పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ విడుదల | 10th class exam fee schedule released: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ విడుదల

Nov 11 2025 3:33 AM | Updated on Nov 11 2025 3:33 AM

10th class exam fee schedule released: Andhra Pradesh

ఈ నెల 13 నుంచి 25 వరకు గడువు

రూ.500 ఆలస్య రుసుంతో వచ్చే నెల 15 వరకు అవకాశం

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (ఎస్‌ఎస్‌సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. అన్ని పాఠశాలలు రెగ్యులర్, ఒకసారి ఫెయిల్‌ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజును ఈనెల 13 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 3 వరకు, రూ.200 ఫైన్‌తో 10వ తేదీ, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ తేదీలలో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలు ఉంటే తదుపరి పని దినాన్ని గడువు తేదీగా పరిగణిస్తారు. విద్యార్థుల ఫీజును  https://bse. ap.gov.in లలో అందుబాటులో ఉన్న స్కూల్‌ లాగిన్‌ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొ­న్నారు. మాన్యువల్‌ నామినల్‌ రోల్స్‌ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.

పరీక్ష ఫీజు రుసుం ఇలా.. 
రెగ్యులర్‌ విద్యార్థులు (అన్ని సబ్జెక్టులకు) రూ.125
⇒ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125
⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110
⇒ వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60
⇒ వయసు మినహాయింపు కోసం రూ.300

మార్చిలో ‘పది’ పరీక్షలు
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మా­ర్చిలో నిర్వహించేందుకు అధికారు­లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి నెల రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభించాలని యో­చిస్తు­న్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మార్చి 16, 21 తేదీలతో టైంటేబుల్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement