breaking news
Wanaparthy District News
-
పూర్తిస్థాయిలో నీరివ్వాలి..
అమరచింత ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది వానాకాలంలో 4 ఎకరాలు వరి సాగుచేశాను. వారాబందీ విధానంలో నీరు వదిలితే పంటకు సరిపడా అందక ఆశించిన స్థాయిలో దిగుబడి రాదేయోనన్న భయం ఉంది. జూరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలి. – మోహన్రెడ్డి, సింగంపేట యాసంగి సీజన్లో కేవలం రామన్పాడు వరకే నీటిని అందించిన అధికారులు వానాకాలంలో కూడా వారాబందీ అమలు చేయాలని నిర్ణయించడం శోచనీయం. కేవలం ఆరుతడి పంటల సాగుకే నీరందిస్తామని చెప్పడం సరికాదు. మండలంలో జూరాల నీటిపై ఆధారపడి సుమారు 6 వేల ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించాలి. – ఎండీ నడిపి ఖాజా, మామిడి రైతు, గోవర్ధనగిరి (వీపనగండ్ల) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ఆయకట్టుకు వానాకాలం సీజన్లో వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నాం. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆరుతడి పంటలకుగాను వారంలో 4 రోజుల పాటు నీటిని అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా వేసవిలో కాల్వల్లో పూడికతీత చేపట్టాం. వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – షమీ ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ -
ప్రతి ఇంట్లో ఇది భాగమే..
మా ఊరిలో జరిగే ప్రతి పెళ్లిలో ఈ చెట్టు పాత్ర ఉంటుంది. పందిరి వేసేందుకు ఆకులు మొదలుకొని ప్రత్యేక పూజలు చేసే వరకు ఈ చెట్టుపై ఆధారపడతాం. ఇది నా చిన్నతనం నుంచి మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి చెట్టు కింద మా జీవితమంతా గడిచింది. ఇంతటి ప్రాధాన్యత గల చెట్టును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే వినాశ కాలమే. – కుర్వ చిన్న రాముడు, పెద్దతాండ్రపాడు ఎవరికీ రాసివ్వలేదు.. చెట్టుకు సంబంధించి మా పెద్దలు ప్రస్తుతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి పత్రం రాసిచ్చారని చెబుతున్నారు. అలాంటిదేమి జరగలేదు. చెట్టు పరిసర ప్రాంతాల్లో మా పెద్దలు ఉండేవారు. ప్రస్తుతం ఉంటున్న వారు మా పెద్దలు రాసిచ్చారని చెబుతూ కొంత ఆక్రమించగా.. మరికొంత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం నేను గ్రామసభలో కూడా చెప్పాను. – మీసాల లక్ష్మన్న, పెద్దతాండ్రపాడు కేసులు నమోదు చేస్తాం.. ఎంతో చరిత్ర ఉన్న రావిచెట్టు గురించి మాకు గ్రామస్తుల వినతిపత్రాల ద్వారా తెలిసింది. దీని కోసం గ్రామంలో విచారణ చేపట్టాం. ప్రకృతిలో భాగమైన చెట్టును నాశనం చేస్తే సహించేది లేదు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించి చెట్టును నరికినా.. కబ్జా చేసేందుకు ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తాం. – పర్వేజ్ అహ్మద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జోగుళాంబ గద్వాల -
లిఫ్ట్ నిర్వహణకు ప్రత్యేక రైతు కమిటీ
● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నంబావి: చిన్నమారూర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు సజావుగా సాగునీరు అందాలంటే రైతుల భాగస్వామ్యంతో ప్రత్యేక రైతుకమిటీ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శనివారం మండలంలోని చిన్నమారూర్ లిఫ్ట్ వద్ద ఆయకట్టు రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. లిఫ్ట్ నిర్వహణలో చిన్న చిన్న సమస్యలు తలెత్తితే ప్రతిసారి అధికారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా తక్షణం మరమ్మతు చేయించుకునే విధంగా కమిటీ పని చేయాలని సూచించారు. ఆయకట్టు రైతులు ఎకరాకు రూ.500 చొప్పున జమ చేసుకుంటే అత్యవసర మరమ్మతుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మరమ్మతు ఆలస్యమైతే సాగునీరు అందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని.. రైతులే లిఫ్ట్ను పరిరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగంపై పూర్తిగా ఆధారపడకుండా ఆయకట్టు రైతులు ఐక్యంగా ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, శ్రీలతరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్, కృష్ణప్రసాద్ యాదవ్, విద్యాసాగర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.52 కోట్ల వరి ధాన్యం మాయం
ఖిల్లాఘనపురం: మండలంలోని హన్పాడ్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బాయిలర్ రైస్మిల్, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రా రైస్మిల్లో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.52 కోట్ల విలువైన వరి ధాన్యం మాయమైనట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. రెండు మిల్లులకు 2022–23, 2024–25 యాసంగి, 2025–26 వానాకాలం, యాసంగి సీజన్ల వరి ధాన్యం ఆయా మిల్లులకు కేటాయించామని.. ఆ ధాన్యం పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని వివరించారు. బాయిలర్ రైస్మిల్లులో 1,49,198 బస్తాలు వీటి విలువ రూ.31 కోట్లు, రా రైస్మిల్లులో 2,01,985 బస్తాలు విలువ రూ.21 కోట్ల వ్యత్యాసం ఉందన్నారు. మొత్తం 3,51,183 బస్తాలు.. విలువ రూ.52 ఽకోట్లని డీఎస్ఓ చెప్పారు. ఆయా మిల్లుల యజమానురాలు ఎస్.శ్రీదేవిపై శనివారం సాయంత్రం ఖిల్లాఘనపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. రైసుమిల్లు యజమానురాలిపై కేసునమోదు.. వనపర్తి రూరల్: జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు ఫిర్యాదు మేరకు మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీ రైసుమిల్లు యజమానురాలు దీపికారెడ్డిపై కేసు నమోదు చేశామని రూరల్ ఎస్ఐ హృశికేష్ తెలిపారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కథనం మేరకు.. భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీ (రైసుమిల్లు)కు 2022–23 యాసంగి, 2023–24 వానాకాలం, 2024–25 వానాకాలం, యాసంగి సీజన్లో ప్రభుత్వం వరి ధాన్యం కేటాయించింది. శుక్రవారం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా 1,03722 సంచుల ధాన్యం తక్కువగా ఉందని గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.14 కోట్లకుపైగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. శనివారం మిల్లు యజమానురాలు దీపికారెడ్డిపై రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. -
వారాబందీ!
వానాకాలం.. ●అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఏర్పడినప్పటి నుంచి ఏటా వానాకాలంలో వరి సాగు కోసం పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేసే అధికారులు.. ఈ ఏడాది మాత్రం వారాబందీ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నా.. వానాకాలంలో వారాబందీ ఏమిటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవని కారణంగా ఈసారి ఆరుతడి పంటలకే సాగునీరు వదులుతామని అధికారులు ఐడీబీ సమావేశంలో నిర్ణయించారు. వరి నారుమడులు సిద్ధం చేసుకున్న అన్నదాతలు ఎలాగైనా తమ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు వదలాలని వేడుకుంటున్నారు. జలాశయాలు, ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని.. తక్కువ నీటిని వినియోగించాలంటూ గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాసంగి సీజన్లో వారాబందీ పద్ధతిన సాగునీటిని అందించిన అధికారులు.. వానాకాలం సీజన్లో కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిదిలో ఈసారి రబీ పంట సాగుకోసం ప్రాజెక్టు సమీపంలోని రామన్పాడ్ రిజర్వాయర్తో పాటు శంకర సముద్రం, గోపల్దిన్నె వరకు అమరచింత ఎత్తిపోతలు, కురుమూర్తి ఎత్తిపోతల ద్వారా వారంలో 4 రోజులు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లా పరిధిలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల వరకు ఉండగా ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు. వానాకాలం విస్తీర్ణం ఖరారు.. జూరాల ఎడమ కాల్వ కింద ప్రస్తుత వానాకాలం సీజన్లో 85 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.629 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వీటిని వానాకాలం పంటల సాగుతో పాటు తాగునీటి అవసరాలకు వినియోగించనున్న నేపథ్యంలో ముందస్తుగా వారాబందీ అమలు చేశారు. ఆరుతడి పంటలకే ప్రాధాన్యమంటున్న అధికారులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్న అన్నదాతలు ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు.. -
అనామలిస్ జాబితాలో 74,462 ఓటర్లు
వనపర్తి: ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 74,462 మంది ఓటర్ల పేర్లు అనామలిస్ జాబితాలో ఉన్నాయని, అదేవిధంగా బీఎల్వోల ద్వారా మ్యాపింగ్ కానివారు 12,027 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తం 86,489 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్ఐఆర్పై ఏఈఆర్వోలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 2002 ఓటరు జాబితాలో ఉన్న పేరుకు ప్రస్తుత ముసాయిదా జాబితాలో ఉన్న పేరులో అక్షర దోషం, సర్ నేమ్, వయస్సులో తేడాలున్నా.. చిన్న చిన్న దోషాలున్నా.. వారిని అనామలిస్ జాబితాలో నమోదు చేసినట్లు చెప్పారు. అలాంటి వారికి నోటీసులిచ్చి వారి వద్ద నుంచి తగిన ఆధారాలు తీసుకొని వెంటనే అప్లోడ్ చేసి జాబితా నుంచి పేరు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇందుకు బీఎల్వోలకు శిక్షణ ఇవ్వాలని ఏఈఆర్వోలను ఆదేశించారు. నో మ్యాపింగ్ జాబితాలో పేర్లు ఉన్నవారికి సైతం నోటీసులిచ్చి తగిన ఆధారాలు తీసుకోవాలని.. ఒకరోజు హియరింగ్కు పిలిచి వారు భారత పౌరులమని నిరూపించుకునే విధంగా అవకాశం కల్పించి తగిన ఆధారాలతో ఆన్లైనలో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. భారతీయ పౌరుడిగా రుజువు చేసుకునేందుకు 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డుతో పాటు ఆధార్కార్డును చూపించాల్సి ఉంటుందన్నారు. హియరింగ్ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనేది నోటీసులో పేర్కొంటారన్నారు. నో మ్యాపింగ్ జాబితాలో ఉన్న వారు 1984, జూన్ 1 కంటే ముందు జన్మించిన వారైతే గుర్తింపుకార్డు సమర్పిస్తే సరిపోతుందని.. 1984 తర్వాత జన్మించిన వారు వారి గుర్తింపుకార్డుతో పాటు తన తల్లి, తండ్రి గుర్తింపుకార్డు ఆధారంగా చూపించాల్సి ఉంటుందని వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కు మార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు 70 వేల క్యూసెక్కుల వరద
గద్వాల/ఆత్మకూర్/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 70,495 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరగా.. వివిధ కాలువలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.06 మీటర్లకు చేరింది. నీటి నిల్వ 8.73 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తికి 42,401 క్యూసెక్కులు, నెట్టెంపాడు, భీమా–1, భీమా–2, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టులకు కలిపి మొత్తం ప్రాజెక్టు నుంచి 76,803 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపట్టారు. ఎగువ కేంద్రంలో ఆరు యూనిట్లతో 234 మెగావాట్లు, దిగువ కేంద్రంలో ఐదు యూనిట్లతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 139.917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. కాగా.. శ్రీశైలం జలాశయంలో 167.8764 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 875.90 అడుగులకు చేరింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 20.159 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా కాల్వకు 3,050 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎంజీకేఎల్కు 2,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పీయూలో సీపీఆర్పై అవగాహనమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో విద్యార్థులకు సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిపుణులు బాబుల్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్షాక్, రోడ్డు ప్రమాదాలు తదితర ఘటనల్లో వ్యక్తులు స్పృహ కోల్పోయినప్పుడు వెంటనే అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. కొన్ని నిమిషాల్లో సీపీఆర్, ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడడంతో పాటు పరిస్థితి విషమించకుండా నిరోధించవచ్చన్నారు.● 11 యూనిట్లతో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి ● శ్రీశైలానికి తగ్గిన వరద.. 167.87 టీఎంసీల నిల్వ -
వరములిమ్ము.. వరలక్ష్మి
కొత్తకోట వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మి వ్రతంతో పాల్గొన్న మహిళలు శ్రావణమాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీరంగాపురం శ్రీ రంగనాథస్వామి, పెబ్బేరు అయ్యప్పస్వామి, కొత్తకోటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల ఆవరణలో నిర్వాహకులు ప్రత్యేక మండపాలను ఏర్పాటుచేయగా.. అర్చకులు అమ్మవారిని అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. – కొత్తకోట/వనపర్తి రూరల్ -
‘విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ చెలగాటం’
వనపర్తిటౌన్: రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో బీజేవైఎం జిల్లాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి‘ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విద్యార్థుల ఆందోళన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు రంగుల ప్రపంచం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. పేద విద్యార్థుల ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ నిధులను నిలిపివేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని జెన్ జీ హక్కుల గురించి సుదీర్ఘ ప్రసంగాలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణ విద్యార్థుల గోస కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలల యజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని.. దీంతో ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగ అవకాశాలు సాధించలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విద్యాసంస్థలు నడపలేక విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల సాధన కోసం భాజపా నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏకకాలంలో విడుదల చేసి విద్యార్థులకు భరోసా కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పురుషోత్తంరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దరాజు, బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ బకాయిల్లో జిల్లా రెండోస్థానం
● జిల్లాలోని రైస్మిల్లుల్లో కొనసాగుతున్న విజిలెన్స్ దాడులు ఖిల్లాఘనపురం: సీఎంఆర్ బకాయిల్లో జిల్లా రెండోస్థానంలో ఉందని ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ డీఎస్పీ వెంకటేశం, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రైస్మిల్లులు రెండింటిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌరసరఫరాలశాఖ, ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ బృందం–2 అధికారులు పౌరసరఫరాలశాఖ డీటీ పరమేశ్వర్, ఈటీఎఫ్ సీఐ పండరి, ఎస్సైలు సాంబశివుడు, వెంకటేష్తో కలిసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు అధికారులు లెక్కలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఓ రైతు ఫిర్యాదు మేరకు మండల కేంద్రంలోని శ్రీదేవికి చెందిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రైస్మిల్లులు రెండింటిలో శుక్రవారం తనిఖీలు చేపట్టామన్నారు. సీఎంఆర్ బకాయిల్లో రూ.500 కోట్లతో సూర్యాపేట జిల్లా ముందువరుసలో ఉండగా రూ.474 కోట్లతో వనపర్తి జిల్లా రెండోస్థానంలో నిలిచిందన్నారు. బకాయిలు చెల్లించేందుకు 90 రోజుల గడువు ఇచ్చినప్పటికీ చాలామంది మిల్లర్లు అప్పగించకపోవడంతో ప్రభుత్వం తనిఖీలకు ఆదేశాలిచ్చిందని తెలిపారు. రెండు రైస్మిల్లుల్లో నాలుగు సీజన్లకు సంబంధించిన ధాన్యం బస్తాల లెక్క తేలాల్సి ఉందన్నారు. తనిఖీలు పూర్తిచేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కనిపించని రైస్మిల్లుల యజమాని.. తనిఖీల విషయం ముందే తెలుసుకున్న మిల్లు యజమానితో పాటు కుటుంబ సభ్యులు ఉండకుండా వెళ్లిపోయారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం జిల్లా అఽధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ రాంబాబు హుటాహుటిన ఖిల్లాఘనపురం చేరుకొని ఎస్ఐ వెంకటేశ్తో పాటు పోలీస్ సిబ్బందిని ఎక్కడున్నది ఆరా తీయాలని ఆదేశించడంతో వారు వెళ్లారు. తర్వాత రైస్మిల్లుల గేట్ మూసివేసి తనిఖీలు చేపట్టారు. చివరి సమయంలో విలేకర్లను అనుమతించారు. పెద్దగూడెంలోనూ.. వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీ (రైసు మిల్లు)పై శుక్రవారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. సీఐ గణేష్, కరుణాకర్, జీఎస్టీఓ సురేష్, సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేశారు. 2022–23 నుంచి 2024–25 వరకు యాసంగి సీజన్లో కేటాయించిన వరి ధాన్యం బస్తాలను లెక్కించారు. 2022–23లో 2,545 మెట్రిక్ టన్నులు, 2023–24లో 1,321 మెట్రిక్ టన్నులు, 2024–25లో 260 మెట్రిక్ టన్నులు.. మొత్తం 4,126 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా వచ్చిందన్నారు. దీని విలువ దాదాపు రూ.10.10 కోట్లని వారు తెలిపారు. -
పకడ్బందీగా ఫ్రై డే.. డ్రై డే...
జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన వారికి మలేరియా, డెంగీ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, అదేవిధంగా ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడంతో పాటు పట్టణంలో నిరుపయోగంగా ఉన్న పార్క్లను గుర్తించి అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాంనగర్కాలనీలో ఆయన పర్యటించి ఆరోగ్య సిబ్బంది ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఇళ్లలో నిల్వ నీరు ఉండకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా నిల్వ నీటిని తొలగించడం, పారిశుద్ధ్య చర్యలు నిరంతరం చేపట్టాలని సూచించారు. కాలనీలోని మున్సిపల్ పార్క్ను పరిశీలించారు. అవసరమైన మరమ్మతు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని, అదేవిధంగా పట్టణంలో అభివృద్ధి నోచుకోని నిరుపయోగంగా ఉన్న పార్క్లను గుర్తించి నివేదిక సమర్పించాలని పుర అధికారులను ఆదేశించారు. అనంతరం కేడీఆర్నగర్లోని బస్తీ దవాఖానాను సందర్శించి ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా పాము, కుక్క కాటు బాధితులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి భాస్కర్నాయక్, కౌన్సిలర్ పరశురాం, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది ఉన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు అక్కాచెల్లెళ్లు
కొత్తకోట రూరల్: జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికల్లో కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు కావలి సాయిచందన, కావలి నవ్యశ్రీ విశేష ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అండర్–20 విభాగం డిస్కస్త్రో పోటీలో సాయిచందన, అండర్–14 విభాగం జావెలిన్త్రో కావలి నవ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 27, 28 తేదీల్లో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ మీట్–2026లో వీరిద్దరూ పాల్గొననున్నారు. సొంత అక్కాచెల్లెళ్లు జిల్లాస్థాయిలో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని వ్యాయామ శిక్షకుడు ఎం.అజయ్కుమార్ ఆన ందం వ్యక్తం చేశారు. క్రీడాకారిణులను గ్రామపెద్దలు, క్రీడాభిమానులు, యువత అభినందిస్తూ రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. హాస్టల్ బియ్యం పక్కదారి : పీడీఎస్యూ వనపర్తిటౌన్: స్థానిక ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్కు కేటాయించిన బియ్యం నిల్వల్లో వ్యత్యాసాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పవన్కుమార్ ఆరోపించారు. 46 క్వింటాళ్లకుగాను కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయన్న ప్రాథమిక సమాచారంతో రెవెన్యూ అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం తహశీల్దార్ హాస్టల్ను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆయన ఇచ్చిన పంచనామాలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. వార్డెన్ నరేందర్రెడ్డి ఈ నెల 13న 15 క్వింటాళ్ల బియ్యాన్ని హ్యాండ్ లోన్గా తీసుకున్నట్లు పంచనామాలో పేర్కొన్నా.. గోదాం రికార్డుల్లో లేదని అధికారులే స్పష్టం చేశారని చెప్పారు. ఆ బియ్యం ఎక్కడికి తరలించారో జిల్లా యంత్రాంగం తక్షణమే తేల్చాలన్నారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన బియ్యం, నిల్వలు, మెస్ వినియోగం, డైట్ బిల్లులను ఆడిటింగ్ చేయాలని.. అక్రమాలు రుజువైతే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు దేవర శివగౌడ్, ప్రతినిధులు మహేందర్ నాయుడు, ధర్మేందర్, రాజు, బాలవర్ధన్, బంజారా గిరిజన విద్యార్థి సమైక్య ప్రతినిధి శివనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కేడర్..!
● పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తే.. వర్గపోరుతో ప్రజల్లో పలుచన ● రాష్ట్ర, దేశ రాజధానికి చేరిన పంచాయితీ ● ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ● గాంధీభవన్కు చిన్నారెడ్డి, అతడి అనుచరులు వనపర్తి: నియోజకవర్గ కాంగ్రెస్పార్టీలో చెలరేగిన అంతర్గత విభేదాల చిచ్చు చిలికి చిలికి గాలివానలా మారింది. గోపాల్పేటలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం వేధికగా మొదలైన వివాదం కాస్తా రాష్ట్ర, దేశరాజధాని వరకు చేరింది. శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన అనుచరులతో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధిష్టానాన్ని, పీసీసీని, తనను ధూషిస్తూ చేసిన అనుచిత వాఖ్యలపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు అందజేశారు. 30 నెలలుగా సొంత పార్టీ, తనపై చేసిన కామెంట్స్, కాంగ్రెస్ ఇచ్చిన పదవితో బీఆర్ఎస్ శ్రేణులతో అంటగాగుతూ ప్రతిపక్షాల నాయకులకు పనులు చేసి పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొని అందజేసి స్థానిక పరిస్థితులను వివరించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అనుచరవర్గం శుక్రవారం సుమారు 200 మందితో రాష్ట్ర రాజధానిలోని గాంధీభవన్ ఎదుట బైఠాయించి ఎమ్మెల్యే మేఘారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భయాందోళనలో పార్టీ శ్రేణులు.. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని సంతోషం లేకుండా నియోజకవర్గంలోని ప్రధాన నాయకులు మొదటి నుంచి ఉప్పు.. నిప్పుగా ఉండటం, ఇటీవల మొదలైన వివాదం తారాస్థాయికి చేరడం పార్టీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎవరి వెంట ఉంటే ఎవరికి కోపం వస్తుందో.. కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి ఎవరికి మద్దతుగా ఉంటారో తెలియక బిక్కుబిక్కుమంటోంది. దశాబ్దాలుగా చిన్నారెడ్డి వెంట ఉన్న కొందరు నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు పీసీసీ, ఏఐసీసీకి ఫిర్యాదు ఇచ్చే సమయంలో ఉండటం.. మరికొందరు చిన్నారెడ్డికి మద్దతు తెలియజేస్తూ.. బాహటంగా ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంతో నియోజవర్గ కాంగ్రెస్ రెండుగా చీలిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వివాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరించినా.. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్కు నష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వనపర్తి కాంగ్రెస్లో రేగిన చిచ్చుతో క్యాడర్ రెండుగా చీలింది. ఫిర్యాదులు చేసేందుకు వెళ్తూ.. తమ బలాన్ని చూపేందుకు శ్రేణులను పెద్దమొత్తంలో గాంధీభవన్కు తీసుకెళ్లి ఆందోళనలు చేస్తుండటం గమనార్హం. అధికార పక్షం కుమ్ములాడుకుంటూ పలుచనైతే.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 1951లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. తొలి అసెంబ్లీ ఎన్నికలు 1952లో జరిగాయి. 74 ఏళ్లలో రెండుసార్లు నిర్వహించిన ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో పదిసార్లు కాంగ్రెస్పార్టీ బలపర్చిన వారే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాని సొంత పార్టీలో ముసలం పలుచన చేస్తూ ప్రధాన నాయకులే అధిష్టానికి ఫిర్యాదులు చేసిన ఘటన ఇదే ప్రథమమని చెప్పువచ్చు. -
ఎస్జీఎఫ్లో.. క్రీడల సందడి!
● రాష్ట్రస్థాయి టోర్నీలకు మహబూబ్నగర్ నుంచి ప్రతిపాదనలు ● అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు ● అండర్–17 బాలికల జాతీయ క్రికెట్ టోర్నీకి ప్రతిపాదన మహబూబ్నగర్ క్రీడలు: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయస్థాయిలో అవకాశాలు కల్పించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీలకు మహబూబ్నగర్ జిల్లా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలతోపాటు అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలో మరోసారి ఎస్జీఎఫ్ క్రీడల సందడి నెలకొననుంది. ఆరు క్రీడాంశాలకు ప్రతిపాదనలు హైదరాబాద్లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు పలు క్రీడాంశాలను ప్రతిపాదించారు. అండర్–17 బాల, బాలికల కబడ్డీ, అండర్–17, అండర్–19 బాల, బాలికల వాలీబాల్, క్రికెట్, అండర్–14, అండర్–17, అండర్–19 బాల, బాలికల హ్యాండ్బాల్, అండర్–19 బాల, బాలికల నెట్బాల్, అండర్–17 బాల, బాలికల ఖోఖో పోటీలను నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. మండల స్థాయి నుంచి పోటీలు ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలకు విద్యార్థులు ఎదిగేలా ఎస్జీఎఫ్ వేదికగా నిలుస్తోంది. జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు ఈ పోటీల ద్వారానే ప్రతిభను చాటుకుని ఉన్నతస్థాయికి చేరుకున్నారు. వందలాది మంది విద్యార్థులు జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు. ఏడేళ్లుగా జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల నిర్వహణలో మహబూబ్నగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. వరుసగా ఏడేళ్లుగా జిల్లాకేంద్రంలో జాతీయస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక జాతీయస్థాయి పోటీని జిల్లాకు కేటాయించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో జడ్చర్ల, మహబూబ్నగర్ పట్టణాల్లో అండర్–17 బాలుర జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించారు. తాజాగా అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ టోర్నీని కూడా జిల్లాలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదన ఆమోదం పొందితే మరో జాతీయస్థాయి టోర్నీకి జిల్లా ఆతిథ్యమివ్వనుంది. జిల్లాలో ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణకు సంబంధించి డీఈఓ ఆదేశాల మేరకు ఈనెల 22వ తేదీన మహబూబ్నగర్ ఇండోర్ స్టేడియంలో పీడీ, పీఈటీల సమావేశం నిర్వహిస్తాం. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు, ఒక బాలికల జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించడానికి ప్రతిపాదనలు ఇచ్చాం. జిల్లాకు ఏ టోర్నీ కేటాయించినా విజయవంతంగా నిర్వహిస్తాం. – వేణుగోపాల్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్నగర్ -
‘జలసరి’పై అవగాహన అవసరం
పాన్గల్: భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా వీబీజీ రాంజీ పథకం ద్వారా చేపపడుతున్న ‘జలసిరి’ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మండలంలోని గోప్లాపూర్లో నిర్మాణంలో ఉన్న ఫాంపాండ్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. రైతు పల్లవితో మాట్లాడి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫాంపాండ్తో వర్షపు నీరు నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపు, బోర్ల రీచార్జి, వ్యవసాయ అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని రైతు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి ఎక్కువ సంఖ్యలో నిర్మించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఫాంపాండ్ల నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించి లక్ష్యాన్ని చేరుకులా తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాకు 1,320 ఫాంపాండ్ల లక్ష్యాన్ని నిర్దేశించారని.. ఆ సంఖ్యను రెండు వేల వరకు పెంచాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు వరి కాకుండా వేరుశనగ, కంది, పెసర, మినుములు వంటి ఆరుతడి పంటలు సాగుచేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడంతో నీటి కొరతను అధిగమించి రైతులు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. -
కళాశాలలకు నిధుల జోష్
● 61 ప్రభుత్వ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ గ్రాంట్లు ● విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.73.24 లక్షల కేటాయింపు ● విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అవసరమైన నిర్వహణ, ల్యాబ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్ గ్రాంట్ కింద రూ.40 లక్షలు, ల్యాబ్ల నిర్వహణకు రూ.33.24 లక్షలు.. మొత్తం రూ.73.24 లక్షలు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. కాంపోజిట్ గ్రాంట్ను స్టేషనరీ, తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ల్యాబ్ నిధులతో సైన్స్ ప్రాక్టికల్స్కు అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర సామగ్రిని సమకూర్చుకోనున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించే సమయంలో ఇబ్బందులు లేకుండా ముందుగానే నిధులు అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుందని కళాశాలల ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కళాశాలలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. బాలికల జూనియర్ కళాశాల, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలకు ల్యాబ్ నిర్వహణకు రూ.లక్ష చొప్పున అందినట్లు అధికారులు తెలిపారు. -
చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి
పాన్గల్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు సాఫీగా పారేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం మండలంలోని రేమద్దుల, కిష్టాపూర్, గోప్లాపూర్లోని కేఎల్ఐ డీ–8, ఎంజే–4 కాల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేరుకపోయిన పూడిక తొలగించడంతో పాటు కాల్వలపై లష్కర్లను నియమించాలని అధికారులకు సూచించారు. వనపర్తి వైపు వెళ్లే సాగునీటి కాల్వను ఎదుట్ల సమీపంలో బైక్పై వెళ్లి మంత్రి పరిశీలించారు. కాల్వలో నీరు అధికంగా పారుతుండటంతో చివరి ఆయకట్టుకు చేరడం కొంత ఇబ్బందిగా ఉంటుందని.. అటు వైపు వెళ్లే నీటి ప్రవాహాన్ని కొంత తగ్గించాలన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని, నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలే వేయాలన్నారు. కాల్వలకు నీరు నవంబర్ వరకే వస్తుందని రైతులకు సూచించారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, కాంగ్రెస్పార్టీ మండల నాయకులు వెంకటేష్ నాయుడు, రవికుమార్, పుల్లారావు, మధుసూదన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. -
వాహనాల తనిఖీ
కొత్తకోట రూరల్: జిల్లా రవాణాశాఖ అధికారి సురేష్కుమార్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సురేష్కుమార్ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై అధిక లోడుతో ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలను ప్రయాణికులను తరలించేందుకు వినియోగించవద్దని సూచించారు. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్గన్స్ ఏర్పాటు చేశామని.. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి సురక్షితంగా ప్రయాణించాలన్నారు. -
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
వనపర్తి: బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ ప్రత్యేక చొరవతో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నుంచి విముక్తి పొందిన 54 మంది బాలికలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఇద్దరు ఎస్ఐలు, వైద్యులతో బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ.. జీవితంలో ఎదురైన పరిస్థితులు భవిష్యత్ను నిర్ణయించకూడదని, బాలికలు చదువుకోవడంతో పాటు నచ్చిన నైపుణ్యాల్ని నేర్చుకొని సొంత కాళ్లపై నిలబడాలని అందుకు జిల్లా పోలీసుశాఖ అండగా ఉంటుందన్నారు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బాల్య వివాహం అనేది కుటుంబ సమస్యగా చూసే విషయం కాదని.. బాలిక హక్కులు, ఆరోగ్యం, విద్య, భవిష్యత్ను ప్రభావితం చేసే తీవ్రమైన సామాజిక సమస్య అన్నారు. తల్లిదండ్రులు కూడా బాలికలపై పెళ్లి ఒత్తిడి తీసుకురాకుండా వారి కలలను అర్థం చేసుకొని అండగా నిలవాలని కోరారు. బాల్య వివాహం నుంచి విముక్తి పొందిన కొందరు బాలికలు తమ అనుభవాలను పంచుకున్నారు. పెళ్లి ఆపిన సమయంలో కుటుంబ సభ్యులు బాధపడ్డారని.. ఆ సమయంలో పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయామని, బాల్య వివాహం జరిగి ఉంటే తమ జీవితాలు ఎలా ఉండేవని తెలుసుకున్నామని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. మీకు పోలీసుశాఖ అండగా ఉందంటూ వారిని ఓదార్చి ధైర్యం చెప్పి ఎస్పీ శాలువాతో సన్మానించారు. బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత, భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని సరైన వయస్సు వచ్చే వరకు వివాహాన్ని వాయిదా వేయడం ప్రతి తల్లిదండ్రి బాధ్యతని తెలిపారు. అనంతరం చైల్డ్ మ్యారేజ్ ప్రీ భారత్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఎస్ఐలు విజయ్కుమార్, జగన్మోహన్, అంజద్, హైమా, భరోసా, షీటీం బృందం తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: బీసీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం ప్రకటించిందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మధు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల బీసీ యువత సెప్టెంబర్ 15వ తేదీలోపు https://tgobmmsnew .cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వారికి రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు అర్హులన్నారు. ఒక రేషన్ కార్డులో ఒక్కరికే అవకాశం ఉంటుందని.. దరఖాస్తునకు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, లబ్ధిదారుడి ఫోన్నంబర్ నమోదు చేయాలని పేర్కొన్నారు. 131.279 మి.యూ. విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. గురువారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 73.297 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 57.982 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో 131.279 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 40 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామన్నారు. 3 రోజుల పాటు సదరం క్యాంప్ వనపర్తిటౌన్: అర్హులైన దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు ప్రత్యేక సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఆర్డీఓ రామమహేశ్వర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ దివ్యాంగులకు శుక్రవారం ఉదయం 9 నుంచి ప్రత్యేక సదరం క్యాంపు కొనసాగుతుందని, 22న ఆప్తమాలజీ, 24న హియరింగ్ సంబంధిత దివ్యాంగులకు క్యాంపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు ఆయా తేదీల్లో నిర్వహించే శిభిరాలకు హాజరుకావాలని సూచించారు. 2 ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని రెండు ఎరువుల దుకాణాల లైసెన్స్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ వనపర్తి డివిజన్ సహాయక వ్యవసాయ సంచాలకుడు ప్రభాకర్రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని స్రవంతి ఫర్టిలైజర్స్, పవన్ ట్రేడర్స్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని కొందరు రైతులు ఈ నెల 7న ఫిర్యాదు చేశారు. స్పందించిన మండల వ్యవసాయ అధికారి ఆయా దుకాణాల్లో రైతుల సమక్షంలో విచారణ చేసి నివేదికను జిల్లా అధికారులకు అందజేశారు. అధిక ధరలు వసూలు చేయడం నేరమని గుర్తించిన ఏడీఏ ప్రభాకర్ రెండు దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆయా దుకాణాల్లో ఎలాంటి ఎరువుల విక్రయాలు జరపరాదని ఆదేశించారు. రైతుల ఫిర్యాదుతో జప్తు చేసిన ఎరువులకు సంబంధించి కోర్టులో 6ఏ కేసు నమోదు చేశామని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇదేవిధంగా ఉంటుందన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి : సీపీఎం వనపర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సీపీఎం నాయకులు 8 డిమాండ్ల వినతిపత్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభికి అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రధాని మోదీ ఆ హామీని వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. వివాదాస్పదమైన జీఓలను తొలగించి ఉద్యోగ నియమకాలు చేపట్టాలని కోరారు. -
కర్నెతండా లిఫ్ట్ను వెంటనే ప్రారంభించాలి
ఖిల్లాఘనపురం: రైతుల కష్టాలు చూసి వారి కోరిక మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నెతండా లిఫ్ట్ను మంజూరు చేయడంతో పాటు పనులు పూర్తి చేసినా.. నేటివరకు ప్రారభించకపోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కర్నెతండా సమీపంలోని ఎత్తిపోతలను రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన పంపులు, లిఫ్ట్ దగ్గర ఉన్న మోటార్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎత్తు ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందడం లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి కర్నెతండా లిఫ్ట్ను మంజూరు చేయించామని.. నాడు రూ.76.16 కోట్లతో పూర్తి చేసి కేవలం సుమారు రూ.రెండు కోట్ల విలువైన విద్యుత్ సబ్స్టేషన్ పనులు మాత్రమే పెండింగ్లో ఉంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి కావచ్చినా ఇప్పటి వరకు ప్రారంభించడం లేదని చెప్పారు. ఈ లిఫ్ట్ను వినియోగంలోకి తీసుకొస్తే 9 గిరిజన తండాలు, 6 గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని.. రైతుల ఒత్తిడితో గతేడాది వెట్రన్ నిర్వహించి మూసి వేశారని వివరించారు. ఇప్పటికై నా మొద్దు నిద్ర వదిలి మూడురోజుల్లో లిఫ్ట్ను ప్రారంభించి సాగునీటిని రైతులకు అందించకుంటే వేలాదిమంది రైతులతో కలిసి తామే ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు అన్యాయం జరిగేతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు. పోచమ్మతల్లికి ప్రత్యేక పూజలు.. మండల కేంద్రంలో జరిగిన పోచమ్మ బోనాల ఉత్సవంలో మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకొనే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సామ్యానాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, పీన్యానాయక్, వాకిటి శ్రీధర్, నందిమళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి -
బీమాపై పట్టింపేది..?
వనపర్తి: జిల్లాలోని పెబ్బేరు మార్కెట్యార్డులోని గోదాంలో 2024, ఏప్రిల్ 1న ఒక్కసారిగా మంటలు చెలరేగి సుమారు 13 లక్షలకుపైగా గన్నీబ్యాగులు పూర్తిగా కాలిపోయాయి. వనపర్తి, కొత్తకోటకు చెందిన రెండు ఫైరింజన్లు వచ్చి ఆర్పేందుకు ప్రయత్నిస్తే.. 24 గంటల తర్వాతగాని మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై పోలీసు విచారణతో పాటు కేసు నమోదు చేయడం, హైదరాబాద్ నుంచి ఫొరెన్సిక్ నిపుణులను రప్పించి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. మంటలు భారీగా ఎగిసిపడటం, మంటలు ఆర్పేందుకు గోదాం గోడలను కూల్చివేయడం తదితర కారణాలతో వారికి తగిన ఆధారాలు లభించకపోవడంతో గోదాం పైకప్పు రేకులు ఎండకు వేడెక్కి మంటలు రావటంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేల్చినట్లు తెలుస్తోంది. కాగా.. రూ.కోట్ల విలువైన గన్నీబ్యాగుల అగ్నిప్రమాదం జరిగి 28 నెలలు దాటినా నేటికీ బీమా సంస్థలు డబ్బులు ఇవ్వకపోవడం శోచనీయం. రూ.కోట్ల ప్రజాధనంపై సంబంధిత అధికారులు సైతం ఆశించిన మేర దృష్టి సారించకపోవడంతో బీమా వర్తింపజేయడంలో ఆయా సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు స్థానికంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ఆరోపణల నేపథ్యంలో బీమా వర్తింపు ఆలస్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గోదాంలో భద్రపర్చిన గన్నీబ్యాగులకు పౌరసరఫరాల కార్పొరేషన్ బీమా చేయించడంతో క్లెయిం కోసం దరఖాస్తు చేశారు. బీమా సంస్థ ప్రతినిధులు ఘటన స్థలాన్ని పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కానీ సుమారు 28 నెలలు కావస్తున్నా.. ఇప్పటికి ఇంకా అడుగు ముందుకు పడలేదు. కానీ గోదాం ఇన్స్యూరెన్స్ రూ.కోటి వరకు క్లెయిమ్ కావడం గమనార్హం. ప్రమాదానికి గల కారణాలను సక్రమంగా పేర్కొనకపోవడంతోనే క్లెయిమ్ ఆలస్యమవుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. గోదాంలో మంటల్లో కాలిపోతున్న రూ.కోట్ల విలువైన గన్నీబ్యాగులు (ఫైల్) 28 నెలలు దాటినా.. అందని సొమ్ము కోట్ల రూపాయల నష్టం కారణాలపై దృష్టి సారించని అధికారులు మంటల్లో కాలిపోయిన గన్నీబ్యాగులకు బీమా చేయించాం. క్లెయిమ్ కోసం కావాల్సిన అన్నిరకాల డాక్యుమెంట్లు అందజేశాం. పలుమార్లు బీమా సంస్థ అధికారులు పరిశీలనలు చేశారు. త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇకపై బీమా కోసం ఫాలోఅప్ చేస్తాం. – ఆంజనేయులు, డీఎం, పౌరసరఫరాల కార్పొరేషన్ రూ.8 కోట్ల నుంచి రూపది కోట్ల విలువ చేసే సుమారు 13 లక్షలకుపైగా గన్నీబ్యాగుల భద్రత గోదాం చుట్టూ సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నా.. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. పర్యవేక్షణ చేయాల్సిన కార్పొరేషన్ అధికారులు రూ.కోట్ల క్లెయిమ్ రావాల్సిన విషయంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం శోచనీయం. -
ఆయిల్పాం సాగుతో అధిక ఆదాయం
● ఆరుతడి పంటలే సాగు చేయాలి ● రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి కే.సురేంద్రమోహన్ వనపర్తి: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యానశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పెబ్బేరు మండలం జనంపల్లి శివారులోని రైతుల పొలాలను సందర్శించి పంటల సాగు పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గ్రామ రైతులతో మాట్లాడి పంటల సాగు, నీటి లభ్యత, ఎరువుల సరఫరా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తాను కంది సాగు చేసినట్లు రైతు బాలరాజు తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించడంతో సాగు చేపట్టినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామంలో వరి సాగు విస్తీర్ణం తగ్గిందని.. పలువురు రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. తాను ఆయిల్పాం సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నట్లు మరో రైతు వెంకటస్వామి వ్యవసాయశాఖ కార్యదర్శికి వివరించారు. యూరియా, ఇతర ఎరువుల సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఆయనకు తెలియజేశారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆయిల్పాం సాగుతో మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని.. ఆసక్తిగల రైతులు దృష్టి సారించాలన్నారు. ఆయిల్పాం సాగుతో లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటస్వామిని అభినందించడంతో పాటు రైతునేస్తం కార్యక్రమంలో భాగస్వామిని చేసి తన అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా ఆయిల్పాం తోటల్లో ఏయే అంతర పంటలు సాగు చేస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుందనే అంశంపై అధికారులు అధ్యయనం చేసి శాసీ్త్రయంగా సూచనలు అందించాలని కోరారు. నీటి లభ్యత, పంటల ఎంపిక, అంతర పంటల సాగు, ఎరువుల వినియోగంపై శాసీ్త్రయ అవగాహన కల్పిస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఇతర ప్రాంతాల్లో రైతులు అవలంబిస్తున్న విధానాలపై క్షేత్రస్థాయి సందర్శనకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి మహాధర్నాను విజయవంతం చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టే మహాధర్నాకు నిరుద్యోగ యువత అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాకేంద్రంలోని వివిధ కళాశాలలు, గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులను కలిసి మహాధర్నాకు తరలిరావాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకుపైగా ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు లక్ష్మి, జిల్లా ఆఫీస్ కార్యదర్శి ఉమా, నాయకులు నందిమళ్ల రాములు, బీసన్న, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
మత్తులో టీనేజర్స్!
ప్రముఖ విద్యాసంస్థల వద్ద గంజాయి అడ్డాలు ●తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చదువుతున్నారు అనేది చూడాలి. మత్తు పదార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. – అనిల్ రాజ్, మానసిక వైద్యుడు, జనరల్ ఆస్పత్రి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ నుంచి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జడ్చర్ల ఏరియాలోని పరిశ్రమలు ఉండే ప్రాంతంలో విస్తృతంగా సోదాలు చేశాం. గంజాయి వినియోగం జరుగుతుందనే సమాచారం వచ్చిన ఏరియాలపై ప్రత్యేక దృష్టిపెట్టి దాడులు చేస్తున్నాం. – శ్రీనివాసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్కు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడిని హైదరాబాద్లోని ఒక ఇంటర్ కళాశాలలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదివిన సదరు విద్యార్థి రెండో సంవత్సరంలో గంజాయికి అలవాటు పడి పరీక్షలు తప్పాడు. దీంతో అప్రమత్తమైన తండ్రి హైదరాబాద్ నుంచి మకాం మహబూబ్నగర్కు మార్చాడు. గంజాయి మత్తులో నుంచి బయటకురాలేని సదరు టీనేజర్ జులాయిగా తిరగడంతో.. మూడేళ్లుగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాడు. మహబూబ్నగర్లోని ఓ ఏరియాకు చెందిన నలుగురు టీనేజర్స్ గంజాయికి బానిసలుగా మారారు. చదువు మధ్యలో వదిలేసి పూర్తిగా జులాయిగా తిరుగుతూ.. ఇటీవల ఓ పాన్ షాప్ దగ్గర సిగరెట్స్ ఇవ్వలేదని కత్తులతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. మరో ఘటనలో ఐఫోన్ కోసం గంజాయి మత్తులో ఒక టీనేజర్పై కత్తితో దాడి చేయడంతో హైదరాబాద్లో చికిత్స అందించారు.’ పాలమూరు: ‘ఉమ్మడి జిల్లాలో గంజాయికి బానిసగా మారుతున్న కొందరు టీనేజర్స్, యువకులు.. చివరికి వాటి విక్రేతలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇటీవల ఎకై ్సజ్– పోలీసులు చేసిన దాడుల్లో 16 నుంచి 25 ఏళ్లలోపు వారే అధికంగా పట్టుబడటం ఇందుకు బలం చేకూరుస్తోంది. కొందరు టీనేజర్లు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. గంజాయి అధికంగా వినియోగంతో విచక్షణ కోల్పోయి.. పలు నేరాలకు పాల్పడుతూ.. తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. మెడికల్ కళాశాలలు, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, ఇతర కళాశాల్లోనే గంజాయి సరఫరా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నా.. మరోవైపు గంజాయి వినియోగం మాత్రం కట్టడి కావడం లేదు. ఒక్కో పాకెట్లో 12 గ్రాములు నింపి ప్యాక్ చేసి రూ.400–500 విక్రయిస్తున్నారు. దీనిని యువకులు సిగరెట్లో ఉండే పొగాకులో కలిపి తీసుకుంటూ.. ఒక రకమైన మత్తుకు బానిసగా మారుతున్నారు. ఇందుకోసం యువత గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేక గదులు, శివారు ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకుంటున్నారు. కేవలం 16–25 ఏళ్లలోపు వారితోపాటు ఆటోడ్రైవర్లు దీనిని అధికంగా తీసుకుంటున్నారు. ఒడిశాలోని సుక్కా, మల్కాన్గిరి, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి గంజాయిని ఉమ్మడి పాలమూరుకు తరలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహబూబ్నగర్తోపాటు జడ్చర్ల ఏరియాలో సరఫరా అవుతుంది. దీనికితోడు పోలేపల్లి సెజ్ ఏరియాలోనూ కూలీలుగా పనిచేసే యూపీ, బీహార్ కార్మికులు రాకపోకలు సాగించినప్పుడు స్వరాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్లోని దూల్పేట నుంచి ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇటీవల పోలీసులు ఓ యువకుడిని పట్టుకోగా అతడికి గంజాయి కావాలని గంటల వ్యవధిలో దాదాపు 20 మంది ఫోన్ చేసినట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా మైనర్లతో గంజాయి దందా చేస్తున్నారు. కౌన్సెలింగ్.. చికిత్స గంజాయి బాధితులకు చికిత్స కోసం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ప్రారంభించారు. ఇందులో 30 మంది గంజాయి పాజిటివ్ బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహణ కొసాగుతుంది. వీరిలో 20 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరు వారాలపాటు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత 7 నుంచి 8 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్ట్ ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి 7 మందికి నాన్ గంజాయి అడిక్టర్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. తరుచూ వినియోగంతో మానసికంగా పలు మార్పులు సరఫరాలో ప్రముఖంగా మైనర్లతోపాటు 25 ఏళ్లలోపు యువతే.. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ఇదే పరిస్థితి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో 30 మందికి కౌన్సెలింగ్ -
మూడువారాల్లో పరిహారం అందిస్తాం
ఖిల్లాఘనపురం: గణపసముద్రం భూ నిర్వాసితులకు ఒప్పంద పత్రాలిచ్చిన మూడు వారాల్లో పరిహారం అందిస్తామని భూ సేకరణ ప్రత్యేక అదనపు కలెక్టర్ తిరుపతయ్య తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేధికలో రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతాయపల్లికి చెందిన 171 మంది రైతుల 53.31 ఎకరాలు, వెంకటాంపల్లికి చెందిన 45 మంది రైతుల 19.19 ఎకరాల భూములు రిజర్వాయర్లో ముంపునకు గురవుతాయన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.12.65 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించిందని.. రెండు గ్రామాలకు సంబంధించి 73.10 ఎకరాల భూమి కోల్పోతున్న 216 మంది రైతులు భూమిని రిజర్వాయర్కు ఇస్తున్నట్లు ఒప్పంద పత్రాలు ఇవ్వాలని.. పత్రాలిచ్చిన మూడు వారాల్లో కచ్చితంగా పరిహారం అందుతుందన్నారు. ఎలాంటి సందేహాలున్నా.. తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో ఐబీ డీఈ బాబుచంద్, తహసీల్దార్ సుగుణ, ఐబీ ఏఈ లక్ష్మారెడ్డి, గ్రామపెద్ద ఆగారం ప్రకాష్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
మత్స్యబీజం.. తాత్సారం
నేడు పూర్తిగానున్న టెండర్ల ప్రక్రియ.. పంపిణీలో జాప్యం ●ప్రభుత్వం ఇచ్చే రాయితీ చేప పిల్లల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకే చేప పిల్లలు చెరువుల్లోకి వదిలేవాళ్లం. అధికారులు సైతం తమ చెరువుకు రావాల్సిన రాయితీ చేప పిల్లలను అందించే వారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెబుతున్నారు. త్వరగా చేప పిల్లలను సరఫరా చేసి ఆదుకోవాలి. – గోపి, మత్స్యకారుడు, అమరచింత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. ఆగస్టు 20న టెండర్లు ఓపెన్ అవుతాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే జిల్లాలోని మత్స్యసొసైటీలకు ఎంత మేర చేప పిల్లలను ఇవ్వాలనే ప్రణాళికను రూపొందించుకొని వాటి ప్రకారం కొనుగోలు చేయాలని కాంట్రాక్టర్లకు సూచిస్తాం. చేప పిల్లలు వచ్చిన వెంటనే పంపిణీకి చర్యలు తీసుకుంటాం. – డా. లక్ష్మప్ప ఏడి అమరచింత: ఉచిత చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నా.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవని కారణంగా టెండర్ల ప్రక్రియ ఆలస్యమైనట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం సగం గడిచినా.. జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో నిండుకోకపోవడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ ఏడాది జిల్లాలో 2.30 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే ఆశించిన మేర ఎదుగుదల లేకపోవడంతో పాటు బరువు తగ్గుతాయనే సందేహాలను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 2.50 కోట్ల చేప పిల్లలు అందించాలనే లక్ష్యం ఉన్నా.. అనుకున్న మేర నిధులు మంజూరుగాకపోవడంతో కేవలం 1.11 కోట్ల చేప పిల్లలను మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేయగలిగారు. ప్రస్తుతం 2.30 కోట్ల చేప పిల్లలను అన్ని సొసైటీలకు పూర్తిస్థాయిలో ఉచితంగా అందించి ఆదుకోవాలని ఆయా గ్రామాల మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పుణ్యకాలం దాటిపోతోందని.. త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆయా సొసైటీలకు అనుకున్న విధంగా చేప పిల్లలను వెంటనే అందించాలంటున్నారు. చేప పిల్లల పరిశీలనలు.. మత్స్యశాఖ అధికారులు బృందాలుగా పక్కనున్న ఆంధ్రాకు వెళ్లి మేలు రకం చేప పిల్లలతో పాటు వాటి ధరలు తెలుసుకుంటారు. ఈసారి ఇప్పటికే పర్యటించి నాణ్యమైన చేప పిల్లల కోసం టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది. కాని ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు వేగంగా వీటికి సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేపడుతున్నారు. మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు.. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుంది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ ద్వారా చేపల వేటకు వెళ్లి మృతిచెందిన మత్స్యకారుడికి రూ.5 లక్షలు. శాశ్వత గాయాలైన వారికి రూ.5 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ ఇవ్వనున్నారు. ప్రమా దం కారణంగా ఆస్పత్రి ఖర్చులకు రూ.25 వేలు, పాక్షిక వైకల్యం పొందితే రూ.25 వేలు వేల చెల్లిస్తుస్తోంది. వీటి ప్రీమియం మొత్తం రూ.134 లక్షలు పూర్తిగా ప్రభుత్వంపైనే భారంగా పడనుంది. ఈసారి లక్ష్యం 2.30 లక్షలు జిల్లాలో 143 మత్స్య పారిశ్రామిక సొసైటీలు.. 13,600 మంది మత్స్యకారులు గతేడాది పంపిణీ చేసింది 1.11 కోట్ల చేప పిల్లలే.. జిల్లాలో మొత్తం 1,052 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో గతేడాది అనుకున్న లక్ష్యంలో సగం అంటే 54.84 లక్షల చేప పిల్లలను రాయితీపై పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో 143 మత్స్య సహకార సొసైటీలు ఉండగా 13,600 మంది మత్స్యకారులు చేపల విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాది పొడవునా తమకు జీవనాధారంగా ఉన్న చేపలను చెరువుల్లో పెంచుకొనేందుకు ఇప్పటికే మత్స్యకారులు సొంతంగా సీడ్ను ఆంధ్రా నుంచి తీసుకొచ్చి వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ చేప పిల్లలతో పాటు సొసైటీ ద్వారా డబ్బులను వెచ్చించి తమ ప్రాంతాల్లో అమ్ముడయ్యే చేప పిల్లలను కొనేందుకు సిద్ధమవుతున్నారు. -
పేదలకు మెరుగైన వైద్యం అందాలి
మదనాపురం: ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెంచే దిశగా వైద్యులు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్నాయక్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, సేవల తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా ఇన్, ఔట్ పేషెంట్ సేవలు, ఐరన్ సుక్రోజ్ పంపిణీ, గర్భిణుల అంచనా ప్రసవ తేదీ వివరాలు, ప్రసవాల సంఖ్య, టీ–హబ్ నమూనా రిజిస్టర్లు అలాగే వ్యాక్సిన్ డ్యూ జాబితాను తనిఖీ చేశారు. రోజువారీ ఇన్పేషెంట్లు, టీ–హబ్ నమూనా పరీక్షలు, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణులను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రసవ సమయం వరకు వారికి మెరుగైన వైద్య సలహాలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయన వెంట డా. పరిమళ, డా. భవాని, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు. గ్రామపంచాయతీ కార్మికులను క్రమబద్దీకరించాలి ఖిల్లాఘనపురం: గ్రామపంచాయతీ కార్మికులను క్రమబద్దీకరించడంతో పాటు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేష్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కార్మికులు రెండ్రోజుల దీక్ష చేపట్టగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ఇచ్చిన హామీ మేరకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రీన్ చానల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీన కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమచేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వయస్సు పైబడిన, అనారోగ్యం పాలైన, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీనివాసులు, పుష్ప, దాసు, గంగాదేవి, కుర్మమ్మ, నాగమణి, అలివేలు, దాసు, గోపాల్, కృష్ణయ్య, నాగయ్య, వెంకటేష్, నర్సింహులు, చెన్నయ్య పాల్గొన్నారు. శాశ్వత మార్కెట్ ఏర్పాటుకు అడుగులు కొత్తకోట రూరల్: పట్టణంలో ప్రస్తుతం ప్రైవేట్ స్థలంలో కొనసాగుతున్న మార్కెట్ సరిపోక వ్యాపార కార్యకలాపాలు ప్రధాన రహదారిపైకి విస్తరించి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి భవానమ్మ ఆలయం సమీపంలోని శనిగచెరువు కట్ట ప్రాంతంలో శాశ్వత మార్కెట్యార్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా పుర చైర్పర్సన్ అరుణ శ్రీనివాస్ బుధవారం తహసీల్దార్ సుభాష్నాయుడిని కలిసి సంబంధిత భూముల సర్వేనంబర్లు, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలం వివరాలను వెంటనే మున్సిపాలిటీకి అందజేయాలని కోరారు. శాశ్వత మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వత మార్కెట్ ఏర్పాటుతో వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద టీఎన్జీఓల భవనంలో నిర్వహించిన ఎన్ఎంయూ మహబూబ్నగర్ డిపో సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల తలరాత రాసే పూర్తిస్థాయి ఉద్యోగ భద్రతతో కూడిన విలీన ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే తాము అనుకున్నవి సాధించుకోగలుగుతామన్నారు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ సంఘాన్ని గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందన్నారు. అంతకు ముందు డిపో కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా భానుప్రకాష్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
జత కట్టారు.. జమ్ము తొలగించారు
పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండా సమీపంలో ఉన్న కేఎల్ఐ డీ–1 కాల్వలో జమ్ము, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎర్లకుంటతండా సమీపం నుంచి తెల్లరాళ్లపల్లితండా వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర కాల్వలో పెరిగిన జమ్ము, పూడిక తొలగించకపోవడంతో సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కాల్వ ద్వారా మండలంలో తెల్లరాళ్లపల్లి, తెల్లరాళ్లపల్లితండా, చిక్కేపల్లి గ్రామాల్లో సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉండగా.. సాగునీరు సక్రమంగా అందక సగం కూడా సాగు కావడం లేదు. ఖరీఫ్ సీజనల్లోనైనా జమ్ము, పూడిక తొలగించి సాగునీరు సాఫీగా అందేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు 30 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కలెక్టర్కు వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చేసేది లేక రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రెండ్రోజులుగా కాల్వలో పేరుకపోయిన జమ్ము తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాల్వ ద్వారా సాగునీరు సరఫరా అవుతున్నా.. జమ్ముతో తండా వరకు సాగునీరు సరఫరాగాకపోవడంతో స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నట్లు రైతులు వివరించారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కాల్వ మరమ్మతు చేపట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఢిల్లీకి కాంగ్రెస్ వర్గపోరు పంచాయితీ
వనపర్తి: వనపర్తి కాంగ్రెస్లో పుట్టిన వర్గపోరు చిలికి చిలికి గాలివానలా పెరుగుతోంది. ఎమ్మెల్యే, ఆయన వర్గం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, రేపు ఢిల్లీలో ఏఐసీసీకి ఫిర్యాదులు చేస్తుండటంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందోనన్న ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారెడ్డి బీఆర్ఎస్తో అండగాగుతున్నారని, పీఏల కాల్డెటా పరిశీలించాలంటూ ఎమ్మెల్యే కాంగ్రెస్ పెద్దలకు అందజేసే ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్లలో కొందరు నాయకులు లేవనెత్తిన చిన్నారెడ్డి హటావో.. కాంగ్రెస్ బచావో అనే నినాదం మరోమారు మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ప్రతిధ్వనించాయి. ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గం పెద్దఎత్తున గాంధీభవన్కు చేరుకొని నినాదాలు చేశారు. కన్నతల్లి లాంటి పార్టీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం కోరామని.. అనుమతిస్తే వివాదానికి గల కారణాలను వివరించనున్నట్లు తెలిపారు. పార్టీకి నష్టం కలిగించేలా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా పదే పదే అనుచిత వాఖ్యలు చేయడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో కేడర్ను రెండుగా చీల్చేలా, విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని.. వారి ఆదే శాల మేరకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వర్గీయులు -
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. మంగళవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 65.849 మి.యూ., దిగువ 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 50.600 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 116.449 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. -
విద్యాశాఖలో ప్రక్షాళన!
వనపర్తిటౌన్: జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన మొదలైనట్లు కనిపిస్తోంది. జెడ్పీ సీఈఓ యాదయ్య ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన రెండునెలల్లోనే పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ డీఈఓగా పనిచేసే అబ్దుల్ ఘనీని విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ ఏడాది జూన్ 2న బదిలీ చేయడంతో పాటు ఆర్జేడీ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్రెడ్డిని జిల్లా విద్యాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కారణాలు ఏమిటో తెలియదుగాని ఆయన బాధ్యతలు స్వీకరించకపోవడంతో పాఠశాలల పునః ప్రారంభ సమయంలో విద్యావ్యవస్థ గాడితప్పే అవకాశం ఉందని కలెక్టర్ జెడ్పీ సీఈఓ యాదయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమయపాలన పాటించని ఏడీపై కఠినంగా వ్యవహరించారు. మాన్యువల్, బయోమెట్రిక్ హాజరులో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి ఆమె వేతనంలో కోత విధించారు. ఏడీ హాజరుపై చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. రెగ్యులర్ డీఈఓలు సైతం చర్యలకు వెనుకడుగు వేశారు. ఈ విషయంపై ఇన్చార్జ్ విద్యాధికారి ప్రత్యేక నిఘా ఉంచి మాన్యువల్, బయోమెట్రిక్ హాజరు నమోదులో తేడాలను గుర్తించి 10 రోజులకుపైగా వేతనాన్ని నిలిపివేయడం కార్యాలయంలో చర్చకు దారితీసింది. సెక్టోరియల్ అధికారులు ఇతర విభాగాల నిర్వహణ బాధ్యతలతో అవసరమైనప్పుడు మాత్రమే జిల్లా విద్యాధికారి కార్యాలయానికి వచ్చి పని ముగిసిన తర్వాత తిరిగి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. కాని కొందరు అలాగాకుండా అదనపు బాధ్యతల పేరుతో ఇష్టానుసారంగా పాఠశాాలలకు డుమ్మాకొట్టి డీఈఓ కార్యాలయానికే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గత మంగళవారం సెక్టోరియల్ అధికారులతో ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని.. లేకుంటే శాఖాపరమైన చర్య లు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. అలాగే కొందరు అదనపు బాధ్యుల ఉపాధ్యాయులు ఆయా విభాగాలకు అవసరమైనప్పుడు మాత్రమే డీఈఓ కార్యాలయానికి రావాల్సి ఉండగా.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో అసలు విధులకు ఎసురు పెడుతున్నారు. చర్యలకు ఉపక్రమించిన ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి ఏడీ హాజరులో వ్యత్యాసాలు.. వేతనంలో కోత సెక్టోరియల్ అధికారులపైనా ప్రత్యేక నిఘా బడి మరిచిన అదనపు బాధ్యులపై చర్యలు తీసుకునేనా? -
నేటి యువతకు స్ఫూర్తి సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్
వనపర్తి: సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ప్రజల హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన గొప్ప యోధుడిగా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని.. తన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావంతో నాటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఆయన చూపిన ధైర్యం, సమానత్వం, ఆత్మగౌరవం వంటి విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న జీవితంపై సామాజిక చైతన్య కళాకారుడు రాజారాం ప్రకాష్ పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇన్చార్జ్ బీసీ సంక్షేమశాఖ అధికారి మధు, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, వనపర్తి పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ నాయకులు గంధం నాగరాజు, వెంకటేష్, గౌడ సంఘం నాయకులు, ఇతర ప్రజాసంఘాల, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాజేంద్రప్రసాద్కు సముచిత స్థానం
వనపర్తి రూరల్: టీపీసీసీ రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ యాదవ్ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేతాజీ నేటి యువతకు ఆదర్శం వనపర్తిటౌన్: నేతాజీ చూపిన ధైర్యం, దేశభక్తి, నాయకత్వ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు అధ్యక్షతన స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా నేతాజీ చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్గౌడ్, బాశెట్టి శ్రీనివాసులు, కృష్ణగౌడ్, నక్క మహేష్, కొమ్ము శ్రీనివాసులు, విజయ్సాగర్, ఎండీ ఖలీల్, ద్వారపోగు నారాయణ, రాయన్నసాగర్ పాల్గొన్నారు. యాజమాన్య పద్ధతులపై అవగాహన అమరచింత: మిరప, పత్తి, చెరుకు సాగుచేసిన రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందవచ్చని కేవీకే శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చంద్రానాయక్తండాలో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని.. మెట్ట పంటలు కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయం అలోచించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ అరవింద్, సర్పంచ్ కృష్ణానాయక్, రైతులు పాల్గొన్నారు. -
క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల మెరుగు : ఎస్పీ
వనపర్తి: క్రీడలు కేవలం గెలుపు కోసం మాత్రమే కాదని.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించే గొప్ప సాధనంగా ఉపయోగపడతాయని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బౌరంపేట్లో మిషన్ స్కేటింగ్ అకాడమీ, పూణే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక 80 నిమిషాల నాన్న్స్టాప్ స్కేటింగ్ ఈవెంట్లో జిల్లాకు చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొని జాతీయస్థాయి రికార్డు సాధించారు. మంగళవారం ఆయా చిన్నారులతో పాటు కోచ్ రాథోడ్ కిషన్, నిర్వాహకులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి తమ విజయాన్ని తెలియజేశారు. అలాగే కార్యాలయ ప్రాంగణంలో స్కేటింగ్ విన్యాసాలను ప్రదర్శించగా ఎస్పీ తిలకించి మాట్లాడారు. చిన్న వయస్సులో చక్కటి ప్రతిభతో జాతీయస్థాయి రికార్డు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. 80 నిమిషాల పాటు నిరంతరాయంగా స్కేటింగ్ చేయడం సాధారణ విషయం కాదని.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మంజునాథ్రెడ్డి, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ జగన్మోహన్, స్కేటింగ్ కోచ్ కిషన్, చిన్నారుల తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయానికి ప్రయత్నించాం
పీయూ సమీపంలోని ప్రభుత్వ భవనాల్లో ప్రత్యామ్నాయంగా హాస్టల్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నించాం. అయితే జిల్లా అధికారులు ఆ భవనాలను మరో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ హాస్టల్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో వసతి కల్పించలేకపోతున్నాం. యూనివర్సిటీలో కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతోంది. త్వరలోనే అవి పూర్తవుతాయి. ప్రస్తుతం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ -
సీటుంది.. వసతి లేదు!
ప్రత్యామ్నాయం ఏదీ? కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అవి పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కస్తూర్బాగాంధీ పాఠశాలను హాస్టల్గా వినియోగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పీయూ గెస్టుహౌస్తోపాటు పరిసరాల్లో కొన్ని ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నా.. వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వసతులకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో సీటు సాధించాలన్న విద్యార్థుల కల.. హాస్టల్ వసతి లేక చెదిరిపోతోంది. ఎప్సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించినా.. వసతి సౌకర్యం లేక పలువురు అడ్మిషన్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లు, రూముల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే లా, ఇంజినీరింగ్లో రెండు సంవత్సరాలుగా 159 సీట్లు ఖాళీగా మిగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్న హాస్టళ్లలోనూ సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉంటుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. లా, ఇంజినీరింగ్లో ఖాళీలు లా కళాశాలలో గతేడాది ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో 140 సీట్లకు 97 మంది చేరగా.. 43 మంది సీట్లు రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది ఎల్ఎల్బీలో 120 సీట్లకు 67 మంది చేరగా.. 53 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఈ నెల 19, 20 తేదీల్లో మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.ఇంజినీరింగ్లో 180 సీట్లకు 125 మంది చేరగా.. 55 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు ఉన్నాయి. హాస్టల్ వసతి లేకపోవడంతో ముఖ్యంగా బాలికలు సీట్లు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే వీటిలో చేరే వారికి ప్రభుత్వ స్కాలర్షిప్ అందే అవకాశం లేదని విద్యార్థులు చెబుతున్నారు. 680 మంది సామర్థ్యం.. 870 మంది పీయూలో హాస్టల్ సమస్యతో విద్యార్థుల వెనకడుగు లా, ఇంజినీరింగ్లో 159 సీట్లు ఖాళీ.. ఏటా ఇదే పరిస్థితి ప్రైవేట్ హాస్టళ్లు, రూములకు నెలకు రూ.6–8 వేల భారం కొత్త హాస్టళ్లు నిర్మాణంలో.. అప్పటివరకు అవస్థలే!బాలికల హాస్టల్లో 680 మందికి వసతి కల్పించే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం సుమారు 870 మంది ఉంటున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి 190 మందికిపైగా ఉండటంతో గదుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నలుగురు ఉండాల్సిన గదుల్లో ఆరు నుంచి ఏడుగురు వరకు ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. -
సంక్షేమ పథకాల రద్దును సహించం : బీఆర్ఎస్
వనపర్తి: ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆడబిడ్డలకు ఆర్థిక భరోసానిచ్చే షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను నిలిపివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ పాలకులు మునుపటి పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తే ప్రజాగ్రహానికి గురవుతారన్నారు. కరోనా సమయంలోనూ తమ ప్రభుత్వం ఆయా పథకాలను కొనసాగించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్ రూ.4 వేలు, దివ్యాంగ పింఛన్ రూ.6 వేలు, ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్పార్టీ చేసిన మోసాన్ని ప్రశ్నించాలని ప్రజలను కోరారు. ఎల్నినో సాకుచూపి సాగునీరు అందించకుండా రైతులను మోసం చేస్తున్నారని, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిలభ్యతను బట్టి యాసంగి, వర్షాకాలం పంటలకు నీరు సరిపోతుందన్నారు. ఆంధ్రా ప్రయోజనాల కోసం సీఎం తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 200 రోజులు మోటార్లు నడిపితే ఇక్కడి భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్పా.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులు కాపాడటానికి పోతిరెడ్డిపాడు సందర్శనను వెళ్తే ఆంధ్రా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆదిత్యదాస్ అనే ఆంధ్రా అధికారిని రేవంత్ తన దగ్గర పెట్టుకొని తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. అధికారులు ప్రజల పక్షాన పని చేయాలేగాని.. ప్రభుత్వంలో ఉన్నవారి మాటలకు వత్తాసు పలకడం సరికాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తు పెట్టుకుంటామని, పోలీసులు నిష్పక్షితంగా వ్యవహరించాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పడావ్ పెట్టడాన్ని నిరసిస్తూ పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, నందిమళ్ల అశోక్, శ్రీకర్గౌడ్, పరంజ్యోతి, మాణిక్యం, ఉంగ్లం తిరుమల్, నాగన్న యాదవ్, ప్రేమ్నాథ్రెడ్డి, మురశిసాగర్, మహేశ్వర్రెడ్డి, మహిళా కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
2,37,006మంది ఓటర్లతో ముసాయిదా జాబితా
వనపర్తి: జిల్లాలో 2,37,006 ఓటర్లతో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. జాబితాలో పేర్లు లేని వారితో పాటు, పేర్లలో మార్పులు, చేర్పులు, చిరునామా మార్పు కోసం సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) టి.వినోద్కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో విడుదలచేసిన ముసాయిదా ఓటరు జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రకటించడమే కాకుండా, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జూన్ 15వ తేదీ నాటికి జిల్లాలో 2,75,570 ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం విడుదలచేసిన ముసాయిదా జాబితాలో 2,37,006 ఓటర్లు నమోదైనట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 38,564 మంది ఓటర్లు తక్కువగా నమోదయ్యారని తెలియజేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు రాని వారందరికీ ఈఆర్వో ద్వారా నోటీసులు జారీ చేయడం జరుగుతుందని.. వారు తగిన ఆధారాలతో రుజువు చేసుకుంటే తుది జాబితాలో పేరు నమోదు చేయనున్నట్లు తెలిపారు. 1984 జూలై 1 కంటే ముందు జన్మించిన వారు ఉంటే.. వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1984 నుంచి 2007 మధ్యలో జన్మించిన వారు తన గుర్తింపు కార్డుతో పాటు తన తల్లి లేదా తండ్రి గుర్తింపు కార్డు ఆధారంగా చూపించాల్సి ఉంటుందన్నారు. 2007 తర్వాత పుట్టిన వారు తన గుర్తింపు కార్డుతో పాటు తన తల్లి లేదా తండ్రి ఇద్దరి గుర్తింపు కార్డులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అదే విధంగా అక్టోబర్ 10వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు పూర్తిచేసుకున్న యువతీ యువకులు సైతం ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉన్నా.. డబుల్ పేర్లు ఉన్నట్లు గుర్తించినట్లయితే ఫారం–7 ద్వారా పేరు తొలగించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి సంబంధిత పోలింగ్ కేంద్రంలో లేదా https:// voters.eci.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు వచ్చిన అన్ని ఫిర్యాదులను అక్టోబర్ 15వ తేదీలోగా పరిష్కరించి.. 19న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రైతుల ప్రయోజనాలను విస్మరించిన కాంగ్రెస్
వీపనగండ్ల/పాన్గల్: రైతుల ప్రయోజనాలను విస్మరించి.. స్వలాభం కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలపై రైతులు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం వీపనగండ్ల, పాన్గల్ మండలాల్లో ఆయన పర్యటించి.. భీమా, కేఎల్ఐ కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి కాల్వల మరమ్మతుపై అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. పాన్గల్ మండలంలో రామన్నగట్టు రిజర్వాయర్ మరమ్మతుతోనే సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈసారి ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్కు వదలడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. భీమా, జూరాల కాల్వలకు యుద్దప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి, ఆయకట్టు పొలాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కమలేశ్వర్రావు, మల్లయ్యయాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వీరసాగర్, సత్యనారాయణగౌడ్, సర్పంచులు కృష్ణ, కోట్ల రాములు, ప్రవీణ్, పార్వతమ్మ, కిషోర్ నాయక్, బాలరాజు, నాయకులు సుదర్శన్రెడ్డి, బాలస్వామి, వేణుమాధవరెడ్డి, కరుణాకర్రెడ్డి, దయాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, జ్యోతినందన్రెడ్డి, తిలకేశ్వర్గౌడ్, వెంకటయ్యనాయుడు, రాజేశ్వర్రెడ్డి, దశరథ నాయుడు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలే మేలు
వనపర్తి: నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం వంటి ఆరుతడి పంటలకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. సోమవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుతో కలిసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ నీటితో సాగుచేసే పంటల ద్వారా నీటి వనరులను ఆదా చేయడంతో పాటు రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవచ్చన్నారు. అదే విధంగా కందులు – మినుములు, ఆముదం – మినుములు, మొక్కజొన్న – మినుములు వంటి అంతర పంటల సాగును రైతులు చేపట్టేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటూ.. నీటి లభ్యత, నేల పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్, డీఎల్పీఓ రఘునాథ్, హౌసింగ్ పీడీ విఠోబా పాల్గొన్నారు. -
జాబితాలో మీ పేరుందా..!
అచ్చంపేట: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)–2026 ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్తోపాటు ఆర్డీఓ, తహసీల్దార్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పోలింగ్ బూత్ల వద్ద జాబితా ప్రదర్శించారు. మృతిచెందిన వారితోపాటు శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓట్లు కలిగిన వారిని జాబితా నుంచి తొలిగించారు. బీఎల్ఓలు 45 రోజులపాటు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు అందించి.. పూర్తి చేసిన ఫారాలను తీసుకొని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి.. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేశారు. ప్రస్తుతం వెలువడిన ఓటరు జాబితాలో తమ పేరు ఉందా.. లేదా.. అని వెతికే పనిలో ఓటర్లు పడ్డారు. సరి చూసుకోకపోతే.. ఉమ్మడి జిల్లాలో సర్ ప్రక్రియకు ముందు 32,35,733 మంది ఓటర్లు ఉండగా.. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 27,72,578 మంది ఓటర్ల పేర్లను బీఎఓలు డిజిటలైజేషన్ చేశారు. వీరి పేర్లను మాత్రమే ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ఫారాలు తిరిగి ఇవ్వని, అన్ కలెక్టబుల్ (అబ్సెంట్), పర్మనెంట్ షిఫ్ట్, డెత్, డూప్లికేట్ (ఎఎస్డీడీ) 4,63,155 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి ప్రచురించారు. ముసాయిదా జాబితాలో ఉండే 8,84,030 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు (అనామలిస్) కలిగి ఉండటం, మ్యాపింగ్ జరగకపోవడంతో వారిని అనుమానాస్పద ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరందరికీ అక్టోబరు 15 వరకు ఎలక్ట్రోరల్ రిజిస్టర్ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. తొలగించిన 4,63,155 మంది ఓటర్లు, నోటీసులు అందుకోనున్న 8,84,030 మంది ఓటర్లు కలిపితే 13,47,185 మంది జాబితాలో తమ పేరు తొలిగింపు ముప్పు ఎదుర్కోనున్నారు. నోటీసులు అందుకోనున్న 8,84,030 మంది ఓటర్లలో 1,21,434 మంది అన్మ్యాప్డ్ ఓటర్లు ఉండగా.. మిగిలిన 7,62,596 మంది ఓటర్లలో వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు/ తల్లిదండ్రులు/ వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు ఎన్యూమరేషన్ ఫారంలో పూరించాల్సి ఉండగా.. ఈ వివరాలను ఇవ్వడంలో విఫలమైన/ లేక తప్పుడు వివరాలు ఇచ్చిన 1,21,434 మంది ఓటర్లను అన్ మ్యాప్డ్గా గుర్తించారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో చాలామంది ఎన్యూమరేషన్ ఫారంలోని సర్–2002 ఓటర్ల జాబితాలోని వివరాలు రాయాల్సిన భాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని వివరాలు రాశారు. దీంతో వీరు సైతం నోటీసులు అందుకోక తప్పడం లేదు. తస్మాత్ జాగ్రత్త.. ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం జరిగే అవకాశముంది. ఓటరు స్థానికంగానే ఉండి జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్లో చాలా ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఈ క్రమంలో ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్లు కచ్చితంగా తమ పేరు ఉందో.. లేదో చూసుకోవాల్సిందే. లేకుంటే తదుపరి ఓటరుగా నమోదు కావాలంటే ఇబ్బందితో కూడుకున్న పని. ముసాయిదా ఓటరు జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో 4,63,155 మంది ఓట్ల తొలగింపు 32.35 లక్షల నుంచి 27.72 లక్షలకు తగ్గిన సంఖ్య ముసాయిదాలో పేర్లున్న 8.84 లక్షల మందికి నోటీసులు గల్లంతయ్యే ఓట్లపై ఉత్కంఠ.. అభ్యంతరాలు, అప్పీల్కు నెలరోజుల గడువు నమోదుకు మరో అవకాం.. ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు, తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి క్లెయింలు, అభ్యంతరాలపై అందే దరఖాస్తులను అక్టోబరు 15 వరకు స్వీకరిస్తారు. అలాగే అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతతోపాటు ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని వారు నిబంధనల ప్రకారం ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించేందుకు ఫారం–7, ఓటరు పేరు, చిరునామా, ఛాయాచిత్రం తదితర వివరాల్లో మార్పులు, సవరణలకు ఫారం–8 వినియోగిస్తారు. వచ్చిన క్లెయింలు, అభ్యంతరాలను పరిష్కరించి.. అక్టోబరు 19న తుది జాబితా ప్రచురిస్తారు. -
కాంగిరేసులో మళ్లీ రచ్చ!
వనపర్తి: 2023 ఎన్నికల ముందు నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆదివారం గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ పార్టీల నాయకులతో పాటు మీడియాలో ఇదే చర్చ సాగుతోంది. ఇదివరకే చిన్నారెడ్డి పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. పార్టీ అధిష్టానం కలుగజేసుకుని కొంత శాంతింపజేసింది. మరోసారి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల విషయంపై వ్యాఖ్యానించడం మళ్లీ వివాదానికి దారి తీసింది. ఒకే పార్టీలో ఉంటూ.. ఇద్దరు నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడాన్ని అధిష్టానం ఎలా డీల్ చేస్తుందనే అంశంపై పార్టీ కేడర్లో చర్చ కొనసాగుతోంది. రానున్న ఎన్నికల నాటికి తమ ఆధిపత్యం ఉండాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పార్టీలోనే ఉంటూ, బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ.. తన వర్గానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగానే చెప్పడం గమనార్హం. పార్టీ ప్రతిష్టను భంగపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి న చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ిఎమ్మెల్యే మేఘారెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ డా.మల్లు రవిని కల్వకుర్తిలో కలిసి ఫిర్యాదు చేశారు. మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అ ధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లను కలిసి ఫిర్యాదులు చేస్తామన్నారు. పార్టీ అధిష్టానం కోట్లాది రూపాయలు తీసుకుని తనకు బీఫాం ఇచ్చిందని పార్టీని అవమానించడంతో పాటు నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు ఫిర్యాదు మాటల యుద్ధం.. ‘‘వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసేందుకు తాను చేసే ప్రయత్నాలకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడు.. తనకు సంబంధించిన కంట్రాక్టర్కు ఐటీ టవర్ పనులు వచ్చాయని టెండర్లు రద్దు చేయించారు.. గోపాల్పేటకు నాలుగు వరుసల రోడ్డు, బ్యూటిఫికేషన్ కోసం నిధులు కోరితే.. మంత్రులు తనను నిరాశ పరిచారు.’’ అంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా డబ్బులు తీసుకుని మేఘారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటూ.. కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరిపై తరచుగా చేస్తున్న వ్యాఖ్యలపై సోమవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ.. పార్టీని అప్రతిష్టపాలుజేస్తున్నారని.. ఇక ఫిర్యాదు చేయక తప్పడం లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సైతం ఈ వివాదంలోకి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ‘‘పార్టీలో సీనియర్గా ఉంటూ.. కెబినెట్ హోదాలో ఉన్నారనే గౌరవంతో ఇన్నాళ్లు ఊరుకున్నా.. పదే పదే అనుచిత వ్యా ఖ్యలు చేస్తూ.. పార్టీని ప్రజల్లో చులకన చేస్తుంటే సంహించేది లేదు. నాలుగేళ్ల క్రితమే గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశాం. తన వర్గం కోసం మరో కార్యా లయం ప్రారంభించడం.. సందర్భం లేకుండా సొంత పార్టీలోని ప్రజాప్రతినిధులను దుషిస్తూ.. పార్టీ క్రమశక్షణ తప్పతున్నారు.’’ అని ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డిపై టీపీసీసీ, సీఎం రేవంత్రెడ్డి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తామని ప్రకటించారు. వివాదానికి దారితీసిన చిన్నారెడ్డి వ్యాఖ్యలు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులకు సిద్ధం ఇద్దరు నేతల వివాదాన్ని లాభంగా మార్చుకుంటున్న బీఆర్ఎస్ -
20న జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపికలు
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఈ నెల 20న జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 విభాగంలో ట్రయాథ్లాన్–ఏ,బీ,సీ, కిడ్స్ జావెలిన్, అండర్– 16లో 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, అండర్–18 విభాగంలో 100, 200, 400, 1000 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, హై జంప్, అండర్ –20లో 100, 200, 400, 800, 1,500, 3,000 మీటర్ల పరుగుపందెం, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, షాట్ఫుట్, డిస్కస్ త్రో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఈ నెల 27, 28 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ మీట్– 2026కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 20న ఉదయం 8 గంటలకు క్రీడా ప్రాంగణంలో రిపోర్టు చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు అథ్లెటిక్స్ కోచ్ శంషీర్ అలీ 94413 53375 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. ఫిర్యాదులపై సత్వర చర్యలు : ఎస్పీ వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది ఎస్పీ సునీతారెడ్డిని నేరుగా కలిసి ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. లా, ఇంజనీరింగ్ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజనీరింగ్ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణాధికారి ప్రవీణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. లా రెండో సెమిస్టర్ పరీక్షకు 80 మందికి 78 మంది హాజరుకాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ పరీక్షకు 182 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రవీణ సూచించారు. సూపరింటెండెంట్ భూమయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 19, 20 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రమేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పీయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావా లని సూచించారు. రోస్టర్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని, టీజీఎప్సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఫీజులను ఎప్సెట్–2026 వెబ్సైట్లో ప్రకటించిన విధంగా చెల్లించాలని సూచించారు. -
తిరుమలనాథస్వామి సన్నిధిలో న్యాయమూర్తులు
వనపర్తి రూరల్: పెద్దగూడెం శివారు తిరుమలయ్యగుట్టపై వెలిసిన వేంకటేశ్వరస్వామిని ఆదివారం జిల్లా ప్రధాన నాయ్యమూర్తి బాక శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కళార్చన, అడిషినల్ సీనియర్ న్యాయమూర్తి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కార్తీక్రెడ్డి, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీలత, రెండో అదనపు జూనియర్ నాయమూర్తి అశ్వని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వా గతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ విశిష్టతను తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. -
మండలాలకు చేరిన ప్రజావాణి
అమరచింత/ఆత్మకూర్: కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తుండగా.. ఫిర్యాదుదారులు ఆయా కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే కార్యక్రమానికి హాజరై వినతులు అందజేస్తున్నారు. కొన్ని మండలాల వారికి దూరభారం కావడం, దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్ల పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి జరి గినా అన్నిశాఖల అధికారులు రాకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి జిల్లాకేంద్రానికి వెళ్తున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట నిర్వ హించి ప్రతి దరఖాస్తును పోర్టర్లో నమోదు చేసి పరిశీలన, పరిష్కారంపై జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్య క్రమం గత వారమే మొదలు కావాల్సి ఉండగా.. సె లవు రావడంతో నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఎంపీడీఓలే నోడల్ అధికారులు.. మండలస్థాయిలో జరిగే ప్రజావాణికి నోడల్ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరిస్తారు. వారే మండలస్థాయిలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వహించాలి. తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, పశుసంవర్దకశాఖ, ఉద్యాన, విద్య, మత్స్య, గృహనిర్మాణ, అటవీ, భగీరథ, నీటిపారుదల, ఆర్అండ్బీ, విద్యుత్ అధికారులతో పాటు డిప్యూటీ తహసీల్దార్, ఐసీడీఎస్ అధికారులు పాల్గోనాల్సి ఉంటుంది. ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ హెల్ప్డెస్క్లు, వసతుల కల్పన జిల్లాకేంద్రానికి వెళ్లే ఇబ్బందులు తప్పినట్టే దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసేలా సిబ్బందికి శిక్షణ ప్రతి దరఖాస్తు పోర్టల్లో.. ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని పోర్టల్లో నమోదు చేయాలి. అంతేగాక ఫిర్యాదుదారులకు గుర్తింపు సంఖ్యలో రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం మండలస్థాయి అధికారులు, శాఖల ఆపరేటర్లకు యూజర్ ఐడీ, పాస్వర్ట్ కేటాయించారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కూడా పూర్తయింది. వసతుల కల్పన.. వినతులు అందజేసేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందిపడకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించడమే కాాకుండా వైద్యసేవల కోసం ఆరోగ్య సిబ్బందిని కేటాయించాలి. అలాగే దివ్యాంగులకు వీల్చైర్లు, ప్రజావాణికి దరఖాస్తులతో వస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు సిబ్బందిని కేటాయించాలి. వృద్ధులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. -
మురుగుతో అవస్థలు..
పట్టణంలోని జీఎస్నగర్లో గ్రామకంఠం స్థలంలో ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నిల్వ ఉంటుంది. ఏళ్లుగా నీరు నిలిచి రంగు మారి దోమలు వృద్ధి చెందడంతో రోగాల బారిన పడుతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. – ఫాతిమాబేగం, అమరచింత ముందస్తు చర్యలు కరువు.. వర్షాకాలంలో విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ దోమల నివారణకు రసాయనాలను పిచికారీ చేయాలి. కాలనీల్లో అపరిశుభ్ర ప్రదేశాలను గుర్తించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి. – శ్రీధర్రెడ్డి, పెబ్బేరు ఫాగింగ్ చేపడతాం.. పురపాలికలో దోమల వ్యాప్తి అధికంగా ఉందనే ఫిర్యాదులు వస్తున్నాయి. నివారణకు ఫాగింగ్ చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం చేపట్టి పుర ప్రజలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛ పురపాలికగా తీర్చిదిద్దేందుకు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నాం. – నూరుల్నదీం, పుర కమిషనర్, అమరచింత ● -
పురం.. స్వచ్ఛత కనం
అమరచింత: వర్షాకాలంలో పరిసరాల్లో వర్షపు నీరు నిలిచి అపరిశుభ్రంగా మారి ఈగలు, దోమలు వ్యాప్తి చెంది ప్రజలు విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ముందస్తుగా వారంలో ఒకరోజు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినా.. ఆశించిన మేర ప్రజల్లో చైతన్యం తీసుకురాలేకపోతున్న పరిస్థితులున్నాయి. గత ప్రభుత్వం పురపాలికల్లో ఆదివారం పది గంటలు.. పది నిమిషాల కార్యక్రమం ద్వారా పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించినా ప్రయోజనం చేకూరలేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాని పురపాలికల్లో మాత్రం సరపడా ఫాగింగ్ యంత్రాలు లేకపోవడం విశేషం. కరోనా సమయంలో ప్రపంచమంతా కరోనాతో భయపడుతుంటే అమరచింత పురపాలికలో మాత్రం ప్రజలు డెంగీ బారిన పరిస్థితులు ఉన్నాయి. జ్వరాల వ్యాప్తి సీజన్.. మున్సిపాలిటీల్లో లోపిస్తున్న పారిశుద్ధ్యం వర్షాకాలం.. సీజనల్ వ్యాధుల భయం నామమాత్రంగా ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం అధికమవుతున్న దోమలు, ఈగల బెడద ఫాగింగ్ యంత్రాలున్నా.. నిరుపయోగంవర్షాకాలం అంటే చాలు.. రోగాల సీజన్ ప్రారంభమైనట్లే. విషయం తెలిసినా సరే సంబంధిత అధికారులు నివారణకు ముందస్తు చర్యలు మాత్రం చేపట్టడం లేదు. డ్రైనేజీలను శుభ్రపర్చడం, నీటినిల్వ గుంతలను గుర్తించి వాటిని మట్టితో కప్పి ఉంచడం, కాలనీలలో ఫాగింగ్ చేపట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా.. అప్పుడప్పుడు ఫాగింగ్ మాత్రమే చేస్తూ చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలున్నాయి. -
‘పరావస్తు’ సేవలు అభినందనీయం
వనపర్తి రూరల్: నిరుద్యోగ యువతకు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిలెల్ల చిన్నారెడ్డి కొనియాడారు. ఆదివారం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, డీసీపీ మధుకర్స్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు ఉచిత కోచింగ్కు మండలంలోని రేడియంట్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎలిజిబిలిటి టెస్టు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై 500 మంది అభ్యర్థులకు పరీక్ష ప్రశ్నపత్రాలు అందజేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఎంపిక పరీక్ష నిర్వహిస్తుండం అభినందనీయమన్నారు. 2005 నుంచి ఇప్పటి వరకు మధుకర్స్వామి, గద్దె భాస్కర్ నిరుద్యోగ యువతకు అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు ఆర్థికభారం లేకుండా నాణ్యమైన శిక్షణ అందించడం సామాజిక బాధ్యతతో కూడిన గొప్ప కార్యక్రమమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని నిర్యుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాహితి కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్, ప్రిన్స్పాల్ తిరుమలేష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, కవిత, బాలసుబ్రమణ్యం, శైలజ, సాహితి, బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, రాంకీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు. -
సర్వేలతోనే సరి..!
●సానుకూలంగా స్పందించారు.. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న భూత్పూరు– మన్ననూర్– సిరిగిరిపాడు వరకు జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. ఇప్పటికే రోడ్డు ప్రాముఖ్యత, ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్రం ప్రకటించే కొత్త జాతీయ రహదారుల జాబితాలో ఇది ఉంది. దీంతోపాటు అలంపూర్ చౌరస్తా– చిన్నంబావి, కొల్లాపూర్, అచ్చంపేట, నల్లగొండ రోడ్ల ప్రతిపాదనలు అందజేశాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ ప్రతిపాదనలు పంపించాం.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన జాతీయ రహదారులను పూర్తి చేసే క్రమంలో కొత్త రోడ్ల ప్రతిపా దనలు పరిగణలోకి తీ సుకోవడం లేదు. కొత్త రోడ్ల మంజూరు కో రుతూ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎర్రవల్లి– గద్వాల– రాయాచూరు, వనపర్తి– మంత్రాలయం, మరికల్– నారాయణపేట– మక్త ల్ రోడ్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాం. భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కూడా పరిగణలోకి తీసుకుని మంజూరు కోరుతాం. – డీకే అరుణ, ఎంపీ, మహబూబ్నగర్ అచ్చంపేట: ఉమ్మడి పాలమూరు జాతీయ రహదారుల అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. రోడ్ల నిర్వహణ సైతం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారత్మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జాతీయ రహదారుల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందులో భూత్పూర్– మన్ననూర్ ప్రధాన రోడ్డుకు దశాబ్దకాలంగా జాతీయ రహదారి గుర్తింపు లభించడం లేదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న నాగర్కర్నూల్ జిల్లాకు ఈ రోడ్డు మార్గం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారుల ఇక్కట్లు చూడలేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. దీనికి జాతీయ రహదారుల విభాగం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేసినా ముందడుగు మాత్రం పడలేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు దృష్టి సారించకపోవడంతో ఈ రోడ్డు మార్గానికి అనుమతులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2017 కేంద్ర బడ్జెట్లో.. భూత్పూర్– నాగర్కర్నూల్– మన్ననూర్ రోడ్డును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్లో 88 కి.మీ., ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించింది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల– వనపర్తి– పెబ్బేరు 74 కి.మీ., ఎర్రవల్లి– గద్వాల– రాయచూరు 55 కి.మీ., ప్రధాన రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పటి ప్రభుత్వం కోరగా.. కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన ఈ రోడ్లు అప్పట్లో సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ రోడ్లతో గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట కొత్త జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు మార్గం సుగమమవుతుంది. మారిన ప్రతిపాదనలతో.. మొదట ప్రతిపాదించిన భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కాలక్రమేణా మద్దిమడుగు– గంగులకుంట (తెలంగాణ) మీదుగా సిరిగిరిపాడు (ఆంధ్రప్రదేశ్) వరకు 166 కి.మీ., రోడ్డుగా మారింది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి ఆలస్యమవుతుండంతో మాజీ ఎంపీ రాములు విడతల వారీగా జాతీయ రహదారి ఏర్పాటు కోసం మరోసారి మన్ననూర్ వరకు ప్రతిపాదనలు రూపొందించి జాతీయ రహదారుల విభాగం సెక్రెటరీ గిరిధర్కు పంపించగా పరిశీలించి దాదాపు ఆమోదం తెలిపారు. చివరి క్షణంలో దీని ప్రతిపాదనలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ వరకు పొడిగించడంతో మారిన ప్రతిపాదనలతో ఆమోదం లభించలేదు. 2022లో కల్వకుర్తి– నంద్యాల కొత్త జాతీయ రహదారి–167కె మంజూరు తర్వాత కేంద్రం ఇప్పటి వరకు మరో జాతీయ రహదారి మంజూరు చేయలేదు. దీంతో ప్రాధాన్యత క్రమంలో ఉన్న కొత్త రోడ్డు మార్గాలు మరుగున పడుతున్నాయి. భూత్పూర్– చించోలి రహదారితో.. బెంగళూరు– ముంబాయి మధ్య అనుసంధానంగా కొనసాగుతున్న భూత్పూర్– చించోలి జాతీయ రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి అనుసంధానంగా 88 కి.మీ., దూరంలో ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి–765కే వరకు పొడిగించడం వల్ల ముంబాయి, బెంగళూరు, శ్రీశైలం మూడు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. వీటితోపాటు హైదరాబాద్– పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మహబూబ్నగర్– గుడేబల్లూరు జాతీయ రహదారి–167ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 80.01 కి.మీ., పనులకు రూ.3,175 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని దేవరకద్ర, మరికల్, మాగనూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల మధ్య రాకపోకల ఇబ్బందులు తీరుతాయి. ఉమ్మడి జిల్లాకు దక్కని జాతీయ రహదారులు ప్రతిపాదనలకే పరిమితమైన భూత్పూర్– మన్ననూర్ రోడ్డు చించోలి రోడ్డుకు లింకుతో నాలుగు హైవేల అనుసంధానం పాలమూరు ప్రజలకు తప్పని రవాణా కష్టాలు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని వేడుకోలు -
పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం పెద్దమందడి మండలం మద్దిగట్లలో జరిగిన పలువురి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారని.. ఆ కలను సాకారం చేసుకోవడం ఎంతో అదృష్టమన్నారు. అనంతరం మండల నాయకులతో సమావేశమై స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్రెడ్డి, మోజర్ల సర్పంచ్ శేఖర్, పెద్దమందడి మండల అధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, సత్యారెడ్డి, పుట్టమోని నారాయణ, రామచంద్రయ్యగౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, బాబురెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయమేప్రభుత్వ లక్ష్యం
జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేస్తున్న చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేత, ప్రసంగాల అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను ఆకట్టుకున్నాయి. జై జవాన్.. జై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అగ్నివీర్కు ఎంపికై న యువకులు పిరమిడ్లు చేసి ముఖ్యఅతిథితో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్ తదితరులను అలరించారు. అనంతరం 138 మంది ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎస్పీ సునీతారెడ్డి, వనపర్తి పుర చైర్పర్సన్ మాధవి, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు కలెక్టరేట్ స్వాతంత్య్ర వేడుకల్లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించిన ముఖ్యఅతిథి -
ప్రజాసేవలో అంకితభావంతో పనిచేద్దాం
వనపర్తి: దేశ అభివృద్ధిలో శాంతిభద్రతలు అత్యంత కీలకమని.. పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యత, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆమె హాజరై 8.45 గంటలకు సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలు, స్ఫూర్తి మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించి సమస్యలను సానుకూలంగా విని న్యాయం అందించాలని కోరారు. ప్రతి బాధితుడికి న్యాయం అందించినప్పుడే స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునంద, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, సీసీఎస్ సీఐ అశోక్కుమార్, రిజర్వ్ ఇనన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు. జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న ఎస్పీ సునీతారెడ్డి, పోలీసు అధికారులు -
వడ్డీ లేని రుణాలు..
2025–26 సంవత్సరానికిగాను 9,023 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద రూ.7.72 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా జిల్లాలోని 5 పురపాలికల్లో 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించి 956 సంఘాలకు రూ.3.16 కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చినట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఈ పథకం ద్వారా 2026, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 5,847 మందికి రూ.18.97 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ప్రత్యామ్నాయ సాగు ప్రోత్సాహం.. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలంలో లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మినుములు, కంది, జొన్న, ఆముదం, కూరగాయలు తదితర ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాకు 5,887 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 88 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఈ పథకానికి రూ.121 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా 13వ స్థానంలో నిలిచిందని చెప్పారు. 2వ విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు మంజూరు కాగా... గుడిసెలు లేని తెలంగాణా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లాలో 1,103 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో అర్హులైన 320 మందికి ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 79 బేస్మెంట్ వరకు పూర్తయి 24.69 శాతం ముందు వరుసలో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి పైకప్పు భర్తీ పథకం కింద 500 ఇళ్లు కేటాయించగా నెలాఖరులోగా అర్హులైన వారందరిని గుర్తించి సంబంధిత లబ్ధిదారుకు రూ.2 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తుందన్నారు. -
విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం..
● అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.3.75 కోట్ల విలువైన బ్యాంకులింకేజీ రుణాల చెక్కును అందజేశారు. అలాగే కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ● టీబీ ముక్త్భారత్ అభియాన్లో భాగంగా ఏఐ సాంకేతికతతో 1,86,705 అనుమానిత కేసులను గుర్తించగా.. వారిలో 319 మందికి సీఎస్ఆర్ నిధి నుంచి పోషణ కిట్లు, ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. 14 ఏళ్లు నిండిన 2,616 మంది బాలికలకు హెచ్పీవీ వాక్సినేషన్ చేసినందుకు జిల్లా రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో నిలిచిందన్నారు. 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ జిల్లా జనరల్ ఆస్పత్రికి మంజూరై ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ● శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా 1,785 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాల్యవివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసుశాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. లోక్అదాలత్ ద్వారా జిల్లాలో 3,566కు పైగా కేసులు పరిష్కరించి ప్రజలకు సత్వర న్యాయం అందించినట్లు చెప్పారు. జిల్లాకేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్న భరోసా కేంద్రాన్ని ఎస్పీ చొరవతో ఉమెన్ సేఫ్టీవింగ్, కలెక్టర్ నిధులతో పోలీసు పాత నివాస భవనానికి మరమ్మతు చేయించి తరలించి సేవలందిస్తున్నారన్నారు. జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు కాగా.. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాలు, పాఠశాల బ్లాకుల నిర్మాణానికి రూ.13.50 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 71 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేస్తున్నట్లు చెప్పారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలోని 1,83,013 లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.2 వేల కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టారని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి కూడా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం కాగా.. జిల్లాస్థాయిలో ముఖ్యఅతిథి పట్నం మహేందర్రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చదివిన పాఠశాల, కళాశాలలో సుమారు రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. జిల్లాకేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్కార్డుతో మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం.. స్మార్ట్ రేషన్కార్డుపై ఉన్న బార్కోడ్ను స్కాన్ చేయడంతో రేషన్ దుకాణం, లబ్ధిదారులకు అందే రేషన్ వివరాలతో పాటు ఇతర సంబంధిత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. లబ్ధిదారులకు సకాలంలో రేషన్ కార్డులు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, పౌరసరఫరాల డీఎం ఆంజనేయులు, వనపర్తి పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పెబ్బేరు మార్కెట్యార్డ్ చైర్పర్సన్ ప్రమోదిని, ఆర్డీఓ సుబ్రమణ్యం, సంబంధిత ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
79 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న వ్యత్యాసాలు
● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం ● అవినీతి కూడా ప్రధాన సమస్య ● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి ● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం తమ జీవితాల్లో పూర్తిస్థాయిలో ప్రతిఫలించడం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక అంతరాలు, అవినీతి, పేదరికం, నాణ్యమైన విద్య–వైద్య సేవల కొరత వంటి సమస్యలు ఇంకా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాల్లో సమానత్వం వంటి విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని, వాటి అమలులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి లభించే అవకాశాలు, పేదలకు అందే అవకాశాల మధ్య వ్యత్యాసం తగ్గాల్సి ఉందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియలను మరింత సరళీకరించాలని పలువురు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టసభలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కులం, సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వివక్షకు తావులేని వాతావరణం ఏర్పడాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు ఏ మేరకు అందుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం పరిస్థితి ఎలా ఉంది? 79 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం? వంటి అంశాలపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 250 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? -
జెండాపండుగకు ముస్తాబు
అంతరాలే అసలు సమస్య వనపర్తిసర్వే సాగిందిలా.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు కొత్తకోట రూరల్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పురపాలికలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతంలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో దోమల నివారణకు పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది అందుబాటు, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని కోరారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థుల యూనిఫాం తయారీ, పంపిణీ పురోగతిని అధికారులతో ఆరా తీశారు. యూనిఫాం పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం మదనాపురం మండలం దంతనూరులో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకలాపాలు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ● ఉదయం 9.20 గంటలకు ఎస్పీ సునీతారెడ్డి కలెక్టరేట్లోని వేధిక వద్దకు చేరుకుంటారు. ● 9.23 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, 9.25 గంటలకు ముఖ్యఅతిథి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలకనున్నారు. ● 9.30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయగీత ఆలాపన, వందన సమర్పణ, అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ముఖ్యఅతిథి చదివి వినిపిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మానం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల అందజేత జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగింపు. రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులో కలెక్టరేట్ భవనం వనపర్తి: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ రంగురంగుల విద్యుద్దీపాలు, వేధిక, ఇతర ఏర్పాట్లతో ముస్తాబైంది. శనివారం జరిగే వేడుకలకు శుక్రవారం ఉదయం నుంచే పనులు ప్రారంభించారు. సాయంత్రం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఏర్పాట్లను పరిశీలించి ఎక్కడా లోపం లేకుండా పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వేడుకలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొననుండగా.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. వేడుకల వేధిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏఓకు సూచించారు. మధ్యాహ్నం తర్వాత డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ.. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రకాల భద్రత ఏర్పాట్లతో రూపొందించిన డిజిటల్ రేషన్ కార్డులను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. సమావేశ మందిరంలో ముఖ్యఅతిథి పట్నం మహేందర్రెడ్డి, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో మధ్యాహ్నం 2 గంటలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే జిల్లాలో సైతం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సైబర్ ప్రొఫైలింగ్లో వనపర్తికి ప్రథమ స్థానం వనపర్తి: సైబర్ నేరాల నియంత్రణ, ప్రొఫైలింగ్లో జిల్లా పోలీస్శాఖ అసాధారణ ప్రతిభ కనబర్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. శుక్రవారం హైదరాబాద్లోని ఐసీసీసీ భవనంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా’ రాష్ట్రస్థాయి సైబర్ అవగాహన సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున డీఎస్పీ గిరిబాబుకు ప్రశంసాపత్రం అందజేశారు. ఎస్పీ సునీతారెడ్డి పర్యవేక్షణలో పనిచేస్తున్న జిల్లా సైబర్ విభాగం సైబర్ నేరస్తుల వివరాల సేకరణ, సమాచార విశ్లేషణ, సమన్వయ సెక్యూరిటీ ప్రొఫైలింగ్ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ఈ అవార్డును కై వసం చేసుకుంది. జిల్లా పోలీసు యంత్రాంగం సమష్టి కృషికి నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. సైబర్ విభాగం అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీరంగాపురం వాసికి ‘మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ వనపర్తి: హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ, శ్రీరంగాపురానికి చెందిన రుద్రవరం గుండ్ల శివమారుతికి ప్రతిష్టాత్మకమైన ‘మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ (ఎంఎంఎస్) దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన పోలీసు పతకాల్లో శివమారుతి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, నేరాల నిరూపణలో కీలక ఆధారాలను సేకరించడం, సీసీ టీవీ ఫుటేజీ విశ్లేషణతో పాటు విధుల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించినందుకు ఈ పతకం లభించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది ఈ పతకాన్ని అందుకున్న అధికారుల్లో శివమారుతి ఒక్కరే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, తనతో కలిసి పనిచేస్తున్న సిబ్బంది సహకారంతోనే ఈ పతకం దక్కిందన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు? సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు II కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికార యంత్రాంగం జాతీయజెండా ఎగురవేయనున్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సరికాదు
వనపర్తి: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఎక్కువ నీటిని తరలించుకుపోతున్న విషయం రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాలేదా అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మాజీలు విహారయాత్రలు చేస్తూ పబ్లిసిటీ కోసం తప్పులు ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడితే ఉరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నందున బాధ్యతాయుతంగా సమాధానమిస్తున్నామని.. హద్దులు దాటితే కాంగ్రెస్ కార్యకర్తలే సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జూరాల ప్రధాన కాల్వ, రాజీవ్ భీమాఫేజ్–2, కేఎల్ఐ కింద నియోజకవర్గంలో 90,741 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని.. ఇవన్నీ 2014కు ముందు కాంగ్రెస్పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు కావా అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చారో రైతులకు లెక్కలు చెప్పాలని.. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్దమేనంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన బీఆర్ఎస్ నాయకులు 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు, ఇతర పెండింగ్ బిల్లులకు రూ.4 వేల కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. స్థానికంగా చర్చించడం చేతగాక సీఎంను విమర్శించడం పనిగా పెట్టుకొన్నారని, మాజీ మంత్రి కేటీఆర్ మెప్పు కోసం అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 1న ఎల్లూరు, ఆగస్టు 2న సింగోటం–జొన్నలబొగుడ, ఆగస్టు 3న గుడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని వదిలామని వివరించారు. డబుల్ ఓట్లను తొలగించడంతో వనపర్తి, పెబ్బేరు పట్టణాల్లో ఓట్ల సంఖ్య తగ్గిందని, మొత్తంగా నియోజకవర్గంలో 86 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. నెలాఖరులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జిల్లా పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సర్ ప్రక్రియలో బీఎల్ఏలు సమర్థవంతంగా పని చేశారని డీసీసీ అధ్యక్షుడు ప్రశంసించారు. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపునిస్తామని తెలిపారు. సమావేశంలో పుర చైర్పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, కౌన్సిలర్లు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. -
ఎఫ్సీఓ నిబంధనలు విధిగా పాటించాలి
కొత్తకోట రూరల్: ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయంలో ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సీఓ) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, స్టాక్ బోర్డులు, ధరల పట్టికలను పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేశారు. అధిక ధరలకు విక్రయించడం, బిల్లులు ఇవ్వకపోవడం, స్టాక్ వివరాలను నమోదు చేయకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రైతులకు క్షేత్ర ప్రదర్శనలో ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. వర్షపాతం అస్థిరంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, పంటల్లో సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విక్రయించాలి.. ఖిల్లాఘనపురం: ప్రభుత్వ నిబంధనలు, ధరల ప్రకారమే ఎరువులు విక్రయించాలని డీఏఓ అంజనేయులు అన్నారు. శుక్రవారం సోళీపురం, ఖిల్లాఘనపురంలోని ఎరువుల దుఖాణాలను మండల వ్యవసాయ అధికారి మల్లయ్యతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు, ఈపాస్ యంత్రాల్లోని ఎరువుల నిల్వలు, స్టాక్ బోర్డులు పరిశీలించారు. జిల్లాలో సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని తెలిపారు. ఎవరైన డీలర్లు ఎక్కువ ధరలకు, నకిలీ ఎరువులు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రైసుమిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
వనపర్తి రూరల్: రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం, అధికారుల బృందం గురువారం పెబ్బేరు మండలం చెలిమిళ్ల సమీపంలో ఉన్న శ్రీ సత్యసాయి రైసుమిల్, జాతీయ రహదారి పక్కనున్న రైస్మిల్, గోదాంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. 2022–23 యాసంగి సీజన్లో ఆయా మిల్లులకు కేటాయించిన వరి ధాన్యం, మిల్లు, గోదాముల్లో బస్తాలను లెక్కించారు. కేటాయించిన ధాన్యంలో 6,491.92 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా వచ్చిందని, విలువ రూ.18.51 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. కేఎల్ఐ కాల్వకు జలకళ గోపాల్పేట: కేఎల్ఐ డి–8 కాల్వకు బుధవారం అధికారులు నీటిని వదిలారు. గురువారం ఉదయం గోపాల్పేట – ఏదుట్ల వెళ్లే దారిలో ఉన్న మేజర్–2 కాల్వ నిండుగా పారుతోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఎంతోకొంత వరిసాగు చేసుకున్న రైతులకు కాల్వ నీరు వచ్చేసరికి సంతోషంలో మునిగిపోయారు. మేజర్–2 కాల్వకు గండిపడకుండా తూము ఏర్పాటు చేసి సరిపడా నీరు వదలాలని రైతులు కోరుతున్నారు. కేఎల్ఐ డీ–8 కాల్వ ద్వారా ఉమ్మడి గోపాల్పేట మండలంతో పా టు పాన్గల్, వనపర్తి, కోడేరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి రూరల్: బీసీ విద్యార్థులకు నీట్ యూజీ, జేఈఈ–2027 ఉచిత లాంగ్టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తునట్లు ఎంజేపీ సొసైటీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులతో పాటు నీట్, జేఈఈ–2026లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి https;//mjptbc admissions.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు నీట్లో 100, జేఈఈలో 40.. బాలురకు నీట్లో 50, జేఈఈలో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. బాలికలకు నాగోల్ సీఓఈ కళాశాలలో, బాలురకు అబ్దులాపూర్మెట్ సీఓఈ కళాశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. మెరిట్, సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని, దరఖాస్తులు అధికంగా వస్తే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట కొత్తకోట రూరల్: మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మహిళా సమైఖ్య సర్వసభ్య సమావేశం, ఇందిరా మహిళాశక్తి 23వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సభ్యులతో మాట్లాడి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగా కాకుండా ఆర్థిక, వ్యాపార శక్తులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులు, కామన్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్న ఎమ్మెల్యే, కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్బంక్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వీఓఏల వేతనాల పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమరభేరి
వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. మోదీ, అమిత్షా అనుకుంటే ఎదురులేదని ప్రచారం జరుగుతున్న సమయంలో దేశ యువత పెద్దఎత్తున మోదీ విధానాలను వ్యతిరేకించి సీజేపీ రూపంలో పోరాటం చేపట్టిందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, రాజ్యాంగ పరిరక్షణకు యువత, మహిళలు పెద్దఎత్తున పోరాడి విజయం సాధించారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబాని, అదాని వంటి బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతోందని.. బొగ్గుగనులు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీ, రక్షణ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని దేశభక్తి అంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ, తక్షణమే రైతుభరోసా నిధులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని.. రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, బాల్రెడ్డి, మండ్ల రాజు, లక్ష్మి, గోపీ, జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వరాచారి, మేకల ఆంజనేయులు, ఆర్ఎన్ రమేష్, మండ్ల కృష్ణయ్య, రాజు, వెంకటేష్, బాల్యానాయక్, మహబూబ్పాషా, వెంకటయ్య పాల్గొన్నారు. -
మీసేవా కేంద్రాల్లో పారదర్శక సేవలు
వనపర్తి: మీసేవా కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. గురువారం జిల్లాకేంద్రంలో జిల్లాలోని మీసేవా కేంద్రాల నిర్వాహకుల సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై పలు సూచనలు చేశారు. వైకల్య గుర్తింపు కార్డులు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, కార్మికశాఖ సేవలపై సూచనలిచ్చారు. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, ఆన్లైన్ విధానం, సేవల ప్రాసెసింగ్ తదితర అంశాలను అధికారులు వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అదనంగా ఎలాంటి మొత్తాన్ని వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రతి సేవకు నిర్ణయించిన రుసుం వివరాలను కేంద్రాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రతి లావాదేవీకి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించడంతో పాటు కేంద్రాలను శుభ్రంగా, సౌకర్యవంతంగా నిర్వహించాలని సూచించారు. మీసేవా జిల్లా మేనేజర్ వెంకటేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పటిష్టంగా నీటిశుద్ధి ప్రక్రియ..
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా శుద్ధి ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా సమీపంలో ఉన్న 75 ఎంఎల్డీ మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మిషన్ భగీరథ సూపరింటెండెంట్తో కలిసి ప్లాంట్లోని నీటి ప్రవాహం, ఫిల్టరేషన్ ప్రక్రియను పరిశీలించారు. గౌరీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి ప్లాంట్కు ఏ విధంగా నీరు చేరుతుంది.. వివిధ దశల్లో శుద్ధిచేసి ప్రజలకు ఏ విధంగా సరఫరా చేస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కూడా నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట మిషన్ భగీరథ ఈఈ అంజద్, ఇంజినీరింగ్ అధికారులు, సర్పంచ్, సిబ్బంది ఉన్నారు. -
దేశభక్తి
వెల్లివిరిసిన240 అడుగుల మువ్వన్నెల జెండా ప్రదర్శన జిల్లాకేంద్రంలో గురువారం 240 అడుగుల పొడవున్న జాతీయ జెండాను ప్రదర్శించారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ బచ్చు రాము ఆధ్వర్యంలో విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేడ్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా పట్టణ వీధుల్లో దేశభక్తి నినాదాలు చేస్తూ ప్రదర్శించారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఆద్యంతం అందరిని కట్టిపడేసింది. – వనపర్తిటౌన్ -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
వనపర్తి: గణప సముద్రం రిజర్వాయర్తో ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతున్నారు.. కాబట్టి భూములు కోల్పోతున్న రైతులకు సైతం ప్రభుత్వం తరఫున సరైన న్యాయం అందించేందుకు బాధ్యత తీసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఆర్అండ్ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి బుద్ధారం, ఖిల్లాఘనపురం గణపసముద్రం భూ నిర్వాసితులతో సమావేశమై నష్టపరిహారం చెల్లింపు విషయంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణప సముద్రంలో లక్ష్యం మేర నీటినిల్వ సామర్థ్యం తగ్గించకుండా బండ్ ఎత్తు పెంచితే రైతుల నుంచి సేకరించాల్సిన నికర భూమి తగ్గుతుందని, తద్వారా ఇటు రైతులు అటు ప్రభుత్వానికి లాభం కలుగుతుందని, ఆ దిశగా సర్వే పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్శాఖ అధికారులను కోరారు. భూ నిర్వాసితులకు నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.11.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉందని.. కానీ సన్న, చిన్నకారు రైతులు నష్టపోతున్నందున కాస్త పెంచి ఇచ్చేవిధంగా చూడాలని కలెక్టర్ను కోరారు. భూ నిర్వాసితులు ఎకరాకు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరగా నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకొని రూ.14 లక్షలు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇల్లు లేని పేద నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తనదని, రైతులు సహకరించాలని కోరారు. ఇందుకు సమ్మతించిన రైతులు రూ.14 లక్షలకు కాస్త పెంచి ఇవ్వాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పీఎన్ చేసిన నాటికి ప్రభుత్వ భూ విలువ ఎంత ఉంటుందో దానికి మూడు రెట్లు లెక్కించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, కానీ రైతులు, శాసనసభ్యుల కోరిక మేరకు నేడు చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్అండ్ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్నాయుడు మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు నష్టం జరగడం సహజమేనని.. కానీ చాలామంది రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు మిగిలిన భూమికి ఎక్కువ డిమాండు వస్తుందని తెలిపారు. జనరల్ అవార్డుకు వెళ్తే రైతులు నష్టపోతారని.. అందుకే చర్చలు జరిపి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. బండరాయిపాకుల నిర్వాసితుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ తిరుపతయ్య, ఏడీ సర్వే శ్రీనివాసులు, తహసీల్దార్లు, పెద్దమందడి, ఖిల్లాఘనపురం మార్కెట్ కమిటీ చైర్మన్ నవనీత, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోలేని కాంగ్రెస్ సర్కార్
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శ వనపర్తి: తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేస్తూ.. కాంగ్రెస్ సర్కార్ ఆంధ్రకు నీళ్లు దోచిపెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ముందుగా జూరాల ప్రాజెక్టును పరిశీలించి.. అనంతరం పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్తుండగా.. ఆంధ్ర పోలీసులు కర్నూలు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే మీడియాలో మాట్లాడారు. ఎల్నినో పేరిట తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు సాగు నీళ్లు దోచిపెడుతున్న రేవంత్రెడ్డి సర్కారును రైతాంగం క్షేమించబోదన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఆధారంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చూద్దామని వస్తే.. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో కూడా పంటలు పండాలి.. అభ్యంతరం లేదు కానీ.. గ్రావిటీతో రోజుకు నాలుగైదు టీఎంసీలు తోడేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వైపున 802 మీటర్లు అడుగున ఉన్న మోటార్లతో ఎత్తిపోయాలని, కేఎల్ఐ మూడు పంప్లు పనిచేస్తున్నా రోజుకు కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోవడం వల్ల.. ఒక టీఎంసీ నీటికే ఐదారు రోజులు సమయం పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘోరమైన వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేయడానికే వచ్చామని పేర్కొన్నారు. కల్వకుర్తి మోటార్లు సరిగా నడపడం లేదని, దీనిపై తాము ఒత్తిడి తెస్తేనే ఎత్తిపోతలు చేపట్టారన్నారు. 162 కిలోమీటర్ల పొడవు ఉండే కాల్వలో 102 కి.మీ., దూరానికి కూడా ఇప్పటికీ నీళ్లు పోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో శ్రీశైలంలో వంద టీఎంసీలు ఉన్నప్పుడు కూడా 40 టీఎంసీల నీళ్లు రైతులకు నీళ్లు ఇచ్చామని ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. దీనిపై పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఆగస్టులో సాగు సీజన్ దాదాపు అయిపోతుందని.. ఈ సమయంలో ఐఏబీ సమావేశంలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తామని చెప్పడం వింతగా ఉందని తెలిపారు. నిన్నటి వరకు జూరాలకు వరద వచ్చిందని.. ఈ సీజన్కు నీటికొరత లేకున్నా ఉన్నట్లు ప్రభుత్వమే రాద్ధాంతం చేయడం తగదన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు గట్టుయాదవ్, లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, జగదీశ్వర్రెడ్డి, పలుస రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, కురుమూర్తి యాదవ్, గంధం పరంజ్యోతి ఉన్నారు. -
సీఎంఆర్పై ఈడీ నజర్!
● మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం ● అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ● జిల్లాలో వరుసగా విజిలెన్స్ దాడులు వనపర్తి: జిల్లాలో సీఎంఆర్ అక్రమాల పుట్ట తొవ్వేకొద్దీ ఊటబావిలోని నీటిలా వెలికి వస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా నెలరోజులుగా చేపడుతున్న విజిలెన్స్ దాడులతో రూ.కోట్ల అక్రమాలు వెలుగులోకి రావడం, క్రిమినల్ కేసులు నమోదవుతున్న విషయం విధితమే. కాగా.. కొందరు రైస్మిల్లర్లు అవినీతిలో తిమింగలాలతో పోటీపడుతున్నారంటూ వారి విచారణ బాధ్యతలను ఈడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా సీఎంఆర్ కోసం చేసిన ధాన్యం కేటాయింపులను మాయం చేయడం, బియ్యం ఇవ్వకుండా వాయిదాలతో కాలం గడుపుతున్న 11 మిల్లుల యాజమాన్యాలపై ఈడీ తనదైన శైలిలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సదరు అక్రమాల్లో అగ్రగనుల చిట్టా ఈడీ చేతికి అందినట్లు తెలుస్తోంది. గత పది సీజన్లలో మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పెండింగ్ బియ్యం విలువ సుమారు రూ.623.45 కోట్లు. కాగా.. ఇందులో అత్యధికంగా బకాయి ఉన్న 11 మిల్లుల యాజమాన్యాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ.. వీరిపై విచారణ చేసే బాధ్యతను ఈడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని విక్రయించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణాధికారాలు ఈడీ చేతికి వెళ్లినట్లు సమాచారం. జిల్లాలో 191 రైస్మిల్లులు ఉండగా.. 11 మిల్లుల బకాయిలు భారీ ఎత్తున దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నట్లు భావించిన అధికారులు వారు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి స్వప్రయోజనాల కోసం అందుకు సంబంధించిన డబ్బును వినియోగించిట్లు భావించి విచారణ బాధ్యతను ఈడీకి బదలాయించబడినట్లు తెలుస్తోంది. వీరి బ్యాంకు లావాదేవీలు.. వారు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువుల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులు.. నూతనంగా ప్రారంభించిన వ్యాపారాలు తదితర అంశాలపై లోతైన విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో.. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి గ్యారెంటీలు లేకుండా రూ.కోట్ల విలువైన వరి ధాన్యం కేవలం ఒక మిల్లుకు యజమాని అనే కారణంతో రికవరీతో సంబంధం లేకుండా విచ్ఛలవిడిగా కేటాయించడంతో అక్రమాలకు అవకాశం ఇచ్చినట్లయింది. జిల్లాలో అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు మిల్లర్లు ఇదే అదునుగా భావించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బయట మార్కెట్కు విక్రయించి ఆస్తులు, కొత్త వ్యాపారాలకు పెట్టుబడి కోసం వినియోగించుకున్నట్లుగా వచ్చిన ఆరోపణల మేరకు 11 మిల్లుల యజమానులపై మనీ లాండరింగ్ కోణంలో విచారణకు ఈడీ సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి సేకరించిన వరి ధాన్యం విక్రయించిన మిల్లుల యజమానుల్లో కొందరు పెద్దమొత్తంలో ఇతర వ్యాపారాల్లోకి, ఆస్తుల్లోకి మళ్లించినట్లుగా అనుమానం వచ్చి రాష్ట్ర అధికారులు ఈడీకి అప్పగించారు. ఇప్పటికై తే.. ఒకే యజమానికి చెందిన ఐదు రైస్మిల్లులపై ఈడీ విచారణ చేపట్టింది. హైదరాబాద్లో విచారణకు హాజరై వచ్చా ను. ఇంకా కొన్ని ఉన్నాయన్నారు కాని మాకు విచారణ విషయమై సమాచారం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అత్యధికంగా సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులపై విచారణ చేసేలా పౌరసరఫరా లశాఖ సిఫారస్ చేసింది. – ఆంజనేయులు, డీఎం, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లాలో నలుగురికి చెందిన 11 మిల్లులకు ఇప్పటి వరకు కేటాయించిన వరి ధాన్యంలో పెండింగ్ సీఎంఆర్ రూ.101.10 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టనుంది. ఇదే జిల్లాలో ఒక మిల్లరు రూ.వంద కోట్లకుపైగా బకాయి ఉన్నట్లు ఇటీవల ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పించారు. వారి మిల్లుపై ఇటీవల విజిలెన్స్ సోదాలు నిర్వహించినా.. ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. సీఎంఆర్ అక్రమాలపై కొంతకాలంగా జిల్లాలో వరుసగా విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం పెబ్బేరులోని ఓ మిల్లులో తనిఖీలు చేపట్టారు. కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపూరం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లోని మిల్లుల్లో వరుస తనిఖీలు చేస్తూ ధాన్యం లోటు ఉన్న మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తుండటం.. భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఈడీ విచారణకు సిఫారస్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
వనపర్తిటౌన్: విద్యార్థులు భవిష్యత్పై శ్రద్ధ చూపకుండా మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.కళార్చన ఆదేశాల మేరకు బుధవారం జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు కార్యాలయం, మహాత్మా జ్యోతిబా పూలే బాలుర జూనియర్ కళాశాలలో ప్రపంచ యువజన దినోత్సవం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై యువత, విద్యార్థులకు డ్రగ్స్, డ్రంకెన్ డ్రైవ్, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో, ఉచిత నిర్బంద విద్య, మోటారు వాహనాల చట్టం, సైబర్ క్రైం గురించి వివరించారు. ఉచిత న్యాయసేవలకై టోల్ఫ్రీ నంబర్ 15100లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, జువైనల్ జస్టిస్ బోర్డు సిబ్బంది, ప్యానెల్, పారా లీగల్ వలంటీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ...
రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూనే, ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా వీలైనంత నీరు విడుదల చేసేందుకు ప్రయత్నించాలన్నారు. నీటి విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో నాగర్కర్నూల్, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, విజయుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ కలెక్టర్లు ఖుష్బూగుప్తా, సీహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్బాషా, హేమంత కేశవ్ పాటిల్, ఉమ్మడి జిల్లా వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
వనపర్తి: విద్యార్థులు రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని బండారునగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి విద్యాభ్యాసం, హాజరు, క్రమశిక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, భోజనం తయారు చేసే సమయంలో శుభ్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. వంటశాల, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చదవాలని సూచించారు. -
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ..
చాలామంది రైతులు ఇప్పటికే బోరుబావుల కింద వరి సాగు చేశారని, ఆయా పంటలను రక్షించుకునేందుకు వారాబంధి విధానంలో నీటిని విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఎల్నినో కమిటీ సిఫారసు చేసిన పంటలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని.. కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొత్తకోట మండలం కానాయపల్లి ఆర్అండ్ఆర్ సమస్యను పరిష్కరిస్తే శంకర సముద్రం రిజర్వాయర్ పరిధిలోని 12 గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని.. ఈ విషయంపై కేబినెట్లో చర్చించాలని మంత్రులను కోరారు. -
భవన నిర్మాణ పనుల్లో జాప్యం సరికాదు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో జాప్యం సరికాదని.. నెలాఖరులోగా బేస్మెంట్ పనులు, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు, మ్యాప్ను పరిశీలించి ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి, చేపట్టాల్సిన వాటి వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆశించిన స్థాయిలో సాగకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేస్తూ పనులు ప్రారంభించి చాలా కాలం గడిచినందున ఇకపై ఎలాంటి జాప్యానికి తావులేదని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన సందర్భంగా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాల మేర పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ అంచనాలు పెంచకుండా పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. చేపట్టాల్సిన ప్రతి పనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసి సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప నుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ యాదయ్య, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు, ఇతర విద్యాశాఖ అధికారులు ఉన్నారు. -
ఆరుతడి సాగు చేయాలి
ఉమ్మడి జిల్లా ఐఏబీ సమావేశంలో మంత్రులు జూపల్లి, వాకిటి ● నీటి విడుదల, పంటల సాగుపై సుదీర్ఘంగా చర్చ ● పాల్గొన్న ఎమ్మెల్యేలు, సాగునీటి, వ్యవసాయశాఖ అధికారులు అధికారులు జవాబుదారీతనంతో ప్రజలకు అన్ని వివరాలు, వాస్తవాలను తెలియజేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఏమి ఇవ్వగలమో అదే చెప్పాలన్నారు. రూ.వేల పెట్టుబడితో పంటలు సాగు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిపుణుల సూచనల మేరకు ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని సూచించారు. వనపర్తి: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.. ఉమ్మడి పాలమూరు రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని నష్టపోకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశానికి వారితో పాటు ఎమ్మెల్యేలు, నీటిపారుదల, వ్యవసాయశాఖ అఽధికారులు హాజరయ్యారు. ఎల్నినో కారణంగా కరువు పరిస్థితులు, ఉమ్మడి జిల్లా పరిధిలోని జూరాల, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఆర్డీఎస్, కేఎల్ఐ, భీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టం, రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాల దృష్ట్యా నీటి నిల్వలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదతో ప్రస్తుతానికి ప్రాజెక్టులు నింపుకొన్నామని.. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచినట్లు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో తిరిగి నీటి విడుదల జరిగితేనే రైతులకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సాగునీటి విడుదలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలు సాగు చేసేలా సూచనలు చేయాలని నిర్ణయించారు. అదృష్టవశాత్తు కర్ణాటకలో కురిసిన కొద్దిపాటి వర్షాలతో జూరాలకు వరద వచ్చిందని.. వరి సాగు చేస్తే డిసెంబర్ వరకు నీరు అవసరం ఉంటుందన్నారు. అప్పటి వరకు ఇవ్వాలంటే వర్షాలు కురవడం తప్పనిసరని.. ఎల్నినో ప్రభావంతో రానున్న రెండు, మూడునెలలు ఆశించిన మేర వర్షాలు కురిసే అవకాశాలు లేవని తెలిపారు. రూ.వేల పెట్టుబడితో వరి సాగు చేసి నష్టపోవడం కంటే ఆరుతడి పంటలు సాగు చేయడమే రైతుకు శ్రేయస్కరమన్నారు. ప్రస్తుత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు సరిపడా సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని, లేకుంటే వారబంధి విధానంలో నీళ్లు వదలాలన్నారు. జిల్లాలోని జలాశయాలకు ఎంత నీరు వస్తోంది,. ఎంత వదులుతున్నామనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. -
జాతీయ బహుమతి అందుకున్న వగ్గు శ్రీరామ్
అమరచింత: ఢిల్లీలో జరిగిన జాతీయ హ్యండ్లూమ్ హ్యకథాన్లో పట్టణానికి చెందిన వగ్గు శ్రీరామ్ బుధవారం కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకున్నారు. పట్టువస్త్రాల తయారీలో నేతన్నలు వెన్నునొప్పితో బాధపడకుండా ఉండేందుకుగాను శ్రీరామ్ తయారు చేసిన పరికరాన్ని జాతీయస్థాయి ఇన్నోవేషన్లో ప్రదర్శించగా ప్రథమ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా అమరచింత పద్మశాలి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రఘురాం వగ్గు శ్రీరామ్కు అభినందనలు తెలిపారు. నిధులు, విధులు సర్పంచ్లకే ఉండాలి వనపర్తిటౌన్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే విధులు, నిధులు, బాధ్యతలు సర్పంచ్లకే ఉండాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధికార ప్రతినిధి పురుషోత్తంరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సర్పంచ్ హక్కుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో సంసారం చేసేది సర్పంచ్ అయితే అధికారం ఎమ్మెల్యేలకు అప్పజెప్పి గ్రామ స్వరాజ్య వ్యవస్థను ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని మండిపడ్డారు. విధులు సర్పంచ్లు నిర్వర్తిస్తుంటే నిధులు ఎమ్మెల్యేలకు కేటాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. గ్రామానికి, గ్రామసభకు సర్పంచే సర్వాధికారిగా ఉండాలనే నిబంధనకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలు అధికారం సర్పంచ్లకు కాకుండా ఇందిరమ్మ కమిటీల పేరుతో అనామకులకు అప్పగించడం సరికాదన్నారు. సర్పంచ్, గ్రామకార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వకుండా ఏదో ఒక వార్డులో గెలిచిన వ్యక్తిని ఉప సర్పంచ్గా చేసి సర్పంచ్ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనైతిక నిర్ణయాలతో సర్పంచ్ వ్యవస్థ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, అన్ని గ్రామపంచాయతీలకు నిర్వహణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధానకార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శి మందిపల్లి వెంకట్, అధికార ప్రతినిధి, బుద్ధారం సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు. జాతీయ జెండాల పంపిణీ వనపర్తిటౌన్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ భావాన్ని చాటాలన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కేతూరి బుడ్డన్న, శ్రీశైలం, మెంటపల్లి పురుషోత్తం, రామన్నగారి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, కల్పన, జిల్లా కార్యదర్శి కాటమోని కృష్ణగౌడ్, ఆఫీస్ సెక్రటరీ దారపోగు సుబ్రమణ్యం, కౌన్సిలర్ విజయ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో రుద్రహోమం కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో ఆషాడమాస అమావాస్య సందర్భంగా బుధవారం రుద్రహోమం, కోటిలింగాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రహోమం జరిగాయి. హోమం కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. -
స్వచ్ఛతే లక్ష్యంగా.. నిధుల విడుదల
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 70 శాతం నిధులు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.21.91 కోట్ల మంజూరు ● మహిళా సంఘాల భవనాలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాల వద్ద నిర్మాణాలు ● అక్టోబర్ 2 లక్ష్యంగా పనులు ముమ్మరం నర్వ: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాల భవనాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మార్కెట్యార్డులు, దేవాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధుల్లో 70 శాతం స్వచ్ఛభారత్ మిషన్ నుంచి సమకూరనున్నాయి. మిగిలిన 30 శాతం నిధులను గ్రామ పంచాయతీలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించనున్నారు. మహిళా సంఘాల భవనం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద రూ.52 వేలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.92,747 చొప్పున నిధులు అందించనున్నారు. జిల్లా మ.సం.భ మంజూరైన నిధులు నాగర్కర్నూల్ 209 రూ.1.77 కోట్లు నారాయణపేట 45 రూ.52.50 లక్షలు మహబూబ్నగర్ 427 రూ.2.36 కోట్లు వనపర్తి 73 రూ.66.89 లక్షలు జోగుళాంబ గద్వాల 50 రూ.49.73 లక్షలు మ.సం.భ : మహిళా సంఘాల భవనాలుకలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అందిపుచ్చుకునేలా మహిళా సమాఖ్య, ఎస్బీఎం అధికారులకు దిశానిర్దేశం చేశాం. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. కేంద్ర బృంధం యూనిసెఫ్ సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అంచనా నివేదికను తయారు చేసి కేంద్రానికి నివేదించేందుకు ఇటీవల పర్యటన చేపట్టారు. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట గతంలో ఉపాధిహామీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా నిర్మాణాలు చేపట్టినప్పుడు పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో సమస్యల కారణంగా పథకం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం స్వచ్ఛభారత్ మిషన్, మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, పంచాయతీ శాఖల సమన్వయంతో పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. -
అక్టోబర్ 2 లక్ష్యంగా వేగవంతం..
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ఆయా మండలాల్లో కేటాయించిన సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడుగుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. జిల్లాలోని కొత్తపల్లి మండలం భూనీడు, గుండుమాల్ మండలం ఆమ్లీకుంటలలో కేంద్రబృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. అక్టోబర్ 2 డెడ్లైన్తో పనులు పూర్తి చేసేలా పనుల వేగవంతం చేస్తున్నాం. పైలెట్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో పనులను పర్యవేక్షిస్తున్నాను. మరో కొన్నిరోజుల్లో లక్షా్య్న్ని చేరుకుంటాం. – మాలిక్, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ ● -
డీఐజీ చౌహాన్పై బదిలీ వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ● ఇన్చార్జి డీఐజీగా షాన్వాజ్ ఖాసీం మహబూబ్నగర్ క్రైం: పోలీసుశాఖలో ఉన్నతస్థాయిలో ఉంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు.. తనిఖీలకు వెళ్లిన ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొన్న జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్పై ఆకస్మికంగా వేటు పడింది. ఆయనను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ (వెయిటింగ్) చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాత్కాలికంగా ఐజీ షాన్వాజ్ ఖాసీంకు ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. జోగుళాంబ జోన్–7 ఏర్పాటైన తర్వాత తొలి డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్ 2023 జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆయనను రామగుండం సీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినప్పటికీ.. అవి అమలు కాకపోవడంతో ఇక్కడే కొనసాగారు. దాదాపు మూడున్నరేళ్లుగా ఇదే పోస్టులో కొనసాగుతున్న ఆయన తీరుపై మొదటి నుంచీ పోలీసు వర్గాల్లో పలు విమర్శలు వినిపించాయి. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీల వ్యవహారంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తనిఖీల సందర్భంగా కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని, బదిలీల విషయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించేవారనే విమర్శలు పోలీసు వర్గాల్లో వినిపించాయి. -
ఆయకట్టు.. ఆందోళన
● ఆరుతడి పంటలకే సాగునీరుసరఫరా అంటున్న అధికారులు ● ఇప్పటికే జూరాలకు తగ్గిన వరద.. క్రస్ట్గేట్లు మూసివేత ● నేడు వనపర్తి కలెక్టరేట్లో ఐఏబీ సమావేశం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకుపైగా వరి సాగు మూడున్నరేళ్ల తర్వాతఐఏబీ సమావేశం.. సాగునీటి లభ్యత, పంటల ప్రణాళిక, ఆయకట్టు ప్రాంతాలకు నీటి కేటాయింపులు, వినియోగంపై మార్గదర్శకాలు తదితర అంశాలపై ఏటా వానాకాలం, యాసంగి పంటల సాగుకు ముందు ఐఏబీ (ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు) సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పాలకులు మూడున్నరేళ్లుగా ఆ ఊసే ఎత్తలేదు. ఎల్నినో ప్రభావంతో సమస్య తీవ్రతరమైన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఐఏబీ సమావేశాలను పునరుద్ధరించి.. ఏటా రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, వాటి పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు, ఇప్పటి వరకు సాగుచేసిన పంటల వివరాలు, పంటకాలం ముగిసే వరకు సరిపడా నాటి నిల్వలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించేందుకు సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకు వనపర్తి కలెక్టరేట్ వేదిక కానుంది. ఉమ్మడి జిల్లాలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐ, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టుల పరిధిలో సుమారు 6లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఇప్పటికే సుమారు 4 లక్షల ఎకరాలకు పైబడి వరిసాగు చేసినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. కేవలం 5.5 టీఎంసీల నిల్వ ఉన్న జూరాల నీటితో పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించటంపై సాధ్యాసాధ్యాలను చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రియదర్శిని జూరాల జలాశయం వనపర్తి/గద్వాల: వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద వస్తోందని సంబురపడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. అయితే వీరి ఆనందం తాత్కాలికమేనని జూరాలకు తగ్గిన వరదతో స్పష్టమైంది. ప్రియదర్శిని జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 15 రోజులకు పైగా భారీగా వరద వచ్చి చేరగా.. ఆదివారం నాటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు జూరాల క్రస్ట్గేట్లను పూర్తిగా మూసివేశారు. పదేళ్ల కాలంలో వానాకాలం క్రస్ట్గేట్లను పూర్తిగా మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మంగళవారం తిరిగి ఎనిమిది గేట్లు తెరిచారు. దీనితో పాటు విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తుండగా.. నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వలకు నీటి విడుదలను తగ్గించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగుచేసిన వరిపంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంట పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే డిసెంబర్ వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలకే సాగునీటిని విడుదల చేస్తామంటున్న అధికారుల ప్రకటనతో అన్నదాతల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం వనపర్తిలో జరిగే ఇరిగేషన్ బోర్డు సమావేశంలో పంటలకు సాగునీటి లెక్కలు తేలనున్నాయి. గడ్డు కాలమే.. వానాకాలంలో నెలన్నర రోజులపాటు జూరాల జలాశయం నీరులేక వెలవెలబోయింది. వానాకాలంలో జలాశయం అడుగంటిన పరిస్థితి దశాబ్దకాలంలో ఇదే తొలిసారి. దీంతో అధికారులు జలాశయంలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రాజెక్టు ఆయకట్టులో ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అప్పటికే 60 వేలకు పైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే కృష్ణాబేసిన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఊరట పొందిన అన్నదాతలు.. వానదేవుడిపై భారం వేసి, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. నెట్టెంపాడు కింద 1.20లక్షలు, జూరాల కుడి కాల్వ పరిఽధిలో 20వేలు, భీమా లిఫ్ట్–2 కింద 92వేలు, జూరాల ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో 73,639, ఎంజీకేఎల్ఐ కింద 1,18,730 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఇందులో అత్యధికంగా వరిసాగైంది. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కోడేరు: ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని సింగాయిపల్లిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, గుండ్యవాల్యానాయక్ తండా సర్పంచ్ కాట్రావత్ పార్వతి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం : సీపీఎం
అమరచింత: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సీపీఎం ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పిట్టల రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భారతదేశ రాజకీయ పరిస్థితులు, ప్రజ సమస్యలపై పోరాటాలు, కార్మిక, కర్షక ఉద్యమాల ప్రాధాన్యత, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నాయని.. సంక్షేమ పథకాలు పేదల దరి చేరడం లేదన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. స్థలం లేక నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వితంతువులు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేష్, ఆర్ఎన్ రమేష్, అజయ్, రాఘవేంద్ర, ఆత్మకూర్ మండల సీపీఎం కార్యదర్శి రాజు, గోపాల్, బుచ్చన్న, కౌన్సిలర్ మాధవి, కో–ఆప్షన్ సభ్యురాలు షాజహాన్, శ్రీను, చంటి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
వనపర్తి రూరల్: ఉపాధ్యాయులు, విద్యాధికారులు విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజంలోని పరిస్థితులపై అవగాహన కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని అంజనగిరి ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి తరగతి గదిలో ఉపాధ్యాయుడై శుభ్రత, మంచినీరు, ఆహార నాణ్యత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి ఆసక్తి పెంచేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గత నెలలో పాఠశాలను సందర్శించినప్పుడు సొంత ఖర్చుతో భోజనం అందిస్తానని ఇచ్చిన హామీ మేరకు తయారు చేయించి తన చేతులతో విద్యార్థులకు వడ్డించారు. ఆప్యాయంగా పలకరించి ఆహారం అందించే రైతు, రైతుకూలీల విశిష్టతను వివరించారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను గౌరవించాలని కోరారు. ప్రజాప్రతినిధులు తరచూ తనిఖీ చేస్తూ వసతులు, ఆహార నాణ్యతపై శ్రద్ధ చూపి మెరుగుపర్చాలని, తద్వారా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరిగి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతమ్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్విండో అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, నందిమళ్ల అశోక్, దేవకుమార్, ధర్మానాయక్, మాధవరెడ్డి, మహేశ్వర్రెడ్డి, చిట్యాల రాము, సురేష్, యాదగిరి, వాసు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాత పింఛన్ను పునరుద్ధరించాలి
పాన్గల్: రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ధరలకు అనుగుణంగా మెరుగైన ఫిట్మెంట్తో పాటు 2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొని మాట్లాడారు. బకాయిపడ్డ 6 డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ను పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలు చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు శాపంగా మారిన జీఓ నంబర్ 25ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య 50 దాటితే తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున నియమించాలన్నారు. అంతకుముందు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మల్లేష్కుమార్, ప్రధానకార్యదర్శి రాముడు, జిల్లా కార్య దర్శి గడ్డం మురళి, సూరయ్య, సంఘం సీనియర్ సభ్యులు శ్రీరాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్లు లేని పాఠశాల ఉండొద్దు
వనపర్తి: జిల్లాలో మరుగుదొడ్డి లేని పాఠశాల లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్మాణంలో ఉన్న అన్ని పనులు సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, విద్యా, గ్రామీణాభివృద్ధి, జిల్లా సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో కొనసాగుతున్న నిర్మాణాలపై చర్చించారు. పెబ్బేరు మండలానికి గవర్నర్ నిధుల నుంచి మంజూరు చేసిన రూ.15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు 4 బోర్లు వేయించడం వంటి పనులు ఇంకా పూర్తిగాకపోవడానికి కారణాలు ఏమిటని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన వేంకటేశ్వరస్వామి ఆలయ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా నాణ్యతగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడైనా పాఠశాలలో మరుగుదొడ్లు లేకుంటే వెంటనే తన దృష్టికి తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఇందిరాశక్తి భవనం త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని, జిల్లాకు 133 గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు మంజూరుకాగా.. పనులు పురోగతిలో ఉన్న 53 భవన నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. 33 ఫుడ్ గ్రైన్ స్టోరేజ్ భవనాలు అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. సహాయ ఇంజినీర్లు రోజూ క్షేత్రస్థాయికి వెళ్లి పనుల పురోగతిని పర్యవేక్షించాలని.. అందుకు సంబంధించిన ఫొటోలు తనకు పంపించాలని సూచించారు. అంగన్వాడీ, వీఓ భవనాలు, డీఎంఎఫ్టీ నిధుల ద్వారా చేపడుతున్న పనులు సైతం త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా స్థలం సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో వీబీజీ రాంజీ పథకంలో అత్యధిక పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ విజయ్కుమార్, ఇన్చార్జ్ డీఆర్డీఓ రామమహేశ్వర్రెడ్డి, సీపీఓ హరికృష్ణ, డీడబ్ల్యూఓ సుధారాణి, పంచాయతీరాజ్ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
జిల్లా వైద్యాధికారిగా డా. భాస్కర్నాయక్
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా డా. భాస్కర్నాయక్ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్హెల్త్ డా. రవీంద్రనాయక్ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఎంహెచ్ఓగా కొనసాగుతున్న డా. సాయినాథ్రెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంతకాలంగా వైద్య, ఆరోగ్యశాఖలో చెప్పకోదగిన సంఘటనలు చోటు చేసుకోవడం.. వెనువెంటనే జిల్లా వైద్యాధికారిని మారుస్తూ ఉత్తర్వులు వెలువడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కోటిలింగేశ్వరస్వామికి అన్నాభిషేకం కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అన్నదాతలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలనే సంకల్పంతో ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమం చేపట్టి వివిధ పూజలు చేశారు. అన్నాభిషేకం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి వనపర్తిటౌన్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట, ప్రధాన కూడళ్లలో వాహనదారులకు జాతీయ జెండాలను పంపిణీ చేసి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ బచ్చు రాము, రాష్ట్ర మాజీ కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, సబిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతూరి బుడ్డన్న, ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బాశెట్టి శ్రీనివాసులు, మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేలమ్మ, జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి గద్వాల: ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొట్టడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ప్రభుత్వ కళాశాలలకు రాత పుస్తకాలు
● తొలిసారి రాత పుస్తకాలతో పాటు, యూనిఫాం పంపిణీ ● ఉమ్మడి జిల్లాలో 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు.. ● 40,382 మంది విద్యార్థులకు లబ్ధి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా రాత పుస్తకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు యూనిఫాం కూడా అందించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో ఉన్న 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రాత పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే 38 కళాశాలలకు నోటుపుస్తకాలు చేరాయి. మిగిలిన 23 కళాశాలలకు మరో రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కళాశాలలకు చేరిన రాత పుస్తకాలను మంగళవారం పలు కళాశాలల్లో విద్యార్థులకు అందజేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న ప్రతి విద్యార్థికి 12 నోటుపుస్తకాల చొప్పున పంపిణీ చేయనున్నారు. యూనిఫాంలు కూడా.. నోటుపుస్తకాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తొలిసారిగా యూనిఫాంలను కూడా ప్రభుత్వం అందించనుంది. ఇందుకు సంబంధించిన యూనిఫాం క్లాత్ ఎంఈఓ కార్యాలయాలకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మహిళా సంఘాలకు క్లాత్ను అందించి, మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలను కుట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. కుట్టు ప్రక్రియ పూర్తయిన అనంతరం విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేయనున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఒకవైపు విద్యార్థులకు అవసరమైన నోటుపుస్తకాలను అందిస్తూనే.. మరోవైపు యూనిఫాం కూ డా ఇవ్వడం ద్వారా ప్రభు త్వ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు, హాజరు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. -
85.590 మి.యూ.విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో మంగళవారం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 49.266 ఎంయూ, దిగువ కేంద్రంలోని 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 36.324 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 85.590 ఎంయూ విద్యుదుత్పత్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 40,537 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
వీపనగండ్ల: సంక్షేమ పథకాల అమలులో మామూళ్లు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పుర్గర్చర్లలో కల్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.10 వేలు లంచం తీసుకున్నారని లబ్ధిదారు తెలుపగా వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవనం, కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. భీమా కాల్వ నుంచి శ్రీరంగాపురం రిజర్వాయర్కు సరిపడా సాగునీరు అందేవిధంగా కాల్వల విస్తరణకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ అధికారులు రైతులకు అందజేస్తున్న ట్రాన్స్ఫార్మర్లతో పాటు పరికరాల వివరాలను అందజేస్తే రైతులందరికి తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేలా చూస్తామన్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కేఎల్ఐ, జూరాల కాల్వల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, ఆరుతడి పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, సర్పంచ్లు మీసాల పార్వతమ్మ, రామన్గౌడ్, సుదర్శన్రెడ్డి, రాత్లావత్ గోపాల్, బండారు రాములు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం
వనపర్తిటౌన్: సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్కు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జీవితం ప్రభుత్వ సేవకు అంకితమై విధులు నిర్వర్తిస్తుంటే.. పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతతో గౌరవప్రదమైన జీవితం గడపడానికి పింఛన్ ఎంతో ముఖ్యమని చెప్పారు. సీపీఎస్ ఉద్యోగులు తమ భవిష్యత్తో పాటు కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకొని సీపీఎస్ రద్దు చేసేందుకు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి సాయిచందర్రెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్కుమార్, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు బౌద్ధారెడ్డి, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీనివాసులు, టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధానకార్యదర్శి శశి, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర బాధ్యులు మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
మదనాపురం: రైల్వేలైన్ విస్తరణలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. మండల కేందరంతో పాటు మండలంలోని కొన్నూరు, నర్సింగాపురం, ద్వారకనగర్ గ్రామాల్లో మొత్తం 125 మంది రైతులు రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోగా.. ఆదివారం కొన్నూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి రూ.3,73,91,502 నష్ట పరిహారం చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రాంతీయ అభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. భూమి కోల్పోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా తగిన పరిహారం చెల్లించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రసూల్బీ, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
‘జైల్భరో విజయవంతం చేద్దాం’
అమరచింత: కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం నిర్వహించే జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అఖిల భారత ఐక్యరైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజన్న, ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం జైల్భరోకు సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని దుకాణ యజమానులకు పంపిణీ చేసి మాట్లాడారు. దేశసంపదంతా అదాని, అంబానీలకు కట్టబెడుతూ కార్మికుల్ని మరింత బానిసలుగా, రైతుల్ని పేదలుగా మార్చడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు. కార్మిక చట్టాలను తిరిగి సాధించుకునే వరకు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, మసలమని, కురుమన్న, ఏసన్న, కుర్మానాయక్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. రేపు బీచుపల్లిలోసీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా నిర్వహించే రాములోరి కల్యాణోత్వసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. యునెస్కో గుర్తింపు కల్పించండి అలంపూర్: అలంపూర్ క్షేత్రానికి యునెస్కో గుర్తింపు కల్పించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్రావు కోరారు. ఈ మేరకు ఆదివారం నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపూర్లోని పురాతన ఆలయాల సముదాయం గత చరిత్ర, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. అదే విధంగా అలంపూర్ క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రసాద్ స్కీం భవనంలో భక్తులకు అన్నప్రసాద సత్రం, వసతి గృహాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. విద్యా సమానత్వం కోసం ప్రజలు పోరాడాలి అచ్చంపేట రూరల్: విద్యా సమానత్వం కోసం ప్రజలు పోరాడాల్సిన అవసరముందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నిర్వహించిన పాలమూరు అధ్యయన వేదిక జిల్లాశాఖ కన్వీనర్, సామాజికవేత్త బాలజంగయ్య 4వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విద్య వ్యాపార వస్తువుగా మారిపోయిందని.. మార్కెట్లో అధిక ధరకు విక్రయించే సరుకుగా విద్యను మార్చడం ఆందోళనకరమన్నారు. దేశంలో కామన్ స్కూల్ విద్యావిధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శతాబ్దాల క్రితమే వివిధ దేశాల్లో ప్రజల సామాజిక అవసరాలకు అనుగుణంగా ఈ విధానం అమలులోకి వచ్చిందన్నారు. దేశంలో సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోయే వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అన్నారు. ఇటీవల యువత చేపట్టిన ఉద్యమాలు అనేక సామాజిక అంశాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చాయన్నారు. బలమైన రాజకీయ, సామాజిక శక్తులు సైతం యువత ఉద్యమాల ముందు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రజలు, యువత అప్రమత్తంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పాలమూరు అధ్యయన వేదిక హైదరాబాద్ కమిటీ మెంబర్ ప్రొ. జి.విజయ్, డా. శ్రీనివాస్, పీబీ స్వామి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శ్రీశైలం పాల్గొన్నారు. -
మత్తు.. భవిత చిత్తు!
చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువతరం ● మద్యం, గంజాయి, అశ్లీల వీడియోల మత్తులో.. ● జిల్లాలోని 25 మందిపై కేసులు నమోదు చేసిన సైబర్ పెట్రోలింగ్ విభాగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ, .. స్మార్ట్ఫోన్ల వినియోగంపై నియంత్రణ కరువు పర్యవేక్షణే కీలకం.. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? స్మార్ట్ఫోన్లలో ఏం చూస్తున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలి. వారితో నిత్యం కొంత సమయం గడుపుతూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి.. వాటిలోని మంచి, చెడులను అర్థమయ్యేలా వివరిస్తూ స్నేహపూర్వకంగా మెలగాలి. వారికి ఏదైన సమస్య ఉంటే మనతో చెప్పుకొనేలా మలుచుకోవాలి. వారిని క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలవైపు దృష్టి సారించేలా ప్రయత్నించాలి. విస్తృత అవగాహన అవసరం యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు పోలీస్, ఎకై ్సజ్, వైద్య, విద్య, యువజన సంక్షేమ శాఖలు ప్రస్తుతం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. యువత విద్య, ఉపాధి అవకాశాల్లో సాధించిన అంశాలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు చేరవేసి అందివచ్చిన సాంకేతికతను సక్రమ మార్గంలో వినియోగించుకునేలా నిత్యం అవగాహన కల్పించాలి. ఉదయం ప్రార్థన సమయంలో ప్రముఖుల విజయగాథ వినిపిస్తూ.. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలని నింపాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, చట్టపరమైన పరిణామాలు, మానసిక, శారీరక ప్రభావాలను సైతం వివరించాలి. వనపర్తి: ఉన్నత చదువులతో జీవితానికి బంగారు బాటలు వేసుకోవాల్సిన యువత చెడు వ్యసనాలతో పెడదోవపడుతోంది. కళ్లెదుటే భవిష్యత్ తరం మద్యం, గంజాయి, అశ్లీల వీడియోల కేసులో నిందితులై ఉజ్వల భవిష్యత్ను చేతులారా నాశనం చేసుకోవడం.. ఏటా కేసుల సంఖ్య పెరగుతుండటం ఆందోళనకర సంకేతాలేనని చెప్పవచ్చు. తాము కష్టాల ఊబిలో నుంచి వచ్చాం.. తమ పిల్లలకు ఆ పరిస్థితులు రావద్దని, వారి భవిష్యత్పై ఎన్నో కలలుగన్న తల్లిదండ్రులు ఏమరపాటుతో కల్పించే స్వేచ్ఛ, సౌకర్యాలు వారిని పెడదోవ పట్టిస్తున్నాయని పలు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో పాటు స్మార్ట్ఫోన్లలో నిషేధిత అశ్లీల వీడియోలకు బానిసలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరదాగా మొదలయ్యే అలవాట్లు క్రమంగా వ్యసనంగా మారి చదువు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తెరపై విష సంస్కృతి.. నేటి యువతరం చేతికి స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వీటిని చదువులో అదనపు సమాచారం, ఆధునిక విద్యావిధానం కోసం వినియోగించేవారు కొందరైతే.. మరికొందరు ఇతర వ్యసనాలకు వినియోగిస్తూ కేసుల బారిన పడుతున్నారు. అశ్లీల, హింసాత్మక కంటెంట్కు కూడా సులభంగా చేరువవుతూ బానిసలవుతున్నారు. చెడు వైపు అడుగులు.. ఏడాది వారీగా నమోదైన కేసులు -
క్రీడలతో ఉన్నత విలువలు
వనపర్తిటౌన్: క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన వంటి ఉన్నత విలువలను నేర్పుతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆరేపల్లి వెంకటేశ్వర్లు స్మారక 72వ స్టేట్ సీనియర్ మెన్, ఉమెన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ శారీరక దృఢత్వంతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంపొందించే క్రీడన్నారు. క్రీడాకారులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని నిరంతరం సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని సూచించారు. ఒలింపిక్స్లో మహబూబ్నగర్ జిల్లా నుంచి పాల్గొని పతకాలు సాధించి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో మహిళల భాగ్యస్వామ్యం పెరుగుతుండటం ఆనందకర విషయమని, తమ ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జీవితంలో గెలుపు, ఓటమి సహజమని, సమానంగా స్వీకరించే ఓర్పు, క్రమశిక్షణ క్రీడలతోనే అలవడుతాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు శ్రీనివాస్గౌడ్, భాస్కర్గౌడ్, రవీందర్రెడ్డి, రామ్మోహన్రావు, కోచ్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి బాబా, ద్వారపోగు విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. మహిళల జట్టు : విన్నర్ రంగారెడ్డి, రన్నర్ వరంగల్. పురుషుల జట్టు : విన్నర్ వరంగల్, రన్నర్ నల్గొండ. -
శుద్ధజలం.. పుష్కలం!
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొల్లాపూర్: మిషన్ భగీరథ పథకానికి నీటి కష్టాలు ఇకపై శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకానికి ప్రతి ఏటా వేసవిలో పలు సమస్యలు ఎదురయ్యేవి. రోజువారీగా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కేఎల్ఐ ప్రాజెక్టుపై తీవ్రమైన భారం పడేది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో కేఎల్ఐపై భారం తగ్గడమే కాకుండా.. మిషన్ భగీరథ స్కీంకు రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే వెసులుబాటు ఏర్పడింది. 84 మండలాలకు సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. నీటి అవసరాలు ఇలా.. మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీలు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్ భగీరత పథకానికి నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యేవి. శాశ్వత పరిష్కారం దిశగా.. మిషన్ భగీరథ స్కీం ప్రారంభమయ్యాక 2018లో నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటుచేసి, కేఎల్ఐ ప్రాజెక్టు వరకు నీటిని తరలించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 6కోట్ల మేరకు వెచ్చించింది. ఆ సమయంలో వరదలు రావడంతో సమస్య పరిష్కారమైంది. మళ్లీ నాలుగేళ్ల క్రితం కూడా నీటి తరలింపు సమస్య ఏర్పడింది. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి, తాగునీటి సమస్యను తీర్చారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. తీరిన ఇక్కట్లు.. తాగునీటి అవసరాలకు ఇన్నాళ్లు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిపైనే అధారపడిన అధికారులు.. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిని కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు కాగా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. వేసవికి ముందు నార్లాపూర్ రిజర్వాయర్ను నింపితే చాలు, మిషన్ భగీరథ స్కీంకు చాలినన్ని నీరు లభిస్తాయి. మిషన్ భగీరథ పథకానికి తీరిన నీటి కష్టాలు ఇకపై కేఎల్ఐతో పాటు పాలమూరు ప్రాజెక్టు నుంచి పంపింగ్ ఏడాది పొడవునా తాగునీటికి బేఫికర్ శాశ్వతంగా తీరనున్న తిప్పలు ఇకపై సమస్య ఉండదు.. గతంలో రెండు పర్యాయాలు వేసవిలో కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీటిి తరలింపునకు సమస్యలు ఎదురయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కావడం.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నూతనంగా నిర్మిస్తున్న చానల్ ద్వారా నీటిని తరలించే పనులు చివరి దశకు చేరడంతో మిషన్ భగీరథ స్కీంకు ఇకపై నీటి సమస్య ఉండదు. శాశ్వతంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు. – అంజాద్ పాషా, డీఈఈ -
సాగు సంబురం
జూరాల, రామన్పాడు జలాశయాలకు జలకళ ● ఆయకట్టులో జోరందుకున్న సాగు పనులు ● వరి, ఆముదం, కంది, పత్తి సాగుపైనే రైతుల ఆశలు ● నీరులేక సరళాసాగర్ ఆయకట్టు వెలవెల ●మదనాపురం: వర్షాభావ పరిస్థితులతో అల్లాడిన అన్నదాతల కళ్లలో ఆనందాన్ని నింపుతూ ఇటీవల కురిసిన వర్షాలు నేలతల్లికి జీవం పోశాయి. వరుణుడి కరుణతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాల జలాశయానికి చేరి ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిగండాన్ని పూర్తిగా తొలగించింది. రామన్న్పాడు జలాశయానికి వరద చేరడంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగడంతో జలకళను సంతరించుకుంది. దీంతో నేరుగా రామన్పాడు జలశయానికి నిరంతరం నీటిని వదులుతున్నారు. ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమమైంది. వర్షాలు ఆలస్యం కావడంతో బోరుబావుల కింద మాత్రమే అరకొరగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు కాల్వల ద్వారా నీరు విడుదల అవుతుండటంతో సాగుపనులు ముమ్మరం చేశారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఆత్మకూర్, అమరచింత మండలాలకు, రామన్పాడు జలాశయం నుంచి కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, గోపల్దిన్నె రిజర్వాయర్ ద్వారా వీపనగండ్ల, పాన్గల్, గణప సముద్రం ద్వారా ఖిల్లా ఘనపురం మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆముదం, పత్తి, కంది సాగు చేసిన రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. రామన్పాడు జలాశయంలో నీటిమట్టం అన్నదాతలు బిజీ.. బిజీ... -
పెట్టుబడిపై నమ్మకం కలిగింది..
మాది రామన్పాడు జలాశయం పరిధిలోని అజ్జకొల్లు గ్రామం. వానాకాలం ఆరంభంలో వర్షాలు ఆలస్యం అవుతాయేమోనని చాలా భయమేసింది. కురవవు అనుకున్న సమయంలో వరణుడు కరుణించడంతో పాటు రామన్పాడు నుంచి నీరు వదలడం మాకు వరంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్నాం. వర్షాల పుణ్యమా అని ఈసారి పెట్టిన పెట్టుబడికి గింజ పండుతుందన్న నమ్మకం ఏర్పడింది. – తోకల రవి, రైతు, అజ్జకొల్లు (మదనాపురం) సాగు పనులు ముమ్మరం.. ఇటీవల కురిసిన వర్షాలు, ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందుతుండటంతో జిల్లాలో సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు అన్నదాతలకు వరంలా మారాయి. భూమిలో తగినంత తేమ శాతం రావడంతో దుక్కులు సులభతరమయ్యాయి. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి -
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కృషి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హాశాంతివనంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ రెండో రోజు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను చదవలేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే పోటీ ప్రపంచంలో సమర్థంగా రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పీయూను నల్లగొండకు కేటాయించి నాగార్జునసాగర్తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. పాలమూరు ప్రాంతానికే యూనివర్సిటీ అవసరాన్ని వివరించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేశామన్నారు. ఉషా నిధులతో పీయూ అభివృద్ధి.. పీయూ అభివృద్ధికి ఉషా నిధులతో వేగం పుంజుకుందని వీసీ శ్రీనివాస్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాలతో పాటు పలు హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, సెమినార్ కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలి భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు యువత కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, నూతన వనరుల వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత యువత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ పరిశోధనలు, స్టార్టప్లు, నూతన ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా కొనసాగినప్పుడే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచేవిద్యా ప్రమాణాల పెంపు పోటీ ప్రపంచంలో రాణించాలంటేనాణ్యమైన విద్య తప్పనిసరి పీయూ నేషనల్ సెమినార్ ముగింపుకార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హాజరైన ఎంపీ డీకే అరుణ, వీసీ శ్రీనివాస్, ప్రొఫెసర్లు -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
వనపర్తిటౌన్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నీని ఆయన జ్యోతి వెలిగించి, జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం చాలా ముఖ్యమని, ఏ రంగంలో ఆసక్తి ఉంటే అందులో ప్రతిభ చాటాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసికోల్లాసం, ఏకాగ్రత పెంపొందుతాయన్నారు. జాతీయ క్రీడాకారుడు భాస్కర్గౌడ్, సీనియర్ క్రీడాకారుడు రవీందర్రెడ్డి ప్రోత్సాహంతో నిర్వహించిన పోటీలకు మహబూబ్నగర్ బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు పి.మన్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రామారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. మొదటిరోజు పోటీల్లో నిజామాబాద్ కరీంనగర్పై 35–29, 35–14 తేడాతో, రంగారెడ్డి ఖమ్మంపై 35–22, 35–14, వరంగల్ మహబూబ్నగర్పై 35–23, 35–10 తేడాతో విజయం సాధించాయి. మహిళా విభాగంలో మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ముందంజలో ఉన్నాయి. పురుషుల విభాగంలో రంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జట్లు సెమీ ఫైనల్స్కు చేరాయని, మహిళా విభాగంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జట్లు సెమీ ఫైనల్కు చేరే అవకాశాలు ఉన్నాయని డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వి.వెంకటరమణ, సంయుక్త కార్యదర్శులు కమల్కుమార్, బి.శ్యామ్, తిరుపతి, నారాయణరెడ్డి, తాడిపర్తి సర్పంచ్ లోకారెడ్డి, చీఫ్ రెఫరీ రామకృష్ణారెడ్డి, ఎన్.కృష్ణారెడ్డి, టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఈశ్వర్, వరప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. సరళాసాగర్కు శాపం..
జూరాల, రామన్పాడు జలాశయాల ఆయకట్టు పంటల సాగుతో కళకళలాడుతుంటే.. చారిత్రాత్మక సరళాసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో మాత్రం నిరుత్సాహమే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద దంతనూరు, శంకరమ్మపేట, మదనాపురం, తిరుమలాయ్యపల్లి, అజ్జకొల్లు, రామన్పాడు, చర్లపల్లి, నెల్విడి, నర్సింగాపురం, కొన్నూరు గ్రామాలకు చెందిన సుమారు 4,200 ఎకరాల ఆయకట్టు ఉంది. యాసంగిలో నీటిపారుదలశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు ప్రణాళిక, కనీస నియంత్రణ లేకుండా సరళాసాగర్ జలాశయంలోని నీటిని అట్టడుగు భాగం వరకు వదిలారు. కొందరు రైతులు మోటార్లతో ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతున్నా పట్టించుకోలేదు. ఫలితంగా ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయింది. ప్రస్తుతం రామన్పాడు నుంచి సరళాసాగర్కు వారం రోజులుగా రెండు మోటార్లతో నీటిని తరలిస్తున్నా ప్రాజెక్టులో కనీసం 10 అడుగుల నీటిమట్టం రావడానికి మరో పదిరోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆయకట్టుకు నీటిని వదలనున్నారు. ఈలోగా అన్నదాతలకు అత్యంత కీలకమైన వరి నారుమడులు పోసుకునే సమయం పూర్తిగా దాటిపోనుంది. ప్రస్తుతం నాట్లు వేసే సమయం ముగిసిపోతున్న తరుణంలో మొక్కుబడిగా మోటార్లు ప్రారంభించడంతో ఒరిగేదేమి లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. -
మా గురించి ఎవరికీ పట్టదు
అడవిలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోయి బతకడం కష్టంగా మారింది. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ అధికారులు మా వైపే చూడటం లేదు. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నాం. అప్పుడప్పుడు దాతలు వచ్చి దుస్తులు, దుప్పట్లు, సరుకులు ఇస్తున్నారు. చెంచులకు గతంలో మాదిరిగా ప్రత్యేక ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – లింగేష్, సార్లపల్లి పథకాలు అందేలా చూస్తాం.. చెంచు, గిరిజనులకు ప్ర భుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం. చెంచుల కు టుంబాల పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, పోషకా హారం, కేంద్ర ప్రభుత్వ జన్ ధన్ వంటి పథకాల అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. – యాదిగిరి, ఆర్డీఓ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ -
అసత్య ఆరోపణలు మానుకోవాలి : ఎమ్మెల్యే
వనపర్తి: కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా.. రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగునీటి పారుదల విషయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీడియాతో మాట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు. ఎంజీకేఎల్ఐ లిఫ్ట్–1 పంపులను ఈ నెల 1న ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి ఇప్పటి వరకు 2.7 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్లూరు రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 0.355 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.34 టీఎంసీలు, సింగోటం రిజర్వాయర్ సామర్థ్యం 0.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.40 టీఎంసీలు, జొన్నలబొగడ రిజర్వాయర్ సామర్థ్యం 2.14 టీఎంసీలు కాగా.. 7వ తేదీ నాటికి 1.753 టీఎంసీల నీటి నిల్వ ఉందని వివరించారు. మూడు పంపులతో ఇన్ఫ్లో 2,400 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,100 క్యూసెక్కులుగా నమోదైందన్నారు. కేఎల్ఐ 29 ప్యాకేజీ ఎడమ కాల్వ నుంచి 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవాలు కళ్ల ముందు ఉండగా.. మోటార్లు ఇంకా ప్రారంభించలేదని, సాగునీరు ఇవ్వడం లేదని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎల్నినో సాకు సరికాదు : బీఆర్ఎస్ వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్నినో పేరు చెప్పి పంటలకు నీరు వదలకుండా రోజులు గడుపుతోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ఆరోపించారు. శనివారం పెబ్బేరులోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పార్టీ నేతలకు వ్యవసాయంపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. ప్రస్తుత వర్షాలకు వస్తున్న వరదను ఎలా వినియోగించుకోవాలనే ధ్యాస కూడా లేదని.. జలాశయాల నుంచి నీరు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అనుక్షణం హెచ్చరిస్తున్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కాల్వలకు నీటిని వదలడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 11న నార్లాపూర్ను ముట్టడిస్తామని హెచ్చరించడంతోనే కాల్వలకు నీరు వదిలారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు కర్రె స్వామి, శంకర్నాయుడు, దిలీప్కుమార్రెడ్డి, వనం రాములు, రాజశేఖర్, సాయినాథ్, మన్యం, సాయిరెడ్డి, వడ్డే రమేష్, తదితరులు పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణం కరువు ● 35 వేల జనాభాకు ఏర్పాటు చేయని వైనం ● వాకింగ్ , రన్నింగ్కు ప్రైవేట్ స్థలాలే దిక్కు ● పట్టని పాలకులు, అధికారులు వివరాలు 9లో... -
పీఎంశ్రీపై నీలినీడలు..!
జిల్లాలో మూడోవిడతకు 24 ఉన్నత పాఠశాలలు ఎంపిక ● ఏడాది గడుస్తున్నా.. ప్రతిపాదనలకే పరిమితం ● వసతులు, డిజిటల్ విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు ● నైపుణ్య కోర్సులను కోల్పోతున్న వైనం ఆమోదం రావాల్సి ఉంది.. జిల్లాలోని 24 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మూడోవిడత పీఎంశ్రీ పథకం అమలుకు ప్రతిపాదించాం. ఇప్పటి వరకు వాటికి ఆమోదం లభించలేదు. ఆమోదం లభిస్తేనే విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన విద్యను అందించడంతో పాటు పాఠశాలల రూపురేఖలు మారుతాయి. ఈ పథకంలో అధునిక సదుపాయాలకు నిధుల మంజూరుతో పాటు సివిల్ వర్క్స్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తారు. – శేఖర్, సెక్టోరియల్ అధికారి, వనపర్తి వనపర్తిటౌన్: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్స్థాయిలో తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంతికేక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంశ్రీ పథకం జిల్లాలో మూడోవిడత ప్రతిపాదనలకే పరిమితమైంది. మొదటి, రెండు విడతలు పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం మూడోవిడతలో 24 పాఠశాలలను ఎంపిక చేసి ఏడాది గడుస్తున్నా నేటికీ పెండింగ్లో ఉంచడంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయా పాఠశాలలకు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఆమోదం లభించకపోవడంతో విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. జిల్లాలో పీఎంశ్రీ పథకాన్ని దశల వారీగా అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మొదటి విడతలో 10 పాఠశాలలు ఎంపిక చేసి వాటిలో అభివృద్ధి పనులు, డిజిటల్ తరగతుల నిర్మాణం చేపట్టారు. ఆ విజయాన్ని ఆధారంగా చేసుకుని రెండోవిడతలో మరో 11 పాఠశాలలను ఎంపిక చేయగా కేంద్రం నిధులు మంజూరు చేసింది. వీటిలో 6 ప్రాథమిక పాఠశాలలు, 3 కేజీబీవీలు, 4 రెసిడెన్షియల్ పాఠశాలలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ), ఒక మోడల్ స్కూల్, 7 జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలకు డిజిటల్ పరికరాలు, నిధులు అందడంతో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు సమకూరాయి. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా మిగిలిన పాఠశాలల విద్యార్థులకు కూడా ఆయా ప్రయోజనాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు మూడోవిడతలో 24 జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించారు. ఏడాది గడుస్తున్నా ఆమోదముద్ర పడకపోవడంతో ఆయా పాఠశాలల విద్యార్థులు ముఖ్యమైన ప్రయోజనాలను కోల్పోతున్నారు. పాన్గల్లోని పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణలో విద్యార్థినులు (ఫైల్) -
పునరుద్ధరణ జరిగేనా..?!
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘార ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రారంభం కావడంతో నాలుగో యూనిట్ ప్రారంభానికి జెన్కో అధికారులు సిద్ధం చేశారు. వారం రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జెన్కో అధికారులు గురువారం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటం విశేషం. షార్ట్సర్క్యూట్ కారణంగా.. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటు చేసుకున్న షార్ట్సర్క్యూట్ కారణంగా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ఇచ్చే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రమాదం జరిగిన నాలుగో యూనిట్ను పునరుద్దరించే పనులు వివిధ కారణాలతో ఆలస్యమైనా.. ఎట్టకేలకు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎడమ గట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో యూనిట్లు 6 మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు ఒక యూనిట్లో చేపట్టే విద్యుదుత్పత్తి 150 మెగావాట్లు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రం వివరాలిలా.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ 162.81 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ప్రస్తుతం ఐదు యూనిట్లలో చేపడుతున్నది 750 మెగావాట్లు ఇదే తొలి ప్రమాదం.. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకు ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఆరేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధం చేస్తున్న నాలుగో యూనిట్ వరదలు వస్తుండటంతో వారంలో వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు 2020, ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృత్యువాత ఆరేళ్లుగా సా..గుతున్న మరమ్మతులు అందుబాటులోకి 150 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి రూ.14.93 కోట్లతో మరమ్మతు ప్రమాదం జరిగిన తర్వాత 2021లో నాలుగో యూనిట్ పనులు పునరుద్ధరించేందుకు మరమ్మతు చేపట్టిన అధికారులు ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్ను రూ.14.93 కోట్లతో మరమ్మతు చేపట్టి.. 2023లో పూర్తి చేసినా.. సాంకేతిక సమస్యలతో 72 గంటలు పనిచేసి మళ్లీ ఆగిపోయింది. దీనిపై జెన్కో అధికారులు కమిటీ వేసి పొరపాట్లు, లోపాలను గుర్తించింది. కాంట్రాక్టు సంస్థ పొరపాట్ల వల్లే ప్రమాదం సంభవించిందని, డిజైన్లోనూ లోపాలున్నాయని కమిటీ తేల్చింది. తిరిగి అదే సంస్థ పనులు చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల తర్వాత గతేడాది మాదిరిగానే మరోసారి మరమ్మతు చేపట్టగా.. మళ్లీ అదే తరహాలో 10 గంటలు పనిచేసి ఆగిపోయింది. అయితే రెండేళ్ల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జెన్కో అధికారులను ఆదేశించారు. దీంతో ఈసారి కాంట్రాక్టు సంస్థ, జెన్కో ఇంజినీర్ల పర్యవేక్షణలో మరమ్మతు చేపట్టి.. ట్రయల్ రన్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
రైస్మిల్లు యజమానిపై కేసు నమోదు
వనపర్తి రూరల్: పెబ్బేరులోని సాయిగోపాల ఇండోటెక్ ప్లాంట్ రైస్మిల్లు యజమానిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్గౌడ్ తెలిపారు. 2022–23 యాసంగి సీజన్లో ప్రభుత్వం అప్పగించిన వరి ధాన్యం లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు పౌరసరఫరాల అధికారులు గుర్తించారన్నారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి సీఎంఆర్ పూర్తిస్థాయిలో అందించకపోవడంతో సుమారు రూ.10 కోట్లకుపైగా నష్టం వాటినట్లు ప్రాథమికంగా నిర్ధారించారని, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. సంఘటితంతోనే ఉత్తమ ఫలితాలు అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం బలోపేతానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని నాబార్డు డీడీఎం మనోహర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2019లో ప్రారంభమైన సంఘం ప్రస్తుతం గుర్తింపు పొందిన స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. చేనేత కార్మికులు సంఘటితంగా పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరని తెలిపారు. కార్యక్రమంలో వీవర్ సర్వీస్ సెంటర్ శ్రీనివాసులు, సంఘం సీఈఓ చంద్రశేఖర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఘనంగా చేనేత ర్యాలీ.. జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులంతా పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి జై చేనేత అంటూ నినాదాలు చేశారు. బస్టాండ్ కూడలిలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్ధ చేనేత కా ర్మికులను పాలకవర్గం సన్మానించింది. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తిరుమల రఘురాం, కోటకొండ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు, కౌన్సిలర్లు మేర్వ రాజు, పారుపల్లి ఉశన్న, అమరచింత చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు పారుపల్లి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మేర్వ అనిల్, కోశాధికారి మ్యాడం కృష్ణయ్య పాల్గొన్నారు. -
‘సీ్త్రనిధి’ సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సీ్త్రనిధి పథకంలో తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని సకాలంలో తిరిగి చెల్లించాలని.. వసూలు చేసిన డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగం చేసినా, అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీ్త్ర నిధి జోనల్ మేనేజర్ టీవీ రవికుమార్ అధ్యక్షతన ఏపీఎం, గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని రుణాలు గ్రౌండింగ్ చేశారు.. రికవరి ఎంత చేశారు అనే వివరాలను జోనల్ మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు, పురపాలికల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేసినా.. తిరిగి వసూలు చేసే విషయంలో జిల్లా చాలా వెనుకబడి ఉందని వివరించారు. కొందరు వీఓలు సభ్యుల నుంచి రుణాలు వసూలు చేసి బ్యాంకుకు చెల్లించకుండా దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. స్పందించిన కలెక్టర్ రుణాలు పొందిన సభ్యుల నుంచి డబ్బులు తిరిగి బ్యాంకుకు చెల్లించే విధంగా ఏపీఎంలు, వీఓలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మొండి బకాయిల కింద మారకుండా చూసుకునే బాధ్యత వీఓలదేనన్నారు. డబ్బులు బ్యాంకులో జమ చేయని వీఓలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు, వడ్డీ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వం సీ్త్ర నిధి పథకం ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తోందని.. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు అందించే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చూడాలని కోరారు. -
సమకూరే వసతులు..
పీఎంశ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్లు, స్మార్ట్ బోర్డులు, ఆన్లైన్ లెర్నింగ్ టూల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. కానీ మూడోవిడతలో ఎంపిక చేసి ప్రతిపాదించిన 24 ఉన్నత పాఠశాలలకు పథకం అమలు కాకపోవడంతో వేలాది మంది గ్రామీణ విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరమవుతున్నారు. సాధారణ పాఠ్యపుస్తకాలకే పరిమితమై ఆధునిక సాంకేతిక విద్యను నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. అలాగే ఆయా పాఠశాలల్లో ఉపాధి నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేకంగా వృత్తి విద్యా కోర్సులు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల నవీకరణను చేపడతారు. ఇవికూడా అందక విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితమవుతున్నారు. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన నైపుణ్య కోర్సులు, ఇంటర్న్షిప్ అవకాశాలు దక్కడం లేదు. చివరగా పీఎంశ్రీ పాఠశాలలను పర్యావరణహిత పాఠశాలలు (గ్రీన్ స్కూల్స్)గా రూపొందిస్తారు. సోలార్ ప్యానెళ్లు, వర్షపునీటి నిల్వ నిర్మాణాలు, శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేస్తారు. బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్లు సమకూరకపోతే వారి హాజరుపై ప్రభావం పడుతుంది. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక ర్యాంప్లు, ఆడిజం కేర్సెంటర్లు లేక వారు విద్యాభ్యాసంలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవచూపి తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి : ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా ఉత్సాహంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించగా.. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని, అండర్ ఇన్వెస్టిగేషన్, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్లు త్వరగా తెప్పించి ఛేదించాలని సూచించారు. ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని కోరారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఠాణాకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యను శ్రద్ధగా విని సత్వర పరిష్కారం అందించాలని కోరారు. పోలీస్శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే స్పందనలో మానవీయ దృక్పథం, సేవల్లో వేగం, దర్యాప్తులో నిబద్ధత ఉండాలన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీసు అధికారి తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించాలని, ప్రజలతో మమేకమై ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం వేగంగా చేరేలా చూడాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, దాబాలు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్హెచ్ఓలను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా తరచూ తనిఖీ చేసి సాంకేతిక సమస్యలుంటే వెంటనే మరమ్మతు చేయించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని, డ్రంకెన్ డ్రైవ్, నాకాబందీలు, నైట్ పెట్రోలింగ్ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సమీక్షలో డీఎస్పీ గిరిబాబు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
సత్వర సేవలకు అప్రమత్తంగా ఉండాలి
కొత్తకోట రూరల్/ఆత్మకూర్: అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులు, రోగులకు అత్యుత్తమ, నాణ్యమైన సేవలు అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని 108, 102 వాహనాల రాష్ట్ర ఫ్లీట్ హెడ్ వరప్రసాదరాజు సిబ్బందిని ఆదేశించారు. గురువారం కొత్తకోట, ఆత్మకూర్లోని 108, 102 వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య పరికరాల పనితీరు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న అత్యవసర వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి క్షతగాత్రులు, రోగులను సమీప ఆస్పత్రులకు సకాలంలో తరలించాలని.. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి, ఎగ్జిక్యూటివ్లు రత్నం, దుర్గాప్రసాద్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఖాజా మైనుద్దీన్, రాము, పైలట్లు అక్బర్, చంద్రశేఖర్, ఆత్మకూర్లో మెడికల్ టెక్నీషియన్లు శ్రీనివాస్, సంజీవ్, అజీం ఉన్నారు. -
నేటి యువతకు ఆదర్శం ప్రొ. జయశంకర్
వనపర్తి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి దిశగా యువత పయనించాలని ఎస్పీ డా. సునీతారెడ్డి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రొ. కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాది వేసిన మహోన్నత వ్యక్తి ప్రొ. జయశంకర్ అని కొనియాడారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, సమాన అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత, దూరదృష్టి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. జయశంకర్ ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునంద, సీఐ సుగంధ రత్నం, ిసీసీఎస్ సీఐ అశోక్కుమార్, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, రిజర్వ్ ఎస్ఐ వినోద్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి మహబూబ్గర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.మన్మోహన్రావు, వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రటనలో తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయని.. ఈ పోటీల్లో ఇదివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు సైతం పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలు సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో జరిగే 72వ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని వివరించారు. ‘కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతాం’ పాన్గల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధానకార్యదర్శి వంక గోపాల్, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యురాలు కళావతమ్మ తెలిపారు. సీపీఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గురువారం తెల్లరాళ్లపల్లి నుంచి వారు పాదయాత్ర ప్రారంభించి కేతేపల్లి, వెంగళాయిపల్లి, బండపల్లి, బహుదూర్గూడెం మీదుగా పాన్గల్కు 10 కిలోమీటర్లు పూర్తి చేశారు. వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. -
ఏఐపీ హబ్గా వనపర్తి ఐటీఐ
● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ వనపర్తి: సంస్థానాధీశుల కాలం నుంచే విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చే వనపర్తికి విద్యాపర్తిగా పేరొచ్చింది. తాజాగా వనపర్తి ఐటీఐని ఏఐపీ (అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్) హబ్గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) క్లస్టర్–8 లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది. రూ.240 కోట్లతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1953లోనే వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో సాంకేతిక విద్య, ఉన్నత విద్యకు నిలయంగా మారింది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో వనపర్తి ఐటీఐకి గద్వాల, మహబూబ్నగర్ బాలికలు, డిండి, మన్ననూరు ఐటీఐలను అనుసంధానం చేస్తూ ఏఐపీ హబ్గా ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించగా ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఉన్నత విద్యతో పాటు పారిశ్రామిక విద్యలోనూ రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలవనుంది. రాష్ట్రంలోని ప్రముఖ నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో వనపర్తి ఒకటిగా మారనుంది. ఈ ప్రాజెక్టుతో వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ల్యాబ్లు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, ఏఐ తదితర కోర్సులు, అధునాతన మిషన్ల తయారీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. -
మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత
వనపర్తి: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని అన్నివర్గాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమెతో పాటు జెడ్పీ సీఈఓ యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మానవ అక్రమ రవాణాతో మహిళలు, బాలికలు, చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలు, రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉద్యోగాలు, విదేశీ ఉపాధి, విద్య పేరుతో తప్పుడు హామీలిచ్చి మోసం చేయడం, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకొని వల వేయడం, నకిలీ వివాహలు, చిన్నారులను ప్రలోభపెట్టడం లేదా అపహరించడం వంటి మార్గాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందన్నారు. ఇలాంటి ముఠాల బారిన పడితే వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం, శారీరక–మానసిక హింసకు గురికావడం, చదువు, భవిష్యత్ దెబ్బతినడం, కుటుంబాలకు దూరమవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. అనంతరం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుబడి పని చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్ఐ అంజాద్, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
మదనాపురం: గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) ప్రకారం జిల్లాలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రణాళికతో చేపట్టి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం మండలంలోని నర్సింగాపూర్లో పర్యటించి ఫాంపాండ్ నిర్మాణానికి గుర్తించిన స్థలం, మార్కింగ్ ప్రక్రియను పరిశీలించి భూమిపూజ చేశారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను రూపొందించి ప్రజలకు ఉపయోగపడేలా సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రతి పనిలో నాణ్యతతో పాటు పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ యాదయ్య, డీపీఓ రఘునాథ్, ఎంపీడీఓ, సర్పంచ్, సెర్ప్ ఏపీఎం, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు ఉన్నారు. -
ఉపాఽధి అవకాశాలు పెరుగుతాయి..
వనపర్తి ఐటిఐని హబ్గా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతిక విద్యా విధానాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చదువుకున్న ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ది చేసేందుకు ఏఐపీ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కలగనుంది. గ్రామీణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించి దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు సాధించుకునే అవకాశాలు పెరగనున్నాయి. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి ● -
ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ
వనపర్తి: జిల్లాకేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులు, సమస్యలను వివరిస్తూ ఈ నెల 3న సోమవారం ‘ప్రజారోగ్యంపై పట్టింపేది’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు (25), అసోసియేట్ ప్రొఫెసర్లు (43), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (29), ట్యూటర్ (30) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన, 33 మంది సీనియర్ రెసిడెంట్లను గౌరవ వేతనం ఇచ్చే విధానంలో భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 12న తగిన విద్యార్హత ధ్రువపత్రాలతో వాక్–ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని, దరఖాస్తుఫారాలు, ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ఈ ప్రకటన కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. మల్లికార్జున్ సంయుక్తంగా జారీ చేశారు. ఈ నెల 3న ‘సాక్షి’లో ప్రచురించిన కథనం -
పంటమార్పిడిపై దృష్టి సారించాలి
వనపర్తి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా పంటమార్పిడిని ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని రైతులు వరి సాగుపై మొగ్గు చూపినా.. రానున్న వాస్తవ పరిస్థితులను వారికి వివరించి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించేలా మండల వ్యవసాయ అధికారులు కృషి చేయాలన్నారు. జూరాల ప్రాజెక్టు నిండటంతో కేవలం 10 శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటి లభ్యత ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులు వేరుశనగ, ఆయిల్పాం, ఉల్లి, కూరగాయలు, కంది, మినుము తదితర పంటలు సాగు చేసేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యంగా నిర్దేశించినందున తప్పనిసరిగా సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి రోజూ ప్రగతి నివేదికలను సమర్పించాలని కోరారు. ఆయా అంశాలపై ప్రతి వారం సమీక్ష ఉంటుందని.. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ప్రత్యామ్నాయ పంటల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ వివరాల ఆధారంగా రైతులకు ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఫోన్కాల్స్ పంపించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఎంఏఓలు పాల్గొన్నారు. -
ఉపాధి పొందుతున్నా..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. తర్వాత సంఘంలో సభ్యత్వం పొందడంతో మగ్గం, ముడి సరుకు అందించారు. తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధికంగా వేతనం చెల్లిస్తున్నారు. ఐదేళ్లుగా నెలకు రెండు జరి చీరలు తయారు చేస్తూ రూ.10 వేల వేతనం పొందుతున్నా. – మహంకాళి బాలస్వామి, నేత కార్మికుడు, అమరచింత అప్పట్లో మాస్టర్ వీవర్స్తో అడ్వాన్స్గా డబ్బులు తీసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. వాటిని విక్రయించాక తిరిగి డబ్బులు చెల్లించేవాళ్లం. ఇప్పడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారి వేతనం బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో ఖర్చులు తీరుతున్నాయి. – పుట్టా శ్రీనివాసులు, నేత కార్మికుడు, అమరచింత గతేడాది చేనేత ఉత్పత్తుల సంఘంలో సభ్యుడిగా చేరా. నెలకు రెండు చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో చేనేత కూలీ దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్రస్తుతం సంఘం అన్నీ భరిస్తూ ముడిసరుకు ఇవ్వడంతో పాటు వేతనం చెల్లించడం, లాభాల్లో వాటా పంచుతోంది. దీంతో కార్మికుడిగా కాకుండా యజమాని అనే ఆలోచనతో మగ్గాలపై చీరలు తయారు చేస్తున్నాం. – ఎం.లక్ష్మణ్, నేత కార్మికుడు, అమరచింత పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. చేనేతను కాపాడాలని, కార్మికులను యజమానులు చేయాలనుకొని నాబార్డు బృందంతో సంప్రదించి సంఘం ఏర్పాటుకు ప్రయత్నాలు చేశా. కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సంఘం ఏర్పాటు చేశా. 20 మందితో ప్రారంభించి నేడు 550 కార్మికుల భాగస్వామయ్యంతో సంఘం కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు ప్రతినెల వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం కంపేనీకి 11 ఎలక్ట్రికల్ జకాటీ మగ్గాలు వచ్చాయి. వీటితో కొత్త డిజైన్లతో పాటు చీరల తయారీ పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. – మహంకాళి శేఖర్, సీఈఓ, అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం ● -
ప్రత్యామ్నాయ సాగు బాధ్యత వ్యవసాయ అధికారులదే..
వనపర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణశాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎల్నినో పరిస్థితులు, పంటమార్పిడి, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, మిషన్ భగీరథ తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వర్షపాతం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై చర్చించారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉందని, ఉమ్మడి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఒకసారి నిండితే సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతుందని నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పంటల మార్పిడిపై లక్ష్యాలు నిర్దేశించి వాటి అమలును నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. జిల్లాలో వేరుశనగ, మినుములు, కంది సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని.. వేరుశనగ సాగు విస్తీర్ణాన్ని 30 వేల నుంచి 40 వేల ఎకరాలు, మినుము సాగును 30 వేల ఎకరాలకు పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉద్యానశాఖ పనితీరును సమీక్షిస్తూ ఆయిల్పాం లక్ష్యాలపై పలు సూచనలు చేశారు. ఆయిల్పాం సాగు లక్ష్యాన్ని 6 వేల ఎకరాలకు పెంచాలని, కూరగాయల సాగు 7 వేల ఎకరాల్లో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని గుడిసెలను ఇందిరమ్మ ఇళ్ల పథకం పరిధిలోకి తీసుకురావడంతో పాటు రూఫ్ రీప్లేస్మెంట్ అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రూఫ్ రీప్లేస్మెంట్కు అర్హులైన కుటుంబాలను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎల్–1 జాబితాలో అర్హులైన కుటుంబాల వివరాలను ఉన్నతాధికారుల లాగిన్కు పంపించాలని సూచించారు. ఇసుకతో పాటు ఇతర నిర్మాణ సామగ్రి లబ్ధిదారులకు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ) హరికృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
భూ భారతి ఆపరేటర్లకు మంగళం?
నాగర్కర్నూల్/ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఉద్వాసన పలకనుందా.. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నియమించనున్నారా.. అన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననే అనిపిస్తున్నాయి. బుధవారం ఏకంగా కలెక్టరేట్లలో జిల్లాలోని జూనియర్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ విధానంపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. నాగర్కర్నూల్లో స్వయంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వగా.. ఇతర అధికారులు రిజిస్ట్రేషన్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్ల స్థానంలో వీరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది.. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ చేయాలని 2018లో నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ–సెన్ట్రిక్ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకోగా.. వీరిని ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మధ్యలో రెన్యువల్ చేసేవారు. ముందుగా రూ.11 వేల వేతనం ఇవ్వగా ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో చివర్లో నెలవారి వేతనం రూ.21,500 పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్ కింద తీసుకొని.. నెలకు రూ.21,500 వేతనం ఇస్తున్నారు. అయితే ఇది నెలవారిగా ఇవ్వకుండా మూ డు, ఆరునెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఆందోళన భూ భారతి ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమిస్తున్నారని అనుమానంతో గత రెండు రోజుల నుంచి ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం రాష్ట్రంలోని ఆపరేటర్లందరూ హైదరాబాద్లోని గాంధీభవన్కు వెళ్లి నిరసన చేపట్టి తమగోడు వినిపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్, జగ్గారెడ్డిని సైతం కలిసి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని విన్నవించారు. వీరి స్థానంలో జూనియర్ అసిస్టెంట్ల నియామకం ఇప్పటికే కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లు.. 15 నెలల వేతనాలు పెండింగ్ రెండు రోజులుగా నిరసన చేపడుతున్నా స్పందించని ప్రభుత్వం -
సెమినార్కు వేళాయె
● హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీసీలు, కేంద్ర విద్యా శాఖ అధికారులు ● రెండోరోజు పీయూను సందర్శించనున్న వీసీలు ● వచ్చే అతిథులకు హోటళ్లలో బస, వాహనాల ఏర్పాటు ● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన యూనివర్సిటీ అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సెమినార్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 800 మంది వరకు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సమీపంలోని కన్హాశాంతి వనంలో శుక్ర, శనివారాల్లో సెమినార్లో నిర్వహించనున్న సెమినార్లో మొదటిరోజు ప్రారంభ కార్యక్రమం అక్కడే జరుగుతుండగా.. విద్యార్థుల కోరిక మేరకు రెండోరోజు పలు సెషన్స్ పీయూలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీయూలో ఉషా నిధులు వినియోగించి నిర్మించిన భవనాలు, ఇతర సదుపాయాలను పలు యూనివర్సిటీల వీసీలతో పరిశీలించనున్నారు. అలాగే పీయూ విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతి, పరిశోధన తదితర అంశాలను వచ్చిన అతిథులకు వివరించనున్నారు. అదేరోజు సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతివనంలో జరగనుంది. గత విద్యా సంవత్సరంలో యూనివర్సిటీకి పీఎం ఉషా (ప్రధానమంత్రి ఉచ్చత్తర్ శిక్షా అభియాన్) కార్యక్రమం కింద రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పీయూలో జాతీయ సెమినార్ ‘విజన్ ఇండియా–2047’ ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ పేరుతో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం రూ.36 లక్షలు కేటాయించింది. దీంతో దక్షిణ భారతదేశంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పీయూకు మొదటిసారి అవకాశం దక్కినట్లయింది. సెమినార్కు కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రీసెర్చి సాలర్స్, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. నేషనల్ సెమినార్లో వీరు తాము రూపొందించిన నూతన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ శాస్త్ర, సాంకేతికతతో కూడిన పరిశోధనలకు సంబంధించి పలు ఎంఓయూలు (మెమోరాండం ఆఫ్ అండ్ స్టాండింగ్) సంస్థలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఇతర యూనివర్సిటీలతోనూ ఎంఓయూలు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పీయూకు పలు ప్రాజెక్టులు, పరిశోధనల్లో సహకారం వంటివి లభించనున్నాయి. పీయూలో ప్రతి సంవత్సరం సుమారు 650 నుంచి 750 మంది విద్యార్థులు మాస్టర్ డిగ్రీలు పొందుతున్నారు. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ, మైక్రోబయోలజీ, కెమిస్ట్రీ వంటి డిపార్ట్మెంట్ల వారితోపాటు ముఖ్యంగా బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ వంటి కోర్సులు చదివినవారు ఉన్నారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన లా కళాశాల, ఇంజినీరింగ్లో మూడు డిపార్ట్మెంట్ల విద్యార్థులు ఉన్న నేపథ్యంలో కార్యక్రమానికి పలు ప్రైవేటు కంపెనీలు వచ్చి.. పీయూలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసేందుకు ఒప్పందాలు చేసుకోనున్నారు. నేషనల్ సెమినార్ను ఘనంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్ కన్వీనర్గా రిజిస్ట్రార్ రమేష్బాబు, కన్వీనర్లుగా వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ వ్యవహరిస్తున్నారు. కమిటీల్లో వివిధ స్థాయిల్లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు కన్హా శాంతివనంలోనే రెండు రోజుల కోసం వసతి ఏర్పాటు చేయనున్నారు. రెండోరోజు యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి మూడు బస్సుల్లో వివిధ యూనివర్సిటీల వీసీలను తీసుకురానున్నారు. ఎయిర్ పోర్టు, బస్టాండ్, రైల్వేస్టేషన్స్ నుంచి వచ్చే అతిథులను ప్రత్యేక వాహనాల ద్వారా శాంతివనానికి తరలించనున్నారు. పీయూ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ మొదటిరోజు కన్హా శాంతివనంలో ప్రారంభం కాగా.. రెండోరోజు పీయూలో పలు సెషన్లు నిర్వహించి.. అనంతరం సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతి వనంలోనే చేపడుతాం. పీయూకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం. యూనివర్సిటీ గొప్పతనం చాటేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీసీలు హాజరుకానున్నారు. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ పీయూకు దక్కిన అరుదైన అవకాశంతో యూనివర్సిటీ గొప్పతనం చాటేలా జాతీయ సెమినార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీని ద్వారా యూనివర్సిటీకి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరి సహకారంతో శాంతివనం, పీయూలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేస్తాం. – మధుసూదన్రెడ్డి, సెమినార్ కన్వీనర్ -
పథకాల అమలులో నిర్లక్ష్యం సరికాదు
వనపర్తి: అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు సత్వర ఫలితాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించి ఫాంపాండ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్), ఉపాధి కూలీల సమీకరణ, జలసిరి పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా గ్రామాల్లో నిర్మిస్తున్న ఫాంపాండ్ల నిర్మాణాలను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎన్ఎఫ్బీఎస్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధి కూలీల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జలసిరి పనులు నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు. నిర్లక్ష్యానికి తావులేకుండా పని చేసి ప్రతి కార్యక్రమంలో ఆశించిన పురోగతి సాధించాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్లో 15 నెలల వేతనాలు
ఆపరేటర్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు సైతం ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అన్యాయం చేయొద్దు ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆపరేటర్లకు అన్యాయం చేయవద్దు. మా ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్యాయంగా తొలిగించి కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మొదట 300 మందిని తొలిగిస్తామని చెప్పి ఇప్పుడు అందరినీ తొలిగించే కుట్ర చేస్తుంది. వెంటనే తమకు పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలు ఇవ్వాలి. – రాంబాబు, భూ భారతి ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ ● -
ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి
వనపర్తిటౌన్: విశ్రాంత ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన రూ.900 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యం డిమాండ్ చేశారు. బస్భవన్ ముట్టడిని అడ్డుకోవడంతో మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌక్లో విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు బకాయిలు చెల్లించండంటూ బస్భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయో వృద్ధులని చూడకుండా అరెస్టులు చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. 2017 నుంచి రావాల్సిన ఆర్బీఎస్, గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్నాథ్రెడ్డి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు రామచంద్రారెడ్డి, అంజయ్య, ఉపేందర్, ప్రకాష్, సత్యనారాయణగౌడ్, హుస్సేన్ అలీ, స్వామి, రాఘవరెడ్డి, బీవీ రావు, గాంధీ, కురుమయ్య, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నీరున్నా.. నిట్టూర్పే!
‘అమరచింత’ ఆయకట్టుకు అందని సాగునీరు అమరచింత: వేసవిలో చేపట్టాల్సిన ఎత్తిపోతల సెక్షన్ పైపుల మరమ్మతు ప్రస్తుత వానాకాలంలో కొనసాగుతున్నాయి. కృష్ణానదికి వరద వచ్చి జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి పారుతుంటే సమీపంలోనే ఉన్న అమరచింత ఎత్తిపోతల ఆయకట్టు రైతులు మాత్రం సాగునీరు వినియోగించుకోలేకపోతున్నారు. సెక్షక్షన్ పైపుల మరమ్మతు పూర్తయితే తప్పా లిఫ్ట్కు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో వరి నారుమడులు సిద్ధం చేసుకొని సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరో వారం పాటు మరమ్మతులు కొనసాగుతాయని.. పూర్తయిన వెంటనే ఆయకట్టుకు నీటిని అందిస్తామని లిఫ్ట్ నిర్వహణ కమిటీ చెబుతోంది. ఇప్పటికే సాగునీరు వదలాలని రైతుల నుంచి ఒత్తిడి వస్తున్నా.. 26 ఏళ్ల కిందట ఏర్పాటు చేసుకున్న సెక్షన్ పైపులను మార్చి కొత్త పైపులను అమర్చుకునే పనులు కొనసాగుతుండటంతో రైతుల విజ్ఞప్తిని వింటూనే త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే దయాకర్రెడ్డి హయంలో నాబార్డు నుంచి రూ.11 కోట్లతో 2,400 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అమరచింత ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. లిఫ్ట్ డ్రమ్ము మరమ్మతుకు గురికావడంతో తెలంగాణా ఉద్యమ సమయంలో లిఫ్ట్ సందర్శనకు వచ్చిన నాటి ఎమ్మెల్యే హరీశ్రావు ఎంపీ నిధుల నుంచి రూ.60 లక్షలు మంజూరు చేయించారు. చిన్న చిన్న మరమ్మతులతో సాగునీటిని అందించిన ఎత్తిపోతలకు ప్రస్తుతం అతిపెద్ద మరమ్మతు సెక్షన్ పైపులను మార్చడమేనని ఆయకట్టు రైతులు అంటున్నారు. యాసంగిలో క్రాప్హాలిడే.. అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు రెండేళ్లుగా యాసంగి సీజన్లో సాగునీరు సరఫరా చేయక క్రాప్ హాలీడే ప్రకటించారు. ఈసారైనా వానాకాలంలో సకాలంలో వరిసాగు చేద్దామనుకున్న రైతుల ఆశలకు ఎదురుచూపులే మిగిలాయి. వరద వేళ కొనసాగుతున్న సెక్షన్ పైపుల మరమ్మతు గతేడాదే రూ.56 లక్షలు మంజూరు టెండర్ పూర్తయినా.. అగ్రిమెంట్ ఆలస్యం సాగునీటికి ఆయకట్టు రైతుల ఎదురుచూపులు -
తల్లిపాలతో రోగ నిరోధకశక్తి మెరుగు
మదనాపురం: శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని, పుట్టిన ప్రతి బిడ్డకు 30 నిముషాల నుంచి గంటలోపు ముర్రుపాలు పట్టించడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండలంలోని తిరుమలాయపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శిశువుకు మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలన్నారు. బాలింతలు తమ రోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో బిడ్డకు సరిపడా పాల ఉత్పత్తి జరుగుతుందని సూచించారు. అంగన్న్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీపీఓ రాజలక్ష్మి, సూపర్వైజర్ జ్యోతి, ఉపాధ్యాయులు రాధ, శారద, అరుణ, తారమ్మ, హంసమ్మ, సుజాత, ఎంఎల్టీలు రతన్, ముజాఫర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
పాన్గల్: ఫర్టిలైజర్ డీలర్లు నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మల్లాయిపల్లి, రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లి, పాన్గల్లోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వలు, రికార్డులను పరిశీలించారు. దుకాణం ఎదుట నిల్వ వివరాలు, ధరలు ప్రదర్శించాలన్నారు. ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎఫ్ఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ సేల్ యాప్ జిల్లాలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుండటంతో దుకాణాల్లో స్టాక్ వివరాలు, ఈపీఓఎస్ మిషన్ స్టాక్ను తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో తెలియని వ్యక్తులు విక్రయించే నకిలీ డీఏపీ, ఫెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ను కొనుగోలు చేయవద్దని కోరారు. అలాంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జ్ ఏఓ రమేష్నాయక్ ఉన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం : సీపీఐ
అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, నీటిపారుదల వసతులు కల్పించినప్పుడే వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దశాబ్ద కాలానికిపైగా ప్రధాని మోదీ అపూర్వ ప్రగతి సాధించినట్లు ఒక చిత్రాన్ని ప్రాజెక్టు చేస్తోందని ఆరోపించారు. దళిత ఆదివాసీలపై దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న న్యూడిల్లీలోని రాంలీలా మైదానంలో జరగబోయే యే బద్లావ్ జరూరీ హై ర్యాలీతో ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అబ్రహం, మక్తల్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీహరి, కో–కన్వీనర్ నర్సింహ, లక్ష్మి శెట్టి, శ్యాంసుందర్, భాస్కర్, మోషా, నాగరాజు, లక్ష్మీనారాయణ, అంజి తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో యూనిఫాంల తయారీ
వనపర్తి/వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న యూనిఫాంల కుట్టు పనులు నాణ్యతగా, వేగంగా పూర్తిచేసి నిర్దేశిత గడువులోగా అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. వనపర్తి పురపాలికలో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుట్టు కేంద్రంతో పాటు మండలంలోని రాజపేటలో సెర్ఫ్ కుట్టుకేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ యూనిఫాంల కుట్టు పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. ప్రతి యూనిఫాంను నిర్ణీత ప్రమాణాల మేరకు కుట్టి ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. కుట్టు పనులు ఆగస్టు 10వ తేదీలోగా పూర్తిచేసి సకాలంలో సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట పుర కమిషనర్ నిరంజన్, డీపీఎం, మెప్మా, సెర్ప్ అధికారులు, కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. -
‘జైల్భరో’ జయప్రదం చేయండి
పాన్గల్: క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జిల్లాకేంద్రంలో ఈ నెల 10న నిర్వహించే జైల్భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు రేగిచెట్టు నిరంజన్ పిలుపునిచ్చారు. మంగళవారం సీఐటీయూ మండల కన్వీనర్ సూర్యవంశం రాము అధ్యక్షతన నిర్వహించిన మండల సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న జైల్భరోలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయా సంఘాల నాయకులు దేవేందర్, జంబులయ్య, భాస్కర్, శ్యామల, మహేశ్వరి, రేణుక, సుజాత, లక్ష్మి, సుగ్రీవుడు, డీవైఎఫ్ఐ మండల కన్వీనర్ కమలాకర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు కేజీబీవీ విద్యార్థి ఎంపిక ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న కోట్ల నందిని రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి లలిత, పీఈటీ చిట్టి తెలిపారు. ఈ నెల 1న జిల్లాకేంద్రంలో జరిగిన ఎంపికల్లో అండర్ 18 విభాగం వెయ్యి మీటర్ల పరుగుపందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందని.. ఈ నెల 7న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరుఫున పాల్గొంటుందని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని ప్రత్యేక అధికారి, పీఈటీతో పాటు గ్రామపెద్దలు ఆగారం ప్రకాష్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. పశువుల సంత @ రూ.1.94 లక్షలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని పశువుల సంత రూ.1.94 లక్షలు పలికింది. మంగళవారం పుర కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన బహిరంగ వేలం నిర్వహించగా ముగ్గు రు పాటదారులు పాల్గొన్నారు. సర్కార్ పాటను రూ.1.40 లక్షల పైచిలుకుతో పుర అధికారులు ప్రారంభించగా.. గుజ్జుల భరత్ రూ.1.94 లక్షలు పాడి దక్కించుకున్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ ఎం.మాధవి, కమిషనర్ నిరంజన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
నీటి‘కబురు’
కలెక్టర్ సమీక్ష.. జూరాల ప్రాజెక్టుకు స్థిరంగా వరద నీరు కొనసాగుతుండడంతో కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ మంగళవారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సీజన్లో ప్రాజెక్టుకు ఎంతమేర వరద వచ్చింది.. కర్ణాటక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల వరద నీటి స్థితిగతులు వంటి వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం, గేట్ల పనితీరు, హైడల్ పవర్ హౌజ్లో విద్యుదుత్పత్తి వంటి వివరాలపై ఆరాతీశారు. అదేవిధంగా కుడి కాల్వ పరిధిలో లైనింగ్ మరమ్మతులను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జూరాల– ఆర్డీఎస్ లింక్ కెనాల్కు నీటి విడుదల వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరి పండించే రైతులు పంటకాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, చెరువులను కృష్ణాజలాలతో నింపుకోవాలని సూచించారు. అదేవిధంగా జూరాలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో ఎస్ఈ కేశవరావు, డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ నందిని తదితరులున్నారు. గద్వాల: వానాకాలం మొదలై రెండు నెలలు గడిచినా వరద నీరు లేక ఒట్టిపోయిన జూరాల జలాశయం.. వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో జలకళ సంతరించుకుంది. ఈ వానాకాలం సీజన్లో గరిష్టంగా మంగళవారం 2 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు భారీగా వరద కొనసాగుతుండడంతో మొన్నటి వరకు ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని ఇస్తామని చెప్పిన అధికారులు తాజాగా పూర్తిస్థాయి పంటల సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జూరాలను సందర్శించి వరద నీటి వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెలుగొందుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టు కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వల పరిధిలో 1.09 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.40 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో దాదాపు నెలన్నర రోజులపాటు వర్షాలు కురవక.. కృష్ణానదిలో నీరు పారక జూరాల ప్రాజెక్టు అడుగంటింది. దీంతో అధికారులు జలాశయంలో అందుబాటులో ఉన్ననీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టు కింద ఉన్న ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. కానీ, జూరాల కింద అప్పటికే సుమా రు 60 వేలకుపైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రై తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కృష్ణాబేసిన్ పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షా లు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వర ద వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయకట్టుకు నీటి విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతన్నకు తీపికబురు.. స్థానికంగా పెద్దగా వానలు కురవకపోయినా.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. గడిచిన వారం రోజులుగా వరద జలాల రాక స్థిరంగా కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి రిజర్వాయర్లకు ఎత్తిపోతలు చేపట్టారు. ఆయకట్టులోని సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఇన్నాళ్లు ఎల్నినో ప్రభావంతో వరి వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడిన అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కృష్ణానదికి పోటెత్తుతున్న భారీ వరద గడిచిన వారం రోజులుగా జూరాల స్థిరంగా ప్రవాహం జూరాల ఆయకట్టుకు సాగునీటి విడుదలకు నిర్ణయం నెట్టెంపాడు, ఆర్డీఎస్, జూరాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాలు అన్నదాతల హర్షం.. సాగు పనుల్లో నిమగ్నం -
పారదర్శకంగా భూ రిజిస్ట్రేషన్ల నిర్వహణ
వనపర్తి: భూ భారతి విధానంలో భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జూనియర్ అసిస్టెంట్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై జిల్లాలోని వివిధ మండలాల జూనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. రెవెన్యూశాఖలో భూ భారతి అత్యంత కీలకమైందని, రైతులు, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లక్ష్య సాధనలో జూనియర్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని.. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, డిజిటల్ సంతకాలు, సంబంధిత పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సాంకేతిక లోపాలకు తావులేకుండా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తూ లాగిన్ ప్రక్రియ నుంచి దరఖాస్తుల ఆమోదం వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, శిక్షణలోనే సందేహాలను మాస్టర్ ట్రైనర్ల ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. శిక్షణలో కలెక్టరేట్ పరిపాలనాధికారి భానుప్రకాష్ , మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
మరో వారం రోజులు..
త్వరగా సాగునీరు అందించాలి.. అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 4 ఎకరాల పొలం ఉంది. యాసంగిలో క్రాప్ హాలీడే ప్రకటించడంతో ఈసారి వానాకాలంలోనైనా వరి సాగుచేద్దామని బోరుమోటారు నీటితో వరి నారుమడిని సిద్ధం చేసుకున్నా. త్వరగా సాగునీరు విడుదల చేసి పంటలు పండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత 26 ఏళ్ల తర్వాత మరమ్మతు.. అమరచింత ఎత్తిపోతల పథకం నిర్మించి 26 ఏళ్లు అవుతోంది. లిఫ్ట్ ఏర్పాటు సమయంలో వేసిన 5 పైపులకు చిన్నపాటి రంధ్రాలు ఏర్పడటంతో మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా.. మరమ్మతుకు చిన్ననీటి పారుదలశాఖ నుంచి రూ.56 లక్షలు మంజూరు చేశారు. ఆయా పైపులతో పాటు బ్రేకర్ను ఈసారి మార్చుతున్నాం. – ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం నిర్వహణ కమిటీ ●అమరచింత ఎత్తిపోతల పథకం పంప్హౌజ్ వద్ద సెక్షన్ పైపుల బిగింపు పనులు మరో వారం పాటు కొనసాగనున్నాయి. యాసంగిలోనే పూర్తి కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించాం. పనులు పూర్తికాగానే ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రతిపాదనలు పంపాం. – వంశీకృష్ణ, ఏఈ చిన్ననీటిపారుదలశాఖ -
టెక్నికల్గా తగ్గించారా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పెట్టని, బకాయిలు చెల్లించని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అస్త్రం ప్రయోగించగా.. జిల్లాస్థాయిలో కొందరు అధికారులు, సిబ్బంది దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్తకోణం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పలువురు జిల్లా స్థాయి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ వర్గాలతో పాటు రైస్ మిల్లర్లలో ఈ చర్చ జోరుగా సాగుతుండగా.. కలకలం సృష్టిస్తోంది. అసలేం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. మిల్లర్లు బకాయి పడిన మొత్తం చెల్లించాలని ప్రభుత్వ ఇటీవల అల్టిమేటం జారీ చేసింది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నప్పటికీ.. స్పందన లేకపోవడంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ సిటీ యూనిట్–2, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా గత నెల 29న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుబ్బా అశోక్కు చెందిన ఇబ్రహీంబాద్లోని రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మెట్రిక్ టన్నుల (1,26,772 బస్తాలు) ధాన్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రెండు లారీలను సైతం సీజ్ చేశారు. లోపాయికారిగా సర్దుబాటు? మిల్లుల్లో భారీగా ఉండాల్సిన ధాన్యం కొరతను సిబ్బంది నామమాత్రంగా తక్కువ చేసి చూపే ప్రయత్నం జరిగినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ వర్గాల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 లక్షల బస్తాలు లేకున్నా.. కేవలం 1,26,772 బస్తాలు మాయమైనట్లు తేల్చడం వెనుక ఏదో మతలబు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కించిన సిబ్బందికి ఆ మిల్లర్తో గత పరిచయాలు ఉన్నాయని.. ఈ మేరకు సహకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఓ అధికారి చక్రం తిప్పి తక్కువ బస్తాలు చూపించేలా సర్దుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విచారణ జరిపిస్తేనే వెలుగులోకి.. శ్రీబాలాజీ మిల్లుకు సంబంధించి 2022–23 రబీ సీజన్ బకాయిలు సుమారు రూ.19.50 కోట్లు ఉండగా.. ఇప్పటివరకు మూడు దఫాలుగా రూ.2.60 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే విజిలెన్స్ అధికారులు మా సమ్మతి లేకుండానే సుమారు లక్ష ఇరవై వేల బస్తాలు లేవని ప్రెస్కు రిలీజ్ చేశారని సదరు మిల్లు నిర్వాహకుడు మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తే.. ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పలువురు అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. విచారణ జరిపినా ఇంకా కేసు నమోదు చేయకపోవడంపై ఉన్నతాధికారులు జిల్లా సివిల్ సప్లయ్ శాఖ సిబ్బందికి చీవాట్లు పెట్టినట్లు సమాచారం. రైస్ మిల్లర్లలో ముదిరిన పోరు.. తనిఖీలు నిర్వహించిన మిల్లుకు సంబంధించిన నిర్వాహకుడు ప్రస్తుతం మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2022–23 రబీకి సంబంధించిన సీఎమ్మార్ ధాన్యం అంశంపై ఆయన కొంత మంది మిల్లర్లతో కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని.. విజిలెన్స్ తనిఖీలు చేపట్టిందని.. సయోధ్యతో పోతే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేవని జిల్లాలోని పలువురు మిల్లర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఆయన నోటి దురుసుతో మాట్లాడడమే చేటు తెచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లర్లలో పోరు ముదురుతున్నట్లు తెలుస్తోంది. లెక్కింపు సమయంలోనే..రైస్ మిల్లుల్లో విజిలెన్స్ బృందం తనిఖీల సందర్భంగా జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకోవడం సహజం. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గణేష్ తదితర అధికారులు చేరుకుని ఇబ్రహీంబాద్లోని శ్రీ బాలాజీ మిల్లులో ఉన్న వడ్ల బస్తాల లెక్కింపు కోసం ఇద్దరు జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకున్నారు. ఈ మేరకు సదరు సిబ్బంది వడ్ల బస్తాల నిల్వలను గడ (స్టాక్) ఆధారిత భౌతిక లెక్కింపు (ఫిజికల్ వెరిఫికేషన్) విధానంలో లెక్కగట్టారు. గోదాంలో వడ్ల బస్తాలను చట్రంలా ఒక పద్ధతి ప్రకారం అమర్చిన మేర పొడవు, వెడల్పు, ఎత్తులను కొలిచి మిల్లులో ఉన్న బస్తాల సంఖ్యను తేల్చారు. గోనె సంచుల్లో బరువు ఆధారంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందనేది నిర్ధారించారు. అయితే ఇక్కడే మాయాజాలం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘శ్రీ లక్ష్మీ బాలాజీ’లో విజిలెన్స్ తనిఖీల్లో కొత్తకోణం వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం పౌరసరఫరాల శాఖ సిబ్బందిపై అనుమానాలు లోపాయికారి ఒప్పందంలో ఓ అధికారి హస్తం? సివిల్ సప్లయ్ డీఎస్ఓ, డీఎం మధ్య పంచనామా లొల్లి రైస్మిల్లర్స్ అసోసియేషన్లో ముదురుతున్న పోరు ఇరువురి మధ్య ‘పంచనామా’ లొల్లి.. నిబంధనల ప్రకారం వడ్ల బస్తాల లెక్కింపు పూర్తయిన వెంటనే అక్కడికక్కడే స్థల పంచనామా రికార్డులు రాస్తారు. బస్తాలు లెక్కించిన వివరాలు, కేటాయింపులతో పోలుస్తూ వ్యత్యాసాలు స్పష్టంగా నమోదు చేస్తారు. ఆ తర్వాత తనిఖీ చేసిన అధికారులు, మిల్లు యజమాని లేదంటే సదరు మిల్లు ప్రతినిధి, సాక్షులు (రెవెన్యూ, సివిల్ సప్లయ్ సిబ్బంది) సంతకాలు తీసుకుంటారు. ఇక్కడ సివిల్ సప్లయి డీఎస్ఓ గంప శ్రీనివాస్ మిల్లు యజమాని లేదా సదరు మిల్లు ప్రతినిధి సంతకం లేకుండానే రిపోర్ట్ను జిల్లా మేనేజర్ రవినాయక్కు పంపించినట్లు సమాచారం. దీన్ని డీఎం ధ్రువీకరించారు. దీనిపై వివరణ కోసం డీఎస్ఓతో ఫోన్లో మాట్లాడేందుకు ‘సాక్షి’ సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. ఆ శాఖలోని మరో అధికారిని సంప్రదిస్తే.. మిల్లు యజమాని లేదా ప్రతినిధి సంతకాలు అవసరం లేదని, విజిలెన్స్ అధికారులకు ఒక కాపీ ముందుగానే అందజేస్తారని తెలిపారు. -
రైతులకు కుచ్చుటోపీ..!
పెబ్బేరు కేంద్రంగా ఓ వ్యాపారి మామిడి కొనుగోలు ● నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా కాలయాపన ● మోసపోయామని గుర్తించి ఎస్పీని ఆశ్రయించిన బాధిత రైతులు ● తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకోలు ●బుక్కచిట్టీ రాసిచ్చాడు.. రూ. 55వేల విలువైన మామిడి కాయలు విక్రయించగా.. బుక్క చిట్టీపై రాసిచ్చాడు. ఆ తర్వాత డబ్బుల కోసం మూడు నెలలుగా తిప్పించుకుంటున్నాడు. వీపనగండ్ల మండలంతో పాటు పాన్గల్, పెబ్బేరు మండల్లాలోని రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. రోజుకో తేదీ చెబుతూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రైతులకు రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. – వెంకట్రెడ్డి, మామిడి రైతు, వీపనగండ్ల నిర్లక్ష్యంగా సమాధానం.. మూడు నెలల క్రితం మామిడి కాయలు విక్రయించాను. నాకు రూ. 66వేలు రావాలి. హైదరాబాద్లోని మార్కెట్కు వెళ్లి విక్రయించేందుకు ఖర్చు, శ్రమ పడాల్సి వస్తుందని పెబ్బేరులోనే విక్రయించాను. సదరు వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బుల కోసం గట్టిగా ప్రశ్నిస్తే.. నేను నష్టపోయా.. ఇవ్వలేను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. – నారాయణ, మామిడి రైతు, వీపనగండ్ల త్వరలోనే చెల్లిస్తా.. రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలకు ఎగుమతి చేశా. అక్కడి వ్యాపారులు మోసం చేశారు. చివరగా తీసుకెళ్లిన లోడ్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్లో యాపిల్స్ సీజన్ ప్రారంభమవుతుంది. అందులో నుంచి రైతులకు డబ్బులు చెల్లిస్తాను. అందరు వ్యాపారుల మాదిరిగానే బుక్క చిట్టీలపై లావాదేవీలు చేశాను. కొందరు రైతులు ఒత్తిడి తీసుకొస్తే.. చెక్కులు ఇచ్చాను. – సోమశేఖర్, వ్యాపారి వనపర్తి: మూడు నెలల క్రితం రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసిన ఓ వ్యాపారి.. చెల్లింపుల సమయం వచ్చేసరికి మొఖం చాటేశాడు. చివరకు తాము మోసపోయిన గుర్తించిన బాధిత రైతులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ సునీతారెడ్డిని ఆశ్రయించి.. తమకు న్యాయం చేయాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి పెబ్బేరు కేంద్రంగా ఓ రైస్మిల్లు గోదాంలో పండ్లు నిల్వచేస్తున్నాడు. అయితే ఈ ప్రాంతంలో పండిన మామిడి కాయలను సరైన ధరకు కొనుగోలు చేస్తానంటూ.. రైతులను నమ్మబలికాడు. ఒకటి, రెండుసార్లు కాపు వచ్చిన తొలినాళ్లలో కొంత మొత్తంలో కొని చెప్పినట్టుగానే సకాలంలో డబ్బులు చెల్లించాడు. దీంతో వీపనగండ్ల, పెబ్బేరు, పాన్గల్ మండలాలకు చెందిన సుమారు 150 మంది రైతులు మామిడి ఉత్పత్తులను సదరు వ్యాపారికి విక్రయించారు. అయితే మామిడి కొనుగోలుకు సంబంధించి డబ్బుల లెక్కను బుక్కచిట్టీలపై రాసిచ్చిన సదరు వ్యాపారి.. నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అప్పుడూ.. ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తున్నాడంటూ సోమవారం పోలీసు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. 45రోజుల పాటు కొనుగోలు.. పెబ్బేరు శివారు ప్రాంతంలోని పాడుపడిన రైస్మిల్లులో రైతుల నుంచి మామిడి కాయల కొనుగోలు ప్రక్రియ నిర్వహించారు. 45రోజుల పాటు మామిడి కొనుగోళ్లు సాగినప్పటికీ స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కనీసం అనుమతులు తీసుకోవడం.. మార్కెట్ ఫీజు ఊసెత్తిన దాఖలాలు లేవు. -
సమస్యలు ఆలకించి.. వినతులు స్వీకరించి
● ప్రజావాణికి 50 ఫిర్యాదులు ● త్వరగా పరిష్కరించాలనిఅదనపు కలెక్టర్ల ఆదేశం వనపర్తి/వనపర్తి రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వినతులు స్వీకరించారు. మొత్తం 50 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించి.. ఆ సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదుదారుడికి తెలియజేయడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన దరఖాస్తులను సైతం సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రెండు అర్జీలు అందినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.తిరుపతయ్య పాల్గొన్నారు. -
తుర్క కాషా ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొత్తకోటలోని ఓ కన్వెన్షన్ హాల్లో తుర్క కాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ. 54లక్షల వ్యయంతో (ఒక్కో లబ్ధిదారుడికి రూ. 60వేల విలువైన యూనిట్) వందశాతం రాయితీపై జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది లబ్ధిదారులకు రూ. 12కోట్ల వ్యయంతో పనిముట్ల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తుర్క కాషా కమ్యూనిటీ సభ్యులు అత్యంత కష్టమైన వృత్తితో జీవనోపాధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న జనరేటర్లు, టూల్ కిట్లు వారి ఉపాధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. తుర్క కాషా కమ్యూనిటీ కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా పథకాన్ని అమలు చేయడం సంతోషకరమన్నారు. ప్రజా పాలనలో అన్ని వర్గాలు, అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. తుర్క కాషా కమ్యూనిటీ అవసరాల దృష్ట్యా షాదీఖానాల నిర్మాణానికి సహకరించాలని ఆయన మంత్రిని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పల్లవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, తుర్క కాషా కమ్యూనిటీ అధ్యక్షుడు బడే సాబ్, టీజీఎంఎఫ్సీ ఏజీఎం ప్రవీణ్ కులకర్ణి, పవర్బిల్ట్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్, సీడీసీ చైర్మన్ చంద్రమోహన్రెడ్డి, నాయకులు పి.కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, ఎన్జే బోయేజ్, బీచుపల్లి యాదవ్, పెంటన్నయాదవ్, సుభాష్ పాల్గొన్నారు. -
ఇక్కడే సీటు ఇప్పించండి..
నేను 6 నుంచి 10వ తరగతి వరకు పెద్దమందడి టీజీడబ్ల్యూఆర్ఎస్/జేసీలో చదివాను. ఎస్సెస్సీలో 501 మార్కులతో పాసయ్యాను. అనంతరం ఇంటర్ ప్రవేశ పరీక్ష రాయగా.. నాకు మక్తల్లో సీటు కేటాయించారు. ఇక్కడ చదివిన వారికి ఇక్కడే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. అలా జరగలేదు. ఇక్కడ టీసీ ఇవ్వడంతో మక్తల్ టీజీడబ్ల్యూఆర్ఎస్/జేసీలో ఇంటర్ బైపీసీలో చేరాను. అక్కడ తాగునీరు పడక తరచుగా అనారోగ్యానికి గురవుతున్నా. చదువుకు ఇబ్బందిగా మారింది. మక్తల్ నుంచి పెద్దమందడి గురుకులానికి ట్రాన్స్పర్ చేసి.. నా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలి. – డి.పల్లవి, వెలగొండ, చిన్నంబావి మండలం -
పోలీసు ప్రజావాణికి 22 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 22 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఎస్పీ సునీతారెడ్డికి వివరించి.. వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా విని, తక్షణ పరిష్కారం చూపడం పోలీసుశాఖ ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి.. సంబంధిత అధికారుల సమన్వయంతో చట్టబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ అన్నారు. అమరచింతలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు లొంగిపోయి.. వ్యవసాయ ఉత్పత్తులను జీరో ట్యాక్స్తో దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించడం దారుణమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించి.. పారిశ్రామిక యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బకొట్టి.. పెట్టుబడిదారుల ఖజానా నింపడమే ప్రధాని మోదీ తన కార్తవ్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న దేశవ్యాప్తంగా చేపట్టనున్న జైల్భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, రైతు సంఘం జిల్లా కోశాధికారి వెంకటేశ్, ప్రభాకర్, బుచ్చన్న, నాగేంద్రమ్మ, శంకర్, రాజు, మోహన్, భగవంతు, హరికృష్ణ, రేణుక ఉన్నారు. -
సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం
వనపర్తి రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు, శ్రీరంగాపురం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ శాఖల వారీగా ప్రగతి నివేదికలపై నిశితంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయా శాఖల అధికారులు సరైన సమాచారం లేకుండా పొంతన లేని సమాధానాలు చెప్పడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సంబంధిత అంశాలపై స్పష్టత ఇవ్వని విద్యుత్ లైన్మ్యాన్కు నోటీస్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. శ్రీరంగాపురంలో విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోయిన ఎంఈఓ హనుమంతుకు మెమో జారీ చేయాలన్నారు. సమావేశానికి ఇరిగేషన్శాఖ అధికారులు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీరంగాపురంలో రూ. 10లక్షలతో నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవనం, రూ.10 లక్షలతో మండల మహిళా సమాఖ్య భవనం, రూ.30 లక్షలతో గోదాం నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పీఎంశ్రీ పాఠశాలలో రూ. 14.50 లక్షలతో ఏర్పాటుచేసిన కంపూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారులు సుధారాణి, యాదయ్య, సింగిల్విండో చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, వైస్చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు సత్యనారాయణరెడ్డి, వరలక్ష్మి ఉన్నారు. -
కమిటీ సభ్యులు పరిశీలించాల్సిన అంశాలు..
● సమస్యల వలయంలో జీజీహెచ్ ● 205కుపైగా వైద్యులు, సిబ్బంది ఖాళీలు ● కదలిక లేని ఆర్కేఎస్, హెచ్ఎంసీ కమిటీలు ● రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య వనపర్తి: ఆస్పత్రి నిర్వహణ, రోగుల సంక్షేమం, నిధుల వినియోగం, సమస్యల పరిష్కారం, వైద్యసేవలను పర్యవేక్షించాల్సిన ఆర్కేఎస్ (రోగి సంక్షేమ సమితి), హెచ్ఎంసీ (హాస్పిటల్ మేనేజ్మెట్ కమిటీ)లు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తూ.. మమా అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల మంది రోగులు వైద్యం కోసం వచ్చే జిల్లా జనరల్ ఆస్పత్రిపై అధికార, పాలకవర్గం సరైన దృష్టి సారించడం లేదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో ఇనుప మంచాలు తుప్పుపట్టగా, కిటికీలు పగిలిన అద్దాలతో దర్శనమిస్తున్నాయి. ఇక శుద్ధజల కేంద్రం వద్ద నిత్యం చిత్తడే. రక్త పరీక్షల విభాగంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే విద్యార్థులతో రక్త సేకరణ చేయడం, కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షల కోసం బయటకు సిఫారస్ చేస్తుండటం లాంటివి వెలుగు చూస్తున్నాయి. రోగాల సీజన్ వచ్చినట్లే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యసేవలు, వైద్యుల కొరత లేకుండా చూడటంతో పాటు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వేర్వేరు కమిటీలు ముందస్తుగా సమావేశమై.. కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఆయా కమిటీలు ఆస్పత్రిని సందర్శించిన దాఖలాలు ఒకటి రెండు కంటే ఎక్కువగా లేవు. అందులోనూ.. ఒక్కరిద్దరు సభ్యులే వచ్చినట్లుగా తెలుస్తోంది. నిత్యం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు వెయ్యి నుంచి 1,100 మందికిపైగా ఓపీ వస్తుండటంతో జిల్లా జనరల్ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. సేవల మెరుగే ప్రధాన లక్ష్యం.. ఆర్కేఎస్, హెచ్ఎంసీ సభ్యులు జీజీహెచ్లో వైద్య, ఇతర సేవలను మెరుగుపర్చాలి. కానీ ఆ దిశగా కమిటీలు పని చేసింది తక్కువేనని చెప్పవచ్చు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి సభ్యులు హాజరై ఉచిత సలహాలు ఇవ్వటమనే ధోరణి ఇప్పటి వరకు కొనసాగడం శోచనీయం. పర్యవేక్షణకు నోచుకోని అంశాలు.. రోగులకు స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య చర్యలు నిర్దేశించిన సమయానికి చేపట్టడం, టోకెన్ల జారీ ప్రదేశాల్లో వసతులు, బెడ్లు, ఫర్నీచర్, విద్యుత్, జనరేటర్, పవర్ బ్యాకప్ అంశాలను పరిశశీలించాలి. విద్యుద్ధీపాలు, ఫ్యాన్లు, ఆస్పత్రి పైకప్పు నుంచి వర్షపునీరు లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వనపర్తి జీజీహెచ్లో అత్యవసర విభాగం ముఖద్వారం వద్ద వర్షపు నీరు లోనికి వస్తోంది. జిల్లా ఆస్పత్రిలో ఖాళీలు.. విభాగం మంజూరైన పనిచేస్తున్న ఖాళీలు పోస్టులు వారు ప్రొఫెసర్లు 22 13 9 అసోసియేట్ ప్రొఫెసర్లు 24 6 18 అసిస్టెంట్ 90 24(రెగ్యులర్) 53 13 (కాంట్రాక్ట్) సిబ్బంది (అన్ని విభాగాలు) 489 361 128 ● వైద్యులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా? సిబ్భంది అందుబాటులో ఉన్నారా..? ● మందుల కొరత, ఎక్స్రే, స్కానింగ్ యంత్రాల నిర్వహణ, శస్త్రచికిత్సలు, ఇతర వైద్యసేవలు నిర్వహణ, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, అంబులెన్స్ సేవలు, ఆస్పత్రిలో స్వచ్ఛత, రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యత, బయో వేస్టేజ్ నిర్వహణ, రోగుల ఫిర్యాదులు, మరణాలు, ముఖ్యంగా శిశు మరణా లపై సమీక్షలు, ఆస్పత్రి భద్రత, ప్రభుత్వ ఆరోగ్య పథకాలను నిత్యం పరిశీలించాల్సి ఉంటుంది. -
జిల్లాస్థాయి అథ్లెటిక్స్లో కొత్తకోట క్రీడాకారుల ప్రతిభ
కొత్తకోట రూరల్: హన్మకొండ జేఎన్ స్టేడియంలో ఆగస్టు 7, 8 తేదీల్లో జరిగే 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జావెలిన్ డే అథ్లెటిక్స్ మీట్–2026కు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–6 విభాగంలో కొత్తకోటకు చెందిన టి.యశ్విక 60 మీటర్లు, 150 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం సాధించింది. అదే విభాగంలో అప్పరాలకు చెందిన యు.కారుణ్య 60 మీటర్లు, 150 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. అండర్–8 విభాగంలో కొత్తకోటకు చెందిన టి.గగన్కుమార్రెడ్డి 200 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. అండర్–10 విభాగంలో అప్పరాలకు చెందిన వి.జోష్నవి 300 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం, యు.భావన బ్రాడ్ జంప్లో ద్వితీయ స్థానం పొందారు. అండర్–12 విభాగంలో అప్పరాలకు చెందిన వి.లేఖన 400 మీటర్ల పరుగుపందెంలో, జి.నందిని షాట్పుట్ పోటీలో తృతీయ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందారని వ్యాయామ విద్యా శిక్షకుడు ఎం.అజయ్కుమార్ తెలిపారు. విజేతలను స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లా, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
పోలీసుల పహారా అవసరం..
జూరాలకు వరద వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలుతున్నారు. ఈ సమయంలో పోలీసుల పహార లేక పర్యాటకులు దిగువ నది వద్ద పరవళ్లను చూసేందుకు దిగువ నదిలోకి వెళ్తున్నారు. ఉధృతంగా పారుతున్న నీటితో ఆడుకుంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాలి. – వెంకటేష్, నందిమళ్ల జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఎక్కువగా ఉండటంతో భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం అధికసంఖ్యలో పర్యాటకులు రావడంతో దిగువ పుష్కరఘాట్ రోడ్ను మూసివేసి నదిలోకి వెళ్లకుండా పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశాం. సూచిక బోర్డుల ఏ ర్పాటుతో పాటు ప్రాజెక్టుపై వాహనాలు ని లుపకుండా తగిన చర్యలు చేపడుతున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూర్ ● -
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
వనపర్తిటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యన్న ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వనపర్తి బస్టాండ్ ఆవరణలో తొలగించిన కుర్చీలను తిరిగి ఏర్పాటు చేయించాలన్నారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని.. బస్టాండ్ ఆవరణలో సిమెంట్ కుర్చీలను తిరిగి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా స్నేహితుల దినోత్సవం వనపర్తిటౌన్: కుల, మత, ప్రాంతాల సరిహద్దులు లేని ఏకై క పవిత్ర బంధం స్నేహమని వాసవి వనితక్లబ్ అధ్యక్షురాలు కొంపల రజిత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో వాసవి వనిత క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పారు. వివిధ క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్నేహబంధం జీవితంలో అత్యంత విలువైందని.. కష్టసుఖాల్లో తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులని చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి పాపిశెట్టి రాధిక, కోశాధికారి కటకం ప్రశాంతి, వనితక్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..
జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టి తీసుకెళ్లాం. ఆయన తన నిధులిచ్చి పరిష్కరించేందుకు ఆదేశించారు. ఖాళీలున్నా.. నిత్యం వచ్చే ఓపీ సేవలు, ఇన్పేషంట్ల సేవల విషయంలో ఎక్కడా రాజీపడకుండా సేవలందిస్తున్నాం. కమిటీ సమావేశం చివరగా ఏప్రిల్ 6న నిర్వహించాం. మళ్లీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్య పరీక్షలు పూర్తిగా ఆస్పత్రిలోనే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. – డా. చంద్రమోహన్, సూపరింటెండెంట్, జీజీహెచ్ -
11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టొదు అమరచింత: ఉధృతంగా ప్రవహించే నీటితో ఆటలొద్దని.. సెల్ఫీల కోసం పోటీపడి ప్రాణాలను పణంగా పెట్టొదని అమరచింత ఎస్ఐ స్వాతి సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జూరాల ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామని.. దిగువ పుష్కరఘాట్ వద్దకు వెళ్లే రహదారిని మూసి వేయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు రహదారిపై వాహనాలు నిలువకుండా పార్కింగ్కు స్థలం కేటాయించామని తెలిపారు. వరదను చూడాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని.. పోలీసుల సూచనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు. సందర్శకులు సురక్షిత ప్రదేశాల నుంచే కృష్ణమ్మ అందాలను తిలకించాలని.. అ త్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. అన్నవరం క్షేత్రానికిప్రత్యేక బస్సు కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఈ నెల 8న ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. భద్రాచలం, విజయవాడ, అన్నవరం, వైజాగ్, సింహాచలం చేరుకుంటుందని పేర్కొన్నారు. 11న సాయంత్రం తిరిగి కొల్లాపూర్ చేరుకుంటుందని ఆయన వివరించారు. బస్సులో రానుపోను ప్రయాణ చార్జీలు నాలుగు రోజులకు పెద్దలకు రూ. 3వేలు, పిల్లలకు రూ. 2వేలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు టికెట్ల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సంప్రదించాలని సూచించారు. -
తల్లిపాలే అమృతం
జిల్లా పరిధిలో ఇలా.. వనపర్తి: తల్లీబిడ్డల మధ్య ఆత్మీయతను పెంచేవి తల్లిపాలు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని.. పోషక పదార్థాలను అందిస్తాయి. బిడ్డ పుట్టిన తల్లి ప్రతిరోజు లీటరు పాలు అదనంగా తాగితే నవజాత శిశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కానీ, ఇటీవల పాల డబ్బాలు పిల్లల ఆరోగ్యాన్ని, తల్లి ఆప్యాయతను దూరం చేస్తున్నాయి. బిడ్డకు సుమారు రెండేళ్లపాటు పాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువ మంది తల్లులు కేవలం ఏడాది మాత్రమే ఇస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనంలోనూ తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల విశిష్టతను తెలియజేసేలా.. 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల సంస్కృతిని రక్షించడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఏటా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందు లో భాగంగా తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బా లింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. పోతపాలు, పాల పౌడర్ కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి చెదిరిపోతుందనే ఉద్దేశంతో బిడ్డకు పాలివ్వడం లేదు. వీరిలో ప్రధానంగా సంపన్న వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్న ట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరికొందరు ఒక్కసారి బిడ్డకు ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత పాలు రావడం లేదని వదిలేస్తారు. వైద్యుల సలహా తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మెడిసిన్ ద్వారా 30 శాతం మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. డబ్బాపాలు తాగిస్తే బిడ్డ కడుపు నిండుతుందే కానీ పోషకాలు అందవు. ముర్రుపాలు ఎంతో శ్రేష్టం.. ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటివి. బిడ్డకు ఆ పాలు యాంటీ బయోటిక్స్లా ఉపయోగపడతాయి. మూడు రోజులపాటు పసుపురంగులో వచ్చే ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. పుట్టిన ప్రతి బిడ్డకు వచ్చే కామెర్లు.. ఈ పాలు తాగిస్తే 90 శాతం తగ్గుతాయి. తల్లిపాలతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మేధోసంపత్తి పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతోపాటు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలతో బిడ్డ పేగులో నుంచి విసర్జకాలు తొలగిపోతాయి. ఎలర్జీలు రావు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి. ఐసీడీఎస్ ప్రాజెక్టులు 3 అంగన్వాడీ కేంద్రాలు 589 గర్భిణులు, బాలింతలు సుమారు 14,800 డబ్బా పాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు -
‘జైల్భరోను విజయవంతం చేయాలి’
ఖిల్లాఘనపురం: కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను నీరుగారుస్తోందని.. కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్కోడ్లు అమలు చేయడంతో కార్మికులు చట్టబద్దమైన హక్కులు కోల్పోతున్నారని, యాజమాన్యాలకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా.. పరోక్షంగా సమర్థిస్తున్నారని తెలిపారు. కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని చెబుతున్నా.. అమలుకు నోచుకోవడం లేదన్నారు. మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారని.. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నాయకులు, కార్మికులు సాయికృష్ణ, భీమయ్య, వెంకటేష్, నాగయ్య, మునేందర్, శివ, నజ్మ, పద్మ, సంగీత, ప్రియాంక, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
82 మంది బాల కార్మికులకు విముక్తి
వనపర్తి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోందని.. జిల్లాలో 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా పూర్తయిందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 82 మంది బాలకార్మికులను రక్షించామని, వీరిలో 78 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని చెప్పారు. బాలలను చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న 26 మంది యజమానులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకున్నామని. రక్షించిన బాలలను సంబంధిత శాఖల సమన్వయంతో పునరావాసం కల్పించి, వారి తల్లిదండ్రులకు బాలల హక్కులు, నిర్బంధ విద్య, కలిగే నష్టాలపై అవగాహన కల్పించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాలల హక్కులను పరిరక్షించడం, వారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయడంలో పోలీసుశాఖ, కార్మికశాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యా, వైద్యశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని వివరించారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించడం, బలవంతంగా భిక్షాటన చేయించడం, పశువుల కాపరులుగా, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు, పరిశ్రమలు లేదా ఇతర పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినా లేదా బాలలపై వేధింపులు, దోపిడీ జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఉన్నతాధికారులకు విన్నవించాం..
పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత ఉంది. వివిధ స్థాయిల్లో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పశువైద్య సేవలు, రైతులకు అందించే పలు సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పశువైద్యశాలలు, పశు ఆరోగ్య ఉపకేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక ప్రస్తుతం ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది. ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. – వెంకటయ్యగౌడ్, ఇన్చార్జి జిల్లా పశువైద్యాధికారి -
యూడీఐడీ కార్డుల జారీ వేగవంతం
వనపర్తి: దివ్యాంగులకు సంబంధించిన యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అఽధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న యూడీఐడీ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 2025, మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,647 యూడీఐడీ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం 782 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆయా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. -
సిబ్బందిని నియమించాలి..
పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత ఉండటంతో అత్యవసర సమయంలో వైద్య సేవలు అందడం లేదు. అనారోగ్యానికి గురైన గొర్రెలను కాపాడుకోలేకపోతున్నాం. దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతున్నారు పాలకులు వెంటనే ఖాళీలను భర్తీచేసి జీవాల ఇబ్బందులు తొలగించాలి. – మల్లేష్, గొర్రెల పెంపకందారు, కొత్తకోట గ్రామంలో పశుసంపద అధికంగా ఉంది. పశువుల దవాఖాన ఉన్నప్పటికీ శాశ్వత వైద్యుడు లేకపోవడంతో ఇన్చార్జితోనే సేవలు అందిస్తున్నారు. ఆయన ఎప్పడు వస్తారో తెలియదు. కంపౌండర్ పశువులకు వైద్యం చేస్తారు. అధికారులు స్పందించి శాశ్వత వైద్యుడిని నియమించాలి. – ఎం.రాజు, సంకిరెడ్డిపల్లి, కొత్తకోట పశువులకు వైద్యం చేయడానికి సరిపడా సిబ్బంది లేరు. దీంతో తామే తోచిన విధంగా చికిత్సలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలి.– వెంకటయ్య, పాడి రైతు, సూగూరు, పెబ్బేరు●


