breaking news
Wanaparthy District Latest News
-
జోగుళాంబ జోన్ ప్రతిష్ట నిలబెట్టాలి
● స్పోర్ట్స్ నోడల్ అధికారి, జిల్లా ఎస్పీ సునీతరెడ్డి వనపర్తి: రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్లో జోగుళాంబ జోన్–7 క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని జోనల్ నోడల్ అధికారి, ఎస్పీ సునీతరెడ్డి కోరారు. డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు జనవరిలో జోన్–7లోని పోలీసులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఫిబ్రవరి 17 నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ఎంపికై న ఐదుగురికి శనివారం ఎస్పీ స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్, బూట్లు అందజేసి మాట్లాడారు. క్రీడాపోటీలు పోలీస్ వ్యవస్థలోని క్రమశిక్షణ, సహనశక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వ్యక్తిగత విజయానికే కాకుండా జోన్ గౌరవానికి కృషి చేయాలని, గెలుపు లక్ష్యం కావాలని కోరారు. నిరంతర సాధన, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం విజయానికి మూల స్తంభాలని.. క్రీడా స్ఫూర్తి, పూర్తి నిబద్ధతతో పోటీల్లో పాల్గొనాలన్నారు. రాష్ట్రస్థాయి వేదికపై మెరుగైన ఫలితాలు సాధించి జోన్కు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, మొగ్దుంబారీ, పోలీస్ క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పుర పీఠానికి పట్టు.. !
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు ఆఽధిక్యం ● హంగ్తో ఉత్కంఠ రేపుతున్న అమరచింత స్థానం ● ఇన్చార్జి మంత్రి వాకిటితో మంతనాలు ● అధిష్టాన నిర్ణయమే అంటున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేజిక్కించుకునేందుకు ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు వనపర్తి పుర పీఠం దక్కించుకునేందుకు ఎన్ఎల్ఎన్ మాధవి రమేష్తో పాటు తమ సతీమణుల కోసం పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, బి.కృష్ణ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలతో వారికున్న సంబంధాలను ఉపయోగించుకొని చర్చలు జరుపుతున్నట్లు స్థానికంగా కాంగ్రెస్ నేతల్లో చర్చ వినిపిస్తోంది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మద్దతు ఎన్ఎల్ఎన్ రమేష్కు ఉన్నట్లు సమాచారం. వనపర్తి: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగడంతో జిల్లాలోని ఐదు పురపాలికల్లో నాలుగింట స్పష్టమైన మెజార్టీ దక్కిన విషయం పాఠకులకు విధితమే. సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అఽధికార పార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించగా.. పుర పీఠం దక్కించుకునేందుకు సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్నికల ఇన్చార్జి, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, జీఎంఆర్, డీసీసీ చీఫ్ శివసేనారెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. కాగా.. హంగ్ ఏర్పడిన అమరచింత మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. పెబ్బేరులో బీసీ, ఓసీ.. పెబ్బేరు పుర పీఠం జనరల్కు కేటాయించడం.. కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్గౌడ్, తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఎల్లారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురిని ఎమ్మెల్యే బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఐదు వార్డులను దక్కించుకున్నందున ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఆలోచనలో ఎమ్మెల్యే తన ఎక్స్ అఫీషియో ఓటును అక్కడే వినియోగించుకునేందుకు దర ఖాస్తు చేసుకోవడం గమనార్హం. శ్రీనివాస్గౌడ్కు ఎమ్మెల్యే సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. మంత్రి ఇలాకాలో.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకా అయిన ఆత్మకూరు మున్సిపల్ పీఠాన్ని అందరి ఏకాభిప్రాయంతో జుబేదాబేగంకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమెను చైర్పర్సన్గా ఎంపిక చేస్తే మిగతా వారంతా సానుకూలంగా స్పందిచడం గమనార్హం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా చైర్పర్సన్ ఎంపిక జరిగే అవకాశం ఉంది. సీల్డ్ కవర్లో పేర్లు.. స్థానికంగా ఎన్ని పైరవీలు చేసినా ప్రయోజనం లేదని.. పుర చైర్మన్లు ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునే విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. అక్కడి నుంచే సీల్డ్ కవర్లో పేర్లు వస్తాయని వివరించారు. అమరచింత మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎంపీ డీకే అరుణ ముందస్తుగా వారిని క్యాంపునకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్ఎస్ ఏకమైతే పూర్తి మెజార్టీ వచ్చి చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. బీసీ మహిళకు రిజర్వ్ చేసిన కొత్తకోట మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అరుణ శ్రీనివాసులు, కృష్ణారెడ్డి భార్య పల్లవి ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో బీసీ కమ్యూనిటీగా ఉన్న తన భార్యకు అవకాశం ఇవ్వాలని కృష్ణారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో ఎవరికి వారు పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్, చైర్పర్సన్ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆశావహుల పైరవీలు ఏ మేరకు ఫలిస్తాయో.. అదృష్టం ఎవరిని వరిస్తుందనే విషయం తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే. -
సత్తాచాటిన ‘ఖిల్లా’ విద్యార్థులు
ఖిల్లాఘనపురం: సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో మండలానికి చెందిన యువకులు బంగారు పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో పర్వతాపురం గ్రామానికి చెందిన కె.ఉదయ్కిరణ్ లాంగ్జంప్లో, అప్పారెడ్డిపల్లికి చెందిన సాయి సాత్విక్ 600 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించినట్లు డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించడంతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాక్షిక శనిత్రయోదశి పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి శనివారం పాక్షిక శనిత్రయోదశిని పురస్కరించుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనిగ్రహ దోష నివారణకు భక్తుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచు సుగుణమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 18న పీయూలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ మహబూబ్నగర్ న్యూటౌన్: అమ్నీల్ ఫార్మా జడ్చర్ల, ఆర్–టెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 18న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్లు పీయూ ప్లేస్మెంట్ అధికారి ఎస్ఎన్ అర్జు న్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఫార్మ సీ, ఎంకామ్, ఎంబీఏ విద్యార్థుల కోసం ఫా ర్మసీ కళాశాల ఆడియోరియంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్మాలో క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ విభాగాల్లో, ఆర్–టెక్ సొల్యూషన్స్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తగ్గిన వేరుశనగ ధరలు జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో వేరుశనగ ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే క్వింటాకు గరిష్ట ధర వద్ద రూ.167, కనిష్ట ధర వద్ద రూ.1,186 తగ్గింది. శనివారం వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.9,399, కనిష్టంగా రూ.3,029 ధరలు లభిచాయి. కందులకు గరిష్టంగా రూ.7,812, కనిష్టంగా రూ. 5,555, మినుములు గరిష్టంగా రూ.8,349, కనిష్టంగా రూ.8,339, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,693, కనిష్టంగా రూ.6,689, మొక్కజొ న్న గరిష్టంగా రూ.1,876, కనిష్టంగా రూ. 1,848, ధాన్యం ఆర్ఎన్ఆర్ రూ.2,409, పత్తి గరిష్టంగా రూ.6,869, కనిష్టంగా రూ.3,050 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు క్వింటా గరిష్టంగా రూ.7,579, కనిష్టంగా రూ.7,219గా ధరలు పలికాయి. -
ట్విస్ట్లపై ట్విస్ట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులో హంగ్ ఏర్పడిన పురపాలికల్లో క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా.. మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్న రెండింటిలో పాగా వేసేదెవరనే దానిపై స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి చేయి అందుకోవడంతో దేవరకద్రలో కాంగ్రెస్, ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే విజయుడు ఓటు వేయనుండడంతో అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనుంది. మిగిలిన నారాయణపేట, గద్వాల, అమరచింతలో విభిన్న పరిస్థితులు నెలకొనగా.. అటు, ఇటు జంపింగ్లు, క్యాంప్లు, గడియగడియకూ మారుతున్న రాజకీయ పరిణామాలు, ట్విస్ట్లపై ట్విస్ట్లు హీటెక్కిస్తున్నాయి. నారాయణపేటలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలవకుండా చేస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయం. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తే పీఠం అధిరోహించడం నల్లేరు మీద నడకనే. అదేవిధంగా గద్వాలలో కాంగ్రెస్కు పీఠం దక్కకుండా, ఎమ్మెల్యే చేతికి చిక్కకుండా ఉండాలంటే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గద్వాలలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే నారాయణపేటలో తమకు మద్దతు ఇవ్వాలనే షరతుతో బీజేపీ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో అటు గద్వాల, ఇటు నారాయణపేటలో పుర పీఠాలు కాంగ్రెస్కు దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హంగ్.. ‘జంగ్’ ! నారాయణపేట, గద్వాలలో హైడ్రామా ఒకరికొకరు చేదోడువాదోడుగా బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రాయబారాలు -
ఎక్స్ అఫీషియో.. ప్రభావమెంత?
గద్వాల: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్స్ అఫీషియో ఓట్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఒకసారి ఇటువైపు చూడండి. ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నారాయణపేట, అమరచింత, అలంపూర్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. సంపూర్ణ మెజారీటి లేకపోతే.. మున్సిపాలిటీలో ప్రజల ఓట్లతో గెలుపొందిన కౌన్సిలర్లు తమ వర్గానికి చెందిన ఒకరిని చైర్మన్ లేదా చైర్పర్సన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే సంపూర్ణ మెజార్టీ లేనప్పుడు ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, రాజ్యాంగబద్ధ కమిటీకి చైర్మన్ ఇలా ఎవరైనా సరే వారి మున్సిపాలిటీ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునే వీలుంటుంది. దీనినే ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణిస్తారు. గద్వాల, పేట, అమరచింత, పెబ్బేరు, అలంపూర్లో కీలకం ఎన్నికల సంఘం నూతన నిబంధనలతో తప్పని ఇబ్బందులు దీని ఆధారంగానే సుప్రీంను ఆశ్రయించనున్న బీఆర్ఎస్? -
చెల్లని ఓట్లతో చిక్కులు..
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఓట్ల తిరస్కరణ సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల పెద్దసంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అతి తక్కువ మెజార్టీతో పరాభావం పొందిన అభ్యర్థులు తమ ఓటమిలో చెల్లని ఓట్లు కూడా కారణంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. అలాగే చాలాచోట్ల అభ్యర్థుల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవికంగానే అభ్యర్థులు ఎవరూ నచ్చక నోటాకు ఓటేశారా, లేక గుర్తులపై అయోమయంతో నోటాపై ఓటు ముద్ర వేశారా? అన్న దానిపై అభ్యర్థులు చర్చించుకున్నారు. గుర్తులు తెలియక తికమక.. ఈవీఎం ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. ఈవీఎం బ్యాలెట్పై నోటాకు మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. బ్యాలెట్పై సరైన గుర్తును ఎంచుకుని అదే గుర్తుపై ఓటు వేయడంలో చాలామంది ఓటర్లు పొరపాట్లు చేశారు. అయోమయంలో రెండు గుర్తులపై ముద్ర వేయడం, గుర్తులపై బొటనవేలితో ముద్ర వేయడం, బ్యాలెట్ పేపర్పై ఓటు వేయకుండా ఖాళీగా బాక్స్లో వేయడం కనిపించింది. అలాగే బ్యాలెట్ పేపర్లో ఒక గుర్తుపై వేసిన ఇంక్ ముద్ర మరో గుర్తుపై పడకుండా ఉండేందుకు పేపర్ను నిలువుగా మడత పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు నిలువుగా కాక అడ్డంగా మడిచి బ్యాలెట్ వేయడంతో ఇంకు ముద్ర మరో గుర్తుపై కూడా పడి చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. తక్కువ మెజార్టీతో పోటాపోటీగా ఉన్న వార్డుల్లో చెల్లని ఓట్ల ప్రభావంతో అభ్యర్థులు ఆవేదనకు లోనయ్యారు. పోలైనవి...1012, చెల్లనివి 216 మహబూబ్నగర్ కార్పొరేషన్కు మొదటిసారిగా జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలువనున్నాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 59 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1012 ఓట్లు పోలవ్వగా.. అందులో 216 ఓట్లు చెల్లనివి నమోదు కావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యధికంగా 10, 25వ డివిజన్లలో 16 చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. పైగా వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. అలాంటి పోలింగ్ సిబ్బంది ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలలో చెల్లని ఓట్లతో పాటు నోటాకు అధికంగా ఓట్లు వీటి ప్రభావంతో అభ్యర్థుల భవితవ్యం తలకిందులు అయినట్టుగా అంచనాలు పొరపాట్లు, తప్పిదాలతోనే అధికంగా చెల్లని ఓట్లు మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్లోనూ చెల్లని ఓట్లు -
‘సింహ’గర్జన..!
● నాడు కొల్లాపూర్, అయిజలో.. నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీలో.. గత పుర పాలక ఎన్నికల్లో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్కు చెందిన మంత్రి జూపల్లి అప్పుడు బీఆర్ఎస్లో ఉండగా అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో పొసగని పరిస్థితి ఉండేది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులు ఉండగా.. తన వర్గానికి చెందిన వారిని ఏఐఎఫ్బీ నుంచి బరిలో నిలిపారు.. 11 స్థానాల్లో వారే గెలుపొందారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తిరుమల్రెడ్డి తన వర్గాన్ని ఏఐఎఫ్బీ నుంచి బరిలో దించారు. 20 వార్డులు ఉండగా.. 10 స్థానాల్లో వారే విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్బీ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించింది. మొత్తం పది వార్డులు ఉండగా.. ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు. -
విజేత.. ఆశా కార్యకర్త
కొత్తకోట పురపాలికలో 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశా కార్యకర్త ముంత మంజుల విజయం సాధించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరులో 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడం.. భర్త బీఆర్ఎస్ కార్యకర్త కావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. – కొత్తకోట రూరల్ -
నాడు కానిస్టేబుల్.. నేడు కార్పొరేటర్
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ పాతపాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి టి.రమేష్బాబు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూడగా.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో తనను ఓడించిన అభ్యర్థిపైనే 417 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. దీంతో పాతపాలమూరులో రమేష్బాబు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. – మహబూబ్నగర్ రూరల్ -
‘హంగు’..ఆర్భాటాలు!
ఉమ్మడి పాలమూరులో పుర ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా హంగ్ ఏర్పడిన ఆరు పురపాలికల్లో గంటగంటకూ సమీకరణలు మారుతున్నాయి. గద్వాల, నారాయణపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్ రెండు, ఎంఐఎం రెండు, ఏఐఎఫ్బీ ఒకటి, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. ఏఐఎఫ్బీ అభ్యర్ధి కాంగ్రెస్ రెబల్, స్వతంత్ర బీజేపీ రెబల్ కాగా.. వారు ఆయా పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విధంగా జరిగిన పక్షంలో బీజేపీకి 12, కాంగ్రెస్ ఫిగర్ ఎనిమిదికి చేరనుంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ● గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉండగా.. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కు 11, బీజేపీకి ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకున్నట్లు తెలిసింది. ఈ లెక్కన వారి బలం 19 కాగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. తమ అభ్యర్థులను ఎవరికి వారు క్యాంప్లకు తరలించిన ముఖ్యులు చెరో రెండున్నరేళ్లు మున్సిపల్ పీఠాన్ని పంచుకునేలా పావులు కదుపుతున్నారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ విప్ జారీ చేసే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లతో దేవరకద్రలో కాంగ్రెస్, అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనున్నాయి. ● అమరచింతలో 10 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు చొప్పున, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఫలితాలకు ముందే బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు క్యాంప్నకు వెళ్లగా.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన వాహనంలో క్యాంప్కు తరలించారు. ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. చెరి రెండున్నరేళ్లు చైర్మన్ గిరిని పంచుకునేలా ఒక అవగాహనకు రానున్నట్లు చర్చ జరుగుతోంది. దాదాపుగా అంతటా క్యాంప్ రాజ‘కీ’యాలు గద్వాలలో హైడ్రామా.. బేరసారాలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం -
జీఎమ్మార్.. స్టార్ ‘లీడర్’
● దేవరకద్రలోని 3 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలుపు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి (జీఎమ్మార్) స్టార్ లీడర్గా పేరు సాధించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగగా.. అన్ని పీఠాలను కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకుని ఈ మున్సిపాల్టీలను హస్తానికి చేజిక్కకుండా రాజకీయాలు నడిపాయి. ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు కలిసి ప్రచారం చేపట్టాయి. అయినా భూత్పూర్, కొత్తకోటలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్నా.. ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ పార్టీకే పీఠం దక్కనుండడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్శ్రేణులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు సంబరాల్లో మునిగారు. ● 16 స్థానాల్లోనూ హస్తం అభ్యర్థుల గెలుపు ● సీఎం ఇలాకా కావడంతో హాట్టాపిక్ ● గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు దక్కిన పీఠం ● ప్రతీకారం తీర్చుకున్నారంటున్న రేవంత్ అభిమానులు -
చేతిపురం..!
11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ కార్పొరేషన్తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్) హంగ్ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్ఎస్కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ.. ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఐదింటిలో హంగ్ బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ తారుమారైన బీజేపీ అంచనాలు ‘పేట’లో ఆధిక్యత.. అయినా ఊగిసలాట దేవరకద్రలో రెబల్ చేరికతో హస్తానికి లైన్క్లియర్ అలంపూర్లో బీఆర్ఎస్కు అవకాశం గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోబూచులాట -
23 ఏళ్లకే కౌన్సిల్లోకి...
వరుసగా ఐదోసారి నెగ్గి.. స్థానిక పురపాలికలోని ఆరో వార్డు నుంచి 23 ఏళ్ల పుట్టా రేణుక కాంగ్రెస్పార్టీ నుంచి పోటీచేసి గెలుపొంది కౌన్సిల్లో అడుగు పెడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం, అనుకూలమైన రిజర్వేషన్ రావటంతో ఎన్నికల బరిలో నిలిచానని.. వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. – కల్వకుర్తి టౌన్ -
రాష్ట్ర హౌసింగ్ విజిలెన్స్ అధికారి తనిఖీ
ఖిల్లాఘనపురం: మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో బిల్లులు అందని ఇందిరమ్మ ఇళ్లను గురువారం రాష్ట్ర హౌసింగ్ విజిలెన్స్ అధికారి బలరాం, డీఈ విఠోభా పరిశీలించారు. మండలంలోని మానాజీపేటలో 2, మల్కాపూర్లో 3, దొంతికుంటతండాలో 1, ఖిల్లాఘనపురం గ్రామంలో 4 ఇళ్లు మొత్తం 10 ఇందిరమ్మ ఇళ్లకు వివిధ కారణాలతో ఇప్పటి వరకు బిల్లులు అందలేదన్నారు. ఆయా ఇళ్లన్నింటిని పరిశీలించడంతో పాటు లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ప్రొసీడింగ్లు ఇచ్చినప్పటికీ అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ సందీప్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు ఉన్నారు. -
పురం.. ఫలితం
ఓట్ల లెక్కింపునకు మున్సిపాలిటీల వారీగా ప్రతి మూడు వార్డులకు ఒక ఆర్ఓ, ప్రతి వార్డుకు ముగ్గురు చొప్పున ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేటాయించారు. రెండు విడతల్లో జిల్లాలోని 80 వార్డుల లెక్కింపు పూర్తవుతుంది. 123 మంది ఓట్ల లెక్కింపు చేపట్టగా.. రిజర్వ్లో మరో 17 మంది ఉంటారు. వనపర్తి: పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని ఐదు పుర కేంద్రాల్లో పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్లను అక్కడే కేటాయించిన స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చగా..ఓట్ల లెక్కింపు కూడా అక్కడే చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు కొనసాగనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. మధ్యాహ్నంలోగా ఫలితాలు వెల్లడించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 50 శాతం వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టి వాటి ఫలితాల వెల్లడి పూర్తయ్యాక మిగతా వార్డుల ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి వార్డుకు రెండు నుంచి మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆయా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను బయటకు తీసి గుర్తుల వారీగా 25 చొప్పున కట్టలు చేసి ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. నేడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జిల్లాలోని పురపాలికల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 850 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. క్యూఆర్టీ, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం పర్యవేక్షించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి వార్డుకు ముగ్గురు చొప్పున 150 మంది లెక్కింపు సిబ్బంది 850 మందితో పోలీసు బందోబస్తు ప్రతి మూడు వార్డులకు ఒక ఆర్ఓ మొదటి రౌండ్లో 50 శాతం వార్డులు.. మిగతావి రెండోరౌండ్లో... -
‘కార్మికులకు న్యాయం చేయండి’
పాన్గల్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చడం కాదు.. కార్మికులకు న్యాయం చేసే చర్యలు చేపట్టాలని ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జబ్బార్ అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీనర్ రాము అధ్యక్షతన నిర్వహించిన సమ్మెకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తూ కార్మికులు, రైతులపై భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు, విత్తన చట్టం 2025 ముసాయిదా, విద్యుత్ సవరణ బిల్లు, వీబీజీ రాంజీ చట్టం తీసుకొచ్చిందని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్, సీఐటీయూ సీనియర్ నాయకుడు వెంకటయ్య విమర్శించారు. రైతులు, ఉపాధి కూలీలు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రేమద్దుల సర్పంచ్ నిరంజన్, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, నాయకులు భీమయ్య, కిల్లె వెంకటయ్య, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, జీపీ కార్మికులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
● ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ● సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలు ప్రారంభం గోపాల్పేట: క్రీడాకారులు ఉన్నత లక్ష్యం నిర్ధేశించుకొని చిన్నప్పటి నుంచే కష్టపడితే సులభంగా చేరుకోవచ్చని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్, కబడ్డీ, ఖో–ఖో పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించడంతో పాటు క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఎంతో కష్టపడుతోందని.. గ్రామీణస్థాయి విద్యార్థులు వినియోగించుకుంటే భవిష్యత్లో జాతీయస్థాయిలో ఆడేందుకు సీఎం కప్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చేలా ఆడాలని కోరారు. సాయంత్రం విజేత జట్లకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహుమతులు అందజేశారు. ఉన్నత పాఠశాల తనిఖీ.. క్రీడాపోటీలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటిస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వంటగది, వంటలు, అన్నం కలిపి పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం నాణ్యతగా అందించాలని సూచించారు. ఆయన వెంట స్థానిక నాయకులు శివన్న, కొంకి వెంకటేష్, శేఖర్, కోదండం, కొంకి రమేష్, బంగారయ్య, యాదగిరి, మల్లేష్, అధికారులు ఉన్నారు. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
● కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి సురభి వనపర్తిటౌన్/వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్/ఆత్మకూర్/అమరచింత: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. జిల్లాకేంద్రంలో నర్సింగాయపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెబ్బేరులో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, కొత్తకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అమరచింతలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన మూడంచెల పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని.. మధ్యాహ్నం వరకు అన్ని ఫలితాలు వెలువడేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించని, కచ్చితంగా ఏదైన ఒక గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించారు. అభ్యర్థితో పాటు ఒక్కరికి మాత్రమే కేంద్రంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది అందరూ సహకరించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట రెవెన్యూ అదదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, అడిషనల్ జెడ్పీ సీఈఓ రామమహేశ్వర్రెడ్డి, పెబ్బేరు పుర కమిషనర్ ఖాజ ఆరీఫుద్దీన్, తహసీల్దార్ మురళిగౌడ్, ఎంపీడీఓ వెంకటేష్, సీఐ శివకుమార్, అమరచింత పుర కమిషనర్ నూరుల్ నదీం, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేశ్రెడ్డి, ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఎవరి ధీమా వారిదే..!
వనపర్తి: పుర ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆయా పుర కేంద్రాల్లోని స్ట్రాంగ్రూంల వద్దనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఫలితాలు అధికారికంగా వెల్లడిస్తేనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అధికార కాంగ్రెస్పార్టీ జిల్లాలోని ఐదు పురపాలికలను చేజిక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొత్తకోట తమదేనంటూ బీఆర్ఎస్, ఆత్మకూర్లో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. పుర ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షపార్టీ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లగా.. చైర్మన్ పీఠం కోసం బీజేపీతో సయోధ్య కుదుర్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అఽధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఇద్దరు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు జిల్లాలోని ఐదు పురపాలికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను ఎలాగైనా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికలు మునుపెన్నడూ చూడని విధంగా డబ్బు, మద్యంతో పాటు అఽధికార బలాన్ని ఉపయోగించినట్లు ప్రచారం సాగుతోంది. దీనికితోడు.. గ్రామీణప్రాంత నాయకులకు పుర వార్డుల ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయా వార్డుల్లో మఖాం వేయించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గతంలో ఎన్నడూ ఇవ్వనంత పార్టీ ఫండ్, మద్యం సరఫరా చేసినట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్స్–అఫీషియో ఓట్లకు ప్రణాళికలు.. పుర చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, బీజేపీ ఎంపీ అవకాశం ఉన్నచోట తమ ఎక్స్ అఫీషియో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆత్మకూర్ పురపాలిక బీజేపీ ఖాతాలో వేసుకునేందుకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తను ఓటు వేసేందుకు ఇక్కడికే వస్తానని బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఇదే తరహాలో ఆయా మున్సిపాలిటీల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. జిల్లాకేంద్రంలో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ సాధిస్తుందని, పెబ్బేరు మున్సిపాలిటీ ప్రతిపక్షాలకు దక్కకుండా తమ ఖాతాలో వేసుకునేందుకు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత, ప్రస్తుత పుర ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. గతంలో సర్వేలు, ఎగ్జిట్పోల్కు అటు ఇటుగా ఫలితాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఇంటలిజెన్స్ సైతం కచ్చితమైన అంచనాలు ఇవ్వలేని స్థితిలో ఓటరు నాడి ఉంది. పార్టీల అభ్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీ ఎత్తున ఖర్చు చేయడం, ఓటర్లకు తాయిలాలు అందించారు. దీంతో ఓటింగ్ ఎటువైపు మళ్లిందనే విషయాన్ని సీనియర్ నాయకులు సైతం అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధిక స్థానాలు తమవేనంటున్న కాంగ్రెస్ ఖాతానైనా తెరుస్తామంటున్న ప్రతిపక్షాలు నేడు తేలనున్న భవితవ్యం సర్వేలపై భిన్నాభిప్రాయాలు -
గీత కార్మికుల హక్కులు పరిరక్షించాలి
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల హక్కులు పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర గౌడ సంఘం నాయకుడు రామచంద్రయ్యగౌడ్ అన్నారు. హక్కుల పరిరక్షణకు ఈ నెల 17న హైదరాబాద్లో చేపట్టే నిరహార దీక్షకు వేలాదిమంది గీత కార్మికులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దీక్షకు సంబంధించిన కరపత్రాలను స్థానిక సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు బస్వరాజుగౌడ్, మోహన్గౌడ్, వెంకన్నగౌడ్, బాలగౌడ్, రామన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నల్లమలలో ఆక్వా కల్చర్ సెంటర్ అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్లతో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అచ్చంపేట ముదిరాజ్ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. -
75.56 శాతం పోలింగ్
● జిల్లాకేంద్రంలో ప్రధాన పార్టీల నేతల మధ్య వాగ్వాదం ● 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు డబ్బులు పంచుతున్నారని వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు ● పెబ్బేరు 2వ వార్డులోతన ఓటు ఇతరులువేశారని ఓ ఓటరు ఆవేదన ● బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా.. మిగతా అంతా ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని 11వ వార్డు కాంగ్రెస్పార్టీ అభ్యర్థి అనుచరుడు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలాగే 18వ వార్డు నందిమళ్లగడ్డలోనూ.. ఇదే తరహాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 33వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చిన్నపాటి ఘర్షణ నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పక్షాలను శాంతింపజేశారు. ● పెబ్బేరులోని 2వ వార్డులో హెచ్.చంద్రాయుడు అనే వ్యక్తి ఓటు వేసేందుకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాగా అప్పటికే ఆ ఓటు పోలయింది. తన ఓటు వేరొకరు ఎలా వేశారంటూ అధికారులను నిలదీయడంతో పాటు మీడియా ముందుకొచ్చి ఏజెంట్లు, అధికారులు గుర్తింపు కార్డు లేకుండా ఎలా అనుమతించారని ఆవేదన వ్యక్తం చేశారు. ● కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత పురపాలికల్లో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ప్రశాంతంగా కొనసాగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఆయా పుర కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలకు తరలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కల్పించారు. ఓటేసిన 88,738 మంది ఓటర్లు.. జిల్లాలోని ఐదు పురపాలికల్లో 1,17, 441 మంది ఓటర్లు ఉండగా.. 88,738 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75.56 శాతం ఓటర్లు ఓటేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధింగా అమరచింత పురపాలికలో అత్యధికంగా 83.58 శాతం.. అత్యల్పంగా వనపర్తిలో 71.51 పోలింగ్ అయినట్లు తెలిపారు. ఓటుహక్కు వినియోగించుకున్న కలెక్టర్.. జిల్లాకేంద్రంలోని 9వ వార్డు మర్రికుంటలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అందరితో పాటు క్యూలైన్లో నిలబడి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 15, 23వ వార్డు, హరిజనవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 19, 21వ వార్డు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ సరళిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వెబ్కాస్టింగ్తో పరిశీలన.. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీబాయి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తదితరులు పరిశీలించారు. రేపు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం.. మున్సిపల్ ఎన్నికల హడావుడి బుధవారం పోలింగ్తో ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో ఓటు రూపంలో వేసి నిక్షిప్తం చేశారు. శుక్రవారం ఎవరి భవిష్యత్ ఏమిటనేది తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఆయా పుర కేంద్రాల్లోనే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
స్ట్రాంగ్రూం వద్ద పటిష్ట భద్రత
● ఏ చిన్న లోపానికి అవకాశం లేదు ● ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సునీతరెడ్డి వనపర్తి/కొత్తకోట రూరల్/అమరచింత/వనపర్తి రూరల్: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రం, అమరచింతలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎస్సీకాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రం, పెబ్బేరులోని 1, 10 వార్డులో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు, ప్రవేశ నియంత్రణ చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమని, భద్రతలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు, చట్టవిరుద్ధ ప్రయత్నాలు, గందరగోళానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అధికారి, సిబ్బంది తమ విధులను అప్రమత్తంగా నిర్వర్తించాలని, చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడటం పోలీసుశాఖ కర్తవ్యమని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట కొత్తకోట సీఐ రాంబాబు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పుర కమిషనర్ సైదయ్య, ఎంపీడీఓ వినీత్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, కొత్తకోట ఎస్ఐ ఆనంద్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్.. ఆత్మకూర్: పుర ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయని, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్రూంను పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని.. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణ, సిబ్బంది విధులపై మార్గదర్శకాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, పుర కమిషనర్ చికినె శశిధర్, సీఐ శివకుమార్, ఎస్ఐ జయన్న, తహసీల్దార్ చాంద్పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, ఎంఈఓ బాలరాజు, ఎంపీఓ శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తీర్పు రిజర్వ్..
