ఇప్పటికీ తయారీ, వ్యవసాయ రంగాల్లో ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు. ఏఐ విప్లవం వల్ల ఈ ఉద్యోగాలన్నీ ఆటోమేషన్కు గురై భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చైనాతో పోలిస్తే భారత్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ విభాగంలో 96.0 స్కోరుతో మెరుగ్గా ఉంది. మన సేవా రంగం, ఐటీ రంగాలు ఏఐ ద్వారా భర్తీ చేసేవి కావు. పైగా ఏఐతో కలిసి నడిచేవి. కానీ చైనాలాగా గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకునే స్కిల్స్ అలైన్మెంట్ మనకు లేకపోవడం లోటుగా మారుతోంది. ఈ విభాగంలో 82.7 స్కోర్తో 18వ స్థానానికి పరిమితమైంది. ఎందుకంటే.. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాణిస్తూ ప్రపంచ అత్యుత్తమ 250 వర్సిటీల జాబితాలో చోటు సంపాదిస్తుంటే దేశంలోని మిగిలిన వెయ్యికిపైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకుపైగా కాలేజీలు కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి తప్ప ఉద్యోగాలకు పనికొచ్చే నైపుణ్యాలను అందించలేకపోతున్నాయి. కంపెనీలు వెతుకుతున్న ప్రధాన నైపుణ్యాలు ఇవే – సమస్యలను విశ్లేషించడం, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత. భారతీయ విద్యార్థుల్లో ఈ నైపుణ్యాల కొరత ఎక్కువగా ఉందని టాప్ కంపెనీలు చెబుతున్నాయి. – ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేకపోవడం కూడా అడ్డంకిగా మారుతోందని అంటున్నాయి. – వ్యాపార దృక్పథంతో ఆలోచించడం, రిస్క్ తీసుకునే తత్వం తదితర లక్షణాలున్న ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. -
చదువులీ గతి నుంటే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సరిపడా తరగతి గదుల్లేక వరండాలు, చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేక ఒంటికైనా, రెంటికైనా క్యూలో నిలబడాల్సి వస్తోంది. వర్షం పడితే అప్రకటిత సెలవు ప్రకటించే దుస్థితి ఏర్పడింది. ఏటా రూ. 2,500 కోట్లు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో 24,984 పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు ఉండగా, వాటిల్లో 19,45,805 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలలు, సెంట్రల్ స్కూల్స్, సంక్షేమ గురుకులాలను కలుపుకుంటే రాష్ట్రంలో 39,789 పాఠశాలలు ఉండగా, 68,73,019 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ప్రభుత్వ స్కూళ్ల కోసమే ప్రభుత్వం ఏటా సమగ్ర శిక్షా అభియాన్ కింద 2,044 కోట్లు ఖర్చు చేస్తోంది. మధ్యాహ్న భోజనం కింద మరో రూ. 600 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. సదుపాయాలు అంతంతే ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చించినా, మౌలిక వసతులు చేకూరడం లేదు. కనీసం బాల బాలికలకు వేర్వేరుగా పూర్తి స్థాయిలో టాయిలెట్ సదుపాయం కూడా కల్పించలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో బాలుర టాయిలెట్లు 83.6 శాతమే ఉండగా, బాలికలకు ప్రత్యేకంగా 91.4 శాతం టాయిలెట్లు ఉన్నాయి. నిర్మాణాలు చేస్తున్నా..తరగతి గదుల కొరతే పాఠశాలలకు పక్కా భవనాలు, అదనపు తరగతి గదులకు ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చిస్తోంది. అయినా విద్యార్థులకు చెట్ల కింద చదువులు తప్పడం లేదు. కొన్నిచోట్ల ఒకే గదిలో రెండు మూడు తరగతులుకు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. 2024–25 కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని రాష్ట్రంలో 43,154 పాఠశాలలు ఉంటే అందులో బాలికలకు ప్రత్యేకంగా 39,454 టాయిలెట్లు మాత్రమే పని చేసేవి ఉన్నాయి. 36,085 మాత్రమే బాలుర టాయిలెట్లు పని చేస్తున్నాయి. అంటే 3700 బాలికల టాయిలెట్లు, 7,069 బాలుర టాయిలెట్ల కొరత నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి ఇప్పటివరకు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ప్రభుత్వం రూ.706 కోట్లు వెచ్చించి 58,632 నిర్మాణాలు చేపట్టినట్టు ప్రభుత్వ నివేదికల్లోనే పేర్కొంది. ఇందులో టాయిలెట్లు, తరగతి గదులు, ప్రహరీల నిర్మాణానికి రూ.510 కోట్లు వెచ్చించామని చెబుతున్నా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్న భోజన వర్కర్ ఇల్లే పాఠశాలభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నారాయణపురంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గత ఏడాది ఆగస్ట్లో కురిసిన వర్షాలకు పాడైంది. అప్పటి నుంచి స్లాబ్ నుంచి పెచ్చులు ఊడి పడటంతోపాటు కురుస్తోంది. దీంతో పాఠశాలను మధ్యాహ్న భోజనం వర్కర్ ఇంటి వసారాలో రేకుల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. బిల్లులు రాక...నిర్మాణాలు జరగక సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ముత్యాల నగర్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఒక గదిలో రెండు తరగతుల విద్యార్థులకు, వరండాలో మూడు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఒక్కో సారి చెట్ల కింద కూర్చోబెడుతున్నారు. మూడేళ్ల కిందట ఈ పాఠశాలకు 4 గదులు మంజూరయ్యాయి. ఆ గదులు నిర్మాణంలో ఉండగా బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. జెడ్పీ పాఠశాలలోనూ... ఇది నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి.ఇక్కడ 9 గదులున్నా లైబ్రరీ, స్టాఫ్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, ఆఫీస్ రూం కోసం నాలుగు గదులను కేటాయించారు. మిగతా ఐదు గదులున్నా సరిపోకపోవడంతో చెట్టు కింద పాఠాలు చెప్పాల్సి వస్తోంది. -
నీట్, జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో, ఇకపై అడ్మిషన్ల మెరిట్ జాబితాలో క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ కల్పించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో పరీక్షల నిర్వహణలో ఎదురైన పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలు వంటి తీవ్రమైన వివాదాల నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ఎంట్రన్స్ పరీక్షల మార్కులే కాకుండా, బోర్డు పరీక్షల మార్కులకు కూడా సమాన ప్రాధాన్యత లభిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షల సిలబస్ను పాఠశాల పాఠ్యప్రణాళికకు అనుగుణంగా మార్చడం ద్వారా విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పేపర్ లీకేజీల రిస్క్ను పూర్తిగా తగ్గించడానికి, క్రమంగా అడాప్టివ్ ఆన్ డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లనున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తిగా నీట్, జేఈఈ ఎంట్రన్స్ స్కోర్లపైనే ఆధారపడి జరుగుతోంది. బోర్డు పరీక్షలు కేవలం అర్హత సాధించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి,అనధికారిక విద్యాసంస్థల వ్యాప్తిని, కోచింగ్ సంస్కృతిని అరికట్టడానికి విద్యాశాఖ నియమించిన తొమ్మిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఈ కీలక సిఫార్సులను సిద్ధం చేసింది. ఈ కమిటీ తన తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. -
18 ఏళ్ల వయసులోనే ఇలాంటి విజయాలా?
ఇంటర్మీడియట్ అనగానే మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరిగే ఒక రేస్. ఆ రేస్ పూర్తవ్వగానే ఇంజనీరింగ్లో చేరి.. ఓ నాలుగేళ్ల పాటు క్లాసులు అటెండ్ అయి, బోర్డు పైన లెక్చరర్లు రాసిన సబ్జెక్ట్ నోట్ బుక్లలో రాసుకొని, బట్టి పట్టేసి, సెమిస్టర్ పరీక్షలు రాసి, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏదో ఒక ఉద్యోగం ప్రయత్నించడం.. మనకు తెలిసిన విద్యావిధానం ఇదే. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. కాలేజీ చదువుకు తోడుగా సరైన స్కిల్స్ కూడా తోడైతే, డిగ్రీ చేతికి వచ్చేదాకా ఆగాల్సిన పనిలేదు. కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే టెక్నాలజీ ద్వారా వాస్తవ ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారాలు చూపించవచ్చని NIAT అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్న నేటి ఇంజనీరింగ్ విద్యార్థులు నిరూపిస్తున్నారు.ఐఐటీలు, ఐఐఎంలు, ఏకంగా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్స్ను సైతం ఆశ్చర్యపరుస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరు సత్తా చాటుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటూనే, తమ మొదటి, రెండు సంవత్సరాల్లోనే 'NIAT' అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ సాయంతో ఈ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, వీరు తయారుచేస్తున్న ప్రొడక్ట్స్ చూస్తుంటే.. "మన పిల్లలు కూడా ఇలా ఆలోచించగలరా?" అని ప్రతి తల్లిదండ్రీ ఆశ్చర్యపోవాల్సిందే. ఆ విజయాల వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథలేంటో చూద్దాం..అంతర్జాతీయ స్థాయిలో 19 ఏళ్ల తెలుగమ్మాయికి అరుదైన గుర్తింపు:ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ 'గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్' ఒక కల. ఇందులో ఎంపికైతే గూగుల్ ప్రాజెక్ట్లకే నేరుగా మన కోడ్ రాయవచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్కు 131 దేశాల నుంచి 15,245 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఫైనల్గా ఎంపికైన 1,141 మందిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న గుత్తా సోనికా చౌదరి నిలిచింది."పరీక్షల కోసం బట్టీ పట్టే విధానం నుంచి బయటపడి, నిజమైన ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నాను. NIATతో నాకు లభించిన ప్రాక్టికల్ వాతావరణం, అక్కడి మెంటార్ల గైడెన్స్ నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ ఏజ్ లోన్ ఒక గ్లోబల్ ప్రాజెక్ట్కు కంట్రిబ్యూట్ చేసే స్థాయికి రావడం వెనుక ఆ పునాదే కారణం" అని గర్వంగా చెబుతోంది సోనిక.అంబులెన్స్లకు ప్రాణం పోస్తున్న 'ఏఐ' టెక్నాలజీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 'ఓపెన్ ఏఐ అకాడమీ బిల్డథాన్'. దేశవ్యాప్తంగా 70 వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. ఫస్ట్ ఇయర్ చదువుతున్న NIAT స్టూడెంట్స్ టీమ్ టాప్ ఇన్నోవేటర్స్గా నిలిచింది. వీరు అంబులెన్స్లకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆటోమేటిక్గా దారి క్లియర్ చేసే ఒక అద్భుతమైన 'ఏఐ ట్రాఫిక్ సిస్టమ్'ను (ప్రాజెక్ట్-K) డిజైన్ చేసి ఫస్ట్ రన్నరప్గా నిలిచారు."ట్రాఫిక్లో అంబులెన్స్ చిక్కుకుపోవడం చూసినప్పుడల్లా ఏదైనా చేయాలనిపించేది. NIAT 5.0 ల్యాబ్స్లో మేము టెక్నాలజీ నేర్చుకుంటున్నప్పుడు.. దీన్ని ప్రాక్టికల్గా ఆ సమస్య పరిష్కారానికి వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మా మెంటార్ల సపోర్ట్తో ఆ కోడ్ రాసి, సిస్టమ్ను డిజైన్ చేశాం." అని ఆ టీమ్ సభ్యులు వివరించారు.కోమాలో ఉన్న వారి భావోద్వేగాలను తెలుసుకునేలా..సాధారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సిలబస్ అర్థం చేసుకోవడానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ, NIAT విద్యార్థులు 'న్యూరోనెక్సాస్ ఏఐ' పేరుతో హెల్త్కేర్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒకచోట చేర్చారు. ఈ సిస్టమ్ రియల్ టైమ్లో ఒక వ్యక్తి మెదడు తరంగాలను రీడ్ చేసి, వాళ్లు ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నారో పసిగడుతుంది. టెక్నాలజీని సామాజిక ప్రయోజనం కోసం ఎలా వాడాలో ఈ యువత నిరూపించింది.ప్రాణాపాయ పరిస్థితుల్లో మనుషులకు బదులుగా 'హ్యూమనాయిడ్ రోబోట్'“మనుషులకు హాని కలిగించే ప్రదేశాలకు మనం ఇంకా మనుషులనే ఎందుకు పంపుతున్నాం?" - ఓ విద్యార్థి మదిలో మెదిలిన ఈ చిన్న ప్రశ్నే ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. కెమికల్ లీక్స్, గ్యాస్ ఛాంబర్లు, కూలిపోయిన భవనాలు, బాంబ్ డిస్పోజల్ సైట్స్ లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనుషులకు బదులుగా పనిచేసే ఒక 'హ్యూమనాయిడ్ రోబోట్'ను NIAT విద్యార్థి ప్రోగ్రామ్ చేశాడు.ఆర్ఓఎస్, రాస్ప్ బెర్రీ పై సాయంతో రూపొందిన ఈ రోబోట్ ప్రమాదకర ప్రాంతంలో మనిషిలా పనిచేస్తుంటే.. దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తి మాత్రం ఎక్కడో సురక్షితంగా ఉంటాడు.చదువుకునే వయసులోనే..స్టార్టప్ ఫౌండర్లుగాపాకెట్ మనీ కోసం అమ్మానాన్నలను అడిగే వయసులో, NIAT స్టూడెంట్స్ ఏకంగా స్టార్టప్లకు సీఈవోలుగా మారుతున్నారు. ఇప్పటికే 20కి పైగా స్టార్టప్ లను ప్రారంభించారు. అంతేగాక, ఇంటర్న్షిప్ల ద్వారా ఇప్పటికే 2.87 కోట్ల రూపాయల స్టైపెండ్స్ సాధించారు. వీరిలో సచిన్ కీర్తి వాసు అనే విద్యార్థి 'గ్రోవిఫై ఏఐ' అనే స్టార్టప్ను ప్రారంభించి, కాల్ సెంటర్ల కోసం ఏఐ వాయిస్ ఏజెంట్ను సృష్టించాడు.హైదరాబాద్ టీ-హబ్లో జరిగిన 'బిజ్హ్యాక్' ఈవెంట్లోను సత్తా చాటాడు. నష్టాల్లో కూరుకుపోయి మూతపడే దశలో ఉన్న ఒక కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించే మోడల్ను రూపొందించి, 25కి పైగా కాలేజీల నుంచి వచ్చిన 250 మంది పార్టిసిపెంట్స్తో పోటీ పడి విజేతగా నిలిచి ఏకంగా లక్ష రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు."కేవలం ఉద్యోగం కోసమే చదవడం కాకుండా, సొంతంగా ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలని మా NIAT మెంటార్లు మాలో స్ఫూర్తి నింపారు. ఒక ఐడియా వస్తే, దాన్ని వెంటనే ఎలా అమలు చేయాలన్న ప్రాక్టికల్ అప్రోచ్ వల్లే..నేను ఫస్ట్ ఇయర్లోనే ఈ స్టార్టప్ను ప్రారంభించగలిగాను" అని సచిన్ తన సక్సెస్ జర్నీని పంచుకున్నాడు.తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శకం!విజయాలు సాధించిన ఈ విద్యార్థులందరిలో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్.. 'ప్రాక్టికల్ లెర్నింగ్'. పుస్తకాల్లోని థియరీని బట్టీ పట్టకుండా, వాస్తవ సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారాలు కనుక్కోవడం. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్లో అడుగుపెట్టే ప్రతి విద్యార్థీ.. తమ ఫోకస్ను కేవలం మార్కుల వైపే కాక, 'నైపుణ్యాల' పైన దృష్టి సారించాలి. విద్యార్థుల్లో ఆ ఇన్నోవేటివ్ ఆలోచనలను రేకెత్తించి, వారికి సరైన మెంటార్షిప్ ఇచ్చే NIAT లాంటి ఎకోసిస్టమ్ను ఎంచుకున్నప్పుడు.. భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఇలాంటి అద్భుతాలే సృష్టిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు!For more details: https://rebrand.ly/be7c36 -
ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు అమల్లో ఉంటాయని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం స్పష్టం చేసింది.కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటూ ఆంక్షలు విధించడంపై న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదన్న ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ 89 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.కోట్లాది రూపాయల బకాయిలను పెండింగ్లో ఉంచితే కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను, సిబ్బంది జీతాలను ఎలా చెల్లిస్తాయి? కాలేజీలు ఎలా నడుస్తాయి?" అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించదు, అటు కాలేజీలను విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోనివ్వదు. ఇలాంటప్పుడు ప్రస్తుత విద్యాసంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని కోర్టు నిలదీసింది.గతంలో ప్రభుత్వం తెచ్చిన జీవో 7 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో నెం. 9 లో కూడా పాత నిబంధనలనే కొనసాగిస్తూ విద్యార్థుల అలాట్మెంట్ లెటర్లలో ‘ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొనడాన్ని కోర్టు తప్పుబడుతూ స్టే ఇచ్చింది.ప్రభుత్వం తరఫున స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ రాహుల్రెడ్డి వాదనలు వినిపిస్తూ బకాయిల చెల్లింపుపై వివరణ ఇచ్చారు. ఈ రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నిధుల్లో కేంద్రం వాటా ఉంటుంది. అయితే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు చెల్లించాలని, ఆ తర్వాతే తమ వాటా విడుదల చేస్తామని కేంద్రం చెబుతోందని వివరించారు. దీనివల్ల మొత్తం బకాయిల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడిందని, వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటం వల్లే కొంత ఆలస్యం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి రెండు వారాల సమయం కావాలని కోరారు.ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 లోపు దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులందరికీ ఆగస్టు 15 లోపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం గనుక అధికారికంగా కోర్టుకు రోడ్మ్యాప్ సమర్పించి, ఆగస్టు 15 లోపు బకాయిలన్నీ స్పష్టంగా చెల్లిస్తామని హామీ ఇస్తే.. తాము దాఖలు చేసిన పిటిషన్లను విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కాలేజీల యాజమాన్యాల తరఫు సీనియర్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. -
NEET ఎగ్జామ్ మిస్.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్ పెరగడంతో తల్లిదండ్రులు బైక్లను ఫుట్పాత్లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.Bengaluru, Karnataka: A parent of one of the students says, "Rahul Gandhi, D.K. Shivakumar, and even the Commissioner of Police, Bengaluru, do not seem to be concerned. Rahul Gandhi went to Kota for the cause of students, right? But because of his party's function today, four… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/No3W5edKEb— IANS (@ians_india) June 21, 2026 -
బరితెగించిన బీటెక్ రవి.. విద్యార్థుల మృతిపై అసత్య ప్రచారం
వైఎస్సార్,సాక్షి: చక్రాయపేట మండలంలో నిన్న జరిగిన ఘోర విషాదంపై టీడీపీ నేత బీటెక్ రవి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ఇసుక గోతుల్లో పడి చనిపోతే.. కావాలనే ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని అత్యంత హేయంగా మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతేనేలా కారుకూతలు కూశారు. దీంతో బీటెక్ రవి వ్యాఖ్యలపై ఆ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ఆదివారం (జూన్21) నాడు చక్రాయిపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లు సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లారు. అయితే అక్కడ ఇసుకకోసం తవ్విన గుంతల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి అక్రమ దందాలో కాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు. దీనివల్ల నది లోపల ప్రమాదకరమైన భారీ గోతులు ఏర్పడ్డాయి. అలా తవ్విన ఇసుకను చక్రాయపేట ప్రాంతం నుండి యథేచ్ఛగా బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వారి అనుచరులు ఈ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాపాగ్ని నదిని ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పలుమార్లు జిల్లా కలెక్టర్కు అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, ఇసుక దందా ఆగకపోవడం వల్లే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు మండిపడ్డారు. అమాయక విద్యార్థుల మృతికి కారణమైన అక్రమ ఇసుక క్వారీ నిర్వాహకులపై, దానికి సహకరిస్తున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా తాజాగా బాధితుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులపై మృతిపై టీడీపీ నేత బీటెక్ రవి ఇష్ఠారీతిన వ్యాఖ్యానించడం వారి కుటుంబసభ్యులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. -
కోచింగ్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకే ప్రమాదంలో రెండు విషాదాలు చోటు చేసుకోవడం మరింత కలచివేసింది.సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.దట్టమైన పొగలు, మంటల మధ్య చిక్కుకుని కొంతమంది విద్యార్థులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు పై అంతస్తుల నుండి దూకే క్రమంలో తొక్కిసలాటలో మరణించారు. బయటకు వచ్చే మార్గం మూసుకుపోవడంతో విద్యార్థులు కిటికీలు, రైలింగ్ల నుండి దూకారు. ఈ సమయంలో ఒక యువకుడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం అందుకున్న వెంటనే లక్నో చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో 14 అగ్నిమాపక వాహనాలు, ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫారమ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఐదారు మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రాథమికంగా 11 మంది మృతి చెందినట్లు సమాచారం. అనంతరం మృతుల సంఖ్య 14కి చేరింది.ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
‘రీ–నీట్’ కఠినమే..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2026 పునఃపరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసింది. గత మే 3న జరిగిన తొలి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దు కావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రీఎగ్జామ్ నిర్వహించింది. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా త్రీటైర్ సెక్యూరిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జామర్ల నిఘా నడుమ పరీక్ష జరిగింది. తెలంగాణలో మొత్తం 73,059 మంది అభ్యర్థులకు హాల్టికెట్లు జారీ చేయగా, 65,087 (89.09 శాతం) మంది హాజరయ్యారు. తొలి నీట్ పరీక్షతో పోలిస్తే రీ–ఎగ్జామ్కు హాజరైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష రాసిన విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. మే 3న జరిగిన పరీక్షతో పోలిస్తే రీఎగ్జామ్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా, ఎక్కువ సమయం తీసుకునేలా (లెంగ్తీగా) ఉందని వెల్లడైంది. కొరవడిన సమతుల్యత: రద్దయిన నీట్ పరీక్షతో పోలిస్తే పునఃపరీక్షలో బయాలజీ విభాగం సులభంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలన్నీ నేరుగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అడిగినట్టు తెలిపారు. కొన్ని అధ్యాయాల నుంచి అసలు ప్రశ్నలే లేవని, అధ్యాయాల పరంగా సమతుల్యత కొరవడిందని సబ్జెక్ట్ నిపుణులు భావిస్తున్నారు. స్టేట్మెంట్, మల్టిపుల్ చాయిస్ జతపరచడం వంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చినట్టు తెలిపారు. గత పరీక్షలతో పోలిస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంత కఠినంగానే ఉన్నట్టు నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఫిజిక్స్ గత రెండు పరీక్షలతో పోలిస్తే చాలా మారిపోయినట్టు పేర్కొన్నారు. గతంలో మోడరన్ ఫిజిక్స్, సెమీకండక్టర్ నుంచి నేరుగా సిద్ధాంతపరమైన ప్రశ్నలు రాగా, ఈసారి సీన్ రివర్స్ అయింది. జేఈఈ మెయిన్ స్థాయి క్లిష్టత ఫిజిక్స్లో ఉందని వెల్లడైంది. మెకానిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు జేఈఈ మెయిన్ స్థాయిని తాకగా, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ విభాగాల్లో డయాగ్రమ్స్ ఇచ్చి, అందులో రెండు మూడు సూత్రాలు ప్రయోగించాల్సినట్టుగా ప్రశ్నలను క్లిష్టతరం చేశారు. దీంతో ఒక్క ఫిజిక్స్ విభాగానికి గంటన్నర, ఆపైన కేటాయించాల్సి వచ్చిందని విద్యార్థులు చెప్పారు. ఈసారి స్కోర్, మెరిట్ ర్యాంకులను ఫిజిక్స్ శాసిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ నుంచి వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో లెక్కలన్నీ నేరుగా ఫార్ములా ఆధారంగానే ఉన్నాయి. ఇన్ఆర్గానిక్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్, అస్సెర్షన్–రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడంతో వాటిని చదవడానికి ఎక్కువ సమయం పట్టిందని విద్యార్థులు అన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అత్యంత ఇబ్బందిగా అనిపించిందని నిపుణులు అంచనా వేశారు. డైరెక్ట్ ప్రశ్నలు తగ్గించి, రసాయన చర్యల అంతర్గత విధానంపై లోతైన ప్రశ్నలు అడిగారని, దీంతో ఆప్షన్లు చాలా దగ్గరగా ఉండటంతో విద్యార్థులు పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడ నెగిటివ్ మార్కుల ఉచ్చులో విద్యార్థులు పడే వీలుందన్నారు. కటాఫ్ అంచనా ఇలా.. ! 2025తో పోలిస్తే ఈసారి కూడా నీట్ ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో కటాఫ్లు పెద్దగా పెరిగే అవకాశం లేదని నిపుణుల అంచనా. మే నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం కొంత సులభంగా ఉండటంతో గతేడాదితో పోలిస్తే కటాఫ్లు పెరుగుతాయని భావించారు. పునఃపరీక్షతో ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. 2025 తరహాలోనే కటాఫ్లు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో జనరల్ అభ్యర్థులకు 605–610 మార్కుల వద్ద కన్వీనర్ సీట్లు వచ్చాయి. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 540–550 మార్కులు వచ్చిన వారికి చివరి విడతల్లో సీట్లు దక్కాయి. బీసీలకు ప్రభుత్వ కాలేజీల్లో 575–595 మార్కుల మధ్య చివరి సీట్లు కేటాయించబడ్డాయి. ప్రైవేట్లో బీసీ విద్యార్థులకు 490–510 మార్కుల వరకు కూడా సీట్లు లభించాయి. ఎస్సీ విద్యార్థులకు కటాఫ్ ప్రభుత్వ కాలేజీల్లో 495 – 510 మార్కుల మధ్య, ప్రైవేటులో 435–450 మార్కుల శ్రేణిలో ఉంది. ఈ క్రమంలో ఆయా కేటగిరీల్లో గతేడాది కటాఫ్ కంటే 10 నుంచి 20 మార్కులు అదనంగా సాధించిన వారికి ఈసారి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు దక్కే అవకాశం ఉంటుందని అంచనా. మొబైల్తో పట్టుబడ్డ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలకు యత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు. జండావత్ నరేందర్ అనే అభ్యర్థి తన మొబైల్ ఫోన్ను టాయిలెట్లోని ఫ్లష్ ట్యాంక్లో దాచిపెట్టాడు. పరీక్ష సమయంలో టాయిలెట్కు వెళ్లి ఆ మొబైల్ను ఉపయోగించే ప్రయత్నం చేయగా ఇని్వజిలేటర్లు గుర్తించి, అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా, పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్లోని ఇంటరీ్మడియట్ విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. ట్రాఫిక్ జామ్తో పరీక్షకు దూరం మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేంద్రానికి చెందిన వంజరి అనే విద్యార్థిని ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే నీట్ పరీక్ష రాయడానికి బస్సులో వచ్చింది. అయితే పట్టణంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి 10 నిమిషాలు ఆలస్యమైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమనే నిబంధన వల్ల అధికారులు ఆమెను పరీక్షకు అనుమతించలేదు. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని తన తల్లితో కలిసి అరగంటపాటు పరీక్ష కేంద్రం వద్దే నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో కన్నీరుమున్నీరైంది. -
‘మా నాన్నెవరో తెలుసా?’
