Wanaparthy District News
-
బ్రిడ్జి కమ్ బరాజ్
జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం.. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గద్వాల: కృష్ణాబేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత? తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు -
ఎల్లూరు పంపుహౌజ్లో..
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడి నుంచే సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ ద్వారా తరలిస్తారు. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక మోటారు 5 ఏళ్ల క్రితం, మరో మోటారు రెండేళ్ల క్రితం దెబ్బతింది. నాటినుంచి మిగిలిన మూడు మోటార్లతోనే ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్కో పంపు ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వాటిపై భారం పడుతోంది. -
అన్నీ అనుకూలిస్తే..
కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. నిధుల కేటాయింపు కేఎల్ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ కారణంగా.. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం లేక ముందు ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు వేసవిలో రెండు నెలలపాటు విరామం ఇచ్చేవారు. మిషన్ భగీరథ స్కీం వచ్చాక విరామం లేకుండా ఏడాది మొత్తం ఎల్లూరు పంప్హౌజ్ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. దీంతో పాడైన మోటార్లకు సకాలంలో మరమ్మతు చేపట్టేందుకు వీలు కావడం లేదు. బ్యాక్వాటర్ తగ్గుముఖం.. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెల నుంచే శ్రీశైలం బ్యాక్వాటర్ భారీగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ 821 అడుగులుగా ఉండగా.. 805 అడుగుల వరకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. మిషన్ భగీరథ స్కీంకు నార్లాపూర్ రిజర్వాయర్లోని నీటిని మళ్లిస్తే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలకు విరామం లభిస్తుంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే వచ్చే నెలలో నీటి ఎత్తిపోతలు నిలిపివేసి.. మోటార్లకు మరమ్మతు చేపట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. వచ్చే నెలలో కేఎల్ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులోశ్రీశైలం బ్యాక్వాటర్ బ్యాక్వాటర్ భారీగా తగ్గిపోవడంతోఅనుకూలంగా భావన -
అత్యవసర వైద్యసేవలు ఆపొద్దు
వనపర్తి: ఆరోగ్యశ్రీ అనుమతి రాలేదనే నెపంతో రోగులకు అత్యవసర వైద్యసేవలు ఆపొద్దని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్లో ప్రస్తుతం అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏడాది కాలంగా ఆయా ఆస్పత్రుల్లో నమోదైన ఓపీడీ, ఐపీడీ, రెఫరల్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2025, జనవరి నుంచి 2025, డిసెంబర్ వరకు మొత్తం 3.65 లక్షల ఓపీడీ, 33 వేల ఐపీడీ కేసులు నమోదైనట్లు సూపరింటెండెంట్ వివరించారు. నెలకు సగటున 90 నుంచి 150 కేసులను మహబూబ్నగర్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర కేసులను ఇతర ప్రాంతాలకు పంపించకుండా ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, అందుకోసం ఏమేం అవసరం ఉన్నాయో నివేదిక అందించాలని అధికారులను కోరారు. వైద్యుల నివేదిక ప్రకారం ఆస్పత్రులకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉందన్నారు. ఆరోగ్యశ్రీ అనుమతి రాలేదనే పేరుతో రోగులకు అత్యవసర వైద్యసేవలు నిలపొద్దని.. రోగులకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెబ్బేరులో ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు. రాత్రిళ్లు ఆస్పత్రుల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మెరుగ్గా ఉందని, చిన్నపిల్లల వైద్యం, కంటి చికిత్సకు సంబంధించిన విభాగాల్లో వైద్యశాఖ పనితీరు బాగుందని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జీజీహెచ్, ఎంసీహెచ్లో సౌకర్యాల కల్పనకు సంబంధిత విభాగాల హెచ్ఓడీలు కలిసి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత ఉందని అధికారులు ప్రస్తావించగా ఔట్సోర్సింగ్ వారితో సర్దుబాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ రెడ్డి కుమారి, ఐఎంఏ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
20 నుంచి కేంద్రీయ విద్యాలయ తరగతులు
వనపర్తిటౌన్: కేంద్రీయ విద్యాలయ (కేవీ స్కూల్) తరగతులు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సోమవారం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డీఈఓ అబ్దుల్ ఘనీ అధ్యక్షతన కేవీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దశరథరామ్తో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి తరగతికి 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామని, బాలవాటిక విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.40 వరకు తరగతులు కొనసాగుతాయని వివరించారు. అన్ని తరగతి గదులు ఉన్నాయని.. తాగునీరు, టాయిలెట్ల ఏర్పాటును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. బాలవాటిక–1 నుంచి 1వ తరగతి వరకు మొత్తం 4 నాలుగు తరగతులకు ఆన్లైన్లో 5,188 దరఖాస్తులు, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రత్యక్ష దరఖాస్తు విధానంలో 1,029 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. విద్యార్థుల ఎంపిక ఆన్లైన్, లాటరీ పద్ధతిలో కొనసాగనుందని.. 8వ తేదీన బాలవాటిక–1 నుంచి బాలవాటిక–3 వరకు, 9వ తేదీన 1వ తరగతి, 10న 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ అటానమస్ పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని, 2వ దశలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, 3వ దశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 4వ దశలో ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల పిల్లలు, 5వ దశలో ఇతరులకు అవకాశం ఉంటుందన్నారు. లాటరీ విధానంలో ఎంపికలు కేవీ స్కూల్ మార్గదర్శకాలకు అనుగుణంగా నియమించిన కమిటీ ఉంటుందని, ఈ కమిటీలో వీఎంసీ సభ్యుడు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఒక మహిళా ఉపాధ్యాయురాలితో కలిపి ఐదుగురు సభ్యులు ఉంటారని వివరించారు. సమీక్షలో ఏఎంఓ మహానంది, డీఎస్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
వనపర్తిటౌన్: హిందూ వ్యతిరేక విధానాలు, కమ్యూనిస్టుల విదేశీ వాదానికి వ్యతిరేకంగా ఏర్పడింది బీజేపీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని నాగవరంలో కొత్తగా ఏర్పాటుచేసిన పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీకి నేడు 17 కోట్ల మంది కార్యకర్తల బలం, దేశంలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని చెప్పారు. 23 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉందని, త్వరలో రాష్ట్రంలోనూ పార్టీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతోనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తునందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రామన్నగారి వెంకటేశ్వరరెడ్డి, కేతూరి బుడ్డ న్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, వారణాసి కల్పన, ఉ పాధ్యక్షుడు గొర్ల బాబు రావు, కుమారస్వామి, జిల్లా కార్యదర్శి కాటమోని కృష్ణగౌడ్, కౌన్సిలర్ విజయసాగర్, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, రాము, కొమ్ము శ్రీనివాసులు, ప్రవీణ్, ద్వారపోగు నారాయణ, రాజశేఖర్గౌడ్, అరవింద్, నవీన్, చిన్నరాయుడు, కోన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల ముంగిట
●అగ్ని ప్రమాదాలు 112 మహబూబ్నగర్ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్స్టేషన్ల దగ్గర ఫైర్ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు.. బుల్లెట్లు ఉమ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అమ్రాబాద్లో అవుట్పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉండగా మహబూబ్నగర్లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఫైర్ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క టి మాత్రమే ఉంది. అలంపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. సకాలంలో చేరుకుంటేనే.. వేసవిలో తరచూ ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. భానుడి భగభగకు గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, జిన్నింగ్ మిల్లులు, వాహనాలు కాలిపోతుంటాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంటుంది. ప్రమాదాల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటాయి. ఏటా ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖది కీలక పాత్ర. వీరు సకాలంలో వస్తేనే ఆస్తినష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. జిల్లా ఫైర్స్టేషన్లు వాహనాలు మహబూబ్నగర్ 2 5 నారాయణపేట 2 2 గద్వాల 2 2 నాగర్కర్నూల్ 4 5 వనపర్తి 3 3 ఉమ్మడి జిల్లాలో అగ్గి రాజుకుంటే బుగ్గిపాలే ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్ స్టేషన్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఏర్పాటు చేయడంలో అటు అధికారుల్లో, ఇటు ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కొరవడింది. 13 స్టేషన్ల పరిధిలో 17 ఫైర్ ఇంజిన్లు మాత్రమే.. పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యంతో తీవ్రనష్టం కొత్త కేంద్రాల ఏర్పాటుపై కొరవడిన చిత్తశుద్ధి -
‘రామన్నగట్టు’తోనే శాశ్వత పరిష్కారం
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాన్గల్: గోపల్దిన్నె, సింగోటం లింక్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కొల్లాపూర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కిష్టాపూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రూ.150 కోట్ల లింక్ కెనాల్ పనులకు గుత్తేదారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కావడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని.. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తిచేస్తే 25 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మండలంలోని కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆయా పనులను రద్దు చేసిందని చెప్పారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపడితే మండలంతో పాటు వనపర్తి మండలంలోని పలు గ్రామాలకు శాశ్వతంగా సాగునీరు అందేదని తెలిపారు. దీంతోపాటు పాన్గల్కు 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేయిస్తే పనులు ప్రారంభించడం లేదన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేయించి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓట్లప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి సారించేలా నాయకుల పనితీరు ఉండాలన్నారు. జల విద్యుత్ పేరిట శ్రీశైలం నీటిని ఏపీ ప్రభుత్వం దోచుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. నీటిపారుదలశాఖ మంత్రి, జిల్లా మంత్రి ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఇరిగేషన్శాఖ సలహాదారు ఏపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టే సాగునీటిని దోచుకుంటున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్, మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, నాయకులు చంద్రశేఖర్నాయక్, జ్యోతినందన్రెడ్డి, అడ్వకేట్ రవి, రాజేశ్వర్రెడ్డి, తిలకేశ్వర్గౌడ్, దశరథనాయుడు, భాస్కర్రెడ్డి, చంద్రూనాయక్, సర్పంచ్ కృష్ణనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాంచందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఉంటాం..
వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. పాలమూరు నగరంలో మున్సిపల్ బావి సైతం అందుబాటులో ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచేస్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్ -
బడుగుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్
● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వనపర్తి: రైతుల సంక్షేమం, దేశ రక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్.. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ.. డా. జగ్జీవన్రామ్ బాల్యం నుంచే దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే కేంద్రమంత్రిగా సేవలందించి దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. గ్రీన్ రివల్యూషన్లో ఆయన పాత్ర కీలకమని, రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ విమోచన సమయంలో ఆయన నాయకత్వం ఎంతో గొప్పదని వివరించారు. ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భారత తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని.. స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సుమారు 30 ఏళ్లు అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యతోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోందని.. స్వయం ఉపాధి పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జగ్జీవన్రామ్ జీవితంపై పాడిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి రాంజీరావు, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ నాయకులు గంధం నాగరాజు, చిరంజీవి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వెంకటేష్, మాదారి భోజరాజు, గంధం గట్టయ్య, కృష్ణయ్య, వెంకట్గౌడ్, వెంకటేష్, విశ్వంబాబు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కౌన్సిలర్లు, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
బీమాతో కుటుంబానికి దీమా
కొత్తకోట రూరల్: ప్రతి ఒక్కరూ ఆరోగ్య, జీవిత బీమా చేసుకుంటే ఆపత్కాలంలో బాధిత కుటుంబానికి భరోసా ఉంటుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. ఆదివారం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉండే పేదలకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అనేక బీమా పథకాలను అమలు చేస్తుందని, సంవత్సరానికి కేవలం రూ.20 కడితే ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా అందుతుందని వివరించారు. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, చిన్నారుల కోసం ఎన్పీసీ వాత్సల్య లాంటి దీర్థకాలిక పథకాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్లో వారి చదువులకు, పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులపై ఆర్థికభారం పడదన్నారు. డీఆర్డీఓ ఉమాదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. మహిళాల సంఘాల సభ్యులందరూ తప్పనిసరిగా చదవడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, రైతుల స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఫార్మేషన్ రోడ్లను పూర్తి చేస్తామని తెలిపారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి యువత డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ జలంధర్రెడ్డి సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను తొలగించి, సంపూర్ణ మద్యపాన నిషేధానికి సహకరించాలని కోరారు. అందుకు ముఖ్యంగా మహిళలే చొరువ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని కోరారు. ఎవరైనా సైబర్ క్రైం బారిన పడితే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు. -
త్వరలోనే పట్టణ, మండల కార్యవర్గాల ఎంపిక
వనపర్తిటౌన్: కాంగ్రెస్పార్టీ మండల, పట్టణ కార్యవర్గాలను త్వరలోనే ప్రకటిస్తామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ప్రజలు, పార్టీ కోసం పని చేయాలని సూచించారు. గతంలో ఉన్న కార్యవర్గం, ప్రస్తుత కార్యవర్గం పనితీరులో మార్పు కనిపించాలని, నిబద్ధత, ఐక్యతతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని మండలాలకు ఇన్చార్జ్లను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అవకాశం దక్కుతుందని, పార్టీ ఏ బాధ్యత అప్పగించలేదని నిరాశ చెందొద్దని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పి.తిరుపతయ్య, సాయిచరణ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, ధనలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ‘కష్టపడిన వారికే పదవులు’ ఆత్మకూర్: కాంగ్రెస్పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని.. పదవులు లభిస్తాయని పార్టీ జిల్లా ఇన్చార్జ్లు కోళ్ల వెంకటేష్, రమేష్గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్ అధ్యక్షతన మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా మండల, పట్టణ కార్యవర్గాల ఏర్పాటులో భాగంగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాస్, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్ యాదవ్ వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. క్రీడా ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవానికి సంబంధించి శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మండల, అసెంబ్లీ స్థాయి ఇన్చార్జులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యువజన క్రీడాశాఖ అధికారులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు సమన్వయంతో పనిచేసి ఈ క్రీడ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఏప్రిల్ 9న నారాయణపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి జట్లు ఏప్రిల్ 6లోగా ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9 నుంచి 15 వరకు మండల స్థాయి పోటీలు, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి పోటీలు, ఏప్రిల్ 21 మరియు 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 23న రన్నింగ్రేస్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 24న బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రతి క్రీడకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున నలుగురిని నియమించి పోటీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. యువత శారీరక, మానసిక అభివద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రీడలలో పురుషులతో పాటు సీ్త్రలు, బాలికలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి వారిని పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో డీఈ ఓ ప్రవీణ్ కుమార్, డీవైఎస్ఓలు శ్రీనివాస్, వెంకటేష్, సుధీర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
‘108’కు కృతజ్ఞతలు..
మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు. – గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద 15 ఏళ్లుగా 108 వాహనం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలందిస్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం. – సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట 108 వాహనంలో టెక్నీ షియన్గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. – పి.రాజ్కుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట ● -
గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వ్యర్థం
వనపర్తి: గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వ్యర్థమని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని 97 రోజులుగా అఖిలపక్ష పోరాట సమితి నాయకులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈ నెల 9న మాజీమంత్రి హరీశ్రావు వస్తున్నారని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పర్యటనతో బాధిత రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక చేసేముందు ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీల గురించి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అమానుషం అన్నారు. మాజీమంత్రి నిరంజన్రెడ్డి -
క్రీడాభివృద్ధికి తొలి ప్రాధాన్యం
వనపర్తి రూరల్: జిల్లాలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు, యువతను ప్రోత్సహించి క్రీడలను అభివృద్ధి చేయడమే తొలి ప్రాధాన్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర స్పోర్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం వారు పెబ్బేరులో పర్యటించి పీజేపీ క్యాంపు ఆవరణలోని ఖేలో ఇండియా ఫుట్బాల్ మైదానం, క్రీడాకారుల సౌకర్యార్థం కలెక్టర్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శాట్ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కలెక్టర్ చూపుతున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. పీజేపీ క్యాంపు ఆవరణలో ఉన్న పురపాలికకు చెందిన పది ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాధికార సంస్థ పేరున బదిలీ చేస్తూ తీర్మానిస్తే రూ.2.50 కోట్లతో మైదానం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారి జర్మన్ సాంకేతికతతో ఫుట్బాల్, హాకీ మైదానాలను టర్ప్తో పాటు 400 మీటర్ల ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్థలాన్ని వెంటనే సర్వేచేసి హద్దులు నిర్ధారించి పురపాలిక ద్వారా తీర్మానం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, పుర అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఖేలో ఇండియా ఫుట్బాల్ మైదానంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వారి వెంట పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, కృష్ణకుమార్రెడ్డి, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ రోజారెడ్డి తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇంటి పరిశీలన.. పెబ్బేరులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నిర్మాణంలో పురోగతి, చెల్లింపుల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని, లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో చెల్లించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో 143 ఇళ్లకుగాను 83 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని.. పనులు త్వరితగతిన ప్రారంభించి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. -
సద్వినియోగం చేసుకోండి..
108 నంబర్కు ఫోన్చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహనం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, మహబూబ్నగర్ రాష్ట్రంలో 108 వాహ నాలు విలువైన సేవలు అందిస్తున్నాయి. కొన్ని వాహనాల కాలం చెల్లిపోవడంతో మార్చాలని, అవసరమైన చోట సేవలు విస్తరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. 108, 102 అనే హెల్ప్లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశాం. సీఎం రేవంత్రెడ్డి ఫొటో, తెలంగాణ ప్రభుత్వం లోగో, ఉచిత సేవ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మఒడి వాహనాల వెనుక భాగంలో ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ అనే ట్యాగ్లైన్న్ వాహనాల పనితీరుకు అద్దం పడుతోంది. కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందుతాయి. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి -
పుర ప్రక్షాళన జరిగేనా?
● ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే వ్యూహాత్మక అడుగులు ● అధికార యంత్రాంగంలో వణుకు వనపర్తిటౌన్: నియోజకవర్గంలోని వనపర్తి, పెబ్బేరు పురపాలికలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రక్షాళన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆయా పురపాలికలపై కాంగ్రెస్ జెండా ఎగిరినప్పటికీ అధికారులు, సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పాలకవర్గం కొలువుదీరి రెండు నెలలు గడవకముందే బడ్జెట్ సమావేశాలతో కలుపుకొని రెండు దఫాలు సమావేశాలు జరిగాయి. పురపాలికల్లో చోటు చేసుకున్న తప్పిదాలు, లోప భూయిష్టతను ఎండగట్టేందుకు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికార యంత్రాంగం సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసింది. పురపాలికల్లో అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. పుర పాలనలో కాంగ్రెస్ పెద్దలున్నా.. ఏం జరుగుతుందోననే అంశంపై దృష్టి సారించారు. అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి వీడకపోతే సెలవుపై వెళ్లాలంటూ పుర సమవేశంలో బాహాటంగా హెచ్చరిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత పాలకుల హయాంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.. ఏ దశలో ఉన్నాయని తెలుసుకునేందుకు కౌన్సిలర్లు 45 రోజులుగా అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నా స్పందన కరువైంది. దీనికితోడు పాలకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల గురించి అనుకూలంగా, ప్రతికూలంగా ఎమ్మెల్యేకు చేర వేస్తున్నారు. తీసుకొచ్చిన రూ.18 కోట్ల పైచిలుకు పనులు ఏ దశలో ఉన్నాయి, ఎక్కడ ఆగిపోయాయి, ఎందుకు ఆగాయి.. అసలే ప్రారంభం కాని పనులేమిటి? తాగునీటి సరఫరా కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏయే ప్రదేశాల్లో ఎప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి వార్డులో ఎన్ని వీధిదీపాలు ఉన్నాయి.. ఇంకా ఎన్ని కావాలి. వార్డుల వారీగా ఉన్న బోరుమోటార్లు.. ఎన్ని పని చేస్తున్నాయి. మరమ్మతుకు గురైనవి ఎన్ని? కాంగ్రెస్ పాలనలో ఏ నిధులతో భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఎక్కడెక్కడ పూర్తి చేశారు. ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయి. తాగునీటి పైప్లైన్ లీకేజీలు ఎక్కడ ఉన్నాయి. మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతుంది. అమృత్ 2.0 పథకం ఏ దశలో ఉంది. తాగునీటి పథకాల మోటర్లు ఎక్కడెక్కడ మరమ్మతుకు గురయ్యాయి. బాగున్నవి ఎన్ని. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవకుండా ఏం చేయాలి. పుర ట్రాక్టర్ల డీజిల్ ఖర్చు ఎంత పార్కులు ఉన్న వార్డులు ఎన్ని. లేని వార్డులు ఎన్ని. బోరుబావులు ఎక్కడెక్కడ వేశారు. వేసిన వాటి పరిస్థితి ఏమిటి. ఆయా ప్రశ్నలకు పుర అధికారులు సమాధానం చెప్పకపోవడం పాలకవర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ నెల 6వ తేదీలోగా పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని ఎమ్మెల్యే కోరగా.. అధికారులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతేగాకుండా ఆస్తి పన్నుల్లో రివైజ్డ్ పేరుతో హెచ్చుతగ్గులు, ట్రేడ్ లైసెన్స్ కొలతల్లో వ్యత్యాసాలు, ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, మెప్మా విభాగంలోని మహిళా సంఘాల రుణాల రికవరీలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు కూడా పుర అధికారులపై ఉన్నాయి.ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారదర్శక పాలన అందించాలి. పాలనలో తప్పిదాలు, లోపాలు చోటుచేసుకుంటే, అవినీతికి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ హయంలో ప్రజలకు మేలు జరగాలనేదే మా పంతం. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి -
ఐక్యంగా ఉందాం.. నియోజకవర్గం సాధించుకుందాం
అమరచింత: మనమంతా ఐక్యంగా ఉండి కోల్పోయిన నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకుందామని మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డి అన్నారు. పట్టణంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ సాధన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరచింతను నియోజకవర్గాన్ని చూడాలనే లక్ష్యంతో పోరాడదామని పిలుపునిచ్చారు. 52 ఏళ్లు నియోజకవర్గ కేంద్రంగా విరాజిల్లిన అమరచింత అప్పట్లో జరిగిన డీలిమిటేషన్లో కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రతిపాదికన దేశవ్యాప్తంగా నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో కోల్పోయిన నియోజకవర్గాన్ని తిరిగి అమరచింతకు తీసుకొచ్చే అవకాశం కలిగిందన్నారు. అమరచింత మండల ప్రజలే కాకుండా ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట మండలాల ప్రజలను, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసి కొత్త నియోజకవర్గ అవశ్యకత గురించి వివరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను కలిసి నియోజకవర్గ ఏర్పాటుకు తన వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజ్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ రాధ, బీజేపీ రాష్ట్ర నాయకడు మహాంకాళి శ్రీనివాస్, కౌన్సిలర్లు మేర్వరాజు, విష్ణు, పారుపల్లి ఊషన్న, తిరుమలేష్, రాములు, రవి, అరుణ్, ఎస్ఏ రాజు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ప్రతి కార్యకర్తకు గుర్తింపు
అమరచింత: కాంగ్రెస్ను నమ్ముకుని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్సాగర్ అన్నారు. నూతన మండల, పట్టణ కమిటీ ఎన్నికలో భాగంగా శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్గాంధీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న కార్యకర్తలకు పదవులు వరిస్తాయన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజ్గౌడ్ మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో 300 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. శరవంద, మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, రమేష్, రవి,శ్యామ్, సర్పంచ్లు రాజేందర్రెడ్డి, శివకుమార్ ఉన్నారు. -
నిఘా పెంచుతాం
నివాసగృహాల మధ్య పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి, యువతను జూదంపై ఆకర్షితులను చేసేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. క్లబ్లు, పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడైనా ఇలాంటి ముఠాలు పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలిస్తే సంబంధిత పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. రెండేళ్లుగా పేకాట కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరింతగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, వనపర్తి ● -
మురుగు సమస్య తొలగేనా..
దోచుకునేందుకే ‘కాళేశ్వరం’ మదనాపురం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకునే లక్ష్యంతోనే పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని పక్కకు నెట్టి కాళేశ్వరం ఎత్తిపోథలకు రూపకల్పన చేశారని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దుయ్యబట్టారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్రావు అవినీతికి కుంగిన కాళేశ్వరం సాక్షిగా మిగిలిందని ఎద్దేవాచేశారు. దైవ దర్శనానికి వచ్చిన హరీశ్రావు సంబంధం లేకుండా రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. పాలమూరు–రంగారెడ్డి నిర్లక్ష్యానికి నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు ప్రధాన దోషి అని మండిపడారు. సీఎం రేవంత్రెడ్డి రైతు సంక్షేమం కోసం రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నారని కొనియాడారు. నూతన కమిటీల ఎంపికపై కసరత్తు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు మండల నూతన కమిటీ ఏర్పాటుపై ఎమ్మెల్యే పర్యవేక్షించారు. వివిధ పదవుల కోసం ఆసక్తి చూపుతున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పి.ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి, మదనాపురం ఇన్చార్జ్ తులసీరాజుయాదవ్, కురుమూర్తిరాయ లిఫ్ట్ చైర్మన్ రాజవర్ధన్రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు కృష్ణవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కస్తూర్బా కళాశాలలో డ్రెయినేజీ లేక ఇబ్బంది పట్టించుకోని పాలకులు, అధికారులు పరిష్కరించాలని వేడుకుంటున్న స్థానికులు -
గుట్టుగా సాగుతోంది!
పేకాట, బెట్టింగ్ సరదా నుంచి వ్యసనంగా మారుతున్న వైనం ● పట్టపగలు నివాస గృహాల మధ్య స్థావరాలు ● ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు ● దృష్టి సారిస్తే మరిన్ని వెలుగు చూసే అవకాశం అనుమానం రాకుండా.. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా జూదమాడేందుకు పేకాయరాయళ్లు నివాస గృహాల మధ్యలోనే గదుల్లో గుట్టుగా పదుల సంఖ్యలో చేరి పేకాట ఆడుతున్నారు. ఏప్రిల్ 1న జిల్లా కేంద్రంలోని నివాస గృహాల మధ్యలో పేకాట ఆడుతున్న వారిని పట్టణ పోలీసులు అరెస్టు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఈ ఘటనలో పది మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు 9 సెల్ఫోన్లు, రూ. 24 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నివాస గృహాల మధ్య ఇళ్లను కిరాయికి తీసుకొని కొందరు గుట్టుగా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పేకాటరాయుళ్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు. తమ టీంలతో ఆయా పరిసరాల్లో నిఘా ఉంచి, పోలీసుల కదలికలలు ఉంటే వెంటనే అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల పేకాట స్థావరాలు ఉన్నట్లు పోలీస్శాఖలోని నిఘా విభాగాలకు సమాచారం ఉన్నా.. చూసిచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వనపర్తి: సరదాగా ప్రారంభించిన అలవాటే.. క్రమంగా వ్యవసంగా మారుతూ పేకాట యువతను పెడదారిపట్టిస్తోంది. కుటుంబ పెద్దలు పిల్లల నడవడికపై దృష్టి సారించకపోవటం.. సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలను ప్రజలు మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జూదం జోరుగా సాగుతోంది. పేకాటకు తోడు క్రికెట్ మ్యాట్లపై బెట్టింగ్ వ్యవహారం తారాస్థాయికి చేరుతోంది. ప్రస్తుత ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఫోన్లలోనే బెట్టింగ్ల రాయబారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల వరుసగా పోలీసులకు చిక్కుతున్న పేకాయరాయళ్లు. బెట్టింగ్పై వస్తున్న ప్రచారాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో పాటు నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఇంకా పోలీసుల దృష్టికి రాని ఘటనలు చాలానే ఉంటాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. -
పంటలు పండడం లేదు..
కంపెనీల నుంచి మా పొలాల్లోకి కాలుష్యపు నీళ్లు వదులుతున్నారు. ఉన్న రెండు కుంటలూ కలుషిత నీటితో నిండి.. ఆ నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. ప్రతి ఏటా తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లన్నీ కలుషితమయ్యాయి. ఒక్క చుక్క నీరు తాగలేకపోతున్నాం. పంటలు అసలే పండడం లేదు. నష్టపరిహారం ఇప్పించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రైతు, రాయపల్లి వ్యవసాయం వదులుకున్నా.. మా నాయన వాళ్ల కాలంలో మేం చిన్నగా ఉన్నప్పుడు మా బావుల నీళ్లనే తాగేటోళ్లం. ఇప్పుడు బాయి కాడికి వస్తే ఇంటి నుంచి ఫిల్టర్ నీటిని తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల నుంచి వచ్చిన కలుషిత నీటిని తాగి పశువులు సచ్చిపోతున్నాయి. మా బాధలు ఎవ్వరికీ పట్టడం లేదు. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా. – పాలెం శ్రీనివాస్ రైతు కాల్వ తీస్తే ఊరుకోం.. మా గ్రామ శివారులో ఉన్న పరిశ్రమల కారణంగా పల్లె చెరువు కాలుష్యమైపోయింది. చెరువులో చేపలు వదిలితే చనిపోతున్నాయి. గతంలో పొల్యుషన్ బోర్డు వాళ్లు వచ్చి కళ్లారా చూశారు. ఉన్న కాలుష్యంతోనే ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లి దిక్కు ఉన్న కంపెనీల నుంచి కాల్వ తీసి మా గ్రామ చెరువులోకి కలిపేందుకు చూస్తున్నారంట. దీన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే ఊరోళ్లందరం కలిసి సెజ్ గేట్ ముందు ఆందోళన చేస్తాం. – దేవోళ్ల శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ముదిరెడ్డిపల్లి ● -
ఏప్రిల్ 7 వరకు అవకాశం..
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటించాం. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో అధికారుల సమక్షంలో సభ్యుల ఎన్నికకు ప్రణాళిక సిద్ధం చేశాం. – నూరుల్నదీం, పుర కమిషనర్, అమరచింత ఏప్రిల్ 16 నాటికి కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీక రిస్తాం. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్ -
సలేశ్వరం.. జనసంద్రం
తెలంగాణ అమర్నాథ్ సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా’ అంటూ చిన్నా పెద్దా తేడాలేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు, లోయలు, గుట్టలు, సేలయేర్లను దాటుకుంటూ భక్తిపారవశ్యంతో ముందుకు కదిలారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయక లింగమయ్య దర్శనానికి బారులు తీరారు. శివనామస్మరణతో నల్లమల అభయారణ్యం పులకరించింది. సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా.. మొదటి రోజు వేలాది భక్తులు తరలివచ్చారు. – అచ్చంపేట/అచ్చంపేటరూరల్ – వివరాలు 8లో.. -
సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి
చిన్నంబావి: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని దగడపల్లి, అమ్మాయిపల్లిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. దగడపల్లి – తూంకుంట, దగడపల్లి – పెద్దదగడ మధ్య బీటీ రహదారి, దగడపల్లి – వీపనగండ్ల మధ్య ఉన్న బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.కోటి మంజూరు, ఆయా గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారుల నిర్మాణాలు చేపట్టాలని సర్పంచ్ గంగాధర్ మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అత్యధికంగా సీసీ రహదారులకు నిధులు మంజూరు చేశామని, గ్రామస్థాయిలో రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలపై ఆగ్రహం.. మండలంలోని దగడపల్లిలో జరిగిన ముఖాముఖిలో సర్పంచ్ గంగధార్ పాల్గొన్నారు. పార్టీకి మద్దతు ఇవ్వని వ్యక్తికి ఎలా మాట్లాడే అవకాశం ఇస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అంతిమ లక్ష్యం గ్రామాభివృద్ధి అని మంత్రి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిన చింతల వెంకటేష్ను హెచ్చరిస్తూ ఇది మంచి పద్ధతి కాదని.. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు.. మహిళలమని చూడకుండా వార్డుసభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అమ్మాయిపల్లి సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ మాధవి మంత్రికి వివరించారు. మహిళలను గౌరవించాలని, మహిళా ప్రజాప్రతినిధులను అగౌరవపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయాలు మానుకోవాలని.. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి యాదవ్, సర్పంచ్లు కవిత ప్రభంజన్గౌడ్, గంగాధర్, ఉపసర్పంచ్ మాధవి మాధవరెడ్డి, కిరణ్కుమార్గౌడ్, చింతల శ్రీనివాసులు, శంకర్, బాలకృష్ణ, రాజకుమార్, ఉమేష్ నాయుడు, సుధాకర్ నాయుడు, జ్యోతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
1981లో బీజం.. మార్పులతో ఆమోదం
నాగర్కర్నూల్వనపర్తిగద్వాలగతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. -
కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..
నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పాటు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. ●– మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
పండుగ వాతావరణంలో గ్రామసభలు
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పుర కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామ, పుర వార్డుసభలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో టాం టాం వేయించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఇచ్చిన రైతుభరోసా, పంట రుణమాఫీ, ధాన్యం సేకరణ, రైతులకు రూ.500 బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందిన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, రూ.500 సిలిండర్ తదితర వివరాలతో కూడిన కరదీపికలు తయారు చేయించి గ్రామసభకు వచ్చే ప్రతి ఒక్కరికి అందజేసి, లబ్ధిదారుల పేర్లు సైతం చదివి వినిపించాలని ఆదేశించారు. ఎవరైనా అర్జీలు ఇచ్చేవారు ఉంటే తీసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామసభకు ప్రజలు అత్యధికంగా వచ్చేలా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీటి సౌకర్యం, ముఖ్యమంత్రి సందేశం చూసేందుకు టీవీ తదితర మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామసభకు ప్రత్యేక అధికారిని నియమించామని.. ఉదయం 10 గంటలకు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, సభ ఏ విధంగా నిర్వహించాలనే అంశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో సీపీఓ హరికృష్ణ, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పుర కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
వనపర్తి: ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, స్కానింగ్ కేంద్రాలు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2010 ప్రకారం ధరల చార్ట్లను ప్రదర్శించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించి పలు దరఖాస్తులను సమీక్షించారు. 3 ఆస్పత్రులు, 3 క్లినిక్లు, ఒక డయాగ్నొస్టిక్ సెంటర్, 4 స్కానింగ్ కేంద్రాలకు దరఖాస్తులురాగా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని, సకాలంలో పునరుద్ధరించుకోవాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దన్నారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. సాయినాథ్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు, డా. బాబు, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ వనపర్తి: జిల్లాలో ఈ నెల 30 వరకు పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునీతరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ సమావేశాలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. ప్రజా జీవనానికి అంతరాయం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకై నా చోటు లేదన్నారు. ‘30 పోలీస్ యాక్ట్‘ ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయని, అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగానే దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు నిలుస్తాయని, పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని వివరించారు. చట్టాలపై అవగాహన అవసరం వనపర్తిటౌన్: కాబోయే ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడపగలరని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. బుధవారం స్థానిక గాయత్రి బీఈడీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచి చట్టాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్లో ఎలాంటి తప్పులు చేయకుండా సమాజాభివృద్ధికి పాటుపడతారని వివరించారు. పోక్సో, ఎన్డీపీఎస్, బాల్య వివాహాలు, వినియోగదారుల రక్షణ చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, కళాశాల అధ్యాపకులు మల్లికార్జున్, మోహన్, సురేష్, వీరభద్రయ్య, నిరంజన్ వలి, నాగేంద్రం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ విజేత పల్నాడు జట్టు ఆత్మకూర్: మండలంలోని మూలమళ్లలో దివంగత దేశాయి సరళాదేవి జ్ఞాపకార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు నిర్వహించారు. రెండ్రోజుల పాటు జరిగిన పోటీల్లో మొత్తం 10 జట్లు తలపడ్డాయి. చివరిరోజు మంగళవారం రాత్రి జరిగిన తుది పోరులో పల్నాడు జట్టు, హైదరాబాద్ జట్టు తలపడగా పల్నాడు జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ దేశాయి పద్మజారెడ్డి విజేత జట్టుకు రూ.50 వేలు, హైదరాబాద్ జట్టుకు రూ. 40 వేలు నగదుతో పాటు జ్ఞాపిక అందజేశారు. మూడోస్థానంలో నిలిచిన మహబూబ్నగర్ జట్టుకు రూ.30 వేలు, నాలుగో బహుమతిగా బాపట్ల జట్టుకు రూ.20 వేలు, ఐదో బహుమతి కర్ణాటకకు రూ.15 వేలు, ఆరో బహుమతి మూలమళ్ల జట్టుకు రూ.10 వేలు, ఏడో బహుమతి గద్వాలకు రూ.6 వేలు, 8వ బహుమతి రంగారెడ్డి జిల్లా జట్టుకు రూ.5 వేలు, జ్ఞాపిక అందజేశారు. -
ముగిసిన జిల్లాస్థాయి ఎంపికలు
వనపర్తిటౌన్: క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతారని డీవైఎస్ఓ టి.సుధీర్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని క్రీడా మైదానంలో క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకుగాను జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు క్రీడా పాఠశాల ఎంతో దోహదపడుతుందన్నారు. వనపర్తిని క్రీడాపర్తిగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. క్రీడల్లో సత్తా చాటడంతో ఉద్యోగాలు సాధించవచ్చని చెప్పారు. ఎంపికలకు వివిధ మండలాలకు చెందిన 60 మంది బాలురు పాల్గొన్నారని.. జిల్లాస్థాయిలో సత్తాచాటిన విద్యార్థులు ఏప్రిల్ 30, మే నెల 1న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్లో ప్రవేశాలు పెంచాలి : డీఐఈఓ ఆత్మకూర్: రానున్న విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య కోరారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ కళాశాల్లో ప్రవేశాలు పొందేలా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్రెడ్డి, అధ్యాపకులు టీజే విశ్వేశ్వర్, రాఘవేందర్రావు, లలితమ్మ, వీణ, చైతణ్యరాణి, స్వాతి, సునయన, విశ్వాస్, నారాయణ, దేవదాసు, సునీల్కుమార్, పావని, ఏకే కురుమూర్తి, రాఘవేంద్ర, రామన్గౌడ్ పాల్గొన్నారు. హుండీ లెక్కింపు అడ్డాకుల: కందూర్ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి హుండీ లెక్కించారు. బ్రహోత్సవాలు, జాతరకు భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామస్తుల సమక్షంలో లెక్కింపు జరిగింది. రూ.5,17,591ల నగదు స్వామివారి హుండీ ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరింది. -
సలేశ్వర క్షేత్రం
కుంచోని మూలచివరి పాయింట్ కార్లు, బైక్ వాహనాల పార్కింగ్ ఆర్టీసీ బస్ పార్కింగ్ షికార్నగర్ ఆటో రూట్ మన్ననూర్టికెట్ కౌంటర్ మెయిన్ ఎంట్రెన్స్కాలినడక ఏరియా కురియాల జంక్షన్ రాంపూర్పెంట పుల్లాయిపల్లిమోకాల కుర్వ చెప్పుల కుర్వ -
పకడ్బందీగా గ్రామసభల నిర్వహణ
పాన్గల్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామసభలను పండుగ వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామపంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధుల వివరాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామసభల్లో ప్రజలకు వివరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కరదీపికలను గ్రామసభలకు వచ్చే ప్రతి ఒక్కరికీ అందజేయాలని సూచించారు. గ్రామసభలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీటి వసతి కల్పించాలని, నిర్వహణలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలస్థాయి అధికారులు గ్రామసభల నిర్వహణపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ గోవిందరావు, ఏపీఓ కుర్మయ్య, ఏపీఎం వెంకటేష్, ట్రాన్స్కో ఏఈ చందన్కుమార్రెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
లింగమయ్య దర్శనానికి వేళాయె
సలేశ్వరం రూట్మ్యాప్వస్తున్నాం.. వెళ్లొస్తాం ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాళ్లు రప్పల మధ్య నడిచివెళ్లి.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నాపెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నాం.. లింగమయ్యా’ తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్తొస్తాం.. లింగమయ్యా’ అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. సుమారు వెయ్యి అడుగుల లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే నీటి తుంపర్లు.. వెయ్యి అడుగు లపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. మహబూబ్నగర్ – -
అంచనా బడ్జెట్ రూ.63.74 కోట్లు
వనపర్తి టౌన్: స్థానిక పుర కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం చైర్పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హాజరయ్యారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.63.74 కోట్ల వార్షిక అంచనా పద్దును ఎలాంటి కనీస చర్చ లేకుండానే కౌన్సిల్ ఆమోదించింది. మిగులు బడ్జెట్ను పరిగణలోకి తీసుకోకుండా రూ.55.31 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. 2027, మార్చి 31 నాటికి ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మిగులు నిధులు రూ.3.04 లక్షలుగా ప్రతిపాదించారు. మొత్తం బడ్జెట్లో సొంత రాబడిని రూ.25.90 కోట్లుగా చూయించగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, పన్నేతర ఆదాయాలు కలుపుకొని రూ.29.26 కోట్లుగా ప్రతిపాదించారు. ఆస్తి పన్ను రూ.12.23 కోట్లు, కొళాయి బిల్లు రూ.7.50 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ద్వారా రూ.85 లక్షలుగా.. పన్నేతర ఆదాయాన్ని రూ.13.67 కోట్లుగా పొందుపర్చారు. రూ.60.79 కోట్లు ఏడాది కాలంలో ఖర్చు కానున్నాయని.. 2027, మార్చి 31 నాటికి మిగులు నిధులు రూ.3.04 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఖర్చుల్లో అత్యధికంగా జీతభత్యాలకు రూ.6.30 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు రూ.2.70 కోట్లు, విద్యుత్ బిల్లులు రూ.3.20 కోట్లు, గ్రీన్ బడ్జెట్ రూ.2.59 కోట్లు, విలీన గ్రామాల అభివృద్ధికి రూ.2 కోట్ల చొప్పున అంచనాలు రూపొందించారు. పలువురు సభ్యుల అభ్యంతరం.. బడ్జెట్ వివరాలను అకౌంటెంట్ జానకిరాములు చదవగా.. ఎంపీ నిధులను గత బడ్జెట్ కంటే తక్కువగా చూపారని 23వ వార్డు కౌన్సిలర్ పలుస శ్రీకర్గౌడ్ అభ్యంతరం తెలిపారు. గత బడ్జెట్లో పన్నుల ద్వారా చూపించిన ఆదాయానికి, ప్రస్తుతం చూయిస్తున్న ఆదాయానికి పొంతన లేదని 18వ వార్డు సీపీఎం కౌన్సిలర్ గంధం మదన్ ప్రశ్న లేవనెత్తారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్లో ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు బదులిచ్చారు. గాంధీచౌక్లో శౌచాలయాలు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మూడేళ్లుగా అధికారులు ఎందుకు స్పందించడం లేదని అధికార పార్టీ సీనియర్ కౌన్సిలర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ ఎమ్మెల్యే ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. వేలం నిర్వహణలో పదేళ్లుగా అవకతవకతలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో నష్టం వాటిల్లుతుందని మండిపడటంతో నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. సీఓ సరస్వతి ఆర్పీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని 15వ వార్డు కౌన్సిలర్ సౌమ్య కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్ చర్యలకు కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం కోరగా పూర్తిస్థాయిలో పరిశీలించిన చేసిన తర్వాతే ముందుకెళ్దామని 21వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి అడ్డుచెప్పడంతో ప్రతిపాదన విరమించుకున్నారు. 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మురళీసాగర్ మాట్లాడుతూ.. కొత్త కౌన్సిలర్లకు బడ్జెట్పై అవగాహన కల్పించకుండా సమావేశం నిర్వహించడం సరైంది కాదన్నారు. బడ్జెట్ సమావేశంలో పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా పనిచేస్తే కుదరదని.. పద్ధతి మార్చుకోకపోతే సెలవుపై వెళ్లాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలో చేపట్టే రహదారి విస్తరణకు కౌన్సిల్ సభ్యులందరూ సహకరించాలని సూచించారు. ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్నామని.. లక్ష్యం చేరుకునేందుకు యత్నించాలన్నారు. ఈ ప్రాంత ప్రజలే తనకు ప్రాణపదమని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇక్కడి వారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఖరారు కానుందన్నారు. మున్సిపాలిటీకి తాను తీసుకొచ్చిన రూ.18 కోట్ల అభివృద్ధి పనులు ఏయే దశలో ఉన్నాయో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వసూళ్లలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని, లేకపోతే కేంద్ర నిధులు రావన్నారు. రహదారి విస్తరణకు సహకరించాలి.. కనీస చర్చ లేకుండానే పద్దులకు ఆమోదం -
ఉత్సాహంగా కొనసాగుతున్న కబడ్డీ పోటీలు
ఆత్మకూర్: మండలంలోని మూలమళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ పోరులో ఆంధ్రాకు చెందిన పల్నాడు, తెలంగాణకు చెందిన హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. విజేత జట్టుకు రూ.50 వేలు, రెండో బహుమతి రూ.40 వేలు, మూడో విజేతకు రూ.30 వేలు, నాలుగో బహుమతి రూ.20 వేలతో పాటు జ్ఞాపికలు అందించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ దేశాయి పద్మజారెడ్డి తెలిపారు. పోటీలను తిలకించేందుకు ఆయా రాష్ట్రాల క్రీడాకారులు తరలివచ్చారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఆత్మకూర్: పుర అభివృద్ధికి రూ.5.10 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని.. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కమిషనర్ చికినె శశిధర్ అన్నారు. మంగళవారం స్థానిక పుర కార్యాలయంలో 2026–27 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రూ.5.10 కోట్లతో బడ్జెట్ రూపొందించామని.. ఇందులో రూ.2.50 కోట్లు పన్ను రాబడి, పన్నేతర రాబడి రూ.2.25 కోట్లు, అసైన్డ్ ఆదాయం రూ.35 లక్షలుగా అంచనా వేశారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధిదీపాలు తదితర అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నామన్నారు. అన్నివార్డుల్లో సమానంగా అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్నామని.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిధులను పారదర్శకరంగా వినియోగించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తిరుపతయ్య, లలితరాజు, శంకరమ్మ బాలరాజు, దండు శ్రీను, భరత్, జిందె జ్యోతి శ్రీనివాస్, తులసి వెంకట్రాములు, జుబేదాబేగం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి
ఆత్మకూర్: విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో సాధించే దిశగా శ్రమిస్తూ ముందుకుసాగాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంవీ రామన్ పాఠశాలలో నిర్వహించిన సమగ్ర విద్యా విజ్ఞాన ప్రదర్శన–2026ను మంత్రితో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. మొత్తం 51 స్టాళ్లలో ప్రదర్శించిన 741 ప్రదర్శనలు, ఆవిష్కరణలను తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు సైన్స్మేళాలు ఎంతోగానో దోహదపడతాయన్నారు. కష్టపడేతత్వం ఉంటే అనుకున్న లక్ష్యాలను అవలీలగా సాధించవచ్చని, తల్లిదండ్రులే నిజమైన హీరోలని, గురువులను గౌరవించిన వారు జీవితంలో ఏదైనా సాధిస్తారని వివరించారు. పట్టణంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ అన్సీ శ్రీధర్, డైరెక్టర్ శ్రీధర్గౌడ్ను అభినందించారు. ఉన్నతంగా రాణించాలి.. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో చదివితే అనుకున్నది సాధించవచ్చని.. లక్ష్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా అత్యత్తమంగా రాణించాలని, జిల్లా విద్యారంగానికి నిలయమని.. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా కు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
పండుగలా గ్రామసభల నిర్వహణ
–8లో uవనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గ్రామ, వార్డు, మున్సిపల్ సభల నిర్వహణపై సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పుర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి ఏర్పాట్లు, సభ నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. గ్రామసభల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, సోమవారమే ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందించడంతో పాటు గ్రామాల్లో టాం టాం వేయించాలన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులు తదితర విషయాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల కరదీపికలను గ్రామసభకు వచ్చే ప్రతి ఒక్కరికి అందజేయాలన్నారు. ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించాలని.. గ్రామసభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశం వీక్షించేలా టీవీ సైతం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు ముందస్తు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి.. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని.. ప్రస్తుత, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన వాటిని సైతం వారంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి 35 వినతులు వచ్చాయని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సునీతరెడ్డి స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. న్యాయం జరుగుతుందనే భరోసా కలిగించేలా ఎస్పీ చర్యలు తీసుకోవడంతో ఫిర్యాదుదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
ఆదాయం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కొత్తకోట రూరల్: పురపాలక సంఘాలు తమ సొంత ఆదాయాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. సోమవారం స్థానిక పుర కార్యాలయంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ అరుణ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. పుర కమిషనర్ సైదయ్య బడ్జెట్ ప్రవేశపెట్టగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ సొంత ఆదాయం రూ.483.80 లక్షలు కాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు రూ.588.00 లక్షలుగా అంచనా వేశారు. మొత్తం అంచనా ఆదాయం రూ.1071.80 లక్షలకు చేరుకుందని వెల్లడించారు. ఇందులో వేతనాలకు రూ.180.00 లక్షలు, పారిశుద్ధ్యానికి రూ.77.10 లక్షలు, విద్యుత్ బిల్లులు రూ.130 లక్షలు, హరిత నిధికి రూ.60 లక్షలు, ఇంజినీరింగ్ విభాగానికి రూ.125 లక్షలు, సాధారణ పరిపాలనకు రూ.55.70 లక్షలు, టౌన్ ప్లానింగ్ విభాగానికి రూ.6 లక్షలు కేటాయించినట్లు వివరించారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం 1/3 బడ్జెట్ నిబంధన ప్రకారం అభివృద్ధి చెందని ప్రాంతాలకు రూ. 23.00 లక్షలు, ప్రజా అభివృద్ధి పనులకు రూ.11.50 లక్షలు, వార్డుల వారీగా అభివృద్ధి పనులకు రూ.80.00 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 68.80 లక్షల మిగులు నిధి ఉండనున్నట్లు అంచనా వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వార్డుల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం, ఫాగింగ్, అభివృద్ధి పనుల్లో వేగం పెంచడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పుర వైస్ చైర్పర్సన్ పల్లవి, కౌన్సిల్ సభ్యులు, పుర అధికారులు పాల్గొన్నారు. -
హామీల సాధనకు రోడ్డెక్కిన ఆశాలు
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని సోమవారం ఆశా కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి బుచ్చమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాలు మారినా ఆశా కార్యకర్తల జీవితాలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయిస్తామని హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు మూడుసార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించినా.. ఆశాల ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. పని భారం అధికంగా ఉందని.. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆశాలు చలో అసెంబ్లీ నిర్వహిస్తే ప్రభుత్వం పోలీసులతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించడం సరికాదన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేష్, కార్యదర్శి మండ్ల రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసులతో ఆశా కార్యకర్తలను నిర్బంధించడం మానుకోవాలన్నారు. కుష్టు సర్వే బకాయి డబ్బులు, రెండు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, జిల్లా సహాయ కార్యదర్శులు సూర్యవంశం రాము, రాజు, ప్రసాద్, మద్దిలేటి, ఆశా కార్యకర్తలు భాగ్య, గిరిజ, దేవమ్మ, అనిత, రాణి, అనసూయ, పుష్ప, సంతోష, స్వాతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వసతులు కల్పించాలి..
జూరాల ప్రాజెక్టు వద్ద కనీస వసతులు లేక పర్యాటకులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద జలాశయంలో బొటానికల్ పార్క్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. – రాజు, మస్తీపురం పర్యాటక ంగా తీర్చిదిద్దాలి.. చారిత్రక చంద్రగఢ్ కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం గ్రామపంచాయతీ నిధులు, అధికారుల చొరవతో కోట పరిసరాల్లో మెగా ప్రకృతివనం ఏర్పాటు చేయిస్తున్నాం. – నాగేశ్వర్రెడ్డి,మాజీ సర్పంచ్, చంద్రగఢ్ ప్రతిపాదనలు పంపాం.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, పార్క్ల ఏర్పాటుకు గతంలోనే ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించే విధంగా మారోమారు ప్రతిపాదనలు పంపిస్తాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం ● -
దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి : బీజేపీ
వనపర్తి రూరల్: ప్రధాని మోదీ నీతివంత పాలనతో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం పెబ్బేరులోని బీఈడీ కళాశాలలో జరిగిన పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యవక్తగా హాజరై ‘చరిత్ర.. వికాసం’ అనే అంశంపై మాట్లాడారు. 1984లో బీజేపీ కేవలం రెండు సీట్లతో గెలిచి.. ప్రస్తుతం మూడోసారి స్పష్టమైన మెజార్టీతో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. యుద్ధ సమయంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి దేశ ప్రజలకు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రంగస్వామి, నారాయణ, వెంకట్రామారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రాంతినాయడు, మండలాల అధ్యక్షులు నాగరాజు యాదవ్, విష్ణువర్ధన్, మొగిలి రఘు, గోవింద్నాయుడు, సరేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
పర్యాటకం.. పరిహాసం!
జూరాల, చంధ్రగడ్ వద్ద కనీస సౌకర్యాలు కరువు ● ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు ● పట్టించుకోని పాలకులు, అధికారులు అమరచింత: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత కృష్ణా పుష్కరాల సమయంలో ప్రాజెక్టు దిగువ భాగంలో పుష్కరఘాట్లను నాసిరకంగా నిర్మించడంతో వరదలకు కొట్టుకుపోయి బండరాళ్లు తేలాయి. దీంతో ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులు కాసేపు సేద తీరడానికి వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశించిన ఇక్కడి ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ప్రాజెక్టు రహదారిలో అమరచింత మండలంలో ఉన్న చారిత్రక కట్టడం చంద్రగఢ్ కోట అభివృద్ధిని సైతం పాలకులు విస్మరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కళకళా.. వెలవెల... జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కుడి కాల్వ ఉండటం, ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాలు సైతం అటువైపే ఉండటంతో ఆ ప్రాంతంలో పార్క్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ● ఆయకట్టు సాగుతో పాటు దిగువ ప్రాజెక్టు పరిధిలో విశాలమైన ప్రదేశం, రుచికరమైన చేప వంటకాలు లభిస్తుండటంతో పర్యాటకులు అధికంగా ఇక్కడికే వస్తుంటారు. ఈ ప్రాంతంలో పట్టదనం -
సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలి
వనపర్తిటౌన్: జిల్లాలోని నిరక్షరాస్యులైన మహిళా సంఘాల సభ్యులకు అక్షరాలు నేర్పి సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు డీఆర్డీఓ, సెర్ప్, మెప్మా, విద్యాశాఖ సంయుక్తంగా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకు దూరమైన నిరక్షరాస్య మహిళలు అక్షరాస్యులు అవుతారని చెప్పారు. అదేవిధంగా మండలంలోని చిట్యాల, అంకూరు, చీమనగుంటపల్లి, తూర్పుతండాలో సైతం పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది, ఏపీఎం బుచ్చన్న, డీఆర్డీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే సమాజంలో గౌరవం
వనపర్తిటౌన్: చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని.. చదువు లేదంటే రాజకీయాల్లో మాదిగలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డా. కదిరె కృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ ప్రజాప్రతినిధుల సన్మానసభకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జిల్లాలోని మాదిగ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించి మాట్లాడారు. మాదిగలు చరిత్రలో మొదటి కళాకారులని.. జాతి అభివృద్ధే లక్ష్యమని, విద్యావంతులు, జ్ఞానవంతులు మాదిగ యువతను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మాదిగలు ఎదగాలని.. పిల్లల్ని వైద్యులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులుగా తయారు చేయాలని, అప్పుడే సమాజంలో గౌరవంగా జీవించగలరని చెప్పారు. చదువును నిర్లక్ష్యం చేయొద్దని, చదువుతోనే ఏదైన సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజాప్రతినిధులు పదవి కాలంలో సమస్యల పరిష్కారానికి శ్రమించి అభివృద్ధి చేయాలని సూచించా రు. మాదిగల ఐక్యవేదిక సభ్యులు పెద్దింటి వెంకటేష్, గంధం పరంజ్యోతి, మంద రాములు, మీసాల రాము, చిట్యాల తిరుపతి, వడ్డేమాన్ రవి, ద్యారపోగు నాగరాజు, రాజనగరం రాజేష్, గంధం ప్రవీణ్ పాల్గొన్నారు. -
ఘనంగా రాములోరి పట్టాభిషేకం
గోపాల్పేట: మండల కేంద్రంలోని పురాతన కోదండ రామస్వామి ఆలయంలో శనివారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, భక్తుల సమక్షంలో అర్చకులు రాములోరి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు.. మధ్యాహ్నం 12 నుంచి పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. చాలామంది భక్తులు పంచెలు, చీరలు ధరించి సాంప్రదాయ పద్ధతిలో ఆలయానికి చేరుకొని వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వాహకులు సీతారామలక్ష్మణులతో నాణేలను తయారు చేయించి ప్రత్యేక పూజల అనంతరం దంపతులకు అందజేశారు. అలాగే రాత్రి 8.30 గంటలకు రామాలయం నుంచి కేశవాలయం వరకు పల్లకీసేవ నిర్వహించారు. ఆదివారం ఉదయం నిత్యహోమం, సుందరకాండ హోమం, రాత్రి 11 గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
నిబంధనల మేరకే యూడీఐడీ కార్డులు జారీ
వనపర్తి: దివ్యాంగులకు యూనిక్ డిజబుల్ ఐడి కార్డులను పారదర్శకంగా జారీ చేయనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలతో యూనిక్ డిజబుల్ ఐడీ కార్డుల జారీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు ధ్రువపత్రాలు జారీ చేయమని.. అర్హులందరికి అందేలా చూస్తామని చెప్పారు. అలాగే శిబిరాలకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. యూడీఐడీ దరఖాస్తులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 5,625 కేసులు పరిష్కారం
వనపర్తిటౌన్: జాతీయ లోక్ అదాలత్లో రాజీపడి కేసులు పరిష్కరించుకుంటే కక్షిదారులు ఇరువురు గెలిచినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రాజీ పడదగిన కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజీయే రాజ మార్గమని.. కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు లాభం చేకూరుతుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని.. అన్నదమ్ముల తగాదాలు, భార్యాభర్తల గొడవలు, చెక్ బౌన్స్, ఇన్స్యూరెన్స్, సైబర్ క్రైమ్, డ్రంకెన్ డ్రైవ్ తదిత కేసులు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా రెండు వర్గాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం లోక్ అదాలత్ కల్పిస్తుందని.. దీంతో డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు. శనివారం జరిగిన లోక్ అదాలత్లో జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 5,625 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్కుమార్, కార్యదర్శి వెంకటరమణ, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్, కోర్టు సిబ్బంది, లోక్అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యం
అమరచింత: జాతీయ ఉపాధిహమీ పథకం పనులు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగించిందని.. ప్రజాప్రతినిధులు త్వరగా పూర్తిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ కోరారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎస్సెంటియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.56 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆమె భూమిపూజ చేసి అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకంగా మార్చి కూలీలకు పని దినాల పెంపుతో పాటు గ్రామాలకు అదనంగా నిధులు మంజూరు చేసేలా రూపొందించిందన్నారు. మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన ఉపాధి పనులు నేటికీ అసంపూర్తిగా ఉండటంతో నిధులు వెనక్కి వెళ్తాయని భావించి కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిని కలిసి గడువు పొడిగించాలని కోరామని చెప్పారు. ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర మంత్రి నుంచి ఆదేశాలు అందాయని చెప్పారు. సమాజంలో మనుగడ సాగించాలంటే చదువుతోనే సాధ్యమని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించినప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని తెలిపారు. పట్టణానికి చెందిన పంజాబ్, చత్తీస్ఘడ్ బీజేపీ సంఘటన ఇన్చార్జ మంత్రి శ్రీనివాస్ అదనపు తరగతి గదుల నిర్మాణానికి అభయ ఫౌండేషన్ ద్వారా నిధులు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి.. అమరచింతలో జూనియర్ కళాశాల లేకపోవడం బాధాకరమని.. త్వరలో ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్బీఐ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డి, అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచందర్, దేవకి వాసుదేవరావు, మహంకాళి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు శారదమ్మ, కౌన్సిలర్లు మేర్వ రాజు, ఊషన్న, విష్ణు, తిరుమల్లేష్, మీనుగ లక్ష్మి, జిందె శ్రీనివాస్, చంద్రానాయక్తండా సర్పంచ్ కృష్ణానాయక్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగ లావణ్య, మరాఠి అశోక్, క్యామ భాస్కర్, దుబాయి వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని ఉప్పరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉమామహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉదయం వేళ విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉపాధ్యాయులు ఐక్యంగా ఉంటూ విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటికలు, పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను చిన్నారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశంకర్, మాజీ డిప్యూటీ డీఈఓ విశ్వనాథం, సర్పంచ్ బాలరాజు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు. -
ఇళ్ల మంజూరులో తేడాలొస్తే కఠిన చర్యలు
గోపాల్పేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం ఆయన మండలంలోని బుద్దారం గ్రామంలో పర్యటించి గతంలో మంజూరైన 40 డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్ తిలక్కుమార్ అధ్యక్షతన ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ, కార్యదర్శితో కమిటీ ఏర్పాటు చేసి గతంలో ఇళ్లు ఎంతమందికి మంజూరయ్యాయి.. అర్హులెవరు అనే వివరాలతో పూర్తి నివేదికను పదిరోజుల్లో తనకు అందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించుకోలేని పరిస్థితిలో ఉంటే స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ విఠోభా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ్కుమార్ తదితరులు ఉన్నారు. -
మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహిద్దాం
వనపర్తి: జిల్లాలో ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రామ్, ఏప్రిల్ 14న డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకుత తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జయంతి వేడుకల నిర్వహణపై దళిత, ప్రజాసంఘాల నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకల నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయా రోజుల్లో మహనీయుల జీవితగాథలను అందరికీ తెలియజేసేలా కళాజాతా నిర్వహించాలని, కార్యక్రమాలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాంజీరావు, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, దళిత, ప్రజాసంఘాల నాయకులు గంధం గట్టయ్య, గంధం నాగరాజు, మాదారి భోజరాజు, విశ్వం, వీరప్ప, రమేష్, భరత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 2వ విడత రాయితీ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీ, యువకులు https://tgobmms. cgg.gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసానికి సైతం ఆసక్తిగల అభ్యర్థులు ఎస్సీ కార్పొరేషన్కు దరఖా స్తు చేసుకోవచ్చని సూచించారు. వేలం వాయిదా వనపర్తి టౌన్: స్థానిక పురపాలికలో 2026–2027 సంవత్సరానికిగాను గురువారం జరగాల్సిన తైబజార్, పశువుల సంత, జంతువధశాల బహిరంగ వేలానికి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రానందున వాయిదా వేసినట్లు పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన బహిరంగ వేలాన్ని ఎప్పుడు నిర్ణయించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
తప్పులు లేని ఓటరు జాబితా రూపొందిద్దాం
వనపర్తి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏప్రిల్లో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ప్రతి ఓటరు 3 ఫారం పూరించి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి బూత్కు ప్రతి పార్టీ నుంచి ఏజెంట్ను నియమించి వారి జాబితా సమర్పిస్తే గుర్తింపుకార్డు జారీ చేస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ నిబంధనలు వివరిస్తూ ఓటరు 1987 కంటే ముందు దేశంలో జన్మించి ఉంటే అందుకు సంబంధించిన ఆధారం (గుర్తింపు కార్డు) సమర్పించాల్సి ఉంటుందన్నారు. 1987 తర్వాత జన్మిస్తే అతడితో పాటు అతడి తండ్రి ఆధారం ఉండాలని సూచించారు. పుట్టిన తేదీ లేదా స్థలం ఆధారానికి ఎన్నికల సంఘం 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇప్పటి వరకున్న ఓటరు జాబితాను పూర్తిగా జీరోచేసి మొదటి నుంచి కొత్త ఓటరు జాబితా రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, వివిధ పార్టీల నాయకులు శ్రీనివాస్గౌడ్, కుమారస్వామి, పెద్దిరాజు, కొత్తగొల్ల శంకర్, వేణాచారి తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రామాల్లో కాషాయ జెండా ఎగరాలి’
మదనాపురం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. అజ్జకొల్లు పర్యటనలో భాగంగా మదనాపురం చేరుకున్న రాష్ట్ర అధ్యక్షుడికి స్థానిక బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. భారత్ మాతా కీ జై నినాదాలతో మండల కేంద్రంలోని వీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలన్నారు. జిల్లాలో ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. అనంతరం ఇటివల అజ్జకొల్లులో అడ్వకేట్ రాజవర్ధన్రెడ్డి మాతృమూర్తి మరణించడంతో రాంచందర్రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎగ్గని నరసింహులు, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ, వనపర్తి శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు ఎద్దుల రాజవర్ధన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, కొత్తకపు మాధవరెడ్డి, వంగూరు రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణయాదవ్, అమర్నాథ్ శెట్టి, బాబుగౌడ్, అంజన్నయాదవ్, బాలవర్ధన్, కావలి శివ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంఐడీసీ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, మాతా శిశు సంరక్షణ కేంద్రం సూపరింటెండెంట్తో కలిసి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.కోటి నిధులతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సిటీ స్కాన్ సెంటర్, సదరం క్యాంపు కేంద్రాల్లో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. వీటితో పాటు ఆస్పత్రికి అవసరమైన వీల్ చైర్లు, బీపీ కొలిచే మిషన్లు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చుకోడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేసుకునే విధంగా సిటీ స్కాన్, సదరం క్యాంపు గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి, యంత్ర సామగ్రికి వెంటనే ఆర్డరు పెట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అంతకముందు కలెక్టర్ సీబీపీ, హెచ్బీ 1 రక్త పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ పరిమళ, ఇతర వైద్య సిబ్బంది తదితరులున్నారు. క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే క్షయ వ్యాధి పూర్తిగా నయమైపోతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీబీ నివారణ కేంద్రంలో కలెక్టర్ వంద రోజుల క్యాంపెయిన్ వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్రెడ్డి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు -
‘ఐరాడ్’తో ప్రమాదాల నివారణకు చర్యలు
వనపర్తి: ఐరాడ్ (ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డాటా బేస్) అప్లికేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్ఐలకు, రైటర్లకు ఐరాడ్ అప్లికేషన్పై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఐరాడ్ అప్లికేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయడం, ప్రమాద స్థలాలను ఖచ్చితంగా గుర్తించడం, డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టే విధానాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగాఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోడ్డు ప్రమాదం వెనుక ఉన్న కారణాలను సాంకేతికత ద్వారా గుర్తించడం అత్యంత అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఖచ్చితమైన సమాచారం సేకరణలో ఐరాడ్ అప్లికేషన్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ప్రమాదాన్ని సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్లో ప్రమాదాలు తగ్గించే చర్యలు తీసుకోవడం సులభమవుతుందన్నారు. బాధితులకు ప్రభుత్వం అందించే బీమా ప్రయోజనాలు, చికిత్స అవకాశాలు గురించి పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఐఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, పోలీస్స్టేషన్ల సీసీటీ ఎన్ఎస్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు. -
గుడిపర్తి రిజర్వాయర్ను పరిశీలించిన మాజీ మంత్రి
గోపాల్పేట: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో జలకళ అని, తెలంగాణ సాకారమయ్యకే సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన రేవల్లి మండలంలోని గుడిపల్లి రిజర్వాయర్ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్వకుర్తి పరిధిలో రైతులకు మరో 40 రోజులు నీరు ఇవ్వాల్సి ఉంటుందని, శ్రీశైలంలోని ప్రతిచుక్కను వినియోగించుకోవాలన్నారు. కల్వకుర్తికి మోటార్లతో 240 రోజులు సాగునీరు ఇవ్వవచ్చన్నారు. అసంపూర్తిగా ఉన్న కేఎల్ఐ కాల్వకు రూ.3వేల కోట్లతో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, టన్నెల్, కాల్వలు, పవర్లైన్స్, సర్జిపూల్, మోటార్లు పూర్తి చేసి 4 లక్షల ఎకరాకలు సాగునీరు అందించామన్నారు. అలాగే భూగర్భ జలాల ద్వారా మరో లక్ష ఎకరాలకు నీరందించామని మొత్తం ఐదు లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన 35లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అందించి రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టారన్నారు. 90 శాతం పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. ఆయనతో వెంట గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను నిరాశపర్చిన బడ్జెట్
● అంకెల గారడీతో మభ్యపెట్టే ప్రయత్నం ● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న పద్దులు రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసేలా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.3 లక్షల కోట్లు అప్పు చేసి మూడు సంక్షేమ పథకాలు అమలు చేయలేని దుస్థితిలో రేవంత్రెడ్డి సర్కారు కొనసాగుతుందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు పూర్తిగా మోసపూరితమేనని.. దేశ చరిత్రలో ప్రజలను ఇంతగా మోసం చేసే బడ్జెట్ చూడలేదన్నారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీల్లో కనీసం కొన్నింటిని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. దివ్యాంగులు, విద్యార్థినులు, రైతులు, కార్మికులు, ఉపాధి కూలీలు, హరిజన, గిరిజన, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలను మోసం చేసి చరిత్రకెక్కిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. -
ఆదాయం అంతంతే..
తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు ● నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 29వ స్థానం ● జీడీడీపీలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజ ● తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వేలో వెల్లడి సాక్షి, నాగర్కర్నూల్: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -
హైలెవల్ వంతెన నిర్మించి తీరుతాం
ఆత్మకూర్: జూరాల–కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తిచేసి తీరుతామని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసేది లేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శనివారం రంజాన్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 87 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఆత్మకూర్కు గత వైభవం తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, హైలెవల్ వంతెన నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పురపాలికలో రెండేళ్ల వ్యవధిలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ.. మండలంలోని తిప్పడంపల్లిలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మంత్రి శనివారం ఆవిష్కరించారు. అలాగే ఆత్మకూర్లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. మేడేపల్లిలో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాస్, తహసీల్దార్ జేకే మోహన్, ఎంపీడీఓ శ్రీపాద్, పుర కమిషనర్ శశిధర్, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్ పాల్గొన్నారు. పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం... అమరచింత: పదవులు ముఖ్యం కాదని.. మనం చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత పుర కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన పుర సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు వారి సేవకు పునరంకితం కావాలని సూచించారు. మండలంలో కొత్తగా గోదాంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండలానికి మొదటి విడత 450 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. అవి పూర్తిచేస్తే మరో 500 ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మున్సిపాల్టీకి రూ.15 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. పురపాలికకు పొక్లెయిన్, డోజర్ మంజూరు చేయాలని చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ రాధ మంత్రికి విన్నవించగా.. ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత సెల్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, కౌన్సిలర్లు మాధవి, రాములు, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్కుమార్, నాయకులు తౌఫిక్, శ్యామ్, కమలాకర్గౌడ్, నందిమళ్ల సర్పంచ్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు కోత విధించేలా ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ ఆరోపించారు. శనివారం మండలంలోని పాంరెడ్డిపల్లిలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సరిపడా బడ్జెట్ కాదని విమర్శించారు. భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి ఒకసారి మాత్రమే రూ.6 వేలు చెల్లించి, మిగతా రూ.18 వేలు బకాయి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రైతుబీమా పథకాన్ని ఎత్తివేసేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమాపై స్పష్టత ఇవ్వాలని.. కుటుంబానికి కాకుండా రైతు బీమా తరహాలో రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చేయూత పింఛన్ రెట్టింపునకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 నగదు ఊసే లేదని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ మరిచారని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సరిపడా బడ్జెట్ కేటాయించాలన్నారు. శంకర్, మోహన్, అశోక్, మణెమ్మ, చెన్నప్ప, షేక్ అహ్మద్, అనంతరెడ్డి పాల్గొన్నారు. -
ఉపాధి ‘హామీ’ అంతంతే..
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించి వారి ఆదాయం పెంచాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కూలీలకు లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం లేదు. ఉపాధి హామీలో లక్ష్య సాధన విషయంలోనూ మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు వెనుకే ఉన్నాయి. మహబూబ్నగర్లో 88.60 శాతం లక్ష్యం చేరుకోగా, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 73.10 శాతం, గద్వాల జిల్లాలో 74.60 శాతం, నారాయణపేట జిల్లాలో 77.40 శాతం, నాగర్కర్నూల్ జిల్లాలో 81.60 శాతం లక్ష్యం నెరవేరింది. వ్యవసాయ రంగంలో మిశ్రమ పంటల విధానం, పంటల సాంద్రతలో ఉమ్మడి జిల్లా చివరన ఉంది. వనపర్తి జిల్లాలో పంటల సాంద్రత 169 కాగా, మహబూబ్నగర్లో 146, నాగర్కర్నూల్ 143, నారాయణపేట 133, గద్వాలలో 132 పాయింట్లుగా పంటల సాంద్రత నమోదైంది. -
ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
● ఈద్గాల వద్ద ముస్లింల సామూహిక ప్రార్థనలు ● శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు వనపర్తిటౌన్: భగవంతుడు ఒక్కడే అని విశ్వసిస్తూ దైవ ప్రార్థన, ఉపవాసాలు, దానధర్మాలు, మక్కా యాత్ర పంచసూత్రలపై ఆధారపడి ఉండటమే రంజాన్ మాసం ప్రత్యేకత అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నెలరోజుల ఉపవాసాల అనంతరం శుక్రవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో జిల్లాలోని ముస్లింలు శనివారం రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, పుర కేంద్రాల్లోని ఈద్గాలు, మసీద్ల వద్ద సామూహిక ప్రార్థనల అనంతరం రాజకీయ ప్రముఖులు, అధికారులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకేంద్రంలోని గోపాల్పేట రోడ్లో ఉన్న ఈద్గా, శ్రీనివాసపురంలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, నందిమళ్ల అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు ముస్లింల నివాసాలకు చిన్నారెడ్డి, మేఘారెడ్డి, ఆలిండియా మెడికల్ విభాగం రాష్ట్ర సమన్వయకర్త జిల్లెల్ల ఆదిత్యరెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలుపగా, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తన నివాసంలో కలిసిన ముస్లింలను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ ఎం.మాధవి, పీసీసీ సభ్యుడు శంకర్ప్రసాద్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, నాయకులు చరణ్రెడ్డి, ఆదిత్య పాల్గొన్నారు. ● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకి టి శ్రీహరి ఆత్మకూర్ ఈద్గా వద్ద ము స్లింలకు పండుగ శుభా కాంక్షలు తెలిపారు. పోలీస్ బందోబస్తు.. జిల్లాకేంద్రంలోని ఈద్గాలు, మజీద్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం రహదారులపై ముస్లింలు నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
త్వరలోనే భవనాలు ప్రారంభిస్తాం
గోపాల్పేట: ఏదుల, రేవల్లిలో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాలను త్వరలో ప్రారంభించి ప్రజలకు సేవలు అందిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఉమ్మడి గోపాల్పేట మండలంలో పర్యటించారు. మొదట ఏదుల తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్ త్వరగా సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిసేవలు ఒకే దగ్గర అందించేలా చూడాలని సూచించారు. ఆయన వెంట స్థానిక అధికారులు ఉన్నారు. -
‘హామీల అమలు మరిచిన ప్రభుత్వం’
వనపర్తిటౌన్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు జాడే కనిపించడం లేదని, 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ను ముట్టడించి గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీని గెలిపిస్తే రైతులు, కౌలు రైతులకు రైతుభరోసా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రస్తుతం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పింఛన్ పెంపు, కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం జాడేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, బీసీ డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని నిప్పులు చెరిగారు. అనంతరం కలెక్టరేట్ సూపరింటెండెంట్కు మెమోరాండం అందజేశారు. పురుషోత్తంరెడ్డి, పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, వారణాసి కల్పన, సుమిత్రమ్మ, ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, బచ్చు రాము, బోయల రాము, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, కోశాధికారి బండారు కుమారస్వామి, కౌన్సిలర్ విజయసాగర్ పాల్గొన్నారు. -
అభివృద్ధికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేలా ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రజామోద బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయం, మహిళల అభ్యున్నతి, విద్య, యువతపై ప్రత్యేక దృష్టి సారించి నిధుల కేటాయింపులు చేశారు. ఎస్సీకాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత రేవంత్రెడ్డి సర్కారుకే దక్కింది. విద్యావ్యవస్థలో మార్పులు, ఆధునిక కిచెన్లు, విద్యార్థులకు అందించే మెనూలో వారంలో మూడురోజులు పాలు అందించేలా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో క్రీడలకు గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.500 కోట్లు కేటాయించడం హర్షణీయం. కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రోత్సహిస్తూ నిధులు కేటాయించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటేలా క్రీడారంగం బలోపేతానికి పెద్దపీట వేశారు. – శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతున్నారు. అయితే ఖర్చులో మాత్రం తేడా ఉంటోంది. ఎంత కేటాయించారన్నది కాకుండా ఎంత ఖర్చు చేశారో ముఖ్యం. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల కోసం సిద్ధం చేసిన డీపీఆర్లకు అనుగుణంగా సాగునీరు అందించాలి. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు అందించారు.. నీరు అందించకుండా పెండింగ్ ఉన్న భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. అంకెల గారడీ కాదు.. నీళ్లు కావాలి. – రాఘవాచారి, కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. అప్పుల పద్దులను చూస్తేనే ప్రజలకు వణుకు పుట్టేలా బడ్జెట్లో రాబడి, ఖర్చు లెక్కలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా రూ.వేల కోట్లలో రాష్ట్ర ప్రజానికం వడ్డీలు చెల్లించడం శోచనీయం. భారత ప్రభుత్వం నిర్వహించే ప్రజాపంపిణీ, గృహ నిర్మాణంలో రాష్ట్ర వాటా కొద్దిపాటి మాత్రమే. బడ్జెట్లో ఈ రెండు శాఖలకు కేటాయించిన పద్దులతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. – డి.నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రైతుల పంట రుణమాఫీ పూర్తిస్థాయిలో చేపడతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పాలకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కంటితుడుపు చర్యగా కొద్దిపాటి మాఫీచేసి అగ్రభాగం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. బడ్జెట్లో ఈ విషయంపై ప్రస్తావనగాని, నిధుల కేటాయింపులు చేయకపోవడం శోచనీయం. – గట్టుయాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ● -
రూ.6.06 కోట్ల చరాస్తులు జప్తు
వనపర్తి రూరల్: కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని నాచహళ్లి శివారులో ఉన్న మెస్సర్స్ రిలిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సుమారు రూ.6.06 కోట్ల రైస్మిల్లు ఆస్తులు సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో జప్తు చేశామని తహసీల్దార్ రమేష్రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ తదితర అధికారులతో కలిసి మిల్లును తనిఖీ చేశామన్నారు. 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి డిఫాల్ట్ ధాన్యం 10,310.091 ఎంటీఎస్ బకాయిలు రూ.31 కోట్లు చెల్లించాల్సి ఉందని కాలయాపన చేస్తుండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం మిల్లును సందర్శించి పంచనామా నిర్వహించి 8 వాహనాలు, బాయిల్డ్ రైస్ 1.5 ఏసీకే, మిల్లు, మిగతా చరాస్తులను జప్తు చేసినట్లు వివరించారు. నేడు మంత్రి వాకిటి శ్రీహరి రాక ఆత్మకూర్: రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం మండలంలో పర్యటించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతారని, 11 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారని పేర్కొన్నారు. పార్టీ సర్పంచ్లు, పుర కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. -
ప్రత్యేక నిధుల్లేవ్..!
వనపర్తి● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు ● మక్తల్– పేట–కొడంగల్ లిఫ్ట్కు పెద్దపీట ● ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు మరోసారి నిరాశే.. ● కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.800 కోట్లు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెచ్చింపు శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు సమకూరుస్తారని భావించగా, కేవలం రూ.1,800 కోట్ల కేటాయింపులు దక్కాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.2,514 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.714 కోట్ల తగ్గించారు. కాగా.. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ల కోసం మొత్తం రూ.4252.53 కోట్లు కేటాయించగా... మక్తల్– పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పెద్దపీట వేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత -
పీయూకు రూ.45 కోట్లు
● గతేడాది వేతనాలకు రూ.13 కోట్లు, ఈసారి రూ.20 కోట్లు ● కొత్త ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలతో పెరిగిన బడ్జెట్ ● అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు కేటాయింపు – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ఈసారి రాష్ట్ర బడ్జెట్లో నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యం లభించింది. తొలుత రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ను రెండు విడతల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత కోసం రూ.1,126 కోట్లను కేటాయించగా.. రెండో విడత కింద మరోసారి రూ.2,945 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్ను పూర్తిచేసేందుకు తాజాగా రాష్ట్ర బడ్జెట్లో రూ.1,103.28 కోట్ల కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ కింద పెండింగ్లో ఉన్న భూసేకరణతో పాటు పనులను వేగంగా పూర్తిచేసి సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెండింగ్లో ఉన్నవాటికి.. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంపాటు పెండింగ్లోనే ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కోయిల్సాగర్ కోసం రూ.56.13 కోట్లు, సంగంబండ రూ.25.23 కోట్లు, ఆర్డీఎస్ రూ.88 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్కు రూ.232.50 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ. 119.22 కోట్లు, జూరాల రిజర్వాయర్ గేట్ల మరమ్మతు, ఇతర పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించింది. సంక్షేమం కోసం కొత్త పథకాలు.. రాష్ట్ర బడ్జెట్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగిజావతో చేసిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయనున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఉపాధి, భాషా నైపుణ్యాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేయనున్నారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా, రెండో విడతలోనూ కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. ఉమ్మడి జిల్లాకు ఆశాదీపంగా ఉన్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మరో 20 నెలల్లో ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెబుతోంది. అయితే ఈ మేరకు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కనీసం రూ.22 వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లెక్కన ప్రాజెక్ట్ను గడువులోగా పూర్తి చేయాలంటే ఈ బడ్జెట్లోనే సింహభాగం నిధులు అవసరం. కానీ, ఇందుకు బదులుగా కేవలం రూ.1,800 కోట్లే కేటాయించడంతో పనుల పురోగతిపై నీలినీడలు అలుముకొన్నాయి. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు అవసరం ఉంటే ఇంత తక్కువ కేటాయించడంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టమేనన్న భావన నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా.. ప్రాజెక్టు కేటాయించిన నిధులు (రూ.కోట్లలో) పాలమూరు– రంగారెడ్డి 1,800 కేఎల్ఐ 800 పేట–కొడంగల్ 1,103.28 కోయిల్సాగర్ 56.13 సంగంబండ 25.23 ఆర్డీఎస్ 88 నెట్టెంపాడు 232.50 భీమా లిఫ్ట్ 119.22 జూరాల 03 –IIలో u -
రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ
అడ్డాకుల: ఉగాది పండుగ, తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామికి గురువారం విశేషాలంకరణ చేశారు. స్వామివారి శివలింగాన్ని పూలు, పండ్లతో అందంగా అలంకరణ చేశారు. ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టడం భక్తుల రద్దీని సూచిస్తోంది. ఆలయం వద్ద జాతర కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మట్టి కుండలు, గాజుల దుకాణాలు, మిఠాయి షాపుల వద్ద రద్దీ కనిపించింది. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
ఊరూరా ఉగాది వేడుక
కిటకిటలాడిన ఆలయాలు ● ఆలయాల్లో పంచాంగ శ్రవణం ● జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తిటౌన్: తెలుగు వెలుగుల ఉగాదిని గురువారం జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, చింతల హనుమాన్, కన్యకాపరమేశ్వరి, వీరబ్రహ్మేంద్ర, రామాలయం, గణేష్ తదితర ఆలయాలతో పాటు శ్రీరంగాపురం రంగనాథస్వామి, గోపాల్పేట బుద్ధారం గండి ఆంజనేయస్వామి ఆలయాల్లో అర్చనలు అభిషేకాలు, పల్లకీ సేవలు శాస్త్రోకంగా జరిపించారు. అదేవిధంగా సాయంత్రం ఆలయ ఆవరణల్లో అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. శ్రీ పరాభవంలో శుభమే.. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధర్మం, నీతి తప్పిన వారికి మాత్రమే పరాభవం ఎదురవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు ఓరుగంటి నాగరాజుశర్మ పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు, పశుసంపదకు కొదవలేదని చెప్పారు. వనపర్తి ప్రాంత కీర్తి తెలంగాణలో పెరుగుతుందని.. జిల్లా, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయని వివరించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు ప్రజల్లో గౌరవమర్యాదలు, ఆదరణ పెరుగుతాయని చెప్పారు. పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ● ఖిల్లాఘనపురం మండలంలోని గట్టుకాడిపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పండుగ సందర్భంగా గురువారం స్వామివారి పల్లకీసేవ నిర్వహించారు. ఎద్దుల గిరక లాగుడు పోటీలో వృషభాలు -
‘ఉపాధి’ అక్రమాలకు చెక్
● కూలీలు ముఖం చూపిస్తేనే కూలి ● పారదర్శకత దిశగా ముందడుగు.. ● దొంగ హాజరుకు చెల్లుచీటి మదనాపురం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో హాజరు అక్రమాలకు తెరపడినట్లయింది. ఇకపై క్షేత్రస్థాయిలో కూలీల హాజరు కేవలం సంతకాలు, వేలిముద్రలతో కాకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్ యాప్లో ఫేస్ ఆథెంటికేషన్ విధానాన్ని జిల్లావ్యాప్తంగా ఉపాధి పనుల్లో తప్పనిసరి చేశారు. పారదర్శకతే లక్ష్యంగా.. గతంలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలు పనులకు రాకపోయినా వచ్చినట్లుగా మస్టర్లలో తప్పుడు హాజరు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దొంగ హాజరుతో అర్హులైన కూలీలకు నష్టం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యేది. ఈ అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను జోడించింది. ఎలా పనిచేస్తుంది? కూలీలు పని ప్రదేశానికి చేరుకున్నాక మేటీ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ తన స్మార్ట్ఫోన్లోని యాప్ ద్వారా కూలి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ఈ యాప్ నేరుగా కూలి ఆధార్ డేటాకు అనుసంధానమై ఉంటుంది. ముఖం సరిపోలితేనే హాజరు నమోదవుతుంది. కేవలం ఫొటో మాత్రమే కాకుండా సమయం, పని ప్రదేశం కూడా రికార్డు అవుతుంది. జిల్లాలో 87,410 యాక్టివ్ జాబ్ కార్డులు, 1,21,009 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ముఖగుర్తింపు హాజరుతో కేవలం క్షేత్రస్థాయిలో పనిచేసే కూలీలకే వేతనం అందే అవకాశం ఉంటుంది. అర్హత లేని, డూప్లికేట్ కార్డులు, వలస వెళ్లిన వారి జాబ్కార్డులను అధికారులు జాబితా నుంచి తొలగించారు. జిల్లాలో 1.21 లక్షల జాబ్కార్డులు ఉన్నప్పటికీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో 87 వేల కుటుంబాలు మాత్రమే క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. మండలాల వారీగా కూలీల సంఖ్య మండలం సంఖ్య పాన్గల్ 13,908 పెబ్బేరు 11,181 వనపర్తి 10,168 ఖిల్లాఘనపురం 9,729 కొత్తకోట 9,721 చిన్నంబావి 9,624 వీపనగండ్ల 9,372 పెద్దమందడి 8,145 గోపాల్పేట 7,456 మదనాపురం 7,379 శ్రీరంగాపురం 6,464 ఆత్మకూర్ 6,110 అమరచింత 5,004 రేవల్లి 4,026 ఏదుల 2,722 సాంకేతికత ఎంత పెరిగినా అది క్షేత్రస్థాయిలో సామాన్యుడికి న్యాయం చేసినప్పుడే దానికి సార్థకత. ముఖ గుర్తింపు హాజరుతో నిజాయితీగా పనిచేసే కూలీలకు భద్రత లభిస్తుంది. అయితే మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేని చోట సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను బలోపేతం చేయనుంది. – సుల్తాన్, ఏపీడీ, వనపర్తి -
ప్రభుత్వ విప్గా యెన్నం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరికీ.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2019లో బీఆర్ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించింది. కురుమూర్తి స్వామి ఆశీస్సులు ఉండాలి చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆశీస్సులు రాష్ట ప్రజలపైన ఎల్లప్పుడు ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఆయన చిన్నచింతకుంట మండలం అమ్మాపురం కురుమూర్తి స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రావణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమూర్తిస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని వివరించారు. స్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి, రాష్ట ప్రజలపైన ఉండాలన్నారు. కార్యక్రమంలోఅరవింద్కుమార్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్కుమార్, కథలప్ప, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, సర్పంచ్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ఎద్దుల గిరక పోటీలు..
అమరచింత: ఉగాది పురస్కరించుకొని పట్టణంలో గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం అంతర్రాష్ట్ర ఎద్దుల గిరకలాగు పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ, కౌన్సిలర్లు మాధవి, తిరుమల్లేష్ హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. తెలుగు సంవత్సరాది రోజున రైతు సోదరులు గిరకలాగు పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అరుణ్కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగ లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి..
మండల పరిషత్ పాలకవర్గం ఎన్నికలు జరగకపోవడంతో గ్రామంలో ఉన్న సమస్యలను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. మండల పరిషత్ ఉన్నట్టయితే ప్రతి మూడు నెలలకు ఒక పర్యాయం సమావేశం నిర్వహించేవారు. అలాంటి సమావేశంలో గ్రామ సమస్యలు ప్రస్తావించి పరిష్కరించుకునే అవకాశం ఉండేది. సర్పంచ్గా గెలిచినా గ్రామానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి గురించి ఎవరినీ అడగలేని పరిస్థితి నెలకొంది. – సాంబశివుడు, సర్పంచ్, మస్తీపురం, అమరచింత మండలం గతంలో మూడు నెలలకు ఒకసారి మండల సమావేశాలు జరిగేవి. ఆ సభల్లో గ్రామాలకు సంబంధించిన సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తే అధికారులు వాటి పరిష్కారానికి చొరవ చూపేవారు. ప్రస్తుతం సరైన వేదిక లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు స్పందించి సర్పంచులతోనైనా మండలస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది. – రేగిచెట్టు నిరంజన్, సర్పంచ్, రేమద్దుల (పాన్గల్) -
సమస్యల వాణి.. చెప్పుకొనే వేదికేది?
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచులు గ్రామ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల పరిషత్ పాలకవర్గం ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలో సర్పంచులు తమ గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చేవారు. ఫలితంగా ఆయా సమస్యలు కొద్దో గొప్పో పరిష్కారానికి నోచుకునేవి. కానీ, ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు జరపకపోవడంతో మండల పాలకవర్గాలు లేవు. దీంతో గత డిసెంబర్లో కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ సమస్యలు ఎవరికి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకోసారి.. గతంలో మండల పరిషత్ పాలక వర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతి మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులు హాజరయ్యేవారు. డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనేవారు. అలాగే మండలంలో ప్రతి శాఖ అధికారి తమ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, విద్యుత్, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఐకేపీ, ఉపాధి హామీ, పశుసంవర్ధక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో ఆయా గ్రామాల సర్పంచులు తమ సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. డివిజన్ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికలుగా మారేవి. ఎలా చెప్పాలి.. గడువు ముగిసిన వెంటనే పంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచులు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎవరికి విన్నవించాలో తెలియని స్థితిలో సర్పంచ్లు గతంలో మూడు నెలలకోసారి మండల సభలు ప్రస్తుతం పాలకవర్గాలు లేకపోవడంతో అయోమయం -
కాంగ్రెస్పార్టీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
కొత్తకోట రూరల్: కాంగ్రెస్పార్టీ జిల్లా కార్యవర్గాన్ని 32 మందితో హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్గౌడ్ గురువారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పి.తిరుపతయ్య(రాజనగరం), సాయిచరణ్రెడ్డి(ఖిల్లాఘనపురం), ప్రధాన కార్యదర్శులుగా పాపయ్యగారి కృష్ణారెడ్డి (కొత్తకోట), పి.బ్రహ్మయ్యచారి (వనపర్తి), పి.ధనలక్ష్మి (వనపర్తి), ఎల్.సతీష్ (వనపర్తి), జి.గణేష్గౌడ్ (తాడిపర్తి, గోపాల్పేట), ఐ.సత్యారెడ్డి(పెద్దమందడి), అధికార ప్రతినిధులుగా చీర్ల జనార్దన్ (వనపర్తి), కోళ్ల వెంకటేష్ (వనపర్తి), రమేష్గౌడ్(జంగమాయపల్లి, పెద్దమందడి), జి.శరవంద(వనపర్తి), కార్యదర్శులుగా టి.రమేష్ ముదిరాజ్, బి.కృష్ణ(వనపర్తి), వెంకట్రాములుయాదవ్ (పెబ్బేరు), శ్రీహరిరాజు (శ్రీరంగాపురం), వాల్యానాయక్ (పెద్దగూడెం, వనపర్తి), పర్వతాలు(రేవల్లి), యాదగిరి నాయుడు(ఏదుల), వెంకటేష్సాగర్ (బునియాదిపురం, పెబ్బేరు), రియాజ్ (వనపర్తి), ఎన్జే బోయేజ్, (కొత్తకోట), సలీంఖాన్(కొత్తకోట), వేమన్న (మదనాపురం), జి.మన్యం (పెద్దమంద డి), తులసీరాజుయాదవ్ (దేవరపల్లి, ఆత్మకూర్), విజయలక్ష్మి (వనపర్తి), రాములుయాదవ్, విజయ్కుమార్ (ఖిల్లాఘనపురం), కమర్మియా (వనపర్తి), ఆర్.సహదేవ్ (చందాపూర్), శివన్న (వనపర్తి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి కొత్త కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని మహేష్కుమార్గౌడ్ సూచించినట్లు పార్టీ ప్రధానకార్యదర్శి కృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి చేర్చాలని, అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యకర్త పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పినట్లు వారు వివరించారు. -
జిల్లాలో ప్రతిభకు కొదవలేదు
వనపర్తిటౌన్: జిల్లాలో ప్రతిభకు కొదవ లేదని.. ప్రతి ఒక్కరిలో ఓ మేధావి దాగి ఉన్నాడని హెచ్ఎండీఏ జనరల్ మేనేజర్ పెరవలి బద్రీనాథ్ అన్నారు. ప్రతిభను గుర్తించి వెలికితీసేందుకు సహకరిస్తే ప్రయోజకులవుతారని చెప్పారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పానుగంటి శారదమ్మ బ్రాహ్మణ సంస్కారభవన్లో జిల్లా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పంచాంగం ఆవిష్కరించారు. అలాగే జిల్లాలో వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన 28 మందికి ఉగాది పురస్కారాలు అందజేసి సన్మానించారు. పురస్కారాలు అందుకున్న వారిలో.. కొత్తకోటకు చెందిన గ్రూప్–1 అధికారి పెరవలి బద్రీనాథ్, సినీ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, ఆత్మకూర్కు చెందిన కవి, రచయిత బాబు దేవిదాస్రావు, కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన సినిమా డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ మద్దాలి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీలు గోపాల్పేటకు చెందిన రామేశ్వరశర్మ, ఖిల్లాఘనపురానికి చెందిన శేషాచార్యులు, వనపర్తికి చెందిన ఓరుగంటి మనోహర్శర్మ, వంగీపురం నీరజాదేవి, తాళాల రమాకాంత్, తాళాల గాయత్రి, ప్రధానోపాధ్యాయురాలు పెరవలి గాయత్రి, గోశాల వ్యవస్థాపకుడు సౌమిత్రి రామాచారి, వనపర్తి వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథచార్యులు, వనపర్తి బ్రాహ్మణ భవన్ స్థలదాత రాంకిషన్రావు, పత్రి సుధాకర్శర్మ, ఆత్మకూర్కు చెందిన రాఘవన్, శంకరమ్మపేట సర్పంచ్ శ్రీనివాస్శర్మ, సీనియర్ రాజకీయ విశ్లేషకుడు దేవరాజు అచ్యుత రామారావు, టెలికంశాఖ మాజీ అధికారి తాటిపర్తి మోహన్రావు, నాయకంటి నరసింహశర్మ, గీసుకొండ శ్రీనివాసశర్మ, పెబ్బేరుకు చెందిన రంగాచార్యులు, అయ్యవారిపల్లికి చెందిన కృష్ణమాచార్యులు, మదనాపురం జ్యోషి శ్రీనివాసాచారి, సోళీపురానికి చెందిన వెంకటేశ్వరశర్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మదనాపురం గోపీస్వామి, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ డైరెక్టర్ జ్యోషి గోపాలశర్మ, పంచాంగకర్త మనోహర సిద్ధాంతి, ధీరజ్శర్మ, పల్లా సాయికుమార్శర్మ, వరప్రసాదరావు, పత్రి సుధాకర్శర్మ, భక్షి శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ
వనపర్తి రూరల్: మండలంలోని చిమనగుంటపల్లి గ్రామంలో ఆంబేద్కర్ నవచైతన్య సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్, స్వామి వివేకానందా యూత్ అధ్యక్షుడు వాకిటి మహేష్ ఆధ్వర్యంలో బుదవారం జ్యోతిరావుపూలే.. సావిత్రిబాయి పూలే విగ్రహాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, నవ చైతన్య సొసైటీ వైస్ ప్రసిడెంట్ గొర్ల చంద్రకాంత్, జనరల్ సెక్రెటరీ జి.కృష్ణ, ట్రెజరర్ పుల్లయ్య, కె.బాలయ్య, స్వామి వివేకానందా గౌరవ అధ్యక్షుడు వాకిటి నిలేందర్, భగవంతు యాదవ్, వాకిటి సుదర్శన్, చెంచేటి మహేష్, రాజశేఖర్, వాకిటి నరేష్ పాల్గొన్నారు. -
గ్యాస్ పైప్లైన్ దెబ్బతినకుండా చూడాలి
వనపర్తి రూరల్: రైతులు తమ పొలాల వెంట ఉన్న గ్యాస్ పైప్లైన్ దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెం శివారులో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఇంటర్మీడియట్ పిగ్గింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్సైట్ మాక్డ్రిల్కు ఆయనతో పాటు కంపెనీ డీజీఎం అనూజ్ బురోనియా, ఆపరేషన్ మేనేజర్ శశిధర్రెడ్డి పాల్గొన్నారు. పైప్లైన్ మార్గంలోని గ్రామాల పరిధిలో ఎక్కడైనా పొరపాటున గ్యాస్ లీకేజీ ఏర్పడితే భారీ నష్టం జరగకుండా ఏ విధంగా నివారించాలనే విషయాలను కంపెనీ బృందాలు మాక్డ్రిల్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పైప్లైన్ కేవలం 1.5 మీటర్ల లోతులో ఉంటుందని.. ఎల్పీజీ గ్యాస్ పైపులైన్ చుట్టూ 18 మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని సూచించారు. పొలాల్లో పైప్లైన్ ఏ మార్గంలో ఉందో తెలిసి ఉండాలన్నారు. లీకేజీని గుర్తిస్తే సమీపంలోని సైన్బోర్డుపై రాసిన నంబర్కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రైతులు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీసీఎస్ఓ కాశీవిశ్వనాథ్, సర్పంచ్ పుష్పలత, అసిస్టెంట్ మేనేజర్ విద్యాసాగర్ గుప్తా, కృష్ణ, విజయ్, పవన్కుమార్, భారతి, ఫైర్ అధికారులు పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంలో ‘పది’ పరీక్షకు హాజరు
కేటీదొడ్డి: కన్నతండ్రి ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్లాడి గుండె తల్లడిల్లింది. కంటిపాపలా చూసుకున్న తండ్రి భౌతికంగా దూరమైనా ఆశయమే లక్ష్యంగా ఆ విద్యార్థి పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటీదొడ్డి మండలం గంగన్పల్లికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదానందం ఆచారి మృతిచెందారు. ఇంట్లో పార్థివదేహం ఉండగానే బుధవారం పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జరిగే హిందీ పరీక్షకు అతడి కుమారుడు సాయివిష్ణు హాజరు కావాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎంఈఓ విజయభాస్కర్, ఉపాధ్యాయులు విద్యార్థికి ధైర్యం చెప్పడంతో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్నంత సేపు ఆ విద్యార్థి కళ్లు కన్నీళ్లతో నిండిపోవడం చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్
వనపర్తి: బ్యాంకర్లు 2025–2026 వార్షిక ఆర్థిక ప్రణాళిక లక్ష్యాన్ని ఛేదించాలని, ప్రతి ఖాతాదారుడికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.5,339.27 కోట్ల వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా డిసెంబర్ నాటికి రూ.3,326.61 కోట్లు సాధించారని, మార్చి 31లోపు వందశాతం పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనకు జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 72,162 మంది ఖాతాదారులు మాత్రమే బీమా తీసుకున్నారని ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, రిజర్వ్ బ్యాంక్ ఎల్డీఓ చేతన్ గోరేకర్, నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి, యూబీఐ చీఫ్ మేనేజర్ ఆశిష్ రంజన్ బ్యాంకు మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్.. హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్యూమ్ టెక్నాలజీలో 2026–27 విద్యా సంవత్సరానికిగాను డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ.. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. 242 మంది విద్యార్థులకుగాను 242 మంది హాజరయ్యారని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, తహసీల్దార్ రమేష్రెడ్డి తదితరులు ఉన్నారు. ఆస్తిపన్ను వసూళ్లలో వేగం పెంచండి.. ఆస్తి, నీటి పన్ను వసూళ్లలో పుర కమిషనర్లు వేగం పెంచాలని, సిబ్బందికి ఎప్పటికప్పుడు మార్గనిర్ధేశకాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. బుధవారం జిల్లాలోని పుర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పన్ను బకాయిలు ఉన్న వారి జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, జాబితాను కౌన్సిలర్లకు కూడా అందజేయాలన్నారు. డిజిటల్ పేమెంట్ చేయడానికి బార్కోడ్ ఉన్న నోటీసులను తయారుచేసి పోస్ట్లో పంపించాలని సూచించారు. ప్రతి మూడు వార్డులకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రివిజన్ మేళాల నిర్వహణ తప్పనిసరి.. అన్ని పురపాలికల్లో రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా రివిజన్ మేళా నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మ్యుటేషన్లు, కొత్త ఇంటి నంబర్ల జారీ పనులు వేగంగా కొనసాగించాలన్నారు. పన్ను వసూళ్లపై రోజు పర్యవేక్షణ కొనసాగించి నివేదిక ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు సూచించారు. -
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
గోపాల్పేట: రసాయన ఎరువులతో పండిన పంటలకు మార్కెట్లో విలువ తగ్గుతోందని.. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంతో లాభదాయకమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని జయన్నతిర్మలాపూర్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఏళ్ల కిందట చూసుకుంటే దేశంలో పండించే పంటలకు ఎంతో విలువ ఉండేదని.. 200 రోజుల్లో పంట దిగుబడి వచ్చేదని సాంబార్, వరి వంగడాలు చాలా ఏపుగా పెరిగి దిగుబడి అధికంగా ఉండేదని వివరించారు. ప్రస్తుత సమయంలో దిగుబడి అధికంగా రావాలన్న ఉద్దేశంతో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో బయటి దేశాల్లో డిమాండ్ తగ్గిందని వివరించారు. రైతులు ఇప్పటికై నా రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి సేద్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామంలో 125 మంది ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సానుకూలంగా ఉన్నారని.. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరగనుందని వివరించారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ మిషన్ బ్యాగులు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి గోపాల్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, భాస్కర్రెడ్డి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయిస్తాం
వనపర్తి రూరల్: కాంగ్రెస్ పార్టీ మెడలువంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలసి, జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యలాయంలో డిప్యూటీ తహసీల్దార్కు చక్రపాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 27 నెలలైనా ఒక్క హామీకూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు విజయ్సాగర్, దాసరాజు ప్రవీణ్ కొమ్ము,శ్రీను, గోపినాథ్, కంచరవి, చాణక్య, ఉపేందర్ యాదవ్, చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలి వనపర్తిటౌన్: గత వారం రోజులు 19వ, వార్డులో నీటి ఎద్దడి నెలకొందని, అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరా సమస్యను తీర్చాలని 19వవార్డు కౌన్సిలర్ మురళీసాగర్ కోరారు. ఈ మేరకు బుధవారం పుర కార్యాలయంలో కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. 19వవార్డులో ఎండలు తీవ్రతరమై నీటి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలుగా సమస్యలను పరిష్కరించాలని పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. వేసవికాలంలో మంచి నీటిఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
పాఠశాలలో ఉగాది సంబురాలు
పాన్గల్: మండల కేంద్రం ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం ఉగాది పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉగాది పచ్చడిని తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. జీవితంలో కష్టసుఖాలు సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను సూచిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్, హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం హానికరం కొత్తకోట రూరల్: మత్తు పదార్థాల వినియోగం హానికరమని.. జీవితాలు నాశనం అవుతాయని కొత్తకోట ఎకై ్సజ్ సీఐ కరుణ అన్నారు. బుధవారం మండలంలోని రాయినిపేటలో మత్తు పదార్థాల నివారణపై ఎకై ్సజ్ ఎస్సైలతో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల విక్రయం, వినియోగం చట్టపరంగా నేరమని, అలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఎకై ్సజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారం ఉంటేనే మత్తు నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో మత్తు పదార్థాలపై నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు భాస్కర్రెడ్డితో పాటు గ్రామస్తులు, యువకులు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం సరికాదు
● అధికారులు పని చేయకపోతే సెలవుపై వెళ్లండి ● పుర అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిటౌన్: తాగునీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అధికారులు ఏ విషయం అడిగినా పొంతన లేని సమాధానాలు, నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యోగం నుంచి తొలగించేంత వరకు వెనుకాడబోనని ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం పుర కార్యాలయంలో చైర్పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన తాగునీటి సరఫరాపై అత్యవసర సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై మాట్లాడారు. అధికారులు తాగునీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ వద్దకు వచ్చే ప్రజలకు కౌన్సిలర్లు, తాను ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఇక్కడ పనిచేసిన అధికారి కార్యాలయంలో ఉండాల్సిన దస్త్రాలు తీసుకెళ్తే ఏం చేస్తున్నారని.. తక్షణమే కేసు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. చార్జ్లిస్ట్ ఇవ్వకుండా వెళ్తే ప్రస్తుతం ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు పద్ధతి మార్చుకోకపోతే సెలవుపై వెళ్లాలని హితవు పలికారు. పుర చైర్పర్సన్ ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా అధికారులు అందుబాటులో ఉండటం లేదని, కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని, ఆస్తిపన్ను వసూలు వివరాలు ఆమెకు తెలియజేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా పుర కార్మికులను డ్రైవర్లుగా, ఇంట్లో పని మనుషులుగా, ఫాంహౌస్లో పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని, ఎక్కడ పని చేయాల్సిన వాళ్లు అక్కడే పని చేయాలన్నారు. కాంట్రాక్టర్లు ఎవరెవరు ఎంత పని చేశారు? ఏ మేరకు పనులు పెండింగ్లో ఉన్నాయి అనే విషయాలను సోమవారంలోగా తనకు అందించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎక్కడ ఏ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో అవసరమైన ప్రతిపాదనలు కౌన్సిలర్లు ఇవ్వాలన్నారు. మోటార్ల మరమ్మతుకు ముగ్గురు కాంట్రాక్టర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి 11 వార్డులకు ఒకరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. -
చిన్నారికి అరుదైన వ్యాధి
పాన్గల్: ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన వయస్సులో అరుదైన స్వైన్ప్లూ వ్యాధితో పోరాడుతున్న ఓ చిన్నారి దీనగాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం నిజామాబాద్ (మంగళ్లపల్లి)కి చెందిన వరలక్ష్మి, మద్దిలేటి కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. వారి రెండో కుమారుడు రిషికేష్ (5) పదిరోజుల కిందట అనారోగ్యానికి గురికాగా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో అటు నుంచి హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి అరుదైన స్వైన్ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ప్రత్యేక వైద్యం అవసరమని.. చికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలుపడంతో తమ కుమారుడిని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయంలో పడిపోయారు. చికిత్సకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీలు, ఆరోగ్యశ్రీ పథకాలు వర్తించవని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. రూ.5 లక్షలు అప్పుచేసి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రోజుకు రూ.50 వేలకు పైగా ఖర్చవుతుందని.. దాతలు, సేవాసంస్థలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించి తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని పేద కుటుంబం వేడుకుంటోంది. సాయం చేయాల్సిన దాతలు బాలుడి తల్లిదండ్రుల సెల్నంబర్లు 93986 68985, 93926 54657 సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆంగ్ల నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి వనపర్తిటౌన్: నేటి టెక్నాలజీతో విద్యార్థులు ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చని, విద్యార్థులు ఆంగ్లం నేర్చుకొని సాంకేతికతపై శ్రద్ధ పెడితే దేశం ప్రపంచంలో అభివృద్ధి దేశాలకు ధీటుగా పోటీ పడి నెగ్గుతుందని ఆంగ్ల ఉపన్యాసకుడు డాక్టర్. ఎండీ మహబూబ్ పాషా అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (కో–ఎడ్) కళాశాలలో ఇంగ్లిస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎక్ట్సెన్షన్ లెక్చరర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఆంగ్లభాష ప్రాముఖ్యతతో పాటు నేటి టెక్నాలజీ ప్రభావాన్ని విద్యార్థులు పరిశీలించి ప్రపంచం ఎలా ముందుకెళ్తుందో గ్రహించాలన్నారు. ఏఐ ఆధారిత సాధనాలు విద్యార్థులకు వ్యక్తిగతంగా సహాయం చేస్తూ, వారి వ్యాకరణ దోషాలను సరిచేసి, సరైన వ్యాఖ్య నిర్మాణాన్ని నేర్పిస్తున్నాయన్నారు. అంతకుముందు ఉపన్యాసకుడు ఎండీ మహబూబ్ పాషాను కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ దామ్సింగ్, లెక్చరర్ మద్దిలేటి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ● చికిత్సకు రూ.30 లక్షలు అవుతుందన్న వైద్యులు ● దాతల సాయానికి ఎదురుచూపులు -
గ్యాస్ కొరత నివారణలో మోదీ ప్రభుత్వం విఫలం
పాన్గల్: దేశంలో నెలకొన్న వంటగ్యాస్ కొరతను నివారించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అన్నారు. దేశంలో వంటగ్యాస్ కొరత, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులపై సోమవారం పాన్గల్లోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంటగ్యాస్ సంక్షోభం నుంచి దేశ ప్రజలను రక్షించడంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వంటగ్యాస్ కొరతను నివారించాలని.. లేనిచో ప్రజలతో కలిసి గ్యాస్ గోదాంలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా, మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్, వెంకటయ్య, భగత్, సర్పంచులు నిరంజన్, జంబులయ్య, ఉపసర్పంచ్ బాలునాయక్, రాము, దేవేందర్, కమలాకర్ పాల్గొన్నారు. -
బైపాస్పై ఆశలు
జడ్చర్ల: జడ్చర్లకు బైపాస్ మంజూరుపై ఆశలు చిగురిస్తున్నాయి. జడ్చర్ల పట్టణ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించిన బైపాస్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం పంపే కబురు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న జడ్చర్ల పట్టణం గుండా ప్రయాణం నరకప్రాయంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు జడ్చర్ల దాటితే సరి అన్న ఆందోళనలో ప్రయాణాలు సాగిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం కూడా అడ్డదిడ్డంగా ఉండడంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారులు ఇరుగ్గా ఉన్నాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు.. రహదారుల వెడల్పునకు ఎక్కడా పొంతన లేక అడుగడుగునా ట్రాఫిక్తో నిత్యం సతమతమవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి–44, ఇంకోవైపు ఎన్హెచ్–167తోపాటు రాష్ట్రీయ రహదారులు సైతం పట్టణం నడిబొడ్డుగుండా వెళ్తున్నాయి. వీటికి తోడు రైల్వే మార్గం కూడా ఉండడంతో రాకపోకలు అంత సునాయసంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రైల్వే మార్గం కారణంగా రెండు ప్రాంతాల రాకపోకలు సిగ్నల్గడ్డ వద్ద ఉన్న సింగిల్ బ్రిడ్జి మీదుగా మాత్రమే దాటే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాగే జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఎన్హెచ్–44పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర సైతం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఇలా అనేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి పాలకవర్గాల నుంచి అనుకూల ప్రకటనలు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్తో సతమతం.. జడ్చర్ల మీదుగా ఒక్క హైదరాబాద్కు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర తదితర ఉత్తర, దక్షిణ భారతం వైపు భారీ సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే జడ్చర్ల పట్టణం గుండానే అది కూడా సింగిల్ రోడ్డుగా ఉన్న ఒక చిన్నపాటి రైల్వే వంతెనపైనే రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. కాగా ఇటీవల జాతీయ రహదారి–167 విస్తరణ పనులలో భాగంగా ఒకవైపు సింగిల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయగా.. మరోవైపు బ్రిడ్జి విస్తరణ పనులు నిలిచిపోవడంతో గుంతలమయంగా మారిన రహదారిపైనే రాకపోకలు సాగుతున్నాయి. వనపర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాలకు సైతం ఇదే రహదారి కీలకంగా ఉంది. జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులు సిగ్నల్గడ్డ మీదుగానే సాగుతుండడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీంతో గంటల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రజలు బైపాస్ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం వ్యూఈ నెలాఖరులోగా.. జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా ఉంది. అయితే గత బీఆర్ఎస్ పాలనలో బైపాస్ రోడ్డుకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపాదించినా కార్యాచరణ రూపొందలేదు. తాజాగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్గడ్కరీకి ప్రతిపాదించడంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెలాఖరులోగా బిడ్డింగ్ ఓపెన్ చేసి డీపీఆర్ బాధ్యతలను అప్పగించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ నెలాఖరులోగా డీపీఆర్ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జడ్చర్ల బైపాస్తోపాటు జాతీయ రహదారి–167కి సంబంధించి రెండు వరుసలుగా ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలన్న ప్రతిపాదనలకు కూడా డీపీఆర్ చేయనున్నారు. దీనికి సంబంధించి జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారి–167ని అనుసరించి నక్కలబండతండా మీదుగా మల్లెబోయిన్పల్లి, చిట్టింబోయిన్పల్లి మధ్యగా జాతీయ రహదారి–44 మీదుగా మరికల్, నాగసాల గ్రామాల సమీపం నుంచి చర్లపల్లి మీదుగా ఆల్వాన్పల్లి, గంగాపూర్ గ్రామాల పరిధిలోని జాతీయ రహదారి–167ని తాకేలా ప్రతిపాదనలు నివేదించారు. అయితే డీపీఆర్ ఆయా ప్రతిపాదనల మేరకే చేపడుతారా.. మరేమైనా కొత్తవి తెరపైకి వస్తాయా అన్నది వేచిచూడాల్సి ఉంది. డీపీఆర్కు రంగం సిద్ధంతో ముందడుగు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నీ సవ్యంగా జరిగితే జడ్చర్ల మరింత అభివృద్ధి సమాచారం అందింది.. జడ్చర్లకు బైపాస్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి డీపీఆర్ తయారీ టెండర్లకు సంబంధించి సమాచారం అందింది. బైపాస్తో జడ్చర్లలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎంపీ డీకే అరుణ సహకారంతో బైపాస్ సాధనకు చిత్తశుద్ధితో కృషిచేస్తాం. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● బాలికా విద్యకు ప్రోత్సాహం అందించాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: మహిళలు అన్ని రంగాల్లో రాణించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం ఐడీఓసి సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎస్పీ సునీతారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి చెందినట్లు అని అన్నారు. మహిళలకు ఆరోగ్యం ఎంతో కీలకమని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా సమాజంలో బాల్యవివాహాల నిర్మూలనకు నడుం బిగించాలన్నారు. బాల్యంలోనే వివాహం చేయకుండా వారిని ఉన్నత చదువులు చదివించాలని, విద్యతోనే అందరికీ సమాజంలో గౌరవం పెరుగుతుందని తెలియజేశారు. చదువులో బాలికల డ్రాప్ అవుట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించి బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వనజ, రాములమ్మలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల భద్రతకు ఎంతో కృషి చేస్తుందన్నారు. పోలీస్శాఖలో మహిళా ఉద్యోగుల పాత్ర పెరిగిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులు, మంచి ప్రతిభ కనబరిచిన మహిళలను కలెక్టర్, ఎస్పీ శాలువాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు.. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యనాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కాగా, ప్రజావాణి కార్యక్రమంలో 34 దరఖాస్తులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాటిని వినియోగంలోకి తెచ్చే దిశగాా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. టౌన్ హాల్ నిర్మాణానికి నిధులు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ విభాగాలు సమన్వయంతో పనిచేసి.. నెల రోజుల్లోగా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అదే విధంగా నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని కూడా ఏప్రిల్ 1వ తేదీలోగా వినియోగంలోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తరలింపునకు నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, జీసీడీఓ శుభలక్ష్మి, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్ఎంఓ రెడ్డి కుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు సోమవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాల్లో 844 మంది విద్యార్థులకు గాను 790 మంది పరీక్షలకు హాజరు కాగా.. 54 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీవీ రామన్, రావూస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సేవాగుణం ఉండాలి మక్తల్: సమాజంలో ప్రతి ఒక్కరికీ సేవాగుణం ఉండాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన బురాన్ సమకూర్చిన దుస్తులను మంత్రి చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాదృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు కొత్త దుస్తులు అందించిన బురాన్ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, వాకిటి హన్మంతు, సరిత, రహీం పటేల్, శ్రీవిద్య, చెన్నమ్మ, జుట్ల అనిత, మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆశావర్కర్లకు రూ.18వేల వేతనం ఇవ్వాలి వనపర్తి రూరల్: ఆశావర్కర్లకు రూ. 18వేల పిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో 48 గంటల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, కార్యదర్శి మండ్ల రాజు, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి బుచ్చమ్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆశావర్కర్లకు పిక్స్డ్ వేతనం నిర్ణయించకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 1,500లను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పారితోషికంతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అదే విధంగా 6 నెలల పీఆర్సీ ఏరియల్స్ చెల్లించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆశావర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బిలి నిక్సన్, రాములు, గిరిజమ్మ, దేవమ్మ, చెన్నమ్మ, అనిత, ఇందిరా, తార, గోవిందమ్మ, లత, శాంతమ్మ, బాలకృష్ణమ్మ పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడులు గోపాల్పేట: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం గోపాల్పేట రైతువేదికలో డీఏఓ ఆంజనేయులుగౌడ్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతులు సహజసిద్ధంగా లభించే మక్కిన పశువుల ఎరువులు, జీవామృతం, నీమాస్త్రం, దశపత్రి తదితర కషాయాలతో పంటల్లో చీడపీడలను నివారించవచ్చన్నారు. ఏటా ఒకే రకం పంటను వానాకాలం, యాసంగి సీజన్లో పండించకూడదని.. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. -
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక
● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ వర్క్స్ ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం: 4 టీఎంసీలు మొత్తం విడతలు : 3మంజూరైనవి : రూ.1,400 కోట్లు వ్యయం : రూ.2,945 కోట్లు కొడంగల్ పనులు ప్రారంభమయ్యాయి. స్టేజీ–1 కింద మక్తల్ మండలంలోని కాట్రేవులపల్లి నుంచి ఊట్కూర్ వరకు, స్టేజీ–2 కింద ఊట్కూర్ మండలంలోని బాపూర్ నుంచి కానుకుర్తి వరకు పనులను డిసెంబర్ 2027 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 2 ప్యాకేజీలకు సంబంధించి రూ.2,945 కోట్లతో భూసేకరణ, కాల్వ, పంప్ హౌస్లు, రిజర్వాయర్ల పనులు రాఘవ, మెగా కన్స్ట్రక్షన్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. – శ్రీధర్, ఎస్ఈ, ఇరిగేషన్, మహబూబ్నగర్ -
గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం
అమరచింత: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలపేతం చేయడానికే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివాసేనారెడ్డి అన్నారు. సోమవారం అమరచింతలోని పార్టీ కార్యాలయ ఆవరణలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం నాగరాజ్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. గ్రామాల్లో సర్పంచులతో పాటు పార్టీ అధ్యక్షుడికి సైతం అదే స్థాయిలో అధికారాలు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ఎవరికి అందించాలనే పూర్తి స్వేచ్ఛ గ్రామ పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం నాగరాజ్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తామన్నారు. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్చైర్పర్సన్ రాధ అరుణ్, పార్టీ నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, కమలాకర్గౌడ్, రవికాంత్, శ్యామ్, లక్ష్మీకాంత్రెడ్డి, తౌఫిక్, హనుమంతు నాయక్ పాల్గొన్నారు. -
‘పేదలను పట్టించుకోని బీఆర్ఎస్’
గోపాల్పేట: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని.. పేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు, భూములు పంపిణీ చేస్తామని మోసం చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మండలంలోని ఏదుట్ల, తాడిపర్తి, పొలికెపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తమ సొంతింటి కల సాకారమైందని, నిర్మాణాలు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల పార్టీ అని, వారి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితం విద్యుత్ తదితర ఎన్నో పథకాలు అమలు చేస్తోందని వివరించారు. భవిష్యత్లో మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పొలికెపాడులో ప్రాథమిక ఉపకేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయన వెంట మండల నాయకులు సత్యశిలారెడ్డి, తాడిపర్తి సర్పంచ్ లోకారెడ్డి, పొలికెపాడు సర్పంచ్ బంగారయ్య, ఆయా గ్రామాల ముఖ్య నాయకులు ఉన్నారు. కాంగ్రెస్లో చేరిక.. మండలంలోని పొలికెపాడు సర్పంచ్ బంగారయ్య, ఉపసర్పంచ్ జంపన్నతో పాటు మరో 60 మంది కాంగ్రెస్పార్టీలో చేరగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథ కాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. -
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
వనపర్తి రూరల్: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దగూడెం గ్రామంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, గ్రామస్తులు, యువతతో కలిసి రహదారులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలు అభివృద్ధి బాటలో నడిచినప్పుడే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుంటుందని తెలిపారు. వేసవిలో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామంలోని రోడ్లు, పాఠశాల, దేవాలయ ఆవరణలు, వార్డులను శుభ్రం చేసిన విద్యార్థులను అభినందించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులు శిరీష బాలకృష్ణకు కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కార్ సొంత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారి కల నెరవేస్తుందన్నారు. సర్పంచ్ పుష్పలత శివకుమార్, సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, ఉపసర్పంచ్ పోలికమ్మ, మాజీ సర్పంచ్ కొండన్న, నాయకులు శేఖర్రెడ్డి, రొయ్యల రమేష్, విష్ణువర్ధన్రెడ్డి, భాస్కర్రెడ్డి, ఉండాల రాముడు, శివయ్య పాల్గొన్నారు. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్
● సమస్యలు విన్నవిస్తూ సీఎంకు లేఖలు ● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక ఒకసారి మాత్రమే రైతులకు పెట్టుబడి సాయం అందించి వరుసగా మూడు సీజన్లు మొండిచెయ్యి చూపిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. రూ.9 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని.. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ నేతల్లో విశ్వసనీయత కొరవడిందన్నారు. నియోజకవర్గంలో పాలకులు, అధికారులు ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. పోలీసులు కూడా నాయకుల కొమ్ముకాస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీ సునీతరెడ్డికి స్వయంగా కలిసి వివరించామని చెప్పారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని జిల్లాకేంద్రంలో వైద్య, నర్సింగ్ కళాశాల, ఆస్పత్రి కోసం 50 ఎకరాలు కేటాయిస్తే.. అందులో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేసేందుకు సన్నాహాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దూరదృష్టితో రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తే ఉద్దేశపూర్వకంగా పనులు నిలిపివేశారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి హత్యకేసును పోలీసులు ఎందుకు ఛేదించడం లేదని.. ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. పెబ్బేరు సంత స్థల వివాదాన్ని నెలరోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదన్నారు. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం, పెబ్బేరు సంత స్థల వివాదాల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ చేపడితే.. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. రామన్నగట్టు రిజర్వాయర్కు శంకుస్థాపన చేసి నేటికీ పనులు ప్రారంభించలేదని, కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే డీ–5, డీ–8 కాల్వలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో గద్వాల, వనపర్తికి కలిపి ఇక్కడే సీఈ కార్యాలయం ఏర్పాటు చేశామని.. కనీసం అధికారులు వస్తున్నారా లేదా అనే విషయాన్ని సైతం పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు నందిమళ్ల అశోక్, లక్ష్మారెడ్డి, ,రఘుపతిరెడ్డి, భీమన్న, తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిన్నంబావి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని కొప్పునూరులో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పప్పుశనగ పంటను ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.5,875కు కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం ముఖ్యమని.. తేమశాతం 14 శాతంలోపే ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్, విద్యాసాగర్రావు, చిదంబర్రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, తేజారెడ్డి, సర్పంచ్ బిచ్చన్న, భాస్కర్, గూడెం సుధాకర్, జ్యోతిగౌడ్, రాజుకుమార్, ఉమేష్ నాయుడు, యువజన కాంగ్రెస్ నాయకులు విభీషణ్, కత్తి జాని తదితరులు పాల్గొన్నారు. -
జనగణనకు సన్నద్ధం
వనపర్తి: జనగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2021లోనే జనగణన జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ ప్రక్రియ ఐదేళ్లు ఆలస్యంగా ప్రారంభమైంది. జనాభా లెక్కల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసే అవకాశాలు ఉంటాయి. భారత ప్రభుత్వం ఈ ప్రక్రియను తొలిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో రెండువిడతల్లో నిర్వహించనుంది. తొలివిడతలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఇళ్లు, కుటుంబాలను గుర్తిస్తారు. అనంతరం గుర్తించిన ఇళ్లలో కుటుంబాల సంఖ్య ఆధారంగా బ్లాక్లుగా విభజించి జనాభా లెక్కలను సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 11 నుంచి క్షేత్రస్థాయిలోకి.. తొలివిడత మే నెల 11 నుంచి జూన్ 9 వరకు 30 రోజుల పాటు ఇళ్లు, కుటుంబాలు, జీవన స్థితిగతుల వివరాల సేకరణకు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఇళ్లు, కుటుంబాలతో పాటు మరో 34 అంశాలను సేకరించి సీఎంఎంఎస్ పోర్టల్లో నమోదు చేయనున్నారు. మూడురోజుల పాటు శిక్షణ.. మండలాల వారీగా సెన్సెస్ అధికారులు, క్లర్క్లుగా నియమించిన 60 మంది అధికారులు, సిబ్బందికి మూడురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభం కాగా.. కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై జనాభా లెక్కల ప్రక్రియపై కీలక సూచనలు చేశారు. 15 ఏళ్ల తర్వాత నిర్వహణ.. పూర్తిగా డిజిటల్ విధానంలో... జిల్లాలో రెండు విడతల్లో వివరాల సేకరణ తొలి విడత ఇళ్లు, కుటుంబాలు మలి విడతలో జనగణనకు కసరత్తు ప్రారంభమైన ఎన్యూమరేటర్ల శిక్షణ బాధ్యతగా పనిచేయాలి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే జనగణన ప్రక్రియలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని ప్రక్రియల్లో నిబంధనలపై అవగాహన కోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. – ఆదర్శ్ సురభి, కలెక్టర్ -
హైరానా..!
జూరాల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం గద్వాల: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సేఫ్టీని కాపాడాలి.. ఈ మేరకు డ్యాంకు సమీపంలో మరో బ్రిడ్జి నిర్మించాలన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన సమీక్షలో సైతం చర్చ జరగడం.. దీనిపై సమగ్ర వివరాలను ఆ శాఖ అధికారులు మంత్రికి నేరుగా వివరించడం.. ఎంపీ డీకే అరుణ డ్యాం సేఫ్టీని కాపాడాలని సమీక్షలో గట్టిగా కోరడం వంటి పరిణామాలతో సమగ్ర పరిశీలనకు ఆ శాఖ కార్యదర్శి త్వరలోనే జూరాలకు రానున్నారు. దీంతో ప్రస్తుతం గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మధ్యలో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి భవితవ్యం గందరగోళంగా మారింది. ఇదే క్రమంలో ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతుండటం పెద్దఎత్తున చర్చకు దారితీసింది. భద్రతే.. ప్రధానం 2021–డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం ఎక్కడైనా పాజెక్టుకు సంబంధించి డ్యాం భద్రతే ప్రధానం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించిన బ్రిడ్జి సమీపంలో కాకుండా డ్యాంకు దూరంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే, టెండర్లు పూర్తయ్యి సివిల్ పనులు సైతం మొదలయ్యాయి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం డ్యాం సేఫ్టీ చట్టానికి విరుద్ధంగా ఉంది. ఈ చట్టం ప్రకారం డ్యాం సేఫ్టీ పర్యవేక్షణ బాధ్యత ఇరిగేషన్ శాఖదే. వరద వచ్చే ముందు, వరద వచ్చిన తర్వాత డ్యాం భద్రతపై సమగ్ర నివేదిక ఇరిగేషన్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని కారణంగానే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) ఇవ్వడానికి తర్జనభర్జన పడుతున్నారు. స్థల మార్పిడి కారణంగా.. వాస్తవానికి చాలాకాలంగా జూరాల డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్యాంకు సమీపంలో అదనంగా బ్రిడ్జి నిర్మించాలని అధికారులు రూ.వంద కోట్లతో అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గతేడాది వానాకాలంలో జూరాల గేట్ల రోపులు తెగిపోయి ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం రూ.వంద కోట్లతో నూతనంగా మరో బ్రిడ్జి నిర్మి స్తామని ప్రకటించారు. ఇందుకు గతంలో ఇరిగేషన్శాఖ అధికారులు నివేదించిన స్థలంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూరాల మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు సైతం మొద లు కాగా.. తాజాగా వివాదం చెలరేగింది. డ్యాం స్టేఫీ ప్రధానం అంటున్న ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు మూడు, నాలుగు రోజుల్లో రానున్న ఆ శాఖ కార్యదర్శి పైపెచ్చు ఆర్అండ్బీ నిర్మించే బ్రిడ్జిపై అభ్యంతరం లేదని స్పష్టీకరణ -
హామీలన్నీ నెరవేరుస్తాం
వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. ఉపాధిహామీ నిధులు రూ.16.50 లక్షలతో గ్రామంలో సీసీ రహదారి పనులు చేపడుతున్నామని.. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎస్సీ సబ్ప్లాన్ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రహదారి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారి రాములు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ, వార్డు సభ్యులు చింతల రవికుమార్, శ్రీకాంత్, ఆంజనేయులు, సాయిప్రసాద్, మల్లేష్, వెంకటయ్య, పార్టీ సీనియర్ నాయకులు వెంకటరాజయ్య, అఖిల్పాషా, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. చిరు వ్యాపారులు, ఆర్టీసీ అధికారుల వాగ్వాదం వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం చిరు వ్యాపారులు, ఆర్టీసీ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బస్టాండ్లోకి బస్సులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ సిబ్బంది కేసీ శెట్టి, కృష్ణయ్య, మహ్మద్ జాన్రాజ్ తదితరులు రహదారి పక్కన ఉన్న కూరగాయలు, పండ్ల విక్రయ దుకాణాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బస్సుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఖాళీ చేయాలని వారం రోజులుగా చెబుతున్నా వినిపించుకోవడం లేదని.. చివరకు చేసేది లేక తొలగించాల్సి వచ్చిందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. చిరు వ్యాపారులకు కౌన్సిలర్లు ఏర్పుల రవి, మాజీ ఎంపీపీ పద్మమ్మ మద్దతుగా నిలిచి అధికారులతో వాదనకు దిగారు. ఒకదశలో ఆర్టీసీ సిబ్బంది రోడ్డుపై కూరగాయలు పారబోయడం, వ్యాపారులు ఆందోళన దిగడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ‘పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి’ వనపర్తి రూరల్: పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం పెబ్బేరు పుర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుమిత్రాఎల్లారెడ్డి, కౌన్సిలర్లతో కలిసి కార్మికులకు ప్రభుత్వం తరఫున నూనెలు, సబ్బులు పంపిణీ చేసి మాట్లాడారు. నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న కార్మికులకు నూనెలు, సబ్బులే కాకుండా వారికి అవసరమయ్యే గ్లౌజులు, బూట్లు కూడా క్రమం తప్పకుండా అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జమ్ములమ్మ, భాగ్యలక్ష్మి, పర్వీన్, హరిశంకర్నాయుడు, మన్యం, శివ తదితరులు పాల్గొన్నారు. -
చేపలు విలవిల!
వేసవిలో ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం ● జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణ సాధ్యం ● అవగాహన కల్పిస్తామంటున్న మత్స్యశాఖ అధికారులు మృతిచెందిన చేపలు తొలగించాలి.. చెరువులో చనిపోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా గోతి తీసి పూడ్చిపెట్టాలి. వెంటనే సున్నమును హెక్టారుకు 100 నుంచి 250 కిలోల మోతాదులో చల్లాలి. అప్పటికీ అదుపులోకి రాకుంటే నీటినాణ్యత పెంచే రసాయనాలు అనగా బీకేఎస్ను హెక్టార్కు లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యలతో నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరాన్న జీవులు చనిపోతాయి. ప్రాణ వాయువు పెంచడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేయాలి. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే వేసవిలో చేపలు చనిపోకుండా ఉంటాయి. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ అమరచింత: జిల్లాలోని చెరువులు, కుంటలతో పాటు రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. వేసవిలో నీరు వేడెక్కి ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం ఉంటుంది. తగిన ముందస్తు చర్యలు చేపడితే చేపలు మృతి చెందకుండా నివారించే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈసారి రాయితీ చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో ఎదుగుదల లేక మత్స్యకారులు ఆందోళన చెందుతున్న తరుణంలోనే ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉన్న చేప పిల్లలను ఎలా బతికించుకోవాలని సతమతమవుతున్నారు. వేసవిలో అధిక ఉష్ణ్రోగ్రత, చేపల సాంద్రత అధికంగా ఉండటం, నీరు క్రమేపి తగ్గడంతో నీటిలో ప్రాణవాయువు కొరత, నాణ్యత తగ్గిపోవడం తదితర కారణాలతో చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటాయి. రోగకారక సూక్ష్మజీవులతో వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున మత్స్యకారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. నిషితంగా పరిశీలిస్తే.. చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలను రోజు గమనిస్తూ ఉండాలి. మచ్చుకు కొన్ని చేపలు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావంతో పాటు మొప్పల రంగు, పై జిగురు లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన తర్వాత సంబంధిత మత్స్యశాఖ అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ చర్యలు సత్వరమే చేపడితే ఆర్థిక నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు. -
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం సరికాదు
● ప్యాకేజీ–16 కాల్వ పనుల్లో జాప్యంపై ఆగ్రహం ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి: కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఏదుల, పాన్గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీపీఓ, డీఎల్పీఓలతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ, ఏఈలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఏయే పనులకు ఎంత వెచ్చించాలో వివరిస్తూనే గ్రామాభివృద్ధిలో అధికారుల పాత్ర అత్యంత కీలకమన్నారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలు, కాల్వల లైనింగ్, డిస్ట్రిబ్యూషన్ పనుల పురోగతిపై చర్చించారు. ప్యాకే జీ–16 కాల్వ పనుల్లో జరిగిన అవకతవకలపై సీఈ, ఎస్ఈ స్థాయి అధికారులను నిలదీశారు. పను ల్లో నాణ్యత లోపించడం, నిధుల దుర్వినియోగంపై అస హనం వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్యాకేజీ–16కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆదేశిస్తూ త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
వనపర్తి టౌన్: జిల్లాలో శనివారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. మొదటిరోజు జరిగిన తెలుగు, ఉర్దూ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 99.8 శాతం మంది విద్యార్థు లు హాజరయ్యారు. మొత్తం 37 కేంద్రాల్లో 7,219 మంది విద్యార్థులకుగాను 7,206 మంది పరీక్షల కు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరయ్యారు. జి ల్లాకేంద్రంలోని అనూస్ పాఠశాల, చాణక్య పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, గోపాల్పేట మండలంలోని పరీక్ష కేంద్రాలను సహాయ పరీక్షల అధికారి గణేష్కుమార్ తని ఖీ చేశారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. అరగంట ముందు నుంచే విద్యార్థులను తనిఖీ చేసి అనుమతించడంతో ఎక్కడా ఎవరు అసౌకర్యానికి గురికాలేదు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్యసిబ్బందితో పా టు తాగునీరు, విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
సోదరభావానికి ప్రతీక రంజాన్
వనపర్తి: పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని.. ముస్లింలు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి కోరారు. రంజాన్ మాసం పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్కు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపి పలువురికి రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యత పెంపొందించే పండుగగా రంజాన్ ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఉపవాసం ద్వారా ఆత్మ నియంత్రణతో పాటు పేదలపై సానుభూతి పెంపొందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సహకారంతో సమాజ అభివృద్ధికి కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజహిద్, ముస్లిం మతపెద్దలు అఫ్జలుద్దీన్, రహీం, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు పెరుగుతున్నాయి..
వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతి రోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత భీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం. – అశోక్ వర్ధన్రాజు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరిటెండెంట్ తూకాల్లో మోసాలు తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – మోహన్ రెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా తరచుగా తనిఖీలు చేపట్టాలి.. వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి. – వర్దం సైదులు, అచ్చంపేట ● -
యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
పాన్గల్: యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. మండలంలోని దావాజిపల్లిలో ఉన్న ఎన్వీ ట్రేడర్స్ దుకాణంలో యూరియా బస్తాలను అధిక ధరకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, స్టాక్ నిల్వను పరిశీలించారు. రూ.270 బస్తాను రూ.320కి విక్రయిస్తున్నట్లు రుజువు కావడంతో దుకాణ యజమానికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఏడీఏకు మెమో జారీ చేశారు. యజమాని ఇచ్చే సమాధానం, మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే నివేదికను కలెక్టర్కు అందజేసి ఆయన ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని దుకాణాల్లో యూరియాను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని, అధిక ధరకు విక్రయిస్తే దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట ఏఓ మణిచందర్ తదితరులు ఉన్నారు. -
‘పది’ పరీక్షలు.. పకడ్బందీ ఏర్పాట్లు
● నేటి నుంచి ప్రారంభం ● ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు ● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి వనపర్తిటౌన్: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 వరకు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 7,212 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ఇందులో బాలురు 3,577 మంది, బాలికలు 3,635 మంది ఉన్నారు. వీరితో పాటు ప్రైవేట్ విద్యార్థులు 16 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 37 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 25 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో, 12 కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. అత్యధికంగా జిల్లాకేంద్రంలో 9, కొత్తకోటలో 5, పెబ్బేరు 4, ఆత్మకూర్లో 3, వీపనగండ్ల, చిన్నంబావి, రేవల్లిలో ఒక్కోటి, మిగతా మండలాల్లో రెండేసి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. ప్రశ్నపత్రాలను వాటి ముందే నిర్దేశిత సమయంలో తెరవనున్నారు. కేంద్రాల్లోకి సీఎస్, డీఓల మొదలుకొని ఎవరికి సెల్ఫోన్ అనుమతించ లేదు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో శుక్రవారం హాల్టికెట్ నంబర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, సహాయ పరీక్షల అధికారి గణేష్కుమార్ పరిశీలించి సీఎస్, డీఈలకు పలు సూచనలు చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బెంచీలు, తాగునీరు, పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ, పుర పారిశుద్ధ్య కార్మికులతో ఆవరణలను శుభ్రం చేయించారు. విద్యార్థులను అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఉంటుందని.. దాటిన తర్వాత అనుమతించమని అధికారులు తెలిపారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ వాచ్లను అనుమతించమని చెప్పారు. పరీక్షల నిర్వహణకుగాను 375 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. సిట్టింగ్ స్క్వాడ్లు, పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో కలిపి ముగ్గురి చొప్పున రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. పరీక్ష సమయంలో కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కేంద్రంలో వైద్య సేవల కోసం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండనున్నారు. గురుకుల విద్యార్థులు 996 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 115 -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. చివరిరోజు రెండో సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 5,555 మంది విద్యార్థులకుగాను 5,389 మంది విద్యార్థులు హాజరుకాగా.. 166 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,705 మందికిగాను 4,590 మంది హాజరుకాగా.. 115 మంది పరీక్ష రాయలేదు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 850 మందికిగాను 799 పరీక్ష రాయగా.. 51 మంది గైర్హాజరయ్యారు. డీఐఈఓ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులను తనిఖీ చేస్తున్న తీరును పరిశీలించారు. స్కాలర్స్, విజ్ఞాన్, జాగృతి, వాగ్దేవి, సీవీ రామన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. -
డిమాండ్ నోటీసులు అందించాం..
బీడీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ చిన్నచింతకుంటలో భారీ ప్రదర్శన నిర్వహించి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు వేతన పెంపు డిమాండ్ నోటీసులు అందించాం. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలని కోరాం. దీంతోపాటు పీఎఫ్, ఈపీఎఫ్ ప్రతి కార్మికుడికి వర్తింపచేజేయాని విన్నవించాం. – రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం, అమరచింత నెలలో 20 పనిదినాలు ఉండగా.. 15 వేల బీడీలు తయారు చేస్తున్నాం. కుటుంబ పోషణ బీడీల తయారీపైనే ఆధారపడింది. వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లిస్తున్నారు. కూలి సరిపోక పోషణ భారంగా మారింది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా రూ.400 చెల్లిస్తే బాగుంటుంది. – సులోచనమ్మ, బీడీ కార్మికురాలు, అమరచింత చాలీచాలని కూలితో ఇబ్బందులు పడుతున్నా ం. యాజమాన్యం వెంటనే ధరలు పెంచాలి. అలాగే జరిమానాను పూర్తిగా రద్దు చేయాలి. పొద్దంతా కూర్చొని తయారుచేసిన వెయ్యి బీ డీలకు రూ.400 చెల్లించాలి. లేనిపక్షంలో కార్మిక సంఘంతో కలిసి ఆందోళన చేపడతాం. – సరోజ, బీడీ కార్మికురాలు, మస్తీపురం ● -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
కొత్తకోట: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పుర కేంద్రంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, 2కే రన్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు రూపొందించబడిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని.. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. చదువుకునే వయస్సులో చెడు వ్యసనాల బారిన పడకుండా క్రమశిక్షణ, మంచి ఆశయాలతో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా 2025 ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగంగా చేపడుతున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు 67 శాతం పూర్తయిందని, పెండింగ్ పని త్వరగా పూర్తి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వనపర్తి మండలంలో మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని.. బూత్ లెవల్ అధికారులు తమ బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తించాలన్నారు. పనులను నిర్లక్ష్యం చేసే అధికారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైతే వేతనాలు నిలిపివేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డి సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, తహసీల్దార్ రమేష్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వంట గ్యాస్ కొరత లేదు.. జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్, గృహ అవసరాలు, విద్యాలయాలు, ఆస్పత్రులకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని, అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల సమస్య లేదని, విద్యాలయాలు, ఆస్పత్రులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వంట గ్యాస్ను 15 రోజులకు బదులు 25 రోజులకు బుక్ చేసుకునేలా అవకాశం కల్పించామన్నారు. యాసంగి పంటల కోతలు వారం రోజుల్లో ప్రారంభం అవుతాయని.. సాగునీటి సమస్యలు ఎక్కడా ఉత్పన్నం కాలేదని చెప్పారు. తాగునీటికి సైతం ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తుగానే గోదాంలు, అవసరం మేరకు గన్నీ బ్యాగులు సమకూర్చడంపై దృష్టి సారిస్తామన్నారు. వీడియో కాన్ఫరెనన్స్లో ఎస్పీ డి.సునీతరెడ్డి, ఇరిగేషన్శాఖ సీఈ నాగేందర్, ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ కేశవరావు, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఈఈ మిషన్ భగీరథ ఎండీ అంజాద్పాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో వృద్ధుల కోసం ఏర్పాటుచేసిన డేకేర్ సెంటర్లో కావాల్సిన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని రాంనగర్లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ డేకేర్ సెంటర్ ‘ప్రణామ్’ను ఆయన సందర్శించారు. కేంద్రంలోని వసతులను పరిశీలించి అక్కడే ఉన్న పలువురు సీనియర్ సిటిజన్లతో మాట్లాడారు. వారికి అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. డేకేర్ సెంటర్ను ఉగాది నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాయితీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక 2025–26 కింద రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల షెడ్యూల్డ్ కులాల యువత ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు ఆధార్, రేషన్కార్డు, కులం, ఆదాయం, విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు, వ్యవసాయ పథకాలకు 21 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు, శిక్షణ పథకాలకు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. సంవత్సర ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదని, ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిపొందిన కుటుంబాలు అనర్హులని, ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు పత్రాలను ఎస్పీ కార్పొరేషన్ వనపర్తి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు http://obmms.cgg.gov.in వెబ్సైట్లో గా ని, కార్యాలయంలోగాని సంప్రదించాలన్నారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి పాన్గల్: గ్రామాల్లోని ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ కోరారు. పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల గుర్తింపులో భాగంగా శుక్రవారం మండలంలోని బుసిరెడ్డిపల్లి, జమ్మాపూర్లో పర్యటించి ఉపాధి కూలీలు, స్థానిక సమస్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూలీలకు ఇబ్బందికరంగా ఉన్న వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దుచేసి పాత చట్టానే పునరుద్ధరించాలన్నారు. కూలీలకు 8 వారాలకుపైగా కూలి డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి కూలీల సమస్యలు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న మండలస్థాయిలో నిర్వహించే ధర్నాకు కూలీలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెల్లరాళ్లపల్లి సర్పంచ్ జంబులయ్య, నాయకులు భీమయ్య, రాము, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ ఇంటి’ బిల్లుల కోసం లంచం డిమాండ్ అయిజ: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లు చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బోయ రంగన్న ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు చేసేందుకు లబ్ధిదారుల నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంల సమీపంలో లబ్ధిదారుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి మొదటి విడత బిల్లు చెల్లించేందుకు, తదుపరి మూడు వాయిదాలకు అంతరాయం లేకుండా బిల్లులు చెల్లించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశారని, లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఓ ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్లో జడ్జి ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.8.519 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,519, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు రూ.5,889, జొన్నలు రూ.5,273, పెబ్బర్లు రూ.4,850, ఆముదాలు రూ.6,144, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,840, కనిష్టంగా రూ.1,631, ధాన్యం హంస రూ.1,891, ఆర్ఎన్ఆర్ రూ.2,051 ధరలు పలికాయి. -
పంటలు ఎండితే అధికారులదే బాధ్యత
● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వనపర్తి టౌన్: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టులో సాగు చేసిన వరి పంటలకు సరిపడా నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారని.. ఇందుకు కారణం సాగునీటిశాఖ అధికారులేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్పార్టీ పట్టణ, మండల కార్యవర్గాల ఎన్నిక కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో వరద నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లకు తరలించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇటీవల అధికారుల సమీక్షలో కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసినట్లు అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అధికారులను హెచ్చరించారు. కాంగ్రెస్పార్టీలో నిబద్ధతగల నాయకులకు గుర్తింపు ఉంటుందని.. అందుకు ఉదాహరణ డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి ఎన్నిక అని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పనితీరు బాగుందని.. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారని, ప్రజలకు చేరువవుతున్నారని కొనియాడారు. తనకు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజావాణి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి గుర్తింపు, గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ గ్రామ, మండల, పట్టణ కమిటీల్లో నిబద్దతగల కార్యకర్తలకే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పేదలందరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్తో సీఎం రేవంత్రెడ్డికి ప్రజల్లో మంచిపేరు వచ్చిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. కార్యకర్తల కోసం తాము పని చేస్తామని.. ఎప్పుడు ఫోన్చేసినా అందుబాటులో ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పార్టీ పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. -
వ్యాధి నిరోధక శక్తి పెంపునకే టీకాలు
పాన్గల్: పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పశువులకు టీకాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు అందుబాటులో ఉండి తమ పశువులకు టీకాలు వేయించాలన్నారు. అదేవిధంగా మండలంలోని చింతకుంట, రాయినిపల్లిలో పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. సురేష్, చింతకుంట సర్పంచ్ కోట్ల రాములు, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలి ఆత్మకూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల వేతనాలు రూ.26 వేలకు పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ కోరారు. గురువారం స్థానిక కమ్యూనిటీ హెల్త్సెంటర్ వద్ద కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. స్థానిక ఆస్పత్రిని 23 నుంచి 30 పడకలకు పెంచాలని గతంలో డిమాండ్ చేయగా.. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఉత్తర్వులు వెలువరించారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు, మెడికల్ కార్మికులు ఏళ్ల తరబడి కనీస వేతనాలకు నోచుకోక వెట్టిచాకిరి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ వేతనాల్లో కోత విధిస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీని వెంటనే రద్దు చేసి జీఓ ప్రకారం వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సత్తార్, బాలరాజు, శ్రీకాంత్, అరుణ్, శైలజ, బాలకిష్టమ్మ, నాగమ్మ, పార్వతమ్మ, మైనుద్దీన్, తిరుపతమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ ఫస్టియర్ జనరల్ పరీక్షలు వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరిరోజు రసాయనశాస్త్రం, కామర్స్ పరీక్షలు జరగగా 6,503 మంది విద్యార్థులకుగాను 6,222 మంది హాజరుకాగా.. 281 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,491 మందికిగాను 5,283 మంది పరీక్ష రాయగా.. 208 మంది హాజరుకాలేదు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,012 మందికిగాను 939 మంది హాజరుకాగా.. 73 మంది రాయలేదు. డీఐఈఓ ఎర్ర అంజయ్య జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల, ఉర్దూ మీడియం, రావూస్, అభ్యాస్, త్రివేణి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే డీఈసీ బృందం కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నివేదిత, శ్రీప్రతిభ, ఆత్మకూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వికాస్, వనపర్తిలోని విజ్ఞాన్, స్కాలర్స్, సూర్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోపాల్పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పెద్దమందడి, వాగ్దేవి, సీవీ రామన్, జాగృతి కళాశాల పరీక్ష కేంద్రాలను.. సిట్టింగ్ స్క్వాడ్ బృందం కొత్తకోట, గోపాల్ పేట, వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించింది. -
మాజీ ఎంపీ చొరవతోనే కేంద్రీయ విద్యాలయం
వనపర్తి టౌన్: బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు కృషి ఫలితంగానే జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైందని.. ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్ని తానే చేశానని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు డి.నారాయణ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2025, అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని.. అందులో భాగంగానే జిల్లాకేంద్రం సమీపంలోని నాగవరం శివారులో ఏర్పాటు జరగనుందని వివరించారు. నూతన భవన నిర్మాణం జరిగే వరకు రాజపేట శివారులోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ధైర్యం ఉంటే కేంద్రీయ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, భవిష్యత్లో భవన నిర్మాణం, ఇతర అవసరాలకు ఎన్ని కేటాయిస్తుందో పూర్తి వివరాలతో బహిరంగ చర్చకు సిద్ధంగా కావాలని సవాల్ విసిరారు. రెండేళ్లయిన సొంత మండలానికి బీటీ రోడ్డు వేసుకోలేని ఎమ్మెల్యే నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెచ్చారంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బాశెట్టి శ్రీనివాసులు ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగపోగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం..
● సర్పంచ్లు, కౌన్సిలర్లు బాధ్యతగా పనిచేయాలి ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి: సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి వారి మెప్పు పొందాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కళ్యాణసాయి గార్డెనన్స్లో ’ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎన్నికై న సర్పంచులు, కౌన్సిలర్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతరెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా రోజు ఉదయం 2 గంటల పాటు 20 నుంచి 30 ఇళ్లను సందర్శించి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. రాబోయే రోజుల్లో నిర్వహించే గ్రామసభల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు రుణమాఫీ, రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్, గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. అధికారులు కూడా ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా నమోదు చేయాలని.. ఏ ఒక్క దరఖాస్తు కూడా 15 రోజులకు మించి పెండింగ్లో ఉండకూడదని ఆదేశించారు. అధికారులు జవాబుదారీగా పని చేయాలని కోరారు. స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాలి.. ప్రజాప్రతినిధులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తమ కార్యాలయాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గ్రామాలు, వార్డుల్లో నీరు, విద్యుత్ వృథాను అరికట్టాలని కోరారు. తమ పరిధిలోని పాఠశాలలు, ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లాను అన్నిరంగాల్లో ముందువరుసలో నిలపాలని కోరారు. అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఏప్రిల్లో నిర్వహించే గ్రామసభల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల బంధం దృఢంగా ఉండేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు. సమావేశంలో వనపర్తి మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత పుర చైర్పర్సన్లు మాధవి, అరుణ, శ్రీనివాస్గౌడ్, నాగమణి, జింక సువర్ణ, సర్పంచులు, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆధునిక సాగుతోనే అధిక లాభాలు
మదనాపురం: రైతులు మూస పద్ధతికి స్వస్తి పలికి శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆధునిక సాంకేతికతను జోడించి పంటలు సాగు చేపట్టినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతులు, శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు కేవీకే శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకుడు దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్’ ప్రాధాన్యం వివరిస్తూ నీటి పారుదలలో మెళకువలు పాటించాలని సూచించారు. వరికి బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న, దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే ఆయిల్పాం వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. వరి గడ్డిని తగులబెట్టడంతో కలిగే నష్టాలను వివరిస్తూ పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, సేంద్రియ సాగు చేపట్టాలని ప్రోత్సహించారు. రాబోయే వానాకాలం సీజన్కు అనుకూలమైన విత్తన రకాల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ‘రైతునేస్తం‘ కార్యక్రమానికి రైతులు విధిగా హాజరుకావాలని.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, నూతన సాగు పద్ధతుల గురించి తెలుసుకునేందుకు ఇది మంచి వేదికని అన్నారు. కార్యక్రమంలో ఏఓలు గాయత్రి, అరవింద్, ఏఈఓలు, ఆత్మకూర్, అమరచింత, మదనాపురం, కొత్తకోట మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
28న జాతీయ లోక్ అదాలత్
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని కోర్టుల్లో ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్యానల్ లాయర్లు, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్స్, పిటిషనర్ అడ్వొకేట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగ అశ్విని పాల్గొన్నారు. -
రిజర్వాయర్ నిర్మాణాల్లో వేగం పెంచాలి
వనపర్తి: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ, ఇతర పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పునరావాస పనుల పురోగతి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గణప సముద్రం రిజర్వాయర్కు సంబంధించి 197 ఎకరాల ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కర్నె తండా ఎత్తిపోతలకు సంబంధించి పెండింగ్లో ఉన్న 26 ఎకరాల భూ సేకరణకు పెగ్ మార్కింగ్ 14వ తేదీలోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద డీ–1, డీ–5, డీ–8, ప్యాకేజీ 29కు సంబంధించి 92 ఎకరాల భూ సేకరణకు పెగ్ మార్కింగ్ వారంలోగా పూర్తి చేయాలన్నారు. ఖిల్లాఘనపురం బ్రాంచ్ కాల్వ నిర్మాణానికి మార్కింగ్ పూర్తయిన 31 ఎకరాల ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేయాలని సర్వేశాఖ అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొత్తకోట మండలం కానాయిపల్లి ఆర్అండ్ఆర్ సెంటర్తో పాటు శంకరసముద్రాన్ని సందర్శించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ నాగేందర్, ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ కేశవరావు, ఆర్డీఓ సుబ్రమణ్యం, సర్వే ఏడీ శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. కొత్తకోట రూరల్: శంకరసముద్రం ముంపు గ్రామమైన కానాయపల్లి పునరావ కేంద్రాన్ని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు గురువారం సందర్శించారు. మొదట బండ్ లోపల ఉన్న ఇళ్లను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పునరావాస కేంద్రంలోని రోడ్లు, ప్లాట్లను పరిశీలించారు. గ్రామస్తులు సమస్యలను కమిషనర్కు విన్నవించగా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సమాధానమిచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ చాంద్పాషా, నాయకులు పి.కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, గ్రామస్తులు జితేందర్రెడ్డి, నరోత్తంరెడ్డి, భీమన్ననాయుడు, గోకరయ్య, నాగరాజు, బాలరాజు, శ్రీనివాసులు ఉన్నారు. -
అదనపు భారం..
ఉద్యోగరీత్యా రోజు దుప్పల్లి పాఠశాలకు వెళ్లాలి. బస్సులు మదనాపురం రైల్వేస్టేషన్ దగ్గరే నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడే దిగి కిలోమీటర్ నడిచి ఆత్మకూర్ రోడ్ వద్ద ఆటోలో వెళ్లాల్సి వస్తోంది. రాకపోకలకు అదనపు భారం పడుతోంది. అధికారులు స్పందించి త్వరగా పనులు త్వరగా పూర్తిచేసి గేట్ తెరవాలి. – ఆంజనేయులు, ఉపాధ్యాయుడు పనుల్లో జాప్యం సరికాదు. గేటు మూసివేయడంతో వాగులో దుమ్ము, బురదలో వాహనం నడపాల్సి వస్తోంది. చాలామంది ద్విచక్ర వాహనదారులు గేట్ మూసి ఉన్నా అలాగే రైల్వే ట్రాక్ దాటిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. మూడు రోజులు అని చెప్పి ఐదు రోజులైనా పూర్తి చేయడం లేదు. – వంగూరు రామకృష్ణారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం జరిగింది. ట్రాక్ వద్ద పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో రెండ్రోజుల్లో రాకపోకలు పునరుద్ధరిస్తాం. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం. సోమవారం గేటు తెరిచే ప్రయత్నం చేస్తాం. – రవికుమార్, రైల్వే సెక్షన్ ఇంజినీర్ -
సంతోషంగా ఉంది..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు అవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేవరకద్ర, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్లు కూడా ఏబీఎస్ఎస్ కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. – దిడ్డి గోపాల్ నారాయణ, డీఆర్యూసీసీ మెంబర్ -
పకడ్బందీగా పది పరీక్షలు
హాల్టికెట్ లేకున్నా పరీక్షకు అనుమతి పది పరీక్షల నిర్వహణకుగాను ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో 375 మంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే సీఎస్ 37 మంది, డిపార్ట్మెంటల్ అధికారులు 37 మందిని నియమించాం. కొన్ని గదుల్లో విద్యార్థుల సంఖ్య కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల ఎదుటే తెరిచేలా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. వనపర్తిటౌన్: పదోతరగతి విద్యార్థులు హాల్టికెట్ లేకపోయినా వార్షిక పరీక్షలు రాయవచ్చని.. అటెండెనన్స్ షీట్ ఆధారంగా కేంద్రాల్లోకి అనుమతిస్తామని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల అటెండెన్స్ షీట్స్ ఉంటాయని.. హాల్టికెట్స్ లేవని ఆందోళన చెందవద్దన్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, సిబ్బంది తదితర విషయాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. ఆందోళనకు గురికావద్దు.. విద్యార్థులు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి పదోతరగతి పరీక్షలను వచ్చే నెల 16 వరకు నిర్వహిస్తోంది. ప్రతి పరీక్షకు మధ్య ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని సబ్జెక్టుపై మరింత పట్టు సాధిస్తే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడయ్యే అవకాశం ఉంది. వివిధ కారణాలతో హాల్టికెట్ పొందని విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. హాల్టికెట్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్ వస్తుంది.. దీంతో విద్యార్థులు సులువుగా కేంద్రాలకు చేరుకోవచ్చు. విద్యార్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించాం. వారుకూడా సానుకూలంగా స్పందించారు. అనివార్య కారణాలతో విద్యార్థులు పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతిస్తాం. కేంద్రాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, బెంచీలు, విద్యుత్ సౌకర్యం సరిగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ, పోలీస్శాఖ సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల సమక్షంలోనే తెరుస్తాం. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక వైద్యసేవలు అందించేందుకు కేంద్రాల వద్ద ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. జిల్లావ్యాప్తంగా ప్రశ్నపత్రాల స్టోరేజ్ పాయింట్లు (పోలీస్స్టేషన్లు) 10 ఏర్పాటు చేశాం. 7,212 మంది విద్యార్థులు.. జిల్లావ్యాప్తంగా 7,212 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇందులో 3,577 మంది బాలురు.. 3,635 మంది బాలికలు ఉన్నారు. మొత్తం రెగ్యులర్ విద్యార్థులే కాగా.. ప్రైవేట్ విద్యార్థులు కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనున్నాయి. కాగా ఫిజికల్ సైన్స్, బయోలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మాత్రమే జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 25, ప్రైవేట్ పాఠశాలలు 12 ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కానింగ్తో కేంద్రం గుర్తింపు ప్రతి కేంద్రంలో విద్యార్థులకు కనీస వసతుల కల్పన ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ -
‘ఉపాధిహామీ’పై నిర్లక్ష్యం తగదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై వివక్ష చూపుతూ లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందని.. ఉపాధి కూలీలకు అండగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీ రాంజీగా పేరు మార్చి జీఓ తీసుకురావడం దారుణమన్నారు. కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం సిగ్గుమాలిన చర్యగా అభి వర్ణించారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి పనులు చేస్తున్నా కూలి డబ్బుల అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్ధితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ముదురుతున్నందున నీడ కోసం షేడ్నెట్లు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారి కూలి రూ.307 చెల్లిస్తున్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని.. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి, మహమూద్, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర, బుచ్చన్న, శంకర్రాజు, విజయ్, అనంతమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తున్నామనే సాకుతో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద దేశంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయిల్ సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, ఇజ్రాయిల్కు అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనే స్వార్థంతోనే అమెరికా ఇలాంటి చర్యలకు పూనుకొంటుందని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర క్యార్యదర్శి జాన్వెస్లీ -
చకచకా.. సుందరీకరణ
ఊపందుకున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం పునరాభివృద్ధి పనులు ● విమానాశ్రయాల స్థాయిలో వసతుల కల్పనకు చర్యలు ● ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లు ● ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్న జనరల్ మేనేజర్ స్టేషన్ మహబూబ్నగర్: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’ (ఏబీఎస్ఎస్) కింద రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తుండటంతో.. ఈ పథకం కింద ఎంపికై న రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్ని విధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పార్కింగ్, రైల్వే బుకింగ్ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులు వివిధ ప్లాట్ఫాంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు. రైల్వేస్టేషన్లో అనసవర నిర్మాణాలు తొలగించి సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు. ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి పనులు చేపట్టనున్నారు. ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రపంచస్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ట్రాక్ల శుభ్రత, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు ఏర్పాటు చేస్తారు. ప్రవేశం వద్ద ర్యాంపులు, కేఫ్ ఏరియా, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆధునిక లైటింగ్తో సహా స్పీడ్వైఫే 5జీ సేవలకు టవర్లు కూడా నిర్మించనున్నారు. -
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం
గోపాల్పేట: ప్రతి కార్యకర్త శ్రమించి కాంగ్రెస్పార్టీ విజయానికి కృషి చేశారని.. వారికి పార్టీ అండగా ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గోపాల్పేట మండలంలో మండల కాంగ్రెస్ కమిటీల ఎన్నికకు నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొని ఆయా మండలాల కార్యకర్తలతో అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, పోలీసు కేసులతో వేధించినా పార్టీ కోసం పని చేశామని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసినా ఫలితం లేదని.. కనీసం ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పేర్లు లేకుండా చేశారని వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మండల అధ్యక్షులతో పాటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓబీసీ, ఇందిరమ్మ కమిటీలు, పీసీసీ ఇలా ఎన్నో కమిటీలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరికి ఏదోవిధంగా ప్రయోజనం కలిగేలా చూస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే వారికి అధ్యక్షుడి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మూడు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పీజీ హాస్టల్కు నిధులు మంజూరు
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని పీజీ కళాశాలలో చదివే విద్యార్థుల హాస్టల్ వసతికి నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైస్ ఛాన్స్లర్ విజ్ఞప్తి మేరకు 200 మంది మహిళలకు రూ.911.16 లక్షలు, 150 మంది పురుషులకు రూ.672.48 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ‘ప్రజాపాలన’ శిక్షణకు పక్కా ఏర్పాట్లు వనపర్తి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించే సర్పంచ్లు, కౌన్సిలర్ల ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమం కొనసాగే కళ్యాణసాయి గార్డెన్స్ను బుధవారం ఆయన పుర చైర్పర్సన్ మాధవి, జెడ్పీ సీఈఓ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఓ రఘునాథ్రెడ్డి, తహసీల్దార్ రమేష్రెడ్డితో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పురపాలికల చైర్మన్లు, వైస్ చైర్మలు, కౌన్సిలర్లు, సర్పంచులు శిక్షణకు హాజరవుతారని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు హాజరై వివరిస్తారని.. వచ్చే ప్రజాప్రతినిధులకు ఎలాంటి లోటు లేకుండా వేదిక, తాగునీరు, మధ్యాహ్న భోజనం, ఎల్ఈడీ స్క్రీన్లు, ఫొటో ఎగ్జిబిషన్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ప్లంబర్లదే కీలకపాత్ర ఆత్మకూర్: తాగునీటి సరఫరాలో ప్లంబర్లదే కీలకపాత్ర.. వారు లేకుంటే ప్రతి ఇంటికి తాగునీరు సకాలంలో చేరదని మిషన్ భగీరథ సీఈ లలిత అన్నారు. అంతర్జాతీయ ప్లంబర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని బాలకృష్ణాపూర్లో సర్పంచ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ విధులు నిర్వర్తించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఈ వెంకటరమణ, ఈఈ అంజాద్పాషా, ఎంపీడీఓ శ్రీపాద, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, మిషన్ భగీరథ డీఈలు జయపాల్రెడ్డి, విజయ్కుమార్, ఏఈలు రుక్మేందర్రెడ్డి, మహే ష్, శివానంద్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
యువతకు కిడ్నీ గండం
పరీక్షలు చేసుకోవాలి.. కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నవారిలో మొదట లక్షణాలు నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మందిలో మారుతున్న జీవనశైలి వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. వేసవిలో అధికంగా డీహైడ్రేషన్ సమస్య ఉండటం వల్ల మూత్రంలో మంట, కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్ఓఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ రాజేష్, కిడ్నీ వైద్య నిపుణుడు, మహబూబ్నగర్ పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవన విధానంతో యువత ఒత్తిడికి లోనవుతోంది. దీనికితోడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారానికి అలవాటు పడటం, మానసిక ఒత్తిడి, ఎక్కువగా నొప్పులకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ వాడటం, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యం, పొగాకుకు బానిసవ్వడం తదితర అలవాట్లు కిడ్నీ రోగాలకు దారితీస్తోంది. రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహారం తినేటప్పుడు మాత్రమే యువత నీళ్లు తాగుతుండటం వల్ల శరీరానికి అవసరమైన నీరు సరిపోవడం లేదు. మరోవైపు ప్రాథమిక స్థాయిలో కిడ్నీ సమస్యలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది. జిల్లాలో 28– 30 ఏళ్ల వయస్సులో అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్న వారిలో కిడ్నీలు దెబ్బతింటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 479 మందికి డయాలసిస్ ఉమ్మడి పాలమూరులో గద్వాల, వనపర్తి జిల్లాలో అధికంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో డయాలసిస్ రోగులు అధికంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితితోపాటు ఆహార అలవాట్ల వల్ల కూడా కిడ్నీ బాధితులు అధికం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 77 మిషన్ల ద్వారా 479 మంది రోగులకు నిత్యం డయాలసిస్ చేస్తున్నారు. కొత్తగా ఆత్మకూర్లో ఐదు, మక్తల్లో ఐదు మిషన్లతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మార్చి రెండో గురువారం.. ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తారు. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా 9– 10 సెంటిమీటర్ల వెడల్పుతో పాటు 150గ్రాముల బరువు కల్గి ఉంటాయి. కిడ్నీ ప్రధాన శరీరంలోని నీటి లవణాల సమత్యులత, రక్త తయారీలో కీలక పాత్ర, మూత్రం తయారీ చేస్తుంటాయి. ప్రధానంగా కిడ్రీలలో సమస్య తీవ్రతరం అయితే తప్ప లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఆకలి మందగించడం, నీరసం, వాంతులు, చిరాకు, బరువు తగ్గడం, కాళ్ల వాపులు, మూత్రం తగ్గడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్ర, ఒత్తిడి లేకుండా జీవనం, సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. రోగులకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే డయాలసిస్ చేపట్టాలి. అందుబాటులో కేంద్రం ఉంటే రోగికి మేలు జరుగుతుంది. సుదూరంలో ఉండటం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉంటే ఎరిత్రోఫాయింట్ ఇంజెక్షన్ ఇస్తారు. మరీ తక్కువగా ఉంటే నేరుగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమీపంలోనే కేంద్రం ఉంటే ఇలాంటి సందర్భాల్లో రోగి కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండదు. కిడ్నీ రోగులకు ఒక్కసారిగా బీపీ పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రాలు దగ్గరలోనే ఉంటే వెంటనే రోగిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ. మూత్రపిండం.. జరభద్రం మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు మోతాదులో నీళ్లు తాగక అనర్థాలు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధిత బాధితులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
అక్రమార్కులపై కొరడా!
జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా మూడు రోజుల్లో కేసుల నమోదు ఇలా.. ● గోపాల్పేట పీఎస్ పరిధిలో మూడు ట్రాక్టర్లు, పెద్దమందడి పీఎస్ పరిధిలో జేసీబీపై కేసుల నమోదు, ఇసుక డంపుల సీజ్. ● పెబ్బేరు పీఎస్ పరిధిలో నాలుగు ట్రాక్టర్లపై కేసులు ● వనపర్తి పట్టణ పీఎస్లో రెండు ట్రాక్టర్లపై కేసుల నమోదు ● వనపర్తి రూరల్ పీఎస్ పరిఽధిలో రెండు ట్రాక్టర్లపై.. ● ఖిల్లాఘనపురం పీఎస్ పరిధిలో మూడు మట్టి ట్రాక్టర్లపై కేసులు ● మదనాపురం పీఎస్ పరిఽధిలో ఒక ట్రాక్టర్పై కేసు నమోదు ● సీఎం సమీక్ష తర్వాత పోలీసుశాఖ ఉక్కుపాదం ● మూడు రోజుల వ్యవధిలోనే 38 ఇసుక ట్రాక్టర్లపై కేసులు వనపర్తి: జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పోలీసుశాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసి, ఉక్కుపాదం మోపుతోంది. ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 38 ఇసుక ట్రాక్టర్లతో పాటు వాగుల్లో ఉన్న ప్రొకెయిన్లు సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమార్కులు భారీగా నిల్వచేసిన ఇసుకను సైతం సీజ్ చేసి.. మండల రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశారు. మట్టి వాహనాలను మైనింగ్శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. వారు క్యూబిక్ మీటర్ల కోలమానంగా జరిమానా విధిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా అక్రమ దందాకు తెరలేపిన వారిలో భయం మొదలైంది. అనుమతి లేకుండా రోడ్డుపై ఇసుక ట్రాక్టర్లు రావడానికి ఆస్కారం లేనంతగా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. సీఎం సమీక్ష తర్వాత.. రాష్ట్ర రాజధానిలో ఈ నెల 3న కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై సీరియస్గా స్పందించడం.. అక్రమ రవాణాను అదుపు చేయకుంటే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తుందనే అర్థ వచ్చేలా మాట్లాడటంతో కలెక్టర్ పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేశారనే చర్చ సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఈ నెల 3 నుంచే జిల్లాలోని ఇసుక అక్రమ రవాణాపై పోలీసు అధికారులు కొరడా ఝుళిపించడం గమనార్హం. ఆయా మండలాల్లో ఎస్హెచ్ఓలు జల్లెడ పట్టి మరీ ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. -
నివారణే మేలు..
గాలికుంటు వ్యాధి అనేది పశుసంపదను దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైనది. ఇది గాలి, కలుషిత నీరు, మే త ద్వారా వేగంగా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాపిస్తుంది. ఒక్కసారి వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయ డం చాలా ఖరీదైన వ్యవహారం. పైగా పశువు పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టం. అందుకే ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని జిల్లాలోని పాడి రైతులు ఒక బాధ్యతగా తీసుకోవాలి. – వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
ఇంటర్ పరీక్షలకు 262 మంది గైర్హాజరు
వనపర్తిటౌన్: జిల్లాలోని 25 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 6,924 మందికి గాను, 6,662 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,613 మందికి గాను 5,400 మంది, ఒకేషనల్ విభాగంలో 1,311 మందికి గాను1,262 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓతో పాటు డీఈసీ మెంబర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్స్ తనిఖీ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలి వనపర్తి రూరల్: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, కార్యదర్శి ఎం.రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మెరగట్టు మల్లన్న దర్శనం కోసం వెళ్లిన కుటుంబంపై కొందరు అగ్రకుల దురహంకారంతో దాడి చేయడం అమానుషమన్నారు. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, బి.కవిత, కుర్మయ్య, గంధం రత్నయ్య, ఆంజనేయులు, డి.కుర్మయ్య, గట్టయ్య, అరుణ, సంధ్య పాల్గొన్నారు. 17, 18నయూనివర్సిటీల కన్వెన్షన్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్ను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వెన్షన్కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్ రమేష్బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్సీ రవికుమార్, మధుసూదన్రెడ్డి, బెక్కం జనార్దన్, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్, భరత్, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
పాడి పశువులకు టీకా రక్షణ
●మదనాపురం: జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగించే గాలికుంటు మహమ్మారిని తరిమికొట్టేందుకు పశుసంవర్ధకశాఖ సర్వం సిద్ధంమైంది. మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 9 వరకు నెలరోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి పశువుకు టీకా వేయాలని యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. జిల్లాలోని 15 మండలాల్లో పశుసంపదను కాపాడేందుకు అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 1,10,935 పశువులకు టీకాలు వేయనున్నారు. ఇందుకోసం 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ టీకా బృందాలు షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామాన్ని సందర్శించి.. 6 నెలల వయసు పైబడిన ప్రతి పశువుకు టీకా వేయనున్నారు. తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ముందస్తు రక్షణ కల్పించవచ్చు. అశ్రద్ధ చేస్తే ఆర్థికంగా నష్టం.. గాలికుంటు వ్యాధి కేవలం ఒక అనారోగ్యం మాత్రమే కాదు. అది రైతు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. గాలి, నీరు, కలుషిత మేత ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల కలిగే నష్టాలు ఎన్నో ఉన్నాయి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. నోరు, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి.. పశువు మేత మేయలేక నీరసించి ప్రాణాలు కోల్పోయ్యే ప్రమాదం ఉంది. నేటి నుంచి గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం జిల్లాలో 1.10 లక్షల పశువులు 28 ప్రత్యేక బృందాలతో రంగంలోకి పశుసంవర్ధకశాఖ -
మాదకద్రవ్యాలతో కుటుంబాలు నాశనం
వనపర్తిటౌన్: మాదకద్రవ్యాల వ్యసనంతో జీవితాలే కాకుండా కుటుంబాలు నాశనమై రోడ్డున పడతాయని.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఈఓ అబ్దుల్ ఘని సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ఏర్పాటుచేసిన ప్రహరీ క్లబ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల ద్వారా వచ్చే మత్తు కంటే, జీవితంలో సక్సెస్తో వచ్చే మత్తు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్న వారితో సహవాసం మంచిది కాదన్నారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే, జీవితం అంతా బాగుంటుందని చెప్పారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట, బడిలో ఉపాధ్యాయుల మాట వింటూ జీవితాన్ని అందంగా మలుచుకోవాలని అన్నారు. సైకియాట్రిస్ట్ డా.పుష్పలత మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విద్యార్థి తీసుకునే నిర్ణయంతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందన్నారు. పరీక్షలపై భయాన్ని వీడి.. పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ టీం ఇన్చార్జి అంజద్, షీ టీం అధికారి భవిత, మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి, ప్లానింగ్ అధికారి శేఖర్, జీసీడీఓ శుభలక్ష్మి, డీఎస్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
గడువుల ఎత్తిపోతల..!
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలోనే పాలమూరు–రంగారెడ్డి పనులను పూర్తి చేసేందుకు ఈ ఏడాది మార్చి వరకు గడువు విధించింది. అయితే తాజాగా ప్రభుత్వం మరో 20 నెలల్లో పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకుంది. మొత్తానికి 2027 నవంబర్ వరకు పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్ట్ని వినియోగంలోకి తెస్తామని ప్రభుత్వం చెబుతుండగా, ఈసారైనా అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే అవసరమైన నిధులు కేటాయిస్తేనే పనుల్లో కదలిక వస్తుంది. కేఎల్ఐ, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లపై ఫోకస్.. 2025 మే 1న మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, సాగునీటి పారుదల శాఖ అధికారుల బృందం పాలమూరు ప్రాజెక్ట్ను సందర్శించింది. నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు పంప్హౌజ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2026 మార్చి కల్లా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయితే తాజాగా మరో 20 నెలలకు గడువును పొడిగించింది. ● ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ), నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2027 మార్చికల్లా పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అలాగే కొడంగల్–నారాయణపేట–మక్తల్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచి 2027 మార్చి నాటికే పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెట్టెంపాడు రూ. 252 కోట్లు ఇంకా కావాల్సిన నిధులు: రూ.50 వేల కోట్లు రానున్న రెండేళ్లలో ఖర్చు చేసే నిధులు: రూ.22 వేల కోట్లు ‘పాలమూరు–రంగారెడ్డి’ పనులు పూర్తి చేసేందుకు మరోసారి గడువు పెంపు 20 నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించిన ప్రభుత్వం వచ్చేమార్చిలోగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ పెండింగ్ పనులు పూర్తి అనుకున్న సమయానికి పనులు కావాలంటే నిధులు తప్పనిసరి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసుల ఆశలు నిధులు వస్తేనే పనులు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడంలో నిధుల కేటాయింపు విషయమే కీలకంగా మారింది. 2014లో మొత్తం రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ను ప్రారంభించగా ఏటా ప్రాజెక్ట్ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లతో కలిపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం రెండేళ్ల కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఇంకా రూ. 22 వేల కోట్లు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే మిగతా నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రూ.909 కోట్లు, కోయిల్సాగర్ రూ.185 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ.220 కోట్లు, నెట్టెంపాడు కోసం రూ.252 కోట్లను వచ్చే ఏడాది కాలంలో ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే ప్రాజెక్టుల పనుల్లో పురోగతి ఉండనుంది. -
పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం
వనపర్తి రూరల్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు, శ్రీరంగాపురం మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన సమావేశాలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న మండల కమిటీలకు, ప్రస్తుతం కొత్తగా ఎన్నుకునే కమిటీలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందన్నారు. ఒక్కొక్క కమిటీలో 21 మంది ఉంటారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు సంస్థాగత, గ్రామ, బూత్ కమిటీల్లో మండల బాధ్యులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పార్టీకి నిబద్దతగా పనిచేసే వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అనంతరం ఆశావహుల పేర్లను నమోదు చేసుకున్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, బండారు శ్రీనివాస్గౌడ్, వైస్చైర్మన్ సుమిత్ర, విజయవర్ధన్రెడ్డి, పీసీసీ జరనల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, రాజేంద్రప్రసాద్ యాదవ్, కదిరె రాములు, శ్రీలతారెడ్డి ఉన్నారు. -
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆశలు..
పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేస్తేనే ఉమ్మడి జిల్లాకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలుగనుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పంప్హౌజ్ల్లో మోటార్ల బిగింపు, కాల్వల తవ్వకాలు కొనసాగుతున్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల ప్రధాన కెనాల్లో కుడికిళ్ల వద్ద 2.5 కి.మీ. మేర కెనాల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం కోసం ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు భారీస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు. -
ఇప్పుడే నిప్పుల కొలిమి
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇంతలా మండుతుంటే.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతుండగా వాతావరణ కాలుష్యంతో వేడి తీవ్రత మరింత అధికమవుతోంది. జిల్లాలో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ఎండల తీవ్రత వల్ల ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకునే పనిలో ప్రతిఒక్కరూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తున్న క్రమంలో వచ్చే వారంరోజుల్లో కూలర్ల కొనుగోళ్లు అధికంగా పెరగనున్నాయి. ● ఉమ్మడి పాలమూరులో ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పీహెచ్సీల్లో అవసరమైన మందులతోపాటు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో దినసరి కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. మూడురోజుల నుంచి పెరిగిన ఎండలు -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
వనపర్తి: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా అధికారులను ఆయన శాలువాలతో సన్మానించి మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో మ హిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తోందని.. వాటిని సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో మహిళా అధికారులు ము ఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఏఓ భానుప్రకాశ్ పాల్గొన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి వివిధ సమస్యలపై ప్రజావాణిలో సమర్పించే అర్జీలను అధికారులు వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలను పరిశీలించి.. వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్లో ఉన్న అర్జీలను సైతం వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అందరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో 35 అర్జీలు అందాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
ఈ కాల్వ యమడేంజర్!
ప్రాణాలను హరిస్తున్న జూరాల ఎడమ కాల్వ ● వారాబందితో కానరాని నీటి ప్రవాహం ● స్నానానికి, బట్టలు ఉతికేందుకు వెళ్లి గల్లంతు.. మృత్యువాత ● అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు నీటి ప్రవాహాన్ని తెలియజేయాలి.. జూరాల ఎడమ కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని ప్రాజెక్టు అధికారులు సిబ్బంది ద్వారా సమీపంలోని గ్రామాల ప్రజలకు తెలియజేయాలి. వారాబంది ద్వారా ఎన్ని రోజులు నీటిని అధికంగా వదులుతారు.. ఎన్ని రోజులు నీటిని నిలిపివేస్తారనే విషయాలను అక్కడి రైతులతో పాటు ప్రజలకు వివరిస్తే ప్రాణ హానిని నివారించవచ్చు. – హన్మంతు, మాజీ ఎంపీటీసీ, నందిమళ్ల రక్షణ కంచె ఏర్పాటు చేయాలి.. గుంటిపల్లి క్రాస్రోడ్డు సమీపంలోని జూరాల కాల్వ వద్ద తరచుగా ప్రజ లు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నీటి ప్రవాహంపై అవగాహన లేక ఎంతో మంది కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందడం విచారకరం. మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాజెక్టు అధికారులు కాల్వ వెంట ఉన్న మెట్ల వద్ద రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. – వెంకటేశ్, నందిమళ్ల అవగాహన కల్పిస్తున్నాం.. జూరాల ప్రాజెక్టు నుంచి రామన్పాడ్ రిజర్వాయర్ వరకు ఉన్న ప్రధాన ఎడమ కాల్వ వెంట నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. వారబందితో సంబంధం లేకుండా కాల్వకు నీటిని నిరంతరం అందిస్తుంటారు. వారబంది రోజుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందని సమీప ప్రాంతాల యువకులు, చిన్నారులు ఈత కోసం కాల్వను ఆశ్రయిస్తుంటారు. కాల్వలోని నాచు అధికంగా ఉండటంతో కాలుజారి కాల్వలో గల్లంతై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనిపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూరు అమరచింత: జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలో దిగి గల్లంతు కావడం.. విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. జూరాల ఎడమ కాల్వ ఏర్పాటుచేసి నేటికీ 24 ఏళ్లు గడుస్తున్నా కాల్వ సమీపంలోని గ్రామాల ప్రజలకు చాలా వరకు నీటి ప్రవాహ ఉధృతి తెలియకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే చిన్నారులు, యువత ఈత సరదాతో కాల్వలోకి దిగి ప్రాణాలను కోల్పోతున్నారు. జూరాల ప్రాజెక్టు సమీపంలోని నందిమళ్ల గ్రామంలో ఈ ఘటనలు అధికంగా చోటు చేసుకోన్నాయి. అయితే ప్రాజెక్టు అధికారుల రక్షణ చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. రామన్పాడు వరకు ప్రమాదమే.. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీటిని అందించే రామన్పాడ్ ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే విడుదల చేస్తుంటారు. ప్రాజెక్టు నుంచి రామన్పాడ్ వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర కాల్వ ప్రవహిస్తోంది. రామన్పాడ్ రిజర్వాయర్ వరకు ఉన్న సమీప గ్రామాల వద్ద దాదాపు 10 చోట్ల కాల్వలో దిగుడు మెట్లు ఏర్పాటుచేశారు. దీంతో నందిమళ్ల, మూలమళ్ల, జూరాల తదితర గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగుతూ.. తమతమ అవసరాలను తీర్చుకుంటుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోవడం.. రామన్పాడ్ రిజర్వాయర్లో మృతదేహాలు లభించడం సర్వసాధారణంగా మారింది. ఐదేళ్లుగా జూరాల కాల్వలకు ప్రతి సీజన్లో వారాబందితో నీటిని వదులుతున్న విషయం రైతులకు తప్ప ఇతరులకు తెలియకపోవడమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. జూరాల గ్రామ సమీపంలో వెళ్తున్న ప్రధాన ఎడమ కాల్వ లోతుగా, భయంకరంగా ఉండటంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల గ్రామంలోనే 11 ఏళ్ల కాలంలో 17 మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన బండి పెద్ద హన్మంతు, కోళ్ల రంగన్న, మాల రాజు, చింతలమ్మ, బోయ చెన్నమ్మ, బోయ బొజ్జన్న, తెలుగు కాశీమన్న, చిన్నరాయుడు, రాజ్మీ బేగం, మహిమూద్, కుర్వ మణెమ్మ, అలుక్కోడి సరిత తదితరులు గల్లంతై మృతిచెందారు. గత నెలలో ఈత పడేందుకు వెళ్లి చిన్నారి ఆరిఫ్ గల్లంతయ్యాడు. అదే విధంగా మూడేళ్ల క్రితం పెబ్బేరు సమీపంలోని కాల్వలో ముగ్గురు, ఆత్మకూర్ సమీపంలోని గుంటిపల్లి వద్ద 8మంది గల్లంతు కాగా.. గతేడాది మరో ఇద్దరు కాల్వలో గల్లంతై మృతిచెందారు. ఒక్క గ్రామంలోనే 17 మంది మృత్యువాత.. -
మహిళా భాగస్వామ్యంతోనే మెరుగైన సమాజం
వనపర్తి రూరల్: మహిళల భాగస్వామ్యంతోనే మెరుగైన సమాజం నిర్మితమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వి.రజని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో సోమవారం వనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడంలో మహిళా ప్రజాప్రతినిధులు ముఖ్యభూమిక పోషించాలని సూచించారు. మహిళా చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమన్నారు. ఈ విషయంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రబాబు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై ఊరేగిన శ్రీరంగనాథుడు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం వేద మంత్రోచ్ఛారణలతో స్వామివారికి చతుస్థానార్చన అనంతరం మోహినిగా అలంకరించి.. గరుడ వాహన సేవ నిర్వహించారు. శ్రీరంగనాథుడు దివ్యతేజ స్వరూపుడై తిరు వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 10 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టు స్వామి, గోవిందాచార్యులు, కన్నయ్యస్వామి పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 255 మంది గైర్హాజరు వనపర్తిటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 255 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 25 కేంద్రాల్లో 7,158 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 6,903 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,852 మందికి గాను 5,643 మంది, ఒకేషనల్లో 1,301 మందికి గాను 1,260 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోట, ఆత్మకూర్, గోపాల్పేట కళాశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. దరఖాస్తు గడువు పొడిగింపు ఖిల్లాఘనపురం: మండలంలోని దొంతికుంటతండా స్టేజీ వద్ద ఉన్న తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి, 7 నుంచి 10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తు గడువును పొడిగించినట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి ఉమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా htt p://tgms.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏప్రిల్ 19న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతుల్లో సీట్ల భర్తీకి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.10,080 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా 10,080, కనిష్టంగా రూ.4,500 ధరలు లబించాయి. కందులు గరిష్టంగా రూ.7,389, కనిష్టంగా రూ.5,501, మినుములు గరిష్టంగా రూ.7,959, కనిష్టంగా రూ.7,600, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,826, కనిష్టంగా రూ.1,621,పెబ్బర్లు రూ.5,051 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు రూ.5,809, రాగులు క్వింటా రూ.3589గా ఒకే ధర నమోదైయింది. హోలీ సందర్భంగా దేవరకద్ర మార్కెట్కు మంగళవారం సెలవు ప్రకటించారు. -
పోలీస్ ప్రజావాణికి 20 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఎస్పీ సునీతారెడ్డి నేరుగా సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సిఫారస్ చేశారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా 10 దాఖలు కాగా.. పరస్పర గొడవలకు సంబంధించి 9, భార్యాభర్తల తగాదాపై ఒక ఫిర్యాదు అందినట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్స్కు దరఖాస్తు చేసుకోండి కందనూలు: జిల్లాలో దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 సంవత్సరానికి రెన్యూవల్, రెగ్యులర్ సర్టిఫికెట్స్ కోసం యూడీఐడీ పోర్టల్, మీసేవలో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఫోన్కు మెసేజ్ వచ్చిన తర్వాత ఈ నెల 6, 10, 13, 17, 20, 24, 31 తేదీలలో శారీరక, మస్క్యులర్, సీఎన్ఎస్, సెరెబ్రల్, పార్కన్సన్ దివ్యాంగులు ఉదయం 10 గంటలకు నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోవాలని తెలిపారు. అలాగే వినికిడి, మూగలోపం గల దివ్యాంగులు ఈ నెల 5, 25 తేదీల్లో, కంటిచూపు లోపం గలవారు ఈ నెల 9, 24 తేదీల్లో, మానసిక దివ్యాంగులు ఈ నెల 11, 18 తేదీల్లో, తలసేమియా, హెమోపిలియా, స్కేరోసిస్ దివ్యాంగులు ఈ నెల 30న జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ఉదయం 10 గంటలకు చేరుకోవాలని సూచించారు. -
సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టిసారించండి
వనపర్తి: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అఽధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వ్యాధుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి.. విద్యార్థులతో సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారితో కలిసి భోజనం చేయాలని సూచించారు. హాస్టళ్లలో పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతగా ఉందో లేదో తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు వడ్డించే వంటలను సూపర్వైజర్ తప్పనిసరిగా రుచి చూసి నిర్ధారించాలనే నిబంధన కచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి.. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దాఖలుచేసే అర్జీలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్యలతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం నిమిత్తం సంబంధిత అఽధికారులకు సిఫారస్ చేశారు. మొత్తం 40 అర్జీలు దాఖలు కాగా.. ఎక్కువగా భూ సమస్యలపై అర్జీలు అందినట్లు గ్రీవెన్స్ సెల్ అధికారులు వెల్లడించారు. -
రాహుల్గాంధీతో ప్రత్యేక అనుబంధం
వనపర్తి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని మరోసారి నిరూపితమైంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి సోమవారం హాజరైన రాహుల్ గాంధీని డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు. గత ప్రభుత్వ హయాంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఢిల్లీలో ధరల నియంత్రణపై చేపట్టిన ధర్నాలో ఆయన కాలుకు గాయమైతే.. రాహుల్ గాంధీ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు శివసేనారెడ్డి కుటుంబ సభ్యుల ను కలిసి తానున్నానంటూ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పడిన అనుబంధంతో ప్రస్తుతం ఆయన శివసేనారెడ్డి కుటుంబ సభ్యులను కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా, రాష్ట్రంలో శాట్ తరఫున చేపడుతున్న క్రీడలు.. జిల్లా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు శివసేనారెడ్డి తెలిపారు. పా ర్టీని బూత్ లెవల్లో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. -
భవిష్యత్ తరాలకు భరోసా
● బాలల సంరక్షణకు వందరోజుల కార్యాచరణ ● ప్రారంభమైన చైల్డ్ హెల్త్–100 ప్రోగ్రామ్ ● జిల్లాలోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు వనపర్తి: చిన్నారుల మరణాలు తగ్గించడం.. వ్యాధుల నియంత్రణ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ‘చైల్డ్ హెల్త్–100’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి జూన్ మొదటి వారం వరకు వంద రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించడం.. వారిలో ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి.. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. రానున్న రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి చిన్నారుల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యలను తెలుసుకొని.. వాటి పరిష్కారానికి దశల వారీగా చర్యలు చేపట్టనుంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, 14–15 ఏళ్ల వయసు గల విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయనున్నారు. తద్వారా భవిష్యత్లో కేన్సర్ను నివారించవచ్చు. ఈ వ్యాక్సిన్ను ప్రతి విద్యార్థినికి అందించే కార్యక్రమం సైతం ‘చైల్డ్ హెల్త్–100శ్రీలో చేపట్టనున్నట్లు తెలిసింది. ప్రాథమిక దశలోనే చికిత్స.. విద్యార్థుల్లో పోషకాహార లోపాలు, దృష్టి తీక్షణత తెలుసుకునేందుకు రక్తహీనత, హెచ్బీ తదితర పరీక్షలు చేస్తారు. జన్యుపరమైన లోపాలు, ఇతర వ్యాధులు, వైకల్యం తదితర సమస్యలను గుర్తించి.. వాటి నివారణ కోసం పోషకాలు, వైద్యాన్ని ప్రాథమిక దశలోనే అందించేందుకు చైల్డ్ హెల్త్ –100 కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైల్డ్ హెల్త్–100 కార్యక్రమాన్ని జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ, మోడల్ స్కూళ్లలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. వంద రోజుల్లో నాలుగు దశల్లో కార్యక్రమాన్ని పుర్తిచేస్తాం. – డా.సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ -
‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ విజయవంతం చేద్దాం
అమరచింత: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి కోరారు. మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షురాలు లావణ్య ఇంట్లో నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్, కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, పరుగుపందెం పోటీలు ఉంటాయని.. ప్రతిభ కనబర్చిన వారిని పార్లమెంట్స్థాయి పోటీలకు ఎంపికచేసి నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు అందజేయనున్నట్లు వెల్లడించారు. పోటీలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని.. క్రీడాకారులు 24వ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 9 నుంచి 24వ తేదీ వరకు క్రీడాపోటీల నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ గ్రామీణ అధ్యక్షుడు, కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, నరాల నారాయణ, చంద్రనాయక్తండా సర్పంచ్ కృష్ణానాయక్, కౌన్సిలర్లు మేర్వ రాజు, విష్ణు, ఊషన్న, పసుల నీరజ్, దుబాయ్ వెంకటేశ్వర్రెడ్డి, అమరేందర్రెడ్డి, గణేష్ పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ కన్నతల్లి లాంటిది’
ఖిల్లాఘనపురం: కాంగ్రెస్పార్టీ కన్నతల్లి లాంటిదని, కష్టపడి నమ్మకంగా పనిచేసిన వారికి అండగా ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో కాంగ్రెస్పార్టీ మండల నాయకుల విస్తృతస్థాయి సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరవగా.. పలువురు నాయకులు వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అదేవిధంగా పార్టీని నమ్ముకొని వచ్చిన కొత్తవారి సహకారంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచామని.. కాబట్టి వారికి కూడా సముచిత స్థానం కల్పించనున్నట్లు వివరించారు. ఎవరుకూడా పదవులు రాలేదని నిరాశ చెందొద్దని.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పుర ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. మున్ముందు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అందరు ఐఖ్యంగా పనిచేయాలని సూచించారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్పార్టీ అంటేనే అభివృద్ధికి నిదర్శనమని.. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అన్ని తామె చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం మండలపార్టీ అధ్యక్ష పదవి కోరుకుంటున్న వారి పేర్లు చెప్పాలని అడగగా.. మొత్తం 7 మంది పేర్లను రాయించారు. పరిశీలించి అధ్యక్షుడి పేరు ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్రెడ్డి, శ్రీనివాసులుగౌడ్, విజయ్కుమార్, సాయిచరణ్రెడ్డి, పీసీసీ ప్రధానకార్యదర్శి యాదయ్య, మాజీ ఎంపీపీ వెంకటయ్య, వెంకటేశ్వరరావు, గంజాయి రమేష్, ప్రభాకర్రెడ్డి, డా. నరేందర్గౌడ్, శేఖర్రెడ్డి, జయాకర్, కొత్త గొల్ల కృష్ణయ్య, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