● 19 పురపాలికల్లో మొత్తంగా 75 శాతం పోలింగ్ ● గద్వాల జిల్లాలో అత్యధికం.. మహబూబ్నగర్లో అత్యల్పం ● అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు ● రేపు ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి ప్రశాంతంగా ముగిసిన మున్సి‘పోల్స్’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరులో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఐదు జిల్లాల పరిధిలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో మొత్తం 373 డివిజన్లు/వార్డు స్థానాలకు బుధవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. 11 గంటల తర్వాతే ఓటర్ల రాక ఊపందుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తంగా 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో రిజర్వ్ కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 14న మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, వైస్ చైర్లన్లు.. కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకో న్నారు. ఆ తర్వాత 16న పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. బద్ధకించిన కార్పొరేషన్ ఓటర్లు.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా 78.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 67.73 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో నగర ఓటర్లు ఓటెత్తుతారని అందరూ భావించారు. ఇందుకు విరుద్ధంగా అత్యల్పంగా పోలింగ్ నమోదు కావడంతో ఈ ప్రభావం ఎవరిపై పడుతోందని రాజకీయ పార్టీల నేతలు డివిజన్ల వారీగా లెక్కల్లో మునిగారు. నాగర్కర్నూల్ 77.64 శాతంతో రెండు, వనపర్తి 75.56 శాతంతో మూడు, నారాయణపేట 74.04 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి. పట్టణ మహిళల వెనుకంజ.. ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ జరిగిన పురపాలికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో వారే వెనుకబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తగా.. పుర పోరుకు వచ్చేసరికి అతివలు ఓటుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్గనర్, నాగర్కర్నూల్ జిల్లాలో సరాసరిగా పురుషులు, మహిళల ఓటింగ్ శాతం సమానంగా ఉండగా.. మిగతా జిల్లాల్లో ఒక్క శాతానికి పైగానే తేడా ఉంది.మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే మహబూబ్నగర్, దేవరకద్ర, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు, గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, నారాయణపేట, మక్తల్, మద్దూర్, కొల్లాపూర్లో మహళలు ఓటుకు దూరంగా ఉన్నారు. భూత్పూర్, కోస్గి, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో మాత్రమే అతివల ఓటింగ్ శాతం పురుషుల కంటే కొంత మేర మెరుగ్గా ఉంది. 35 మందిలో 16 మంది.. ఉమ్మడి జిల్లాలోని ఎన్నికలు జరిగిన పుర పాలికల్లో ఇతరులు ఓట్లరు 35 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అర్ధరాత్రి మారిన పరిణామాలతో.. ఉమ్మడి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారినట్లు తెలుస్తోంది. పురపాలికల్లో డివిజన్లు/వార్డుల వారీగా పలువురు అభ్యర్థులు ఓటుకొక రేటు చొప్పున వెదజల్లినట్లు సమాచారం. పార్టీల వారీగా ఫండ్ రాగా.. ఒక్కో వార్డులో ఆయా అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పటివరకు గెలుపు అంచనాల్లో మునిగిన అభ్యర్థులు తెల్లారేసరికి పరిస్థితులు మారడంతో నోరెళ్లబెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానం మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్, మక్తల్, వనపర్తి తదితర మున్సిపాలిటీల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు రాత్రికిరాత్రే చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతుండగా.. పలువురు అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. మొత్తం ఓట్లు 6,12,827.. పోలైంది 4,53,090 మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మిగిలిన పురపాలికలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్, అలంపూర్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. మక్తల్ ఆరోవార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. మొత్తంగా 59 డివిజన్లు, 314 వార్డుల్లో జరిగిన పోలింగ్లో 6,12,827 మంది ఓటర్లకు గాను 4,53,090 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
మహదేవప్పకుటుంబానికి పరామర్శ
రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డిమక్తల్/మాగనూర్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్ నుంచి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, నాయకులు నాగురావు నామోజీ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
పురపోరుకు సర్వం సిద్ధం
నేడు పోలింగ్.. ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు 80 వార్డులు.. 1,17,441 మంది ఓటర్లు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు, 1,17,441 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 191 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 20 శాతం రిజర్వ్తో కలిపి 230 మంది ప్రిసైడింగ్ అధికారులు, 230 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 687 మంది ఓపీఓలను నియమించారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది సైతం విధులు నిర్వర్తించనున్నారు. సీసీ కెమెరాలతో నిఘా.. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా సాగేందుకు జిల్లాలోని 80 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్లు)ను నియమించారు. మంగళవారం జిల్లాకేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోట ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీబాయి, ఆయా పుర కమిషనర్లు, తహసీల్దార్లు పరిశీలించారు. వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో బుధవారం ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 80 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఆయా పుర కేంద్రాల్లోని సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి తీసుకొని కేటాయించిన బస్సుల్లో తరలివెళ్లారు. జిల్లాకేంద్రంలో పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో, పెబ్బేరులో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో, కొత్తకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం, అమరచింతలో జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆత్మకూర్లో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీతో పాటు ఎన్నికల రోజు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు సైతం పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. అలాగే అక్కడే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపర్చేందుకు కావాల్సిన స్ట్రాంగ్రూంలను సైతం ఐదు మున్సిపాలిటీల పరిధిలోనే సిద్ధం చేయించినట్లు వెల్లడించారు. పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు వెళ్తున్న ఎన్నికల సిబ్బంది సాయంత్రం 5లోగా ఉంటేనే.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు అవకాశం ఉంటుంది. సాయంత్రం ఐదులోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఓటర్లు ఓటరు స్లిప్తో పాటు ఎన్నికల సంఘం ప్రకటించిన 17 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. పురపాలికల వారీగా ఓటర్ల వివరాలు కేంద్రాలకు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఆయా పుర కేంద్రాల్లోనే స్ట్రాంగ్రూమ్స్ ఏర్పాటు.. అక్కడే ఓట్ల లెక్కింపు -
ఓటు హక్కు విధిగా వినియోగించుకోవాలి
కొత్తకోట రూరల్: పుర ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సిబ్బంది తదితర వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తు కల్పించామన్నారు. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ప్రతి ఓటరు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డు తీసుకురాని ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉండదనే విషయాన్ని ప్రతి ఓటరు గుర్తించాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వినీత్, పుర కమిషనర్ సైదయ్య, ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు. ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు సెలవు.. వనపర్తి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పురపాలికల్లో ఓటరుగా నమోదై ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వారికి బుధవారం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. అర్హత ఉన్న ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. -
పక్కా ప్రణాళికతో ఎన్నికల నిర్వహణ
అమరచింత: పుర ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు జి.లక్ష్మీబాయి అన్నారు. పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పీఓ, ఏపీఓల ఎన్నికల సామగ్రి పంపిణీని మంగళవారం ఆమె పరిశీలించి సిబ్బందికి ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అమరచింతలో మొత్తం 9,147 మంది ఓటర్లుండగా.. 18 పోలింగ్ కేంద్రాలు, 90 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. సీఐ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్ఐలతో పాటు 50 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు వివరించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్ నూరుల్ నదీంను ఆదేశించారు. వయోవృద్ధులు, నడవలేని వారు, దివ్యాంగుల కోసం వీల్చైర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వరావు, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రవికుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. అధికారుల పరిశీలన.. ఆత్మకూర్: ఎన్నికల విధులు నిబద్ధతతో నిర్వహించాలని ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీబాయి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, డీపీఓ రఘునాథ్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్రూం, ఓట్ల లెక్కింపు కేంద్రం, పోలింగ్ కేంద్రాలను వేర్వేరుగా పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా సజవుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు జరుగనున్నాయని వివరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ చికినె శశిధర్, తహసీల్దార్ చాంద్పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, ఎంఈఓ బాలరాజు, ఎంపీఓ శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రధానంగా అమాత్యుల ఇలాకాల్లోనే..
ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ప్రధానంగా అమాత్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాలతోపాటు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వికృత రాజకీయ పోకడలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో పల్లె పోరులో కాంగ్రెస్ పైచేయిగా నిలిచినప్పటికీ, బీఆర్ఎస్, బీజేపీ సత్తా చాటడంతో ‘అధికార’ నాయకుల వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. పురంలో గెలుపే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు ఒక్కదాని వెనుక ఒకటిగా చోటుచేసుకుంటున్న పలు ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయని సీనియర్ రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు వ్యాప్తంగా మక్తల్ మంటలు చెలరేగుతున్నాయి. పుర ఎన్నికల వేళ ఆ మున్సిపాలిటీలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఉమ్మడి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతోపాటు ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్ పోరు క్రమంలో చోటుచేసుకున్న పలు ఘటనలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. ఖద్దరు చేతిలో ఖాకీలు బంధీలయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు పరోక్షంగా మద్దతు ఇస్తూ.. వారి ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, అయిజ, వడ్డేపల్లిలో నెలకొన్నట్లు సమాచారం. మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యతో రాజకీయ దుమారం తెరపైకి కోస్గిలో కౌన్సిలర్ ఆశావహులపై బెదిరింపుల పర్వం మహబూబ్నగర్లో పోలీసుల డేగకన్నుతో ప్రతిపక్ష అభ్యర్థుల కట్టడి కొల్లాపూర్, అలంపూర్లో సైతం ఇవే పరిస్థితులు ఎన్నికల కమిషన్కు అందిన ఫిర్యాదు -
అత్యుత్తమంగా 102, 108 వాహన సేవలు
వెయ్యి మంది సిబ్బందితో పటిష ్టబందోబస్తు వనపర్తిటౌన్: పుర ఎన్నికల సందర్భంగా వెయ్యి మంది పోలీసులతో కట్టుదిట్టమైన పట్టిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అదనపు ఎస్పీ, డీస్పీలు, ప్రత్యేక పోలీసు బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 80 వార్డులు, 191 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 67 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ సమష్టి బాధ్యతని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విధుల్లో ఉన్న సిబ్బంది కఠిన పర్యవేక్షణ కొనసాగిస్తారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్)ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్నికల సెల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు, మొబైల్ పెట్రోలింగ్ నిరంతరం పని చేస్తున్నారయన్నారు. అభ్యర్థులు ఓటర్ల మనసు గెలిచి ఎన్నికల బరిలో గెలవాలని, ఉచితాలు, బహుమతులు, డబ్బు, మద్యం లాంటి వాటితో ప్రలోభాలకు గురిచేయొద్దని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి 123 కేసులు నమోదు చేసి, 432 మందిని సత్ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికలను ప్రభావితం చేసే అక్రమ మద్యం రవాణాలో భాగంగా జిల్లాలో 425 లీటర్ల మద్యాన్ని పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొత్తకోట రూరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 102, 108 వాహనాలు అత్యుత్తమ సేవలు అందిస్తూ అపర సంజీవనిలా ఆదుకుంటున్నాయని 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కె.రవికుమార్ అన్నారు. మంగళవారం పెద్దమందడిలోని 108 వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరికరాల పనితీరు, మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద బాధితులు, ఆపదలో ఉన్న వారిని 108 వాహనాల్లో వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. అలాగే 102 అమ్మఒడి వాహనాలు గర్భిణులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేరుస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయిన తర్వాత తల్లీబిడ్డలను ఇంటివద్ద ఉచితంగా వదులుతున్నాయని.. ఐదేళ్లలోపు చిన్నారులను వ్యాక్సినేషన్ కోసం తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మహబూబ్బాషా, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బుద్వేష్, భార్గవి, శశి, భీమేష్ ఉన్నారు. -
రిజర్వాయర్ పనులు చేపట్టొద్దని పాదయాత్ర
గోపాల్పేట: ఏదుల మండలంలోని గొల్లపల్లి, చీర్కపలి సమీపంలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ పనులు చేపట్ట వద్దని మంగళవారం అఖిలపక్ష నాయకులు పాదయాత్ర చేపట్టారు. గొల్లపల్లి గేట్ నుంచి ఏదులలోని తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి తహసీల్దార్ మల్లికార్జున్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మించడంతో 1,350 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోందని.. వెంటనే పనులు ప్రారంభించకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తలారి కుర్మయ్య, అబ్దుల్ మహమూద్, రాజురెడ్డి, దొడ్ల ఇందిర, రేణుక, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. వేసవి ప్రణాళిక పనులు చేపట్టాలి వనపర్తిటౌన్: విద్యుత్ వినియోగదారులకు వేసవిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూపొందించిన ప్రణాళిక పనులను త్వరగా పూర్తి చేయాలని టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ చీఫ్ ఇంజినీర్ పీవీ రమేష్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలో విద్యుత్ సర్కిల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, గృహ, వాణిజ్య తదితర కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాబాటలో గుర్తించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. అంతకుముందు జిల్లా స్టోర్స్ను సందర్శించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కావాల్సిన సామగ్రి, ఇతర అత్యవసర సమయాల్లో కావాల్సిన పరికరాలు ఉన్నాయా లేవా అని పరిశీలించి అందుబాటులో ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎస్ఈ తిరుపతిరావు, డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, డివిజనల్ టెక్నికల్ ఇంజినీర్ సి.వెంకట శివరాం, సీనియర్ అకౌంట్స్ అధికారి వెంకటరమణ, స్టోర్స్ ఏడీఈ లక్ష్మణరావు, కొత్తకోట ఏడీఈ శివశంకర్రెడ్డి, ఏఈలు, అకౌంట్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మక్తల్లో హై‘టెన్షన్’..!
● మంత్రి వాకిటి ఇలాకాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో కలకలం ● పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత.. 6వ వార్డులో ఎన్నిక వాయిదా ● నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం: మంత్రి వాకిటి ● పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ● బెదిరింపులకు భయపడే ఆత్మహత్య: ఎంపీ డీకే అరుణ – మక్తల్/నారాయణపేట వివరాలు IIలో -
ఎన్నికల ఖర్చు లెక్క పక్కాగా ఉండాలి
అమరచింత: మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఖర్చుల లెక్కలు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల ఖర్చుల పరిశీలకులు ఎం.శ్రీనివాసులు అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల ఖర్చు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అభ్యర్థి రూ.లక్ష వరకు ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రూ. 5వేలకు పైబడి ఖర్చు చేస్తే.. అందుకు సంబంధించి డిజిటల్ పేమెంట్ లేదా చెక్కు రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. బిల్లులు సైతం జత చేయాలన్నారు. ప్రతి లెక్కను ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఫారంలో నమోదు చేయాలని సిబ్బందికి సూచించా రు. ఆయన వెంట అబ్జర్వర్ మహ్మద్ యూసుఫ్, మున్సిపల్ కమిషనర్ నూరుల్నదీం ఉన్నారు. మజ్లిస్కు మద్దతుగా నిలవండి : ఓవైసీ స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్కు మద్దతుగా నిలిచి ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లాకేంద్రంలోని షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్నామని ఒకరు, ఢిల్లీలో అధికారంలో ఉన్నామని మరొకరు, పదేళ్లు పాలించామని ఇంకొకరు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయమని అడుగుతారని, మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల వల్ల అధికారం ఏర్పడన్నారు. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేటర్, వనపర్తి, గద్వాల, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్, మక్తల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల్లో నిలబడిన ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే మీ గొంతుకే డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని అన్నారు. బిహార్లో ఐదుచోట్ల ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్లు తెలిపారు. మజీస్ పార్టీతో వ్యతిరేకించిన ఒక వ్యక్తి నిలబడితే ఆయనకు డిపాజిట్ కూడా రాలేదన్నారు. మహారాష్ట్రలో 125 మున్సిపల్ కార్పొరేటర్ స్థానాలను మజ్లిస్ పార్టీ గెలిచినట్లు తెలిపారు. ఔరంగాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 33 చోట్ల కార్పొరేటర్, ముంబైలో 8 చోట్ల కార్పొరేటర్ స్థానాల్లో గెలవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. సభలో మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్, ఎంఐఎం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జాబిర్ బిన్ సయీద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు అబ్దుల్ హాదీ, మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్, ఎన్నికల ఇన్చార్జిలు జఫర్ఖాన్, అన్వర్సాదత్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షులు సాదుతుల్లా హుస్సేని, ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
భూ సేకరణ అభిప్రాయ సేకరణ కోసం అధికారులు నిర్వహించిన గ్రామసభలో రైతుల నుంచి ఆందోళనలు జరుగుతాయని ముందస్తు సమాచారంతో అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేందర్, వెంకటేష్గౌడ్, వెంకట్రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు తమ డిమాండ్లను శాంతియుతంగా అధికారులకు తెలపాలని సూచించారు. దీంతో రైతులు పోలీసులతో తమ గొంతు నొక్కిస్తూ.. కేసులు పెట్టి భయభ్రంతులు గురిచేస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులు గ్రామసభను బహిష్కరించి వెళ్లడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
వనపర్తి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పార్టీలు, అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ఇతర ప్రాంత వాసులు వెంటనే ఆయా పురపాలికలను వదిలి వెళ్లిపోవాలన్నారు. మోడల్ కోడ్ అనేది ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుందని.. ఏ ఒక్కరు ఇంటింటి ప్రచారం లేదా మీడియాలో ప్రచారం చేయడానికి వీలు లేదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 సెక్షన్ 209(2) ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. అదే విధంగా మొబైల్ ఫోన్లలో ప్రచారం నిర్వహిస్తే సెక్షన్ 209(1) (బీ) ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం, ప్రసంగాలు చేయడం, సంగీత కచేరీలు ఏర్పాటు చేయడం వంటి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఉద్దేశంతో కూడిన కార్యకలాపాలపై ఈ సైలెన్స్ పీరియడ్లో నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్ రోజున ఓటు వేసేందుకు ఓటరు స్లిప్తో పాటుగా ఎన్నికల కమిషన్ గుర్తించిన 17 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డు వెంట తీసుకొని వెళ్లాలన్నారు. హోటళ్లు, దుకాణాలు, రెస్టారెంట్లు మొదలైన ప్రదేశాలతో పాటు పోలింగ్ ప్రాంతంలో మద్యం అమ్మకాలు లేదా పంపిణీ చేయడం నిషేధించబడిందని తెలిపారు. సోమవారం సాయంత్రం 5 నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అన్ని మద్యం షాపులు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ రోజు 13న సైతం మద్యం దుకాణాలు బంద్ చేయాలన్నారు. ఎగ్జిట్ పోల్ లేదా మరేదైనా పోల్ సర్వే ఫలితాలతో సహా ఎలాంటి ఎన్నికల విషయాలను నిశ్శబ్ద సమయంలో ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఇతర మధ్యమాల్లో ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి వీలు లేదని తెలిపారు. -
అవినీతి కూపం.. బీఆర్ఎస్ పాలన
బీఆర్ఎస్ పదేళ్ల పాలన అవినీతి కూపమని.. వారికి మరోసారి పాలనాధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజమహల్ ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుందని చెప్పారు. పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే.. అభివృద్ధిని అడ్డుకున్నవారవుతారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పార్టీ నాయకులు శంకర్ ప్రసాద్, తిరుపతయ్య, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాంగం సన్నద్ధం
మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు ● ఇప్పటికే అధికారుల నియామకం పూర్తి ● జిల్లాలో 15 సమస్యాత్మకపోలింగ్ కేంద్రాల గుర్తింపు ● ప్రతి కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ●అన్ని ఏర్పాట్లు పూర్తి.. ఎన్నికలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. ఎన్నికల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పోలింగ్కు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటువేయడమే లక్ష్యం. – యాదయ్య, అసిస్టెంట్ ఎన్నికల అధికారి వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాగం సన్నద్ధమవుతోంది. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకాన్ని పూర్తిచేశారు. ఇప్పటికే ఫ్లైయింగ్ స్క్వాడ్స్ బృందాలు విధుల్లో నిమగ్నం కాగా.. తాజాగా రూట్ అధికారుల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేశారు. పోలింగ్ సామగ్రి సిద్ధం.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 90 రకాల వస్తువులు అవసరం కాగా.. వాటిని ప్రత్యేకంగా గుర్తించిన రంగు సంచుల్లో నింపి సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. బ్యాలెట్ బాక్సులను ఇదివరకే సర్వీసింగ్ చేసినప్పటికీ.. పోలింగ్ రోజున మొరాయించకుండా మరోసారి సర్వీసింగ్ పూర్తిచేశారు. పోలింగ్కు ఒకరోజు ముందే సంబంధిత సిబ్బంది విధుల్లో చేరనున్నారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, నోడల్ అధికారులు, ఆర్ఓల పర్యవేక్షణలో వారు విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో 1,17,441 మంది ఓటర్లు.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 117,441 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వనపర్తిలో 64,190, కొత్తకోటలో 18,192, పెబ్బేరులో 14,333, ఆత్మకూర్లో 11,579, అమరచింతలో 9,147 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేకంగా రూట్లు ఏర్పాటుచేశారు. ప్రతి రూట్కు ఒక జోనల్ అధికారి, మున్సిపాలిటీ నుంచి మరో అధికారిని నియమించారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం.. ఓటింగ్ అనంతరం తిరిగి లెక్కింపు కేంద్రాలకు తీసుకురావడం తదితర విధులు నిర్వర్తిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీఓ, ఏపీఓ, ముగ్గురు అదనపు పోలింగ్ అధికారులు, ఒక కానిస్టేబుల్, ఒక ఏఎన్ఎం, ఒక బీఎల్ఓ విధులు నిర్వర్తించనున్నారు. వనపర్తిలో 6, కొత్తకోటలో 4, పెబ్బేరులో 4, ఆత్మకూర్లో 3, అమరచింతలో 3 చొప్పున రూట్లను ఏర్పాటుచేశారు. రూట్లకు అనుగుణంగా అధికారుల నియమాకం పూర్తిచేశారు. మున్సిపాలిటీ పీఓలు ఏపీఓలు రూట్లు/ బ్యాలెట్ అదనపు అధికారులు బాక్స్లు సిబ్బంది వనపర్తి 99 99 6 99 297 కొత్తకోట 30 30 4 30 90 పెబ్బేరు 24 24 4 24 72 ఆత్మకూర్ 20 20 3 20 54 అమరచింత 18 18 3 18 60 రిజర్వాయర్కు సరైన అనుమతులు లేకపోవడంతో తాము జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించామని రైతులు రఘుమారెడ్డి, సుందర్రెడ్డి, ఇంద్రారెడ్డి, తిరుపతయ్య తెలిపారు. దీనిపై రిజర్వాయర్కు అవసరమైన అనుమతులు లేనిదే పనులు చేపట్టవద్దని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండురోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం రిజర్వాయర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రతులు, వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. దినిని ఉన్నతాధికారులకు నివేధించడంతో పాటు గ్రామసభలో రైతులు వ్యక్త పరిచిన ఆంశాలను తెలుపనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల నియామకం ఇలా.. జిల్లావ్యాప్తంగా 20 రూట్లు.. నిఘా నీడలో.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. వీటిలో 15 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ప్రతి కేంద్రంలో వెబ్ కాాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అన్ని కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. -
తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకుందాం
స్టేషన్ మహబూబ్నగర్: తెలుగు జాతి సంస్కృతిలో భాగమైన నాటక రంగాన్ని కాపాడుకుందామని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు సోమవారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక కళారంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ 11 ఏళ్ల నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో మన్యంకొండ క్షేత్రంలో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.వివిధ సంస్థలచే శ్రీరామాంజనేయ యుద్ధ సన్నివేశం, భవాని చింతామణి, సుభద్ర అర్జున సీను, కర్ణ రహస్యం సీను, రావణబ్రహ్మ ఏకపాత్రాభినయం నిర్వహించారు. అనంతరం కళాకారులను సన్మానించిన సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు కె.శివప్రసాద్, బంగారు వెంకటయ్య, భాస్కరాచారి, ధర్మన్న, నాగరాజు, వెంకటయ్య, విజయదేవి, శివ పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లోనూ బుద్ధి చెప్పండి
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన కేసీఆర్ భవిష్యత్లో వందేళ్ల వరకు సాగు, తాగునీటి కష్టాలు రాకుండా కాల్వలు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ నాయకులు.. వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. వారికి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ప్రజలు ఇదివరకే గుర్తించి.. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బుద్ధి చెప్పి, బీఅర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, గట్టుయాదవ్, బి.లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, పలుస రమేశ్గౌడ్, నందిమల్ల అశోక్, గంధం బాలపీరు, వేణుగోపాల్, గులాం ఖాదర్ఖాన్, బొబ్బిలి ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విమర్శల హోరు..
చివరిరోజు హోరెత్తిన కార్నర్ మీటింగ్లు ● ప్రధాన పార్టీల బలాబలాలు ప్రదర్శన ● విమర్శలే ప్రధాన అస్త్రాలుగా నేతల ప్రసంగాలు ● ముగిసిన ‘పుర’ ప్రచార పర్వం వనపర్తి: ఏడు రోజులుగా సాగిన పుర పోరు ప్రచారంలో ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకున్నారు. ఒకరి లోపాలను మరొకరు ఎత్తిచూపుతూ.. తమ ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే ప్రచారానికి చివరి రోజైన సోమవారం ఆ రెండు పార్టీలు భారీ జనసమీకరణతో బలప్రదర్శన చూపించే ప్రయత్నం చేశారు. జిల్లా కేంద్రంలోని రాజమహల్ ముఖద్వారం వద్ద అధికార కాంగ్రెస్ పార్టీ, అంబేడ్కర్ చౌరస్తాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. భారీగా జనసమీకరణ చేసి.. తమ బలప్రదర్శన చూపించే ప్రయత్నం చేశారనే చర్చ స్థానికుల్లో వినిపించింది. కార్నర్ మీటింగ్లో విమర్శలే ప్రధాన అస్త్రాలుగా నేతల ప్రసంగాలు సాగాయి. ‘‘రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి.. ఏటా రూ. 75వేల కోట్ల వడ్డీ చెల్లించే దుస్థితి కల్పించారు. మరోసారి వారికి పాలనాధికారం ఇవ్వొద్దు’’ అంటూ రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు చేశారు. అదే తరహాలో ‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. మరో రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అఽధికారంలోకి రాబోతోంది. అప్పుడు మున్సిపల్ పాలకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి చెందినవి ఉంటే.. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు. ఈ రెండేళ్ల పాలన బాగుందని.. అందుకే మున్సిపల్ పాలనాధికారం ప్రజలు తమకు ఇచ్చారని కాంగ్రెస్ పాలకులు హామీలు నెరవేర్చకుండా తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు’’ అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే, కార్నర్ మీటింగ్లతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు వాహనాలను దారి మళ్లించినా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ సరిగ్గా 5 గంటలకే ఇరు పార్టీల నేతల ప్రసంగాలను బంద్ చేశారు. ఏడు రోజులపాటు మార్మోగిన మైకులు సైలెన్స్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు, తమ మద్దతుదారులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. -
భూ సేకరణ గ్రామసభ బహిష్కరణ
● తమ మధ్య చీలిక తీసుకురావొద్దని ఆగ్రహం ● ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలని వినతి ● బల్మూర్లో భారీగా పోలీసు బందోబస్తు బల్మూర్: జిల్లాలోని బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ బండ్ (కట్ట) నిర్మాణం కోసం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన అభిప్రాయసేకరణ గ్రామసభను రైతులు తీవ్ర నిరసనల మధ్య బహిష్కరించారు. బల్మూర్ శివారులోని 16 సర్వే నంబర్లలో 46 మందికి చెందిన 52.07 ఎకరాల లావణి పట్టా భూముల్లో బండ్ (కట్ట) నిర్మాణం కోసం భూమి అవసరమైనందున్న 10(ఏ) యాక్ట్ ప్రకారం భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సోమవారం గ్రామసభ నిర్వహించారు. ముందుగా ఆర్ఐ సీతారాం భూ నిర్వాసితుల పేర్లు చదివి వినిపించగా.. స్పందించిన రైతులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామసభ పెట్టడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన అనుమతులు పొందకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించి రైతులను విడగొట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిల్లో రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెగేసి చెబుతూ.. సర్పంచ్ శిరీషతోపాటు రైతులు అధికారుల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 2,200 ఎకరాల భూములను రైతులు ప్రాజెక్టులో కోల్పోతుండగా కేవలం 52.07 ఎకరాల్లో లావణి పట్టాలు కలిగిన నిర్వాసిత రైతులు 46 మంది పేర్లతో అధికారులు అభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
కొత్తకోట రూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయం, కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్ల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటు వేసిన వారి వివరాలను ఓటరు జాబితాలో స్పష్టంగా మార్క్ చేయాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు చేతి వేలికి తప్పనిసరిగా సిరా చుక్క అంటించాలని, పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఇందుకోసం ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన అనంతరం నమోదైన ఓట్ల వివరాలను సంబంధిత అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆయా పురపాలికల కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దారు ఉన్నారు. 11న యథావిధిగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు వనపర్తిటౌన్: ఇంటర్ ప్రయోగ పరీక్షలు కొన్ని కేంద్రాల్లో పూర్తిగాకపోవడంతో ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఈ నెల 11న సెలవు ఉన్నప్పటికీ యధావిధిగా కొనసాగుతాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉండటంతో కలెక్టర్ ఆదర్శ్ సురభి పురపాలికల పరిధిలో సెలవు ప్రకటించారని.. కాగా పరీక్షలు ఉన్న విద్యార్థులు ఆ రోజు హాజరుకావాలని సూచించారు. 36 మంది విద్యార్థులు గైర్హాజరు.. జిల్లాలోని 15 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం ఇంటర్ ప్రయోగ పరీక్షలు కొనసాగినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 501 మంది విద్యార్థులకుగాను 486 మంది హాజరుకాగా, 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 602 మంది విద్యార్థులకుగాను 581 మంది హాజరుకాగా.. 21 మంది విద్యార్థులు రాలేదని చెప్పారు. ‘రాష్ట్ర పథకాలు కేంద్ర నిధులతోనే అమలు’ వనపర్తి రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రమే నిధులు సమకూరుస్తోందని, వికసిత భారత్లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పెబ్బేరులోని సుభాష్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. పట్టణానికి ప్రధాన ఆదాయ వనరైన సంతను కబ్జా చేసిన వారికి ఓటు వేయొద్దని, సంతకే దక్కాలని పోరాడిన బీజేపీని గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తే ఇందిరమ్మ పేరుతో అమలు చేస్తున్నారని విమర్శించారు. రేషన్ బియ్యం నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు కేంద్ర నిధులతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నిధులతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, ఎన్నికల కన్వీనర్ నరేందర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గౌని వేమారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, పట్టణ అధ్యక్షుడు క్రాంతినాయుడు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
ఓటు.. వజ్రాయుధం
వనపర్తి టౌన్: ‘ఓటు వేయకుంటే ఏమవుతుంది.. ఓటేయడం అంత అవసరమా? అని భావించొద్దు.. ఓటు అనేది సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. ఉత్తమ భవిష్యత్ను నిర్ణయించేందుకు తోడ్పడుతుంది’ అని ప్రజాసంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ‘ఓటరు చైతన్యం’ అనే అంశంపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించగా.. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఆ ఓటుకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకు సేవ చేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. ఓటును అమ్ముకుంటే ప్రజాస్వామ్యాన్ని కాటేసినట్లేనని.. పార్టీకో, సామా జిక వర్గానికో తావు ఇవ్వకుండా పనిచేసే వారికి పట్టం కడితే ప్రజాస్వామ్యం పురోగమిస్తోందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దు ‘సాక్షి’ చర్చావేదికలో అభిప్రాయాలను వెల్లడించిన ప్రజాసంఘాల నాయకులు -
పుర ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం
అమరచింత: పురపాలికల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలో కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచార రోడ్షోలో వారితో పాటు కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించమని తెలిపారు. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడమే గాకుండా పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మక్తల్, ఆత్మకూర్, అమరచింత పురపాలికలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. అమరచింతలో సీపీఎం మద్దతుతో అధికారం చేపడతామని.. అమరచింత పీహెచ్సీని ఆధునికీకరించి నిరంతర వైద్యసేవలతో పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు.. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ప్రజల్లో మత విధ్వేషాలు రెచ్చగొట్టడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చి రైతులు, రైతు కూలీలకు ఉపాధిని దూరం చేస్తోందని ఆరోపించారు. మతోన్మాద పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని కాంగ్రెస్పార్టీతో కలిసి పుర బరిలో నిలిచామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాభివృద్ధితో పాటు సమస్యలు పరిష్కరించుకునే వీలుందని వివరించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కత్తి వెంకటస్వామి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అయ్యూబ్ఖాన్, అరుణ్కుమార్, మహేందర్రెడ్డి, విష్ణు, లక్ష్మీకాంత్రెడ్డి, తౌఫిక్, శ్యాం, ప్రకాశం, సీపీఎం నాయకులు ఎండీ జబ్బార్, రమేష్, అజయ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
‘పోస్టల్’ పోలింగ్కు సర్వం సిద్ధం
● జిల్లాలో 422 మంది దరఖాస్తుదారులు ● ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు అమరచింత: పుర ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 5 పురపాలికల్లో 422 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగానికి ముందుస్తుగా దరఖాస్తు చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఆయా పురపాలికల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులకు సైతం.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారు, దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్నవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు తహసీల్దార్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారు సర్వీస్ ఓటు వినియోగించుకునేందుకు పోస్టాపీస్ ద్వారా ఇది వరకే పంపించారు. -
‘కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ’
అమరచింత: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు అశాంతితో బతికారని.. తమ ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ పొందడంతో పాటు సంక్షేమ పథకాలు అందుకునే స్థాయికి వచ్చారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ప్రొ. కత్తి వెంకటస్వామి అన్నారు. శనివారం పట్టణంలోని డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహాత్మాగాంధీ పేరును తూడిచివేయాలనే ఉద్దేశంతో ఉపాధిహమీ పథకం పేరు తొలగించే కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని బీజేపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని.. రాష్ట్రానికి నిధులిచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్న విషయం మరిచి మాట్లాడుతున్నారన్నారు. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి పంపిన వాటాధనంలో కేవలం పదిశాతం కూడా తిరిగి ఇవ్వని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందకు తీసుకెళ్లామని.. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో కాస్త జరిగిందని, కేవలం మూడు నెలల వ్యవధిలో సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగులు ఆనందించేలా భారీస్థాయిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మక్తల్ నియోజకవర్గంలో మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో మూడు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్ను ఆదరిస్తున్నారని.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం యువత గుర్తించి తమ పార్టీతో పాటు సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అయ్యూబ్ఖాన్, మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, రమేష్, శ్యాం, వెంకటేశ్వర్రెడ్డి, పోసిరిగారి విష్ణు, నందిమళ్ల సర్పంచ్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు
వనపర్తి: పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని, అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్ల శిక్షణకు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. చెల్లుబాటు అయ్యే.. చెల్లుబాటు కాని ఓట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రిటర్నింగ్ అధికారి ఏదైనా ఓటును చెల్లనిదిగా పరిగణిస్తే తిరిగి తీసుకోకూడదని చెప్పారు. అభ్యర్థులు సరైన కారణాలతో లిఖితపూర్వక నోటీసు ఇచ్చినప్పుడు మాత్రమే రీ–కౌంటింగ్పై నిర్ణయం తీసుకోవాలని, తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి తరఫున ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలు విధిగా పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో టీఓటీ శ్రీనివాసులు, ఆర్వోలు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
లోపల పొత్తులు.. బయటకు కత్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వైరుధ్యాలకు సంబంధం లేకుండా చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అంతర్గతంగా ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. బాహాటంగా పొత్తు మాట లేకుండా వార్డుల్లోనే మీకిది.. మాకది అన్న చందంగా పార్టీల అభ్యర్థులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య అంతర్గత పొత్తులు, సర్దుబాట్లు ముమ్మరంగా చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ గుట్టుగా సంప్రదింపులు జరుపుతుండటం చైర్మన్ పీఠాల కోసం పార్టీల పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది. సర్దుబాట్లతో కలసిన పార్టీలు.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరిపింది. అయితే చివరి నిమిషంలో ఏ పార్టీతోనూ పొత్తు పొసగలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు సొంతంగానే అభ్యర్థులను పోటీలో నిలిపాయి. చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత సర్దుబాట్లు కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉన్నచోట సహకరించడం, ఫలితంగా చైర్మన్ ఎన్నికల్లో మద్దతును పొందేలా ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా అంతర్గత సర్దుబాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వనపర్తి, అమరచింతలో బహిరంగంగానే పొత్తు.. వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఒప్పందంలో భాగంగా సీపీఎం పార్టీకి రెండు వార్డులను సైతం కేటాయించింది. అమరచింత మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ పది వార్డుల్లో సీపీఎం పార్టీకి మూడు వార్డులు దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో సీపీఎం పార్టీ ఒకచోట బీఆర్ఎస్, మరోచోట కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం గమనార్హం. చక్రం తిప్పేందుకు బహుముఖ వ్యూహం.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఈసారి మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం వేగంగా సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇతర పార్టీల్లోని అభ్యర్థులతో సైతం టచ్లోకి వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ పలువార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సరు ్దబాట్లు కొనసాగుతుండటం, చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాలలో చైర్మన్ కోసం పోటీతీవ్రం.. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు చైర్మన్ పదవులే లక్ష్యంగా అంతర్గత సర్దుబాట్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు పార్టీలతో నిమిత్తం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాట్లు గద్వాల మున్సిపాలిటీలో ఈసారి చైర్మన్ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ సైతం అంతర్గత పోరుతో ఇరువర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని ఓ వర్గం బీఆర్ఎస్ అభ్యర్థులతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చైర్మన్ పీఠం కోసం తీవ్రమైన పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్లోనూ ఆపార్టీ కీలకనేత ఈ ఎన్నికల సందర్భంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశం ఆసక్తి రేపుతోంది. -
కాంగ్రెస్తోనే అభివృద్ధికి బాటలు
వనపర్తి: పుర ఎన్నికల్లో అధికార కాంగ్రెస్పార్టీకి ఓటేసి అభివృద్ధికి బాటలు వేద్దామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి కోరారు. శనివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని 28వ వార్డులో అభ్యర్థి కోట్ల శిరీష రవితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి పుర పీఠం హస్తగతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం, పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. పదేళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాజేంద్రప్రసాద్ యాదవ్, నాగార్జున, బాబా, పెంటన్న యాదవ్, సహదేవ్ యాదవ్, శ్రీనివాస్రెడ్డి, కరుణాకర్రెడ్డి, జిల్లెల్ల ప్రదీప్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి దూరమవుతున్న పట్టణాలు వనపర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని 14, 15, 16, 33 వార్డుల్లో పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం భగీరథ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హడావుడి తప్పా అభివృద్ధి జాడ కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాకేంద్రంలోని నలుమూలల ఉన్న చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను వృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బి.లక్ష్మయ్య, రమేష్గౌడ్, గంధం బాలపీరు, వేణుగోపాల్, చిట్యాల రాము, జోహెబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ అర్హత పరీక్ష కందనూలు/ బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశాల కోసం 1,520 విద్యార్థులకు గాను 1,067 విద్యార్థులు హాజరు కాగా.. 11వ తరగతి కోసం 3,072 మంది విద్యార్థులకు గాను 2,353 మంది పరీక్షకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. -
మిగిలింది 2 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంలో వేగం.. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. ఉదయం నుంచే ప్రచార రథాలు, మైక్లతో హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ప్రత్యేక పాటలతో రోజంతా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ వార్డుల్లో కలియదిరుగుతున్నారు. వారితోపాటు సతీమణులు, కుటుంబసభ్యులు సైతం ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీరిక లేకుండా ప్రచారంలోనే నిమగ్నమవుతున్నారు. తమకు కలిసివచ్చే అంశాలపై దృష్టిపెడుతూ ఓట్ల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం తమకు పట్టున్న ప్రాంతాలపై ఫోకస్ను మరింత పెంచింది. అభ్యర్థులతోపాటు నేతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ రాత్రివేళల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బలప్రదర్శనపై ఫోకస్.. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ప్రచార జోరు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు మున్సిపల్ పోలింగ్కు మూడు రోజుల ముందే పట్టణాల్లో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది. ఉమ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. -
రెండోవిడత ఆడిట్ పూర్తి
వనపర్తిటౌన్: పుర ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై రెండోవిడత రిజిస్టర్ ఆడిట్ శనివారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో వ్యయ పరిశీలకుడు నర్సింహారెడ్డి చేపట్టారు. నామినేషన్ పత్రాల దాఖలు నుంచి ఇప్పటి వరకు అభ్య ర్థులు చేసిన ఖర్చు వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేయించి అవి ఎన్నికల సంఘం సూచించి న నిబంధనలకు లోబడి ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తయ్యేలోపు మూడుసార్లు ఆడిట్ ఉండగా.. ఇప్పటి వరకు రెండు పూర్తయ్యాయని, ఈ నెల 9న మరోసారి ఆడిట్ చేస్తామని చెప్పారు. -
వ్యూహాలకు పదును
● ముఖ్యనేతల ఓటమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీల కసరత్తు ● తెలిసిన వారితో కథ నడిపిస్తున్న పార్టీలు ● పోటాపోటీగా ప్రచారాలు, పలు వార్డుల్లో నజారానాలు, డబ్బుల పంపిణీ వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో ముఖ్యనేతలను ఓడించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. కాంగ్రెస్పార్టీలో కీలక నేతలుగా ప్రచారంలో ఉన్న ఎస్ఎల్ఎన్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణజ్యోతి, చీర్ల విజయచందర్, బి.వెంకటేష్, పుర మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, బి.రమాదేవికృష్ణ, శారద బ్రహ్మం, ధనలక్ష్మి, మధుసూదన్గౌడ్ను ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇందుకు ప్రతివ్యూహంగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఉంగ్లం అలేఖ్య తిరుమల్, కాగితాల లక్ష్మీనారాయణ, భారతి ప్రేమ్నాథ్రెడ్డిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇరుపక్షాలు ఏయే పార్టీ, ఏయే అభ్యర్థిని టార్గెట్ చేశాయో స్పష్టమవుతుండటంతో అభ్యర్థులు సైతం ఎత్తుకు పైఎత్తు వేస్తూ పట్టు సాధించేందుకు పావులు కదుపుతుండటం పురపోరు ఆసక్తి రేపుతోంది. దశాబ్దాలుగా మున్సిపాలిటీ అంటే పలువురు కౌన్సిలర్ల పేర్లే వినిపిస్తుండటంతో వారిని కట్టడి చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి భావిస్తుండగా.. పురపాలికలో పట్టు సాధించిన కాంగ్రెస్ నాయకులను దెబ్బ తీసేందుకు మాజీ మంత్రి నిరంజన్రెడ్డి వ్యూహాలకు పదునుపెట్టారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
వనపర్తి రూరల్: పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వనపర్తి పుర పరిధిలోని 18, 21 వార్డుల్లో అభ్యర్థులు పుట్టా ఆంజనేయులు, గంధం మదన్తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కర్రెమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కార్మికులు, కర్షకులు సంఘటితం కాకుండా చూస్తోందన్నారు. కష్టజీవులంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. వార్డుల్లోని సమస్యలు పరిష్కరించాలంటే పేదల గురించి తెలిసిన కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ సీపీఎంకు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, డి.బాల్రెడ్డి, రాజు, బాల్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు గంధం బాలపీర్, గంధం విజయ్, పరంజ్యోతి, మంద రాము, తిరుపతయ్య, వెంకటయ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
వలస ఓటర్లకు గాలం
● వారిని ప్రసన్నం చేసుకునేపనిలో అభ్యర్థులు ● నగరాలకు వెళ్లేందుకు సైతం వెనుకాడని వైనం అమరచింత: మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు? ఎవరు నగరాలకు వలస వెళ్లారని విచారిస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని పురపాలికల్లో ఓటర్లుగా ఉంటూ బతుకుదెరువు కోసం హైదరాబాద్, ముంబాయి తదితర పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను ఇదివరకే సేకరించారు. ఎవరిని ఆశ్రయిస్తే వారు తమకు మద్దతిస్తారన్న వివరాలు సైతం తీసుకొని వారితో కలిసి అక్కడకు వెళ్తున్నారు. రానుపోను ప్రయాణ ఖర్చులతో పాటు ఓటేసేందుకు సైతం కొంత ముట్టజెప్పే పనుల్లో లీనమయ్యారు. అమరచింతకు చెందిన వారు సుమారు వెయ్యిమందికి పైగా నగరాల్లో నివసిస్తూ ఎన్నికల వేళ గ్రామానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా 1వ వార్డులోని శివాజీనగర్, 2వ వార్డులోని కొత్తతండా, 6, 10వ వార్డులోని తెలుగుగేరిలో వలస ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాగే ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి పురపాలికల్లో సైతం ఇదేతంతు కొనసాగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
అమరచింత/ఆత్మకూర్/కొత్తకోట: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదని, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటన నడుస్తోందని మహబూబ్నగర్ ఎంపీ డీకె అరుణ మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించుకొని శుక్రవారం అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, వనపర్తిలో నిర్వహించిన రోడ్షో, కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పిందన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడ పిల్లలకు రూ.2,500, కల్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి తదితర హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వినియోగించుకుంటున్న విషయాన్ని గ్రామస్థాయిలో వివరించాలన్నారు. పురపాలికలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ రూ.వేల కోట్లు మంజూరు చేస్తుంటే వాటిని దారి మళ్లించి ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానివని చెప్పుకోవడం వింతగా ఉందని తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని పురపాలికల్లో తాగునీటి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకాలేదని.. ఇప్పుడు జరుగుతున్న పనులు రాష్ట్ర నిధులతో చేపడుతున్నామని చెప్పుకోవడం అవివేకమన్నారు. పుర ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఆత్మకూర్, అమరచింతలో హడావుడిగా చెరువుల సుందరీకరణ పనులు చేపట్టేందుకు నిర్ణయించారని, రాత్రికిరాత్రే శిలా ఫలకాలు తీసుకొచ్చి వాటిపై ఎంపీ పేరు లేకుండానే శంకుస్థాపన చేయడం దారుణమన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. పురపాలికలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించి జెండా ఎగురవేయాలని కోరారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్ వెంకటేశ్వర్లు, నరాల నారాయణ, మేర్వ రాజు, మంగ లావణ్య, అశోక్, భాస్కర్, ఆత్మకూర్లో జరిగిన కార్యక్రమంలో అశ్విన్కుమార్, జిందె శ్రీనివాస్, మహేశ్వరి, తమ్మలి విజయ్, ఆనంద్, లక్ష్మీకాంత్, జిందె జ్యోతి పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆత్మకూర్: బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతి బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి మొండి చెయ్యి చూపుతోందని, రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నది ఎంత? వస్తున్నది ఎంత అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆత్మకూర్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని.. ఇప్పటికే రూ.400 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే లక్ష్యమని.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మునుపెన్నడూ జరగని అభివృద్ధి చేసి చూపామని వెల్లడించారు. హైలెవల్ వంతెన నిర్మాణంతో మహర్దశ రానుందని ప్రకటించారు. పుర ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జ్ జగ్గారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, చెన్నయ్యసాగర్ పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
వనపర్తి: బాల్య వివాహాలు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (గ్రామీణాభివృద్ధి సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలన ప్రచార వాహనాన్ని ఎస్పీ డి.సునీతరెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రచార వాహనం వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల జిల్లాలో పర్యటిస్తుందని, ప్రతి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 రోజుల పాటు తిరుగుతూ బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, చట్ట ప్రకారం పడే శిక్షలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తుందన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించాలని, చట్ట ప్రకారం తీసుకునే కఠిన శిక్ష గురించి వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. అనంతరం ఎస్పీ డి.సునీతరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1098 లేదా డయల్ 100, 112 సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహం జరిపించే తల్లిదండ్రులతో పాటు పెళ్లి తంతుకు హాజరైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదవుతుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం బాల్య వివాహాలు అరికట్టేందుకు రూపొందించిన ప్రతిజ్ఞ చేశారు. ఫెక్సీపై సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఎస్ కో–ఆర్డినేటర్ చిన్నమ్మ థామస్, ప్రోగ్రాం అధికారి సుచేత, సహాయ ప్రోగ్రాం అధికారి జావేద్ ఖురేషి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీసీపీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
కేసీఆర్ పాలనలోనే ముస్లింల అభ్యున్నతి
వనపర్తి: ముస్లింల అభ్యున్నతి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాలనలోనే కొనసాగిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన అక్షా, ఈద్గా, మదీనా మసీదుల్లో ముస్లిం సోదరులను కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పాలనలో మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. షాదీ ముబారక్, రంజాన్ తోఫా, బక్రీద్ ఇనాం వంటి పథకాలతో పాటు మైనార్టీ గురుకులాలు, విద్యార్థులకు విద్యాభరోసా, ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించామని వివరించారు. అలాగే రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ముస్లిం సమాజం అభివృద్ధికి కృషి చేశామన్నారు. పుర ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయన వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, వేణుగోపాల్, ప్రేమ్కుమార్, ఆరీఫ్, ప్రేమ్నాథ్రెడ్డి, ఆవుల రమేష్, నాగన్న యాదవ్, మెకానిక్ శ్రీను, జహంగీర్, శ్రీకర్గౌడ్, పోతులపల్లి రాజు, జోహెబ్ హుస్సేన్, ఎరువ అరుణ, రహీం తదితరులు ఉన్నారు. ఉత్సాహంగా మహిళా క్రీడా పోటీలు గోపాల్పేట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం సీఎం కప్ నియోజకవర్గస్థాయి మహిళా క్రీడాపోటీలు నిర్వహించారు. కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్ పోటీలను తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సాయంత్రం వరకు క్రీడలు కొనసాగాయి. క్రీడలను సంబంధిత చానల్, యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ చేశారు. కబడ్డీ చివరి పోరులో పెబ్బేరు అర్బన్ జట్టు, ఖిల్లాఘనపురం జట్టు తలపడగా పెబ్బేరు అర్బన్ జట్టు విజయం సాధించింది. ఖో–ఖోలో పెద్దమందడి, వనపర్తి రూరల్ తలపడగా పెద్దమందడి.. వాలీబాల్లో పెద్దమందడి జట్టు, వనపర్తి అర్బన్ జట్టు తలపడగా పెద్దమందడి జట్లు గెలుపొందాయి. విజేత జట్లకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. టీ–20లో సత్తా చాటిన మహిళల జట్టు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో జరుగుతున్న సీనియర్ మహిళా అంతర్ జిల్లాల టీ–20 క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతూ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 34 పరగుల తేడాతో ఖమ్మంపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ నిర్ణీత 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు మొదటి వికెట్కు 67 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆర్యాని 41 ( 45 బంతుల్లో 3 ఫోర్లు), ,అక్షరరాథోడ్ 30 (38 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఖమ్మం 17 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. మహబూబ్నగర్ బౌలర్లు ప్రవళిక రాథోడ్ 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు, మేఘన 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. ఫైనల్లో జిల్లా జట్టు శనివారం వరంగల్తో తలపడనుంది. జట్టు ఫైనల్కు చేరడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్ ఎండీ మన్నాన్ హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్ మ్యాచ్లో మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్గా నిలవాలని ఆకాంక్షించారు. -
పకడ్బందీగా పుర ఎన్నికల నిర్వహణ
● పీఓ, ఏపీఓలు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అమరచింత: పుర ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పుర కార్యాలయంలో జరిగిన పీఓ, ఏపీఓల శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ బాధ్యత పీఓ, ఏపీఓలపైనే ఉందని.. బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్కు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ పత్రాల పరిశీలనలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని.. ముద్రణలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూడాలని కోరారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా తగిన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అదేవిధంగా సిరా చుక్కను ప్రతి ఓటరు వేలికి విధిగా అంటించాలని, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే అక్కడే ఉన్న భద్రత సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. పోలింగ్ సమయంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అనంతరం పుర కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి మున్సిపల్ కమిషనర్కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాసులు, తహసీల్దార్ రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మొగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలి యన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. -
పదిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
ఖిల్లాఘనపురం: పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను నంబర్వన్ స్థానంలో నిలపాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. గురువారం మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో మండల విద్యాధికారి జయశంకర్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం ‘లక్ష్య సాధన.. ప్రేరణ’ అనే అంశంపై ప్రముఖ సైకాలజిస్ట్ అడ్డిగ శ్రీనివాస్తో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మండల, జిల్లాస్థాయిల్లో పది విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించడంతో వారికి చదువుపై ఆసక్తి పెంపొందుతుందన్నారు. అనంతరం సైకాలజిస్ట్ అడ్డిగ శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ వయస్సులో వచ్చే మార్పులను కట్టడి చేసుకొని ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని విని అర్థం చేసుకోవాలన్నారు. వార్షిక పరీక్షలకు కేవలం 37 రోజులు మాత్రమే సమయం ఉందని.. సెల్ఫోన్, టీవీ, అనవసర ముచ్చట్లకు సమయం కేటాయించడంతో తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. చదువు అనేది జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విన్నవారు మాత్రమే భవిష్యత్లో ఉన్నతంగా ఎదుగుతారన్నారు. అనంతరం శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వారు విద్యార్థులతో కలిసి ‘చదువుకో తెలంగాణ’ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాలల ప్రత్యేక అధికారులు లలిత, ప్రశాంతి, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది, శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజీఎం సతీష్, బ్రాంచ్ మేనేజర్ రాజేష్కుమార్రెడ్డి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రసవాల సంఖ్య పెంచాలి : డీఎంహెచ్ఓ
అమరచింత: ఆశా కార్యకర్తలు క్లస్టర్ పరిధిలోని గర్భిణులు, బాలింతలకు అందుబాటులో ఉంటూ వారికి సకాలంలో వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి కోరారు. ఆశా డే సందర్భంగా గురువారం స్థానిక డీఎంఆర్ఎం పీహెచ్సీలో ఆత్మకూర్, అమరచింత మండలాల ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆయుష్ వైద్యులు, సూపర్వైజర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలకు విధులు, లక్ష్యాల గురించి ఆయన వివరించారు. ఎస్సీడీ స్క్రీనింగ్, ప్రసవాలు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటూ ప్రజలు రోగాల బారిన పడకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవాల సంఖ్య పెంచేలా చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆపరేషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా వ్యాధిగ్రస్తులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా కుష్టు నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని.. లక్షణాలు కనిపిస్తే తగిన వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డా. ఫయాజ్ ఆయుష్ వైద్యులు డా. దీపిక, డా. వసంత, డా. నిఖిత, సీహెచ్ఓ రవికుమార్, హెచ్ఈ విద్యాసాగర్, ఎంపీహెచ్ఈఓ సూపర్వైజర్లు సురేందర్గౌడ్, సంధ్యారాణి, డీఈఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల ఖర్చు లెక్క చూపాల్సిందే..
అమరచింత: పుర బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను విధిగా రాసి లెక్క చూపాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎం.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పుర కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి అభ్యర్థి సుమారు రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉందని.. రూ.5 వేల పైబడి ఖర్చు చేస్తే అందుకు సంబంధించి డిజిటల్ పెమెంట్ లేదా చెక్కు రూపంలో చెల్లించాలని సూచించారు. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలో ముందుగా రూ.లక్ష డిపాజిట్ చేసి అందులో నుంచే ఖర్చు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతి లెక్కను ఎన్నికల ఖర్చు ఫారంలో నమోదు చేయాలని, వాటి బిల్లులు సైతం జత చేయాల్సి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో వ్యయ పరిశీలకుడు మహ్మద్ యూసుఫ్, పుర కమిషనర్ నూరుల్ నదీం తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్ ముద్రణలో జాగ్రత్తలు పాటించాలి
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ విషయమై గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి జిల్లాలోని పుర కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు, కేటాయించిన గుర్తులను వార్డుల వారీగా సరి చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, నాణ్యత తదితర అన్ని అంశాలను పరిశీలించాలని సూచించారు. అనంతరం వచ్చిన బ్యాలెట్ పేపర్లు స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పోలీస్ భద్రత కల్పించాలన్నారు. పోలింగ్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. శుక్రవారం అన్ని పురపాలికల పరిధిలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రెండోదఫా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. శిక్షణను అన్ని వసతులతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. 8వ తేదీలోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ.. బీఎల్వోలు, వార్డు అధికారుల ద్వారా ఓటర్లు స్లిప్పులు అందజేయాలని, పంపిణీ ప్రక్రియ 8వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. అభ్యర్థులకు వాహనాల అనుమతి పుర కమిషనర్ల ద్వారా జరగాలని, పార్టీ సమావేశాలు, ర్యాలీలకు పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు. -
ఎత్తుకు.. పైఎత్తులు!
● పెబ్బేరు పుర పీఠం కై వసానికి ప్రధాన పార్టీల వ్యూహాలు ● ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యే చాన్స్? మూడు పార్టీలు ఒక్కటవుతాయా? పెబ్బేరు పుర పీఠం హస్తగతం కానివ్వకూడదని బీజేపీ, బీఆర్ఎస్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు ఒక్కటవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు నామినేషన్ల దాఖలు సమయంలో బీఆర్ఎస్ నేతల వాహనాలు గౌని బుచ్చారెడ్డి ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టడంలాంటి ఘటనలు స్థానికులు ఉదహరిస్తున్నారు. పుర పీఠం దక్కించుకునేందుకు ఏకమయ్యే అవకాశాలు ఎక్కువ గా ఉన్నట్లు చర్చ వినిపిస్తోంది. ఈ నెల 11న పె బ్బేరు పుర ప్రజలు ఎవరిని ఆశీర్వదించి గెలుపు శిఖరాలను ఎక్కిస్తారో వేచి చూడాలి మరి. వనపర్తి: సమీప భవిష్యత్లో నియోజకవర్గ కేంద్రంగా మారనున్న పెబ్బేరు పుర పీఠం దక్కించుకునేందుకు అధికార, విపక్షాలు తమదైన శైలిలో ఎత్తుగడలు వేస్తూ ఎన్నికల బరిలోకి దిగాయి. మొన్నటి వరకు అధికార కాంగ్రెస్పార్టీలో ఉన్న గౌని బుచ్చారెడ్డి సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆలిండియా ఫార్వర్డ్స్ బ్లాక్ పార్టీ గుర్తుపై తన మద్దతుదారులను ఐదు వార్డుల్లో పోటీలో నిలిపి జనరల్కు కేటాయించిన పుర పీఠాన్ని కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. పెబ్బేరులో అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న శ్రీనివాస్గౌడ్కు ఎమ్మెల్యే మద్దతు పుష్కలంగా ఉన్నా.. తన బలమైన సమీప బంధువు మద్దతు లభించకపోవడంతో ఒంటరి పోరు చేస్తున్నారు. ఎంత వరకు విజయం సాధిస్తారనే అంశాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు బీజేపీ గత ఎన్నికల్లో రెండుస్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి ఐదు స్థానాల్లో గెలుపొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ జిల్లా నాయకుడు, మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెంటపల్లి పురుషోత్తంరెడ్డి తన మఖాం పెబ్బేరుకు మార్చి ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తూ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ విషయానికొస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో సంత విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పుర పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో పాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి సైతం పెబ్బేరుపై ప్రత్యేక దృష్టి సారించి పాత స్నేహితులను స్వతంత్రులుగా పోటీలో నిలిపి ఓట్లు చీల్చి గులాబీ జెండా ఎగురవేసేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు’
వనపర్తి రూరల్: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించి సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ చరిత్ర సృష్టించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం పుర కేంద్రంలోని 1, 3, 4, 5, 6 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎద్దుల కరుణశ్రీ, శంకర్నాయుడు, పవిత్ర, వడ్డె అనురాధ, గోపిబాబు తరఫున విసృత్త ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకుల వెక్కిలి చేష్టలు, అవమానాలు భరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు. కాంగ్రెస్పార్టీ మహిళలకు రూ.2,500, తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, యువతులకు స్కూటీలు, వరి ధాన్యానికి బోనస్, రాయితీపై వంట గ్యాస్, రైతు భరోసా, పంట రుణమాఫీ, రైతుబీమా పెంచుతామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. పెబ్బేరులో నీతివంతమైన పాలన అందించామని, రహదారి విస్తరణ, అంతర్గత రహదారులు, క్రీడా మైదానం, నిరంతరం విద్యుత్ సరఫరా, శుద్ధజలం అందించామని చెప్పారు. సుపరిపాలన కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు లక్ష్మారెడ్డి, కర్రె స్వామి, దిలీప్రెడ్డి, వనం రాములు రాజశేఖర్, వడ్డె రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన ఆత్మకూర్: రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా పట్టణ కోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కళాళాలలకు సంబంధించి డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం పీయూ వీసీ జి.ఎన్.శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో 30.08 శాతం, 3లో 39.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన పేర్కొన్నారు. పీయూ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రమేష్బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కో–ఆర్డినేటర్ డా.అరుంధతిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గౌతం పాల్గొన్నారు. -
సీఎం కప్.. క్రీడాకారులకు గొప్ప వేదిక
గోపాల్పేట: గ్రామీణ క్రీడాకారులకు సీఎం కప్ గొప్ప వేదికని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండో ఎడిషన్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అసెంబ్లీ నియోజకవర్గస్థాయి క్రీడోత్సవాలను వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ ఎంతో దోహదపడతుందన్నారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి తగిన శిక్షణనిచ్చి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని.. మండల కేంద్రంలో త్వరలోనే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో మన దేశంలో తక్కువ పథకాలు సాధిస్తోందని, ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ గ్రామస్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం బడ్జెట్లో క్రీడారంగానికి కేవలం రూ.350 కోట్లు కేటాయిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.850 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాబోయే బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించనుందని చెప్పారు. క్రీడలను గ్రామస్థాయి క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యల గుర్తింపునకే పల్లెబాట
పాన్గల్: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకే పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని అన్నారం గ్రామంలో ట్రాన్స్కో ఏఈ చందన్కుమార్రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. బీసీకాలనీలో మూడో విద్యుత్ తీగ ఏర్పాటు, ఎస్సీకాలనీలో రేషన్ దుకాణం వెనుక ఉన్న విద్యుత్ స్తంభాలకు తీగల బిగింపు, ధర్మరాజుగడ్డలో ఇళ్ల నడుమ ఉన్న విద్యుత్ తీగల తొలగింపు, బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో విద్యుత్ లైన్లు, పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, వ్యవసాయ బోరుబావులకు డీడీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలనే సమస్యలను సర్పంచ్ వహీద్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
పుర ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
వనపర్తి: జిల్లాను రద్దు చేస్తానంటున్న అధికార కాంగ్రెస్పార్టీకి ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని 3, 4, 15, 16, 17 వార్డుల్లో ఎన్నికల ఇన్చార్జ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, పార్టీ అభ్యర్థులను వెంటబెట్టుకొని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసి చూపించామన్నారు. జిల్లాకేంద్రంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పాతకోట కాలనీలోని కందకం ప్రాంతంలో మార్కెట్ నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. పాత పట్టణం అభివృద్ధి చెందాలని మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్, డయాగ్నొస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం ఎన్నికల ఇన్చార్జ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో వనపర్తికి పలుమార్లు వచ్చానని, నాటికి నేటికీ చా లా మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. విశాలమైన రహదారులు, ఉన్నత విద్యాలయాలు, చెరువు ల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులను గుర్తించానని వివరించారు. నిరంజన్రెడ్డి కుమార్తె డా. ప్రత్యూషా జిల్లాకేంద్రంలోని వివిధ వార్డుల్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు, ఆ యా వార్డుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
పూత దశలో పురుగు మందులు వాడొద్దు
వీపనగండ్ల: మామిడి తోటలకు పూత దశలో పురుగు మందులు వినియోగిస్తే అధిక నష్టం వాటిల్లుతుందని కీటక శాస్త్రవేత్త డా. షహనాజ్, ఉద్యాన శాస్త్రవేత్త డా. మాధవి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేధికలో మా మిడిలో యాజమాన్య పద్ధతులపై జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు వా రు హాజరై పలు సూచనలిచ్చారు. నల్ల తామర పురుగు నివారణకు నీలిరంగు అట్టలను తోటల్లో ఏర్పాటు చేసుకోవాలని, వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని సూచించారు. జిల్లా ఉద్యాన అధికారి సురేష్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం, కూరగాయల పందిళ్లు, పండ్ల తోటల పెంపకం, బిందుసేద్యం పరికరాల ఏర్పాటుకు అనేక రకాల సబ్సిడీలు ఇస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి కృష్ణయ్య, విస్తరణ అధికారి శిరీష, ఏఈఓ అభిలా ష్, క్లస్టర్ డెవలప్మెంట్ కో–ఆర్డినేటర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 126 మంది విద్యార్థులు గైర్హాజరు వనపర్తి: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ప్రయోగ పరీక్షలు మూడోరోజు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన 19 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షలకు 1,767 మంది విద్యార్థులకుగాను 1,697 మంది హాజరుకాగా.. 70 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,569 మంది విద్యార్థులకుగాను 1,513 మంది హాజరుకాగా.. 56 మంది రాలేదన్నారు. మొత్తంగా 126 మంది విద్యార్థులు పరీక్షలకు దూరంగా ఉన్నట్లు వివరించారు. డీఐఈఓ జిల్లాకేంద్రంలోని రావూస్ జూనియర్ కళాశాల, ఖిల్లాఘనపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరు, ఏర్పాట్లు, రికార్డులను పరిశీలించారు. ఇద్దరు డీఈసీ సభ్యులు, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల ఖర్చు లెక్క చూపాల్సిందే అమరచింత: పుర బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు లెక్కను విధిగా చూపాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు యూసుఫ్ అహ్మ ద్ తెలిపారు. బుధవారం స్థానిక పుర కార్యాల య సమావేశ మందిరంలో అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అభ్యర్థి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించిన ప్రతి లెక్కను రికార్డులో నమోదు చేయాలని సూచించారు. ఖర్చు చేసిన వాటికి సంబంధించిన బిల్లులు సైతం జత చేయాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పుర కమిషనర్ నూరుల్ నదీం తదితరులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు వీపనగండ్ల: ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ ఉత్తమ బోధన అందించినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని జిల్లా విద్యా ప్రత్యేక బృందం నోడల్ అధికారి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కల్వరాల, తూంకుంట ఉన్నత పాఠశాలలను సందర్శించిన బృందం సభ్యులు విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదులు మంచి వాతావరణంలో ఉంచడం, బోధనోపకరణాలు వినియోగించడంతో విద్యార్థులు సులభంగా విద్యను అభ్యసించగలుగుతారని వివరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, తనిఖీ బృందం సభ్యులు బలరాముడు, జయంత్రెడ్డి, వెంకటేష్, మధుసూదన్, దేవేంద్రం, కుర్మన్న, ఉపాధ్యాయులు శ్రీనివాస్, జితేందర్గౌడ్, మధుసూధన్గుప్తా, నిరంజన్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధిస్తాం
ఆత్మకూర్: స్థానిక పురపాలికకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని.. ఇప్పటికే రూ.400 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం రాత్రి పట్ట ణంలోని పార్టీ కార్యాలయంలో పుర అభ్యర్థులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణంలో రెండేళ్ల వ్యవధిలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు గత పాలకుల చేతగానితనం, వైఫల్యాలను గడపగడపకు వివరించాలని సూచించారు. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై రూ.123 కోట్లతో హైలెవల్ వంతెన పనులు కొనసాగుతున్నాయని, దీనికి అనుసంధానంగా మంత్రాలయం, ఎమ్మిగనూర్ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ వచ్చిందని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను పాల్గొన్నారు. -
ఆశలు.. అడియాశలు!
పోటీకి దూరంగా ప్రధాన పార్టీల పట్టణాధ్యక్షులు వనపర్తి: పుర ఎన్నికల్లో వివిధ ప్రధాన పార్టీల పట్టణాఽధ్యక్షులపై రిజర్వేషన్ల నీళ్లు చల్లినట్లయింది. జిల్లాకేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత ఐదు పురపాలికల్లో ముగ్గురు మాత్రమే ఎన్నికల బరిలో ఉండటం గమనార్హం. ఒకటి రెండుచోట్ల రిజర్వేషన్ల ప్రతికూలతతో వారు తమ సతీమణులను పోటీలో నిలపాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కాకముందు చైర్మన్ రేసులో ఉన్నామంటూ ప్రచారం చేసుకున్న నేతలు సైతం రిజర్వేషన్లు అనుకూలించక చతికిల పడి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. దీంతో చేసేది లేక సన్నిహితులకు ప్రచారం చేస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తూ సీక్రేట్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. ● వనపర్తిలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, ఆత్మకూరు పురపాలికలో కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసులు, పెబ్బేరు పురపాలికలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్ మాత్రమే పదవిలో ఉంటూ పుర బరిలో నిలిచారు. మిగిలిన పురపాలికల్లో రిజర్వేషన్లు అనుకూలించక పార్టీ పట్టణాధ్యక్షులు బరిలో నిలబడే అవకాశం లభించలేదు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికార కాంగ్రెస్పార్టీ తరుఫున బరిలో నిలిచిన చైర్మన్ అభ్యర్థి మాధవితో పాటు తనకు అత్యంత సన్నిహితులుగా మెలిగే, గత జనరల్ ఎన్నికల్లో తన కోసం పని చేసిన వారిని గెలిపించుకునేందుకు టికెట్లు ఖరారు చేయకముందు నుంచే ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ● బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో లభించిన బూస్ట్తో పుర ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో చాలా జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన మంగళవారం నుంచే ప్రచారం ప్రారంభించారు. అధికార కాంగ్రెస్పార్టీలో ముఖ్యులని చెప్పుకొనే వారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారిన వారిపై సమర్థులైన అభ్యర్థులను, సీనియర్లను బరిలోకి దించారు. వనపర్తి పురపాలికలో బుధవారం నుంచే వార్డుల్లో పర్యటిస్తూ అధికార పార్టీకి గట్టిపోటీనిచ్చేందుకు కావాల్సిన అన్ని అస్త్రాలను సిద్ధ చేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అఽధికార కాంగ్రెస్పార్టీ పట్టణాధ్యక్షుడు చీర్ల చందర్కు అవకాశం దక్కకపోవడంతో సతీమణి రజినిని బరిలో నిలిపారు. చైర్మన్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్ అతడి కుమారుడు శ్రీకర్గౌడ్ని బరిలో దింపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ పోటీలో ఉన్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వారిలో ఏ ఒక్కరూ ప్రస్తుతం పోటీలో లేకపోవడం గమనార్హం. ఐదేళ్లలో మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు సైతం ఎన్నికలకు దూరంగా ఉండటం, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ఆదేశం మేరకు ఇతరులకు మద్దతుగా ఎన్నికల్లో పని చేస్తున్నారు. రిజర్వేషన్ల కేటాయింపుతో దక్కని స్థానాలు సీనియర్ నేతలది ఇదే పరిస్థితి.. జిల్లాకేంద్రంతో పాటు మిగిలిన పురపాలికల్లోనూ.. పలు వార్డులపై ప్రధాన నేతలు ఫోకస్ -
కమలంలో కొత్త జోష్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/పాలమూరు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ముందు కమల దళపతి రాకతో బీజేపీ శ్రేణుల్లో నూతన జోష్ వచ్చింది. మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంతో కమల దళంలో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో ఉండే బూత్ స్థాయి కార్యకర్తలు, వివిధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్నికల్లో పోటీ కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతిసి.. ఒక వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల రాజకీయాలను గమనించాలన్నారు. తెలంగాణలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ‘తెలంగాణలో ఎన్నికల ముందు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలనే కాదు.. రైతులను, బడుగు, బలహీన వర్గాలు, ఓబీసీలనూ మోసం చేసింది. రైతు భరోసా కింద రూ.15 వేలు, రుణమాఫీ, భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి దగా చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల వారిని నమ్మించి నట్టేట ముంచింది. మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పినా.. ఇంత వరకు ఇవ్వడం లేదు. కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడింది. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అవలంబించి ప్రజాగ్రహానికి గురైంది. తెలంగాణలో అన్ని వర్గాలకూ న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. మోదీకి తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు మంజూరు చేసినా.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు కావాలని విమర్శిస్తున్నారు. రైల్వేరంగంలో హై స్పీడ్ కారిడార్, హైదరాబాద్–పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె రోడ్డు కారిడార్ మంజూరు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో తెలంగాణకు రూ.5,450 కోట్లు కేటాయించాం. యువ నాయకత్వం బీజేపీకి అండగా నిలుస్తోంది. బీజేపీ, మోదీ నాయకత్వాన్ని కోరుకుంటూ ప్రతి నగరం నుంచి ఎన్నికల కోసం పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం అధికారం కోసమో, కుర్చీ కోసం కాదు. తెలంగాణ గౌరవం కోసం. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలాన్ని గెలిపించుకోవాలి.’ అని నితిన్ నబిన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షెలాన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పీ కొండ విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, గౌతమ్రావు, నాయకులు పోతుగంటి రాములు, గువ్వల బాలరాజు, ఆచారి, భరత్, చికోటి ప్రవీణ్, కట్టా సుధాకర్రెడ్డి, నాగురావు నామాజీ, శాంతికుమార్, శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాలమూరు గడ్డ.. బీజేపీకి అడ్డా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ పార్టీకి అడ్డాగా నిలువబోతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తెలంగాణ పోరుయాత్రను సైతం పాలమూరులోని మక్తల్ నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడకు వచ్చారన్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో ఏళ్లుగా చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుంటూనే ఉన్నామని చెప్పారు. మక్తల్, ఆమనగల్ చైర్మన్ స్థానాలను గతంలోనే దక్కించుకున్నామన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా తాము పాలమూరులో ఎంపీ సీటును గెలిచామని చెప్పారు. ఎవరితో పొత్తులు, అండ లేకుండానే ఒంటరిగా విజయాలను సాధించగలిగామని.. రానున్న రోజుల్లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను నెరవేర్చలేక పోయారని విమర్శించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దళిత, బీసీ వర్గాలకు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాలంలోనూ పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇరుపార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. పాలమూరుకు ఇప్పటికీ అన్యాయమే: రాంచందర్రావు ఇక్కడి నుంచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినా పాలమూరు జిల్లాకు అన్యాయమే జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. రెండేళ్లలో సీఎం ఇక్కడి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నా లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. కేంద్ర నిధులతో మున్సిపాలిటీల అభివృద్ధి బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. పుర ఎన్నికల శంఖారావం మోగించిన బీజేపీ భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేసిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తెలంగాణ గౌరవం కోసమే బీజేపీ పోరాటం రాష్ట్ర భవిష్యత్ కోసం మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించండి -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా
అమరచింత: పుర ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందితో పాటు ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాలని సీఐ శివకుమార్ను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని, రాత్రి వేళలో పెట్రోలింగ్ పెంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్ఎస్టీ చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు తరలిస్తే జరిగే పరిణామాలను ప్రజలకు వివరించాలని ఎస్ఐ స్వాతికి సూచించారు. సీజ్ చేసిన నగదుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే నగదు పొందవచ్చన్నారు. -
స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
● పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, పోలింగ్, కౌంటింగ్కు ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్తో పాటు ఎస్పీ సునీతరెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకురాలు లక్ష్మీబాయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ 11వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతుందని, ఓట్ల లెక్కింపు 13వ తేదీన చేపట్టనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్ను నియమించుకోవాలని, కౌంటింగ్ ప్రక్రియకు వార్డుకు ఒక ఏజెంట్ను నియమించుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను 11వ తేదీలోపు ఎన్నికల అధికారులకు సమర్పించాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియ వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పెబ్బేరు లెక్కింపు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో, కొత్తకోట లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఆత్మకూర్ లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, అమరచింతకు సంబంధించి ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతుందని వివరించారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను 8వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు వినియోగించుకోవచ్చన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అన్ని పుర కార్యాలయాల్లో కొనసాగనుందని.. కొత్తకోటలో మాత్రమే ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని చెప్పారు. ఓటరు స్లిప్ల పంపిణీ బుధవారం నుంచి అధికారికంగా కొనసాగుతుందని వివరించారు. ముందస్తు అనుమతి తప్పనిసరి.. ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలకు ముంద స్తు అనుమతులు తీసుకోవాలని ఎస్పీ సునీతరెడ్డి సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కా గా అమలు చేస్తున్నామని.. ఉల్లంఘిస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయని, చెక్పోస్టులు కూడా కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీబాయి మా ట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛా యుత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాల ని సూచించారు. కావాల్సిన అనుమతులు సకాలంలో తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ సు బ్ర మణ్యం,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాతావరణం మధ్యాహ్నం ఎండ వేడిమి పెరుగుతోంది. రాత్రిళ్లు చలి తీవ్రత కాస్త ఉంటుంది. అప్పుడప్పుడు చల్లటి గాలులు వీస్తాయి. జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశామని కలెక్టర్ చెప్పారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. -
వైభవంగా ఈదమ్మ షిడె ఉత్సవం
పాన్గల్: మండల కేంద్రంలోని ఈదమ్మ జాతరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల భక్తులు మంగళవారం వేలాదిగా తరలిరావడంతో ఆలయం ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. మహిళలు అందంగా అలంకరించిన బోనపు కుండలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా షిడె కార్యకమ్రం నిర్వహించారు. ఆలయ ఆవరణలో పొడగాటి కర్రకు గొర్రె పిల్లను కట్టి చుట్టూ తిప్పారు. సర్పంచ్ నాగలక్ష్మి, నరేందర్గౌడ్ దంపతులు అమ్మవారికి పట్టువస్తాలు, వడిబియ్యం సమర్పించారు. అర్చకుడు నాగన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కేఎస్ రత్నం, ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది ఎస్ఐలు, 75 మంది పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మిఠాయి, గాజుల దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారిని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు జూపల్లి అరుణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, టీపీసీసీ ఓబీసీ కన్వీనర్ డా. కేతూరి వెంకటేష్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, కాంగ్రెస్పార్టీ నాయకులు వెంకటేష్నాయుడు, రవికుమార్, రాముయాదవ్, మధుసూధన్రెడ్డి, బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్నాయక్, వీరసాగర్, బీజేపీ నాయకులు అన్వేష్, శివరాంయాదవ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిడెకు హాజరైన భక్తులు జాతరకు పోటెత్తిన భక్తులు -
ప్రశాంతంగా ప్రయోగ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థుల ప్రయోగ పరీక్షలు రెండోరోజు మంగళవారం ప్రశాంతంగా కొనసాగినట్టు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. మొత్తం 19 పరీక్షా కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షలకు 2,008 మంది విద్యార్థులకుగాను 1,925 మంది హాజరుకాగా.. 83 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,619 మంది విద్యార్థులకుగాను 1,556 మంది హాజరుకాగా.. 63 మంది రాలేదని వివరించారు. మొత్తంగా 3,481 మంది విద్యార్థులు హాజరు కాగా 146 మంది గైర్హాజరయ్యారన్నారు. తనతోపాటు ఇద్దరు డీఈసీ సభ్యులు, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు కేంద్రాలను తనిఖీ చేశామని చెప్పారు. పరీక్షల నిర్వహణ తీరు, ఏర్పాట్లు, రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా
వనపర్తి: మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ డి.సునీతరెడ్డి తెలిపారు. మంగళవారం డీజీపీ శివధర్రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ, జిల్లాలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో చేపడుతున్న భద్రత చర్యలు, బందోబస్తు ప్రణాళికలు, సున్నిత ప్రాంతాల గుర్తింపు, పోలీసు బలగాల వినియోగం తదితర అంశాలను డీజీపీకి వివరించారు. వీసీలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, వనపర్తి, కొత్తకోత, ఆత్మకూర్ సీఐలు కేఎస్ రత్నం, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ అశోక్కుమార్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘పుర ఎన్నికలతో కాంగ్రెస్ కనుమరుగు’
వనపర్తి టౌన్: పుర ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చే దెబ్బకు కాంగ్రెస్ కనుమరుగవుతుందని.. అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జిల్లాకేంద్రంలోని 5, 18, 19, 20, 21 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గొర్ల ప్రేమ్కుమార్, గంధం మదన్, మురళీసాగర్, సునీల్ వాల్మీకి, ఆంజనేయులుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ, నల్ల చెరువు సుందరీకరణ, మాత, శిశు సంక్షేమ కేంద్రం, క్రిటికల్ కేర్ సెంటర్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. సౌకర్యాలు పెరగడంతో భూముల విలువలు పెరిగి ప్రజలు ఆర్థికంగా ఎదిగారని, ఇవన్నీ ముందుచూపుతో చేపట్టామని వివరించారు. చేసిన అభివృద్ధిని కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
గోపాల్పేట: మిహిళలు వారి చట్టాలు, భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఐఎఫ్హెచ్ఈ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వరకట్న, లైంగిక వేధింపులు, వరకట్న మరణాలపై పలు సూచనలు చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం 112, మహిళా హెల్ప్లైన్ నంబర్ 181 నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహహింస రక్షణ చట్టం గురించి లీగల్ ఎయిడ్ సభ్యులు ఫిర్యాదులు చేయడం, న్యాయ సాయం పొందే విషయాలను నాటిక ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అయేషా అంజుం, ఎంపీఓ భవాని, రవి, కన్నన్, దిలీప్శర్మ, గీత, ప్రియదర్శిని, రాకేష్, సూర్యదేవర, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో టికెట్ల లొల్లి!
● కాంగ్రెస్పార్టీ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదిరె రాములు 25వ వార్డు నుంచి, మాజీ కౌన్సిలర్ నక్క రాములు సతీమణి సుజాత 7వ వార్డు నుంచి బీ ఫారాలు ఇచ్చినప్పటికీ.. సకాలంలో రిటర్నింగ్ అధికారులకు సమర్పించక స్వతంత్రులుగానే బరిలో దిగనున్నారు. ● మాజీ కౌన్సిలర్ నందిమళ్ల శ్యామ్, భువనేశ్వరి దంపతులకు టికెట్లు నిరాకరించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వెంట మొదటి నుంచి ఉన్న రవియాదవ్, ఆయన సతీమణికి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పోటీ కారణంగా ఇరువురికి బీ ఫారాలు ఇవ్వలేదు. వనపర్తిటౌన్: స్థానిక పురపాలిక ఎన్నికల సందర్భంగా మంగళవారం డీసీసీ కార్యాలయంలో టికెట్ల కేటాయింపు, బీఫారాల పంపిణీ వ్యవహారం ఆధ్యంతం ఉత్కంఠ రేపింది. చివరకు ఇద్దరు అభ్యర్థులకు సమయం దాటిన తర్వాత అందజేయడంతో స్వతంత్రులుగా బరిలో నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. బయట కూర్చోబెట్టి మాట్లాడుతామని కొందరిని ఏమార్చగా.. మరికొందరిని రహస్యంగా కార్యాలయంలోకి పిలిపించి బీఫారాలు అందజేశారు. విషయం తెలియక కొందరు ఆశావహులు సమయం గడిచేంత వరకు కాలం వెళ్లదీశారు. పలు వార్డుల్లో ఇద్దరి నుంచి ఐదారుగురు వరకు పోటీ పడుతుండటంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అభ్యర్థుల బలాబలాలపై ఆరా తీసి టికెట్లు కేటాయించారు. మధ్యాహ్నం 3 తర్వాత ఇద్దరు అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసినా అవి రిటర్నింగ్ అధికారులకు సమర్పించేందుకు గడువు ముగియడంతో వెనుదిరిగారు. ● మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణకు టికెట్ కేటాయింపులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీసీ జనరల్ స్థానంలో ఆయన సతీమణికి కాకుండా అతడికే ఇస్తామని చెప్పడం.. ఓ దశలో బీ ఫారం ఇవ్వరనే ప్రచారం సాగింది. చివరకు ఆయన భార్యకే బీ ఫారం అందజేశారు. 32వ వార్డు టికెట్కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు ధనలక్ష్మి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీనివాస్గౌడ్కు పదవి ఉండటంతో బీ ఫారం ఇవ్వరనే ప్రచారం సాగింది. చివరకు 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతుండటంతో సీనియార్టీని పరిగణలోకి తీసుకొని సతీమణి అరుణజ్యోతికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ధనలక్ష్మిని వ్యూహాత్మకంగా ఆ వార్డు నుంచి ఉపసంహరించుకునేలా చేసి 21వ వార్డుకు ఖరారు చేశారు. ● తన భర్త 20 ఏళ్లుగా టికెట్ ఆశిస్తున్నా.. అన్యాయమే జరుగుతోందని, వెయిటింగ్ లిస్ట్లో ఉంచి ఇతరులకు బీ ఫారం ఇచ్చారని రాగి వేణు సతీమణి లక్ష్మి, కుమారుడు అక్షయ్ డీసీసీ కార్యాలయంలో కన్నీటి పర్యంతమయ్యారు. ● 21వ వార్డులో 90 శాతానికిపైగా దళితులు ఉండగా.. ఇతర వర్గాలకు బీ ఫారం ఇవ్వడంలో చిన్నారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారని, దళితులకు ద్రోహం జరిగిందని సోషల్ మీడియా వేదికగా కో–ఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఆరోపించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన బీఫారాల పంపిణీ ఉదయం నుంచి వేచి ఉన్న ఆశావహులు సకాలంలో అధికారులకు అందించక స్వతంత్రులుగా నిలిచిన ఇరువురు పలువురి నాయకుల ఆందోళన -
రాజకీయం రణరంగం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చివరి వరకు ప్రయత్నాలను కొనసాగించారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వార్డులను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రయత్నించారు. పార్టీలో రెబల్స్గా పోటీలో ఉన్న అభ్యర్థులను బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు పార్టీ బీఫారాల అప్పగింతకు సమయం ఉండగా పలుచోట్ల చివరి క్షణం వరకూ హైడ్రామా కొనసాగింది. ● నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 15వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించడం, ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. మొదట బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన తవిటి ఇందిర చివరి క్షణంలో కాంగ్రెస్ గూటికి చేరడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి కాంగ్రెస్కు చేరడంతో మిగిలిన ఇండిపెండెంట్ అభ్యర్థులను విత్డ్రా చేయించేందుకు సైతం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అభ్యర్థి నజియా బేగం ఇంటికి చేరుకుని అప్పటికే మంతనాలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆమెకే బీఫారాన్ని అందించారు. అసంతృప్త నేతల రాజీనామా పర్వం.. కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రాజీనామా చేయడం ఆపార్టీలో చర్చనీయాంశంగా మారింది. టికెట్ రాని వారిని నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బుజ్జగించినా ఫలితం దక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గుచూపడంతో పాటు పార్టీకి రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 6వ వార్డులో కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన తైలి శ్రీనివాసులకు పార్టీ బీఫారం ఇవ్వలేదు. దీంతో భంగపాటుకు గురైన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నాగర్కర్నూల్ పార్లమెంట్ కమ్యునికేషన్ కోఆర్డినేటర్గా పనిచేశారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లేపల్లి జగన్ కల్వకుర్తి మున్సిపాలిటీలో 11 వార్డులో నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫారం ఇవ్వకపోవడతో తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. డబుల్ బీఫారాలతో అలజడి.. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఒకే వార్డుల్లో ఇద్దరికి బీఫారాలు ఇవ్వడం కలకలం రేపింది. మొదట మున్సిపాలిటీలో 37 వార్డు స్థానాలకు గానూ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి చెందిన వర్గీయులకు 37 మందికి పార్టీ బీఫారాలను అందజేశారు. ఆతర్వాత కాంగ్రెస్ నేత సరితాతిరుపతయ్య వర్గానికి చెందిన మరో ఏడుగురు సైతం పార్టీ బీఫారాలను సమర్పించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్వతంత్రుల్లో సింహభాగం రెబల్స్గా.. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలాచోట్ల బీజేపీ అభ్యర్థుల కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్గా పోటీలో ఉండటంతో ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతుందోనని ఇరు పార్టీల కేడర్ ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడం, తుది పోరులో మిగిలిన అభ్యర్థులు ఎవరన్నది తేలిపోవడంతో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ చివరి నిమిషంలో పార్టీల్లోకి చేరికలు గద్వాల, నాగర్కర్నూల్ మున్సిపాలిటీల్లోచివరి వరకు హైడ్రామా బలాబలాల ప్రదర్శనపై ప్రధాన పార్టీల దృష్టి ఉపసంహరణ ఘట్టం ముగియడంతోఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్/బల్మూర్: కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ ఉపాధి హామీ చట్టా న్ని వీబీజీ రామ్జీగా పేరు మార్చి రద్దు చేసే కుట్ర చేస్తోందని, పాత చట్టాన్ని కొనసాగించే వరకు ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. సోమవారం అచ్చంపేట మండలంలోని బుడ్డతండా, బల్మూరు మండలం చెంచుగూడెం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ ఉపాధి కూలీల డబ్బులు కుదించాలని, దేవుడి పేరుతో గ్రా మీణ ప్రాంత కూలీల కడుపు కొట్టాలని చూస్తున్నార ని ఆరోపించారు. గాంధీ పథకం పేరు మార్చేశారని, మొన్నటి వరకు గ్రామసభలు నిర్వహించి పనులు చేపట్టేవారని.. ఇప్పుడు ప్రధాని చేయాలనుకునే పనులను మాత్రమే పథకంలో ఉంచాలని నిర్ణయించారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులను వారే నిర్ణయించుకోవాలని, ప్రధాని నిర్ణయాలకు ఆమోదం తెలపవద్దని సూచించారు. కూలీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని అందుకు తాము మద్దతుగా ఉంటామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడండి ఈ పోరులో కూలీలు, ప్రజలకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ -
గుర్తుల కేటాయింపులో పొరపాట్లకు తావివ్వొద్దు
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై.. అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ, గుర్తుల కేటాయింపుపై పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసి పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు స్వయంగా వచ్చి ఉపసంహరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రతిపాదిత వ్యక్తి లేదా ఏజెంట్ ఉపసంహరణ పత్రం సమర్పించినట్లయితే, అధికారులు తప్పనిసరిగా అభ్యర్థికి ఫోన్చేసి నిర్ధారించుకోవడమే కాకుండా పత్రాలపై ఉన్న సంతకాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నామినేషన్ ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని.. ఈ సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరణలు అంగీకరించబడవన్నారు. సాయంత్రం 4గంటలకు అభ్యర్థులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు. అదే విధంగా పోలింగ్, కౌంటింగ్కు సంబంధించి అభ్యర్థుల ఏజెంట్లందరికీ అవసరమైన గుర్తింపు కార్డులను సిద్ధం చేయాలన్నారు. ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ తమకు కేటాయించిన హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి నియమ నిబంధనలు తెలుసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం–12ను వెంటనే సమర్పించాలని సూ చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాద య్య, డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్రెడ్డి, టీఓటీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
పోలీసు ప్రజావాణికి 10 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 10 మంది సమస్యలను ఎస్పీ సునీతారెడ్డి నేరుగా తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భద్రతే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా ముందుకు తీసుకురావాలని సూచించారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి.. సంబంధిత అధికారుల ద్వారా చట్టబద్ధంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసుశాఖ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ప్రారంభం వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 19 కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన పరీక్షకు 1,811 మంది విద్యార్థులకు గాను 1730 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,586 మంది విద్యార్థులకు గాను 1,523 మంది హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓతో పాటు డీఈసీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రత్యేక పరిశీలకులుగా ఆర్.వెంకటేశ్వరరావు జిల్లాను సందర్శించి.. వనపర్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, జాగృతి కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలతో పాటు పెబ్బేరు, కొత్తకోటలోని ప్రభుత్వ కళాశాల, నివేదిత జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సోమవారం పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనితీరు, ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడం, న్యాయ అవగాహన సదస్సుల నిర్వహణ తదితర విషయాలను సంస్థ కార్యదర్శి వి.రజని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సామాజిక సేవలో భాగస్వాములు కావడానికి పారా లీగల్ వలంటీర్లుగా చేరవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
అడ్డుకున్న కొద్దీ రెట్టింపు అభివృద్ధి
● మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్సైడ్ కావాలి ● రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ● ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లేందుకు ఎందుకు భయపడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. కేసీఆర్ విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. గతంలో కేవలం డ్రోన్ ఎగరవేస్తేనే రేవంత్రెడ్డిని జైలుకు పంపారని.. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిని ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజ్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆయూబ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, లక్ష్మీకాంత్రెడ్డి, విష్ణు, మోహన్, పరమేశ్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గంగాధర్గౌడ్, భాస్కర్, అనీల్గౌడ్, షబ్బీర్, గణేశ్, కలీం, రవికాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్/అమరచింత: అభివృద్ధి పనులకు ప్రతిపక్ష నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా రెట్టింపు ఉత్సాహంతో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం ఆత్మకూర్, అమరచింత పట్టణాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూర్ మున్సిపాలిటీలో రెండేళ్ల వ్యవధిలోనే రూ. 15కోట్లు, అమరచింతలో రూ. 50కోట్ల వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా రూ. 3.14కోట్లతో పరమేశ్వరస్వామి చెరువు సుందరీకరణ, రూ. 123కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి, రూ. 5కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ. 3కోట్లతో డయాలసిస్ కేంద్రం, రూ. 24కోట్లతో 50 పడకల ఆస్పత్రి, రూ. 10 లక్షలతో ఓపెన్ జీమ్, 110 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా మండలానికి రూ. 400కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రానున్న మూడేళ్లలో రూ. 300 కోట్ల నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జూరాల హైలెవల్ బ్రిడ్జికి అనుసంధానంగా రూ. 210కోట్లతో మంత్రాలయం – ఎమ్మిగనూర్ నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి అనుమతులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ ప్రకటన రాబోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. అమరచింతలో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం రాజవలీ ఉర్సు పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. -
నేనంటే.. నేనే!
వనపర్తి బల్దియా చైర్పర్సన్ అభ్యర్థులుగా పలువురి ప్రచారం ఫలితాల తర్వాతే స్పష్టత? మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతే చైర్పర్సన్ను ఎంపికచేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. ఇందుకు ఆ పార్టీలోని పలువురు ముఖ్యనాయకులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఎవరి పేరును అధికారికంగా ప్రకటించడం లేదని తెలుస్తోంది. చైర్పర్సన్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే ప్రతిపాదించే అవకాశం ఉందా? లేక డీసీసీ అధ్యక్షుడు తెరపైకి తెస్తారా? రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బలపరుస్తారా? లేకా ముగ్గురు కలిసి ఒకరి పేరునే ఎంచుకుంటారా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఇదే విషయమై డీసీసీ అధ్యక్షుడు, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో ప్రస్తావించగా.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు, గెలిచిన తర్వాత అప్పటి పరిస్థితుల మేరకు నిర్ణయాలు ఉంటాయని చెప్పడం గమనార్హం. వనపర్తిటౌన్: జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు నేనేంటే.. నేనేనంటూ చైర్పర్సన్ అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటుండటం గందరగోళం సృష్టిస్తోంది. పుర పీఠంపై ఆశలు పెట్టుకున్న నాయకులు.. చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో తమ సతీమణులను ఎన్నికల బరిలో నిలిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వీరిలో ఐదారుగురు నాయకులు మరో అడుగు ముందుకేసి చైర్పర్సన్ అభ్యర్థిని తామే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వారిలో ప్రధానంగా ఎస్ఎల్ఎన్ మాధవి రమేశ్ పేరు చైర్పర్సన్ అభ్యర్థిగా వినిపిస్తుండగా.. చీర్ల సౌమ్య చందర్, జయసుధ మధుగౌడ్, శారద బ్రహ్మం పేర్లు సైతం చర్చకు వస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం అధికారికంగా చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయా వార్డుల్లో పోటీచేసే అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల్లో ఆర్థికంగా తోడ్పాటు పొందేందుకు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్లో భారతి ప్రేమ్నాథ్రెడ్డి, ఉంగ్లం అలేఖ్య పేర్లు ప్రధానంగా చైర్పర్సన్ రేస్లో వినిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు తీరనున్న తరుణంలో చైర్పర్సన్ అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీలో గందరగోళం టికెట్ల కేటాయింపుపై ఇంకా వెలువడని అధికారిక ప్రకటన నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు -
కొందరికే రుణమాఫీ!
● చేనేత కార్మికుల ఆందోళన ● జిల్లాలో 333 మందికి గాను 101 మందికి మాత్రమే చెల్లింపులు ● రూ. కోటి మాత్రమే విడుదల.. పెండింగ్లో రూ.1.27 కోట్లు ● అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న కార్మిక సంఘం నాయకులు ●అధికారుల నిర్లక్ష్యమే కారణం.. చేనేత కార్మికుల రుణమాఫీ వ్యవహారంలో జౌళీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారి వివరాలను సేకరించకుండా సొసైటీ ద్వారా సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లను ఖరారు చేస్తూ రుణమాఫీకి ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం. బ్యాంకు ద్వారా రూ.లక్ష రుణం పొందిన ప్రతి కార్మికుడికి రుణమాఫీ చేయాలి. – పగడాకుల నర్సింహ, నేత కార్మికుడు, అమరచింత అనర్హులకు వర్తింపజేశారు.. నిత్యం చేనేతపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలను దూరం పెట్టి 25 సంవత్సరాలుగా చేనేతకు దూరంగా ఉన్న కార్మికుల పేర్లను రుణమాఫీ కోసం సిఫారసు చేయడం దారుణం. అమరచింతలో 85 మందికి చేనేత రుణమాఫీ వర్తింపజేయగా.. వీరిలో 15 మంది బినామీలు ఉన్నారు. అధికారులు విచారించి అర్హులకు న్యాయం చేయాలి. – చిలువరి నాగరాజు, నేత కార్మికుడు, అమరచింత అమరచింత: చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని రెండేళ్ల క్రితం హామీ ఇచ్చింది. ఈ మేరకు అర్హులైన నేతన్నలకు రుణమాఫీ వర్తింపజేయకుండా.. అనర్హుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశారని చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన కార్మికుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అమరచింత యూనియన్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. నేతన్నల ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాకు సుమారు రూ. 2.50 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, కేవలం రూ.కోటి మాత్రమే మంజూరు చేయడంతో చాలా మంది నేతలకు రుణమాఫీ వర్తించలేదన్నారు. అర్హుల రుణాలను మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చేనేత, జౌళీశాఖ ఏడీ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని అమరచింత, తిపుడంపల్లి, కొత్తకోట, వెల్టూరు, ఘనపురం ప్రాంతాల్లో ఉన్ని కార్మికులతో పాటు మగ్గాలపై జరి చీరలు తయారు నేస్తున్న కార్మికులు ఉన్నారు. వీరిలో 385 మందికి జియోట్యాగ్ నంబర్లు కలిగి ఉండగా.. జాతీయ బ్యాంకుల్లో నేత పనుల పెట్టుబడి కోసం రూ.లక్షలోపు రుణం పొందిన వారు 333 మంది ఉన్నారని జౌళీశాఖ అధికారులు తెలిపారు. వీరందరూ చేనేత రుణమాఫీకి అర్హులని తేల్చి.. పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం రూ. 2.50కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. కేవలం రూ. కోటి మాత్రమే విడుదల చేయడంతో 101 మంది కార్మికుల ఖాతాల్లో మాత్రమే రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి. అమరచింతలో 85 మంది.. మిగిలిన గ్రామాల్లో 16 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. రూ.1.27 కోట్లు రావాల్సి ఉంది.. జిల్లాలో మొత్తం 333 మంది చేనేత కార్మికులు రుణమాఫీకి అర్హులు. వీరికి రూ. 2.50 కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రూ.కోటి మాత్రమే వచ్చాయి. ఆ నిధులను 101 మంది నేతన్నల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకున్నాం. మరో వారం వ్యవధిలో రూ. 1.27కోట్లు రానున్నాయి. అర్హులందరికీ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తాం. – గోవిందయ్య, చేనేత, జౌళీశాఖ ఏడీ -
ఈసారీ.. నిరాశే
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు దక్కని కేటాయింపులు సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర బడ్జెట్ ఈసారి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లావాసులకు నిరాశే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాకు జీవనాడిగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో బడ్జెట్లో ప్రస్తావన కరువైంది. సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక రంగ అభివృద్ధితో పాటు గద్వాల– మాచర్ల రైల్వేలైన్కు ఎలాంటి కేటాయింపులు దక్కలేదు. కొత్తగా అలంపూర్– నల్లగొండ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించినా భంగపాటు ఎదురైంది. వెనుకబడిన జిల్లాలో ఉపాధి కల్పనకు ప్రత్యేకంగా పరిశ్రమల ఏర్పాటు ఉంటుందని ఆశించగా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే హైదరాబాద్– బెంగళూరు రైల్వే మార్గంలో హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు, చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహంతో ఉమ్మడి జిల్లాకు కాసింత ప్రయోజనం కలగనుంది. ఊసే లేని గద్వాల– మాచర్ల కొత్త లైన్ ఉమ్మడి పాలమూరులో చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన కరువైంది. గద్వాల– మాచర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించగా నిరాశే మిగిలింది. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్ల ప్రతిపాదనలు అలాగే మిగిలిపోయాయి. ఉమ్మడి జిల్లా అలంపూర్ సమీపంలోని పుల్లూరు నుంచి నల్లగొండ వరకు నూతన జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సర్వే సైతం నిర్వహించగా.. ఈసారి బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదు. చేనేత కార్మికులకు దన్ను.. మహాత్మగాంధీ గ్రామ్ స్వరాజ్, సమర్థ్ 2.0 కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఉన్న మరమగ్గాలు, చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా మేలు చేకూరనుంది. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా బ్రాండింగ్తోపాటు మార్కెట్ లింకేజీ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచనున్నారు. చదువు.. ఉపాధి విద్యాభివృద్ధిలో భాగంగా బాలికల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయనున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో బాలికల భాగస్వామ్యం పెంచడంతోపాటు విద్యాభివృద్ధి కోసం ఈ హాస్టళ్లను ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా బాలికలకు చదువుతోపాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను కల్పించనున్నారు. ● యువతకు చదువుతో పాటు నేరుగా ఉపాధి కల్పించే విధంగా నైపుణ్యాలను పెంచేందుకు ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, కంటెంట్ క్రియేషన్ ల్యాబ్లను ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. సామాన్యులకు వ్యతిరేకం.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రంతోపాటు వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో ప్రస్తావన కూడా లేదు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులు పెంచలేదు. నిరుద్యోగులు, నిత్యావసర ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు కనిపించలేదు. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ రాష్ట్రంపై నిర్లక్ష్యం.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రా న్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదు. పర్యాటకరంగ అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోలేదు. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దృష్టిపెట్టలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైల్వేతోపాటు జాతీయ రహదారుల ప్రస్తావన లేదు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి హైస్పీడ్ రైల్వే కారిడార్.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రైల్వే మార్గాన్ని హైస్పీడ్ రైల్వే కారిడార్గా మార్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు వేగాన్ని పుంజుకోనున్నాయి. పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా మార్చడంతోపాటు ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. తద్వారా వేగంగా చేరుకోవడంతో పాటు ఇతర రైల్వే నెట్వర్క్, రోడ్లపై రద్దీ భారం తగ్గనుంది. ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ ద్వారా ఉమ్మడి జిల్లాలో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దక్కని జాతీయ హోదా.. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటనతో పాటు పనులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు అందించాలన్న డిమాండ్ ఏళ్లుగా వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర బడ్జెట్లో దీనిపై కనీస ప్రస్తావనకు నోచుకోలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు చేసే భారమంతా రాష్ట్రం మీదే పడింది. అలాగే ఉమ్మడి జిల్లాలో ఐదోశక్తి పీఠమైన అ లంపూర్ జోగుళాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద ప్రత్యేకంగా నిధులు అందుతాయని భావించినప్పటికీ నిరాశే మిగిలింది. కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా భంగపాటు తప్పలేదు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తావన కరువు గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్లు, నూతన జాతీయ రహదారులకు తప్పని భంగపాటు హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైల్వే కారిడార్తో ప్రయోజనం ప్రతి జిల్లాలోనూ బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటుతో మేలు -
ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ డ్రామాలు
వనపర్తి టౌన్: పుర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్పార్టీ సిట్ పేరుతో రెండేళ్లుగా డ్రామలు ఆడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రితో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్పార్టీని భరించే స్థితిలో లేరని, ఇచ్చిన హామీలు విస్మరించి అహంకారం, అజ్ఞానంతో వ్యవహరిస్తున్న సర్కార్ త్వరలోనే కుప్పకూలడం ఖాయమని మండిపడ్డారు. ● సిట్ కేసు లీగల్ సెన్స్ లేని కేసని.. పుర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి కేసీఆర్పై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి కొత్త డ్రామాలకు తెర తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తన వెక్కిలి చేష్టలు మానుకోకపోతే ఇంతకు పదింతల మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పరిపాలన సౌలభ్యం కోసం పదేళ్ల కిందట వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేస్తే నేడు రద్దు చేస్తామంటున్నారని, ప్రజలు విజ్ఞతతో కాంగ్రెస్ పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. సంక్షేమం చేతగాక సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ సిట్ విచారణతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడం మాని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్గౌడ్, పార్టీ మాజీ కౌన్సిలర్లు, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆముదం కాయలు తిన్న చిన్నారులు
ఖిల్లాఘనపురం: సెలవుదినం కావడంతో ఆటలు ఆడుకుంటున్న చిన్నారులు అడవి ఆముదం కా యలు తిని అస్వస్థతకు గురైన ఘటన ల్లాఘనపురంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి నందిని, కిషోర్, నైని, ఆనంది, హేమంతు, రక్షిత, యశ్వంత్, హిమాన్షు, సౌమ్య మొత్తం 9 మంది చిన్నారు లు ఆదివారం కావడంతో కలిసి ఆడుకున్నారు. వీరు ఓ ఇంటి ఆవరణలో ఉన్న అడవి ఆముదం కాయలు తిన్నారు. అనంతరం యథావిధిగా ఎవ రింటికి వాళ్లు వెళ్లిపోగా.. కాసేపటికి వారు వాంతులు చేసుకున్నారు. గుర్తించిన కాలనీవాసులు చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా వారు తిన్న కాయలను చూయించారు. వెంటనే మండలకేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారుల ప్రాణాలకు ఎలాంటి హాని లేదని వైద్యులు పేర్కొన్నారు. 9 మందికి అస్వస్థత.. జిల్లా ఆస్పత్రికి తరలింపు -
ఉపసంహరణలపై ఉత్కంఠ!
వనపర్తిటౌన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పుర ఎన్నికల బరిలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఒక్కో వార్డులో ఇద్దరు మొదలు 10 మంది వరకు నామినేషన్లు వేశారు. ఉపసంహరణకు ఒకరోజే గడువు ఉండటం.. అభ్యర్థులు ఎవరికి వారు టికెట్ తమకంటే తమకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అధికారపార్టీలో అత్యధిక వార్డుల్లో ప్రజలు, రాజకీయ నాయకులకు గందరగోళం నెలకొంది. బరిలో ఎవరుంటారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రచారం చేసేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. ● 80 వార్డులున్న వనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి 176, బీఆర్ఎస్ నుంచి 120, బీజేపీ నుంచి 93 మంది నామినేషన్లు వేశారు. ప్రధానంగా కాంగ్రెస్పార్టీకి పాత, కొత్త కలయిక తలనొప్పిగా మారింది. బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉంటారు.. ఎంత మంది ఉపసంహరించుకుంటారు.. ఏయే పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై మంగళవారం సాయంత్రం స్పష్టత రానుంది. నయానో.. భయానో... రెబల్స్ను నయానో భయానో ఒప్పించి ఉపసంహరించుకునేలా ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. పలు వార్డుల్లో టికెట్ వస్తుందనుకున్న అభ్యర్థులు రెబల్స్కు ఫోన్చేసి రహస్యంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల పట్టణ, జిల్లాస్థాయి నాయకులు రంగంలోకి దిగి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి మరి. అధికార కాంగ్రెస్పార్టీ నుంచి రెబల్స్గా పోటీచేసే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే యోచనలో డీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి వద్ద ప్రస్తావించగా.. రాజకీయ సమీకరణాల దృష్ట్యా పార్టీ నిర్ణయానికి కట్టుబడని నాయకులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఉపసంహరణల మరుసటి రోజే సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పలు వార్డుల్లో 10కిపైగా నామినేషన్లు అధికార కాంగ్రెస్పార్టీ నుంచేఅత్యధికంగా.. బుజ్జగింపులకు ఒప్పుకోకుంటేసస్పెండ్కు వెనుకాడొద్దని డీసీసీ నిర్ణయం కులాల వారీగా ఓట్లు చీల్చేందుకు అభ్యర్థుల వ్యూహాలు ఆత్మకూర్లో..: ఆత్మకూర్: స్థానిక పురపాలికలో పది వార్డులుండగా.. 32 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాగా అధికారపార్టీలో టికెట్ల కేటాయింపు ఎటూ తేలకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి 15 మంది, బీజేపీ నుంచి 13 మంది నామినేషన్లు వేశారు. ఆయా పా ర్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఆదివారం నాటికి ఒ క్కరు కూడా నామినేషన్ ఉపసంహరించుకోలేదు. రంగంలోకి మంత్రి వాకిటి.. అభ్యర్థుల ఎంపికపై మంత్రి వాకిటి శ్రీహరి ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిసింది. సర్వే లు, ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా గెలుపు గుర్రాలకే బీఫారాలు ఇచ్చే యోచనలో ఉన్నారని, మంగళవారం ఉదయం ఎంపిక చేసిన అభ్యర్థులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. రెబల్స్ సైతం నామినేషన్లు ఉపసంహరించుకునేలా మంత్రి నచ్చజెబుతారని తెలిసింది. కుదరని పొత్తులు.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయనున్నట్లు ముందు నుంచి ప్రచారం జరిగినా.. నాయకుల మధ్య సయోధ్య కుదరక ఒంటరి పోరుకే సిద్ధమయ్యారు. ఆయా పార్టీలు ఇదివరకే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మధ్య పొత్తుల చర్చలు విఫలం కావడంతో సీపీఐ, సీపీఎం పోటీకి దూరంగా ఉన్నాయి. వేటుకు రంగం సిద్ధం.. -
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి
పాలమూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం పాలమూరుకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జాతీయ అధ్యక్షుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం ఒకటి గంటలకు బయలుదేరి నేరుగా ఎంవీఎస్ కళాశాల మైదానానికి చేరుకుంటారని ఎంపీ డీకే అరుణ అన్నారు. తొలిసారి జిల్లాకు వస్తున్న క్రమంలో భారీగా స్వాగతం పలకాలని అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తారన్నారు. గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని, బూత్స్థాయి కార్యకర్తల నుంచి జిల్లాస్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలన్నారు. ● మహబూబ్నగర్ కార్పొరేషన్లో పోటీ చేసే అవకాశం వచ్చిన ప్రతి అభ్యర్థి దీనిని సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి కార్పొరేషన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. గెలుపు అవకాశాలు అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థిని పార్టీ ఎంపిక చేసిందని, డివిజన్లో అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు రమేష్, పద్మజారెడ్డి, బాలరాజు, కృష్ణవర్ధన్రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
4న పాలమూరుకు నితిన్ నబీన్
● ఎంవీఎస్ కళాశాలలో కార్యకర్తలసమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ● ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ పాలమూరు: ఫిబ్రవరి 4వ తేదీన మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి జిల్లా బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరవుతున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానాన్ని బీజేపీ నేతలతో కలిసి ఎంపీ పరిశీలించారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు అది కూడా పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, బూత్ కమిటీల సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అన్ని రకాల మోర్చా అధ్యక్షులు ఇతర కార్యవర్గం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంటుందని యువత అధికంగా కమలం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతుందన్నారు. ఆమె వెంట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. -
ఈసారైనా.. పట్టాలెక్కేనా?!
ప్రతిసారి పాలమూరుకు దక్కని కేటాయింపులు ● ఏళ్లుగా పెండింగ్లోనే గద్వాల–మాచర్ల రైల్వేలైన్ ● ఇంకా ప్రారంభం కాని మహబూబ్నగర్– డోన్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ● నేటి కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు మహబూబ్నగర్– డోన్ రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం మూడేళ్ల కింద కేంద్రం రూ.60 కోట్లు కేటాయించింది. అయితే ఈ మేరకు పనులు పూర్తికాలేదు. మేడ్చల్– ముద్ఖేడ్, మహబూబ్నగర్– డోన్ సెక్షన్ల మధ్య విద్యుద్దీకరణ కోసం మొత్తం రూ.122.81 కోట్లు అవసరమని అంచనా వేసినా, ఇందుకు అవసరమైన నిధులు కేటాయించలేదు. ఈ మార్గంలో రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు బైపాస్ లైన్, విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాల్సి ఉంది. సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈసారైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయింపులు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్లకు ఈసారి బడ్జెట్లో నిధులు మంజూరవుతాయన్న ఆశలు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు కొత్త రైల్వేలైన్లకు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ప్రతిసారి కొత్త రైల్వేలైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం.. సర్వేలకే పరిమితం చేస్తుండటం నిరాశ కలిగిస్తోంది. కానీ, ఈసారి బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు దక్కుతాయన్న ఆశలు నెలకొన్నాయి. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్ వరకు 87 కి.మీ., మేర రైల్వే లైన్ కోసం 30 ఏళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ఐదుసార్లు సర్వే పూర్తిచేసినా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు మంజూరుకావడం లేదు. ● గద్వాల– డోర్నకల్ లైన్కు 20 ఏళ్ల కిందట రూ.190 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడుసార్లు సర్వే పనులు పూర్తిచేసినా.. బడ్జెట్లో మాత్రం కేటాయింపులు దక్కడం లేదు. ● కొత్తగా అచ్చంపేట– మహబూబ్నగర్– తాండూరు మార్గంలో సుమారు 180 కి.మీ., కొత్త రైల్వేలైన్ కోసం రూ.360 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే నిధులు కేటాయించకపోవడంతో ఆ ఆమోదం ప్రతిపాదనలకే పరిమితమైంది. ● గద్వాల– వనపర్తి– నాగర్కర్నూల్– గుంటూరులోని మాచర్ల వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఈ ఊసే కనిపించడం లేదు. వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉపాధి కోసం ఎలాంటి పరిశ్రమలు లేక ఇక్కడి నుంచి పనికోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులతోపాటు కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాల్సి ఉంది. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
వనపర్తిటౌన్: పుర ఎన్నికలను అందరి సహకారంతో ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని సహాయ ఎన్నికల అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో నామపత్రాల పరిశీలనను పుర ఎన్నికల సహాయ అధికారి, కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను సౌకర్యవంతంగా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్యాలయంలోని సిబ్బంది ఎవరూ సెలవులపై వెళ్లరాదని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల తిరస్కరణపై ఆదివారం సాయంత్రం 5 వరకు అప్పీల్ చేయవచ్చని, 3వ తేదీన మధ్యాహ్నం 3 లోగా ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. 450 పోలీస్ సిబ్బందితో బందోబస్తు మహబూబ్నగర్ క్రైం: మన్యంకొండ జాతర కోసం మొత్తం 450 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ ఎన్బీ రత్నం వెల్లడించారు. మన్యంకొండ దగ్గర శనివారం బందోబస్తు ఏర్పాట్లను ఏఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. మాట్లాడుతూ రథోత్సవంతో పాటు జాతరలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక అదనపు ఎస్పీతో పాటు ఇద్దరూ డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 75 మంది ఏఎస్ఐ లు, హెడ్కానిస్టేబుల్స్, 250 కానిస్టేబుల్స్, 60 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. -
కాంగ్రెస్ గెలుపుతోనే వార్డుల అభివృద్ధి
వనపర్తిటౌన్: పుర వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను గెలిపించాలని.. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని 4వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ పాలనకు, నేటి ప్రజాపాలనకు మధ్య బేధం ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని, అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్కు ఓటేయాలని కోరారు. 4వ వార్డులోని శివాలయం అభివృద్ధికి రూ.50 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. రూ.85 లక్షలతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల తాగునీటి ట్యాంకు నిర్మించామని, రూ.40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని.. త్వరలో మరో రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపడతామని వివరించారు. కాంగ్రెస్ హయంలోనే అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు చీర్ల విజయచందర్, పరశురాములు, చంద్రశేఖర్రెడ్డి, లక్కాకుల సతీష్, ఎస్ఎల్ఎన్ రమేష్, బ్రహ్మంచారి, పాకనాటి కృష్ణయ్య, ఎల్ఐసీ కృష్ణ, బొంబాయి మన్యంకొండ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
వీపనగండ్ల: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి శేఖర్, డీసీఈబీ చైర్మన్ మద్దిలేటి అన్నారు. శనివారం మండలంలోని తూంకుంట ఉన్నత పాఠశాల ఆవరణలో జీవశాస్త్రంపై నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశానికి వారు హాజరై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధచూపి మంచి మార్కులు సాధించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి రోజు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని కోరారు. ఉపకరణాలు వినియోగించి పాఠ్యాంశాలు బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సింహ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, కాంప్లెక్స్ కార్యదర్శులు శివరాములు, మల్లేశ్, సీఆర్పీ నాగరాజు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘కేసీఆర్పై కక్ష సాధింపు సరికాదు’ వనపర్తిటౌన్: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కక్ష సాధింపు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస రమేష్గౌడ్ అన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం రాత్రి జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్చౌక్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. పుర ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ కక్ష రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేక డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు హేమంత్, ధర్మానాయక్, మాజీ కౌన్సిలర్లు ఉంగ్లం తిరుమల్, బండారు కృష్ణ, ఆవుల రమేష్, సయ్యద్, జమీల్, జోహెబ్ హుస్సేన్, మురళిసాగర్, కవిత నాయక్, మంద రాము, బొబ్బిలి ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం కొత్తకోట రూరల్: పట్టణ సమీపంలోని వెంకటగిరి ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన భూదేవి లక్ష్మీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్రెడ్డి దంపతులతో పాటు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి దంపతులు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, పి.కృష్ణారెడ్డి, రావుల కరుణాకర్రెడ్డి, మేస్త్రి శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి, వేముల శ్రీనివాస్, చర్లపల్లి శేఖర్రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, పి.విశ్వేశ్వర్, గుంత మల్లేష్, గాడీల ప్రశాంత్ పాల్గొన్నారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
వనపర్తిటౌన్: పుర ఎన్నికల్లో భాగంగా నామినేషన్ పత్రాల పరిశీలన శనివారం ఆయా పుర కార్యాలయాల్లో కొనసాగింది. మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారి నామపత్రాల పరిశీలన చేపట్టారు. పరిశీలన కొనసాగిన సమయంలో ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికల అధికారి ఛాంబర్లోనే కూర్చున్నారు. ఉదయం నుంచి వార్డుల వారీగా అభ్యర్థుల పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ అభ్యర్థులను అడుగుతూ నామినేషన్లు పరిశీలించి ఆమోదముద్ర వేశారు. సరైన ఆధారాలు లేక వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలో ఒక్కో నామినేషన్ తిరస్కరణకు గురైంది. కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీల్లో నామపత్రాల పరిశీలన సజావుగా సాగింది. ● జిల్లాలోని ఐదు పురపాలికల్లో మొత్తం 812 నామినేషన్లు దాఖలు కాగా.. బరిలో 496 మంది నిలిచారు. వనపర్తి నుంచి అత్యధికంగా 220 మంది ఉండగా, అతి తక్కువగా అమరచింతలో 60 మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్పార్టీ నుంచి 176, బీఆర్ఎస్ పార్టీ నుంచి 120, బీజేపీ నుంచి 93, బీఎస్పీ నుంచి 8, సీపీఎం నుంచి 9, ఎంఐఎం నుంచి 7, ఇతర పార్టీల నుంచి 30, స్వతంత్రుల నుంచి 85 నామినేషన్లు దాఖలయ్యాయి. వనపర్తి, పెబ్బేరులో ఒక్కొక్కటి తిరస్కరణ -
ఈసీ నిబంధనలు విధిగా పాటించాలి
వనపర్తిటౌన్: ఎన్నికల సంఘం నిబంధనలు విధిగా పాటిస్తూ పకడ్బందీగా పుర ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 11న జరగనున్న పుర ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆమె హాజరై పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా సందేహాలుంటే మాస్టర్ ట్రైనర్లతో నివృత్తి చేసుకోవాలని, పోలింగ్ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. పోలింగ్కు ముందురోజు సిబ్బంది కచ్చితంగా కేటాయించిన కేంద్రంలోనే రాత్రి బస చేయాలని పేర్కొన్నారు. అలాగే టెండర్ ఓటుపై అవగాహన కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ను జాగ్రత్తగా చూసుకోవాలని, ఓటర్లు తమ వెంట కచ్చితంగా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో కొనసాగుతున్నందున అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి రామమహేశ్వరరెడ్డి, మున్సిపల్ డీఈ మహ్మద్ యూనూస్, డీపీఓ రఘునాథ్రెడ్డి, తహసీల్దార్ రమేష్రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. ఎస్ఐఆర్తో మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)తో మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 63.22 శాతం పూర్తయిందని.. ప్రక్రియను మరింత వేగవంతం చేసి లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు.ప్రతి బీఎల్వో 30 నుంచి 40 మందిని మ్యాపింగ్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సమావేశంలో తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
కొత్తకోట: పురపాలికల అభివృద్ధి కాంగ్రెస్పార్టీతోనే సాధ్యమవుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. పుర నామినేషన్ల ప్రక్రియ చివరిరోజు శుక్రవారం పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయించారు. అనంతరం కొత్తకోట చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టణంలో డివైడర్ నిర్మాణం తప్ప ఇతర పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో బాలికల ఉన్నత పాఠశాల భవన నిర్మాణం చేపట్టి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అలాగే ఆస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇటీవల రూ.17 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, కొత్తకోటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పురపాలికలోని 15 వార్డులను తామే గెలుచుకొని జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, పి.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, ఎన్జే బోయేజ్, డా. పీజే బాబు, రావుల కరుణాకర్రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, వేముల శ్రీనివాస్రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
షికారుతో పాలిట్రిక్స్!
గద్వాలలో కీలక రాజకీయ పరిణామాలు ● బండ్ల, సరిత వర్గ పోరులో మారిన పుర ఎన్నికల ముఖచిత్రం ● కాంగ్రెస్లో టికెట్ల నిరాకరణతో సరిత వర్గీయుల నారాజ్ ● బీఆర్ఎస్ నుంచి పలు వార్డుల్లో పోటీకి రంగం సిద్ధం ● మరికొందరు స్వతంత్రంగా బరిలోకి.. ● నామినేషన్ల చివరి రోజు బహిర్గతం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఆధిపత్య, వర్గ రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లాలో మరోసారి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పుర ఎన్నికల వేళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య చోటుచేసుకున్న టికెట్ల లొల్లి కాంగ్రెస్లో చిచ్చు రాజుకోగా.. పట్ణణంలో పోరు ముఖచిత్రాన్ని మార్చేసింది. నామినేషన్ల ఘట్టం చివరి రోజు శుక్రవారం అనూహ్యంగా తారుమారు పాలి‘ట్రిక్స్’తెరపైకి రాగా.. ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. బీఫాంలు ఎవరికో.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య లొల్లి కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు కాంగ్రెస్లో చేరినా.. వారి మధ్య అగాధం పెరుగుతూనే వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ఇరు వర్గాలు పోటీ పడినప్పటికీ.. పార్టీ గుర్తుపై జరిగేటివి కాకపోవడంతో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులుగా ముద్రపడ్డారు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేటివి కావడంతో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు కొందరు సరిత వర్గీయులు ఇటు కాంగ్రెస్తోపాటు అటు బీఆర్ఎస్ తరఫున కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో బీఫాంలు ఎవరికి దక్కుతాయి.. ముఖ్య నేతలు సయోధ్యకు చొరవ తీసుకుంటారా అనేది చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే.. గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. పురపాలికలకు ఎన్నికల కసరత్తు జరుగుతున్న క్రమంలో తన వర్గానికి 20 కేటాయించాలని సరిత అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహబూబ్నగర్లో పర్యటించిన క్రమంలో కూడా ఆమె ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇందుకు ససేమిరా అంటూ నిరాకరించినట్లు సమాచారం. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో కౌన్సిలర్, పుర పీఠం ఎలా దక్కించుకోవాలో తనకు తెలుసని.. ఆ వర్గానికి ఒక్క టికెట్ కేటాయించినా మీ ఇష్టమని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో 20 నుంచి 12.. ఆ తర్వాత పది టికెట్లయినా కేటాయించాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. చివరకు తన వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులకు టికెట్లు ఖరారు చేయాలని కోరగా.. తనకు వారు నేరుగా ఫోన్ చేస్తే కేటాయిస్తానని చెప్పినట్లు వినికిడి. ఇందులో ఒకరు ఫోన్ చేయగా.. ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయించగా.. ఈ కార్యక్రమానికి సరిత, ఆమె వర్గీయులు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్తో టచ్లోకి.. ఆ వెంటనే.. టికెట్ల నిరాకరణతో నారాజ్లో ఉన్న సరిత వర్గీయులు నామినేషన్ల చివరి రోజు కీలక అడుగులు వేశారు. దాదాపు 15 వరకు వార్డుల్లో ఆమె మద్దతుదారులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున కాకుండా కొందరు స్వతంత్రంగా, మరికొందరు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. మూడు, నాలుగు రోజుల క్రితమే పలువురు బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్లడం.. వారి అంగీకారంతోనే పలు వార్డులకు వారు ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు నామినేషన్ల అనంతరం కారెక్కేందుకు వారు రంగం సిద్ధం చేసుకోవడం ముందస్తు స్కెచ్లో భాగమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిని కట్టడి చేయలేక సరిత చేతులెత్తేసిందా.. ఎమ్మెల్యేను ఢీ కొట్టేందుకే తన వ్యూహంలో భాగంగా వారిని ఆ పార్టీలోకి పంపించిందా అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. -
రోడ్డెక్కిన అన్నదాతలు
● భూ పరిహారం చెల్లించాలంటూ నిరసన ● విరమించకపోవడంతో పక్కకు లాగేసిన పోలీసులు ఖిల్లాఘనపురం: గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న అన్నదాతలకు నేటికీ పరిహారం అందకపోవడంతో ఆగ్రహించి శుక్రవారం ముంపు రైతుల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, నాయకులు ఆంజనేయులుగౌడ్, నల్లమద్ది రవీందర్రెడ్డి, బీజేపీ నాయకులు సాయినాథ్, బుచ్చిబాబుగౌడ్ మద్దతు తెలిపి మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణానికిగాను సుమారు 600 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటి వరకు 388 ఎకరాలకు అవార్డు ప్రకటించారు. 7 నెలలు గడుస్తున్నా నేటికీ పరిహారం చెల్లించడం లేదని.. సాగు నీరున్నా భూములు లేకపోవడంతో రైతులంతా వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పరిహారం చెల్లించడంతో పాటు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే మున్ముందు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. చాలా సమయం కావడంతో నిరసన విరమించాలని పోలీసులు కోరినా వినలేదు. ఎమ్మెల్యే మేఘారెడ్డి గట్టుకాడిపల్లి లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణానికి హాజరై తిరిగి వనపర్తికి వెళ్లే సమయం ఆసన్నం కావడంతో చేసేది లేక పోలీసులు వారిని పక్కకు లాగేశారు. కార్యక్రమంలో రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
కమనీయం.. లక్ష్మీవేంకటేశ్వరుడి కల్యాణం
● పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు ● జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఖిల్లాఘనపురం: మండలంలోని గట్టుకాడిపల్లి (అంజనగిరి) శ్రీలక్ష్మీ అలవేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం కనులపండువగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా రెండ్రోజుల పాటు స్వామివారికి అభిషేకం, ధ్వజారోహణం, గరుడ వాహనసేవ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఆయన సతీమణి శారద స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు జరిపించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో అందంగా అలంకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లకు పెళ్లి దుస్తులు తీసుకొచ్చారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ బ్రాహ్మణులు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు లోక నాయకుడి కల్యాణాన్ని తిలకించి భక్తి పారవశ్యంతో తరించారు. వచ్చిన భక్తులకు దాతలు ఆలయ ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
80 వార్డులు.. 816 నామినేషన్లు
చివరిరోజు భారీగా దాఖలు ● నేడు నామపత్రాల పరిశీలన ● ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు వనపర్తిటౌన్: జిల్లాలో పుర ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం శుక్రవారం ముగిసింది. చివరిరోజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ద్విచక్ర వాహనాల ర్యాలీ, మేళతాళాల నడుమ పుర కార్యాలయాలకు చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జిల్లాకేంద్రంలో 33వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్ నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వచ్చారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో 80 వార్డులుండగా.. మొత్తం 816 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. చివరి రోజు అత్యధికంగా వనపర్తిలో 252.. అత్యల్పంగా అమరచింతలో 65 నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తకోటలో 88, ఆత్మకూర్లో 67. పెబ్బేర్లో 71 నామినేషన్లు వచ్చాయి. చివరిరోజు మొత్తంగా 543 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇందులో కాంగ్రెస్పార్టీ నుంచి 286, బీఆర్ఎస్ పార్టీ నుంచి 199, బీజేపీ నుంచి 151, సీపీఎం నుంచి 16, బీఎస్పీ నుంచి 9, ఎంఐఎం నుంచి 7, ఇతర పార్టీల నుండి 40, స్వతంత్రులు 104 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు సాయంత్రం 5 వరకు మాత్రమే సమయం ఉండటంతో సకాలంలో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించారు. వనపర్తి మున్సిపాలిటీలో రాత్రి 7 గంటలు దాటినా ప్రక్రియ కొనసాగింది. నామినేషన్లు వేసిన కొందరు అభ్యర్థులు సైతం చివరిరోజు అదనపు సెట్ల నామినేషన్లు వేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన, తిరస్కరణకు గురైన వారు ఆర్డీఓ అప్పీల్కు వెళ్లేందుకు ఫిబ్రవరి 1న గడువిచ్చారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై విచారణ, 3న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదేరోజు మధ్యాహ్నం బరిలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించనున్నారు. మున్సిపాలిటీల వారీగా నామినేషన్ల వివరాలు పురపాలిక మొదటి రెండో చివరి మొత్తం రోజు రోజు రోజు వనపర్తి 25 108 252 385 కొత్తకోట 4 35 88 127 పెబ్బేరు 1 33 71 105 ఆత్మకూర్ 4 32 67 103 అమరచింత – 31 65 96 -
పకడ్బందీగా నామినేషన్ల స్క్రూటినీ
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగియగా శనివారం స్క్రూటినీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. నామినేషన్ తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఫిబ్రవరి 1న ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి పుర కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. గదిలోకి ఎంతమందిని అనుమతించాలనే విషయాలను వివరించారు. టెలీ కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి పక్కా ఏర్పాట్లు.. అమరచింత/ఆత్మకూర్: పుర ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం అమరచింత పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రం, జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు, అలాగే ఆత్మకూర్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రిటర్నింగ్ అధికారులు పబ్లిష్ చేసిన ఎన్నికల నోటీసు ఫారం–1ను పరిశీలించారు. స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు టీ–పోల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్రూం తనిఖీ.. అమరచింత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం తగిన ఏర్పాట్లను ఫిబ్రవరి 9 సాయంత్రంలోగా పూర్తి చేయాలన్నారు. రూట్ల వారీగా టెంట్లువేసి వార్డుకో టేబుల్ చొప్పున ఏర్పాట్లు ఉండాలని సూచించారు. విశాల ప్రదేశంలో సులువుగా అర్థమయ్యేలా ఫ్లెక్సీలు కనిపించాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని.. పటిష్టమైన బారికేడ్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్, అమరచింత తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్రీనివాసులు, పుర కమిషనర్ నూరుల్ నదీం, ఆత్మకూర్ పుర కమిషనర్ చికినే శశిధర్, తహశీల్దార్ చాంద్పాషా, ఎంపీడీఓ శ్రీపాద్ ఉన్నారు. -
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తకోటలోని ఎంపీడీఓ కార్యాలయం, పెబ్బేరులోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారులు పబ్లిష్ చేసిన ఎన్నికల నోటీస్ ఫారం–1ను పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన సమాచారాన్ని హెల్ప్డెస్క్లో అందించాలని, ఓటరు జాబితాను సైతం అందుబాటులో ఉంచాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వివరాలను ఎప్పటికప్పుడు టీపోల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. స్వతంత్రులకు గుర్తులు చూపించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్రూం పరిశీలన.. కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెబ్బేరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విశాలమైన ప్రాంతంలో సులువుగా అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్రూమ్ను స్వయంగా పరిశీలించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ రాంబాబు, కొత్తకోట ఎంపీడీఓ వినిత్, పుర కమిషనర్ సైదయ్య, పెబ్బేరు తహసీల్దార్ మురళీగౌడ్, పుర కమిషనర్ ఖాజా ఆరీఫోద్దీన్ రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
పుర ఎన్నికల్లో ఆర్వోలే కీలకం
వనపర్తిటౌన్: పుర ఎన్నికల నిర్వహణలో కీలకమైన నామినేషన్ల పత్రాల పరిశీలన విధానాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసింది. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా నామినేషన్ల స్వీకరణ నుంచి విజేతలకు ధ్రువపత్రాల ఽజారీ వరకు అన్నింటిని చూసుకునే పుర కమిషనర్లకు ఎన్నికల నిర్వహణ భారాన్ని తప్పిస్తూ రిటర్నింగ్ అధికారులకు బాధ్యతలు కట్టబెట్టింది. ఈసారి పుర ఎన్నికలకు గెజిటెడ్ హోదా ఉన్న అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. మున్సిపాల్టీకి రిటర్నింగ్ అధికారి ఒక్కరుంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు వార్డులకు ఒకరు బాధ్యతలు నిర్వర్తించేలా నియమించింది. దీంతో ఎన్నికల ప్రక్రియలో వేగం పెరగడంతో పాటు ఆయా వార్డులకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. దీనికితోడు ప్రతి రిటర్నింగ్ అధికారికి మరో సహాయ రిటర్నింగ్ అధికారిని సైతం నియమించారు. ఎన్నికల ఫలితాలు సైతం ఆయా వార్డుల ఆర్వోలే ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. ఏదేని పురపాలికలో ఒక్క వార్డు ఎక్కువైతే ఒక అధికారికి అదనంగా కేటాయించారు. తక్కువైతే రెండింటికే పరిమితం చేస్తారు. అంతేగాకుండా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో రిజర్వ్ అధికారులను సైతం నియమించారు. పెరగనున్న పరిశీలన.. పుర ఎన్నికల్లో నామినేషన్ పత్రాల పరిశీలన సుశితంగా ఉండనుంది. ఏ చిన్న పొరపాటు గుర్తించినా తిరస్కరిస్తారు. నామినేషన్ పత్రాల ఆమోదానికి అభ్యర్థులు పొందుపర్చిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏ చిన్న తప్పు జరిగినా అధికారిదే బాధ్యత. పురపాలికల వారీగా సిబ్బంది కేటాయింపు ఇలా.. మున్సిపాలిటీ ఆర్వోలు ఏఆర్వోలు రిజర్వ్ రిజర్వ్ ఆర్వోలు ఏఆర్వోలు వనపర్తి 11 11 2 2 కొత్తకోట 5 5 2 2 పెబ్బేరు 4 4 2 2 ఆత్మకూర్ 4 4 1 1 అమరచింత 4 4 1 1 నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ధ్రువీకరణ పత్రాల జారీ వరకు వారిదే బాధ్యత నామినేషన్ల పరిశీలన సరళీకృతం అభ్యర్థులకు తప్పనున్న అనుమానాలు -
ఎట్లైనా పోరుబాట..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి డివిజన్లు/వార్డుల వారీగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. బీఫాంలు ఎవరికి ఇస్తారనేది తేలలేదు. నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. ప్రధానంగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ అనిశ్చితి నెలకొంది. టికెట్పై మీమాంస కొనసాగుతుండగా.. పలువురు ఆశావహులు ప్లాన్–ఏ లేదంటే ప్లాన్–బీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనా బరిలో నిలిచే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే పార్టీ మార్పు లేదంటే స్వతంత్రంగానైనా రంగంలోకి దిగేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ వైపు చూపులు.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్ ఖరారు కాని పక్షంలో పలువురు పార్టీ మారి.. బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ఎక్కువ శాతం స్వతంత్రంగా పోటీలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన వారు మాత్రం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి డీకే అరుణ గెలుపొందగా.. అప్పుడు నగర పరిధిలో ఆ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ ఎన్నికలను కమలం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే 43 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే 17 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిలువరించేందుకేనా.. అధికార కాంగ్రెస్లో భారీగా ఆశావహులు ఉండడం ఆ పార్టీ ముఖ్య నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. జీపీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచినప్పటికీ.. బీఆర్ఎస్ సత్తా చాటింది. కొన్ని చోట్ల తక్కువ ఓట్లతోనే ఇతర అభ్యర్థులు గెలుపొందారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెబల్స్ను నిలువరించేందుకు ఆయన ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పలు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పొత్తులకు తెరలేపాయి. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి జిల్లాలోని అమరచింతతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర పురపాలికలో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరుదామనుకున్నా అడ్డుకోవడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఓ నాయకుడు తన భార్యను చైర్మన్గా చేయాలనే లక్ష్యంతో పావులు కదిపినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచేలా స్కెచ్ వేయడంతో పాటు బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ నారాయణపేటలో ఎంఐఎం, అమరచింతలో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకునేలా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఇదే రోజు ప్రధాన పార్టీలు డివిజన్లు/వార్డుల వారీగా తమ తమ కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. కొన్ని ఉదాహరణలు.. కాంగ్రెస్కు సంబంధించి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా అన్ని డివిజన్లలో కార్పొరేటర్ కోసం ఇద్దరికి మించి పోటీపడుతున్నారు. ఒకటో డివిజన్లో 19 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ డివిజన్లో ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో డివిజన్కు ముగ్గురు నామినేషన్లు వేశారు. 39వ డివిజన్లో ముఖ్య నాయకులు ఇద్దరు నామినేషన్లు వేయడం పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. కార్పొరేషన్లోని 52వ డివిజన్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకుడైన మాజీ కౌన్సిలర్ ఒకరు పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన బీజేపీ వైపు అడుగుల వేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆ డివిజన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది. భారీగా ఆశావహులతో అనిశ్చితి.. తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పదవులకు పోటీ చేయాలని అనుకుంటున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ రెండు పర్యాయాలు, బీఆర్ఎస్ ఒకసారి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంగ్రెలో తొలుత 376, ఆ తర్వాత 292 దరఖాస్తులు రాగా.. బీఆర్ఎస్లో 440 మంది వరకు అర్జీ పెట్టుకున్నారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులతో ఆయా పార్టీల్లో అభ్యర్ధిత్వాల ఖరారుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో రెబల్స్ ప్రభావం లేకుండా పార్టీల ముఖ్యులు ఆయా వ్యక్తులతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అభ్యర్థుల ఫైనల్ జాబితా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. -
రెండోరోజు 239 నామినేషన్లు దాఖలు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండోరోజు గురువారం ఊపందుకుంది. జిల్లాలోని ఐదు పురపాలికల్లో మొత్తం 239 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా వనపర్తి పురపాలికలో 108 నామినేషన్ పత్రాలను వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. అభ్యర్థులు ఆయా వార్డుల నుంచి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్లు పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ 38, బీజేపీ 19, బీఆర్ఎస్ 31, సీపీఎం 2, సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థులు 17 మంది నామినేషన్లు వేశారు. పెబ్బేరులో.. వనపర్తి రూరల్: పెబ్బేరులోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో గురువారం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపి నుంచి 9, కాంగ్రెస్పార్టీ పార్టీ 11, బీఆర్ఎస్ పార్టీ నుంచి 7, బీఎస్పీ నుంచి ఒకరు, టీజీఎస్ఈసీ నుంచి 3, ఇండిపెండెంట్గా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారని పుర కమిషనర్ ఖాజా ఆరీఫుద్దీన్ వివరించారు. ఆత్మకూర్లో 36 మంది.. ఆత్మకూర్: పుర పరిధిలోని 10 వార్డులకుగాను గురువారం కాంగ్రెస్పార్టీ తరుఫున 16 మంది, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఏడుగురు, స్వతంత్రులు ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇదివరకు 36 నామినేషన్లు దాఖలైనట్లు పుర కమిషనర్ చికినె శశిధర్ తెలిపారు. అమరచింతలో 32.. అమరచింత: పుర ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండోరోజు గురువారం జోరందుకుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రాత్రి 7.30 వరకు కొనసాగింది. సాయంత్రం 5 వరకు క్యూలో నిల్చున్న అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించడానికి సమయం పట్టిందని పుర కమిషనర్ తెలిపారు. కాగా గురువారం బీజేపీ నుంచి 9 మంది, సీపీఐ(ఎం) నుండి 4, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఐదుగురు, స్వత్రంత్రులు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కొత్తకోటలో.. కొత్తకోట రూరల్: కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో గురువారం 35 నామినేషన్లు దాఖలైనట్లు పుర కమిషనర్ సైదయ్య తెలిపారు. కాంగ్రెస్ నుంచి 12, బీఆర్ఎస్ నుంచి 13, బీజేపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, టీఆర్పీ నుంచి ఒకరు, స్వతంత్రులు నలుగురు నామినేషన్లు వేశారు. -
జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు
పాన్గల్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని.. రైతులు ఆందోళన చెందవద్దని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి దామోదర్గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూరియా పంపిణీపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, అవసరం ఉన్న రైతులే తీసుకోవాలని సూచించారు. గురువారం ఒక్కరోజే 1,650 బస్తాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు పంపిణీ చేసిన వివరాలను ఆయన పరిశీలి ంచారు. కార్యక్రమంలో ఏఓ మణిచందర్, సింగిల్విండో అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆన్లైన్లోనే యూరియా బుకింగ్.. కొత్తకోట రూరల్: వానాకాలంలో యూరియా కొరత, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సాగుకుగాను బుకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి, కొత్తకోట ఏడీఏ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని.. ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లా రైతులు సమీప ఫర్టిలైజర్ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుసుకొని ఫోన్నంబర్, పట్టాదారు పాసు పుస్తకం ఉపయోగించి బుక్ చేసుకోగలరని సూచించారు. ఏమైనా సందేహాలుంటే ఏఈఓలు లేదా ఏఓలను సంప్రదించాలన్నారు. -
కాంగ్రెస్పై తిరుగుబాటు మొదలైంది
వనపర్తిటౌన్: కాంగ్రెస్పార్టీ అబద్ధాల వైపు కాకుండా నిజమైన అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు నిలబడాలని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని మాజీ నిరంజన్రెడ్డి నివాసంలో ఆయనతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు పునాదులు, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని తెలిపారు. మహిళ నుంచి మొదలు అన్నివర్గాల ప్రజలు పుర ఎన్నికల వేధికగా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నిరంజన్రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి.. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విడతల వారీగా అమలు చేస్తామని చెప్పి నేటికీ నెరవేర్చడం లేదన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అభిప్రాయాపడ్డారు. పుర ఎన్నికల్లో లబ్ధికే సిట్ నోటీసులు.. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ది భయపడే నైజం కాదని.. బరి గీసి కొట్లాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబులాంటి నాయకులే తెలంగాణవాదాన్ని అణిచివేసేందుకు, ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీసేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొన్నారని వివరించారు. ఆయన కంటే సీఎం రేవంత్రెడ్డి మించినోడు కాదని.. కేసీఆర్ స్థాయిని పలుచన చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చిల్లర రాజకీయాలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి సానుకూలత ఉందని, కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందని తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ -
ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి
వనపర్తి: పుర ఎన్నికల ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచార సామగ్రి అయిన వాల్పోస్టర్లు, కరపత్రాల్లో కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలన్నారు. పబ్లిషర్ నుంచి ఫారం–ఏలో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఏ, బీతో పాటు ముద్రించిన రెండు కరపత్రాలను జతపర్చి కలెక్టరేట్కు పంపించాలన్నారు. ముద్రించిన కరపత్రం లేదా గోడపత్రికపై ప్రింటింగ్ప్రెస్ పేరు, చిరునామా కచ్చితంగా పేర్కొనాలని, అంతేగాకుండా పబ్లిషర్ పేరు ఫోన్నంబర్ ముద్రించాలని సూచించారు. ఎన్ని పేజీలు ముద్రించారు.. అందుకు తీసుకున్న డబ్బులు ఎన్ని అనే వివరాలు ఫారం–బిలో చూయించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పురం పిరం..!
పురపాలికల్లో ఇదే రాజ‘కీ’యం ● ఆర్థిక స్థోమత ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ● కౌన్సిలర్/కార్పొరేటర్ నుంచి చైర్మన్/మేయర్ వరకూ.. ● ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు.. అన్ని పార్టీలదీ ఇదే దారి ● కర్ణాటక సరిహద్దు జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి భలే గిరాకీ ● చైర్మన్ గిరికి పలికిన ధర సుమారు రూ.5 కోట్లు? ● ఎన్హెచ్పై ఉన్న మరో దాంట్లో ఆర్థిక బలమే పరమావధిగా.. -
మొదటిరోజు 34 నామినేషన్లు
● వనపర్తిలో అత్యధికం.. అమరచింతలో నిల్ వనపర్తిటౌన్: జిల్లాలోని ఐదు పురపాలికల్లో బుధవారం మొదటిరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పుర కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్లో మొత్తం 34 నామినేషన్లు రాగా.. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్పార్టీ నుంచి 16 మంది, బీఆర్ఎస్ నుంచి 8 మంది, బీజేపీ, స్వతంత్రంగా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అమరచింత మున్సిపాలిటీలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పెబ్బేరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు దూరంగా ఉండగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి 6వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. ● కొత్తకోటలోని 1 వార్డులో 2, 7వ వార్డులో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా వార్డుల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కొక్క నామినేషన్ వేశారు. ● ఆత్మకూర్లో 4 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ నుంచి 3, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ ఉన్నాయి. ● వనపర్తి మున్సిపాలిటీలో 25 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ నుంచి 11, బీఆర్ఎస్ నుంచి 6, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల నుంచి నాలుగేసి నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. 1, 2, 6, 7, 9, 10, 12, 13, 18, 21, 23, 26, 27, 28, 33వ వార్డులో ఒక్కో నామినేషన్, 16, 24, 25వ వార్డుల్లో రెండేసి నామినేషన్లు, 14వ వార్డులో నలుగురు నామినేషన్లు వేశారు. 14వ వార్డులో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్.. జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను బుధవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనల ప్రకారం కొనసాగించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్డెస్క్ ఏర్పాటు, నమూనా నామినేషన్ పత్రాలు, ఓటరు జాబితా అందుబాటులో ఉంచడం తదితర సౌకర్యాలు కల్పించడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చిన నామినేషన్లను ఎప్పటికప్పుడు స్కాన్చేసి టీపోల్ యాప్లో అప్లోడ్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలని, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగించాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎన్.వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్, అదనపు కలెక్టర్ యాదయ్య, సిబ్బంది ఉన్నారు. పురపాలికల వారీగా దాఖలైన నామినేషన్లు.. మున్సిపాలిటీ నామినేషన్ల సంఖ్య వనపర్తి 25 కొత్తకోట 4 ఆత్మకూర్ 4 పెబ్బేర్ 1 అమరచింత – -
నోడల్ అధికారుల పాత్ర కీలకం
వనపర్తి: మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నికల నోడల్ అధికారుల సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని, కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా పాటించేలా డీఆర్డీఓ ఉమాదేవి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ అనంతరం వాటిని పోలీసు రక్షణలో తీసుకొచ్చే బాధ్యతను మత్స్యశాఖ అధికారి లక్ష్మప్పకు అప్పగించారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన విభాగాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిబంధనలను క్షుణ్ణంగా చదవాలని, ఏవైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి సకాలంలో ఉత్తర్వులు అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఎఫ్ఎన్టీ, ఎస్ఎస్టీ బృందాలకు వాహనాలతో పాటు ఎన్నికల సామగ్రి తరలించేందుకు కావాల్సిన రవాణా సౌకర్యాలను సమకూర్చాలని జిల్లా రవాణాశాఖ అధికారికి సూచించారు. అదేవిధంగా నోడల్ అధికారులు తమ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ సంబంధిత చిహ్నాలు, పోస్టర్లు తొలగించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్, డీపీఆర్ఓ సీతారాం, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, డీటీఓ మానస తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉండాలి పుర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని.. రాజకీయ పార్టీల ప్రతినిధులు నియమావళి, నిబంధనలకు కట్టుబడి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు ముందస్తుగా తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని, సంబంధిత రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకునే నాటి వరకు ఫారం–బి సమర్పించేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
ఆత్మకూర్: బీఆర్ఎస్ హయాంలో ప్రజాప్రతినిధులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చూసి పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. బుధవారం రాత్రి మంత్రి నివాసంలో స్థానిక పురపాలికకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు దండు శ్రీను ఆధ్వర్యంలో పలువురు మంత్రి సమక్షంలో కాంగ్రెస్పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలకులు ఆత్మకూర్కు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 300 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. అలాగే రూ.3.14 కోట్లతో చెరువుకట్ట విస్తరణ, సుందరీకరణ పనులతో పాటు రూ.15 కోట్లతో వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, రూ.123 కోట్లతో కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పుర ఎన్నికల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, మరింత అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గంగాధర్గౌడ్, పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, భాస్కర్, దామోదర్, మహేష్, సాయిరాఘవ, షాలం, జుబేర్, కరణ్లాల్, జహంగీర్, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : ఎమ్మెల్యే
వనపర్తి టౌన్/రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో పట్టణంలోని 30వ వార్డు సాయినగర్కాలనీ, ఐజానగర్కాలనీ, జంగిడిపురం, నందిహిల్స్ నుంచి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో 60 మంది, శ్రీరంగాపురం మండలం తాటిపాముల ఉపసర్పంచ్ కుర్మయ్యతో పాటు 60 మంది, పెబ్బేరుకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నేత ఐజాక్తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి సమక్షంలో కాంగ్రెస్పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సరైన సమయంలో పార్టీలో చేరడం శుభ పరిణామన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పదవుల్లో ఉన్నమే తప్ప ఎలాంటి గౌరవ మర్యా దలు దక్కలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వాటికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. -
వెంకటేశ.. నమోస్తుతే...
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర గ్రామం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. -
రోడ్డు భద్రత.. మహిళా సంఘాల బాధ్యత
కొత్తకోట రూరల్: గ్రామస్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని.. తమ కుటుంబాలతో పాటు సమాజాన్ని కూడా ప్రమాదాల నుంచి రక్షించాలని ఎస్పీ సునీతరెడ్డి కోరారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అలైవ్.. అరైవ్’ కార్యక్రమంలో భాగంగా 10వ రోజు మంగళవారం ఉదయం పెద్దమందడిలోని రైతువేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలు, విలేకర్లకు ‘అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుటుంబంలోని భర్త, పిల్లలు, అన్నాదమ్ములు సురక్షితంగా ఇంటికి చేరాలంటే మహిళలు వారికి హెల్మెట్ వినియోగంపై నిరంతరం గుర్తుచేయాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, అది చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా కుటుంబ ప్రాణాలను కాపాడే భద్రతా కవచమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. అనంతరం అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ సహకారంతో 65 హెల్మెట్లను పాత్రికేయులు, పోలీసు సిబ్బంది, మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంవీఐ సైదులు, కొత్తకోట సీఐ రాంబాబు, పెద్దమందడి ఎస్ఐ జలంధర్రెడ్డి, అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ నిర్వాహకులు, సర్పంచ్ గంగమ్మ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఐదురోజుల పని విధానం అమలు చేయాలి
వనపర్తిటౌన్: ఐబీసీ ప్రతిపాదించిన వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌక్లో ఉన్న ఎస్బీఎన్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదురోజుల పని విధానం అమలుచేస్తే రోజు 40 నిమిషాలు అదనంగా ఖాతాదారులకు సేవలందించ వచ్చన్నారు. అంతకుముందు బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూఎఫ్బీయూ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
పీఎఫ్తో కార్మికులకు ప్రయోజనం
అమరచింత: కంపెనీల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని హైదరాబాద్ పీఎఫ్ కార్యాలయ అధికారి రుధీర్రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘాన్ని సందర్శించిన ఆయన కార్మికులతో సమావేశమై ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన, ఎంప్లాయి ఎన్రోల్మెంట్ కాంపెయిన్ గురించి అవగాహన కల్పించారు. కంపెనీ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. యాజమాన్యం ప్రతి కార్మికుడు, ఉద్యోగికి పీఎఫ్, ఇన్సూరెన్స్, పింఛన్ అందేలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో కంపెనీ సీఈఓ ఎం.చంద్రశేఖర్, కంపెనీ డైరెక్టర్ పొబ్బతి అశోక్, సిబ్బంది మహేష్తో తదితరులు పాల్గొన్నారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు పాన్గల్: రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామని ఓ పక్క అధికారులు చెబుతుండగా.. మరోపక్క తమకు అందడం లేదని మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉదయం వచ్చి వరుసలో నిలబడి ఆధార్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ అందజేసినా యూరియా అందకపోవడంతో ఆగ్రహించిన వివిధ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం సింగిల్విండో అధికారులను పిలిపించి జిరాక్స్ ప్రతులు అందజేసిన వారికి పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించి సింగిల్విండో కార్యాలయానికి చేరుకున్నారు. పుర కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా కొత్తకోట: బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలంటూ స్థానిక పుర కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నిక్సన్ మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు చెల్లించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏడాదిగా పీఎఫ్ డబ్బులు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, కార్మికుల చదువు, వృత్తి నైపుణ్యాలను గుర్తించి జవాన్లు, డ్రైవర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం, పండుగ రోజుల్లో సెలవులు ఇవ్వాలని, పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలని కోరారు. ఫిబ్రవరి 12న జరగనున్న ఒకరోజు సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జె.ఎర్రన్న, కొండన్న, బాలస్వామి, రమేష్, పెద్దరాజు, ఎర రాజు, శిరీష, సుశీల, మణెమ్మ, సుగుణమ్మ, నయోమి తదితరులు పాల్గొన్నారు. -
ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్నగర్లోని జడ్చర్ల, నాగర్కర్నూల్లోని అచ్చంపేట పురపాలికల పాలక వర్గాల పదవీ కాలం మే నెలలో ముగియనుంది. ఇవి పోనూ మిగిలిన 19 (ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలు) వాటిలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ఇదే జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న దేవరకద్ర, నారాయణపేట జిల్లాలో మద్దూర్ మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ మూడు పురపాలికల్లోనూ తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. -
పుర ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు
వనపర్తి: పురపాలిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ సునీతారెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 80 వార్డులకుగాను 6 ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. పోలీస్శాఖ సహకారంతో ఈసీ నిబంధనల మేరకు అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల నియమావళి అమలులోకి.. పుర ఎన్నికల ప్రకటన వెలువడటంతో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, అధికారులు నిష్పాక్షికంగా నిబంధనలకు లోబడి పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పుర ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం పుర కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సిబ్బందితో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురపాలికల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు, సిబ్బంది ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు, ఇతర రాజకీయ చిహ్నాలను 24 గంటల్లోగా, బహిరంగ ప్రదేశాల్లోని రాజకీయ పోస్టర్లు, కటౌట్లను 48 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. తదుపరి 24 గంటల్లో ప్రైవేట్ ప్రదేశాల్లోని రాజకీయ సంబంధిత ఫ్లెక్సీలు తీసివేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు బుధవారం ఉదయం 10.30 లోగా తమ వార్డులకు సంబంధించి ఫారం–1 ఎన్నికల నోటీస్, ఓటరు జాబితాను పబ్లిష్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఓటరు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికీ అనుకూలంగా వ్యవహరించొద్దని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన రిపోర్టులను వేగంగా టీ–పోల్ యాప్లో అప్లోడ్ చేసేలా ఆపరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. రోజువారీ నివేదికలను ఎప్పటికప్పుడు పంపించేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎల్పీఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్రెడ్డి, సీపీఓ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ తూట్లు
● పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ● శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ వనపర్తిటౌన్: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో పని చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్, పుర ఎన్నికల ఇన్చార్జ్ స్వామిగౌడ్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రమేష్గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆంధ్ర పాలకుల తొత్తుగా మారి తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పుర ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని, టికెట్ రాలేదని నిరాశ చెందకుండా అవకాశం కోసం వేచి ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి, తీవ్ర వ్యతిరేకత ఉందని.. పుర ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారాని తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. హస్తానికి ప్రజల అండ లేదని, మున్సిపల్ ఎన్నికలతో హస్తం అస్తమిస్తోందని జోస్యం చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అంతర్గత సర్వే నిర్వహిస్తోందని, విశ్వాసం, విధేయత, కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకే అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. టికెట్ పొందిన అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్కు మన తరఫున బహుమతి ఇద్దామని ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు జిల్లాకేంద్రం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కె.మాణిక్యం, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
ఆత్మకూర్: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను కై వసం చేసుకొని సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మంత్రి నివాసంలో ఆత్మకూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు మంత్రి సమక్షంలో హస్తం గూటికి చేరగా.. ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆత్మకూర్లో రూ. 3.14కోట్లతో చెరువుకట్ట సుందరీకరణ, వార్డుల్లో రూ. 15కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలు రూ. 123 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని.. మరింత రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేశ్, తులసీరాజ్, నల్లగొండ శ్రీను, కుర్ని రవికాంత్, సద్దల వెంకట్రాములు, దామోదర్, మహేశ్, అశోక్, సాయిరాఘవ, షాలం, జూబేర్, కరణ్లాల్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఊసే లేదు
వనపర్తిటౌన్: కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 25 నెలలు అవుతున్నా అభివృద్ధి ఊసే లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలన మధ్య భేదం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి.. అభివృద్ధి బీఆర్ఎస్ అనే స్థాయిలో జిల్లాను అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి ఊసెత్తని కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణ ప్రజల దశాబ్దాల కల రోడ్ల విస్తరణ, జిల్లాకేంద్రంగా ఏర్పాటు, పార్కుల సుందరీకరణ, చెరువుల ఆధునీకరణతో అన్నివిధాలా అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుత పాలకులు గాలి మాటలు మాట్లాడకుండా, గద్దెనెక్కేందుకు ఇచ్చిన హమీలను అమలుచేసి చూపించాలన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి స్వామిగౌడ్ జిల్లా కేంద్రానికి వస్తున్నారని.. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
భక్తుల ఇంటికే బంగారం..