‘నాకు ఏది కావాలంటే అది వెంటనే నా ముందుండాలి, ఎందుకంటే నేను ప్రత్యేకం!’ – నేటితరం పిల్లల్లో, ముఖ్యంగా నగరాల్లోని విద్యా సంస్థల్లో ప్రమాదకరంగా పెరుగుతున్న మనస్తత్వం ఇది. ఒక సర్వే ప్రకారం, గత దశాబ్ద కాలంలో పాఠశాలల్లో క్రమశిక్షణా రాహిత్యం, తోటి విద్యార్థులను తక్కువ చేసి చూచే ధోరణులు దాదాపు ముప్పై ఐదు శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం, ఈ ఎంటైటిల్డ్ మనస్తత్వమే. తరగతి గది అనేది సమాజానికి చిన్న ప్రతి రూపం లాంటిది. అక్కడ ఒకరిద్దరు పిల్లలు తామే సర్వోన్నతులు అనే భావనతో ఉంటే, అది మిగతా పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ‘మా నాన్న ఎవరో తెలుసా?’ అనే అహంకారంతో గ్రూపులు కట్టి, సాధారణ నేపథ్యం ఉన్న పిల్లలను మానసికంగా వేధించే బెదిరింపులు, వర్గ రాజకీయాలు ఎక్కువవుతాయి. ఇలాంటి పిల్లలు సమూహ పనులు చేసేటప్పుడు కేవలం నాయకత్వం కోసం పట్టుబడ తారు తప్ప, ఇతరులతో కలిసి పని చేయడానికి ఇష్టపడరు.ఇందువల్ల సహకార భావన పూర్తిగా లోపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలోని అంతర్జాతీయ పాఠశాలలు, కార్పొరేట్ ఇంటర్ కాలే జీలలో ఇలాంటి యథార్థాలు చూడవచ్చు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ అంతర్జాతీయ పాఠశాలలో ఒక మంత్రి కుమారుడికి ఆశించిన విద్యార్థి సంఘ నాయకుడి పదవి ఇవ్వనందుకు సదరు ఉపాధ్యాయుడిని స్కూల్ ముందే అవమానించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే విజయవాడలోని ఒక ప్రముఖ పాఠశాలలో ఒక పెద్ద వ్యాపారవేత్త కుమార్తె తను తెచ్చుకున్న లక్షన్నర రూపాయల ఫోన్ను ప్రదర్శిస్తూ, పక్క విద్యార్థినిని కనీసం బ్రాండెడ్ వాచ్ కూడా లేదనీ, తనతో స్నేహం చేయడానికి అర్హురాలివి కావనీ కించపరిచిన ఘటనలు ఉన్నాయి. హైదరాబాద్లోనే మరో ఘటనలో ఒక ఈవెంట్ నాయకత్వం మార్చలేదని ప్రధానోపాధ్యాయునికే ఫోన్ చేసి బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఎంటైటిల్డ్ మనస్తత్వానికి ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. లైకులు, వ్యూస్ కోసం తమ విలాసవంతమైన జీవితాన్ని, పాఠశాల ఈవెంట్లను వైరల్ చేయడం ఒక ట్రెండ్గా మారడం వల్ల పిల్లల్లో తక్షణ సంతృప్తి అలవాటై, ఓపిక నశిస్తోంది. ఇక్కడే మనకు ‘డిజిటల్ పౌరసత్వం’ విద్య ఎంతైనా అవసరమవుతుంది.పరిష్కార మార్గాలు పాఠశాలల యాజమాన్యాలు కఠినమైన ఏక రూప నియమాలను అమలు చేయాలి. ముఖ్య మంత్రి కొడుకైనా, ఐఏఎస్ కూతురైనా స్కూల్ గేటు దాటి లోపలికి వస్తే అందరూ సమానమే అనే నియమం పెట్టి, యూనిఫాం, మొబైల్ ఫోన్ల నిషేధాన్ని అందరికీ ఒకేలా వర్తింపజేయాలి. ఇలాంటి పిల్లలకు కేవలం అధికారం మాత్రమే కాదు, క్లాస్రూమ్ శుభ్రతను పర్యవేక్షించడం, తోటి బలహీన విద్యార్థులకు చదువులో సహాయ పడటం వంటి క్షేత్రస్థాయి బాధ్యతలను అప్పగించాలి. హోదాను చూసి భయపడకుండా, పిల్లాడి ప్రవర్తన సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులను పిలిచి సంప్రదింపులు జరిపి నిర్మొహమాటంగా నిజాలు చెప్పాలి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా అడి గిందల్లా ఇవ్వకుండా, సమాజంలో ఎలా బత కాలో నేర్పాలి. అడిగిన కొన్ని వస్తువులను తిరస్కరించడం వల్ల వారికి జీవితంలో అన్నీ అను కున్నట్టు జరగవు అనే చేదు నిజం చిన్నప్పుడే బోధపడుతుంది. క్రమశిక్షణతో కూడిన విద్యే నిజమైన సంస్కారం అని అందరూ గ్రహించాలి.– డా‘‘ మేడా జగన్మోహన రావు ‘ విద్యారంగ నిపుణులు -
ఫీజు కడితేనే సర్టిఫికెట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను చంద్రబాబు సర్కార్ దివాలా తీయిస్తోంది. పేదింటి విద్యార్థులకు ఉచిత విద్యను దూరం చేస్తూ పైశాచిక పాలన సాగిస్తోంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయినా, చీమకుట్టినట్టుగా కూడా లేకుండా దగాకోరుతనం ప్రవర్తిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల మెడపై కత్తి పెట్టి ఫీజులు వసూలు చేస్తుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. ఫీజు బకాయిలు చెల్లిస్తే తప్ప, సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ సంస్థలుగా సేవలందిస్తున్న విశ్వవిద్యాలయాలు సైతం మరో అడుగు ముందుకేసి ఫీజు బకాయిలకు సంబంధించి వంద రూపాయల బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకోవడం విస్తుగొలుపుతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాబూలి వ్యాపారి కంటే ఘోరంగా ఏపీలోని విద్యా సంస్థలు పేదింటి విద్యార్థులను ఫీజుల కోసం పీడిస్తుండటం దిగజారిన విద్యా దుస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి పాత బకాయిలతో పాటు 2026–27 విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద రూ.10,300 కోట్లు ఖర్చు చేయాలి. కానీ, బడ్జెట్లో మాత్రం రూ.2,766 కోట్లు మాత్రమే చూపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాక ఇచ్చింది రూ.2,800 కోట్లు మాత్రమే. ఫలితంగా ఇంకా రూ.6,400 కోట్లు బకాయి ఉంది. దీనిని గమనించిన విద్యా, ఆరి్థక వేత్తలు నెమ్మదిగా ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సంపూర్ణంగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఫీజులు విద్యార్థులే కట్టాలంటూ వంద రూపాయల స్టాంప్ పేపర్పై సంతకాలు తీసుకున్న ఆర్జీయూకేటీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు కట్టాల్సిందే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. అంతకు ముందు మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పేదింటి విద్యార్థుల భవిష్యత్తుకు జీవం పోశారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గాలికి వదిలేసింది. ఫలితంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సైతం ప్రభుత్వంపై నమ్మకం లేదని, అసలు ఫీజు డబ్బులు విడుదల చేసే పరిస్థితి లేదని అభిప్రాయానికి వచ్చాయి. దీంతో విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఫీజుల పీడింపులు, వేధింపులు పెచ్చుమీరాయి. ఈనెల 27న స్నాతకోత్సవం అని ప్రకటించిన వర్సిటీ యాజమాన్యం.. ఇంజనీరింగ్ పట్టా పొందాలంటే ఫీజు బకాయిలు మొత్తం ఒకేసారి కట్టాలని షరతు విధించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. 2024, 2025లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెండింగ్ ఫీజులను కట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. లేదంటే ఫీజు బకాయి ఉన్నట్లు వంద రూపాయిల బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుంటోంది. ఈ వ్యవహారం భారీగా దుమారం రేపుతోంది. ఇలా నాలుగు బ్యాచుల్లో 16 వేల మందికిపైగా విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అవసరమైతే అప్పులు చేసి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడం ఆర్జీయూకేటీలో పరిపాటిగా మారింది. ఫీజులు విద్యార్థులే కట్టాలంటూ వంద రూపాయల స్టాంప్ పేపర్పై సంతకాలు తీసుకున్న ఆర్జీయూకేటీ 97 శాతానికిపైగా పేదింటి విద్యార్థులే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదింటి విద్యార్థులు ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను అందుకోవాలని మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో ఆర్జీయూకేటీ కింద ట్రిపుల్ ఐటీలను ప్రవేశపెట్టారు. 10వ తరగతి తర్వాత నేరుగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ను అభ్యసించేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చారు. రెండు సంవత్సరాల ప్రీ–యూనివర్సిటీ కోర్సు(పీయూసీ), 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీగా బోధన సాగిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు రెసిడెన్షియల్ క్యాంపస్లలో చదువు నేర్పించేలా మహోన్నత ఆశయంతో ఆర్జీయూకేటీని స్థాపించారు. ఇందులో ఏటా 40 వేలకు పైగా దరఖాస్తులు వస్తే 4040 మందికి సీట్లు లభిస్తాయి. వీరిలో 97 శాతంపైగా ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైనా పేదింటి విద్యార్థులే ఉంటారు. ప్రభుత్వ.. ప్రైవేటు తేడా లేదు! విద్యార్థులను ఫీజుల కోసం పీడించే గుణంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు తేడా ఉన్నట్లు కనిపించట్లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపార ధోరణిలో చూస్తూ కళాశాలలను నడిపిస్తున్నాయి. అయితే రెండేళ్లుగా ఫీజు బకాయిల దెబ్బకు తీవ్ర అప్పులు, అప్పులకు వడ్డీల భారంతో కుదేలయ్యాయి. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక రోజువారీ కళాశాల నిర్వహణకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పులపై నెట్టుకొస్తున్నాయి. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇక 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుండటం విచారకరం. విద్యార్థి చివరి ఏడాది చదువు ముగించుకుని సర్టిఫికెట్లతో బయటకు వెళ్లాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఇక్కడ డిగ్రీ, ఇంజనీరింగ్ నుంచి పీజీ కోర్సులకు వెళ్లే వారికి గడిచిన రెండేళ్లుగా సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కౌన్సెలింగ్ను సైతం వాయిదా వేసిన పరిస్థితులున్నాయి. మూడో ఏడాది హామీ గాలికే! చంద్రబాబు ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. తీరా, అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి మోసం చేసింది. త్వరలో పీజీ కౌన్సెలింగ్ చేపట్టనుండగా, ప్రైవేటులో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మాత్రం నోరు మెదపట్లేదు. ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేసే దిశగా వాటిల్లో పీజీ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు బీరాలు పలికి ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ పీజీకి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా చూస్తే.. ప్రైవేటు మాట దేవుడెరుగు.. ప్రభుత్వ వర్సిటీల్లోనే ఫీజులు కట్టకుంటే చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ వర్సిటీల నిధులు దారి మళ్లింపు!చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని భ్రష్టు పట్టించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కరోనాను ఎదురించి సమర్థవంతంగా ఐదేళ్లు పథకాన్ని కొనసాగిస్తే.. చంద్రబాబు పాలనలో ఫీజుల పేరుతో విద్యార్థుల గొంతు నులిమేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో అత్యంత పారదర్శకంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికి ప్రైవేటు యాజమాన్యాలను సర్వం ముంచేశారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి నిధుల చెల్లింపులను అడ్డుకుని ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడంతో ప్రభుత్వ వర్సిటీలు, ఉన్నత విద్యా మండలి నుంచి దాదాపు రూ.1,200 కోట్లు నిధులు దారి మళ్లించి వాటితో ప్రైవేటు యాజమాన్యాలకు అరకొరగా విదిల్చారు. అదే, ప్రభుత్వ వర్సిటీల్లోనూ విద్యార్థులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఉన్నత విద్యా మండలి ఖజానా నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చిన్నబాబు ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు. విద్యకు అరకొర బడ్జెట్..ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కార్ అరకొర బడ్జెట్తో ఆరి్థకంగా ముంచేస్తోంది. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2025–26 బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు, 2026–27లో రూ.2,766 కోట్లు మాత్రమే కేటాయింపులు చూపించింది. ఈ ఏడాది భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు పాత చంద్రబాబు ప్రభుత్వంలోని రూ.1,778 కోట్లు బకాయిలను తీర్చింది. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేసింది. ఇలా మొత్తం ఐదేళ్లలో ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఫీజు బకాయిల చెల్లింపులను సైతం చంద్రబాబు సర్కార్ విడుదల చేయడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
హైదరాబాద్ : చూడ చక్కగా..అబ్బుర పరిచే ఇంటీరియర్ డిజైన్లు (ఫొటోలు)
-
ఆంగ్ల భాషపై విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ సందేశం
సాక్షి,హైదరాబాద్: విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందిస్తూనే వారి మాతృభాషలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన “రెండు వారాల ఆంగ్ల భాషా ప్రావీణ్యత కార్యక్రమం”లో పాల్గొన్న ఉపాధ్యాయులతో గవర్నర్ శుక్రవారం లోక్ భవన్లో ముచ్చటించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులకు గవర్నర్ ధృవపత్రాలను అందజేసి అభినందించారు.హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ నివాస విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిర్వహించబడింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా గవర్నర్ విచక్షణ నిధుల నుంచి రూ.12.80 లక్షలు లోక్ భవన్ మంజూరు చేసింది. కార్యక్రమంలో 50 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఈఎఫ్ఎల్యూ అధ్యాపకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల భావప్రసార, బోధనా సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈఎఫ్ఎల్యూ మరియు గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఉపాధ్యాయులలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెరగడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడి, ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయని ఆయన పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని గవర్నర్ అన్నారు. ఇటువంటి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరమైన అంతరాలను తగ్గించడమే కాకుండా, గిరిజన ప్రాంతాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా లోక్ భవన్ నిధుల మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.“శిక్షణ పొందిన 56 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఆదర్శంగా నిలవాలి. నాణ్యమైన విద్య ద్వారా గిరిజన విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి మనమందరం కలిసి పనిచేయాలి. గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి లోక్ భవన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని గవర్నర్ పేర్కొన్నారు. మాతృభాషలను, గిరిజన సమాజాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, పోటీ ప్రపంచంలో రాణించగల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన సాగాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులను గవర్నర్ అభినందించి, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల ప్రయోజనం కోసం సమర్థవంతంగా వినియోగించాలని కోరారు.కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఈఎఫ్ఎల్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె. శశికిరణా చారి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా రామ్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి లోకేష్ పరువు తీసిన స్కూల్ పిల్లలు
-
తరగతి గదుల్లో తెలంగాణ భవిష్యత్తు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల బతుకులు మారవు. అవి కేవలం బతకడానికి మాత్రమే పనికొస్తాయి. భవిష్యత్ తరాల తలరాతలు మారాలంటే ముందు వారు చదువుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులుగా రాణించినప్పుడే బతుకులో మార్పు కన్పిస్తుంది. పుట్టి, పెరిగిన ప్రాంతానికి గుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు రంగుల అద్దాల మేడలు, రంగుల గోడల్లో లేదు. తరగతి గదుల్లోనే ఉంది. విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతికేలా విద్యలో రాణించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువును చిన్నతనంగా భావించొద్దు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుకుని రాణించిన వాళ్లే..’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బడి పిల్లలకు అల్పాహారం పంపిణీ పథకాన్నీ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అటు నుంచి నేరుగా కిచెన్కు వెళ్లి పూరీని వొత్తారు. లైబ్రరీ, ప్రయోగశాల, మ్యూజిక్, డ్యాన్స్ తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. క్రీడామైదానానికి చేరుకుని పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడారు. విద్యార్థులు, టీచర్లతో కరచాలనం చేశారు. గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేలా.. ‘విద్యాశాఖ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. పదేళ్ల పాలనలో విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించేందుకే టీపీఎస్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆరుట్ల టీపీఎస్లో ఇప్పటికే 1,814 మంది అడ్మిషన్లు పొందారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక టీపీఎస్ నుంచి ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ఆరుట్ల గ్రామం తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా. ఇక్కడ ప్రారంభించిన టీపీఎస్ను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు అంకితం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికే కాదు..తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులది. డిసెంబర్ 9న స్కిల్స్ వర్సిటీ ప్రారంభం ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు. ప్రస్తుతం విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు 9 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. రూ.685 కోట్లతో టెండర్ పిలిస్తే..రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. జూలై ఆఖరి వరకు విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర వస్తువులు అందజేస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కుల,మతాలకు అతీతంగా 500 మంది విద్యార్థులను ఒకేచోట చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ 9న యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని ప్రారంభించనున్నాం..’అని సీఎం తెలిపారు. మెస్సీని తెస్తే విమర్శించారు.. ‘2034 ఒలింపిక్స్లో గోల్డ్మెడల్ సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేశాం. అకాడమీల్లో ఆడే వాళ్ల కంటే..ఆరుట్ల స్కూలు పిల్లలు బాగా ఆడుతున్నారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, విద్యార్థులను కలిపి ఫుట్బాల్ ఆడించాం. క్రీడలను ప్రోత్సహించేందుకు మెస్సీని తీసుకొస్తే రాజకీయ విమర్శలు చేశారు. కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేయాలని భావించే వారికి భవిష్యత్తు ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..’అని రేవంత్ ధ్వజమెత్తారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం 19న ప్రతిజ్ఞ ‘తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సమస్యగా మారాయి. సరదాగా మొదలైన అలవాటు ఆ తర్వాత వాటికి బానిసలుగా మార్చుతుంది. డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం ఈ నెల 19న ఎల్బీనగర్లో వేలాది మంది విద్యార్థులతో ప్రమాణం చేయించబోతున్నాం. విద్యార్థులు తమ తోటి విద్యార్థులు ఎవరైనా గంజాయి, డ్రగ్స్కు అలవాటైతే ఆ విషయం వెంటనే ఉపాధ్యాయుల ద్వారా పోలీసులకు చేరవేయాలి. పోలీసులకు మీరే సమాచార వారధులుగా నిలవాలి..’అని సీఎం కోరారు. పేదల భూములకు విముక్తి కల్పించండి ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న పేదల భూములకు విముక్తి కల్పించాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, ఇతర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. నాగన్పల్లి సర్వే నంబర్ 189లోని పన్నెండెకరాల నాలుగు గుంటల భూమి, 203 సర్వే నంబర్లో ఎనిమిదెకరాల భూమిలో 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని సీఎంకు తెలిపారు. పేదలకిచ్చిన ఇంటి స్థలాలను రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం ఆక్రమించిందని వివరించారు. ఈ భూమికి విముక్తి కల్పించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. -
యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం
లక్నో: నీట్ రీఎగ్జామ్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ రాసే విద్యార్థులకు బస్సు టికెట్లలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు అడ్మిట్ కార్డు చూపించి ఈ సేవలు పొందవచ్చని తెలిపింది. విద్యార్థులు మరోసారి నీట్ ఎగ్జామ్ రాస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.జూన్ 21న నీట్ రీఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు (బుధవారం) అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. నీట్ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీని యోగి ప్రకటించారు. ఎన్టీఏ ఇచ్చిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సదుపాయాలతో పాటు పరీక్ష కేంద్రాలకు సరైన సమాయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నిశితంగా పర్యవేక్షించాలని, పరీక్షకు సంబంధించిన వదంతులు, తప్పుడు సమాచారం లేదా తప్పుదారి పట్టించే కంటెంట్పై తక్షణ చర్యలు తీసుకోవాలి. నీట్ పునఃపరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు, పోలీసు అధికారులు, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్లో దాదాపుగా దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయం నేపథ్యంలో వారందరికీ మేలు చేకూరనుంది.టెలిగ్రామ్ బ్యాన్ కాగా నీట్ పరీక్ష కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేదం విధించింది. జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ నిషేదించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నీట్ రీటెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది.పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటుంది. కాగా ఇటీవల ప్రశ్నాపత్రాల తరలింపుకు విమానాలను వాడింది. ఒక పరీక్ష పత్రాలకోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి. -
పర్మినెంట్ రెసిడెంట్ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం
అమెరికా ఆంక్షలతో బెంబేలెత్తుతున్న విద్యార్థులకు మరో షాక్ తగిలింది. కెనడాలో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే శాశ్వత నివాసం (పీఆర్ కార్డ్) పొందాలనుకునే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అక్కడి మానిటోబా ప్రావిన్స్ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్, అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ల కోసం ఉన్న ఒక కీలకమైన వలస మార్గాన్ని మూసివేసింది. మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (ఎంపీఎన్పీ)ని, అంతర్జాతీయ విద్యా విభాగం (ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్) కింద ఉన్న కెరీర్ ఎంప్లాయ్మెంట్ పాత్వే (సీఈపీ)ని తక్షణమే రద్దు చేసింది. చదువు పూర్తైన విద్యార్థులు నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు ఇప్పటివరకు ఎంతో సులభంగా ఉపయోగపడుతున్న ఒక కీలకమైన ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ఆ ప్రావిన్స్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తున్నట్లు జూన్ 11న సంచలన ప్రకటన చేసింది. ఇలా చేసిన మొట్టమొదటి కెనడియన్ ప్రావిన్స్ మానిటోబానే. దీంతో ఉత్తర అమెరికా దేశంలో శాశ్వత నివాసం కోసం స్టూడెంట్ వీసా మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్న భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విస్తీర్ణం పరంగా కెనడాలో అతిపెద్ద ఆరో ప్రావిన్స్ మానిటోబా, భారతదేశంతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు రోజురోజుకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. దీని రాజధాని విన్నిపెగ్లో, టొరంటో, ఒట్టావా వంటి నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉంటుంది, అదే సమయంలో చక్కటి ప్రభుత్వ యూనివర్శిటీలు యూనివర్శిటీ ఆఫ్ మానిటోబా, ఆర్ఆర్సి పాలిటెక్ వంటి సంస్థలు అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు పీఆర్ చాలా త్వరంగా, సులువుగా వస్తుందనే కారణంతో వేలాది మంది తెలుగువారితో పాటు 80కి పైగా దేశాల నుండి దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇటే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారతీయ విద్యార్థుల వాటా గణనీయంగా ఉంది. 2021లో, 5,240 మంది భారతీయులు స్టడీ పర్మిట్ హోల్డర్లు న్నారు.మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (MPNP) ప్రకారం మానిటోబా ప్రావిన్స్లోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం ఏడాది పాటు చదివి, చదువు పూర్తి కాగానే తమ రంగానికి సంబంధించిన ఒక అర్హత కలిగిన ఉద్యోగ ఆఫర్ సంపాదిస్తే చాలు ఎటువంటి నిరీక్షణ లేకుండా నేరుగా పీఆర్కు దరఖాస్తు చేసుకునే లీగల్ అవకాశం ఉండేది. ముఖ్యంగా భారతదేశం నుండి కెనడా వెళ్లి అక్కడ వన్-ఇయర్ పీజీ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీఆర్ సాధించి ప్రయోజనం పొందేవారు. ప్రస్తుతం ఈ విండోను పూర్తిగా మూసివేయడంతో భారతీయ విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది.ఇదీ చదవండి: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవంభారతదేశం నుండి 5,485 మంది కొత్త శాశ్వత నివాసితులు న్నారు. ఇది మొత్తం ప్రవేశాలలో 33.1శాతం., CEP కార్యక్రమాన్ని రద్దు చేయడం వల్ల ఈ భారతీయ విద్యార్థులు ప్రభావితమవుతారు. వీరు శాశ్వత నివాసం కోసం విద్యా అర్హతల కంటే పని అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే ప్రత్యామ్నాయ కార్యక్రమాలను ఎంచుకోవలసి ఉంటుంది. ఇదీ చదవండి: ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!రద్దయిన సీఈపీ ప్రకారం, దరఖాస్తుదారులు మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరం పాటు మానిటోబాలో పూర్తికాల స్టడీ ప్రోగ్రామ్ను పూర్తి చేసి ఉండాలి. కనీసం కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్మార్క్ (CLB) 7 స్థాయి భాషా ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రావిన్సులో తమ దీర్ఘకాలిక వృత్తి అవకాశాలను వివరిస్తూ ఒక కెరీర్ ఎంప్లాయ్మెంట్ ప్లాన్ను కూడా సమర్పించాల్సి ఉండేది , కొన్ని సందర్భాల్లో, తమ వద్ద తగినంత స్థిరపడే నిధులు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉండేది.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?కానీ మారిన నియమాల ప్రకారం మానిటోబాలోని స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, జాబ్ హిస్టరీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అర్హత కలిగిన పూర్తికాల, దీర్ఘకాలిక ఉద్యోగ ఆఫర్ను స్వీకరించడానికి ముందు, ‘స్కిల్డ్ వర్కర్ ఇన్ మానిటోబా’ (Skilled Worker in Manitoba) ప్రోగ్రామ్ ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా అదే మానిటోబా యజమాని వద్ద కనీసం ఆరు నెలల నిరంతర పూర్తికాల పనిని పూర్తి చేయాలి. ఆ అనుభవ పత్రాలను సమర్పిస్తేనే పీఆర్ నామినేషన్కు అర్హత సాధిస్తారు. అయితే దీనికి ప్రత్యేక విద్యా అర్హత అవసరం లేదు. బదులుగా, భాషా అవసరాలు వృత్తి డిమాండ్లకు, మానిటోబాలో ఆర్థికంగా స్థిరపడగల దరఖాస్తు దారుడి సామర్థ్యానికి ముడిపడి ఉంటాయి. అలాగే ఒక సెటిల్మెంట్ ప్లాన్ను సమర్పించాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ షరతులేదు. అంతేకాకుండా, స్వయం ఉపాధి ద్వారా లేదా పూర్తికాలం చదువుతున్నప్పుడు పొందిన వర్క్ ఎక్స్పీరియన్స్ను పరిగణనలోకి తీసుకోరు. ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి! -
పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్,బుక్స్, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీస్శాఖ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసింది. స్టేషనరీ షాపుల్లో కొనుగోలు చేసే పెన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.పెన్నుల్లా కనిపించేవన్నీ పెన్నులు కాదని.. సంఘ విద్రోహ శక్తులు పెన్నులకు బదులు..వాటి ఆకారంలో ఉండే బాంబుల్ని తయారు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని విడుదల చేసింది.ఉత్తరప్రదేశ్లో పెన్ ఆకారంలో ఉన్న అనుమానాస్పద వస్తువులపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బులంద్షహర్ జిల్లా పోలీసులు (ఖుర్జా పోలీస్ స్టేషన్ పరిధి) ఈ అడ్వైజరీని విడుదల చేశారు. పెన్లా కనిపించే అనుమానాస్పద వస్తువులను తాకరాదని ప్రత్యేక సూచనలు చేశారు. ఇవి విస్ఫోటక పరికరాలుగా మార్పిడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ప్రజలు రోడ్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో లేదా ఎడారిలాంటి ప్రాంతాల్లో కనిపించే వస్తువులను తాకకుండా 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారం అత్యంత కీలకమని, శిక్షణ పొందిన భద్రతా సిబ్బందే ఇలాంటి వస్తువులను పరిశీలించాని తెలిపారు. ప్రజలు సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. అంతా ఉత్తుత్తే..తాజాగా సమాచారం ప్రకారం.. పెన్నులా కనిపించే ఒక వస్తువు చివర ఉన్న బటన్ను నొక్కగానే బాంబులు పేలుతాయని, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వైరల్ వార్తల్లో నిజం లేదని తేలింది. ముందుగా ఈ తరహా పెన్నులపై అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు సూచనలు జారీ చేశారని ప్రచారం జరిగింది. కానీ, తాము ఎలాంటి సూచనలు ఇవ్వలేదని యూపీ పోలీసులు మీడియాకు స్పష్టంగా తెలిపారు. -
స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవం
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగం చేస్తుండగా కొందరు విద్యార్థులు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మరియు రక్షణ రంగ సంస్థలతో గూగుల్ ఒప్పందాలకు నిరసనగా కొంతమంది విద్యార్థుల బృందం సభ నుండి బయటకు వెళ్ళిపోయి నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వ, రక్షణ సంబంధిత పనులలో ప్రధాన టెక్ సంస్థల ప్రమేయంపై యూఎస్ క్యాంపస్లలో విద్యార్థులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ నిరసన చోటు చేసుకోవడం గమనార్హం.సాధారణంగా విద్యార్థుల ఆనందోత్సాహాలు, సాధించిన విద్యా విజయాలతో ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన ఈ వేడుక విద్యార్థుల వాకౌట్తో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. ప్రసంగం కొనసాగుతుండగా పలువురు గ్రాడ్యుయేట్లు ఒకేసారి లేచి బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా'స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా', 'నో టెక్ ఫర్ అపార్తీడ్' వంటి సామాజిక సంస్థలు ఈ నిరసన చేపట్టాయి. దీంతో పిచాయ్ తన ప్రసంగాన్ని టెక్నాలజీ అంశాలపై లోతైన చర్చకు దూరంగా, పట్టభద్రులకు సాధారణ సలహాలకే పరిమితం చేశారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మరియు ఇమ్మిగ్రేషన్ విభాగాలతో గూగుల్ కుదుర్చుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఈ నిరసన చేపట్టారు.Stanford grads walk out as Google CEO Sundar Pichai takes the stage as commencement speaker. No mention of AI, unlike other uni speakers getting booed down this year. Story for @sfgate shortly pic.twitter.com/qvS2rJ91Ip— Matt Brown (@maattttbrown) June 14, 2026మరోవైపు ఇటీవల ఇతర యూనివర్సిటీల్లో ఇలాంటి విషయాలపై టెక్ ప్రముఖుల ప్రసంగాలకు విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో 2015 నుండి గూగుల్కు నాయకత్వం వహిస్తున్న, స్టాన్ఫర్డ్ పూర్వ విద్యార్థి పిచాయ్, తన ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా సాంకేతిక రంగ పరిణామాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?సుందర్ పిచాయ్ సందేశంపిచాయ్ ప్రసంగాన్ని చాలా సరళంగా, వ్యక్తిగత విషయాలకే పరిమితం చేశారు. 1990లలో కాలిఫోర్నియాలో తన తొలి రోజుల నాటి ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నారు. అలాగే ఈ వేదికపై "ఏం మాట్లాడకూడదో" తనకు చాలా సలహాలు వచ్చాయంటూ కాస్త హాస్యాన్ని జోడించారు. డిగ్రీ పూర్తి చేసుకుని కొత్తగా కెరీర్ ప్రారంభించబోయే విద్యార్థులు ఎల్లప్పుడూ ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్ -
అమావాస్యతో విద్యార్థుల సంవత్సరం ఆరంభమా..?
-
మాట నిలబెట్టుకున్న విరోష్ జంట.. పుట్టిన గడ్డ కోసం..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నెరవేర్చారు. తన స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా తుమ్మన్పేటలో విద్యార్థులకు సాయం అందించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 9,10 తరగతుల విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. తన స్వగ్రామంలోని జడ్పీహెచ్ఎస్ తుమ్మన్పేట పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించారుతాజాగా ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్లోని విద్యార్థుల మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్ పేరిట ఎంపికైన జాబితాను విడుదల చేశారు. ఈ లిస్ట్లో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి స్కాలర్ షిప్స్ అందజేయనున్నారు. ఈ ఉపకార వేతనాలతో దాదాపు 180 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. కాగా.. ఈ ఏడాది తన సొంతూరిలో పర్యటించిన విజయ్ దేవరకొండ విద్యార్థులకు మాటిచ్చారు. ఇవాళ అఫీషియల్గా తన మాటను నెరవేర్చారు. హీరో విజయ్ దేవరకొండ తమ సొంత గ్రామానికి చేస్తున్న సేవపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. సొంతూరిపై తనకున్న ప్రేమను చాటుకున్నారని కొనియాడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాయల సీమ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. We are on our way to Thummanpet. The little village where my Father was born. In February - @iamRashmika and I had announced the beginning of a little dream of ours. To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana. Here is a… pic.twitter.com/wLNSr4ZZHe— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026 -
బెరుకులేని చదువే... బెంచ్..మార్క్!
ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ దాకా నవ్వులు కనిపిస్తున్నాయి. కానీ ఆ నవ్వుల మధ్యలో కొన్ని మొహాలు డల్గా ఉన్నాయి. ఒకడు ఒంటరిగా లంచ్ చేస్తున్నాడు. ఒక గర్ల్ స్టూడెంట్ బాత్రూమ్కి వెళ్లాలన్నా భయపడుతోంది. వెనక బెంచీలో ముగ్గురు ముందు బెంచీ వాడిని చూస్తే బెదిరిపోతున్నారు. టీచర్లకు చెప్పాల్సిన సిలబస్ మాత్రమే కనిపిస్తుంది. కానీ బెంచీల మధ్య జరిగే ‘సైలెంట్ వార్’ కనిపిస్తోందా? క్లాస్లో మనసులన్నీ సేఫ్గా ఉన్నాయా? బుల్లీయింగ్ జరుగుతున్నదేమో చూశారా?స్కూళ్లు తెరుస్తారు. పాఠాలు మొదలవుతాయి. పిరియడ్కూ పిరియడ్కూ మధ్య టంగు టంగుమంటూ గంట ఉంటుంది. కానీ పిల్లల ప్రపంచంలో అసలు పాఠం బ్రేక్ టైమ్లో మొదలవుతుంది. ఎవరో ఎవరితోనో ‘ఇక్కణ్ణుంచి లే’ అంటారు. ఎవరి వాటర్ బాటిల్నో ఎవరో విసిరేస్తారు. ఎవరి పేరునో మరొకరు ఫన్నీగా పిలిచి ఏడిపిస్తారు. బుల్లీయింగ్.. గ్రూపిజం... నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. ‘వాడు మనోడు కాదు’...‘వాడి షూస్ బ్రాండెడ్ కాదు’... ‘నీకు ఇంగ్లీష్ రాదు’.. ‘నీ ర్యాంక్ తక్కువ’... పిల్లల మధ్య మాటలు ఎక్స్ఛేంజ్ అవుతుంటాయి. పేరెంట్స్కి ఇవి తెలీవు. ప్రిన్సిపాల్ దగ్గరికి కంప్లైంట్ వెళ్లదు. ఎందుకంటే బాధ పడే పిల్లాడు భయంతో చెప్పడు. మరి ఎవరు కనిపెట్టాలి? క్లాస్లో 40 నిమిషాలపాటు వాళ్లతో ఉండే టీచరే. పిల్లాడి మనసులో గాయాల్ని చూసే ఫస్ట్ కౌన్సెలర్ టీచరే.→ చివరి బెంచీ పిల్లాడు సైలెంట్ ఎందుకు?ఆ చివరి బెంచీ పిల్లాడు ఏది అడిగినా జవాబు చెప్పడు. మౌనంగా ఉంటాడు. వాడొక ‘మొద్దు’ అని మీరు అనుకోవచ్చు. కానీ నిజం వేరే ఉండొచ్చు. వాడి డ్రెస్ చిరిగిపోయిందని ముందు బెంచీ వాళ్లు నవ్వారేమో. నత్తిగా మాట్లాడతాడని వెనక నుంచి ‘సౌండ్’ చేస్తున్నారేమో. లంచ్టైమ్లో వాడి బాక్స్ లాగేసి పరిగెత్తారేమో. వాడి సైలెన్స్ కు కారణం చదువురాక కాదు, భయం. ఇలా బాధ పడుతున్న పిల్లలను ఎలా కనిపెట్టాలి? క్లాస్లో గ్రూప్ యాక్టివిటీ ఇవ్వండి. ‘ఇష్టమైన వాళ్లతో గ్రూప్ చేసుకోండి’ అనండి. మీరే లెక్కపెట్టి గ్రూప్స్ విడదీయండి. అప్పుడు ఒకరిద్దరు మిగులుతారు. అంటే వారిని అందరూ కలిసి సైడ్ చేశారన్నమాట. అలాంటి పిల్లలతో విడిగా మాట్లాడండి. ‘నీకు ఏమైనా ప్రాబ్లమా?’ అని డైరెక్ట్గా అడగొద్దు. ‘నీకు ఏ గేమ్ ఇష్టం?’ అని స్టార్ట్ చేయండి. నమ్మకం వస్తే నిజం చెప్తాడు. చివరి బెంచీ సైలెన్స్ ని మీరు బ్రేక్ చేస్తే, వాడి లైఫ్లో ఫస్ట్ సౌండ్ మీరే అవుతారు.→ ‘కంప్లయింట్ బాక్స్’ ఉండాలి‘మా క్లాస్లో అందరం బాగున్నాం సార్’ అని పిల్లలంతా అంటారు. ఎందుకంటే బుల్లీ చేసేవాడి ముందు ఎవరూ నోరు విప్పరు. అందుకే క్లాస్లో ఒక ‘మాటల డబ్బా’ పెట్టండి. పేరు అవసరం లేదు. చీటీ మీద ‘నన్ను ఎవరో కొడుతున్నారు’ అని రాసి వేసినా చాలు. ‘ఫలానా వాడు నా పెన్ విరగ్గొట్టాడు’ అని రాసినా చాలు. వారానికి ఒకసారి మీరు మాత్రమే ఆ డబ్బా ఓపెన్ చేయండి. పేర్లు బయటికి చెప్పొద్దు. కానీ ఆ తప్పు చేసిన వాడిని విడిగా పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వండి. ‘ఇది తప్పురా. మళ్లీ చేస్తే ప్రిన్సిపాల్కి చెప్పాల్సి వస్తుంది’ అని వార్నింగ్ ఇవ్వండి. బాధ పడ్డ పిల్లాడికి ‘నేనున్నా’ అనే ధైర్యం ఇవ్వండి. ‘కంప్లైంట్ బాక్స్ అంటే మన స్కూల్ పరువు పోతుంది’ అని కొందరు అంటారు. కానీ నిజం ఏంటంటే, ఆ డబ్బా ఉండబట్టే పరువు నిలబడుతుంది. ఎందుకంటే సమస్యని దాచిపెడితే పెద్దదవుతుంది. బయటికి తీస్తే పరిష్కారం అవుతుంది. టీచర్గా మీరు కోర్ట్ కాదు, కౌన్సెలింగ్ సెంటర్.→ వేధించే పిల్లాడిని ఏం చేయాలి?బుల్లీ చేసిన పిల్లాడి పేరెంట్ని పిలిపించడం ఈజీ. కానీ మాట్లాడటం కష్టం. ఎందుకంటే ‘మా వాడు అలాంటోడు కాదు’ అని వాళ్లు ముందే డిఫెన్స్ లోకి వస్తారు. అందుకే ఈ మూడు రూల్స్ పాటించాలి.నేరం మోపొద్దు: ‘మీ అబ్బాయి రౌడీలా తయారయ్యాడు’ అనకండి. ‘క్లాస్లో ఒక సంఘటన జరిగింది. మీ అబ్బాయి కూడా అందులో ఉన్నాడు. మనం కలిసి సరిచేద్దాం’ అనండి. ‘మనం’ అనే మాట వాళ్లకి మీరు విలన్ కాదు, ఫ్రెండ్ అని అనిపిస్తుంది.పిల్లాడి ముందు పంచాయితీ వద్దు: పేరెంట్ని, పిల్లాడిని కలిపి కూర్చోబెట్టి ‘ఏరా నువ్వు చేశావా?’ అని అడగొద్దు. వాడు భయంతో ‘లేదు’ అంటాడు లేదా మొండిగా ‘అవును’ అంటాడు. ముందు పేరెంట్తో విడిగా మాట్లాడండి. తర్వాత పిల్లాడితో విడిగా మాట్లాడండి.సొల్యూషన్ తో ముగించండి: ‘ఇంకోసారి చేస్తే టీసీ ఇచ్చేస్తాం’ అని బెదిరించొద్దు. ‘మీవాడికి ఊపు ఎక్కువ. సాయంత్రం ఆటలకి పంపించండి. ఎనర్జీ అక్కడ రిలీజ్ అవుతుంది’ అని సలహా ఇవ్వండి. మీరు పేరెంట్కి శత్రువు కాదు, వాళ్ల పిల్లాడి భవిష్యత్తుకి మీరు పార్టనర్ అని ప్రూవ్ చేయండి. అప్పుడే ఇంటిదగ్గర కూడా మార్పు వస్తుంది.→ చివరిమాటక్లాస్లో 40 మంది పిల్లలుంటే వారు 40 మార్కుల లిస్టులు కాదు, మనసులని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ బెంచీ పిల్లాడి కంట్లో భయం, ఫస్ట్ బెంచీ పిల్లాడి కళ్లలో అహంకారం రెండూ డేంజరే. రెండిటికీ మందు మీ దగ్గరే ఉంది. అదే ‘పట్టించుకోవడం’. పాఠం మొదలుపెట్టే ముందు, ఒకసారి క్లాస్ మొత్తం చూడండి. ఎవరి మొహంలో బెరుకు ఉందో కనిపెడితే చాలు. బెంచీల మధ్య దూరం పోతుంది. అప్పుడు బ్లాక్బోర్డ్ మీద మీరు ఏం రాసినా వాళ్ల గుండెల్లోకి చేరుతుంది. ఎందుకంటే సేఫ్గా ఫీల్ అయిన పిల్లాడే షార్ప్గా నేర్చుకుంటాడు. -
తొలిరోజే తడ‘బడి’!
సాక్షి, అమరావతి: కానరాని స్టూడెంట్ కిట్లు.. ఊసేలేని ‘తల్లికి వందనం’ దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభం అవుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కనీస అవసరాలను సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితులను చంద్రబాబు సర్కారు కల్పించింది. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లు హామీని అటకెక్కించింది. కనీసం అందరికీ పుస్తకాలైనా అందించకుండా సర్దుకోమంటోంది. రాష్ట్రంలో మొత్తం 62 వేల పాఠశాలలు ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులుండగా అదే అంచనాతో ఈ ఏడాది పుస్తకాల ముద్రణ చేపట్టారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ సాధ్యం కాదని ఇటీవల ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసింది. గతేడాది కిట్లలో విద్యార్థులకు సరిపోని బూట్లు, బెల్టులు, మిగిలిన యూనిఫారం క్లాత్ను కొన్ని మండలాల్లో సర్దుబాటు చేశారు. తొలిరోజే ఇస్తామని గొప్పలు చెప్పి... జూన్ 12న బడులు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు కిట్లను అందిస్తామని గతంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమవల్ల కాదని ప్రకటించింది. గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ లాంటి ముడి పదార్థాల కొరతను సాకుగా చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జగనన్న విద్యా కానుక’ పేరును మార్చేసి మొదటి ఏడాది (2024 జూన్) వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన కిట్లను ఇచ్చింది. 2025 వచ్చేసరికి ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లిస్తేనే కిట్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. దాంతో అధికారులు తమ సొంత హామీతో కిట్లు తీసుకొచ్చి ఆగస్టు తర్వాత పంపిణీ చేశారు. ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేయడంతో ఈ ఏడాది కిట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. తమకు రెండేళ్లకు సంబంధించి రూ.1372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్లో పాల్గొనలేమని ఆయా కంపెనీలు తేల్చి చెప్పాయి. ఇక 2026–27 విద్యా సంవత్సరంలో 35 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని అంచనాలు రూపొందించారు. ముద్రణ సమయంలో సర్కారు పిల్లిమొగ్గలు వేయడంతో పాటు ఇంటర్ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ లీకేజీ స్కామ్కు కారణమైన ప్రైవేటు ముద్రణ సంస్థ వీజీఎస్కు భారీగా కాంట్రాక్టు కట్టబెట్టారు. సకాలంలో ప్రింటింగ్ పూర్తి చేయకపోవడంతో ఇప్పటికీ చాలా మండలాలకు పుస్తకాలు చేరలేదు. గతేడాది మిగిలిపోయినవే దిక్కు.. – సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లో 1,40,012 యూనిఫారాలు అవసరమైతే 20,618 మాత్రమే అందించారు. కుప్పం, శాంతిపురం మండలాలకు సరఫరా చేశారు. షూలు, బ్యాగులు లేవు. 80 వేల మందికి నోటు పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా 70 వేల మందికి మాత్రమే వచ్చాయి. పాఠ్యపుస్తకాలు సైతం 10 శాతం పెండింగ్. వర్క్బుక్స్ ఒక్కటీ రాలేదు. – విజయనగరం జిల్లాలో 27 మండలాలు ఉండగా ఆరు మండలాలకు పాత యూనిఫారం ఇచ్చారు. పుస్తకాలు 11 మండలాలకు పుస్తకాలు రాలేదు. పాత బూట్లు కొన్ని మండలాలకు సర్దుబాటు చేశారు. – ఎన్టీఆర్ జిల్లాలో కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే స్కూళ్లకు చేరాయి. – కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ మాత్రమే వచ్చాయి. యూనిఫామ్ 4 మండలాలకు, నోట్ బుక్స్ 9 మండలాలకు, పిక్టోరియల్ డిక్షనరీలు 8 మండలాలకు మాత్రమే వచ్చాయి. – పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని టైటిల్స్ కలిపి 4.80 లక్షల పుస్తకాలు అవసరముంటే 4 లక్షలు మాత్రమే అందించారు, వర్కుబుక్స్ మాత్రం అందలేదు. బ్యాగులు, బెల్టులు, బూట్లు లేనేలేవు. – కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాలకు యూనిఫారం లేదు, 1.20 లక్షల మంది విద్యార్థులకు బూట్లు ఆర్డర్ పెట్టగా, 25 వేల మందికి 8 మండలాల్లో పాక్షికంగా సరఫరా చేశారు. బెల్టులు కూడా 10 శాతం సరఫరా చేశారు. జగన్ ప్రభుత్వంలో చదువులకు భరోసా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ఏటా స్కూళ్లు తెరిచిన మొదటి రోజే టంచన్గా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లి‹Ù–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్ను మొదటి రోజే విద్యార్థుల చేతికందేది. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమచేసి పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచారు. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం’ అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం పూర్తిగా ఎగరగొట్టారు. -
టిఫిన్ బాక్స్లో గొడ్డు మాంసం.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
గోల్పారా: అస్సాంలోని గోల్పారా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బాక్స్లో గొడ్డు మాంసం (బీఫ్) తీసుకువచ్చిన ఉదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. క్లాస్మేట్స్కు ఈ ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఐదుగురు ముస్లిం విద్యార్థులను పాఠశాల నుండి బహిష్కరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఘటన స్థానికంగా మతపరమైన వివాదంగా మారడంతో పోలీసులు, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగాల్సి వచ్చింది.తల్లి అరెస్ట్.. మైనర్ బాలుడి నిర్బంధంకృష్ణాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు జూన్ 5వ తేదీన తమ టిఫిన్ బాక్స్లోని గొడ్డు మాంసాన్ని ఇద్దరు హిందూ సహచర విద్యార్థులకు తినిపించడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హిందూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, మతపరమైన నమ్మకాలను దెబ్బతీశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే టిఫిన్ తెచ్చిన మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతని తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు బాలురను విచారిస్తున్నారు.స్కూల్ మేనేజ్మెంట్ సంచలన నిర్ణయంమొదట ఈ వివాదాన్ని పాఠశాల పరిధిలోనే పరిష్కరించాలని ఉపాధ్యాయులు భావించినప్పటికీ, విషయం గ్రామంలో తెలియడంతో స్థానిక సంస్థలు, ప్రజలు పాఠశాల వద్దకు భారీగా చేరుకుని నిరసనలు చేపట్టారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు సుబ్రతా దాస్ మాట్లాడుతూ.. మంగళవారం జరిగే ప్రత్యేక సమావేశంలో ఆ ఐదుగురు విద్యార్థులను పాఠశాల నుండి శాశ్వతంగా బహిష్కరించే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. మెజారిటీ సభ్యులు బహిష్కరణకే మొగ్గు చూపినట్లు ఆయన తెలిపారు.మాంసాహారంపై నిషేధం విధించిన కలెక్టర్ఈ ఘర్షణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రదీప్ తిముంగ్, ఎస్ఎస్పీ నవనీత్ మహంత పాఠశాలను సందర్శించి శాంతిభద్రతలను సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు స్కూల్ టిఫిన్ బాక్సులను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులు గరిష్టంగా కోడిగుడ్లు మాత్రమే తెచ్చుకోవచ్చని, చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.ఇది కూడా చదవండి: యూసుఫ్ పఠాన్కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్! -
డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్ గోల.. యూటర్నే శరణ్యం
సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థకు సంబంధించిన వరుస వివాదాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనంలో పారదర్శకత, భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలకు దిగుతూ పరీక్షా వ్యవస్థలో సంస్కరణలకు డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో సీబీఎస్ఈ ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు విద్యా రంగాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఈ అంశం పలు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివాదాలకు కారణమైన కోఎంప్ట్ సంస్థ పనితీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ సంస్థకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ సమాధానపత్రాల ఆన్లైన్ మూల్యాంకన కాంట్రాక్టును అప్పగించడం మరింత వివాదానికి దారితీసింది. మూల్యాంకనంలో పొరపాట్లు, సాంకేతిక లోపాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలపై అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు బట్టబయలు కావడంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం రావడం లేదు. ఫ్యాక్ట్చెక్ పేరుతో ఇస్తున్న సమాచారంలో డొల్లతనాన్ని అభ్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు కౌంటర్ ఇవ్వలేక తడబడుతున్నారు. బాధితులు నేరుగా రోడ్డెక్కి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాన్ని కడిగి పారేస్తున్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ పోస్టులను సంతలో సరుకులా రేటు కట్టి అమ్ముకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పేట దాడి పెరగడంతో పాటు పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం చివరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఫలితంగా పాలిటెక్నిక్ సమాధానపత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్ విధానంలో కాకుండా సంప్రదాయ ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. తప్పుల మీద తప్పులు చేస్తున్న సర్కారు రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని విద్యాశాఖ తప్పుల మీద తప్పులు చేస్తుండడంతో పాలిటెక్నిక్లో వార్షిక పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గందరగోళంగా మార్చేసింది. వారానికో విధానం అమలు చేస్తూ భారీగా నిధులు ఖర్చు చేస్తూ ఫలితాల ప్రకటనపై పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ ఏడాది కొత్తగా వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ‘‘ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వాల్యూయేషన్’’ (ఓఎస్ఎం) ప్రక్రియను ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. ఒక్కో ఎగ్జామినర్ 24 గంటల సమయంలో ఎన్ని జవాబు పత్రాలైనా మూల్యాంకనం చేసుకునేలా అధికారులు అవకాశం ఇచ్చారు. ఓఎస్ఎం విధానంలో తప్పులు జరుగుతున్నాయని మే 18న ‘ఇదేం టెక్నిక్ మహాశయా?’ పేరుతో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసింది. దీంతో ఓఎస్ఎం ఎంతో ఉత్తమ విధానమంటూ వివరణ ఇచ్చిన అధికారులు.. సాంకేతికంగా పరిజ్ఞానం అందించిన ‘కోఎంప్్ట’ సంస్థను వెనుకేసుకొచ్చారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఉన్నఫళంగా ఆన్లైన్ మార్కుల విధానాన్ని పక్కనబెట్టి ‘తూచ్.. ఇది పైలట్’ మాత్రమేనని మాట మార్చడం గమనార్హం. అంతేగాక మళ్లీ మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని, అదీ.. ఒకే ఒక్క వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఏ దరికి చేరతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కోఎంప్ట్ ఇన్ఫ్రాకు రూ.కోట్లు చెల్లింపు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎస్బీటీఈటీ) 2025–26 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆన్స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వ్యాల్యూయేషన్ (ఓఎస్ఎం) సాంకేతిక పరిజ్ఞానాన్ని కోఎంప్ట్ సంస్థ నుంచి తీసుకున్నారు. ఇదే సంస్థ సీబీఎస్ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా నిర్వహించి బొక్కబోర్లా పడింది. ఈ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఉన్నత విద్యాశాఖలో సాంకేతిక విద్యాశాఖ విలీన సమయంలో ‘కోఎంప్ట్’ సంస్థకు రూ.కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ ఏడాది మొత్తం 7.05 లక్షల స్క్రిప్టుల మూల్యాంకన ప్రక్రియను ఓఎస్ఎం విధానంలో చేపట్టారు. ఒక్కో స్క్రిప్టు మూల్యాంకనం చేసేందుకు రూ.18 చొప్పున ఎగ్జామినర్లకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రోజుకు 40 నుంచి 45 పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉండగా, 100కు పైగా స్క్రిప్టులు చేయించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధానంలో విద్యార్థులకు నష్టం జరుగుతోందని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో ఉత్తమ విధానంపై బురద జల్లుతున్నారని ఖండించారు.తాజాగా మాన్యువల్ మూల్యాంకనంపాలిటెక్నిక్ వార్షిక పరీక్షల ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని ఆన్లైన్ విధానంలో మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, ఇప్పుడు ఆ మార్కులను పక్కనబెట్టి, మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయాలని, అదీ వారం రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై తీవ్ర విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా 7 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్ను ఫణంగా పెట్టి, ఇప్పుడు ఆ మార్కులు చెల్లవని, మాన్యువల్ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై ఎస్బీటీఈటీ కార్యదర్శిని వివరణ కోరగా సమాధానం దాటవేయడం గమనార్హం. -
‘లింగ వివక్ష బస్సులు’.. ఉచిత బస్సులపై రచ్చ!
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం మహిళలు, విద్యార్థినులకు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. 2026, జూన్ 15 నుంచి అమలు కానున్న ఈ పథకాన్ని ఎల్డీఎఫ్ (డీఎల్ఎప్) కూటమి భాగస్వామ్య పక్షమైన కేరళ కాంగ్రెస్ (ఎం) ఛైర్మన్ జోస్ కె. మణి స్వాగతించారు. అయితే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కేవలం అమ్మాయిలకే పరిమితం చేయడం వల్ల విద్యార్థుల మధ్య లింగ వివక్ష తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక వర్గానికే కాకుండా, అబ్బాయిలకూ ఈ ఉచిత సౌకర్యాన్ని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తి చేశారు.విద్యార్థుల్లో వివక్ష వద్దు పాఠశాలలు, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించేటప్పుడు అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఎలాంటి తేడాలు చూపడం లేదని జోస్ కె. మణి గుర్తుచేశారు. కేవలం రవాణా సౌకర్యం విషయంలోనే ఇలాంటి భేదాలు చూపడం సమంజసం కాదని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్, వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఒకే తరగతిలో కలిసి చదువుకునే విద్యార్థుల్లో ఒకరికి ఉచిత ప్రయాణం, మరొకరికి కాదనడం వల్ల వారి మధ్య తారతమ్యాలు ఏర్పడతాయని, అందువల్ల లింగభేదం లేకుండా విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.ఉచిత రవాణా ఒక పెట్టుబడి విద్యా రంగంలో కేరళ ఎప్పుడూ ముందుంటుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఉచిత రవాణా విధానాన్ని తీసుకురావాలని జోస్ కె. మణి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 33 లక్షల మంది విద్యార్థులు వివిధ ప్రయోజనాలను పొందుతున్నారని, దీనికి అదనంగా ఇల్లు - పాఠశాల మధ్య ఉచిత ప్రయాణ గ్యారంటీని కూడా జోడించాలన్నారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆర్థిక భారంగా భావించకూడదని, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని ఆయన హితవు పలికారు.కేఎస్ఆర్టీసీ ముందడుగు వేయాలి ఈ ఉచిత ప్రయాణ విధానాన్ని ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులకూ వర్తింపజేయాలని జోస్ కె. మణి సూచించారు. ప్రస్తుతానికి ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ పథకాన్ని విస్తరించడం సాధ్యం కాకపోతే, కనీసం కేఎస్ఆర్టీసీ బస్సుల్లోనైనా హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ తక్షణమే ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చదువుకోవడానికి రవాణా అనేది ఒక ముఖ్యమైన అవసరమని, ఇల్లు దాటి విద్యాసంస్థకు వెళ్లి, మళ్లీ సురక్షితంగా ఇళ్లకు చేరుకునే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే భరించాలని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: సురేష్ గోపీ రాజీనామా?.. సస్పెన్స్కు ఎండ్ కార్డ్! -
కొత్త కోర్సుల్లేవా దోస్త్?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కన్పించడం లేదు. మండలి, సాంకేతిక విద్య అధికారుల మధ్య వివాదమే దీనికి ప్రధాన కారణం. ఇంజనీరింగ్ విద్యకు సమాంతరంగా మండలి రూపొందించిన కోర్సులను సాంకేతిక విద్య కమిషనరేట్ ఆపివేసింది. డిగ్రీ ద్వారా ఈ కోర్సులు చేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతోనే అత్యధిక వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందే వీలుంది. అంతర్జాతీయంగా బహుళ జాతి కంపెనీల్లోనూ పేద విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా రూపొందించారు.ఈ కోర్సులపై ఏడాదిగా ఉన్నత విద్యా మండలి విస్తృత ప్రచారం చేపట్టింది. రూ. లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్లో యాజమాన్య కోటా సీటు పొందేకన్నా ఎమర్జింగ్ కోర్సులున్న డిగ్రీ విద్యను ఎంచుకోవాలని విద్యార్థులు సైతం ఆశపడ్డారు. వీటివల్ల బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు వస్తాయని భావించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యా మండలి ద్వారా కోర్సుల వివరాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆసక్తి చూపడంతో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో మండలి చైర్మన్ సమావేశం ఏర్పాటు చేసి కోర్సుల నిర్వహణకు ఒప్పించారు.బీవోఎస్ అనుమతులు ఆపిందెవరు?కొత్త కోర్సులు, సిలబస్ను రూపొందించేప్పుడు ప్రతీ యూనివర్సిటీ పరిధిలోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇందులో విశ్వవిద్యాలయం అధికారులతో పాటు బయట నుంచి పారిశ్రామిక నిపుణులు, వ్యాపారవేత్తలూ ఉంటారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో సిలబస్, కోర్సుల రూపకల్పనపై ఈ బోర్డు చర్చిస్తుంది. కోర్సులపై ఏడాదిగా కసరత్తు జరుగుతున్నా, యూనివర్సిటీలు మాత్రం బీవోఎస్ సమావేశాలు నిర్వహించలేదు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి కారణంగానే తాము ముందుకు వెళ్ళడం లేదని పలు వర్సిటీల వీసీలు తెలిపారు.ఈ విషయమై ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంను వివరణ కోరగా బీవోఎస్లోని సభ్యులు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరని, అందుకే సమావేశం నిర్వహించలేదని తెలిపారు. ఇది సహేతుక కారణమే కాదని, సాంకేతిక విద్య అధికారుల ఒత్తిడే దీని వెనుక పని చేసిందని మండలి వర్గాలు అంటున్నాయి. అయితే కొన్ని వర్సిటీల నుంచి బీవోఎస్ అనుమతులు వచ్చాయని, వీటిని విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే దోస్త్ రెండో ఫేజ్ ఇప్పటికే పూర్తయింది. మూడో విడత నడుస్తోంది. ఇది కూడా ఈ నెల 16తో ముగుస్తుంది. అయినా కొత్త కోర్సులపై పంచాయితీ ఇప్పటికీ తెగకపోవడం, ఆన్లైన్లోకి ఇవి రాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.ఇంజనీరింగ్కు దీటుగా..డేటాసైన్స్, ఏఐఎంఎల్, డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ (ఆనర్స్) వంటి కోర్సులను డిగ్రీలో ప్రతిపాదించారు. వీటి బోధన ప్రణాళిక మొత్తం ఇంజనీరింగ్ విద్యతో సమానంగా రూపొందించారు. శరవేగంగా దూసుకొస్తున్న ఇ–కామర్స్ కోసం ఫైనాన్స్ టెక్నాలజీతో పాటు, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను సైతం ప్రతిపాదించారు. ఈ మేరకు ఏడాదిగా కసరత్తు చేసిన ఈ కోర్సులను ఆపలేమని కౌన్సిల్ చెప్పడంతో సాంకేతిక విద్య ఉన్నతాధికారి బీవోఎస్ నివేదికలు ఇవ్వొద్దని వీసీలపై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రైవేటు కాలేజీల నుంచి భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.అసలు కారణం ఏమిటి?ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. యాజమాన్య కోటా సీట్లు రూ. 10 నుంచి రూ. 20 లక్షల వరకూ పలుకుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సుల వల్ల ఉపాధి అవకాశాలు అంతగా ఉండటం లేదు. తాజాగా మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఇంజనీరింగ్ విద్యకు దీటుగా, మెరుగ్గా ఉండే వీలుంది. అందువల్ల విద్యార్థులు డిగ్రీ కోర్సులకు వెళ్తే ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్లు నిండటం కష్టం. దీంతో యాజమాన్యాలు లాబీయింగ్ చేసి కోర్సులు ఆపాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలతో సాంకేతిక విద్య అధికారులు సంప్రదింపులు జరపడం, కౌన్సిల్పై కోర్సులు ఆపమని ఒత్తిడి చేయడం వివాదానికి కారణమైంది. -
విద్యార్థులకు ఓఎస్ఎమ్ షాక్...
సాక్షి, ఎడ్యుకేషన్ డెస్క్: సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎమ్) విధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫలితాల తర్వాత తక్కువ మార్కులు, ఆన్సర్ షీట్ల స్కానింగ్ సమస్యలు, రీవాల్యుయేషన్పై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆన్సర్ షీట్లు మారిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. మరోవైపు డిజిటల్ మూల్యాంకనం పారదర్శకతను పెంచుతుందని సీబీఎస్ఈ చెబుతోంది.ఈ వివాదం ఇప్పు డు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో పెద్ద చర్చకు దారితీసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026లో క్లాస్–12 బోర్డు పరీక్షల మూల్యాంకనంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనినే ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎమ్) అంటున్నారు. ఇప్పటి వరకు టీచర్లు విద్యార్థుల ఆన్సర్ పేపర్లను పరిశీలించి మార్కులు వేసేవారు. కానీ ఇప్పుడు ఆ పేపర్లను స్కాన్ చేసి కంప్యూటర్లో అప్లోడ్ చేసిన తర్వాత చూసి మార్కులు వేస్తున్నారు. స్కానింగ్పై పెరుగుతున్న అనుమానాలు ఈ వివాదంలో మరింత ఆందోళన కలిగించిన అంశం ‘‘అన్సర్ షీట్లు మారిపోయాయి’ అనే ఆరోపణలు. కొంతమంది విద్యార్థులు తమ చేతిరాతలా లేదని, కొన్ని పేజీలు కనిపించలేదని, డయాగ్రామ్లు బ్లర్గా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. రీవాల్యుయేషన్ తర్వాత మార్కుల్లో భారీ మా ర్పులు రావడం కూడా అనుమానాలకు బలం చేకూర్చింది. అయితే ఇప్పటి వరకు భారీగా ఆన్సర్ షీట్లు మారిపోయా యని నిర్ధారించే అధికారిక ఆధారాలు వెలుగులోకి రాలేదు. సాంకేతిక సమస్యలూ చర్చలోకి.. విద్యార్థుల ఫిర్యాదుల్లో.. పోర్టల్ స్లోగా పనిచేయడం, ఓటీపీ ఆలస్యం, రీవాల్యుయేషన్ చెల్లింపుల సమస్యలు, లాగిన్ ఇబ్బందులు లాంటివి కూడా ఉన్నాయి. ఇక ఒక యువ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు పరీక్షా పోర్టల్లో భద్రతా బలహీనతలు ఉన్నాయని పేర్కొనడం మరింత చర్చకు దారితీసింది. అయితే సీబీఎస్ఈ మాత్రం అసలు మూల్యాంకన వ్యవస్థ సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది. రాజకీయ రంగు కూడా ఈ వ్యవహారం రాజకీయ చర్చకూ దారి తీసింది. ప్రతి పక్షనేత రాహుల్ గాంధీ ఓఎస్ఎం టెండర్ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తగా.. కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్ఈ వాటిని ఖండించాయి. ‘‘కొన్ని ప్రారంభ సమస్యలు ఉండొచ్చు.. అవసరమైతే సరిదిద్దుతాం’ అని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నిజంగా వ్యవస్థ విఫలమైందా? విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వివాదాన్ని రెండు కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు డిజిటల్ మూల్యాంకనంలో సాంకేతిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ స్కానింగ్ నాణ్యత కీలకం. స్పష్టమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ అవసరం. మరోవైపు జాతీయ స్థాయి పరీక్షల్లో మూల్యాంకనం కఠినతరం అవుతోంది. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు పెరుగుతున్నాయి. స్ట్రక్చర్డ్ ఆన్సర్స్కు ప్రాధాన్యం పెరుగుతోంది. అంటే ప్రతి తక్కువ మార్కును సిస్టమ్ తప్పిదంగా చూడలేమని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులకు కొత్త సవాలు.. ఈ పరిణామం విద్యార్థులకు కూడా కొత్త పాఠాన్ని నేర్పుతోంది. భవిష్యత్తులో... స్పష్టమైన చేతిరాతతో పాయింట్ల రూపంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. డయాగ్రామ్లు స్పష్టంగా ఉండాలి. కీవర్డ్ ఆధారిత రాత మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. డిజిటల్ దిశగా అడుగులు.. భారత విద్యా వ్యవస్థ వేగంగా డిజిటల్ మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఆన్స్క్రీన్ మార్కింగ్ కూడా ఆ మార్పులో భాగమే. అయితే సాంకేతికతతో పాటు విద్యార్థుల నమ్మకం, పారదర్శకత, వేగవంతమైన ఫిర్యాదు పరిష్కారం కూడా అంతే ముఖ్యం. ఓఎస్ఎం వివాదం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. డిజిటల్ వ్యవస్థలు ఎంత ఆధునికమైనా.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంశంలో ఖచ్చితత్వం, నమ్మకం అత్యంత కీలకం!! ఓఎస్ఎం అంటే ఏమిటి? ఇప్పటి వరకు అన్సర్ పేపర్లను భౌతిక రూపంలోనే టీచర్లు పరిశీలించేవారు. కొత్త విధానంలో మాత్రం విద్యార్థుల ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి డిజిటల్ కాపీలుగా మార్చి కంప్యూటర్ స్క్రీన్పై పరిశీలిస్తున్నారు. మార్కులు నేరుగా సిస్టమ్లో నమోదు అవుతున్నాయి. సీబీఎస్ఈ ప్రకారం–ఈ విధానం వల్ల మార్కుల లెక్కల్లో పొరపాట్లు తగ్గుతాయి, మూల్యాంకనం వేగవంతం అవుతుంది, పారదర్శకత పెరుగుతుంది, పర్యవేక్షణ సులభమవుతుంది. అయితే ఫలితాల విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. తక్కువ మార్కులపై అసంతృప్తి ⇒ ఫలితాలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో వేలాది పోస్టులు కనిపించాయి. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఆశించిన మార్కులు రాలేదని అనేక మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు ‘‘సమాధానాలు సరిగానే రాసినా మార్కులు తగ్గించారు’ అని ఆరోపిస్తుండగా.. మరికొందరు... ’డిజిటల్ మూల్యాంకనం చాలా కఠినంగా జరిగింది’’అని అంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం కీవర్డ్స్కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఉండొచ్చు. స్టెప్ మార్కింగ్ తగ్గి ఉండొచ్చు. పాత విధానంలో ఉండే లీనియెన్సీ తగ్గి ఉండొచ్చు. అయితే దీనిపై సీబీఎస్ఈ మాత్రం ‘‘మార్కింగ్ విధానం మారలేదు... కేవలం మూల్యాంకన మాధ్యమం మాత్రమే మారింది’ అని చెబుతోంది. -
సీబీఐతో విచారించాలి
