Wanaparthy District News
-
పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయాలి
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఏయే మండలంలో ఎంతమంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని తరగతులకు కలిపి 1,25,983 పాఠ్య పుస్తకాలు వచ్చాయని, వాటిలో ఇప్పటి వరకు 48,011 మంది విద్యార్థులకు పంపిణీ చేశామని, యూనిఫామ్స్ డీఆర్డీఓ, మెప్మా ద్వారా 34,665 వచ్చాయని.. అందులో మొదటి విడతగా ఒక జత దుస్తులు 12,737 మంది విద్యార్థులకు అందించినట్లు జిల్లా విద్యాధికారి వివరించారు. విద్యార్థులు పాఠశాలకు హాజరుకాగానే పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నామని చెప్పారు. పాఠశాలల వారీగా నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తి నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత సామర్థ్య పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఫోరం అధ్యాపకులు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నపత్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. నాలుగు సెట్ల ప్రశ్నపత్రం తయారు చేయాలని, ఈ వారంలో పరీక్ష నిర్వహించి కనీస మార్కులు రాని విద్యార్థులకు నెలరోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి గణితంలో ఫెయిల్ కావడానికి వీలులేదన్నారు. సమావేశంలో జిల్లా విద్యా ధికారి మహ్మద్ అబ్దుల్ ఘని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ గణేష్, డీఆర్డీఓ ఉమాదేవి, సీఎంఓ యుగంధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ముందస్తు వరద
●జూరాలకు జూన్లోనే మొదలైన ప్రవాహం ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో వానాకాలం పంటల సాగుకు త్వరగా సాగునీరు అందించాలనే ఆలోచనను ఉన్నతాధికారులకు విన్నవించాం. రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా నెలాఖరు నాటికి కాల్వలకు సాగునీరు వదిలే అవకాశాలు ఉన్నాయి. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం వరి నారు పోసుకున్నా.. ఎడమ కాల్వకు ముందస్తుగా సాగునీరు వదులుతారనే ఆశతో వరి నారుమడి సిద్ధం చేసుకున్నా. గతేడాది యాసంగిలో 8 ఎకరాల వరి సాగుచేసినా సాగునీరు సరిపడా అందక ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఈసారి సైతం 8 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు పొలం చదును చేస్తున్నా. – కుమార్, రైతు, జూరాల ఎత్తిపోతల పథకాలకు నీరివ్వాలి.. జూరాల ఎడమకాల్వ ద్వారా ఎత్తిపోతల పథకాలకు నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మండలంలోని అమరచింత ఎత్తిపోతల పథకం రైతుల భాగస్వామ్యంతో నిర్విరామంగా కొనసాగుతోంది. గత యాసంగిలో సాగునీరు అందక ఇబ్బందిపడిన రైతులకు ఈసారి పూర్తిస్థాయిలో సాగునీటిని అందించి ఆదుకోవాలి. – ఆంజనేయులు, కార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ముందస్తుగా జూన్లోనే వరద వస్తుండటంతో ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ముందుగా కాల్వలకు సాగునీరు విడుదల చేస్తే పొలాలు దుక్కి దున్నడం, కరిగెట చేసుకోవడం వంటి పనులు చేపట్టేందుకు ఆయకట్టు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం వరి నారుమడులను సిద్ధం చేసుకుంటూ ఎప్పుడు నీరు వదులుతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తుగా ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి కేవలం 35 వేల ఎకరాలకే పరిమితం చేసి సాగునీటిని అతి కష్టం మీద అందించగలిగింది. దీంతో పంటలకు దూరంగా ఉన్న చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం సన్నరకం వరిని మాత్రమే సాగు చేసేందుకు తమ పొలాలను సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడే పొలాలకు అందిస్తే సాగు పనులు మొదలు పెడతామని.. అధికారులు గుర్తించాలని వేడుకుంటున్నారు. ఎగువ నుండి ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో జూన్లోనే నిండుకుండను తలపిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.184 టీఎంసీల నీటిమట్టం ఉంది. ఆయకట్టు పరిధి ఇలా.. జూరాల ఎడమ కాల్వ కింద అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో మొత్తం 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు గత కొంతకాలంగా యాసంగిలో వారబందీ విధానంలో సాగునీరు వదులుతుండటంతో వరితో పాటు చెరుకు సాగుపై రైతులు దృష్టి సారించారు. అధికారుల సూచన మేరకు రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో కోతల సమయం వరకు నీరందుతోంది. ● గతేడాది యాసంగిలో ఎడమ కాల్వ పరిధిలో అధికారులు రామన్పాడు రిజర్వాయర్ వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించారు. ఈసారి వానాకాలంలో చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ విషయాన్ని ఇది వరకే ఉన్నతాధికారులకు విన్నవించారు. రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించి నీటి పారుదలశాఖ మంత్రి ఆదేశాలతో చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నెలాఖరున కాల్వలకు విడుదల చేసే అవకాశం వానాకాలం వరి సాగుకు ఆయకట్టు రైతులు సన్నద్ధం ప్రాజెక్టులో ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు నారుమడులు సిద్ధం.. జూరాల ఎడమ కాల్వ పరిధిలో చాలామంది రైతులు ఇది వరకే వరి నారు పోసుకున్నారు. అకాల వర్షాలు, ముందస్తు వానలు కురవడంతో ఎగువ నుంచి జలాశయానికి వరద భారీగా చేరుతుండటంతో ఆయకట్టుకు ముందస్తుగా సాగునీరు వదులుతారనే ఆశతో రైతులు తమ పొలాలను చదును చేసుకుంటూ నీటిరాక కోసం ఎదురు చూస్తున్నారు. -
అన్నదాతల ఆనందం
ప్రారంభమైన రైతుభరోసా నిధుల జమ ●పెట్టుబడికి ఉపయోగం.. వానాకాలం సాగుకుగాను ప్రభుత్వం రైతుభరోసా నిధులను అందిస్తున్నట్లు ప్రకటించడం హర్షించదగిన విషయం. సకాలంలో చేతికందడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధ తప్పింది. యాసంగి మాదిరిగా రైతులు అయోమయానికి గురికాకుండా పూర్తి వివరాలు వెల్లడించాలి. – తెలుగు పరశురాం, రైతు, పాన్గల్ సీఎం ప్రకటనతో ఉత్సాహం.. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో 5 ఎకరాల పొలం ఉంది. రైతు భరోసా డబ్బులు సమయానికి అందితే పంట సాగుకు ఉపయోగపడుతాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులను తొమ్మిది రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించడం ఉత్సాహం కలిగించింది. వార్షాకాలం సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తులతో అప్పులు చేద్దామనే సమయంలో రైతుభరోసా డబ్బులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. – సుధాకర్, రైతు, మూలమళ్ల అర్హులందరికీ రైతుభరోసా.. సోమవారం నుంచి తొమ్మిది రోజుల్లోగా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించాలని ఆదేశాలొచ్చాయి. తొలిరోజు సోమవారం 70 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకానుంది. జూన్ 5వ తేదీ వరకు భూములు కొనుగోలు చేసిన వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వనపర్తి: వానాకాలం సాగు సమయం ఆసన్నం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుభరోసా (పెట్టుబడి సాయం) సాయాన్ని సోమవారం నుంచి పంపిణీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో తొలిరోజు 70 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతునేస్తం కార్యక్రమంలో ప్రకటించారు. నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్న సమయంలో రైతుభరోసా నిధులను మునుపటి కంటే పకడ్బందీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించడంతో ఎన్నిక స్టంటేనన్న చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మొదటిరోజు రెండెకరాలలోపు వారికి.. జిల్లాలో 1,96,683 మంది రైతులు రైతుభరోసాకు అర్హులుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. వీరిలో రెండెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు 1,08,214 మంది ఉండగా.. మొదటిరోజు సోమవారం రూ.57,40,20,979 జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండెకరాలలోపు భూమి ఉన్న వారికి నిధులు జమ చేస్తూ మీట నొక్కారు. మిగతా రైతులందరికి తొమ్మిది రోజుల్లో సుమారు రూ. 155 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా ఇలా.. మండలం అర్హులైన మంజూరైన రైతులు నిధులు వనపర్తి 20,083 15,71,41,940 పాన్గల్ 19,917 20,36,50,440 కొత్తకోట 18,536 17,13,93,636 ఖిల్లాఘనపురం 16,399 15,49,04,522 పెద్దమందడి 16,066 16,51,72,632 పెబ్బేరు 15,354 17,81,37,153 గోపాల్పేట 13,355 13,33,76,394 చిన్నంబావి 11,776 17,06,41,323 ఆత్మకూరు 11,585 17,13,93,636 మదనాపురం 10,227 11,28,48,975 ఏదుల 8,843 8,74,99,288 శ్రీరంగాపురం 8,241 8,09,73,330 అమరచింత 8,070 11,35,64,983 రేవల్లి 5,789 6,43,01,888 వీపనగండ్ల 2,442 17,85,98,920 జిల్లాలో తొలిరోజు 70 శాతం మంది రైతులకు.. అర్హులైన రైతులు 1.96 లక్షలు మొదటిరోజు 1.08 లక్షల మంది ఖాతాల్లో రూ.57.40 కోట్ల చెల్లింపులు తొమ్మిది రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశాలు -
రామరాజ్యంతోనే ఆర్థిక పరిపుష్టి : బీజేపీ
వనపర్తిటౌన్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత గూడూరి నారాయణరెడ్డి ఆరోపించారు. ఆయన రజాకార్ల వారసుడని.. పదేళ్లలో రాష్ట్రంలో ఏమీ మిగల్చలేదని దుయ్యబట్టారు. సోమవారం జిల్లాకేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో 11 ఏళ్ల మోదీ పాలనపై నిర్వహించిన ప్రదర్శనశాల, మేధావుల అవగాహన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. దేశం ఆర్థిక పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని.. ఆర్థికంగా పదో స్థానంలో ఉన్న భారత్ను 4వ స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. రూ.64 వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.1.14 లక్షలకు చేర్చారని చెప్పారు. భావితరాలకు పునాది వేసేందుకు సనాతన ధర్మ పరిరక్షణే ఏకై క మార్గమన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకుడు అట్లూరి రామకృష్ణ మాట్లాడుతూ.. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ వరకు కాంగ్రెస్ పాలనలో అన్నీ తప్పులే జరిగాయని, ప్రజా మద్దతుతోనే మోదీ మూడోసారి అధికారం చేపట్టారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు. అనంతరం నారాయణరెడ్డి నిర్మించిన రజాకార్ల సినిమాకు గద్దర్ అవార్డు రావడంతో బీజేపీ జిల్లా నాయకులు గూడూరు నారాయణరెడ్డిని సన్మానించారు. రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గౌని హేమారెడ్డి, మున్నూరు రవీందర్, ఫొటో ఎగ్జిబిషన్, ప్రొఫెషనల్ మీట్ కార్యక్రమాల కన్వీనర్, స ర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం పలువురు నాయకులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 9 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రావుల గిరిధర్ ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలీస్స్టేషన్ల అధికారులతో మాట్లాడి జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో 7 పరస్పర గొడవలు, రెండు భార్యాభర్తల గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని కార్యాలయ సిబ్బంది వివరించారు. ‘త్రిఫ్ట్’కు దరఖాస్తుల ఆహ్వానం అమరచింత: నేతన్నకు చేయూత పథకానికి (త్రిఫ్ట్ ఫండ్) మరమగ్గాల కార్మికులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని చేనేత జౌళిశాఖ గద్వాల జిల్లా ఏడీ గోవిందయ్య సోమవారం తెలిపారు. జిల్లాలో మరమగ్గాలపై నేత పనులు చేస్తున్న 18 ఏళ్లు నిండిన కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జియోట్యాగింగ్ కలిగిన ప్రతి మగ్గానికి ముగ్గురు చొప్పున దరఖాస్తు చేసుకోవచ్చని.. 19వ తేదీ వరకు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీలో 54 శాతం ఉత్తీర్ణత వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య సోమవారం తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 3,650 మంది పరీక్షలు రాయగా 2,134 మంది.. ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 2,110 మంది పరీక్షలు రాయగా వెయ్యి మంది ఉత్తీర్ణులైనట్లు వివరించారు. మొత్తం 5,760 మంది విద్యార్థులకుగాను 3,134 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. కోయిల్సాగర్లో 15.6 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్లో సోమవారం సాయంత్రం వరకు నీటిమట్టం 15.6 అడుగులకు చేరింది. జూరాల నుంచి నీటిని ఒక పంపు ద్వారా విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రతిరోజు కొంత మేర పెరుగుతోంది. ఈ నెల 6 నుంచి నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి రావడం ప్రారంభమైన విషయం తెలిసిందే. యాసంగి పంటలకు వదిలిన తర్వాత 11 అడుగుల మేర ఉన్న నీటిమట్టం ప్రస్తుతం జూరాల నుంచి కృష్ణా జలాల రాకతో 4.6 అడుగుల మేర పెరిగింది. మరో 11 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి వస్తుంది. గేట్ల లెవల్ నీటిమట్టం 32.6 అడుగులు ఉంది. ఎల్ఆర్ఎస్కు ఐదోసారి గడువు పొడిగింపు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎల్ఆర్ఎస్–2020కి సంబంధించి 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మొదట గత మార్చి 31, ఆ తర్వాత ఏప్రిల్ 30, మూడోసారి మే 3 వరకు, నాలుగోసారి 31 వరకు తిరిగి ఇప్పుడు ఈనెల 30వ తేదీ వరకు ఇలా ఐదుసార్లు పొడిగించారు. దీనికి కారణం దరఖాస్తుదారుల నుంచి సరైన స్పందన రాకపోవడమేనని తెలుస్తోంది. కష్టంగా కాదు.. ఇష్టంతో చదవాలి ఎర్రవల్లి: విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా.. ఇష్టంతో ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పదో పటాలం ఇన్చార్జి కమాండెంట్ జయరాజు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో పటాలం సాయుధ చైతన్య పాఠశాలలో ఏర్పాటుచేసిన వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి పాఠశాల, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గతేడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు అందించి అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పాణి, శ్రీనివాస్, ఎంఈఓ అమీర్పాషా పాల్గొన్నారు. -
అమాయకులకు వల
గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ మాయగాళ్లు, నాటువైద్యులు ఉమ్మడి జిల్లాలో మాయగాళ్లు, నాటు వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో అమాయకులే లక్ష్యంగా చేసుకుని మాయగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. చిన్నపిల్లలతోపాటు మహిళలు, వృద్ధులు అనారోగ్యానికి గురైనా తాయత్తులు, బిల్లలు కడతామంటూ రోజుకొకరు చొప్పున మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొందరు వ్యక్తులు మంత్రాలు, నాటువైద్యం పేరుతో వ్యవస్థీకృతంగా దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు కొన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా మాయగాళ్లకే సహకరించిన ఘటనలే ఎక్కువ. సాక్షి, నాగర్కర్నూల్: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’ అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న దందాలు అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు -
ఆలయాల విధ్వంసం..
పోలీసులకు ఫిర్యాదు చేయండి.. ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్కర్నూల్ ఉమ్మడి పాలమూరులో ఇంకా మూఢనమ్మకాల జాఢ్యం వీడటం లేదు. మంత్రాలు, మాయలు, గుప్తనిధుల పేరుతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాయగాళ్లను నమ్మి పెద్దఎత్తున సొమ్మును కోల్పోయి మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మూఢనమ్మకాల నిర్మూళనలో పోలీసులు, సంబంధిత అధికారులు చేస్తున్న కార్యక్రమాలతో ఆశించిన ప్రయోజనం ఉండటం లేదు. చాలా సందర్భాల్లో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన నిందితులు, సూత్రదారులు పోలీసులకు చిక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని గుప్తనిధుల తవ్వకాలు చేపడుతూ అపురూపమైన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమలలోని పురాతన నవ నారసింహా ఆలయం, ప్రతాప రుద్రుని కోట, రాయలగండి చెన్నకేశవ ఆలయం, బైరాపూర్, వడ్డేమాన్లోని పురాతన ఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి విగ్రహాలను ధ్వంసం చేశారు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, ఆలయాలను పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి రూరల్: పెబ్బేరు మోడల్ కళాశాలలో భౌతికశాస్త్రం గంటల ప్రాతిపదికన బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్స్పాల్ డా. తూర్పింటి నరేష్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ఎమ్మెస్సీ (ఫిజిక్స్)తో పాటు బీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన వారు అర్హులని.. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటాతో బుధవారం కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు. ‘సీపీఐ పాత్ర లేని పోరాటం లేదు’ వనపర్తి రూరల్: దేశంలో సీపీఐ పార్టీ పాత్రలేని పోరాటం లేదని.. ఎర్రజెండాను ఎవరూ అంతం చేయలేరని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయరాములు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు గోపాలకృష్ణ అధ్యక్షతన పట్టణ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో పార్టీ ఆవిర్భవించిన వందేళ్లలో దేశ స్వాతంత్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి విజయం సాధించామన్నారు. పోరాటాలతోనే భూ సంస్కరణ, పేదలకు ఇళ్లు, పింఛన్లు వంటి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని కొందరు అంటున్నారని.. ప్రపంచంలో కష్టజీవుల శ్రమ దోపిడీ ఉన్నంత కాలం ఎర్రజెండా ఎగురుతూనే ఉంటుందన్నారు. దేశం, రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన హామీల అమలుకు పోరాడాలని.. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని పోరాడితే పార్టీ విస్తృతం అవుతుందని, అందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ కార్యదర్శిగా రమేష్ను రెండోసారి, సహాయ కార్యదర్శిగా గోపాలకృష్ణతో పాటు 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, ఎర్ర కురుమయ్య, చిన్న కురుమయ్య, పృథ్వీనాదం, జయమ్మ, శిరీష, శ్రీదేవి, వెంకటమ్మ, ఎత్తం మహేష్, శాంతయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి వనపర్తిటౌన్: ఖమ్మంలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభల్లో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ ఫెడరేషన్ మహబూబ్నగర్ రీజియన్ 3వ మహాసభలు జిల్లాకేంద్రంలోని జై భీమ్ స్వచ్ఛంద సేవాసంస్థ సంఘం భవనంలో జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సంఘం జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు అధిక పని భారంతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో యూనియన్ కార్యక్రమాలకు అనుమతించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎంవీ యాక్ట్ సవరించి ప్రజా రవాణాను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలో భాగంగా ఎలక్ట్రికల్ బస్సులను జీసీసీ పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మీ పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని.. అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, భిక్షపతిగౌడ్, సంఘం రీజియన్ అధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శి వెంకటయ్య, పది డిపోల ప్రతినిధులు, నాయకులు ఎండీ ఖయ్యూం, జేవీ స్వామి, గోపాలకృష్ణ, నాగేష్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు. తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం 1,017 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వలో నీటి సరఫరా లేదని, రామన్పాడు నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. -
కానరాని పురోగతి
●● విచారణలో జాప్యానికి తెలియని కారణాలు ● సీసీ కెమెరాలు వినియోగంలోకి వచ్చినట్లేనా? ● జిల్లా కార్యాలయాల్లో భద్రతపై వీడని సందేహాలు నేటికీ తెలియలేదు.. ఏప్రిల్లో వరుసగా మూడురోజులు సెలవులు వచ్చిన సమయంలో మా కార్యాలయంలో కొత్త బ్యాటరీ చోరీ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటికీ చోరీకి పాల్పడింది ఎవరనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం మా ఫ్లోర్లో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. పోలీసుల విచారణ ఎంత వరకు వచ్చిందని అప్పుడప్పుడు అడుగుతున్నాం. – అఫ్జల్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, వనపర్తి వనపర్తి: కలెక్టరేట్లోని రెండు జిల్లా కార్యాలయాల్లో బ్యాటరీలు మాయమైన ఘటన ఏప్రిల్ 16న వెలుగుచూసింది. చోరీ జరిగి రెండు నెలలు కావస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించకపోవడం శోచనీయం. చోరీ ఘటనపై కలెక్టరేట్ ఏఓ, ఆయా శాఖల అధికారులు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సమయంలో హడావుడి చేసిన పోలీసులు చోరీకి పాల్పడింది ఎవరనేది నేటికీ తేల్చలేదు. వందలాది మంది ఉద్యోగులు, ఫ్లోర్కు పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు, గస్తీ నిర్వహించే సెక్యూరిటీ గార్డులు, సెలవు రోజుల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులున్న కలెక్టరేట్లో చోరీకి ఎలా ఆస్కారం ఉంటుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నా.. పురోగతి మాత్రం కనిపించడం లేదు. కలెక్టరేట్లోని పలువురు సిబ్బందిని విచారణ చేయడంతో పాటు బయట ఎక్కడైనా విక్రయించారా అన్న కోణంలో జిల్లాకేంద్రంలోని పలు బ్యాటరీల దుకాణాల్లో విచారణ చేపట్టినా ఫలితం లేకపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుస సెలవుల సమయంలోనే.. ఏప్రిల్ 16వ తేదీకి ముందు వరుసగా మూడురోజులు సెలవులు వచ్చిన సమయంలో భారీ బరువున్న బ్యాటరీని సైతం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మైనార్టీ సంక్షేమశాఖలో ఒకటి, జిల్లా పంచాయతీరాజ్శాఖ అధికారి కార్యాలయంలో రెండు బ్యాటరీలు మొత్తం మూడు చోరీ అయినట్లు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొలిక్కిరాని కలెక్టరేట్ బ్యాటరీల చోరీ కేసు సీసీ కెమెరాల నిర్వహణ లేక.. కలెక్టరేట్లోని ప్రధాన ద్వారం నుంచి ప్రతి ఎంట్రెన్స్, మలుపుల వద్ద, ప్రతి ఫ్లోర్లో హెచ్డీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాల పర్యవేక్షణ, ఫుటేజీలను ఏఓ కార్యాలయం, కలెక్టర్ పేషీలో భద్రపర్చే ఏర్పాటు చేసినా.. చాలా వరకు పని చేయ లేదు. చోరీ ఘటన వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే బాగు చేయించారు. చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీల కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ఆధారాలు లభించకపోవడంతో కేసులో నేటికీ ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విచారణ కొనసాగుతోంది.. కలెక్టరేట్లో బ్యాటరీల చోరీపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నాం. ఫిర్యాదు అందిన రోజుకంటే ముందు వరకు కలెక్టరేట్లో చాలా సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఆధారాలు లభించడం లేదు. చోరీ చేసిన బ్యాటరీలను బయటకు తీయకపోవడంతో ఎక్కడా మార్కెట్లో విక్రయించినట్లు తెలియరాలేదు. త్వరలో కేసును ఛేదిస్తాం. – జలంధర్రెడ్డి, ఎస్ఐ, వనపర్తి రూరల్ -
విధేయతకు తగిన గుర్తింపు
వనపర్తి: కాంగ్రెస్పార్టీలో విధేయతకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి అన్నారు. టీపీసీసీ ప్రధానకార్యదర్శిగా జిల్లాకేంద్రానికి చెందిన నందిమళ్ల యాదయ్య ఎన్నిక కాగా.. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై యాదయ్యను శాలువాతో సన్మానించి మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న యాదయ్యకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి గుర్తించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఏఐసీసీ సైతం మొదటి నుంచి పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలనే సంకల్పంతో పని చేస్తోందని గుర్తు చేశారు. కార్యకర్తలు పదవులు ఆశించి పని చేయవద్దని.. అంకితభావంతో పనిచేస్తే పదవులు కచ్చితంగా వరిస్తాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ కోసం పనిచేసిన వారికే అవకాశం లభిస్తుందని తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అధిష్టానం పని చేస్తోందని.. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆసరాగా నిలబడ్డామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని.. దేశంలో కులగణన చేసిన ఏకై క రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేస్తానని నందిమళ్ల యాదయ్య తెలిపారు. సామాజిక న్యాయం కాంగ్రెస్పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఆదిత్యారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్నాయక్, రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కమర్మియా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమద్మియా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశ్రీని ఆదుకున్న ఖ్యాతి వనపర్తిది
వనపర్తి టౌన్: దేశవ్యాప్తంగా మహాకవి శ్రీశ్రీకి అభిమానులున్నా.. ఆయనను కష్టకాలంలో ఆదుకొని అండగా నిలిచిన చరిత్ర వనపర్తి సొంతమని మహనీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర చైర్మన్ రాజారామ్ప్రకాశ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శ్రీశ్రీ 42వ వర్ధంతిని మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు కవులు, నాయకులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజారామ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. తన కలం, గళంతో జన చైతన్యానికి శ్రమించిన విప్లవ కమ్యూనిస్టు కవి శ్రీశ్రీ అని, కవులు, రచయితలకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో కవులు గిరిరాజాచారి, డా. నాయికంటి నరసింహశర్మ, చిలుక రవి, బాలెమియా, గాయకుడు చింతకుంట కురుమయ్య, గద్వాల కృష్ణ, నర్సింహ, సులిగిరి వెంకటస్వామి, పరమేశ్వరాచారి, శ్రీనివాస్ శెట్టి, రఘునాథ్ రెడ్డి, పుల్లారెడ్డి, గంధం శ్రీకాంత్ పాల్గొన్నారు. -
విద్వేషాలు, ఉద్రిక్తతలే మోదీ ఆయుధాలు
పాన్గల్: విద్వేషాలు, ఉద్రికత్తలే ప్రధాని మోదీ ఆయుధాలని, బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. మండలంలోని రేమద్దులలో రెండ్రోజుల పాటు జరిగిన సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని.. ఆపరేషన్ కగార్ పేరుతో విధ్యంసం సృష్టించేందుకు యత్నిస్తోందన్నారు. పాకిస్థాన్తో యుద్ధం ఆపి చర్చలు జరుపుతామంటున్న కేంద్రం.. దేశంలో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా వినకుండా ఎన్కౌంటర్లు జరుపుతోందన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని.. అదేవిధంగా ఇజ్రాయిల్ మారణహోమ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, 19న పాలస్తీనా సంఘీభావ దినాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని, ఇందుకు ప్రతి సభ్యుడు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టి రాయితీపై రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలని, పెండింగ్లో ఉన్న బోనస్ చెల్లించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తూనే పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం, పని పద్ధతులపై రెండ్రోజుల పాటు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించామని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జబ్బార్ వివరించారు. ప్రజల పక్షాన ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బాల్రెడ్డి, జి.వెంకటయ్య, మహబూబ్పాషా, ఆది, వేణుగోపాల్, దేవేందర్, వెంకటేష్, రాజేందర్గౌడ్, రాము, భగత్, ఎం.వెంకటయ్య, భాస్కర్, ఖాజా, మహేష్, మల్లేష్, శేఖర్, కమలాకర్, రాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన పత్తి విత్తనాల ధరలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ఈసారి పత్తి విత్తనాల ధర పాకెట్పై రూ.37 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీటీ– 2 పత్తి విత్తనానికి ఒక పాకెట్కు రూ.864 ధర ఉండగా, ప్రస్తుతం రూ.37 పెంపుతో రూ. 901కి చేరింది. ఇప్పటికే మూడేళ్లుగా చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో పత్తి ధర రూ.7 వేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు పంట దిగుబడి సైతం సరిగా రాలేదు. తాజా ధర పెంపుతో రైతులపై అదనపు భారం మోపినట్లయ్యింది. కాగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దీనికోసం 5 లక్షల వరకు విత్తన పాకెట్లు అవసరమవుతాయి. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, మూసాపేట, అడ్డాకుల, నవాబుపేట, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, భూత్పూర్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా బీటీ– 2 పత్తి సాగు చేస్తారు. ఇటీవల కురిసిన కొందరు రైతులు విత్తనాలు విత్తుకోగా.. మరికొందరు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. బీటీ–2 పత్తి విత్తనాల ధరలు ఇలా సంవత్సరం పాకెట్ ధర (రూ.లలో..) 2018 690 2019 710 2020 730 2021 767 2022 810 2023 853 2024 864 2025 901 ఒక్కో పాకెట్పై రూ.37 పెంపు -
ఆర్థిక చేయూత
చేనేత.. రూ.లక్ష రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయం ●రూ.50 వేలు అప్పు తీసుకున్నా.. నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా. – స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల మగ్గాల కొనుగోలుకు.. కొత్త మగ్గాల కొనుగోలుకు డబ్బులు అవసరం ఉండి బ్యాంకు నుంచి రూ.లక్ష రుణం తీసుకున్నా. క్రమం తప్పకుండా ప్రతిసారి రెన్యూవల్ చేశా. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామనడంతో తీసుకున్న డబ్బులు మాఫీ అవుతాయనే సంతోషం ఉంది. – పుట్టా సరిత, నేత కార్మికురాలు, గద్వాల రుణ వివరాలు అందించాం.. చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్, అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం అందరికీ వర్తింపజేయాలి.. చేనేత కార్మికులు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేసి విముక్తి కల్పించాలి. ముద్ర, క్రెడిట్ కార్డులతో పాటు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను పరిగణలోకి తీసుకోవాలి. రూ.లక్షలోపు రుణాలు పొందిన వారి జాబితాను తయారుచేసి త్వరగా మాఫీ వర్తింపజేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలి. – అక్కల శాంతారం, జిల్లా కార్యదర్శి, చేనేత కార్మికుల సంఘం, గద్వాల అమరచింత: చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని గతేడాది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించగా.. ఇందుకు సంబంధించి తాజాగా జిల్లా అధికారులకు మార్గదర్శకాలు అందాయి. 2017, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు నేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని చేనేత కార్మికులకు ఆర్థిక ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ ఆదేశాలతో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల ఏడీ కార్యాలయాల పరిధిలో నేత కార్మికులు ఎంతమంది రూ.లక్ష రుణాలు తీసుకున్నారనే వివరాలను బ్యాంకు మేనేజర్లతో సేకరించి జాబితా రూపొందిస్తున్నారు. ఆ జాబితాను మరోమారు పరిశీలించి కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఎల్సీ (జిల్లాస్థాయి కమిటీ) ఏర్పాటు చేసి స్టేట్ లెవల్ కమిటీకి నివేదించనున్నారు. రూ.6.50 కోట్లకుపైగా రుణాలు.. ఉమ్మడి జిల్లాలో 4,537 జియోట్యాగ్ కలిగిన మగ్గాలు ఉండగా.. 8,338 మంది కార్మికులు నేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మగ్గం పనిచేసే కార్మికులు ముద్ర యోజన, క్యాష్ క్రెడిట్, చేనేత మగ్గాల పేరున రుణాలు పొందారు. ఇలా చేనేతకు సంబంధించి సుమారు రూ.6.50 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు గతంలో అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.లక్ష రుణం మాఫీ చేస్తామని ప్రకటించడం, ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఆయా జిల్లాల ఏడీలకు అందడంతో ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోంది. వేగంగా కొనసాగుతున్న ప్రక్రియ.. చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆయా చేనేత సహకార సంఘాల ద్వారా ఇదివరకే సేకరించిన జౌళిశాఖ అధికారులు తాజాగా మరోమారు ఏ బ్యాంకులో రుణాలు ఇప్పించారో అక్కడికే వెళ్లి రుణగ్రహీతల వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు. రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారి వివరాలను సైతం సదరు ఏడీ కార్యాలయాల సిబ్బంది సేకరించే పనుల్లో లీనమయ్యారు. రెండు, మూడు రోజుల్లో జౌళిశాఖకు పూర్తి నివేదిక అందనుంది. వీటిని రాష్ట్రస్థాయి కమిటీకి అందజేసిన తర్వాత ప్రభుత్వం అర్హుల జాబితాను ప్రకటించనుంది. ఇవీ మార్గదర్శకాలు.. కలెక్టర్ చైర్మన్గా ఆరుగురితో కూడిన జిల్లాస్థాయి కమిటీ (డీఎల్సీ) ఆమోదం పొందాలి. తర్వాత చేనేత డైరెక్టర్ చైర్మన్గా ఉన్న స్టేట్ లేవల్ కమిటీ ఆమోదం పొందితే బ్యాంకర్లు నో డ్యూ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ప్రతి కార్మికుడికి వడ్డీతో కలిపి రూ.లక్ష వరకు రుణ మాఫీ అవుతుంది. అంతకుమించి ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 8,338 కార్మికులు.. 4,537 జియోట్యాగింగ్ మగ్గాలు రూ.6.50 కోట్ల అంచనా బ్యాంకర్లను నివేదిక కోరిన అధికారులు వివరాలు సేకరిస్తున్నాం.. చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల -
ఏపీడీపై అదనపు కలెక్టర్కు ఫిర్యాదు
వనపర్తి: తమను అవమానించేలా, మా పనితీరును కించపర్చేలా కామెంట్స్ చేస్తున్నారంటూ డీఆర్డీఓ ఏపీడీ సుల్తాన్పై పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలు, టీఏలతో పెద్దమందడిలో నిర్వహించిన సామూహిక ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతూ తమను కించపర్చడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనీసం రోజుకు రెండు గంటలు కూడా పనిచేయడం లేదని, పాలనలో పూర్తిగా విఫలమయ్యారని హేళన చేస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఏపీడీ సుల్తాన్ను వివరణ కోరగా తాను వారి జాబ్చాట్ను గుర్తుచేశానని.. ఎవరినీ కించపర్చే ఉద్దేశం తనకు లేదన్నారు. -
అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డుకు గురుకుల విద్యార్థి
దామరగిద్ద: వినూత్న ఆలోచనలో భాగంగా పర్యావరణ హితమైన పూల కుండీలు తయారు చేసిన గురుకుల విద్యార్థి అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు పోటీలకు ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 2023– 24 ఏడాదిలో పదో తరగతి చదివిన విద్యార్థి శివారెడ్డి టీజీటీ బయోసైన్స్ ఉపాధ్యాయురాలు, గైడ్ జరీనా ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో శివారెడ్డి కొబ్బరి పీచు, మైదా పిండితో హైడ్రాలిక్ పవర్ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీ సిస్టంలో పూల కుండీలను తయారీ చేసి.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి.. అంతర్జాతీయ స్థాయి స్ఫూర్తి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయ స్థాయిలో జపాన్లోని సకురా సైన్స్ స్కూల్లో జరగనున్న సైన్స్పేర్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం బయలుదేరి వెళ్తాడు. రైతుల అనుమతి లేని రిజర్వాయర్ వద్దు బల్మూర్: రైతుల అనుమతి లేకుండా ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో భూ నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బల్మూర్, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాల్లోని 2,601 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సర్వే చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
ఆశాలకు వేతనం ఇవ్వాలి : సీఐటీయూ
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు కచ్చిత వేతనం కింద రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆశా కార్యకర్తల 4వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి పనిభారాన్ని తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జులై 9న జరిగే దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో ఆశా కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆశ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి సునీత సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు నిక్సన్, ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ, జిల్లా కోశాధికారి జె.భాగ్య, నాయకురాలు గిరిజ, దేవమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన
ఆత్మకూర్: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, కార్పొరేట్కు దీటుగా వసతులు కల్పిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి అధ్యాపకులతో సమావేశమయ్యారు. కళాశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకొని ప్రవేశాల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. గతేడాది కంటే 30 శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల ఆవరణలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా బోధన అందించాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్రెడ్డి, టీజే విశ్వేశ్వర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2,307 ప్రవేశాలే లక్ష్యం.. వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు గతేడాది కంటే 30 శాతం పెంచాలని ఆదేశించడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ఇంటింటి ప్రచారం చేపడుతున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాలో ఉన్నత పాఠశాలలు ఉన్న ప్రతి గ్రామాన్ని అధ్యాపకులు సందర్శించి ప్రవేశాలు చేయిస్తున్నట్లు వివరించారు. గతేడాది 1,775 అడ్మీషన్లు ఉండగా.. ఈ ఏడాది 30 శాతం కలిపి మొత్తం 2,307 లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కచ్చితంగా లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
పాన్గల్: వర్షాకాలం ప్రారంభమైనందున సిబ్బంది సీజనల్గా వచ్చే వ్యాధులతో అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యం చేయాలని జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. సాయినాథ్రెడ్డి అన్నారు. ఫ్రై డే.. డ్రై డేలో భాగంగా శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి నిల్వలు, అపరిశుభ్రతతో దోమలు వృద్ధి చెంది రోగాలు వ్యాప్తి చెందుతాయని.. రోగాల బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, వైద్యసిబ్బంది రాంచందర్, నర్సమ్మ, నాగేశ్వరి, శైలజ, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని 19 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే భూ భారతిని రూపొందించి అమలు చేస్తోందని.. భూ సమస్యల పరిష్కారానికే ఈ చట్టం తీసుకొచ్చామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మిరాసిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ధరణి పేరుతో రైతులను దగా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. అంతేగాకుండా ధనవంతులతో సమానంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేదని, ఈ ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందని తెలిపారు. గ్రామానికి మొదటి విడత 24 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. రెండోవిడతలోనూ మంజూరు చేస్తామన్నారు. అంతకుముందు గ్రామంలో పెండింగ్లో ఉన్న వడ్డెర, యాదవ కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్ల నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు బాలమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, బీచుపల్లియాదవ్, కాంగ్రెస్ నాయకులు రావుల కరుణాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేత.. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ను ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు ధీటుగా సౌకర్యాలు, బోధన అందుతుందని.. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీఎస్ హెచ్ఎం భీంపల్లి బాలరాజు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించండి
ఖిల్లాఘనపురం: గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో సహకరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణానికి మొత్తం 603.46 ఎకరాలు అవసరం ఉండగా.. అందులో 388 ఎకరాలు చెరువు లోపల శిఖం పట్టాలున్నాయని వివరించారు. మొత్తం 991 మంది రైతులకు పట్టాలు ఉండగా.. ఇప్పటికే 251 మంది రైతులు భూమిని అప్పగించడానికి అంగీకారం తెలపడంతో పాటు అవార్డు అందజేసినట్లు తెలిపారు. మిగతా 740 మంది రైతులు అంగీకారం తెలిపి అవార్డు చేసుకుంటే రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి మండలంతో పాటు మూసాపేట మండలంలోని ముసాపేట, నిజాలాపూర్, మహ్మద్హుస్సేన్పల్లి తదితర గ్రామాల్లోని 5,200 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పరిహారం అందుతుందని చెప్పారు. 15 రోజుల సమయం తీసుకొని అన్నివిధాలుగా ఆలోచించి అంగీకారం తెలపాలని కోరగా.. రైతులు అందుకు సమ్మతించారు. సమావేశంలో ఇరిగేషన్ డీఈ నరేందర్రెడ్డి, ఏఈ వెంకటేశ్వర్లు, సర్వేయర్, రైతులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు వినియోగించుకోండి.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను భూ సమస్యలున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లిలో కొనసాగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరైన ఆయన రైతులు ఇచ్చిన ధరఖాస్తుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాలకు వచ్చే అధికారులకు సమస్యలు ఉన్న రైతులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుగుణ, ఆర్ఐ తిర్పతయ్య, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
వనపర్తి రూరల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నేడు పండుగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలంలో రూ.13 కోట్లు, శ్రీరంగాపురం మండలంలో రూ.21.75 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి, తోమాలపల్లి, కొత్తసూగూరు, ఈర్లదిన్నె, శేరుపల్లిలో గ్రామపంచాయతీ భవనాలు, రంగాపురంలో హమాలి సంఘం భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, వైశాఖాపూర్లో మహిళా సంఘం భవనం, చెలిమిళ్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, బునాదిపురం గ్రామ పాఠశాలలో ల్యాబ్, కంచిరావుపల్లిలో హైమాక్స్ లైట్ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అలాగే వైశాఖాపూర్, యాపర్ల, తోమాలపల్లిలో అంగన్వాడీ భవనాలు, పెబ్బేరు మున్సిపాలిటీలో రూ.10.76 కోట్లతో చేపట్టే అమృత్ స్కీం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం యాపర్లలో బండలాగుడు పోటీలు ప్రారంభించి, అయ్యవారిపల్లి, యాపర్ల బడిబాటలో పాల్గొని పాఠశాలలో సరస్వతి పూజ చేసి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. అలాగే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు, సన్నబియ్యం పంపిణీ లాంటి అనేక పథకాలు అమలవుతుండటంతో పేదలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మార్కెట్ చైర్మన్లు ప్రమోదిని, శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, నాయకులు సురేందర్గౌడ్, వెంకటేష్సాగర్, రంజిత్కుమార్, సూగూరు శివ, రామచంద్రారెడ్డి, దయాకర్రెడ్డి, రామన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
573 బస్సులకు నో ఫిట్నెస్
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నట్లు డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు.జిల్లాల వారీగా ఇలా.. ఉమ్మడి జిల్లాలో పునః ప్రారంభమైన పాఠశాలలు నేటినుంచి స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ఫిట్నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు -
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఖిల్లాఘనపురం/కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం ఖిల్లాఘనపురంలోని పద్మశాలి కల్యాణ మండపంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, హౌసింగ్ డీఈ విఠోభాతో కలిసి అలాగే పెద్దమందడి, శ్రీరంగాపురం, పెబ్బేరులోని ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదోడి సొంతింటి కళ కలగానే మిగిలిందన్నారు. ఏడాదికి అయిదు ఇళ్లు ఇచ్చినా నేడు ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వనపర్తిని పూరి గుడిసే లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత చీర, పంచె, పసుపు, కుంకుమతో ఇళ్లకు వస్తామన్నారు. ఖిల్లాఘనపురం గణపసముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడటానికి శుక్రవారం అధికారులు వస్తారని.. అన్ని విషయాలు మాట్లాడుకోవాలని సూచించారు. త్వరలో జరిగే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. అలాగే పెబ్బేరులో రుక్సానాబేగం ఇంటిని ముగ్గు వేసి ప్రారంభించారు. ఖిల్లా ఘనపురంలో జరిగిన కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ వెంకటాచారి, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మాజీ సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రావు, పెబ్బేరు, శ్రీరంగాపురంలో జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, విండో చైర్మన్ జగన్నాథంనాయుడు, తహసీల్దార్లు మురళిగౌడ్, రాజు, ఎంపీడీఓ రవీంద్ర, రవినారాయణ, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేష్సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, సమయపాలనతో గుర్తింపు
వనపర్తి: క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ, విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ అధికారుల మన్ననలు పొందాలని.. నీతి, నిజాయితీతో పనిచేసే వారికి పోలీసుశాఖలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందికి విధుల నిర్వహణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని.. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలు తెలుసుకోవాలని, న్యాయం జరుగుతుందనే నమ్మకం, భరోసా, భద్రత కల్పించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, వివిధ వర్టికల్ విభాగాల్లో చక్కటి ప్రతిభ కనబర్చాలని, ఐటి సెల్ సేవలు వినియోగించుకొని జిల్లాను ముందువరుసలో నిలపడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిమ కనబర్చిన పోలీసు సిబ్బందిని ఎస్పీ శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి సీఐ కృష్ణయ్య, ఆత్మకూర్ సీఐ శివకుమార్, రిజర్వ్ సీఐ అప్పలనాయుడు, డీసీఆర్బీ ఎస్ఐ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
రైతులకు పారదర్శక సేవలు
ఖిల్లాఘనపురం: రైతులకు పారదర్శకమైన సేవలు అందించే బాధ్యత అధికారులపై ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండలంలోని షాపురం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదస్సుల్లో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తూ దరఖాస్తులకు సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తప్పుడు ఎంట్రీలకు నోటీసులు జారీ చేయాలని.. హెల్ప్డెస్క్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది రైతులకు పూర్తి సమాచారం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. రైస్మిల్లు తనిఖీ.. గురువారం మండలానికి వచ్చిన రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వర రైస్మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. మిల్లుకు వచ్చిన ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని యజమానిని ఆదేశించారు. దించుకున్న ధాన్యం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని.. సీఎంఆర్ కోసం మిల్లింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, సీనియర్ అసిస్టెంట్ కురుమూర్తి, ఆర్ఐ తిరుపతయ్య, పలువురు సిబ్బంది ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
వనపర్తి విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్ కో–ఆర్డినేటర్ యుగంధర్ కోరారు. గురువారం ఆత్మకూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల, జూరాలలోని ఉన్నత, జెడ్పీ బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ బడులను కాపాడుకునే బాధ్యత గ్రామంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బాలికలు భవిష్యత్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యాభ్యాసం ఆపకుండా లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలన్నారు. బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికేందుకు భవనాలను మామిడాకుల తోరణాలు, పూలమాలలతో అలంకరించడంతో పాటు డప్పుచప్పుళ్లతో ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
పాన్గల్: రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర గురువారం మండలంలోని తెల్లరాళ్లపల్లి, కేతేపల్లి, జమ్మాపూర్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ వారసత్వం, డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై సంవిధాన్ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అందించాలనేదే గాంధీజీ ఆలోచన అని.. ఆయన ఆశయ సాధనకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని తెలిపారు. గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్నారు. కాంగ్రెస్పార్టీ అధికారంలో ఉన్న 70 ఏళ్లలో భారత రాజ్యాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షించిందని.. నేడు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విడతల వారీగా అమలు చేస్తున్నామని.. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతాయన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని.. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ధాన్యం తరుగుపై ఆరా.. మిల్లర్లు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయంపై మంత్రి జూపల్లి పౌరసరఫరాల డీఎం జగన్మోహన్, ఆర్డీఓ సుబ్రమణ్యంతో ఆరా తీశారు. ఈ విషయంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆగుతూ.. సాగుతూ!
జిల్లాలో నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వివరాలు 8లో u●బేస్మెంట్ నిర్మించినా బిల్లు రాలే.. అధికారులు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం ఇచ్చారు. దీంతో అప్ప చేసి బేస్మెంట్ వరకు నిర్మించినా ఇప్పటి వరకు రూ.లక్ష ఇవ్వలేదు. కారణం ఏమిటంటే బ్యాంకు ఖాతాలో తేడాలున్నాయని అధికారులు చెబుతున్నారు. త్వరగా బిల్లు చెల్లించి ఆదుకోవాలి. – అంజమ్మ, చింతరెడ్డిపల్లి (అమరచింత) అప్పు చేసి నిర్మాణం.. బిల్లు త్వరగా వస్తుందని రూ.50 వేలు అప్పుచేసి బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం చేపట్టా. ఇప్పటి వరకు బిల్లు రాకపోవడంతో పనులు నిలిపివేశా. మండలంలోని యూనియన్ బ్యాంకులో ఖాతా తెరవమన్నారు.. ఇప్పటి వరకు బిల్లు మాత్రం రాలేదు. ఎంపీడీఓతో పాటు అధికారులు వచ్చి పనులు చేపట్టాలని బిల్లు వస్తుందని భరోసానిస్తున్నారు. మొదటి బిల్లు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తా. – వై.అనిత, చింతరెడ్డిపల్లి (అమరచింత) రెండో బిల్లు వచ్చింది.. అధికారుల సూచనతో ఇంటి నిర్మాణం చేపట్టా. ఆత్మకూర్ ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఇచ్చా. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ.రెండు లక్షల బిల్లు వచ్చింది. ప్రస్తుతం స్లాబ్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇంటి పనులు పూర్తి చేసుకుంటే పూర్తి బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. – వెంకటన్నగౌడ్, చింతరెడ్డిపల్లి (అమరచింత) అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో మొదటి విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచడానికి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 499 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు నిర్మాణాలు పూర్తిచేశారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష జమ చేశాం. మిగిలిన లబ్ధిదారులతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు ఖాతాల్లో లోపాలు గుర్తించి సవరిస్తూ బిల్లులు అందిస్తున్నాం. – విఠోభా, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ అమరచింత: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పథక ప్రారంభంలో జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి పేదలను గుర్తించి జనవరి 26న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. ఇంటి నిర్మాణంలో పాటించాల్సిన విధి విధానాలను గ్రామసభల ద్వారా అధికారులు తెలియజేశారు. కాని అధికారుల గైడ్లెన్స్ ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టలేమంటూ లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకొచ్చి పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. మొత్తం 14 గ్రామాల్లో 1,131 మంది లబ్ధిదారులను గుర్తించి ఇంటి నిర్మాణ పత్రాలు అందించారు. వీటిలో ఇప్పటి వరకు 499 బేస్మెంట్ లేవల్కు, 54 రూఫ్ లేవల్కు, కేవలం 10 ఇళ్లు మాత్రమే స్లాబ్ లేవల్కు వచ్చినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాల సమస్య.. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలు తలెత్తడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. జాతీయ బ్యాంకుల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు హౌసింగ్శాఖ విడతల వారీగా చెల్లిస్తున్నారు. కాని ఇప్పటి వరకు యూనియన్ బ్యాంకులో మాత్రమే ఇలాంటి సమస్య తలెత్తిందని.. గుర్తించి పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడం సాధ్యం కాదంటూ లబ్ధిదారులు మండల పర్యటనకు వచ్చిన అధికారులకు ఇంటి మంజూరు పత్రాలను వెనక్కి ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో అధికారులు వారానికోమారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి త్వరగా బెస్మెంట్ నిర్మిస్తే రూ.లక్ష మంజూరు చేస్తామని, అధైర్యపడొద్దని భరోసానిస్తూ ప్రోత్సహిస్తున్నారు. బిల్లుల చెల్లింపులు.. మొదటి బిల్లు రూ.లక్ష బేస్మెంట్ నిర్మించిన తర్వాత లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. రెండోబిల్లు రూ.లక్ష గోడలు నిర్మించిన తర్వాత, మూడో బిల్లు రూ.రెండు లక్షలు స్లాబ్ వేసిన తర్వాత, చివరి బిల్లు రూ.లక్ష మరుగుదొడ్డి, ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత చెల్లిస్తారు. పైలెట్ గ్రామంగా మండలానికి ఒకటి ఎంపిక 14 గ్రామాలు.. 1,131 మంది లబ్ధిదారులు స్లాబ్ వరకు చేరినవి కేవలం 10 మాత్రమే.. బేస్మెంట్ లేవల్కు వచ్చినవి 499 అడ్డంకిగా మారిన నిబంధనలు.. మంజూరు పత్రం అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించాలి. ఇంటి నిర్మాణం 400 X 600 విస్తీర్ణం మించకుండా, ఆర్సీసీతో నిర్మించుకోవాలి. రెండు గదులతో పాటు వంట గది, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలి. అనర్హులుగా తేలినా, నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించినట్లు తెలిసినా ఇంటి మంజూరును రద్దు చేస్తూ అప్పటి వరకు చెల్లించిన బిల్లును ఆర్ఆర్ చట్టం ప్రకారం తిరిగి వసూలు చేయబడును. -
ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లిస్తే చర్యలు
వనపర్తి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీల నిధులు, వాటాలు కచ్చితంగా వారికే అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులతో జిల్లాస్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టరేట్లోకు చేరుకోగానే ఎస్పీ, అదనపు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సమీక్షలో పాల్గొని ప్రభుత్వపథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన వాటాపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం విధిగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ఏడాది ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. పౌర హక్కుల దినోత్సవం మొక్కుబడిగా కాకుండా గ్రామ చావడి, గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించాలని.. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, మీడియాకు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంక్షేమ పథకాలు ఎలా పొందవచ్చనే విషయాలపై అవగాహన కల్పించాలని, సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు ప్రతి మూడు నెలలకు ఓసారి కలెక్టర్ అధ్యక్షతన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం తప్పక నిర్వహించాలని, లేనిపక్షంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి అభ్యున్నతికి మాత్రమే కేటాయించాలని, నిధులను దారి మళ్లిస్తే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో క్రిమినల్ కేసుల సంఖ్య ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువని.. జిల్లా పోలీసుశాఖ మంచి పనితీరుతోనే సాధ్యమైందని అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉండాలని.. ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవం కోసం భావోద్వేగంతో ఉంటారని, పోలీసులు వారితో స్నేహపూర్వకంగా మెలిగి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు పరిష్కరించి భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ను కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల కేటాయింపులు పారదర్శకంగా చేపట్టాలని.. జిల్లాకేంద్రంలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం నాయకులు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. -
తీవ్రంగా నష్టపోతున్నారు..
ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను తెప్పించి ఇక్కడి మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. దీంతో చేపపిల్లలు నాణ్యతగా లేకపోవడం, సరైన మోతాదులో పంపిణీ చేయకపోవడం, చేపపిల్లల నిర్ణీత సైజు లేక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక మత్స్యకారులకు పంపిణీ చేయాలి. అక్రమాలను నివారించాలి. – లక్ష్మయ్య, అధ్యక్షుడు అమ్మాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం -
రాజ్యాంగ పరిరక్షణకే జై సంవిధాన్ : మంత్రి
చిన్నంబావి: రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని గూడెం, అమ్మాయిపల్లి, బెక్కెం గ్రామాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి మాట్లాడారు. డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని.. బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలు నెరవేర్చడం లేదన్నారు. ప్రధాని మోదీకి కార్పొరేట్లే ముఖ్యమయ్యారని విమర్శించారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యాంగ విలువలు కాపాడి ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యమని.. రాహుల్గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2009లోనే అయ్యేవారని వివరించారు. భారత్ జోడోయాత్రతో దేశ ప్రజలకు రాహుల్పై మక్కువ పెరిగిందని.. పార్లమెంట్ వేదికగా బీజేపీ నాయకులు అవమానిస్తున్నారన్నారు. అదేవిధంగా జూరాల చివరి ఆయకట్టు కోసం ఏర్పాటు చేస్తున్న లింక్ కెనాల్ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కొత్త కళ్యాణ్రావు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, బీచుపల్లి యాదవ్, చిదంబర్రెడ్డి, రంజిత్కుమర్, తేజారెడ్డి, జ్యోతిగౌడ్, మందడి కృష్ణ, గూడెం సుధాకర్ పాల్గొన్నారు. రామన్పాడులో 1,016 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం సముద్ర మట్టానికిపైన 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా జలాశయానికి నీటి సరఫరా లేదని.. రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. ఖిల్లాఘనపురం: రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తికేంద్రాలు, బూత్కమిటీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలన్నారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా బుచ్చిబాబుగౌడ్, ఉపాధ్యక్షులుగా రాజు, శాంతమ్మ, భద్రయ్య, శంకర్నాయక్, ప్రధాన కార్యదర్శులుగా దశరథం, గోపాల్రెడ్డి, కార్యదర్శులుగా కేశన్న, లక్ష్మి, తులసీకుమార్, సంధ్య, కోశాధికారిగా మల్లేష్ ఎన్నికయ్యారు. జిల్లా, మండల నాయకులు రాంరెడ్డి, గోపి ముదిరాజ్, రామచంద్రి, అక్బర్, రాజు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా 4వ మహాసభలు జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జి.శారద, ప్రధానకార్యదర్శిగా బి.కవిత, కోశాధికారిగా జి.రాధ, ఉపాధ్యక్షులుగా బి.నారా యణమ్మ, జి.జ్యోతి, వెంకటేశ్వరమ్మ, విజయ, రమాదేవి, సహాయ కార్యదర్శులుగా నాగేంద్ర మ్మ, సుమతి, అరుణ, రామచంద్రమ్మ, రాజే శ్వరి, భాగ్యలక్ష్మి, ప్రశాంతి, రాధతో పాటు 25 మంది సభ్యులుగా ఎనుకున్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
‘నీలి’నీడలు
మత్స్యకారులకు ఉచితంగా చేప విత్తనాలు ఆర్థిక భరోసా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఏటా రూ.కోట్లు వెచ్చించి.. చేప విత్తనాలు అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది పెద్దగా సత్ఫలితాలు సాధించలేకపోతోంది. దీనికోసం ఉమ్మడి పాలమూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న చేప విత్తనాల ఉత్పత్తి కేంద్రాలకు కొద్దిపాటి నిధులు వెచ్చించి.. వాటిని వినియోగంలోకి తెస్తే ప్రభుత్వం ఆశించిన నీలి విప్లవం సృష్టించవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు ‘మీన’మేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాల వారీగా ఇలా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుపయోగంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ● కొత్త కేంద్రాల ఏర్పాటుపైనా అధికారుల నిర్లక్ష్య వైఖరి ● పుష్కలంగా నీటి వనరులున్నా నిష్ప్రయోజనం ● క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టి సారించని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నష్టపోతున్న మత్స్యకారులు మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిఏటా జిల్లాల వారీగా కోట్లలో చేప విత్తనాలు అవసరమవుతాయి. జిల్లాల వారీగా చేప పిల్లల ఉత్పత్తి జరిగితే వాటిని మత్స్యకారులకు పంపిణీ చేసి పారదర్శకంగా మత్స్య పారిశ్రామిక రంగం వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మత్స్య సంపద పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి చేప విత్తనాలను తెస్తే నాణ్యత లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నదులు, జలాశయాలు, చెరువులు, కుంటలు మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో 4,624 చెరువులు, కుంటలు, జలాశయాల్లో ప్రతి ఏడాది 11.07 కోట్ల చేపపిల్లల పెంపకం లక్ష్యంగా ఉంది. చేపపిల్లల పంపిణీ కోసం ఏటా రూ.9 కోట్లు వెచ్చిస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు మత్స్యకారులకు నాణ్యమైన చేప విత్తనాలు లభించడంతోపాటు అక్రమాలకు ఆస్కారం ఉండదు. పిల్లలమర్రిలో నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ‘మీన’మేషాలు -
భూ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
వనపర్తి రూరల్: రైతుల నుంచి స్వీకరించిన భూ ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం పెబ్బేరు మండలం వై శాఖాపూర్లో జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులపై గ్రామంలో ఒక రోజు ముందుగానే చాటింపు వేయించాలని ఆదేశించా రు. నిర్ణీత నమూనాలోనే దరఖాస్తు చేసుకోవాలని, ఫారాలు నింపేందుకు రెవెన్యూ సిబ్భందిని నియమించినట్లు తెలిపారు. నోటీసులు ఇవ్వాల్సిన వాటికి వెంటనే జారీచేసి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం కంచిరావుపల్లిలోని రైతువేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని మహేశ్వర ట్రేడర్స్ దుకాణాన్ని తనిఖీచేసి లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, విత్తనాలను పరిశీలించారు. అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా సరఫరా చేయాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, డీటీ నందకిషోర్, ఆర్ఐ రాఘవేందరావు, ఏఓ షేక్ మున్నా పాల్గొన్నారు. -
వేసవి శిక్షణ.. సత్ఫలితం
శిక్షణ కేంద్రాలు ఇవే.. మదనాపురం, గోపాల్పేట, ఏదుట్ల, వీపనగండ్ల, ఖిల్లాఘనపురం, పాన్గల్, కొత్తకోట, ఆత్మకూర్, మూలమళ్లతో పాటు జిల్లాకేంద్రంలో అధికంగా క్రీడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రచారం చేయడానికి వీలు లేకపోవడంతో ఆయా మండలాల్లో పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి శిబిరాలు నిర్వహించారు. క్రీడా సామగ్రి పంపిణీ.. క్రీడాకారులకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడా సామగ్రిని అందించిందని జిల్లా క్రీడలు, యువజనశాఖ అధికారి తెలిపారు. వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ కిట్లు, అథ్లెటిక్స్ పరికరాలను ఆయా కోచ్లకు జిల్లాకేంద్రంలో అందించడంతో క్రీడాకారులు వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. రోజు ఉద యం ఎనిమిది గంటల వరకు, సాయంత్ర ఐ దు నుంచి ఆరు గంటల వరకు శిక్షణనిచ్చారు. అమరచింత: బడిఈడు పిల్లలు వేసవి సెలవుల్లో చెడుదారులు పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ కలిగిస్తూ నచ్చిన ఆటలను పరిచయం చేస్తూ తర్ఫీదునిచ్చే కార్యక్రమం చేపట్టింది. జిల్లాలోని వివిధ మండలాల్లో 10 చోట్ల క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసి మే ఒకటో తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు శిక్షణనిచ్చింది. శిబిరాలకు హాజరైన విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడలో శిక్షణ పొంది వాటిలో ప్రతిభ చాటే స్థాయికి ఎదిగారు. కోచ్లు క్రీడా నైపుణ్యాలను నేర్పిస్తూ విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వారిలోని ప్రతిభను వెలికితీయడంలో సఫలీకృతులయ్యారు. వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీతో పాటు వివిధ క్రీడా విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలించి వారికి శిక్షణ కేంద్రాలను మంజూరు చేశారు. శిక్షకులకు శిక్షణ కాలంలో గౌరవ వేతనంగా రూ.4 వేలు అందించారు. 16 ఏళ్లలోపు విద్యార్థుల పేర్లను నమోదు చేసుకొని వారికి నెల పాటు శిక్షణనిచ్చినట్లు కోచ్లు వెల్లడించారు. జిల్లాలో ముగిసిన క్రీడా శిబిరాలు వివిధ ఆటల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పాఠశాల స్థాయిలో విద్యతో పాటు ఆటలపై దృష్టి హాకీ, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో తర్ఫీదు -
పునరావాస పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్తండా, అంజనగిరి తండా, వడ్డె గుడిసెలు తదితర గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్, ఎల్లూర్ గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు. -
వన మహోత్సవ లక్ష్యం 21 లక్షలు
వనపర్తి: ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 21 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ ఆదర్శ సురభి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్లో మండల అధికారులు పాల్గొనగా వన మహోత్సవంపై దిశా నిర్దేశం చేశారు. లక్ష్య సాధనకు ప్రతి గ్రామం, మండలం, పురపాలికకు సంబంధించి నిర్ధిష్ట ప్రణాళిక సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ గొప్పగా జరగాలని, రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర పెద్ద మొక్కలు నాటాలని, దీంతో గ్రామానికి కళ వస్తుందన్నారు. ప్రస్తుత ఫొటోలు.. మొక్కలు నాటిన నెల తర్వాత తిరిగి ఫొటోలు తీసి సమర్పించాలని ఎంపీడీఓలు, పుర కమిషనర్లను ఆదేశించారు. వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల ప్రాంగణాల్లో మొక్కలతో కంచె వేయాలన్నారు. సాగునీటి కాల్వల వెంట ఖాళీ స్థలాల్లో ఈత, తాటి మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. అన్ని శాఖలకు మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించామని.. అందుకు అనుగుణంగా స్థలాలు గుర్తించి మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేసి టీజీఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ చేయాలన్నారు. కోతులు అడవిని వదిలి పల్లెలు, పట్టణాలకు వస్తున్నాయని.. వాటికి ఆహారం దొరికేలా అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు విరివిగా పెంచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని.. అప్పుడే నాటిన మొక్కలు బతికి ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి వన మహోత్సవం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ప్రతి ఇంటికి 5 పండ్ల మొక్కలు పంపిణీ చేసేలా చూడాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, జిల్లా ఇన్చార్జ్ అటవీశాఖ అధికారి సత్యనారాయణ, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఇంటింటికి 5 పండ్ల మొక్కలు కలెక్టర్ ఆదర్శ్ సురభి -
హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు..
ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చా. పనులు దొరక్కపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఓ వ్యక్తి పరిచయమై చేపల కంపెనీలో పనిచేసేందుకు పిలిచాడు. అడ్రస్ చెప్పలేదు. అతడి వెంట వచ్చా. మల్లేశ్వరంలో ఓ వ్యక్తికి అప్పగించాడు. 5 నెలలుగా కృష్ణానదిలో చేపల వలలు లాగే పనులు చేశా. రోజు అన్నంతోపాటు కారంపొడి పెట్టేవారు. లేదంటే చేపలు వండుకొని తినాలి. రాత్రి, పగలు పనిచేయాలి. పని చేయలేమంటే కొట్టేవారు. మూత్రానికి వెళ్లినా ఒకరిద్దరు మాకు కాపలా ఉంటారు. పనిచేసినందుకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. అధికారులు జీతాలు ఇప్పించకుండానే మా ఊళ్లకు పంపించారు. – రాహుల్, బెంగుళూరు ● -
టీపీసీసీలో మనోళ్లు
ఉమ్మడి పాలమూరు నుంచి ఆరుగురికి చోటు త్వరలోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక? టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించడంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరో వారంలో రోజుల్లో పూర్తిస్థాయిలో డీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామక జాబితాను సోమవారం ఏఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు నాయకులకు చోటు దక్కింది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, ఐదుగురు ప్రధాన కార్యదర్శులుగా ఉండగా.. ఈసారి ఆరుగురికి కార్యవర్గంలో చోటు కల్పించారు. కార్యవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ ఉపాధ్యక్షులుగా 27 మందిని ఎంపిక చేయగా వీరిలో ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ నియమితులయ్యారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 69 మందితో జాబితా ప్రకటించగా ఉమ్మడి జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్, ఏపీ మిథున్రెడ్డి, గద్వాల నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్లో పనిచేసిన ఎం.రాజీవ్రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన నందిమల్ల యాదయ్య ముదిరాజ్లను ఎంపిక చేశారు. వీరిలో సంజీవ్ ముదిరాజ్ ప్రస్తుత కార్యవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా మళ్లీ అదే పదవిని కట్టబెట్టారు. కార్యకర్తల్లో హుషారు టీపీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేయడంపై ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల్లో హుషారు నింపింది. ఇప్పటికే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించగా.. టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు నాయకులకు చోటు దక్కడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రధాన కార్యదర్శులుగా ‘పేట’ ఎమ్మెల్యే పర్ణికారెడ్డితోపాటు మరోనలుగురు -
మెట్ట సాగు తగ్గుముఖం
జిల్లాలో 50 శాతానికిపైగా తగ్గిన పంటల విస్తీర్ణం ●అవగాహన కల్పిస్తున్నాం.. ప్రత్యేక రాష్ట్రంలో జిల్లా ఏర్పాటు తర్వాత ప్రాజెక్టులు, పంట కాల్వలతో సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. దీంతో చాలామంది రైతులు వర్షాధార మెట్టపంటల సాగును తగ్గించి వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మెట్టపంటల సాగు ప్రాముఖ్యత, మార్కెటింగ్, పెరిగిన ధరలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
హక్కుల సాధనకుసంఘటితంగా పోరాటం
వనపర్తిటౌన్: హక్కుల సాధన కోసం భవన నిర్మాణ, ఇతర 54 రంగాల కార్మికులు సంఘటితంగా పోరాడాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోటం రాజు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా నాలుగో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల పింఛన్, ఇళ్లు లేని వారికి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు జూలై 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో అందరు కార్మికులు పనులు నిలిపివేసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు, అధ్యక్షుడు గంధం మదన్, జిల్లా కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, ఉపాధ్యక్షులు డి.కురుమయ్య, కె.వెంకటయ్య, చెన్నారం శ్రీను, బాలస్వామి, రాబర్ట్, బాలరాజు, నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి : బీజేపీ వనపర్తిటౌన్: పురపాలికలో పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కృషి చేయాలని.. త్వరలో వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు శ్రమించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ కోరారు. ఆదివారం పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఉందేకోటి అంజి, జి.ఉపేందర్ యాదవ్, కాటమోని రాణిగౌడ్, అశ్విని గోవింద్, ప్రధాన కార్యదర్శులుగా దంతోజు నవీన్చారి, అరవింద్, కార్యదర్శులుగా కడమంచి శివ, అశ్విని, పవన్, మందడి మనీషా, రేణుక, పట్టణ కోశాధికారిగా కూన శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్గా వంశీ యాదవ్, కార్యవర్గ సభ్యులుగా వసంత్కుమార్రెడ్డి, కిషోర్కుమార్, ఉందేకోటి వెంకటేష్, శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం పుర ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీ శ్రేయస్సుకు శ్రమించాలన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని, సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేందర్రెడ్డి, పట్టణ ఇన్చార్జ్ బి.శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర సహ కోశాధికారి జ్యోతి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కుమారస్వామి, వెంకటేశ్వర్రెడ్డి, సీతారాములు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారానికి కృషి వనపర్తి: గ్రామస్థాయి నుంచి వచ్చిన తనకు జర్నలిస్ట్ల సమస్యలు తెలుసని.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేయడంతో పాటు జీవిత బీమా చేయిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని.. స్నేహపూర్వకంగా ఎవరి ఆత్మగౌరవం దెబ్బతీయకుండా స్వేచ్ఛా వాతావరణంలో పాలన అందిస్తానని వివరించారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులు నిజాలు, సమస్యలను నిర్భయంగా రాయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా మిగిలిన జిల్లా, మండలాల ప్రెస్క్లబ్ స్థలం, భవన నిర్మాణం, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాల కేటాయింపు, రాజీవ్ యువశక్తి పథకం వర్తింపునకు తాను బాధ్యత తీసుకుంటానని భరోసానిచ్చారు. అనంతరం జర్నలిస్టులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు స్పందిస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నియోజవర్గంలోని అన్ని మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి విస్తరణలో కదలిక
జిల్లాకేంద్రంలో పునః ప్రారంభమైన పనులు●వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ పనుల్లో కదలిక వచ్చింది. గత ప్రభుత్వ హయంలో పలు ప్రాంతాల్లో రహదారి విస్తరణ చేపట్టినా డివైడర్ల నిర్మాణాలు మిగిలిపోగా, పానగల్, కర్నూలు రోడ్లు విస్తరణకు నోచుకోలేదు. ప్రస్తుతం పానగల్ రోడ్ విస్తరణకు మార్గం సుగమం కాగా.. బడా వ్యాపారులుండే కర్నూలు రోడ్పై సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రహదారుల విస్తరణ చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా.. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పానగల్ రోడ్ను 100 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించినా.. ఆ ప్రాంతంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని 70 అడుగులకు కుదించి అందుకు అనుగుణంగా మార్కింగ్ ఇస్తున్నారు. స్వల్పం నుంచి పూర్తిస్థాయి వరకు ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోయే 63 మంది వివరాలు సేకరించారు. బాధితులు ఏం ఆశిస్తున్నారనే అంశాలతో అధికారులు నివేదికను సిద్ధం చేసి కలెక్టర్కు అందించడంతో దాదాపు విస్తరణ ఖాయమైనట్లే కనిపిస్తోంది. కర్నూలు రోడ్పై ఉత్కంఠ.. కర్నూలు రోడ్ను 100 అడుగుల మేర విస్తరించాలని అధికారులు నిర్ణయించగా.. 70 నుంచి 80 అడుగుల వరకే విస్తరించాలని ఈ ప్రాంత వ్యాపారుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ రహదారిలో 130 వరకు భవన సముదాయాలకు నష్టం వాటిల్లనుంది. ఈ దారిలో పాలిటెక్నిక్ కళాశాల రోడ్ నుంచి రామాలయం వరకు పూర్తిస్థాయిలో విస్తరణకు మార్కింగ్ ఇచ్చినా.. అధికారులు, వ్యాపారులు ప్రస్తుత మార్కింగే ఫైనల్ అని చెప్పే స్థితిలో లేకపోవడంతో విస్తరణ అంశం సందిగ్ధంలో పడిందనే భావన వ్యక్తమవుతోంది. దీనికితోడు రహదారికి ఓ వైపు ఉన్న దుకాణాలు అక్రమ కట్టడాలని రెండేళ్ల కిందట పుర అధికారులు తేల్చారు. ఆక్రమణలపై కొరడా ఝుళిపించకపోతే సక్రమంగా ఉన్న దుకాణదారులు నష్టపోతారనే వాదన వినిపిస్తుండగా.. ఆక్రమణలు తొలగించాలంటే వనపర్తిలో ఏవీ ఉండవని మరోపక్క ఉన్న వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు రోడ్డు విస్తరణ బాధితులకు డబుల్, ఖాళీ స్ధలాలు, టీడీఆర్ను అధికారులు తెరపైకి తీసుకొచ్చినప్పటికీ వ్యాపారులెవరూ ఆ ఊసే ఎత్తడం లేదని తెలుస్తోంది. అధికారులకు కూడా ఆ వివరాలు రాబట్టేందుకు ప్రయాస తప్పడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు.. జిల్లాకేంద్రంలో రహదారుల విస్తరణ పనులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపడతాం. పానగల్ రహదారిలో ఇప్పటికే బాధితుల నుంచి అభిప్రాయాలు సేకరించాం. బాధితులను ఆదుకునేందుకు కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని టీడీఆర్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాం. పుర ప్రజల విస్తరణ కల త్వరలోనే తీరనుంది. – ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి పానగల్ రోడ్లో మార్గం సుగమం కర్నూల్ రోడ్లో వీడని సందిగ్ధత -
అధికారులు ఏం తేల్చారంటే..
పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఉన్న రోడ్ నుంచి రామాలయం వరకు పుర స్థలంలో ఆక్రమణదారులు తిష్ఠ వేసినట్లు గుర్తించారు. ఒక్కొక్కరు 3 ఫీట్ల నుంచి 40 అడుగుల వరకు స్థలాన్ని ఆక్రమించారని గుర్తించి వాటి తొలగింపునకు చర్యలు చేపట్టడంతో బస్టాండ్ మార్గంలో ఉండే బడా వ్యాపారులు కంగుతున్నారు. అత్యధికంగా పుర స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేసినట్లు తేలడంతో పొక్లెయిన్లతో మెట్లు, ర్యాంప్లను తొలగించారు. అంతలో ప్రభుత్వం మారడంతో ఆ అంఽశం మరుగునపడింది. పుర అధికారులు బస్టాండ్ మార్గంలో నిర్మాణాలపై మాస్టర్ ప్లాన్, అప్పట్లో వేసిన వెంచర్లు బయటకు తీయగా రాజారామేశ్వర్రావు పాలిటెక్నిక్ కళాశాల నుంచి బస్టాండ్కు వెళ్లే రోడ్డుకు 20 ఫీట్ల గ్రీన్ మార్కెట్కు స్థలం వదలగా.. ఆ స్థలంలోనూ నిర్మాణాలు చేసినట్లు తేలింది. దీనికితోడు కొన్నిచోట్ల డాక్యుమెంట్లలో ఉన్న స్థలానికి అదనంగా ఆక్రమించి నిర్మాణాలు గుర్తించారు. -
మంత్రివర్గంలో చోటు హర్షణీయం
కొత్తకోట రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని వడ్డెవాటలో సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు భీమన్ననాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిథ్యం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని.. అనేక పోరాటాల ఫలితంగానే కరుడుగట్టిన కాంగ్రెస్పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటిసారి ఇద్దరు, రెండోసారి ఒక బీసీకి మంత్రివర్గంలో అవకాశమిచ్చారన్నారు. బీసీల పోరాటం ఎక్కడా వృథా కాలేదని.. ఇటీవల ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్పార్టీ చరిత్రలో లేనివిధంగా అగ్రకుల సామాజిక వర్గానికి లేకుండా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారని తెలిపారు. ఎవరి వాటా వారికి దక్కాలని రాహుల్గాంధీ చెప్పారని.. అందుకు అనుగుణంగా అటు ఇటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎమ్మెల్సీగా, మంత్రులుగా అవకాశం దక్కడం హర్షిస్తున్నామన్నారు. ఇదే పద్ధతిన నామినేటెడ్ పోస్టులు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, సమాచార కమిషన్లో బీసీల వాటా బీసీలకు కేటాయించాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించి రెండు నెలలవుతుందని.. రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పారని.. బీజేపీని నమ్మాలంటే బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామన్నగౌడ్, జిల్లా అధ్యక్షుడు బాలరాజుగౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దోమ వెంకట్ ముదిరాజ్, బీసీ నేతలు జనార్దన్గౌడ్, బస్వరాజ్, రంగస్వామి, వెంకటన్నగౌడ్, శ్రీనివాస్గౌడ్, తిరుపతయ్య, రాందాస్, ఉద్యోగ సంఘం నేతలు వెంకటేష్, మహేష్ మేరు, దోమ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
మదనాపురం: అమరచింతలో ఈ నెల 11న నిర్వహించే టీయూసీఐ జిల్లా మహాసభలకు కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్, కోశాధికారి రాజు కోరారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. టీయూసీఐ కార్మిక సంఘం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అమరచింత ఉద్యమాలకు కేంద్రంగా మారిందని.. అందుకే మహాసభలు అక్కడే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గోవర్ధన్రెడ్డి, రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నూనెగింజల సాగుతో అధిక లాభాలు
కొత్తకోట రూరల్: నూనెగింజల సాగుతో రైతులు అధిక దిగుబడులతో పాటు లాభాలు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజేందర్రెడ్డి అన్నారు. వానాకాలం పంటల సాగులో తీసుకోవాల్సిన చర్యలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కృషి విజ్ఞాన కేంద్రం, భారతీయ నూనెగింజల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మే 29 నుంచి జూన్ 12 వరకు ‘వికసిత కృషి సంకల్ప అభియన్’ కార్యక్రమం మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తోంది. ఆదివారం మండలంలోని మిరాసిపల్లిలో జరిగిన కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి వరి సాగులో సమస్యలు, సేంద్రియ వ్యవసాయం, పచ్చిరోట్ట ఆవశ్యకత, జీవన ఎరువుల వాడకం, పప్పు, చిరుధాన్యాల సాగు.. యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. భారతీయ నూనెగింజల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. రమ్య వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుతు, నువ్వుల రకాలు, సాగు యాజమాన్య పద్ధతులను వివరించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, భూసార సంరక్షణ, నేల ఆరోగ్యం గురించి వివరించడంతో పాటు మార్కెటింగ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధ్దలతో బక్రీద్
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు బక్రీద్ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాకేంద్రం శివారు గోపాల్పేట రహదారిలో ఉన్న ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. అదేవిధంగా తొలిసారి శ్రీనివాసపురంలో ముస్లింలకు కేటాయించిన స్థలంలో కూడా పలువురు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ముస్లింలు పట్టణం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఈద్గాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి శ్రీనివాసపురంలో, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తన నివాసంలో ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనీరతి, సహనానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారని ఎమ్మెల్యే మేఘారెడ్డి వివరించారు. విశ్వాసం, నమ్మకం, పరోపకారానికి బక్రీద్ ప్రతీక అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ముస్లీంలకు వివిధ పార్టీల ప్రముఖులు, అధికారులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, చీర్ల విజయచందర్, వెంకటయ్య యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు జిల్లాకేంద్రంలో తొలిసారిగా శ్రీనివాసపురం ప్రాంతంలో కేటాయించిన స్థలంలో నమాజ్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేఘారెడ్డి -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గతేడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి ఏ కేటగిరికి మారుస్తామని.. దీంతోపాటు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్లకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైంది. కాగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీహరికి బెర్త్ దక్కడంతో.. రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్తో ప్రశంసలు.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం -
నెలకు మూడు చీరలు..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా. – దాస్పత్తి తిమ్ములు, నేత కార్మికుడు అత్యంత ప్రామాణికంతో.. చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్ వీవర్స్ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు స్థల ప్రభావం లేదు.. ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా. – పద్మ, నేత కార్మికురాలు నెలవారీగా వేతనాలు.. అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య చేనేత అంతరించకుండా.. పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. – మహంకాళి శేఖర్, కంపెనీ సీఈఓ ● -
పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా
చిన్నంబావి: తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం స్వగ్రామైన పెద్దదగడలో ఆయన గ్రామస్తులతో కలిసి వీధుల్లో పర్యటించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఇంతటివాడిని చేసిన గ్రామానికి ఎంతో చేయాల్సి ఉందని.. రానున్న కొద్దిరోజుల్లో గ్రామ రూపురేఖలు మార్చేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ, రూ.రెండు కోట్లతో తిరుమలనాథస్వామి ఆలయ మరమ్మతులు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకు 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంగల నీటి ట్యాంకును నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గ్రామానికి 100కు పైగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి మట్టి మిద్దె లేని గ్రామంగా చూడాలన్నదే తన సంకల్పమని వివరించారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేదని రైతులు అడగగా.. రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రధాన కూడలిని రూ.కోటితో పట్టణ స్థాయిలో పార్క్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా.. తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొప్పునూరులో బీరప్ప ఆలయంలో పూజలకు హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, బీచుపల్లి యాదవ్, మాజీ సర్పంచ్ సురేందర్సింగ్, వెంకటేష్, నర్సింహ, రజినిబాబు, నరేష్ కుమార్, బొల్లు శ్రీనివాసులు, యుగంధర్గౌడ్, మధు గౌడ్, శంకర్ యాదవ్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ రూపురేఖలు మారుస్తా రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భక్తిభావం పెంపొందించుకోవాలి పాన్గల్: ప్రతి ఒక్కరూ భక్తిభావంతో పాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని గోప్లాపూర్లో సీతారామాంజనేయస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. పండుగలను శాంతియుత వాతావరణంలో ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. పిల్లలను గొప్ప చదువులు చదివించాలని.. విద్యబుద్ధులతో పాటు సోదర భావం, ప్రేమానురాగాలు, ధైర్యం, సాహసం, పట్టుదలవంటి లక్షణాలను నేర్పించాలన్నారు. మహాత్ముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా లక్ష్యం కోసం ప్రయత్నించాలని సూచించారు. కుటుంబాల్లో చిన్న, చిన్న విషయాలకు సోదరుల మధ్య ఘర్షణలు, తల్లిదండ్రులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని, అందరూ కలిసికట్టుగా ఉండాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విండో డైరెక్టర్ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్పార్టీ మండల నాయకులు రవికుమా ర్, వెంకటేష్నాయుడు, పుల్లారావు, రాముయాదవ్, భాస్కర్యాదవ్, బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
టెంట్ సప్లయ్ చేసినందుకు..
మాది చిన్నధన్వాడ గ్రామం. అయితే గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి టెంట్లు, డ్రమ్ములు, సప్లయర్ వస్తువులు అద్దెకు అందిస్తూ జీవనం సాగిస్తున్నాం. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న క్రమంలో మా ఆయన పరుశరాముడు టెంట్ ఇతర వస్తువులు సప్లయ్ చేశాడు. దానికి బుధవారం జరిగిన ఘటనలో ఆయన పేరు చేర్చి రిమాండ్కు తరలించారు. నాయకులు, పెద్ద వాళ్లు అయితే ఏదోలా బయట పడతారు. కానీ పని చేసుకుని బతికే మమ్మల్ని ఎవరు బయటకు తీసుకువస్తారు. మాకు ముగ్గురు పిల్లలున్నారు. పిల్లలకు బడులు ప్రారంభమవుతాయి. కానీ ఇంట్లో నా భర్త లేని కారణంగా మాకు ఏం అర్ధం కావడం లేదు. – శ్రావణి, రిమాండ్కు వెళ్లిన పరుశరాముడి భార్య ● -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సంతోష్కుమార్ చెప్పారు. శుక్రవారం ఆర్ఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పది డిపోల నుంచి ఈ బస్సు (సూపర్ లగ్జరీ, డీలక్స్)లను అవసరమైన చోటకు పంపడానికి సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏడు రూట్లలో ఆయా ప్యాకేజీలను బట్టి చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ బస్సులో సామూహికంగా ఏదైనా సంస్థ (పాఠశాలలు, కళాశాలలు) లేదా ఇతర సంఘాల తరఫున ఒకేసారి 30 నుంచి 35 మంది వరకు వెళ్లొచ్చేందుకు బుక్ చేసిన వారి పేర ఒకరికి ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అందరికీ కలిపి పది శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు మహబూబ్నగర్ డిపో మేనేజర్ (ఫోన్ నం.99592 26286)ను సంప్రదించవచ్చన్నారు. దీనికి సంబంధించి ఈనెల 27న రాష్ట్రస్థాయిలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. అంతకంటే ముందే ఎవరైనా ఈ ప్యాకేజీలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఈ ప్యాకేజీకి చెందిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ, డీఎం బి.సుజాత, పీఓ వి.సుజాత, ఏఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ నుంచి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఈ నెల 27న ప్రారంభం: ఆర్ఎం -
ఆ.. 40లో ఉన్నదెవరు?
రాజోళి: రాజోళి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ప్యాక్టరీ వద్ద జరిగిన రగడ రోజురోజుకో మలుపు తిరుగుతుంది. బుధవారం ఫ్యాక్టరీ, వాహనాలపై దాడులు, కంటైనర్ తగలబెట్టిన ఘటనల్లో పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో 12 మందిని ఇప్పటికే రిమాండ్కు తరలించారు. తాజాగా మిగిలిన వారిపై కేసులు, రిమాండ్కు తరలిస్తారని తెలియడంతో పెద్దధన్వాడతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 మందిని రిమాండ్ పంపించగా అందులో ఒకరు చిన్నధన్వాడకు చెందిన వ్యక్తి ఉన్నాడు. మిగతా వారు పెద్దధన్వాడ గ్రామస్తులే. అయితే మిగిలిన 29 మందిలో ఏ గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నారు? వారిపై ఎలాంటి కేసులు నమోదు చేశారనే ఆందోళన నెలకొంది. అసలు ఆ కేసుల్లో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారా, రైతులా, కూలీలా, మహిళలు ఉన్నారా అనే అనుమానాలు ఆయా గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. జైలుకు వెళితే రాజకీయ నాయకులు ఏదోలా బయటకు వస్తారు మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అసలు 40 మందితోనే కేసులు ఆగుతాయా లేక వీడియోల ఆధారంగా మరికొంత మందిపై కేసులు నమోదు చేస్తారా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. చిన్నధన్వాడలో ఒక్కరిపైనే కేసు నమోదు కాగా.. మాన్దొడ్డి, నసనూరు, తుమ్మిళ్ల తదితర గ్రామాల్లో ఎవరిౖపైనెనా కేసులు నమోదు చేశారు అనే అనుమానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఒక జైలర్ శాఖకు సంబందించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే కోణంలో దర్యాప్తులు జరుగుతున్నట్లు సమాచారం. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనలో పలువురిపై పోలీసుల ప్రత్యేక నజర్ కొందరి స్వార్థంతో అమాయక రైతులు బలయ్యారని వాదన ఇప్పటికే 12 మంది రిమాండ్.. మరికొందరిపై కేసులు ? ఆందోళనలో జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు -
మూడేళ్లలో ‘పాలమూరు’ పూర్తి
అడ్డాకుల/నవాబుపేట: ‘కుట్రదారులు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తెలంగాణ రైజింగ్ను ఆపలేరని.. తెలంగాణ వెలుగుతోంది.. మనకు ఇక ప్రపంచంతోనే పోటీ’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతలను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.శుక్రవారం నవాబ్పేట, మూసాపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ను బట్టి 2033– 35 సంవత్సరానికి ప్రణాళిక వేసుకుని 33,700 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంపద సృిష్టించి.. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు విద్యుత్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి భవిష్యత్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా వివిధ దేశాల కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేస్తాం నిధులు ఆవిరైనా.. నీళ్లు రాలేదని... కాంగ్రెస్ ప్రభుత్వమే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేస్తారని, అందుకు కేబినెట్ కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూ.70 కోట్లు, శంకరసముద్రం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.32 కోట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే చౌదర్పల్లి లిఫ్ట్కు సాధ్యమైనంత త్వరగా ఆర్థికపరమైన అనుమతులిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో దొంగలు పడ్డట్లు దోపిడీ చేశారని విమర్శించారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ తెలంగాణ ఇవ్వలేదు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినా చంద్రబాబునాయుడు వద్దన్నందుకే బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా నాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ పాలన మాదిరిగా సాగితే రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చేదన్నారు. అందుకే బీఆర్ఎస్ను దగ్గరికి రాకుండా దూరం పెట్టాలని ప్రజలను కోరారు. కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ స్వర్ణమ్మ, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మా ర్కెట్ చైర్మన్లు ప్రశాంత్, కతలప్ప పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు రూ.102 కోట్లు విడుదల చేస్తాం చౌదర్పల్లి లిఫ్ట్కు త్వరలో అనుమతులు తెలంగాణ రైజింగ్ను ఆపలేరు -
ప్రజాపాలనలో భూ సమస్యలు పరిష్కారం
మంత్రి ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నంబావి: బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఎంతోమంది రైతులను ఇబ్బందులకు గురి చేసిందని.. ప్రజా ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మంత్రి స్వగ్రామం మండలంలోని పెద్దదగడలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్నేళ్లుగా భూ సమస్యలతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడటమేగాక ఎన్నో మానవ ఘోరాలకు భూ వివాదమే కారణం అవుతుందని తెలిపారు. దీర్ఘకాలిక భూ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చిందని చెప్పారు. గత పాలకులు ధరణి ద్వారా అనేక అక్రమాలకు తెర తీసారని.. వాటికి కొత్త చట్టం ద్వారా చరమగీతం పాడుతామన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయట వేయడమేగాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాయని వివరించారు. గ్రామంలో 100 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టునున్నట్లు తెలిపారు. అదేవిధంగా సర్వేనంబర్ 30లో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ బాషా, తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, ఎంపీడీఓ రమణారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కళ్యాణ్రావు, బీచుపల్లి యా దవ్, కృష్ణప్రసాద్ యాదవ్, విద్యాసాగర్రావు, తేజారెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్సింగ్, మాజీ ఎంపీటీ సీ సభ్యురాలు పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
వనపర్తి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులు, క్షయ, మధుమేహం గుర్తించడం, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా, వాంతులు, విరేచనాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు చేపట్టడంతో పాటు రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. మధుమేహం, క్షయ వ్యాధిగ్రస్తులకు అందించే వైద్యం, వాడుతున్న మందులపై నివేదిక తయారుచేసి ఆన్లైన్ పోర్టల్లో నిక్షిప్తం చేస్తూ వైద్యచికిత్సలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే ప్రత్యేక యాప్ జూన్ 20 వరకు అందుబాటులోకి వస్తుందని, అవసరమైన అన్ని వివరాలు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలపై సమీక్షిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఏఎన్సీ వైద్య పరీక్షలు సమయానుసారం నిర్వహిస్తూ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు డా. సాయినాథ్రెడ్డి, డా. రామచందర్రావు, డా. పరిమళ, ఇతర ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
మరుగునపడిన మలశుద్ధి
జిల్లాకేంద్రంలో కర్మాగారం ఏర్పాటుకు పడని అడుగులు ఆదాయ సమీకరణకు.. గ్రామాలు, పట్టణాల్లో మానవ వ్యర్థాలను యథేచ్ఛగా కాల్వల్లోకి వదులుతున్నారు. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని.. దీనిని శాశ్వతంగా నిర్మూలించేందుకు పురపాలికల్లో కర్మాగారాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మల శుద్ధి కర్మాగారాల ద్వారా ఎరువు తయారు చేసే విధానం అమలులోకి తేవాలని భావించింది. ఈ ప్రక్రియ ద్వారా వచ్చే ఎరువును మొక్కలు, రైతులు పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవచ్చు. ఎరువు విక్రయంతో పురపాలికకు కూడా ఆదాయం సమకూరనుంది. ఈ విధానం ఇప్పటికే వరంగల్, రాజన్న సిరిసిల్లలో అమలువుతున్నందున మిగతా పురపాలికలకు విస్తరించనున్నారు. కానీ ఆ దిశగా పురపాలికలో ఇప్పటి వరకు అడుగులు పడకపోవడం శోచనీయం. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే త్వరలోనే ప్రారంభం కానుంది. వనపర్తి టౌన్: జిల్లాకేంద్రానికి ఐదేళ్ల కిందట మలశుద్ధి కర్మాగారం మంజూరైంది. అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా మొదట పురపాలికలోని నాగవరం శివారులో ఎకరా స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలం కేంద్రం నిర్మాణానికి అనువుగా లేదని అధికారులు నిర్ణయించడంతో రెండేళ్ల కిందట పాన్గల్ రోడ్లో కేటాయించారు. అప్పటి నుంచి పనులు చేపట్టేందుకు ఏజెన్సీ ముందుకు రాకపోవడం.. తర్వాత బదిలీపై వచ్చిన అధికారులు అవగాహన లేమితో మిన్నకుండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 2022, ిఫిబ్రవరి 18న పుర బడ్జెట్ సమావేశంలో మలశుద్ధి కర్మాగారం నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ పుర అధికారులను ప్రశ్నించగా ఏజెన్సీ ముందుకు రావడం లేదని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని సీడీఎంఏ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయా లని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్లోని పాత పురపాలికల్లో మానవ వ్యర్థాల రీసైక్లింగ్ చేసేందుకు ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. చర్యలు చేపడతాం.. జిల్లాకేంద్రంలో మలశుద్ధి కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాలను ఇంజినీరింగ్ విభాగం నుంచి తీసుకుంటాం. గతంలో ప్రక్రియ ఎక్కడి వరకు జరిగింది.. ఎందుకు నిలిచిపోయింది.. స్థలం కేటాయింపు, నిర్మాణం, ప్రభుత్వ ఆదేశాలను అధ్యయనం చేస్తాం. ఉన్నతాధికారులకు విన్నవించి వారి ఆదేశానుసారం ముందుకు సాగుతాం. – ఎన్. వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి ఐదేళ్ల కిందటే ఎకరా స్థలం కేటాయింపు.. పట్టించుకోని అధికారులు నిర్మాణానికి నోచుకోని వైనం -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
వనపర్తి టౌన్: రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులకు తెలియజేస్తూ వారి కేసులను పరిష్కరించాలని, కక్షిదారులు కోర్టు చుట్టూ తిరగకుండా త్వరగా కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ సువర్ణ అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఈ నెల 14న నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసులు క్రిమినల్, న్యాయవాదులు సివిల్ కేసులను అధిక మొత్తంలో పరిష్కరించాలన్నారు. కేసు పరిష్కారమయ్యే వరకు కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసును పరిష్కరించుకుంటే ఎలాంటి తగాదాలకు తావుండదని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రజనీ, సీనియర్ సివిల్ జడ్జి కల్పన, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కవిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీలత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ● ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అందరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె కోరారు. -
నిపుణుల అభిప్రాయం
పెబ్బేరు గోదాంలో గల రూ.7కోట్ల విలువ గల గన్నీ బ్యాకులు దగ్ధమైన ఘటనపై జిల్లాకు సంబంధించిన డీసీఆర్బీ డీఎస్పీ, సీసీఎస్, ఎస్బీ వంటి విభాగాలతో విచారణ చేయడంతోపాటు హైదరాబాద్ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీంను పిలిపించి క్షుణ్ణంగా ఆధారాలు సేకరించాం. ఈ కేసులో దాదాపు వంద మందికిపైగా విచారించాం. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం. గన్నీ బ్యాగులు దగ్ధమైనప్పు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేదని, గోదాం పైకప్పు మీద గల రేకులు (ట్రాన్పరెంట్ షీట్స్) దగ్గరగా ఉండే బస్తాలు వేడికి మంటలు వచ్చి తగులబడి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. – రాంబాబు, సీఐ, పెబ్బేరు ● -
అలజడి.. ఆందోళన
● ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త ఘటనలతో గ్రామాల్లో అలజడి ● అరెస్టులతో 12 గ్రామాల్లో ఆందోళన ● 41 మందిపై కేసు.. 12 మంది రిమాండ్ ● ఘటనపై మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజల్లో కునుకులేకుండా పోయింది. తాజాగా బుధవారం ఫ్యాక్టరీ వద్ద జరిగిన దాడులు, నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో పెద్ద ధన్వాడతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. రైతులు చేసిన దాడికి సంబంధించి కంపెనీకి చెందిన సీఏఓ మంజునాథ్ రాజోళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడుల్లో తమ సిబ్బంది పలువురికి గాయాలు కావడంతో పాటు కంపెనీకి చెందిన వాహనాలు, సామగ్రి ధ్వంసమైనట్లు అందులో పేర్కొన్నారు. దాడులకు దిగిన 41 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేయగా.. ఇందులో జనం సాక్షి పత్రిక ఎడిటర్ రహమాన్తో పాటు నాగర్కర్నూల్ జిల్లా సబ్ జైలర్ నాగరాజు ఉండడం చర్చనీయాంశంగా మారింది. దాడుల సమయంలో వారు ఘటన స్థలంలో లేరని.. అయినా వీరి పేరు చేర్చడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై రాజోళి ఎస్సై జగదీష్ని సంప్రదించగా.. దాడులకు ప్రేరేపించింది రహమాన్, నాగరాజు అని, మంజునాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా.. కేసులు నమోదైన వారిలో 12 మందిని పోలీసులు గద్వాల జిల్లా కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్కు తరలించిన వారిలో పెద్ద ధన్వాడకు చెందిన రైతులు నర్సింహులు, కె.నర్సింహులు, భరత్ కుమార్, చిన్న నాగేంద్ర, నల్లబోతుల కాటన్, శివ గౌడ్, సూర్యప్రకాష్, భీమన్న, మనోహర్, యేసన్న, నాగేంద్రంతోపాటు చిన్న ధన్వాడకు చెందిన పరుషరాముడు ఉన్నారు. జడ్జి తీర్పు అనంతరం పోలీసులు వీరిని ప్రత్యేక వాహనంలో మహబూబ్నగర్లోని జిల్లా జైలుకు తరలించారు. బుధవారం ఘటన అనంతరం రాత్రి పోలీసులు అరెస్టులు మొదలు పెట్టడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామంతో పాటు ఇటు చిన్నధన్వాడ గ్రామస్తుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు తీసిన వీడియోల ఆధారంగా అరెస్టులు ఉంటాయని తెలియడంతో, మామూలుగా ఘటనా స్థలి దగ్గరకు వెళ్లిన వారు కూడా ఆందోళన చెందుతున్నారు. వీరితో పాటు అదే ప్రాంతంలో ఫ్యాక్టరీ పక్కనే తమ పొలాలు ఉన్న వారు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. వారు కూడా తమపై ఏదైనా చర్యలుంటాయనే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ సాటి రైతులపై కేసులు నమోదయ్యాయని తెలిసి భయబ్రాంతులకు గురవుతున్న రైతులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మానుష్యంగా మారిన పెద్ద ధన్వాడ గ్రామం బిక్కుబిక్కుమంటూ... ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపై దాడి చేయడం తగదని.. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని గురువారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమంగా కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని.. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుని అడ్డుకోవడం రైతుల ప్రాఽథమిక హక్కు అని.. ఓ మైనర్పై కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. ఇథనాల కంపెనీ ఏర్పాటుతో పర్యావరణ ప్రభావం అంచనాను తాజాగా చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని, రాజోళి ఎస్సై జగదీశ్వర్తో పాటు గాయత్రి ఇండస్ట్రీస్ అండ్ రెన్యువేబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా పోలీస్ హింసలో గాయపడిన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటిషన్ను స్వీకరించిన కమిషన్ 13030/ఐఎన్/2025 నంబర్తో కేసు నమోదు చేసింది. కాగా.. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తులు దాడి చేయడం వల్ల తాము గాయపడ్డామని పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ, కుర్వ క్రిష్ణ, కుర్వ లింగన్న గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్ తెలిపారు. -
రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలి
వనపర్తి: జిల్లాకేంద్రం నుంచి వెళ్లే పాన్గల్, పెబ్బేరు రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. పాన్గల్ రోడ్డుకు సంబంధించి మొత్తం ఎంత మంది స్థలాలు కోల్పోతున్నారు.. వారికి ఇప్పటి వరకు అందజేసిన పరిహారంపై వివరాలు తెలుసుకున్నారు. పెబ్బేరు రోడ్డుపై మాట్లాడుతూ 80 ఫీట్ల రోడ్డుకు కొలతలు తీసుకోవాలని, స్థలం కోల్పోతున్న వారికి టీడీఆర్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండో దఫా నోటీసులు జారీ చేసి పనులు త్వరగా ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో ఇప్పటికే నిధులు మంజూరై పనులు పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లను ఆదేశించారు. కళాభవన్, మినీ ట్యాంక్ బండ్, అమ్మ చెరువు, నల్లచెరువు అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలన్నారు. అలాగే మురుగు కాల్వలు, చిట్యాల, అప్పాయిపల్లి రోడ్ల పురోగతిపై ఆరాతీశారు. ఆయా సమావేశాల్లో సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీనివాస్, ఏఈ పావని తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను వినియోగించుకోండి వనపర్తి రూరల్: గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం శ్రీరంగాపురం మండలంలోని నాగసానిపల్లి, పెబ్బేరు మండలం రంగాపురంలో రెవెన్యూ సదస్సులను సందర్శించారు. అనంతరం అదే గ్రామంలోని చౌకధర దుకాణానికి ఆకస్మికంగా వెళ్లి రికార్డులు పరిశీలించారు. పాతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి కొనుగోలు ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథం, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రాజు, మురళిగౌడ్, ఆర్ఐ రాధాకృష్ణ పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో భయపెడుతున్నారు
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న కూడా బలవంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకం. దీన్ని నిరసిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశామంటున్నారు. ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలి. అమాయక రైతులను జైలుకు పంపి వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. – శ్రీనువాసులు, బీఆర్ఎస్ నాయకుడు, రాజోళి పొలం వద్దకువెళ్లి అరెస్టు చేశారు.. పొలంలో బోర్ మోటా ర్ ఆన్ చేసి వస్తానని చెప్పిన మా బాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పని చేసుకుని జీవించే మా ఇంట్లో వాళ్లను ఇలా అరెస్టు చేస్తే మేము బతికేది ఎలా. వెంటనే మా బాబు చిన్న నాగేంద్రంను వదిలిపెట్టాలి. – నర్సమ్మ● -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వనపర్తి: మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో పార్క్ వద్ద శ్రమదానం చేసి మొక్కలు నాటారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. అధునాతన విజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో మనిషి తన మనుగడ కోసం విచ్చలవిడిగా యంత్రాలను వినియోగిస్తున్నారన్నారు. అలాగే కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని, ఇందుకోసం మొక్కలు నాటడం, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంటి పరిసర ప్రాంతాల్లో కనీసం మూడు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రభుత్వ సేవకులపై ఎల్లప్పుడూ ఆధారపడకుండా తమ వీధులను తాము శుభ్రపరుచుకునేలా నెలలో ఒకరోజు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అటవీ శాఖాధికారి నిఖిల్రెడ్డి మాట్లాడుతూ జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రధానంగా నీటి వనరుల కోసం భూగర్భ జలాలను పెంచుకోవాలన్నారు. అందుకు చెట్లను పెంచడమే అసలైన మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐ కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, నిస్వార్థ ఆర్గనైజేషన్ సభ్యులు, స్నేక్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
వనపర్తి విద్యావిభాగం: మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని డీఈఓ అబ్దుల్ ఘనీ అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంస్థ ఆధ్వర్యంలో గురువారం కేజీబీవీలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అన్నారు. దీనికి పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా గురవుతున్నారన్నారు. సమాజంలో ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలన్నారు. సమాజంలో ఉన్న చాలా సమస్యలకు ఆర్థిక కారణాలతోపాటు సామాజిక కారణాలు దోహదం చేస్తాయని, మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి వారిని ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి, మాయమాటలు, ఉద్యోగం, సినిమా అవకాశం అంటూ మోసం చేస్తారన్నారు. అనంతరం ప్రజ్వల సీనియర్ కోఆర్డినేటర్ మల్లేష్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ శుభలక్ష్మి, ఏఎంఓ మహానంది, సీఎంఓ యుగంధర్, ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్ మిథాలీరాజ్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి
వనపర్తి: జిల్లాలో కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని 5 రోజుల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మధ్యాహ్నం అదనపు కలెక్టర్ తన చాంబర్లో వరి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, గోపాల్పేట మండలాల్లో దాదాపు 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉందని, వాటిని వారం రోజుల్లో కొనుగోలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలు మూసివేయాలని సూచించారు. రోజుకు 3 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబెట్టి తూకం త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.57 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు (95 శాతం) కొనుగోలు పూర్తి చేశామని, మిగిలిన 5 శాతాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అలాగే వరకు 42 వేల మంది రైతుల నుంచి రూ.600 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి రూ.458 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. మిగిలిన రూ.130 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఆన్లైన్ ఎంట్రీలు వేగవంతం చేయాలని కో ఆపరేటివ్, డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఏఓ గోవింద్నాయక్, సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, కోపరేటివ్ అధికారి రాణి, డీపీఎం అరుణ, రవాణా శాఖాధికారి మానస తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన
రాజోళి/మానవపాడు: ‘12 గ్రామాలకు ఇబ్బందిగా మారిన ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు.. పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీ చిచ్చు పెట్టొద్దు.. ఈ విషయం ఎన్నో సార్లు ఫ్యాక్టరీ వారికి చెప్పాం.. శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టాం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు విన్నవించాం.. అయినా మా మాట లెక్కచేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు’ అంటూ సహనం కోల్పోయిన స్థానికులు సదరు ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. సామగ్రితో వచ్చిన కంటైనర్తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లకు నిప్పు పెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి శాంతియుతంగా కొనసాగుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక నిరసన కాస్తా.. బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గతేడాది అక్టోబర్ నుంచి రిలే దీక్షలు.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడలో 27.5 ఎకరాల భూమిని గాయిత్రి ఇథనాల్ ప్యూయల్స్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారనే విషయం అప్పటి వరకు ఎవరికీ తెలియదు. గతేడాది అక్టోబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గ్రామస్తులు కొన్ని రోజుల తర్వాత, ఇతర గ్రామాలతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాట్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమకు ఇబ్బంది కలుగుతుందని చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజలతో కలిసి తమ కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగా నిరసనలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతులు అందజేశారు. అనంతరం ఈ ఏడాది జనవరి 23న రిలే నిరాహార దీక్షను ప్రారంభించి ఫిబ్రవరి 11న విరమించారు. ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ఫ్యాక్టరీ విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని మాట ఇచ్చి తమతో దీక్ష విరమింపచేశారని.. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇంతదాకా వచ్చిందని వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పేర్కొన్నారు. గ్రామస్తులకు గాయాలయ్యాయి పనులు చేపట్టవద్దని అడగడానికి వెళితే వారు చెప్పిన సమాధానాలు, మాట్లాడిన తీరు వల్ల ఇంతటి పరిస్థితికి దారి తీసింది. ప్రైవేట్ వ్యక్తులు దాడులు చేశారు. అందులో గ్రామస్తులకు గాయాలయ్యాయి. పచ్చని పంటలను దెబ్బతీసే ఫ్యాక్టరీ వద్దని చెబుతుంటే, వారు మాపై దాడులు చేస్తే భవిష్యత్తులో మా పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. – శ్యాం ప్రసాద్, పెద్ద ధన్వాడ పికెటింగ్ ఏర్పాటు చేశాం ఫ్యాక్టరీకి సంబందించిన వారు అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. వాటి ఆధారంగా పెద్దధన్వాడలో పనులు చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుకుంది. మళ్లీ గ్రామంలో అలజడి రేగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల పరిశ్రమకు సంబంధించి కంటైనర్, టెంట్లు, షెడ్లకు నిప్పు.. వాహనాలు ధ్వంసం పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టొద్దంటూ ఆగ్రహం రాజోళి మండలం పెద్దధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత ఫ్యాక్టరీ పనుల ప్రారంభంతో ఆగ్రహం ఈ క్రమంలో మంగళవారం ఫ్యాక్టరీ స్థలం వద్దకు సామగ్రితో కూడిన వాహనాలు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని ధర్నా చేపట్టగా పోలీసులు కలగజేసుకొని తిప్పిపంపారు. బుధవారం సైతం పనులు కొనసాగడం, పోలీసులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో విషయం తెలుసుకొని అక్కడి సిబ్బందితో గ్రామస్తులు మాట్లాడే క్రమంలో గొడవ మొదలైంది. ఒక్కసారిగా సహనం కోల్పోయిన దాదాపు 400 మంది గ్రామస్తులు కర్రలు, రాళ్లతో మూకుమ్మడిగా ఫ్యాక్టరీకి సింబంధించిన ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. టెంట్లు, షెడ్లు నేలకూల్చి వాటితోపాటు కంటైనర్కు నిప్పుపెట్టారు. జేసీబీ, కార్లను ధ్వంసం చేశారు. పలువురికి గాయాలయ్యాయి. చివరికి పోలీసులు గ్రామస్తులను శాంతింపజేసి వెనక్కి పంపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా.. బుధవారం సాయంత్రం తర్వాత పెద్ద ధన్వాడ చుట్టూ ఉన్న గ్రామాలకు చెందిన 45 మంది రైతులకు పోలీసులు అదుపులోకి తీసుకొని.. మానవపాడు స్టేషన్కు తరలించారు. ఆధార్కార్డులు, ఫోన్ నంబర్లను తీసుకొని రాత్రి 10 గంటల తర్వాత 35 మంది రైతులను పోలీసులు వదిలేశారు. మిగిలిన పదిమంది ఇంకా వారి అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. -
పేదలకు నాణ్యమైన సన్న బియ్యం
వనపర్తి రూరల్: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని.. బయటి వ్యక్తులకు విక్రయించరాదని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం ఆయన పెబ్బేరులోని రేషన్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారా లేదా అని డీలర్ను అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం నాణ్యత ఎలా ఉందని లబ్ధిదారులతో ఆరా తీశారు. ప్రజలకు సరైన తూకంతో బియ్యం పంపిణీ చేయాలని.. ఎలాంటి లోపాలున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. అధికారులు మీ గ్రామానికి వచ్చారని.. భూ సమస్యలను నిర్ణీత ప్రోఫార్మలో పూరించి రెవెన్యూ సదస్సులో ఇవ్వాలని పరిశీలించి పరిష్కరిస్తారని వివరించారు. -
పేదలకు వరం..
కేజీబీవీలు నిరుపేద విద్యార్థులకు వరం. వేసవి సెలవుల్లో శిబిరాలు నిర్వహించి కోడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, మానసిక వికాసంపై ప్రత్యేక శిక్షణనిచ్చాం. నాణ్యమైన బోధన, పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని నిత్యం పర్యవేక్షించడంతో పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం. దరఖాస్తులను పరిశీలించి అర్హులను త్రిసభ్య కమిటీ ఎంపిక చేస్తుంది. – శుభలక్ష్మి, జీసీడీఓ ● -
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం
పాన్గల్/వీపనగండ్ల: తల్లిదండ్రులు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించి బడులను కాపాడాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్గౌడ్, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య కోరారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుదాం–ప్రభుత్వ బడులను కాపాడుదాం’ నినాదంతో నిర్వహిస్తున్న ప్రచార జాత బుధవారం పాన్గల్, వెంగళాయిపల్లి, వీపనగండ్ల మండలం కల్వరాల్ల, పుర్గర్చర్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, పాఠ్య, రాత పుస్తకాలు ఉచితంగా అందుతాయని, తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందన్నారు. ప్రైవేట్కు దీటుగా బోధన, సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి బడులను కాపాడేందుకు తోడ్పాటునందించాలని కోరారు. పాన్గల్లో జరిగిన కార్యక్రమంలో సంఘం నాయకులు హమీద్, గడ్డం మురళి, వెంకటేష్, తిమ్మప్ప, శ్రీనివాస్గౌడ్, కృష్ణమూర్తి, బాలయ్య, రాముడు, డీవైఎఫ్ఐ నాయకులు బాలరాజు, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, కాంగ్రెస్పార్టీ మండల నాయకుడు రాముయాదవ్, వీపనగండ్లలో జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా నాయకులు శ్రీనివాసులు, బాలీశ్వర్, సమీద్, అయోద్యరాముడు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం..
వనపర్తి రూరల్: రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మండలంలోని అంకూర్లో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి దరఖాస్తు ఫారాలు ఒకరోజు ముందుగానే అందించారా, గ్రామంలో టాంటాం వేయించారా లేదా అని ఆరా తీశారు. దరఖాస్తులను పరిశీలించి సాధ్యమైన వాటిని అక్కడే పరిష్కరించాలని తహసీల్దార్ రమేశ్రెడ్డిని ఆదేశించారు. నోటీసులు ఇవ్వాల్సిన వాటికి వెంటనే జారీ చేసి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆర్ఐ మధు తదితరులు ఉన్నారు. -
పల్లెల్లో ‘ఇథనాల్’ చిచ్చు
ఊర చెరువును పరిశీలించిన లోకాయుక్త సభ్యులు వనపర్తి రూరల్: మండలంలోని కిష్టగిరి శివారులో ఉన్న ఊర చెరువు అలుగు పెంచడంతో నీటినిల్వ పెరిగి పొలానికి వెళ్లడానికి దారి లేదని, నీరు తగ్గించాలని రైతు శ్రీనివాస్రెడ్డి లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం లోకాయుక్త సభ్యులు తిరుపతి వెంకట్రావు, విద్యాసాగర్ గ్రామంలోని రైతులు, ఫిర్యాదుదారుతో కలిసి చెరువు, ఆయకట్టును పరిశీలించారు. గతంలో తమ పొలానికి చెరువు ముందు నుంచి వెళ్లే వాళ్లమని బాధితుడు వివరించారు. అలుగు అప్పటిలాగే ఉందని.. ఎత్తు పెంచలేదని, నీటి నిల్వ తగ్గిస్తే పంటలు పండటం కష్టమని పలువురు రైతులు సభ్యులకు వివరించారు. వారి వెంట డీఈ మల్లయ్య, ఏడీ బాలకృష్ణ, ఆర్ఐ వెంకటేష్, సర్వేయర్లు భాస్కర్, సందీప్, అధికారులు ఉన్నారు. -
నూనెగింజల సాగుతో లాభాలు
అమరచింత: రైతులు నూనెగింజల పంటలు సాగుచేస్తే అత్యధికంగా లాభాలు పొందవచ్చని జాతీయ నూనెగింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డా. సురేష్ తెలిపారు. వికసిత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి, కొంకన్వానిపల్లిలో రైతులకు నూనెగింజల సాగుపై అవగాహన కల్పించారు. పంటల సాగులో ఏవైనా సందేహాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. ఇక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందని, రైతుల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆముదంలో ఐసీహెచ్–5 హైబ్రిడ్ రకం ఉందని తక్కువ కాల పరిమితితో అధిక దిగుబడి పొందడానికి వీలుగా తయారు చేసినట్లు చెప్పారు. ఈ విత్తనాలు మదనాపురం కేవీకేలో అందుబాటులో ఉన్నాయన్నారు. భూ సారం పెంచుకోవడానికి రైతులు జీలుగ, పచ్చరొట్ట సాగుచేసి పూతదశలో భూమిలో కలియ దున్నాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డా. అనిత, ఏఓ అరవింద్, ఏఈఓ శివ, రైతులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం మండలంలోని బండపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించి మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో భూ సమస్యలను నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తిచేసి అధికారులకు అందజేస్తే పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. 2020లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సాదా బైనామాలను పరిశీలించి పరిష్కరిస్తారని.. మిగిలినవి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో సదస్సు నిర్వహణకు ఒకరోజు ముందుగానే చాటింపు వేయించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఆర్ఐ తిరుపతయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
వనపర్తి: పట్టణాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవరసరమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 22, 23 వార్డుల్లో మార్నింగ్ వాక్ చేసి ఆయా వార్డుల ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో రహదారి విస్తరణకు అంకురార్పణ చేశారని.. ఎన్నో హామీలు గుప్పించి అడుగడుగునా మోసం చేశారని, ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని గోడు వెల్లబోసుకున్నారు. కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని, అవి వినియోగానికి అనుకూలంగా లేవని సరిచేసి ఇవ్వాలని కోరారు. వృద్ధులైన తమకు రెండు, మూడు అంతస్తుల్లో ఇళ్లు కేటాయిస్తే వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాన్గల్ రోడ్ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేసి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఏ ఒక్కరూ నష్టపోకుండా తగిన పరిహారం అందజేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఉండి బాధితుల జాబితాను తయారు చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పి.మహేష్, మాజీ కౌన్సిలర్ చీర్ల సత్యం, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. -
సీఎంఆర్ అప్పగిస్తేనే ధాన్యం కేటాయింపు
వనపర్తి: డిఫాల్ట్ మిల్లర్లు బకాయి ఉన్న సీఎంఆర్ అప్పగించి నిజాయతీగా ముందుకొస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ధాన్యం కేటాయింపులు చేపడతామని పౌరసరఫరాలశాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ తెలిపారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పౌరసరఫరాలశాఖ అఽధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యం మిల్లులకు అప్పగిస్తే పద్ధతి ప్రకారం నిల్వ చేయకుండా బయట గుట్టలుగా పడేసి తడిసిపోయిందని, సీఎంఆర్ ఇవ్వమని చెప్పడం క్షమార్హం కాదని, ప్రభుత్వం కేటాయించిన ధాన్యం తీసుకోకుండా ప్రైవేట్గా వడ్లు తీసుకొని మిల్లింగ్ చేసే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రెండు జిల్లాల్లో సగానికిపైగా మిల్లర్లు డిఫాల్ట్ జాబితాలో ఉండటం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్యలు ఇక్కడే ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని ప్రశ్నించారు. తాత్కాలికంగా గోదాముల్లో ధాన్యం నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం మిల్లుకు రాకపోవడంతో క్వింటాకు 67 కిలోలు రావాల్సిన బియ్యం 62 కిలోలే వస్తున్నాయని, తద్వారా మిల్లర్లు నష్టపోతున్నారని వివరించారు. ఎఫ్ఏక్యూ ప్రకారం ధాన్యం రావడం లేదని చెప్పడం సరికాదని, తేమ శాతం వచ్చాకే తూకం చేసి మిల్లులకు పంపిస్తున్నామన్నారు. వరి కోత యంత్రాలు 18 నుంచి 20 ఆర్పీఎం, గేర్ స్నాట్ బి–1లో ఉంచడం, బ్లోయర్ ఆన్లో పెట్టుకొని పంట కోతలు చేపట్టేలా చూడాలని, నిబంధనలు పాటించని యజమానులపై కేసులు నమోదు చేయాలని పోలీస్శాఖను ఆదేశించారు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. పదేళ్లలో ఏ యాసంగిలో రానంత దిగుబడి ఈసారి జిల్లాలో పండిందని తెలిపారు. ఇప్పటి వరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.571 కోట్లు 39,145 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మరో 20 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో 184 మిల్లులు ఉండగా.. డిఫాల్ట్ మిల్లులుపోను కేవలం 77 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించినట్లు వివరించారు. సమావేశంలో నాగర్కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి డీఎస్ఓ కాశీవిశ్వనాథ్, డీఎంలు, ఆయా ప్రాంతాల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రైవేట్ వడ్లు మిల్లింగ్ చేస్తే చర్యలు పౌర సరఫరాలశాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ -
పనులు ముమ్మరం
జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న సీసీ నిర్మాణాలు ●రోడ్డు వేయడం శుభ పరిణామం శివారు ప్రాంతంగా ఉన్న మా కాలనీలో కొన్నేళ్లుగా మట్టి రోడ్డే ఉండేది. ఆ రోడ్డు కూడా గుంతలు, మిట్టలు ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. చాలా ఏళ్ల తర్వాత సీసీ రోడ్డు వేయడం శుభపరిణామం. ఈ ప్రాంతంలో రోడ్డు వేస్తారని అనుకోలేదు. – ఎరుకలి రాధ, నాగవరం రహదారి మారింది.. మా కాలనీలో మురుగు అస్తవ్యస్తంగా రహదారిపై పారడంతో రాకపోకలకు ఇబ్బందులు పడేవాళ్లం. సమస్యను ప్రజా ప్రతినిధు లు, అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. పుర మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ చొరవతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు వేస్తున్నారు. – మణెమ్మ, ప్యాటగడ్డ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు.. ప్రతి కాలనీలో అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు మెరుగుపడితే ప్రజలకు కనీస సౌకర్యాలు అందిన ట్లు అవుతాయి. హంగామా కోసం నాలుగు లైట్లు వేసి ఇదే అభివృద్ధి అనడం మా విధానం కాదు. పట్టణాభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. – మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని అంతర్గత రహదారులన్నీ సీసీ హంగులు సంతరించుకుంటున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 33 వార్డులు, 68 కాలనీల్లో సుమారు 40 కిలోమీటర్ల మేర సీసీ రహదారులు, డ్రెయినేజీల పనులు నెలరోజులుగా ముమ్మరంగా సాగుతున్నాయి. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.44 కోట్లతో పుర పరిధిలోని ప్రతి కాలనీలో సీసీ రహదారులు, డ్రెయినేజీల నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 25న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో వార్డుకు అభివృద్ధి ప్రాధాన్యత ఆధారంగా రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు కేటాయించి రోడ్లు, డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. పుర విలీన గ్రామాలైన శ్రీనివాసపురం, మర్రికుంట, రాజనగరం, నాగవరం, నర్సింగాయపల్లిలోనూ పనులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో చిట్యాల, రాజపేట, పెద్దగూడెం, పీర్లగుట్ట. అప్పాయిపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంతాల్లో సీసీ రహదారుల నిర్మాణం చేపట్టలేదు. ఆయా ప్రాంతాల్లోనూ సీసీ రహదారులు నిర్మిస్తుండటంతో పట్టణంలోని ఏ కాలనీలో చూసినా సీసీ రోడ్లే దర్శనమిస్తున్నాయి. పాతకాలనీలో గతంలో వేసిన సీసీ రహదారులు దెబ్బతింటే వాటిని కూడా తొలగించి కొత్తగా నిర్మిస్తున్నారు. డ్రెయినేజీల నిర్మాణం.. పుర కేంద్రంలో ప్రస్తుతం ఏటవాలుగా ఉన్న వరద కాల్వకు అనుసంధానంగా మరో మూడు కిలోమీటర్లు, వివిధ కాలనీల్లో 17 కిలోమీటర్ల సీసీ డ్రెయినేజీలను నిర్మిస్తున్నారు. రహదారికి ఇరువైపులా, మరికొన్నిచోట్ల ఒకవైపున నిర్మిస్తున్న డ్రెయినేజీలను అడుగు నుంచి రెండు అడుగుల మేర లోతు మట్టిని తొలగిస్తుండటంతో మురుగు, వర్షపు నీరు సాఫీగా ముందుకు పారే ఆస్కారం ఉంటుంది. 23 కిలోమీటర్ల రహదారులు.. 17 కిలోమీటర్ల డ్రెయినేజీలు టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.44 కోట్లతో.. ‘డబుల్’ ఇళ్ల ప్రాంత అభివృద్ధికి రూ.8 కోట్లు -
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : ఎస్పీ
వనపర్తి రూరల్: నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని ఎస్పీ రావుల గిరిధర్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం మండలంలోని రాజపేట శివారు గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల పక్కన రూ.2.20 కోట్లతో నిర్మిస్తున్న పోలీస్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం అందించేందుకు బంక్ ఏర్పాటు చేస్తున్నామని, పోలీసుశాఖ పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని, త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి, మిషన్ భగీరథ డీఈ విజయ్కుమార్, సైట్ ఇంజినీర్ నరేష్, ఏఆర్ ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
వనపర్తి రూరల్: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని నాగవరం రైతువేదికలో ప్రొ. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, మండల వ్యవసాయశాఖ సంయుక్తంగా రైతు అవగాహన సదస్సు నిర్వహించగా ఆయనతో పాటు శాస్త్రవేత్త డా. భరత్భూషణ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మెళకువలు పాటించి నాణ్యమైన విత్తనాలు వినియోగించి వచ్చే సీజన్లో మిగతా రైతులకు అందించాలని కోరారు. వరి (కేఎన్ఎం–1638), జొన్న 28 మినీ కిట్ల విత్తనాలను మండలంలోని ఒక్కో గ్రామ రైతులకు 3 ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఓ కురుమ య్య, న్యాయ సలహాదారు ఉత్తరయ్య, ఏఈఓలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి పోరాటం పాన్గల్: మహిళల సమస్యల పరిష్కారానికి వారితో కలిసి పోరాటాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల అన్నారు. మంగళవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో సంఘం సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో మహిళల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెలల్లో ఐద్వా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో సంఘం నాయకురాలు అనిత, సభ్యులు పాల్గొన్నారు. -
నేటి నుంచి భూ భారతి సదస్సులు
వనపర్తి: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో మంగళవారం నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలంలో సంబంధిత అధికారులతో రెండు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కో బృందం ఒక్కో జీపీలో భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు షెడ్యూల్ వారీగా నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ కె.రమేశ్బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సీట్ల భర్తీ నిమిత్తం మొదటి విడత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు iti.telangana.gov.in వెబ్సైట్లో ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 79953 35372, 98492 44030 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు పాన్గల్: పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపొందుతుందని ఐఐఓఆర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అనిల్కుమార్, భవాని అన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా సోమవారం పాన్గల్, దొండాయిపల్లి రైతువేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటల సాగులో రసాయన ఎరువులు, యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. సాగునీటి పొదుపు, నాణ్యమైన విత్తనాల ఎంపికపై సూచనలు చేశారు. వరి, ఇతర పంటల కోతల అనంతరం కొయ్యలను తగలబెట్టడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్, ఏఓ రాజవర్ధన్రెడ్డి, ఏఈఓలు నరేశ్, వెంకటేశ్, షర్మిళ, అఖిల పాల్గొన్నారు. పోరాటాలతోనేహక్కుల సాధన వనపర్తి రూరల్: పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. కార్మికుల హక్కులను సాధించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంగన్వాడీల పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో పాటు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ పెంచిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 9న నిర్వహించ తలపెట్టిన అఖిలభారత సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, నాయకులు బొబ్బిలి నిక్సన్, ఆర్ఎన్ రమేశ్, నారాయణమ్మ, జ్యోతి, సుమతి, విజయ, రేణుక, మహేశ్వరి, నిర్మల, సత్యమ్మ, విజయలక్ష్మి, వసంత, శారద, కవిత తదితరులు ఉన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ నెలలోనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కార్యాలయాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రెండో దశలో నారాయణపేట, కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అమలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ సేవలు పరిశీలించి కొనుగోలుదారులకు దస్తావేజులు అందజేశారు. అవగాహన లేకపోవడంతో.. సోమవారం స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని కార్యాలయాల్లో సాఫీగానే సాగగా.. మరికొన్ని కార్యాలయాల్లో ప్రజలకు స్లాట్ బుకింగ్పై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అలంపూర్లో ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు. ఆత్మకూర్లో కేవలం 1 దస్తావేజు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది. గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 44 స్లాట్ బుకింగ్ చేసుకోగా 35 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా.. మిగతా 9 దస్తావేజుల అమ్మకపు, కొనుగోలుదారులు కార్యాలయానికే రాలేదు. సోమవారం స్లాట్ బుకింగ్ ప్రారంభమైన కార్యాలయాల్లో జడ్చర్లలో 40, వనపర్తిలో 45, గద్వాలలో 35, మక్తల్లో 7, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 7, ఆత్మకూరులో ఒక స్లాట్ బుక్ అయ్యాయి. మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు పారదర్శకంగా, మరింత వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాలకు అదనంగా సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, గద్వాల కార్యాలయాలకు ఒక్కొక్కరు చొప్పున సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఈ మేరకు సోమవారం జడ్చర్లలో నూతన సబ్ రిజిస్ట్రార్ భానుప్రసాద్ బాధ్యతలు సైతం స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలోని 12 చోట్ల పూర్తిస్థాయిలో అమలు తొలిరోజు 140 స్లాట్స్ బుకింగ్ జిల్లాకు ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల కేటాయింపు -
సమగ్రాభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ
వనపర్తిటౌన్: మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ రూపొందించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు వంద రోజుల కార్యాచరణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఈఈ యూనుస్, మేనేజర్ శంకరయ్య, రెవెన్యూ ఆఫీసర్ అశోక్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ శివకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్టపాకల మహేష్, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం, వెంకటేశ్, చీర్ల సత్యం, నాయకులు పరశురాం, ఎల్ఐసీ కృష్ణ, మెప్మా సిబ్బంది బాలరాజు, యువరాజు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో అగ్రస్థానం
వనపర్తి: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం తెలంగాణ రైజింగ్–2047 విజన్తో పనిచేస్తోందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్.ప్రీతం అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రీతం హాజరు కాగా.. జిల్లా యంత్రాంగం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివా ళి అర్పించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ రైజింగ్–2047 విజన్లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళిక రూపొందించిందని వివరించారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్తో పనిచేస్తున్నాం ● కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతాం ● యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు.. ● రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్. ప్రీతం ● ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవంజాతీయ పతాకం ఆవిష్కరించి వందనం సమర్పిస్తున్న రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్.ప్రీతం, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ తదితరులుఆడబిడ్డలకు అండగా.. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంటా మహాలక్ష్మి తాండవిస్తుందన్నారు. అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో జిల్లాలో సుమారు 2.39 కోట్ల మంది మహిళలు రూ. 78.42కోట్ల లబ్ధి పొందినట్టు తెలిపారు. రూ. 500కే వంటగ్యాస్ సరఫరాతో ఇప్పటి వరకు 84,399 మందికి గాను 2.34 లక్షల సిలిండర్లను పంపిణీ చేసి.. రూ. 6.56లక్షల లబ్ధి చేకూర్చామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో 81,649 మంది వినియోగదారులకు ప్రభుత్వం రూ. 24.51 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని అందజేసినట్లు వెల్లడించారు. మహిళలు పెట్రోల్ బంకులు, మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారన్నారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళాశక్తి స్టాళ్లను తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మహిళా సంఘాలతో 600 బస్సులు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిర్మాతలు అని అన్నారు. వారి భవిష్యత్కు గ్యారంటీ ఇస్తూ.. ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఏడాది కాలంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు రూ. 3లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి.. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తోందన్నారు. రాజీవ్ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. చిన్నారి నృత్యప్రదర్శన యువతకు ఉపాధి, ఉద్యోగాలు.. -
ఒకేసారి మూడు నెలల రేషన్
●● కేంద్రం నిర్ణయంతో ముందుకు.. ● రేషన్ దుకాణాలకు బియ్యం తరలింపు ● నిల్వ చేసుకునేందుకు స్థలం కరువు.. ఇబ్బందులు పడుతున్న డీలర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశానుసారం మూడునెలల రేషన్ బియ్యం ఈ నెల 30వ తేదీలోగా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని డీలర్లుక ఆదేశాలిచ్చాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నాం. ఎక్కడా ఫిర్యాదులు, పొరపాట్లకు తావులేకుండా ప్రజాపంపిణీ చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. – కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వనపర్తి: కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలకు మూడునెలల బియ్యం కోటా ఒకేసారి ఎంఎల్ఎస్ గోదాం నుంచి తరలిస్తున్నారు. బియ్యం తరలింపును పౌరసరఫరాలశాఖ అధికారులతో పాటు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మూడు నెలల కోటా నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులు ఆయా రేషన్ డీలర్లు, అధికారులు, ఎంఎల్ఎస్పీ గోదాంల ఇన్చార్జ్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు. ఒక్కో కార్డుదారుడి నుంచి మూడుసార్లు వేలిముద్రలు తీసుకొని బియ్యం పంపిణీ చేయాలని అధికారులు నిబంధనలు రూపొందించారు. వాతావరణ మార్పులను ముందస్తుగా అంచనా వేసిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీతో పెరిగిన ఆసక్తి.. రెండునెలలుగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో 90 శాతం మంది లబ్ధిదారులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో దొడ్డురకం బియ్యం పంపిణీ చేస్తుండటంతో చాలావరకు రేషన్ దుకాణాల నుంచి రీసైక్లింగ్ అయ్యేవి. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీతో పరిస్థితులు పూర్తిగా మారినట్లు క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. సన్న బియ్యం పంపిణీతో ప్రజాపంపిణీ లక్ష్యం నెరవేరుతోందని అఽధికారులు సైతం కితాబిచ్చారు. ఈ నెల 30 వరకు గడువు.. ఈ నెల 30వ తేదీలోగా జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగష్టు బియ్యం కోటాను రేషన్ డీలర్లు పంపిణీ చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు డీలర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. లబ్దిదారులు 5,58,334 అంత్యోదయ కార్డులు 10,514 మూడునెలల కోటా 10,555.422 మెట్రిక్ టన్నులు అన్నపూర్ణ కార్డులు 109 బియ్యం నిల్వకు స్థలాలు కరువు? జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాల్లో ఒకనెల కోటా బియ్యం పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేందుకు సరిపడా స్థలం లేదు. ఏకంగా ఒకేసారి మూడు నెలల కోటా నిల్వ చేసుకునేందుకు అదనంగా సమీపంలో మరో దుకాణం లేదా గోదాం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. బియ్యం పంపిణీపై ఆయా మండలాల తహసీల్దారు నిశితంగా పర్యవేక్షణ చేస్తున్నారు. -
నేటినుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–19 క్రికెట్
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో ఎండీసీఏ ఆధ్వర్యంలో మరోసారి ఇంట్రా డిస్ట్రిక్ర్ట్ టోర్నమెంట్ జరగనుంది. గత నెల 19 నుంచి 31 వరకు అండర్– 23 ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ను నిర్వహించగా మహబూబ్నగర్ జట్టు చాంపియన్షిప్గా నిలిచింది. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇప్పుడు అండర్– 19 క్రికెట్ లీగ్ను నిర్వహించనున్నారు. 2 నుంచి 6 వరకు.. ఔత్సాహిక గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ పురుషుల అండర్–19 క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లీగ్లో పాల్గొనే ఆరు జట్లను రెండు పూల్లుగా విభజించారు. పూల్–ఏలో జడ్చర్ల, వనపర్తి, నాగర్కర్నూల్ జట్లు, పూల్–బీలో మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జట్లు ఉన్నాయి. ఐదు రౌండ్లలో 15 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు చాంపియన్గా నిలుస్తుంది. లీగ్ మ్యాచ్ల వివరాలు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో అండర్– 19 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి రౌండ్కు సంబంధించి సోమవారం మహబూబ్నగర్– వనపర్తి జట్లు (వేదిక– మహబూబ్నగర్), జడ్చర్ల– గద్వాల జట్లు (జడ్చర్ల), నారాయణపేట– నాగర్కర్నూల్ (నారాయణపేట) జరుగుతాయి. రెండో రౌండ్ మంగళవారం నాగర్కర్నూల్– మహబూబ్నగర్ జట్లు (మహబూబ్నగర్), గద్వాల– వనపర్తి (వనపర్తి), జడ్చర్ల– నారాయణపేట (జడ్చర్ల) మ్యాచ్లు ఉంటాయి. మూడో రౌండ్ బుధవారం మహబూబ్నగర్– గద్వాల (మహబూబ్నగర్), నాగర్కర్నూల్– జడ్చర్ల (జడ్చర్ల), వనపర్తి– నారాయణపేట (వనపర్తి) కొనసాగుతాయి. నాలుగో రౌండ్ గురువారం మహబూబ్నగర్– నారాయణపేట (మహబూబ్నగర్), జడ్చర్ల– వనపర్తి (జడ్చర్ల), గద్వాల– నాగర్కర్నూల్ (గద్వాల) ఉంటాయి. ఐదో రౌండ్ శుక్రవారం జడ్చర్ల– మహబూబ్నగర్ (మహబూబ్నగర్), నాగర్కర్నూల్– వనపర్తి (నాగర్కర్నూల్), గద్వాల– నారాయణపేట (గద్వాల)లో నిర్వహిస్తారు. ఆరు జట్లు.. 15 లీగ్ మ్యాచ్లు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో మ్యాచ్ల నిర్వహణ అధిక పాయింట్లు సాధించిన జట్టు విజేత -
నాటి నుంచి విద్యాపర్తిగా..
సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తికి విద్యాపర్తిగా పేరుంది. గద్వాల, అయిజ తదితర ప్రాంతాల నుంచి విద్యనభ్యసించేందుకు ఈ ప్రాంతానికి వస్తుంటారు. నాటి నుంచి డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా.. ప్రత్యేక రాష్ట్రంలో కొత్తగా జేఎన్టీయూ అనుబంధ ఇంజినీరింగ్, ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్ కళాశాలలు, రెండో ఫిషరీష్ కళాశాల ఏర్పాటు విద్యపరంగా జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయా కళాశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వేలాది మంది విద్యార్థులు జిల్లాకు తరలివస్తుండగా.. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయడంతో పాటు తగిన వసతులు కల్పించింది. -
ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం
వనపర్తి: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల భవనాలను రంగురంగుల విద్యుద్ధీపాలతో ముస్తాబు చేశారు. కార్యక్రమాలు ఇలా.. ● ఉదయం 9.50 గంటలకు ఎస్పీ రావుల గిరిధర్, 9.55కు కలెక్టర్ ఆదర్శ్ సురభి, 9.58కి ముఖ్యఅతిథి ప్రీతం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన వేదికకు చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ● 10 గంటలకు ముఖ్యఅతిథి జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ, రాష్ట్ర గీతాలాపన, పోలీసుల వందన సమర్పణ ఉంటుంది. ● 10.10 గంటలకు ముఖ్యఅతిథి జిల్లా ప్రగతిపై సందేశం. 10.30కి స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల సన్మానం ఉంటుంది. ● 10.35 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 10.50కి వివిధ పథకాల లబ్ధిదారులకు ధ్రువపత్రాల పంపిణీ, 11 గంటలకు స్టాల్స్ సందర్శనతో కార్యక్రమం ముగియనుంది. ‘బొమ్మా, బొరుసుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన’ వనపర్తిటౌన్: బొమ్మా, బొరుసుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని.. పార్టీలు వేరైనా చేసే అవినీతి ఒక్కటేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. ఆయా పార్టీల పాలనపై ప్రజలకు అవగాహన వచ్చిందని, ఏ పార్టీ వచ్చినా అవినీతి, అక్రమాలు ఆగవనే నిజాన్ని గ్రహించారని ఎద్దేవా చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో పార్టీ జిల్లా మీడియా ఇన్చార్జ్ పెద్దిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఆ పార్టీ అభ్యర్థులు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకం చేయకుండా రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 18 నెలలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైస్మిల్లర్లతో కుమ్మకై భారీగా అవినీతికి తెర లేపారని ఆరోపించారు. సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్సభ్యుడు మున్నూరు రవీందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి, అధికారులకు సమన్వయం కొరవడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పారు. వరి కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రధాని మోదీ 14 రకాల చిరుధాన్యాల మద్దతు ధర పెంచి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి రామన్గౌడ్, ఉపాధ్యక్షుడు బండారు కుమారస్వామి, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగపోగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా 3X3 పురుషులు, మహిళా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్, జాకీర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాటాడారు. బుధ, గురువారం జిల్లాకేంద్రంలోని ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో మొదటి రాష్ట్రస్థాయి 3X3 బాస్కెట్బాల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీలో వివిధ జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్ హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను వారు అభినందించారు. సభ్యులు మీర్ ఖాలెద్అలీ, మహ్మద్ ఇలియాజ్, సుబాన్జీ, గోపాలకృష్ణ, ఫారూఖ్ ముకర్రం, మహ్మద్ షకీల్, వినోద్కుమార్, బాలరాజు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీలు అమలు చేస్తాం
వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని పుల్గర్చర్లలో రూ.2.94 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్స్టేషన్, కల్వరాలకు నూతనంగా ఏర్పాటు చేయనున్న మిషన్ భగీరథ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు రైతులు, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు రాజీవ్ యువ వికాసం, సన్నరకం వరి ధాన్యానికి రూ.500 బోనస్ తదితర సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విద్యుత్శాఖ ఎస్ఈ రాజశేఖరం, పంచాయతీరాజ్శాఖ ఈఈ మల్లయ్య, నాగర్కర్నూల్ జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నర్సింహ, నాయకులు రఘునాథ్రెడ్డి, ఇంద్రకంటి వెంకటేష్, నారాయణరెడ్డి, బిచ్చయ్యసాగర్, సుదర్శన్రెడ్డి, నరేష్, బాల్రెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
అభివృద్ధి పథం
ప్రత్యేక రాష్ట్రంలో అన్నిరంగాల్లో జిల్లా పురోగతి650 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రి.. ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నాటి వంద పడకల ఏరియా ఆస్పత్రి నేడు 650 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రిగా సర్కారు తీర్చిదిద్దింది. పేదలు ప్రసవాలకు ప్రైవేట్ను ఆశ్రయించి రూ.వేలు ఖర్చు చేయకుండా వాటికి ధీటుగా సాధారణ, సిజేరియన్ కాన్పులు చేస్తూ సర్కారు వైద్యంపై భరోసా కల్పిస్తున్నారు. ఒక్క జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రతి నెల 400కు తగ్గకుండా ప్రసవాలు జరుగుతున్నాయి. దీంతోపాటు క్యాన్సర్ కేర్, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు దీటుగా జిల్లాకేంద్రంలో ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో సుమారు 80 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా వైద్యుల సూచన మేరకు చేస్తుండడం గమనార్హం. స్వరాష్ట్రంలో ప్రతిరంగంలో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు జిల్లా ప్రగతి నివేదికతో వెల్లడవుతోంది. వనపర్తి: పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో జిల్లా వ్యవసాయ, విద్య, వైద్యం తదితర అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వ్యవసాయ ఉత్పత్తులు నాలుగింతలు పెరిగినట్లు ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోనే అత్యధికంగా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యంతో స్పష్టమవుతోంది. పదేళ్ల కిందటి వరకు వానాకాలంలో 78 వేల ఎకరాలు, యాసంగిలో 34 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. ప్రస్తుతం వానాకాలంలో 1.94 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి సాగు, ఉత్పత్తి నాలుగింతలు పెరగడంతో జిల్లాను రైస్బౌల్గా స్థానిక ప్రజలు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో ఏకంగా 3.98 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధేశించుకోవడం గమనార్హం. ఇందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన భీమా, కేఎల్ఐతో పాటు జూరాల వరద నీటితో చెరువులు, రిజర్వాయర్లను నింపుతుండటంతో భూగర్భ జలాలు పెరగడం, నీటిని ఎక్కువగా నిల్వ చేసుకొని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవడం, కొత్త కాల్వలను పాత కాల్వలకు అనుసంధానంగా నిర్మాణం చేసుకోవడంతోనే సాధ్యమైందని చెప్పవచ్చు. పదేళ్లలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం ప్రభుత్వ వైద్య, ఇంజినీరింగ్, ఫిషరీస్ తదితర కళాశాలల ఏర్పాటు క్యానర్స్కేర్, ప్రసూతి, డయాలసిస్, 650 పడకల ఆస్పత్రి నిర్మాణం 2016–17తో పోలిస్తే నాలుగింతలు పెరిగిన వరి పంటలు -
పంటల సాగుపై రైతులకు అవగాహన
వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా ఐఐఓఆర్ ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఆర్డీ ప్రసాద్ వానాకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆముదం, వేరుశనగ సాగులో మెళకువలు, సాంకేతికత గురించి వివరించారు. కేవీకే మదనాపురం శాస్త్రవేత్త భవాని మాట్లాడుతూ.. వానాకాలంలో వరి, కంది సాగుకు అనుకూలమైనవని, రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కిసాన్ డ్రోన్లు, బయో ఎరువుల గురించి వివరించారు. ఏఈఓ కవిత మాట్లాడుతూ.. భూమి సారవంతంగా ఉండాలంటే రైతులు పచ్చిరొట్ట పైర్లు 40 రోజులు ముందుగా వేసుకొని పూత దశలో కలియదున్నాలని, దీంతో భూసారం దెబ్బ తినకుండా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వరి కొయ్యలను తగలబెట్టరాదని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోవర్ధన్, గ్రామ రైతులు పాల్గొన్నారు. నర్సింగాపురంలో.. మదనాపురం: మండలంలోని నర్సింగాపురంలో ప్రధాన పంటలైన వరి, పత్తి, వేరుశనగ, జీలుగ, కంది పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త అనిత సంతులిత, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. విత్తన ఎంపికపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఓ గాయత్రి, మాజీ సర్పంచ్ హనుమాన్రావు, మైనుద్దీన్, కాశన్న, గట్టన్న తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా నెలరోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. యాక్ట్ ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాళ్లలో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదని వివరించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ, కులమతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని కోరారు. -
అహల్యబాయి సేవలు మరువలేనివి
వనపర్తిటౌన్: సాధారణ భారతీయ మహిళ వీరనారిగా మారుతుందడానికి రాణి అహల్యబాయి హోళ్కర్ ఉదాహరణ అని మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు అహన్య రాజు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు అశ్విని రాధ ఆధ్వర్యంలో అహల్యబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుర వీధుల్లో మహిళలతో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. పెళ్లయిన కొన్నేళ్లకే భర్త యుద్ధంలో చనిపోగా రాజ్యపాలన చేశారని.. నేటి మహిళా లోకానికి ఆమె ఆదర్శమన్నారు. తన రాజ్యంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ద్వారక, వారణాసి, నాసిక్, గయ, కాశీ, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, సోమనాథ్ తదితర ప్రముఖ ఆలయాలను పునరుద్ధరించారని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆమె పేరిట సీ్త్రశక్తి పురస్కారాన్ని అందజేస్తోందని.. ఇండోర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాణి అహల్యబాయి విమానాశ్రయంగా నామకరం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.పురుషోత్తంరెడ్డి, మహిళామోర్చా రాష్ట్ర నాయకులు జ్యోతి రమణ, పి.అలివేలమ్మ, జిల్లా ప్రధానకార్యదర్శి రామన్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగుపోగు కుమార్, జిల్లా అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు, కార్యదర్శి బోయల రాము, మాజీ మహిళామోర్చా అధ్యక్షురాలు కల్పన, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా ప్రధానకార్యదర్శి సూగూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
3 నుంచి ఇంటర్ప్రయోగ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శనివారం వెల్లడించారు. జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రయోగ పరీక్షలు కొనసాగుతాయన్నారు. 3న వృక్షశాస్త్రం, 4న జంతు శాస్త్రం, 4, 5 తేదీల్లో భౌతిక శాస్త్రం, 5, 6న రసాయన శాస్త్రం పరీక్షలు జరుగుతాయని వివరించారు. అదేమాదిరిగా జూన్ 9, 10న ఇంగ్లీష్, 11న పర్యావరణ విద్య పరీక్ష, 12న నైతికత, మానవ విలువలు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాల్టిక్కెట్లను కళాశాల నుంచి లేదా ఇంటర్బోర్డు వెబ్సైట్ నుంచి పొందవచ్చని, సకాలంలో కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులు జూన్ 30 సాయంత్రం 5 వరకు www.telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎండీ అఫ్జలుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు ప్రవేశం పొంది, కుటుంబ ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రూ.20 లక్షల ఉపకార వేతనంతో పాటు విమాన ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.60 వేలు చెల్లిస్తారని.. పూర్తి వివరాలకు జిల్లా కార్యాలయంలోగాని లేదా సెల్నంబర్లు 72078 54914, 08545–232500 సంప్రదించాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత జూలై, 31 సాయంత్రం 5 వరకు హార్డ్ కాపీలను జతచేసి 2 సెట్లను కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు వనపర్తి రూరల్: విధులను నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం మండలంలోని కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయన వెంట నోడల్ అధికారి డా. వంశీ, డా. రాకేష్రెడ్డి, వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరానిలిపివేత వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నుంచి 33 కేవీ కొత్తకోట ఫీడర్ లైన్లో తీగలకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నందున ఆయా ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ సరఫరా నిలివేస్తున్నట్లు పట్టణ విద్యుత్ ఏఈ ఎస్.రాజయ్యగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేడీఆర్నగర్, శంకర్గంజ్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి రోడ్, కొత్తకోట రోడ్, బసవన్నగడ్డ, ఐజయ్యనగర్, వెంగళరావునగర్కాలనీ, సాయినగర్కాలనీ, టీచర్స్కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, చందాపూర్ రోడ్, కర్నూలు రోడ్, సాగర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, న్యూటౌన్ కాలనీ, జంగిడిపురం, వల్లభ్నగర్, బ్రహ్మంగారి వీధి, రాజనగరం రోడ్, నాగవరం, భగీరథ స్విమ్మింగ్ పూల్ రోడ్ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 9 వరకు విద్యుత్ సరఫరా ఉండదని.. గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు. 3 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు కందనూలు: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతాయని నాగర్కర్నూల్ జిల్లా విద్యాధికారి రమేష్కుమార్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయని, హాల్టిక్కెట్లను ఇప్పటికే విడుదల చేశామని, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకొని సకాలంలో కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. 5 నిమిషాల వరకు అనుమతిస్తారని.. తర్వాత అనుమతి ఉండదని తెలిపారు. -
మరింత ప్రోత్సాహం అందించాలి
మాకు ఆరు బర్రెలు ఉన్నాయి. వీటి నుంచి పాలు సేకరించి హోటళ్లు, గృహాలకు అందించి వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నా. రోజుకు 10నుంచి 15లీటర్ల పాల వరకు విక్రయిస్తాను. మాలాంటి సన్నకారు రైతులకు, కొత్తగా ఈ రంగం వైపు వచ్చే యువతకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. బర్రెలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం లేదా బ్యాంకులు ఆర్థిక సహకారం అందిస్తే బాగుంటుంది. చిన్నంబావి మండలంలో పాల కేంద్రం ఏర్పాటు చేస్తే పాడి రంగం వైపు మరింత మంది రైతులు వచ్చే అవకాశం ఉంది. – వేముల శేఖర్గౌడ్, పాడిరైతు, చిన్నంబావి, వనపర్తి జిల్లా -
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
వనపర్తిటౌన్: చెడు వ్యసనాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులు దరి చేరకుండా సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ధూమపానం చేయమని.. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటామని.. కుటుంబ సభ్యులు, స్నేహితులను పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేలా చూస్తామంటూ న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యా యమూర్తి జి.కళార్చన, జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 14న జాతీయ లోక్ అదాలత్.. కోర్టు తీర్పుతో కక్షిదారుడు ఒక్కరే విజయం సాధిస్తే.. లోక్ అదాలత్లో రాజీ కావడంతో ఇరువురు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 14వ తేదీన జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీకి అనుకూలమైన సివిల్, క్రిమినల్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. తీర్పులకు అప్పీలు ఉండదని తెలిపారు. -
జాగ్రత్తలతోనే నియంత్రణ
ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదు ప్రశ్న: కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రాకేష్, దుప్పల్లి (మదనాపురం) డీఎంహెచ్ఓ: ఇతర దేశాల నుంచి వస్తున్న వారి నుంచి జెన్–1 కరోనా వేరియంట్ వ్యాపిస్తుంది. విదేశాల నుంచి వచ్చే వారికి దూరంగా ఉండటంతో పాటు మాస్క్లు ధరించాలి. వారి ఆరోగ్య పరిస్థితిని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రశ్న: వైరస్ వ్యాప్తిని ఎలా గుర్తించాలి.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? – రామకృష్ణ, వనపర్తి డీఎంహెచ్ఓ: మందులు వాడినా జ్వరం, దగ్గు, జలుబు తగ్గకుంటే వైరస్ సోకినట్లుగా భావించాలి. ఆర్టీపీసీఆర్ ద్వారా వైరస్ను గుర్తించవచ్చు. పౌష్టికాహారం, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే తగ్గిపోతుంది. ప్రశ్న: జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారా? – రాములు, బుసిరెడ్డిపల్లి (పాన్గల్) డీఎంహెచ్ఓ: ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా వ్యాధి లక్షణాలు బయటపడలేదు. ప్రస్తుత వేరియంట్ జెన్–1 సోకినట్లు నిర్ధారణ కాకపోవడంతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయలేదు. అవసరాన్ని బట్టి ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో కేవలం సింగిల్ డిజిట్ కేసులు నమోదు కావడంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు ఉత్పన్నం కావు. ప్రశ్న: గతంలో కరోనా సమయంలో భయాందోళనకు గురయ్యాం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలా? – శ్రీనివాసులు, పెబ్బేరు డీఎంహెచ్ఓ: తొలిసారి కరోనా ప్రభావం తక్కవే అయినా.. ప్రజల భయాందోళనలతో ఎక్కువ ప్రాణ నష్టం కలిగింది. ఇప్పటికే రెండుసార్లు వైరస్ ప్రభావం చూశాం. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలోని ప్రజల్లో రోగ నిరోధకశక్తి చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రూపాంతరం చెందిన జెన్–1 వైరస్ మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం లేదు. ప్రశ్న: సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – బాల్యానాయక్, తెల్లరాళ్లపల్లి తండా (పాన్గల్) డీఎంహెచ్ఓ: ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్యం బారిన పడితే సమీప ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలి. ప్రాథమిక దశలో ఉన్నప్పుడే సరైన వైద్యం తీసుకోవాలి. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పౌష్టికాహారంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కరోనా రూపాంతరం చెంది మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు సూచించారు. జెన్–1 వేరియంట్ రూపంలో కరోనా వ్యాపిస్తున్నందున శనివారం జిల్లా వైద్యాధికారితో ‘సాక్షి’ ఫోన్–ఇన్ నిర్వహించింది. జిల్లా నలుమూలల నుంచి పలువురు ఫోన్లో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని కొన్నిచోట్ల జెన్–1 వేరియంట్ వైరస్ సోకినా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసుకూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లా ప్రజలు రెండు విడతలుగా వైరస్ విజృంభణ చూశారని, వాటి బారిన పడకుండా రక్షణగా రెండు దఫాలు వ్యాక్సిన్ సైతం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న కరోనా వైరస్ తీవ్రత ప్రమాదకరంగా లేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు. – వనపర్తి ప్రస్తుత వైరస్ తీవ్రత తక్కువే.. భయపడాల్సిన అవసరం లేదు జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు ప్రశ్న: ఆహార అలవాట్లలో మార్పులు అవసరమా? – విష్ణు, గోపాల్పేట డీఎంహెచ్ఓ: ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం లేదు. రోజువారీగా కొద్దిపాటి పౌష్టికాహారం, వ్యాయామం చేస్తే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఎలాంటి వైరస్లు మీ దరికి చేరవు. -
రైతులతో డబ్బులు వసూలు చేయొద్దు
గోపాల్పేట: వరి కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, లారీడ్రైవర్లు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం ఆయన గొల్లపల్లి, చీర్కపల్లి, చాకల్పల్లి, రేవల్లి, గోపాల్పేటలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్రయించుకోవాలని.. కేంద్రాల్లో ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. -
ఉమ్మడి జిల్లాలో పాడి పశువులు, పాల ఉత్పత్తి ఇలా..
గద్వాలలోని ఓ డెయిరీ ఫాంలో పాలు పితుకుతున్న రైతు పాల ఉత్పత్తికి పెట్టింది పేరు పాలమూరు. జిల్లాలో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రతినిత్యం వేలాది మంది రైతులు పాలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో సుమారు 10 వేల మంది పాడి రైతులు ఉన్నారు. కాగా.. విజయ డెయిరీ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు 224 ఉండగా, ప్రతిరోజు 36,157.5 లీటర్ల పాలు సేకరిస్తున్నామని డెయిరీ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు. ఈ డెయిరీ పరిధిలో మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పాల సేకరణ జరుగుతుంది. డెయిరీతోపాటు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, బల్క్ కూలింగ్ యూనిట్లు మొత్తం 6 ఉన్నాయి. పాడి రైతుల కోరిక మేరకు ప్రైవేట్ డెయిరీల కంటే అధిక పాల సేకరణ ధర లీటరు గేదె పాలకు అధికంగా 10 శాతం వెన్న, 9 శాతం గణ పదార్థాలకు రూ.84.50, ఆవు పాలకు 4.9 వెన్న శాతానికి 8.9 ఘన పదార్థాలకు రూ.42.57 చెల్లిస్తున్నారు. యువత సైతం మక్కువ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వ్యవసాయంతోపాటు, కరువు కాటకాలు వచ్చినప్పుడు కుటుంబ పోషణ భారం కాకుండా ఇక్కడి రైతులు పాడిపై దృష్టిసారిస్తూ వచ్చారు. ఆవులు, గేదెల ద్వారా వచ్చిన పాలను విక్రరు ుస్తూ జీవనం సాగించడంతోపాటు ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు. గడిచిన ఐదేళ్ల నుంచి చాలామంది నిరుద్యోగ యువత పాడిపై మక్కువ పెంచుకున్నారు. డెయిరీ ఫాంల ఏర్పాటుతో స్వయం ఉపాధి కల్పించుకొని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. పాడి రైతులపై ఆర్థిక భారం ఒకప్పుడు రాష్ట్రానికి రోజువారీగా అవసరమైన పాలు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్పత్తి అయ్యేవి అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. అయితే ప్రస్తుతం పాడి పరిశ్రమ ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు ఆవు పాల ధర తగ్గించింది. ఇప్పటికే పాడి రైతులు పశుపోషణ భారమై తమ ఆవులు, గేదెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా విజయ డెయిరీ ద్వారా ఇస్తున్న దాణా, మినరల్ మిక్చర్, క్యాల్షియం మందులు సబ్సిడీలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కాల్షియం మందులు, విజయ దాణా కొనుగోలు చేయాలంటే సబ్సిడీ కాకుండా పూర్తి ధర చెల్లించాల్సి వస్తుందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ పరంగా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవి రైతులకు భరోసా కల్పించడం లేదు. ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ, పాడి రైతులకు డీబీటీ సదుపాయంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు సక్రమంగా అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు సెంటర్లలో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాగర్కర్నూల్లో 9 కేంద్రాలు .. నాగర్కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 9 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా జిల్లావ్యాప్తంగా 220 అవుట్ లెట్ల ద్వారా పాలు సేకరిస్తున్నారు. అయితే ప్రతిరోజు 1.70 లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతున్నా కేంద్రాల ద్వారా దాదాపు 10 వేల మంది రైతుల నుంచి 74 వేల లీటర్ల పాలు మాత్రమే సేకరిస్తున్నారు. జిల్లా గేదెలు ఆవులు ప్రతిరోజు పాల ఉత్పత్తి మహబూబ్నగర్ 50,000 80,000 36,157 నాగర్కర్నూల్ 1,20,800 80,500 1,70,225 వనపర్తి 22,955 9,774 35,677 జోగుళాంబ గద్వాల 49,659 47,902 40,000 నారాయణపేట 24,000 35,000 27,300 వనపర్తిలో ప్రైవేట్ వైపే.. జిల్లాలో ప్రతిరోజు 53,677 లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. అయితే పాడిరైతులు రోజువారిగా ఉత్పత్తి చేసిన పాలను 95 శాతం గృహ అవసరాలు, ప్రైవేటు డెయిరీలకు వెళ్తుంటే.. కేవలం 5 శాతం మాత్రమే ప్రభుత్వం అనుబంధంగా నిర్వహిస్తున్న విజయ డెయిరీకి పోస్తున్నారు. విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతుల సంఖ్య కేవలం 343 మంది మాత్రమే ఉండటం గమనార్హం.1975లోనే పాలకేంద్రం గద్వాల ప్రాంతంలో 1975లో ప్రభుత్వం పాలకేంద్రం స్థాపించింది. చాలా ఏళ్లపాటు రైతులు ఇక్కడ పాలు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా పాల కేంద్రం మూతబడింది. కాగా 2020 ప్రాంతంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో పాలకేంద్రం పునఃప్రారంభమైంది. దీనిద్వారా జిల్లావ్యాప్తంగా 25 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతిరోజు 2,500 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ పరంగా మరో పది దాక పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో.. జిల్లాలో 280 గ్రామాలతోపాటు పెద్దఎత్తున తండాలు ఉండటం వల్ల గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండటంతో పాడి పశువుల పోషణే ప్రధాన జీవనోపాధిగా మారింది. జిల్లావ్యాప్తంగా 500 మిల్క్ సెంటర్లు ఉండగా ప్రైవేటు వారు 30 వేల లీటర్లు, విజయ డెయిరీ నుంచి 2,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. -
చెరుకు బిల్లులు సకాలంలో చెల్లించాలి
అమరచింత: చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం ఆయన పలువురు చెరుకు రైతులతో కలిసి కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో ఈడీ రవికుమార్, డీజీఎం నాగార్జునరావుకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వారితో సమావేశమై సమస్యలను వివరించారు. చెరుకు పంటను ఫ్యాక్టరీకి తరలించిన 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలని, లేదంటే 16 శాతం వడ్డీతో కలిపి రైతులకు ఇవ్వాల్సి ఉండగా.. ఆ విధానం నేటికీ అమలు చేయడం కావడం లేదని తెలిపారు. చెరుకు విత్తన బిల్లులు 40 రోజుల్లో ఇస్తామన్న యాజమాన్యం ఇప్పటి వరకు అందించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని.. రాయితీలు, ప్రోత్సాహకాలు సకాలంలో చెల్లించి రైతులను ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్లో రికవరీతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర కల్పించాలని, వేరు పురుగు సోకిన పంట రైతులకు యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేటి వరకు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. త్వరగా చెల్లించి రైతు ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాసులు, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
వనపర్తి: వివిధ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు (కొత్త, పాత) 2024–2025 విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్ పొందేందుకు పూర్తి వివరాలను ఈ–పాస్ వెబ్సైట్ http://telanganae pass.gov.inలో నమోదుకుగాను జూన్ 30 వరకు గడువు ఉందని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి ఎం.మల్లికార్జున్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 1, 5వ తరగతిలో ప్రవేశాలకు జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జిల్లాకు చెంది, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించని వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు దిగువ చూపిన ధ్రువపత్రాలు జతచేసి జూన్ 16లోగా కార్యాలయంలో సమర్పించాలన్నారు. కుటుంబంలో ఒక విద్యార్థి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలకు కులం, ఆదాయం, స్థానిక, జనన ద్రువపత్రాలతో పాటు ఆధార్, రేషన్కార్డు ప్రతులపై గజిటెడ్ అధికారి సంతకం చేయించి సమర్పించాలన్నారు. అలాగే 5వ తరగతిలో ప్రవేశాలకు కులం, ఆదాయం, స్థానిక, 4వ తరగతి పాసైన బోనఫైడ్ (ఒరిజినల్), ఆధార్కార్డు, రేషన్కార్డు ప్రతులపై గజిటెడ్ అధికారి సంతకం చేయించి సమర్పించాలని పేర్కొన్నారు. వివరాల కోసం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిని సంప్రదించాలని సూచించారు. మక్తల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం షాద్నగర్రూరల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్నగర్వైపు వెళ్తున్న మరో కారు టోల్ప్లాజాలోని వేరే లైన్కు మారేందుకు డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 94407 31801, 63049 67688
వనపర్తి: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జెన్–1 వైరస్ వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 31న శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు ‘సాక్షి’ ఫోన్–ఇన్ నిర్వహిస్తోంది. జిల్లా ప్రజలు కరోనా వైరస్, జెన్–1 వేరియంట్పై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవటంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
రైతువేదికలు.. సౌర కేంద్రాలు
భవనాలపై ప్యానల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధం ●● ఒక్కో కేంద్రం వద్ద 5 కిలోవాట్ల సామర్థ్యం.. ● కేంద్రాల నిర్వహణకు విద్యుత్ విక్రయం ● పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లిలో విజయవంతం ● అన్ని వేదికల్లో ఏర్పాటుకుసిద్ధమవుతున్న టీజీ రెడ్కో కోస్గి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు సమకూరడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదాయ సమీకరణకు రైతువేదిక భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసి విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. ఒక్కో వేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర పలకలు అమర్చడంతో విద్యుత్ అవసరాలు పోను ఏడాదికి సుమారు రూ.25 వేల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రూపొందించింది. పైలెట్ గ్రామాల్లో విజయవంతం.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకొని జిల్లాకు రెండు చొప్పున పైలెట్ గ్రామాల రైతువేదికలను ఎంపిక చేసి సౌర విద్యుదుత్పత్తి చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా జానంపేట, నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిని ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో విజయవంతం కావడంతో మిగిలిన రైతువేదికపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెడ్కో అధికారులు సిద్ధమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 467 రైతువేదికలపై సోలార్ ప్యానెల్స్ బిగించి సౌర విద్యుత్ తయారీకి చర్యలు తీసుకుంటోంది. నిర్వహణ భారం.. గత ప్రభుత్వ హయంలో రైతులను సమావేశపర్చి శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ, సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాల పంపిణీ కోసం 5 వేల ఎకరాలను ఓ క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒకటి చొప్పున రైతువేదిక నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతను ఏఈఓలకు అప్పగించారు. భవనాల నిర్మాణం పూర్తయినా.. నిర్వహణకు నిధులు మంజూరుగాకపోవడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయారు. సొంతంగా ఆదాయం లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతువేదికల లక్ష్యం నీరుగారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. రైతువేదికలపై సోలార్ పలకల ఏర్పాటుతో ఆదాయం సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతువేదికల నిర్వహణకు నిధుల కొరత లేకుండా సక్రమంగా సాగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. -
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
వనపర్తి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు జరుగుతాయని.. అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వేదిక, అతిథులు, ప్రజాప్రతినిధులు, వేడుకలకు హాజరయ్యే ప్రజలు కూర్చునేందుకు వసతులను రోడ్లు, భవనాలశాఖ చేపట్టాలని సూచించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేయించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 2,37,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుపై శుక్రవారం కలెక్టర్ ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. యాసంగిలో ఇప్పటి వరకు 2,37,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే 6,744 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించామని, ఇందుకుగాను 170 లారీలు వినియోగించగా.. 160 లారీల్లోని ధాన్యం మిల్లులో అన్లోడ్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.456 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఎగువ 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, దిగువ 3 యూనిట్ల నుంచి 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ప్రాజెక్టుకు వరద పెరిగితే 11 యూనిట్ల నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడతామని.. ప్రస్తుతం 17 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. సుంకేసులకు కొనసాగుతున్న వరద.. రాజోళి: సుంకేసుల బ్యారేజీకి శుక్రవారం ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. 4,504 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఒక గేటు తెరిచి 4,345 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్కు 159 క్యూసెక్కులను వదులుతున్నట్లు జేఈ మహేంద్ర వివరించారు. ఏడు యూనిట్లలో 276 మెగావాట్లు 17 వేల క్యూసెక్కుల నీటి వినియోగం -
విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
వనపర్తి: విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంపై అవగాహన పెంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని ఎస్పీ రావుల గిరిధర్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని ఉర్దూ మీడియం బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు కొనసాగుతున్న ఐదురోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తల బాల్యం, విద్యాభ్యాసం, జీవన పోరాటం, ప్రయోగాల రూపకల్పన వైపు దారితీసిన పరిణామాలను పిల్లలకు వివరించాలన్నారు. విజ్ఞానశాస్త్ర అధ్యయనానికి విదేశాలకు వెళ్లకుండా మన దేశానికే విదేశీయులు బారులు తీరేలా ఎదగాలని, అది కేవలం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని తెలిపారు. ప్రాచీనకాలంలో విద్య, వైద్యం, వైజ్ఞానిక, ఖగోళ శాస్త్రాల్లో భారతీయుల సామర్థ్యం గురించి వివరించారు. ఈ మధ్య జరిగిన యుద్ధంలో మన శాస్త్రవేత్తలు తయారు చేసిన క్షిపణులను ఎస్పీ గుర్తు చేశారు. భావితరం సంస్కారవంతమైన, స్ఫూర్తివంతమైన జీవన విధానాన్ని అలవర్చుకునేలా తయారుచేసే శక్తి సామర్థ్యాలు ఒక్క ఉపాధ్యాయునిపైనే ఉన్నాయని తెలిపారు. అనంతరం కోర్స్ డైరెక్టర్ మంజులత, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, ఏఎంఓ మహానంది ఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో డీపీఆర్లు శ్రీనివాసులు, సుదర్శన్రావు, మల్లేష్కుమార్, సాయిచందర్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాభివృద్ధికి సహకరించండి
వనపర్తి: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారి విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన రహదారి విస్తరణ బాధితులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాకేంద్రం నుంచి పెబ్బేరు, పాన్గల్ రహదారి విస్తరణను ఇళ్లు, వ్యాపారసంస్థల యజమానులను ఒప్పించి తగిన పరిహారం చెల్లించి చేపడతామని వివరించారు. పాన్గల్ రోడ్లో ఇళ్లు కోల్పోతున్న వారికి రెండు పడక గదుల ఇళ్లు కేటాయించడం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వనపర్తి–పెబ్బేరు రహదారి విస్తరణ అనేది భావితరాలకు, వనపర్తి గౌరవాన్ని కాపాడేందుకు చాలా ముఖ్యమని.. వ్యాపారులు సహకరించాలని కోరారు. రోడ్డు ఎన్ని ఫీట్లు ఉండాలనేది టౌన్ ప్లానింగ్ ద్వారా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఒకటి, రెండురోజుల్లో కలెక్టర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పదేళ్లలో పట్టణ జనాభా రెండింతలు పెరిగిందని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు ఉండాలన్నారు. పట్టణాల్లో కనీసం వంద ఫీట్ల రోడ్లుంటే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందని.. వనపర్తికి 2000 సంవత్సరంలోనే ప్లాన్ తయారుచేసి 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించినట్లు చెప్పారు. కొంత స్థలం కోల్పోతున్న వారికి టీడీఆర్, పూర్తిగా స్థలం కోల్పోయే వారికి నష్ట పరిహారం అందిస్తామన్నారు. టీడీఆర్పై వ్యాపారులకు అవగాహన కల్పించారు. అనంతరం బాధితులు వారి వాదనలు, అభ్యర్థనలు తెలిపారు. రోడ్డు మధ్యభాగం ఎక్కడి నుంచి కొలతలు చేస్తారో నిర్ణయించాలని.. విస్తరణను 80 ఫీట్లకు కుదించాలని కోరారు. వ్యాపారుల తరఫున న్యాయవాది నిరంజన్పాషా వాదనలు వినిపించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ రమేష్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయం మేరకే..
రైతులకు అందుబాటులో ఉంటూ సాగు సలహాలు, సూచనలు, సమీక్షల కోసం నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు మంజూరుకావడం లేదు. సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – తిరుపతి, ఏఈఓ, గుండుమాల్ క్లస్టర్ అన్ని వేదికలపై ఏర్పాటు.. ఉమ్మడి జిల్లాలో పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లి రైతులవేదికల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని 467 రైతువేదికలపై ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని భవనాలు ఒకే నమూనాలో నిర్మించడంతో సౌర పలకల బిగింపు ఒకేసారి చేపట్టేందుకు వీలుంటుంది. సౌర విద్యుత్ తయారీ, విక్రయం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అను గుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – మనోహర్రెడ్డి, మేనేజర్, టీజీ రెడ్కో, ఉమ్మడి పాలమూరు జిల్లా ● -
ఫిట్లెస్ బస్సులు
ఈ నెల 16 నుంచి మొదలైన ప్రైవేట్ బస్సుల సామర్థ్య పరీక్షలు ● ఉమ్మడి జిల్లాలో 1,383 బస్సులకుగాను 245 పూర్తి ● కండీషన్లో లేని వాహనాలు వెనక్కి పంపాలని నిర్ణయం ● ఫిట్నెస్ పరీక్షలకు రాకుండానే నడిపిస్తున్న వైనం ● విద్యార్థుల సంరక్షణ బాధ్యత యాజమాన్యాలదే ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ విషయంలో కొందరు అధికారులు ఉదాసీనంగా, ఏజెంట్లు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024– 25లో దాదాపు వందకు పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోకుండానే విద్యార్థులను తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన కొందరు యాజమాన్యాలు మరమ్మతు ఇతర కారణాలతో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదు. విద్యాసంస్థల బస్సులన్నీ నిబంధనల మేరకు వసతులు కల్పించి ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలి. బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణా శాఖకు హామీపత్రం సమర్పించాలి. కచ్చితంగా ఉండాల్సినవి.. ● ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ● బస్సులో తప్పకుండా యూనిఫాం ధరించిన ఒక అటెండర్ను ఉంచాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు, విద్యార్థి ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రదేశాలు నమోదు చేయాలి. ● బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్కి వారు కనిపించేలా మిర్రర్ ఏర్పాటు చేయాలి. ● ముఖ్యంగా బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరం ఉండాలి. ● బస్సులో సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్ ఏర్పాటు చేయాలి. ● బస్సు పాఠశాల కమిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. తయారీ సంవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు. ● ప్రతి బస్సుకు చేతి బ్రేకు, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి. ● బస్సు అద్దాలకు అనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. ● నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి. ● విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి. కఠినంగా వ్యవహరిస్తేనే.. -
ఇసుక రీచ్లను గుర్తించండి
వనపర్తి: మన ఇసుక వాహనం ద్వారా భవన నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేందుకు రీచ్లను గుర్తించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాస్థాయి సాండ్ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో కొత్తగా ఎక్కడెక్కడ రీచ్లు గుర్తించారు, వాటి భౌగోళిక పరిస్థితులపై చర్చించారు. తుంపల్లి, వీరరాఘవాపూర్ రీచ్లలో 3,990 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని, ఇరిగేషన్, భూగర్భ జలాలు, మైన్స్ అండ్ జియాలజి రిపోర్టును కలెక్టర్కు అందజేశారు. వీరరాఘవపూర్ రీచ్ నుంచి ఇసుక తరలింపునకు కమిటీ తీర్మానం చేసింది. రహదారి విస్తరణ పనుల్లో జాప్యం సరికాదు.. జిల్లాలో రహదారి విస్తరణ పనుల్లో చాలా జాప్యం జరుగుతుందని.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్ను ఆదేశించారు. బాధితులు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లు తీసుకోవడంతో భవిష్యత్లో నాలుగింతల లాభం చేకూరుతుందని.. అవగాహన కల్పించాలని సూచించారు. రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులతో సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, రోడ్లు, భవనాలశాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. వరి కొనుగోళ్లపై ప్రత్యేక బులెటిన్.. యాసంగిలో ఇప్పటి వరకు 2,30,796 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి వివరించారు. గురువారం ఒక్కరోజే మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించినట్లు చెప్పారు. ధాన్యం తరలింపునకు 180 లారీలు వినియోగించామని, 135 లారీల ధాన్యం మిల్లుల్లో ఖాళీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ.445 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. -
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ కళాశాలను మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్లో గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు వలన పాలమూరు జిల్లా విద్యారంగంలో మరింత పురోగతి సాధించగలుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి (మహబూబ్నగర్), జి.మధుసూదన్రెడ్డి (దేవరకద్ర), జనంపల్లి అనిరుధ్రెడ్డి (జడ్చర్ల), వాకిటి శ్రీహరి (మక్తల్), చిట్టెం పర్ణికారెడ్డి (నారాయణపేట), తూడి మేఘారెడ్డి (వనపర్తి), వీర్లపల్లి శంకర్ (షాద్నగర్) ఉన్నారు. – స్టేషన్ మహబూబ్నగర్ -
నీరు పారేదెలా..?!
ఆధునికీకరణకు నోచుకోని కేఎల్ఐ కాల్వలు ●ఉన్నతాధికారులకు నివేదించాం.. సాగునీటి కాల్వల్లో జమ్ముగడ్డి, ముళ్లపొదల తొలగింపు, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు లేవు. ఈజీఎస్ ద్వారా జమ్ము, ముళ్లపొదలు తొలగించే పనులు చేపట్టాలని గతంలో నిర్ణయించారు. కొన్నిచోట్ల ఆ పనులు జరిగాయి. సిమెంట్ లైనింగ్ నిర్మాణాల గురించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – శ్రీనివాస్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ సొంత డబ్బులు వెచ్చించి.. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి కొల్లాపూర్ మీదుగా రామాపురం వరకు ఉన్న డీ–1 కాల్వలో జమ్ముగడ్డి, ముళ్లచెట్లు పెరిగాయి. ఏటా ఒక ప్రజాప్రతినిధి సొంత డబ్బులతో మొక్కలు తొలగిస్తున్నారు. లేకపోతే రైతులమే స్వయంగా పనులు చేయించుకుంటున్నాం. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేయాలి. – ఆంజనేయులుగౌడ్, రైతు, రామాపురం, కొల్లాపూర్ మండలం ● పేరుకుపోయిన జమ్ముగడ్డి, ముళ్లపొదలు ● సాగునీరు ముందుకు పారకుండా అడ్డంకులు ● వర్షాకాలంలో కోతకు గురవుతున్న వైనం ● సిమెంట్ లైనింగ్ చేయాలని రైతుల వేడుకోలు ఆయకట్టు విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలు కేఎల్ఐ పరిధిలో రిజర్వాయర్లు 3 సాగునీటి కాల్వలు 324 కి.మీ., సింగోటం కాల్వ లైనింగ్ కోసం మంజూరు చేసిన నిధులు రూ.10 కోట్లు -
సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం
పాన్గల్: స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ నాయకులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల్లో మిగతా వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, తరలింపులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు అర్హులైన పేదలకే అందాలని కోరారు. స్థానిక సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలన్నారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్, సభ్యులు భాస్కర్, భగత్, ఎం.వెంకటయ్య, భీమయ్య, వెంకటయ్య, జంబులయ్య పాల్గొన్నారు.4న ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ ఎంపికలుమహబూబ్నగర్ క్రీడలు: ది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 4వ తేదీన జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.శ్యాంసుందర్గౌడ్, ఎల్.రవికుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–13, అండర్–15, అండర్–17, అండర్–19, సీనియర్, వెటరన్ విభాగాల్లో సెలక్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆ రోజు ఉదయం 9 గంటలకు కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్ను రిపోర్టు చేయాలని, మిగ తా వివరాల కోసం 98480 85211, 98660 33377, 96189 75795, 98669 28835 నంబర్లను సంప్రదించాలని సూచించారు.ఫలితాలు విడుదలమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ, బీఎడ్ ఫలి తాలను బుధవారం పీయూ వీసీ శ్రీనివాస్ వి డుదల చేశారు. బీఫార్మసీ మొదటి సెమిస్టర్లో 5.52 శాతం, బీఎడ్ 3వ సెమిస్టర్లో 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.రేపు సీతారాముల కల్యాణంఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని ఆయన కోరారు.మొక్కలే మానవాళికి జీవనాధారంఎర్రవల్లి: మొక్కలే మానవాళికి జీవనాధారమని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుంచి నీటి కుంట ఏర్పాటు కోసం కమాండెంట్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటేనే మొక్కలకు అవసరమైనప్పుడు నీటిని వినియోగించుకోవచ్చునని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ద్వారా రూ. 3లక్షల వ్యయంతో బెటాలియన్లో నీటి కుంటను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే రాబోయే కాలానికి ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ రాజేశం, సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ
పాన్గల్: చిన్నారుల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. పరిమళ, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. సాయినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, సబ్సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల వివరాల నమోదు రికార్డులు, వ్యాక్సిన్ నిల్వలు, అసంక్రమిత వ్యాధుల వివరాల నమోదు, వ్యాక్సిన్ పంపిణీ చేయని జాబితాను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించేలా, టీకాలు ఇప్పించడంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తల్లిదండ్రులను చైతన్యం చేయాలన్నారు. పాలిచ్చే తల్లులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ జిల్లా మేనేజర్ పరశురాం, జిల్లా ఎన్సీడీ కో–ఆర్డినేటర్ చంద్రయ్య, సీహెచ్ఓ రామయ్య, ఎంఎల్హెచ్పీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయాలి
వనపర్తి: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కేటగిరి–1 ప్రాధాన్యత కింద నిర్ధారించిన భూములను త్వరగా సేకరించి ఇరిగేషన్శాఖకు అప్పగించాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. జయన్న తిర్మలాపూర్లో 12.95 ఎకరాలు, రేవల్లి మండలం కేశంపేటలో 29.24 ఎకరాలు సర్వే చేసి పెగ్ మార్క్ చేయాలని, సర్వేయర్లను పంపించి వారంలో సర్వే చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రేమద్దుల డి–8, కర్నెతండా ఎత్తిపోతలకు సంబంధించిన భూ సేకరణ చేపట్టాలని సూచించారు. షాపూర్లో 28.32 ఎకరాలు, మల్కాపూర్లో 8.35 ఎకరాలు, పొల్కెపాడులో భూ సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. గణపసముద్రం, బుద్ధారంలో 96 ఎకరాలకు అవార్డ్ పాసైనందున రైతులకు పరిహారం చెల్లింపులు జరిగేలా చూడాలని భూ సేకరణ అధికారిని ఆదేశించారు. ఖిల్లాఘనపురం మండలం అల్లమాయపల్లిలో 10 ఎకరాలు, మిల్క్మియాన్పల్లిలో 6 ఎకరాలు, తిర్మలాయపల్లిలో 23 ఎకరాలు సైతం కేటగిరి–1లో ఉన్నందున జూన్ చివరి నాటికి సర్వే చేపట్టి అవార్డ్ పాస్చేసి ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి కావాలన్నారు. సర్వేయర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో భూ సేకరణ పూర్తి చేయాలని కోరారు. ఇక నుంచి ప్రతి వారం భూ సేకరణ పురోగతిపై సమీక్ష ఉంటుందని, పూర్తయిన నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో భూ సేకరణ ప్రత్యేక అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్ఈ జె.శ్రీనివాస్రెడ్డి, ఇరిగేషన్ కార్యనిర్వాహక ఇంజినీర్ మధుసూదన్రావు, ఏడీ సర్వే బాలకృష్ణ, ఇరిగేషన్ ఈఈ కేశవరావు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
వీపనగండ్ల: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపై ఉందని జిల్లా నోడల్ అధికారి డా. వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కల్వరాల సబ్సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ముసురు వర్షాలతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని.. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లోని వీధులను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, మురుగు కాల్వల్లో నీరు నిల్వకుండా చూడాలన్నారు. చిన్నారులను ఆస్పత్రులకు తీసుకొచ్చి క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. -
బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం
వనపర్తి: బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ పని చేస్తోందని సంఘం రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీసీ జనభేరి మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమకాంక్ష ఒక్కరోజులో సఫలీకృతం కాదని.. దీర్ఘకాలం పోరాడాలని, ఈ సమయంలో ఏళ్లుగా రాజ్యాధికారం అనుభవిస్తున్న వారు హేళన చేసినా, తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినా బెదిరేది లేదన్నారు. ఓ వైపు బీసీల హక్కుల కోసం పోరాడుతూనే ఈ ప్రాంత బిడ్డగా సమాజంలో చోటు చేసుకుంటున్న అవినీతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధుల అలసత్వాన్ని ఎండగట్టేందుకు మరో అడుగు వేస్తున్నట్లు ప్రకటించారు. ఓర్వలేని కొందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుదిరగనని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని.. లేదంటే బీసీ పొలిటికల్ జేఏసీ తమ అభ్యర్థులను నిలబెట్టి ప్రజల ఆశీర్వాదంతో గెలిపించుకునేందుకు వెనుకాడబోదన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి రావడంతో మైదానం జనకళను సంతరించుకుంది. బుల్లితెర కళాకారులు జానులిరి, జంగిరెడ్డి బృందం తమ ప్రదర్శనలతో అలరించారు. -
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం
వనపర్తి విద్యావిభాగం/అమరచింత: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని రాష్ట్ర తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాకేంద్రానికి బడిబాట ప్రచార జాత చేరుకోగా యూటీఎఫ్ నాయకులు, సభ్యులు పెద్దఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. రాజీవ్ చౌక్, అంబేడ్కర్ చౌక్లో, సాయంత్రం అమరచింతలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు సంఖ్య పెంపునకు టీఎస్ యూటీఎఫ్తో పాటు తెలంగాణ పౌర స్పందన వేదిక కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలాలు ఉన్నాయని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాంలు అందించడంతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం నుంచి విముక్తి పొందాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని, సంపాదనలో సగానికిపైగా చదువులకే ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్లతో పాటు ఒత్తిడి లేని బోధన అందుతుందని వివరించారు. జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రవిప్రసాద్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి జిల్లా కార్యదర్శులు హమీద్, శ్రీనివాస్గౌడ్, తిమ్మప్ప, అరుణ, అనసూయ, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు భద్రశేనయ్య, రామన్గౌడ్, నారాయణ, గట్టయ్య, భీమయ్య, అమరచింతలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏఈ మంగ, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, కావ్య, ధనమూర్తి, అగ్రిప్ప, రాములు, కిరణ్, జీఎస్ గోపి, అజయ్, తౌఫిక్, అశోక్, రవి, ఎం.శ్రీనివాసులు, ఆదాం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
జిల్లా తూనికలు, కొలతల అధికారి సస్పెన్షన్
వనపర్తి: జిల్లా తూనికలు, కొలతలశాఖ అధికారి సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. పెట్రోల్ పంపుల లైసెన్స్ రెన్యూవల్స్, తూకాల్లో మోసాలు, నిబంధనలు ఉల్లంఘించి చేతివాటం ప్రదర్శించారనే కారణాలతో విజిలెన్స్ విభాగం ఇచ్చిన విచారణ నివేధిక ఆధారంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్, రాష్ట్ర కంట్రోలర్ డీఎస్ చౌహాన్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన అవినీతి బాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం, గత నెల 8న ‘సాక్షి’ ప్రధాన పత్రికలో ‘రెన్యూవల్కు ఓ రేటుంది’ శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించి విచారణ చేసి చర్యలు తీసుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అధికారి నాగేశ్వర్రావుకు జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తె లుస్తోంది. ఈ విషయంపై కలెక్టరేట్కు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.నేడు జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలువనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు జూన్ 1న తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో జరిగే 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అండర్–8లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2017 నుంచి 01.06.2019, అండర్–10లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2015 నుండి 01.06.2017, అండర్–12లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2013 నుంచి 01.06.2015 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు కుల, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్లు 99086 29908, 94413 53375, 80961 15222 సంప్రదించాలని సూచించారు.ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలువనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరగగా.. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 2,374 మంది విద్యార్థులకుగాను 2,179 మంది హాజరు కాగా, 195 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 663 మంది విద్యార్థులకుగాను 614 మంది హాజరు కాగా 49 మంది రాలేదని వివరించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నరేంద్రకుమార్, శ్రీనివాసులు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు, బాలురు, వాగ్దేవి కేంద్రాలను తనిఖీ చేశారు. డీఐఈఓ ఎర్ర అంజయ్య రావూస్, స్కాలర్స్, సీవీ రామన్, విజ్ఞాన్ జూనియర్ కళాశాల కేంద్రాన్ని సందర్శించారు.నేడు జనభేరి బహిరంగ సభవనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారం.. హక్కుల సాధన కోసం బుధవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో జనభేరి బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ వెల్లడించారు. మంగళవారం జిల్లాకేంద్రంలో జేఏసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో తిరిగినప్పుడు మా దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, పలు ప్రజాసంఘాల నాయకులు హాజరవుతారని వివరించారు. పార్టీలకతీతంగా నిర్వహించే జనభేరికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు చింతపల్లి సతీష్, పాండురంగ యాదవ్, గోటూరి రవీందర్, వీవీ గౌడ్, కొన్నూర్ గూడు షా, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, రాఘవేందర్గౌడ్, ధర్మేందర్, ఆస్కని రమేష్, అక్కల మల్లేష్గౌడ్, చెలిమిళ్ల రామన్గౌడ్, యశ్వంత్, శ్రీనివాస్గౌడ్, రేనట్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణలక్ష్మి పేదలకు వరం
కొత్తకోట రూరల్/మదనాపురం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రొ. జయశంకర్ సమావేశ మందిరం, మదనాపురం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలన పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దరిచేరక నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేవారని, ప్రజాపాలనలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాసులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, మదనాపురంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దారు జేకే మోహన్, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, మార్కెట్ డైరెక్టర్ పావనిరెడ్డి, జగదీష్, సాయిబాబా, ఖాజా మైనుద్దీన్, అంజద్ అలీ, ఆవుల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ఆత్మకూర్: కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దిగువ జూరాల జల విద్యుత్కేంద్రం వద్ద జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, వర్టికల్స్, డయల్ 100, బ్లూకోర్టు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, బీట్ సిస్టం సిబ్బందితో నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్లలో వర్టికల్స్ పనితీరును నిత్యం పర్యవేక్షిస్తుండాలని, ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. నేరస్తులను త్వరగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని, బీట్ సిస్టంను మరింత పటిష్టపర్చాలని, దొంగతనాలు జరగకుండా ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని, ఎక్కడబడితే అక్కడ మద్యం తాగకుండా, అమ్మకాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని, పట్టుబడితే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం సందర్శన.. దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాన్ని ఎస్పీతో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్లు సందర్శించారు. వియ్యర్, స్విచ్యార్డు, పవర్హౌజ్ను పరిశీలించి విద్యుత్ తయారీ తదితర వివరాలను జన్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐలు శివకుమార్, రాంబాబు, కృష్ణయ్య, ఎస్ఐలు నరేందర్, తిరుపతిరెడ్డి, సురేష్, శేఖర్రెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పోలీస్ అధికారులు నిత్యం పర్యటించాలి ఎస్పీ రావుల గిరిధర్ -
ధాన్యం తరలింపులో జాప్యం వద్దు
గోపాల్పేట: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి జాప్యం చేయకుండా మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని ఏదుట్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం చేసేందుకు హమాలీలు ఎక్కువగా ఉండేలా చూడాలని, వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్కు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని గోదాంను పరిశీలించారు. గోదాంలో ధాన్యం నిల్వకు అనుకూలమైన వాతావరణం, పటిష్ట భద్రత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదాంలోని గన్నీబ్యాగులు తరలించి ఖాళీ చేయాలని, ధాన్యం తరలింపులో అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ‘భూ భారతి’పై సమీక్ష.. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పాండునాయక్, రెవెన్యూ సిబ్బందితో భూ భారతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన మండలంలో దరఖాస్తులను వచ్చే నెల రెండో తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 573 దరఖాస్తులు రాగా.. 246 దరఖాస్తులకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ పాండు వివరించారు. ఇందులో 155 సక్సేషన్ దరఖాస్తులు, మిగిలినవి సాదా బైనామా దరఖాస్తులని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, మిగతావి కలెక్టర్ లాగిన్కు పంపించాలని కలెక్టర్ సూచించారు. జూన్ 2 నాటికి రైతుల సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు సహకరించాలన్నారు. భూ ఫిర్యాదులను త్వరగాపరిష్కరించాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
జలయజ్ఞం ప్రాజెక్ట్లపై నజర్
కోయిల్సాగర్: చివరి దశలో పనులు 2006లో రూ.349 కోట్లు కేటాయించి.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి కాకుండానే పదేళ్ల తర్వాత 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలు, లింక్ కెనాల్ కింద కొత్తగా పిల్ల కాల్వల పనులు చేపట్టడానికి రూ.50 కోట్లతో రీ టెండర్లు పిలిచారు. అలాగే నాగిరెడ్డిపల్లి ఫేస్1, తీలేర్ ఫేస్ 2 పంపుహౌస్లలో పెండింగ్లో ఉన్న పనులకు రూ.16.90 కోట్లతో రీ టెండర్లను పిలిచారు. ఎత్తిపోతల పథకం లక్ష్యం 50,250 ఎకరాలు కాగా.. వానాకాలం పంటల కింద 36 వేల ఎకరాలలకు, యాసంగిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుంచి దేవరకద్ర గ్రావిటీ కెనాల్ను రూ.23 కోట్లతో చేపట్టగా పనులు చివరిదశలో ఉన్నాయి. అజిలాపూర్, చౌదర్పల్లి ఎత్తిపోతల పథకం, రాజోలి నుంచి పేరూర్ వరకు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి ● నెట్టెంపాడులో 610 ఎకరాలకు రూ.25 కోట్లు విడుదల ● ‘పాలమూరు’లో 15 వేల ఎకరాలకు రూ.300 కోట్లు.. ● భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పనులపైనా కసరత్తు ● పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి రవినాయక్ ఆరా ● ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ప్రాజెక్ట్ -
కేఎల్ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్కు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. -
మంచి నడవడికతో గౌరవం పొందాలి
వనపర్తి: సమాజంలో మంచి నడవడికతో జీవిస్తూ అందరి ఆదరణ, గౌరవం పొందాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని ఠాణాల్లో నేరచరిత్ర కలిగిన 85 మంది రౌడీషీటర్లు, 75 మంది అనుమానితులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, సాధారణ ప్రజా జీవనానికి ఇబ్బందులు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని, అలాంటి వారిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. జిల్లా పరిధిలో సత్ప్రవర్తన కలిగి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను గుర్తించి పోలీసు రికార్డుల్లో నేరచరిత్రను తొలగిస్తామని, తమ కుటుంబ సభ్యులతో జీవితాన్ని గడపాలని కోరారు. అలాగే ఏదైనా, ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారం అందించే బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించారు. హింసతో ఏదీ సాధించలేమని, ప్రతికార చర్యలకు కాకుండా పరస్పరం చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ రవిపాల్, సీసీఎస్ ఎస్ఐ జయన్న, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ ప్రజావాణికి 12 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 12 వినతులు వచ్చినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. అర్జీదారులు వివిధ సమస్యలపై నేరుగా ఎస్పీని కలిసి వినతులు అందించారు. ఎస్పీ స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారికి ఫోన్చేసి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
197 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. సోమవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయని.. సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారని వివరించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,907 మంది విద్యార్థులకుగాను 1,755 మంది హాజరుకాగా.. 152 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 607 మంది విద్యార్థులకుగాను 562 మంది హాజరుకాగా 45 మంది రాలేదని వివరించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నరేంద్రకుమార్, శ్రీనివాసులు పెబ్బేర్, కొత్తకోట పరీక్ష కేంద్రాలను, జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని తాను తనిఖీచేసినట్లు తెలిపారు. రామన్పాడులో 1,016 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం సముద్ర మట్టానికిపైన 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా జలాశయానికి నీటి సరఫరా నిలిపివేశారని.. రామన్పాడు జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు. -
సాగని పనులు.. పారని నీరు
నిలిచిన సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు కొల్లాపూర్: నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు ముందుకు సాగడం లేదు. భూ సేకరణ సమస్య కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ కాల్వ నిర్మాణంపై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. నిర్మాణం పూర్తయితే సాగునీటి సమస్యలు తీరుతాయని భావిస్తున్నా.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ● మూడేళ్ల కిందటరూ.147.7 కోట్లు మంజూరు ● భూ సేకరణే ప్రధాన అడ్డంకి ● నిర్మాణం పూర్తయితే 34 వేల ఎకరాలకు సాగునీరు -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
గోపాల్పేట: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. మిల్లులకు ఎంత తరలించారు, ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని గోదాంను పరిశీలించారు. గోదాంలో ధాన్యం నిల్వ చేసేందుకు అనుకూలమైన వాతావరణం, పటిష్ట భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తయితే మండలానికి సంబంధించిన ధాన్యం ఇక్కడే నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. స్థానిక నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. నేడు పీఎఫ్ సమస్యలపై సదస్సు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీఎఫ్ ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి గాను మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ‘నిధి ఆప్కే నిక్కత్–2’ నిర్వహించనున్నామని రీజినల్ పీఎఫ్ కమిషనర్–1 తేజ్ప్రతాప్సింగ్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సులు మహబూబ్నగర్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్, నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయం, వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం, నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాలలోని ఎన్ఎస్ ఎంటర్ప్రైజెస్ (బీడీ మాన్యుఫ్యాక్చర్స్), గద్వాల పీఏసీఎస్లో, రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మున్సిపల్ కార్యాలయంలో, వికారాబాద్ జిల్లా తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో కొనసాగుతాయన్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలోని షేక్పేట్ నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాలలో, హైదరాబాద్ పీఎఫ్ రీజినల్ ఆఫీస్–2లో జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని పీఎఫ్ ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నేడు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో మంగళవారం 11వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు బాలురు, బాలికలను ఎంపికలు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. స్థానిక మినీ స్టేడియంలో అండర్–8 బాలురు, బాలికల విభాగంలో 60తోపాటు 200 మీటర్ల పరుగు పందెం, టెన్నిస్ బాల్ త్రో, అండర్–10 బాలురు, బాలికల విభాగంలో 60తోపాటు 300 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్–12 బాలురు, బాలికల విభాగంలో 60, 300, 600 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ఫుట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని, వీరు జూన్ 1వ తేదీన సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. -
ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అచ్చంపేట/ బల్మూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రణాళిక, జీఓ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతలు, ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో చేపట్టనున్న పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందే తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు. అచ్చంపేట నియోజవర్గానికి, తమకు విడదీయని బంధం ఉందని, అన్న మల్లు అనంతరాములుతోపాటు మల్లు రవి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేశారని, తాను అప్పట్లో విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికి వచ్చానని గుర్తుచేసుకున్నారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే.. నీళ్లు, నిధులు, నియామకాలంటూ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న యువతకు గత పాలకులు అన్యాయం చేశారని డిప్యూటీ సీఎం విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామని, ఇప్పటికే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేసిందని, దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు ఈ ఆలోచన చేయలేదని వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు సోలార్ కరెంట్, పంపుసెట్లు, డ్రిప్ స్ప్రింక్లర్లను వినియోగించి ఉద్యానశాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, నిమ్మ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని.. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించామని తెలిపారు. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం బీఆర్ఎస్ పనులు చేపట్టింది తప్పా పూర్తిచేయలే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు
వనపర్తి: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆధ్వర్యంలో జరిగిన టాస్క్ఫోర్స్ కమిటీ జిల్లాస్థాయి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభవుతున్నందున రైతులు విత్తనాలు నాటేందుకు సమాయత్తం అవుతుంటారని, పొరపాటున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడా నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ చేయని, లేబుల్ లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని.. టాస్క్ఫోర్స్ బృందాలు విత్తన విక్రయ దుకాణాలను తనిఖీ చేసి ఎక్కడైనా పట్టుబడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు ఖరీదైనవి కావడంతో నకిలీవి విక్రయించే ప్రమాదం ఉందని.. జిల్లా, మండలస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనుమతి ఉన్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలని, ఇతరులు అమ్మడానికి వీలు లేదన్నారు. ఫ జిల్లా రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైతులు సన్నరకం మాత్రమే సాగు చెసేలా అవగాహన కల్పించాలని, రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం ద్వారా నకిలీ విత్తనాలు, పంట మార్పిడీపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏడీఏ చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి మున్నా, సీఐలు, ఎస్ఐలు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
నీటి వృథాకు అడ్డుకట్ట
పూర్తయిన జూరాల ఎడమ కాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతు సుమారు 30 ఏళ్ల కిందట.. జూరాల ఎడమ కాల్వ కింద జిల్లాలో సుమారు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏడాదికి రెండుసార్లు పంటలకు సాగునీరు అందిస్తారు. సుమారు 30 ఏళ్ల కిందట బిగించిన షట్టర్లు వంగిపోయి దెబ్బతినడంతో మూసినా నీరు వృథాగా పారుతోంది. వారబందీ సమయంలో లీకేజీల కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథా అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు. యాసంగిలో వారబందీ విధానంలో రామన్పాడు రిజర్వాయర్ వరకు సాగునీటిని వదిలారు. సమాంతర కాల్వకు మోక్షమెన్నడో? భీమా ఫేజ్–2 ఎత్తిపోతల కోసం సమాంతర కాల్వను ఏర్పాటు చేశారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు వస్తున్న నీటిని కాల్వ ద్వారా పంపింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. కాని భీమా అధికారులు కాల్వ ప్రధాన షట్టర్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం 150 క్యూసెక్కుల నీరు కాల్వలో వృథాగా పారుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమకాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిపివేసినా షట్టర్ల లీకేజీలతో రోజు కాల్వలో వృథాగా పారి జలాశయంలో నిల్వ నీటిమట్టం తగ్గుముఖం పట్టేది. నిత్యం 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు వృథా అవుతుండటంతో అధికారులు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వకు 4 సాధారణ, 4 ఎమరెన్సీ షటర్లు ఉండగా.. 4 సాధారణ షట్టర్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతుంది. దీంతో వీటి మరమ్మతుకు రూ.7.50 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వేగంగా మరమ్మతులు పూర్తిచేశారు. ఇకనుంచి యాసంగి సీజన్లో ఆయకట్టుకు వారబందీ సమయంలో సాగునీరు నిలిపివేసే సమయంలో చుక్కనీరు ముందుకు పారకుండా షట్టర్లను పక్కాగా బిగించనున్నారు. నాలుగు షట్టర్లకు రూ.7.50 లక్షల వ్యయం వారబందీ సమయంలో నీరు వృథా కాకుండా చర్యలు ఎట్టకేలకు మోక్షం -
యువతను మించిన సంపద లేదు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వనపర్తి టౌన్: దేశ భవిష్యత్కు యువతను మించిన సంపద లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత సరైన మార్గంలో పయనించకుంటే దేశ భవిష్యత్ అంధకారమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పానియాలు, పదార్థాల బారిన పడకుండా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చెడు వ్యసనం లేని భారతావనే లక్ష్యంగా ముందుకు సాగితే అగ్రగామిగా నిలబడుతోందని దీమా వ్యక్తం చేశారు. ధనవంతుల పిల్లలు అత్యధికంగా ఫ్యాషన్ మోజులో పడి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని తెలిపారు. ఒత్తిడికి గురైనప్పుడు ధ్యానం, యోగా చేయాలని తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ప్రతి అంశానికి ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండటం నేర్చుకోవాలని, మౌనానికి మించిన సంపద లేదని వివరించారు. అనంతరం వ్యసనం లేని సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు నషాముక్త్ భారత్ రథాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అఖ్తర్, కమర్మియా, యాదయ్య, బాబా, సమద్, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు శోభ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఎం
పాన్గల్: మండలంలోని రేమద్దులలో రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామంలోని పార్టీ కార్యాలయంలో రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న పేదలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, గ్రామ కొత్త చెరువు అలుగు వద్ద వంతెన నిర్మాణంతో పాటు నల్లకుంట వరకు సీసీ రహదారి నిర్మించాలని కోరారు. అలాగే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో మిగిలినవి అమలు చేయాలన్నారు. పేదలకు న్యాయం చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంకటయ్య, భగత్, ఎం.వెంకటయ్య, ఖాజా, మల్లేష్, భాస్కర్, నిరంజన్, భాస్కర్గౌడ్, తిరుపతయ్య, బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు. కోయిల్సాగర్లో 11 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్హౌస్ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్ సాగర్కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. -
సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ
వనపర్తిటౌన్: ఆపరేషన్ సిందూర్తో భారతదేశ రక్షణ వ్యవస్థ బలాన్ని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండకు ప్రతీకారంగా భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయం, సైనికులకు మద్దతుగా ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్ల మీదుగా పార్టీ జిల్లా కన్వీనర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్లామిక్ టెరర్రిస్ట్ గ్రూప్లు కుట్ర పూరితంగా పహల్గాంలో 28 మందిని అతికిరాతకంగా చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఈ నెల 7న ఉదయం కేవలం 20 నిమిషాల వ్యవధిలో పౌర సమాజానికి విఘాతం కలగకుండా 9 ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి వందలాది మంది టెరర్రిస్టులను అంతమొందించి దేశ రక్షణ వ్యవస్థ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేశారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా విద్యార్థి, యువజన, కుల, ప్రజాసంఘాలు, రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పెద్దసంఖ్యలో తిరంగా ర్యాలీలో పాల్గొని దేశ జవాన్లకు నేను సైతం మద్దతు అంటూ ఐక్యతను చాటారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్రెడ్డి, నాయకులు పురుషోత్తంరెడ్డి, బి.శ్రీశైలం, చిత్తారి ప్రభాకర్, హేమారెడ్డి, రిటైర్డ్ ఆర్మీ జవాన్ల సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్రెడ్డి, రత్నాకర్రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
వనపర్తి: బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్తో ఆమెతో పాటు కమిషన్ సభ్యురాలు బండి అపర్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం, విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాలల హక్కులను రక్షించడంతో పాటు గౌరవించాలని, వాటిని కాపాడే అధికారం కమిషన్కు ఉంటుందని వివరించారు. జిల్లాల్లో బాలలకు అందుతున్న విద్య, పోక్సో చట్టం అమలు, బాధితులకు అందుతున్న పరిహారం తదితర విషయాలను సభ్యురాలు బండి అపర్ణను అడిగి తెలుసుకున్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, చిన్నారులు మానసిక రుగ్మతలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థినులు, యువతులు, మహిళల భద్రత పోలీసుశాఖ మొదటి ప్రాధాన్యమని, భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని కోరారు. బాలల సంరక్షణకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
నేడు బల్మూర్కు ఉప ముఖ్యమంత్రి రాక
బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్కు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన గ్రామానికి చేరుకొని విద్యుత్ సబ్స్టేషన్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల పనులు, సభ ఏర్పాట్లను విద్యుత్శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లోని బేగంపేట ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు గ్రామానికి చేరుకుంటారన్నారు. అక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రూ.25 కోట్లతో పోల్కంపల్లి, రూ.1.82 కోట్లతో బొమ్మనపల్లి, రూ.1.73 కోట్లతో పదర, రూ.2.54 కోట్లతో గట్టుతుమ్మెన్, రూ.2.24 కోట్లతో లింగాల మండలం బాకారం, రూ.2.49 కోట్లతో ఉప్పునుంతల మండలం కంసాన్పల్లి, రూ.2.74 కోట్లతో వంగూరు మండలం ఉల్పర, రూ.1.99 కోట్ల అంచనాలతో అచ్చంపేట మండలం సింగారంలో నిర్మించనున్న సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం 12 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారని వివరించారు. కాగా ఉప ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రణాళికతో పక్కాగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన నాగర్కర్నూల్ కలెక్టర్ సంతోష్ -
ప్రశాంతంగా జీపీఓ ఎంపిక పరీక్ష
వనపర్తి: జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన గ్రామ పరిపాలన అధికారుల ఎంపిక పరీక్ష సజావుగా జరిగిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తం 97 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 90 మంది హాజరుకాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీచేసి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. జవాబు పత్రాలను స్పెషల్ మెస్సెంజర్ ద్వారా ఎస్కార్ట్తో జేఎన్టీయూ విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చేరవేయాలని లైజన్ అధికారి భానుప్రసాద్ను ఆదేశించారు. ఆయన వెంట పరీక్ష నిర్వహణ నోడల్ అధికారి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ నోడల్ అధికారి సుబ్రమణ్యం, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గురురాజ్, తహసీల్దార్ రమేష్రెడ్డి, అర్ఐ మధు, అబ్జర్వర్ సుధీర్రెడ్డి ఉన్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
వనపర్తి విద్యావిభాగం: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కలర్చన అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భావం, సంస్థ అందించే ప్రయోజనాలను వివరించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం 2012, మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకుగాను పోష్ యాక్ట్ 2013, డ్రగ్స్, మత్తు పదార్థాలు తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ నెల 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సాయం పొందాలని, మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్రెడ్డి, సైన్స్ ఉపాధ్యాయుడు జి.సుదర్శన్రావు, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, సురేష్, దయాకర్, వెంకటేష్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు నివేదిక అందజేయండి
వనపర్తి: జిల్లాలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల కేటాయింపుపై సమర్థన నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా. సువర్ణ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 41వ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా, ఇందులో 12 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 7.166 హెక్టార్ల అటవీ భూమి ఉన్నట్లు పటం ద్వారా తెలుస్తోందన్నారు. అటవీ భూమి కేటాయిస్తే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. స్పందించిన డా. సువర్ణ 7.166 హెక్టార్ల స్థలం దేని కొరకు కావాలో సమర్థన నివేదిక అందజేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఆదేశించారు. వీసీలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, సెక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునే వరకు పోరాటం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ సర్కారు తెచ్చిన వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునేవరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తులను గుంజుకునేందుకు బీజేపీ ఈ బిల్లును తెచ్చిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లింలకు ఈ బిల్లు వ్యతిరేకమని, అందుకు మద్దతు తెలిపిన టీడీపీకి ఏపీలో ముస్లిం ఓట్లు పడవన్నారు. వేలాది కోట్ల వక్ఫ్ ఆస్తులపై కన్ను వేసిన బీజేపీ సర్కారు వారికి కొల్లగొట్టేందుకు ఈ బిల్లును తెచ్చిందని అందకు సహకరించిన టీడీపీ, జేడీఎస్లకు భవిష్యత్లో బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఈనెల 25న స్థానిక బాలుర జూనియర్ కలాశాలలో నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ఎంఐఎం అధినేత ఆసదుద్దీన్తో పాటు ఇతర మత పెద్దలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు మోసిన్, అబ్దుల్ సుల్తాన్, అహ్మద్సన, ఇమ్రాన్, ఇద్రీస్, మేరాజ్, హనీజ్, షారుక్, సిద్దిక్, ఇబ్రహీం, నూర్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండోరోజు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 827 మంది విద్యార్థులకుగాను 754 మంది హాజరుకాగా.. 73 మంది గైర్హాజరయ్యారని, అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 74 మంది విద్యార్థులకుగాను 70 మంది హాజరుకాగా.. నలుగురు రాలేదని డీఐఈఓ ఎర్ర అంజయ్య వివరించారు. జిల్లాకేంద్రంలోని జాగృతి, రావూస్, వాగ్దేవి, విజ్ఞాన్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు వివరించారు. రేపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాక ఖిల్లాఘనపురం: మండలంలోని కర్నెతండాకు ఆదివారం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ వస్తున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. మండలంలోని మామిడిమాడ, షాపురం గ్రామాల రెవెన్యూ శివారుల పరిధిలోని 8 గిరిజన తండాల గిరిజనులు పట్టాల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. వెనికితండా, ముందలితండా, బక్కతండా, కర్నెతండా, మేడిబావితండా, ఆముదంబండ తండా, మిట్యాతండాకు చెందిన గిరిజనులు సుమారు 150 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న నాటి రాజుల భూములకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఏళ్ల తరబడి గిరిజనులు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలుపుతూ వారికి అండగా పోరాడేందుకు ముందుకొచ్చామని తెలిపారు. పట్టాల కోసం పోరాడుతున్న అన్ని తండాల గిరిజన రైతులు, భూ పోరాట సమితి సభ్యులు పర్యటనలో పాల్గొని సమస్యలను వివరించాలని కోరారు. పంచముఖికి ప్రత్యేక బస్సులు వనపర్తి టౌన్: అమావాస్య సందర్భంగా ఈ నెల 27న పంచముఖికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు బస్సులు బయలుదేరి పంచముఖికి చేరుతాయని.. దర్శనానంతరం మంత్రాలయం వెళ్లి అక్కడ దర్శనం పూర్తి చేసుకున్నాక తిరిగి పంచముఖికి చేరుకొని అదేరోజు రాత్రి బయలుదేరి ఉదయం 5 వరకు జిల్లాకేంద్రానికి చేరుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూరాలకు 5,609 క్యూసెక్కుల వరద ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం సాయంత్రానికి 5,609 క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.657 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. -
దేశ సమైక్యత కోసమే జై సంవిధాన్ యాత్ర
పెద్దకొత్తపల్లి: దేశ సమైక్యత కోసమే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర చేపట్టామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్ గ్రామంలో కొనసాగిన జైసంవిధాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి యాత్ర ప్రారంభించగా.. చెన్నపురావుపల్లి గ్రామం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, నాయకులు నర్సింహ, విష్ణువర్ధన్రెడ్డి, గోపాల్రావు, మధు, వెంకటస్వామి, శివకుమార్రావు, చిన్నయ్య, ఎల్లయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణలో జాప్యం సరికాదు
వనపర్తి: వచ్చిన వరి ధాన్యం త్వరగా దించుకొని లారీలు తిరిగి పంపించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రైస్మిల్లు నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైస్మిల్లర్లతో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి తూకం చేసి మిల్లుకు చేరిన ధాన్యం లారీలను తాలు, దొడ్డు రకం తదితర కారణాలు చూపుతూ దించుకోకుండా జాప్యం చేస్తుండటంతో లారీలు ఎక్కడికక్కడ నిలిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతోందని.. లారీలు మిల్లుల వద్ద నిలుపుకోవడానికి వీలు లేదని హెచ్చరించారు. దొడ్డు రకం ధాన్యం తీసుకోమని చెప్పడం సరికాదని.. సన్న, దొడ్డు రకం 60:40 శాతం మేర కేటాయిస్తున్నందున దించుకోవాల్సిందే అని తేల్చిచెప్పారు. గతేడాది యాసంగిలో జిల్లావ్యాప్తంగా 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈసారి మూడింతలు అధికంగా పంట దిగుబడి వచ్చిందని.. ఇప్పటి వరకు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, మరో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల రైస్మిల్లర్లు సహకరించాలని, రైతులు ఇబ్బంది పడేలా చేయవద్దని కోరారు. అదేవిధంగా కొందరు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేదని, వెంటనే అందజేయాలని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని పౌరసరఫరాలశాఖ డీఎంను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, రైస్మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, మిల్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు. మిల్లర్లు లారీలను త్వరగా ఖాళీచేసి పంపించాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్ష
వనపర్తి: జిల్లాకేంద్రంలో మే 25న జరిగే గ్రామ పరిపాలన అధికారుల స్క్రీనింగ్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. గత ప్రభుత్వం వివిధ శాఖల్లో నియామకం చేసిన వీఆర్వోలు, డిగ్రీ ఉత్తీర్ణులైన వీఆర్ఏలను ప్రస్తుత ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులుగా నియమించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆసక్తిగల 97 మంది వీఆర్వోలు, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకోగా వారికి మే 25న ఆదివారం రాత పరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని, విద్యుత్ సదుపాయం ఉండాలన్నారు. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడానికి వీలులేదని.. అభ్యర్థులను ఉదయం 9.30 నుంచి 10 వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. పోలీసుశాఖ తగిన బందోబస్తు కల్పించాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఏఓ భానుప్రకాశ్, తహసీల్దార్ రమేష్రెడ్డి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, పుర అధికారులు పాల్గొన్నారు. -
నేతన్నలను ఆదుకుంటాం
అమరచింత: పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో వస్త్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నేత కార్మికులతో పాటు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు నాబార్డు తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీజీఎం ఉదయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని నాబార్డు సీజీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం సందర్శించి రోలింగ్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన చీరలు రోలింగ్ కోసం గద్వాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. మహిళలు కుట్టు శిక్షణ పొందడమే గాకుండా పలు రకాల డిజైన్ల వస్త్రాలను కుట్టడంలో మెళకువలు నేర్చుకున్నారని చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ తయారు చేస్తున్న వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయస్థాయితో పాటు ఆన్లైన్ మార్కెటింగ్కు కావాల్సిన మద్దతునిస్తామని హామీనిచ్చారు. అనంతరం మగ్గాలపై జరీ చీరలు తయారు చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి ఆదాయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తాము సైతం కంపెనీ యజమానులమని.. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి లాభాలు సమానంగా చేరుతాయని కార్మికులు వివరించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం దీప్తి సునీల్, డీడీఎం మనోహర్రెడ్డి, ఆర్డీఎస్ సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, కంపెనీ డైరెక్టర్లు పబ్బతి వెంకటస్వామి, అశోక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
జీలుగతో నేల సారవంతం
పాన్గల్: ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు 50 శాతం రాయితీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని.. పంటల సాగుకు ముందు పొలంలో విత్తి ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్నితే నేల సారవంతమవుతుందన్నారు. జీలుగ సాగుతో కలిగే లాభాలను వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలని సూచించారు. 30 కిలోల బస్తా రాయితీ పోను రూ.2,138 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, కాంగ్రెస్పార్టీ మండల నాయకులు మధుసూదన్రెడ్డి, రవికుమార్, రాముయాదవ్, భాస్కర్యాదవ్, బ్రహ్మయ్య, నరేందర్గౌడ్, మహేష్నాయుడు, ఏఓ రాజవర్ధన్రెడ్డి, సీఈఓ భాస్కర్గౌడ్, విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
మరమ్మతుల జాడేది?
జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట సమస్యలు●నిధులు కేటాయించాలి.. జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చటంతో పాటు లైనింగ్ దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి మరమ్మతులకు నిధులు కేటాయించాలి. రెండేళ్లుగా కాల్వ వెంట మరమ్మతులు చేపట్టడం లేదు. కనీసం పూడికతీత, ముళ్లపొదల తొలగింపు వంటి పనులైనా పూర్తిచేయాలి. – హన్మంతు, రైతు, నందిమళ్ల ప్రతిపాదనలు పంపించాం.. ప్రధాన ఎడమ కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి అందజేశాం. నిధులు మంజూరు చేస్తే మరమ్మతులు చేపడతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల జలాశయం అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ అధికారులు రెండేళ్లుగా సంబంధితశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నా.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుగాకపోవడంతో మరుగునపడ్డాయి. ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడటాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతులకు ఎన్ని నిధులు అవసరం అన్న విషయాలను నివేదిస్తూనే ఉన్నారు. వర్షాకాలం రాకముందే మరమ్మతులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. నిధులు ఎప్పుడు మంజూరవుతాయని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జూరాల ప్రధాన జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. ప్రాజెక్టు సమీపంలో ఉన్న వాటిని గుర్తించలేని అధికారులు వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎప్పుడు గుర్తిస్తారని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ మరమ్మతులకు అధికారులు సిద్ధమయ్యారు. వీటిని గతేడాది వేసవిలో పూర్తి చేయాలని నిర్ణయించినా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, కత్తేపల్లిలో రెండు ప్రధాన పనులు నిలిచిపోయాయి. వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఆయకట్టు ఇలా.. జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు మొత్తం 1.20 లక్షల ఎకరాలుగా నిర్ధారించినా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలుగుతున్నారు. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల మీదుగా 100 కిలోమీటర్ల పొడవునా కాల్వ విస్తరించి ఉంది. వీటిని ఆయా మండలాల్లో కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీటిని ఎడమకాల్వ వెంటే విడుదల చేస్తుంటారు. పెచ్చులూడిన లైనింగ్ రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం నిధుల మంజూరుకు ఎదురుచూపులు ముగుస్తున్న వేసవి.. వర్షాకాలంలో గండ్లు పడే ప్రమాదం -
గోదాం వినియోగంలోకి తెస్తాం..
మండల కేంద్రంలో 1.20 లక్షల సంచుల సామర్థ్యంతో నిర్మించిన గోదాంను వినియోగంలోకి తెచ్చి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని గోదాంను ఆయన పరిశీలించి రహదారికి స్థలం ఇచ్చిన ఇరువురు రైతులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రహదారి సమస్యతో ఇంతకాలం గోదాంను వినియోగించుకోలేకపోయామని.. యుద్ధప్రాతిపదికన మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని రైతుల ధాన్యాన్ని గోదాంకు చేరవేస్తామని చెప్పారు. హమాలీల సంఖ్య తక్కువగా ఉండటంతో ధాన్యాన్ని సకాలంలో తూకం చేయడం లేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా.. పక్క గ్రామాల్లోని హమాలీలను వినియోగించుకోవాలని తహసీల్దార్ వరలక్ష్మిని ఆదేశించారు. గ్రామంలోని హమాలీలు అడ్డుకుంటే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్యయాదవ్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, నాయకులు రవీందర్రెడ్డి, బస్వరాజుగౌడ్, ఏపీఎం బిచ్చన్న ఉన్నారు. -
అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే చర్యలు
వనపర్తి రూరల్: అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం శ్రీరంగాపురం మండలంలో పర్యటించారు. మొదట కంభాళాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు వడ్ల భారతమ్మ, శైలజ ఇళ్లను పరిశీలించారు. ఆన్లైన్లో వివరాల నమోదు సమయంలో ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోలు కాకుండా ప్లాట్ వద్ద దిగిన ఫొటోలు ఉండటంతో అనుమానం వచ్చిన కలెక్టర్ వారి ఇళ్ల వద్దకు వెళ్లి చూశారు. భారతమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో కూలగొట్టుకోవడం చూశారు. శైలజ ఇల్లు చూసి ఇందిరమ్మ ఇంటికి అర్హురాలిగా నిర్ధారించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. పనులు నాణ్యతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి శేరుపల్లికి చేరుకొని పక్కా ఇళ్లలో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సిఫారస్ చేసిన పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యను ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగి చేసిన సిఫారస్ను పరిశీలించకుండా అనుమతించినందుకు ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలని.. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాకే సిఫారస్ చేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ విఠోభా, తహసీల్దార్ మురళిగౌడ్, ఎంపీడీఓ రవినారాయణ తదితరులు ఉన్నారు. -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్లో జఠిలంగా పరిహారం.. పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం. రిజర్వాయర్లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ డెడ్లైన్.. డిసెంబర్ మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి డెడ్లైన్.. కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్లోపు కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో సాగు నీరందిస్తాం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం. – విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే జై సంవిధాన్
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే సహించం.. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను మోసం చేసి.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. రైతులు పంటను సకాలంలో కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులను తాలు పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. అనంతరం మండలంలోని మియాపూర్లో పిడుగుపాటుకు గురై మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు కొత్త కళ్యాణ్రావు, చంద్రశేఖర్ యాదవ్, రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి, జ్యోతిగౌడ్, మహదేవ్ గౌడ్, తేజారెడ్డి, రంజిత్కుమార్, విభీషన్, జగదీశ్, ప్రకాశ్, పురేందర్ పాల్గొన్నారు. చిన్నంబావి: రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం చిన్నంబావి మండలం వెల్టూరు నుంచి చిన్నమారూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు. ప్రధాని మోదీకి బడాబాబులే ముఖ్యమయ్యారని విమర్శించారు. మహాత్మా గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. -
పరీక్ష జరగలేదు.
సీయూఈటీ పరీక్ష రా సేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – మహేశ్కుమార్, విద్యార్థి, మద్దూరు వర్షంలో తడుచుకుంటూ వచ్చాం.. రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి. – సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల ఏపీ ఎంసెట్ వదులకున్నా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వర కు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు స మాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రా యాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి. – సాయివర్షిణి, విద్యార్థి, మరికల్ -
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
కొత్తకోట రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యా న్ని వేగంగా తరలించేందుకు అదనపు లారీలను అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు సూచించా రు. బుధవారం కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో అదనపు కలెక్ట ర్ సమావేశమై మాట్లాడారు. మిల్లులకు ధాన్యం తర లింపులో జాప్యం చేయొద్దన్నారు. వీలైనంత వేగంగా ధాన్యాన్ని తరలించేందుకు అదనంగా లారీలను ఏర్పా టు చేయాలన్నారు. కొత్తకోట మండలంలో 80శాతం పైగా ధాన్యాన్ని తరలించినట్లు చెప్పారు. అనంతరం పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని రైస్మిల్లును అదనపు కలెక్టర్ పరిశీలించారు. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని సూ చించారు. ఆ తర్వాత పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి.. మండలంలో ఇంకా ఎంత ధాన్యం తరలించాల్సి ఉంది.. ఎన్ని లారీలు కావాల్సి ఉందనే వివరాలను అధికారులతో తెలుసుకున్నారు.