Wanaparthy District Latest News
-
ప్రశాంతంగా ‘నీట్’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో నీట్ పరీక్షకు 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో ఎస్పీ జానకితోపాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు మొదట ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. రేపు రైతు సదస్సు కొల్లాపూర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న కొల్లాపూర్లోని మహెబూబ్ ఫంక్షన్హాల్లో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు ఉద్యానశాఖ డివిజనల్ అధికారి లక్ష్మణ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరులు పెరిగిన నేపథ్యంలో సంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించే విధంగా రైతులకు సదస్సులో తగు సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే సదస్సుకు కేవీకే పాలెం శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు. ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాన ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్లో పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాట దక్కడంలేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. -
ధాన్యం.. దైన్యం
● గన్నీ బ్యాగులు తీసుకున్న తర్వాత కూడా పలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తోంది. ఒక బస్తా ధాన్యం నింపేందుకు రూ.25 వసూలు చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఇబ్బందులు ఇవే.. ● ఏఈఓలు, సిబ్బంది కొరత కారణంగా రైతులకు మూడు రోజులకోసారి టోకెన్లు జారీ చేస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే గన్నీ బ్యాగులు కేంద్రాలకు వస్తుండగా.. అవి వచ్చినప్పుడే టోకెన్లు పొందిన రైతులు తీసుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది. యాసంగి సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్కర్నూల్ మినహా మిగిలిన మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా.. ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సుమారు 15 రోజులు గడిచినప్పటికీ క్రయవిక్రయాల్లో వేగం పుంజుకోకపోవడంతో అసలు కొనుగోళ్లు చేస్తారా.. లేదా అనేది తెలియక రైతులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రయవిక్రయాల్లో రోజుల తరబడి జాప్యంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అన్నదాతలు రాస్తారోకోకు దిగగా.. ఇలాంటి పరిస్థితులే పలు ప్రాంతాల్లో నెలకొన్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ధాన్యం వద్దనే పడిగాపులు.. నాకున్న ఎనిమిదెకరాల్లో వరిని సాగుచేసి.. వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చాను. లారీలు రావడం లేదని ఏవేవో కారణాలు చెబుతూ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఎప్పుడు అకాల వర్షం వచ్చి ధాన్యం తడిసిపోతుందోనని భయంతో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. – వెంకటన్న, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం ఇంకా కొనడం లేదు.. నేను ఈసారి మూడెకరాల్లో వరిసాగు చేశా. పంట కోసి వారం రోజులైంది. గ్రామంలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అధికారులు త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల భయంతో ఆందోళన చెందుతున్నాం. వానలో ధాన్యం తడిస్తే చేసిన కష్టం నీళ్లపాలవుతుంది. తేమశాతం లేని ధాన్యాన్ని వెంటనే కొనేందుకు చర్యలు తీసుకోవాలి. – చంద్రారెడ్డి, రైతు, జటప్రోలు, పెంట్లవెల్లి మండలం ●ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇప్పటి వరకు 877 మాత్రమే అందుబాటులోకి రాగా.. ఇందులో కనీసం రెండు శాతం మేర సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధారించిన అధికార యంత్రాంగం.. ఇప్పటివరకు ప్రభుత్వ కేంద్రాల ద్వారా కేవలం 36,175 మెట్రిక్ టన్నులు సేకరించింది. అయితే ఉమ్మడి జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా పడుతాయని.. కోతలు కూడా ఆలస్యమవుతాయని.. ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. సన్నాలకే మొగ్గు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ● దాదాపుగా ప్రారంభమైన అన్ని కేంద్రాల్లో ధాన్యం తరలింపు ప్రధాన సమస్యగా మారింది. అధికారులు కొనుగోలు కేంద్రాలకు వెంటవెంటనే లారీలను పంపించకపోవడమూ కారణమవుతోంది. దీంతోపాటు మిల్లుల కేటాయింపుల్లో గందరగోళంతో లోడ్ అయిన వాహనాలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. దీంతో రైతులు రేయింబవళ్లు అక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది. ● గద్వాల జిల్లాలో మిల్లులకు గతంలో కేటాయించిన సీఎమ్మార్ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ యాసంగి ధాన్యం నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు మిల్లర్లు వినతిపత్రం అందించారు. వనపర్తి జిల్లాలో డీఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉండడంతో కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా యాసంగి సాగు, కొనుగోలు కేంద్రాల వివరాలు.. ఆర్భాటానికే పరిమితమైన కొనుగోలు కేంద్రాల ప్రారంభం సెంటర్లలో అస్తవ్యస్తంగా మారిన క్రయవిక్రయాలు రోజులకొద్దీ జాప్యంతో అన్నదాతల పడిగాపులు పలు ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్న రైతులు దొడ్డు వరి సాగు చేసిన వారికి తప్పని ఎదురుచూపులు ప్రభుత్వం ఈసారి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్లో మిల్లులకు కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో సమస్యలు తలెత్తడంతో క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతుండడంతో అధికారులు తిరిగి పాత విధానం ప్రకారమే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిపై అస్పష్టతతో కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని తెలుస్తోంది. -
ప్రశాంతంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. -
బాధిత కుటుంబాలకు బాసట
మరికల్: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) అమలు విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు తహసీల్దార్ పరిధిలో ఉన్న ఈ పథకం బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులు ఇప్పటి నుంచి ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇస్తే విచారణ, పరిశీలన, ఆమోద ప్రక్రియ వేగవంతం కానుంది. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. గతంలో దరఖాస్తులను తహసీల్దార్లు విచారణ చేసి నివేదికలను కలెక్టర్లకు పంపితే నిధులు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో జాప్యం చోటుచేసుకునేది. ప్రస్తుతం లబ్ధిపొందే విధానంలో మార్పులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పుర, నగరపాలికల్లో కమిషనర్లకు అర్హులను గుర్తించే అధికారాన్ని అప్పగించారు. ఇందుకు నిర్ధిష్ట గడువు కూడా విధించటంతో దరఖాస్తులు త్వరగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. పది రోజుల్లో పరిశీలన బాధిత కుటుంబ సభ్యులు అన్ని పత్రాలు జతచేసి ఎంపీడీఓ, పుర, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో అందించిన పది రోజుల వ్యవధిలో అధికారులు విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలి. గతంలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉండటంతో క్షేత్ర స్థాయి విచారణ లో జాప్యం చోటు చేసుకునేది. సమస్యను గుర్తించి న ప్రభుత్వం తాజా మార్పునకు నిర్ణయించటంతో వేగంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. రూ. 20 వేల చొప్పున.. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 60 ఏళ్ల లోపు వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే వారు గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లో పురపాలికల్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి మంజూరుకు సిఫార్సు చేస్తే ఎవరి ప్రమేయం లేకుండా నిధులు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. 2017, ఏప్రిల్ 13 తర్వాత మరిణించిన వారి కుటుంబ సభ్యులు దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎన్ఎఫ్బీఎస్ అమలు ఎంపీడీఓ చేతుల్లోకి.. కుటుంబ పెద్ద చనిపోతే రూ.20 వేల సాయం అర్హులు సద్వినియోగం చేసుకోవాలి జత చేయాల్సిన పత్రాలు ఆహార భద్రత కార్డు మృతుడి ఆధార్ కార్డు మరణ ధ్రువీకరణ పత్రం మృతుడి వయస్సు నిర్ధారణ పత్రం ఆదాయ ద్రువీకరణ పత్రం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా పుస్తకం వీటన్నింటిని జతచేసి మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ పత్రాలను స్థానిక సంస్థల కార్యాలయాల్లో అందించాలి. -
శిక్షణ అదుర్స్
నీట్, ఐఐటీ, క్లాట్ పరీక్షలకు ప్రత్యేక తరగతులు ● జిల్లాలో 4 కేజీబీవీల నుంచి.. ● ప్రతి సబ్జెట్కు 40 మంది విద్యార్థులు ఎంపిక ● ప్రభుత్వ నిర్ణయం కేజీబీవీ విద్యార్థినులకు వరం శిక్షణ బాగుంది ప్రస్తుతం అమరచింతలోని కేజీబీవీలో బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. నీట్ శిక్షణకు ఎంపియ్యా. నాకు డాక్టర్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. నేను చదువుకుంటున్న పాఠశాలలోనే నీట్పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. రోజువారీగా తరగతుల నిర్వహణతో పాటు వారాంతపు పరీక్షలు నిర్వహించి, ప్రోత్సహిస్తున్నారు. – దివ్యశ్రీ, కేజీబీవీ అమరచింత క్లాట్లో శిక్షణ పొందుతున్నా.. నేను సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. ప్రభుత్వం కేజీబీవీల వి ద్యార్థునుల కోసం పోటీ పరీక్షలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తుండటంతో క్లాట్పై శిక్షణ పొందడానికి గోపాల్పేట కేజీబీవీకి వచ్చా. విషయాల వారీగా బోధనతో పాటు సౌకర్యాలు బాగున్నాయి. – భవ్యశ్రీ, కేజీబీవీ, గోపాల్పేట నీట్లో ర్యాంకు సాధిస్తా.. అమరచింత కేజీబీవీలో నీట్పై శిక్షణ ఇస్తున్నారని ఎస్ఓ చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. రోజువారి తరగతుల నిర్వహణ తీరు బాగుంది. సబ్జెక్టుల్లో అనుమానాలను ఎప్పటికప్పుడు నివృతి చేస్తున్నారు. మొదటి సారిగా ఇస్తున్న శిక్షణను ప్రేరణగా తీసుకుని వచ్చే సంవత్సరం మరింతగా రాణించి నీట్లో మంచి ర్యాంకు సాధిస్తా. – పల్లవి, కేజీబీవీ వనపర్తి డాక్టర్ కావాలనేది కల.. నీట్ శిక్షణపై పట్టు సాధించి పోటీ పరీక్షలో ర్యాంకు సాధించేందుకు శిక్షణ తోడ్పడనుంది. తల్లిదండ్రులను ఒప్పించి ఇక్కడికి శిక్షణకు వచ్చా. వసతులతో పాటు అవగాహన ఉన్న సీఆర్టీల ద్వారా శిక్షణ ఇప్పించడం బాగుంది. డాక్టర్ కావాలనే కల నేర్చుకుంటాను. – పూజ, బైపీసీ, చిన్నంబావి రోజు వారీగా.. జిల్లాలోని 4 కేజీబీల ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు మూడు కేజీబీవీల్లో ఒకొక్క పోటీ పరీక్షపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి రోజు ఆయా కేజీబీవీలకు వెళ్లి విద్యార్థినులకు అందుతున్న బోధన గురించి ఆరా తీస్తున్నాం. వచ్చే ఏడాది వరకు ఆయా సబ్జెట్ల్లో విద్యార్థినులకు శిక్షణ ఇచ్చి అనుకున్న ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. – శుభలక్ష్మి..జీసీడీఓ అమరచింత: కేజీబీవీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినులు నీట్, ఐఐటీ, క్లాట్ వంటి పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లాలోని 4 కేజీబీవీలను ఎంపిక చేసి ప్రతి కేజీబీవీ నుంచి టాప్ టెన్లో ఉన్న 10 మంది విద్యార్థి నులను ఎంపిక చేస్తూ.. వేసవి సెలవులు వృథా కాకుండా పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వసతులను కల్పించి ఆయా సబ్జెట్లపై పట్టున్న సీఆర్టీల ద్వారా రోజువారి తరగతులను బోధించే విధంగా ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తున్నారు. నిత్యం పర్యవేక్షణతో పాటు జిల్లా విద్యాధికారుల తనిఖీలు, జీసీడీఓ ఆకస్మిక తనిఖీలతో నాణ్యతతో కూడిన బోధన అందించడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షలపై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి ప్రయత్నం.. కేజీబీవీలో ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన ఎంపీసీ, బైపీసీ, ఈసీటీ చదువుతున్న వారికి నీట్, క్లాట్, ఐఐటీ పోటీ పరీక్షలకు హాజరయ్యేలా తొలి ప్రయత్నంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు లైబ్రరీల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధిచిన పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లైబ్రరీ స్టడీకి అవకాశం కల్పిస్తున్నారు. -
3 చోట్ల శిక్షణ తరగతులు
జిల్లాలోని చిన్నంబావి, శ్రీరంగాపురం, వనపర్తి, అమరచింత మండలాల్లోని కేజీబీవీల నుంచి ఒకొక్క సబ్జెట్ నుంచి 10 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. అమరచింత కేజీబీవీని నీట్ శిక్షణ కోసం ఎంపిక చేయగా.. ఐఐటీ శిక్షణ కోసం వనపర్తి కేజీబీవీ, క్లాట్ శిక్షణ కోసం గోపాల్పేట కేజీబీవీని ఎంపిక చేసి తరగతులు ప్రారంభించారు. నీట్ శిక్షణకు వచ్చిన విద్యార్థినులకు రోజువారీగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాలపై గంటన్నర పాటు శిక్షణ ఇస్తున్నారు. అమరచింత కేజీబీవీలో లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థినులు -
దోపిడీకి ముగింపేది?
బహిరంగ మార్కెట్లో తరుగు, కమీషన్ పేరుతో మామిడి రైతులు విలవిల ● నెలక్రితం టన్నుకు రూ.1.50 లక్షలు, నేడు రూ.30 వేలే ● రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించని వ్యాపారులు ● ఆశించిన దిగుబడి రాక నష్టాల ఊబిలోకి.. ● జిల్లాలో 17 వేల ఎకరాల్లో సాగు రూ.60 లక్షలు వెచ్చించి వివిధ గ్రామాల్లో 10 తోటలు కౌలుకు తీసుకున్నా. ఇప్పటికీ మామిడి కాయలు విక్రయిస్తే రూ.15 లక్షలు కూడా రాలే. మూడు రోజుల క్రితం ఈదురు గాలులతో 5 టన్నుల కాయలు నేలరాలగా వాటిని విక్రయిస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా సరిపోలే. ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, దళారుల దోపిడీని అరికట్టాలి. – పెబ్బేటి మహేష్, మామిడి కౌలు రైతు, వీపనగండ్ల ప్రతి ఏటా మామిడి రైతులు కొనుగోలుదారుల చేతుల్లో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. – దొడ్ల కవిత, సర్పంచ్, గోపల్దిన్నె నిబంధనలు పాటించకుండా రైతుల నుంచి మా మిడి కాయలు కొనుగోలు చేసి ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేస్తే క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేయిస్తాం. – విజయభాస్కర్రెడ్డి, జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి, వనపర్తి వీపనగండ్ల: ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల నిలువు దోపిడీ వెరిసి మామిడి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. కొనబోతే కొరివి.. అమ్మబోతే అరివి అన్న చందంగా మారింది వారి పరిస్థితి. మామిడి చెట్లకు వేసే ఎరువులు, పూత దశలో పిచికారీ చేసే రసాయనిక మందులకు రూ.వేలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో పెట్టుబడి వ్యయం తడిసిమోపెడు అవుతుంది. తీరా పంట దిగుబడి వచ్చాక మామిడి కాయలు అమ్ముదామని పోతే బహిరంగ మార్కెట్లో దళారులు తరుగు, కమీషన్ల పేరుతో దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలడంతో దిగుబడి దారుణంగా పడిపోయింది. మిగిలిన పంటను అయినా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు. స్పందించాల్సిన ఉద్యాన శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మాయాజాలం జిల్లాలో పెబ్బేరు, కడుకుంట్ల గ్రామాల వద్ద కొందరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీపనగండ్ల మండలంలో మండల మహిళా సమైక్య ద్వారా మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభించి కాయ సైజు 250 గ్రాముల నుంచి 450 గ్రాముల మధ్యే ఉండాలన్న నిబంధనను విధించి, రోజు రెండు టన్నుల కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కవర్ కట్టిన కాయలు తీసుకోవడం లేదు. హైదరాబాద్ సమీపంలోని బాటసింగారంలో మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా అక్కడ నిబంధనలను పాటించడం లేదు. 4 శాతం తరుగు తీయాల్సి ఉండగా.. హమాలీ తరుగు, కాయలు నాణ్యతగా లేవని సాకు చూపి 18 శాతం తరుగును తీస్తున్నారు. నెల క్రితం టన్ను కాయలు రూ.1.50 లక్షలు పలకగా నేడు టన్నుకు రూ.30 చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలం రైతులు ఎకరాల్లో.. అమరచింత 101 449 ఆత్మకూర్ 240 769 కొత్తకోట 244 592 మదనాపురం 96 284 చిన్నంబావి 1,099 2,410 పాన్గల్ 1,081 1,980 వీపనగండ్ల 2,389 5,406 ఖిల్లాఘనపురం 193 421 గోపాల్పేట 292 675 పెబ్బేరు 515 1,319 పెద్దమందడి 210 562 రేవల్లి 150 344 శ్రీరంగాపురం 310 648 వనపర్తి 456 963 ఏదుల 381 748 మొత్తం 7,757 17,576 -
‘ఉపాధి’ పనులకు కూలీల సంఖ్య పెంచాలి
ఖిల్లాఘనపురం: ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచేందుకు మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని డీఆర్డీఓ ఉమాదేవి సూచించారు. శనివారం ఖిల్లాఘనపురం వచ్చిన ఆమె సర్పంచు పద్మమ్మ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఏపీఓ లక్ష్మి, ఈసీ సత్యం, పంచాయతీ కార్యదర్శి రవికుమార్తో మాట్లాడుతూ.. వివరాలు సేకరించారు. మండల వ్యాప్తంగా గతేడాదితో పోల్చితే కూలీల సంఖ్య చాలా తగ్గిందన్నారు. గతేడాది ఈ సమయంలో 2 వేల మంది కూలీలు మండలంలో పనికి హాజరైతే.. ఇప్పుడు ఆ సంఖ్య 1,150 పడిపోయిందన్నారు. జిల్లావ్యాప్తంగా మే నెలలో 1.23 లక్షల మంది కూలీలు పనిచేయాల్సి ఉండగా కేవలం 12 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారని తెలిపారు. పనులు చేసిన కూలీలందరికీ ఏప్రిల్ 15 నాటికి కూలి డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసిందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా ప్రజాప్రతినిధులు చొరువ తీసుకోవాలని సూచించారు. రైతులు ఎవరైనా అర ఎకరం వరకు మునగ పంట సాగు చేస్తే ఉపాధి పథకం ద్వారా సహకారం అందిస్తామని పేర్కొ న్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తు న్న మహిళా సంఘం భవనం, దివ్యాంగుల భవనాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో నాయ కులు ఆగారం ప్రకాష్, నాగేష్ పాల్గొన్నారు -
సంఘర్షణ నిర్మూలన కోసం..
● మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు ● మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్ ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు ● పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు. స్పష్టత కరువు నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది. పరిహారం అందితేనే రీలొకేషన్కు.. నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలని అంటున్నారు. ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్ చేపట్టాలి. పునరావాసంతోపాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. రీలొకేషన్ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్చంద్ర, ఐఎఫ్ఎస్ అధికారి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ -
‘రోడ్ల ఆక్రమణను అందరూ ఖండించాలి’
వనపర్తి టౌన్: జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ జరిగిన ప్రాంతాల్లో ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలని, మున్సిపల్ పాలక వర్గ సభ్యులందరూ సహకరించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మాధవి అధ్యక్షతను మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ అధికారులకు క్రమశిక్షణ కొరవడిందని, కనీసం ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వడం లేదని కౌన్సిలర్లు పితాంబర్, గంధం మదన్ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధికి సంబంధించి ఫొటోలతో కూడిన సమాచారం అందిస్తేనే కౌన్సిల్ బిల్లులు ఆమోదిస్తుందని కౌన్సిలర్ పాకనాటి కృష్ణ స్పష్టం చేశారు. విలీన గ్రామాలకు జనరల్ ఫండ్ నిధులు కేటాయించొద్దనడం సరికాదని కౌన్సిలర్లు శరవంద, ముడావత్ శంకరమ్మ అన్నారు. చైర్పర్సన్ భర్త అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై కౌన్సిలర్ ధనలక్ష్మి అభ్యంతరం తెలిపారు. మున్సిపాలిటీ దుకాణాలకు సంబంధించి పన్నులపై సీపీఎం సభ్యుడు గంధం మదన్ ప్రశ్నించారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్లు కౌన్సిల్కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషితోనే ఆస్తి పన్నుపై రాయితీ లభించిందని బీఆర్ఎస్ సభ్యుడు శ్రీకర్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
మదనాపురం: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వేగంగా కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ వినోద్కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. మదనాపురంలో ఐకేపీ సెంటర్తో పాటు అజ్జకొల్లు, రామన్పాడు, దుప్పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాల మేరకు వెంటనే సేకరించాలని సూచించారు. తూకాల్లో రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్ణీత బరువు కంటే అదనంగా తూకం వేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరగా మిల్లులకు తరలించాలి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా మిల్లులకు తరలించి, కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఐకేపీ మార్కెటింగ్ ఏపీఎం రాంబాబు, తహసీల్దార్ రేపోలు రాజు, ఏపీఎం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5లోగా అక్రిడిటేషన్కు దరఖాస్తు చేసుకోవాలి వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడిటేషన్ కార్డు జారీ చేసేందుకు వీలుగా జిల్లాలోని జర్నలిస్టులు మే 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి.సీతారాంనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తప్పా మిగిలిన జర్నలిస్టులు యాజమాన్యాల సిఫారస్ లెటర్, సర్క్యూలేషన్, అనుభవ పత్రాలతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, కాపీ డీపీఆర్ఓ కార్యాలయంలో అందించాలన్నారు. జర్నలిస్టు ప్రస్తుత హోదానే ఆన్లైన్లో నమోదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఎడిట్ ఆప్షన్ లేనందున జర్నలిస్టులు జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే సడ్మిట్ చేసిన దరఖాస్తుల్లో ఏమైనా మార్పులు చేయాలనుకునే వారు మే 5 లోపు డీపీఆర్ఓకు నేరుగా ఫోన్ చేసి తన దరఖాస్తును డిలీట్ చేయించుకొని తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 5 వరకు వచ్చే దరఖాస్తులను మాత్రమే కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే తదుపరి మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చించి, అర్హులైన జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేస్తామన్నారు. -
అనుచరులతోనే..
కొనుగోలు కేంద్రాల్లో వేలం సమయంలో గుత్తేదారు తన అనుచరులనే నలుగురిని నియమించుకొని వేలం పాడుతున్నట్లు నటించి తను అనుకున్నట్లుగా రైతులకు తక్కువ రేటు చెల్లిస్తున్నాడు. రశీదు కూడా ఇవ్వరు. నగదు చెల్లింపులో కూడా ఆలస్యం చేస్తున్నారు. చీడపీడల నివారణ, కాయలు తెంపేందుకు కూలీల రేట్లు, ట్రాన్స్పోర్ట్, తరుగు మొత్తంగా ఎకరాకు రూ.80 వేలు ఖర్చు వస్తే విక్రయించిన తర్వాత రూ.20 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వీపనగండ్లలో కాయల నాణ్యతను చూపిస్తున్న రైతులు -
‘కాంగ్రెస్ రైతుల ఉసురు తీస్తోంది’
ఆత్మకూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. శనివారం గాంధీచౌక్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతులు రాజులుగా బతికారని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేశామని గుర్తుచేశారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా లారీలు రావడం లేదని, గన్నీ బ్యాగులు లేవనే సాకుతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం దిగుబడి తగ్గిందని, వచ్చిన అరకొర పంటను కాపాడుకుని కేంద్రానికి తీసుకువస్తే కొనే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఽశంకుస్థాపనలకే పరిమితం ఆత్మకూర్ మండలంలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి, కాంగ్రెస్ నాయకులు ఆ అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందనే విషయం మరవొద్దని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనులు సైతం ప్రారంభించలేదని, ఈ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, లక్ష్మీకాంత్రెడ్డి, కోటేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
3నెలలకోసారి ఉద్యోగ మేళాలు
● రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ● మెగా జాబ్మేళాలో పాల్గొన్న 105 కంపెనీలు ● ఉమ్మడి జిల్లా నుంచి 3,450 మంది నిరుద్యోగుల హాజరు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు. ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. నియామక పత్రాల అందజేత ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పోలీసుల ప్రతిష్టను పెంచేలా పనిచేయాలి’
వనపర్తి: పోలీస్ సిబ్బంది తమ ప్రతిష్టను పెంచేలా, క్రమశిక్షణతో పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా సూచించారు. సాయుధ దళ పోలీసు కార్యాలయాన్ని శుక్రవారం అదనపు ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి, కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్, స్పోర్ట్స్ విభాగం, బాంబ్ డిస్పోజల్ టీం, మోటార్ వాహనాల విభాగాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి, నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి విభాగంలో రికార్డుల నిర్వహణ, సామగ్రి వినియోగం, వాహనాల స్థితిగతులను సమీక్షిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని, శాఖ ప్రతిష్టను దష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖ ప్రతిష్ట సిబ్బంది క్రమశిక్షణ, పనితీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా -
పీహెచ్సీలకు పైసల్లేవ్..!
పాలమూరు: ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ భారంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతి పీహెచ్సీకి హెచ్డీఎఫ్ (హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు రాక వసతులు సమకూర్చుకోలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు పీహెచ్సీ అభివృద్ధి కమిటీకి ఎంపీపీలు అధ్యక్షులుగా ఉండి విడుదలయ్యే నిధులపై పర్యవేక్షిస్తుండేవారు. వారి పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటంతో వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సరైన వసతుల కల్పన లేకపోవడంతో చాలా వరకు వైద్యాధికారులు పీహెచ్సీల వైపు చూడటం లేదు. చివరగా 2023 మార్చిలో.. మహబూబ్నగర్ జిల్లాలోని 17 పీహెచ్సీలు, ఆరు యూపీహెచ్సీలకు, మూడు సీహెచ్సీలకు గత మూడేళ్లుగా నిధుల కేటాయింపు లేవు. చివరగా 2023 మార్చిలో రూ.59.46 లక్షల నిధులు విడుదల కాగా.. దీంట్లో రూ.37.14 లక్షలు ఖర్చు చేశారు. తాజాగా ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద కేవలం 9 పీహెచ్సీలకు కలిపి రూ.6 లక్షలు విడుదల చేయగా దీంట్లో ఒక్కో పీహెచ్సీకి రూ.50 వేల చొప్పున.. ఒక్క రాజాపూర్ పీహెచ్సీకి మాత్రం రూ.2 లక్షలు విడుదల చేశారు. గద్వాల జిల్లాలో గత మూడేళ్లు నిధులు లేకపోవడంతో పీహెచ్సీల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద ఆరు పీహెచ్సీకు రూ.6.35 లక్షలు విడుదలైన నిధులు తప్పా ఇతర బడ్జెట్ రాలేదు. వనపర్తి జిల్లాలో కేవలం హెచ్డీఎస్ కింద 2023– 24 ఏడాదిలో మొత్తం 13 పీహెచ్సీలలో ఒక్కోదానికి రూ.1.39 లక్షలు విడుదల చేయగా.. 2024– 25లో ఒక్కో పీహెచ్సీకి రూ.61,579 విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి నిధుల కేటాయింపులకు నోచుకోలేదు. నారాయణపేట జిల్లాలో 11 పీహెచ్సీలు ఉండగా 2023 అక్టోబర్ నుంచి హెచ్డీఎస్ నుంచి కానీ కాయకల్ప విభాగం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. అవసరాలు తీరేదెలా? బడ్జెట్ కేటాయింపు లేకపోవడంతో పీహెచ్సీల్లో అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ భవనంలో చిన్నపాటి మరమ్మతు, పరిసరాలు శుభ్రం చేయడానికి వర్కర్లకు కూలీ, చిన్నపాటి పరికరాలు, బ్లడ్గ్రూప్ టెస్ట్ కిట్ల కొనుగోలు, విద్యుద్దీపాలు, టాయిలెట్స్ నిర్వహణ, రిజిస్టర్లు కొనుగోలు ఇలా ప్రతీది సమస్యగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ పరిధిలోని గర్భిణులతోపాటు దీర్ఘకాలిక రోగులు ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలంటే తప్పక ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. దీనికి ఏటా రూ.6 వేల వరకు ఖర్చు అవుతుంది. వీటికి కూడా నిధులు లేకపోవడంతో పలుచోట్ల వైద్యాధికారులే సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. గత మూడేళ్లుగా విడుదల కాని హెచ్డీఎస్, కాయకల్ప బడ్జెట్ నిర్వహణకు సైతం అవస్థలు.. పేరుకుపోతున్న సమస్యలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా కనికరించని ప్రభుత్వం నెట్ సదుపాయం కోసం సొంతంగా చెల్లిస్తున్న వైద్యాధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 69ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నేషనల్ హెల్త్ హెల్త్ మిషన్ కింద ప్రతి ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి కింద ఒక్కో పీహెచ్సీకి రూ.1.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యేవి. వీటి ద్వారా ఆయా పీహెచ్సీల్లో అభివృద్ధి కమిటీ తీర్మానం మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేవారు. అయితే గత మూడేళ్లుగా నిధులు మంజూరు ఊసేలేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా కనీస సౌకర్యాలు లేక పీహెచ్సీకి వచ్చిన రోగులతోపాటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ వస్తువులు మరమ్మతుకు గురైనా వాటిని బాగు చేయించే పరిస్థితి లేక సిబ్బంది సతమతమవుతున్నారు. ఇటీవలే ప్రభుత్వానికి బడ్జెట్ విషయంపై పలుమార్లు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతమైతే కలెక్టర్ దగ్గర అదనపు నిధులు తీసుకున్నాం. వాటిలో నుంచి పీహెచ్సీల నిర్వహణ కోసం కొంత ఖర్చు చేస్తున్నాం. చిన్నపాటి నిర్వహణ ఖర్చులు మెడికల్ ఆఫీసర్లు భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు త్వరలో వస్తాయని అనుకుంటున్నాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి ప్రస్తుతం పీహెచ్సీలకు నిధుల కొరత ఇబ్బంది ఉంది. హెచ్డీఎస్, కాయకల్ప నుంచి రావాల్సిన బడ్జెట్ సకాలంలో రావడం లేదు. ప్రస్తుతం సీఎస్ఆర్ నిధులతోపాటు ఇతర చోట్ల వచ్చేవాటిని సర్దుబాటు చేస్తున్నాం. త్వరలో ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు నిర్వహణలో సమస్యలు ఎదురవకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ, మహబూబ్నగర్ -
‘ప్రతి కార్మికుడిని గౌరవించాలి’
వనపర్తి: కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడిని గౌరవించాల్సి అవసరం ఉందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇతర కార్మికులను, ఉపాధి హామీ పథకంలో జిల్లాలోనే అత్యధిక పని దినాలు సద్వినియోగం చేసుకున్న కార్మికురాలు విజయమ్మ సన్మానించారు. అలాగే ఐటీఐ విద్యార్థులకు ప్రతిభా పురస్కార పత్రాలు అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల శ్రమే సమాజ అభివృద్ధికి మూల స్తంభమని కొనియాడారు. కార్మికులే ప్రగతి చక్రాలు కార్మికులే సమాజ ప్రగతి చక్రాలని, నిరంతరం వారు కష్టపడి చేయడం వల్లే అందరి అవసరాలు తీరుతున్నాయని డీఎస్పీ బాలాజీనాయక్ అన్నారు. ప్రతి వ్యక్తి తను పనిలో నిబద్ధతతో ఉంటే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. కార్మికులకు గౌరవించడం, వారి సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐటీఐ కళాశాలకు సంబంధించిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులకు సంబంధించిన పోస్టర్, కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై, కార్మికులకు కల్పించే పథకాలపై రూపొందించిన బుక్లెట్ను అధికారులు ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన ఏబీడీ లిక్కర్ పరిశ్రమలో 1,600 మంది కార్మికులు పనిచేస్తున్నారని, యాజమాన్యం తరఫున హాజరైన రీజనల్ మేనేజర్ ఉమాశంకర్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్మిక శాఖ అధికారి రవి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ హక్, ఐటిఐ విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, కార్మికులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమ కాంగ్రెస్ అజెండా
వనపర్తిటౌన్: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్మే మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా శుక్రవారం బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆర్టీసీ విస్తరణపై వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహాలక్ష్మి పథకంతో ఎంతో మంది మహిళలకు ఉచిత ప్రయాణం అందుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వం త్వరగా పరిష్కరించి, పీఆర్సీ పెంచిందని, మిగతా సమస్యలు సైతం త్వరలోనే పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో కండక్టర్లు, డ్రైవర్ల సేవలు అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు ఎమ్మెల్యేకు డీఎం దేవేందర్గౌడ్కు మొక్క అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, ఆర్టీసీ అధికారులు, కౌన్సిలర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు. ఆయిల్పాం సాగుతో సుస్థిర ఆదాయం గోపాల్పేట: ఆయిల్పాం మొక్కలు ఒకసారి నాటితే మూడేళ్ల తర్వాత కాపు ప్రారంభమై 30 ఏళ్ల పాటు నిరంతరం ఆదాయం అందిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక నీటివసతి, ఐదెకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులు ఆయిల్పాం తోటలు వెంటనే సాగు చేయడం ద్వారా లాభాలు గడించవచ్చన్నారు. ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, అలాగే గెలలు అమ్ముకునేందుకు ఫ్యాక్టరీల విషయంలో, డబ్బుల విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రస్తుతం గోపాల్పేట మండలంలో 320 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు పెంచుతున్నారని, భవిష్యత్లో మరింత విస్తరించాలని కోరారు. మండల వ్యవసాయ అధికారిణి కరుణశ్రీ, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి
కొనుగోళ్ల ప్రారంభ దశలో కొంత సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమే. జిల్లాలోని 36 మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు నిర్ణయించాం. గతంలో సీఎమ్మార్ పూర్తి చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. ధాన్యం పంపిస్తున్నాం. ప్రస్తుతం కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. ట్రాన్స్పోర్ట్ సమస్య వనపర్తి జిల్లాలో లేదు. దొడ్డు రకాలను దించుకునేందుకు ముందుకు వచ్చిన మిల్లర్లకే సన్నాలు ఇస్తున్నాం. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ, వనపర్తి ● -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్ : డీఈఓ
వనపర్తిటౌన్: తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపాలని.. చదువుతోనే ఎన్నో విజయాలు సాధించగలరని జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘని అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీచేసి అనంతరం తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. బడిబాటలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందిస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో సైతం ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారి మద్దిలేటి, సీఎంఓ ప్రతాప్రెడ్డి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ శేఖర్, ఏఎంఓ మహానంది, జీసీడీఓ శుభలక్ష్మి, బ్యాంక్ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
భానుడి విలయతాండవం
ఉమ్మడి పాలమూరులో తీవ్రమవుతున్న ఎండలు పాలమూరు: రోజురోజుకూ భానుడు విలయతాండవం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. మార్చి రెండో వారం నుంచే వేసవి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందినట్లుగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్ధరాత్రి తర్వాత చల్ల గాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మే నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగి అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకుల హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. ఊపిరాడనంత కష్టం వారం రోజులుగా ఎండల తీవ్రతకు ఊపిరి కూడా ఆడడం లేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా దాదాపు ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలాల నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇందులో కర్బన వాయువుల మోతాదు అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని చెట్ల కింద సేదతీరితేనే కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండల ప్రభావంతో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు మృతిచెందారు. ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్ హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం కిడ్నీలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు శరీర ఉష్ణోగ్రత మాములు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి. – డాక్టర్ స్వరూప్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధుల ఉక్కిరిబిక్కిరి ముందస్తు జాగ్రత్తలతోనే వడదెబ్బ నివారణ చల్లని చెట్లతో ఉపశమనం అంటున్న వైద్య నిపుణులు -
ప్రజాపాలనతోనే పేదలకు మేలు
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో స్పష్టమైన మార్పు వస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న పలువురు లబ్ధిదారుల గృహాలను సందర్శించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని, గౌరవప్రదమైన జీవనం అందించడమే ధ్యేయమన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ పి.అరుణ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి కృష్ణారెడ్డి, కాంగ్రెస్పార్టీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి -
క్రీడాశిక్షణకు వేళాయె..
●జిల్లాలోని వివిధ మండలాల్లో మొత్తం 17 క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మే నెల చివరి వరకు శిక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే శిక్షకులకు అన్నిరకాల సూచనలు చేశాం. 14 ఏళ్లలోపు బాలలు శిబిరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒక శిబిరంలో ఎంతమంది విద్యార్థులైనా ఉండవచ్చు. శిక్షకులకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లిస్తూ విద్యార్థులకు తర్ఫీదునిచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. – సుధీర్రెడ్డి, డీవైఎస్ఓ అమరచింత: వేసవి సెలవుల్లో బడిఈడు పిల్లలు చెడుదారి పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ కల్పిస్తూ నచ్చిన క్రీడను పరిచయం చేస్తూ తర్పీదునిచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి నెలరోజుల పాటు వివిధ క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. కొన్ని మండలాల్లో క్రీడా శిబిరాలు ప్రారంభం కాగా.. మిగిలిన ప్రాంతాల్లో మరో రెండ్రోజుల్లో ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. శిక్షకులకు ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించనుంది. శిబిరాలకు వచ్చే 14 ఏళ్లలోపు బాలలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వేసవి సెలవులు పూర్తయే వరకు విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి జిల్లావ్యాప్తంగా 17 ప్రాంతాలు ఎంపిక చేశారు. జిల్లాకేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో 7, మిగిలిన శిబిరాలు మండలాల్లో నిర్వహించనున్నారు. మండలాల్లో పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన శిక్షకుల దరఖాస్తులను పరిశీలించి వాటి ఆధారంగా శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడాసామగ్రి పంపిణీ.. శిక్షణకు హాజరయ్యే క్రీడాకారులకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడాసామగ్రి అందిస్తుందని జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ అధికారి సుధీర్రెడ్డి తెలిపారు. వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ కిట్లు, అథ్లెటిక్స్ సామగ్రిని ఆయా కోచ్లకు జిల్లాకేంద్రంలో పంపిణీ చేశారు. శిక్షణకు వచ్చే క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకుంటూ కోచ్ల వద్ద భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. శిబిరాలకు ప్రథమ చికిత్స కిట్లు అందించేందుకుగాను జిల్లాకు రూ.5 వేలు మంజూరయ్యాయి. కేంద్రం క్రీడ శిక్షకుడు శ్రీరంగాపురం కబడ్డీ ప్రవీణ్ ఆత్మకూర్ వాలీబాల్ అబ్దుల్ ఖదీర్ ఖిల్లాఘనపురం అథ్లెటిక్స్ దేవేందర్ గోపాల్పేట ఫుట్బాల్ సందీప్ ఏదుల ఫుట్బాల్ రవీందర్ వనపర్తి ఫుట్బాల్ ప్రవీణ్ చిన్నమందడి వాలీబాల్ రమేశ్ పెద్దమందడి వాలీబాల్ మన్యం యాదవ్ పాన్గల్ వాలీబాల్ శ్యామల (బాలికలు) కల్వరాల, వీపనగండ్ల వాలీబాల్ శ్రీకాంత్ పెద్దగూడెం, వనపర్తి వాలీబాల్ శేఖర్ పెబ్బేరు–1 ఫుట్బాల్ నాగరాజు పెబ్బేరు–2 ఫుట్బాల్ శంకర్ సోలీపూర్ హాకీ మన్యం యాదవ్ కడుకుంట్ల, వనపర్తి హాకీ నిరంజన్గౌడ్ వనపర్తి హకీ జావేద్, సాగర్ చిట్యాల, వనపర్తి కిక్బాక్సింగ్ వరుణ్కుమార్ 30 రోజుల శిక్షణతో క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడాపోటీలతో పాటు డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆడే అవకాశం లభిస్తుంది. వేసవి సెలవులు వృథా చేయకుండా ఆసక్తి గల విద్యార్థులకు రోజు ఉదయం 8 వరకు, సాయంత్ర ఐదు నుంచి ఆరు వరకు క్రీడల్లో శిక్షణనిస్తారు. జిల్లాలో 17 వేసవి శిబిరాలు 14 ఏళ్లలోపు చిన్నారులకు అవకాశం 30 రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ శిక్షకులకు గౌరవ వేతనం చెల్లింపు -
గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ ప్రతిభ, సీ్త్ర వైద్య నిపుణులు, మహబూబ్నగర్ ● -
పకడ్బందీగా విద్యా వారోత్సవాల నిర్వహణ
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మే నెల 11 నుంచి విద్యా వారోత్సవాలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా వారోత్సవాల్లో భాగంగా బడిబాట, పదోతరగతి, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు రెమెడియల్ తరగతులు నిర్వహించేందుకు, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా సర్పంచులు, వార్డుసభ్యులు, కౌన్సిలర్లు అందరికీ నియోజకవర్గస్థాయిలో విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం పుర పరిధిలోని హౌసింగ్బోర్డు కాలనీ, నర్సింగాయపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులను పుర కమిషనర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని నర్సరీని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలని సూచించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కొత్తకోట రూరల్: ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలు తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. గురువారం పెద్దమందడి మండలం జగత్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన పౌరహక్కుల దినంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మనిగిళ్ల, చిన్నమందడి, వెల్టూర్, పెద్దమందడిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి కొనుగోళ్లపై ఆరా తీశారు. సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా కొనసాగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని సూచించారు. పెట్రోల్బంక్ల తనిఖీ.. మండలంలోని కనిమెట్ట, పెద్దమందడి మండలం వెల్టూరులోని పెట్రోల్బంకును గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు, సరఫరా విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఇంధన సరఫరా నిరంతరం కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ పరిణత, ఇతర అధికారులు ఉన్నారు. -
డిపో అభివృద్ధికి కృషి చేయాలి
వనపర్తి టౌన్: తోటి ఉద్యోగులు ప్రతిభ కనబర్చిన వారిని ఆదర్శంగా తీసుకొని డిపో ఆదాయం పెంచాలని, రీజియన్లో డిపోను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆర్టీసీ డీఎం దేవేందర్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో గురువారం ఉత్తమ ఉద్యోగుల అభినందన కార్యక్రమం నిర్వహించి మార్చిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందించి మాట్లాడారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం, డీజిల్ ఆదా, బస్సుల నిర్వహణ, జీరో బ్రేక్డౌన్ ఉన్నవారిని అభినందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్, మెయింటెనెన్స్ సిబ్బంది, సూపర్వైజర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నారసింహ జయంత్యుత్సవాలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని శంకర్గంజ్లో ఉన్న లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటేశ్వరశర్మ నేతృత్వంలో ఉదయం శాస్త్రోక్తంగా సుప్రభాత సేవ, మూల, ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని ఆంజనేయుడు, శివుడికి సైతం విశేషంగా పూజలు చేశారు. రాత్రి స్తంభపూజ, లక్ష పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం ఉత్సవమూర్తులతో పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక వనపర్తి రూరల్: పెబ్బేరుకు చెందిన పరమేష్ జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ నాగరాజు గురువారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్–20 జట్టు ఎంపికలో పరమేష్ అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. మే నెల 3 నుంచి 25వ తేదీ వరకు ఛత్తీస్ఘడ్లో జరిగే జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడతారని పేర్కొన్నారు. గురువారం పట్టణంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి, వెంకట్, అఫ్సర్, రాజేందర్, సీనియర్ క్రీడాకారులు పరమేష్ను అభినందించారు. -
ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎస్ఐఆర్ ప్రత్యేక అధికారి చెన్నయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి తహసీల్దార్లు, సూపర్వైజర్లు, బీఎల్వోలతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిని పరిశీలించి నెమ్మదిగా సాగుతుండటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 70 శాతం మాత్రమే పూర్తయిందని పేర్కొంటూ.. అన్ని మండలాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. మరికొద్ది రోజుల్లో తిరిగి సమీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ మ్యాపింగ్లో వెనుకబడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మ్యాపింగ్ శాతం గరిష్టస్థాయికి తీసుకెళ్లా లని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పదిలో మెరిసిన బాలికలు
● రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచిన వనపర్తి ● 106 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత వనపర్తి: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడైన విషయం విధితమే. జిల్లా విషయానికొస్తే గత విద్యాసంవత్సరం రాష్ట్రంలో 29వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది 19వ స్థానానికి ఎగబాకడం విద్యాశాఖ అధికారులకు కాస్త సంతృప్తినిచ్చింది. గతేడాది ఉత్తీర్ణత శాతం 89 ఉండగా.. ప్రస్తుతం 97.46 శాతానికి చేరుకోవడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే బాలికలదే పైచేయిగా కొనసాగింది. ఆశ్రమ పాఠశాలలో వందశాతం.. జిల్లాలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా.. బీసీ వెల్ఫేర్, ప్రైవేట్ పాఠశాలల్లో 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగతా విద్యాలయాల్లో 88 శాతం నుంచి 98 శాతం నుంచి వరకు ఉత్తీర్ణత నమోదైంది. జిల్లావ్యాప్తంగా 7,219 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా.. 183 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో అత్యధికంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 149 మంది ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో 17 మంది, కేజీబీవీల్లో నలుగురు, మోడల్ స్కూల్లో ముగ్గురు, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదుగురు, మైనార్టీ గురుకులాల్లో ఇద్దరు, సాంఘిక సంక్షేమ గురుకులానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ అయినట్లు అధికారులు వెల్లడించారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఒక్కరు గైర్హాజరు కావడంతో ఉత్తీర్ణత వందశాతం నమోదు కాలేదు. పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని పెబ్బేరు మోడల్ స్కూల్ విద్యార్థిని పి.అర్షిత 577 మార్కులు, పాన్గల్ మండలం కదిరెపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని అస్నాన్ 576 మార్కులు, జిల్లాకేంద్రంలోని హరిజనవాడ పాఠశాల విద్యార్థి నజీర్ 566 మార్కులు సాధించారు. జిల్లాలో మొత్తం 175 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. 106 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో 97.46 శాతం ఉత్తీర్ణత నమోదు పైవ్రేట్ పాఠశాల విభాగంలో ఆత్మకూర్లోని ఎస్వీఎస్ సెంట్రల్ స్కూల్ విద్యార్థిని శ్రీనిధి 585 మార్కులు, జిల్లాకేంద్రంలోని సీవీ రామన్ పాఠశాల విద్యార్థిని సంజన 582 మార్కులు, ఆత్మకూర్లోని శ్రీవాణి పాఠశాల విద్యార్థిని దీప్తి 579 సాధించి తమదైన ముద్ర వేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 7,219 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా.. 7,027 మంది ఉత్తీర్ణత సాఽధించారు. వీరిలో బాలురు 3,594 మంది పరీక్షలు రాయగా, 3,462 మంది ఉత్తీర్ణత సాధించగా.. ముగ్గురు గైర్హాజరయ్యారు. మరో 129 మంది ఫెయిల్ అయ్యారు. బాలికల విషయానికొస్తే 3,625 మంది పరీక్షలు రాయగా.. 3,565 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆరుగురు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరుకాగా.. మరో 54 మంది ఫెయిల్ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అన్ని సెక్టార్లలో బాలికల ఉత్తీర్ణత శాతమే అధికంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. -
డిప్యుటేషన్తో కేంద్రాలు మూత..
పాన్గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి, మాందాపూర్, చింతకుంటపల్లి, చిన్నంబావి మండలంలోని వెలుగొండ, గోపాల్పేట మండలంలోని నాగపూర్ పల్లె దవాఖానాల నుంచి ఎంఎల్హెచ్పీ వైద్యులు డిప్యుటేషన్పై వెళ్లడంతో తెరుచుకోవడం లేదు. ఈ కేంద్రాల్లోని సిబ్బంది కూడా కేవలం వ్యాక్సిన్ ఉన్న బుధవారం రోజు కొద్దిసేపు తెరిచి ఉంచుతున్నారు. రేమద్దుల, బుసిరెడ్డిపల్లిలోని దవాఖానాలు వైద్యులున్నా సక్రమంగా తెరుచుకోవడం లేదు, అన్నారంలోని దవాఖానా మాత్రం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. పల్లె దవాఖానాలు సక్రమంగా తెరవకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. -
బంకులు.. బారులు
పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులతో మంగళవారం ఉదయం వాహనదారులు జిల్లాలోని పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద బారులు తీరారు. ఆత్మకూర్, అమరచింత ఒక్కో మండలంలో మూడు బంకులు ఉండగా కేవలం ఒక్కో బంకులో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉండటంతో వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. పంట కోతల సమయం కావడంతో కోత యంత్రాలు, ట్రాక్టర్ల నిర్వాహకులు డ్రమ్ములను తీసుకొచ్చి డీజిల్ పోయించుకోవడం కనిపించింది. మిగిలిన బంకుల్లో నో–స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. అమరచింతలో పోలీసుల పహారాలో ఇంధనం సరఫరా చేయడం కనిపించింది. గోపాల్పేటలోని రెండు బంకుల్లో సాయంత్రం వరకు నో–స్టాక్ బోర్డులు కనిపించాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఓ బంకుకు పెట్రోల్ రావడంతో వాహనదారులు బారులు తీరారు. చెన్నారంలో మాత్రమే డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంది. రేమద్దుల పెట్రోల్ బంకులో మధ్యాహ్నం వరకు పెట్రోల్ విక్రయించారు. – ఆత్మకూర్/అమరచింత/గోపాల్పేట -
బాలల భద్రత అందరి బాధ్యత
వనపర్తి: బాలల భద్రత, మత్తుకు అలవాటుపడ్డ వారిలో మార్పు, యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుంచి పారద్రోలడమే ముఖ్య ఉద్దేశమని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అన్నారు. బాలల భద్రత, రక్షణ.. మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు భరోసా, ఏహెచ్టీయూ షీ–టీం సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లింగ సమానత్వం, సమ్మతి, సైబర్ నేరాలు, యువతలో సురక్షిత ప్రవర్తన, సమస్యలు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేసే విధానం తదితర వాటి గురించి వివరించారు. ప్రతి విద్యార్థి తన హక్కులు, బాధ్యతలు తెలుసుకొని సురక్షితంగా ఉండటం చాలా అవసరమన్నారు. సమాజంలోని మార్పులను అర్థం చేసుకొని సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలికలు, యువతులు ఏ సమస్య వచ్చినా భయపడకుండా వెంటనే పోలీసులు లేదా షీ–టీమ్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో హెచ్టీయూ ఎస్ఐ అంజద్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్ శిరీష, షీ–టీం సిబ్బంది, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
కొత్తకోట రూరల్: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో వెబెక్స్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఏక్యూ నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం సేకరించాలని, రైతులు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించాలని, సరిపడా గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు, హమాలీలకు తాగునీరు, నీడ వసతి కల్పించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సమకూర్చుకోవాలని సూచించారు. రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి కేటాయించిన మిల్లు, గోదాంకు తరలించాలని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి కావాలని సూచించారు. ఇంధన కొరత లేకుండా చర్యలు.. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరం కొనసాగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లాలోని ఆర్డీఓ సుబ్రమణ్యంతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, ఇంధన అవుట్లెట్ డీలర్లు, ఎస్ఓలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యంగా వ్యవసాయ అవసరాలు, రవాణా, అత్యవసర సేవలకు ఇంధన కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే బంకుల్లో తగినంత నిల్వలు ఉండేలా పర్యవేక్షణ చేయాలని, రోజువారీ విక్రయాలు, నిల్వలపై సమగ్రంగా పరిశీలించాలని చెప్పారు. కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రంగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
ఆయిల్పాం సాగుపై ఆసక్తి చూపాలి
వనపర్తి రూరల్: ఆయిల్పాం పంటను ఒక్కసారి సాగు చేస్తే ఏళ్ల తరబడి ఆదాయం పొందవచ్చని.. రైతులు సాగుకు ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు కోరారు. మంగళవారం పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలోని రైతువేదికలో ఆయిల్పాం సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాణిజ్య పంటల కంటే ఆయిల్పాం సాగుకు అధిక ప్రోత్సాహం, రాయితీ అందిస్తోందని వివరించారు. మండలంలో 200 ఎకరాల్లో పంట సాగు లక్ష్యంగా నిర్ణయించిందని.. రాయితీతో పాటు అంతర పంటల సాగుకు రూ.4,200 చెల్లిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి భాస్కర్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి షేక్ మున్నా, మండల ఉద్యాన అధికారి కృష్ణయ్య, ఏఈఓ ఆంజనేయులు, గ్రామస్తులు పరశురాం, అర్జున్ పాల్గొన్నారు. -
ముందుకు.. వెనక్కి..
సాక్షి, నాగర్కర్నూల్: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిల ప్రాంతంలోనే హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో.. కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షణం చేసేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి సోమశిల వరకు హెలికాప్టర్లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యేలా టూర్ ప్లాన్ చేపట్టింది. హెలికాప్టర్లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరొకరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరిజం ప్యాకేజీని బుక్ చేసుకునే సందర్శకులకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం.. కృష్ణాతీరంలోని సోమశిలతో పాటు అమరగిరి సమీ పంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీప ంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్నెస్, స్పిరిట్యువల్ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఆగస్టులోనే పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్నెస్ సెంటర్లో కాటేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్పూల్, ల్యాండ్స్కేప్ గార్డెన్, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్నెస్, రిట్రీట్ ప్రాజెక్ట్ అటకెక్కింది. అసైన్డ్ భూముల్లో ఏర్పాటుతో.. హెలీటూరిజం ప్రాజెక్ట్ కింద హెలీప్యాడ్ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్ భూముల్లో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు హైదరాబాద్–సోమశిల హెలికాప్టర్ రైడ్ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్ పనులకు బ్రేక్ హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత -
పల్లె దవాఖానాపై పట్టింపేది
పేదలకు అందని వైద్యసేవలు ● కొన్ని కేంద్రాలు డిప్యుటేషన్తో మూత.. మరికొన్ని వైద్యులున్నా సక్రమంగా తెరుచుకోని వైనం ● సమయపాలన పాటించని సిబ్బంది.. మధ్యాహ్నానికే మూత ● నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం ●ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం.. గ్రామంలోని పల్లె దవాఖానాకు వైద్యులు సక్రమంగా విధులకు రావడం లేదని కలెక్టర్, డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశాం. వైద్యులు రాక కేంద్రం మూతబడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ఆర్ఐ ముందుకొచ్చి భవనం నిర్మించి వసతులు కల్పిస్తే వైద్యులు రాకపో వడం సరికాదు. జిల్లా అధికారులు స్పందించి రెగ్యులర్ వైద్యుడిని నియమించి కేంద్రం తెరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – రేగిచెట్టు నిరంజన్, సర్పంచ్, రేమద్దుల వైద్యులు లేక మూతబడిన కేంద్రం.. పల్లె దవాఖానాలోని ఎంఎల్హెచ్పీ వైద్యుడు డిప్యుటేషన్పై జిల్లాకేంద్రానికి వెళ్లడంతో మూతబడింది. సిబ్బంది కూడా వ్యాక్సిన్ ఉన్న బుధవారం రోజు మాత్రమే తెరిచి మిగతా రోజులు మూసి ఉంచుతున్నారు. అత్యవసర సమయంలో వైద్యసేవల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారులు స్పందించి డిప్యుటేషన్ రద్దుచేసి కేంద్రంలో వైద్యుడు ఉండేలా చూడాలి. – జంబులయ్య, సర్పంచ్, తెల్లరాళ్లపల్లి డిప్యుటేషన్ విషయాన్నిపరిశీలిస్తాం.. పల్లె ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశాం. అలాంటివి మూతబడటానికి వీలు లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలి. కేంద్రాలకు వెళ్లని, సమయపాలన పాటించని సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఎంఎల్హెచ్పీలు డిప్యుటేషన్పై వెళ్లిన విషయాన్ని పరిశీలిస్తాం. – డా. సాయినాథ్రెడ్డి, జిల్లా వైద్యాధికారి పాన్గల్: పల్లె దవాఖానా.. కొన్నాళ్ల కిందట ఈ పేరు వినగానే ప్రభుత్వ వైద్య సేవలపై పేదలకు ఓ విశ్వాసం కలిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మాదిరిగానే ఈ దవాఖాల్లోనూ వైద్యులుంటారని.. నిరంతర వైద్యసేవలు అందుతాయని నమ్మారు. కానీ.. వారు విశ్వసించిన స్థాయిలో ఈ దవాఖానాల్లో వైద్యసేవలు అందడం లేదు. కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ఎప్పుడోస్తారో కూడా తెలియని పరిస్థితి ఉండగా.. మరికొన్ని చోట్ల సిబ్బంది కేంద్రాలను తెరిచే దిక్కే లేకుండా పోయింది. కొన్ని కేంద్రాల్లోని ఎంఎల్హెచ్పీ వైద్యులు డిప్యుటేషన్పై జిల్లాకేంద్రానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఆయా కేంద్రాలు మూతబడ్డాయి. ఉన్న కేంద్రాలకు వచ్చే ఎంఎల్హెచ్పీలు, సిబ్బంది ఎక్కడ కూడా సమయ పాలన పాటించడం లేదు. పల్లె దవాఖానాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలనే నిబంధన ఉన్నా.. తాము వచ్చిందే సమయంగా భావించి మధ్యాహ్నానికే మూసి వెళ్తున్నారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందక ఇబ్బందులు తప్పడం లేదు. నెరవేరని లక్ష్యం.. వైద్యసేవలు పల్లెలకూ విస్తరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. ఎంబీబీఎస్ లేదా బీహెచ్ఎంఎస్, బీఎస్సీ నర్సింగ్ చేసిన వారిని ఎంఎల్హెచ్పీలుగా నియమించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాల పేరునే పల్లె దవాఖానాలుగా మారుస్తూ ఎంఎల్హెచ్పీ, ఒక ఏఎన్ఎం ఇక్కడ సేవలందించాలని ఆదేశించారు. కాగా క్షేత్రస్థాయిలో సిబ్బంది డిప్యుటేషన్పై వెళ్లడంతో మూడు కేంద్రాలు మూతబడ్డాయి. మరికొన్ని కేంద్రాల్లో నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తుండటంతో ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె దవాఖానాలు కొనసాగాలంటే అధికారులు పర్యవేక్షణ చేస్తూ కేంద్రాలను నిర్దేశిత సమయం వరకు తెరిచి ఉండేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. ‘పాన్గల్ మండలంలో 28 జీపీలకు ఒకే పీహెచ్సీ ఉంది. ఇందులో ఇద్దరు వైద్యులు ఉండగా.. ఒకరు డిప్యుటేషన్పై కడుకుంట్ల పీహెచ్సీకి వెళ్లి ఏళ్లు గడుస్తోంది. ముగ్గురు ఎంఎల్హెచ్పీ వైద్యులు, ఒక హెల్త్ అసిస్టెంట్ డిప్యుటేషన్లపై వెళ్లడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. మరో వైద్యుడు ఫీల్డ్ విజిట్కు వెళ్తుండటంతో పేదలకు సక్రమంగా వైద్యసేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’ -
ఉద్యాన కళాశాల విద్యార్థుల నిరసన
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును ప్రారంభించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ఉద్యానవిద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఉండగా.. మరో యూనివర్సిటీలో అదే కోర్సు ప్రవేశపెట్టడంతో ఉద్యాన విద్య ప్రత్యేకత దెబ్బతింటుందని, ఈ నిర్ణయంతో అకాడమిక్ వ్యవస్థలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోళ్లు
కొత్తకోట రూరల్: ఎఫ్ఏక్యూ నిబంధనలు పాటిస్తూ యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం మండలంలోని కనిమెట్ట, కానాయిపల్లి, పాలెం గ్రామంతో పాటు మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో రైతులకు కల్పించిన వసతులు, ధాన్యం సేకరణ జరుపుతున్న తీరును పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సన్న, దొడ్డురకం ధాన్యాన్ని గుర్తించాలని, కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ కోసం టెంట్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, నిర్దేశిత తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి కేటాయించిన మిల్లు లేదా గోదాంకు తరలించాలన్నారు. ధాన్యం మిల్లు, గోదాంకు చేరే వరకు నిర్వాహకులదే బాధ్యతని.. కొనుగోలు పూర్తయిన వెంటనే ట్యాబ్ఎంట్రీ చేయాలని చెప్పారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అఽ దికారి కాశీవిశ్వనాథ్, కొత్తకోట తహసీల్దార్ చాంద్పాషా, పీఏసీఎస్ సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. సమన్వయంతో సర్వే పూర్తి చేయాలి.. వీపనగండ్ల: ఉద్యోగులు సమన్వయంతో హౌస్హోల్డ్ సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణకు ఆయన హాజరై సూచనలు, సలహాలు చేశారు. ప్రణాళికతో చేపడితేనే సర్వేను పూర్తి చేయగలమని.. అందుకు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు తూంకుంటలో మూతబడ్డ ఇసుక రీచ్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమై ఇసుక రీచ్కు సంబంధించిన నివేదికను కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ ఖాజామైనుద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ గడ్డం శివకుమార్, ఆర్ఐ కురుమూర్తి, సర్వేయర్ శివ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ ఏర్పాటుచేయాలి..
కొల్లాపూర్లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. – సాయికృష్ణగౌడ్, మామిడి రైతు, సింగోటం ధరలు తగ్గించేశారు.. రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ ● -
బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ
వనపర్తి: స్థానిక డీఎస్పీగా జి.గిరిబాబు సోమవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీసు శిక్షణ కేంద్రంలో విధులు నిర్వహించిన ఈయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు సేవలందించిన వెంకటేశ్వరరావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డీఎస్పీ గిరిబాబు మాట్లాడుతూ.. వనపర్తి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల ను కాపాడటం తన బాధ్యతన్నారు. నేరాల నియంత్రణలో రాజీ ఉండదని, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతూ పోలీసింగ్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని పొందేవిధంగా పని చేస్తామని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని.. పోలీసు అధికారులు వారితో కలిసి పనిచేయాలని సూచించారు. క్రీడలతో మానసికోల్లాసం వీపనగండ్ల: క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం లభించడమేగాక క్రీడా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని కల్వరాలలో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిక్షణతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారి రాముడు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ, జీహెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీఈటీ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు వెంకటరాజయ్య, మండ్ల సురేష్, భాస్కర్, శివుడు, వెంకట్, గోపాల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైద్య కళాశాలకు మృతదేహం అప్పగింత ఆత్మకూర్: పట్టణానికి చెందిన విశ్రాంత డీఏఓ రాజశేఖరరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. వైద్య విద్యార్థులకు మృతదేహం ఉపయోగపడుతుందని, ఇందుకు ముందుకొచ్చిన రాజశేఖర్రావు కుటుంబ సభ్యులను ప్రొఫెసర్లు అభినందించారు. అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేశారు. రాజశేఖరరావు సతీమణి నాగమణి, కుమారుడు వెంకటనాంగేంద్రప్రసాద్, కుమార్తెలు విజయ లక్ష్మి, నాగజ్యోతి, బంధువులు పాల్గొన్నారు. -
స్వీయ నమోదు..
● ఏప్రిల్ 26 నుంచి మే నెల పది వరకు.. ● వివరాలు నమోదు చేసుకుంటున్న ఉద్యోగులు, ప్రజలు ● జనగణన–2007లో భాగమే ● రెండ్రోజుల్లో 490 మంది.. –8లో u●వనపర్తి: జనగణన–2027 స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం నుంచి మే నెల పది వరకు పౌరులు వారి కుటుంబ వివరాలను నిర్దేశిత వెబ్సైట్లో నమోదు చేసుకునేందుకు భారత ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం విధితమే. మొదటిరోజు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్తో పాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లాలోని 15 మండలాలు, ఐదు పురపాలికలను 1,139 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించారు. ఒక్కో బ్లాక్లో 700 నుంచి 800 జనాభా ఉండేలా మ్యాపింగ్ చేశారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఇంటి నిర్మాణం, పైకప్పు, వాహనాలు, రేషన్ కార్డు తదితర 33 రకాల ప్రశ్నలకు ఆన్లైన్ పోర్టల్లో జవాబులు నమోదు చేయాల్సి ఉంటుంది. స్వీయ నమోదు సమయంలో సెల్నంబర్ ఆధారంగా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విధిగా ఇంటి లోకేషన్ను మార్క్ చేయాలి. మొదటిరోజు 182 మంది అధికారులు చేసుకోగా.. రెండోరోజు మధ్యాహ్నం వరకు సుమారు 490 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు సీపీఓ హరికృష్ణ వెల్లడించారు. జిల్లాలో ఇలా.. సిద్ధం చేసిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ల మ్యాపింగ్ల ప్రకారం జనగణన ప్రక్రియ తొలి విడత ప్రారంభమవుతుంది. మే నెల 11 నుంచి అధికారులు 30 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకుగాను 1,139 మంది హెచ్ఎల్పీబీలు, 1,081 మంది ఎన్యూమరేటర్లు, 193 మంది సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమంగా భారత ప్రభుత్వం జనగణన– 2027 ప్రారంభించింది. స్వీయ నమోదు అవకాశాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలి. మొదటి దఫా ఇళ్ల గణన, జనాభా గణన 2026, మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. జనాభా లెక్కల చట్టం 1948 ప్రకారం మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. ఏ దర్యాప్తు ప్రయోజనాల కోసం ఈ సమాచారాన్ని వినియోగించబడదు. – హరికృష్ణ, సీపీఓ, వనపర్తి 15 రోజులు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం -
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
వనపర్తి: మాదకద్రవ్యాల రహిత జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, డీఎస్పీ బాలాజీనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. సోమవారం నుంచి మే నెల రెండో తేదీ వరకు ప్రభుత్వం బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ చొరవతో జిల్లాకేంద్రంలోని బాలసదనం చిన్నారులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా చేయించి పత్రాలతో పాటు క్రీడా సామగ్రి అందజేశామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో బాల్య వివాహాలు కట్టడి చేయడంలో పురోగతి సాధించినట్లు చెప్పారు. డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్తుకు బానిసైన వారిని మాన్పించేందుకు డి–అడిక్షన్ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా పది, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన బాలసదనం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మిషన్ వాత్సల్య దత్తతకు సంబంధించిన అడాప్షన్ హెల్ప్డెస్క్, పోస్టర్లును అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీపీఓ రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి.. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలు వేగంగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 41 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
ముగిసిన కో–ఆప్షన్ ఎన్నిక
ఆత్మకూర్: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. పుర కమిషనర్ చికినే శశిధర్, చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీను, కౌన్సిలర్లు పాల్గొన్నారు. క్యాటగిరి–1 నుంచి శ్రీనివాసులు, సౌజన్య గంగాధర్, క్యాటగిరి–2 నుంచి జహంగీర్, సన జహీర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ శివకుమార్, ఎస్ఐ జయన్న తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. దళిత సంఘాల ఆందోళన.. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలో దళిత వర్గానికి అన్యాయం జరిగిందని.. అర్హులైన వారిని సైతం విస్మరించారని దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ బైలా ప్రకారం ఎన్నిక జరగలేదని.. పట్టణంలో రెండు వేల ఓట్లున్న దళితులను విస్మరించి అవమానించారని నాయకులు రవీందర్, బుచ్చన్న, గాలిపంపు శ్రీను తదితరులు ఆరో పించారు. కలెక్టర్తో పా టు రాష్ట్రస్థాయి అధి కారులకు ఫిర్యాదు చేయ నున్నట్లు తెలిపారు. మైనార్టీల నిరసన.. 40 ఏళ్లుగా కాంగ్రెస్పార్టీలో ఉంటూ సేవలందించిన వారిని కాదని ఇటీవల వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారంటూ మైనార్టీ యువకులు నిరసన వ్యక్తం చేశారు. మైనార్టీ విభాగంలో సీనియర్ నాయకుడు మెకానిక్ షబ్బీర్ను కాదని జహంగీర్కు పదవి కట్టబెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. మంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. -
మామి‘డీలా’..!
కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. టన్నుకు కనిష్టంగా రూ.20వేల ధర.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు. స్థానికంగా మార్కెట్ లేకపోవడమే సమస్య.. మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 45వేలకు మాత్రమే కొనుగోలు కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ఆందోళనలో మామిడి రైతులు -
వారబందీ మరో రెండ్రోజులే..
● ఆయకట్టులో తుది దశకు చేరుకున్న వరి కోతలు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో యాసంగి వరి కోతలు తుది దశకు చేరుకోవడంతో కాల్వలకు మరో రెండ్రోజులు మాత్రమే సాగునీరు వదలనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారంలో మూడురోజుల పాటు సాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ప్రాజెక్టులో 1.461 టీఎంసీల నీరు ఉండటంతో వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. పీజేపీ నందిమళ్ల డివిజన్ డీఈ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. నీటి అవసరం ఉందని ఒకరిద్దరు రైతులు అడుగుతున్నారని.. రెండురోజుల్లో సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. -
స్వీయ జనగణనలో పాల్గొనాలి
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: మొదటి విడత స్వీయ జనగణన ఆదివారం నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగనుందని.. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. ఆదివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి హరికృష్ణతో కలిసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి వివరించారు. జిల్లాలో జనగణన–2027 ప్రక్రియ చేపట్టేందుకు 1,139 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించామన్నారు. ఒక్కో బ్లాక్లో సుమారు 700 నుంచి 800 జనాభా ఉంటుందని.. జనగణనకు జిల్లావ్యాప్తంగా 1,086 మంది ఎన్యూమరేటర్లు, 193 మంది సూపర్వైజర్లను నియమించి శిక్షణనిచ్చినట్లు చెప్పారు. మొదటి విడత స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) మే 10వ తేదీ వరకు కొనసాగనుందని.. ఇప్పటికే ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నట్లు వివరించారు. ప్రజలందరూ సంబంధిత వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఫిర్యాదు చేయండి..
జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్కుమార్, డీఈఓ కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెటీరియల్ ఫీజులు సంఖ్యతో సంబంధం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వసతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్య తీసుకోవాలి. జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు. హాస్టల్స్ కూడా ఇందులో నిర్వహిస్తున్నా పట్టింపు లేదు. – మారుతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
మదనాపురం: రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దంతనూరులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదల చిరకాల కోరిక సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. ప్రజా ప్రభుత్వానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న తమను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం గ్రామంలో హమాలీ కార్మిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సర్పంచ్ నాగరాజుగౌడ్, మార్కెట్ డైరెక్టర్ పావనిరెడ్డి, మాజీ సర్పంచ్ రాజవర్ధన్రెడ్డి, కాంగ్రెస్పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటన్న, గుగ్గిళ్ల రాములు, వివిధ గ్రామాల సర్పంచులు సుజాత నాగరాజు, శ్రావణ్ కుమార్, చింతకుంట శేఖర్, అంజాద్ అలీ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాగుతో అధిక దిగుబడులు కొత్తకోట రూరల్: రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పాలెం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం రాయితీపై అందజేసిన డ్రోన్ను ప్రారంభించి మాట్లాడారు. డ్రోన్తో ఎరువులు, పురుగు మందులు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు డ్రోన్ వినియోగాన్ని రైతులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా వివరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి -
ఇదేం శిక్షణ..!
● ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్ ● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ● షార్ట్, లాంగ్టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు ● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు న్యూటౌన్లో నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ రాజేంద్రనగర్లోని నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. గతంలో పలువురు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ ఇచ్చిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదని, సిలబస్ పూర్తి చేయలేదని, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదని అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పలు కోచింగ్ సెంటర్ల యజమానులు వాటి స్థానంలో కొత్త పేర్లతో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించారు. ఇందుకోసం పెద్దఎత్తున ఫీజులు వసూలు చేయడంతోపాటు హాస్టల్స్ సైతం నిర్వహిస్తున్నారు. వీటికి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలియని విద్యార్థుల తల్లిదండ్రులు రూ.వేలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. మహబూబ్నగర్తో పాటు నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తిలోనూ చాలా కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడం విశేషం. టెట్, డీఎస్సీ, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగత సెలవులు పెట్టుకుని శిక్షణ ఇస్తుండగా.. మరికొంత మంది ఉదయం, సాయంత్రం వేళల్లో కోచింగ్ సెంటర్లను నడిపిస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి ప్రైవేటు వ్యాపారాలు చేసేందుకు వీల్లేదు. -
ఎదురుచూపులు..
‘చంద్రగఢ్’ మరమ్మతుకు రూ.6.58 కోట్లు మంజూరు ● టెండర్ పూర్తయినా అగ్రిమెంట్లో జాప్యం ● 9 ఏళ్లుగా నిరుపయోగంగా నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల ● చంద్రగఢ్ లిఫ్ట్లో తాజాగా కాలిన ప్యానల్ బోర్డు ● వేసవి నాటికి పనులు పూర్తయ్యేనా? –8లో u●చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు దక్కించుకున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పటి వరకు అగ్రిమెంట్ మాత్రం పూర్తి చేయలేదు. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తిచేసి మరమ్మతులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ అమరచింత: నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్ మరమ్మతుల కారణంగా మరుగునపడింది. ఏళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించకుండా నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల మరమ్మతునకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించారు. అప్పట్లో మక్తల్ పర్యటనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని వేడుకోవడం, ఎనిమిది నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు వివరించడంతో వెంటనే రూ.6.58 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన జీఓ ప్రతులను సైతం సంబంధిత శాఖ అధికారులకు అందించడంతో టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియ 4 నెలల కిందట పూర్తవగా పనులు దక్కించుకున్న కంపెనీ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇదీ పరిస్థితి.. జూరాల ప్రాజెక్టు నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలను 2005లో రూ.50 కోట్లతో పూర్తి చేశారు. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా పైప్లైన్ నిర్మించారు. కాని కాంట్రాక్టర్ పనులు నాసిరకం చేపట్టడంతో పాటు పథకం నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించారు. నాణ్యత లేని పైపులు కావడంతో ఎక్కడికక్కడే పగిలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో పైపులు మార్చేందుకు నిధులు మంజూరుకు అనేక పర్యాయలు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. చంద్రగఢ్, బెక్కర్పల్లి ఎత్తిపోతల పరిధిలో ప్రస్తుతం 2,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది. ● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ మార్పు, లీకేజీలు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రికి వివరించగా.. వీటి కోసం త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం సంప్హౌజ్ నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్లైన్ మార్పు, చిన్న సంపుహౌజ్ల నిర్మాణం, కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటుకు రూ.2.52 కోట్ల ప్రతిపాదనలు చేశారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డుతో పాటు పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. బెక్కర్పల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల కోసం రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే ఇరిగేషన్శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు అందించారు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి సైతం విన్నవించడంతో నిధులు మంజూరయ్యాయి. -
త్యాగానికి ప్రతీక వాసవీమాత
● వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి: అహింస, ఆత్మగౌరవం, త్యాగనీరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి వాసవి కన్యకాపరమేశ్వరి మాత అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్లో వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై వాసవీమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి ధర్మం, అహింస, సత్యం వంటి గొప్ప విలువలను బోధించిన మహనీయురాలని, ఆమె చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని, వాసవీమాత బోధనలు అందరూ ఆచరించాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వాసవీమాత జయంతి వేడుకలు సమాజంలో సత్ సంకల్పం పెంపొందించేలా ఉంటాయన్నారు. జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి సుధీర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. వనపర్తి రూరల్: ప్రజా ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి బోనస్ అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మెంటెపల్లి, నాచహళ్లి, పెద్దగూడెం, పెద్దగూడెం తండా, కడుకుంట్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ఽధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి ,సర్పంచ్లు పుష్పలత, వాల్యానాయక్, తిరుపతయ్య, రాములు, అబ్దుల్లా, పలువురు కాంగ్రెస్పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతిరోజు రెండుపూటలు..
ప్రతి ఇంట్లో నిత్యం కనిపించే చాయ్కు ఇది పూర్తిగా భిన్నమైంది. దవాచాయ్కి పాలు, చక్కెర, టీపొడి అవసరం ఉండబోదు. 24 మూలికల చూర్ణంను నీటిలో మరిగించి నేరుగా తీసుకోవడమే. మరిగించిన నీరు ముదురు గులాబీ రంగులోకి వస్తే.. ప్రతిరోజు రెండుపూటలా చాయ్ కప్పు మోతాదులో తీసుకుంటే.. చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని ప్రాంతాల్లో ఈ చాయ్కు డిమాండ్ పెరిగింది. వనపర్తి జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చాయ్ సెంటర్కు ఉదయం సుమారు 250 నుంచి 500 మంది వస్తుంటారు. కొందరు దవాచాయ్ తాగితే.. మరికొందరు గ్రీన్ జ్యూస్ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ఆరోగ్యవంతులే.. శ్రీమంతులు
ఔషధ గుణాలు కలిగిన దవాచాయ్.. గ్రీన్ జ్యూస్లకు ఆదరణ నిత్యం వాకింగ్ తర్వాత తీసుకుంటున్న ఔత్సాహికులు 24 మూలికల చూర్ణంతో దవాచాయ్ తయారీ ధాతు ఆయుర్వేదం సహకారంతో సెంటర్ల ఏర్పాటు కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ వనపర్తి: కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చిందనడానికి ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధనే ఉదాహరణగా చెప్పవచ్చు. యసిడిక్ ఆహారం, పానియాలను తగ్గించి సేంద్రియ ఎరువులతో పండించిన వాటిని తినడం, వందేళ్ల క్రితం నాటి ఆహారపు అలవాట్లను మళ్లీ పునఃప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాకు ముందు డబ్బు సంపాదించే వారిని ధనవంతులుగా చెప్పుకొనేవారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం కలవారే నిజమేన శ్రీమంతులుగా అభివర్ణించడం విశేషం. మారిన ప్రజల ఆలోచన తీరుకు అనుగుణంగా చద్దన్నం, మిల్లేట్ టిఫిన్స్, దవాచాయ్, గ్రీన్ జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. శతాబ్దాల నాటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రంతో అనుబంధం ఉన్న ధాతు ఆయుర్వేదంకు సంబంధించిన డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సహకారంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాకేంద్రాల్లోనూ దవాచాయ్ సెంటర్లు వెలిశాయి. -
గ్రీన్ జ్యూస్ రకాలు.. ఉపయోగాలు
● ఎనిమిది రోజుల వయస్సు గల గోధుమగడ్డి జ్యూస్తో రక్తం పెరిగి.. బీపీ నియంత్రణ, చర్మవ్యాధులు తగ్గుతాయి. ● బూడిద గుమ్మడికాయ జ్యూస్ వల్ల గ్యాస్, అల్సర్ సమస్య, బరువు తగ్గడం, హార్ట్ బ్లాక్ సమస్య పరిష్కారంతోపాటు గర్భాశయ సమస్యల చెక్ పెడుతుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపరుస్తోంది. ● కొత్తిమీర, పుదీన, తులసీ జ్యూస్తో గర్భసంచి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ● సోరకాయ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, బరువును అదుపులో ఉంచుతుంది. ● కాకరకాయ జ్యూస్ షుగర్ను నియంత్రణలో ఉంచటంతోపాటు మల బద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది. ● కీర దోసకాయ జ్యూస్ గుండెజబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించేందుకు పనిచేస్తుంది. ● దొండకాయ జ్యూస్ లివర్ సంబంధిత సమస్యను తగ్గించేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ● క్యారెట్, బీట్రూట్ జ్యూస్ను రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా తాగాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ జ్యూస్ను తాగకూడదు. మునగాకు జ్యూస్ మిక్సిడ్ వెజిటేబుల్ జ్యూస్ శరీరంలో సత్తువ తగ్గిన వారికి ఒంట్లో బలం పెంచేందుకు, ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చిన వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. రణపాల జ్యూస్ కిడ్నీలో రాళ్లు కరిగించడం, చర్మ వ్యాధులను తగ్గించడం, దీర్ఘకాలిక గాయాలను తగ్గించడానికి దోహదపడుతుంది. మునగాకు జ్యూస్లో అధిక పోషకాలు ఉండటం వల్ల రక్తహీనత తగ్గటం, జీర్ణక్రియ మెరుగుపడటం, చర్మం, జుట్టు సమస్యలను పరిష్కరించడం, షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. -
రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు
ఖిల్లాఘనపురం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోసం గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని.. సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శనివారం డీసీసీ ఉపాధ్యక్షుడు సాయిచరణ్రెడ్డితో కలిసి మండలంలోని తిర్మలాయపల్లి, కమాలోద్దీన్పూర్, అంతాయపల్లి, ఆగారం, ఖిల్లాఘనపురం, సల్కెలాపురం, సూర్యతండా, అల్లమాయపల్లి, రోడ్డుమీది తండా, షాపురం, మానాజీపేట, దొంతికుంట తండా, సోళీపురం, రుక్కన్నపల్లి, ఉప్పరిపల్లి, సూరాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. కొత్తపల్లిలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు మండల కేంద్రంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం సందర్భంగా లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కేంద్రాల్లో విక్రయించడంతో మద్దతు ధర రూ.2,389 లభిస్తుందని.. అదేవిధంగా సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ అందుతుందని వివరించారు. అవసరమైన ప్రతి గ్రామంలో సింగిల్విండో, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ సుగుణ, ఎంపీఓ నర్సింహయ్య, ఏపీఎం నాగరాజు, సింగిల్విండో సీఈఓ కృష్ణ, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, ఖిల్లాఘనపురం సర్పంచ్ ఆగారం పద్మమ్మ, నాయకులు మురళీధర్రెడ్డి, రవీందర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, కృష్ణయ్య యాదవ్, ఆగారం ప్రకాష్, గంజాయి రమేష్, క్యామ రాజు, డా. నరేందర్గౌడ్, బాలకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, మాసయ్యగౌడ్, నవీన్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, రవినాయక్, శ్రీరాములు, దేవిజానాయక్, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
వేసవి క్రీడా శిబిరంప్రారంభం
గోపాల్పేట: యువత, క్రీడాభిమానులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్కుమార్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వేసవి క్రీడా శిబిరాన్ని వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మైదానంలో రోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు ఫుట్బాల్ క్రీడలో మెళకువలు నేర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఆంజనేయులు, జిల్లా హాకీ అకాడమీ కోచ్ సాగర్, క్రీడాకారులు సందీప్, రవి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ వేలంవాయిదా వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో శనివారం నిర్వహించాల్సిన తైబజార్, పశువుల సంత, జంతు వధశాల బహిరంగ వేలం వాయిదా వేసినట్లు పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తైబజార్కు 3, పశువుల సంతకు 2, జంతు వధశాలకు దరఖాస్తులు రాకపోవడంతో వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి వేలం ఈ నెల 29 (బుధవారం) నాడు ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనిదోష నివారణ కోసం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత జిల్లేడు పూలు, తిలతైలాభిషేక పూజలు చేశారు. లింగదర్శనం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ క్రికెట్ సంబురం జడ్చర్ల టౌన్: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్నగర్ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్లకు జడ్చర్ల బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హాజరుకాన్నారు. 31 జట్లు.. 61 మ్యాచ్లు.. టోర్నమెంట్ను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 20–20 ఓవర్ల విధానంలో 61 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 31 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఏడు గ్రూప్లో నాలుగేసి జట్లు ఉంటాయి. ఒక్క గ్రూప్లో మాత్రం మూడే జట్లు ఉంటాయి. డ్రా ద్వారా గ్రూప్లను విభజిస్తారు. ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్ఫైనల్కు చేరుకుంటాయి. మ్యాచ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. మ్యాచ్లు జరిగే మైదానాల్లో మ్యాట్లు వేశారు.క్రీడాకారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మ్యాచ్లు తిలకించేందుకు వచ్చే వారి కోసం సైతం మైదానాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. -
ధాన్యం.. దైన్యం!
ఆరేళ్లుగా నిలిచిన రాయితీ టార్పాలిన్ల పంపిణీ ● పొంచి ఉన్న అకాల వర్షాల ముప్పు ● ప్రైవేట్ వ్యాపారుల వద్ద అద్దెకు తీసుకుంటున్న వైనం ● ఆందోళనలో అన్నదాతలు కొత్తకోట రూరల్: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి.. కొనుగోలు కేంద్రాలు కూడా లాంఛనంగా ప్రారంభించినా ఇంకా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో చాలామంది రైతులు తమ ధాన్యాన్ని పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఎండబెట్టుకుంటున్నారు. వాతావరణంలో మార్పులతో వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రైతుల వద్ద టార్పాలిన్లు లేక ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద 50 శాతం రాయితీతో టార్పాలిన్లు రైతులకు అందజేసింది. ధర రూ.2,500 ఉంటే రూ.1,250కి విక్రయించింది. తర్వాత ఈ పథకాన్ని వ్యవసాయశాఖకే పరిమితం చేయగా.. చివరిగా 2018లో వీటిని పంపిణీ చేశారు. ఆరేళ్లుగా పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో కొందరు అన్నదాతలు ప్రైవేట్ వ్యాపారుల వద్ద టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటుండగా.. మరికొందరు పూర్తి ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో టార్పాలిన్కు రూ.4 వేల వరకు ధర ఉందని రైతులు చెబుతున్నారు. ఈ యాసంగిలోనైనా రాయితీపై అందివ్వాలని అన్నదాతలు కోరుతున్నారు. అదనపు భారం.. పండించిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా కాపాడుకోనేందుకు టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక్కోదానికి రోజుకు రూ.10 నుంచి రూ.15 వరకు చెల్లిస్తారు. రెండెకరాల ధాన్యానికి సుమారు 10 టార్పాలిన్లు అవసరమవుతాయి. రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత యాసంగిన 20 రోజులపైనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉంచాల్సి వచ్చింది. దీంతో ఒక్కొక్కరిపై రూ.2 వేల పైనే భారం పడింది. తేమ పేరుతో కొర్రీలు.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు 17 శాతం లోపు తేమ ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందంటూ కేంద్రాల వద్ద రోజుల తరబడి ఆరబెట్టాల్సి వస్తోందని.. అకాల వర్షాలకు ధాన్యం టార్పాలిన్లు లేక తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి రాయితీ ఇస్తున్నప్పటికీ టార్పాలిన్ల పంపిణీపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేదు.. ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్ల పంపిణీని నిలిపివేసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం అందుబాటులో ఉంచాం. సర్దుబాటు చేసుకోవాలి. రాయితీ టార్పాలిన్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ ప్రకటిస్తే రైతులకు తెలియజేస్తాం. – దామోదర్, ఏడీఏ, కొత్తకోట నిర్లక్ష్యం సరికాదు.. యాసంగి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాం. అనుకోకుండా వర్షం వస్తే కప్పేందుకు టార్పాలిన్లు లేవు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. రైతు ప్రభుత్వమని చెప్పుకొనే పాలకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. – బాజ గిరన్న, రైతు, కానాయపల్లి -
ఇబ్బందులు తప్పడం లేదు..
రైతులు దేశానికి వెన్నెముక అంటారు. కానీ.. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. ప్రతి విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పంట వేసిన నాటి నుంచి విక్రయించేంత వరకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మకానికి తీసుకొస్తే కప్పడానికి టార్పాలిన్లు లేక వర్షం ఎప్పుడొస్తుందోనని భయంగా ఉంటుంది. ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు పంపిణీ చేస్తే బాగుంటుంది. – మండ్ల శాంతమూర్తి, రైతు, అజ్జకొల్లు అద్దెకు తెచ్చుకుంటున్నాం.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి వర్షానికి తడవకుండా ఉంచేందుకు టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటున్నాం. గతంలో ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్తు విక్రయించగా.. ప్రస్తుతం నిలిపివేసింది. అద్దెకు తీసుకురావడంతో అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు విక్రయించాలి. – రాజు, రైతు, కొత్తకోట ● -
చాలా మంచిది..
దవాచాయ్ తాగడం శరీరానికి చాలా మంచిది. గ్యాస్, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం ఒక్క టీ గ్లాస్ దవాచాయ్ తాగుతాను. గత కొన్ని రోజులుగా నేను దవాచాయ్ తాగుతున్నాను. నాకు తెలిసిన మిత్రులకు, గ్యాస్ సమస్య ఉన్నవారికి అలవాటు చేశాను. సుమారు 24 వనమూలికల సమ్మిళితంతో తయారు చేస్తున్నారు. పాలు, చక్కెర, టీ పొడిలతో తయారు చేసిన చాయ్ను తగ్గించాం. – సుధీర్రెడ్డి, డీవైఎస్ఓ, వనపర్తి కెఫిన్.. ప్రమాదకరమైనది రెగ్యులర్గా తీసుకునే టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. సాధారణ టీలో 60 శాతం, గ్రీన్టీలో 50 శాతం ఉంటుంది. దీంతోపాటు కాఫీ, టీ పొడి, పాలు, చక్కెర సైతం కల్తీ అవుతున్నాయి. కల్తీ అయినవి ఎందుకు అని దవాచాయ్ తీసుకుంటున్నాం. సహజసిద్ధంగా సేంద్రియ పద్ధతిలో పెంచిన వన మూలికల చూర్ణం నీటిలో మరిగిస్తే దవాచాయ్ తయారవుతుంది. – శ్రీకాంత్, ఉద్యోగి, వనపర్తి గ్రీన్ జ్యూస్లతో ఆరోగ్యం ఇక్కడ లభించే పలు రకాల గ్రీన్ జ్యూస్లతో చాలా ఆరోగ్యం. సేంద్రియ ఎరువులతో పండించిన గుమ్మడి, సోరకాయ, దొండ, కాకర, ఇతర కూరగాయలను జ్యూస్గా చేసి ఇస్తున్నారు. ఇంట్లో ఇలాంటివి చేసుకోవడం సాధ్యం కాదు. టీ, కాఫీలకు బదులు ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక గ్రీన్ జ్యూస్ తాగుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాం. – రాంరెడ్డి, వనపర్తి ● -
రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
● తెల్లవారుజాము నుంచేప్రారంభమైన రాకపోకలు ● విధుల్లో చేరిన 382 మంది కార్మికులు వనపర్తిటౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా మూడు రోజులుగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించడంతో శనివారం రోడ్డెక్కాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు సమ్మె విరమణపై స్పష్టత రాకపోవడంతో కార్మికులు రిపోర్ట్ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో ఉదయం 3 గంటలకు బయలుదేరాల్సిన బస్సులు 5 గంటల సమయంలో రోడ్డెక్కాయి. సమ్మె కారణంగా మొదటిరోజు అద్దె, ఆర్టీసీ బస్సులు 20, రెండో రోజు 50, మూడోరోజు 68 బస్సులు 10 రూట్లలో ప్రైవేట్ సిబ్బందితో సేవలందించాయి. సమ్మె కారణంగా మూడు రోజుల్లో ఆర్టీసీ రూ.50 లక్షల పైచిలుకు ఆదాయం కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం 186 మంది కండక్టర్లు, 127 మంది డ్రైవర్లు, 55 మంది మెకానిక్లు, మరో 14 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం 382 మంది విధుల్లో చేరడంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 38 రూట్లలో 109 ఆర్టీసీ, అద్దె బస్సులు రాకపోకలు సాగించాయి. డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఆయా రూట్లలో సకాలంలో బస్సులు నడిచేలా పర్యవేక్షించారు. ఆర్టీసీ సేవలను మునుపటిలాగే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. -
పకడ్బందీగా ఓటరు మ్యాపింగ్
వనపర్తి రూరల్: ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా మండలంలోని పెద్దగూడెం గ్రామంలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపాలన అధికారులు ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను సత్వరం పరిశీలించి అర్హులైన వారికి ఆర్థిక సాయం అందేలా చూడాలని తహసీల్దార్ రమేష్రెడ్డి, సంబంధిత అధికారులను కోరారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో విచారణలో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్సరెన్స్లో జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్ఐలు, గ్రామపాలన అధికారులతో సమీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
పోటీ లేకుండా సహకారం
● నూతన సంస్కరలా..? రాజకీయ వ్యూహమా..? ● ఎమ్మెల్యేల చేతుల్లోకి పీఏసీఎస్ పగ్గాలు ● డీసీసీబీకి కూడా నామినేటేడ్ చేసే అవకాశం పీఏసీఎస్ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదే జీఓను కొనసాగిస్తూ అకస్మాత్తుగా రద్దు చేయడం, తిరిగి నామినేటేడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు మరింత చికాకుగా మారాయి. సహకార ఎన్నికల స్వస్తి పలికి, నామినేటేడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్న తరుణంలో రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. మదనాపురం/అచ్చంపేట: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలను నియమించాలనే నిర్ణయం రాజకీయ వేడెక్కించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా మరో ఆరు నెలలు గడువును పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గడువు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసింది. కాగా..ఊహించినట్లుగానే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదవీకాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలోనే నామినేటేడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో 76 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటి అన్నింటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)జిల్లా మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కూడా పాలకవర్గాలను నామినేటేడ్ చేసే అవకాశం ఉంది. పోటీ లేకుండా పదవులు? ఇక డైరెక్టర్ల ఎంపికలో పాత పద్ధతిలో అనుసరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సహకార శాఖ వర్గాల ప్రకారం ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, మిగిలిన వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత నామినేటేడ్ కమిటీల నియామక ప్రక్రియ త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగా ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నేతల్లో హర్షం వ్యక్తవుతుంటే, ప్రతిపక్షాలు దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పీఏసీఎస్ పాలనపై నియంత్రణను స్థానిక ఎమ్మెల్యేల చేతుల్లోకి అప్పగించేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 76 సొసైటీలుంటే.. నాగర్కర్నూలు జిల్లాలో 23, వనపర్తి15, జోగుళాంబగద్వాల 11, మహబుబ్నగర్17, నారాయణపేట 10 చొప్పున సొసైటీలు పని చేస్తున్నాయి. మరో 20 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో సొసైటీల పరిధిలో 380 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 76 మంది చైర్మన్లు, 76 మంది వైస్ చైర్మన్లను నియమిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అధికార పక్షం నేతలు పీఏసీఎస్లను ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. ప్రభుత్వం నామినేటేడ్ వైపు మొగ్గు చూపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నాయకులకు పోటీ లేకుండానే సహకార సొసైటీలో పదవులు దక్కే అవకాశం దక్కుతుంది. ఆత్మకూర్, రేచింతల, కొత్తకోట, పామాపురం, పెద్దమందడి, కొప్పునూరు, తూంకుంట, గోపాల్పేట, శ్రీరంగాపురం, పెబ్బేరు, పాన్గల్, నాగవరం, రాజానగరం, ఖిల్లాఘనపురం, వనపర్తి. పీఏసీఎస్ పదవులు ఇక నామినేటెడ్ స్థానిక రైతుల అవసరాలు, క్షేత్రస్థాయి సమస్యలపై పాలకమండళ్లకు ఉండే అవగాహన అధికారులకు లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణాలు మంజూరు చేయాలన్నా, ఎరువుల తెప్పించాలన్నా ఇన్చార్జ్లు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూడాల్సి వస్తోంది. దీంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. సహకార సంఘాలు బలోపేతం అయితేనే పల్లెల్లో ఆర్థిక లావాదేవీలు కొనసాగుతాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 15 సంఘాల భవితవ్యం తేలాలంటే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
వైభవంగా శేషదాసుల రథోత్సవం
మల్దకల్: స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శేషదాసుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం దాసులవారి ఉత్సవమూర్తులను రథంపై ఉంచి భాజాభజంత్రీలతో ఊరేగించారు. అంతకు ముందు అభిషేకాలు, హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, శశాంక, ప్రసన్నచారిలు భక్తులకు ప్రవచనాలు వినిపించారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు బ్రాహ్మణులు, భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మహిళా భజన మండలి సభ్యులతో ప్రత్యేక భజనలు కొనసాగాయి. భక్తులకు దాసుల వారి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, శేషదాసుల వారి వంశస్థులు ధీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, విష్ణుదాసు, శశాంకదాసు, మధుసూదనాచారి, వెంకటేశ్వరావు, అరవిందరావు, శ్రీకాంత్జోషి, శేషగిరిరావు, గిరిరావు, చంద్రశేఖర్రావు, ముకుందరావు, బాబురావు, శ్రీకాంత్జోషి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
వనపర్తిటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను శుక్రవారం ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి, ఆస్తుల పరిరక్షణకు నాటి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి చట్టాన్ని రూపొందించి నాటి గవర్నర్ అనుమతికి పంపితే కాలయాపనతో సాధ్యం కాలేదని వివరించారు. వేతన సవరణ 44 శాతం అందించింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి పోరాడటం ప్రాథమిక హక్కని.. నేటి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణగదొక్కడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికులు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం కాలయాపన చేస్తూ కార్మికులను పట్టించుకోకుంటే ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ విశ్వనాథం, బొబ్బిలి ప్రేమ్కుమార్, పెద్దముక్కుల రవి, చలపతిరెడ్డి, బీఎస్ నారాయణ, గోకం భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నందిమళ్ల అశోక్, శ్రీకర్గౌడ్, ప్రేమ్నాథ్రెడ్డి, సూర్యవంశం గిరి, జోహెబ్ హుస్సేన్, హేమంత్, చిట్యాల రాము, మంద రాము, అస్లాం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ.. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కార్మికులు ఆర్టీసీ డిపో నుంచి బస్టాండ్, పొట్టి శ్రీరాములు చౌరస్తా, రాజీవ్ చౌక్, కమాన్ చౌరస్తా, శంకర్గంజ్ తదితర ప్రాంతాల మీదుగా మౌన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందనూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 44 వాహనాలు, డిగ్రీ విద్యార్థులకు 17 ల్యాప్టాప్లు, 2 సెల్ఫోన్లు అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడం లక్ష్యంగా ఉపకరణాలను అందజేస్తుందని వివరించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్లో కూడా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల గణన పక్కాగా చేపట్టాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఖిల్లాఘనపురం: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 11 నుంచి కొనసాగుతున్న ఇళ్ల గణన పక్కాగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు కొనసాగుతున్న శిక్షణను శుక్రవారం ఆయన పరిశీలించారు. వారితో మాట్లాడి శిక్షణలో ఎదురవుతున్న సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనగణనలో భాగంగా ముందుగా చేపట్టే ఇళ్ల గణన సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. రోజు ఉదయం వేళలో సర్వే చేసేలా చూసుకోవాలని.. ఆ సమయంలో ఎండవేడిమి తక్కువగా ఉండటంతో పాటు ప్రజలంతా ఇళ్ల దగ్గరే ఉంటారని చెప్పారు. సర్వే పూర్తయిన ఇళ్లకు కచ్చితంగా స్టిక్కర్ అంటించాలని.. ప్రతి ఒక్కరి ఇంటి పేరుతో పేర్లు రాయాలన్నారు. ఇళ్ల రకాలు, ఆలయాలు, పాఠశాలలు తదితర ప్రభుత్వ భవనాలను గుర్తించాలని.. కార్లు, మోటర్ సైకిళ్లు, టీవీలు తదితర వాటి వివరాలు చెప్పేందుకు ఇష్టపడని వారితో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేర్పుతో ఒప్పించి సేకరించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వరి కోతలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సాదాబైనామాల పరిష్కారం, మండలంలోని భూముల పరిస్థితులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర వాటి వివరాలను తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 382 వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని.. ఇప్పటి వరకు 103 గ్రామాల్లో ప్రారంభించినట్లు చెప్పారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు, జనాలతో మాట్లాడి ఎందుకోసం వచ్చారు.. కార్యాలయ అధికారులు పనులు ఎలా చేస్తున్నారు అనే విషయాలను ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్, ఆర్ఐ తిరుపతయ్య, కార్యాలయ సిబ్బంది, టీఓటీలు, ఎన్యూమరేటర్లు ఉన్నారు. -
కార్మికుడి మృతి బాధాకరం
ఖిల్లాఘనపురం: ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ మృతి ఎంతో బాధాకరమని టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడు రాంసింగ్నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో ఉన్నారని, శంకర్గౌడ్ మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఉద్యోగ భద్రత, వేతన సమస్యలు, పెండింగ్ బకాయిలు, పరిపాలనా ఒత్తిళ్లు తదితర సమస్యలతో ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్గౌడ్ బలిదానాన్ని ప్రభుత్వం గుర్తించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఉద్యోగులందరికి సమన్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలన్నారు. ఇకనైనా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు హీరాలాల్, ఉపాధ్యాయుడు రాజశేఖర్ పాల్గొన్నారు. డీసీఆర్బీ డీఎస్పీని కలిసిన న్యాయ సలహాదారు వనపర్తి: జిల్లా భరోసా కేంద్రం న్యాయ సలహాదారుగా నియమితులైన సత్యశ్రీ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు, బాధిత వర్గాల రక్షణకు భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు న్యాయం, మార్గదర్శకం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసుశాఖతో సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు తక్షణ న్యాయ సాయం అందించే దిశగా నిబద్ధతతో పని చేయాలని. పోలీసుశాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,279 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.5,199 ధర పలికింది. ఆముదాలు గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.5,900, జొన్నలు గరిష్టంగా రూ.5,678, కనిష్టంగా రూ.4,277, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,759, కనిష్టంగా రూ.1,609, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.24,40, కనిష్టంగా రూ.1,721, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,827, కనిష్టంగా రూ.1601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,217, కనిష్టంగా రూ.1,925, హంస గరిష్టంగా రూ.1,741, కనిష్టంగా రూ.1,729గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి నారాయణపేట: తెలంగాణ ప్రభుత్వం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా హైదరాబాద్ దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో 2026–27కుగాను పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎల్.రాజేందర్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రలను కోల్పోయిన అనాథ బాలికలు, ఇతర నిరాశ్రయ బాలికలు (అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికలు) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. మొత్తం సీట్లలో 70 శాతం వీరికే కేటాయిస్తామని.. పదో తరగతి పాసైన వారు అర్హులన్నారు. ఎంపికై న బాలికలకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం (అనాథలైతే..) , హాస్టల్/హోమ్ నుంచి సంబంధిత సూపరింటెండెంట్/అధికారితో జారీ చేసిన డిక్లరేషన్/బోనాఫైడ్ సర్టిఫికేట్ బదిలీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికేట్, మెమో (కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలి) జిరాక్స్ ప్రతులను దరఖాస్తునకు జతచేసి మే నెల 22లోగా జిల్లాకేంద్రంలోని బాలరక్ష భవన్, మోనప్పగుట్ట, కలెక్టర్ కార్యాలయం పక్కన సమర్పించాలని, ఇతర వివరాలకు జిల్లా బాలల పరిరక్షణ అధికారిని సంప్రదించవచ్చని సూచించారు. -
వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం
● ఫిట్నెస్ను జీవితంలో భాగస్వామ్యం కావాలి ● గవర్నర్ శివప్రతాప్ శుక్లా ● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్ మహబూబ్నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శరీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు. క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఖేల్ మహోత్సవ్ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడల తో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నా రు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● అంతకముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
నీటి కుంటలతో భూగర్భ జలాల వృద్ధి
ఖిల్లాఘనపురం: ఉపాధి పనుల్లో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో నీటి కుంటలు తవ్వడంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు మూగ జీవాలకు తాగునీటి వసతి ఏర్పడుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అమృత్ సరోవర్లో భాగంగా శుక్రవారం మండలంలోని ఉప్పరిపల్లి శివారులో నెమలి జాలు వంపు వద్ద తవ్విన నీటి కుంటను వారు పరిశీలించి కూలీలతో మాట్లాడారు. 10 వారాలుగా కూలీ డబ్బులు రావడం లేదని తెలుపగా.. వివరాలు తెలుసుకొని వారం రోజుల్లో చెల్లించేలా చూస్తామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులో రూ.10 లక్షల ఉపాధి నిధులతో అమృత్ సరోవర్ ఫండ్ను తవ్వుతున్నట్లు చెప్పారు. జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఇలాంటి వాటిని నిర్మించడంతో భూగర్భ జలాలు కచ్చితంగా పెరుగుతాయన్నారు. అటవీ భూమి కావడంతో మూగ జీవాలకు కూడా తాగునీటి వసతి కల్పించినవారమవుతామని తెలిపారు. గ్రామానికి చాలా దూరంలో పనులు చేస్తున్నామని.. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కూలీలు చెప్పడంతో స్పందించిన అధికారులు మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉన్నందున గ్రామపంచాయతీ ట్రాక్టర్లో కూలీలను తీసుకెళ్లాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ లక్ష్మి, ఈసీ సత్యం, టీఏ, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను శోభాయమానంగా అలంకరించి.. వేదమంత్రాల నడుమ కల్యాణతంతు జరిపించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. -
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
మదనాపురం: ఓటరు జాబితాను తప్పులు లేకుండా పాదర్శకంగా రూపొందించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. గురువారం మదనాపురం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్లో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. జాబితాలో మరణించిన వారి పేర్లను గుర్తించి తొలగించాలని.. దీనిపై క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా ఓటు హక్కుకు దూ రం కాకూడదన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆ యన హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దా ర్ రేపోలు రాజు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ‘ఉపాధి’ కూలీల వేతనాలు చెల్లించండి అమరచింత: ఉపాధిహామీ కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అమరచింత ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మూడు నెలలుగా కూలి చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయడంతో పాటు రోజు పని ప్రదేశంలో రెండు పూటల ఫొటో క్యాప్చర్ తీసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. వడదెబ్బతో చనిపోయిన ఉపాధి కూలీలకు రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో తాగునీటి వసతి, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు తట్టబుట్ట సరఫరా చేయాలన్నారు. కొలతల పద్ధతిని రద్దుచేసి, రోజు కూలి రూ.600 ఇవ్వాలని.. ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో భగవంతు, చిన్నవిష్ణు, జలగరి రాములు, విజయ్, నిశాంత్, అరుణ్ పాల్గొన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా ఆత్మకూర్: స్థానిక మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికను వాయిదా వేసినట్లు చికినే శశిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పాలనలో అనుభవమున్న మాజీ వార్డు సభ్యుల నుంచి ఒక్క నామినేషన్ కూడా అందకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని వివరించారు. తిరిగి 24, 25 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, 27న ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయాలని.. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని కమిషనర్ సూచించారు. వేరుశనగ @ రూ.6,461 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.6,461, కనిష్టంగా రూ.4,889 ధరలు లభిచాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,310, కనిష్టంగా రూ.5,940, జొన్నలు గరిష్టంగా రూ.5,887, కనిష్టంగా రూ.5,377, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,609, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,461, కనిష్టంగా రూ.1,651, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,831, కనిష్టంగా రూ.1,600, కందులు రూ.గరిష్టంగా రూ.6,266, కనిష్టంగా రూ.5,660, పెబ్బర్లు రూ.6,277 ధరలు లభించాయి. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
–8లో u● ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గంలో ఆర్అండ్బీ శాఖ చేపట్టాల్సిన రోడ్ల పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ, మెడికల్ ఆస్పత్రి, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వినోద్కుమార్, ఎన్.ఖీమ్యానాయక్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ ధనలక్ష్మి తదితరులు ఉన్నారు. వనపర్తి: ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని దిశ కమిటీ చైర్మన్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన తోపాటు కో–చైర్మన్ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలన్నారు. విద్యుత్శాఖ అధికారులు పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పశుసంవర్ధకశాఖ పరిధిలో జీవాలకు సకాలంలో రోగనిరోధక టీకాలు వేసి రైతులకు సహకరించాలన్నారు. హౌసింగ్శాఖకు సంబంధించి జిల్లాకు మొత్తం 6,203 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో కేవలం 4,864 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, మిగతా 1,340 ఇళ్లను వేగంగా గ్రౌండింగ్ చేసి నిర్మాణాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆర్థిక కారణాలతో ఇళ్ల నిర్మాణం చేసుకోలేని వారికి స్వయం సహాయక బృందాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు స్కాలర్షిప్స్ పెండింగ్ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రూ.13 కోట్లతో మొత్తం 199 సీసీరోడ్లు మంజూరయ్యాయని.. వీటిలో ఇంకా 25 నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ పొందడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పౌర సరఫరాల అధికారికి సూచించారు. ఉపాధి కల్పనకు ప్రాధాన్యం.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ మల్లు రవి సూచించారు. ప్రతి బ్యాంకు పరిధిలో ఎన్ఎస్ఎంఈ, ముద్ర, పీఎం విశ్వకర్మ పథకాల పరంగా లబ్ధిదారులకు వేగంగా రుణాలను మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బ్యాంకర్ల వద్ద పెండింగ్లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను కూడా సామాజిక బాధ్యతగా నిర్మించడం జరిగిందన్నారు. అదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు 500 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వందశాతం పూర్తిచేయాలి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు రానివ్వొద్దు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాద్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామం కూడా పంచాయతీ భవనం లేకుండా ఉండొద్దని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానంపై రైతు లకు అవగాహన కల్పించాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు పథకాల లబ్ధిని చేకూర్చాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు రావాల్సి ఉంటే కలెక్టర్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్మిక శాఖకు సంబంధించి శ్రమ యోగి మాంధన్ యోజన పథకంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లాలోని 21 పీఎంశ్రీ పాఠశాలల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. -
మక్కలు.. తిప్పలు..
● వేగం పెరుగని మొక్కజొన్న కొనుగోళ్లు, రోజుల తరబడీ రైతుల ఎదురుచూపులు ● నాగర్కర్నూల్లో వారం రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేత ● ప్రైవేటు అమ్మకాలతో దక్కని మద్దతు ధర ●సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పక్షం రోజులైనా కొలిక్కిరాని కొనుగోళ్లు.. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చి సుమారు నెలరోజులు అవుతోంది. ఈసారి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ఊపందుకోలేదు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో నర్వ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నా ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులకు ఇప్పటివరకు కొన్నది 760 బస్తాల మొక్కజొన్న మాత్రమే. వనపర్తి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం వెయ్యి మెట్రిక్టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 8,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు. అరకొరగా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు గోపాల్పేట కొనుగోలు కేంద్రంలో కాంటా చేసిన మక్కలను తీసుకెళ్లేందుకు లారీలు సరిగా రావడం లేదు. అకాల వర్షాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి. మరోవైపు అధికారులు ఈ నెల చివరి వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటున్నారు. అలా కాకుండా వచ్చేనెల కూడా కొనాలి. ఇంకా చాలామంది కోతలు కోయాల్సి ఉంది. వారికి ఇబ్బంది లేకుండా చూడాలి. – సింగారపు రమేశ్, యువ రైతు, సింగాయపల్లి, ఏదుల మండలం మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – తహమీనా, జిల్లా మార్క్ఫెడ్ అధికారి, నాగర్కర్నూల్ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్నగర్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల నేపథ్యంలో రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి పంటను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఇదే అదనుగా ప్రైవేటు దళారులు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లకు ప్రభుత్వ మద్ధ తు ధర క్వింటాలు రూ. 2,400 లభిస్తుండగా, ప్రైవేటులో ఎక్కడా క్వింటాలు రూ.1,700 దాటడం లేదు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, ప్రతీ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఆర్టీసీ సేవలు అంతంతే!
వనపర్తి: ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు పలు డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజు కొనసాగింది. జిల్లాకేంద్రమైన వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రైవేటు డ్రైవర్లతో ఉదయం అంతంతమాత్రంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు.. సాయంత్రం వరకు 50 శాతానికి పైగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని బస్సులను ప్రైవేటు కండెక్టర్లతో నడపగా.. మరికొన్నింటిని కండెక్టర్ లేకుండానే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. గురువారం పాఠశాలలకు చివరిరోజు కావడంతో గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్ల నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు దాదాపుగా తమ సొంత వాహనాలనే వినియోగించారు. పోలీసు పహారాలో.. తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో, బస్టాండ్ వద్ద పోలీసులు మోహరించారు. కార్మికుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు పహారా మధ్య బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని బస్సుల్లో పోలీసు సిబ్బంది కండక్టర్లుగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్, కర్నూలు, గద్వాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, ఆత్మకూర్, ఖిల్లాఘనపురం తదితర రూట్లలో బస్సుల సమయపాలన లేకపోయినా.. ఆశించిన మేర అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 71 బస్సులు ప్రయాణికులకు సేవలందించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. 17 ఆర్టీసీ బస్సులు, 47 అద్దె బస్సులు, 7 ఈవీ బస్సులను నడిపినట్లు పేర్కొన్నారు. రెండో రోజు అరకొరగానే బస్సు సర్వీసులు కార్మికుల సమ్మెకు అద్దె బస్సుల యజమానుల మద్దతు 50శాతం పైగా బస్సులు నడిపినట్లు అధికారుల వెల్లడి రీజియన్లో 426 నడిచిన బస్సులు రెండు రోజు గురువారం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి. -
రీజియన్లో 134 నడిచిన బస్సులు
● 109 బస్సులకు గాను సేవలందించింది 20 మాత్రమే ● ప్రయాణికులకు తప్పని తిప్పలు ● డిపో ఎదుట నిరసన తెలిపిన ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు వనపర్తి టౌన్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మెతో బుధవారం ప్రగతి రథ చక్రాలు డిపోకే పరిమితమయ్యాయి. వనపర్తి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు ప్రజలకు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో అందుబాటులో ఉన్న ప్రైవేట్ వాహనాల వైపు పరుగులు తీశారు. మూడు, నాలుగు గంటలకు ఒక్క బస్సు రావడం.. అది కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బస్సులే కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్మికుల సమ్మెను విజయవంతం చేసేందుకు వనపర్తి ఆర్టీసీ జేఏసీ కార్మికులు వేకువజాము నుంచే డిపో ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిపోల నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా ముట్టడించారు. పోలీస్, రవాణా అధికారుల సహకారంతో.. పోలీస్, రవాణా శాఖ అధికారుల సహకారంతో కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు అతికష్టం మీద నడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రవాణా శాఖ అధికారులు హెవీ లైసెన్స్ ఉన్న 12 మంది డ్రైవర్లను, మరో ఏజెన్సీ 12 మంది కండక్టర్లను తీసుకొని హైదరాబాద్, మహబూబ్నగర్, ఆత్మకూర్, గద్వాల తదితర ప్రాంతాలకు మొత్తంగా కేవలం 12 బస్సులను మాత్రమే నడపగలిగారు. ఆర్టీసీ అధికారులు విన్నవించినా.. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు అత్యధికులు సమ్మెకు మద్దతివ్వడంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. కేవలం 8 అద్దె బస్సులు మాత్రమే రాకపోకలు సాగించాయి. ప్రతీ రోజు ఆర్టీసీ డిపో నుంచి డిపార్ట్మెంట్, అద్దె బస్సులు కలుపుకొని 38 రూట్లలో 109 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేవి. సమ్మె కారణంగా రెండు, మూడు రూట్లలో ఒకే సర్వీస్తో అద్దె, ఆర్టీసీ బస్సులు కలుపుకొని కేవలం 20 బస్సులను మాత్రమే డిపో అధికారులు నడపగలిగారు. ఉమ్మడి జిల్లాలో ఏ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు రోడెక్కడం లేదని, వనపర్తి డిపో మేనేజర్ కార్మికుల సమ్మెకు సహకరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నాయకులు డీఎం దేవేందర్గౌడ్తో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను వ్యవహరిస్తున్నట్లు డీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులకు, డిపో మేనేజర్ దేవేందర్గౌడ్తో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ హైర్, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్నగర్ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు. -
బాబోయ్.. భౌభౌలు
వనపర్తిజిల్లాలో మూడు నెలల్లో 350 మందిపై కుక్కల దాడులు గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026●వనపర్తి: జిల్లావ్యాప్తంగా కుక్కల దాడులు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు నెలల వ్యవధిలోనే 350 మందిపై కుక్కలు దాడి చేశాయంటేనే పరిస్థితి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కల సంతతిని తగ్గించేందుకు రూ.50 లక్షల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఎనిమల్ కేర్ సెంటర్ కొద్ది రోజులుగా మూసే ఉంచారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసినా.. స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం ధోరణి వీడటం లేదు. కనీసం నియంత్రణ చర్యలపై కూడా దృష్టి సారించకపోవడం శోచనీయం. ఐదు మున్సిపాలిటీల్లో.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ పరిధిలోనే సుమారు 2,600 పైచిలుకు కుక్కలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా. ఇక గ్రామాలతో కలిపితే వాటి సంఖ్య రెండింతల కంటే ఎక్కువే ఉంటుంది. చిన్నారులు క్రీడా మైదానంలో ఆడుకునేందుకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా సమీకృత కలెక్టరేట్లోనూ కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా.. పట్టించుకులే వారు లేకుండా పోయారనే నిట్టూర్పులు నిత్యం వినిపిస్తుంటాయి. కుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులు, ద్విచక్రవాహనాలపై వారిని వెంబడిస్తున్నా యి. రాత్రిపూట రోడ్లపై వాహనదారుల వెంటపడుతూ భయపెడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోట, ఆత్మకూరు, పెబ్బేరు, అమరచింత మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు నామమాత్రలు చర్యలతో సరిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యర్థ ఆహార పదార్థాలు, మాంసం వల్లే.. జిల్లాలోని ప్రధాన పట్టణాలు వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు ప్రాంతాల్లో హోటళ్లు, చికెన్, మటన్ షాపుల్లో వదిలేసే వ్యర్థాల కోసం కుక్కలు అక్కడే గుంపులుగా ఉంటూ.. రోడ్లపై సంచరించే వారిపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టం వచ్చినట్లు వ్యర్థాలను రోడ్డు పక్కనే వేయడంతో మాంసానికి అలవాటు పడిన కుక్కలు.. మాంసం లభించనప్పుడు పందులు, మేకలు, గొర్రెలు, మనుషులపై దాడి చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బ యటికి వెళ్లాలన్నా భయపడాల్సిన దుస్థితి ఉందని ప్ర జలు వాపోతున్నారు. కుక్కల దాడి నుంచి తప్పించుకునే సమయంలో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. సుల్తానాబాద్ ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం అధికారుల్లో కనిపించని చలనం మనుగడలో లేని ఎనిమల్ కేర్ సెంటర్ రూ.50 లక్షల నిధులు వెచ్చించినా ఫలితం లేదు జిల్లావ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీ అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 3 వేల వరకు కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 450 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మరికొన్ని కుక్కలకు సైతం ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెంటర్ మూతపడి ఉన్న కారణంగా ఖచ్చితమైన లెక్కలు అందుబాటులో లేవని మున్సిపల్ అధికారులు తెలిపారు. కుక్కలు 2024లో 824 మందిపై, 2025లో 1,137 మందిపై దాడిచేయగా చికిత్స అందించారు. 2026 మార్చి చివరి వరకు 351 మందిపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. పది రోజుల నుంచి నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ కలిగి దాడులు చేస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. అవి ఆగ్రహంతో ఉన్న సమయంలో ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వారిపై దాడి చేస్తు న్నాయి. సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరకక ఇలా వ్యవహరిస్తుంటాయని వైద్యులు తెలిపారు. ప్రధానంగా పిల్లలపై అధికంగా దాడులు చేసే అవకాశం ఉంటుందంటున్నారు. -
కుక్కల నియంత్రణకు చర్యలు
జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల్లో కుక్కల సంతతిని నింయంత్రించేందుకు ఎనిమల్ కేర్ సెంటర్ను నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు కుక్కల బెడద నుంచి ఉపశమనం కలిగించేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఎక్కడైనా నిత్యం కుక్కల గుంపుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే మా దృష్టికి తీసుకురావాలి. వారి ఇబ్బందులు తొలగించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు. – వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, వనపర్తి -
భూమి సంరక్షణ అందరి బాధ్యత
కందనూలు: భూమిని సంరక్షించడం అందరి బాధ్యత అని, విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పర్యావరణాన్ని రక్షించడం అంటే మన భవిష్యత్ను రక్షించుకోవడమే’ అనే నినాదంతో విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేపట్టి ప్రజల్లో చైతన్యం కల్పించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సులోనే పర్యావరణ విలువలను అలవర్చుకోవాలని, వాటిని సమాజంలోకి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భూమి తల్లి సంరక్షణ కోసం చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి వనరుల సంరక్షణ వంటి చర్యలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు తమ పంట పొలాల్లో వినియోగించే ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని గుర్తు చేయాలని, ఎరువుల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని చెప్పారు. అనంతరం పుడమితల్లి సంరక్షణపై వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ కుర్మయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్రావు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్కుమార్, ఉపాధ్యాయుడు సుదర్శన్, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతులు, మహిళలకు సమున్నత స్థానం
కొత్తకోట రూరల్: ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్న రకం వరి ధాన్యానికి బోనస్ అందించి అన్నదాతలకు అండగా నిలుస్తోందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు. పెద్దమందడి మండల కేంద్రంతో పాటు వెల్టూరులో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎంపీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే, కాంటా చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులకు వారం రోజుల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ వెల్టూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న పలువురు లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఇల్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఎస్ఓ కాశీవిశ్వనాధ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పీఎంశ్రీ పథకం కింద రూ 13.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సైన్స్ ల్యాబ్ను బుధవారం ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్సురభి ప్రారంభించారు. అనంతరం చిట్యాలలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, గ్రామ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ, సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్కుమార్, ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి, ప్రిన్సిపాల్ ప్రశాంతి, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, సర్పంచులు జి శోభ, సాలమ్మ, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, తహసీల్దార్ రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి -
‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్ధేశించుకోవాలి’
వనపర్తి టౌన్: పదో తరగతి విద్యార్థులకు అత్యంత ముఖ్యమైందని, ఉన్నత చదువులకు నాందిగా నిలుస్తుందని డీఈఓ అబ్దుల్ ఘనీ అన్నారు. బుధవారం సంగ్రహణాత్మక మూల్యాంకనం–2లో 500 పైగా మార్కులు సాధించిన, నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్–2026 పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హరిజనవాడ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను మెమోంట్లతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ గెలుపునకు ప్రయత్నిస్తూనే తోటి వారికి సహయపడాలని సూచించారు. పాఠశాల వయస్సులో విద్యార్థులు చురుగ్గా ఉంటారని, ఇప్పటి నుంచే లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. క్రమశిక్షణతోనే జీవితంలో ఏదైనా సాధించగలమని, క్రమశిక్షణ లేని గెలుపు జీవితంలో గౌరవాన్ని ఇవ్వదన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.చంద్రశేఖర్, 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు వాకిటి రవికుమార్, పాఠశాల చైర్మన్ యాదయ్య, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, శ్రీనివాసరావు, డీటీఎఫ్ అధ్యక్షుడు యోసేప్, గంధం నాగరాజు, ఉపాధ్యాయులు వెంకట రాములు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ
● బర్త్ సర్టిఫికెట్ల జారీకి రూ.25 వేల లంచం డిమాండ్ ● రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూర్కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్ కార్యాలయానికి తిరుగుతూ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తామని సదరు అధికారి ద్వారా ఆర్డీఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించారు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
పల్లెల్లో ‘పరిషత్’ సందడి!
ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు ● ఓటరు జాబితా, ఉద్యోగుల గుర్తింపు, శిక్షణలు ఇప్పటికే పూర్తి ● ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు ● పెరగనున్న స్థానాలు మళ్లీ రిజర్వేషన్ల ప్రక్రియ తప్పదా..? అప్పటి పరిస్థితుల ఆధారంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రకారం.. జిల్లాలోని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోమారు రిజర్వేషన్లు పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు.. గత పరిషత్ ఎన్నికల సమయంలో జిల్లాలో 128 ఎంపీటీసీ, 14 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఈసారి ఐదు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానం పెరిగింది. నాగర్కర్నూల్ జిల్లా నుంచి కొన్ని గ్రామాలను వనపర్తి జిల్లాలో విలీనం చేయడంతో మాచుపల్లి, గుండ్యావాల్యానాయక్తండా, సింగాయపల్లి, ముతిరెడ్డిపల్లి, గొల్లపల్లి ఎంపీటీసీ స్థానాలు కొత్తగా ఏర్పాటు కావడంతో పాటు ఏదులను మండలం చేసి ఒక జెడ్పీటీసీ స్థానాన్ని పెంచారు. ప్రస్తుతం 133 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పెరిగిన ఐదు ఎంపీటీసీ స్థానాలు, ఒక మండలం వనపర్తి నియోజకవర్గ పరిధిలోనే ఉండటం గమనార్హం. వనపర్తి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించి ఒకరోజు అభ్యర్థుల నుంచి స్వీకరించిన తర్వాత రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన చిక్కుముడితో వాయిదా పడిన విషయం పాఠకులకు విధితమే. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం మరోసారి మే నెలలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించడంతో పల్లెల్లో మళ్లీ ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకున్నట్లయింది. సర్పంచ్ ఎన్నికల సమయంలో బుజ్జగింపులతో రాజీపడి పోటీ నుంచి తప్పుకున్న వారు, ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ పదవిని దక్కించుకోవాలనుకున్నవారు, జెడ్పీటీసీగా గెలుపొంది కేబినేట్ హోదా కలిగిన జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు గ్రామీణ నాయకులు ముమ్మరం చేస్తున్నారు. 2025, జులై 10 నుంచి 2026, ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను సైతం తుది ఓటరు జాబితాలో చేర్చి సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నవీకరణ చేసిన ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు అందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఓటరు జాబితా సవరణ.. -
పారదర్శకంగా దుకాణాల కేటాయింపు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని సమీకృత మార్కెట్లో ఉన్న 32 దుకాణాలు, ఒక సూపర్ మార్కెట్, ఒక బాంకెట్ హాల్ను లాటరీ పద్ధతిన అత్యంత పారదర్శకంగా కేటాయించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ వెల్లడించారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని దుకాణాల కేటాయింపును మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 32 దుకాణాలు, సూపర్ మార్కె ట్, బాంకెట్హాల్కు 318 దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతిన కేటాయించినట్లు చెప్పారు. మార్కెటింగ్శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాదరావు, డీఎం స్వరణ్సింగ్, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ఇతర అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు. -
హిందూధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ కృషి
కొత్తకోట రూరల్: హిందూ సమాజ ఐక్యత, దేశ సమగ్రతకు రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపించబడిందని అంబత్రయ క్షేత్రం వ్యవస్థాపకుడు ఆదిత్య పరాశ్రీ స్వామీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని అమడబాకులలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఐక్యతను కాపాడటం, హిందూ ధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదంతో దేశభక్తిని పెంపొందిస్తూ సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి హిందువు తన ధర్మ సూత్రాలను పాటిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని.. మతమార్పిడి వంటి చర్యలతో సమాజంలో విభేదాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని, హిందువులు ఐక్యంగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రాంత సంపర్క్ ప్రముఖ్ గుర్రం సంజీవ, సర్పంచ్ గాయత్రి, ఖండ సంఘచాలక్ మురళీధర్, నిర్వాహకులు సురేంద్రనాథ్, ప్రకాష్, శ్రీనివాసులు, జ్ఞానేశ్వర్, పవన్, అమరేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెకు సై..
నేటి నుంచి ‘ఆర్టీసీ’ బంద్ ● డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట ● రీజియన్లోని 10 డిపోల పరిధిలో నిలిచిపోనున్న బస్సు సర్వీసులు ● అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అద్దె బస్సులు నడిపేలా చర్యలు ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి. ● మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను క్రమం తప్పకుండా నెలనెలా ఆర్టీసీకి ఇవ్వాలి. ● ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి. ● ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ● అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ● రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలన్నింటినీ చెల్లించాలి. ● మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. డిపో బస్సులు అచ్చంపేట 80 గద్వాల 108 కల్వకుర్తి 103 కొల్లాపూర్ 65 కోస్గి 27 మహబూబ్నగర్ 152 నాగర్కర్నూల్ 81 నారాయణపేట 97 షాద్నగర్ 91 వనపర్తి 121 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు. 925 బస్సులు.. 3267 మంది కార్మికులు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్ డ్రైవర్లు, 148 మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, 385 మంది మెకానిక్ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు.. సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా అద్దె బస్సులను నడుపుతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులతో బస్సులు నడిచేలా తగిన చర్యలు చేపడుతాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్ -
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
వనపర్తి రూరల్: గర్భిణులు, బాలింతలు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ సుధారాణి అన్నారు. మంగళవారం మండలంలోని చిట్యాల రైతువేదికలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించగా.. ఆమెతో పాటు సీడీపీఓ హజీరాబేగం, సర్పంచ్ జి.శోభ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పోషక విలువలు, బాలింతలు, గర్భిణులు, నవజాత శిశుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. సీడీపీఓ హజీరాబేగం మాట్లాడుతూ.. రోజు తీసుకునే ఆహారంలో పోషక విలువలున్న ఆకు, కాయగూరలు, పండ్లు, గుడ్లు, పాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమన్నారు. ప్రభుత్వం గర్భిణులు, బాలింతల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని.. అందులో భాగంగానే పోషణ్ పక్వాడా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో డీసీపీఓ రాంబాబు, అంగన్వాడీ సూపర్వైజర్లు బాలీశ్వరి, రాణి, సంహిత, భారతి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం మర్రికుంట గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రికెట్, హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించడంతో పాటు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందన్నారు. వేసవి శిబిరం మే నెల 29 వరకు కొనసాగుతుందని.. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల వంట గదిని పరిశీలించి స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వంటగదిలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి మెస్ కమిటీ విద్యార్థులు సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై విచారణ చేశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్రెడ్డి, ప్రిన్సిపాల్ సరస్వతి, పాఠశాల సిబ్బంది, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ ప్రజావాణికి 12 వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 12 వినతులు వచ్చినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ను కలిసి సమస్యలు విన్నవించి వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్చేసి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వేసవి జాగ్రత్తలు వివరించాలి వీపనగండ్ల: వేసవిలో విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి లక్ష్మప్ప, ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్భా విద్యాలయను వారు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భోజనం అందించాలన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తోందని.. ఉత్తమంగా రాణించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ‘మిషన్ భగీరథ’తో సంపూర్ణ ఆరోగ్యం ఖిల్లాఘనపురం: మిషన్ భగీరథ నీటితో ఆరోగ్యంగా ఉంటారని మిషన్ భగీరథ డీఈ హరీశ్ అన్నారు. సోమవారం మండలంలోని ఆగారం గ్రామంలో హర్ ఘర్ జల్, జల్ జీవన్ మిషన్ కార్యక్రమం నిర్వహించగా.. ఆయనతో పాటు ఏఈ నరేష్, సర్పంచ్ బొక్కెన నర్సమ్మ, ఉప సర్పంచ్ మున్నూరు రవి, మహిళా సంఘాల సభ్యులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాటర్ ట్యాంక్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీటిలో మనిషికి అవసరమైన లవణాలు ఉంటాయని చెప్పారు. గ్రామంలో 40 కేఎల్, 30 కేఎల్ ట్యాంకులు రెండు ఉన్నాయని.. మొత్తం 198 ఇళ్లకు కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతంలో కొంతమేర పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవితేజ, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి ఆత్మకూర్: పుర పరిధిలోని నివాస గృహాలు, దుకాణాలు, కొళాయి బిల్లులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ శశిధర్ కోరారు. సోమవారం వార్డు అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కో–ఆప్షన్కు 12 దరఖాస్తులు.. స్థానిక పురపాలికలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకుగాను సోమవారం వరకు 12 దరఖాస్తులు వచ్చాయని పుర కమిషనర్ చికినె శశిధర్ తెలిపారు. మంగళవారం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. 23న స్కూృటినీ, అభ్యర్థుల ప్రకటన, 24న ఎన్నిక జరగనుందని వివరించారు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
ఖిల్లాఘనపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జెడ్పీ సీఈఓ యాదయ్య విద్యార్థులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఎంపీడీఓ సునీత, ఎంపీఓ నర్సింహయ్యతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య ఉందని ఉపాధ్యాయులు ఆయనకు తెలిపారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఆహార పదార్థాలు, బియ్యం, పప్పులు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఖిల్లాఘనపురంలో ఇంగ్లిష్, తెలుగు మీడియం కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయని, ఇంటర్ తరగతులను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒకేషనల్ కోర్సులో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట ఆయా పాఠశాలల ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
విద్యార్థి దశ జీవితానికి పునాది
వనపర్తి రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని, తద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని డీఎస్పీ వెంకటేశ్వరావు తెలిపారు. సోమవారం పెబ్బేరు మండలంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన చివరి సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయనతో పాటు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి పునాది వంటిదని, సాంకేతిక విద్యలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. పుర చైర్మన్ మాట్లాడుతూ.. పుర పరిధిలోని విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల కనీస సౌకర్యాల కల్పనకు తమవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పంపిన క్రీడా కిట్లను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్స్పాల్ జయచంద్ర, ఎస్ఐ దివ్యారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సంక్షేమ వారోత్సవాలు ఘనంగా చేయాలి
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు అన్ని సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో నిర్దేశించిన ప్రత్యేక కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేసి వంటగది శుభ్రత, ఇతర స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మెస్ కమిటీలు యాక్టివ్గా ఉన్నాయా లేదా తనిఖీ చేయాలని, స్టాక్ రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా చూడాలని సూచించారు. అదేవిధంగా వంట సరుకుల గడువు ముగింపు తేదీని పరిశీలించాలన్నారు. సూపర్వైజర్ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. భవనాల మరమ్మతులు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంపించిన గూగుల్ ఫామ్లో నమోదు చేయాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు విద్యార్థులకు టాలెంట్ ఫెస్టివల్ పేరుతో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని సూచించారు. మూడోరోజు వసతి గృహాలు, విద్యాసంస్థల్లో ఏమైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలని ఆదేశించారు. నాలుగోరోజు విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి ప్రభుత్వం అమలు చేస్తున్న సౌకర్యాలపై వివరించాలన్నారు. తదుపరి రోజుల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్లను సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఇతర జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీంకు సంబంధించిన వాల్పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వినోద్కుమార్, ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, హౌసింగ్ పీడీ విఠోబా, ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోరాటయోధుడు బసవేశ్వరుడు.. సమాజంలో మూఢ నమ్మకాలు బలంగా ఉన్న రోజుల్లో తన బోధనలతో ప్రజలను కాపాడిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ వినోద్కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. లింగాయత ధర్మం స్థాపించి చిరుప్రాయంలోనే శివపురాణం గాధలను అవగతం చేసుకున్న మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, లింగాయతుల సంఘం నాయకులు, వీరశైవ మహాసభ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
రక్తశుద్ధికి అభయాలసిస్
● ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 12 చోట్ల సేవలు ● నూతన యూనిట్లతో రోగులకు మరింత ఊరట ● మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు ● పాలమూరువ్యాప్తంగా 908 మంది బాధితులు ●వనపర్తి జిల్లాకు కొత్తగా మూడు యూనిట్లతో పాటు వనపర్తి జనరల్ ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొత్తగా వచ్చిన రేవల్లి, వీపనగండ్ల, ఖిల్లాఘనపురంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, విద్యుత్, నీళ్లు ఇలా వసతులపై పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి కిడ్నీ సమస్య ఉన్నవారిలో మొదట నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్వోఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ శంకర్, నెఫ్రాలజిస్టు కొత్తగా మంజూరైన డయాలసిస్ కేంద్రాలు ఇలా.. జిల్లా యూనిట్ పడకలు గద్వాల వడ్డేపల్లి 5 గద్వాల గట్టు 5 గద్వాల అయిజ 5 వనపర్తి ఖిల్లాఘనపురం 5 వనపర్తి రేవల్లి 5 వనపర్తి వీపనగండ్ల 5 నారాయణపేట కోస్గి 5 నారాయణపేట మద్దూరు 5 నాగర్కర్నూల్ లింగాల 5 నాగర్కర్నూల్ అమ్రాబాద్ 5 నాగర్కర్నూల్ తిమ్మాజిపేట 5 పాలమూరు: ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే ఉమ్మడి పాలమూరులో సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసింది. 11 కేంద్రాల్లో 55 పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్– ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 కేంద్రాలు అందుబాటులో ఉండగా వీటి ద్వారా వందలాది మంది బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. మహబూబ్నగర్లో 10, బాలానగర్లో 5, నారాయణపేటలో 10, మక్తల్లో 5, ఆత్మకూర్లో 5, వనపర్తిలో 10, నాగర్కర్నూల్లో 10, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 5, కల్వకుర్తిలో 5, గద్వాలలో 12, అలంపూర్లో 5 మిషన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. 5 పడకల చొప్పున.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దూరం, ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒక యూనిట్ చొప్పున డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు నూతనంగా 11 కేంద్రాలు మంజూరు చేయగా.. అన్నిచోట్ల ఐదు పడకలకు ఐదు మిషన్స్ ఏర్పాటు చేసి మరో మూడు నెలల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్సీలు లేదా సివిల్ ఆస్పత్రులు ఉన్నచోట ఒక గదిలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట నూతన భవనాలు నిర్మించనున్నారు. ప్రతి కేంద్రం దగ్గర నీటిశుద్ధి ప్లాంటు, ఫ్రిజ్లు, వైద్య నిపుణులతో పాటు ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ఈ ఐదు పడకలు ఉన్నచోట నిత్యం 20 మందికి రక్తం శుద్ధి చేయనున్నారు. పీపీపీ విధానంలో ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్న కొత్త డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి కోసం ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా జీవన విధానం పాటించాలి. సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. -
వరి కోతలు షురూ!
● జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు ● జూరాల ఆయకట్టులో ముమ్మరం యాసంగిలో వరి సాగుకు పెట్టుబడి బాగా పెరిగింది. యూరియా, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు కూలీల కొరతతో ఖర్చులు గతానికన్నా ఎకరాకు రూ.10 వేల మేర పెరిగింది. మొత్తంగా ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు అయింది. – మైను, రైతు, నందిమళ్ల అన్ని గ్రామాల్లో వరి కోతలు ఒకేసారి ప్రారంభం కావడంతో యంత్రాల కొరత అధికమైంది. యంత్రాలకు ఽడిమాండ్ పెరిగి యజమానులు అద్దె సైతం పెంచారు. గంటకు రూ.2,600, ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.500 చెల్లించాల్సి వస్తోంది. – కృష్ణారెడ్డి, రైతు, అమరచింత అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వతో పాటు బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు సకాలంలో చేతికందుతున్నాయి. దీంతో రైతులు పంట కోతలకు శ్రీకారం చుట్టారు. యాసంగిలో సాగు చేసిన వరి పంటలకు తెగుళ్లు విపరీతంగా సోకడంతో వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ సకాలంలో మందులు పిచికారీ చేయడంతో పంట పూర్తిస్థాయిలో చేతికొచ్చిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి కోతలకు కూలీల కొరత తలెత్తడంతో యంత్రాలను వినియోగించి నూర్పిళ్లు చేపట్టి మార్కెట్కు తరలించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వారం నుంచి వరి కోతలు ముమ్మరం కావడంతో యంత్రాలకు డిమాండ్ పెరిగింది. – జిల్లాలోని 14 మండలాల్లో ఈసారి యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. ఈసారి పంట నష్టాన్ని అధిగమించినా.. వ్యవసాయ కూలీల కొరత కారణంగా మరోమారు వరి కోతలకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తింది. పనుల్లో వ్యవసాయ కూలీలు బిజీగా ఉండటంతో గ్రామాల్లో ఒక్కో కూలీకి రోజువారి 450 నుండి రూ.500 వరకు చెల్లిస్తున్న పరిస్థితులు దాపురించాయి. జూరాల ఆయకట్టులో.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో పంట కోతల పండుగ మొదలైంది. వారబందీ విధానంలో కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే నీరు వదలడంతో వరి సాగు చేశారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పూర్తిస్థాయిలో నిలిచిపోవడంతో అధికారులు వేసవిలో తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎడమ కాల్వ ఆయకట్టు 85 వేల ఎకరాలు ఉండగా.. కేవలం 20 వేల ఎకరాలు అదికూడా రామన్పాడ్ ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని వారబందీ విధానంలో వదలడంతో తక్కువ ఆయకట్టులో వరి సాగైంది. -
అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
కొత్తకోట రూరల్: ప్రజలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమని కొత్తకోట అగ్నిమాపక అధికారి దేవేందర్రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సినిమా థియేటర్లు, జన సంచార ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పొగ ఎక్కువగా వ్యాపించినప్పుడుడు ప్రజలు నేలకు దగ్గరగా వంగి లేదా మోకాళ్లపై పాకుతూ బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో లిఫ్ట్లను వాడకుండా మెట్ల మార్గం వినియోగించాలన్నారు. పొగ నుంచి బయటకు రావాల్సిన సమయంలో ముక్కు, నోరు కప్పుకోవడానికి తడి గుడ్డ లేదా రుమాలు ఉపయోగిస్తే శ్వాస ఇబ్బంది తగ్గుతుందన్నారు. అలాగే సినిమా ప్రదర్శన మధ్యలో ఫైర్ అలారం మోగితే వెంటనే బయటకు రావాలని, వ్యక్తిగత వస్తువుల కోసం వెదకకుండా ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. థియేటర్ యాజమాన్యం ప్రమాదం సంభవించిన వెంటనే అత్యవసర ద్వారాలను తెరవడం, లైట్లు వెలిగించడం, ప్రేక్షకులు ప్రశాంతంగా బయటకు పంపే విధంగా మార్గదర్శనం చేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, సూచనలు పాటిస్తే అగ్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించవచ్చని వివరించారు. కరపత్రాలు పంపిణీ.. ఆత్మకూర్: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని మార్ట్లు, ఇతర ప్రాంతాల్లో ఆదివారం సిబ్బంది ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విన్యాసాలతో క్లుప్తంగా వివరించారు. అగ్నిమాపక అధికారి సంజీవరెడ్డి బహుళ అంతస్తుల్లో ప్రజలు ప్రమాదాల బారినపడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. చివరిరోజు సోమవారం ప్రధాన కూడళ్లు, గ్రామాల్లో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం వారోత్సవాల కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది రాముడు, నాగార్జున, వెంకట నర్సింహయ్య, భీమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
నేడు మంత్రి వాకిటి శ్రీహరి రాక
ఆత్మకూర్: తెలంగాణ పశువర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పీఏసీఎస్ సీఈఓ వాకిటి నరేష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక మార్కెట్యార్డు, 10.30 గంటలకు మూలమళ్ల, 11 గంటలకు జూరాల, 11.30 గంటలకు దేవరపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు తిప్పడంపల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని వివరించారు. ప్రశాంతంగా ‘ఆదర్శ’ ప్రవేశ పరీక్ష కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకులలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్గౌడ్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12 వరకు పరీక్ష నిర్వహించగా 364 మంది విద్యార్థులకుగాను 275 మంది హాజరుకాగా, 89 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్షలో 217 మంది విద్యార్థులకుగాను 159 మంది హాజరుకాగా 58 మంది విద్యార్థులు రాలేదు. చేనేత ఓటరు జాబితా ప్రదర్శన అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం అమరచింత చేనేత సహకార సంఘంలో ఓటరు జాబితాను ప్రదర్శించారు. సంఘంలో మొత్తం 766 మంది ఓటర్లు ఉన్నట్లు అధ్యక్షుడు మహంకాళి చంద్రమోహన్ తెలిపారు. ఓటరు జాబితాను డైరెక్టర్లతో కలిసి నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటరు జాబితా ప్రదర్శించి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం మరోమారు జాబితాను రూపొందించి ఏడీ కార్యాలయంలో సమర్పిస్తామని వివరించారు. వనపర్తి, గద్వాల, నాగర్కర్నూలు జిల్లాలోని చేనేత సహకార సంఘాల్లో ఓటరు జాబితా ప్రదర్శన పూర్తిచేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని చేనేత జౌళిశాఖ ఏడీ పద్మ తెలిపారు. వచ్చే నెల 15 వరకు పూర్తిస్థాయి ఓటరు జాబితా సిద్ధం చేసి పంపనున్నట్లు వివరించారు. -
సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
పాన్గల్: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో రూ.42.12 లక్షలతో అదనపు మౌలిక వసతులు, ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ, రైతువేదికలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, క్రీడా మైదానం తదితర సమస్యలున్నాయని మంత్రికి వివరించారు. పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని సర్వేచేసి నివేదిక అందించాలని తహసీల్దార్ను మంత్రి ఆదేశించారు. చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని.. ఆరోగ్యంగా ఉంటేనే చదవడం, ఆటలు ఆడటం సాధ్యమని చెప్పారు. చదువు సమాజాన్ని సంస్కరించేదిగా ఉండాలని.. రోజు విద్యార్థులకు మహనీయుల చరిత్రను వివరిస్తూ వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. బాలికలు పొడువుకు తగిన బరువు ఉండేలా చూడాలని.. అందుకు తగిన ఆహారం అందించాలన్నారు. మూడు నెలల తర్వాత విద్యాలయాన్ని సందర్శించినప్పుడు మార్పు కనిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి బలోపేతానికి తోడ్పాటునందించాలని కోరారు. చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యమే.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
రైతుల సంక్షేమానికే కేంద్రాల ఏర్పాటు
కొత్తకోట రూరల్/మదనాపురం: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని.. ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి కొత్తకోట, మదనాపురం మండలం రామన్పాడ్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర లభించి లాభపడతారని.. దళారులను ఆశ్రయిస్తే నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేయడంతోనే అధికారానికి దూరమైందని విమర్శించారు. అభివృద్ధికి సహకరించకుండా ప్రతిపక్ష నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో పుర చైర్పర్సన్ పి.అరుణ, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు మేస్త్రి శ్రీనివాసులు, కౌన్సిలర్లు ఎన్జే బోయేజ్, అబ్దుల్ నబీ, చంద్రకాంత్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, మోహన్రెడ్డి, సుభాష్, ముజీబ్, చీర్ల యాదయ్యసాగర్, రామన్పాడులో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ అఫ్రీన్బేగం అంజాద్అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, మండల కో–ఆర్డినేటర్ చుక్క మహేష్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం చైర్మన్ రాజవర్దన్రెడ్డి, నాయకులు శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి -
సైబర్.. ఫీవర్!
అమాయకులను చిత్తు చేస్తున్న మోసగాళ్లు ●అవగాహనతోనే నేరాల నియంత్రణ.. జిల్లాలో కొంతకాలంగా సైబర్ క్రైం విభాగం డీఎస్పీ, సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్హెచ్ఓల సాయంతో విచారణ చేపడుతున్నాం. ఎక్కడా ఇబ్బందులు కలుగలేదు. సైబర్ నేరాలపై నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కొత్త పంథాల్లో వల పన్ని అమాయకులను మోసం చేస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామంటూ వచ్చే కాల్స్కు ఎవరూ స్పందించొద్దు. బ్యాంకర్లు రుణాలు ఇస్తామంటూ ఫోన్లు చేయరు. ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్పీ పేరుతో డబ్బులు లాగే ప్రయత్నం చేస్తే సమాచారం ఇవ్వండి. – రవిప్రకాష్, ఎస్ఐ, సైబర్క్రైం విభాగం, వనపర్తి వనపర్తి: పోలీసు అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో మోసం చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న డిజిటలైజేషన్తో సైబర్ నేరాల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది. పోలీసులు ఓ వైపు సాంకేతికతను వినియోగించి సైబర్ నేరాలను ఛేదిస్తున్నా.. ఈజీమనీకి అలవాటు పడిన కొందరు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ నెల నాలుగో తేదీన గోపాల్పేటకు చెందిన వి.నర్సింహకు బజాజ్ ఫైనాన్స్లో రూ.5 లక్షల రుణం మంజూరైందని.. ప్రాసెసింగ్ ఫీజు, అప్రూవల్ ఫీజు, జీఎస్టీ పేరుతో సుమారు రూ.77,400 స్వాహా చేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. కొత్త పంథాలతో మోసగిస్తున్న వైనం జిల్లాలో ఏటా పెరుగుతున్న కేసులు తాజాగా గోపాల్పేటలో రుణం ఇప్పిస్తామంటూ రూ.77,400 స్వాహా -
తాగునీటికి ఢోకా లేనట్టే!
కొల్లాపూర్: శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. సరఫరా ఇలా.. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి.. నీటి సరఫరా చేస్తున్నారు. తగ్గుతున్న నీటిమట్టం.. కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పదో తరగతికి సంబంధించి 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,389 మంది పరీక్ష రాయనున్నారు. అలాగే ఇంటర్కు సంబంధించి 29 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,782 మంది విద్యార్థులు ఇంటర్ 29 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో పూర్తిస్థాయిలో పరీక్ష కేంద్రాల్లో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లతోపాటు ఏఎన్ఎంలను కూడా పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు.. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. ‘మిషన్ భగీరథశ్రీకు కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల నీటిమట్టం 800 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు రోజూ 0.02 టీఎంసీలు అవసరం మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్గా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాపీయింగ్ను అరికట్టేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ -
పకడ్బందీగా జనగణన నిర్వహణ
వనపర్తి: ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని మర్రికుంట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణకు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లే ముందు తమకు ఇచ్చిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ ఆధారంగా హద్దులను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎవరి పరిధిలో వారే జనగణన చేపట్టాలని, కిచెన్ ఆధారంగా హౌస్హోల్డ్ని నిర్ణయించాలని సూచించారు. ప్రజలు సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తే, వారి వ్యక్తిగత సమాచారం ఎక్కడా వినియోగించడం జరగదని.. కేవలం జనగణన కోసం తీసుకుంటున్నట్లు వారికి తెలియజేయాలన్నారు. డబుల్ ఎన్యూమరేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని హెచ్చరించారు. సీపీఓ హరికృష్ణ, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్రెడ్డి, శిక్షకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ వారోత్సవాలు విజయవంతం చేయాలి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్లు వినోద్కుమార్, ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సంక్షేమ వారోత్సవాలను పక్కాగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి రోజు ఏప్రిల్ 20న అన్ని సంక్షేమ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో శానిటేషన్ డ్రైవ్, రెండోరోజు విద్యార్థులకు టాలెంట్ ఫెస్టివల్ పేరుతో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని సూచించారు. మూడోరోజు సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థల్లో మరమ్మతులు చేపట్టాలని, నాలుగో రోజున విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సౌకర్యాలను వివరించాలన్నారు. తదుపరి రోజుల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్, వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఇతర సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డీలిమిటేషన్ను మహిళా బిల్లుతో లింక్ పెట్టడం సరికాదు
● రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేషన్ మహబూబ్నగర్: డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో లింక్పెట్టడం సరికాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడం నియంతృత్వ ధోరణితో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. 46 ఏళ్ల బీజేపీ ఒక్క మహిళను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేయలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడున్న 543 సీట్లలో ఇది వరకు ఆమోదం పొందిన మహిళా బిల్లు ప్రకారం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేలా బిల్లు పెడితే బేషరుతుగా మద్దతు ఇస్తామని, మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి స్టాండ్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్–ఇండియా విభజనతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పోల్చి ఇక్కడి ప్రజలను అవమానపరిచారని, దీనిని సహించేది లేదన్నారు. ఆ ఎంపీ తెలంగాణ పట్ల మాట్లాడిన మాటలను పార్లమెంట్ రికార్డులో తొలగించే బాధ్యత ఇక్కడి బీజేపీ ఎంపీలపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా వివరాల నమోదు
కొత్తకోట రూరల్: జనగణన ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి చేరుకొని వివరాలను పక్కాగా డిజిటల్ యాప్లో నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం పెద్దమందడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎన్యూమరేటర్ల శిక్షణను సందర్శించి మాట్లాడారు. 2027 జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. అనంతరం గోపాలపేట మండలం బుద్ధారం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి పనులను డీఆర్డీఓ, డీపీఓతో కలిసి పరిశీలించారు. గ్రామంలోని సీఎస్సీ కేంద్రం, గ్రామపంచాయతీ నర్సరీలు, కోళ్ల షెడ్ను సందర్శించి నిర్వహణ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బుద్ధారం గ్రామపంచాయతీలో ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదును పరిశీలించారు. కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని, ప్రజలకు లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీగా రాజేష్ మీనా వనపర్తి: జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా రాజేష్ మీనాను నియమిస్తూ శనివారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ పోస్టు కొంతకాలంగా జిల్లాలో ఖాళీగా ఉంది. ఈయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. రైస్మిల్పై కేసునమోదు ఖిల్లాఘనపురం: మండల పరిధిలోని సోళీపురం గ్రామంలో ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ ఇండస్ట్రీస్ రైస్మిల్లుపై శనివారం కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగమైనట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఎన్.ఆంజనేయులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 2022–23 వానాకాలం, 2022–23 యాసంగి, 2023–24 వానాకాలం సీజన్లలో ప్రభుత్వం నుంచి వరి ధాన్యం కేటాయించగా.. ఇందుకు సంబంధించిన సీఎంఆర్ అప్పగించలేదని పేర్కొన్నారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో గణనీయమైన ధాన్యం లోటు కనిపించిందని.. ప్రభుత్వ ధాన్యాన్ని బ్లాక్మార్కెట్కు మళ్లించినట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
అమ్మాపురంలో మకాం..
