కనులపండువగా శ్రీనివాసుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా శ్రీనివాసుని కల్యాణం

Mar 15 2026 1:32 AM | Updated on Mar 15 2026 1:32 AM

కనులపండువగా శ్రీనివాసుని కల్యాణం

డెంకాడ: చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్‌లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే సుప్రభాత సేవ, అర్చనలు, ప్రత్యేక హోమాలు చేపట్టారు. సాయంత్రం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. బెటాలియన్‌ కమాండెంట్‌ వై.రవిశంకర్‌, ఉమాదేవి దంపతులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసునికి కల్యాణంలో పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు, బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది కల్యాణాన్ని తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement