breaking news
Vizianagaram
-
రేపటి నుంచి స్వస్థ్ నారీ సశక్త్పరివార్ అభియాన్
● జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం రూరల్: జిల్లాలో ఈనెల 17వ తేదీ బుధవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లను సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, వీఆర్ఓ హేమలత, ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డా.జి. నాగభూషణరావు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి జగన్మోహన్రావు లతో కలిసి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పారామెడికల్ సిబ్బంది ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాలు వైద్య నిపుణులతో నిర్వహించనున్నందున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు, గర్భిణులు, బాలింతలు ఈ శిబిరాలకు తీసుకురావాలని ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశవర్కర్లు మాత్రమే కాకుండా జిల్లా, మండల గ్రామస్థాయిలో వైద్యశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖతోపాటు స్థానిక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించి వైద్య శిబిరాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, మరికొంతమంది జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
● పశువుల కంటైనర్ బోల్తా
బొండపల్లి: మండలంలోని నెలివాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారి26పై గజపతినగరం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న పశువుల కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. సోమవారం వేకువ జామున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. పశువులను రవాణా చేస్తుండగా కంటైనర్ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడి పోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు పశువులకు ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ హుటాహుటిన లారీ యాజమాన్యంతో పాటు పశువులను రవాణా చేస్తున్న వారు భారీ క్రేన్లు తీసుకువచ్చి లారీని బయటకు తీసి, అలాగే లారీలో రవాణా చేస్తూ ప్రమాదంలో చెల్లాచెదురైన పశువులను బయటకు తీసి వాటిని వేరే వాహనంలో గుట్టుచప్పడు కాకుండా పోలీసులకు తెలియకుండా తరలించారు. -
జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు నలుగురి ఎంపిక
● అక్టోబర్ 8 నుంచి నోయిడాలోపోటీలుచీపురుపల్లి: జాతీయస్థాయిలో జరగనున్న టెన్నికాయిట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఆడేందుకు జిల్లాకు చెందిన నలుగురు ప్రధాన క్రీడాకారులు, ఇద్దరు అదనపు క్రీడాకారులు ఎంపికయ్యారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ప్రధాన క్రీడాకారుల్లో ముగ్గురు మహిళల విభాగం నుంచి కాగా ఒకరు పురుషుల విభాగం నుంచి ఎంపికయ్యారు. ఈ నెల 13, 14 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో నిర్వహించిన 49వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్లో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఆ పోటీల్లో జిల్లాలోని గరివిడి మండలం కేఎల్.పురానికి చెందిన ఆర్.మౌనిక ప్రథమ స్థానంలో నిలవగా పి.రేణుక తృతీయస్థానం, జి.శ్రావణి నాల్గవ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఈ ముగ్గురిది ఒకే గ్రామం కావడం విశేషం. అలాగే చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన కె.ఇందు అదనపు క్రీడాకారిణిగా ఎంపికై ంది. అలాగే పురుషుల విభాగంలో పార్వతీపురానికి చెందిన ఎస్.రాహుల్ నాల్గవ స్థానంలో నిలిచి ప్రధాన క్రీడాకారుడిగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అంతేకాకుండా పురుషుల విభాగంలో విజయనగరానికి చెందిన కె.చంద్రమౌళిని అదనపు క్రీడాకారుడిగా ఎంపిక చేశారు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 8 నుంచి 13 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పట్టణంలో గల ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో జరగనున్న జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో వీరు రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన టెన్నికాయిట్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఎం.రామారావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభ కనపరిచి రాష్ట్రంతో బాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. -
వైద్యవిద్యను ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటు
విజయనగరంఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. అబద్ధాలను నిజంచేసే టాలెంట్ సీఎం చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. విజయనగరం గాజులరేగ వద్ద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా సోమవారం సాయంత్రం పార్టీ మహిళా విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో కళాశాల వద్ద కేక్ కట్ చేసి వేడుకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత ఫోటోలు చూపించి వైద్య విద్యార్థులు బ్యాగులు సర్దుకుని వెళ్లిపోవాలని హోం మంత్రి అనిత అంటున్నారని, ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత అభివృద్ధిచేశారో తెలుస్తుందన్నారు. విజయనగరం వైద్య కళాశాలలో 220 మందికి పైగా వైద్య సిబ్బంది పనిచేస్తుండగా, 150 మంది వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా ప్రజల చిరకాల వాంచను నేరవేర్చారన్నారు. 70 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే రూ.500 కోట్లు ఖర్చుతో నిర్మించి ప్రారంభించారని తెలిపారు. ఆయన కృషి వల్ల ఏడాదికి 150 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించగలుగుతున్నారని తెలిపారు. నాడు–నేడుతో రాష్ట్రంలో 56 వేల పాఠశాలల రూపు రేఖలు మార్చారని తెలిపారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతోనే కూటమి సర్కారు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే వైద్య విద్యార్థులు నష్టపోతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయికుమార్ పాల్గొన్నారు. -
జూనియర్స్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
● 23 నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో పోటీలువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్క్రీడామైదానం ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 120 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. బాల, బాలికల విభాగాల్లో నిర్వహించిన ఎంపికలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ ఎంపికల్లో బాలుర విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులు, బాలికల విభాగంలో మెరుగైన ఆట తీరు కనబరిచిన 14 మంది క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23 నుంచి 26వరకు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరగనున్న అంతర్ జిల్లాల జూనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఎంపిక పోటీలను అసోసియేషన్ కోశాధికారి బి.శివప్రసాద్, ప్రధానోపాధ్యాయులు నగేష్కుమార్, కొవ్వాడ శేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు తౌడుబాబు, గోపాల్, మీసాల.శ్రీనివాసరావు, మజ్జి తిరుపతిరావు, సారిపల్లి గౌరీశంకర్, సౌదామిని, పి.ఆదినారాయణలు పర్యవేక్షించారు. -
● ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తలపెట్టిన నిరసన వారంలో భాగంగా రాజాం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేశారు. నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి మెమో 57ను అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, యాప్లను, అసెస్మెంట్ బుక్లెట్ విధానాలను రద్దుచేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి మధన్మోహన్, విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు లంక రామకృష్ణ, ఎలకల భాస్కరరావు, నల్ల రవికుమార్, ఎందువ సీతంనాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ మీసాల సత్యంనాయుడు, రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీఆర్కే నాయుడు, బెవర శ్రీనివాసరావు, వి.తారకేశ్వరరావు, శెట్టి శివరావు, వై.రామకృష్ణ, పి.శ్రీకర్, డి.మహేష్, వై.గౌరినాయుడు, రాజేశ్వరి, మాధురి, గీత తదితరులు పాల్గొన్నారు. – రాజాం సిటీ -
స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీలకు 37 మంది ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ బాల, బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఎంపికలు నిర్వహించారు. అండర్–14 విభాగంలో బాలురకు, అండర్–17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించిన పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 200మందికి పైగా క్రీడాకారులు హాజరై పోటీ పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ బరువుల కేటగిరీల వారీగా ఎంపికలు నిర్వహించగా రెండు విభాగాల్లో మొత్తం 37 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు అర్హత సాధించినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు తెలిపారు. పోటీలను బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల మన్మథకుమార్ ప్రారంభించగా..శాప్ కోచ్ బి.ఈశ్వరరావు, ఖేలో ఇండియా కోచ్ సీతారామంజనేయులు పర్యవేక్షించారు. పోటీలకు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. -
పట్టణాలకు రోగుల పరుగు..!
● నాడు ఇళ్లవద్దకే వైద్యసేవలు ● నేడు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ● గిరిజన ఆరోగ్యంపై సర్కారు చిన్నచూపువైద్యశిబిరాల నిర్వహణకు ప్రణాళికలు జిల్లాలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నందున వైద్యశిబిరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ప్రస్తుతం 104 సంచార వాహనాల ద్వారా వైద్యసేవలందిస్తున్నాం. వైద్యశిబిరాల నిర్వహణకు సంబంధించి వైద్యులను అందుబాటులో ఉంచాం. అతి త్వరలో గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించి గిరిజన, మైదాన ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తాం. – ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్ఓ, పార్వతీపురం మన్యంపార్వతీపురంటౌన్: అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు, విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంది. గిరిజన, గిరిశిఖర గ్రామాల్లో విషజ్వరాలు విలయతాండవం చేస్తున్నాయి. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన ప్రభుత్వం, యంత్రాంగం గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఇంటికో జ్వరపీడితుడు ఉన్నా తూతూ మంత్రంగానే వైద్యసేవలు అందుతున్నాయి తప్ప తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని గిరిజనులు వాపోతున్నారు. గ్రామాల్లో సరిగ్గా వైద్యసేవలు అందక, పీహెచ్సీల్లో సరైన వైద్యం అందక పట్టణాల్లో గల ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీసి వైద్యం చేయించుకోవల్సిన దుస్థితి గిరిజనులకు ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గిరిజన, మైదాన ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించి గ్రామాల్లోనే సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో వైద్యశిబిరాలను నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సల నిమిత్తం కార్పొరేట్ వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకువచ్చారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్య సమస్య తలెత్తరాదనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో నెలకు రెండుసార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇళ్లవద్దనే పరీక్షలు నిర్వహించి గ్రామాల్లోనే 105 రకాల మందులను అందజేసి గిరిజనుల ఆరోగ్యానికి భద్రత కల్పించారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని, గిరిజనులంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. నాడు 1,42,191 మందికి గ్రామాల్లోనే వైద్యసేవలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గిరిజన, మైదాన గ్రామాల్లో కార్పొరేట్ వైద్యులతో వైద్యశిబిరాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 364 వైద్యశిబిరాలు నిర్వహించి 1,42,191 మందికి వైద్యసేవలు అందించారు. అందులో 91,178మందికి బీపీ, 4,571మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించి చికిత్స, వారికి అవసరమైన మందులను అందజేశారు. 2,547మందిని వివిధ రోగాల నిమిత్తం వారిని గుర్తించి మెరుగైన వైద్యసేవల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి రిఫర్చేయగా 2,316 మందికి చికిత్స పొందారు. 18,773 మందికి కంటివైద్యపరీక్షలు నిర్వహించి 1260మందికి కేటరాక్ట్ సమస్య గుర్తించి 232మందికి శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఈ శిబిరాల్లోనే 1,229మందికి కళ్లజోళ్లను అందజేశారు. ఫ్యామిలీ డాక్టర్తో ఇళ్లవద్దకే వైద్యసేవలు దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతిరోజూ గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం వైద్యసేవలు అందించింది. గిరిజన గ్రామాల్లో మంచాన పడి ఉన్న గర్భిణులు, వృద్ధుల ఇళ్లవద్దకే వెళ్లి ఉదయం సమయంలో వైద్యసేవలు అందించి మధ్యాహ్న సమయంలో గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి వైద్యసేవలను అందించేవారు. గ్రామాల్లోనే రక్తపరీక్షలు నిర్వహించి రోగాలను గుర్తించి మందులను అందించేవారు. పట్టణాలకువెళ్లే పరిస్థితి లేకుండా గ్రామాల్లోనే 105 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. ఆ పరిస్థితి కానరాదు గ్రామాల్లో గతంలో మాదిరి వైద్యసేవలు అందే పరిస్థితి ప్రస్తుతం లేదు. తూతూ మంత్రంగానే 104 వాహనాల ద్వారా వైద్యసేవలు అందించి మమ అనిపిస్తున్నారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు, మారుమూల గ్రామస్తులు వేడుకుంటున్నారు. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ దూరప్రాంతాలకు ప్రయాణం చేసి ఆస్పత్రుల వద్ద లైన్లో నిలబడి వైద్యం పొందాల్సిన దుస్థితి ఉందని ప్రభుత్వం, యంత్రాంగం ఇప్పటికై నా స్పందించి గ్రామాల్లో వైద్యసేవలు, రక్తపరీక్షలు, మందులు, వైద్యశిబిరాలు అందుబాటులోకి తీసుకువచ్చి గిరిజన ఆరోగ్యానికి భద్రత కల్పించాలని ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. -
● మోసం చేశారు.. ఆదుకోండి
రాజాంలోని ఓ ప్రైవేటు ఏజెన్సీ వద్ద గంగోత్రి రకం విత్తనాలు కొనుగోలు చేశాం. సుమారు 350 ఎకరాల్లో సాగుచేశాం. నాసిరకం విత్తనాలు కావడంతో కేళీలు వచ్చాయి. పంట సమయానికి ముందే కంకులు వచ్చాయి. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకుంది. ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకుని ఎకరాకు రూ.50వేలు చొప్పున పరిహారం ఇప్పించాలంటూ రాజాం మండలంలోని నాయుడువలస, అమరాం గ్రామ రైతులు జిల్లా అధికారులను వేడుకున్నారు. వరి దుబ్బులను తెచ్చి కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. రైతు కష్టాన్ని గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు లోకవరపు ఆదినారాయణ, జి.వెంకటరమణ, ఎం.రామభగవన్దాసు, చిన్నంనాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. – విజయనగరంఫోర్ట్ -
● విద్యుత్ ఉద్యోగుల పోరుబాట
విద్యుత్ సంస్థలో దీర్ఘకాలంగా ఉన్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం దాసన్నపేట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఉద్యోగులు సోమవారం ధర్నా చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యధోరణి అవలంభిస్తున్నాయన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. జిల్లా కేంద్రంలో 19, 20 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు, 22న జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు మెమొరాండం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సురగాల లక్ష్మణ్, కన్వీనర్ బండారు రాజేష్కుమార్, కో చైర్మన్ పి.అప్పలస్వామినాయుడు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
ఆందోళన వద్దు.. వదంతులు నమ్మవద్దు
● రూరల్ సీఐ రంగనాథంపార్వతీపురం రూరల్: మండలంలోని బాలగుడబ గ్రామ సమీపంలో గల నేలబావి వద్ద ఉన్న దుర్గాదేవి ఆలయంలో విగ్రహం ధ్వంసం జరిగిందన్న ఘటనపై పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై సంతోషికుమారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరిగిన ఘటనపై వివరించారు. కొన్నేళ్ల క్రితం అమ్మవారి విగ్రహంలో ఎడమచేయి శిథిలమవడంతో మరమ్మతులు చేసి స్థానిక భక్తులు ఏర్పాటు చేశారని ఈ మేరకు క్రమేణా మళ్లీ అదే చోట శిథిలమైనట్లు తమకు సమాచారం వచ్చిన వెంటనే క్లూస్టీం ద్వారా పరిశీలించి, అ స్థానిక గ్రామ పెద్దలు, భక్తులతో మాట్లాడి విచారించిన అనంతరం ఎలాంటి విధ్వంస చర్యలు జరగలేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఎవరూ ఆందోళన చెందనవసరంలేదని, అలాగే ఇలాంటి సున్నితమైన విషయాలు, వదంతాలు స్పష్టత లేకుండా నమ్మవద్దని తెలిపారు. -
జనసేన మండల అధ్యక్షుడిపై పిర్యాదు
సీతంపేట: సోషల్ మీడియా వేదికగా సర్పంచ్లను దుర్భాషలాడినందుకు జనసేన పార్టీ సీతంపేట మండల అద్యక్షుడు మండంగి విశ్వనాథంపై కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓలకు ఫిర్యాదు చేసినట్లు మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు సోమవారం తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 73వ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 243 ప్రకారం రాజ్యాంగం 11వ భాగం ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ఎన్నికై గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వ్యవస్థపై అసభ్యపదజాలం, పోస్టింగ్లతో కించపరిచే విధంగా సోషల్మీడియాలో పోస్టులు పెట్టిన విశ్వనాథంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నికై న తాము ఏనాడు పార్టీల పరంగా భేదాభిప్రాయాలు తలెత్తేలా నడుచుకోలేదన్నారు. ఇప్పుడు జనసేన నాయకుడు సర్పంచ్లను దొంగనాకొడుకులు అంటూ అసభ్యంగా పెట్టిన పోస్టులు తమ మనోభావాలు పూర్తిగా దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. శాంతిభద్రతలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన విశ్వనాథంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, సర్పంచ్లు ఎన్.తిరుపతిరావు, కె.వెంకునాయుడు, ఎస్.బాపయ్య, హెచ్.ఆదిలక్ష్మి, జె.సుందరమ్మ, బి.తిరుపతిరావు, ఎస్.ప్రవీణ్, ఇసోని, రాజయ్య, జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు ఎస్.లక్ష్మి, ఎంపీటీసీలు ఎస్.చంద్రశేఖర్, ఎస్.మంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైల్లో తనిఖీలు
పార్వతీపురం రూరల్: గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నివారించేందుకు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాయపూర్ పాసింజర్ రైల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, డాగ్స్క్వాడ్, ఈగల్ టీం సంయుక్తంగా పార్వతీపురం రూరల్ సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి. సంతోషికుమారి తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్లో, భోగీలలో ప్రయాణికుల లగేజీలను, అనుమానితులను తనిఖీ చేసినట్లు ఆమె చెప్పారు. అప్రమత్తంగా ఉండి సమాచారం ఇవ్వండి సాలూరు పట్టణంలో సోమవారం జరిగిన చైన్స్ స్నాచింగ్కు సంబంధించిన నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరి మీదనైనా అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సంతోషి కోరారు. ఈ సందర్భంగా నిందితులు పరారవుతున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చిత్రాలను ఆమె విడుదల చేశారు.భవనంపై నుంచి జారిపడి కార్మికుడి మృతి పార్వతీపురం రూరల్: జిల్లాకేంద్రంలోని సౌందర్య థియేటర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనం పైనుంచి శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆరిక మోహనరావు(43) అనే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. ఈ మేరకు ప్రాధమిక విచారణలో నిర్ధారించినట్లు పార్వతీపురం పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. మృతుడు కిందికి ప్రమాదవశాత్తు జారిపడిన సమయంలో సమీపంలో గల కళాశాల విద్యార్థి ఒకరు చూసినట్లు ఎస్సై చెప్పారు. కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీ లిక్కిడిగూడ గ్రామానికి చెందిన మోహనరావు భార్య సుహాసిని ఇటీవల మరణించింది. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీసాలూరు: పట్టణంలోని రామాకోలనీలో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రామా కాలనీకి చెందిన అక్కేరపు సత్యవతి(65) సోమవారం మధ్యాహ్నం ఇంటిలో నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి తలుపుకొట్టడంతో ఆమె బయటకు వచ్చింది.ఆమెకు ఇంటిపక్కనే ఖాళీగా ఉన్న రెండో ఇల్లు అద్దెకు కావాలని, ఇల్లు చూపించమని ఆ వ్యక్తులు కోరారు. ఈ క్రమంలో ఇంట్లో బెడ్ రూం ఎక్కడ ఉందో చూపించమనగా ఆమె ఇంటిలోకి వెళ్లింది. దీంతో ఓ వ్యక్తి ఆమె చేతులను గట్టిగా పట్టుకోగా రెండో వ్యక్తి ఆమె మెడలో గల సుమారు 5 తులాల బంగారు గొలుసును తెంపేసి వెంటనే ఓ స్కూటీపై పరారయ్యారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రాగా అప్పటికే దొంగలు పారిపోయారు. తరువాత ఆమె స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు తాడ్డి రమణ తదితరులతో కలిసి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
విజయనగరం
కాలుష్యంతో మత్స్యసంపద నాశనం.. మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025మత్స్యకారులను వీడని.. జెట్టీ చింత..! మిత్రమా.. నిన్ను మొక్కల్లో చూసుకుంటాం... నెల్లిమర్ల రూరల్: విజయనగరం రింగ్ రోడ్డులో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో నెల్లిమర్ల మండలం సారిపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆల్తి కుమార్గణపతి చనిపోయాడు. స్నేహితుడి జ్ఞాపకార్థం తోటి విద్యార్థులు సోమవారం మొక్కలు పంపిణీ చేశారు. ప్రజలు పెంచుకునే మొక్కల్లో తమ స్నేహితుడిని చూసుకుంటామని, తాము కూడా మొక్కలు నాటి పెంచుతామని విద్యార్థులు తెలిపారు. నేరాల నియంత్రణే లక్ష్యం ● ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్ విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవా ణాను అడ్డుకోవడం, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎస్పీకు అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీనివాస్, బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, లీగల్ అడ్వయిజర్ వై.పరశురాం తదితరులు పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులకు దిశానిర్దేశం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దామోదర్ జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మహిళలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. పోలీస్ విధులను నిర్వహించడంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు సమష్టిగా ముందుకు సాగాలన్నారు. ఉపకార వేతనాలకు రిజిస్ట్రేషన్ విజయనగరం టౌన్: ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థుల వివరాలను జ్ఞానభూమి కళాశాల లాగిన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కళాశాల లాగిన్లో ఆప్షన్ ఇచ్చామని సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు డి.వెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ పొందేందుకు, ప్రెష్, రెన్యువల్ విద్యార్థుల వివరాలు ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీ, కాపు, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు అర్హులని పేర్కొన్నారు. చింతపల్లి తీరంలో వేటసాగక ఒడ్డున నిలిపిన బోట్లు పూసపాటిరేగ: విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. సముద్రంలో చేపల వేటపై సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వీరిలో 6 వేల మంది చేపలవేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. వారిపై పరోక్షంగా 15 వేల మంది ఆధారపడ్డారు. రెండు మండలాల్లో 885 బోట్లలో సుమారు 4 వేల మంది మత్స్యకారులు నిత్యం వేట సాగిస్తుంటారు. జెట్టీ లేకపోవడంతో వేట కష్టాలు వెంటాడుతున్నాయి. తుఫాన్ల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేట సాగిస్తున్నారు. జీవనోపాధి కోసం విశాఖపట్టణం, గుజరాత్, హీరావల్, సూరత్ తదితర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. అక్కడి ఫిషింగ్ కంపెనీల్లో నెలల తరబడి పనిచేస్తూ కుటుంబ పోషణ కోసం డబ్బులు పంపిస్తున్నారు. వీరిలో చాలామంది సముద్రంలో జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కూడా విడుస్తున్నారు. స్థానికంగా జెట్టీ లేకపోవడమే మత్స్యకారుల బతుకుకు భరోసా కరువైంది. జెట్టీ నిర్మించేదెప్పుడు? పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకారుల జీవన కష్టాలను గుర్తించిన గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శంకుస్థాపన కూడా చేసింది. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ఉత్తర్వులు మరుగునపడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ ప్రక్రియపై నోరుమెదిపేవారే కరువయ్యారు. మత్స్యకారుల కష్టాలు గుర్తించేవారే లేరు. జెట్టీ నిర్మాణంపై ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యాన్ని మత్స్యకారులు తప్పుబడుతున్నారు. మత్స్యకారుల వలస బతుకులు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వంద రోజుల్లో వంద కంపెనీలు తెస్తామంటూ ఉత్తుత్తి కబుర్లు చెప్పే పాలకులు కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్లోటింగ్ జెట్టీ పనులైనా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ వేట సాగకపోవడంతో సుమారు 3వేల మంది వలసలపైనే ఆధారపడి జీవిస్తున్న పరిస్థితులు గమనించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. మత్స్యకారుల కష్టాలు గుర్తించాం.. జిల్లా తీరప్రాంత మత్స్యకారుల కష్టాలను గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. సుమారు 23 కోట్లతో చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్ జెట్టీ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా జెట్టీ నిర్మాణం కోసం కనీసం పట్టించుకోకపోవడం విచారకరం. మత్స్యకారులకు జెట్టీ అవసరాన్ని గుర్తించాలి. జెట్టీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. మత్స్యకారులకు జీవన భరోసా కల్పించాలి. – బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే ఎదురు చూస్తున్నాం చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు జెట్టీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేటకు ఎదురీదుతున్నాం. ప్రభుత్వం స్పందించి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి. – బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు, విజయనగరం ఓ వైపు జెట్టీ లేదు.. మరోవైపు పరిశ్రమల రసాయన వ్యర్థాలు సంద్రంలో కలుస్తుండడంతో పూసపాటిరేగ, భోగాపురం తీరంలో చేపలవేట సాగడం లేదు. ఇక్కడ మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతోంది. కొంత కాలం కిందటి వరక వేట అనుకూలించేదని, ప్రస్తుత పరిస్థితి చూస్తే భిన్నంగా ఉందని మత్స్యకారులు వాపోతున్నారు. చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మిస్తే వేట కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మోక్షగుండంను ఆదర్శంగా తీసుకోవాలి విజయనగరం అర్బన్: ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి కోరారు. మోక్షగుండం జయంతిని పురస్కరించుకుని వర్సిటీలో సోమవారం ఇంజినీరిండ్ డేను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ ఇంజినీర్లు ప్రొఫెషనల్గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనాలని కోరారు. దేశాభివృద్ధికి మోక్షగుండం చేసిన కృషిని కొనియాడారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.ఉమాశంకర్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జీజే నాగరాజు, సివిల్ విభాగాధిపతి డాక్టర్ జి.అప్పలనాయుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.జగన్మోహన్ పాల్గొన్నారు. మత్స్యకారులకు సముద్రమే జీవనాధారం. అలలపైనే జీవన గమనం. వేటసాగితేనే నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేది. లేదంటే కడలి తీరంలో పస్తుల జీవనం. వరుస తుఫాన్లు వారి బతుకుల్లో అలజడి రేపుతున్నాయి. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇక్కడి మత్స్యకారుల వేట చింత తీర్చేలా, వలసలకు చెక్పెట్టేందుకు వీలుగా పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో రూ.23 కోట్లతో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి ఉత్తర్వులు జారీచేయడంతో మత్స్యకారుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. మత్స్యకారులు గొంతెత్తి అరుస్తున్నా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జెట్టీ నిర్మాణం గురించి కనీసం పట్టించుకోకపోవడం ఆవేదన నింపుతోంది. చింతపల్లి తీరంలో జెట్టీ నిర్మాణానికి గత ప్రభుత్వం చర్యలు రూ.23 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం మారడంతో ఎండమావిగా మారిన ఫ్లోటింగ్ జెట్టీ జెట్టీ నిర్మాణంపై ఊసెత్తని కూటమి సర్కారు పట్టించుకోని స్థానిక పాలకులు మత్స్యకారులకు తప్పని వలస బతుకులు -
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
● జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సమర్పించే అర్జీదారుల వినతులకు సత్వరమే పరిష్కారం చూపాలపి పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన అధ్యక్షతన జరిగిన పీజీఆర్ఎస్లో సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, సబ్కలెక్టర్ ధర్మచంద్రారెడ్డిలు అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో కొమరాడ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన ధాత్రిశ్రీ తల్లికి వందనం డబ్బులు జమకాలేదని, జిల్లా కేంద్రంలోని కొత్తవలసకు చెందిన రౌతు పారినాయుడుకు పింఛన్ మంజూరు చేయాలని, వెంకటసాగరం ఆయకట్టులో 40 ఎకరాలకు సక్రమంగా నీరు అందించాలని సీతానగరం మండలం అంకలాం రైతులు కోరారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులకు పరిష్కారం చూపండి పార్వతీపురం రూరల్: ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధిత పోలీసుశాఖ అధికారులు జవాబుదారిగా వ్యవహరించి పరిష్కారం చూపాలని ఏఎస్పీ అంకితా సురానా అన్నారు. అలాగే నిర్దేశించిన సమయంలోనే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వచ్చిన 10 ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 42 అర్జీలు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. ముగడపేటకు చెందిన రమణమ్మ హౌసింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి అందజేసింది. యోగా టీచర్ పోస్టు ఇప్పించాలని మండ గ్రామానికి చెందిన సవర శ్రీను, కొండపోడు పట్టాలు ఇప్పించాలని బంజారుపేట గిరిజనులు కోరారు. జీజీవలస గ్రామస్తులు శ్మశానవాటికకు సీసీ రోడ్డు, ప్రహరీని నిర్మించాలని వినతులు అందజేశారు. పెద్దగూడకు చెందిన సవర మంగయ్య బ్యాటరీ స్ప్రేయర్ ఇప్పించాలని, కమ్యూనిటీహాల్ మంజూరు చేయాలని కరడంగివలస గ్రామస్తులు కోరారు. పీజీఆర్ఎస్లో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈవో రామ్మోహన్రావు, ఉపవైద్యాధికారి విజయపార్వతి, ఏపీడీ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
గజపతినగరంలో ఉద్రిక్తత.. యూరియా కోసం రైతుల కొట్లాట
విజయనగరం: గజపతినగరం పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతుల ఆందోళనకు దిగారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో రైతుల కొట్లాటకు దిగారు. కుర్చీలు విరిగేలా టీడీపీ నేతలు, రైతులు కొట్టుకున్నారు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై రైతులు తిరగబడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పడనిరాని పాట్లు పడుతున్నారు.అనకాపల్లి: హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో యూరియా కోసం రైతుల పాట్లు పడుతున్నారు. ఎస్. రాయవరం మండలం కొరుప్రోలు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా సక్రమంగా పంపిణీ చేయలేదంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని రైతులు డిమాండ్ చేశారు.కాగా, కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత బొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలి
● సీఐటీయూ రాష్ట్ర నాయకులు ● ముగిసిన మహాసభలుపాలకొండ: ప్రజాసమస్యల పరిష్కారమే కార్మిక సంఘాల లక్ష్యం కావాలని విప్లవవాది, సినీనటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. రెండు రోజులుగా పాలకొండ పట్టణంలో నిర్విహిస్తున్న సీఐటీయూ 11వ జిల్లా మహసభలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశంలో నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకు అని తెలిపారు. సమసమాజ స్థాపన కోసం కార్మిక నాయకులు పోరాటాలు చేయక తప్పదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పోరాటాలపై నిర్బంధాలు విధిస్తున్నాయని మండిపడ్డారు. పోరాటాలతోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. కార్మికులు, ఉద్యోగులు, చివరికి అధికారులపైన కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులు చేపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం ఎమ్మెల్యే కార్మికులపై ఉక్కుపాదం మోపే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. అణిచివేత ధోరణితో ప్రభుత్వం పాలన సాగిస్తోందని, పోలీసులను పావులుగా వాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ మహాసభల్లో చూపించిన స్ఫూర్తితో పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం 47 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. ఈ సమావేశాల్లో పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు దావాల రమణారావు, మన్మథరావు, ఎం.కృష్ణమూర్తి, కె.రామస్వామి, తిరుపతిరావు పాల్గొన్నారు. -
క్రైస్తవ విశ్వాసులు లోకానికి వెలుగునివ్వాలి
● ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక వేత్త బెన్నీ ప్రసాద్ ● ముగిసిన సిమ్స్ బాప్టిస్ట్ చర్చి 150వసంతాల వేడుకవిజయనగరం టౌన్: క్రైస్తవ విశ్వాసులు లోకానికి వెలుగై ఉన్నారని, అటువంటి క్రైస్తవులందరూ దీపంలా అనేకులకు వెలుగునివ్వాలని ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక వేత్త బెన్నీ ప్రసాద్ (బెంగళూరు) పేర్కొన్నారు. సిమ్స్ బాప్టిస్ట్ చర్చి 150వసంతాల వేడుకల్లో చివరిరోజు ఆదివారం చర్చి ఆవరణలో నిర్వహించిన ఆధ్యాత్మిక సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పాటూ జిల్లాలోని ఆధ్యాత్మిక క్రీస్తు సహోదరులకు ఆయన దైవసందేశాన్ని అందజేశారు. ఆయన ఆంగ్లభాషలో చెప్పిన దేవుని వాక్యాలను పాస్టర్ యబ్బోజు చౌదరి తెలుగులోకి అనువదించి భక్తులకు వివరించారు. విశ్వాసంతో, ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుని రక్షణ పొందగలమన్నారు. అద్భుతమైన గిటార్ వాయిద్య సహకారంతో దేవుని కీర్తనాలాపన చేస్తూ, ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ మాట్లాడుతూ సిమ్స్ చర్చి 150వసంతాల వేడుకలను పెద్దలందరి సహాయ, సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోగలిగామన్నారు. ఐదురోజుల పాటు నిర్వహించిన క్రైస్తవ మహాసభలకు హాజరై ఆధ్యాత్మిక దైవసందేశాన్నిచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిమ్స్ జూబ్లీ కమిటీ చైర్మన్ ఎం.ఎ.నాయుడు, కార్యదర్శి తాలాడ ఆనందరావు, వై.ప్రభాకర్, ఆశాజాన్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రెస్క్యూ
పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో వంతెనపై నుంచి నాగావళి నదిలో శనివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మహిళ దూకిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అటు విజయగరం జిల్లా రేగిడి, ఇటు మన్యం జిల్లా పాలకొండ సివిల్ పోలీసులతో పాటు స్థానిక అగ్నిమాపక అధికారులు వెతుకులాట చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అనుభవజ్ఞులైన ఈతగాళ్లతోపాటు డ్రోన్ సాయంలో కొంత మేరా శోధించారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేనట్లు స్థానిక ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. కేవలం వంతెనపై లభించిన పాదరక్షలు మినహా ఎటువంటి క్లూ గాని, మహిళను సజీవంగా, నిర్జీవంగా గుర్తించలేదన్నారు. తీరం వెంబడి గ్రామాలకు సమాచారం అందించామని, ఇరు జిల్లాల పరిధిలో ఎక్కడా మిస్సింగ్ కేసులు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. -
అర్ధరాత్రి ఇంట్లో దోపిడీ
చికెన్కొత్తవలస: మండలంలోని చింతలపాలెం సమీపంలో గల శీరంశెట్టివానిపాలెం గ్రామంలో ఒక ఇంటిలో అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టి తీయగానే ఇంటిలోకి ప్రవేశించి కుటుంబసభ్యులను బంధించి బంగారం, నగదును దుండగులు దోచుకుపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మీసాల రవిప్రకాష్ గ్రామానికి కొంతదూరంలో ఇల్లు కట్టుకుని కుటుంబంతో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి రవిప్రకాష్ కేటరింగ్ పని నిమిత్తం గాజువాక వెళ్లాడు. ఇంట్లో భార్య సత్యవతి, మామ, అత్త, ఇద్దరు పిల్లలు తలుపులు గడియలు పెట్టి నిద్రపోయారు. ఈ క్రమంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టడంతో రవిప్రకాష్ మామ తలుపు తెరిచాడు. సదరు దుండగుడు ఒక్క సారిగా ఆయనపై విరుచుకుపడి స్క్రూడ్రైవర్తో చెవిభాగంలో పొడిచి లోనికి ప్రవేశించాడు.ఇంతలో మరో ఐదుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు తొడుక్కుని ఇంటిలోకి ప్రవేశించారు. అత్త, మామను ఒక గదిలోను, భార్య సత్యవతి, ఇద్దరు పిల్లలను మరో గదిలో బంధించి బంగారం, డబ్బు ఎక్కడ ఉందో చెప్పాలని భయభ్రాంతులకు గురిచేశారు. గొడవ చేసి అరిస్తే చంపేస్తాం అంటూ హిందీ, తెలుగు బాషల్లో భయపెట్టారు. పరిశీలించిన పోలీసులు బలవంతంగా బీరువా తెరిచి అందులో గల బంగారం తాడు, ఉంగరం, శతమానాలు తదితర వస్తువులు రెండున్నర తులాల బంగారం, కొంత వెండి, రూ 24వేల నగదు దోచుకున్నారు.రవిప్రకాష్ అత్త చేతులకు ఉన్న గాజులు, చెవిదిద్దులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవి ఇత్తడి వస్తువులు అని చెప్పినా వినకుండా వాటిని సైతం లాక్కుని పోయారు. మొత్తం ఆరుగురు దుండగులు చేతికి అందింది దోచుకుని బయటకు వెళ్లి తలుపు గడియ పెట్టి వెళ్లిపోయారు. దీంతో రవిప్రకాష్ అత్తయ్య వద్ద గల ఫోన్లో గాజువాకలో గల రవిప్రకాష్కు జరిగిన విషయం తెలియపరచగా ఆయన పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. అందరూ వచ్చి తలుపులు తీయగా కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. బాధితుడు రవిప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, స్థానిక ఎస్సై ఎన్.జోగారావుతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విజయనగరం నుంచి ప్రత్యేక క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జోగారావు తెలిపారు. హడలిపోయిన కుటుంబ సభ్యులు -
ప్రకృతి అందాల కనువిందు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం పరిసర ప్రాంతాలు సహజ సిద్ధ సౌందర్యానికి నిలయంగా మారుతున్నాయి. ఒక వైపు ఎత్తైన బోడికొండ. మరో వైపు నిండుకుండలా చెరువు ఎంతో అందంగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు రామతీర్థం, సీతారామునిపేట పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఉన్న వరి పంట పొలాలు పచ్చని సౌందర్యంతో కనువిందు చేస్తున్నాయి. ఈ దృశ్యాలు కళ్లకు హాయినిస్తూ, మనసుకు ఆనందాన్ని పంచుతున్నాయని ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు. ఆదివారం ఈ అందమైన దృశ్యాలను సాక్షి తన కెమోరాలో బంధించింది. -
కొనసాగిన ఉపాధ్యాయుల నిరసన వారం
విజయనగరం అర్బన్: ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న నిరసన వారం కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట ఉపాధ్యాయులు నిరసన నినాదా ల కార్యక్రమం చేపట్టారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇంతవరకు పెండింగ్లో ఉన్న 4 డీడీలు విడుదల చేయాలి. సీపీఎస్ రద్దు, ఐఆర్ (ఐఆర్) ప్రకటన, బకాయిల చెల్లింపు హెల్త్ కార్డు పరిమితి పెంపు, అసెస్మెంట్ బుక్లెట్ విధానం రద్దు తదితర డిమాండ్లు పరిష్కరించాలని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ కర్రి రవి, జిల్లా అధ్యక్షుడు షేక్ బుకారీ బాబూ, ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్ కర్రి రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మజ్జి రమేష్, మార్రాపు శ్రీనివాస్, కె.వెంకునాయుడు, టి.శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, సుగుణాకరరావు, పి.సత్యన్నారాయణ కె.వెంకటరావు పాల్గొన్నారు. మంత్రి కొండపల్లికి వినతి -
గురజాడ నివాసాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి
విజయనగరం గంటస్తంభం: సాహిత్య కారుడు, మహాకవి గురజాడ అప్పారావు నివాసాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామారావు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక మయూరి జంక్షన్ నుంచి గురజాడ అప్పారావు నివాసం వరకూ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సమాజంలోని అసమానతలను బటయపెట్టారన్నారు. ప్రభుత్వం గురజాడ నివాసాన్ని స్వాధీనం చేసుకుని, స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు ప్రజలు అందరూ గౌరవంతో దర్శించుకునే విధంగా గురజాడ గృహాన్ని పునఃనిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురజాడ అప్పారావు జయంతి, వర్ధంతిలను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సూచించారు. ఆయన పేరు మీద సాంస్కృతిక విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పారు. సైన్స్వాక్లో పాల్గొన్న కళాకారులు గురజాడ గేయాలను ఆలపించి, గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకులు, మహాసభ ప్రతినిధులు, కవులు, విద్యావేత్తలు,మేధావులు, కళాకారులు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక డిమాండ్ -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
పాలకొండ రూరల్: ఈనెల 24 నుంచి 28 వరకూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సంబంఽధించిన జిల్లా జట్టు ఎంపిక ఆదివారం పాలకొండలో జరిగింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో జరిగిన ఈ ఎంపిక పోటీలకు జిల్లా పరిధిలో 15 మండలాలకు చెందిన 20 ఏళ్ల లోపు ఔత్సాహికులు హాజరయ్యారు. జూనియర్ విభాగానికి చెందిన ఎంపికలో బాలురు 70 మంది, బాలికలు 50 మంది ప్రతిభ కనబర్చారు. తుది జట్టులో 14 మంది వంతున రెండు జట్లను బాల,బాలికల నుంచి ఎంపిక చేశారు. అత్యంత ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ సంఘం గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు, అధ్యక్షుడు కోడి సుదర్శనరావు, కార్యదర్శి వెన్నపు చంద్రరావు(శేఖర్) తదితరులు తెలిపారు. -
విద్యార్థులతో చెలగాటం..!
పార్వతీపురం రూరల్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు దాదాపు 10 ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై నేటికి ఐదు నెలలు కావస్తున్నా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు నేటికీ అడ్మిషన్లు కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ ప్రవేశాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఏడాదిలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా సెప్టెంబర్ 3వ వారం వచ్చినా అడ్మిషన్లు జరగక తరగతులు ప్రారంభం కాక విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విడతల వారీగా చేపట్టిన ప్రవేశాలు ఇప్పటికే పూర్తయి తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పట్ల విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా వాయిదా దాదాపు 30వేలమంది విద్యార్థులు ప్రతి ఏడాది వివిధ కోర్సుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న సుమారు 191 డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరట డబుల్ మేజర్ విధానం తెచ్చేందుకు మూడు నెలల క్రితం దానికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చి కళాశాలల ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అయితే ప్రక్రియ అంతా ముగిసిన వెంటనే మళ్లీ పాత విధానం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మళ్లీ కళాశాలల యాజమాన్యాలను కొత్తగా కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని హడావిడి చేశారు. ఈ పక్రియ కూడా పూర్తయ్యాక గత నెల 20న ఆన్లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగస్టులో 20 నుంచి 26వరకు ప్రవేశాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఆగస్టు 24 నుంచి 28 వరకు వెబ్ అప్షన్లకు గడువు ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 1 నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెబ్సైట్లో సాంకేతిక లోపంతో సకాలంలో తెరుచుకోకపోవడంతో ఈనెల 3వ తేదీవరకు ప్రవేశాలకు, 4వ తేదీవరకు ఆప్షన్లు పెట్టుకోవడానికి గడువు పొడిగించారు. ఈనెల 8వ తేదీన సీట్ల కేటాయింపు, కళాశాలల్లో విద్యార్థుల రిపోర్టింగ్కు గడువు ఇచ్చారు. ఈనెల 9న ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతుల నిర్వహణ ప్రారంభమవుతుందని మరోసారి తాజాగా ఇచ్చిన షెడ్యూల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే గడువు పూర్తయినప్పటికీ నేటివరకు విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తి కాలేదు. సోమవారం జరిగే అవకాశం ఉంటుందని వారికొచ్చిన సమాచారం మేరకు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మొదటి విడత సీట్ల కేటాయింపుపై ఇంతవరకు స్పష్టత లేక కాకపోవడంతో రెండు, మూడు విడతలకు సంబంధించి అలాగే స్పాట్, యాజమాన్య కోటా ప్రవేశాలు జరగడానికి మరికొంత జాప్యం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వం చేసిన ఈ జాప్యం కారణంగా మొదటి ఏడాది సిలబస్, సబ్జెక్టు క్రెడిట్లో మార్పులు చేశారు. ప్రవేశాలు పూర్తయ్యి తరగతులు ప్రారంభమయ్యే సమయానికి మార్కెట్లో పుస్తకాలు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన కూడా విద్యార్థులను పీడిస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ ప్రవేశాల్లో భారీగా తగ్గుదల ఉంటుందని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఆందోళన చెందుతున్నాయి. డిగ్రీ ప్రవేశాల్లో గందరగోళం ఇప్పటికే సీట్లు ఖరారై పలుమార్లు వాయిదా ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 30వేలమంది ఎదురు చూపు తరగతులు నిర్వహిస్తున్నా అడ్మిషన్లు కాకపోవడంతో ఆందోళన ఇంటర్ ఫలితాలు విడుదలైనా ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం సగం విద్యాసంవత్సరం గడిచింది గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యంతో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ తీవ్ర జాప్యం నెలకొంది. కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే దీనికి కారణం. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం కూడా గడిచిపోయింది. మిగిలిన తరగతుల విద్యార్థులంతా త్వరలో సెమిస్టర్ పరీక్షలు రాయనున్నారు. కానీ డిగ్రీ మొదటి సంవత్సరం సిలబస్ ఎప్పుడు పూర్తి చేస్తారో, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ ఫలితాలు విడుదలై ఐదునెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాలు చేపట్టకపోవడం ముమ్మాటికీ కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం ఈ విధంగా డిగ్రీ విద్యార్థులతో ఆటలాడుకోవడం సరికాదు. ఇంకా ఆలస్యం చేస్తే భవిష్యత్లో విద్యార్థుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. బోను రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, అఖిల భారత విద్యార్థి సమాఖ్య -
‘అంగన్వాడీ’లపై ధరాభారం
రామభద్రపురం: చిన్నారులకు తొలి బడి అమ్మ అయితే.. మలిబడి అంగన్వాడీ కేంద్రాలే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల భవితను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వీటిలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ కనీస ఆలోచన చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో కార్యకర్తలకు భారంగా మారింది. అసలే వారి జీతాలు అంతంత మాత్రం. దీనికి తోడు పాత ధరల ఆధారంగా బిల్లులు చెల్లిస్తుండడంతో వంట ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో పౌష్టికాహారం ఇచ్చి ధరలను పెంచాలని కార్యకర్తలు వినతులు ఇవ్వడంతో పాటు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీ స్కూల్ పిల్లల ఆహారం కోసం కూరగాయలు, ఆకు కూరలు, పసుపు, చింత పండు, కారం, పోపు తదితర సామగ్రి ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. వీటి కొనుగోలుకు ఒక చిన్నారికి వారానికి రూ.50 ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిసింది. ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. వారానికి ఒకరికి కూరగాయలు, పోపులకు రూపాయిన్నర, గ్యాస్కు నెలకు రూ.450 చొప్పున్న ఇస్తున్నారు. సిలిండర్ రూ.950 లకు కొనుగోలు చేస్తున్నామని ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా మెనూ ప్రకారం వండి పెట్టాలంటే అదనపు భారం తప్పడం లేదని అంగన్వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం బిల్లులు మెనూ ప్రకారం 2022 ఫిబ్రవరి ధరలకు అనుగుణంగా ప్రస్తుతం బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరల మూడు రెట్లు పెరిగాయి. అలాగే గ్యాస్ ధర కూడా బిల్లు చెల్లించిన దానికంటే అదనంగా మరో రూ.500 వరకు పెరిగింది. ప్రస్తుతం మెనూ ప్రకారం వండి పెట్టాలంటే తమకు భారంగా ఉందని ప్రస్తుత ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకేనా.. కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించేందుకే బాల్య దశలోనే విద్యా పరంగా గట్టి పునాదులు వేసే అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలలకు చిన్నారులు మళ్లే అవకాశం ఉంది. సాధారణంగా చిన్నారులు ప్రీ స్కూల్కు ఎక్కడ చేరితే అదే విద్యా సంస్థల్లోనే విద్యార్థిగా కొనసాగే అవకాశం ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తే చిన్నారులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ, యూకేజీల్లో చేరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువు కొనసాగిస్తారు. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేకూరుతుంది. కేవలం కార్పోరేట్ విద్యా సంస్థలకు మేలు చేకూర్చేందుకే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆలోచన కూడా అదే రీతిలో ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొత్త ధరలు ప్రకారం బిల్లులు ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. ప్రభుత్వం పెంచిన వెంటనే కొత్త ధరల ప్రకారం బిల్లులు పెడతాం. – ఎం.వరహాలమ్మ, సీడీపీవో, బాడంగి -
అమ్మవారి విగ్రహ ధ్వంసం!
పార్వతీపురం రూరల్: మండలంలోని బాలగుడబ గ్రామ ప్రారంభంలో నేలబావి సమీపంలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం చేతులను గుర్తు తెలియని ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఆలయంలో వున్న హుండీని ధ్వంసం చేసి నగదును సైతం దొంగలించినట్టు విశ్వహిందు పరిషత్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అక్కడకు చేరుకొని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా దేవతామూర్తుల స్వరూపాలపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. దీనిపై సంబంధిత పోలీసు శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీకి, వీహెచ్పీ తరఫున ఫిర్యా దు చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో వీహెచ్పీ సభ్యులు శ్రీనివాసరావు, స్థానికులు ఉన్నారు. పోలీసుల పరిశీలన విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ బి.సంతోషి కుమారి వెంటనే క్లూస్ టీంతో వెళ్లి పరిశీలించారు. గతంలో అమ్మవారి విగ్రహానికి ఉన్న చేయి విరిగిందని, దానిని అతికించిన అనంతరం శిథిలమై ఉండవచ్చునని స్థానికులు తెలియజేశారన్నారు. ఈ మేరకు వివరాలు సేకరించామని ఎస్ఐ తెలిపారు. -
కౌలు రైతుకు కష్టం..!
జిల్లాలో కౌలు రైతుల కష్టాలు చెప్పనలవి కానివిగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. అన్నదాత సుఖీభవ ఇవ్వని కూటమి ప్రభుత్వం... రుణాల మంజూరులో విఫలమైంది. ఇటు ఎటువంటి పెట్టుబడి సాయం అందక... అటు రుణాలు కూడా అందకపోవడంతో కౌలు రైతు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ సాగును కొనసాగిస్తున్నాడు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని విధాల సాయం అందడంతో సంతోషంగా సాగు చేసిన కౌలు రైతులు కూటమి పాలనలో అన్నింటికీ దూరమై కష్టాల నడుమ సాగు కొనసాగిస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: కౌలు రైతుల సంక్షేమానికి పాటు పడతామని ఎన్నికల వేళ గొప్పలు చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక వారి కష్టాన్ని పట్టించుకోవ డం లేదు. కనీసం ఎటువంటి సాయం అందజేయ డం లేదు. కూటమి పాలకులు చెబుతున్న మాటల కు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణకు భూమిని కౌలుకు తీసుకుని రైతులు భూమిని సాగు చేస్తున్నా రు. ప్రకృతి సహకరిస్తే పరవాలేదు. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయాలంటే వారికి పెట్టుబడి కావాలి. ఇందుకోసం వారు ప్రైవేటు వ్యాపారుల దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అందించే సాయంతో పాటు రుణ సాయం కూడా అందని దుస్థితి. దీంతో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా సాధారణ రైతులు మాదిరి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసింది. దీంతో వారు పంటల సాగుకు పెట్టుబడి కోసం అప్పలు చేసే పరి స్థితి తప్పింది. రైతు భరోసా కింద వారికి రూ. 13,500 చొప్పన ఇవ్వడం వల్ల వారు వాటిని విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు పెట్టుబడి సాయంగా ఉపయోగించుకునేవారు. అదేవిధంగా కౌలు రైతులకు రుణాలు కూడా ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మొదట విడతలో కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. ఇంతవరకు రూ.3 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. మిగతా వారికి కూడా రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ఉద్యమానికి రంగం సిద్ధం..!
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, పని చేస్తున్న ఉద్యోగులపై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఆ వ్యవస్థలో అందిస్తున్న సేవలను కనుమరుగు చేసే కుట్ర సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వాలంటరీ సేవలను రద్దు చేశారు. వారి విధులను సచివాలయ ఉద్యోగులకు బలవంతంగా అప్పగించి వారి సహనాన్ని కూటమి ప్రభుత్వం పరీక్షిస్తుంది. మరో వైపు సచివాలయ సిబ్బంది నిర్వహించాల్సిన విధులను తగ్గించకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీల పింఛన్ పంపిణీ తదితర విధులు కూడా నిర్వహించాలని తొలిత పై అధికారుల వినతి నేపథ్యంలో చేపట్టారు. ప్రస్తుతం వాటిని తప్పనిసరి చేస్తూ సచివాలయ సిబ్బందికి పనిభారం పెంచారు. దీనితో పాటు ఉద్యోగులకు న్యాయబద్దంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు విడుదల చేయకుండా ఏడాదిగా పెండింగ్లో ఉంచిన డిమాండ్లతో పాటు పని ఒత్తిడి తగ్గించాలని సచివాలయ సిబ్బంది డిమాండు చేస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జేఎసీ (ఏపీజీడబ్ల్యూఎస్ఈ జేఏసీ) ఐక్యవేదిక ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించింది. జిల్లాలో ఉన్న 626 సచివాలయాలో భర్తీ చేసిన 14 కేటగిరీల వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది 5,498 మంది ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు సర్వీస్లో చేరి ఆరు సంవత్సరాలు పూర్తయినా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పటికీ మంజూరు చేయలేదు. ఒకే కేడర్లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్న నిబంధన అమలు కాలేదు. పనిభారం.. అన్యాయమైన ఆదేశాలను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. పండగలు, ఆదివారాలు, సెలవు దినాల్లోనూ తప్పనిసరి విధులు, ఇంటింటి సర్వేల వల్ల ఉద్యోగుల ఆత్మ గౌరవం దెబ్బతింటోంది. రోజువారీ లక్ష్యాలతో ఒత్తిడితో కుటుంబ జీవితం దూరమవుతోంది. అనైతిక బదిలీల ప్రక్రియ. బదిలీల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించి, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక విధానాన్ని అమలు చేయాలి. పే స్కేల్ అసమానతలు తొలగించి, కేడర్ అప్గ్రేడ్ చేయాలి. కొన్నాళ్లుగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతిపత్రా లు సమర్చించినప్పటికీ తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఉద్యోగులు విసుగు చెందారు. ప్రధానమైన ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై చర్చ లు జరిపి న్యాయం చేయకపోతే రానున్న అక్టోబర్ 1 నుంచి పెన్షన్ పంపిణీతో సహా ఇతర సర్వేలు చేయం. బకాయిలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే చెల్లించాలి. సచివాలయ సిబ్బంది సహనాన్ని పరీక్షించవద్దు. –మధుబాబు బూరాడ, రాష్ట్ర చైర్మన్, ఏపీజీడబ్ల్యూఎస్ఈ జేఏసీ వాలంటీర్ విధులను సచివాలయ ఉద్యోగులకు అప్పగించరాదు. డిపార్ట్ మెంట్ వారీగా నిర్ధిష్ట జాబ్ చార్ట్ పనులు మాత్రమే అప్పగించాలి. గ్రామ వార్డు సచివాలయం గొడుగులో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకు ఒకే బేసిక్ పేతో ప్రమోషన్లు ఇచ్చి, పీఆర్సీ స్లాబ్ వర్తింపజేయాలి. డిపార్డుమెంట్ల వారీగా మాతృ శాఖల్లో విలీనం చేయాలి. ప్రతి సంవత్సరం వచ్చే పీరియాడికల్ ఇంక్రిమెంట్ తక్షణమే అమలు చేయాలి. –వెంపడాపు కాశినాయుడు, జిల్లా అధ్యక్షుడు, ఏపీజీడబ్ల్యూఎస్ఈ జేఏసీ -
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం లేదు..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయలేదు. జిల్లాలో వేలాది మంది కౌలు రైతులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం సాయం అందని పరిస్థితి. జిల్లాలో కౌలు రైతులు 13,635 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ మందికి మాత్రమే పంట రుణాలు ఇచ్చారు. ఖరీఫ్లో కౌలు రైతులకు రూ.140 కోట్ల పంట రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకు కేవలం 601 మందికి రూ.3 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సాధారణ రైతులు అయితే భూమిని హామీగా చూపిస్తే ఏ వ్యాపారి అయినా డబ్బులు ఇచ్చే పరిస్థితి. కాని కౌలు రైతులకు ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే భూమికి యాజమాని వేరొకరు ఉంటారు కాబట్టి. ఈ క్రమంలో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంట సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు ప్రభుత్వం నుంచి సాయం అందక, అటు రుణాలు అందక కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. -
మడ్డువలసకు 3200 క్యూసెక్కుల ఇన్ఫ్లో
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులోకి 3200 క్యూసెక్కుల ఇన్ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. సువర్ణ ముఖి, వేగావతి నదుల నుంచి నీరు వచ్చి చేరడంతో 64.45 మీటర్లు లెవెల్ నీటిమట్టం ప్రాజెక్టు వద్ద నమోదైంది. దీంతో ఒక గేటు ఎత్తి 2080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ ఆదివారం తెలిపారు. విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతోపాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్గా పూరించాలన్నారు. జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించారు. -
తాగిన మైకంలో యువకుడి ఆత్మహత్య
పార్వతీపురం రూరల్/గుమ్మలక్ష్మీపురం: మద్యం తాగి ఆ మైకంలో తనకు తానే పదునైన చాక్తో తోయక చంద్రశేఖర్(32) అనే యువకుడు తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక తాడికొండ పీహెచ్సీకి తరలించారు. ప్రాధమిక వైద్యసేవలు అనంతరం భద్రగిరి సీహెచ్సీకు తరలించి వైద్యుల సూచన మేరకు పార్వతీపురం కేంద్ర ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ మృతి చెందినట్టు పార్వతీపురం కేంద్ర ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టికతోనే వినికిడి, మూగ సమస్యలతో దివ్యాంగుడైన చంద్రశేఖర్ తాగుడుకు బానిస అయ్యాడు. అప్పుడప్పుడు మద్యం మత్తులో మతి భ్రమించినట్టు ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కురుపాం మండలంలోని తెన్నుఖర్జలో తన చెల్లి ఇంటికి వెళ్లి తాగి మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్ను మందలించడంతో తన స్వగ్రామమైన ఎగువతాడికొండకు మూడు రోజుల క్రితం వచ్చి ఎప్పటిలాగే శుక్రవారం మద్యం సేవించి శనివారం వేకువజామున 3గంటల ప్రాంతంలో గొంతుకోసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యసేవలకు తరలించామన్నారు. మృతుడు తల్లితండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా సోదరుడు కిశోర్తో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మహిళ ఆత్మహత్య విజయనగరం క్రైమ్ : నగరంలోని వీటీ అగ్రహారం మహిళా ప్రాంగణంలో ఓ మహిళ శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలు... కొత్తవలసకు చెందిన భారతి గుజరాత్కు చెందిన షిండేను వివాహం చేసుకుంది. షిండే మోసగాడని తెలిసి విబేధించి అతనకు దూరంగా ఉంటుంది. ఈ విషయం కొత్తవలస పోలీసులకు తెలిసి ఆమెను విజయనగరంలోని వీటీ అగ్రహారం మహిళా ప్రాంగణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఉన్న హోమ్కు తరలించారు. ఇక్కడ చేరిన తరువాత భారతి శనివారం బాత్రూమ్కని వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. హోం సిబ్బంది అనుమానంతో తలుపు పగలగొట్టి చూడగా బాత్రూమ్లోని కిటికీకి చున్నీతో కట్టి ఆత్మహత్య చేసుకుంది. హోం ఉద్యోగి భవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైన్స్తోనే సమాజ ప్రగతి
● సమాజ హితమే జేవీవీ లక్ష్యం విజయనగరం గంటస్తంభం: సైన్స్తోనే సమాజ ప్రగతి సాధ్యమని, సైన్స్ను విస్తరింపజేయడమే జేవీవీ (జన విజ్ఞాన వేదిక) లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. జేవీవీ 18వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలోని మహా కవి గురజాడ అప్పారావు ఇంటి ప్రాంగణంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జేవీవీ పతాకాన్ని రచయిత అట్టాడ అప్పలనాయుడు, జేవీవీ ప్రతినిధి నారు సింహాద్రినాయుడు ఆవిష్కరించారు. అనంతరం వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ అధ్యక్షతన జరిగిన సభలో సంఘ అధ్యక్షుడు డి.వి.రమణ మాట్లాడుతూ.. దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ అని చాటిచెప్పిన నేల విజయనగరం అన్నారు. ఇది ఉత్తరాంధ్ర కాదు ఉత్తమాంధ్రగా అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. గురజాడ అప్పారావు సాక్షిగా మెరుగైన సమాజం కోసం జేవీవీ పని చేస్తుందన్నారు. అనంతరం యుటీఎఫ్ సీనియర్ నాయకులు కె.విజయగౌరీ సావిత్రి జ్యోతిరావు పూలే మీద రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్న శ్రీను సోల్జర్స్ చైర్మన్ సిరి సహస్త్ర ‘ప్రపంచ శాంతి కోసం సైన్స్(జ్ఞాపిక)’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్ మాట్లాడుతూ.. జేవీవీలో పని చేస్తున్నవారంతా సీనియర్ ఉద్యమ నాయకులేనన్నారు. దేశం నాలెడ్జ్ హబ్గా ఉంది. అక్షరాస్యత ఎంతో పెరిగింది. మనం ఎందుకు వెనుకబాటులో ఉన్నామో అనేది ప్రజలను చైతన్యం చేయాల్సి ఉందన్నారు. మహిళలు, యువ త సమర్థవంతంగా పనిచేస్తే దేశాభివృద్ధి సాధ్య మన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల కోసం సైన్స్... ప్రగతి కోసం సైన్స్ అనే నినాదంతో సామాన్య మానవుడికి శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని తెలియజేసేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేయడం అభినందనీయమన్నారు. వైజ్ఞానిక పరమైన జ్ఞానం, మానవత విలువలతోనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు. యువతలో ప్రశ్నించే గుణం పెరగాలని, ప్రశ్నించని బతుకు గడ్డి పరకతో సమానమన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్మి, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లా డుతూ కళలకు కాణాచిగా పేరుగాంచిన విజయనగరంలో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మెరుగైన సమాజం కోసం శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం గురజాడ నివాసాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలని కోరారు. -
ఎస్పీగా ఏఆర్ దామోదర్
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కొత్త ఎస్పీగా ఎం.ఆర్.దామోదర్ నియామకమయ్యారు. ఈయన 2013 బ్యాచ్కు చెందినవారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. ఆయన 2019లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇంతవరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన వకుల్ జింద్ల్కు గుంటూరు జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యింది. కూటమి తీరుపై గర్జించిన ఎర్రదండు ● ప్రజల సంపదను పెట్టుబడిదారులకు కట్టబెతున్నారు ● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకొండ: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ఎర్రదండు గర్జించింది. శ్రమ జీవులను దోచుకుని, ప్రజల సంపదను పెట్టుబడి దారులకు కట్టబెడుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు ధ్వజమెత్తారు. పాలకొండలోని ఓ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లా మహసభలను శనివారం ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో నర్సింగరావు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లను మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. విశాఖలోని భూములు పెట్టుబడి దారులకు కట్టబెతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎన్నికల ముందు కథలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడంలేదని ప్రశ్నించారు. కాంట్రాక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ కార్మికుల పొట్టేకొడుతున్న కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు కొనసాగిస్తామని తెలిపారు. కార్మిక వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, సీనియర్ నాయకులు ఎం.తిరుపతిరావు, మన్మథరావు మాట్లాడారు. జిల్లాలోని పలు కార్మిక యూనియన్లకు చెందిన నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఐదుగురికి నక్క కాటు
● చివరకు నక్కను చంపేసిన బాధితుడు సంతకవిటి: మండలంలోని అక్కరాపల్లి గ్రామానికి చెందిన ఎమ్.లక్ష్మి, కె.సూరయ్య, వి.లచ్చమ్మ, బూ రాడపేట గ్రామానికి చెందిన బంటుపల్లి చిన్నోడు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామానికి చెందిన కె.జగన్మోహన్లకు నక్క కాటేసింది. వీరు సంతకవిటి పీహెచ్సీకి రావడంతో వేక్సినేషన్ వేసినట్టు వైద్యాధికారి యు. నాగేంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. కె.జగన్మోహన్ రాజాం స్కూటిపై వెళ్తుండగా సంతకవిటి సమీపంలో నక్క దాడి చేసి కాటు వేసింది. అక్కరాపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు సంతకవిటి నుంచి అక్కరాపల్లి వెళ్తుండగా సంతకవిటి సమీపంలోనే అకస్మాత్తుగా దాడి చేసి గాయపరిచింది. నక్కతో పోరాటం బూరాడపేట గ్రామానికి చెందిన బంటుపల్లి చిన్నోడుకు సంతకవిటిలోని భాను ఫిల్లింగ్ స్టేషన్ వద్ద అకస్మాత్తుగా నక్క దాడి చేసి దాదాపు 30 నిమిషాలు కాలును పట్టేయడంతో నక్కపై కూర్చొని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. స్థానికులు కూడా చూసి భయపడి కాసేపట్లో తేరుకుని నక్కను చంపడంతో చిన్నోడుకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం చిన్నోడు పీహెచ్సీకి వెళ్లి వ్యాక్సినేషన్ వేసుకున్నారు. -
పత్రికా స్వేచ్ఛకు బాబు ఎప్పుడూ వ్యతిరేకమే
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతూనే ఉంటుంది. తనను పొగిడిన పత్రికలంటేనే బాబకు ఇష్టం. తనపైనా, తన పరివారం పై ఏమైనా సత్యాలు రాస్తే మాత్రం కంటగింపు తప్పదు. వారిపై ఎటువంటి చర్యలకై నా సిద్ధమవుతాడు. ఎల్లో మీడియాతో నిజాలను అబద్ధాలు చేయించేందుకు ఎంతకై నా తెగిస్తారు. పోలీసు బాస్ల దగ్గర నుంచి కింది స్థాయి వరకు తనకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకునేందుకే ప్రాధ్యాన్యమిస్తారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర తెలిసిన వారెవరికై నా ఇది బాగా అర్థం అవుతుంది. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే -
గుడి దొంగల అరెస్టు
పూసపాటిరేగ : మండలంలోని కనిమెల్ల గ్రామంలో దొంగతనం చేసిన నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్ఐ ఐ.దుర్గాప్రసాదు శనివారం తెలిపారు. పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. కనిమెల్ల గ్రామంలోని గుడిలో ఇద్దరు నిందితులు దొంగతనం చేసినట్టు తేలడంతో సొత్తు రికవరీ చేసినట్టు తెలిపారు. పేరాపురం, కోనాడ గ్రామాలలో ఇదే వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షల జరిమానా విజయనగరం క్రైమ్ : మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన 85 మంది వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషి యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 85 కేసులు నమోదు చేశారు. అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం 85 మందికి రూ.8.50 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు. 15 నుంచి స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. 15న రాజీవ్ స్టేడియంలో బాక్సింగ్ పోటీలు, కొండవెలగాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెజ్లింగ్ క్రీడాంశంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 16న విజయనగరం విజ్జీ స్టేడియంలో తైక్వాండో, స్కేటింగ్, సైక్లింగ్ పోటీలు, మరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రగ్బీ పోటీలు నిర్వహిస్తామన్నారు. 17న విజయనగరంలో ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ క్రీడాంశంలో, బూర్జ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్చరీ క్రీడాంశంలో ఎంపికలు జరుగుతాయన్నారు. అండర్ – 14, 17 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా రోగి పట్ల రేడియోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన! ● సర్వజన ఆసుపత్రిలో ఘటన ● ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు విజయనగరం ఫోర్ట్: ఎక్సరే కోసం వెళ్లిన ఓ మహిళ పట్ల సర్వజన ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ రేడియోగ్రాఫర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. గజపతినగరం మండలానికి చెందిన ఓ మహిళ ఫైల్స్ వ్యాధితో సర్వజన ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని ఆసుపత్రిలో ఇన్పేషంట్గా చేర్చారు. శనివారం ఎక్సరే తీయించాలని వైద్యులు చీటి రాసి ఇవ్వడంతో అది పట్టుకుని మహిళ ఎక్సరే విభాగానికి వెళ్లింది. ఎక్సరే గదిలోకి వెళ్లిన మహిళ పట్ల ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఓ రేడియాగ్రాఫర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చేసింది. గది బయట ఉన్న తన భర్తకు విషయం చెప్పడంతో సదరు ఉద్యోగిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉద్యోగికి ఆసుపత్రి అధికారులు మెమో జారీ చేసినట్టు తెలిసింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తాం
సాక్షి ప్రతినిఽధి, విజయనగరం: జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి అన్నారు. జిల్లా నుంచి వలసలను నివారించి, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా జిల్లా ఏయే రంగాల్లో వెనుకబడి ఉందో పరిశీలించి, ఆయా రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. కలెక్టర్గా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్కు ఇన్చార్జి జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారని, వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని అన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణను వేగవంతం చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, దానికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఎగుమతులకు ఎంతో అవకాశం కలుగుతుందన్నారు. ముఖ్యంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెడతామని చెప్పారు. జిల్లా అధికారులు, మండల అధికారులను కలుపుకొని ఒక జట్టుగా సమష్టి కృషితో జిల్లాను ముందుకు నడిపిస్తామని చెప్పారు. -
సులభమైన భాష
హిందీ భాష చాలా సులభతరమైన భాష. నిరుద్యోగులు చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. పది, ఇంటర్ తరువాత హిందీ సబ్జెక్ట్గా తీసుకుని డిగ్రీ చేయడం, తర్వాత హిందీ పండిట్ శిక్షణ పొందడం, గ్రూప్ – 1, 2 వంటి ఉద్యోగులు సంపాదించడం చాలా తేలిక. కె.మధుసూధనరావు, హిందీ ప్రచారక్, రాజాం బాగా కష్టపడితే.. హిందీ భాషలో చదువుకుని బాగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. పదో తరగతి తరువాత ఇంటి వద్దే ఉండి ఉన్నత చదువులు చదువుకోవాలంటే హిందీ ప్రచార సభలు చాలా ఉపయోగపడుతున్నాయి. బి.ఎల్.నాయుడు, హిందీ భాషోపాధ్యాయులు, రాజాం -
యూరియా ఎక్కడ బాబూ..
రాజాం సిటీ/సంతకవిటి/తెర్లాం/గుర్ల: కూటమి ప్రభుత్వ తీరుతో రైతన్నను యూరియా కష్టాలు వీడడం లేదు. ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, ప్రైవేటు దుకాణాలకు తిరిగితిరిగి వేసారిపోతున్నారు. గంటల తరబడి పస్తులతో క్యూ కడుతున్నారు. డబ్బులిచ్చి కొనుగోలుచేసుకునే యూరియాను సైతం అవసరం మేరకు ప్రభుత్వం సరఫరా చేయలేకపోవడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. రైతుల ఓపిక నశించడంతో రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న మనగ్రోమోర్ దుకాణం ముందు శనివారం బైఠాయించారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువు కొరతలేదని ఏసీ రూమ్లలో కూర్చొని చెబుతున్న సీఎం చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్కల్యాణ్కు రైతుల బాధలు ఏం తెలుసంటూ మండిపడ్డారు. ఇదిగో యూరియా వస్తుంది, అదిగో వస్తుందని ప్రకటనలు చేస్తున్న నాయకులకు అన్నదాతలు ఆక్రందన కనపడడం లేదన్నారు. ప్రభుత్వం సక్రమంగా యూరియా సరఫరా చేస్తే పనులు మానుకుని ఇలా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదును దాటిన తరువాత ఎరువు ఇస్తే ఏం ప్రయోజనం ఉంటుందని మండిపడ్డారు. మాకేమైనా ఊరికే ఎరువులు ఇచ్చి ఉద్దరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సంక్షేమం పట్టని ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు మా బాధలు కనబడడం లేదు యూరియా కొరతలేదని స్టేట్మెంట్లు ఇస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్, లోకేశ్లకు మా రైతులు పడుతున్న బాధలు కనపడడంలేదు. ఏసీ రూమ్లలో ఉండి స్టేట్మెంట్లు ఇవ్వడంకాదు. రైతుల పరిస్థితి చూసి మాట్లాడాలి. అదును దాటిన తరువాత యూరియా సరఫరాచేస్తే ఏం ప్రయోజనం ఉటుంది. – జి.నారాయణరావు, రైతు, పొనుగుటివలస 8 రోజులుగా తిరుగుతున్నా... ఒకబస్తా యూరియా కోసం ఎనిమిది రోజులుగా తిరుగుతున్నాం. మా గ్రామంలో ఆర్ఎస్కే వద్ద అరకొరగా పంపిణీ చేశారు. రాజాంలోని ప్రైవేటు దుకాణాల వద్దకు ప్రతి రోజు రావడం, యూరియా దొరకక తిరుముఖం పట్టడం పరిపాటిగా మారింది. – బలగ గణేష్, రైతు, పెనుబాక, రాజాం మండలం ఎన్ని రోజులు తిరగాలి.. ప్రభుత్వం రైతులకు అవసరం మేరకు ఎరువులు సరఫరా చేయడంలేదు. ఆర్ఎస్కేల ద్వారా అందించక పోయింది. ప్రతిరోజూ ప్రైవేటు దుకాణాల వద్దకు తిరగాల్సి వస్తోంది. నాలుగు ఎకరాల వరి పంట సాగుచేశాను. యూరియా కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నా దొరకలేదు. పంటలను కాపాడుకోలేక విషం తాగి చావడమే మిగిలింది. – మక్క శేషగిరిరావు, రైతు, పెంట గ్రామం, జి.సిగడాంఎప్పుడిస్తారో తెలియదు... యూరియా కోసం రాజాంలోని ప్రైవేటు దుకాణం వద్దకు నాలుగు రోజులుగా తిరుగుతున్నాను. ఒక రోజు కాకపోతే ఒక రోజైనా ఒక బస్తా యూరియా అందుతుందని ఆశపడుతున్నాను. ఈ రోజు రాజాం మండలం వారికే ఇస్తామన్నారు. ఆ విషయం ముందురోజే చెబితే ఇంత దూరం రాకపోయి ఉండేవాడిని. – సీహెచ్ అప్పారావు, రైతు, పణుకువలస, తెర్లాం మండలంగుర్లలో... గుర్ల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ దుకాణంలో యూరియా పంపిణీ చేస్తున్నట్టు తెలుసుకున్న గోషాడ, గుర్ల, కెల్ల, చింతలపేట, పకీరు కిట్టాలి, గుజ్జింగివలస, వల్లాపురం, జమ్ము, కలవచర్ల, గరికివలసకు చెందిన సుమారు 400 మంది రైతులు శనివారం తరలివచ్చారు. 200 మందికి మాత్రమే ఎరువులు అందడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. అదిగదిగో వేలటన్నుల ఎరువు వచ్చేస్తోందంటూ అనుకూల మీడియాలో ప్రచారం రైతులను మభ్యపెట్టేయత్నం సమయం మించిపోతున్నా బస్తా యూరియా దొరకని వైనం రాజాం, తెర్లాం, సంతకవిటి, గుర్లలో రోడ్డెక్కిన రైతన్నలు టోకెన్ల కోసం తోపులాటలు రాజాం–శ్రీకాకుళం రోడ్డుపై బైఠాయించి ఆందోళన -
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
విజయనగరం లీగల్: రాజీయే రాజ మార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎం.బబిత అన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్లను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు వృథా కాకూడదన్నారు. జాతీయ లోక్ అదాలత్లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లోని విజయనగరం పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 6852 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. వాటిలో సివిల్ కేసులు 280, క్రిమినల్ కేసులు 6505, ప్రీ లిటిగేషన్ కేసులు 67 పరిష్కరించినట్టు తెలిపారు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 37 లక్షల 50 వేల రూపాయలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, ఫ్యామిలీ కోర్ట్ జడ్జి కె.విజయ కళ్యాణి, బి.అప్పలస్వామి, నాలుగవ శ్రేణి న్యాయమూర్తి, ఎన్.పద్మావతి, మహిళా మరియు ఐదవ జిల్లా న్యాయమూర్తి కె.నాగమణి, ఫోక్స్ న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయమూర్తి ఎ.కృష్ణప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కోర్ట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, ఎక్కువ సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ జీవీలో ఫార్మసీ కళాశాల ప్రారంభం
● ఆన్లైన్లో సర్టిఫికేషన్ కోర్సులు ● రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ప్రాంగణంలో ఫార్మసీ కళాశాలను ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) అనుమతులు మంజూరు చేసిందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ శనివారం తెలిపారు. ఈ ఫార్మసీ కళాశాల అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఈ సంవత్సరం నుంచి పలు సర్టిఫికేషన్ కోర్సులు, ఫార్మసీ కోర్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కోర్సుల ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉంటాయి. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో పలు సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తామని తెలిపారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ (3 నెలల కాల వ్యవధి), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టూల్స్ (ఒక నెల కాల వ్యవధి), మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ (ఒక నెల కాల వ్యవధి), సైబర్ సెక్యూరిటీ (ఒక నెల కాల వ్యవధి), క్వాంటం కంప్యూటింగ్ (ఒక కాల వ్యవధి) కోర్సులు ఉన్నాయని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం 7780351078 ఫోన్ నంబరును సంప్రదించాలని, జేఎన్టీయూజీవీ.ఈడియూ.ఐఎన్/సర్టిఫికేషన్ కోర్సుల వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని సూచించారు. -
విలేకరుల సమావేశం కవర్ చేస్తే కేసులు పెడతారా?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ గొంతునొక్కేందుకు చూస్తోంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను జర్నలిస్టు వార్తగా రాస్తే కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రం హక్కు అమలులో ఉందా?లేదా? అనే ఆందోళన కలుగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సమంజసం కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కూటమి పాలకుల తీరును గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం -
పది లారీలు సీజ్
కొత్తవలస : పరిమితికి మించి అధిక బరువులను రవాణా చేస్తున్న పది లారీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం ఆధ్వర్యంలో శనివారం సీజ్ చేశారు. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో రోడ్డు రవాణ శాఖ అధికారులు, విజిలెన్స్ అదికారులు సంయుక్తగా దాడులు నిర్వహించారు.అధిక బరువుతో రవాణా చేస్తున్న పది లారీలను గుర్తించి సీజ్ చేసి రూ 6.80 లక్షలు జరిమానా విధించారు. సీజ్ చేసిన లారీలను స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. దాడుల్లో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రమేష్కుర్, ఐశ్వర్యలక్ష్మి, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం
● జిల్లా ప్రజా రవాణా అధికారి ● డయల్ యువర్ డీపీటీఓకు 26 వినతులుపార్వతీపురంటౌన్: జిల్లాలోని పల్లెలు, గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రజా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమానికి 26 వినతులు ఫోన్ ద్వారా వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకూ పల్లెలకు, శివారు గ్రామాలకు బస్సు సౌకర్యం అలాగే స్టాపుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
సిరులతల్లి ఉత్సవానికి శ్రీకారం
● ప్రత్యేక అలంకరణలో పైడితల్లి ● చదురుగుడి, వనంగుడిల వద్ద పందిరిరాట ● మండల దీక్షలు చేపట్టిన భక్తులు చదురుగుడి వద్ద పందిరిరాట ఉత్సవంవిజయనగరం టౌన్: సిరులతల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు పందిరిరాటతో శుక్రవారం శ్రీకారంచుట్టారు. ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష నేతృత్వంలో వేకువజామునుంచి అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. ముహూర్తం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి వద్ద, ఉదయం 10.30 గంటలకు రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి వద్ద పందిరిరాట ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదురుగుడి వద్ద నిర్వహించిన పందిరిరాట కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఆమెకు అర్చకులు వేదాశీస్సులు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పైడితల్లి ఆలయ విస్తరణ పనులను ఈ ఏడాది పండగ పూర్తయిన తర్వాత రూ.కోటి 80లక్షల ఖర్చుతో పూర్తిచేస్తామన్నారు. అమ్మవారి పండగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. పందిరిరాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ పూజారులు, అధికారులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి మండల దీక్షలు ప్రారంభం పైడితల్లి అమ్మవారి పందిరిరాట మహోత్సవం రోజున ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష ఆధ్వర్యంలో అమ్మవారి దీక్షాపరులు మండల దీక్షలను సన్నిధానంలో తీసుకున్నారు. దీక్షధారులకు దీక్షావస్త్రాలను ఈఓ అందజేశారు. కార్యక్రమంలో పైడిమాంబ దీక్షాపీఠం వ్యవస్థాపకులు ఆర్.సూర్యపాత్రో, ఎస్.అచ్చిరెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆరికతోటలో జిల్లా స్థాయి జూడో జట్ల ఎంపికలు
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిలాస్థాయి అండర్ 14,17,19 బాలికలు, బాలుర జూడో జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపిక జిల్లా జూడో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.రత్నకిషోర్, అండర్ 19 జిల్లా ఎస్జీఎఫ్ పరిశీలకుడు సీహెచ్ రాజేష్ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.ఈ పోటీలో జిల్లాలోని 25 పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొనగా సర్పంచ్ పెంకి పుష్పమ్మ, ఎంఈవో తిరుమల ప్రసాద్ పోటీలను ప్రారంభిచారు. అలాగే అండర్ 14 విభాగంలో బాలికలు ఏడుగురు, బాలురు ఏడుగురు చొప్పున ఎంపిక చేయగా అండర్ 17 విభాగంలో బాలికలు 9 మంది, బారులు 9 మంది, అండర్ 19 విభాగంలో బాలికలు 9 మంది, బాలురు 9 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తం 50 మందిని రాష్ట్రస్థాయి జూడో పోటీలకు పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ పోటీలను ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జి.కృష్ణవేణి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి నల్ల వెంకటనాయుడు, వైస్ ఎంపీపీ ప్రతినిధి పెంకి శేఖర్, పీడీలు వి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అవస్థల ప్రయాణం..!
పార్వతీపురంటౌన్: సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళాసంక్షేమ పథకాలను పక్కన పెట్టి సీ్త్రశక్తి ఉచిత బస్సు అమలు చేసి మమ అనిపించింది. ఆగస్టు 15న సీ్త్రశక్తి పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తున్నప్పటికీ, జిల్లాలో సరిపడా బస్సులు లేకపోయినప్పటికీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని గ్రామాలకు సర్వీసులు నడిపే పరిస్థితి లేకపోయింది. మన్యం జిల్లాలో ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ప్రయాణం అవస్థల ప్రయాణంగా సాగుతోంది. ఆక్యుపెన్సీ లేని కొన్ని గ్రామాలకు, రోడ్డు బాగాలేని కొన్ని గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు రద్దుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మేరకు ట్రిప్లు కుదించారు. జిల్లాపరిధిలోగల సాలూరు, పాలకొండ, పార్వతీపురం డిపోలలో బస్సుల కొరత ఉంది. ఉన్న బస్సుల కండిషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించకుండా ఉచిత బస్సు పథకంతో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే.. జిల్లా వ్యాప్తంగా మూడు డిపోల పరిధిలో 237 బస్సులు ఉంటే అందులో పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కలిపి మొత్తం 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో కేవలం 50 బస్సులు మాత్రమే సాధారణ సర్వీసులు నడుపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గిరిజన, మారుమూల మైదాన ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సులు సరిగ్గా లేక ప్రయాణ అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పథకానికి బస్సులు వేయడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. గంటల తరబడి వేచి చూడాల్సిందే జిల్లాలో మూడు డిపోల పరిధి నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు రహదారులు గుంతలమయం కావడంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడడం, డిపోలకు సమయానికి బస్సులు రాకపోవడం, కాజ్వేలు, వంతెనలు మరమ్మతులకు గురవడం వంటి సమస్యలతో బస్సులు సమయానికి దొరకక వేచిచూడాల్సిన పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. జిల్లాలో బస్సుల సంఖ్యను పెంచి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అటు ప్రయాణికులు, ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. సీట్ల కోసం రోజూ గొడవలే.. అసలే అరకొర బస్సులతో బస్సులకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ అవుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు సీట్లు సరిగా దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా మేము రుమాలు వేశామని ఒకరు..మేము టవల్ వేశామని మరొకరు ఇలా ఒక్కో సాకుతో ప్రతిరోజూ బస్సుల్లో గొడవలు పడుతున్న సందర్భాలు అనేకం. బస్సుల్లో పురుషులు ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. డిపోల నుంచి బయలు దేరిన కొన్ని బస్సుల్లో పురుషులపై మహిళలు దాడికి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి.. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే బస్సుల సంఖ్య పెంచి సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.ఓ వైపు చాలీచాలని బస్సులు..మరో వైపు పాడైపోయిన రహదారులతో సమయానికి రాని బస్సులు..ఇంకో వైపు సీ్త్ర శక్తి పథకానికి కేటాయించిన బస్సుల్లో అధిక రద్దీతో గొడవలు..వెరసి సాధారణ ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేందుకు సతమవుతున్నారు. బస్సుల సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు. అరకొరగా బస్సులు ఉచిత బస్సుల్లో రద్దీ ఇబ్బందులు ఆక్యుపెన్సీ లేదని కొన్ని గ్రామాలకు బస్సుల రద్దు జిల్లాలో మూడు డిపోల పరిధిలో 237 ఆర్టీసీ బస్సులు వాటిలో 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే తీవ్ర ఇక్కట్లు పడుతున్న సాధారణ ప్రయాణికులు -
బదిలీ కలెక్టర్కు సన్మానం
విజయనగరం అర్బన్: బదిలీ అయిన కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు జిల్లా అధికారులు శుక్రవారం కలెక్టర్ చాంబర్లో ఘనంగా సన్మానించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయన సారథ్యంలో పనిచేసి సాధించిన విజయాలను గుర్తుచేశారు. దుశ్శాలువలతో సత్కరించారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ కార్యక్రమం? సాక్షిప్రతినిధి విజయనగరం: ప్రభుత్వ కార్యాలయంలో రాజకీయ కార్యక్రమాన్ని నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం మార్కెట్ కమిటీ ఆవరణలో గాజులరేగ ప్రాథమిక సహకార పరపతి సంఘం కొత్త పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు చేపట్టింది. ఈ సంఘానికి కోరాడ వెంకటరావు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అది పూర్తిగా అధికారిక కార్యక్రమం. దీనికి సహకారశాఖ అధికారి వి.సత్యనారాయణ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే అదితిగజపతి రాజు కూడా హాజరై కొత్త పాలకవర్గాన్ని అభినందించారు. అక్కడివరకు ఫరవాలేదు. అయితే, ఎలాగూ టెంట్లు.. పూల దండలు.. బొకేలు ఉన్నాయి.. మళ్లీ కొత్తగా అవన్నీ సమకూర్చడం ఎందుకు అనుకున్నారో ఏమో.. ఆరోవార్డు నుంచి టీడీపీలో చేరుతున్నాం అంటూ వచ్చిన పలువురికి అక్కడే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఒక ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమం ఎందుకు పెట్టడం.. అదేదో పార్టీ ఆఫీసులోనో.. ఎమ్మెల్యే ఇంటివద్దనో పెడితే బాగుణ్ణు కదా అని కొందరు అక్కడే గుసగుసలాడగా.. పల్లకోండిరా.. అక్కడైతే సింపుల్గా అయిపోద్ది.. ఇప్పుడు చూడు.. దండలు.. డెకరేషన్లు.. అన్నీ మనకోసమే చేసినట్లుగా లేవూ.. అంటూ నోరు మూయించారు. కొలిక్కి వచ్చిన భూ సమస్య వీరఘట్టం: మండలంలోని చినగోర రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 17లో ఉన్న 20 ఎకరాల భూ సమస్యకు శుక్రవారం రెవెన్యూ, పోలీస్ అధికారులు శాశ్వత పరిష్కారం చూపారు. ఆక్రమణకు గురైన సుమారు 20 ఎకరాల భూమి వీరఘట్టం మండలం చినగోర రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే నంబర్ 17లో ఉన్న 151 ఎకరాల భూమిని 18 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం వీరఘట్టం మండలం సంతనర్సిపురంలో ఉన్న భూమిలేని పేదలకు ఎకరా చొప్పున కేటాయించింది. అందరికీ డీ పట్టాలు ఇచ్చింది. అయితే, భూమి అప్పగించలేదు. చినగోర రెవెన్యూ గ్రామానికి పక్కనే ఉన్న జియ్యమ్మమవలస మండలం గడసింగుపురం, ఏనుగులగూడకు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిలో సుమారు 20 ఎకరాలను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. ఈ భూమిపై హక్కు కల్పించాలని జియ్యమ్మవలస మండలాలనికి చెందిన వారు కూడా అధికారులపై ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో సంత–నర్శిపురం లబ్ధిదారులకు, భూము లు సాగు చేస్తున్న జియ్యమ్మవలస మండలానికి చెందిన వారికి కొన్నేళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. పోలీసు కేసులు కూడా నమోదయ్యా యి. ఆ భూమిని వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల తహసీల్దార్లు ఎ.ఎస్.కామేశ్వరరావు వై.జయలక్ష్మి, సర్వే అధికారులు పరిశీలించారు. 20 ఎకరాల భూమి వీరఘట్టం మండలంలో ఉన్నట్లు గుర్తించారు. సోమవారం నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తామని స్పష్టంచేశారు. -
ఐటీఐ స్థలం జోలికొస్తే ఊరుకోం
● ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా ● స్థలం చదునుచేసేవారిపై క్రిమినల్ కేసు నమోదుకు డిమాండ్ బొబ్బిలి: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఊరుకునేది లేదని విద్యార్థులు హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి. రవికుమార్, డివిజన్ కార్యదర్శి వి.శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ఐటీఐకి చెందిన స్థలంలో హోటళ్లు, రెస్టారెంట్లు పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బీజేపీ ఇన్చార్జి మరిశర్ల రామారావు ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి పొందినట్టు తెలిసిందన్నారు. స్థలం ఐటీఐ నుంచి చేజారనీయమని, అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. స్థలాన్ని చదును చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగరాజు,సురేష్, చరణ్,ప్రదీప్, ఐటీఐ, ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ● ఇదీ పరిస్థితి... విశాఖపట్నం–రాయగడ అంతరరాష్ట్ర రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఐటీఐకు సుమారు ఎకరన్నర స్థలం ఉంది. ఇది ఎంతో విలువైనది. కొన్నేళ్ల కిందట ఏపీ టూరిజం సంస్థకు ఐటీఐ ద్వారా అప్పటి ప్రభుత్వం వీణలతయారీ, విక్రయ కేంద్రం కోసం కేటాయించినా ఎలాంటి పనులు జరగలేదు. ప్రైవేటు వ్యక్తులు కొన్నాళ్లు ఆ స్థలాన్ని వాడుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఓ నాయకుడికి 20 ఏళ్లకు లీజుకు ఇచ్చిందన్న సమాచారంతో ఐటీఐ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్థలం చదును చేసినా మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి తెలియకపోవడం విచారకరం. స్థానికుల ఆందోళనతో రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. -
14న జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడకారుల ఎంపిక పోటీలు ఈనెల 14న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్క్రీడామైదానంలో ఎంపిక పోటీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంపిక పోటీల్లో 2006 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించి, బాలురు 75 కేజీల లోపు, బాలికలు 65 కేజీల లోపు బరువు కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు కృష్ణా జిల్లా గొల్లపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఏపీలో ఉత్తమ రిసార్ట్స్గా సన్రేభోగాపురం: భోగాపురంలోని ఎ.రావివలస సమీపంలో ఉన్న సన్రే విలేజ్ రిసార్ట్స్ ఏపీ ఉత్తమ టీం బేస్ట్ రిసార్ట్గా గుర్తింపు పొందడం సంతోషించ దగ్గ విషయమని మేనేజింగ్ డైరెక్టర్ ఇందుకూరి రాజాబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, భరత్ చేతులమీదుగా ఏపీ ఉత్తమ టీం రిసార్ట్ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ పురస్కారంతో వరుసగా ఏడోసారి గౌరవం దక్కినందుకు సంతోషిస్తున్నానని రాజాబాబు పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఉద్యోగి కృషికి ఆయన అభినందనలు తెలియజేశారు. -
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి సమాజానికి ఉత్తమ సేవలందించాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. జెడ్పీ పరిధిలో ఉద్యోగోన్నతి పొందిన వారికి నియామక పత్రాలను తన చాంబర్లో శుక్రవారం అందజేశారు. బొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ బుడతనాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల జూనియర్ సహాయకుడిగా నియామకమైన ఎస్.షఫీని అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ ఆర్.వెంకట్రామన్, ఏఓ రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా అరికట్టేందుకు చర్యలు
విశాఖ సిటీ/పార్వతీపురం రూరల్/విజయనగరం క్రైమ్: గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రేంజ్ పరిధిలోని అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో డీఐజీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు రూ.10,04,89,621 స్వాధీనం చేసుకోవడాన్ని అభినందించారు. ఇప్పటి వరకు 1,119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరిచినట్లు చెప్పారు. అలాగే 51 మంది నిందితులపై పీడీ చట్టం, 80 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం అమలుకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది, అలాగే గంజాయితో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మందిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాలు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా 341 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 కేసుల్లో 33 మంది నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. వీరిలో 24 మందికి 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. విశాఖపట్నం రేంజ్ పోలీసులు స్టే సేఫ్, నిదాన్, కాజ్, నాట్ గ్రిడ్ యాప్స్ ద్వారా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో కృషిని అభినందించారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, మహిళ మిస్సింగ్ కేసులపై సమీక్షించారు. ఇటువంటి కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చెప్పారు. రేంజ్ పరిధిలోని శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు. భవిష్యత్తు కోసం తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి -
కోడూరుమాత యాత్రోత్సవం నేడు
బాడంగి: మండలంలోని కోడూరు మరియమాత యాత్రోత్సవం శనివారం జరగనుంది. ఈ యాత్రలో సుమారు 20వేలమంది క్రైస్తవ, ఇతర మతస్తులైన యాత్రికులు పాల్గొనున్నారు. ఈ యాత్రకు సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం డిపోలనుంచి ఆర్టీసీవారు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.ఉదయం నుంచే దివ్యబలిపూజలు నిర్వహించనున్నారు.మూడవపూజకు విశాఖ అగ్రపీఠాధిపతులు హాజరుకానున్నారు.భక్తులు మాతను దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటయ్యాయి. బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, రూరల్ సీఐ నారాయణ రావుతోపాటు ఎస్సై సిబ్బంది శుక్రవారం యాత్ర స్థలాన్ని సందర్శించి యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందో బస్తు ఏర్పాట్లు చేయనున్నారు. ఆర్టీసీబస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వన్వే ట్రాఫిక్ను పాటిస్తూ బాడంగిలోని పిన్నవలస జంక్షన్ వద్ద ప్రవేశించి కోడూరునుంచి రామచంద్రపురం మీదుగా బయటకు వెళ్లనున్నాయి. కాలినడకన పలువురు భక్తులు రానున్నారు. మహిళ మెడలో గొలుసు అపహరణవేపాడ: మండలంలోని నీలకంఠరాజపురం సమీపంలో రైవాడ కాలువ గట్టుపై గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో గొలుసును తెంపుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నీలకంఠరాజపురం గ్రామానికి చెందిన నెక్కల లక్ష్మి తన తల్లితో పశువులకు గడ్డి కోసుకుని వస్తుండగా గ్రామసమీపంలోని రైవాడ కాలువగట్టుపై ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చి వెంకటలక్ష్మి మెడలో గొలుసు తెంపుకుని పారిపోయాడు. దీంతో వెంకటలక్ష్మి వల్లంపూడి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను అరా తీశారు. గుర్తుతెలియని వ్యక్తి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు పోలీసు బృందాలతో విచారణ చేయిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనాథ బాలికలకు 100 సైకిళ్ల పంపిణీ
బాడంగి: విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తల్లితండ్రులు లేని అనాథబాలికలకు సుమారు రూ.4లక్షల విలువైన 100సైకిళ్లను పంపిణీ చేశారు. బాడంగి హైస్కూల్లో హెచ్ఎం సత్యనారాయణ అధ్యక్షతన బొబ్బిలి డిప్యూటీ డీఈఓ మోహన్రావు ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం సైకిళ్లను పంపిణీ చేశారు. బెంగళూరుకు చెందిన వసుధైక కుటుంబం, కేజీబ్రీసంస్థ, కెనరాబ్యాంకువారి సౌజన్యంతో సైకిల్స్ సమకూర్చగా కనీసం పాఠశాలలకు రెండుకిలోమీటర్ల దూరం, 85శాతం మార్కులు సాధించిన అనాథబాలికలకు అందజేశారు. అదేవిధంగా హైస్కూల్లో చదువుతున్న 50 మంది అనాథబాలికలకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున రూ.50వేలు అందజేశారు. కార్యక్రమంలో వీకేపౌండేషన్ ప్రతినిధి ప్రతాప్, కెనరాబ్యాంకు డీజీఎం అనంతపద్మనాభం, రీజనల్మేనేజర్ వినోద్, సీనియర్ మేనేజర్ రాజ్యలక్ష్మి, ఎంఈఓ. లక్ష్మణదొర, జెడ్పీటీసీ పెద్దింటిరామారావు, ఎంపీటీసీ డి.శ్రీనివాస రావు, సర్పంచ్ కండి రమేష్, ఎస్ఎంసీ చైర్మన్ భారతి, మూడు జిల్లాలనుంచి హాజరైన బాలికలు, తల్లిడండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు కొల్లి ఈశ్వరరావు నిర్వహించారు. -
పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్/తెర్లాం: ఈ ఏడాది ఫిబ్రబరి నెలలో నమోదైన పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు కిరణ్ (36)కు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చారని ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. కేసు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తెర్లాంకు చెందిన ఓ బాలిక (12) నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కంకణాల కిరణ్ వెనక నుంచి వచ్చి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో, దగ్గరలో ఉన్న కొంత మంది వచ్చేసరికి నిందితుడు పారిపోయాడు. ఆ బాలిక ఇంటికెళ్లి కన్నవారికి చెప్పగా బాలిక తల్లి తెర్లాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ బి.సాగర్ బాబు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు నమోదైన 7 నెలల కాలంలోనే ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగా తెర్లాం ఎస్సై బి.సాగర్ బాబు చర్యలు చేపట్టారని ఎస్పీ తెలిపారు. కోర్టులో నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష, బాధితురాలికి పరిహారంగా రూ.25,000 ఇవ్వాలని పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు. 115 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.11.50 లక్షల జరిమానా మద్యం తాగి వాహనాలు నడిపి, పట్టుబడిన 115 మంది వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 115 కేసులు నమోదు చేసి విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా వారందరికీ రూ.11.50 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి అమానుషం
ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరించడం తగదు. ఓ నాయకుడి ప్రెస్మీట్ వార్తను యథాతథంగా ప్రచురించినా కేసులు పెట్టడం విచాకరం. పోలీస్ వ్యవస్థలో పదోన్నతుల విషయంలో జరిగిన అక్రమాలపై వార్తను ప్రచురించిన ‘సాక్షి’పై కక్ష కట్టడం ఎంతవరకు సమంజసం. ఎడిటర్, బ్యూరో ఇన్చార్జిలపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో వేధించడం సరి కాదు. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వమూ చేపట్టని తీరు ఇది. పత్రికా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం సంకెళ్లువేయాలని చూస్తోంది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల్లో అభ్యంతరాలుంటే తెలియజేయాలే తప్ప పోలీస్ కేసులు పెట్టడం సరికాదు. – బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ -
నోటిఫికేషన్ ఇచ్చారు.. పోస్టుల భర్తీ మరిచారు..!
విజయనగరంఫోర్ట్: అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి సర్కార్... నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎంతో ఆశగా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే... భర్తీ నిలిపివేయడం ఏమిటని నిలదీస్తున్నారు. మార్చి 13న నోటిఫికేషన్... ఈ ఏడాది మార్చి 13వ తేదీన వైద్య విధాన్ పరిధిలోని ఆస్పత్రుల్లో 29 పోస్టుల భర్తీకి వైద్య విధాన్ పరిషత్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. బయోస్టాటిస్టిషయన్ పోస్టు–1, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు –2, ఆడియో మెట్రిసిన్ పోస్టులు–4, రేడియాగ్రాఫర్–1, ఫిజియోథెరపిస్టు పోస్టులు–2, బయో మెడికల్ ఇంజినీర్ పోస్టు–1, ధియేటర్ అసిస్టెంట్ పోస్టులు–3, మెడికల్ రికార్డు అసిస్టెంట్ పోస్టు–1, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు–2, ఎలక్ట్రీషియన్ పోస్టు–1, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు–10, ప్లంబర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 15 పోస్టులను మాత్రమే భర్తీ చేసారు. 14 పోస్టులు భర్తీ చేయలేదు. నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు భర్తీ చేయకపోవడంపై దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. 29 పోస్టులకు ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చాం. వీటిలో మొదటి కౌన్సెలింగ్లో 10 పోస్టులు, రెండో కౌన్సెలింగ్లో ఐదు పోస్టులను భర్తీచేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్నిపోస్టుల భర్తీని నిలిపివేశాం. – డాక్టర్ పద్మశ్రీ రాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి -
పెట్రోల్లో నీరు..
● పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన ● పోలీస్ స్టేషన్కు వివాదం చీపురుపల్లి: ఆంజనేయపురానికి చెందిన తమ్మిన వెంకటేష్... చీపురుపల్లి మెయిన్రోడ్లోని హెచ్పీ పెట్రోల్ బంక్లో గురువారం రాత్రి 9 గంటల సమయంలో రూ. 510 పెట్రోల్ను తన ద్విచక్ర వాహనంలో పోయించాడు. బంక్ నుంచి కొద్ది దూరం వెళ్లేలోగా రెండు సార్లు ద్విచక్ర వాహనం మొరాయించింది. అనుమానం వచ్చి తిరిగి పెట్రోల్ బంక్కు వచ్చి సిబ్బందికి చెప్పాడు. అక్కడే వాహనం నిలిపి పెట్రోల్ ట్యాంక్ నుంచి ఓ బాటిల్లోకి పెట్రోల్ను తీశాడు. పెట్రోల్తో పాటు నీరు కనిపించడంతో ఆందోళన వ్యక్తంచేశాడు. ఇంతలో కిశోర్ అనే ఆటో డ్రైవర్ వచ్చి తనకు కూడా అనుమానం ఉందని, డీజిల్ కల్తీ అవుతోందని పేర్కొన్నాడు. అక్కడికక్కడే ఓ బాటిల్ లీటర్ డీజిల్ పోయించి చూస్తే తెలుపు రంగులో డీజిల్ కనిపించింది. దీంతో అధిక సంఖ్యలో వినియోగదారులు చేరి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది పెట్రోల్ బంక్కు వచ్చి అక్కడ సిబ్బందిని, వినియోగదారులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. నీరుకలిసిన పెట్రోల్, డీజిల్ను విక్రయించడంపై యువకులు మండిపడ్డారు. వాహనాలు మరమ్మతులకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని నిలదీశారు. -
పైడితల్లి పండగకు నేడు పందిరిరాట
● వనంగుడి, చదురుగుడిల వద్ద ప్రత్యేక పూజలు ● మండల దీక్షలు ప్రారంభం విజయనగరం టౌన్: సిరులతల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు శుక్రవారం పందిరి రాట మహోత్సవంతో అర్చకులు, ఆలయ అధికారులు అంకురార్పణ చేయనున్నారు. చదురుగుడి, వనంగుడి వద్ద పందిరిరాట వేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. పైడితల్లి అమ్మవారి మండల దీక్షలను భక్తులు స్వీకరించనున్నారు. ఈ అపురూపమైన ఘట్టాలను తిలకించేందుకు భక్తులు తరలిరానున్నారు. మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి ఆలయ ఆవరణలో భాద్రపద బహుళ పంచమిని పురస్కరించుకుని ఉదయం మండల దీక్షలు ప్రారంభిస్తారు. 9.30 గంటలకు పందిరి రాట వేయనున్నారు. వనంగుడి వద్ద 11 గంటలకు ముహూర్తం ప్రకారం పందిరి రాట, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూజా కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష మాట్లాడుతూ అక్టోబర్ 6న సోమవారం తొలేళ్ల మహోత్సవం, అక్టోబర్ 7న మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులందరి సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేదిశాగా సాగుతున్నామన్నారు. అక్టోబర్ 14న మంగళవారం తెప్పోత్సవం, 19న ఆదివారం కలశ జ్యోతి ఊరేగింపు, 21న ఉయ్యాలకంబాల మహోత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతి వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. చండీహోమం, పూర్ణాహుతితో ఉత్సవాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. భక్తులందరూ నెలరోజుల పాటు నిర్వహించే పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ప్రతీరోజూ పర్వదినమేనని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. -
నిబంధనలకు గండి..!
హౌసింగ్ విభాగంలో.. ● నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ● అడ్డదారిలో పెద్దకుర్చీని కాజేసిన ఉద్యోగి ● ఇటుక ఇటుక్కీ ఒక్కో రేటు సాక్షిప్రతినిధి విజయనగరం: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు కావాల్సినవి మన విస్తర్లోకి వచ్చి వాలతాయని విజయనగరం హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు రుజువు చేస్తున్నారు. అసలే గృహనిర్మాణ సంస్థ.. ఇల్లుకట్టినంత శ్రద్ధగా... పునాదులు వేసినంత దృఢంగా.. రంగులు అద్దినంత అందంగా తన దందా నడిపించుకున్న ఓ ఉన్నతాధికారి.. ఏకంగా రెండు ఇన్చార్జి పోస్టుల్లో కొనసాగుతూ ప్రభుత్వ నిబంధనలకు ‘గండి’కొడుతుండడం ఆ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. తనకన్నా సీనియర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్నా వాళ్లను వెనక్కినెట్టేసి తన పలుకుబడితో పెద్ద కుర్చీలో కూర్చొని తన పవర్ చూపించిన ఈ పెద్దాఫీసర్ ఇక తనకు ఎదురులేదని ధీమా వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా హౌసింగ్ కార్పొరేషన్లో రిక్రూట్మెంట్ లేకపోయినా అడ్డదారిలో ఒక వర్క్ ఇన్స్పెర్ను వేసుకుని, వెనువెంటనే ఆయనకు ఏకంగా మండల ఇన్చార్జి హోదా (హోసింగ్ ఏఈ హోదా) కట్టబెట్టి మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ప్రభుత్వ వ్యవస్థలకు సవాల్ విసురుతుండడం ఉద్యోగవర్గాలనే కలవరపెడుతోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ... ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. ఆయనకు వాస్తవంగా పీడీ పోస్టు రాదు. కానీ ఎలాగైనా ఆ పెద్ద కుర్చీ కావాలి. కాబట్టి నిబంధనలకు ‘గండి’కొడుతూ బేరం సెటిల్ చేసుకుని ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా నియమితులైనట్టు సమాచారం. ఇక అడ్డు తొలగిపోయింది. ఇన్చార్జి ఈఈ కాబట్టి.. పీడీ పోస్ట్ ఇచ్చేయొచ్చు అనే లాజిక్ తీసి పీడీ పోస్టు కొట్టేశారు. వాస్తవానికి సీనియారిటీ లిస్టులో ఈయనకన్నా ఆరుగురు సీనియర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ) పైన ఉండగా వాళ్లను పక్కకునెట్టేసి ఇన్చార్జి ఈఈగా, పీడీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘కోట’లో డీఈఈగా ఉంటూ విద్యలనగరంలో ఈఈగా, హౌసింగ్ పీడీగా దర్జా వెలగబెడుతున్నారు. చీపురుపల్లిలో ఉన్న ఎన్.జె.రత్నాకర్, విజయనగరంలో పనిచేస్తున్న జి.వి.రంగారావు ఆయనకన్నా సీనియర్లు. కానీ వాళ్లను తొక్కుకుంటూ ఈయన ముందుకెళ్లిపోయారు. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎక్కడా హౌసింగ్ కార్పొరేషన్లో నియామకాలు చేపట్టలేదు. కానీ ఈయన తన పలుకుబడితో తనకు నచ్చిన వ్యక్తిని గత జనవరిలో విజయనగరంలో అవుట్ సోర్సింగ్ విధానంలో వర్క్ ఇన్స్పెక్టర్గా నియమించుకున్నారు. కుర్రాడు జూనియర్ కాబట్టి అలా ఉద్యోగంలో మెలకువలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడు అనుకుంటే నాలుగురోజుల్లోనే హౌసింగ్ పథకానికి సంబంధించి ఏకంగా మండల ఇన్చార్జి హోదా కట్టబెట్టేశారు. అదేంటి మండలంలో ఇంకా సీనియర్ వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు కదా అంటే.. వాళ్లెవరూ పీడీకి దగ్గర కాదుగా.. అందుకే ఆయనను ఏకంగా ఏఈ హోదాలో మండల ఇన్చార్జిగా నియమించారు అనే సమాధానం ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. అడ్డదారిలో నిబంధనలకు ‘గండి’ కొడుతూ వచ్చిన ’పీడీ’ హవాపై ఇప్పుడు జిల్లా హౌసింగ్ శాఖలో చర్చజోరందుకుంది. ఆయనదంతా అడ్డ అడ్డదారి! హౌసింగ్ కార్పొరేషన్లోకి అడుగుపెట్టేందుకు అడ్డదారి చేసుకున్న ఆ అధికారి ఇక ప్రతిదీ అడ్డంగా చేసుకుంటూ.. అడ్డొచ్చినవాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్గా కార్పొరేషన్లో చేరిన ఆయన సర్వీస్ మొత్తం నెల్లిమర్లలోనే పనిచేశారు. డీఈఈగా ఉన్న సమయంలో అంటే మార్చి నెలాఖరున అప్పటి ప్రాజెక్టు డైరెక్టర్ కూర్మినాయుడు రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్కు ముందే అప్పటి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కు హౌసింగ్ ఇన్చార్జి పీడీగా నియమించాలని కలెక్టర్ తలపోసి ఒక ఫైల్ రెడీ చేశారు. అయితే, వ్యవస్థలో అడ్డదారులన్నీ తెలిసిన సదరు ఉద్యోగి ఉన్నతాధికారుల వద్ద ‘మురళీ’నాథం వినిపిస్తూ తనకు అనుకూలంగా పీడీ పోస్టును తెచ్చుకున్నారు. వాస్తవానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు మాత్రమే ఆ పీడీ పోస్టు ఇవ్వాల్సి ఉంది. -
మందుగుండు నిల్వలు సీజ్
కొమరాడ: మండలంలోని శివిని గ్రామ సమీపంలో దీపావళి మందుగుండు సామగ్రి అక్రమ నిల్వలు గురువారం పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఎస్ఐ కె.నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం... ముందస్తు సమాచారం మేరకు శివిని గ్రామానికి చెందిన సేనాపతి రాజేష్ రానున్న దసరా, దీపావళి పండగలు నేపథ్యంలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వలు ఉంచారన్నారు. తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి ఈ సామగ్రి తీసుకుని వచ్చి అనుమతులు లేకుండా భద్రపరిచారని తమకు వచ్చిన సమచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేసినట్టు తెలిపారు. రూ.2లక్షల విలువ గల సామగ్రి స్వాధీనం చేసుకుని పోలీస్ష్టేషన్కు తరలించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.బుచ్చి అప్పారావు జలాశయం నీరు విడుదలగంట్యాడ: గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నీటి మట్టం పెరుగడంతో జలాశయం నుంచి గురువారం రాత్రి నీటిని విడుదల చేశారు. జలాశయం నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 295.500కు చేరింది. జలాశయం నుంచి 100 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదలచేశారు.కోడూరు మరియమాత యాత్రకు సర్వం సిద్ధంబాడంగి: కోడూరు మరియమాత యాత్రకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 13న జరగనున్న దివ్యబలిపూజలు, ప్రార్థనలకు వీలుగా టెంట్లు, వరుస క్రమంలో వెళ్లి మాతను దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. తలనీలాలు సమర్పించుకునే భక్తుల కోసం ఆర్సీఎం పాఠశాల భవనం వద్ద ప్రత్యేక కాంప్లెక్స్ను నిర్మించారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.మిథున్రెడ్డిని కలిసిన బెల్లాన చీపురుపల్లి: రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని విజయనగరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ రాజమండ్రిలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నవరంలో సత్యనారాయణస్వామి వ్రత, తీర్థ ప్రసాదాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు
అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఒక నాయకుడు ప్రెస్మీట్లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే కేసులు పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే విరుద్ధం. నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రశ్నించిన సామాన్యుల నుంచి పెద్దల వరకు కక్ష సాధింపులకు పాల్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పుడేమో ఏకంగా నిజాలను ప్రచురించే మీడియా/పత్రికలపై క్షక్షసాధింపులకు దిగడం హేయమైన చర్య. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూస్తే రెట్టింపు ఉత్సాహంతో ప్రజావ్యతిరేక అంశాలపై ప్రశ్నిస్తూనే ఉంటాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపట్ల గౌరవ భావం కలిగి ఉండాలి. భయపెట్టి నిజాలను కప్పివేయాలనుకోవడం సరికాదు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై వేసిన కేసులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి -
వైఎస్సార్సీపీ ప్రతిష్టను పెంచేలా పనిచేస్తా
● పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి విజయనగరం: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా స్థాపించిన వైఎస్సార్సీపీ ప్రతిష్టను పెంచేలా, రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమయ్యేలా పనిచేస్తానని పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పారు. నగరంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో శ్రావణినిను పార్టీ విజయనగరం నియోజకవర్గం నాయకులు, కార్పొరేటర్లు గురువారం అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ తనకు కొత్త బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాజకీయ ఓనమాలు నేర్పించి, అనునిత్యం వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న తండ్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి కృజత్ఞలు తెలిపారు. చదువుకున్న మహిళలు రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళలను రాజకీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు అన్నిరంగాల్లో మహిళలకు తగిన ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు గౌరవంతో పాటు గుర్తింపు లేకుండా పోతుందన్నారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిపై మహిళా నాయకురాలిగా పోరాటం చేసి మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, కార్పొరేటర్లు ఆశపు సుజాత, పిన్నింటి కళావతి, తాళ్లపూడి సంతోషి, బోనెల ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్గా రామసుందర్రెడ్డి
విజయనగరం అర్బన్: ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా 12 మంది కలెక్టర్లను బదిలీచేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం జిల్లా కలెక్టర్గా 2015 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఎస్.రామసుందర్రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఆయన రీహెబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్గా, సీడీఏ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు బదిలీ అయింది. పోస్టు కేటాయించాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా జిల్లాలోని అధికార పార్టీ నాయకులతో ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో కలెక్టర్ అంబేడ్కర్ బదిలీ కోరుకున్న విషయాన్ని ఇటీవల ‘సాక్షి’లో ‘ఎల్లిపోతా..నేనెల్లిపోతా...’ అనే శీర్షికతో వచ్చిన కథనం నిజమయింది. -
16 నుంచి రామతీర్థంలో పవిత్రోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని దేవస్థాన ఈవో వై.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పవిత్రోత్సవాలకు అంకురారోపణం చేస్తామన్నారు. 17న మంగళాశాసనం, తీర్థ గోష్ఠి, యాగశాలలో ప్రత్యేక హోమాలు జరుగుతాయన్నారు. అదే రోజు మధ్యాహ్నం అకల్మష హోమాలు, పవిత్ర శుద్ధి ఉంటుందని, 18న పారయణాలు, జపములు, హవనాలు, అష్టకలశ స్నపన మహోత్సవం జరిపించి శ్రీరామచంద్రస్వామికి అర్చకులు పవిత్ర సమర్పణ చేస్తారన్నారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రారంభమైన కళా ఉత్సవ్ పోటీలు నెల్లిమర్ల: స్థానిక వేణుగోపాలపురంలో ప్రభుత్వ డైట్ కళాశాలలో కళా ఉత్సవ్–2025 జిల్లా స్థాయి పోటీలు గురువారం సందడిగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలిరోజు నృత్యం, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం తదితర అంశాలపై వ్యక్తిగత, బృంద పోటీలు నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ప్రిన్సిపాల్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి వున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళాఉత్సవ్ పోటీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. కా ర్యక్రమంలో శ్రీనివాసరావు,ఉ త్సవాల నోడల్ అధికారి వి.చిన్నంనాయుడు, అధ్యాపకులు కాళ్ల అప్పారావు, సూరిబాబు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, మురళి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న జన విజ్ఞాన వేదిక (జేవీవీ) 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, నాయకులు వి.రాజ్గోపాల్, చీకటి దివాకర్, జి.నిర్మల పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం పేర్కొన్న శాసీ్త్రయ దృక్పథాన్ని ప్రజల్లో నాటేందుకు జేవీవీ కృషి చేస్తోందని చెప్పారు. మహాసభ ప్రారంభ సమావేశానికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెవీవీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్, చెకుముకి పత్రిక పూర్వ సంపాదకులు ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య, పూర్వ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
● స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలకు స్పందన ● ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్బాల్ జట్ల ఎంపిక పూర్తి విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని మూడు ప్రాంతాల్లో ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, పుట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహించగా... వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. హాజరైన క్రీడాకారులకు అండర్ – 14, 17 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. నగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన ఫుట్బాల్ జట్ల ఎంపికలకు 500 మంది క్రీడాకారులు హాజరుకాగా... పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 72 మంది క్రీడాకారులు బాల, బాలికల విభాగాల్లో జిల్లా జట్లకు ఎంపికయ్యారు. విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఫెన్సింగ్ పోటీలకు 120 మంది క్రీడాకారులు హాజరుకాగా.. 48 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు. అండర్ – 17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 16 మంది క్రీడాకారులు అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో రాష్ట్ర స్థాయిలో జరగబోయే స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి పాత్రినిధ్యం వహించనున్నట్టు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మి తెలిపారు. ఎంపిక పోటీలను వ్యాయామ అధ్యాపకులు బంగార్రాజు, పివిఎస్ఎన్.రాజు, సౌదామణి, మాధవ్, ఆదిలక్ష్మి, నాయుడు, శ్రీనివాసరావు, తిరుపతిరావు, శివకుమార్, అనురాధ తదితరులు పర్యవేక్షించారు. -
వైద్యం వికటించి మహిళ మృతి
● పీఎంపీ వైద్యుడి నిర్వాకం ● ఆందోళనకు దిగిన బంధువులు భామిని: మండలంలోని ఘనసర గ్రామానికి చెందిన కిల్లారి తేజాలు(58) కొత్తూరుకు చెందిన శ్రీసాయి ప్రజావైద్యశాలలో వైద్యానికి వెళ్లి మృతి చెందింది. తేజాలు మృతికి పీఎంపీ వైద్యుడు వై.నాగేశ్వరరావు నిర్లక్ష్యమే కారణమని బంధువులు ప్రజా వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. చివరకు కొత్తూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు మృతురాలి బంధువులకు నచ్చజెప్పి మృతదేహాన్ని తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఘనసర గ్రామానికి చెందిన తేజాలు కాళ్లు, చేతులు పీకుతున్నాయని భర్త తవిటినాయుడుతో కలిసి కొత్తూరులోని శ్రీసాయి ప్రజా వైద్యశాలకు గురువారం వెళ్లింది. అక్కడ పీఎంపీ వైద్యుడు నాగేశ్వరరావు రెండు ఇంజక్షన్లు వేసే సమయానికి తేజాలు అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందిందని భర్త తెలిపాడు. విషయం తెలుసుకున్న తేజాలు బంధులు ప్రజా వైద్యశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కొత్తూరు ఎస్ఐ అక్కడకు చేరుకొని మృతురాలి బంధువులను శాంతింపజేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. -
చెరువుకు గండికొట్టి మా పొట్ట కొట్టారు..
● టీడీపీ నేతల అండతో జేసీబీతో చెరువుకు గండి ● వైఎస్సార్సీపీ సానుభూతిపరులమనే కక్ష గజపతినగరం : పిడిశీల గ్రామానికి చెందిన తాము పుష్కర కాలంగా చెరువు ద్వారా పంట పొలాలకు సాగునీరు వాడుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే తాము వైఎస్సార్సీపీ సానుభూతిపరులమనే కక్షతో టీడీపీ నేతల అండతో చెరువులకు జేసీబీతో గండికొట్టి తమ పొట్ట కొట్టారని సర్పంచ్ పాండ్రంకి సూర్యమాధవి గురువారం తెలిపారు. గతంలో ఓ వ్యక్తికి చెరువు లీజుకు ఇవ్వడంతో ఇందులో చికెన్ వ్యర్థాలు వేసి హాని తలపెట్టడంతో గత జూలై నెలలో గ్రీవెన్స్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీ చేసి తాత్కాలికంగా చెరువు లైసెన్స్ అధికారులు నిలుపు చేశారని పేర్కొన్నారు. తరువాత చెరువులను క్లోరినేషన్ చేయించి మళ్లీ రీఓపెనింగ్ పెట్టుకోవాలని సూచించారని తెలిపారు. దీనికి ఫిషరీస్కు సంబంధించి పర్మినెంట్ లైసెన్సు ఉండడంతో దాన్ని గ్రీవెన్స్లో పెట్టామని పేర్కొన్నారు. తరువాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ కొన్ని సూచనలు చేసి సంతకాలతో కూడిన స్టేట్మెంట్ను తీసుకున్నారని తెలిపారు. తరువాత చెరువు వినియోగానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇంతలో టీడీపీ మంత్రి జోక్యం చేసుకుని కలెక్టర్ ద్వారా ఏడాది పాటు చెరువులను తెరవకుండా లైసెన్స్ను నిలిపివేశారని పేర్కొన్నారు. చివరకు మంత్రి ఆదేశాలతో రాజకీయ కక్షతో చెరువును జేసీబీతో తవ్వేశారని పాండ్రంకి సూర్యప్రకాష్ దంపతులు విలేకరుల వద్ద తమ గోడు వెలిబుచ్చారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో రెవెన్యూ, ఫిషరీస్, పోలీసు అధికారులు మూకుమ్మడిగా వచ్చి తమ చెరువు ఖాళీ చేయించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారుల వద్ద సాక్షి ప్రస్తావించగా చెరువు లైసెన్స్ తాత్కాలికంగా నిలుపుదల చేశామని, క్లియరెన్స్ చేసుకుంటే మళ్లీ అనుమతులు ఇస్తామని తెలిపారు. -
దోపిడీకి అడ్డాగా వారపు సంతలు
● తూనికల్లో వ్యత్యాసం ● కల్తీ సరుకులదే రాజ్యం ● సంతల ద్వారానే ఏజెన్సీలకు ఖైనీ, గుట్కా సరఫరా ● మోసపోతున్న గిరిజనం కురుపాం: ఏజెన్సీలో వ్యాపారుల దోపిడీకి అడ్డాగా వారపు సంతలు నిలుస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జరుగుతున్న వారపు సంతల్లో కల్తీ సరుకులు రాజ్యమేలుతున్నాయి. నిత్యావసర సరుకులైన పప్పులు, నూనెలు, కారం, పసుపు, సబ్బులు, వంట దినుసులు సైతం కల్తీలే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ప్రతీ గురువారం కురుపాం మండల కేంద్రంలో జరిగే వారపు సంతకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ ఒక్క రోజే ఈ సంతలో రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ వారపు సంతపైనే నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన గిరిజనులు ఆధార పడుతుంటారు. గిరిజనులు పండించే ఫల సాయాలను వారపు సంతకు తెచ్చి వస్తు మార్పిడి ద్వారాగానీ, విక్రయించగా వచ్చిన డబ్బులతో తమకు అవసరమైన నిత్యావసర సరుకులను స్థానికంగా ఉన్న వ్యాపారుల వద్ద, వారపు సంతలో కొనుగోలు చేస్తారు. దోపిడీకి అడ్డాగా.. కురుపాం నియోజకవర్గంలో ఉన్న గిరిజన మండలాల్లో ప్రతీ వారం వారపు సంతలు నిర్వహిస్తున్నప్పటికీ వీటన్నిటిలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రాల్లో జరిగే వారపు సంతల్లోనే రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ వారపు సంతల్లో వ్యాపారుల తూకంలో భారీ వ్యత్యాసం కూడా ఉంటుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చిన నుంచి మరింత దోపిడీ ఎక్కువైందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ కాటాల్లో వ్యాపారులు చేతివాటం (మైనస్ నంబర్ ఫీడింగ్) వలన గిరిజనులు మోసానికి గురవుతున్నారు. గిరిజన రైతులు తెచ్చే అల్లం, పసుపు, చిరుధాన్యాలు, కాయగూరలు, చింతపండు వంటి వస్తువులను ఇంటి వద్ద ఉన్న వారి కాటాల్లో గిరిజనులు సక్రమంగానే తూచి స్థానిక మార్కెట్లోకి, వారపు సంతల్లో విక్రయించేందుకు తీసుకొని రాగా 3 కేజీల నుంచి 5 కేజీల వరకు తక్కువ వ్యాపారులు చూపిస్తూ తమను మోసం చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఖైనీ, గుట్కా విక్రయాలు జోరు.. వారపు సంతల ద్వారానే ఏజెన్సీలోని గ్రామాలకు ఖైనీ, గుట్కా వంటివి వారపు సంతల్లో వ్యాపారుల ద్వారానే ఏజెన్సీలోని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. విచ్చలవిడిగా విక్రయాలు జోరందుకోవడంతో చాలా వరకు గిరిజన యువత కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు, తూనికలు కొలతల శాఖ, నకిలీ వస్తువులు, నిత్యావసర సరుకులపై దృష్టి సారించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. వారపు సంతల్లోనే.. దశాబ్దాలుగా తామ పండించిన చింత, జీడి, పసుపు, అల్లం వంటి ఫల సహాయాలను వారపు సంతల్లోనే వ్యాపారులకు విక్రయిస్తుంటాం. తద్వారా మాకు అవసరమైన నిత్యావసర సరుకులను తమ వెంట తీసుకువెళ్తాం. అవి నాణ్యమైనవో లేక నాణ్యత లేనివో తెలియదు. తూకంలో కూడా వ్యత్యాసాలు ఉంటున్నాయి. – తోయక బాబూరావు, దురుబిలి గ్రామం, కురుపాం మండలం అధికారులు దృష్టి సారించాలి వారపు సంతల్లో వస్తువులు, ఎలక్ట్రానిక్ కాటాలపైన సంబంధిత అధికారులు దృష్టి సారించాలి. అవగాహన లేని గిరిజనులకు తూనికలు కొలతల్లో మోసం జరుగుతుంది. దీంతో అమాయక గిరిజనం నష్టపోతున్నారు. మోసం చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి. – ఇంటికుప్పల రామకృష్ణ, ట్రైబల్ రైట్ ఫొరం, జిల్లా అధ్యక్షుడు -
హోటల్ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం..
● ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు విజయనగరం: రాష్ట్రంలో హోటల్ అసోసియేషన్ రంగాన్ని రానున్న కాలంలో మరింత బలోపేతం చేస్తామని, హోటల్ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని మెట్రో కన్వెన్షన్లో గురువారం జరిగిన ఏపీహెచ్ఏ రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షునిగా విజయనగరం పట్టణానికి జి.శ్రీనివాసరావు, కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు చెందిన కలమెడి రమణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన ఎదపాటి కొండయ్య, కోశాధికారిగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన బైల లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల పరిశీలకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం రాష్ట్రంలో హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే హోటల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. హోటల్ రంగం ఒక ఇండస్ట్రీగా పని చేస్తుందన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే హోటల్ రంగం నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు పర్యాటకంగా అనేక సేవలను అందించడం జరుగుతుందన్నారు. త్వరలోనే అసోసియేషన్ తరఫున ప్రభుత్వ పెద్దలను కలిసి మా యొక్క సమస్యలను విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, హోటల్స్ యజమానులు పాల్గొన్నారు. -
మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు : డీఎంహెచ్వో
విజయనగరం ఫోర్ట్: మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం మాతృ, శిశు మరణాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రక్తహీనత ఉన్న గర్భిణులకు ఐరన్ మాత్రలు అందించాలన్నారు. రక్తం అవసరమైన వారికి రక్తం ఎక్కించాలని తెలిపారు. ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్ధాలు ప్రతీ రోజు భోజనంలో ఉండేటట్టు చూడాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే ఆసుపత్రిలో చేర్పించి ప్రసవం అయ్యే వరకు పర్యవేక్షణ చేయాలన్నారు. మాతృ, శిశు మరణాలు పునరావృతం అయితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి.శ్రీనివాస్, డాక్టర్ సుజాత, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం.. దయనీయం!
పల్లె పండగ పేరుతో రోడ్లన్నీ బాగుచేస్తామన్నారు.. గిరిజన ప్రాంతాల్లోని రాళ్లదారులన్నింటినీ అద్దంలా మెరిసిపోయే రోడ్లుగా నిర్మిస్తామన్నారు.. రాకపోకలకు కష్టాలు లేకుండా చేస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా గిరిజన ప్రాంతాల్లో రాళ్లదారులే దర్శనమిస్తున్నాయి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు విద్య, వైద్య కష్టాలు షరా మామూలుగా మారాయి. అత్యవసర వేళ రాళ్లదారుల్లో కిలోమీటర్ల మేర డోలీలోనే రోగులను తరలించాల్సిన దుస్థితి. గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్ సేవలు నిలిచిపోయాక గిరిజన గూడల్లో వైద్య కష్టాలు అధికమయ్యాయి. డోలీమోతలు నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇటీవల వైద్యం కోసం గిరిజనుల పాట్లే నిలువెత్తు నిదర్శనం.కొమరాడ: మండలంలోని పూడేస్, కుంతేస్, మసిమండ, పెదశాఖ, గుణదతీలేస్, చోళ్లప దం తదితర పంచాయతీల్లోని పలు గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. గిరిజనలు ఆనారోగ్యానికి గురైతే డోలీ మోతలే శరణ్యం. నాలుగు రోజుల కింద పాలేం పంచాయతీ పరిధి కుస్తూరు గ్రామానికి చెందిన తాడింగి సురేష్ అస్వస్థతకు గురైతే డోలీలో రాళ్లదారిలో 4 కిలోమీటర్ల దూరంలోని పూజారిగూడ వర కు మోసుకొచ్చి అక్కడ నుంచి ఆటోలో కురుపాం పీహెచ్సీకి తరలించారు. అనంతరం 108లో కేజీహెచ్కు తీసుకెళ్లారు.పొలం గట్లపై మూడు కిలోమీటర్లు... బొబ్బిలిరూరల్: మండలంలోని గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని మోసే వలస గ్రామానికి చెందిన చోడిపల్లి ఆశమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందిన ఆమె గ్రామానికి చేరుకుంది. మలివిడత చికిత్స కోసం బుధవా రం డోలీలో పొలంగట్లపై నుంచి మూడు కిలోమీటర్లమేర మోసుకుంటూ ఆమె బంధువులు నారశింహునిపేట వద్దకు చేర్చారు. అక్కడి నుంచి వాహనంలో విశాఖపట్నం తీసుకెళ్లారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా యాతన తప్పడం లేదంటూ గ్రామస్తులు వాపోయారు. కనీసం రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు. -
శ్రీకనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.1,47,173లు
చీపురుపల్లి: పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం హుండీల నుంచి రూ. 1,47,173లు ఆదాయం లభించినట్టు దేవస్థా నం ఈఓ బి.శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారి దేవస్థానంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జి. శ్యామ్ప్రసాద్ నేతృత్వంలో 2025 జూలై 16 నుంచి 2025 సెప్టెంబర్ 10 వరకు భక్తులు హుండీలలో వేసిన కానుకలను బుధవారం లెక్కించారు. కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు గవిడి నాగరాజు, పొట్నూరు త్రినాథ రావు, లెంక చిన్నారావు, ఇప్పిలి పార్వతి, ఇల్లాపు ఆది, తదితరులు పాల్గొన్నారు. కొత్త బాధ్యతలువిజయనగరం: రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్సీపీ సంస్థా గత నియామకాలను చేపట్టింది. మాజీ ముఖ్య మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణికి బాధ్యతలు అప్పగించింది. అలాగే రాష్ట్ర ఐటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా గజపతినగరం నియోజవర్గానికి చెందిన ఎస్. శ్రీనివాసరావును నియమించింది. వీరికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.ఆగని జిందాల్ పోరుశృంగవరపుకోట: జిందాల్ నిర్వాసితులు తమ పోరుబాటను కొనసాగిస్తున్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి బుధవారం ధర్నా చేయగా, స్థానికంగా ఉన్నవారు బొడ్డవరలో యథావిధిగా తమ ఆందోళన కొనసాగించారు. కూటమి నేతలు కొర్పొరేట్ శక్తులకు దాసోహమయ్యారంటూ విమర్శించారు. జిందాల్కు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చివేయాలంటూ నినదించారు. -
సంతసించేలా చేపల వ్యాపారం
● పూసపాటిరేగ, భోగాపురం తీరంలోని ఎండు చేపలకు గిరాకీ ● ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి ● ఫిష్ల్యాండింగ్ కేంద్రాలు వినియోగంలోకి తెస్తే మరింత ఉపయుక్తం పూసపాటిరేగ: జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండ లాల పరిధిలోని సముద్ర తీరంలో లభ్యమయ్యే ఎండు చేపలకు గిరాకీ ఉంది. ప్రతి బుధవారం పూసపాటిరేగ జాతీయరహదారిని ఆనుకొని జరుగుతున్న సంత నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎండుచేపలు ఎగుమతి అవుతున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలలు నుంచి వ్యాపారులు వచ్చి చేపలను కొనుగోలు చేసి లారీలతో తరలిస్తున్నారు. పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి, పతివాడబర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, కోనాడ, కొత్తూరు, మ ద్దూరు, నీలగెడ్డపేట, భోగాపురం మండలంలోని చేపలకంచేరు, ముక్కాం, కొండ్రాజుపాలెం, చోడిపల్లిపేటకు చెందిన మత్స్యకార మహిళలు ‘సంత’సించేలా ఎండుచేపల వ్యాపారం సాగుతోంది. వారం నుంచి పది రోజులు ఎండబెట్టి.. వేటలో దొరికిన చేపల్లో ఖరీదైనవి తీరంలోనే అమ్ముడవుతాయి. మిగిలిన చేపలను ఉప్పు కలిపిన నీటి లో ఒక రోజు ఉంచిన తరువాత ఎండలో సుమారు 10 రోజులపాటు ఆరబెట్టి సంతకు తరలిస్తారు. నా ణ్యత బాగుండడంతో ఇక్కడి ఎండుచేపలకు గిరాకీ ఉంటుందని మత్స్యకార మహిళలు చెబుతున్నారు. నిరుపయోగంగా ఫిష్ల్యాండింగ్ కేంద్రాలు పూసపాటిరేగ మండలం చింతపల్లి, భోగాపురం మండలం ముక్కాంలో సుమారు రూ.2 కోట్ల ఖర్చు తో ఫిష్ల్యాండ్ కేంద్రాలు ఉన్నా నిరుపయోగంగానే మారాయి. నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. చేపలు ఎండబెట్టడానికి ప్లాట్ఫాం, ఆంక్షన్హాల్, అధునాతన కూలింగ్ హాల్తో పాటు చేపలు నిల్వ కేంద్రాలు వినియోగానికి దూరంగా ఉన్నాయి. ఫిష్ల్యాండింగ్ కేంద్రాలను వినియోగంలోకి తీసుకువస్తే ఎండుచేపల వ్యాపారం మరింత విస్తరిస్తుందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. తీరప్రాంత గ్రామాల్లో ఫిష్ల్యాండింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలి. కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల వేలాది రూపాయలు విలువైన మత్స్యసంపద పాడవుతోంది. ముక్కాం, చింతపల్లి గ్రామాల్లో ఉన్న షిఫ్ల్యాండింగ్ కేంద్రాలను వినియోగంలోకి తీసుకువచ్చి, మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలి. – బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సహకారసొసైటీ అధ్యక్షుడు, విజయనగరం -
వీడని ఎరువు కష్టాలు
రైతులను ఎరువు కష్టాలు వీడడంలేదు. అధికారులు అధిగోఇదిగో అంటున్నా రైతుకు ఎరువు లభించడంలేదు. దీనికి మెరకముడిదాం మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద బుధవారం కనిపించిన ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. పీఏసీఎస్లో ఎరువులు పంపిణీ చేస్తారన్న సమాచారం మేరకు ఉదయాన్నే రైతులు అక్కడకు చేరుకున్నారు. తమ తమ ఆధార్కార్డు, భూమికి చెందిన వన్బీ జెరాక్స్లను వరుసగా పెట్టి అధికారులు వచ్చేంతవరకు వేచిచూశారు. అధికారులు 9.30 గంటలకు రావడంతో తమ జెరాక్స్లు పెట్టిన స్థానంలో రైతులు క్యూ కట్టారు. ఎరువుకోసం ఇన్ని కష్టాలు గత ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదని, డబ్బులిచ్చి కొనుగోలుచేసుకునే ఎరువును కూడా కూటమి ప్రభుత్వం సరఫరా చేయకపోవడంపై మండిపడ్డారు. ఒక్కో రైతుకు ఒక బస్తాయే ఇవ్వడంతో నిరాశచెందారు. – మెరకముడిదాం -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
విజయనగరం: గ్రంథాలయాలు వెలకట్టలేని విజ్ఞాన భాండాగారాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రశేఖర కల్కూర పేర్కొన్నారు. సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో సీతం ఇంజినీరింగ్ కాలేజీ గ్రంథాలయ విభాగంలో బుధవారం ‘విద్యార్థులు–గ్రంథాలయాల ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లడం ద్వారా విజ్ఞా నంతో పాటు నైతికవిలువలు, నడవడికను నేర్చుకు ని ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. పుస్తక పఠనం అనునిత్యం చేయాలని సూచించారు. సంఘ జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొమర్రాజు లక్ష్మణరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, పాతూరి నాగభూషణం వంటి ఎందరో మహనీయుల కృషి ఫలి తంగా తెలుగు నేలలో గ్రంథాలయాలు విరివిగా వ్యాప్తిచెందాయని గుర్తు చేశారు. గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకున్నప్పుడే వాటికి సార్ధకత చేకూరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కల్కూరను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, తదితరులు సత్కరించారు. వ్యాసరచన పోటీలలో విజేతలకు, జిల్లాలో విస్తృతంగా సేవలందిస్తున్న గ్రంథ పాలకులకు, ఏపీ గ్రంథాలయ సంఘం ద్వారా సేవలందిస్తున్న సభ్యులకు చంద్రశేఖర కల్కూర పతకాలను ప్రదానంచేశారు. కళాశాల చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్.సత్యవతి సమన్వయకర్తగా వ్యవహరించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాస్, గ్రంథాలయ సంఘం ఉపాధ్యక్షురాలు పిన్నింటి కళావతి, కార్యదర్శి ఎం.సుభద్రాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ఒకే రైతుకు 50 బస్తాల యూరియా విక్రయం
● విచారణ చేసిన విజిలెన్స్, వ్యవసాయ అధికారులు ● ఎరువుల దుకాణ డీలర్పై చర్యలకు సిఫార్సుతెర్లాం: మండలంలోని సుందరాడ గ్రామంలోని ఎరువుల దుకాణ డీలర్పై చర్యలకు విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సిపార్సు చేశారు. దీనికి సంబంధించి మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎరువుల దుకాణ డీలర్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒకే రైతుకు 50 యూరియా బస్తాలు విక్రయించినట్లు ఈపోస్ యంత్రంలో నమోదు చేశాడు. దీనిని గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఎరువుల డీలర్పై దర్యాప్తు నిమిత్తం వచ్చారు. ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్–1985 ప్రకారం ఒక రైతుకు ఎక్కువ యూరియా బస్తాలు విక్రయించడం నేరం కావడంతో దీనిపై మండల వ్యవసాయ అధికారి బొత్స శ్రీనివాసరావు, విజిలెన్స్ కానిస్టేబుల్ తిరుపతిరావు, సుందరాడ వీఏఏ దేముడు గ్రామానికి వచ్చి ఎరువుల దుకాణ డీలర్ వద్ద ఉన్న రికార్డులను గ్రామ పెద్దలు, రైతుల సమక్షంలో తనిఖీ చేశారు. ఎరువుల దుకాణ డీలర్ ఒక రైతుకు 50బస్తాల యూరియా విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు కావడంపై అతనిపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్, వ్యవసాయ అధికారులు తెలిపారు. -
ఇంజినీరింగ్ కళాశాలకు గ్రహణం..!
● కూటమి అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన పనులు ● ప్రభుత్వం స్పందించాలని గిరిజన సంఘాల డిమాండ్ గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకు మోక్షం కలగడం లేదు. గత ప్రభుత్వం కళాశాల మంజూరు చేసిన తరువాత దాదాపు 80 శాతం పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పూర్తి చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టిందని పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రజలు, పలుగిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుపాం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టినా నేటివరకు కురుపాంలో మంజూరైన గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు పూర్తి కాకుండా నిలిచిపోయాయని ఆదివాసీ గిరిజనులు వాపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యంగా అప్పటి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పట్టుబట్టి గిరిజన ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయించగా వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కురుపాం నియోజకవర్గ కేంద్రం సమీపంలో టేకరఖండి గ్రామం వద్ద 105 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.153.853 కోట్ల అంచనా విలువతో పనులకు నిధులు మంజూచేసింది. కళాశాల పూర్తి నిర్వహణ బాధ్యతలను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూకే)కి ప్రభుత్వం అప్పగించింది. త్వరితగతిన కళాశాల పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. అప్పటినుంచి పనులు చురుగ్గా జరిగినా తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్ధాంతరంగా నిలిచిపోయాయి. జేఎన్టీయూకే నాలుగో క్యాంపస్గా కురుపాం కళాశాల జేఎన్టీయూకే పరిధిలో ఇప్పటికే కాకినాడ, విజయనగరం, నర్సారావుపేటలో మూడు క్యాంపస్లు ఉండగా కురుపాం క్యాంపస్ నాలగవదిగా ఉంటుంది. కురుపాం క్యాంపస్లో గిరిజన విద్యార్థులకు ఐదు బ్రాంచిలైన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులను అందించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్రాంచికి 60 సీట్లు చొప్పున మొత్తం 300 సీట్లు ఉంటాయి. కురుపాం, పార్వతీపురం ప్రాంతాల గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టారు. కురుపాం ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం పూర్తయి తరగతులు ప్రారంభమైతే మన్యం జిల్లాలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కళాశాల ఎంతో ఉపయోగ పడుతుంది. కాంట్రాక్టర్కు రూ.8 కోట్ల బకాయి గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు నిలిచిపోయి రెండేళ్లవుతోంది. అలాగే కాంట్రాక్టర్కు కూడా సుమారు రూ.8 కోట్ల వరకు బకాయిలు ఉండిపోయాయి. దాదాపు 80 శాతం వరకు పనులు పూర్తి కాగా చివరి దశలో పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దృష్టి సారించలేదని ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని మన్యం జిల్లా ప్రాంత ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడితే నిరుపేద గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవకాశం ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
పత్రికలపై కక్షసాధింపు హక్కుల హననమే...
దినపత్రిక సంపాదకునిపై అక్రమ కేసులు పెట్టడం అంటే రాజ్యాంగ హక్కులను హననం చేయడమే. పత్రికలో వచ్చిన వార్త విషయంలో పోలీసులు ఏకంగా ఎడిటర్పై పొలీసు కేసు నమోదు చేయడాన్ని ప్రజాసామ్యవాదులెవరైనా ఖండించాల్సిందే. ప్రజాప్రతినిధి ఆరోపణల వ్యాఖ్యలను ప్రచురించిన విషయంలో అభ్యంతరాలుంటే అదే పత్రికా ముఖంగా ఖండించాలేగానీ పోలీసు కేసులు పెట్టడం సమంజసం కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదు. – జేఏవీఆర్కే ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
అటవీశాఖ రేంజ్ ఆఫీసర్గా రామ్నరేష్
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ రేంజ్ ఆఫీసర్గా బి.రామ్నరేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ బి.అప్పలరాజు ఉద్యోగవిరమణ పొందడంతో ఆయన స్థానంలో విధుల్లో చేరారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ డీఎఫ్ఓ, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అటవీశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, నాణ్యమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జాతీయ లోక్అదాలత్ను విజయవంతం చేయండి విజయనగరం లీగల్: జిల్లాలో ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయలోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీఅయ్యేలా చూడాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ, ఎకై ్సజ్, భూ సంబంధిత కేసులు, కుటుంబ తగాదాలు, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరువర్గాల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.పద్మావతి, పోక్సో కోర్టు జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.దుర్గయ్య, ఎ.కృష్ణప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఐస్బండితో చెట్టును ఢీకొని వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఐస్బండితో చెట్టును ఢీకొట్టి బుధవారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించి ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) ఐస్ బండి నడుపుతూ జీవనం కొససాగిస్తున్నాడు. వ్యాపారం నిమిత్తం సుంకరిపేట వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనాన్ని చూసి పక్కకు తప్పించబోయి చెట్టును ఐస్ బండితో చెట్టునుకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కొడుకు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్ చెప్పారు. -
మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్
కురుపాం: మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అనధికార అమ్మకాలు (బెల్ట్ షాపులు) నిర్వహిస్తున్న వారి కోసం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై ఐదు రోజుల పాటు స్పెషల్డ్రైవ్ నిర్వహించి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేసినా, గొలుసు దుకాణాల నిర్వహణకు వేలం పాట నిర్వహిస్తున్నా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎకై ్సజ్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై జె.రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. నలుగురి అరెస్టు -
గంజాయి కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు
● ప్రాసిక్యూషన్ జరుగుతుండగా మరో నిందితుడి మృతి విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఎస్.కోట పోలీస్స్టేషన్లో 2018లో నమోదైన గంజాయి కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటవ ఏడీజే ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించారని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఎస్కోట స్టేషన్ పరిధి బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద సిబ్బందికి వచ్చిన కచ్చితమైన సమాచారంతో 2018 ఫిబ్రవరి 19 న వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వ్యాన్ లో పశ్చిమ బెంగాల్ కు చెందిన సంతు ముజిందార్ (36), ఏఎస్ఆర్ జిల్లా జీకే వీధి మండలం దుప్పలవాడకు చెందిన పంగి ధనుంజయ్ (24) గంజాయి రవాణా చేస్తూ పట్టుబడగా వారి నుంచి 66.2 కిలోల గంజాయిని ఎస్.కోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్.కోట సీఐ వై.రవికుమార్ నిందితులను రిమాండ్కు తరలించి, న్యాయస్థానంలో నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్లో నిందితుడు (ఎ2) పంగి ధనుంజయ్ పై నేరారోపణలు రుజువు కావడంతో పైవిధంగా శిక్ష విధిస్తూ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఎ1) సంతు ముజిందార్ ప్రాసిక్యూషన్ సమయంలో మరణించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నిందితుడు (ఎ2) పంగి ధనుంజయ్కు శిక్ష పడేలా చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీపీని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. జిల్లాలోని కొత్తవలస కుమ్మరివీధిలో ఉంటున్న ఒక మహిళపై 2023లో దాడికి పాల్పడి, బంగారు వస్తువులను దోపిడీ చేసిన ఎల్.కోట మండలం జమ్మాదేవి పేటకు చెందిన నిందితుడు మడబత్తుల కృష్ణ (34)కు విజయనగరం 5వ ఏడీజే కోర్టు జడ్జి ఎన్.పద్మావతి జీవిత ఖైదు , రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కొత్తవలస కుమ్మరివీధిలో మడబత్తుల సూర్యకాంతం తన కొడుకుతో కలిసి నివాసం ఉంటోంది. 2023 ఏప్రిల్ 15వతేదీన గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోనికి చొరబడి, ఆమె తలపై కొట్టి, కంట్లో కారం జల్లి, మెడలో బంగారు పుస్తెల తాడు, చెవిదిద్దులను అపహరించికుని పారిపోయాడు. గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించగా మృతిచెందినట్లు ఆమె అన్నయ్య సూడా అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదుపై దోపిడీ చేసి, హత్యకు పాల్పడినట్లు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టిన అప్పటి కొత్తవలస సీఐ బాల సూర్యారావు విచారణ చేసి, నిందితుడు కృష్ణను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో జడ్జి ఎన్.పద్మావతి పైవిధంగా తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. -
ఆటో బోల్తా పడి ఒకరి మృతి
గుర్ల: మండలంలోని పెద్దబంటుపల్లి ప్రధానరహదారిలో బుధవారం ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలకు మేరకు..మెరకముడిదాం నుంచి గరివిడి వస్తున్న ఆటోకు పెద్దబంటుపల్లి వద్ద అడ్డంగా కుక్క రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మెరకముడిదాం మండలం సింగవరం గ్రామానికి చెందిన మన్యపురి తవిటినాయుడు (59) మృతి చెందాడు. గాయాలపాలైన ముగ్గురిని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేగిడి: మండల పరిధిలోని అంబాడ గ్రామానికి చెందిన ముడిదాన కిరణ్ (6) తీవ్ర జ్వరంతో మృతిచెందాడని ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న కిరణ్ మృతి వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులను హెచ్ఎం మీసాల సత్యంనాయుడుతో కలిసి ఆయన పరామర్శించారు. వేకువజామున నాలుగు గంటల సమయంలో గుండెలో నొప్పి వచ్చిందని, అనంతరం వాంతులు కావడంతో అపస్మారకస్థితికి చేరుకోగా కుటుంబ సభ్యులు రాజాం కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతిచెందాడని వైద్యులు తెలిపారని ఎంఈఓ పేర్కొన్నారు. ఆయనతో పాటు ఉపాధ్యాయులు ఎం.సింహాచలం, డి.ప్రసాద్, బాలుడు తండ్రి జోగినాయుడు తదితరులు పరామర్శలో పాల్గొన్నారు. గాయాల పాలైన వారికి సపర్యలు చేస్తున్న పెద్దబంటుపల్లి గ్రామస్తులు మరో ముగ్గురికి గాయాలు -
స్కూల్గేమ్స్ పోటీల్లో సత్తా చాటాలి
● డిప్యూటీ డీఈఓ కె.వెంకటరమణ ● రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక ప్రారంభంవిజయనగరం: రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరగబోయే స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభతో సత్తా చాటాలని డిప్యూటీ డీఈఓ కె.వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్కూల్గేమ్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలను బుధవారం ఆయన నగరంలోని పీఎస్ఆర్ స్కూల్లో ప్రారంభించారు. టేబుల్ టెన్నిస్, మాల్కంబ క్రీడాంశాల్లో అండర్–14,17 విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో టేబుల్టెన్నిస్ క్రీడాంశంలో 20 మంది, మాల్కంబ క్రీడాంశంలో 16 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తాయన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక పోటీలను టేబుల్టెన్నిస్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, విజయనగరం డివిజన్ ఇన్చార్జి తవిటయ్య, రత్నకిషోర్, శ్రీను, రవి, ప్రవీణ్, శ్రీకాంత్లు పర్యవేక్షించారు. సెపక్తక్రా పోటీల్లో 20 మంది ఎంపిక నెల్లిమర్ల మండలం అలుగోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన సెపక్తక్రా అండర్–14,17 బాల, బాలికల ఎంపిక పోటీల్లో 20 మంది జిల్లా జట్టుకు అర్హత సాధించారు. ఎంపిక పోటీల్లో మొత్తం 50 మంది క్రీడాకారులు పాల్గొనగా..పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ధర్మారావు పర్యవేక్షణలో ఎంపికలు జరిగాయి. జిల్లా జట్టుకు అర్హత సాధించిన క్రీడాకారులు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లనున్నారు. ఎంపిక పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు సూర్యారావు తదితరులు పర్యవేక్షించారు. -
‘స్టేటస్కో’ భూములకు అధికారుల కంచె
తగరపువలస: ఓ హోటల్ కోసం హైకోర్టు స్టేటస్కో ఆదేశాలున్న భూముల్లో రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో బుధవారం జంగిల్ క్లియరెన్స్ చేయడంతోపాటు ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టడంపై విశాఖ, విజయనగరం జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మే ఫెయిర్ హోటల్కు కూటమి సర్కారు కేటాయించిన భూముల్ని ఇచ్చేందుకు తిరస్కరించిన రైతులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించి స్టేటస్కో ఉత్తర్వులు తీసుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీ సర్వే నెం.101/1లో బుధవారం భీమిలి రెవెన్యూ అధికారులు 200 మంది కూలీలతో జంగిల్ క్లియరెన్స్తో పాటు ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టారు. 70 ఏళ్లకు పైగా ఈ భూములలో సరుగుడు, కొబ్బరి, నీలగిరి, జీడి తదితర తోటలు సాగు చేసుకుంటూ డీఆర్ నంబరు కలిగిన రైతులను అక్కడకు అనుమతించలేదు. విలేకరులను కూడా దూరం నుంచే పోలీసులు పంపించేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే సర్వే నంబరులో స్టార్ ఒబెరాయ్ గ్రూప్నకు స్థలాలు కేటాయించినప్పుడు రైతులకు ప్రతిఫలంగా ఎకరాకు 20 సెంట్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఇదే సర్వే నంబరులో మే ఫెయిర్ హోటల్కు 40 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను రైతులకు ఎకరాకు 5 సెంట్లు మాత్రమే ఇస్తామనడంతో వారు అంగీకరించలేదు. జూన్లో ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన మే ఫెయర్ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. అప్పట్లో భీమిలి తహసీల్దారు రామారావు ఫిర్యాదు మేరకు భీమిలి మండలం అన్నవరం పంచాయతీ, విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం పంచాయతీలకు చెందిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 40 ఎకరాల రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి స్టేటస్కో ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్ను గురువారానికి వాయిదా వేసింది. పేదల కడుపుకొట్టి హోటల్కు భూములా? ఇందులో మా కుటుంబానికి ఎ.8.50 సెంట్లు ఉంది. ల్యాండ్ పూలింగ్కు అడిగినా ఇవ్వలేదు. హైకోర్టును ఆశ్రయించి జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. పేదల కడుపు కొట్టి ప్రభుత్వం హోటల్కు భూములు ఇస్తుంది. – దువ్వి అప్పన్న, తూడెం -
మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్ప రథం’తో ప్రచారం
విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించి, వారిని ఆ అలవాటుకు దూరం చేసేందుకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు ’సంకల్ప రథం’తో ప్రచారం చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. యువతతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ఈ ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రథాన్ని ప్రారంభించామన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ’సంకల్ప రథం’ రూపొందించామన్నారు. ప్రతిరోజూ ఒక మండలాన్ని సందర్శించి, స్థానిక పోలీస్స్టేషన్ అధికారి, సిబ్బంది సహకారంతో ఉదయం కళాశాలల్లో వాహనాన్ని నిలిపి, విద్యార్ధులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నామన్నారు. అదే విధంగా సాయంత్రం సమయాల్లో మండలంలోని ముఖ్య ప్రాంతం లేదా కూడలిలో వాహనాన్ని నిలిపి, ప్రజలు, యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వారిలో చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ’సంకల్ప రధం’తో అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. మూడో విడతగా ప్రచార కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి ఆగస్టు 16 వరకు నిర్వహించినట్లు తెలిపారు. కొత్తగా ఒక షెడ్యూల్ను రూపొందించి ఆ ప్రకారం స్థానిక పోలీస్అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఒక మండలంలోని ఒక కళాశాల, ముఖ్య కూడలిలో వాహనాన్ని నిలిపి, మాదక ద్రవాలవల్ల కలిగే దుష్ప్రభావాలపై వీడియోలు ప్రదర్శించి, వివరించామని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలను సంకల్ప రథం సందర్శించే విధంగా షెడ్యూల్ రూపొందించామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. -
ఇసుక బండి కింద పడి రైతు మృతి
శృంగవరపుకోట: మండలంలోని వేములాపల్లి గ్రామంలో మంగళవారం ఇసుక బండి కింద పడి ఓ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గోస్తనీనదిలోకి ఇసుక కోసం బండి తోలి లోడు వేసుకుని వస్తున్న సమయంలో బొడబల్ల సన్యాసిరావు(48) ప్రమాదవశాత్తు జారిపోయి బండి కింద పడిపోగా టైరు సన్యాసిరావు మీదుగా వెళ్లిపోయింది. దీంతో హుటాహుటిన సహచరులు ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు మృతుడి భార్య ఉమ ఎస్.కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్.కోట పోలీసులు వివరించారు. మృతుడు సన్యాసిరావుకు భార్య ఉమ, పిల్లలు భువనచంద్ర, మౌనికలు ఉన్నారు. ట్రాక్టర్ కిందపడి వృద్ధుడు.. శృంగవరపుకోట: పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వన్వే జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ రోడ్డు వారగా నడిచి వెళ్తున్న కొటానవీధికి చెందిన కొటాన వల్లయ్య(74)ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ తొట్టి టైరు కింద పడిన వల్లయ్య అక్కడికక్కడే ప్రాఽణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న ఎస్.కోట పోలీసులు వెంటనే ట్రాక్టర్ను స్టేషన్కు తరలించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న కొడుకు నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఒక బస్తాను ఏం చేసుకోవాలి?
నేను నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నా. నెల రోజులుగా యూరియా రాలేదు. ప్రస్తుతం వరి పంట పిలకలు వేస్తున్నాయి. ఈ తరుణంలో యూరియా వేయాలి. నాలుగు బస్తాల యూరియా అవసరం కాగా ఒక్క బస్తా ఇస్తున్నారు. దీనిని ఏం చేసుకోవాలి?. ఎన్ని ఎకరాలున్నా ఒక బస్తా మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది రైతులను మోసం చేసే ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతూ ఆనందంగా లేడు. – కెల్ల నారాయణరావు, రైతు, గుంకలాం గ్రామం, విజయనగరం మండలం -
ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ● పార్వతీపురంలో మారథాన్ 5కె రెడ్రన్ పార్వతీపురం టౌన్/రూరల్: జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. హెచ్ఐవీ/ఎయిడ్స్, మాదక ద్రవ్య దుర్వినియోగంపట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్ఫెస్ట్–2025 ఐఈసీ మారధాన్ 5కె రెడ్రన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్, ఎస్వీడీ డిగ్రీ కళాశాల వద్ద జెండాను ఊపి రెడ్రన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు నాలుగురోడ్ల కూడలి మీదుగా రన్ ర్యాలీ కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం కలెక్టర్ హెచ్ఐవీపై, రక్షణ లేని లైంగిక సంబంధాలు, రక్తమార్పిడి, వాడిన చిరంజీల వినియోగం వంటి తదితర వ్యాప్తి చెందే సందర్భాలపై అవగాహన కల్పించారు. అనంతరం మారధాన్ రెడ్ రన్లో మహిళలు, పురుషుల విభాగంలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. గెలుపొందిన వారిలో మహిళా విభాగంలో పి.అరుణ, ప్రథమ, బి.స్పందన ద్వితీయ స్థానాలను సాధించగా పురుషుల విభాగంలో బి.సాయి ప్రథమ, ఎం.అజయ్లు ద్వితీయ స్థానం గెలుచుకున్నారు. అలాగే ట్రాన్స్జెండర్ విభాగంలో బి.చిన్ని ప్రథమ, బి.ప్రశాంత్ ద్వితీయ స్థానం గెలుపొందారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7వేలు కలెక్టర్ అందించారు. అలాగే క్విజ్ కాంపిటేషన్లో ప్రథమ స్థానం విజేతలు మౌనిక, వైష్ణవి, వాసు ద్వితీయ స్థానంలో భువనేశ్వరి, కుమారి తృతీయ స్థానంలో మామిలి, భవ్యశ్రీలకు కూడా కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్కుమార్, ఏఆర్టీ అధికారి డా. ఫణీంద్ర, దిశ సీపీఎం కేవీఆర్. శైలజ, డీఎస్డీఓ డా.శ్రీధర్, దిశ టీం జి.అమ్మినాయుడు, జి.కోటేశ్వరరావు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్జీఓలు, ఎన్ఎస్పీ ఫెసిలిటీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సిమ్స్ బాప్టిస్ట్ చర్చి 150 వసంతాల వేడుకలు
● సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్.జాన్ విజయనగరం టౌన్: మత సామరస్యానికి నెలవైన విజయనగరంలో అతిపెద్ద క్రైస్తవ సమాజంగా పేరుపొందిన సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి 150 వసంతాల వేడుకలను ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు సిమ్స్ చర్చి సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్.జాన్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సిమ్స్ చర్చిలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 150 వసంతాల చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం సిమ్స్ చర్చి కెనడా మేరీ టైమ్ బాప్టిస్ట్ మహాసభకు చెందిన డాక్టర్ సేన్ ఫోర్ట్ భీమిలి నుంచి ఇక్కడికి వచ్చి 1875 నవంబర్లో ఇక్కడ సంఘాన్ని స్థాపించి యాభై ఏళ్ల పాటు క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. తర్వాత కాలంలో దీనికి సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిగా నామకరణం చేసినట్లు తెలిపారు. అలా సిమ్స్ స్థాపితమై నేటికి 150 వసంతాలు పూర్తిచేసుకుని, 151 వ వసంతంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలను విజయనగరం క్రైస్తవ సమాజానికి తలమానికంగా అత్యంత ఘనంగా నిర్వహించ తలపెట్టామని, అందులో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ వేడుకలు ప్రారంభిస్తారన్నారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఐదు రోజుల పాటు విజయనగరంలో క్రైస్తవ మహాసభలు నిర్వహిస్తామన్నారు. క్రైస్తవమహాసభలకు ప్రముఖ దైవజనులైన రాజమండ్రి జాన్ వెస్లీ, మదనపల్లి రాజశేఖర్, పలమనేరు వేద నాయకం, బెంగుళూరు బెన్నీ ప్రసాద్, తిరుపతి హేమలత ప్రభ, హైదరాబాద్ వడ్డే నవీన్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో సౌత్ ఇండియా యూత్ కన్వెన్షన్ పేరుతో బైబిల్ రిఫరెన్స్, బైబిల్ క్విజ్, గ్రూప్ సింగింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దైవజనులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
252 పాఠశాలలు అభివృద్ధికి చర్యలు
రామభద్రపురం: జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు కింద 252 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్ఏ జిల్లా కో ఆర్డినేటర్ ఎ. రామారావు తెలిపారు. మండలంలోని బూసాయవలస కేజీబీవీ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. బాలికలకు నాణ్యమైన విద్యనందించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని టీచర్లకు సూచించారు. బాధ్యతగా పనిచేయాలని ఎంఆర్టీలను ఆదేశించారు. మండలానికి 4 నుంచి 5 పాఠశాలలు మరీ అధ్వానంగా ఉన్నాయని, వాటిని తొలుత బాగుచేస్తామన్నారు. పాఠశాలల నిర్వహణకు స్కూల్ గ్రాంటు కింద రూ.2.2 కోట్లు విడుదలైనట్టు వెల్లడించారు. కేజీబీవీల నిర్వహణకు ఒక్కో విద్యాలయానికి రూ.2 లక్షల చొప్పున విడుదల చేస్తామని తెలిపారు. పీఎంశ్రీ కింద 40 పాఠశాలల్లో రూ.4.50 కోట్లతో ఆధునిక కెమిస్ట్రీ ల్యాబ్లు, లైబ్రరీలు, క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కేజీబీవీల్లో షటిల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, వాలీబాల్, క్యారమ్స్ క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 10వ తరగతిలో ఉత్తీర్ణశాతం మరింత పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఈఈ ఎన్.హరిప్రసాద్, ప్రిన్సిపాల్ దీపిక, తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు మైనర్ల ఫేక్ బాంబ్ కాల్..!
● స్టేషన్కు పిలిపించి మందలించిన సీఐ విజయనగరం క్రైమ్: చదువుకుంటున్న ఇద్దరు మైనర్లు ఫేక్ బాంబ్ కాల్ చేసి అటు స్కూల్ యజమాన్యాన్ని, ఇటు పోలీసులను పరుగులు పెట్టించారు. దీనిపై టుటౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల, భోగాపురానికి చెందిన మైనర్ల అత్త విజయనగరంలోని డబుల్ కాలనీలో ఉన్న కేజీబీవీలో పనిచేస్తోంది. ఈ మైనర్లు రెండు రోజుల క్రితం ఫంక్షన్కు వెళ్లిన సమయంలో తమ అత్త ఇంకా రాలేదన్న అక్కసుతో ఫేక్బాంబ్ కాల్ నాటకా నికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5 గంటలకు కేజీబీవీకి ఫోన్ చేసి బాంబ్ ఉందని చెప్పి ఫోన్ కట్ చేశారు. స్కూల్ నుంచి సమాచారం అందుకున్న టుటౌన్ సీఐ తన సిబ్బందితో హుటాహుటిన ఆరోజు రాత్రే కేజీబీవీకి వెళ్లి అణువణువూ గాలించారు. సీఐ శ్రీనివాస్ ఫోన్ నంబర్లను వెరిఫై చేయగా నెల్లిమర్ల లోకేషన్ చూపించడంతో క్రైమ్ పార్టీతో వెళ్లి ఇద్దరు మైనర్లను పట్టుకుని విచారణ చేయగా అది ఫేక్ కాల్ అని తెలింది. మైనర్ల తండ్రులు ఆర్టీసీలో ఒకరు, సెక్యూరిటీగా మరొకరు పనిచేస్తున్నారు. పోలీసులనే హడలెత్తించిన మైనర్లను సీఐ శ్రీనివాస్ మంగళవారం స్టేషన్కు పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలోనే సున్నితంగా హెచ్చరించారు. జైలు జీవితం వద్దని, ఇటువంటి ఫేక్ కాల్స్ ఆలోచన రావొద్దని చెబుతూ జీడీలో ఇద్దరి పేర్లను రాయించి ఇంటికి పంపించారు. ఈ విషయమై సీఐ మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారో కన్నవారు నిరంతరం కనిపెడుతూ ఉండాలన్నారు. కాలేజీ స్టూడెంట్స్ భవిష్యత్తు దృష్ట్యా కన్నవారిని పిలిచి మందలించామని సీఐ తెలిపారు. -
రైతులకు రూ.85 లక్షల టోకరా!
● రైతులకు తప్పుడు రశీదులు ● సభ్యులందరికీ నోటీసులిచ్చి విచారణ జరుపుతాం గరుగుబిల్లి: గరుగుబిల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో (పీఏసీఎస్) అక్రమాలు జరిగాయి. రైతులకు తప్పుడు రశీదులు ఇచ్చి సుమారు రూ.85 లక్షలకు టోకరా పెట్టినట్టు ప్రాథమిక సమాచారం. పీఏసీఎస్లలో కంప్యూటరీకరణతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గరుగుబిల్లి పీఏసీఎస్ పరిధిలోని 12 గ్రామాలకు చెందిన 1400 మంది రైతులు ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరిలో చాలామంది రుణాలు తీసుకున్నారు. పీఏసీఎస్ సీఈఓ ఈ ఏడాది ఏప్రిల్ 2న అకాలమరణం పొందారు. ఇక్కడ జరిగిన అక్రమాలపై విజయనగరం డీసీసీబీ చీఫ్ మేనేజర్ సంతోష్కుమార్ ప్రాథమిక దర్యాప్తును నిర్వహించగా 31 మంది రైతుల పేరున రూ. 85 లక్షల వరకు కాజేసినట్టు నిర్ధారించారు. మరింత లోతైన దర్యాప్తునకు విచారణాధికారిగా జిల్లా సహకారశాఖాధికారిని నియమించి, రెండు నెలల్లో దర్యాప్తును పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు పీఏసీఎస్లో ఆగస్టు 22 నుంచి రైతులకు నోటీసులను జారీచేసి కార్యాలయంలోనే విచారణ చేపడుతున్నారు. రశీదులతోనే... సొసైటీ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో ఒక రశీదు రైతుకు, బ్యాంకునకు ఒక రశీదు సమర్పించాలి. మూడో రశీదు కార్యాలయంలో ఉంటుంది. ఈ రశీ దుల జారీలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పుతీసుకున్న రైతుకు ఒక రశీదు ఇచ్చి, మిగిలిన రశీదులు బ్యాంకుకు సమర్పించ లేదు. రైతుకు అప్పునకు సంబంధించి రశీదుతో పాటు ఆ రుణానికి సంబంధించిన వివరాల నమోదుకు అప్పటి సీఈఓ చెల్లుచీటీ ఇచ్చినట్టు సమాచారం. రుణం తీరిపోయిందని రైతులు భావించారు. వాస్తవానికి రైతు చెల్లించిన డబ్బులు బ్యాంకుకు జమచేయలేదు. దీంతో రైతు రుణం చెల్లించనట్టుగా సంస్థ లెక్కలలో ఉంది. రెండు రశీదు పుస్తకాలు మాయం సంస్థ జారీ చేసిన రెండు రశీదు పుస్తకాలు మాయమయ్యాయి. ఆ రెండు రశీదు పుస్తకా లతో రైతులతో అప్పటి సీఈఓ ఆర్థిక లావాదేవీలు నెరిపినట్టు అధికారులు గుర్తించారు. రశీదు పుస్తకాల నంబర్లు 112500 నుంచి 112550 వరకు, 112651 నుంచి 112700 వరకు రశీదుల లావాదేవీలు పీఏసీఎస్లో లేవు. సొసైటీలో సభ్యత్వం తీసుకొన్న రైతులందరికీ నోటీసులు జారీ చేస్తాం. ఇంత వరకు 181 మంది రైతులకు నోటీసులు జారీచేయగా 60 మందిని విచారణ చేపట్టాం. రెండు రశీదు పుస్తకాలు కార్యాలయంలో కనిపించడం లేదు. ఆ రెండు రశీదు పుస్తకాలద్వారానే రైతుల రుణానికి సంబంధించి రశీదులను జారీచేశారు. నోటీసులు రాకపోయినా సభ్యత్వం ఉన్న రైతులు వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. – ఆర్.రమణమూర్తి, డీసీఓ, పార్వతీపురం -
కొంతమందికే ఇంటింటికీ రేషన్
● ఈ కింది ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం విజయనగరం పట్టణంలోని గోకపేటలోనిది. గోకపేట రేషన్ డిపో నుంచి బియ్యాన్ని సైకిల్ పై వేరే మహిళ సహాయంతో వృద్ధురాలు ఇంటికి తీసుకుని వెళ్తోంది.వృద్ధుల ఇంటికి సరుకులు ఇవ్వాలి 65 ఏళ్లు దాటిన వృద్ధుల ఇంటికి వెళ్లి సంబంధిత రేషన్ డీలర్ రేషన్న్సరుకులు ఇవ్వాలి. ఎక్కడైనా ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం. – మురళీనాథ్, జిల్లా పౌరసరఫరాల అధికారివిజయనగరంఫోర్ట్:ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలోని అనేక మంది వృద్ధులకు ఎదురువుతున్న దుస్థితి. ఇంటింటికీ వెళ్లి రేషన్ అందించే పక్రియకు కూటమి సర్కార్ స్వస్తి పలికింది. దీంతో ప్రజలకు కష్టాలు మొదలుయ్యాయి. అయితే 65 ఏళ్లు దాటిన వృద్ధుల ఇంటికే రేషన్ సరుకులు అందిస్తామని కూటమి సర్కార్ చెప్పింది. అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమందికే రేషన్ అందిస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. జిల్లాలో రైస్ కార్డులు 5,74,137 జిల్లాలో రైస్ కార్డులు 5,71,137 ఉన్నాయి. వారందరికీ ప్రతి నెల రేషన్ డిపోల ద్వారా సరుకులు అందించాల్సి ఉంది. వారిలో 65 ఏళ్లు దాటినవారు 69,246 మంది ఉన్నారు. వారందరికీ ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందించాల్సి ఉంది. కానీ వారికి పూర్తిస్థాయిలో ఇంటికి రేషన్ సరుకులు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైస్ కార్డు దా రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు అందించారు. అన్ని వర్గాల ప్రజల ఇంటికే వెళ్లి రేషన్ అందించడం వల్ల వారికి ఇబ్బందులు తప్పాయి. గంటల తరబడి రేషన్ సరుకుల కోసం నిరీక్షించాల్సిన పని ఉండేది కాదు. దీని వల్ల పనులు మానుకుని ఉండాల్సి వచ్చేది కాదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారు, రేషన్ డిపో దూరంగా ఉన్నవారు 2,3 కిలోమీటర్లు నడిచి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అటువంటి వారికి ఇంటికి వెళ్లి సరుకులు అందించేవారు. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గేవి. కానీ కూటమి సర్కార్ పాలనలో రేషన్ సరుకుల కోసం వాగులు, వంకలు, దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికీ వెళ్లే ఆసక్తి లేదనే ఆరోపణలు 65 ఏళ్లు నిండిన వారి ఇంటికి రేషన్ సరుకులు ఇవ్వడానికి డీలర్లు అసక్తి చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల వృద్ధులు రేషన్ డిపోలకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నదే అయినప్పటికీ తప్పని పరిస్థితి. పూర్తిస్థాయిలో వృద్ధుల ఇంటికి చేరని బియ్యం జిల్లాలో రైస్ కార్డులు 5,73,137 వాటిలో 65 ఏళ్లు దాటిన వారు 69,246 మంది -
హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్శాఖలో హోంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎంవీ కృష్ణారావుకు ‘చేయూత‘ అందించేందుకు సిబ్బంది పోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు రూ.3,22,340/ల చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన లేదా ఉద్యోగ విరమణ చేసిన హోగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు హోంగార్డ్స్’ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీస్ ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేద్దాం
● రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్వెస్లీపార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు క్రిస్టియన్ మైనార్టీలంతా కృషిచేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీసెల్ అధ్యక్షుడు జాన్ వె వెస్లీ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమానికి కృషిచేస్తూ పార్వతీపురం మన్యంజిల్లాలో మైనార్టీల అభివృద్ధి కోసం పేద, వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కా రానికి కృషిచేస్తామన్నారు. క్రైస్తువులంతా ఏకమై వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కుల, మత, ప్రాంత, పార్టీల భేదం లేకుండా ఇళ్లకే పథకాలందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అఽధికారంలోకి తెచ్చుకు నేందుకు ముందస్తు ప్రణాళికలతో క్రైస్తవ సోదరులంతా ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అనేక వర్గాల వారిని అవస్థలకు కూటమి ప్రభుత్వం గురిచేస్తోందన్నారు. అనంతరం ఆయన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జిల్లావ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీ నాయకులకు తదుపరి కార్యాచరణపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ లక్ష్మణరావు, సాలూరు, కురుపాం మైనార్టీసెల్ అధ్యక్షులు సువార్త రాజు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తూనికల్లో తేడాలొస్తే చర్యలు
రాజాం సిటీ: తూనికల్లో తేడాలొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి, శ్రీకాకుళం లీగల్మెట్రాలజీ అధికారులు ఉమాసుందరి, బలరాంకృష్ణలు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాజాంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. పండ్ల దుకాణాలు, వ్యాపార సంస్థల్లో వినియోగిస్తున్న కాటాలను పరిశీలించారు. ఈ సందర్భంగా 300 నుంచి 400 గ్రాముల వరకు తూకంలో తేడాలు గుర్తించారు. మొత్తం 40 మందిపై కేసులు నమోదుచేయడంతో పాటు కాటాలను, సీల్ లేని ఇనుపగుండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూనికల్లో తేడాలు లేకుండా విక్రయాలు జరపాలని, అలాగే ఎంఆర్పీ కంటే అధికంగా విక్రయాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కువగా పండ్ల దుకాణాల్లో మోసాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, మరోసారి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దాడికారణంగానే వాచ్మన్ మృతి
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామానికి చెందిన వాచ్మన్ కోడూరు ముత్యాలనాయుడిపై లారీ డ్రైవర్లు చేసిన దాడి కారణంగానే మృతిచెందాడని రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముత్యాలనాయుడు మృతికి కారకులైన ఇద్దరు లారీ డ్రైవర్లను అరెస్టుచేశామని తెలిపారు. స్థానిక పాలకొండ రోడ్డులోని లక్ష్మీనారాయణ రైస్మిల్లు వద్ద ముత్యాలునాయుడు వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 14 మిల్లు వద్దకు లారీ డ్రైవర్లు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం చిర్లుపాలెం గ్రామానికి చెందిన బూర్లె నాగరాజు, కోరాడ చిన్నప్పడులు రెండు లారీల ఊక ఎత్తుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ మద్యం తాగుతుండగా వారించిన వాచ్మన్పై విచక్షణా రహితంగా డ్రైవర్లు దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడడంతో వాచ్మన్ తొడ ఎముక విరిగిపోయిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని చెప్పారు. కార్యక్రమంలో సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు, సిబ్బంది ఉన్నారు. -
మృతుల స్వగ్రామాల్లో విషాదఛాయలు
జామి: మండలంలోని అలమండ గ్రామం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరికిపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బోని సాగర్, గుల్లిపల్లి సురేష్ అక్కడికక్కడే మృతిచెందారు. భీమాళి గ్రామానికి చెందిన మిడతాన సూర్యప్రకాష్ విజయనగరం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన గణేష్, సత్యవతి దంపతుల కుమారుడు సూర్యప్రకాష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు యువకులు, చేతికి అందివచ్చిన తరుణంలో మృత్యువాత పడడంతో మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యక్తిపై కేసు నమోదుసంతకవిటి: మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన కంఠ రామలక్ష్మిని అదే గ్రామానికి చెందిన టొంపల రాజు మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రామలక్ష్మి భర్త జీవనోపాధి నిమిత్తం విజయవాడ తరచూ వెళ్తుంటాడు. భర్త లేని సమయంలో రాజు ఆమెను మానసికంగా వేధిస్తుండగా భర్త ఇంటికి రావడంతో ఆమె ఈ విషయం తెలపడంతో సోమవారం స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
గడువు దాటక ముందే పరిష్కరించాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్కు 167 వినతులువిజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని ఇంకనూ చూడవలసిన కాలమ్లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజూ లాగిన్ అయిన అధికారులు వినతులను చూడాలని అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ చేసి ముగించాలని తెలిపారు. గడువులోగా వినతులకు సమాధానాలు పంపాలని లేని ఎడల సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ, మురళి ప్రజల నుంచి వినతులు 167 వినతులు స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 20 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 20 ఫిర్యాదులు వచ్చాయి. కార్యాలయానికి ఫిర్యాదుతో వచ్చిన ప్రతి బాధితుడి ఆవేదనను ఎస్పీ వకుల్ జిందల్ అడిగి తెలుసుకున్నారు. వారి ముందే సంబంధిత స్టేషన్ హౌన్ ఆఫీసర్కు ఎస్పీ ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత ఎస్హెచ్ఓలకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీలీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
సతివాడ ఘటనలో 72 మందిపై కేసుల నమోదు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో ఇటీవల జరిగిన గణనాథుడి ఊరేగింపులో తలెత్తిన ఉద్రిక్తత ఘటనలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మొత్తం 72 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ సోమవారం తెలిపారు. ఎస్సీ కాలనీ గణేష్ నిమజ్జనం ఊరేగింపులో బీసీ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్తులు తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. దళితులమనే అక్కసుతోనే తమ గణేష్ ఊరేగింపును అడ్డగించారని, కులం పేరిట దూషించారని, బీసీ సామాజిక వర్గానికి చెందిన 36 మందిపై ఉత్సవ నిర్వాహుకులు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా..ఫిర్యాదులో పేర్కొన్న 36 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే ఘటనలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు బీసీ మహిళలపై దాడి చేశారని, అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వారు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన 36 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో మొత్తం 72 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని ఎస్సై గణేష్ స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా పోలీస్ పికెట్ గ్రామంలో కొనసాగిస్తున్నామన్నారు. -
వినతులకు పరిష్కారం చూపండి
పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో మొత్తం 133 వినతులు స్వీకరించారు. వినతుల స్వీకరణలో కలెక్టర్తోపాటు డీఆర్ఓ హేమలత, ఉప కలెక్టర్ పి. ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినతులను సంబంధిత అధికారులే స్వయంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసిన అనంతరం పరిష్కారం చూపాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై వచ్చిన ప్రజలు అర్జీలను అందజేశారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలి గిరిజన విద్యార్థులు, ఉపాధ్యాయులపై వివక్ష చూపుతున్న జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం, ఆదివాసీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో పి.రంజిత్ కుమార్, పల్లా సురేష్, ఆరిక చంద్రశేఖర్, మరికొంతమంది నాయకులు నిరసన తెలుపుతూ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పదోతరగతి ప్రతిభా అవార్డులలో గిరిజన విద్యార్థులను కానీ, ఉపాధ్యాయ దినోత్సవంలో గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానీ, కేటాయింపు చేయకుండా వివక్షతో డీఈఓ వ్యవహరిస్తున్నారని, ఈ మేరకు ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్దేశించిన సమయంలో ఫిర్యాదుల పరిష్కారం ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు నిర్దేశించిన సమయంలోనే చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించు కోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్లో స్వయంగా మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 12 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 41 వినతులు సీతంపేట: ఐటీడీఏలో సోమవారం ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 41 వినతులు వచ్చాయి. ఎరువులు ఇప్పించాలని పాలిష్కోట రైతులు అర్జీ ఇచ్చారు. సీసీ రోడ్డు పూర్తి చేయాలని మూర్తిగాడి గూడకు చెందిన సవర రవికుమార్ కోరారు. కొండపోడు పట్టా ఇప్పించాలని శుబలయకు చెందిన పొట్నూరు గౌరికుమారి విన్నవించారు. పెద్దగూడకు చెందిన సవర ఆదమ్మ మోటార్ ఇంజిన్కు రుణం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. కొత్తగూడలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వినతిఇచ్చారు. లాడలో సెల్ టవర్ పెట్టాలని ఆరిక ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, పీహెచ్వో ఎస్వీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పైడితల్లమ్మ జాతరకు సన్నాహాలు
విజయనగరం: నగరంలోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి, మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. రానున్న పైడితల్లి అమ్మవారి జాతర నేపథ్యంలో ఇంజినీరింగ్ పనులు ముమ్మరం చేస్తున్నారు. ఈనెల 20వ తేదీ నాటికి నిర్దేశిత పనులు పూర్తి కావాలని కమిషనర్ పల్లి నల్లనయ్య సిబ్బందికి నిర్దేశించారు. దీంతో పనుల ప్రక్రియ ఊపందుకుంది. స్థానిక రాజారావు మేడ వద్ద బీటీ రహదారి మరమ్మతు పనులు సాగుతున్నాయి. అలాగే ప్రశాంతినగర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాంక్రీట్ పని జరుగుతోంది. గాయత్రి నగర్లో సీసీ రోడ్డు నిర్మాణం సాగుతోంది. మయూరి ఎత్తు బ్రిడ్జి వద్ద సీసీ బెర్ము పనులు చేపట్టారు. కాటవీధి వద్ద కల్వర్టు మరమ్మతులు పూర్తి చేశారు. కాళీమాత టెంపుల్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పరిసరాల్లో ఉన్న డివైడర్ గ్రిల్స్కు రకరకాల రంగులు అద్దుతున్నారు. ఆయా పనులను డీఈ శ్రీనివాసరావు, ఏఈలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే నెల్లిమర్లలోని బూస్టర్ పంప్ హౌస్ ప్రాంతాన్ని డీఈ నరసింహారెడ్డి పరిశీలించారు. కొన్ని ప్రాంతాలలో రహదారులకు ఇరువైపులా ఉన్న లతలను సిబ్బంది తొలగించారు. గుబురుగా ఉన్న ప్రాంతాలను చదును చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ పైడితల్లమ్మ జాతర నాటికి నగర సుందరీకరణలో భాగంగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నామన్నారు. ఈనెల 20వ తేదీలోగా పనులు పూర్తి చేసి ప్రజలు, భక్తుల కోసం నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం మరింత సమర్థవంతంగా జాతర నిర్వహించేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
దత్తిరాజేరు: మండలంలోని మరడాం వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం లారీ ఢీకొనడంతో మర్రివలస గ్రామానికి చెందిన కోరాడ లక్షణరావు(42)అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్.బూర్జవలస ఏఎస్సై రమణ తెలిపారు. ఈ మేరకు స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం నుంచి గజపతినగరం వెళ్తున్న లారీ బస్సు కోసం ఉన్న లక్షణరావు వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కొన్నాళ్లు క్రితం భార్యతో తెగతెంపులు అవగా కూలి పనులు చేసుకుంటూ అన్నదమ్ముల వద్ద ఉంటున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చెప్పారు.ఎన్ఎంఎంఎస్కు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం టౌన్: డిసెంబర్ 7న జరగనున్న ఎన్ఎంఎంఎస్ పరీక్షకు జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి. రాజ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలు రాయడానికి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుని కుటుంబ సంవత్సరాదాయం రూ.:3.5లక్షలు మించకూడదని తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు పార్వతీపురంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పని దినాల్లో సంప్రదించాలని ప్రకటనలో కోరారు.జాతీయస్థాయి పోటీలకు రాజాం క్రీడాకారులురాజాం సిటీ: ఈ నెల 26 నుంచి 29 వరకు జమ్ము కశ్మీర్లో జరగనున్న పికిల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రాజాం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 6, 7తేదీలలో విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగ్గా రాజాంకు చెందిన పీవీజీకే రాజు, డాక్టర్ బీహెచ్ అరుణ్కుమార్, డాక్టర్ ఎం.పురుషోత్తం, సీహెచ్ రామకృష్ణంరాజు, బి.శాంతిస్వరూప్, ఆర్.విజయకృష్ణలు చక్కని ప్రతిభకనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం ఎంపిక జాబితా వచ్చిందని క్రీడాకారులు తెలిపారు. వారి ఎంపికపట్ల రాజాంకు చెందిన పలువురు అభినందనలు తెలియజేశారు.ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యసంతకవిటి: మండలంలోని తాలాడ గ్రామానికి చెందిన బింగి లక్ష్మణరావు సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అప్పుల బాధ తాళలేక లక్ష్మణరావు తన కళ్లలంలోని రేకుల షెడ్లో ఉరి వేసుకున్నట్లు భార్య గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.పోలీసు శాఖకు జాగిలాల కేటాయింపుపార్వతీపురం రూరల్: పోలీసుశాఖలో కీలకంగా వ్యవహరించి పేలుడు పదార్థాల కేసుల ఛేదింపు, నేరస్తులను గుర్తించడంలో ఉపయోగపడే జాగిలాలను జిల్లా పోలీసు శాఖకు రెండింటిని కేటాయించారు. ఈ మేరకు సోమవారం నూతన జాగిలాలు జూలీ, చార్లీతో పాటు హేండర్స్ ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రెండు జాగిలాలు విజయవాడ మంగళగిరి హెడ్క్వార్టర్స్ 6వ బెటాలియన్లో సీటీసీలో శిక్షణ పొందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ వాటి హేండర్లైన పార్వతీశం, లక్ష్మణరావు, ఆనంద్మోహన్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు రాంబాబు, నాయుడు, డాగ్ హేండర్లు తదితరులు పాల్గొన్నారు. -
భయపెడుతున్న నిమోనియా..!
● జిల్లాలో పెరుగుతున్న కేసులు ● ఇటీవల జిల్లాకు చెందిన ఇద్దరి మృతి ● నెలకు 400 నుంచి 500 వరకు కేసుల నమోదు విజయనగరంఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన 12 ఏళ్ల బాలుడుకి దగ్గు, ఆయాసం, జ్వరం రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు, ఎక్స్రే, స్కానింగ్ తీసిన తర్వాత నిమోనియాగా గుర్తించారు. అక్కడ మూడు రోజులపాటు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ● ఇదే మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళకు దగ్గు, ఆయాసంతో పాటు చాతి నొప్పి, జ్వరం రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా అక్కడ వైద్య పరీక్షలు, ఎక్సరే, స్కానింగ్లో నిమోనియాగా గుర్తించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. వీరిద్దరే కాదు. జిల్లాలో అనేక మంది నిమోనియా వ్యాధి బారిన పడుతున్నారు. చల్లటి వాతావరణంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. నెలకు 400 నుంచి 500 వరకు నిమోనియా కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాతపడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో చికిత్స చేయించుకోవాలని చెబుతున్నారు. నిమోనియా, ఆస్తమా ఉన్న వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. కాలుష్యం ఉండే ప్రాంతాల్లో తిరగకూడదు. త్వరగా నిద్రపోవాలి. మధుమేహవ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలి. కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు ప్రతిరోజు తీసుకోవాలి. స్వీట్స్, మైదా, గోధమలు, అన్నం తక్కువగా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలసత్వం వద్దు నిమోనియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వ్యాధి పట్ల అలసత్వం వహించరాదు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. సకాలంలో చికిత్స చేయించుకోవాలి. మద్యం, పొగ తాగడం మానివేయాలి. చిన్న పిల్లలకు నియోనియా రాకుండా వ్యాక్సిన్ వేస్తారు. పెద్దవాళ్లు కూడా నియోనియాకు వ్యాక్సిన్ వేయించుకోవాలి. న్యూమోకోలర్, ఇన్ఫ్లూయంజా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ బొత్స సంతోష్కుమార్, పలమనాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
భయపెట్టిన కింగ్కోబ్రా
సీతంపేట: సుమారు 18 అడుగుల పొడవు ఉన్న కింగ్కోబ్రా సీతంపేటలోని ఓ ప్రైవేటు నర్సరీ పంప్షెడ్ గదిలో తిష్టవేసింది. సామగ్రి తీసేందుకు సోమవారం గదిలోకి వెళ్లిన నర్సరీ యజమాని భుజంగరావు పామును చూసి భయపడ్డారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. శ్రీకాకుళం నుంచి స్నేక్క్యాచర్స్ ఖాన్, అశోక్ వచ్చి కింగ్కోబ్రాను పట్టుకుని కొత్తూరు–బత్తిలి రిజర్వ్ ఫారెస్టు పరిధిలో విడిచిపెట్టినట్టు ఎఫ్బీఓ దాలినాయుడు తెలిపారు. రాళ్లదారిలో 4 కిలోమీటర్లు..కొమరాడ: మండలంలోని పాలెం పంచాయతీ పరిధి కుస్తూరు గ్రామానికి చెందిన తాడింగి సురేష్ సోమవారం త్రీవ అస్వస్థతకు గురయ్యాడు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో రాళ్ల దారిలో 4 కిలోమీటర్ల దూరంలోని పూజారి గూడ గ్రామం వరకు తీసుకొచ్చి ఆటోలో కురుపాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధిని విస్మరించిందని, రోడ్ల సదుపాయం కల్పనకు కనీస చర్యలు తీసుకోవడంలేదని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. తరచూ డోలీ కష్టాలు ఎదురవుతున్నా పట్టించుకోవడంలేదంటూ వాపోయారు.కింగ్కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్ -
రామరాజ్యం స్థానంలో రాక్షస రాజ్యం
● పడిగాపులే... ● ఇదీ లెక్క.. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు అర్థం అవుతున్నాయి. ఆ నదిలో దిగి స్నానం చేసి రాగానే బంగారు కడియం ఇస్తానని చెప్పిన పులి.. బాటసారిని ఊబిలో చిక్కుకునేలా చేసి కబళించిన పులి కథ ప్రజలకు యాదికొస్తోంది. గుప్పెడు గింజల కోసం ఆశపడిన పావురాళ్లు వేటగాని వలలో చిక్కుకున్న కథ కూడా గుర్తొస్తోంది. ఎండు చేప ముక్క ఆశపడి బోనులో చిక్కుకున్న ఎలక పరిస్థితి మాదిరిగా మారింది ఏపీలో అన్నదాత పరిస్థితి. మీకెందుకు.. అన్నీ చేస్తాను.. అన్నీ ఇస్తాను అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు మాటలు పంచదార పైన పూతపోసిన విషగుళికలు అని ఇప్పుడే అర్థమవుతోంది. పాడియావును కాళ్లదన్నుకుని నిజంగా కాళ్లతో తన్నే ఎద్దును తెచ్చుకుని ఇప్పుడు బాధపడితే ఏమిలాభం.. వైఎస్ జగన్ ఉన్న రోజుల్లో ఇంట్లో బిడ్డలకు అందరికీ సరిపోయేలా తల్లి అన్నం వండినట్లు.. అందరికీ సరిపోయేలా ఫలహారం సిద్ధం చేసినట్లు.. ఒక్కో ఊరికి ఎంత ఎరువు అవసరం అనేది లెక్కేసి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేసేది. రైతులు అలా వీధి చివరకు వెళ్లి ఎరువులు తెచ్చుకునేవారు. పోటీలేదు.. పోరాటం ఆరాటం అసలే లేదు. ఎవరో ఎత్తుకుపోతారన్న బెంగలేదు. అందరికీ సమృద్ధిగా ఎరువులు అందేవి. ఉన్న ఊళ్లోనే అన్ని సేవలు.. సౌకర్యాలు ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రైతుకు పట్టంగట్టిన వైఎస్ జగన్ పాలన స్థానంలో రైతులు అంటే అసహ్యించుకునే కూటమి పాలన వచ్చింది. ఇక కష్టాలు మొదలయ్యాయి. పంటపండితే గిట్టుబాటు ధర దక్కదు. పంటలు వేద్దామంటే ఎరువులు దొరకవు. మారుతల్లి బిడ్డకు గిన్నె నిండా గంజిపోసి.. అందులో గుప్పెడు మెతుకులు విదిలించినట్లుగా ఎరువుల సరఫరా జరుగుతోంది. దీనికోసం రైతుల కొట్లాట.. కాట్లాడా.. గంటలతరబడి సొసైటీలు, ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ లైన్లు.. తోపులాట.. తన్నులాట.. ఒక్క బస్తా ఎరువు దక్కితే ఏనుగు ఎక్కినంత సంబరం. అమ్మా... నాన్న ఏడమ్మా రోజంతా కనిపించలేదని అడిగే బిడ్డకు నాన్న ఎరువుల కోసం క్యూలో ఉన్నాడని చెప్పాల్సిన పరిస్థితి ఆ తల్లిది. వచ్చిన ఎరువుల్లో సింహభాగం టీడీపీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయి బ్లాకులో అమ్ముతున్నారు. ఇక్కడ లైన్లో చెమటలుగక్కే రైతన్నలు మళ్లీ పరుగుపరుగున టీడీపీ వారి దుకాణాలకు వెళ్లి అధికధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి. జై కిసాన్ నినాదం ఆంధ్రాలో అపహాస్యం పాలవుతోంది. పాలకులకు బాధ్యత లేదు.. కానీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఆ బాధ్యతను భుజాన వేసుకుంది. రైతుల దుస్థితిని గుర్తించిన పార్టీ అధినేత వారికి బాసటగా ఉందామని నిర్ణయించుకున్నారు. అడుగడుగునా దగాపడుతున్న రైతన్న ఎరువుకోసం అగచాట్లు బస్తా యూరియా కోసం రోజంతా నిరీక్షించినా లభించని వైనం నేడు అన్నదాతపోరు పేరిట ప్రభుత్వాన్ని నిలదీయనున్న రైతన్న జిల్లాలోని మూడు ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు చీపురుపల్లిలో పాల్గొననున్న శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అందరికీ అన్నంపెట్టే రైతన్నకు కష్టకాలం దాపురించింది. పొలంపని మానుకుని ఎరువు కోసం అగచాట్లు పడుతున్నాడు. ఒక బస్తా ఎరువు కోసం మండే ఎండలో.. పస్తులతో రోజంతా పడిగాపులు కాస్తున్నాడు. ఓ చోట టోకెన్ల పంపిణీ, మరో చోట ఎరువుబస్తా కోసం చాంతాడంత లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి. అప్పటికీ ఎరువు దొరుకుతుందో లేదో తెలియని దుస్థితి. జిల్లాకు వచ్చిన ఎరువును కూటమి నేతలు ముందుగానే బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయించడంతో రైతన్నకు ఈ గడ్డు పరిస్థితి ఎదురైందంటూ గగ్గోలుపెడుతున్నారు. దీనిపై జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల వద్ద మంగళవారం వైఎస్సార్సీపీ తలపెట్టిన పోరుబాటలో పాల్గొనేందుకు పెద్దఎత్తున సమాయత్తమవుతున్నారు. కూటమి ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు. నేడు ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసనలు నేడు (మంగళవారం–సెప్టెంబర్ 9)న జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ఆందోళనలకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ‘ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టి రైతులకు ఎరువులు అందేవరకు పోరాటం సాగిస్తామని కూటమి నేతల వెన్నుతట్టనుంది. బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల వద్ద వేలాదిగా తరలివచ్చే రైతులతో కలిసి ఉద్యమం చేపట్టనుంది. పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎంపీపీలు, అన్ని స్థాయిల్లోని కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొని రైతుపక్షాన నిలబడి ప్రభుత్వం కళ్లు తెరిపించనున్నారు. చీపురుపల్లిలో జరగనున్న కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు. యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాలకు పూర్తిస్థాయిలో యూరియా రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు దుకాణాల వద్ద బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకని పరిస్థితి. పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందజేయకుండా కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని, రైతు ఉసురు తప్పక తగులుతుందంటూ శాపనార్థాలు పెడుతున్నారు. కొందరు రైతులు పొరుగు జిల్లాలోని పద్మనాభం, ఆనందపురం, భీమునిపట్నం తదితర మండలాలకు వెళ్లి రూ.267లు విలువున్న యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.400కు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు రైతులు గత్యంతరం లేక రూ.1700 విలువైన కాంప్లెక్స్ ఎరువు బస్తాను పంటకు జల్లుతున్నారు. పెట్టుబడి తడిసిమోపెడవుతోందంటూ ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాకు 40,111 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. ఈ నెల 6వ తేదీవరకు 26,849 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. ఇందులో 26,387 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించారు. 462 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. రైతు సేవా కేంద్రాల వద్ద 227.9 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 206 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ వద్ద 22 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ల వద్ద 6 టన్నులు ఉంది. నిల్వలు అరకొరగా ఉండడం, అవసరం ఎక్కువగా ఉండడంతో రైతులకు యూరియా దొరకడం లేదు. -
సుజల స్రవంతి భూ సేకరణ వేగవంతం చేయండి
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు భూ సేకరణపై తన చాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.కోట, వేపాడ, కొత్తవలస మండలాల పరిధిలోని నాలుగు గ్రామాల్లో 108 ఎకరాలు, బొండపల్లి మండలంలోని 3 గ్రామాల పరిధిలో 126 ఎకరాల భూసేకరణపై చర్చించారు. ఈ గ్రామాల రైతులతో త్వరలో సమావేశం నిర్వహించి ధర ఖారారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.ఎస్.కళావతి, సుజల స్రవంతి ఈఈ ఎ.ఉమేష్కుమార్, ఆయా భూసేకరణ విభాగాల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డయల్ యువర్ కలెక్టర్కు 19 కాల్స్సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్కు 19 కాల్స్ వచ్చాయి. ప్రధానంగా రెండో విడత యూరియా సరఫరా పైనే కాల్స్ ఎక్కువగా వచ్చాయి. కలెక్టర్ అంబేడ్కర్ స్వయంగా కాలర్స్తో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. యూరియా సక్రమంగా సరఫరా అయ్యేలా చూస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సమాధానం చెప్పారు. -
పైడితల్లి ఆలయంలో సమస్యల కొలువు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 12 నుంచి పందిరిరాట, మండల దీక్షలతో ప్రారంభంకానున్నాయి. చదురుగుడి అభివృద్ధి కోసం ఇరువైపులా ఉన్న షాపులను పూర్తిగా నేలమట్టం చేయడంతో కొన్నాళ్లుగా ఆలయ గోడలు శిథిలావస్థకు చేరాయి. వర్షం కురిస్తే ఆలయమంతా నీటితో నిండిపోతోంది. అసలే చిన్న ఆలయం కావడంతో పక్కన రేకులను కప్పి మమ అనిపించేశారు. వర్షం కురిసినప్పుడు ప్రధాన ఆలయం లోపలికి వర్షం నీరు చేరుతుండడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న ఆలయానికి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేని స్థితిలో అధికారులున్నారా ? అని ప్రశ్నిస్తున్నారు. హుండీల ఆదాయం నెల, నెలన్నర రోజులకు లెక్కిస్తారు. గత గురువారం లెక్కించిన చదురుగుడి హుండీల నుంచి రూ.15,62,461 నగదు, సుమారు 12 గ్రాముల బంగారం, 216 గ్రాముల వెండి లభించాయి. వనంగుడి నుంచి రూ.3,64,000 ఆదాయం సమకూరింది. లక్షలాది రూపాయలు ఆదాయం వస్తున్నా చిన్నపాటి వర్షం వస్తే కారిపోయే ఆలయానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోవడంపై భక్తులు విచారం వ్యక్తంచేస్తున్నారు. పండగ పూట వర్షం కురిస్తే కారిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ● రక్షణ కరువు పైడితల్లి అమ్మవారి చదురుగుడి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆలయంలో సుమారు ఐదారు హుండీల వరకు ఉంటాయి. భక్తులు సమర్పించే కానుకలన్నీ అందులోనే నిక్షిప్తమై ఉంటాయి. ఆలయానికి పటిష్టమైన భద్రత లేకపోవడం వల్ల ఎప్పుడు ఏ చోరీ జరుగుతుందోనన్న భయం అటు సిబ్బంది, ఇటు భక్తుల్లో నెలకొంది. పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. పైడితల్లి జాతర మహోత్సవాలు పూర్తికాగానే ఆలయ విస్తరణ పనులు ప్రారంభిస్తాం, ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ–టెండర్లు పిలిచారు. నాలుగు టెండర్లు వచ్చాయి. ఈలోపు తాత్కాలికంగా మరమ్మతులు చేపడతాం. – కె.శిరీష, ఇన్చార్జి ఈఓ, పైడితల్లి అమ్మవారి దేవస్థానం, విజయనగరం హుండీలకు రక్షణ అంతంత మాత్రమే.. వర్షం కురిస్తే ఆలయమంతా నీరే.. శిథిలావస్థలో ఆలయ ప్రహరీలు పండగ సమీపిస్తున్నా మరమ్మతుల పనులు శూన్యం -
చెరువులో పడి వ్యక్తి మృతి
భోగాపురం: మండలంలోని సవరవిల్లి పంచాయతీ బుగతపేట గ్రామానికి చెందిన బుగత లక్ష్మణ్(42) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుగతపేట గ్రామానికి చెందిన బుగత లక్ష్మణ్ కొబ్బరి తోటల్లో కొబ్బరి కాయలు తీసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆయన అనా రోగ్యంతో బాధపడుతుండడంతో ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో అతనికి ఏదో గాలి పట్టిందని అందువల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడని కుటుంబసభ్యులు భావించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ బహిర్భూమికి వెళ్తానని చెప్పి శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఆదివారం మధ్యాహ్నం రాజ్కమల్ పౌల్ట్రీ సమీపంలో ఉన్న చెరువులో లక్ష్మణ్ శవమై తేలాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్సీకి తరలించారు. మృతుని తమ్ము డు యరకయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యకుమారి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీతానగరం: మండలంలో విశాఖ–రాయగడ రైల్వేలైన్లో సీతానగరం మండలం మరిపివలస వద్ద గేటు దాటుతుండగా ఆదివారం సాయంత్రం రైలు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పార్వతీపురం రైల్వే పోలీస్ రత్నకుమార్ తెలిపిన వివరాలిల మేరకు ట్రైన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు వచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టు పక్కల గ్రామాలకు తెలియజేయగా మృతుడిని మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన పప్పల సూర్యనారాయణ(58)గా గుర్తించారన్నారు. మృతదేహాన్ని పార్వతీపురం ప్రభుత్వ జిల్లాకేంద్రాస్పత్రికి తరలించినట్లు తెలియజేశారు. -
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఖేలో ఇండియా అస్మిత వెయిట్ లిఫ్టింగ్ లీగ్ పోటీల్లో శ్రీపాద శ్రీజ ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు, మరో విద్యార్ధిని మౌనిక రెండు స్వర్ణపతకాలు దక్కించుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు, చాన్స్లర్ జీఎస్ఎన్ రాజు, వైస్ చాన్స్లర్ పీకే మహంతి, తదితరులు అభినందిచారు. 55 మద్యం సీసాల పట్టివేతరాజాం: రాజాం ప్రొహిభిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అనధికారిక మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్శాఖ రాజాం సీఐ ఆర్.జైభీమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో మూడురోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురు వ్యాపారులపై కేసులు నమోదుచేసి 55 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశామని చెప్పారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. -
గణనాథుడి ఊరేగింపులో ఘర్షణ
● ఇరువర్గాల మధ్య వివాదం ● భారీగా మోహరించిన పోలీసులు ● గ్రామంలో కొనసాగుతున్న పోలీస్ పికెట్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో శనివారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గణనాథుడి ఊరేగింపు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఎస్సీ కాలనీ ప్రజలు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి శనివారం రాత్రి శ్రీకారం చుట్టారు. ఊరేగింపులో భాగంగా గ్రామ ప్రధాన రహదారి నుంచి వెళ్లేందుకు యత్నించగా బీసీ వర్గాలు అడ్డుకున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువత తమ పట్ల, తమ ఆడబిడ్డల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బీసీ వర్గానికి చెందిన మహిళలు అర్ధరాత్రి రోడ్డుపై భైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇళ్ల ముందు నుంచి ఊరేగింపు చేయడానికి వీలులేదంటూ అడ్డుకున్నారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ..సుమారు 20 మంది సిబ్బందితో గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తగాదా పెరగకుండా నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాన్ని పోలీసులే చేపట్టారు. ఇదిలా ఉండగా దళితులమనే అక్కసుతోనే తమ గణనాథుడి నిమజ్జనానికి అడ్డు తగిలారంటూ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు చెబుతున్నారు. వివక్ష చూపిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ రామకృష్ణను వివరణ కోరగా ఘటన వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ను కొనసాగిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన సుమారు 30 మందిపై చర్యలు తీసుకోవాలని దళిత వర్గానికి చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారని వారి ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెప్పారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
● వాచ్మన్ మృతిపై కుటుంబసభ్యుల ఆందోళనరాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పాలకొండ రోడ్డులోని లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లులో పనిచేస్తున్న వాచమన్ కోడూరు ముత్యాలనాయుడు (70) ఈ నెల 6న మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు మిల్లు యాజమాన్యంతోపాటు పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే వాచ్మన్ మృతిచెందాడంటూ పెద్ద ఎత్తున ఆదివారం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. పొనుగుటివలస గ్రామానికి చెందిన కోడూరు ముత్యాలు నాయుడు ఏడాది నుంచి రైస్మిల్లులో వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 14న రాత్రి యథావిధిగా విధులకు హాజరయ్యాడు. ఆ రోజు రాత్రి మిల్లు వద్ద ఊక కోసం రెండు లారీలు వచ్చాయి. లారీలో వచ్చిన కొంతమందిని అక్కడ మద్యం తాగవద్దని వాచ్మన్ అడ్డుకోగా దాడికి దిగారు. దీంతో వాచ్మన్ ముఖంతోపాటు పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. మరుసటి రోజు విషయం తెలుసుకున్న కుమారుడు లక్ష్మునాయుడు తండ్రిని ఆస్పత్రిలో చేర్పించడంతో పాటు సంతకవిటి పోలీసులకు, మిల్లర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వూండ్ సర్టిఫికెట్లేదని కేసు కట్టలేమని ఎస్సై గోపాలరావు తెలిపారని బాధితులు వాపోయారు. మరోవైపు రూ.15వేలు, రూ.25వేలు ఇప్పిస్తామని ఎస్సై రాజీ ప్రయత్నాలు చేసినట్లు ఫిర్యాదులో బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఆందోళన ముత్యాలనాయుడు మృతిని జీర్ణించుకోలేక అటు కుటుంబసభ్యులతో బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చి మిల్లు ఎదుట నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ ఉపేంద్రతోపాటు రేగిడి, వంగర, సంతకవిటి ఎస్సైలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనను అదుపుచేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. మృతుని కుమారుడి ఫిర్యాదుతో హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని సీఐ ఉపేంద్ర వెల్లడించారు. -
కల్వర్టుల నిర్మాణం కలేనా?
● జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన 44 కల్వర్టులు ● రెండింటికి మాత్రమే మంజూరైన నిధులుపార్వతీపురం రూరల్: రహదారులపై అధ్వానంగా భారీ గుంతలు ఏర్పడి వాహన చోదకులను ప్రమాదాలకు గురిచేస్తుంటే ఇంకోపక్క రహదారిపై ఉన్న కల్వర్టులు శిథిలావస్థకు చేరి, కుంగిపోయి మరింత భయాందోళనకు వాహనచోదకులను గురిచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రహదారులపై 44 కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి. వాటి నిర్మాణాల నిమిత్తం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు, అంచనా విలువలు అధికారులు పంపించారు. అయితే ప్రస్తుతం రెండు కల్వర్టులకు సంబంధించి మాత్రమే నిధులు మాత్రమే మంజూరయ్యాయని, మరో 133 కల్వర్టులకు మరమ్మతులు చేసేందుకు కూడా నివేదికలు పంపామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రహదారులు దారుణంగా గోతులమయమై వాహనాల రాకపోకలకు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రహదారుల్లో కనీస స్థాయిలో మరమ్మతులు సైతం సక్రమంగా నిర్వహించడం లేదు. జిల్లా కేంద్రం నుంచి కొరాపుట్కు వెళ్లేందుకు ఉన్న రహదారిపై మరమ్మతులు ప్రారంభించి కొన్ని భారీ గుంతలు మాత్రమే పూడ్చి పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రహదారిపై అక్కడకక్కడ ఏర్పడిన గుంతల్లో రాళ్లు తేలి మరమ్మతులకు నోచుకోకపోవడంతో సమస్యకు పూర్తి పరిష్కారం కాలేదని వాహన చోదకులు, ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం ఎప్పుడో? రహదారి నిర్మాణం, మరమ్మతులకు సంబంధించిన 97పనులకు నిధులు మంజూరు కాగా 324 కిలోమీటర్ల రహదారి పనులను ప్రారంభించి 295 కిలోమీటర్లు పనులు పూర్తిచేశామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికీ దారుణమైన గుంతలతో రహదారులు దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 324 కిలోమీటర్ల పరిధిలో పనులు చేశామని ఆర్అండ్బీ పరిధిలో మరో 150 కిలోమీటర్ల రోడ్ల పనులకు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా చాలా ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన రహదారుల పనులపై ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో స్పష్టత ఇవ్వడం లేదు. అంచనాలు వేస్తున్నామంటూ దాటవేస్తున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో బైపాస్రోడ్డు, పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి, లక్ష్మీనారాయణపురం, సంగంవలస, సీతంపేట తదితర గ్రామాల రోడ్లు గుంతలతో నేటికీ అధ్వానంగా ఉన్నాయి. మరి ఈ రోడ్డు పనులు ఎప్పుడు నిర్వహిస్తారో? ప్రభుత్వం నిధులు మంజూరు చేసేదెప్పుడో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు రోజూ కళ్లారా చూస్తూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్న రహదారులపై ముఖం చాటేస్తూ దాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య వాహన చోదకులు అధికారులు, పాలకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.నివేదికలు సిద్దం చేస్తున్నాం ఆర్అండ్బీ పరిధిలో గత అక్టోబర్లో మంజూరైన నిధుల మేరకు 324 కిలోమీటర్ల రహదారి పనులు ప్రారంభించి 295 కిలోమీటర్ల పనులు పూర్తి చేశాం. అలాగే కల్వర్టులకు సంబంధించి 44చోట్ల పునర్నిర్మాణాల కోసం, 133 కల్వర్టుల మరమ్మతులకు సంబంధించి అంచనాలతో కూడిన నివేదికలను పంపించాం. అయితే రెండు కల్వర్టుల పునర్నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరయ్యాయి. మిగతా వాటికి మంజూరు కావాల్సి ఉంది. రహదారులపై అవసరమైన చోట తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాం. రాధాకృష్ణ, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పార్వతీపురం, మన్యం జిల్లా -
వీఓఏలకు కాలపరిమితి రద్దు చేయాలి
పార్వతీపురం టౌన్: వెలుగు వీవోఏ లకు మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కిల్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ ప్రకటించాలని వీవోఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో వీవోఏల జిల్లా మహాసభ కె.కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీవోఏల 3 సంవత్సరాల కాల పరిమితి సర్కిల్ రద్దు చేయాలని కోరారు. మెప్మాలో ఈ సర్క్యులర్ను రద్దు చేశారు అదే రకంగా వెలుగు సెల్ఫ్లో కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రకరకాల పనులు ఇవ్వడం ద్వారా ఐకేపీ వీవోఏ పని భారం పెరుగుతోందన్నారు. పలు యాప్లు లాగిన్ చేయడం ద్వారా వీవోఏలు అనారోగ్యం పాలవుతున్నారని, రాజకీయంగా వేధిస్తూ జిల్లాలో 19 మంది వీవోఏలను తొలగించడం అన్యాయమన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెరగడం లేదని విమర్శించారు. ఇస్తున్న వేతనాలు ఆరు, మూడు నెలలకు ఒకసారి చెల్లించడం దారుణమైన విషయమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తొలగింపులు, వేధింపుల నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీవోఏల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా వీవోఏలు ఐక్యమై ఉద్యమించాలని కోరారు. నూతన కార్యవర్గం ఎన్నిక జిల్లాలోని 15 మండలాల నుంచి హాజరైన వీవోఏల సంఘం నూతన జిల్లా అధ్యక్షరాలిగా కె. శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా కె.ధర్మరాజు, కోశాధికారిగా కె.కుమారి. సహ కార్యదర్శులుగా సుందరరావు, దేవి, ఉపాధ్యక్షుడిగా డి.అరుణ విజయ్ కుమార్లను మరో ఏడుగురు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వి రామలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, జిల్లా కోశాధికారి గొర్లె వెంకటరమణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
చెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
విజయనగరం టౌన్: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా కేకే జగన్నాథ్, ఉపాధ్యక్షులుగా సాగి జానకీరామ్రాజు, డాక్టర్ పైల రమేష్ కుమార్, కార్యదర్శిగా కరణం భాస్కరరావు, సహ కార్యదర్శులుగా కాళ్ల లీలా ప్రసాదరావు, సంభాన శ్రీధర్, కోశాధికారిగా బైరెడ్డి సన్యాసినాయుడు, మెంబర్లుగా జి.లక్ష్మీ గాయత్రి దేవి, ఎల్.రమ, డి.రమేష్, ఎన్.పద్మావతి, ఎంజేవీఎస్ఎన్.తాడిరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిటర్నింగ్ అధికారింగా ఎం.పీటర్ మార్టిన్ వ్యవహరించి కొత్త కార్యవర్గసభ్యులను ఎంపిక చేశారు. ఎంపికై న సభ్యులందరినీ అసోసియేషన్ అభినందించింది. -
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేయాలి
రాజాం : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేయాలని ఆ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజాంలో సమగ్ర శిక్ష ఉద్యోగులతో ఆదివారం సమావేశమైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమగ్ర శిక్షలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగు లను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరారు. వీరిని వెంటనే రెగ్యుల ర్ చేయాలని పట్టుబట్టారు. హెచ్ఆర్ పాలసీ అమ లు, ఉద్యోగ భద్రత కల్పించాలని, మినిమమ్ ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి, గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను వెంటనే ప్రారంభించి, పదవీ విరమ ణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఈపీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ సెలవులు, హెల్త్కార్డుల వంటి హక్కులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాల ని కోరారు. కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లపై రాజకీ య వత్తిడిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయ దుర్వినియోగానికి గురికాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందని స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష ఔట్సోర్సింగ్ ఫెడరేషన్ ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా అక్టోబర్ 12న దశాబ్ద ఐక్యత – భవిష్యత్ పోరాట సభ విజయవాడలోని ఎంబీవీకే కేంద్రంలో నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు అంతా పాల్గొనాల ని పిలుపునిచ్చారు. జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.గోవిందరావు, రాష్ట్ర కన్వీనర్ వి.రమేష్, నియోజకవర్గ బాధ్యులు కృష్ణప్రసాద్, గణపతి, జ్యోతి, కిర ణ్, నాయుడు, రామారావు, శ్రీనివాసరావు, లక్ష్మి, పార్వతి, రాము తదితరులు పాల్గొన్నారు. -
15 నుంచి జిల్లాలో యూటీఎఫ్ రణభేరి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలని, ఒత్తిడి లేకుండా పని చేసే వాతావరణం కల్పించాలన్న డిమాండ్తో రణభేరి కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని యూటీఎఫ్ జిల్లా కమిటీ ప్రకటించింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సంఘం మధ్యంతర కౌన్సిల్లో ఈ మేరకు పేర్కొన్నారు. తొలిత రణభేరి షెడ్యూల్ ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోహన్లు కల్పించాలని, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని డిమాండ్ చేశారు. రణభేరి కార్యక్రమంలో భాగంగా 3వ రోజున 100 బైక్లతో బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, విజయనగరం, గంట్యాడ మీదుగా ఎస్.కోట వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బయలుదేరాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్కే ఈశ్వరరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జేఆర్సీపట్నాయక్, గౌరవాధ్యక్షులు మీసాల అప్పలనాయుడు, రాష్ట్ర నాయకులు డి. రాము, కె.విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం, పీఎం మోసపూరిత విధానాలతో ప్రజలకు నష్టం
రాజాం సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు అన్నారు. రాజాంలో రెండు రోజుల పాటు జరగను న్న సీఐటీయూ 11వ జిల్లా మహసభలు ఆదివారం ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చీపురుపల్లి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో సీఎం, పీఎంలు వ్యవహరిస్తున్నారని, అలాగే సీఎం కుర్చీ కోసం పవన్కల్యాణ్ తపిస్తున్నారని ఎద్దేవా చేశారు. జీతాలు పెంచడం కార్మికుల హక్కు అన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల పైనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. తెల్ల వారి లేస్త్తే చంద్రబాబు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామంటూ ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అనే పెద్దమనిషి అదే ఇప్పుడు నిజం చేస్తున్నా రని పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు పాట్లు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎరువు లు కావాల్సిన దానికంటే అధికంగా ఉత్పత్తి అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం విధానంతో ఈ రోజు రైతులకు ఎరువులు అందని పరిస్థితి నెలకొందన్నా రు. రైతులకు గిట్టుబాటు ధర నామమాత్రంగా ఉందన్నారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించేందుకు సమర శంఖారావం పూరించడానికి కార్మిక వర్గం సిద్ధపడాలన్నారు. జిల్లాలో జ్యూట్ పరిశ్రమలు మూతపడ్డాయని, ఒక్క రంగం కూడా అభివృద్ధి కాలేదని ధ్వజమెత్తారు. జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక వెల్లడించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ. 11440 కోట్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ద మని అన్నారు. అది కూడా తీసుకున్న లోను రీపేమెంట్ చేశారని, రూ.500ల కోట్లు వీఆర్ఎస్ తీసు కున్న ఉద్యోగులకు ఇచ్చారని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయ న్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పోరాటం ద్వారానే ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని తెలిపారు. సభలో రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్, పి.శంకరరావు, టి.సూర్యనారాయణ, టీవీ రమణ, జగన్మోహనరావు, త్రినాధ్, వివిద యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో కేసులు పరిష్కారమవ్వాలి
విజయనగరం క్రైమ్: ఈ నెల 13న జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఆదేశించారు. పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాద కేసులు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలన్నారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఇందుకుగాను పోలీసు స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిరోజూ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. లోక్ అదాలత్ విజయవంతమయ్యేందుకు సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కోరారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా వారిని ప్రోత్సహించాలన్నారు. సమన్వయంతో పని చేస్తే త్వరగా కేసులు సానుకూలంగా రాజీ అయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులను ప్రతిరోజూ ఆయా సబ్ డివిజన్లకు చెందిన డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. -
ఆలయాల మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామివారి దేవస్థానాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం మధ్యాహ్నం మూసి వేశారు. పైడితల్లి ఆలయాన్ని సోమవారం ఉదయం 8.30 గంటలకు తెరవనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రామతీర్థంలో వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలు జరిపించిన అనంతరం నిత్య కై ంకర్యాలను పూర్తి చేసి ఆలయ తలుపులను మూసివేశారు. రామతీర్థంలో శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానాన్ని సోమవారం ఉదయం గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి 11.30 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని రామతీర్థం ఆలయం ఈవో వై.శ్రీనివాసరావు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం/నెల్లిమర్ల రూరల్ -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవా రం ఉదయం 10 గంట ల నుంచి ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక–మీకోసం కార్యక్రమం జరుగు తుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు వారి అర్జీలు ఆన్లైన్లో నమోదు చేసుకోవడాని కి ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ అందుబాటులో ఉందన్నారు. నమోదైన అర్జీల గురించి, వాటి పరిష్కార స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబరు కు నేరుగా కాల్ చేసి సంప్రదించాలని కలెక్టర్ కోరారు. మరో వారం పాటు డయల్ యువర్ కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రధానంగా ఎరువుల సరఫరాపై రైతుల సమ స్యలను మరింతగా తెలుసుకోవడానికి వారి సూచనలు, సలహాలను స్వీకరించడానికి ఈ కార్యక్రమాన్ని మరో వారంరోజుల పాటు కొనసాగించాలనే నిర్ణయాన్ని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తీసుకున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 9441957315 నంబరుకు రైతులు ఫోన్ చేసి యూరియా సరఫరాలో సమస్యలు, అభిప్రాయాలను తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏలు, పీఎఫ్ ఇతర ఆర్థ్ధిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసుల నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక పీఆర్టీ యూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సంఘం జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటించడానికి ఆలస్యమైన కారణంగా ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు యాప్ ల వినియోగం వంటి బోధనేతర పనుల ఒత్తిడి తో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగి న సమావేశంలో సంఘం నాయకులు వి.రవీంద్రనాయుడు, రావాడ రాంబాబు, ఆల్తి రాంబా బు, బంకపల్లి శివప్రసాద్, రామకృష్ణ, తిరుపతినాయుడు, శంకర్నాయుడు పాల్గొన్నారు. సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భోజన పదార్థాలు పరిశీలించారు. అన్నం, కూరలు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. బాలికల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. జ్వరం, ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిచెన్ గార్డెన్, మరుగుదొడ్లు, డార్మెటరీ పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినుల సామర్థ్యాలను పరిశీలించారు. -
వ్యాన్ బోల్తా: డ్రైవర్కు గాయాలు
వేపాడ: మండలకేంద్రం వేపాడ సమీపంలో కళ్లాల్లో పంచదారతో వెళ్తున్న వ్యాన్ శనివారం బోల్తా పడడంతో డ్రైవర్ గాయాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడవరం నుంచి ఆనందపురం వేపాడ మీదుగా ఎస్.కోటకు పంచదారతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి వేపాడ కళ్లాలవద్ద రోడ్డుపై బోల్తాపడింది. దీంతో డ్రైవర్ కృష్ణకు గాయాలు కాగా స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి హెచ్సి శేషాద్రి, కానిస్టేబుల్ కిషోర్ 108 వాహానంలో తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డెంగీతో వివాహిత మృతిభోగాపురం: మండలంలోని చిన కవులవాడ (యాతపేట) గ్రామానికి చెందిన వివాహిత మైనపు మంగ (28) డెంగీ వ్యాధి సోకి శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మంగను కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి డెంగీ వ్యాధి సోకి మెదడుకు వ్యాపించిదని నిర్థారించారు. ఇంతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంగ పిచ్చి పిచ్చి పేలాపనలు, వాగడం మొదలు పెట్టింది. దీంతో వ్యాధి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో కొన్ని రోజులు ఉంచి వైద్యం అందించాలని వెద్యులు సూచించినప్పటికీ కుటంబసభ్యులు వినకుండా ఆమెకు దెయ్యం పట్టిందనే అనుమానంతో ఇంటికి తీసుకువచ్చేశారు. దీంతో ఆమెకు వైద్యం అందక చనిపోయింది. మృతురాలికి భర్త నరసింహులుతో పాటు ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. గూడ్స్ ఢీకొని వ్యక్తి మృతిలక్కవరపుకోట: మండలంలోని సంతపేట గ్రామం సమీపంలో కొత్తవలస–కిరండోల్ (కేకే లైన్) రైల్వే ట్రాక్ దాటుతుండగా మార్లాపల్లి గ్రామానికి చెందిన గేదెల దేముడుబాబు (48) గూడ్స్ ఢీకొట్టడంతో శనివారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేముడుబాబు సంతపేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నసమారాధనకు రైల్వే ట్రాక్ దాటి వెళ్తుండగా కిరండోల్ నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రెండు కాళ్లు తెగిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి కొన ఊపిరితో ఉన్న దేముడుబాబును ఎస్కోట సీహెచ్సీకి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసునమోదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యబొబ్బిలి: రాష్ట్రంలో యువత అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడంతో యువత ఆత్మహత్యల బాట పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని రైతు కూలీ కుటుంబానికి చెందిన బలగ మధు(23)అనే యువకుడు బొబ్బిలి సమీపంలోని గున్నతోటవలస సమీపంలోని రైలు కింద పడి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై రైల్వే పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బలగ శంకరరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మధుసూదన రావు ట్రిపుల్ ఐటీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. చిన్న కుమారుడు ఐటీఐ చదువుతున్నాడు. మధు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రాకపోవడంతో తరచూ కలత చెందేవాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఉద్యోగం రాకపోతే పోయింది. మా శక్తి ఉన్నంత వరకూ పెంచుతాం. తరువాత ఎప్పుడైనా ఉద్యోగం రాకపోతుందా?మమ్మల్ని అప్పుడు పెంచుతావుకదా? ఇంత ఘోరానికి ఒడిగట్టావా నాయనా అంటూ తల్లి దండ్రులు మృత దేహంపై పడి రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. మధు మృతి వార్తతో కృష్ణాపురంలో విషాద ఛాయలు అముకున్నాయి. మృతదేహాన్ని బొబ్బిలి ఆస్పత్రికి తరలించిన రైల్వే పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
రాణికట్ వ్యాధితోనే లక్షలాది కోళ్ల మృతి
● పశువర్థకశాఖ ఎ.డి కన్నంనాయుడుకొత్తవలస: ఇటీవల కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో అంతుచిక్కని వ్యాధితో లక్షలాది కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కోళ్లు రాణికట్ వ్యాధితోనే చనిపోతున్నాయని ఈ మేరకు విజయవాడ సెంట్రల్ లేబొరేటరీ నుంచి నివేదికలు అందాయని పశువర్ధకశాఖ కొత్తవలస ఎ.డి కన్నంనాయుడు శనివారం తెలిపారు. కోళ్ల మృతికి బర్డ్ప్లూ కారణం కావని నిర్ధారణ జరిగినట్లు చెప్పారు. లక్షలాది కోళ్ల మృతికి కారణం రాణికట్ వ్యాధే కారణమని స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజార్యోగానికి ఎటువంటి ముప్పులేదన్నారు. కాగా మరోపక్క కోళ్ల మృతులు మాత్రం ఆగడం లేదు. పౌల్ట్రీ కోళ్ల కన్నా దేశవాళీ కోళ్లే అధిక సంఖ్యలో మృతి చెందుతున్నాయి. లక్షలాది కోళ్ల మృతికి కారణం బర్డ్ప్లూ కారణమని ప్రభుత్వం ప్రకటిస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని, అందుకే ఆ వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించ లేదని కొంతమంది పౌల్ట్రీ రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గడిచిన 20 రోజులుగా కోళ్లు మృతిచెందినా అధికారులు పట్టించుకోక ప్రస్తుతం కొత్తరకం రాణికట్ ఆనే వ్యాధిని తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం బర్డ్ప్లూ వ్యాధి ఉందని ఆ వైరసే మన పౌల్ట్రీలకు సోకిందని రైతులు వాపోతున్నారు. మరోపక్క కోళ్ల మృతులు ఆగక పోవడంతో పదుల సంఖ్యలో పౌల్ట్రీలు ఖాళీ అవుతున్నాయి. రైతుల ఆరోపణపై ఎ.డి కన్నంనాయుడిని వివరణ కోరగా లేబొరేటరీలో పరీక్షల అనంతరం రాణికట్ వ్యాధిగా నిర్ధారణ అయిందన్నారు. రైతుల ఆరోపణలో వాస్తవం లేదన్నారు. వైరస్ తగ్గు ముఖం పట్టిన వెంటనే వ్యాక్సిన్ వేస్తామన్నారు. -
బాలల చట్టాల అమలులో సమస్యలు
విజయనగరం లీగల్: రాష్ట్రంలో బాలల న్యాయ, బాలల పరిరక్షణ చట్టాల అమలులో ప్రధాన సమస్యలున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురా ఎం. బబిత అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో బాలల న్యాయ, బాలల పరిరక్షణ చట్టాల అమలులో ప్రధాన సమస్యలు అనే అంశంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు, ప్రధాన న్యాయమూర్తి ఎంబబిత పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నిధుల కొరత, అవగాహన లేకపోవడం, సిబ్బంది కొరత, ప్రత్యేక పోలీస్ యూనిట్ల లోపం ,శిక్షణ పొందిన మానవ వనరుల కొరత, సతి గృహాల కొరత వంటివి ప్రధాన సమస్యలుగా, సవాళ్లుగా ఉన్నాయన్నారు. మొదటి సమస్య నిధుల కొరత అని, బాలల పరిరక్షణ కార్యక్రమాలకు, వసతి గృహాల నిర్వహణకు అవసరమైన నిధుల కొరత ఉందన్నారు. అదేవిధంగా చట్టాలు ప్రభుత్వ పథకాలు, బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో స్పెషల్స్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థల ఇన్చార్జ్ కార్యదర్శి లక్ష్మీకుమారి, మహిళా పోలీస్ స్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ గోవిందరావు బాలలకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు, జోనల్ జస్టిస్ బోర్డు ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
దుష్ట సంప్రదాయానికి పరాకాష్ఠ
● జెడ్పీచైర్మన్ ప్లెక్సీలు చించివేసిన దుండగులపై ఫిర్యాదు బొబ్బిలి: పట్టణంలో కొత్త దుర్మార్గానికి తెరతీశారు గుర్తు తెలియని దుండగులు. ఇటీవల జెడ్పీ చైర్మన్ మజ్జిశ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా బొబ్బిలి పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బ్లేడ్, చాకుతో కోసినట్టు చించేశారు. అభిమానంగా పెట్టుకున్న ఫ్లెక్సీలకు కూడా రాజకీయ దుర్భుద్ధితో ఇలా చించడం సరికాదంటూ చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే సంప్రదాయం కొనసాగించే అవకాశం ఉందని దీనిని కొనసాగించకుండా అడ్డుకోవాలని ఆలోచించిన వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్ నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్ రామకృష్ణ, పాలవలస ఉమా శంకర్, ఇంటి గోవిందరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి దుండగులను గుర్తించాలని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ద్విచక్ర వాహనదారులపై చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం అన్నారు. నిబంధనలు అతిక్రమించిన ద్విచక్ర వాహన దారులపై 955 కేసులు నమోదు చేసి, రూ.4,77,460/లను జరిమానా విధించామన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనాలను ప్రమాదకరంగా నడిపిన వాహనదారులపై 88 కేసులు నమోదు చేశామని తెలిపారు. హెల్మెట్స్ ధరించని వారిపై 155 కేసులు, మైనర్లు డ్రైవ్ చేస్తున్న వారిపై 8 కేసులు, లైసెన్స్ లేని వాహన చోదలకుపై 471 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇక భద్రత నియమాలు ఉల్లంఘించిన వారిపై 46 కేసులు, నంబర్ ప్లేట్స్ సక్రమంగా లేని వారిపై187 కేసులు నమోదు చేశామన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు రోడ్ సేఫ్టీ నిబంధనల గురించి, హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల జరిగే అనర్థాలను వివరించి, కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. వాహనదారుతో పాటు బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలని హితవు పలికారు. ప్రత్యేక డ్రైవ్ను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించారన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
త్రుటిలో తప్పిన ప్రమాదం
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద ఓ మహిళ పసిపాపతో రిక్షాలో వెళ్తున్న క్రమంలో రిక్షాను వెనకనుంచి లారీ ఢీకొట్టడంతో రిక్షా చక్రం రహదారిపై ఉన్న గుంతలో ఒక్కసారిగా దిగిపోయింది. దీంతో రిక్షా ఒక్కసారిగా పక్కకు వాలిపోవడంతో రిక్షాలో ఉన్న మహిళ, పసిపాప రోడ్డుపై పడి తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రిక్షాకు ఉన్న చక్రం గుంతలో దిగి ధ్వంసమైంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులంతా భావించారు.రిక్షాను పక్కకు తీసేందుకు సాయం చేస్తున్న స్థానికులు -
రజక మహిళ హత్యపై ఆగ్రహం
● కలెక్టరేట్ ఎదుట రజక సంఘాల ధర్నావిజయనగరం అర్బన్: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో ఇటీవల రజక మహిళ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రజక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐక్యవేదిక సభ్యులు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ నెల 4న గ్రామంలో పెత్తందారులు రజకులపై దాడి చేసి అరసవిల్లి హరమ్మ అనే మహిళను దారుణంగా హతమార్చి, మరో ఐదుగురిని తీవ్రంగా గాయపరిచారన్నారు. రజకుల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే ప్రత్యేక భద్రతా చట్టాన్ని రూపొందించాలని, బాధిత కుటుంబాలకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం డీఆర్ఓ శ్రీనివాసమూర్తిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రజక సమాఖ్య అధ్యక్షుడు గురజాపు సత్యారావు, ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం అధ్యక్షుడు కెల్లా సత్యం, మద్ది పైడిరాజు, తామాడ అచ్చన్న, కొత్తకోట భవాని, ముత్యాల సత్యవతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన 15 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోన్–1 మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోడానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా మహిళలను నిట్టనిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియాను సరఫరా చేసినప్పటికీ వాటిని టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ తరలించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడి చేసేసిందని విమర్శించారు. 80 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని, పర్మిట్ రూమ్లకు కూడా అనుమతులు ఇచ్చేశారని తెలిపారు. మద్యం కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, గంజాయిని హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పండిస్తున్నారని వివరించారు. వాటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్లీ దేవుడు రావాలని ప్రార్థిస్తున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రానున్న మూడేళ్లు ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి పాలనపై 15 నెలల్లో ప్రజా వ్యతిరేకత సూపర్ సిక్స్ పేరుతో నయవంచన యూరియా కోసం రైతులు రోడ్లెక్కడం దారుణం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, గంజాయితో అఘాయిత్యాలు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణిప్రజలకు రూ.81 వేల కోట్ల బకాయి కూటమి ప్రభుత్వం రైతులకు మొదటి ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చెప్పి ఒక్కో మహిళకు రూ.22,500 బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేల కింద ఇప్పటి వరకు రూ.45 వేలు బకాయి ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక్కరికి పింఛన్ గానీ, రేషన్ కార్డు గానీ మంజూరు చేయలేదన్నారు. పైగా రాష్ట్రంలో 3 లక్షల మంది అర్హులైన వారి పెన్షన్ తొలగించిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రూ.81వేల కోట్లు బాకీ పడిందని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 16 రకాల బస్సులు ఉంటే.. కేవలం 5 రకాల బస్సుల్లో అవకాశం కల్పించారన్నారు. అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్మీట్
రాజాం: స్థానిక జీఎంఆర్ వరలక్ష్మి డీఏవీ స్కూల్లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. జీఎంఆర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె.గిరీష్, సీఏఓ సుప్రియోభట్టాచార్య తదితరులు ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి 22 డీఏవీ పాఠశాలలకు చెందిన 561 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారిలో విజేతలకు పాఠశాల ఆవరణలో జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీఎంఆర్ఐటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ డీన్ రాంబాబు, జీసీఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. పురుషోత్తమరావు, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
గుట్టుగా బాల్య వివాహాలు..!
విజయనగరం ఫోర్ట్: ఈ ఏడాది జనవరి నెలలో బొండపల్లి మండలంలో 16 ఏళ్ల బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని చైల్డ్లైన్ ట్రోల్ఫ్రీ నంబర్ 1098కు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో చైల్డ్లైన్, బాలల సంరక్షణ, పోలీసులు సంబంధిత గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు. అలాగే విజయనగరం మండలంలో 17 ఏళ్ల బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈవిషయాన్ని చైల్డ్ లైన్ ట్రోల్ఫ్రీ నంబర్ 1098కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో అధికారులు సంబంధిత గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు. ఈ రెండు చోట్లే కాదు. జిల్లాలో అనేక చోట్ల బాల్య వివాహాలు గుట్టుగా జరిగిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల దృష్టికి వచ్చినవి చాలా తక్కువే. అధికారుల దృష్టికి రాకుండా రహస్యంగా బాల్యవివాహాలు జరిగిపోతున్నట్లు సమాచారం. బాల్య వివాహాలకు అధికారులు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశం కాని కమిటీలు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బాల్యవివాహ నిషేధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి పంచాయతీ సర్పంచ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో బాల్య వివాహాల నిరోధక అధికారులుగా వ్యవహరిస్తారు. అయితే ఈ కమిటీ సమావేశాలు ఎక్కడా కానరావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాల్యవివాహం చేయడానికి అస్కారం ఉండే వారిని వీరు గుర్తించి వారిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అనాథ బాలికలు, ఇంట్లో వృద్ధాప్యం బారిన పడిన తాతయ్యలు, మామ్మలు ఉండేచోట బాల్య వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి చోట్ల బాల్య వివాహాలు చేయకుండా వారికి అవగాహన కల్పించాలి. కాని ఎక్కడా ఈ చర్యలు కానరావడం లేదు. 10 మండలాల్లో ప్రయత్నాలు జిల్లాలోని 10 మండలాల్లో బాల్యవివాహాలు చేయడానికి బాలికల తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ 10 మండలాల్లో జనవరి నెల నుంచి ఇప్పటివరకు అధికారులు 23 చోట్ల బాల్య వివాహాలను నిలుపుదల చేశారు. నిలిపివేస్తామని చెప్పి వివాహాలు అధికారుల సమక్షంలో బాల్య వివాహాన్ని నిలుపుదల చేసినట్లు ఇరువైపులా తల్లిదండ్రులు చెబుతున్నారు. లఖిత పూర్వకంగా రాసి ఇస్తున్నారు. అంతటితోనే అధికారులు ఆగిపోతున్నారు. తర్వాత వారు నిజంగానే బాల్య వివాహలు నిలుపుదల చేశారా? లేదా ఎక్కడైనా వివాహం చేసేశారా అని ఫాలోఅప్ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల అధికారుల ముందు బాల్య వివాహం నిలుపుదల చేసిన తల్లిదండ్రులు మళ్లీ వివాహం జరిపించేస్తున్నారు. రెండేళ్ల జైలు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు చేసిన, ప్రోత్సహించిన వారిపై కేసులు నమోదు చేసి రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక్కోసారి జైలు, జరిమానా విడివిడిగా పడే అవకాశం ఉంది. ఈఏడాది 23 నిలుపుదల గ్రామాల్లో కానరాని నిషేధ కమిటీ సమావేశాలు అనధికారికంగా అధిక సంఖ్యలో జరిగిపోతున్నట్లు ఆరోపణలు -
నేడు ఆలయాల మూసివేత
నెల్లిమర్ల రూరల్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానాన్ని ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మూసివేస్తామని, గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి చేసి సోమవారం ఉదయం 11.30 దాటిన తరువాత స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు కల్పిస్తామని ఈఓ వై.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి 9.50 కు సంపూర్ణ చంద్రగ్రహణం పడుతుందన్నారు. భక్తులు ఈ అంతరాయాన్ని గమనించాలని కోరారు. పైడితల్లి ఆలయం మూసివేత విజయనగరం టౌన్: చంద్రగ్రహణం సందర్భంగా పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయం మూసివేసి, సంప్రోక్షణ అనంతరం తిరిగి సోమవారం ఉదయం 8.30 గంటలకు తెరవబడుతుందని ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష శనివారం ప్రకటనలో తెలిపారు. -
తోటపల్లి నీరందేలా చూడండి
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, డాక్టర్ తలే రాజేష్ రాజాం సిటీ: తోటపల్లి ప్రాజెక్టు కాలువ నుంచి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ కోరారు. రాజాంలోని తోటపల్లి ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజాం, రేగిడి మండలాల్లోని సుమారు 20 గ్రామాలకు సాగునీరు సరఫరా కావడంలేదన్నారు. ఉభాలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు రైతులతో ఆడుకోవడం మంచిపద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్రాంచి కెనాల్లో నీటిని విడిచిపెట్టాలని కోరారు. కార్యక్రమంలో లావేటి రాజగోపాలనాయుడు, పాలవలస శ్రీనివాసరావు, టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, ఉత్తరావిల్లి సురేష్ముఖర్జీ, వాకముళ్లు చిన్నంనాయుడు, బి.నరేంద్ర పాల్గొన్నారు. -
● అందరికీ అందని ఎరువు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో ఎరువుల కోసం రైతులు శనివారం గంటల తరబడి నిరీక్షించారు. స్థానిక సత్యనారాయణ ట్రేడర్స్లో వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో యూరియా పంపిణీ ప్రారంభించగా వందలాది మంది రైతులు తరలివచ్చారు. తొలుత ఆధార్ కార్డు తెచ్చి లైన్లో పడిగాపులు కాయగా.. ఆ తరువాత వన్బీ తేవాలని సిబ్బంది ఆంక్షలు పెట్టడంతో ఇళ్లకు పరుగు తీశారు. ఒక్కో బస్తాపై రూ.30 నుంచి రూ.40 వరకు వసూలు చేసినట్టు రైతులు ఆరోపించారు. ఎరువుకోసం 500 రైతులు తరలిరాగా 267 మందికే ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు. -
ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..
9న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ‘ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు’ విజయనగరం/బొబ్బిలి: అబద్ధపు హమీలను నమ్మి ఓట్లేసిన పాపానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతాంగం రోడ్లెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలోని రైతులంతా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమోత్తారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాలా అంటూ ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా వేకువజామున 4 గంటల నుంచి క్యూలైన్లలో నిల్చొనే దుస్థితి దాపురించడం ప్రభుత్వ రైతు వ్యతిరేక పనితీరుకు అద్దంపడుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ఎదుట తలపెట్టిన ‘ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వాల్పోస్టర్లను విజయనగరం, నెల్లిమర్ల, ఎస్.కోట, బొబ్బిలి నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్సీతో కలిసి శనివారం ఆవిష్కరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలోను, బొబ్బిలిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గాల ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఈనెల 9న విజయనగరం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి నిరసనలు చేపట్టి అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. విజయనగరం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట చేపట్టే ఆందోళనకు విజయనగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాలకు చెందిన రైతులు, నాయకులు, కార్యకర్తలు, బొబ్బిలి రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టే ఆందోళనకు బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా మహాత్మాజ్యోతీరావుపూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు అన్నదాత పోరు నిరసన ర్యాలీ కొనసాగుతుందన్నారు. అనంతరం ఆర్డీఓకు రైతు సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేస్తామన్నారు. ● మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హమీలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, ఎరువుల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. 9న తలపెట్టిన అన్నదాత పోరును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. ● ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతలకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు. యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందంటూ చెప్పడంలోనే ఆయన వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్యం అర్ధమవుతుందన్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చొన్నా ఒక బస్తా యూరియా దొరకక రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. ● ఎస్కోట నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. రైతంగాం కోసం చేపడుతున్న కార్యక్రమంలో ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ● నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల కోసం రైతులు గగ్గోలు పెడుతుంటే కూటమి నేతలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటన్నారు. పవన్ కల్యాణ్ ఏదో చేస్తానంటూ గొప్పలు చెప్పి తనకు డిప్యూటీ సీఎం పదవిని, వాళ్ల అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకుని అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ● మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయం దండగ అనే చంద్రబాబుకు రైతులు కష్టాలపై స్పందించకపోవడంలో ఆశ్చర్యంలేదన్నారు. చంద్రబాబు తీరును రైతులు గుర్తించాలన్నారు. ● మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులకు అవస్థలు తప్పవన్నారు. ఆయన హయాంలో ఎరువులు, విత్తనాల కోసం దెబ్బలు కాయాల్సిన దుస్థితి ఉంటుందన్నారు. కార్యక్రమాల్లో రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు మంత్రి అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధా న కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టివీరవెంకటరాజేష్, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతన్నలను కించపరిచేలా వ్యవసాయశాఖ మంత్రి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రికి రైతన్నలంటే అవహేళనగా మారిపోయిందని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూ, ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులను కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. క్యూలో నిలబడిన రైతులను ఉద్దేశించి ‘బఫే భోజనానికి వెళ్లేటప్పుడు నిలబడలేదా..? ఎందుకు నిలబడరు?‘ అంటూ రైతులను చులకనగా చేసి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన మేరకు పుష్కలంగా ఎరువులు, విత్తనాలను అందించామని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖమంత్రి సొంత గ్రామమైన నిమ్మాడలో వైఎస్సార్సీపీ హయాంలో ఏ ఒక్క రైతైనా ఎరువు కోసం వేచి చూసి, క్యూలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయా..? అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. మద్దతు ధరలు లేక మిర్చి, మామిడి, పొగాకు, ఉల్లి, చీనీ, టమాటా రైతులు సైతం రోడ్డెక్కి రోదిస్తున్న పరిస్థితులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని, రెండో ఏడాదికి సంబంధించి అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు మండుటెండలో నిలబడాలా..? రైతన్నలను కించపరిచేలా వ్యవసాయ శాఖ మంత్రి వాఖ్యలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిలుపు విజయనగరం, ఎస్కోట, నెల్లిమర్ల, బొబ్బిలి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం -
ఏపీపీఎస్సీ పరీక్ష కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష కోసం అభ్యర్థులకు సహాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ నంబర్ 08922–236947ను సంప్రదించాలని కోరారు. ముగిసిన నవోదయ స్కూల్ టీచర్ల ఇంటర్వ్యూ విజయనగరం అర్బన్: జిల్లాలోని జవహర్ నవోదయ స్కూల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసింది. జేసీ సేతుమాధవన్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ప్రక్రియలో పీజీటీ ఇంగ్లిష్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, లెక్కలు రెండు పోస్టుల కోసం ఇంటర్వ్యూలు చేపట్టారు. ఏడాది కాలానికి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాడానికి ఎంపికలు నిర్వహించారు. మెరిట్ అభ్యర్థులను నియమిస్తామని జేసీ తెలిపారు. ఇంటర్వ్యూ ప్రక్రియలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, నవోదయ ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మోడీ పాల్గొన్నారు. రాజ్యలక్ష్మికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మికి ప్రతిష్టాత్మక ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ అకడమిక్ లీడర్షిప్’ లభించింది. కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కాంపెటెన్సీస్ (సీఎసీసీ ఇండియా) సంస్థ ఈ అవార్డును ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదానం చేసినట్టు శనివారం ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. ఆమెకు వర్సిటీ సిబ్బంది అభినందనలు తెలిపారు. -
యూరియా కోసం మండుటెండలో.. అన్నదాతల నరకయాతన
సాక్షి, అమరావతి,మాడుగుల రూరల్, బుచ్చెయ్యపేట/దెందులూరు,రామభద్రపురం/పలాస: బస్తా యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవించారు. అనకాపల్లి జిల్లా కేజే పురం శివారు తెలకలదీపం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో శనివారం యూరియా పంపిణీ చేపడుతున్నట్టు తెలుసుకున్న రైతులు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆధార్, భూమి పాసుపుస్తకం, 1బీ జెరాక్స్ కాపీలను కేంద్రం వద్ద లైన్లో పెట్టారు. ఎండ మండుతున్నా క్యూలైన్లో వేచి ఉన్నారు. యూరియా పంపిణీ ప్రారంభమవుతున్న సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకి వచ్చారు. ఈ క్రమంలో రైతులు తమకు 2 బస్తాలు కావాలని పట్టుబట్టారు. అయితే ప్రతి రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మాకుమ్మడిగా కేంద్రంలోకి చొరబడి ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. యూరియా అందరికీ అందకపోవడంతో రైతులు మండిపడ్డారు. 800 రైతులకు 150 బస్తాలే.. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం లో 800కి పైగా రైతులు ఉండగా 150 యూరియా బస్తాలే వచ్చాయి. దీంతో యూరియా దొరకదేమోననే ఆందోళనతో రైతు సేవా కేంద్రం వద్దకు అన్నదాతలు పరుగులు తీశారు. పేర్లు నమోదు కోసం రైతులంతా ఎగబడటంతో గందరగోళం తలెత్తింది. తహశీల్దార్ లక్ష్మి గ్రామానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. వచి్చన యూరియా కట్టలను కొంతమందికే ఇవ్వగలమని, మిగిలిన వారికి 2,3 రోజుల్లో ఇస్తామని చెప్పగా రైతులు నిరసన తెలిపారు. 112 మందికే ఇస్తే మిగిలినవారి సంగతేంటి? యూరియా నిల్వలకు ఎటువంటి ఇబ్బందీ లేదని, సరిపడా ఉన్నాయని అంటూనే తమకు చుక్కలు చూపిస్తున్నారని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి రైతులు నిరసన తెలిపారు. శనివారం కొవ్వలి కో–ఆపరేటివ్ సొసైటీకి 12.30 టన్నుల కట్టల యూరియా వచ్చింది. వాటిలో 112 మందికి ఒక కట్ట,2 కట్టలు చొప్పున పంపిణీ చేశారు. 2.5 టన్నుల యూరియా కట్టలు సొసైటీలో నిల్వ ఉంచారు. అప్పటికే 200 మందికి పైగా రైతులు సొసైటీకి వచ్చి యూరియా కావాలని అడిగితే జిల్లా అధికారులు బఫర్ స్టాక్ కింద సొసైటీలో ఉంచాలని ఆదేశాలిచ్చారని, ఇది అలాగే ఉంచాలని, వీటిని ఇవ్వడం కుదరదని చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యూరియా వస్తుందని, అది మిగిలిన రైతులకు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. యూరియా..ఇవ్వండయ్యా! ఒక్క బస్తా యూరియా కోసం విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులు శనివారం రోజంతా క్యూలో నిలుచున్నారు. టోకెన్లు ఉన్నవారికే ఆర్ఎస్కే సిబ్బంది ఒక్కో బస్తా యూరియా ఇచ్చారు. మిగిలినవారంతా ఉసూరుమంటూ వెనుదిరిగారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సచివాలయం వద్ద కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. టోకెన్లు ఒక చోట, ఎరువులు ఒక చోట పెట్టి కావాల్సిన రైతులకు మాత్రమే యూరియాను ఇస్తున్నారని మిగిలిన రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రైతు సేవా కేంద్రం ఉన్నా అక్కడ పంపిణీ పెట్టకుండా సచివాలయం వద్దనే టోకెన్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. ఎకరా పొలానికి కనీసం 3 బస్తాలు యూరియా కావాలని రైతులు డిమాండ్ చేస్తుండగా ఒక్క బస్తాతోనే సరిపెటే్టస్తుండటంపై అన్నదాతలు మండిపడుతున్నారు.యూరియా దారి మళ్లింపుపై సమగ్ర విచారణ జరపాలి ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి యూరియా దారిమళ్లుతున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్న వార్తలు వస్తున్నాయని విమర్శించారు. జూన్ నాటికి 10 శాతం పంటలు సాగైతే.. 32 శాతం యూరియా అమ్మకాలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. పంటలు వెయ్యక ముందే ఈ యూరియా ఎవరు కొన్నారో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్నకు మాత్రమే యూరియా అవసరం ఉందని, వీటికీ డిమాండ్కు సరిపడా యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. -
రోగులకు తప్పని ఇక్కట్లు..
విజయనగరం ఫోర్ట్: పక్క ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బి.సూర్యకుమారి. ఈమెది భోగాపురం ప్రాంతం. చర్మ సంబంధిత సమస్యతో శుక్రవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చింది. ఇక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని ఆస్పత్రిలోని లేబరేటరీ వద్దకు ఆమె వెళ్లగా..ఇక్కడ థైరాయిడ్ పరీక్ష జరగడం లేదని సిబ్బంది బదులిచ్చారు. బయట ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకోవాలని సూచించారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో థైరాయిడ్ నిర్థారణ పరీక్షలు చేయక పోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. ఇదే అదునుగా ల్యాబ్ నిర్వాహకులు ఒక్కో రోగి నుంచి రూ. 500 నుంచి 800 రూపాయల వరకు వసూల చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంపై పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రోజుకు15 నుంచి 20 మంది వరకు .. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, డెంటల్, డెర్మాటాలజీ, పలమనాలజీ, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం , న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, ఈఎన్టీ, నెప్రాలజీ, యురాలజీ, తదితర విభాగాలున్నాయి. ఓపీ విభాగాల్లో రోగులను పరీక్షించిన వైద్యులు థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి పరీక్ష చేయించుకోవాలని చీటీలు రాసి ల్యాబ్కు పంపిస్తారు. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది రోగులకు థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరమవుతాయి. రెండు వారాలుగా థైరాయిడ్ పరీక్షలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యకుమారి సర్వజన ఆస్పత్రిలో అందుబాటులో లేని థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్లకు పరుగు రోగులకు వదులుతున్న చేతిచమురుచర్యలు తీసుకుంటా.. నేను ఈ రోజే బాధ్యతలు స్వీకరించాను. ఎందువల్ల థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు జరగడం లేదో తెలుసుకుంటాను. రెగ్యులర్గా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటాను. – అల్లు పద్మజ, సూపరింటిండెంట్ , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
టీడీపీలో వర్గపోరు..
జామి: టీడీపీలోని వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నికల సమయంలో తమను వాడుకుని తీరా అధికారం వచ్చాక కరివేపాకులా తీసి పడేశారని జామి మండల అధ్యక్షుడు లగుడు రవికుమార్, తదితరులు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీరుపై మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మండలంలోని అలమండలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు గొంప కృష్ణ ఎమ్మెల్యే టికెట్కు ప్రయత్నించగా.. ఆయనకు మద్దతు తెలిపామనే కక్షతో ఎమ్మెల్యే కోళ్ల తమను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలితకుమారిని ప్రకటించినప్పుడు.. విశాఖ ఎంపీ భరత్, తదితర పెద్దలు కోళ్ల గెలుపుకోసం కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో తాము ఎంతో కష్టపడి పార్టీ గెలుపుకోసం పనిచేసినట్లు చెప్పారు. అనుకున్న ప్రకారం ఎన్నికల్లో కోళ్ల లలితకుమారి గెలిచిందని.. అయితే తమను మాత్రం పూర్తిగా పక్కనబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మండలంలో వేరే వర్గాన్ని తయారు చేసి ప్రోత్సహిస్తున్నారన్నారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన తమను కాదని.. వేరే వారిని ప్రోత్సహంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అలమండలో మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు లలితకుమారి హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలెక్టర్ను కలిసి కొన్ని పనులు మంజూరు చేయించుకుంటే ఎమ్మెల్యే వాటిని అడ్డుకున్నారని వాపోయారు. మండలంలో ఏ కార్యక్రమం జరిగినా తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. తన తండ్రి లగుడు సింహాద్రి జెడ్పీ చైర్మన్గా పనిచేసినా 2021లో జరిగిన మహానాడులో కనీసం అతని పేరు ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పాక వెంకట త్రివేణి, నాయుడుబాబు, బి.స్వామినాయుడు, బి.అప్పలనాయుడు, చిప్పాడ నాగరాజు, జాగరపు శ్రీను, రామకృష్ణ, డి.చినసత్యం, ఎర్ర శ్రీను, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. తమకు గుర్తింపు లేదన్న టీడీపీ మండల అధ్యక్షుడు రవికుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అలమండలో సమావేశం ఎమ్మెల్యే కోళ్ల తీరుపై నిరసన పార్టీ అధిష్టానం దృష్టికి సమస్యలుమండల కమిటీ ఇదే.. సమావేశం అనంతరం పార్టీ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్. రవికుమార్, ఉపాధ్యక్షుడిగా వేండ్రపు నాయుడుబాబు, జనరల్ సెక్రటరీగా బండారు పెదబాబు, ఆర్గ్నైజింగ్ సెక్రటరీలుగా శిరికి చంద్రరావు, గూనూరు సంతోష్కుమార్, రంభ అవతారం, జె.జ్యోతి, కార్యదర్శులుగా బి.స్వామినాయుడు, దాసరి చినసత్యం, ట్రెజరర్గా చిప్పాడ నాగరాజు ఎంపికయ్యారు. -
ఈ చెరువు ఎవరి సొంతం..?
● తనదే అంటున్న గ్రామస్తుడు, కాదంటున్న ప్రజలు ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ● తహసీల్దార్ కార్యాలయంలో నేడు విచారణనెల్లిమర్ల రూరల్: మండలంలోని తంగుడుబిల్లి కాలనీ వద్ద ఉన్న ఓ చెరువు పొలిటికల్ హీట్ను పెంచుతోంది. నెల్లిమర్ల – రణస్థలం ప్రధాన రహదారి పక్కన సర్వే నంబర్–72లో 2.40 ఎకరాల స్థలం పూర్వం నుంచి ఓ చెరువును పోలి ఉండేది. మూడేళ్ల కిందట వరకు ఆ చెరువు ఖాళీగానే ఉండేది. అప్పట్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెరువు తనదేనంటూ చదును చేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పటి తహసీల్దార్ రాము సైతం చెరువుపై ఎవరికీ యాజమాన్య హక్కు లేదని ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల గ్రామస్తులు ఇంటికి కొంత నగదు సేకరిచి చెరువును బాగు చేసుకున్నారు. దీంతో మళ్లీ సదరు వ్యక్తి ఆ స్థలం తనదని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అనంతరం గ్రామస్తులు చెరువు ఆక్రమణ అడ్డుకోవాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి కూడా తనదే ఆ స్థలం అంటూ అధికారులను ఆశ్రయించాడు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆ స్థలం జిరాయితీ భూమిగా ఉందని ప్రస్తుత తహసీల్దార్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయం కాస్తా పీజీఆర్ఎస్కు చేరడంతో చెరువు అంశం ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సదరు వ్యక్తి తరఫున కొంత మంది టీడీపీ అగ్రనాయకులు రంగ ప్రవేశం చేసి కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ తగాదాపై అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఇరువర్గాలకు సమాచారం అందించామని తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఈ చెరువు ఎవరి సొంతమో పంచాయితీలో తేలిపోనుంది. -
రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
బొండపల్లి: మండలంలోని బొండపల్లి – గరుడబిల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పై హెచ్సీ బి. ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు పట్టాలపై వెళ్లి చూడగా సుమారు 30 సంవత్సరాల యువకుడి తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాడని చెప్పారు. మృతుడు పసుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు ఫ్యాంట్ ధరించాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించామని, వివరాలు తెలిసిన వారు 94906 17089, 94918 13163 నంబర్లను సంప్రదించాలని కోరారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొని మరొకరు.. బొండపల్లి: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు సమీపంలో గుర్తు తెలియని వాహనం ట్రాలీ రిక్షాను ఢీ కొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై యు. మహేష్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శిర నాగరాజు (42) బొండపల్లి మండలంలోని బోడిసింగిపేటలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవానికి ట్రాలీ తీసుకెళ్లాడు. నిమజ్జనం అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా..బొండపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో వెనుకనుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం రిక్షాను ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజును జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొదుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య గౌరి, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. చీపురుపల్లి: కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడిన పట్టణంలోని హడ్కో కాలనీకి చెందిన నాదెళ్ల శ్రీనివాసరావు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆగస్టు 29న శ్రీనివాసరావు తన స్నేహితుడు మదీనాతో కలిసి తన ఫొటో స్టూడియో నుంచి హడ్కో కాలనీలోని ఇంటికి వెళ్తుండగా.. గరివిడి నుంచి చీపురుపల్లి వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టాడు. దీంతో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు కన్నుమూశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితుల అరెస్ట్ ● డీఎస్పీ భవ్యారెడ్డి గజపతినగరం రూరల్: మండలంలోని కొత్తబగ్గాం గ్రామంలో ఈనెల 2వ తేదీన జరిగిన హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన పసుపురెడ్డి శ్రీను, పసుపురెడ్డి చంటితో పాటు మరో ఇద్దరు మండల పరిధి కొణిశ గ్రామంలోని మద్యం దుకాణం వద్ద ఈ నెల 2వ తేదీన వాదులాడుకున్నారన్నారు. వాగ్వాదం అనంతరం పసుపురెడ్డి చంటి తన అన్నయ్య పసుపురెడ్డి శ్రీనును ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకుని ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన చీకట్లో మాటువేశాడని తెలిపారు. ఇంతలో శ్రీను ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. వెంటనే ఆపి పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి పసుపురెడ్డి చంటికి అతని మిత్రుడు గుమ్మడి రామచంద్రుడు సహకరించడంతో ఇద్దరినీ గజపతినగరం రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ రమణ, ఎస్సై కిరణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. వంగర: మండల పరిధి మడ్డువలస పంచాయతీ జగన్నాథవలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గంధం చిన్నకు ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన సాయితో వివాహం జరిగింది. అయితే తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. అనంతరం జి.సిగడాం పోలీస్స్టేషన్లో భర్తపై ఫిర్యాదు కూడా చేసింది. ఈక్రమంలో పెద్దలు జోక్యం చేసుకుని భార్యాభర్తలకు సర్దిచెప్పారు. దీంతో వారిద్దరూ జగన్నాథవలసలో ఉంటుండగా.. తాజాగా తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో మాట్లాడాడని అనుమానిస్తూ సాయి శుక్రవారం ఉదయం గడ్డి మందు తాగేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త చిన్న కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి వారిద్దరినీ రాజాం సీహెచ్సీకి తరలించారు. ఏఎస్సై సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గణేష్ నిమజ్జనంలో అపశృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని అలుగోలు గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ చెరువులో పడి కొంచాడ గణపతి (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై గణేష్, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. విగ్రహాన్ని గ్రామ శివారులో ఉన్న గుండాల చెరువులో నిమజ్జనం చేసేందుకు యువకులంతా తీసుకెళ్తుండగా.. గ్రామానికి చెందిన కొంచాడ గణపతి తన ఫోన్ను చెరువు గట్టుపై ఉన్న నీలా కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి చెరువులో దిగి కూరుకుపోయాడు. అయితే ఈ సంఘటనను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఎంతకీ గణపతి రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుమార్ మొబైల్ను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకుని వెతకగా.. గణపతి మృతిదేహం కనిపించింది. మృతుడికి భార్య పావని, ఇద్దరు కుమార్తెలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయ్యన్నపేటలో ఒకరు.. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని అయ్యన్నపేటకు చెందిన రాజు (34) అనే యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. సీఐ ఆర్వీకే చౌదరి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడ్ని గురువారం రాత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సహచర స్నేహితులతో కలిసి రాజు నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసే క్రమంలో అందరితో పాటే చెరువులో దిగాడు. అయితే అందరూ పైకి వచ్చినా రాజు జాడ కనిపించలేదు. దీంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చి అందరూ వెతికారు. సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్, పోలీసులు శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకుని సుమారు 12 గంటలు గాలింపు చేపట్టగా రాజు మృతదేహం లభించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చౌదరి తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి -
ఉపాధ్యాయ వృత్తి ఓ సామాజిక బాధ్యత
విజయనగరం అర్బన్: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది వృత్తికాదని.. వారిది సామాజిక బాధ్యతని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడమే మన తొలి ప్రాధాన్యమన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజంలో గౌరవ ప్రదమైన వారని, వారిని సన్మాంచుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా హజరైనఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్రపంచంలో గొప్పవారినందరినీ తీర్చిద్దినది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు ఎప్పుడూ సూపర్ హీరోనే అని పేర్కొన్నారు. విద్యార్థులు ఏ స్థాయికి ఎదిగినా గురువుని తల్లిదండ్రులతో పాటు గుర్తు పెట్టుకుంటారని, అంతటి గొప్ప వృత్తి ఉపాధ్యాయునిదని కొనియాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుడూ బోధనాంశాలతో పాటు నైతిక విలువులు, మన సంస్కృతీ సంప్రదాయాల గురించి బోధించాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 76 మందిని సత్కరించారు. సభకు అధ్యక్షుత వహించిన డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత దైవంగా కొలిచే ఉపాధ్యాయుడు తరగతిగదిలో పిల్లల భవిష్యత్తును తీర్చే బాధ్యతను తీసుకోవడం జరుగతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రోటోకాల్ను పక్కనపెట్టి.. ఉపాధ్యాయులను సత్కరించాల్సిన పవిత్రమైన ఉత్సవంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని ఇద్దరు శాసన మండలి సభ్యులను పక్కనపెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేను మాత్రమే విశిష్ట అతిథిగా ఆహ్వానించి సత్కారాలు నిర్వహించడంపై ఉపాధ్యాయులు విస్తుపోయారు. తాము ఎన్నుకున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి తొలి ప్రాధాన్యం ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యేకి ఇవ్వడం అంటే ఉపాధ్యాయులను అగౌరవ పరచడమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయుల స్పూర్తిని తోటి ఉపాధ్యాయులకు కలిగించే ప్రసంగం చేయకుండా చంద్రబాబు విజన్, లోకేశ్ పనితీరుపై భజనచేయడాన్ని ఉపాధ్యాయులు తప్పుబట్టారు. ఉపాధ్యాయ సత్కార సభలో రాజకీయ ఉపన్యాసం సరికాదన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ టీచర్ ఎప్పుడూ సూపర్ హీరోనే: ఎమ్మెల్సీ సురేష్బాబు విద్యతోపాటు మన సంస్కృతిని బోధించాలి: ఎమ్మెల్సీ గాదె గురువులను గౌరవించాల్సిన సభలో చంద్రబాబు భజన -
రైతన్నకు మద్దతుగా నిలబడదాం
● శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ● వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చీపురుపల్లిరూరల్ (గరివిడి): రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం సాగించాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గరివిడిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో పాటు నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలకు చెందిన నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలతో మమేకయ్యారు. గ్రామాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఎరువు సమస్యపై ఆరా తీశారు. యూరియా కొరతపై రైతుకు వెన్నుదన్నుగా పోరాటం సాగిద్దామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9న యూరియా కొరతపై రైతుకు మద్దతుగా చీపురుపల్లిలో జరిగే పోరాటానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ పోరాటం వల్లే దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు నోటీసులిచ్చినా పింఛన్లు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొణిశ కృష్ణంనాయుడు, వైస్ ఎంపీపీలు రామకృష్ణరాజు, శ్రీరాములనాయుడు, పార్టీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, ఏఎమ్సీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, మెరకముడిదాం మండల నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, పార్టీ మండలాధ్యక్షుడు తాడ్డి వేణు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, బూర్లె నరేష్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, పార్టీ గుర్ల మండలాధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు సీర అప్పలనాయుడు, నాలుగు మండలాల పీఏసీఎస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
ఘనంగా జెడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు
విజయనగరం: ఉమ్మడి విజయగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జెడ్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ కేక్ కట్చేయగా, విజయనగరం, పార్వతీపురం–మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, జెడ్పీ అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు, దుశ్శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, కంబాల జోగులు, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలే రాజేష్, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, విజయనగరం కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శలు సీహెచ్ మురళి, రవికుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎరువు కరువు
ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్న ఎరువు కోసం అగచాట్లుపడుతున్నాడు. పొలంపని మానుకుని పస్తులతో ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. అప్పటికీ ఎరువు దొరకక ఆవేదన చెందుతున్నాడు. ఏపిక లేని చేనును చూసి కన్నీరు పెడుతున్నాడు. ఆర్ఎస్కేలకు వచ్చిన అరకొర ఎరువును ‘అధికార’బలంతో కళ్లముందే తన్నుకుపోతుండడాన్ని చూసి నిశ్చేష్టుడవుతున్నాడు. ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని, రైతన్నను ఉసురుపెట్టిన ఏ ప్రభుత్వమూ మనుగడసాగించలేదంటూ చీవాట్లు పెడుతున్నాడు. యూరియా కావాలంటే క్యూ కట్టాల్సిందే... గరివిడి మండలంలోని వెదుళ్లవలస గ్రామంలో రైతులు ఒక యూరియా బస్తా కోసం గంటల తరబడి సచివాలయం వద్ద క్యూ కట్టారు. 500 మంది రైతులు ఎరువుకోసం రాగా పోలీసుల సమక్షంలో రైతుకు బస్తా చొప్పున కేవలం 260 బస్తాలే శుక్రవారం పంపిణీ చేశారు. మిగిలిన వారికి ఆ ఒక్క బస్తా ఎరువు లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. – చీపురుపల్లిరూరల్(గరివిడి) గనివాడ ఆర్ఎస్కే వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు లక్కవరపుకోట: మండలంలోని గనివాడ రైతు సేవా కేంద్రానికి వచ్చిన యూరియాను తలుపులు మూసివేసి కూటమి నాయకులు పంచుకున్నారు. దీనిపై రైతులు ప్రశ్నించారు. ఇక్కడి ఆర్ఎస్కేకు 200 బస్తాల యూరియా వచ్చింది. గనివాడ, మల్లివీడు, గేదలవానిపాలెం, కొత్తపాలెం, వేచలపువానిపాలెం, నిడుగట్టు గ్రామాలకు చెందిన రైతులకు ఇస్తామని వ్యవసాయాధికారులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల రైతులు గనివాడ ఆర్ఎస్కే వద్ద శుక్రవారం గంటల తబడి క్యూకట్టారు. చివరికి ఓ వర్గానికి చెందిన కూటమి నాయకులు ఎరువులను తమకు నచ్చినవారికి పంచేయడంతో వ్యవసాయాధికారులు ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. రైతులు నిరాశతో ఇంటిబాటపట్టారు. గొల్లలపేట ఆర్ఎస్కే వద్ద ఎరువు కోసం స్లిప్పులు రాయిస్తున్న రైతులు రామభద్రపురం: ఎరువుల కొరత రోజురోజుకీ తీవ్రమవుతోంది. పంటకు అవసరమైన సమయంలో యూరియా దొరకక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రామభద్రపురం మండలంలోని గొల్లలపేట ఆర్ఎస్కేకు 250 యూరియా బస్తాలు రాగా వాటి కోసం తెల్లవారి నుంచే రైతులు పడిగాపులు కాశారు. కొందరికి ఒక బస్తా యూరియా కూడా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. -
ఏఐటీ టెస్ట్లో ఐటీఐ విద్యార్థుల ప్రతిభ
● జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఎర్ల సాయి ● ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్లో 600/600విజయనగరం అర్బన్: ఆల్ ఇండియన్ ట్రేడ్ టెస్ట్–2025 ఫలితాల్లో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు ప్రతిభ చూపారు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగానికి చెందిన ఎర్ల సాయి 600/600 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. అదే విభాగంలో ఓ.శ్రీరాంసందీప్ 598/600, ఎల్.రఘునాథ్ 597/600, వై.ప్రణీత్ 596/600, డి.జయకిరణ్ 594/600, సాయి చైతన్య 590/600 మార్కులు లభించాయి. జూనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో జెవీడీ చక్రధర్ 598/600, ఎస్.వరప్రసాద్ 591/600 మార్కులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి మాట్లాడుతూ ఏఐటీ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఇన్స్ట్రక్టర్ శ్రీధర్ కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించగలిగారని తెలిపారు. విద్యార్థులను కళాశాల బోధన సిబ్బంది అభినందించారు. భక్తిశ్రద్ధలతో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు విజయనగరం టౌన్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగను ముస్లిం సోదరులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునుంచి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ శాంతికి, దేశాభివృద్ధికి, సుస్థిరతకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. అంబటి సత్రం కూడలి నుంచి కోట, బాలాజీ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరీ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డు, వైఎస్సార్ సర్కిల్, ఎన్సీఎస్ కూడలి, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం మీదుగా ర్యాలీ సాగింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఏనుగుల గుంపు కొమరాడ: మండలంలోని బంజకుప్ప గుమడ, కోటిపాం, కళ్లికోట, దుగ్గి తదితర ప్రాంతాల్లో ఇటీవల సంచరించిన తొమ్మిది ఏనుగుల గుంపు శుక్రవారం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలైన కంచరపాడు, చీకటిలోవ, తదితర ప్రాంతాల్లో సంచరించాయి. కోనవలస, లక్ష్మీపేట, రాజ్యలక్ష్మీపురం గ్రామాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. గజరాజుల గుంపు తరలించేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
లేబరోళ్లు, వేరే గ్రహం నుంచి వచ్చారు.. జనసేన మహిళా నేత నోటి దురుసు
సాక్షి, విజయనగరం: జనసేన కేడర్ను ఉద్దేశించి పార్టీ మహిళా నాయకురాలు రెచ్చిపోయారు. తమ పార్టీకి చెందిన జనసైనికులను దారుణంగా అవమానించారు. వారంతా వేరే గ్రహం నుంచి వచ్చారు అంటూ తిట్టిన తిట్టకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన నాయకురాలు పాలవలస యశస్వని ఆగ్రహంతో ఊగిపోయారు. జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఘోరంగా అవమానిస్తూ లోకేడర్, లేబరోళ్లు సంభోదించారు. అసలు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలను అడిగి మరీ తన ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టించుకోవాల్సిన దుస్థితిలో పార్టీలో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం తనను పట్టించుకోవడం లేదన్నారు. కొందరు గోడ మీద పిల్లుల్లగా ఉన్నారు. ఇదే సమయంలో పదవులు వచ్చిన వాళ్లు ఒకలా.. పదవులు లేని వాళ్లు ఒకలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. విజయనగరం వాళ్ళు వేరే గ్రహం నుండి వచ్చారు. వీళ్లంతా అదో రకం అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఇక, ఆమె మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో పార్టీ కార్యకర్తలు ఖంగుతిన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియా వైరల్గా మారింది.