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు అటూ ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా పార్సింగ్, కొరియర్ సేవలు అందజేస్తోంది. దీంతో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో రాఖీ పండుగ సందర్భంగా దూరంగా ఉన్న సోదరీ మణులు రాఖీలను తమ సోదరులకు పంపించేలా కొరియర్ సేవలు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందజేశారు. ● ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే అందజేసేలా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం సమ్మక్క–సారక్క జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవార్ల ప్రసాదాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299తో బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందజేస్తారు. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయనున్నారు. రీజియన్లోని పది డిపోల పరిధిలోని లాజిస్టిక్ కేంద్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమ్యాయి. భక్తులు www.tsrrtclogistics. co.in వెబ్సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ మేడారం ప్రసాదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆర్టీసీ వినూత్న కార్యక్రమం రూ.299తో బుకింగ్ చేసుకుంటే చాలు.. ప్రసాదంతో పాటు దేవతల ఫొటో, పసుపు, కుంకుమ వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం -
మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలి
దేవరకద్ర: మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయని, పార్టీపరంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు అందరు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. పార్టీ టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని వారిని పార్టీ ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తుందన్నారు. టికెట్ రాని వారు నిరాశకు గురి కాకుండా పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తామని, అలాగే వార్డుల వారీగా సర్వేలు చేసి, అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి అందరూ ఐక్యమత్యంగా పని చేయాలని కోరారు. సమావేశంలో నాయకుల లక్ష్మీకాంత్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, బాలస్వామి, అంజన్కుమార్రెడ్డి, వెంకటేశ్, వేణుగోపాల్రెడ్డి, ఫారూఖ్, ఆదిహన్మంతరెడ్డి, శంకర్, శ్రీనివాస్రెడ్డి, బాల్రాజు, చెన్నయ్య, రాము, రాములు, చంద్రమౌలి, బుచ్చన్న, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధికి పాటుపడాలి
కొల్లాపూర్: స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాణకర్తల త్యాగాలు, విశేష కృషి ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు వనపర్తి రూరల్: జిల్లా మహిళా శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం పెబ్బేరు పట్టణంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దివ్యాంగులకు స్కూటీలు, ల్యాప్టాప్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 11వ వార్డు నాగులకుంటలో అమృత్ స్కీమ్ కింద రూ. 3.14 కోట్లతో పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అంతకుముందు పెద్దగూడెం తండాలో రూ.20లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్నాయక్, రవికిరణ్, మధుసూదన్రెడ్డి, ఎత్తంరవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, వైస్చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, దయాకర్రెడ్డి, రంజిత్కుమార్, భానుప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. నేడు అండర్–16 క్రికెట్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్కార్డు, ఎస్ఎస్సీ మెమో, జననఽ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, రెండు ఫొటోలతో మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికయ్యే ఉమ్మడి జిల్లా జట్టు ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో ప్రారంభమయ్యే హెచ్సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. -
ఇంటింటా సంక్షేమం
జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు ● అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం ● కలెక్టర్ ఆదర్శ్ సురభి ● ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు ‘‘జిల్లాలో అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా.. ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్య, వైద్యం అందించడం.. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను అందరూ గౌరవించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరం పునరంకితమవుదాం.’’ – కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్పీ డి.సునీతారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డిలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. జిల్లాలో రూ. 126.34కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. 85,237 మందికి రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు వివరించారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మండల మహిళా సమాఖ్యల ద్వారా 10 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వగా.. ప్రతినెలా దాదాపు రూ. 69వేల చొప్పున ఆదాయం లభిస్తుందన్నారు. అమరచింత, వనపర్తి మండలాలకు ‘కుసుమ్ ప్రాజెక్టు‘ ద్వారా 2 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంట్లు మంజూరైనట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో పెట్రోల్బంక్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎకరా స్థలం కేటాయించిందన్నారు. రూ. 5కోట్లతో చేపట్టిన జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలోని 1,22,472 మంది మహిళా సంఘ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో 22,051 మందికి ఉచితంగా చికిత్సలు అందించేందుకు రూ. 57.37 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గృహజ్యోతి పథకంతో 83,882 మందికి జీరో బిల్లులు జారీ చేసి.. రూ.41.7 కోట్ల సబ్సిడీని అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతుందన్నారు. జిల్లాలో 6,047 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా.. 73 శాతం నిర్మాణాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 51 గృహాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని.. లబ్ధిదారులకు రూ. 81.71 కోట్ల బిల్లులు చెల్లించినట్లు కలెక్టర్ వివరించారు. చేయూత పథకంతో 70,909 మందికి ప్రతినెలా రూ. 17.61 కోట్ల పింఛన్లు అందిస్తున్నామన్నారు. పంట రుణమాఫీ పథకం కింద జిల్లాలో మొత్తం 60,545 మంది రైతులకు రూ. 480.91 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పథకంతో 245 మంది నామినీల బ్యాంకు ఖాతాల్లో రూ. 12.25కోట్లు జమ చేసినట్లు వివరించారు. రైతుభరోసా పథకంతో వానాకాలం 2025 సీజన్లో 1.75 లక్షల మంది రైతులకు రూ. 205.93 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందన్నారు. 2025–26 సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరిధాన్యం విక్రయించిన 30వేల మంది రైతులకు రూ.76.18 కోట్ల బోనస్ చెల్లించినట్లు తెలిపారు. వానాకాలంలో 395 కేంద్రాల ద్వారా 2.86 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 1,80,857 రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 10,847 కొత్త రేషన్ కార్డులతో పాటు 66,929 మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డుల్లో చేర్చడం జరిగిందన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ద్వారా 1.70లక్షల టీబీ అనుమానిత కేసులను గుర్తించగా.. వారిలో 339 మందిని నోటిఫై చేయడం జరిగిందన్నారు. వీరికి సీఎస్ఆర్ ద్వారా పోషణ కిట్లు, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా మిషన్ మధుమేహ ద్వారా గతేడాది 19,643 మంది బాధితులను గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ. 47.50 కోట్లతో చేపట్టిన వనపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలుర), జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నా యన్నారు. 2025–26 సంవత్సరానికి గాను పీఎంశ్రీ ర్యాంకింగ్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించిందన్నారు. -
చిన్నారులను మింగిన పాంపాండ్
● నీటిలో పడిన బంతి తీసేందుకు వెళ్లి ముగ్గురు మృతి ● త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ మరో బాలిక ● నాగర్కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లిలో విషాదం తల్లిదండ్రులతో కలిసి సరదాగా సొంతూరికి వచ్చిన చిన్నారులు వ్యవసాయ పొలంలో ఆడుకునేందుకు వెళ్లి విగత జీవులుగా మారారు. ఉదయం నుంచి హుషారుగా కేరింతలు కొడుతూ.. సెల్ఫీలు దిగుతూ.. ఆడుకున్న ఆ చిన్నారుల ఆనందం ఊహించని ఘటనతో ఆవిరైపోయింది. పాంపాండులో పడిన బంతి తీసుకునేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యుఒడికి చేరిన విషాదకర ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో చోటుచేసుకుంది. కల్వకుర్తి టౌన్/ ఊర్కొండ: ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి, రజని దంపతుల సంతానం మాదు సిరి(14), మాదు శ్రీమన్యు(12), రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రావిర్యాల గ్రామానికి చెందిన అతని సోదరి చంద్రకళ కూతురు స్నేహ(15), అదే గ్రామానికి చెందిన అతని అన్న వేణుగోపాల్రెడ్డి కూతురు విద్యాధరణి కలిసి వేణుగోపాల్రెడ్డి పొలంలో ఉదయం నుంచి సరదాగా ఆడుకున్నారు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేశాక వేణుగోపాల్రెడ్డి పొలంలో ఉన్న పాంపాండ్ వద్ద బంతితో సరదాగా ఆడుకుంటుండగా అందులో పడిపోయింది. దీంతో పాంపాండులో బంతిని తీసుకునేందుకు ముందుగా శ్రీమన్యు వెళ్లగా.. అతనికి ఈత రాక మునిగిపోవడంతో అక్క మాదు సిరి చూసి తమ్ముడిని కాపాడేందుకు వెళ్లింది. ఇద్దరూ గుంతలో మునిగిపోతున్నారని గమనించిన స్నేహ సైతం వారి ని రక్షించాలని గుంతలో దిగగా ముగ్గురికి ఈత రాకపోవడం, పాంపాండు లోతుగా ఉండటంతో అక్కడే ఉన్న మరో చిన్నారి విద్యాధరణి గమనించి పాంపాండులోకి దిగుతూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే శ్రీకాంత్రెడ్డి ఈత రాకపోయినా తన కాలుకు తాడు కట్టుకొని గుంతలోకి వెళ్లి విద్యాధరణిని బయటకు తీశాడు. మళ్లీ గుంతలోకి వెళ్లేసరికి ముగ్గురు చిన్నారు లు అప్పటికే పాంపాండులో బురదనీటిని మింగడంతో మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ఊర్కొ ండ ఎస్ఐ కృష్ణదేవరాయ ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు చిన్నారులను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిన్నారుల తల్లి రజని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు. ఈ జీవితం మాకు వద్దు.. కళ్లెదుటే తమ ఇద్దరు సంతానం విగత జీవులుగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు మా పిల్లలు లేని ఈ జీవితం మాకు వద్దు అని బోరున విలపించారు. మా పిల్లలు చనిపోయిన ఈ గుంతలోనే మేం కూడా చనిపోతామని అనడంతో స్థానికులు వారిని ఓదార్చారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా.. నాయకులు, గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే పరామర్శ ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పరామర్శించారు. ఒకే కుటుంబంలోని చిన్నారులను కోల్పోవడం దురదృష్టకరణమన్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఆయన చిన్నారుల మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెట్టును పట్టుకోవడంతో బతికాను మేము నలుగురం కలిసి ఆడుకునేందుకు పొలం వద్దకు వెళ్లాం. బంతి ఆట ఆడుకుంటూ గుంతలోకి వెళ్లడంతో సిరి, శ్రీమన్యు, స్నేహ మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చుట్టుపక్కల వాళ్లను మా బాబాయి శ్రీకాంత్రెడ్డి పిలిచారు. మా బాబాయి నన్ను అక్కడే ఉన్న చెట్టు పట్టుకోమని చెప్పడంతో నేను బతికిపోయాను. బాబాయి పిలిచిన వారంతా గుంత వద్దకు వచ్చే సరికి ఆ ముగ్గురూ నీటి లోపలికి మునిగిపోయారు. – విద్యాధరణి, ప్రాణాలతో బయటపడిన బాలిక -
అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు
● అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని.. నవసమాజ నిర్మాణానికి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిజిటల్ ప్లాట్ఫారమ్స్ ద్వారా కూడా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. అందులో సగానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. మహిళలు ఓటింగ్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆయన అభినందించారు. మై ఇండియా మై ఓటు అనే ఇతివృత్తంతో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఓటరు జాబితా తయారీ, ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. అదే విధంగా కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లను సన్మానించారు. అంతకుముందు, ఓటర్లలో అవగాహన కల్పించేందుకు మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాల నుంచి ఐడీఓసీ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించే గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరేడ్ నిర్వహణ, అతిథుల సీటింగ్, జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేశ్రెడ్డి, డీపీఆర్ఓ సీతారాం, సీఐ కేఎస్.రత్నం, ఎస్ఐ హరిప్రసాద్ ఉన్నారు. -
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మండలం వడ్డెవాట, భూత్కూర్, నాటవెళ్లి పెద్దతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామస్థాయిలో మహిళల ఆర్థికాభివృద్ధికి మహిళా సమాఖ్య భవనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం వడ్డెవాటలో రెడ్డి అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వడ్డేవాటకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరగా.. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, పి.కృష్ణారెడ్డి, బోయేజ్, భానుప్రకాశ్రెడ్డి, సర్పంచులు మండ్ల రాములు, బంగారయ్య, పాండునాయక్ పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలకు ముస్తాబు
విద్యుత్ దీపాల వెలుగులో కలెక్టరేట్ వనపర్తి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశభక్తి ఉట్టిపేడలా మువ్వన్నెల జెండావిష్కరణ, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలతో పాటు పోలీస్ కవాతు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు జాబితా సిద్ధంచేశారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించేందుకు ఏర్పాటుచేసే ప్రత్యేక స్టాల్స్, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూర్చొని వేడుకలు తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోలీసు కవాతు నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ సందేశం, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, సాంస్కృతిక పదర్శనలు, ప్రభుత్వశాఖల స్టాళ్ల సందర్శన, ప్రశంసా పత్రాల పంపిణీ చేయనున్నారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
వడ్డీ సొమ్ము వాపస్..
మహిళా సంఘాలకు చేయూత ● వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం ● ప్రతినెలా బ్యాంకు కంతులు చెల్లించే వారికి ప్రాధాన్యత ● జిల్లాలో 956 సంఘాలకు లబ్ధి ●డబ్బులు వచ్చాయి. బ్యాంకు ద్వారా తీసుకు న్న రుణం క్రమం త ప్పకుండా తిరిగి చెల్లించ డంతో తమ సంఘానికి వడ్డీ డబ్బులు వచ్చాయి. మొత్తం రూ. 6,920 బ్యాంకు ఖాతాలో జమ కావడం సంతోషంగా ఉంది. గతంలో వడ్డీ ఇస్తామని ఆశ చూపారే తప్ప చెల్లించలేదు. – భాగ్యమ్మ, గణపతి మహిళా సంఘం, అమరచింత సంతోషంగా ఉంది.. వడ్డీ లేని రుణాలు ఇస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతినెలా ఎంతో ప్రయాసతో అనుకున్న సమయానికి బ్యాంకు అప్పు తీరుస్తున్నాం. తమ సంఘానికి ప్రభుత్వం రూ. 5,600 వడ్డీ చెల్లించింది. వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – సునీత, మధూరి మహిళా సంఘం, అమరచింత క్రమం తప్పకుండా చెల్లించిన వారికే.. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించిన మహిళా సంఘాలకు మాత్రమే పావలా వడ్డీ వర్తిస్తుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బ్యాంకు రుణాలను రెగ్యులర్గా చెల్లించి తిరిగి కొత్త రుణాలను తీసుకుంటున్న వారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. మొత్తం 956 సంఘాలకు రూ. 3.16కోట్లు మంజూరయ్యాయి. – బాల్రాజ్, జిల్లా కోఆర్డినేటర్, మెప్మా అమరచింత: స్వయం సహాయక మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహిస్తూ, భారీగా రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వడ్డీ డబ్బులను తిరిగి చెల్లిస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బ్యాంకు రుణాలను క్రమం తప్పకుండా తీరుస్తున్న 956 సంఘాలను గుర్తించిన అధికారులు... మొత్తం రూ. 3,16,92,822 వడ్డీని ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొత్తం 13వేల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోంది. వడ్డీ చెల్లింపు డబ్బులకు సంబంధించిన చెక్కులను జిల్లా మంత్రుల చేతుల మీదుగా ఆయా పట్టణ సమాఖ్యలకు అందజేశారు. జిల్లాలో సంఘాలు, వడ్డీ డబ్బుల చెల్లింపు ఇలా (రూ.పాలలో) మున్సిపాలిటీ సంఘాలు వడ్డీ డబ్బులు అమరచింత 124 61,40,579 ఆత్మకూరు 53 13,95,206 కొత్తకోట 174 65,29,903 పెబ్బేరు 76 15,56,683 వనపర్తి 529 1,60,61,651 మొత్తం 956 3,16,92,822 పదేళ్లుగా రాని వడ్డీ.. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను చెల్లించలేకపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంపై పొదుపు సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడమే కాకుండా పెట్రోల్బంక్ల నిర్వహణ, అద్దెకు ఆర్టీసీ బస్సులను ఇవ్వడం, కుటీర పరిశ్రమల ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో మహిళలు ఆర్థికంగా ముందుకెళ్తున్నారు. -
పాలమూరు పద్మం
మహబూబ్నగర్లోని పాలకొండ వెంకట్రాంరెడ్డి, దమయంతి దంపతుల కుమారుడు విజయానంద్ రెడ్డి 1982లో ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొన్ని రోజులపాటు భూత్పూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత రేడియేషన్ అంకాలజీలో ఎండీ, డీఎన్బీ పూర్తి చేసి గత 30 ఏళ్లుగా అపోలో ఆస్పత్రిలోని అంకాలజీ విభాగం ప్రొఫెసర్ హెచ్వోడీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ శశికళ ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్డ్ కాగా.. ఇద్దరు కొడుకులలో ఒకరు వైద్యుడిగా, మరొకరు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. పాలమూరు సిగలో మరో పద్మశ్రీ చేరింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్లోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర మొగులయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్య కారుడు దాసరి కొండప్పలను పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తాజాగా పాలమూరు నగరంలోని వల్లబ్నగర్కు చెందిన వైద్యుడు పాలకొండ విజయానంద్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయానంద్రెడ్డి గత 44 ఏళ్లుగా వైద్యరంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు ఈ పురస్కారం దక్కిందని కొనియాడారు. – సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్/ పాలమూరు -
రైతులను మోసం చేసిన బీఆర్ఎస్
వనపర్తిటౌన్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల పేరుతో ఎన్నో మోసాలు చేశారని.. రైతులను మోసం చేసిన పార్టీకి భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి మండల రైతువేదికలో రైతులకు రాయితీపై వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి రైతు పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు, రాయితీలను అందిస్తోందన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు రూ.లక్షలు ఆదా అయ్యే వ్యవసాయ ఉపకరణాలపై రాయితీలను ఎత్తేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులకు బొక్కలుపెట్టి నీళ్లు తెచ్చామని గొప్పలు చెబుకున్నారని దుయ్యబట్టారు. ● జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి 40 మందికి పైగా సర్పంచులు యువకులేనని.. పార్టీ యువకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులకు సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో వీధి దీపాలను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్రెడ్డి, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మురళీధర్రెడ్డి, సాయిచరణ్రెడ్డి, శారద, సయ్యద్ ఖలీద్, మాజీద్, ఆదిత్య, శివాంత్రెడ్డి, సుకన్య పాల్గొన్నారు. -
నామినేషన్ల స్వీకరణకు 11 కేంద్రాలు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. ప్రతి 3 వార్డులకు ఒక నామినేషన్ స్వీకరణ కేంద్రం చొప్పున మొత్తం 11 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు యూనుస్, శ్రీనివాసులు, ఉమామహేశ్వర్రెడ్డి, బాలరాజుతో కలిసి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఖరారు చేశారు. అదే విధంగా 99 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. అవసరమైన బ్యాలెట్ బాక్స్లను ఎంపీడీఓ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మొత్తం 139 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ తెలిపారు. -
అచ్చంపేటలో మోస్ట్ వాంటెడ్..
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తున్న దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న మీసాల సాలోమాన్తోపాటు ఆయన భార్య సన్బట్టిని పోలీసులు అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమాన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్జీ, హిడ్మా వంటి వారితో పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ అక్కడి మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సైతం దండకారణ్యం డీవీసీఎం కేడర్, పీఎల్జీ బెటాలియన్ సభ్యురాలిగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యాన్ని వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకోవడం.. ఈ క్రమంలోనే అరెస్ట్ కావడం స్థానికంగా అలజడి సృష్టించింది. -
పెరగనున్న మెడికల్ కళాశాల సీట్లు
పాలమూరు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పాలమూరులోనే ఏర్పాటు చేశారు. 2016లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదలైన కళాశాల ప్రస్తుతం 175 సీట్లతో కొనసాగుతోంది. పదేళ్ల కాలంలో నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లాయి. ఒక్కో బ్యాచ్లో 150 విద్యార్థుల చొప్పున 600 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. అలాగే కళాశాలలో 34 పీజీ సీట్లు ఉండటం విశేషం. తాజాగా మరో 25 సీట్లు పెంచడానికి శనివారం పాలమూరు మెడికల్ కళాశాలను, జనరల్ ఆస్పత్రిని ఎన్ఎంసీ(జాతీయ మెడికల్ కౌన్సిల్) బృందం సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ అనిల్ బాబు సందర్శించారు. ఉదయం వారు మెడికల్ కళాశాలకు వెళ్లి స్థానికంగా బోధకుల సంఖ్య, పరిపాలన సిబ్బంది, తరగతి గదులు, ఇతర వసతులపై ఆరా తీశారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో రోజు వారీగా వచ్చే ఓపీ రోగులు, ఐపీ రోగుల సంఖ్య, క్యాజువాలిటీ, అన్ని రకాల ఆపరేషన్ థియేటర్స్, వార్డులు, ఐసీయూ, మాతా శిశు విభాగం ఇలా ప్రతి వార్డును సందర్శించి స్థానికంగా ఉన్న వసతులపై నివేదిక తయారు చేశారు. ఎన్ఎంసీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎంసీ పర్యటన పూర్తయిన నేపథ్యంలో పాలమూరు మెడికల్ కళాశాల అధికారులు ఈ నెల 28 వరకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఎంసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి మరోసారి పర్యటిస్తారా? లేదా ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తారా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. ఎన్ఎంసీ బృందం వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా ఇతర వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 2016లో 150 సీట్లతో ప్రారంభం ఇప్పటి వరకు నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు పూర్తి తాజాగా 25 సీట్ల కేటాయింపు కోసంఎన్ఎంసీ బృందం పర్యటన -
నల్లమలలో అలజడి
కలకలం రేపిన మవోయిస్టుల అరెస్టు సాక్షి, నాగర్కర్నూల్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. నల్లమలకే చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులతోపాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలను అచ్చంపేటలో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమలలో సుమారు 20 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తెరమరుగు పడుతూ రాగా.. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి సృష్టించింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దు, దండకారణ్యంలో కేంద్ర బలగాల ముమ్మర కూంబింగ్, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు ఆశ్రయం కోసం నల్లమల ప్రాంతానికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆశ్రయం కోసమే వచ్చారా.. లేక ఈ ప్రాంతంలో మావోయిస్టు పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిశిత పరిశీలన.. మావోయిస్టు పార్టీలో కీలక నేతలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల ప్రాంతంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల అంబయ్య ఇప్పటికే పలుమార్లు చత్తీస్ఘడ్ వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన జక్క బాలయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామానికి చెందిన మన్శెట్టి యాదయ్య గతంలో మావోయిస్టుగా పనిచేసి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. నల్లమల ప్రాంతానికే చెందిన ఈ ముగ్గురు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరులో.. రెండు దశాబ్దాల కిందట నల్లమల దళం కేంద్రంగా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మెరుపుదాడులు, ఎన్కౌంటర్లు, పరస్పర దాడులకు ఉమ్మడి జిల్లా సాక్ష్యంగా నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలో 1993 నవంబర్ 13న పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేయడంతో ఏకంగా ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు పోలీసులు మరణించారు. అలాగే 2005 ఆగస్టు 15న ధన్వాడలో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రస్థాయిలో కొనసాగింది. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఉమ్మడి జిల్లాలో మళ్లీ మవోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. అచ్చంపేటలో కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడు సాలోమాన్తో పాటుమరో ముగ్గురు స్థానికులు అదుపులోకి.. ఆశ్రయం కోసం వచ్చారా.. పునరుజ్జీవం చేసేందుకా? ఉమ్మడి జిల్లాలో బలోపేతానికియత్నించినట్లు పోలీసుల వెల్లడి -
వెట్టి చాకిరి నుంచి విముక్తి..
● మహారాష్ట్రలో పనిచేస్తున్న 26 మందిని నాగర్కర్నూల్ జిల్లాకు తరలింపు సాక్షి, నాగర్కర్నూల్: బతుకుదెరువు కోసం వలసజీవిగా మహారాష్ట్రకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అక్కడి అధికారులు విముక్తి కల్పించారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన 26 మంది మహారాష్ట్రలోని పర్బాణీ జిల్లాలో రోడ్డు నిర్మాణం కోసం కూలీలుగా పనిచేస్తున్నారు. అతి తక్కువ జీతంతో రోజంతా పనిచేయించుకుంటూ, ఇక్కట్లకు గురిచేస్తుండటంతో స్థానిక అధికారులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన అధికారులు బాండెడ్ లేబర్గా గుర్తించి శనివారం నాగర్కర్నూల్ జిల్లాకు తరలించారు. నాగర్కర్నూల్, తెలకపల్లి, బిజినేపల్లి, కోడేరు, అచ్చంపేట మండలాలకు చెందిన మొత్తం 26 మందిని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, ఫౌండేషన్ ఫర్ సస్టైనేబుల్ డెవలప్మెంట్(ఎఫ్ఎస్డీ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారి స్వస్థలాలకు తరలించారు. రోజుకు 200 మాత్రమే కూలీ ఇస్తూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయించారని, అనారోగ్యం బారిన పడినా తమను పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. -
రైతులకు తప్పని యూరియా కష్టాలు
● గంటల తరబడి నిరీక్షించినా నిరాశే ● గోపాల్పేటలో రోడ్డెక్కి ఆందోళనకు దిగిన అన్నదాతలు గోపాల్పేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా యూరియా రాలేదని.. కనీసం అధికారులు టోకెన్లు కూడా జారీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ గోపాల్పేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట వనపర్తి – హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పీఏసీఎస్కు వచ్చిన యూరియా శుక్రవారం సాయంత్రం వరకు అయిపోయింది. శనివారం వస్తే ఇస్తామని అధికారులు చెప్పడంతో తెల్లవారుజామునే పీఏసీఎస్ వద్దకు రైతులు చేరుకున్నారు. తమ పట్టాదారు పాస్బుక్కులను లైన్లో పెట్టి యూరియా కోసం వేచి చూశారు. మధ్యాహ్నం వరకు యూరియా లోడ్ రాలేదు. కనీసం క్యూలో నిరీక్షించిన రైతులకు టోకెన్లు కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ సీఈఓ రామ్మోహన్రావు రైతులకు నచ్చజెప్పారు. మధ్యాహ్నం 3 గంటల వరకు యూరియా వస్తుందని చెప్పడంతో ధర్నా విరమించారు. కాగా, మధ్యాహ్నం తర్వాత ఈ–పాస్ మిషన్ పనిచేయకపోవడంతో వ్యవసాయాధికారులు 180 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. వారికి మంగళవారం యూరియా అందిస్తామని తెలిపారు. గంటల తరబడి పడిగాపులు ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడ సింగిల్విండో కేంద్రానికి శనివారం యూరియా వస్తుందని సమాచారం ఇవ్వడంతో తెల్లవారుజామునే వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రం వద్ద భూ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్కార్డు జిరాక్స్ లైన్లో పెట్టి గంటల తరబడి పడిగాపులు కాశారు. మధ్యాహ్నం 3 గంటలైనా యూరియా లోడ్ రాకపోవడంతో చాలా మంది రైతులు ఆకలితో అలమటించారు. ఇక చేసేది లేక అక్కడ ఉన్న సిబ్బంది రైతులకు టోకెన్లు ఇచ్చి పంపించారు. -
వీబీజీ రామ్జీ చట్టంతో పేదలకు నష్టం
వనపర్తి రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టంతో పేదలకు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు కె.శివసేనారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి మండలం పెద్దగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడమంటే.. సామాన్య ప్రజలపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. గతంలో ఉపాధి హామీ చట్టంలో కాంట్రాక్టర్లపై నిషేదం ఉండేదని.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలో కన్వర్జేన్స్ పేరిట కాంట్రాక్టర్లకు ప్రవేశం కల్పించి దోపిడీకి తెరతీశారన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థల లబ్ధికే బీజేపీ ప్రభుత్వం పరిమితమైందని.. రైతులు, కార్మికులు ,పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. కొత్త చట్టంతో దళిత, ఆదివాసీ కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు పుష్పలత, వాల్యానాయక్, ఉపసర్పంచ్ పోలికమ్మ, మాజీ ఎంపీపీ శంకర్నాయక్, గుముడాల రాములు, శివకుమార్, రొయ్యల రమేశ్, శేఖర్రెడ్డి, బుచ్చిబాబు, శివయ్య, రవికుమార్, రమేశ్, ఇసాక్, నాగన్న, మల్లేష్, రాములు, వెంకటేశ్, ఆంజనేయులు ఉన్నారు. -
మెరుగైన విద్య అందించడమే లక్ష్యం
వనపర్తి: సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న మైనార్టీ వర్గాల పిల్లలకు మెరుగైన విద్య అందించడమే తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ లక్ష్యమని టీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి షఫీవుల్లా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించి, విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం షఫీవుల్లా మాట్లాడుతూ.. ఇంటర్ తర్వాత నిర్వహించే వివిధ పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా మంచి సదుపాయాలను కల్పిస్తోందని, విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకొని నిరంతరం కష్టపడాలని సూచించారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ పరిధిలోని అన్ని పాఠశాలలు కళాశాలల్లో వందశాతం అడ్మిషన్లు అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ● కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థల కన్నా ప్రభుత్వ రెసిడెన్షియల్ సొసైటీల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, ఆర్ఎల్సీ ఖాజా, కళాశాల ప్రిన్సిపాల్ హవిలారాణి పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
అమరచింత: బాలికలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. శనివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని దేశాయి మురళీధర్రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ, తమ లక్ష్యాలను సాధించాలన్నారు. బాలికలకు న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు తమ సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బాల్యవివాహ ముక్త్ భారత్లో భాగంగా ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును బాలికలు ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిక్షఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డా.మానస వివరించారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ స్వాతి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, దేశాయి ప్రకాశ్రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు కలాంపాషా, హెచ్ఎం పద్మ, సీఆర్పీ స్వామి పాల్గొన్నారు. -
నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం : ఎస్పీ
కొత్తకోట రూరల్: వాహనాలు వేగంగా నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్బెల్ట్ ధరించడంలో నిర్లక్ష్యం వంటి కారణాలతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఒక్క కుటుంబానికే కాదు.. సమాజానికే తీరని నష్టం కలిగిస్తాయని చెప్పారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మండలంలోని అప్పారాల సమీపంలో ఉన్న కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, చెరుకు రవాణా వాహనాల డ్రైవర్ల అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పరిశ్రమల ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. కార్మికులు విధులు ముగించుకొని సురక్షితంగా ఇంటికి చేరడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు, ఎస్ఐ ఆనంద్, షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్ రామరాజు, షుగర్ ఫ్యాక్టరీ లీగల్ అడ్వయిజర్ భాస్కర్, పోలీస్ సిబ్బంది, షుగర్ ఫ్యాక్టరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పుర ఎన్నికల్లో ఆర్ఓలదే కీలకపాత్ర
● అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: త్వరలో జరిగే పురపాలక ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎన్నికల సంఘం నియమాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలని, ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పుర ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో ఉంటాయని, చాలా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ ప్రక్రియలో చాలా అనుమానాలు వస్తుంటాయని.. గుర్తులు, క్రమసంఖ్య కేటాయింపుల్లో తప్పులు దొర్లకుండా నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వివరించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు, మరో వ్యక్తిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని.. నామినేషన్ పత్రంలో ఏమైనా తప్పులు, లోపాలు ఉంటే పరిశీలించి నోటీసు ఇవ్వాలన్నారు. జనరల్ అభ్యర్థులు రూ.2,500 చెల్లించాల్సి ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. నామినేషన్ దాఖలు నుంచి స్క్రూటినీ, విత్డ్రా, గుర్తుల కేటాయింపు, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, వనపర్తి పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్లు, శిక్షణ నోడల్ అధికారి రామమహేశ్వర్రెడ్డి, ట్రైనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి.. ప్రతి ఓటరు ఎన్నికల్లో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, ఐడీఓసీ సిబ్బందితో ఓటరు దినోత్సవంపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పిల్లలను విధిగా కళాశాలకు పంపించాలి
వనపర్తి రూరల్: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా కళాశాలకు పంపించాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య కోరారు. శుక్రవారం శ్రీరంగాపురం, పెబ్బేరు జూనియర్ కళాశాలల్లో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అధ్యక్షతన జరిగిన విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశాలకు ఆయనతో పాటు తహసీల్దార్లు రాజు, మురళీగౌడ్, ఎంపీడీఓ రవినారాయణ, ఎస్ఐ హిమబిందు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలని, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధ్యాపకులతో చర్చించాలన్నారు. -
కాంట్రాక్టు, ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేయాలి
వనపర్తి రూరల్/ఖిల్లాఘనపురం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత లేక శ్రమ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని.. వెంటనే ఆయా వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ, ఖిల్లా ఘనపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి కార్మికులతో మాట్లాడారు. కనీస వేతనం రూ.26 చెల్లించి వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.15 లక్షలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న ఏజెన్సీల మూడేళ్ల కాలవ్యవధి ముగిసి దాదాపు పది నెలలు గడుస్తోందని.. కొత్త టెండర్ల ప్రక్రియ కాలయాపనతో తీవ్రమైన పనిభారంతో పాటు ఆర్థికంగా కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా నేరుగా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్లు థర్డ్పార్టీ ఏజెన్సీల కింద ఎలాంటి ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదన్నారు. ఖిల్లాఘనపురంలో జరిగిన కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆస్పత్రి బ్రాంచ్ నేతలు, కార్మికులు సాయికృష్ణ, నాగన్న, వెంకటేష్, మునీందర్, భీమయ్య, నజ్మా, రంగమ్మ, వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, గంధం శ్రీనివాస్, నర్సింహ, నరేందర్, భరత్, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