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు దగా చేసిందని టీచర్ పోస్టుల అభ్యర్థులు, నిరుద్యోగులు భగ్గుమన్నారు. డీఎస్సీ అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025లో అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి పోరుకు భారీ స్పందన వచి్చంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు, టీచర్ అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సరి్టఫికెట్లతో ఎంపికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైనట్లు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. శుక్రవారం గుంటూరులో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి వినతి పత్రం సమర్పించారు. పూర్తిగా పారదర్శకత లోపించిన మెగా డీఎస్సీ తంతులో పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం లాంటి అనేక అవకతవకలు జరిగాయని పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డబ్బులు వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా, నగర అధ్యక్షులు అంబటి రాంబాబు, షేక్ నూరిఫాతిమా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నేతలు పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ..⇒ పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.⇒ బాపట్లలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.⇒ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ శ్రేణులతో కలసి పాల్గొన్నారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని నినదించారు.⇒ డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు.⇒ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచేశారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు శశిదీప్, నియోజవర్గ అధ్యక్షులు సద్ధాం ఆరోపించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వ్యతిరేకంగా నినదించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నారా లోకే‹శ్మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.⇒ ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్దవైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ్ నేతృత్వంలో దగాడీఎస్సీపై నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్,సమన్వయకర్తలు తిప్పల దేవాన్రెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు.⇒ మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం విగ్రహం నుంచి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించింది. సకల శాఖా మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.⇒ కాకినాడలో వైఎస్సార్సీపీ విద్యారి్థ, యువజన విభాగాల ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.⇒ ఒంగోలులో నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహా్మనందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు.⇒ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాల్లో ‘విద్యార్థి పోరు’ పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.⇒ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించడంతో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అక్కడకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును⇒ చంద్రబాబు సర్కారుకు డీఎస్సీపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యముందా అని వైఎస్సార్సీపీ నేతలు నిలదీశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినా‹Ù, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, లోకేశ్ డౌన్ డౌన్ అంటూ నినదించారు.⇒ దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మలసత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.⇒ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేడ్కర్ సెంటర్, ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి’
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల కు కనెక్టివిటీ నీ కేంద్ర ప్రభుత్వం పెంచిందని తద్వారా ఈశాన్య రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు మరింతగా సాంస్కృతికంగా చేరువయ్యాయని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్-యువ సంగమ్ ఫేజ్-6’ కార్యక్రమంలో భాగంగా మేఘాలయ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) షిల్లాంగ్కు చెందిన 50 మంది విద్యార్థులు గురువారం లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాల పరస్పర అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.యువత దేశ సమైక్యత, జాతీయ సమగ్రత బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి విశేషాలను విద్యార్థులకు అధికారులు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, ఎన్ఐటీ వరంగల్కు చెందిన ప్రొఫెసర్ కిరణ్ కుమార్, సునీల్ కుమార్, ప్రొఫెసర్ పెరుగు శ్యామ్ (కో-నోడల్ ఆఫీసర్), ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి (నోడల్ ఆఫీసర్) పాల్గొన్నారు.గవర్నర్ను కలిసిన ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), ముంబై 28 స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ (ఎస్సీజీ) గ్రూప్ కమాండర్ కల్నల్ అభిషేక్ సింగ్ గురువారం లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. -
ఎస్ఎస్సీ బోర్డు నిర్లక్ష్యం
బేతంచెర్ల: ఎస్ఎస్సీ బోర్డు నిర్లక్ష్యం మరో సారి వెలుగులోకి వచ్చింది. ఇష్టానుసారంగా జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడంతో విద్యార్థుల మార్కులు తలకిందులయ్యాయి. కనీసం రాసిన జవాబులు కూడా మూల్యాంకనం చేయకపోవడం వాల్యూయేషన్ జరిగిన తీరుకు అద్దంపడుతోంది. మరి కొందరికి వచ్చిన మార్కులు కూడా కలపలేదు. తమకు మార్కులు తక్కువ వచ్చాయని రీవాల్యూయేషన్, రీ వెరిఫికేషన్కు పలువురు విద్యార్థులు వెళ్లడంతో బోర్డు వైఫల్యం బహిర్గతమైంది. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకెంత మంది బాధితులు ఉన్నారో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాధానాలు రాసినా.. వదిలేశారు.. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణానికి చెందిన కె.వసుప్రజ్వల (హాల్ టికెట్ నెం.2622123572)కు పదోతరగతి ఫలితాల్లో సోషల్లో 100, గణితం 100, సైన్స్లో 92, తెలుగు 92, హిందీలో 94 మార్కులు రాగా.. ఇంగ్లి‹Ùలో 65 మార్కులే రావడంతో అనుమానం వచ్చింది. దీంతో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేయగా ఏకంగా 11 మార్కులు పెరిగి 76 మార్కులు నమోదయ్యాయి. అనంతరం ఆన్సర్ షీట్ను పరిశీలించగా 36, 37 ప్రశ్నలకు సమాధానాలు రాసినా దిద్దకుండా వదిలేసినట్లు గుర్తించారు. రీవాల్యుయేషనలో 11 మార్కులు పెరగడం ఎస్ఎస్సీ బోర్డు అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మిగిలిన రెండు ప్రశ్నలకు కూడా మార్కులు కేటాయిస్తే తమ కుమార్తెకు మరిన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.12 మార్కులకు గానూ.. 7 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి పెదపూడి సంజయ్ స్వరూప్నకు 558 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్ పేపర్ రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేయగా పేపర్ పీడీఎఫ్ ఫైల్ పంపించారు. అందులో 13వ ప్రశ్నకు 4, 17వ ప్రశ్నకు 8 కలిపి మొత్తం 12 మార్కులు వచ్చాయి. కానీ, టోటల్లో 7 మార్కులు మాత్రమే వేశారు. ఈ విద్యార్థికి 5 మార్కులు కలపాల్సి ఉంది. దీని కోసం విద్యార్థి సంజయ్ స్వరూప్ ఎస్ఎస్సీ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. -
కొత్త కోర్సులతో దోస్తీ కట్
సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంగా కసరత్తు చేసి, విద్యార్థులను ఊదరగొట్టిన పది కొత్త కోర్సులకు మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ ఆన్లైన్ సిస్టమ్ (దోస్త్) నుంచి వీటిని తొలగించారు. ఈ కోర్సుల కోసం ఉన్నత విద్యామండలి వెచ్చించిన లక్షలాది రూపాయలు బూడిదపాలవుతోంది. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశలోకి వెళ్లారు. కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తులు కూడా సమర్పించిన దాదాపు 260 కాలేజీల పరిస్థితి అయోమయంలో పడింది. కొత్త కోర్సుల కోసం ఈ కాలేజీలు ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా వదులుకున్నాయి. కొత్తవి రాక, ఉన్నవి రద్దవ్వడంతో కాలేజీ యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా విభాగం మధ్య కోల్డ్ వార్ దీనికి కారణం. ఈ వ్యవహారాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు కొత్త కోర్సుల రద్దుపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రాజీకి అధికారులు మాత్రం తగ్గేదేలేదంటూ భీషి్మంచుకున్నారు. పెద్ద ఎత్తున నిధులు కొన్నేళ్లుగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నా చేరేవారి సంఖ్య 2.25 లక్షలు దాటడం లేదు. ఇంజనీరింగ్తో సమానంగా డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు ఉన్నత విద్యామండలి ఏడాదిపాటు నిపుణులను నియమించుకుని, దాదాపు రూ.25 లక్షల వరకూ వెచ్చించి, డిగ్రీ కోర్సుల్లో సంస్కరణలను మండలి చేపట్టింది. విస్తృతంగా పరిశోధన జరిపేందుకూ పెద్దఎత్తున నిధులు వెచ్చించింది. ఈ క్రమంలో బీఏ, బీకాం, బీఎస్సీలో ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన బోధన ప్రణాళికనూ సిద్ధం చేశారు. దీనికి అన్ని యూనివర్సిటీలూ ఆమోదం తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 260 కాలేజీలు కొత్త కోర్సులను తెచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులను రద్దు చేసుకుంటామని చెప్పాయి. యూనివర్సిటీలు అదే పనిగా ఈ కోర్సులపై ప్రచారం చేశాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరేందుకు సంసిద్ధమయ్యారు. వర్సిటీలు కూడా దోస్త్ పోర్టల్లో కోర్సులను అప్లోడ్ చేశాయి. వీటన్నింటినీ సాంకేతిక విద్య కమిషనరేట్ ఆపేసింది. దోస్త్ పోర్టల్లో ఆప్షన్లు పెట్టేందుకు వీల్లేకుండా బ్లాక్ చేయడంతో వేలాది మంది విద్యార్థులు అమోమయంలో పడ్డారు. వాస్తవానికి ఈ కోర్సులన్నీ ఈ నెలాఖరుతో ముగిసే రెండో దశ కౌన్సెలింగ్లోకి ఉంటాయని అధికారులు నెల రోజులుగా చెబుతున్నారు. రద్దయిన కోర్సులన్నీ కీలకమైనవే... బీఏ, బీఎస్సీ, బీకామ్ ద్వారా బహుళజాతి సంస్థల్లో గరిష్ట ఉపాధి అవకాశాలు లభించే కోర్సులను ప్రవేశ పెడుతున్నట్టు ఉన్నత విద్యామండలి ఏడాదిగా ప్రచారం చేసింది. బీఏలో సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ల్యాండ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ వంటివి ఉన్నాయి. ఈ కోర్సులను ఇంజనీరింగ్లో పూర్తి చేయాలంటే విద్యార్థి రూ. లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డిగ్రీలో ఈ కోర్సులు చేయడానికి మూడేళ్ల కాలంలో రూ. 50 వేలకు మించి ఖర్చు కాదు. ఇంజనీరింగ్తో సమానంగా ఉపాధి లభించే వీలుంది. బీఎస్సీలోనూ డేటాసైన్స్, ఏఐఎంఎల్, డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ (ఆనర్స్) వంటివి ఉన్నాయి. వీటి బోధన ప్రణాళిక మొత్తం ఇంజనీరింగ్ విద్యతో సమానంగా రూపొందించారు. శరవేగంగా దూసుకొస్తున్న ఇ–కామర్స్ కోసం ఫైనాన్స్ టెక్నాలజీతో పాటు, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను ప్రతిపాదించారు. వీటివల్ల బహుళజాతి సంస్థలో మంచి ఉపాధి వస్తుందని విద్యార్థులు భావించారు. వీటినీ ఇప్పుడు నిలిపివేస్తున్నారు. ఎవరి కోసం ఈ వివాదం? డిగ్రీ కోర్సుల ప్రక్షాళనకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వ్యతిరేకంగా ఉన్నాయి. సమాంతర కోర్సులు ప్రవేశపెడితే ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లకు డిమాండ్ ఉండదనే వాదన తెచ్చాయి. ఈ దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతోపాటు, బలమైన లాబీయింగ్ కూడా నడిచినట్టు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వంలోని కొంతమంది, ఉన్నతాధికారులు కీలకమైన కోర్సుల నిలిపివేతకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ కోర్సులపై ఏడాదిగా ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి, సిలబస్ రూపకల్పన చేస్తున్నప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులూ ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. దోస్త్లో కోర్సులు రాకుండా ఆఖరులో అడ్డుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. -
ఇతిహాసాల్లో ఇంధన సంక్షోభానికి పరిష్కారాలు
రాజ్గిర్: బిహార్లోని నలంద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను, రామాయణ-మహాభారతాలలోని సూత్రాలతో ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. ప్రపంచంలోని 30కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు భారతదేశ పురాణ ఇతిహాసాలను దౌత్యపరమైన ఆయుధాలుగా మలుచుకుంటూ అంతర్జాతీయ సంబంధాల (ఐఆర్పీఎస్) విభాగంలో సరికొత్త విశ్లేషణలు చేస్తున్నారు.ఇతిహాసాలే దౌత్య మార్గదర్శకాలునలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశ్యం మన పురాతన జ్ఞాన సంపదను ఆధునిక ప్రపంచ సమస్యలతో అనుసంధానించడమే. ఒక సంక్షోభ సమయంలో భారతదేశం తన వ్యూహాలను ఎలా రూపొందించుకోవాలి? అగ్రరాజ్యాల మధ్య సంబంధాలను ఎలా నిర్వహించాలి? వంటి ప్రశ్నలకు పురాతన భారతీయ గ్రంథాలు గొప్ప పరిష్కారాలను చూపుతున్నాయని ఆయన వెల్లడించారు.రామాయణం - సుగ్రీవ మైత్రి ఒక వ్యూహంఈ కోర్సులో భాగంగా విద్యార్థులు వివిధ పరిశోధనా పత్రాలను సమర్పిస్తున్నారు. ఉదాహరణకు, ‘రామాయణంలోని కిష్కింధ కాండ’ దౌత్యం, సార్వభౌమాధికారం, నైతికతకు ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ అని ఒక విద్యార్థి తన పరిశోధనలో పేర్కొన్నారు. రాముడు-సుగ్రీవుల మధ్య కుదిరిన మైత్రి కేవలం స్నేహం మాత్రమే కాదు, అది ఆధిపత్యం లేని భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన నాయకత్వానికి ప్రతీక అని విద్యార్థులు వివరిస్తున్నారు.మహాభారతం - నేటి ప్రపంచానికి సరికొత్త పాఠాలుమహాభారతంలోని శ్రీకృష్ణుడి నీతిని, ప్రస్తుత యుద్ధ తంత్రాలతో పోల్చి చూస్తున్నారు. ‘జస్ట్ వార్’ భావనను మహాభారత ఘట్టాలతో అనుసంధానిస్తూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ఉగ్రవాద సంస్థలు లేదా అరాచక శక్తులను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా పురాతన పర్యావరణ పరిరక్షణ పద్ధతుల ద్వారా ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను కూడా వారు చర్చిస్తున్నారు. ప్రపంచం అశాంతితో ఉన్న తరుణంలో, భారతీయ ఇతిహాసాల నుండి తీసుకున్న ఈ పరిష్కారాలు ప్రపంచ శాంతికి బాటలు వేస్తాయని నలంద విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది.ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు -
ఉద్యోగాలపై AI ప్రభావం.. యువతకు పిచాయ్ సందేశం!
కృత్రిమ మేధస్సు (AI) గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువతలో.. విద్యార్థుల్లో ఏఐ తమ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందేమో అనే భయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఇటీవల 'హార్డ్ ఫోర్క్' అనే పాడ్కాస్ట్లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. యువతపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. ఏఐ వల్ల మార్పులు వచ్చినా, కొత్త తరం ఆ సవాళ్లను స్వీకరించి మంచి భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరగబోయే పట్టభద్రుల సభలో పిచాయ్ ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా.. పాడ్కాస్ట్ హోస్ట్ ఏఐ గురించి మాట్లాడితే.. విద్యార్థులు విమర్శిస్తే, ఏమని జవాబిస్తారు? అని సరదాగా ప్రశ్నించారు. 'ప్రతి తరం సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగింది. ఈ తరం కూడా అలాగే సవాళ్లను అధిగమించి మంచి ప్రపంచాన్ని నిర్మిస్తుంది' అని పిచాయ్ సమాధానం ఇచ్చారు.యువత, విద్యార్థులు ఏఐ ప్రభావాన్ని మాత్రమే అనుభవించరు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధిని ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా కూడా మారతారు. వీళ్ళే AI పురోగతికి కారణమవుతారు, దాని ప్రభావాలను కూడా ఎదుర్కొంటారని పిచాయ్ వెల్లడించారు. యువత కొత్త అవకాశాలను సృష్టించే శక్తి కలిగిన వారని ఆయన స్పష్టం చేశారు.ఇటీవల చాలా కంపెనీలు.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఏఐ అని చెబుతున్నారు. దీనివల్ల ఉద్యోగాల భద్రతపై మరింత ఆందోళన పెరిగింది. ముఖ్యంగా కొత్తగా చదువు పూర్తి చేసిన యువతలో నిరుద్యోగం కూడా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు AI గురించి భయపడటం సహజమని పిచాయ్ అంగీకరించారు.టెక్నాలజీలో వచ్చే మార్పులు ఎప్పుడూ సమాజంలో భయాన్ని కలిగిస్తాయి. గతంలో వచ్చిన సాధారణ సాంకేతిక మార్పులకు కూడా ప్రజలు భయపడ్డారు. కానీ.. తరువాత అవే అభివృద్ధికి దోహదపడ్డాయని ఆయన గుర్తుచేశారు. AIను కూడా సరైన విధంగా ఉపయోగిస్తే మానవ సమాజానికి ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు.ఏఐ వల్ల జరిగే నష్టాలను మాత్రమే కాకుండా.. ప్రయోజనాలను కూడా ప్రజలకు స్పష్టంగా చూపించాల్సిన బాధ్యత టెక్నాలజీ రంగంపై ఉందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి బాధ్యతాయుతంగా AIని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు ఇంకా చాలా పని చేయాల్సి ఉందని ఆయన అంగీకరించారు. -
90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్లో ప్రస్తుత విద్యా విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై మాట్లాడుతూ.. నేటి స్కూళ్లు పిల్లలపై అధిక ఒత్తిడి పెంచి వారిని డిప్రెషన్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పిల్లలకు చిన్న వయసులోనే నైతిక విలువలు,సమయపాలన, సర్వైవల్ స్కిల్స్ నేర్పాలి. అలాగే డిజిటల్ డిసిప్లిన్, మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత విద్యా విధానంలో 90% మార్కులు తెచ్చుకున్నా ఆ విద్యార్థికి జీవితంలో దాని ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్, మనోస్థైర్యం, సంస్కారం నేర్పితే వారు మంచి పౌరులుగా తయారవుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ.. ప్రతి సంవత్సరం 13,000–15,000 మంది విద్యార్థులు అకాడమిక్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు కంటే సంస్కారం ముఖ్యం. భవిష్యత్ విద్యావ్యవస్థ పిల్లలకు మనోస్థైర్యం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ నేర్పేలా ఉండాలని పూరీ జగన్నాథ్ కోరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి-విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. దాని తరువాత సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. -
విద్యార్థి'కి' మిత్ర ద్రోహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్ల పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇందుకు ఇరాన్–అమెరికా యుద్ధాన్ని సాకుగా చూపింది. జూన్ 12న బడులు తెరిచిన మొదటిరోజే వీటిని అందిస్తామని ప్రారంభంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకునేందుకు సాకులు వెదుకుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిసరుకు ధరలు పెరిగాయని, ముఖ్యంగా గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ వంటి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఉండడంతో క్రూడ్ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయని చెప్పింది. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని చెబుతోంది. ఇలా కుంటి సాకులతో కేవలం రెండేళ్లకే విద్యార్థి మిత్ర అమల్లో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేతులెత్తేశారు.జగన్ ప్రభుత్వం పుణ్యమాని ‘2024 జూన్’ హ్యాపీ2024 జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా కానుక కిట్ పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ముందుగానే ఆర్డర్ పెట్టిన జగనన్న విద్యాకానుక కిట్లను కూటమి ప్రభుత్వం 2024 జూన్ నెలలోనే సకాలంలో పంపిణీ చేయగలిగింది. ఇది జగన్ ప్రభుత్వం క్రెడిట్ తప్ప, చంద్రబాబు ప్రభుత్వం గొప్పేమీ కాదు. 2025కు వచ్చేసరికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లకు కిట్లు సరఫరా చేయలేమని భీష్మించారు. దాంతో అధికారులు చొరవ తీసుకుని, సరఫరాదారులకు భరోసా ఇచ్చి కిట్లు తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో జూన్ నెలలో ఇవ్వాల్సిన కిట్లు ఆగస్టు దాటినా పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారు. కమీషన్ల కహానీనే..అసలు కారణం 2026–27 విద్యా సంవత్సరానికి 1–10 తరగతుల వరకు 35 లక్షల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇంటర్మీడియట్ వరకు వస్తువులు కొనుగోలు, నాణ్యత పరిశీలన, మండల స్టాక్పాయింట్లకు చేరవేత వరకూ రూ.910 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, రెండేళ్లకు తమకు రావాల్సిన రూ.1,372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్లో పాల్గొనలేమని కంపెనీలు తేల్చి చెప్పాయి. దాంతో ప్రభుత్వం చేసేది లేక గత నెలలో బకాయిలు చెల్లించింది. అయితే, ఇందులో విద్యాశాఖలోని ఓ అత్యున్నతాధికారి 5.5 శాతం కమీషన్ వసూలు చేసినట్టు సమాచారం. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు ఈ ఏడాది కిట్లు, వాటిలోని వస్తువులు ఇవ్వలేమని కరాఖండీగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. కానీ వాస్తవాలను దాచిపెట్టిన ప్రభుత్వం యుద్ధ వాతావరణం సాకుతో కిట్ల పంపిణీని ఎగ్గొట్టే యత్నం చేస్తోంది. తూచా తప్పకుండా జూన్ 12నే జగనన్న విద్యా కానుక పుస్తకాలు, యూనిఫారం కొనలేక తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాను సీఎం కాగానే బడి తెరిచిన మొదటిరోజే జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, సాక్సులు, టైతో సహా ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏటా జూన్ 12న బడులు తెరిచిన తొలిరోజే వీటిని అందించేలా కార్యాచరణ రూపొందించారు. జగనన్న విద్యా కానుక కిట్లో నాణ్యమైన పుస్తకాల బ్యాగ్, స్టిచింగ్ చార్జ్లీతో 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు ఇంగిŠల్ష్– తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ(ఆరోతరగతి), ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ అందించారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వంలో సగటున ఏటా 43 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యా కానుక అందుకున్నారు. కిట్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం: సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావుకిట్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా పాఠశాల పున: ప్రారంభం నాటికే అందజేయాలనే లక్ష్యంతో అన్ని రకాల ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టామని, అయితే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో కిట్ల సరఫరా మరో నెల ఆలస్యం అవుతుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ వంటి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఏర్పడటంతో క్రూడ్ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయన్నారు. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని, దీంతో సరఫరాదారులు కొంత గడువు కోరినట్లు వివరించారు. అయితే, చదువుకు ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో జూన్ 12న బడులు తెరిచే నాటికే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. ‘మెగా పీటీఎం’ నాటికి మిగిలిన వస్తువుల పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
ఏఐతో కంబైన్డ్ స్టడీ!
చదువుకోవడానికి పక్కా టైంటేబుల్ ఉంటే సగం విజయం సాధించినట్లే. ఇందుకోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్ సహాయంతో విద్యార్థులు చాలా తేలికగా, ఒత్తిడి లేకుండా చదువుకొని పరీక్షల్లో పాసైపోవచ్చు. –సాక్షి స్పెషల్ డెస్క్పోమోడోరో టెక్నిక్ గంటల తరబడి బ్రేక్ లేకుండా చదివితే బుర్రకెక్కదు. అందుకే పోమోడోరో టెక్కిక్ అనే ఈ స్మార్ట్ పద్ధతిని పాటించండి. ⇒ 25 నిమిషాలు శ్రద్ధగా చదవండి. ⇒ 5 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోండి (నడవడం, నీళ్లు తాగడం). ⇒ ఇలా 4 సార్లు అయ్యాక, 15–30 నిమిషాలు పెద్ద బ్రేక్ తీసుకోండి. ⇒ ఇతర విషయాలను దూరం పెట్టండి. చదువుకునే సమయంలో ఫోన్ సైలెంట్లో పెట్టి మీకు దూరంగా ఉంచండి. సోషల్ మీడియా నోటిఫికేషన్ మీ సమయాన్ని వృథా చేయకుండా చూసుకోండి. ఎలా చదవాలి? ముందుగా మీ సిలబస్ను ఒక పేపర్పై రాసి, ఏఐ టూల్స్ సాయంతో టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోండి. కళ్ల ముందు స్పష్టమైన ప్లాన్ ఉంటే అయోమయం పోతుంది. ఒకవేళ ఏదైనా రోజు చదవడం కుదరకపోతే, ఏఐ టూల్స్ వాటంతటవే మీ కాల ప్రణాళికను సర్దుబాటు చేస్తాయి. చదువును సులువు చేసే 4 ఏఐ టూల్స్ 1. షోవెల్ యాప్ (స్టడీ ప్లానర్): మీ కాలేజీ సమయాలు, నిద్ర, ఇతర పనులు, సబ్జెక్ట్ డెడ్లైన్ వివరాలను ఇందులో నింపితే మీకు మిగిలిన ఖాళీ సమయాన్ని లెక్కించి ఒక మంచి టైమ్ టేబుల్ ఇస్తుంది. 2. నోషన్ ఏఐ (ఆల్ ఇన్ వ¯న్ ఆర్గనైజర్): గజిబిజిగా ఉన్న సిలబస్ లిస్ట్ను ఇది ఒక చక్కటి పట్టికగా మార్చేస్తుంది. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ట్రాక్ చేయడానికి ఇది మంచి టూల్. 3. చాట్జీపీటీ (పర్సనల్ స్టడీ కోచ్): మీ అవసరానికి తగ్గట్టుగా ప్రణాళిక ఇస్తుంది. ఉదాహరణకు: ‘‘నాకు వచ్చే నెల మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, రోజుకు 2 గంటలే చదవగలను, ప్లాన్ ఇవ్వు’’అని అడిగితే క్షణాల్లో వీక్లీ ప్లాన్ రెడీ చేసి ఇస్తుంది. 4. టుడూఇస్ట్ (స్మార్ట్ టాస్క్ మేనేజర్): ‘‘ఈ వారం హిస్టరీ ప్రాజెక్ట్ చేయాలి, రోజూ సై¯న్స్ రివిజన్ చేయాలి’’అని మీరు సాధారణంగా టైప్ చేస్తే, ఈ ఏఐ వాటి డెడ్లై¯న్ను గుర్తించి క్యాలెండర్లో ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. -
విద్యార్థులకు ప్రభుత్వం షాక్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పిడుగులాంటి వార్త చెప్పింది. విద్యా కానుక కింద విద్యార్థులకందించే యూనిఫాం, షూ, బ్యాగ్ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ మేరకు జూన్ 12 వ తేదీన అందించే విద్యాకానుక కిట్ను అందించలేమని సమగ్రశిక్ష డైరెక్టర్ ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలోనూ గ్యారంటీ లేదని ప్రకటించారు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక భారంతో యూనిఫాం, బ్యాగు, బట్టలు ఇవ్వలేమని తెలిపింది. ఈ పిడుగులాంటి వార్తతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాయాంలో పాఠశాలలు తెరిచే రోజే విద్యా కానుక కిట్ను అందజేసేవారని ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేసి తమ చదువులకు ఆటంకం కలగజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతుంది. గత రెండేళ్లుగా నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన విద్యార్థుల చదువు విషయంలోనూ కూటమి ప్రభుత్వం కోతలు పెడుతుండడంతో సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
గురుకులాలకు ప్రతి నెలా నిధులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోని విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలతో పాటు ప్రైవేటు భవనాల్లో ఉన్న వాటి అద్దెను ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేయనుంది. సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో ఇబ్బందులకు క్రమంగా స్వస్తి పలికేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచే నెలవారీగా నిధులు విడుదల చేయనున్నారు. తాజాగా ఆదివారం రూ.221.24 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల వసతి, విద్యా సౌకర్యాల వాతావరణం మరింత మెరుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు, అద్దె చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల వరకు కూడా నిధులు విడుదల కాని పరిస్థితి ఉండేది. దీనివల్ల గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడటంతో పాటు విద్యార్థుల ఆహారం, వసతి, ఇతర మౌలిక అవసరాలపై ప్రభావం పడేది. ఈ సమస్యలపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం ప్రత్యేక చొరవతో నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించిన విధంగా, తొలుత త్రైమాసిక (క్వార్టర్లీ) ప్రాతిపదికన నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం దానిని మరింత మెరుగుపరిచి నెలవారీ నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. నిధులు సకాలంలో విడుదల కావడం వల్ల విద్యార్థులకు పోషకాహారం నిరంతరాయంగా అందుతుంది. హాస్టళ్ల నిర్వహణ, భవనాల అద్దెల చెల్లింపులు, అవసరమైన సౌకర్యాల కల్పన సులభతరమవుతాయి. ఆదివారం విడుదల చేసిన రూ.221.24 కోట్లలో.. డైట్ చార్జీల కింద రూ.164.37 కోట్లు, కాస్మోటిక్ చార్జీల కింద రూ.22.43 కోట్లు, భవనాల అద్దె కింద రూ.34.44 కోట్లు కేటాయించారు. -
ఇంటర్ రీ కౌంటింగ్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియట్ పబ్లిక్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. మొత్తం 2,432 మంది విద్యార్థులు రీ–కౌంటింగ్కు, 11,883 మంది విద్యార్థులు రీ–వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను bie.ap.gov.inలో చూడవచ్చని ఇంటర్ విద్యా కార్యదర్శి రంజిత్ బాషా బుధవారం తెలిపారు. ఫలితాల్లో ఏమైనా తేడా వస్తే ఇంటర్ విద్య మండలి పోర్టల్ లేదా 93929 11819 నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
అమెరికా కొలువుల స్కామ్.. భారత్లో మూలాలు?
వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) భారీ షాక్ ఇచ్చింది. ఎఫ్-1 (ఎఫ్-1) వీసాతో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కింద ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 10,000 మంది విద్యార్థులు నకిలీ కంపెనీల ఉచ్చులో ఉన్నట్లు దర్యాప్తులో తేలడం తీవ్ర సంచలనంగా మారింది.ఓపీటీ అక్రమాల పుట్టఐసీఈ డైరెక్టర్ టాడ్ ఎమ్ లియోన్స్ ఈ భారీ స్కామ్ వివరాలను వెల్లడిస్తూ, ఓపీటీ ప్రోగ్రామ్ మోసాలకు ప్రధాన కేంద్రంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుష్, ఒబామా హయాంలో కొద్ది మంది కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)ఆధ్వర్యంలో మొదలైన ఈ పథకం.. నేడు లక్షలాది మంది వలస కార్మికులకు అక్రమ దారిగా మారిపోయిందన్నారు. ట్రంప్, బైడెన్ పాలకుల సమయంలో ఈ నకిలీ ఉద్యోగాల మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని, అస్సలు ఉనికిలోనే లేని కంపెనీల్లో వేలాది విద్యార్థులు పనిచేస్తున్నట్లు కల్పిత ఆధారాలు సృష్టించారని ఆయన తెలిపారు. కేవలం టాప్ 25 ఓపీటీ యాజమాన్యాలను పరిశీలించగా, 10 వేల మంది విద్యార్థులు అనుమానాస్పద కంపెనీల్లో ఉన్నట్లు బయటపడిందని, ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని లియోన్స్ అన్నారు. Another great win for our fraud task force. We will not tolerate foreign nationals abusing our visa system at the expense of the American people. https://t.co/smFBgxha3w— JD Vance (@JDVance) May 12, 2026తాళం వేసిన ఆఫీసులు.. గుట్టు రట్టుదర్యాప్తు అధికారులు రంగంలోకి దిగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వందలాది మంది విదేశీ విద్యార్థులు పనిచేస్తున్నారని చెబుతున్న కంపెనీల చిరునామాలకు వెళ్లి చూడగా, అక్కడ కేవలం ఖాళీ భవనాలు, తాళం వేసిన తలుపులు మాత్రమే కనిపించాయి. ఒకే అడ్రస్పై పలు కంపెనీలు రిజిస్టర్ కావడం, ఏ ఒక్కరికీ లీజు అగ్రిమెంట్లు లేకపోవడం, అంతేకాకుండా అంతర్జాతీయంగా అనుమానాస్పద నగదు లావాదేవీలు జరగడం మొదలైనవి అధికారులను విస్మయానికి గురిచేశాయి. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) బృందం టెక్సాస్లో ఇటీవల 18 ఓపీటీ వర్క్సైట్లపై దాడులు చేయగా, ఈ నకిలీ కంపెనీల వెనుక ఉన్న భారీ కుట్ర బట్టబయలైంది. MASSIVE #OPT FRAUD We have identified over 10,000+ foreign students identified with fake jobs. We’re taking it this very seriously. Full video of the @ICEgov director speaking.#F1 #studentvisa pic.twitter.com/8MNysI1apO— M9 USA🇺🇸 (@M9USA_) May 12, 2026తీగ లాగితే ఇండియా డొంకటెక్సాస్ దాడుల్లో బయటపడిన విషయాలు ఈ స్కామ్ తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక వర్క్సైట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓపీటీ విద్యార్థులు ఉన్నారని యాజమాన్యం చెప్పగా, రికార్డుల్లో మాత్రం ఏకంగా 500 మంది ఉన్నట్లు తేలింది. అధికారుల ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని అక్కడి సిబ్బంది.. ఇండియాలో ఉన్న తమ హెచ్ఆర్ (హెచ్ఆర్) ప్రతినిధులను అడగాలంటూ దాటవేశారు. ఈ నెట్వర్క్ అంతా వెబ్సైట్లలో ఒకే విధమైన జాబ్ పోస్టింగులు ఇస్తూ, ముఠాగా ఏర్పడి అక్రమ దందాను నడిపిస్తున్నట్లు నిర్ధారణ అయింది.ఇది కూడా చదవండి: నీట్ స్కామ్ @ 2026: తనిఖీల్లో చిక్కిన ‘సాల్వర్ గ్యాంగ్’ -
ఫెయిలైతే టీచర్ల బాధ్యత.. పాసైతే ప్రిన్సిపాల్స్ ఘనత..
సాక్షి, అమరావతి: విద్యార్థులకు మార్కులు తగ్గితే టీచర్లకు షోకాజ్ నోటీసులు.. అదే ఉత్తీర్ణత శాతం పెరిగితే ప్రిన్సిపాల్స్కు సత్కారాలు.. చంద్రబాబు సర్కారుకు ఇదేం ద్వంద్వనీతి అంటూ బీసీ గురుకులాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరి«ధిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఉత్తీర్ణతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు ప్రిన్సిపాల్స్ను మంగళవారం విజయవాడలో సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించడం వరకు సరే.. ప్రిన్సిపాల్స్ను, జిల్లా బీసీ సంక్షేమ అధికారులను జ్ఞాపికలతో అభినందించడాన్ని బీసీ గురుకుల టీచర్లు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు ముందు ప్రభుత్వం చేసిన హడావుడిని వారు గుర్తుచేస్తున్నారు.బీసీ గురుకులాల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే సంబంధిత టీచర్లకు షోకాజ్ నోటీçసులు ఇస్తామని, ఉత్తీర్ణత శాతం తగ్గితే విధుల నుంచి తొలగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత నుంచి గురుకులాల కార్యదర్శి మాధవీలత వరకు సమీక్ష సమావేశాల్లో హెచ్చరించారు. పరీక్ష ఫలితాలు వచ్చాక ఉత్తీర్ణత తక్కువ నమోదైన గురుకులాల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తక్కువ ఉత్తీర్ణత ఉన్న గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలను విధుల నుంచి తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఉత్తీర్ణత బాగున్న గురుకులాల్లో మాత్రం సంబంధిత టీచర్లను గుర్తించి అభినందించకపోగా.. ఆ మొత్తం ఘనత ప్రిన్సిపాల్స్దే అన్నట్లు వారిని సత్కరించడాన్ని టీచర్లు తప్పుబడుతున్నారు.రాష్ట్రంలోని 105 బీసీ గురుకులాలకుగాను 32 గురుకులాల్లో మాత్రమే నూరుశాతం ఉత్తీర్ణత వచ్చింది. ఆ 32 గురుకులాల ప్రిన్సిపాల్స్ను పిలిచి అభినందించిన కార్యక్రమానికి తమను కూడా పిలిచి తమ కృషిని గుర్తించి ఉంటే బాగుండేదని టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మార్కులు తగ్గినా, ఉత్తీర్ణత లేకపోయినా టీచర్ బాధ్యుడని, మంచి ఫలితాలు సాధిస్తే ప్రిన్సిపాల్ ఘనత అని ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించడం సరికాదని గురుకులాల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. -
ఎన్టీఏకి ఇది 'కామన్'!
సాక్షి, హైదరాబాద్: నీట్ యూజీకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు ఇంటర్మీడియెట్లో చేరిన తొలి రోజు నుంచే నీట్లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్లో అడుగుపెట్టాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. కానీ నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో 22.79 లక్షలమంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. నీట్ యూజీ మాత్రమే కాకుండా ఇతర పరీక్షల విషయంలోనూ ఎన్టీఏ నిర్వహణ లోపాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల నిర్వహణలో ఎన్టీఏ వైఫల్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తు న్నాయి. రాజస్తాన్లోని సికార్ ప్రాంతంలో పేపర్ లీకైనట్లు, 600 మార్కులకు సరితూగే 120కి పైగా ప్రశ్నలు పరీక్షకు రెండు రోజుల ముందుగానే పలు కోచింగ్ సెంటర్లలో ప్రాక్టీస్ పేపర్ పేరిట ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం యాదృచ్ఛికమే అని, పేపర్ లీక్ కాలేదని తొలుత ప్రకటించిన ఎన్టీఏ.. కేవలం కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకుని నీట్–2026 పరీక్షను రద్దు చేసింది. పరీక్ష కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ చెప్పింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించి, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ ప్రశ్నపత్రం లీక్ కావడం ఎన్టీఏ వైఫల్యానికి పరాకాష్ట అని వైద్య కళాశాలల ప్రొఫెసర్లు విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిపోయి, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు లేవా? ఎన్టీఏ పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రశ్నపత్రం లీకైందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రశ్నపత్రాలను రూపొందించి పరీక్ష కేంద్రాలకు పంపించే ఎన్టీఏ వాటి పంపిణీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. పటిష్ట భద్రతతో పేపర్లను సెంటర్లకు పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదని, దీంతో ఆయా రాష్ట్రాల్లో పర్యవేక్షణ అధికారుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఏ నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలికి నీట్ యూజీ–2024ని కూడా విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. ఆ ఏడాది నీట్ యూజీ నిర్వహణ సమయంలో బిహార్ రాజధాని పట్నాలో పేపర్ లీకైందని, సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రాలను ముందుగానే అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ పట్నా సెంటర్ నుంచి పరీక్షకు హాజరైన 67 మంది అభ్యర్థులకు 720 మార్కులకుగాను 720 మార్కులు వచ్చాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, సదరు పరీక్ష సెంటర్లో నిర్వహణ పరమైన ఇబ్బందుల కారణంగా విద్యార్థులకు సమయాభావం ఏర్పడిందని, దీంతో వారికి గ్రేస్ మార్కులు ఇవ్వడంతో ఆ స్థాయిలో మార్కులు వచ్చాయని చెప్పింది. అయితే, దీనిపై సీబీఐ విచారణ జరిపి పేపర్ లీక్ వాస్తవమని తేల్చింది. కేవలం ఒక సెంటర్లో లీకైందనే కారణంతో లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లో పెట్టబోమని, పేపర్ లీకైన సెంటర్లలోని 1,563 మందికి మాత్రమే పరీక్ష రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించాలని నాడు కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. విద్యా సంవత్సరంపై ప్రభావం నీట్ పరీక్ష రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు? పేపర్ ఎలా ఉంటుంది? అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పరీక్షకు హాజరైన విద్యార్థులు మళ్లీ అదే పరీక్షకు హాజరు కావాలంటే మానసికంగా అలసటకు గురవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ రద్దు, పునర్నిర్వహణ కారణంగా వచ్చే విద్యా సంవత్సరంపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. నీట్ పునర్నిర్వహణకు ఎన్టీఏకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత ఫలితాల విడుదలకు మరో పది, పదిహేను రోజులు.. మొత్తంగా 40 రోజులు పడుతుందని నిపుణులు అంటున్నారు. అంటే జూన్ మూడో వారానికి గానీ నీట్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఇదే జరిగితే నీట్ ఆధారంగా నిర్వహించే మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యం అవడం ఖాయం. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభం కూడా జాప్యమవుతుంది. ఇతర కోర్సుల ప్రవేశాలకు సందిగ్ధత: నీట్ పునర్నిర్వహణ వల్ల విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాల విషయంలోనూ సందిగ్ధత నెలకొనే ప్రమాదం ఉంది. నీట్లో సరైన ఫలితం రాకుంటే బైపీసీ అర్హతతో డిగ్రీ లేదా ఇతర కోర్సులవైపు విద్యార్థులు దృష్టి సారిస్తారు. అయితే డిగ్రీ ప్రవేశాల విషయంలో ఇప్పటికే తెలంగాణలో ‘దోస్త్’షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 20 కల్లా మూడు దశల కౌన్సెలింగ్ పూర్తయి జూలై 1 నుంచి క్లాస్లు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఏపీలోనూ జూలై రెండో వారానికి డిగ్రీ ప్రవేశాలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో నీట్ ఫలితాలు ఆలస్యమైతే అందులో నిరాశకు గురైన విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా బైపీసీ అర్హతతో ఎప్సెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు నిర్వహించే అగ్రికల్చర్, బీఫార్మసీ కోర్సుల షెడ్యూల్ కోణంలోనూ గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు 2024లో నీట్ లీకేజ్ నేపథ్యంలో పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన చర్యలపై నాడు కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. అదే సంవత్సరం అక్టోబర్లో నీట్ యూజీ నిర్వహణ తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలించిన కమిటీ.. నీట్ యూజీని ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా లేదా హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సిఫార్సు చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సహా ఇతర నెట్వర్క్ సదుపాయాలు లేవనే కారణంతో దీన్ని అమలు చేయలేదు. అయితే ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తే ప్రశ్నపత్రాల లీకేజ్కు ఆస్కారం ఉండదని, విద్యార్థులు తాము పరీక్ష రాస్తున్న సమయంలోనే ప్రశ్నలను చూసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇతర పరీక్షల్లోనూ ఎన్టీఏ లోపాలు ⇒ నీట్ యూజీ–2024 ప్రశ్నపత్రం బిహార్ రాజధాని పట్నాలో లీకైంది. దీంతో పేపర్ లీకైన కేంద్రంలో పరీక్షను మళ్లీ నిర్వహించారు. ⇒ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జేఆర్ఎఫ్లకు అర్హతగా నిర్వహించే యూజీసీ నెట్–2024 పరీక్ష కూడా పేపర్ లీక్ కారణంగా 2024 జూన్ 18న పరీక్ష జరిగిన మరుసటి రోజు రద్దు చేశారు. ⇒ సీఎస్ఐఆర్– యూజీసీ–నెట్– 2024ను కూడా పేపర్ లీకైందనే ఆందోళన నేపథ్యంలో రీషెడ్యూల్ చేసి నిర్వహించారు. ⇒ టీచింగ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎన్సీఈటీ–2024ను నిర్వహణ పరమైన లోపాలతో నెలపాటు వాయిదా వేశారు. ⇒ జేఈఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషన్లో.. సరైన ప్రశ్నలు రూపొందించని కారణంతో 12 ప్రశ్నలు తొలగించారు. జేఈఈ – మెయిన్ 2025లో సైతం 19 ప్రశ్నలను తొలగించారు. ⇒ ఇలా 2018లో ఎన్టీఏ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 పరీక్షలను వాయిదా వేయగా.. పలు పరీక్షల విషయంలో ప్రశ్నల రూపకల్పనలో పొరపాట్లు చేయడంతో లక్షల మంది విద్యార్థులు ప్రతికూల ప్రభావానికి గురయ్యారు. 2024లో ఎన్టీఏ డీజీపై వేటు 2024లో కొన్ని సెంటర్లలో నీట్ పేపర్ లీకేజ్, యూజీసీ నెట్ లీకేజ్లకు బాధ్యులుగా.. అప్పుడు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ను తొలగించారు. ఆయన స్థానంలో ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించారు. అయినప్పటికీ ఆశించిన మార్పులు లేకపోవడంతో తాజాగా ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ను నియమించారు. ఇలా అధికారుల స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో నిర్వహణ వరకు పలు లోటుపాట్లు ఎన్టీఏలో జరుగుతున్నాయని అంటున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తీవ్ర ఒత్తిడి ఉంటుంది నీట్ యూజీ పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒకసారి చదివిన అంశాలే అయినప్పటికీ.. పరీక్ష క్లిష్టత, పోటీ వంటి కారణాలతో ఒత్తిడికి గురవుతారు. అదేవిధంగా నీట్లో అవకాశం చేజారితే దృష్టి సారించాల్సిన ముఖ్య ప్రత్యామ్నాయ కోర్సులైన అగ్రి బీఎస్సీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్ కోణంలోనూ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నీట్ను ఆన్లైన్లో నిర్వహించడం శ్రేయస్కరం. –ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ -
జీరో మార్కుల ‘నీట్’!
ఉన్న ఊరునూ, అయినవాళ్లనూ వదిలి వేలాది రూపాయలు వెచ్చించి పట్టణాలు, నగరాలకొచ్చి రాత్రింబగళ్ల ధ్యాసే లేకుండా, తిండితిప్పలు పట్టించుకోకుండా ‘నీట్’ పోటీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకోవటంలో తలమునకలైన లక్షలాదిమంది విద్యార్థులు మరోసారి దగా పడ్డారు. ఈ నెల 3న దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీకయిందంటూ ఆ పరీక్ష కాస్తా మంగళవారం రద్దుచేశారు. విద్యార్థులు ఈ వేసవిలో మళ్లీ తిప్పలుపడాలి... కోచింగ్ కోసం మరోసారి అవస్థలు పడాలి. పోటీ పరీక్ష రాశాక ఫలితాలకన్నా ముందు లీకయిందనే వార్తలొస్తాయేమో, మళ్లీ రాయకతప్పదేమోనని కంగారుపడేంతగా ఆ వ్యవస్థను నిర్వాహకులు భ్రష్టుపట్టించారు. పదే పదే ప్రశ్నపత్రాలు లీకవుతున్నా అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత! ఒకసారి జరిగిందంటే అనుకోకుండా జరిగిందిలే అని సర్దిచెప్పుకోవచ్చు. ఈసారి తగిన కట్టుదిట్టాలు చేస్తారని సరిపెట్టుకోవచ్చు. ప్రతియేటా ఇదే ప్రహసనమైతే ఏమనాలి? విద్యార్థులకు సక్రమంగా పరీక్షలు నిర్వహించటంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి ఎప్పుడూ సున్నా మార్కులే వస్తున్నాయి.ఈసారి 22 లక్షలమందిపైగా ‘నీట్’ యూజీ పరీక్ష రాశారు. పరీక్ష రోజున దేశ వ్యాప్తంగా జరిగే హడావుడికి అంతులేదు. తనిఖీ పేరిట గేటువద్ద నిర్వహించే శల్య పరీక్షలతోపాటు ఆడపిల్లల ముక్కుపుడకలు, దుద్దులు మొదలుకొని పట్టాలవరకూ అన్నీ తీయించిగానీ లోపలికి పంపరు. ఒకటి రెండు నిమిషాలు లేటయ్యారని వెనక్కిపంపడం షరా మామూలు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, 5జీ జామర్ల ఆర్భాటం సరేసరి. పరీక్షార్థుల లేత ముఖాల్లో కనబడే ఆదుర్దా, వారికి తల్లిదండ్రులిచ్చే భరోసా చూస్తుంటే ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారన్న వేదన కలుగుతుంది. మారుమూల అడవుల్లో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో సమాచారం రాబట్టుకునేంత సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అడుగడుగునా నిఘా నీడలు పరుచుకున్నాయని అర్థమ య్యేంతగా నిశితమైన చూపులు వెన్నాడుతుంటాయి. కానీ వాట్సాప్ మాధ్యమంలో వేలాదిమందికి ప్రశ్నపత్రం అందినా 28 రాష్ట్రాల్లో ఏ ఒక్కచోటా వెనువెంటనే ఏ ప్రభుత్వా నికీ ఉప్పందలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అత్యధిక శాతంమంది హాజరయ్యే పరీక్షల్లో ఒకటైన ‘నీట్’ను స్వచ్ఛంగా, నిర్దుష్టంగా, అవినీతిరహితంగా నిర్వహించుకోలేక పోవటం ఎంత నామర్దా! మంచికో చెడుకో ప్రజాస్వామ్యంలో ‘మెరిట్’కుండే ప్రాధాన్యత, దానికుండే గౌరవా దరాలు అపారం. ‘పుట్టకవల్లే ప్రతిభ’ అనే భావన నిరాకరించి, డబ్బుకొద్దీ చదువన్న వాదన తిరస్కరించి అందరికీ సమానావకాశాలు కల్పించటం మంచిదే. కానీ కోచింగ్ పేరిట డబ్బులు దండుకునే వ్యవస్థ వచ్చిపడింది. హాజరైనవారిలో మెరికల్లాంటి వారిని ఎంపిక చేయటానికి చిక్కుముడులతో ప్రశ్నలుంటాయి. ఉండే సీట్లు తక్కువ, ఆశించే పిల్లలు ఎక్కువమంది ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని సరిపెట్టుకున్నా... పరీక్ష నిర్వాహకులకూ, ప్రభుత్వాలకూ పరువుప్రతిష్ఠలపై పట్టింపు ఉండొద్దా? సమర్థవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకుందామన్న తాపత్రయం కలగొద్దా? దేశవ్యాప్తంగా దాదాపు 400 మెడికల్ కళాశాలలు నిర్వహించే 40 వరకూ ప్రవేశపరీక్షలు రాయటం, అందుకోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిరావటం సమస్యాత్మకమవుతున్నదని 2016లో ‘నీట్’ తెచ్చి నప్పుడు చెప్పారు. వివిధ పరీక్షలకు వేర్వేరుగా సంసిద్ధం కావటంకన్నా ఒక్క పరీక్షతో ముగుస్తుందని అనేకులు సంతోషించారు. పైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో ఏర్పడే సంస్థ నిర్వహించే పరీక్ష పకడ్బందీగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ జరుగుతున్నదేమిటి? ఎప్పుడు చూసినా లీకులు, మోసాలు, అవకతవకలు! పరీక్షకు పక్షంరోజులముందే ‘ఊహాజనితమైనవ’న్న పేరిట 410 ప్రశ్నలు రాజస్థాన్, ఉత్తరాఖండ్లలో చక్కర్లుకొట్టాయనీ, అటుతర్వాత దేశమంతా వ్యాపించాయనీ వస్తున్న వార్తలు నిజమైతే అంతకన్నా ఘోరం మరొకటుండదు. విద్యారంగంలో మాఫియా ముఠాల ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి తెలుస్తుంది. లక్షలాదిమంది జీవితాకాంక్షలను చిదిమేసే లీకుల్ని అరికట్టి తీరాలన్న సంకల్పం ఇప్పటికైనా పాలకుల్లో కలిగితేతప్ప సమస్యకు పరిష్కారం లభించదు. -
నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15మంది అరెస్టయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42గంటల ముందు పేపర్ లీక్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SOG) దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ పేపర్లోని 120 ప్రశ్నలు.. నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్ యూజీ 2026 పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పరీక్షను రద్దు చేసి, రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్ ఎస్వోజీ ఇద్దరిని మాస్టర్మైండ్స్గా అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర) లీక్ నెట్వర్క్పై విచారణ కొనసాగుతోంది.22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. ఎన్టీఏ తెలిపిన ప్రకారం.. కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా రీ-ఎగ్జామ్ త్వరలో నిర్వహించనుంది. ఇప్పటికే చెల్లించిన ఫీజులు రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పేపర్ లీకేజీతో విద్యార్థుల్లో అనిశ్చితి, మానసిక ఒత్తిడి పెరిగింది. -
విద్యార్థి దశలో భక్తి కూడా ప్రధానమే..!
ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
నేడు ఏ క్షణంలోనైనా సీబీఎస్ఈ 12 ఫలితాలు?
న్యూఢిల్లీ: లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు నేడు వెలువడే అవకాశం ఉంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ)CBSE) మే 11న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. డిజీలాకర్ నుంచి అందిన తాజా సంకేతాలు విద్యార్థుల్లో ఉత్కంఠను రెట్టింపు చేస్తున్నాయి. ఫలితాల ప్రకటనకు సంబంధించి బోర్డు తుది ఏర్పాట్లను పూర్తి చేసింది.ఫలితాల వెల్లడి.. అధికారిక వేదికలు ఇవేసీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెలువడగానే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ మార్కులను వేగంగా తెలుసుకోవచ్చు. ప్రధానంగా cbse.gov.in, results.cbse.nic.in వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్లతో పాటు, విద్యార్థుల సౌకర్యార్థం Digilocker, UMANG App ద్వారా కూడా స్కోర్కార్డులను డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. ఫలితాల విడుదల సమయంలో వెబ్సైట్లపై ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రత్యామ్నాయ యాప్లను ముందే ఇన్స్టాల్ చేసుకోవడం ఉత్తమం.స్కోర్కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలా..ఫలితాలను చెక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మొదట అధికారిక వెబ్సైట్ను సందర్శించి, హోమ్ పేజీలో కనిపించే 'CBSE Class 12 Result 2026' లింక్పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలైన రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సమర్పించిన వెంటనే మీ స్కోర్కార్డ్ పిడిఎఫ్ రూపంలో స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది. భవిష్యత్తు ఉన్నత విద్యా ప్రవేశాల కోసం దాన్ని సేవ్ చేసుకోవడంతో పాటు ఒక ప్రింటౌట్ తీసుకోవడం మర్చిపోవద్దు.డిజీలాకర్ అప్డేట్.. తుది దశలో ప్రక్రియఈ ఏడాది ఫలితాల ప్రకటనపై డిజీలాకర్ సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు అందించింది. ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయని అధికారికంగా పేర్కొనడంతో, మే 11నే ప్రకటన ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
ఫీజులపై లోకేష్ కు విద్యార్థి లేఖ వైరల్ అవుతున్న న్యూస్
-
స్పెషల్ డీఎస్సీపై సర్కారు మౌనం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆటిజం, బుద్ధిమాంద్యం వంటి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం స్పెషల్ టీచర్లను నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. అత్యున్నత న్యాయస్థా నం ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టించాల్సింది పోయి, ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలోని రెగ్యులర్ టీచర్ పోస్టు ల్లో 2,260 పోస్టులను సర్ప్లస్(మిగులు)గా చూపి వాటిని స్పెషల్ టీచర్ పోస్టులుగా (1,136 స్పెష ల్ ఎస్జీటీలు, 1,124 స్పెషల్ స్కూల్ అసిస్టెంట్) మార్పు చేసింది. ఈ మేరకు గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం జీఓనెం.13ను విడుదల చేసింది. అనంతరం ఆర్థిక ఆమోదం తెలపడంతోపాటు గత మేలో ఈ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ప్రక టన సమయంలో సహా పలు సందర్భాల్లో ప్రభు త్వం స్పెషల్ టీచర్ పోస్టుల (డీఎస్సీ) భర్తీకి చర్య లు చేపడుతున్నట్టు ప్రకటించి అభ్యర్థుల్లో ఆశలు పెంచింది. వాస్తవంలో మాత్రం ఏడాది కాలంగా నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో స్పెషల్ బీఈడీ, డీఎడ్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 5 వేల వరకూ ఖాళీలు.. స్పెషల్ టీచర్ల నియామకానికి సంబంధించి విద్యాశాఖ 13 ఉమ్మడి జిల్లాల్లోనూ గుర్తించిన ఖాళీలు ఒక్క పాఠశాల విద్యాశాఖలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించినవి మాత్రమే కావడం మరో విశేషం. మిగిలిన ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మహాత్మ జ్యోతిబాపూలే, జువైనల్, మోడల్ స్కూల్స్ తదితర శాఖలు ఇప్పటికీ ఆయా స్కూళ్లల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించలేదు. పైగా ఈ ఖాళీలపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద స్పష్టత కూడా లేదు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఖాళీలు కలిపి మొత్తం 5 వేల వరకు ఉంటాయని అంచనా. దివ్యాంగ విద్యార్థుల వికాసమే లక్ష్యంగా... ⇒ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 10 మంది విద్యార్థులకు ఒకరు, ఉన్నత పాఠశాలల్లో ప్రతి 15 మందికి ఒక స్పెషల్ టీచర్ ఉండాలని ఆర్టీఈ–2009 చట్టంలో 2022 సవరణ చెబుతోంది. ⇒ దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ⇒ స్పెషల్ టీచర్లను నియమించాలని ప్రభుత్వాలకు గతేడాది మార్చిలో విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. విద్యకు దూరమవుతున్న స్పెషల్ విద్యార్థులు రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద 679 భవిత కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 9 వేల మంది ఆటిజం, బుద్ధిమాంద్యం పిల్లలు చదువుకుంటున్నారు. ఇక భవిత కేంద్రాల పరిధిలో దాదాపు 80 వేల మంది స్పెషల్ విద్యార్థులున్నారు. వీరిలో 1–5 తరగతుల వయసు వారు 17 వేల మంది భవిత కేంద్రాల్లో ఉన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచేందుకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్టీ) 1,286 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వీరంతా స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినవారే. మిగిలిన 63 వేల మంది విద్యార్థులు స్థానిక ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలల్లో చేరినా స్పెషల్ టీచర్లు లేక విద్యకు దూరమవుతున్నారు. ప్రస్తుతమున్న 6 స్పెషల్ స్కూళ్లల్లోనూ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ‘భవిత’ స్పెషల్ టీచర్ల ఆందోళన భవిత సెంటర్లలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని లేదా రెగ్యులర్ టీచర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం హడావుడిగా వీరి అర్హతలను నిర్ధారించేందుకు కమిటీని నియమించింది. కానీ ఇంత వరకు దీనిపై ఎటూ తేల్చలేదు. సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారంతా తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మభ్యపెట్టే ధోరణి అవలంభించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. -
నిరాశ చెందవద్దు ఉత్కంఠల నడుమ.. విజయ్ ట్వీట్
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా ఇతర పార్టీలు పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇంత ఉద్రిక్తతల నడుమ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఫలితాలలో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విజయ్ ట్వీట్ చేశారు. " 12వ తరగతి పబ్లిక్ పరీక్షలో అచంచలమైన పట్టుదలతో విజయం సాధించిన నా ప్రియమైన సోదరులకు, నీ సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ కఠోర శ్రమకు లభించిన గుర్తింపు. ఉన్నత విద్యలో తదుపరి దశకు ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టండి. అదే సమయంలో, ఈసారి విజయం సాధించలేని వారు నిరాశ చెందవద్దు. మళ్ళీ ప్రయత్నించండి. మనం విజయపు అంచున ఉన్నామని గుర్తుంచుకోండి.మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను." అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీకి మెజారిటీకి ఇంకా ఐదు స్థానాల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో కమ్యునిస్టులు,వీసీకే పార్టీ మద్దతు ఇస్తారా లేదా అన్న అంశం ఈ రోజు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. -
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 32 లక్షలే
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 32లక్షల మందే విద్యను అభ్యసిస్తున్నట్టు పాఠశాల, ఉన్నత విద్య కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ 9,620 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కనీసం 60 మంది విద్యార్థులు చొప్పున ఉండేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో డిసెంబర్ నాటికి 1,500 పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. -
ఫీజులు కడితేనే ‘పరీక్ష’.. చదువులు చతికిల!
‘‘ఫైనలియర్ పరీక్ష దరఖాస్తు నింపాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిందే. ప్రభుత్వం ఇచ్చేవరకూ మేం ఎదురు చూడలేం. ఫీజు కడితేనే చివరి ఏడాది పరీక్షలు, ప్రాజెక్టు సబ్మిషన్కు వెళ్లనిస్తాం..!’’ విశాఖలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓ ప్రముఖ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం అల్టిమేటం ఇదీ! పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తమకు ప్రభుత్వం చెల్లిస్తుందని.. విద్యార్థులు కట్టాల్సింది ‘సున్నా’ అని అడ్మిషన్ సీటు అలాట్మెంట్ లెటర్లో చూపించిన కాలేజీ యాజమాన్యం.. ప్రస్తుతం ఫైనలియర్ విద్యార్థులు రూ.50 వేల చొప్పున బకాయిలు కట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఒక్క విశాఖే కాదు.. ఫీజు రీయింబర్స్మెంట్ను చంద్రబాబు సర్కారు అటకెక్కించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితి ఇదే! చరిత్రలో ఎన్నడూ లేనంత బకాయిలు పేరుకుపో వడం కూటమి పాలనలో దిగజారిన విద్యారంగం పరిస్థితికి నిదర్శనం. సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను మిథ్యగా మార్చేసింది. కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యా నాణ్యత పూర్తిగా దిగజారింది. పిల్లల చదువులు ఆగిపోతుండగా.. కాలేజీలు దివాళా తీసే దుస్థితి దాపురించింది. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో పేద కుటుంబాలు ఆర్థిక భారంతో చితికిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు. అటు కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదు. ఒకవేళ ఎలాగోలా రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. దీంతో విద్యార్థుల చదువులు చెదిరిపోతున్నాయి. దీనంతటికీ కారణం.. చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఫీజు బకాయిలు పెట్టడమే. రాష్ట్రంలో గత రెండేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్ల చొప్పున మొత్తంగా 9 క్వార్టర్లకు రూ.6,300 కోట్లు ఫీజుల బకాయిలతోపాటు రెండేళ్లుగా వసతి దీవెన బకాయిలు రూ.2,200 కోట్లు కలిపి మొత్తంగా రూ.8,500 కోట్లు చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం అరకొరగా విదిలిస్తోంది. ఫీజులు, వసతి దీవెన కింద చంద్రబాబు సర్కార్ ఇప్పటికే రూ.6,100 కోట్లు బకాయిలు పెట్టింది. ఇక దీనికి అదనంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి క్వార్టర్ కింద రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతేకాదు.. రానున్న విద్యా సంవత్సరంలో పిల్లల ఫీజులు, వసతి దీవెన కోసం రూ.3,900 కోట్లు అవసరం. అంటే పాత బకాయిలతో కలిపి మొత్తం రూ.10,700 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.2,766 కోట్లు! నమ్మించి నయ వంచన..ఒకవైపు ఫీజులను తొక్కిపెట్టిన చంద్రబాబు సర్కారు మరోవైపు కనికట్టు చేసింది. రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్టు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వోలు) ఇచ్చి మొత్తం అప్పులు తీర్చేసినట్లు ప్రచారం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ ఖాతాలో గొప్పలు చెప్పుకున్నారు. నెలలు గడిచినా కళాశాలల ఖాతాల్లో రూపాయి పడలేదు. ఇదేమిటని అడిగితే చావుకబురు చల్లగా చెప్పింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి 7.55 శాతం వడ్డీ రేటుతో అప్పు తెచ్చి, ఆ డబ్బులిస్తామని.. అయితే ముందుగానే వడ్డీ మినహాయించుకుంటామని మెలిక పెట్టింది. దీనిపై వైఎస్సార్సీపీ పోరాటానికి పిలుపు ఇవ్వడం.. కళాశాలల యాజమాన్యాలు ఒప్పందాలకు నిరాకరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు రెండు విడతల్లో రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతాది ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఇవ్వలేదు. పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడలో భాగంగానే కాలేజీలకు చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు సమాచారం అందడంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధించి వసూలు చేస్తున్నాయి.వర్సిటీల నిధులు దారి మళ్లింపుప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా నిధులను దారి మళ్లించిన బాబు సర్కారు వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు వర్సిటీల నుంచి ఏకంగా రూ.1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. తాజాగా మరో రూ.300 కోట్లు కూడా లాగేసుకుంది. మొత్తం రూ.1,500 కోట్లను వర్సిటీల నుంచి ప్రభుత్వం తన సొంత అవసరాల నిమిత్తం లాగేసుకుంది. దీంతోపాటు ఉన్నత విద్యా మండలి నిధులు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేçÜుకోవడం గమనార్హం. ముఖ్యంగా చినబాబు ఆస్రే్టలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనావిుక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు.ఉన్నత విద్యపై వైఎస్ జగన్ హయాంలో రూ.18,663.44 కోట్లు వ్యయంవైఎస్సార్సీపీ హయాంలో కరోనా విలయ తాండవం చేసినా ఐదేళ్లూ ఫీజుల పథకాన్ని సజావుగా కొనసాగించారు. అత్యంత పారదర్శకంగా తల్లుల ఖాతాల్లో ఫీజుల డబ్బులు జమ చేశారు. విద్యార్థుల శ్రేయస్సును కాంక్షిస్తూ గత ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టింది. హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేసింది. వైఎస్సార్సీపీ పాలనలో ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. గతంలో చంద్రబాబు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లను కూడా చెల్లించి చిత్తశుద్ధిని చాటుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులను పెండింగ్లో పెట్టడంతోపాటు ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామన్న హామీని చంద్రబాబు గాలికి వదిలేశారు. -
ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాల్లో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. ఇంగ్లిష్ అనేది అందరినీ ఏకం చేసే ఒక అంశమని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంలో కూడా చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా వారు ఇతర రంగాలలోకి విస్తరించడానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ద్వారా పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది మంచి పరిణామమేనంది. ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు తగిన అవకాశాలు దొరక్క పోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భాషగా ఇంగ్లిష్ ఉంటుందంటూ గత నెల 16న విద్యా శాఖ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ను బోధన భాషగా చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని ఇదే హైకోర్టు కొట్టేసిందన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా ఇంగ్లిష్ను బోధనా భాషగా చేస్తూ గత నెల 16న ప్రొసీడింగ్స్ జారీ చేసిందని వివరించారు.పొరపాటు జరిగింది.. సవరించాంవిద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. బోధన భాషగా ఇంగ్లిష్ను పొరపాటున పేర్కొన్నామని, అందువల్ల ఆ ప్రొసీడింగ్స్ను సవరించామని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ద్విభాషా విధానం (తెలుగు, ఇంగ్లిష్) అమల్లో ఉంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇక ఈ వ్యాజ్యం నిరర్థకమని, ఇందులో విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. -
స్థిరమైన ఆదాయానికి.. సరికొత్త ప్లాన్!
అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్ నెస్ట్ యాన్యూటీ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్ రథ్ తెలిపారు.బజాజ్ లైఫ్ ‘యంగ్ అచీవర్ ప్లాన్’ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్ లైఫ్ యంగ్ అచీవర్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యథావిధిగా కొనసాగుతుంది.ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.ఇదీ చదవండి: ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి? -
‘పది’ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు 7 వరకు గడువు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ కోరే విద్యార్థులు ఈ నెల ఏడో తేదీలోగా తమ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్కు రూ .500, రీ–వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్ కోసం పాఠశాల లాగిన్తో పాటు వాట్సప్ గవర్నెన్స్(మన మిత్ర)ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించినట్టు తెలిపారు. -
టెన్త్ ఉత్తీర్ణత 85.25 శాతం
సాక్షి, అమరావతి: గతనెలలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలు గతేడాది కంటే కాస్త మెరుగుపడ్డాయి. ఉత్తీర్ణత గతేడాది కంటే 4.11 శాతం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తీర్ణత 2024లో వచ్చిన 86.69 శాతాన్ని దాటలేకపోయింది. పదోతరగతి పరీక్ష ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు. 2025–26 విద్యా సంవత్సరంలో 6,18,131 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 5,26,954 మంది (85.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికలు 2,67,321 మంది (87.90 శాతం), బాలురు 2,59,633 మంది (82.68 శాతం) ఉన్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో 5,83,645 మంది హాజరవగా, 5,03,539 మంది పాసయ్యారు. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన 30,129 మందిలో 19,834 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు మాధ్యమాలతో పాటు హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా భాషల్లోను స్వల్పసంఖ్యలో పరీక్షలు రాశారు. ఈ ఏడాది పరీక్షల్లో పాసైన వారిలో అత్యధికంగా 83.69 శాతం మంది ప్రథమ శ్రేణి సాధించారు. 11.87 శాతం మంది ద్వితీయ శ్రేణి సాధించగా 4.44 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాసయ్యారు.పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07 శాతం ఉత్తీర్ణత గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదోతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో టాప్లో నిలిచింది. ఈ జిల్లా టాప్లో నిలవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 96.07 శాతం ఉత్తీర్ణతతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండోస్థానంలోను, 91.08 శాతం ఉత్తీర్ణతతో విజయనగరం జిల్లా మూడోస్థానంలోను నిలిచాయి.మూడోస్థానంలో ప్రైవేటు స్కూళ్లు ఈ ఏడాది మొత్తం 12,089 ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 5,044 ప్రైవేటు పాఠశాలలుండగా మిగిలినవి వివిధ యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మొత్తం 2,161 స్కూళ్లు 100 శాతం ఫలితాలను సాధించాయి. మరో 16 పాఠశాలలు ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. సున్నా ఫలితాలు వచ్చిన 16 పాఠశాలల్లో 11 ప్రైవేటు స్కూళ్లున్నాయి. రాష్ట్రంలోని 12 యాజమాన్య పాఠశాలల్లో.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచాయి. తర్వాత బీసీ సంక్షేమశాఖ స్కూళ్లు 96.02 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో నిలిచాయి. విద్యార్థుల సంఖ్య పరంగా రెండోస్థానంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఉత్తీర్ణతలో 95.29 శాతంతో మూడోస్థానంలో ఉన్నాయి.నేటి నుంచి రీ కౌంటింగ్ దరఖాస్తులకు అవకాశం పదోతరగతి పరీక్ష తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశమిచ్చింది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వారి స్కూల్ లాగిన్ ద్వారా శుక్రవారం నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1000 ఫీజు చెల్లించాలి.అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు మే 9 పదోతరగతి తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు త్వరలో టైమ్టేబుల్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. విద్యార్థులు శుక్రవారం నుంచి మే 9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో మే 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడుకు పైగా సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలి. వెనుకబడ్డ కీలక జిల్లాలు రాష్ట్రంలో ఆది నుంచి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు విద్యాకేంద్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో ఆ జిల్లాల మెరుపులు కనిపించలేదు. గుంటూరు జిల్లా 8వ స్థానంలో నిలవగా కృష్ణాజిల్లా 10, ఎన్టీఆర్ జిల్లా 11 స్థానాల్లో నిలిచి ప్రగతిపరంగా ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడ్డాయి. ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా 24వ స్థానానికే పరిమితమైంది. -
విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్లు, ఐడీ కార్డులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి అంతా నాణ్యమైనవే అయ్యుండాలని.. అవన్నీ జూన్ 15లోగా స్కూళ్లకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సామగ్రి అందాక వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖతోపాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అందించే సామగ్రి కేంద్రీకృత సేకరణ విధానంపై సీఎం రేవంత్రెడ్డి గురువారం సమీక్షించారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ సేకరణ, సరఫరా చేపట్టడంతో నాణ్యత లోపంతోపాటు అక్రమాలు జరిగేవని.. వాటిని అరికట్టేందుకే కేంద్రీకృత సేకరణ విధానాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పా రు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి గడువులోగా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మండలానికో నోడల్ అధికారి... విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని.. సరఫరాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి అవసరమైన సామగ్రి అందిందా లేదా అనే విషయాన్ని సరిచూసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, సెర్ప్ సీఈవో దివ్య, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, గురుకులాల కార్యదర్శి బి.సైదులు తదితరులు పాల్గొన్నారు. -
‘రీయింబర్స్మెంట్’లో కీలక మార్పు
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్(ఏపీబీఎస్) ద్వారా నేరుగా విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో ఫీజు మొత్తాన్ని బదిలీ చేయనుంది. వాస్తవానికి 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర డీబీటీ పద్ధతిలోనే ఫీజును చెల్లిస్తుండగా..తాజాగా ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు కూడా డీబీటీ పద్ధతిలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు (జీఓఎంఎస్ నం.7) జారీ చేశారు. కొత్త విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు వైఎస్ భరోసా.. పేదరికం కారణంగా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అప్పట్లో అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. తద్వారా కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ నిబంధన విధించారు. అంతేకాకుండా ఫీజుల విషయంలో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయని భావించారు. విద్యార్థి ఖాతాలోనే వేయాలన్న కేంద్రం కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని, విద్యార్థి ఖాతాలోనే ఫీజును జమ చేయాలని సూచించింది. అప్పుడే తమ వాటా నిధులు వాటా విడుదల చేస్తామనే మెలిక పెట్టింది. కానీ గత ప్రభుత్వం ఈ నిబంధనకు ఒప్పుకోలేదు. దీంతో దాదాపు 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటాను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తొలుత ఎస్సీ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని నేరుగా విద్యార్థులకే ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.ప్రతి కాలేజీలో ప్రత్యేక నోడల్ అధికారి – విద్యార్థుల ప్రోగ్రెస్ ట్రాకింగ్ కోసం ఈపాస్లో ప్రత్యేక మాడ్యూల్ రూపొందించాలి. – స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ప్రతి కాలేజీలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. – ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. – ఆన్లైన్ దరఖాస్తు తర్వాత విద్యార్థులు హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుదమెంట్లు డిజిటల్గా అప్లోడ్ చేయాలి. బకాయిల చెల్లింపు పాత విధానంలోనే.. – జిల్లా సంక్షేమ అధికారి డిజిటల్ వెరిఫికేషన్ తర్వాత స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. – డీబీటీ అమలు కారణంగా అడ్మిషన్ సమయంలో కాలేజీలు ఫీజులు డిమాండ్ చేయకూడదు. విద్యార్థి డీబీటీ పద్ధతిలో వచ్చిన డబ్బుతో ఫీజు చెల్లించాలి. – ఈ మార్గదర్శకాలు 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి వర్తిస్తాయి. – 2025–26 వరకు ఉన్న బకాయిలు పాత విధానంలోనే చెల్లిస్తారు. – సంబంధిత సంక్షేమ శాఖల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈపాస్, ఐఎఫ్ఎంఐఎస్, పీఎఫ్ఎంఎస్ వ్యవస్థల్లో అవసరమైన మార్పులు చేయాలి. ఫీజుల చెల్లింపుపై అస్పష్టత ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల్లో మార్పులతో ఇకపై విద్యార్ధి తాను చదువుతున్న కోర్సు ఫీజును నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. డీబీటీ పద్ధతిలో విద్యార్ధి ఖాతాకు ఫీజు మొత్తం జమ అయిన తర్వాత.. ఆ మొత్తాన్ని కాలేజీలో చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. అయితే ఫీజు డబ్బులను ప్రభుత్వం ఎప్పటిలోగా విద్యార్ధి ఖాతాకు జమ చేస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు. వాస్తవానికి కోర్సు ప్రారంభ సమయంలోనే కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు అందిన తర్వాత చెల్లిస్తానంటే యాజమాన్యం అనుమతించే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజా మార్పులు విద్యార్ధిని గురి చేస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేటిక్ రెన్యువల్.. ⇒ ఆధార్ లింక్ చేసిన విద్యార్థి బ్యాంక్ ఖాతాకే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏ పీబీఎస్ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. ⇒ దరఖాస్తు సమయంలో ఆధార్ వివరాలు ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. ⇒ ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేస్టేషన్ కోసం బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా మాత్రమే సమర్పించాలి. ⇒ బ్యాంక్ ఖాతా వివరాలు ఎన్పీసీఐ ద్వారా ధ్రువీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. ⇒ కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు మీసేవ ద్వారా ఆధార్తో లింక్ చేయాలి. ⇒ రెన్యువల్ అప్లికేషన్లు ఆటోమేటిక్గా కొనసాగుతాయి. కాలేజీలు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపాలి. -
వేసవి క్రీడా చార్జీలు ‘హైజంప్’!
