గూనలు పటిష్టం చేయాలి..
మా పొలాలకు మేజర్–2 కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది. కాల్వ ప్రారంభంలో కేవలం రెండు గూనలు ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు నీరు అధికంగా, మరికొన్నిసార్లు తక్కువవగా రావడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం కాల్వ ప్రారంభంలో గండి పడింది. దీంతో రెండు గూనలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. గూనలు కాకుండా స్ట్రక్చర్ నిర్మించాలి.
– చంద్రశేఖర్,
మాజీ వైఎస్ ఎంపీపీ, గోపాల్పేట
ఏటా పనులు చేపట్టేందుకు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ముందుకు సాగడం లేదు. మేజర్–2 కాల్వ ప్రారంభంలో బుధవారం గండిపడి రెండు గూనలు కొట్టుకుపోయాయి. సమాచారం అందగానే పరిశీలించి వెంటనే తల్పునూరు వద్ద గేట్ను మూసి వేయించాం. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే స్ట్రక్చర్ నిర్మిస్తాం.
– వెంకటరమణమ్మ,
డీఈ, నీటిపారుదలశాఖ