గోపాల్పేట: గోపాల్పేట సంస్థానం 19వ శతాబ్దంలో ఏర్పాటైంది. ఈ సంస్థానం రాణి రంగనాయకమ్మ తన భర్త గోపాల్రావు పేరిట గోపాల్పేట అనే పేరు పెట్టారు. ఇక్కడి సంస్థానంతో వనపర్తి సంస్థానాధీశులకు సంబంధాలు ఉండేవని చరిత్రచెబుతోంది. ఈ సంస్థానం పరిధిలో 12 గ్రామాలుండగా.. రాణి రంగనాయకమ్మ గ్రామంలో వేలాది మందికి అన్నదానం చేసేవారు. ప్రస్తుతం ఇక్కడి కోట పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపురం అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉన్న అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల నుంచి రెడ్డి రాజుల వరకు ముక్కెర వంశీయులు పాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పాలన సాగింది. 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది. కురుమూర్తి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీద్తో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి. -
డబ్బులు అడుగుతున్నారు..
నాకు మూడు ట్రిప్పుల ఇసుక అవసరం ఉంది. మీ–సేవా కేంద్రంలో ఈ నెల 2న బుక్ చేసుకుంటే బుధవారం వచ్చిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు రూ.500 అదనంగా ఇవ్వలేదని పంచాయితీ పెట్టుకున్నారు. ఒకరు మొత్తం ఇసుక పోసిపోగా.. మరొకరు కొంత ఇసుకను తిరిగి తీసుకెళ్లారు. గురువారం ఒకతను ఫోన్చేసి ట్రిప్పు ఇసుక వస్తుంది.. రూ.500 ఇస్తావా అని డిమాండ్ చేస్తున్నారు. ఇస్తానన్నా తీసుకురాలేదు. – గాజులపేట నాగయ్య, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న వారు ట్రాక్టర్ల వారికి తిరిగి డబ్బులు ఇవ్వరాదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ట్రాక్టర్ నంబర్, బుక్ చేసుకున్న ఐడీ ఇస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సుగుణ, తహసీల్దార్, ఖిల్లాఘనపురం ఖిల్లాఘనపురం మండలం అంతాయపల్లి శివారులో ఇసుక రీచ్ ఏర్పాటు చేశాం. ఇసుక అవసరమైన వారు మీ–సేవా కేంద్రాల్లో చూపిన ప్రకారం డబ్బులు చెల్లించాలి. ట్రాక్టర్ల వారు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు ఇస్తే ట్రాక్టర్ను ఇసుర తరలించకుండా రద్దు చేస్తాం. ఎవరికి కూడా అదనంగా డబ్బులు ఇవ్వకూడదు. – సుబ్రమణ్యం, ఆర్డీఓ, వనపర్తి ● -
మట్టితో కోట నిర్మాణం..
గద్వాల: గద్వాల కోట 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. గద్వాల సంస్థానం 17వ శతాబ్దం (1663– 1670)లో నల్లసోమనాద్రి (పెద్ద సోమభూపాలుడు) పూడూరు కేంద్రంగా గద్వాల కోట నిర్మించారు. కర్ణాటక సరిహద్దులోని రాయచూరు, రాయలసీమలోని నందికొట్కూరు వరకు పాలన చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోట నిర్మాణం మొత్తం మట్టితో నిర్మించడం ప్రత్యేకత. దీని లోపల అద్భుతమైన శిల్పకళతో కూడిన చెన్నకేశవస్వామి ఆలయం, ఆలయం ఎదుట 90 అడుగుల గాలిగోపురం నిర్మించారు. కృష్ణానది, తుంగభద్ర నదుల మ ధ్య గద్వాలలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మి ంచిన కోట చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణం ఉంది. ఈ కోట వలయాకారంలో నిర్మించగా.. లోపలి వైపు రాతి తో కూడిన గోడ కట్టారు. కోటలోపల కందకం, బావి నిర్మాణాలు ఉన్నాయి. ఈ కోటలో ప్రముఖ నటుడు చిరంజీవి కొండవీటిరాజా సినిమాను నిర్మించారు. -
రాజసానికి చిహ్నం
కొల్లాపూర్: జటప్రోల్ను సంస్థానంగా చేసుకొని కొల్లాపూర్ ప్రాంతాన్ని ప్రజారంజకంగా సురభి రాజులు పాలించారు. సురభిరాజుల పాలనకు సంబంధించి 14వ శతాబ్దం నుంచి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆనె గొంది రాజుల నుంచి జటప్రోల్ సంస్థానాన్ని సురభి రాజవంశస్థుడు మల్లనాయుడు కానుకగా పొందినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి సురభి రాజులు ఏకచత్రాధిపత్యంగా కొల్లాపూర్ను పాలించారు. సురభి సంస్థానం పరిధిలో 81 గ్రామాలు ఉండేవి. మొదట్లో జటప్రోల్లో సంస్థాన కోట నిర్మించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముస్లిం రాజులు తరుచూ దాడులకు దిగుతుండటంతో 1840లో సంస్థానం పరిపాలనను కొల్లాపూర్కు మార్చారు. ఇక్కడే రాజాబంగ్లాను నిర్మించగా.. 1884లో ప్రారంభించారు. మంత్రమహల్, చంద్రమహల్, రాణిమహల్గా బంగ్లాలోని భవనాలకు నామకరణం చేశారు. రాజ కుటుంబీకులు ఉద్యాన విహారం చేసేందుకు ఎల్లూరు సమీపంలోని పెద్దతోటలో బంగ్లా కట్టించారు. కొల్లాపూర్లోని రాజాబంగ్లాతో పాటు తోటబంగ్లా కూడా పర్యాటకులను కనువిందు చేస్తుంది. -
ఇష్టారాజ్యం!
● ట్రిప్పునకు రూ.500 డిమాండ్ చేస్తున్న వైనం ● పట్టించుకోని అధికారులు.. తనకేమీ సంబంధం లేదంటున్న ఎస్ఆర్ఓ ఖిల్లాఘనపురం: మండలంలోని అంతాయపల్లి శివారులో ఉన్న రీచ్ నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను వివిధ ప్రాంతాలకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి తరలిస్తుంటారు. ఈ ఇసుక తరలింపునకు గతంలో కొందరు ట్రాక్టర్ల యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వేసవి కావడంతో చాలామంది ఇళ్లు, ప్రహరీల నిర్మాణాలకు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుంటున్నారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5 వరకు ఇసుక తరలింపునకు ప్రభుత్వం రీచ్లో ఓ అఽధికారిని నియమించింది. ఆయన నిత్యం వరుస క్రమంలో ఇసుక బుక్ చేసుకున్న వారికి పంపిస్తున్నారు. కిలోమీటర్ల ఆధారంగా ధర.. అంతాయపల్లి రీచ్ నుంచి మండలంతో పాటు పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలకు ఇసుక తరలింపునకుగాను ప్రభుత్వం కిలోమీటర్ల ఆధారంగా ధర నిర్ణయించింది. ఇసుక అవసరం ఉన్న వారు మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న వారికి వరుస క్రమంలో ఇళ్ల దగ్గరకు ఇసుక వస్తోంది. డబ్బులు డిమాండ్.. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల నిర్వాహకులు మాత్రమే రీచ్ నుంచి ఇసుక తరలింపునకు అవకాశం ఉంది. తమను కాదని ఎవరి ట్రాక్లర్లు వస్తాయిలే అనుకున్న యజమానులు ఇష్టానుసారంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం రీచ్ నుంచి అప్పారెడ్డిపల్లికి ఇసుకతో వచ్చిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు ఒక్కో ట్రాక్టర్కు రూ.500 చొప్పున రూ.వెయ్యి అదనంగా ఇవ్వాలని పట్టుబట్టారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించామని.. తిరిగి ఎందుకివ్వాలని అడగడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. డబ్బులు ఇవ్వనందుకు ఓ ట్రాక్టర్ యజమాని 25 శాతం ఇసుకను తిరిగి తీసుకెళ్లారు. ఇంత జరుగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్లో ఉండే ఎస్ఆర్ఓ తనకేమీ తెలియదని.. ట్రాక్టర్ల వారికి అద్దె పడితే వస్తారు లేదంటే రారుంటూ జవాబిచ్చారు. ఎప్పట్నుంచో ఇస్తున్నారంట కదా... ఇప్పుడిస్తే ఏమైతుందని మాట్లాడటం విస్మయానికి గురిచేస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ నిరసన
వనపర్తిటౌన్: రెండో పీఆర్సీని జూన్ 2లోగా ప్రకటించాలని టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు జి.అశోక్కుమార్, ప్రధానకార్యదర్శి ఎస్.వరప్రసాద్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ (తెలంగాణ ఉద్యోగులు, గజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక అండ్ పింఛన్ల కార్యాచరణ సమితి) ఆధ్వర్యంలో రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు, మేనిఫెస్టోలో ప్రకటించినట్లు సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 61 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఆరు విడతల కరువు భత్యం చెల్లించి న్యాయం చేయాలన్నారు. ముఖ్యమైన 64 డిమాండ్లలో కేవలం నాలుగింటినే పరిష్కరించాలని కోరుతున్నామని, స్పందించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బౌద్ధారెడ్డి, ఎస్.చంద్రశేఖర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్గౌడ్, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ స్టాఫ్ ప్రధానకార్యదర్శి రషీద్, డీటీఎఫ్ తరఫున మద్దిలేటి, శివారెడ్డి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్, టీటీయూ జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, టీజీహెచ్ఎంఏ జిల్లా ప్రధానకార్యదర్శి బాణం విష్ణు, టీఎన్జీఓ జిల్లా ప్రధానకార్యదర్శి రాజు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజనయ్య, నర్సింహులుగౌడ్, కార్యదర్శి జగపతిరావు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
వనపర్తిటౌన్: వేసవిలో పుర ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు పుర చైర్పర్సన్ ఎం.మాధవి తెలిపారు. పట్టణానికి తాగునీరు సరఫరా చేసే బుగ్గపల్లి, కానాయపల్లి పంప్హౌస్, రామన్పాడు సమీపంలో, రాజాపేటలో పగిలిన తాగునీటి పైప్లైన్ను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామన్పాడు రిజర్వాయర్ ద్వారా తాగునీరు అందించేందుకు 85 హెచ్పీ, 155 హెచ్పీ మోటార్లు అవసరమని పుర అధికారులు ఆమె దృష్టికి తీసుకురాగా.. కౌన్సిల్ ఆమోదంతో కొనుగోలు చేద్దామని చెప్పారు. తాగునీటి సరఫరా విషయంలో ఇంజనీరింగ్ అధికారులు లైన్మెన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సరఫరా అయ్యే నీటికి ప్రత్యామ్నాయంగా రామన్పాడు సమీపంలో మోటార్ల ఏర్పాటుతో ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా చూసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. అధికారులు తక్షణం స్పందించాలని సూచించారు. లైన్మెన్లు, అధికారులతో పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ తాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, డీఈ యూనూస్, ఏఈ, అధికారులు, కౌన్సిలర్లు, లైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు. చలివేంద్ర ప్రారంభం.. పుర కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చైర్పర్సన్ ఎం.మాధవి శుక్రవారం ప్రారంభించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు మున్సిపాలిటీ తరుఫున కలెక్టరేట్, పుర కార్యాలయం, గాంధీచౌక్, రాజీవ్చౌక్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకటేష్, డీఈ యూనూస్, మేనేజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎల్ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ల డిమాండ్లు నెరవేర్చాలి : బీజేపీ
వనపర్తిటౌన్: ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు అయ్యగారి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో వనపర్తి డివిజన్ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని శుక్రవారం బీజేపీ నాయకులు సందర్శించి వారికి మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజులుగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధర్నాలు, సమ్మెలు చేస్తున్న వారిని ఉద్దేశించి వీటిని పరిష్కరించడం టీ తాగిన సమయం కాదని గొప్పగా చెప్పారని.. ఇప్పటిదాకా ఆ సమయం రాలేదా అని ప్రశ్నించారు. ఆర్టిజన్లు తమ డిమాండ్లు పూర్తిగా సాధించే వరకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆదేశాల మేరకు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగపోగు కుమార్, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు ఎద్దుల రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుదాం
● గోల్డెన్ హవర్ సాయంపై అవగాహన కలిగి ఉండాలి ● ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) డా. గజరావు భూపాల్ కొత్తకోట రూరల్: ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకునేలా అవగాహన కల్పించడమే ’అరైవ్–అలైవ్’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) డా. గజరావు భూపాల్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కొత్తకోటలోని ఓ ఫంక్షన్హాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు చేయాల్సిన గోల్డెన్ హవర్ రెస్పాన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజీతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, నారాయణపేట ఎస్పీ వినీత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డ్రైవర్లు, విద్యార్థులు, ప్రజలు హాజరుకాగా.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గోల్డెన్ హవర్లో స్పందించాల్సిన తీరు, సీపీఆర్పై అవగాహన కల్పించారు. అదేవిధంగా డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సందర్శించి రోడ్డు భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 50 శాతం మత్యువాత చెందుతున్న వారు ద్విచక్ర వాహనదారులేననని, అందులో 18 నుంచి 40 ఏళ్లలోపు వారేనని తెలిపారు. కాబట్టి ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్బెల్ట్ ధరించాలని సూచించారు. అత్యధిక దూరం ప్రయాణించేవారు బైక్లు వినియోగించకుండా ఇతర మార్గాలు ఎంచుకోవాలని, అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు నెలల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి పైగా దుర్మరణం చెందారని.. ఇది అత్యంత బాధాకరమన్నారు. రాంగ్ రూట్లో ప్రయాణించడం సరైన పద్ధతి కాదని, సరైన మార్గంలో ప్రయాణించి క్రమశిక్షణగా నడుచుకోవాలని సూచించారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రికి తరలించే మొదటి క్షణాల్లో క్షతగాత్రులకు అందించాల్సిన సాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అలా చేసిన వారికి ప్రభుత్వం నగదు బహుమతి అందిస్తుందని వివరించారు. ● నారాయణపేట ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. దేశంలో ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే, అందులో 1.20 లక్షల మంది మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సరైన చికిత్స అందిస్తే మృతుల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, కొత్తకోట పుర చైర్పర్సన్ పి.అరుణ, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సీఐ రాంబాబు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మామిడి రైతులకు ప్రోత్సాహం
వనపర్తి: మామిడి రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, నాణ్యమైన ఉత్పత్తులను ప్రోత్సహించడం ‘అమ్మకందారులు.. కొనుగోలుదారులు’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మామిడి పంటకు సంబంధించి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఉద్యానశాఖ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల అభివృద్ధి సంస్థ, ఎన్హెచ్బీ, ప్రసాద్ సీడ్స్ సంస్థ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన 140 మంది రైతులు తమ మామిడి ఉత్పత్తులను ప్రదర్శించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై వాటిని పరిశీలించి రైతులతో మాట్లాడి పండ్ల ప్రత్యేకతను తెలుసుకోవడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వ్యాపారులు మామిడి రైతుల వద్దకే వచ్చి మంచి ధరకు పండ్లు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి చక్కటి అవకాశమని.. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. మామిడి రైతులకు కవర్లు అందజేయడం గొప్ప విషయమని, ఇంకా ఎవరికై నా ఇవ్వకపోతే వెంటనే అందజేయాలని సూచించారు. మొత్తం 12 మంది వ్యాపారులు పాల్గొని 40 మంది రైతుల నుంచి 250 టన్నుల మామిడిపండ్ల ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఉద్యానశాఖ జేడీ బాబు, డీహెచ్ఎస్ఓ విజయభాస్కర్, ఏపీ ఎగుమతిదారుల అభివృద్ధి సంస్థ ఏపీఎం ఆర్బీ నాయుడు, ప్రసాద్ సీడ్స్ సీఈఓ విజయభాస్కర్, శాస్త్రవేత్త వెంకటలక్ష్మి, రవి, లక్ష్మి, ఏడీలు పద్మనాభం, జయరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్యాంకు గ్యారంటీ, అగ్రిమెంట్ తప్పనిసరి.. మిల్లులకు ధాన్యం కేటాయించాలంటే 10 శాతం బ్యాంకు గ్యారెంటీతో పాటు అగ్రిమెంట్ తప్పనిసరి అని కలెక్టర్ ఆదర్శ సురభి మిల్లర్లకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రూ.కోట్ల వరి ధాన్యం మిల్లులకు అడ్వాన్సుగా ఇస్తుందని.. కేటాయించిన ధాన్యంలో 10 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకు గ్యారెంటీ లేని మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరగవని స్పష్టం చేశారు. యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయని.. త్వరలో కొనుగోళ్లు ప్రారంభించి బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన మిల్లర్లకు సరిపడా ధాన్యం మాత్రమే కేటాయిస్తామని చెప్పారు. డిఫాల్ట్ మిల్లర్లు త్వరగా క్లియర్ చేసుకొని ధాన్యం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మరింత గడువు ఇచ్చిందని.. గత సీజన్కు సంబంధించి పెండింగ్ బియ్యం త్వరగా ఎఫ్సీఐకి అప్పగించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ డీఎం ఆంజనేయులు, మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్రెడ్డి, మిల్లర్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
బీసీలు 54.82%
వనపర్తి● కులాల వారీగా జనాభా మొత్తం 37.01 లక్షలు ● ఇందులో బీసీలు 20,29,001 మంది ● బీసీల్లో ముదిరాజ్లు, ఎస్సీల్లో మాదిగలదే అగ్రస్థానం ● గద్వాల, వనపర్తిలో ప్రభావిత వర్గాలుగా వాల్మీకి బోయలు ● కందనూలులో చెంచుజనాభా 9 వేలకే పరిమితం ● రాష్ట్ర సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్ట్లో వెల్లడి తుది సమావేశం.. జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గానికి మే నెల 6న గడువు ముగియనుండగా చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026–8లో uఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో మెజార్టీ వర్గాలు ఓసీల్లో రెడ్డిలదే ఆధిపత్యం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓసీ జనాభా 2,97,406 మంది కాగా, 8.03 శాతంగా నమోదైంది. ఓసీల్లో మెజార్టీ సంఖ్యలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరిలో నారాయణపేటలో అత్యధికంగా 69.19 శాతం, వనపర్తిలో 66.84 శాతం, జోగుళాంబ గద్వాలలో 63.30 శాతం, నాగర్కర్నూల్లో 61.06 శాతం, మహబూబ్నగర్లో 52.40శాతం రెడ్డి జనాభా ఉంది. ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం తర్వాత వైశ్యులు ప్రభావిత వర్గంగా ఉన్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్లో 15.69 శాతం, వనపర్తిలో 13.86 శాతం వైశ్యుల జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లా.. సామాజికవర్గం జనాభా మాదిగ (ఎస్సీ) 1,04,613 మాల (ఎస్సీ) 16,873 బంజార(ఎస్టీ) 1,12,127 ముదిరాజ్ (బీసీ) 1,34,794 యాదవ(బీసీ) 94,144 రెడ్డి(ఓసీ) 44,825 నాగర్కర్నూల్ జిల్లా మాదిగ (ఎస్సీ) 1,26,990 మాల (ఎస్సీ) 56,426 బంజార(ఎస్టీ) 96,053 ఎరుకల(ఎస్టీ) 8,073 చెంచు(ఎస్టీ) 8,739 ముదిరాజ్(బీసీ) 95,079 రెడ్డి(ఓసీ) 47,021 వైశ్య(ఓసీ) 12,083 వనపర్తి జిల్లా మాదిగ(ఎస్సీ) 91,157 మదాసికురువ(ఎస్సీ) 8,076 మాల(ఎస్సీ) 5,703 బంజార(ఎస్టీ) 48,978 ఎరుకల (ఎస్టీ) 5,373 వాల్మీకిబోయ(బీసీ) 79,364 ముదిరాజ్(బీసీ) 65,605 యాదవ(బీసీ) 79,140 రెడ్డి(ఓసీ) 34,319 వైశ్య(ఓసీ) 7,114 ఎస్సీల్లో 70 శాతానికి మించి మాదిగలే.. ఉమ్మడి జిల్లాలో బీసీల తర్వాత 20.09 శాతంతో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉండగా, ఇందులో సింహభాగం 70 శాతానికి మించి మాదిగలే ఉన్నారు. ఎస్సీల్లో వీరి జనాభా అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 83.13 శాతం, వనపర్తిలో 78.86 శాతం, మహబూబ్నగర్లో 71.88 శాతం, నారాయణపేటలో 71.18 శాతం, నాగర్కర్నూల్లో 62.41 శాతం ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలో మాలల జనాభా అత్యధికంగా 27.73 శాతం ఉంది. ఎస్సీల్లో మాదాసికురువల జనాభా నారాయణపేటలో అత్యధికంగా 10.75 శాతం, గద్వాలలో 5.61 శాతం నమోదైంది. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న సామాజికవర్గాల జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే వివరాలను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా జనాభా 37,01,072 మంది కాగా.. అందులో అత్యధికంగా 20,29,001 మంది బీసీలు ఉండడం విశేషం. మొత్తం జనాభాలో బీసీలదే 54.82శాతం ఉన్నట్లు తేలింది. మిగిలిన వర్గాల్లో 20.09 శాతంతో 7,43,606 మంది ఎస్సీ జనాభా ఉండగా, 9.37 శాతంతో 3,42,055 మంది ఎస్టీ జనాభా ఉంది. ఓసీల జనాభా 2,97,408 మందితో 8.03 శాతం కాగా, మైనార్టీల జనాభా 2,89,004 మందితో 7.80 శాతంగా తేలింది. బీసీల్లో ముది‘రాజులు’.. ఉమ్మడి జిల్లాలోని జనాభాలో సింహభాగం బీసీలే కాగా, ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గమే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం బీసీ జనాభా 20,29,001 కాగా, వీరి శాతం మొత్తం జనాభాలో సగానికి మించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజుల ప్రాబల్యమే ఎక్కువగా ఉండగా, అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 36.03 శాతం ఉండటం గమనార్హం. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 22.92 శాతం, నాగర్కర్నూల్లో 20.37 శాతం, వనపర్తి జిల్లాలో 17.35 శాతం ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం వాల్మీకి బోయ, కురుమ, యాదవ కులాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో కులాల వారీగా జనాభా.. జిల్లా ఎస్సీలు శాతం ఎస్టీలు శాతం బీసీలు శాతం ఓసీలు శాతం ముస్లిం శాతం మహబూబ్నగర్ 1,45,543 15.46 1,22,358 12.99 4,76,910 50.65 85,550 9.09 1,11290 11.82 నాగర్కర్నూల్ 2,03,470 23.61 1,14,503 13.29 4,21,022 48.86 77,004 8.94 45,676 5.30 వనపర్తి 1,15,594 19.22 56,365 9.37 3,46,031 57.54 51,342 8.54 32,032 5.33 జోగుళాంబగద్వాల 1,51,075 22.66 12,141 1.82 4,11,783 61.76 41,749 6.26 49,992 9.51 నారాయణపేట 1,27,924 20.32 36,688 5.83 3,73,255 59.28 41,761 6.63 50,014 7.94 మొత్తం 7,43,606 20.09 3,42,055 9.37 20,29,001 54.82 2,97,408 8.03 2,89,004 7.80 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తేలిన లెక్కలు -
చిన్నారి చైత్రికను కాపాడండి
● సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి మదనాపురం: అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1తో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి చైత్రికను కాపాడాలని మదనాపురం మండలవాసులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో చిన్నారి దీనగాథను తెలియజేస్తున్నారు. ఇందుకు ఇటీవల ‘సాక్షి’ మెయిన్లో ప్రచురితమైన ‘సీఎం సారూ.. ప్రాణం పోయరూ’ కథనాన్ని సీఎం అధికారిక ఇన్స్ట్రాగామ్ ఖాతాకు ట్యాగ్ చేస్తున్నారు. మండలంలోని నెలివిడికి చెందిన రమేశ్, సాత్విక దంపతుల ఏకై క కుమార్తె చైత్రిక ఎస్ఎంఏ టైప్–1 వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారి చికిత్సకు అవసరమైన ఖర్చు ను భరించలేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించి చిన్నారి చైత్రిక వైద్యానికి అవసరమైన ఆర్థికసాయం అందించాలని మాజీ ఎంపీటీసీ కుర్మయ్య, రమేశ్, ఈశ్వర్, దశరథ్ విజ్ఞప్తి చేశారు. -
దాహం తీర్చేలా..!
● వన్యప్రాణులకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు ● మండుతున్న ఎండలతో అడుగంటుతన్న జలాలు ● అభయారణ్యంలో ఎండుతున్న వాగులు, చెక్డ్యాంలు, కుంటలు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలో మూగజీవాలకు నీటి సౌకర్యం అచ్చంపేట: వేసవిలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలను గుర్తించి వాగులు, వంకలు, ఊటకుంటలు, చెలిమెలు, చెక్డ్యాంలు, నీటి గుంటలు, సోలార్ కుంటలు, సాసర్ పిట్లు నిర్మించారు. సోలార్ పిట్లలో ప్రతి నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండటంతో సమస్య జటిలమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, నీటి ఆవాసాల వైపు వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంరణకు చర్యలు చేపడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. దాహం తీర్చడంతో పాటు వాటి మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం 2,611.39 చ.కి.మీ., విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చ.కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చ.కి.మీ., బఫర్జోన్గా ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్జీసీఏ) లెక్కల ప్రకారం ప్రస్తుతం 42 పులులు, 250కిపైగా చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులు, మచ్చల జింకలు, దుప్పులు, మనుబోతులు, ముళ్లపందులు, నక్కలు, తోడేళ్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, వంటి ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. వీటితోపాటు అరుదైన వివిధ రకాల పక్షులు, సర్పాలు, కీటకాలు, వృక్ష సంపద నల్లమల సొంతం. ప్రతిఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. నీటి సమస్య తీవ్రతతో అటవీ జంతువుల ఇబ్బందులు వర్ణణాతీతం. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4 కి.మీ., పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ., పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జలవనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసులచెరువులో మాత్రమే కొద్దిగా నీరు ఉండటంతో అత్యధికంగా వన్యప్రాణులు ఇక్కడికి వస్తుంటాయి. నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్స్ లేని ఎత్తైన ప్రాంతాల్లో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏటీఆర్(అమ్రాబాద్ టైగర్రిజర్వ్)లో 75 సోలార్ విద్యుత్తో నడిచే పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఏటీఆర్ పరిధిలో 80 వరకు నీటికుంటలు, చెక్డ్యాంలు, పర్కులేషన్ ట్యాంక్లు, పాంపాండ్లు ఏర్పాటు చేశారు. నీటి ఊట ఉన్న ప్రదేశంలో బావిలా గుంత తవ్వి నీరు పడగానే వన్యప్రాణులు సులువుగా దిగి నీరు తాగేలా రెండువైపుల ర్యాంపు తయారు చేస్తారు. మూడు మీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పుతో గుంత తవ్వుతారు. అందులోకి స్వచ్ఛమైన నీరు ఊటల ద్వారా చేరుతుంది. వీటిని 20 వరకు ఏర్పాటు చేశారు. వీటిని ప్రతి రెండురోజులకోసారి బేస్ క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు పర్యవేక్షిస్తారు. నల్లమలలో వన్యప్రాణులకు ఆహారంతోపాటు దాహార్తి తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అడవిలో పారే వాగులు, నీటి వనరులు ఉన్న ప్రదేశాల్లో సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. నీటి ఆనకట్టలు, ర్యాంపు వెల్స్, చెలిమెల ద్వారా సహజసిద్ధమైన నీటిని వన్యప్రాణులకు అందించేందుకు చర్యలు చేపట్టాం. సీసీ సాసర్ల వినియోగం తగ్గించి సహజ సిద్ధమైన నీరిందించేందుకు చూస్తున్నాం. కెమెరాల పర్యవేక్షణలో నీరు అయిపోయినట్లు గుర్తించి వెంటనే నింపుతున్నాం. వన్యప్రాణులు పొలాల వైపు వస్తే సమాచారం ఇవ్వాలి. వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – రేవంత్చంద్ర, డీఎఫ్ఓ -
హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ
జడ్చర్ల: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళన కలిగిస్తోందని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అరైవ్–అలైవ్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది 800 మంది హత్యల కారణంగా మరణిస్తే 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి రోడ్డు భద్రతకు సంబంధించి ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ ద్వారా క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పోలీస్, రోడ్డు రవాణా శాఖల ద్వారానే కాకుండా అందరి భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ బెక్లు నడిపేవారు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించకపోవడ వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. అరైవ్–అలైవ్ అవగాహన సదస్సులో డీజీపీ శివధర్రెడ్డి -
నిధుల గండం..!
● కేంద్రం నుంచి వచ్చే నిధులపై నీలినీడలు ● గతేడాది వసూలైన ఆస్తిపన్ను రూ.5.72కోట్లు ● ఈ సారి రూ.5.53 కోట్లు మాత్రమే.. ● మరో 12శాతం వసూలుకాక ఫర్ఫామెన్స్ గ్రాంట్లకు గండి వనపర్తి పురపాలికలో గతేడాదికి మించి వసూలుకాని ఆస్తిపన్ను వనపర్తిటౌన్: కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను వనపర్తి మున్సిపాలిటీ చేజారవిడుచుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం గత మార్చి 29 నాటికి మున్సిపాలిటీలో వసూలుచేసిన ఆస్తిపన్ను కంటే మరో 12శాతం అదనంగా వసూలుచేస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చేవి. ఈ మేరకు ప్రభుత్వం ముందస్తుగానే సూచనలు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను వసూలులో విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 5.72కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసిన మున్సిపాలిటీలో.. ఈసారి 42.87 శాతంతో రూ. 5.53కోట్ల ఆస్తిపన్ను వసూలయ్యాయి. అదనంగా మరో రూ. 63లక్షలు వసూలైతే కేంద్రం నిధులకు అర్హత సాధించేది. ఆస్తిపన్ను వసూలు లక్ష్యం నెరవేరకపోవడంతో నిధులు రాక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. సవాల్గా మారిన నిబంధన.. ఆస్తిపన్ను వసూళ్లలో గతేడాది కంటే రాష్ట్ర జీఎస్డీపీ ప్రకారం నిధుల లక్ష్యానికి చేరువైతేనే కేంద్ర ప్రభుత్వం విడుదలచేసే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. ఇదే నిబంధన ప్రతిసారీ పురపాలిక సంఘాలకు సవాల్గా మారుతోంది. చివరి నిమిషంలోనూ దీనికోసం హడావుడి చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం పన్ను వసూళ్లు చేపట్టడం లేదు. వాస్తవానికి నివాసగృహాలు, వాణిజ్య నిర్మాణాలు, పరిశ్రమలు.. ఇలా ఎలాంటి ఆస్తులున్నా ఆరు నెలలకొకసారి పన్ను వసూలు చేస్తారు. అనుకున్న మేరకు సక్రమంగా వసూలుచేస్తే లక్ష్యం చేరుకోవచ్చు. ప్రతిసారి ఆర్ధిక సంవత్సరం ముగిసే మార్చిలోనే సిబ్బంది ఉరుకులు పరుగులు తీస్తున్నారు. దీంతో పన్నుల లక్ష్యం నెరవేరడం లేదు. వనపర్తి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో నివాసాలు, దుకాణాలు కోల్పోయిన వాటికి కూడా ఆస్తిపన్ను వస్తుంది. ఆ వివరాలను అదనపు కలెక్టర్కు అందించాం. మనుగడలో లేని వాటికి కూడా సుమారు రూ. 1.20కోట్ల పన్ను చూయిస్తుంది. వాటిని ఆన్లైన్లో పూర్తిగా తొలగిస్తే కేంద్రం నిధులకు అర్హత సాధించవచ్చు. – శంకర్, ఇన్చార్జి ఆర్ఓ, వనపర్తి మున్సిపాలిటీ ఆస్తిపన్ను వసూళ్లకు కమిషనర్, ఆర్ఓతో మొదలుకొని వార్డు అధికారుల వరకు హడావుడే తప్పితే.. ప్రణాళికాబద్ధంగా ఎక్కడా ముందడుగు వేసినట్లు కనిపించ లేదు. దీనికి తోడు ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది పెడచెవిన పెట్టడంతో ఆస్తిపన్ను లక్ష్యానికి గండిపడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎం.మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తదితరులు ఆస్తిపన్ను వసూలుపై సమీక్షలు జరిపినా పెద్దగ ప్రభావం చూపలేదు. ఉమ్మడి జిల్లాలోనే పేరున్న వనపర్తి మున్సిపాలిటీలో రెండు, మూడేళ్లుగా ఆస్తిపన్ను వసూళ్లలో మందగమనం చోటుచేసుకుంటుంది. మున్సిపాలిటీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు రూ. 20.77 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. కేవలం రూ. 5.53 కోట్ల వసూళ్లకే పరిమితమై కేంద్ర నిధులను కోల్పోయింది. మొత్తం లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్నా 50శాతం పన్నులు కూడా వసూలు చేయకపోవడం గమనార్హం. -
ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువ
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గోపాల్పేట: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. అనేక పథకాలు అమలు చేస్తోందని.. ప్రజలకు ఇంకా ఏ పథకాలు అమలుచేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి అన్నారు. గురువారం గోపాల్పేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎంపీఓ భవాణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళికను అమలుచేస్తున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్ రావడం లేదని.. ప్రస్తుతం నేరుగా గ్రామ పంచాయతీల్లోనే నిధులు జమ అవుతున్నాయన్నారు. సర్పంచులు నిజాయతీగా పనిచేసి.. గ్రామాలను అన్నివిధాలా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఇంకా అభివృద్ధి పనులకు నిధులు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జూరాల సమీపంలోని పంటపొలాలకు సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పట్టుబట్టి కేఎల్ఐ కాల్వలు తవ్వించినట్లు చెప్పారు. కేఎల్ఐ నీటి రాకతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారన్నారు. రెండో పంటకు సాగునీటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులు ముందస్తుగా రైతులకు తెలియజేయాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. గతంలో తాను పనిచేసిన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రాజకీయ నాయకుడు మరణించాడని గుర్తుచేశారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం డీటీఓ మానస ప్రతిజ్ఞ చేయించారు. ఉమ్మడి మండలంలో మొదటిసారిగా బెల్టుషాపులను బంద్ చేయించిన పొలికెపాడు సర్పంచ్ నక్కా బంగారయ్యను అభినందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, మండల అధికారులు పాల్గొన్నారు. వనపర్తి: యాసంగి సీజన్ వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వరిపంట కోత దశకు చేరుకుందని, రైతులు పంట కోసిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్లో దాదాపు 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా కోతకు వచ్చే మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. తూకం కాంటాలు, తేమ యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా వరిధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు కేంద్రాల్లో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు వేగంగా చేసే విధంగా నిర్వాహకులకు సూచనలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఏమైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇక ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాములను సిద్ధం చేయాలని మార్కెటింగ్ అధికారికి సూచించారు. మిల్లర్లకు సంబంధించి వరిధాన్యం కేటాయింపులు కచ్చితంగా బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన వారికి మాత్రమే ధాన్యం కేటాయించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, డీసీఓ రాణి ఉన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి
కొత్తకోట రూరల్: వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక అధికారి దేవేందర్ సూచించారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం కొత్తకోట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుదాఘాతాలు, నిర్లక్ష్యంగా గ్యాస్ వినియోగం, చెత్త దహనం వంటి కారణాలతో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. గ్యాస్ సిలిండర్లు సురక్షితంగా వినియోగించడం, విద్యుత్ పరికరాలను సరిగా నిర్వహించడం, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే స్పందించి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో అగ్ని ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పేదల హక్కుల సాధనకు పోరాటం
ఖిల్లాఘనపురం: దేశంలో పేదలు ఉన్నంత కాలం వారి హక్కులు, దోపిడీ వ్యవస్థ నిర్మూలన, పేదల జీవన పరిస్థితులు మెరుగుపర్చడానికి ఎర్ర జెండా నిరంతరం పని చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్.వెంకట్రాములు అన్నారు. మండల కేంద్రంలోని ఓ సంఘం కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలకు ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు జిల్లా సీనియర్ నాయకుడు వేణుగోపాల్, మహాసభ అధ్యక్షుడు ఎస్.అజయ్, భూ పోరాటాల సాధన కమిటీ జిల్లా కన్వీనర్ సక్రూనాయక్, ఉపాధి కూలీల సంఘం నాయకులు లక్ష్మి హాజరుకాగా వారితో కలిసి సంఘం జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేసి వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చిందని, అందులోని నిబంధనలు వ్యవసాయ కూలీల కడుపుకొట్టే విధంగా ఉన్నాయని చెప్పారు. శ్రమకు తగిన వేతనం లేనందున కొత్త చట్టాన్ని రద్దు చేసి పాతది కొనసాగించాలని కోరారు. సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కూలీల కడుపుకొట్టి పెద్దల కడుపులు నింపే విధంగా ఉన్నాయని ఆరోపించారు. సమగ్ర కూలీ చట్టం తీసుకురాకుండా కూలీల బతుకుల్లో మార్పు తెస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. మండలంలోని కర్నెతండాలో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు పట్టాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. భవిష్యత్లో కూలీలు, భూ పోరాటాలకై వ్యవసాయ కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బాల్యానాయక్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు రామచంద్రయ్యగౌడ్, జీఎంపీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ బాలపీరు, మండల నాయకులు పొయ్యికాటి పెంటయ్య, వ్యవసాయ సంఘం నాయకులు ఆర్.మౌలాలి, మహబూబ్పాషా, నిరంజన్, వెంకటయ్య, ముత్యా లు, దేవన్న, సత్యనారాయణ, భరత్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
మామిడి క్లస్టర్తో మేలు
కొల్లాపూర్: నాణ్యమైన ఉత్పత్తులు.. ఎగుమతులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ విధానం మామిడి రైతులకు ఉపయోగకరంగా మారింది. మామిడి సాగుకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని కచ్, ఉత్తర్ప్రదేశ్లో లక్నో, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలను మూడేళ్ల క్రితం కేంద్రం క్లస్టర్ జోన్లుగా గుర్తించింది. పాలమూరు క్లస్టర్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి ఉండగా.. క్లస్టర్ సేవల్లో భాగంగా జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో.. ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి సాగు అధికంగా ఉంటుంది. ఇక్కడ పండే మామిడికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. కేంద్రం ప్రకటించిన క్లస్టర్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్ర, రాష్ట్ర ఉద్యాన శాఖలు సయన్వయంతో నిర్వహిస్తున్నాయి. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 62 లక్షల మామిడి కవర్లను సబ్సిడీపై రైతులకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా కోటికిపైగా కవర్ల పంపిణీ జరిగింది. మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల ఎలాంటి రసాయనాలు వాటిపై పడవు. చీడపీడలు కూడా ఆశించవు. కాయలు మంచి రంగులో ఉంటాయి. కవర్లు కట్టిన కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కాయలకు, కవర్ కాయలకు మధ్య టన్నుకు రూ.30 వేలకు పైగా ధర అధికంగా పలుకుతోంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 62,612 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు. అత్యధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 31,728 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో పంట కాపు వచ్చే తోటలు 30 వేల ఎకరాల మేరకు ఉన్నాయి. సురభి సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే బేనిషాన్ రకం మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బేనిషాన్ రకం మామిడికి జాతీయస్థాయి గుర్తింపు కూడా ఉంది. బేనిషాన్తోపాటు హిమాయత్, దెషేరీ, కలెక్టర్, బంగారు, జహంగీర్ పసంద్, మోతిమోనీ పసంద్, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్గుబా వంటి నోరూరించే మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. క్లసర్ ద్వారా ప్రోత్సాహకాలు.. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాధ్యతలను గ్రాండ్ కార్టన్ కంపెనీ, ప్రసాద్ సీడ్స్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మామిడి సాగు విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సబ్సిడీపై పేపర్ కవర్లు ఇస్తున్నారు. కాయలు కత్తిరించేందుకు, కొమ్మలు నరికేందుకు అవసరమైన సామగ్రిని ఇస్తున్నారు. డ్రిప్ సౌకర్యం, క్లయిమింగ్ ల్యాడర్స్, దపోలి హార్వెస్టర్ పరికరాల పంపిణీ, పండ్లు మాగ బెట్టేందుకు అవసరమైన వసతులను స్థానికంగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. క్లస్టర్ పరిధిలోని మొత్తం 62 వేల ఎకరాల రైతులందరికీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రాసెసింగ్ యూనిట్.. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ పథకం కింద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మామిడి ప్రాసెసింగ్ యూనిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్ లైనింగ్ పనులు జరుగుతుండగా.. మిగతావన్నీ పూర్తయ్యాయి. దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు లేదా మామిడి రైతులకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గ్రేడింగ్ వారీగా ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. రైతులకు అప్పగించాలి పెద్దకొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలను మామిడి సాగు చేస్తున్న రైతులకే అప్పగించాలి. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు రెగ్యులర్గా వివరించాలి. దీంతో ఎగుమతులకు ఉపయోగపడేలా మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. క్లస్టర్ ఏజెన్సీ ద్వారా అందుతున్న సహకారంతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. – శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్నాణ్యతలో బెటర్.. కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్రం మన ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్గా గుర్తించడం వల్ల మామిడి సాగుకు అవసరమైన వసతి, సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. మన మామిడి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. నాణ్యతలో ఇది బెటర్గా ఉంది. ఈ ఏడాది క్లస్టర్ ఏజెన్సీలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. – లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్ మూడేళ్ల కిందట పాలమూరును క్లస్టర్గా ఎంపిక చేసిన కేంద్రం ఎగుమతులకు ఉపయోగపడేమామిడి ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల కేటాయింపు నాలుగేళ్లపాటు ప్రణాళికబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయం నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేస్తున్న రైతులు -
రహదారి భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
వనపర్తి రూరల్: రహదారి భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ప్రాణం అమూల్యమైందని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని రాజపేట శివారు పోలీస్ పెట్రోల్బంక్ ఆవరణలో గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి వారితో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు నియమాల ప్రాముఖ్యతను వివరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. హెల్మెట్, సీట్బెల్ట్ వంటి చిన్న జాగ్రతలు మన ప్రాణాలను రక్షించే పెద్ద ఆయుధాలని, ప్రతి ఒక్కరూ తన బాధ్యతను గుర్తించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రతగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ హృషికేష్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
సాదాబైనామాకు మోక్షం
జిల్లాలో 8,120 దరఖాస్తులు పెండింగ్ వనపర్తి: సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2020, నవంబర్ 10 నుంచి అఫిడవిట్ దాఖలు విషయంలో భూమి విక్రయించిన వారితో సైతం తీసుకోవాలని నిబంధనలను సడలించే డిమాండ్ ఉండటం, ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో జాప్యం జరిగింది. ఇటీవల భూమి కొనుగోలు చేసిన వారితో మాత్రమే అఫిడవిట్ తీసుకుంటే సరిపోతుందనే నిబంధనతో ప్రభుత్వం జీఓ నంబర్ 76, 77 జారీ చేయడంతో ఎట్టకేలకు సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించినట్లు అయింది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 8,120 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీఓల ఆధారంగా అధికారులు విచారణకు నోటీసులు జారీ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వేలాది మంది రైతుల నిరీక్షణ ఫలించనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సాదాబైనామా అర్జీల పరిష్కారానికి అప్పటీ జీఓ 112పై వచ్చిన అభ్యంతరాలు, విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. దీంతో కోర్టులో సాదాబైనామాపై ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అమలులోకి వచ్చిన సాదాబైనామాల అమలు ప్రక్రియ ఆగుతూ.. సాగుతూ.. అన్నట్లుగా ఉంటోంది. 2016లో జీఓనంబర్ 153తో కొన్నింటిని అమలు చేశారు. ధరణి చట్టం అమలులోకి వచ్చాక మరో జీఓను నాటి ప్రభుత్వం జారీ చేయడం, ఈ జీఓను సవాల్ చేస్తూ కోర్టులో పిల్ దాఖలు కావడంతో ప్రక్రియకు బ్రేక్ పడినట్లైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు కావాల్సిన వివరాలను సమర్పించడంతో దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమమైంది. జిల్లాలో 2020, నవంబర్కు ముందే కొన్ని దరఖాస్తులను పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేశారు. మిగిలిన వాటిని పరిష్కరించేందుకు అధికారులు కొత్త జీఓలతో సమాయత్తమవుతున్నారు. మండలం పెండింగ్ దరఖాస్తులు పెబ్బేరు 1,788 పాన్గల్ 919 వీపనగండ్ల 822 వనపర్తి 707 ఏదుల 618 గోపాల్పేట 575 కొత్తకోట 480 చిన్నంబావి 448 శ్రీరంగాపురం 387 పెద్దమందడి 354 ఆత్మకూర్ 257 రేవల్లి 252 ఖిల్లాఘనపురం 225 మదనాపురం 172 అమరచింత 86 ప్రభుత్వం మార్గదర్శకాలతో పరిష్కార మార్గం ఏళ్ల నిరీక్షణకు తెర భూమి విక్రయించిన వారి అఫిడవిట్ అక్కర్లేదని జీఓ జారీతో వీడిన చిక్కుముడి -
‘జనగణన’ వేగవంతం చేయాలి
వనపర్తి: జనగణన ప్రక్రియలో భాగంగా హౌస్లిస్టింగ్ బ్లాక్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని, హెచ్ఎల్బీ డీమార్కేషన్ పనులను గురువారంలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి జనగణనలో భాగమైన హౌస్ లిస్టింగ్ బ్లాక్ ఏర్పాటు ప్రక్రియపై తహసీల్దార్లు, పుర కమిషనర్లు, ఎంపీఎస్ఓలతో టెలీ కాన్ఫరెన్న్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అధికారులు నిర్దేశిత గడువులోగా డీమార్కేషన్ పూర్తి చేయాలని, హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్కు సంబంధించిన ప్రింట్ కాపీలను ఎన్యూమరేటర్లకు అందజేయాల్సి ఉంటుందన్నారు. పనులు సమర్థవంతంగా, సమయపాలనతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, సీపీఓ హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోపాల్పేట: జిల్లాలో జరుగుతున్న అబార్షన్ కేసుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి కేసు వెనక ఉన్న కారణాలు, చోటుచేసుకునే ప్రాంతాలపై క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రసవాల రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి జరుగుతున్న ప్రసవాలు, అబార్షన్లపై ఆరా తీశారు. అబార్షన్లకు కారణాలు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్న వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్యసేవల కోసం అవసరమైన సదుపాయాలతో నివేదిక సమర్పించాలన్నారు. మహిళలకు హెపీవీ వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని, ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి అనంతరం మండలంలోని పొలికెపాడులో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లుల చెల్లింపునకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 35 ఇళ్లు మంజూరకాగా.. 34 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని, మూడు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. అర్హులైన వారికి రెండోవిడతలో తప్పనిసరిగా మంజూరవుతాయని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ ఇంటిని హౌసింగ్ కార్యాలయానికి వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై జనగణనపై సమీక్షించారు. గురువారం వరకు హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, డీ–మార్కేషన్ పూర్తిచేసి ఇవ్వాలని సూచించారు. 18 నుంచి ఆయా బృందాలకు శిక్షణ ఉంటుందని.. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ విఠోబా, సీపీఓ హరికృష్ణ, వైద్య అధికారులు ఉన్నారు. -
అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తి: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని.. అందరూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి.చిన్నారెడ్డితో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే అంటరానితనం, అస్ప్రశ్యతను దూరం చేయవచ్చని అంబ్కేడర్ నమ్మారన్నారు. ఆ రోజుల్లోనే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదివిన ఘనత సాధించారని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత న్యాయశాఖ మంత్రిగా పని చేశారని, ఆయన రూపొందించిన రాజ్యాంగం దేశంలో అమలవుతోందని తెలిపారు. ఆయన కృషి ఫలితమే నేడు సమాజంలో సమానత్వం విరాజిల్లుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని.. రెసిడెన్షియల్, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఉన్నత విద్యాలయాలు నెలకొల్పుతోందని చెప్పారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించాలని.. విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని గుర్తు చేశారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. అంబేడ్కర్ జీవితం సమాజానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడమే కాకుండా సమాజానికి సేవ చేయడం కూడా ముఖ్యమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఉన్నత విద్యతో ఏదైనా సాధించగలరని తెలిపారు. ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇంటి మొత్తానికి జ్ఞానాన్ని పంచుతుందని.. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం శాట్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే జ్ఞానం లభిస్తుందని, అంబేడ్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తూ బాగా చదువుకోవాలని సూచించారు. ఆయన జీవిత చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ఆయన ఘనతను చాటి చెప్పాలన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు అంబేడ్కర్ జీవితంపై పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, పుర వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం నాగరాజు, ఉపాధ్యక్షుడు చిరంజీవి పాల్గొన్నారు. -
ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు..
ఫార్మా కంపెనీల పక్కనే మా పొలాలున్నాయి. కలుషిత నీటిని వదులుతున్నప్పుడల్లా ఆ నీటి శాంపిళ్లను తీసుకుపోయి పీసీబీ అధికారులకు ఇస్తున్నాం. లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. వాళ్లు వస్తారు.. మమ్మల్ని హైదరాబాద్కు పిలుస్తారు. పరిశ్రమల సిబ్బందిని పిలిచి ఇంకోసారి వదలకండనీ చెబుతారు. ఆ తర్వాత కంపెనీలది మళ్లీ షరామామూలే. మా సమస్యలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – మాధవి లత, మహిళా రైతు -
వరి కొనుగోళ్లకు సన్నద్ధం
జిల్లాలో 414 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ● 1.25 లక్షల ఎకరాల్లో సాగు ● సేకరణ లక్ష్యం 3.75 లక్షల మెట్రిక్ టన్నులు ● గ్రేడ్–1కు మద్దతు ధర రూ.2,389 ● సన్నరకానికి రూ.500 బోనస్ అవగాహన కల్పిస్తున్నాం.. మండలంలోని నందిమళ్ల, ఈర్లదిన్నె, క్రాస్రోడ్లో ఐకేపీ ఆధ్వర్యంలో, అమరచింతలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందనే విషయాన్ని రైతులకు వివరిస్తున్నాం. వానాకాలం పంటకు సంబంధించిన బోనస్ చెల్లించడంతో ఈసారి కూడా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. – అరవింద్, ఏఓ, అమరచింత పక్కా ప్రణాళికతో ముందుకు.. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వపరంగా వరి ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జిల్లావ్యాప్తంగా 414 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పంట విక్రయించే రైతులు నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా గ్రామాల్లో ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈసారి యాసంగిలో 3.75 లక్షల మె.ట. వరి ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. – కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి అమరచింత: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గత వారం కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికారులు జిల్లావ్యాప్తంగా 414 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. బోరుబావుల కింద సాగుచేసిన పంట కోతలు ప్రారంభం కావడంతో మండలాల వారీగా కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సన్న రకాలకు బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికే మొగ్గు చూపుతున్నారు. మొదలైన పంట కోతలు.. జిల్లాలో యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంటలు కోత దశకు చేరాయి. బోరుబావులు, చెరువుల కింద సాగు చేసిన పంటల కోతలు మొదలయ్యాయి. దీంతో అధికారులు కోతలు ఎక్కడెక్కడ ప్రారంభించారో తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో సన్న, దొడ్డురకం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయా గ్రామాల రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఇలా.. -
రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి
పాలమూరు: చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మంగళవారం సాయంత్రం స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నారీ శక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ కూడలిలో మహిళలతో కలిసి ఎంపీ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబోతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో రాణించే శక్తి, పాలించే శక్తి మహిళలకు ఉందన్నారు. దేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళ బిల్లును అడ్డుకునే ప్రయత్నం గతంలో కొందరు చేశారన్నారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని ప్రధాని కంకణం కట్టుకొని పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరిగితే 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని వెల్లడించారు. మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వాలన్నారు. అసెంబ్లీ స్థానాలు పెరిగితే రాష్ట్రంలో 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారు 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇచ్చి మహిళా బిల్లుకు మద్దతు తెలపండి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
‘గరళ’కంఠుడే రావాలేమో..!
‘పోలేపల్లి’ పరిసర ప్రాంత వాసుల దీనగాధ విచారణలో తేలినా.. జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సుమారు 1,100 ఎకరాల్లో భూములను సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్ కోసం 250 ఎకరాలు కేటాయించారు. దీని పరిధిలో ఇప్పటివరకు 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2023లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన అనంతరం విచారణ బృందం శాఖల వారీగా ఆధారాలతో నివేదిక అందజేసింది. పలు ఫార్మా పరిశ్రమలు వర్షాకాలంలో వరద మాటున రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా చెరువులు, కుంటలు, పొలాల్లోకి వదులుతున్నాయని.. దీంతో పంటలు పండడం లేదని, జలాశయాల్లో చేపలు ఎదగకుండా మృతి చెందుతున్నాయని నివేదికలో పేర్కొంది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, గొల్లపల్లి, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామకు చెందిన పలువురు చర్మ, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. కాగితాలకే పరిమితం.. విచారణ బృందం నివేదిక అందజేసిన క్రమంలో అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ప్రతి నెలా 11న కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సెలవు దినమైతే మరుసటి రోజున సందర్శించి పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. కాలుష్య కట్టడిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని టీజీఐఐసీ అధికారులకు సైతం సూచనలు చేశారు. అయితే ఇవేమీ అమల్లోకి రాకముందే వెంకట్రావ్ సూర్యాపేటకు బదిలీ అయ్యారు. అనంతరం రవినాయక్, ఆయన తర్వాత విజయేందిర బోయి మహబూబ్నగర్ కలెక్టర్లుగా పనిచేశారు. వీరి హయాంలో నెలనెలా తనిఖీల అంశం తెర మీదకే రాలేదు. ఇటీవల ఖుష్బూ గుప్తా కలెక్టర్గా రాగా.. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదులుతున్న పలు పరిశ్రమలపై కొందరు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఫొటోలతో సహా పలు ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. ‘పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. తాగేందుకు, పంటల సాగుకు, జీవచరాల ఉనికికి ఈ నీరు అసలే పనికి రాదు.’ ...పరిశ్రమల కాలుష్యం, ప్రభావిత ప్రాంతాలపై పలు ప్రభుత్వ శాఖలతో ఏర్పాటైన విచారణ కమిటీ 2023 జనవరి 31న అప్పటి కలెక్టర్ వెంకట్రావ్కు అందజేసిన నివేదికలోని అంశాలు ఇవి. మూడేళ్లుగా ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలతో పాటు ప్రభావిత పల్లెల్లో సంరక్షణ చర్యలనూ ‘అధికార’ యంత్రాంగం గాలికొదిలేసింది. ఈ క్రమంలో నెలనెలా ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా.. అటు పీసీబీ, ఇటు జిల్లా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ సెజ్లోని ఓ పరిశ్రమ బయటికి వదిలిన కాలుష్యం జలాలు ప్రస్తుతం పీసీబీ ఆడిందే ఆట.. పరిశ్రమల కాలుష్యంపై జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్గా వ్యవహరించిన క్రమంలో హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన వారు వర్షాకాలంలో పలుమార్లు స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత మూడేళ్లలో పరిస్థితి తారుమారైనట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలకే పరిమితం కాగా.. పీసీబీ ఆడిందే ఆటగా మారినట్లు సమాచారం. ఆధారాలతో సహా అందజేసినా.. కనీసం శాంపిళ్ల సేకరణకు రాకపోవడంతో ఫిర్యాదుదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్లతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ అయినా తమ గోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఓఎస్ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) పరీక్ష సైతం చేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా, తదితర పరిశ్రమల పొల్యూషన్తో బతుకులు ఛిద్రం తాగు, సాగుకు ఆ నీరు పనికిరాదని తేల్చిన విచారణ బృందం కలెక్టర్లు మారినా.. మారని బాధిత గ్రామాల ప్రజల తలరాతలు ఉత్తుత్తి మాటలుగానే నెలనెలా తనిఖీలు.. పీసీబీ తీరుపై అనుమానాలు ? ప్రస్తుత కలెక్టర్ అయినా దృష్టి సారించాలని బాధిత రైతుల విజ్ఞప్తి -
మాకు న్యాయం చేయాలి..
కంపెనీల నుంచి శుద్ధి చేయకుండా బయటకు వదిలే రసాయనాలు కలిసిన నీరు మూలంగా పంటలు పండవని.. ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులు ఎప్పుడో తేల్చారు. మా బోర్లు, భూములు పరిశీలించి.. టెస్టులు చేసి.. సర్టిఫికెట్లు ఇచ్చారు. మేం ఊరి వదిలిపెట్టి పోవాల్నా.. లేకుంటే ఏమైనా తాగి సావాల్నా అర్థమైతలేదు. కాలుష్యపు నీళ్లు వదిలే కంపెనీలపై చర్యలు తీసుకుని.. పరిహారం ఇప్పించాలి. మాలాంటి రైతులందరికీ తగిన న్యాయం చేయాలి. – ముల్గర నారాయణగౌడ్, రైతు, ముదిరెడ్డిపల్లి -
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
వనపర్తిటౌన్: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఏడు రోజులుగా విద్యుత్ ఆర్టిజన్, కార్మికులు దీక్ష చేస్తుండగా.. మంగళవారం శిబిరాన్ని మాజీ మంత్రి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టిజన్ కార్మికులను విద్యుత్శాఖలో పూర్తిస్థాయిలో విలీనం చేశారని.. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమైన హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో దీక్షా శిబిరాలను సందర్శించి సమస్యలు పరిష్కరిస్తానని మోసం చేసి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ విద్యార్థులకు సన్మానం.. ఉత్తమ మార్కులు సాధించిన జాగృతి, విజ్ఞాన్ జూనియర్ కళాశాలల విద్యార్థులను మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఉన్నతస్థాయికి చేరే సమయంలో ఎన్నో అటంకాలు ఎదురవుతాయని.. వాటన్నింటిని అధిగమించి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కన్న తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులను ఎన్నటికీ మరువొద్దని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పుర మాజీ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు ప్రేమనాథ్రెడ్డి, సూర్యవంశం గిరి, హేమంత్, భాగ్యరాజు, ఇమ్రాన్, సయ్యద్ జమీల్, చిట్యాల రాము, అస్లం, అలీమ్, శివగౌడ్, లక్ష్మణ్గౌడ్, వంశీ, ముదసార్, రాహుల్, తోట శ్రీను, మునికుమార్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు.. సాగదీత..?
రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేసే పనులు కూడా వర్షాకాలంలో, పంటల సాగు సమయంలో చేస్తే ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కెనాల్లో నీరు కూడా ఉండదని, పంటలు కూడా సాగులో ఉండవని, ఈ సమయంలో పనులు వేగంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. కేవలం మరమ్మతు పనులకే నాలుగేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని, ఆధునికీకరణ లాంటి పెద్ద పనులు చేయాలంటే ఇంకెన్నేళ్లు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 65 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తుంది. మిగతా పనులు ఎప్పుడు చేపడతారనేది స్పష్టత లేదనే వాదన వినిపిస్తుంది. ఫిబ్రవరి చివరలోనే కెనాల్లో నీరు తగ్గుముఖం పట్టగా.. అప్పటి నుంచే పనులు ప్రారంభించి ఉంటే.. జూన్లో వర్షాలు కురిసే సమయానికి చాలా వరకు పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేదని, అది వదిలేసి ఇప్పుడు పనులు చేయకుండా, మళ్లీ సీజన్ ప్రారంభమయ్యాక పనుల పేరుతో కెనాల్లో నీటిని ఆపే చర్యలు మొదలవుతాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి పనులను వేగంగా చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందించడంతో పాటు పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పనుల్లో వేగం పెరుగుతుందని ఆర్డీఎస్ రైతులు అంటున్నారు. నోటీసులు ఇచ్చాం.. ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్ 2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు నేటి వరకు నత్తనడకనకొనసాగుతున్న పనులు నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి.. సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం -
ఉద్రిక్తంగా కో-ఆప్షన్ ఎన్నిక
పుర కమిషనర్, బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్–అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడంతో కాంగ్రెస్–2, సీపీఎం–2 కో–ఆప్షన్ స్థానాలు కై వసం చేసుకున్నాయి. కో–ఆప్షన్ ఎన్నికకుగాను పదిమంది కౌన్సిలర్లు సకాలంలో కార్యాలయానికి చేరుకోగా మంత్రి వస్తున్నారనే సమాచారంతో పుర కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సీపీఎం నుంచి చిన్నన్న, షాజహాన్, కాంగ్రెస్పార్టీ నుంచి తౌఫిక్, మణెమ్మను కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి ఎన్నికై న సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయలు పక్కనబెట్టి పట్టణాభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు స్వాతి, జయన్న పాల్గొన్నారు. అమరచింత: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం జరిగిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 11 గంటల సమయంలో ఎన్నిక జరుగుతుందనే సమాచారంతో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ముందుగానే పుర కార్యాలయానికి చేరుకోన్నారు. ఇచ్చిన సమయం దాటుతున్నా పుర అధికారులు ఎన్నిక నిర్వహించకపోవడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు పుర కార్యాలయ ఆవరణ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండుకోవడంతో అసహనానికి గురైన బీజేపీ కౌన్సిలర్ మేర్వ రాజు సమయం దాటిపోయిందని, వెంటనే ఎన్నిక నిర్వహించాలని అక్కడే ఉన్న పుర కమిషనర్ నూరుల్ నదీంతో వాగ్వాదానికి దిగారు. ఒకనొక సమయంలో కౌన్సిలర్ కమిషనర్ కుర్చీ, చెయ్యి పట్టుకొని లాగేందుకు యత్నించగా ఇరువురి మధ్య మాటల యుద్ధం పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కౌన్సిలర్ రాజును బయటకు తీసుకొచ్చి అదుపులోకి తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో కౌన్సిలర్ మేర్వరాజుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ స్వాతి తెలిపారు. కమిషనర్ ఫిర్యాదుతో కౌన్సిలర్పై కేసు నమోదు పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం మంత్రి ఓటుతో అధికార పక్షం కై వసం చెరో రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, సీపీఎం -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
ఖిల్లాఘనపురం: జిల్లాలో పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అక్కడే ఉన్న ఎంఈఓ జయశంకర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పాఠశాలల్లోని పరిస్థితులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 14న ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. ఒకేషనల్, సంస్కృతం మినహా ప్రధాన పరీక్షలు సోమవారంతో ముగిశాయని చెప్పారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఖిల్లాఘనపురంలోని రెండు కేంద్రాలకు 496 మంది విద్యార్థులను కేటాయించగా సోమవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 493 మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం ఒకేషనల్, గురువారం సంస్కృతం పరీక్ష నిర్వహిస్తే మొత్తం పరీక్షలు ముగుస్తాయని డీఈఓ చెప్పారు. ఆయన వెంట కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. -
బాధ్యతలు చేపట్టిన రెవెన్యూ అదనపు కలెక్టర్
వనపర్తి: రెవెన్యూ అదనపు కలెక్టర్గా వినోద్కుమార్ సోమవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విభాగంలో పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ విభాగానికి సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు. ఎస్పీ ప్రజావాణికి ఆరు వినతులు వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆరుగురు వినతులు వచ్చాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అర్జీదారులతో వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసుశాఖ ఎల్లప్పుడూ అంకితభావంతో పని చేస్తోందన్నారు. ప్రజలు పోలీసుశాఖపై నమ్మ కం ఉంచి సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు వీపనగండ్ల: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రైతుల నుంచి వరి ధాన్యం సేకరించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, డీపీఎం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రాల సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి వారు హాజరై పలు సూచనలు చేశారు. దొడ్డు, సన్నరకం ధాన్యం గుర్తించే విధానాన్ని వివరించారు. తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే సమయంలోనే పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మండల వ్యవసాయ అధికారులు ఆంజనేయులు, డాకేశ్వర్గౌడ్, ఏపీఎం మద్దిలేటి, అనిల్కుమార్, సింగిల్విండో ఏఓ రాము, పలువురు ఏఈఓలు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి..
ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్లో మరమ్మతు చేపట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది కలిగించొద్దు.. పనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్లో నీరు ఉన్నప్పుడు, రైతులు సాగులో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దాని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డే స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె -
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
వనపర్తి: జిల్లాలో రానున్న వారం రోజులు భారీగా వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ఎండాకాలం వడగాలులపై సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేశారు. అన్ని పుర, మండల కేంద్రాల్లో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వడగాలులపై అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ వెంట తాగునీటి సీసాను వెంటబెట్టుకొని వెళ్లాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉపాధి పని ప్రదేశాల్లో చల్లని తాగునీరు, నీడ కోసం టెంట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా సదుపాయాలు కల్పించలేదని తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా మధ్యాహ్నం వేళలో వ్యవసాయ పనులకు వెళ్లరాదన్నారు. మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ప్రజలందరికీ సకాలంలో నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎస్పీ బాలాజీనాయక్, డీటీఓ మానస, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోషణ్ పక్వాడ్ వాల్పోస్టర్ ఆవిష్కరణ.. పోషకాహార లోపం నివారణే లక్ష్యంగా ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న పోషణ్ పక్వాడ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన పోషకాహారం అవసరమని, వాటిపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని వైద్యశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఆయుష్ విభాగం అధికారులు, డీడబ్ల్యూఓ, సీడీపీఓలు, సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయన హాజరై రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ దరఖాస్తులను కూడా పరిశీలించి వారంలోగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 30 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ విఠోబా, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
కొత్తకోట రూరల్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజిని అన్నారు. సోమవారం పట్టణంలోని వెంకటేశ్వర ఐటీఐ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న ఐటిఐ విద్యార్థులకు మోటారు వాహనాల వినియోగం, వాటి నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక చట్టాలు, మైనర్ డ్రైవింగ్తో కలిగే ప్రమాదాలు, వాటి పరిణామాల గురించి తెలిసి ఉండాలని సూచించారు. అదేవిధంగా మైనర్లకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు పోక్సో–2012, బాల్య వివాహాల నిషేధం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఏ వంటి అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ ఎం.రఘు, ఐటీఐ కళాశాల చైర్మన్ విశ్వనాథం గంగాధర్శెట్టి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మున్సిపల్ కో–ఆప్షన్ ఎన్నిక
● హాజరుకానున్న మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత: పుర కార్యాలయంలో సోమవారం జరిగే కో–ఆప్షన్ ఎన్నికలో పాల్గొని ఎక్స్–అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం రానున్నారు. 4 కో–ఆప్షన్ స్థానాలకు అధికార కాంగ్రెస్పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం తమ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అత్యధిక కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే కో–ఆప్షన్ ఎన్నిక జరుగుతుందని పుర కమిషనర్ నూరుల్ నదీం తెలిపారు. ● పుర ఎన్నికల్లో కాంగ్రెస్–3, బీఆర్ఎస్–3, బీజేపీ–3, సీపీఎం–1 వార్డులను దక్కించుకున్నాయి. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ సంఖ్యకు నాలుగుకు చేరింది. కాంగ్రెస్పార్టీ సీపీఎం మద్దతు, మంత్రి ఎక్స్ అఫీషియో ఓటుతో పుర చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది. కో–ఆప్షన్ ఎన్నికలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెరో ఐదుగురు కౌన్సిలర్లు ఉంటే డిప్ సిస్టంలో ఎన్నిక జరిగేది. అలాగాకుండా అవగాహనతో అందరూ ఒక్కో కో–ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకోవాలనే ఆలోచనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. తీరా కో–ఆప్షన్ ఎన్నికకు కూడా మంత్రి హాజరవుతున్నట్లు మున్సిపల్ కమిషనర్కు షెడ్యూల్ రావడంతో ఇక ఎన్నిక లాంచనమే. ఇక అన్ని కో–ఆప్షన్ స్థానాలు అధికార పార్టీ కై వసం కానున్నాయి. -
బాలికలదే పైచేయి..
ఇంటర్మీడియట్లో 66 శాతం ఉత్తీర్ణత ● ప్రథమంలో రెగ్యులర్ 23, ఒకేషనల్ 6.. ద్వితీయం రెగ్యులర్లో 21, ఒకేషనల్లో 11 స్థానంలో నిలిచిన జిల్లా ● గతేడాది కంటే కంటే కాస్త మెరుగుపడిన ఫలితాలు ఉత్తీర్ణులు కావడంతో 72.58 శాతం, బాలురు 3,053 మంది పరీక్షలు రాయగా 1,464 ఉత్తీర్ణులు కావడంతో 47.95 శాతం నమోదైంది. రెండో సంవత్సరం.. జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 5,625 మంది పరీక్షలు రాయగా.. 4,047 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 3,055 మంది పరీక్షలకు హాజరుకాగా.. 2,488 మంది ఉత్తీర్ణులై 81.44 శాతం, బాలురు 2,570 మంది పరీక్షలు రాయగా 1,559 మంది ఉత్తీర్ణులై 61 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తంగా బాలికలు 6,221 మంది, బాలురు 5,623 మంది పరీక్షలు రాయగా.. బాలికలు 4,786 మంది, బాలురు 3,023 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 559 మంది అధికంగా ఉన్నారు. వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో మొదటి, రెండో సంవత్సరం కలిపి జిల్లావ్యాప్తంగా 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని 12 ప్రభుత్వ, 26 రెసిడెన్షియల్ కళాశాలలు, 19 ప్రైవేట్ కళాశాలల నుంచి మొత్తం 11,844 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 7,809 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 60.49, రెండో సంవత్సరంలో 70.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2024–25 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా 59 శాతానికి పరిమితం కాగా.. 2025–26లో కేవలం ఒక శాతం పెరుగుదల కనిపించంది. రెండో సంవత్సరంలో 2024–25లో 67 శాతంతో సరి పెట్టుకోగా 2025–26 ఫలితాల్లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6,221 మంది బాలికలు హాజరుకాగా.. 4,786 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలుర కంటే బాలికలు 1,763 మంది అధికంగా ఉత్తీర్ణులై పైచేయి సాధించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రెగ్యులర్ 23, ఒకేషనల్లో 6.. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్లో 21, ఒకేషనల్లో 11 స్థానంలో జిల్లా నిలిచింది. మొదటి సంవత్సరం.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 6,219 మంది విద్యార్థులు హాజరుకాగా.. 3,762 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 3,166 మంది పరీక్షలు రాయగా 2,298 మంది -
కేటాయించిన మిల్లులకే ధాన్యం తరలించాలి
ఖిల్లాఘనపురం: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తూకం చేసిన తర్వాత కేటాయించిన మిల్లులకే లారీల్లో తరలించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అఽఽధికారి విశ్వనాథం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేధికలో 2025–26 యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి మండలస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు డీఎం ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి మల్లయ్యతో కలిసి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కచ్చితంగా ఎత్తు ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. తేమశాతం, ధాన్యంలో చెత్తా, మట్టి లేకుండా చూసుకోవాలని.. ప్రజాప్రతినిధులు, బంధువులు చెప్పారని తప్పుడు తూకాలు, తేమశాతం పంపితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ట్రక్షీట్ రాయడం, గన్నీ బ్యాగులు అందించడం సకాలంలో జరిగేలా చూడాలని చెప్పారు. వ్యవసాయ అధికారులు అవసరమైన రైతులకు టోకన్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఆనంద్, ఏపీఎం నాగరాజు, సీఈఓ కృష్ణ, వివిధ గ్రామాల ఏఈఓలు, కేంద్రాల ఇన్చార్జ్లు పాల్గొన్నారు. జాగ్రత్తలు పాటించాలి.. గోపాల్పేట: యాసంగి సీజన్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, జిల్లా కోఆపరేటివ్ అధికారి రాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేధికలో అన్ని గ్రామాల పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సన్నరకం గుర్తింపు, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. కొనుగోలు, రవాణా, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడు ఎకరాలు సాగుచేశా..
యాసంగిలో జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 7 ఎకరాల్లో వరి సాగుచేశా. ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్న గ్రామం కాబట్టి వారబంది విధానంలో నీటిని వదులుతున్నా సద్వినియోగం చేసుకుంటున్నా. ప్రస్తుతం పంట చేతికి రావాలంటే మరో మూడు తడులైనా నీటిని అందించాలి. – మైను, రైతు, నందిమళ్ల ఐదు తడులు అవసరం.. జూరాల ఎడమ కాల్వ ద్వారా వారబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీరు వదులుతున్నారు. కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు సరిగా లేకపోవడంతో డి–6 కాల్వకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సాగునీరు అందుతుందనే ఆశతో 11 ఎకరాల్లో వరి సాగుచేశా. అధికారులు ఈ నెల 15 వరకే సాగునీరు వదులుతామంటున్నారు. పంట చేతికి అందాలంటే మరో 5 తడులు ఇవ్వాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. – దేవేంద్రం, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) నీటి చౌర్యంతోనే.. జూరాల ఎడమ కాల్వ కింద 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారంలో నా లుగు రోజులు సాగు నీ రు వదులుతున్నామంటూ మిగిలిన రోజుల్లో దిగు వకు తరలిస్తున్నారు. ఇలాంటి నీటి చౌర్యంతోనే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతోంది. – బాలస్వామి, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) ఇబ్బంది లేదు.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, సాగునీటి పారుదల శాఖ ● -
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
నాగర్కర్నూల్ క్రైం: రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, ఇందులో భాగంగానే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో రూ.23.75 కోట్లు వెచ్చించి.. 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్కు పరుగులు తీయకుండా.. స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అలాగే వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీస్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. వసతుల కల్పనకు కృషి.. వైద్య విద్యార్థులు భవిష్యత్లో సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హాస్టల్, లైబ్రరీలు, ల్యాబొరేటరీలను అభివృద్ధి చేస్తున్నామని, ఆధునిక పరికరాలు, మెరుగైన బోధన విధానాలు, క్లినికల్ ట్రైనింగ్ వంటివి అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనరల్ ఆస్పత్రిలో అవసరమైన వసతుల కల్పనకు కలెక్టర్ ఆధ్వర్యంలో రూ.2.65 కోట్ల నిధులు అందుబాటులో ఉంచామని, వీటితో అవసరమైన వైద్య పరికరాలు నేరుగా కలెక్టర్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని, క్లినికల్ ట్రయల్స్ కోసం విద్యార్థులు మెడికల్ కళాశాల నుంచి జనరల్ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కోసం మరికొన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, కమిషనర్ సృజన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్యే రాజేష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, వైస్ చైర్మన్ రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, డీఎంహెచ్ఓ రవినాయక్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి పాల్గొన్నారు. -
అడుగంటిన జూరాల
ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 0.442 టీఎంసీలే.. ● కుడి, ఎడమ కాల్వల పరిధి 35 వేల ఎకరాల వరి సాగు ● ఈ నెల 15 వరకు నీటి సరఫరా ● వేసవిలో తాగునీటి అవసరాలకు అర టీఎంసీ అవసరం ● మరోసారి కర్ణాటకను ఆశ్రయించాల్సిన పరిస్థితి –8లో uఅమరచింత/గద్వాల: కృష్ణా బేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరులోని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందరి అవసరాలు తీర్చే పెద్దన్నే.. మరొకరి సాయం కోరే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 0.44 టీఎంసీలు, ఎంబీ, ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ పరిధిలో అధికారికంగా 25 వేల ఎకరాలు సాగు చేయగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం 35 వేల ఎకరాలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం కాగా ఇప్పటికే పంటలకు వారబంధీ విధానంలో.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవిలో తాగునీటి కోసం మూడునెలలపాటు అర టీఎంసీ అవసరం. ప్రస్తుతం జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలు తీర్చడం గగనమే. దీంతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరోసారి కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడ్సాలిన పరిస్థితి నెలకొంది. మార్చి చివరి నుంచే.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. వానాకాలంలో ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్, రామన్పాడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 7 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. అయితే ఈసారి వేసవి మొదలైన మార్చి చివరాఖరు నుంచే జలాశయంలో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎగువనున్న కర్ణాటక నుంచి జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడం, కుడి, ఎడమ కాల్వల పరిధిలోని సాగైన పంటలకు సాగునీటిని అందిస్తుండడం, లీకేజీలతో పాటు ఎండలకు ఆవిరి అవుతుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. 35 వేల ఎకరాలు సాగు.. జూరాల ప్రాజెక్టు పరిధిలో వానాకాలంలో 1.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుండగా.. రబీ సీజన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు పరిధిలోని సాగుచేసే సుమారు 50 వేల ఎకరాలకు ప్రభుత్వం క్రాప్హాలిడే ప్రకటించి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే వదులుతుంది. ఇక కుడి ప్రధాన కాల్వ పరిధిలో 37 వేల ఎకరాలు సాగైతే రబీలో మాత్రం కేవలం 15 వేల ఎకరాలకు కుదించారు. అయితే అధికారికంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే వారబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. కుడికాలువ పరిధిలో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ, సమాంతర కాల్వలకు మాత్రం నీటిని పూర్తిగా నిలిపివేశారు. కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంటలు సాగుచేసిన రైతులు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఈ నెల 20–25 తేదీల వరకై నా నీరు అందించాలని కోరుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఈ నెల 15 వరకే నీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తర్వాత మరో పదిరోజులపాటు పంటలకు నీటిని ఎలా అందించాలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.500 బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు మొత్తం వరిపంట సాగుచేశారు. తాగునీటికి ఎలా.. వేసవిలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు అర టీఎంసీ వరకు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. లైవ్లో 0.442 టీంఎసీలు మాత్రమే ఉంది. దీంతో సాగు, తాగునీటి లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఏమాత్రం సరిపోవు. దీంతో మరోసారి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తుంది. కర్ణాటక కనీసం 2 టీఎంసీలు విడుదల చేస్తే కానీ.. తాగునీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులకు మరో రెండు తడులు మాత్రమే నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆత్మకూర్ మండలంలోని చివరి ఆయకట్టు గ్రామాల రైతులు మాత్రం తమకు 5 తడులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. ప్రస్తుతం వారబంధి విధానంలో నాలుగు రోజులకుగాను కేవలం 3 రోజుల పాటు సాగునీటిని వదులుతున్నాం. – చెన్నకేశవరెడ్డి, డీఈ, నందిమళ్ల డివిజన్, జూరాల ప్రాజెక్లు సీఎం దృష్టికి తీసుకెళ్తా.. జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
వారబంది కుదింపు..
యాసంగిలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలోని 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారు. వారంలో 4 రోజుల పాటు పంట కాల్వలకు సాగునీటిని అందించి మిగిలిన 3 రోజులు నిలిపివేసేవారు. అయితే ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా తగ్గడంతో వారంలో కేవలం 3 రోజులు.. అది కూడా రోజుకు 650 క్యూసెక్కుల నీటిని కాల్వకు వదులుతుండటంతో ఆత్మకూర్ మండలంలోని చివరి ఆయకట్టు గ్రామాలైన రేచింతల, వీరరాఘవాపురం రైతులకు సాగునీరు అందడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా వారబంది విధానంలో కూడా కోత విధించి సాగునీటిని వదలడం ఏమిటని ఆయకట్టు రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. కాల్వ వెంట ఉన్న గ్రామాలకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో అమరచింత మండలంలోని ఎత్తిపోతల పథకాలు క్రాప్ హలీడేను ప్రకటించాయి. -
మెనూ విధిగా అమలుచేయాలి
వనపర్తి: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ కచ్చితంగా అమలు చేయడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల గదులు, వంటశాల (కిచెన్), స్టాక్రూమ్, హాస్టల్లోని వసతులను పరిశీలించారు. ఎల్పీజీ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విచారించి సమస్యలు ఉంటే వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలని, పరిష్కరిస్తారని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం సరఫరా అవుతున్నాయా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘డబుల్’ కాలనీలో వసతులు కల్పించాలి.. రాజపేట శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారికి అనుసంధానం, డ్రైనేజీ సమస్యలను స్థానికులు వివరించగా.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
బెదిరింపులకు భయపడేది లేదు
● కేంద్ర నిధులు వాడుకుంటూ విమర్శలా? ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అమరచింత: కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధితో పాటు చెరువుల సుందరీకరణకు నిధులు మంజూరు చేసిందని.. వాటిని వినియోగించుకుంటూ తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని మహబూబ్నగర్ ఎంపీ డీకె అరుణ అన్నారు. పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు మంజూరు చేసిందని.. పుర ఎన్నికల వేళ మంత్రి వాకిటి శ్రీహరి హడావుడిగా శంకుస్థాపన చేయడం తనను అవమానించడమేనని తెలిపారు. శుక్రవారం ఆమె పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమిపూజ చేసేందుకు రాగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు, మాటల యుద్ధం కొనసాగింది. వీటన్నింటిని లెక్క చేయకుండా ఎంపీ కాంగ్రెస్ నాయకులను తోసుకుంటూ చెరువుకట్టపైకి చేరుకొని అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎస్ఐ స్వాతి సిబ్బందితో కాంగ్రెస్ నాయకులను బయటకు పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి హూందాతనం మరిచి అహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంపీగా రాజకీయాల్లో ఉన్నానని.. బాధ్యతలు, గౌరవం, ప్రొటోకాల్ తనకు తెలుసన్నారు. ఎమ్మెల్యేలు కేంద్ర నిధుల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని.. నిజమైన పేదలకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేయడం దారుణమన్నారు. ప్రజల పన్నులతో చేసే ప్రతి అభివృద్ధి పనికి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించాలని సూచించారు. భూమిపూజ కోసం వస్తే కొందరు గుండాలకు మద్యం తాగించి అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు. పోలీసుల వైఫల్యమే.. ఇక్కడ జరిగిన ఘటనకు పోలీసులే నైతికంగా బాధ్యత వహించాలని, వారి అసమర్థతతోనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారని ఎంపీ ఆరోపించారు. ముందస్తు షెడ్యూల్ ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తనను అడ్డుకొనేందుకే పోలీసులు కాంగ్రెస్ వారికి సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దచెరువు కట్ట వద్ద కాంగ్రెస్ శ్రేణులను నిలువరిస్తున్న ఎస్ఐ స్వాతి, సిబ్బంది అమరచింత పెద్దచెరువు కట్టపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తోపులాడుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ తమ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండయ్య, బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, మహకాళి శ్రీనివాసులు, మేర్వ రాజు, మంగ లావణ్య. మల్లారెడ్డి, విష్ణు, ఊషన్న, క్యామ భాస్కర్, మరాఠి అశోక్, నరాల నారాయణ, దుబాయి వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్మీడియట్లో కొత్త కోర్సు
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ విద్యలో 2026–27 విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సు అందుబాటులోకి రానుందని డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూప్ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి అందుబాటులో తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏసీఈ గ్రూప్ను నిర్వహించాలనుకునే కళాశాలల యాజమాన్యాలు వెంటనే ఇంటర్బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కొత్త గ్రూప్ గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రవేశాల సమయంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఈ నెల 19న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రెండు సెషన్లలో కొనసాగుతుందని.. 6వ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికార వెబ్సైట్ www.tfmr. telangana.gov.in నుంచి తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రైతుల సహకారం అభినందనీయం కొత్తకోట రూరల్: మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పే బాధ్యత రైతులే స్వీకరించాలని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో ఉన్న ఓ మామిడి తోటలో మొదటి కాయ కోసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నాబార్డ్, రాంకీ ఫౌండేషన్ సహకారంతో మండలంలోని గిరిజన గ్రామాల్లో 450 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేయడం సంతోషకరమని రాంకీ ఫౌండేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సామాజిక బాధ్యతలో భాగంగా రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పొందేందుకు పేద మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయర్లు అందించారు. కార్యక్రమంలో నాబార్డ్ సిబ్బంది, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. సృజనాత్మకతతో ఆలోచించాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్మెంట్లలో చదివిన విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ రమేష్బాబులు, కృష్ణయ్య, అర్జున్కుమార్ పాల్గొన్నారు. -
హే..కృష్ణా.!
శ్రీశైలం డ్యాంలో శరవేగంగా తగ్గుతున్న నీటిమట్టం ● ప్రస్తుతం మిగిలింది 42 టీఎంసీలే ● మరో వారం, పది రోజుల్లో కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ● జూరాలలోనూ అడుగంటిన జలాలు ● వేసవిలో ఇబ్బందులు తప్పించేందుకు చర్యలు శూన్యం అడుగంటిన జూరాల.. ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.074 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.367 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. దీంతో తాగునీటి అవసరాలకు సైతం కటకట ఏర్పడనుంది. గతేడాది సైతం జూరాలలో నీటినిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకోగా.. ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని సరఫరా చేశారు. ఈ సారి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తేనే తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి.సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం వేగంగా అడుగంటుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పెరగడంతో, ఈ సారి వేసవి ప్రారంభంలోనే నీటినిల్వ అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది. శ్రీశైలం డ్యాం నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.408 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తితో పాటు సాగునీటి ప్రాజెక్ట్ల కోసం వినియోగిస్తుండటంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవి చివరి నాటికి తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. డెడ్ స్టోరేజీకి చేరువగా.. శ్రీశైలం డ్యాంలో 20 రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. రెండు, మూడు రోజులకు ఒక టీఎంసీ చొప్పున నీరు అడుగంటుతోంది. ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని కేఎల్ఐ ప్రాజెక్ట్కు నీటి విడుదల కొనసాగడం.. గత నెల 22 వరకు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో నీటిమట్టం వేగంగా తగ్గింది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరువగా ఉండటంతో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. గతనెల 15వ తేదీ వరకు 75 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. ప్రస్తుతం 42 టీఎంసీలకు పడిపోయింది. వేసవికాలం ముగిసేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉండటం.. జూలై వరకు శ్రీశైలం ప్రాజెక్టు వరద వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పోటాపోటీగా నీటి వినియోగంతో.. గత మార్చి ప్రారంభానికి ముందు శ్రీశైలం రిజర్వాయర్లో 92 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉండగా.. ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా నీటి తరలింపు చేపట్టారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి నెలలో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. ఏపీలోని విద్యుదుత్పత్తి కేంద్రానికి నిత్యం సగటున 10వేల క్యూసెక్కులతో పాటు హంద్రీనీవా సుజలాస్రవంతి, కేసీసీ, పీఆర్పీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేశారు. అలాగే తెలంగాణలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి సగటున 8 వేల క్యూసెక్కులతో పాటు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్ట్కు నీటి సరఫరా కొనసాగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీశైలం డ్యాంలో కనిష్ట నీటిమట్టానికి ముందే కేఎల్ఐ కింద రిజర్వాయర్లను నింపుతున్నాం. అవసరం మేరకు నీటినిల్వ చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, ఇరిగేషన్శాఖ ఈఈ, నాగర్కర్నూల్ -
మొక్కల పెంపకంపై దృష్టి సారించాలి
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఖిల్లాఘనపురం: గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్రెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని మల్క్మియాన్పల్లిలో వైకుంఠధామం, నర్సరీ, ఉపాధి పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో మొక్కలు ఎండిపోవడానికి అవకాశం ఉందని, నిత్యం నీరు అందించడంతో పాటు వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. బెడ్ల నడుమ కలుపు తొలగించాలని, మొక్కలు పెరిగేందుకు అవసరమైన ఎరువులు అందించాలని సూచించారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కూలీలకు సకాలంలో కూలి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట సర్పంచ్ రామకృష్ణ, ఉప సర్పంచ్ చెన్నయ్య, ఇన్చార్జ్ ఎంపీడీఓ సునీత, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ వేడుకలు వనపర్తిటౌన్: పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార పోరాటంలో సంఘం ఎన్నడూ వెనకడుగు వేయలేదని, నిజాయితీగా పని చేస్తోందన్నారు. మలిదశ తెలంగాణా ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాటి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొనకుండా అడ్డుకొని చీలిక తేవడంతో 2011, ఏప్రిల్ 9న పీఆర్టీయూ టీఎస్ అనే ఉపాధ్యాయ సంఘాన్ని గాల్రెడ్డి హర్షవర్షన్రెడ్డి స్థాపించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాయినిపల్లి శ్రీనివాసులు, ప్రతినిధులు, ఉపాధ్యాయులు కరుణాకర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నారాయణరావు, రామచంద్రయ్య, నర్సింహ, జైపాల్రెడ్డి, ఆంజనేయులు, విజయ్కుమార్, శ్రీధర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకటేష్, బాలస్వామి, విష్ణువర్ధన్, రమేష్, స్వామి పాల్గొన్నారు.