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో స్విమ్మింగ్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడలు నేర్చుకోవడానికి హైదరాబాద్లో సమ్మర్ క్యాంపుల బాటపట్టే విద్యార్థులపై జీహెచ్ఎంసీ తోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొ రేషన్లు చార్జీల భారం మోపాయి. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని స్టేడియాలు, ప్లేగ్రౌండ్లలో సమ్మర్ కోచింగ్లకు యూజర్ ఫీజులు పెంచాయి. గతంలో బేస్బాల్, బాక్సింగ్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ వంటివి ఆడుకోవడానికి రూ. 50గా ఉన్న నెలవారీ ఫీజును రూ. 200 చేశాయి. సైక్లింగ్, క్యారమ్స్, చెస్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, క్రికెట్, కిక్ బాక్సింగ్, తైక్వాండో, టెన్నికాయిట్ తదితర ఇన్డోర్/ఔట్డోర్ గేమ్స్పైనా ఫీజులు పెంచాయి.క్రికెట్ ఫీజును రూ. 100 నుంచి రూ. 400కు పెంచగా జిమ్ ఫీజు రూ. 200 నుంచి రూ. 400కు, లాన్ టెన్నిస్ (క్లే) ఫీజు రూ. 450 నుంచి రూ. 1,500కు పెంచేశాయి. వాటన్నింటికీ ఏడాదికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100గా నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా కార్పొరేషన్ల స్టాండింగ్ కమిటీలు ఫీజుల పెంపునకు ఆమోదం తెలిపాయి. అయితే సమ్మర్ క్యాంపుల్లో 16 ఏళ్లలోపు విద్యార్థులకు ఈ ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇచ్చాయి. పాఠశాల విద్యార్థులకూ భారం: పాఠశాలల విద్యార్థులు ప్లేగ్రౌండ్లు బుక్ చేసుకోవడంపైనా ఫీజుల భారం పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 నుంచి రూ. 1,000కి పెరగడంతోపాటు విస్తీర్ణాన్ని బట్టి గ్రౌండ్ల ఫీజులు పెరిగాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ప్లేగ్రౌండ్ను ఒక విద్యా సంవత్సరంలో 11 నెలల్లో 75 గంటలపాటు వినియోగించుకోవడానికి రూ. 10 వేలుగా ఉన్న ఫీజును మూడు రేట్లతో రూ. 15 వేలు చేశారు. అదే గ్రౌండ్ను 150 గంటలు వాడేందుకు రూ. 20 వేలుగా ఉన్న ఫీజును రూ. 30 వేలకు పెంచారు.వెయ్యి చదరపు మీటర్ల గ్రౌండ్ను 11 నెలల్లో 150 గంటలు వాడుకోవడానికి రూ. 40 వేలుగా ఉన్న ఫీజును రూ. 60 వేలు చేశారు. మరోవైపు వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకపూట ఆయా గ్రౌండ్లను వినియోగించుకునేందుకు ప్రస్తుతమున్న రూ. 4 వేల ఫీజును రూ. 6 వేలకు, రోజు ఫీజు (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) రూ. 7,500 నుంచి రూ. 11,000కు పెంచారు. వాలీబాల్ కోర్టు ఒకపూట ఫీజును రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు, క్రికెట్ నెట్ ఫీజును రూ. 100 నుంచి రూ. 200కు, బాస్కెట్బాల్ కోర్టు రోజు ఫీజును రూ. 7500 నుంచి రూ. 11,000కు పెంచారు. -
అమ్మాయిలు అదరహో!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో అమ్మాయిలు అదరహో అనిపించారు. బాలుర కంటే బాలికలు 2.19 శాతం అధికంగా ఫలితాలు సాధించారు. బుధవారం టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఇ.నవీన్ నికోలస్, విద్యాశాఖ అదనపు సంచాలకుడు పీవీ శ్రీహరి, జి.రమేశ్ తదితరులు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ క్యాంపస్లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగాయి. సీబీఎస్ఈ టైమ్టేబుల్ మోడల్లో ఈసారి పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు, పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల విరామం ఉండేలా నిర్వహించడంతో పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు విద్యార్థులకు ఎంతగానో దోహదపడింది. దీంతో ఉత్తీర్ణత కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొత్తం 5,26,166 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 5,16,815 మంది రెగ్యులర్ విద్యార్థులు, 9,351 మంది వన్టైమ్ ఫెయిలైన విద్యార్థులున్నారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల్లో 4,97,312 మంది ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో 4,91,774 మంది రెగ్యులర్, 5,538 మంది వన్టైమ్ ఫెయిల్ విద్యార్థులున్నారు. రెగ్యులర్ కేటగిరీలో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి 2.37 శాతం పెరిగింది. తాజా ఫలితాల్లో బాలికలు 96.26 శాతం మంది, బాలురు 94.07 శాతం ఉత్తీర్ణులయ్యారు. జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థులు ఆందోళన చెందొద్దని విద్యాశాఖ సూచించింది. జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పీవీ శ్రీహరి తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలు రాయాలనుకుంటే మే 14 కల్లా ఫీజును సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలి. హెడ్మాస్టర్లు ఇ–ఎన్ఆర్లను డీఈఓకు మే 15లోగా సమరి్పస్తారు. డీఈఓలు ఇ–ఎన్ఆర్లను మే 16లోగా ప్రభుత్వ పరీక్షల విభాగానికి అందజేయాలి. రూ.50 ఆలస్య రుసుముతో పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ములుగు ఫస్ట్... హైదరాబాద్ లాస్ట్2026 టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా టాప్లో నిలిచింది. 99.30 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలబడగా... అట్టడుగు స్థానంలో హైదరాబాద్ జిల్లా 89.23 శాతంతో ఉండిపోయింది. టెన్త్ ఫలితాలను విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన వెబ్సైట్లలో చూసుకోవచ్చు. రానున్న 15 రోజులు ఈ ఫలితాలు అందు బాటులో ఉంటాయి. జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 30 నుంచి మే 14 వరకు https://bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్కుల రీకౌంటింగ్ కోసం రూ.500 ఫీజు, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. -
రాష్ట్రంలో శంకర్దాదాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ సినిమా తరహాలో వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్కు పాల్పడుతూ ఇప్పటివరకు ఏకంగా 20 మంది వైద్య విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిలో 14 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. చిట్టీల ద్వారా కాపీయింగ్కు పాల్పడుతూ 16 మంది, స్మార్ట్ వాచీల్లో చూసి రాస్తూ ఇద్దరు, సెల్ఫోన్ ద్వారా కాపీయింగ్ కొడుతూ ఇద్దరు దొరికారు. విశాఖ, నెల్లూరు, కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు రాజమండ్రి, మంగళగిరి, విశాఖపట్నం, విజయనగరంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడినట్టు సమాచారం. స్మార్ట్ వాచీలు, ఫోన్లు ఎలా అనుమతించారు? నిబంధనల ప్రకారం ఎగ్జామినేషన్ హాలులోకి స్మార్ట్ ఫోన్లు, వాచీలు తీసుకువెళ్లకూడదు. హాలులోకి ప్రవేశించేటప్పుడే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉండే ఇని్వజిలేటర్లు, సిబ్బంది కూడా సెల్ఫోన్లు వినియోగించకూడదు. అయితే, తనిఖీలను దాటుకుని విద్యార్థులు చిట్టీలే కాకుండా, స్మార్ట్ ఫోన్లు, వాచీలతో పరీక్ష హాలులోకి ప్రవేశించి కాపీయింగ్కు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది, అబ్జర్వర్, ఎగ్జామినర్ల సహకారంతోనే కాపీయింగ్ తంతు నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.రెండు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్లు సెల్ఫోన్ వినియోగిస్తుండటంతో వారిని పరీక్షల విధుల నుంచి తప్పించారు. గతేడాది కూడా ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ వైద్య విద్యార్థులు పట్టుబడ్డారు. కాగా, ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్లలో కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులను విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా గుర్తించినట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, చిట్టీల ద్వారా కాపీయింగ్కు పాల్పడుతూ విద్యార్థులు దొరికిపోయినట్లు వెల్లడించారు. -
వాట్సాప్లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్ కార్డులు వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు చేరాయి. ఐటీ శాఖ పరిధిలోని మీ సేవ ద్వారా 18 లక్షల మందికి పైగా విద్యార్ధుల తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు జారీ అయ్యాయి.దీనిద్వారా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లకుండానే వేగంగా, సురక్షితంగా, పేపర్లెస్ విధానంలో తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్డుల్లో మార్కులతో పాటు, హాజరుశాతం వివరాలు కూడా ఉన్నాయి. ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులకు సాంకేతిక సేవలు చేరాలనే లక్ష్యంతో వాట్సాప్ ద్వారా రిపోర్ట్ కార్డులు అందించినట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీని ద్వారా ఆయా కుటుంబాలకు సమ యం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. -
ఇంగ్లిష్ పై పట్టు సాధించారు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఇంగ్లిష్ అబ్బేలా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేసిన వినూత్న ఆలోచన విజయవంతమైంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1–5వ తరగతుల విద్యార్థుల కోసం అమలు చేసిన ‘ఎవ్రీ చైల్డ్ రీడ్’తో ఏడు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అక్షరాలు నేర్చుకోవడం నుంచి ప్రారంభించి, పదాలు రాయడం, వాక్యాల నిర్మాణం.. పూర్తిగా చదివేలా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 26 వేల మంది విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగింది. అలా మొదలై.. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్లంపై పట్టు పెంచాలన్న సంకల్పంతో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ 2025 అక్టోబర్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల్లో చాలామందికి పూర్తిగా ఇంగ్లిష్ పదాలు, వాక్యాలు చదవడం రాలేదు. అయితే ఆరు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసిన ఈసీఆర్ (ఎవ్రీ చైల్డ్ రీడ్) యాప్ ద్వారా ప్రతీవారం సుమారు 26వేల విద్యార్థుల ఇంగ్లిష్ పఠన స్థాయిని ఉపాధ్యాయులు నమోదు చేశారు. ప్రతీ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో నమోదు చేస్తుండగా, కలెక్టర్, ప్రతీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పర్యవేక్షణతో పురోగతి కనిపించింది. ఒక్కో మెట్టుతో ముందుకు.. మొదటి వారంలో కేవలం 11 శాతం మంది విద్యార్థులు మాత్రమే వాక్య స్థాయిలో చదవగా, 21వ వారానికి 85 శాతం మంది విద్యార్థులు వాక్యాల స్థాయికి చేరితే, అక్షరాల దశలో కేవలం ఒక శాతమే ఉన్నారు. వాక్య పఠనంలో ఈ ఏడాది 2వ తరగతిలో 53 శాతం, 3వ తరగతిలో 71 శాతం, 4వ తరగతిలో 73 శాతం, 5వ తరగతిలో 86 శాతం పురోగతి నమోదైంది. ఎవ్రీచైల్డ్ రీడ్స్ను ఖమ్మం జిల్లాలో ప్రారంభించాక మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేశారు. నూరుశాతం పఠనా నైపుణ్యాలను సాధించాలి ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఎవ్రీచైల్డ్ రీడ్స్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో 26 వేల మంది విద్యార్థులు పూర్తి పఠన నైపుణ్యం సాధించారు. ప్రారంభంలో కేవలం 12–13 శాతం మందే వాక్యాలు చదవగలిగితే, ప్రస్తుతం అది 84 శాతానికి పెరిగింది. ప్రతిరోజూ ఒక గంట సమయం కేటాయించగా మంచి ఫలితాలు వచ్చాయి. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్, ఖమ్మం -
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్–2 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ స్కోర్కార్డ్ను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్తో పాటు డిజిలాకర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 11.23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సుమారు 2.5 లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులు అయ్యారు. -
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్
నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్ ఫోకస్డ్ టర్మ్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది. -
‘విద్యార్థినులు షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ కావొద్దు’
సాక్షి,చెన్నై: ‘నేను ఈ మధ్య ఓ విషయాన్ని గమనించాను. విద్యార్థినులు తరుచుగా షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇలాంటి వస్త్రధారణ పట్ల అటు విద్యార్థులు, ఇటు ప్రొఫెసర్లు ఆకర్షణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైంగిక వేధింపులకు ఆస్కారం కలిగిస్తాయంటూ తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ వి. నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వైస్ ఛాన్సలర్ వి.నాగరాజు వ్యాఖ్యలపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్ చాన్సలర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. యూనివర్సిటీ అధికారులు మాత్రం.. విద్యార్థులకు ఓ తండ్రిలా మాట్లాడారే తప్పా.. విద్యార్థునులను కించ పరిచే ఉద్దేశం కాదని అన్నారు. ప్రస్తుతం ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.విద్యార్థినులు షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులను ఆహ్వానిస్తుంది అంటూ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు షార్ట్స్ ధరించి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీసీ మాత్రం తాను చేసి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం యూనివర్సిటీ న్యాయవాద విద్యార్థులతో జరిగిన ఓ సాధారణ సమావేశంలో వైస్ ఛాన్సలర్ నాగరాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ఆయనతో పాటు, రిజిస్ట్రార్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల డీన్లు, మహిళా సంక్షేమ కేంద్రానికి అధిపతిగా ఉన్న అధ్యాపకులతో సహా పరిపాలనలోని ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు.తనపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్ని వీసీ నాగరాజు ఖండించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఏ వైస్-ఛాన్సలర్ కూడా డ్రెస్ కోడ్ పెట్టలేరు. కానీ నా అభిప్రాయం ప్రకారం, సంస్థ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో విద్యార్థుల వస్త్రధారణ ఒక అంశం కావొచ్చని అన్నారు. విద్యార్థుల ప్రశ్నలను వారి అభిప్రాయాలుగా ఆయన కొట్టిపారేశారు. నేను ఏం మాట్లాడానో అర్థం చేసుకోకుండా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.70గా నమోదైంది. గతేడాది 93.66 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 94.99శాతం ఉండగా బాలురుది 92.69శాతంగా ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే త్రివేండ్రం అత్యధికంగా 99.79శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సంస్థల వారీగా చూస్తే కేంద్ర విద్యాలయాలు (KV) అత్యుత్తమ ఫలితాలను సాధించాయి. వీటి ఉత్తీర్ణత శాతం 99.57శాతంగా నమోదైంది. ఫలితాల తర్వాత సప్లమెంటరీ పరీక్షలు మే మధ్యలో ప్రారంభం కానున్నాయి. అలాగే లిస్ట్ ఆఫ్ కాండిడేట్స్ విండో ఏప్రిల్ 16 నుండి 20 వరకు అందుబాటులో ఉంటుంది. గతంలో ఫలితాల సమయంలో వెబ్సైట్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యేవి. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా ఫలితాలను విద్యార్థులు నేరుగా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేలా డిజీలాకర్, ఉమాంగ్ యాప్స్లలో అందుబాటులోకి తెచ్చింది. తద్వారా విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే కేవలం నిమిషాల వ్యవధిలో స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
సాంకేతికతతో యువరైతుల అద్భుతం
కుంకుమపువ్వు ఈ పేరు చెబితేనే ప్రధానంగా గుర్తుకు వచ్చేది జమ్మూకశ్మీర్.. ఎందుకంటే ఆ పంటలకు కావాల్సిన వాతావరణ పరిస్థితులు అక్కడే అధికంగా ఉంటాయి గనుక ప్రధానంగా ఆ ప్రాంతమే గుర్తుకు వస్తుంది. అయితే పంజాబ్లోని యువరైతులు ఆ రికార్డును బ్రేక్ చేశారు. అత్యాధునికి పద్దతులను అనుసరించి కుంకుమపువ్వు సాగు చేస్తున్నారు. అంతే కాదండోయ్.. ఒక కిలో రూ.13 లక్షలకు రికార్డు స్థాయిలో విక్రయించి రికార్డు సృష్టిస్తున్నారు.కుంకుమ పువ్వు పంటను పండించాలంటే అంతా ఆషామాషీ కాదు..దానికి ప్రత్యేక మైన వాతావరణ పరిస్థితులతో పాటు అణువైన నేలకావాలి. ఈ పరిస్థితులు మన దేశంలో ఎక్కువగా జమ్మూకశ్మీర్ ప్రాంతంలోనే ఉంటాయి. అంతే కాకుండా దీనిని సాగుచేయడం చాలా కష్టం కావడంతో ధరలు కూడా అంతే స్థాయిలో అధికంగా ఉంటాయి. అయితే పంజాబ్కు చెందిన సోదరి, సోదరుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అత్యంత నాణ్యమైన కుంకుమపువ్వును పండించి రికార్డు స్థాయి ధరకు అమ్మారు.వ్యవసాయంపై మక్కువతోలూధియానాలో నివసించే ఆస్తిక నారులా, ఆమె సోదరుడు శంకర్ నారులా ఉన్నత విద్యావంతులు. వీరికి ఎటువంటి వ్యవసాయ నేపథ్యం లేదు అయితే వ్యవసాయం మీద మక్కువతో 2019 కాలంలో ఆధునాతన వ్యవసాయ పద్దతులపై అధ్యయనం చేశారు. దీంతో కుంకుమపువ్వును ఇంటివద్దే సాగుచేయాలని నిశ్చయించుకున్నారు.అనుకున్నదే తడవుగా 630 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏరోపోనిక్స్ సాంకేతికతను ఉపయోగించి వాతావరణాన్ని నియంత్రించే గది ఏర్పాటు చేశారు. కశ్మీర్లో ఉండే వాతావరణం మాదిరిగా ఉండడానికి LED గ్రో లైట్లు, హ్యూమిడిఫైయర్లను ఉపయోగించారు. ఉష్ణోగ్రత 3నుంచు 27 శాతం మధ్య ఉండేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కుంకుమ పువ్వు పంటకు అనుగుణమైన తేమ, కార్బన్ డయాక్సైడ్ను రూపొందించారు. అనంతరం కశ్మీర్ నుండి కుంకుమపువ్వు విత్తనాలను తీసుకవచ్చారు. అయితే వ్యవసాయం తొలినాళ్లలోనే వారికి ఎదురుదెబ్బ తగిలింది. వేడిమి కారణంగా దాదాపు 20 శాతం వరకూ విత్తనాలు పాడైపోయాయి. దీంతో భారీగా నష్టం చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ బెదరకుండా పంటను ప్రారంభించి అత్యంత నాణ్యమైన కుంకుమపువ్వును పండించారు.రికార్డు ధరకువీరు తొలి ఏడాది 1.3 కిలోల కుంకుమ పువ్వును పండించారు. అయితే దానిని ఒక గ్రాముకు రూ.1300-1650 మధ్య విక్రయిస్తున్నారు. అంటే కేజీకి దాదాపుగా రూ.13 లక్షలు. అయితే సాధారణంగా దీని ధర గ్రాముకు రూ 300-400 మధ్య ఉంటుంది. వీరు పండించే పవ్వు అత్యంత నాణ్యమైనది కావడంతో అంత అధిక ధరకు విక్రయిస్తున్నారు. వీరు ప్రధానంగా ఈ పంటను ఆస్ట్రేలియా,కెనడాలకు ఎగుమతి చేస్తున్నారు. భవిష్యత్తు కాలంలో దిగుబడిని మరింత పెంచుతామని యువ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేసే కుంకుమ పువ్వులో సింహభాగం సుమారు 90%కు పైగా ఇరాన్ ఉత్తత్తి చేస్తోంది. -
నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు బోర్డు మంగళవారం తెలిపింది. ఉదయం 10.31 గంటలకు https://resultsbie.ap.gov.in/ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. విద్యార్థులు sakshieducation.comలో కూడా ఫలితాలు చూసుకోవచ్చు. -
అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!?
ఇది పరీక్షల కాలం. పిల్లలతోపాటు పెద్దలూ హడావిడి పడుతుంటారు. అసలీ పరీక్షలు ఎవరు కనిపెట్టారంటూ కొందరు పిల్లలు విసుక్కుంటుంటారు. లిఖిత పూర్వక పరీక్షలు కనిపెట్టిన దేశం ఏదో తెలుసా? చైనా. అవును! ప్రామాణికతో కూడిన లిఖిత పరీక్షలను మొదట చైనాలో అమలు చేశారు. వీటిని ‘కేజు’ అని పిలిచేవారు. సుయి రాజవంశం క్రీ.శ. 605లో ఉద్భవించింది. దాని వారసురాలైన టాంగ్ రాజవంశం, వు జెటియాన్ పాలనలో పరీక్షా విధానం మొదలైంది. సాంగ్ రాజవంశం కాలంలో కేవలం గొప్ప ఇళ్ల వాళ్లే కీలక అధికారుల స్థానాలు తీసుకోకుండా సామాన్యులు కూడా అధికారులు అయ్యేందుకు వీలుగా పరీక్షలు నిర్వహించేవారు. కన్ఫ్యూషియస్ క్లాసిక్స్ను సిలబస్గా చదువుకుని పరీక్షలకు కూచునేవారు. అలా పాసైన వారికి ఉద్యోగాలు దక్కేవి. 13వ శతాబ్దంలో మంగోల్ యువాన్ రాజవంశం ప్రారంభంలో ఈ పరీక్షలకు ఒక చిన్న అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత మంగోలులకు అనుకూలంగా, దక్షిణ చైనీయులకు ప్రతికూలంగా ఉండే ప్రాతీయ కోటాలతో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు. కాలక్రమంలో ఆధునిక పరీక్షలు చైనాతో పాటు అన్నీ దేశాలలోకి వచ్చాయి. -
సీఎస్ఆర్ను ఖర్చులా కాదు.. భాగస్వామ్యంగా చూడండి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సమాజాభివృద్ధికి చేసేది ఖర్చులా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని.. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. అయితే కంపెనీలు సీఎస్ఆర్ కింద చేస్తున్న వ్యయం వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా తయా రు చేయగలమన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నిధులు స్థానికంగానే వినియోగించాలి రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 44 శాతం హైదరాబాద్ నగరంలోనే ఉన్నారని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని సీఎం అన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని చెప్పారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకోసం నియమించామని తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని సూచించారు. రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చాయంటూ ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు. మమ్మల్ని ఇలా ఎవరూ సంప్రదించలేదు.. సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న సీఎంకు అభినందనలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణపై వారు ఆసక్తి చూపారు.. సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షాయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు, మేఘా నుంచి సుధారెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణారెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్రెడ్డి, నాదం ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, కామినేని భాస్కర్రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికొలస్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు గల్లంతు
వల్లూరు: వైఎస్సార్జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు యువకులు స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో గల్లంతైన వారిలో కడప టౌన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హర్షవర్ధన్ (22), కడప విశ్వనాధ పురానికి చెందిన హరిబాబు (25), కడప ఐటి సర్కిల్ కు చెందిన కృష్ణ చైతన్య (20) లుగా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. హరిబాబు, హర్షవర్ధన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన యువకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
రెస్పెక్ట్ ఏదిరా?
గంగాధర: తమకు గౌరవం ఇవ్వడం లేదని పదో తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులను చితకబాదారు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల విద్యాలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. శుక్రవారం రాత్రి పది గంటలు దాటిన తరువాత వాచ్మన్, డ్యూటీలో ఉండే ఉపాధ్యాయుడు నిద్రపోయారు. పదో తరగతి విద్యార్థులు 25 మంది కలిసి తొమ్మిదో తరగతి చదువుతున్న 15 మందిని, ఒక్కొక్కరిగా తమ గదిలోకి పిలుస్తూ చితకబాదారు. దెబ్బలు తిన్న విద్యార్థులు శనివారం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.దెబ్బలు తిన్న వారిలో ఓ విద్యార్థి పుట్టిన రోజు కావడంతో.. శనివారం అతని తల్లి పాఠశాలకు వచ్చినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత బాధిత విద్యార్థుల తల్లిదండ్రులందరూ పాఠశాలకు చేరుకోగా, సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్రావు, ఎస్ఐ వంశీకృష్ణ, పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. బాధిత విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇద్దరిని కరీంనగర్ తరలించారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనపై తహసీల్దార్ అంబటి రజితకు ఫిర్యాదు చేశారు. దాడి జరుగుతున్నా డ్యూటీలో ఉన్న వాచ్మన్, ఉపాధ్యాయుడు పట్టించుకోలేదని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తహసీల్దార్ రజిత విచారణ చేపట్టి దాడి చేసిన పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, ఇంటికి పంపించారు. వాచ్మన్, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు.గదిలో బంధించి ర్యాగింగ్7వ తరగతి విద్యార్థిని కొట్టిన టెన్త్ విద్యార్థులుకారేపల్లి: గురుకులం విద్యార్థులు సాయంత్రం వేళ ఆడుకుంటున్న సమయంలో తలెత్తిన గొడవ ఏడో తరగతి విద్యార్థిపై దాడికి దారితీసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో శనివారం సాయంత్రం కొందరు పదో తరగతి విద్యార్థులు ఓ గదిలో 7వ తరగతి విద్యార్థిని బంధించి ర్యాగింగ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు.ఈ సమయాన ఉపాధ్యాయులెవరూ లేకపోగా, విద్యార్థి అరుపులు విన్న సమీపంలోని డబుల్ బెడ్రూం వాసులు చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. గాయపడిన విద్యార్థిని 108 అంబులెన్స్లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఇంతలోనే చేరుకున్న విద్యార్థి కుటుంబీకులు, స్థానికులు దాడి చేసిన టెన్త్ విద్యార్థులను తమకు అప్పగించాలని ఆందోళన చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులు చేరుకుని 10వ తరగతి విద్యార్థులను ఓ గదిలో ఉంచి.. ఉదయం మాట్లాడదామని నచ్చజెప్పినా వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. -
విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించిన తర్వాత సదరు విద్యార్థులకు వెనుక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మీదట అనేక ఏళ్లుగా కాలేజీలకు సర్కార్ నుంచి రూ.వేల కోట్లు బకాయి ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసినా విడుదలలో విపరీత జాప్యం కారణంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది.ఆయా కాలేజీల నిర్వహణ, కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఇతర చర్యలు ఈ పిటిషన్లలో ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇప్పటివరకు పేరుకుపోయిన రూ.వేల కోట్ల బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీతోపాటు మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేశవ్ మెమోరియల్ సహా పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీతాలు ఇచ్చే పరిస్థితీ లేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా 2008, 2009లో రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందన్నారు. ఈ నిషేధం తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు రూ.1,500 కోట్ల ట్యూషన్ ఫీజు బకాయిలను విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తాలు రావాల్సి ఉంటే కోర్టులు అతన్ని డిఫాల్టర్గా పేర్కొని, శిక్షించేవన్నారు.చెల్లింపులపై టోకెన్లు జారీ చేసి ఐదేళ్లయినా విడుదల చేయడం లేదన్నారు. ఒక్క కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకే రూ.56 కోట్లు బకాయి ఉందని తెలిపారు. 2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు బడ్జెట్ ఆమోదం ఉందని, అనుమతి పొందిన తర్వాత చెల్లించకపోవడం సబబుకాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలేజీలు ఆర్థికంగా కుదేలయ్యాయని, బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరాయన్నారు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకూ ఆదాయాన్ని సమకూర్చుకోలేక పోతున్నాయని, బకాయిలు వెంటనే చెల్లించేలా ఆదేశించాలని కోరారు. బకాయిలు మరింతగా పేరుకుపోకుండా ఉండేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.నిర్వహణ కష్టంగా మారడంతో...పిటిషనర్లు సమరి్పంచిన గణాంకాలు సరైనవి కావని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున టోకెన్లు జారీ చేసిన మొత్తాల చెల్లింపునకు సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూ ర్తి.. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు.


