breaking news
Wanaparthy District Latest News
-
79 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న వ్యత్యాసాలు
● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం ● అవినీతి కూడా ప్రధాన సమస్య ● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి ● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం తమ జీవితాల్లో పూర్తిస్థాయిలో ప్రతిఫలించడం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక అంతరాలు, అవినీతి, పేదరికం, నాణ్యమైన విద్య–వైద్య సేవల కొరత వంటి సమస్యలు ఇంకా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాల్లో సమానత్వం వంటి విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని, వాటి అమలులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి లభించే అవకాశాలు, పేదలకు అందే అవకాశాల మధ్య వ్యత్యాసం తగ్గాల్సి ఉందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియలను మరింత సరళీకరించాలని పలువురు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టసభలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కులం, సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వివక్షకు తావులేని వాతావరణం ఏర్పడాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు ఏ మేరకు అందుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం పరిస్థితి ఎలా ఉంది? 79 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం? వంటి అంశాలపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 250 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? -
ఎఫ్సీఓ నిబంధనలు విధిగా పాటించాలి
కొత్తకోట రూరల్: ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయంలో ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సీఓ) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, స్టాక్ బోర్డులు, ధరల పట్టికలను పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేశారు. అధిక ధరలకు విక్రయించడం, బిల్లులు ఇవ్వకపోవడం, స్టాక్ వివరాలను నమోదు చేయకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రైతులకు క్షేత్ర ప్రదర్శనలో ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. వర్షపాతం అస్థిరంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, పంటల్లో సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విక్రయించాలి.. ఖిల్లాఘనపురం: ప్రభుత్వ నిబంధనలు, ధరల ప్రకారమే ఎరువులు విక్రయించాలని డీఏఓ అంజనేయులు అన్నారు. శుక్రవారం సోళీపురం, ఖిల్లాఘనపురంలోని ఎరువుల దుఖాణాలను మండల వ్యవసాయ అధికారి మల్లయ్యతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు, ఈపాస్ యంత్రాల్లోని ఎరువుల నిల్వలు, స్టాక్ బోర్డులు పరిశీలించారు. జిల్లాలో సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని తెలిపారు. ఎవరైన డీలర్లు ఎక్కువ ధరలకు, నకిలీ ఎరువులు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జెండాపండుగకు ముస్తాబు
అంతరాలే అసలు సమస్య వనపర్తిసర్వే సాగిందిలా.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు కొత్తకోట రూరల్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పురపాలికలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతంలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో దోమల నివారణకు పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది అందుబాటు, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని కోరారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థుల యూనిఫాం తయారీ, పంపిణీ పురోగతిని అధికారులతో ఆరా తీశారు. యూనిఫాం పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం మదనాపురం మండలం దంతనూరులో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకలాపాలు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ● ఉదయం 9.20 గంటలకు ఎస్పీ సునీతారెడ్డి కలెక్టరేట్లోని వేధిక వద్దకు చేరుకుంటారు. ● 9.23 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, 9.25 గంటలకు ముఖ్యఅతిథి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలకనున్నారు. ● 9.30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయగీత ఆలాపన, వందన సమర్పణ, అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ముఖ్యఅతిథి చదివి వినిపిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మానం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల అందజేత జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగింపు. రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులో కలెక్టరేట్ భవనం వనపర్తి: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ రంగురంగుల విద్యుద్దీపాలు, వేధిక, ఇతర ఏర్పాట్లతో ముస్తాబైంది. శనివారం జరిగే వేడుకలకు శుక్రవారం ఉదయం నుంచే పనులు ప్రారంభించారు. సాయంత్రం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఏర్పాట్లను పరిశీలించి ఎక్కడా లోపం లేకుండా పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వేడుకలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొననుండగా.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. వేడుకల వేధిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏఓకు సూచించారు. మధ్యాహ్నం తర్వాత డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ.. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రకాల భద్రత ఏర్పాట్లతో రూపొందించిన డిజిటల్ రేషన్ కార్డులను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. సమావేశ మందిరంలో ముఖ్యఅతిథి పట్నం మహేందర్రెడ్డి, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో మధ్యాహ్నం 2 గంటలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే జిల్లాలో సైతం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సైబర్ ప్రొఫైలింగ్లో వనపర్తికి ప్రథమ స్థానం వనపర్తి: సైబర్ నేరాల నియంత్రణ, ప్రొఫైలింగ్లో జిల్లా పోలీస్శాఖ అసాధారణ ప్రతిభ కనబర్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. శుక్రవారం హైదరాబాద్లోని ఐసీసీసీ భవనంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా’ రాష్ట్రస్థాయి సైబర్ అవగాహన సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున డీఎస్పీ గిరిబాబుకు ప్రశంసాపత్రం అందజేశారు. ఎస్పీ సునీతారెడ్డి పర్యవేక్షణలో పనిచేస్తున్న జిల్లా సైబర్ విభాగం సైబర్ నేరస్తుల వివరాల సేకరణ, సమాచార విశ్లేషణ, సమన్వయ సెక్యూరిటీ ప్రొఫైలింగ్ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ఈ అవార్డును కై వసం చేసుకుంది. జిల్లా పోలీసు యంత్రాంగం సమష్టి కృషికి నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. సైబర్ విభాగం అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీరంగాపురం వాసికి ‘మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ వనపర్తి: హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ, శ్రీరంగాపురానికి చెందిన రుద్రవరం గుండ్ల శివమారుతికి ప్రతిష్టాత్మకమైన ‘మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ (ఎంఎంఎస్) దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన పోలీసు పతకాల్లో శివమారుతి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, నేరాల నిరూపణలో కీలక ఆధారాలను సేకరించడం, సీసీ టీవీ ఫుటేజీ విశ్లేషణతో పాటు విధుల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించినందుకు ఈ పతకం లభించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది ఈ పతకాన్ని అందుకున్న అధికారుల్లో శివమారుతి ఒక్కరే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, తనతో కలిసి పనిచేస్తున్న సిబ్బంది సహకారంతోనే ఈ పతకం దక్కిందన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు? సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు II కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికార యంత్రాంగం జాతీయజెండా ఎగురవేయనున్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సరికాదు
వనపర్తి: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఎక్కువ నీటిని తరలించుకుపోతున్న విషయం రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాలేదా అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మాజీలు విహారయాత్రలు చేస్తూ పబ్లిసిటీ కోసం తప్పులు ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడితే ఉరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నందున బాధ్యతాయుతంగా సమాధానమిస్తున్నామని.. హద్దులు దాటితే కాంగ్రెస్ కార్యకర్తలే సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జూరాల ప్రధాన కాల్వ, రాజీవ్ భీమాఫేజ్–2, కేఎల్ఐ కింద నియోజకవర్గంలో 90,741 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని.. ఇవన్నీ 2014కు ముందు కాంగ్రెస్పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు కావా అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చారో రైతులకు లెక్కలు చెప్పాలని.. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్దమేనంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన బీఆర్ఎస్ నాయకులు 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు, ఇతర పెండింగ్ బిల్లులకు రూ.4 వేల కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. స్థానికంగా చర్చించడం చేతగాక సీఎంను విమర్శించడం పనిగా పెట్టుకొన్నారని, మాజీ మంత్రి కేటీఆర్ మెప్పు కోసం అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 1న ఎల్లూరు, ఆగస్టు 2న సింగోటం–జొన్నలబొగుడ, ఆగస్టు 3న గుడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని వదిలామని వివరించారు. డబుల్ ఓట్లను తొలగించడంతో వనపర్తి, పెబ్బేరు పట్టణాల్లో ఓట్ల సంఖ్య తగ్గిందని, మొత్తంగా నియోజకవర్గంలో 86 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. నెలాఖరులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జిల్లా పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సర్ ప్రక్రియలో బీఎల్ఏలు సమర్థవంతంగా పని చేశారని డీసీసీ అధ్యక్షుడు ప్రశంసించారు. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపునిస్తామని తెలిపారు. సమావేశంలో పుర చైర్పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, కౌన్సిలర్లు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. -
పటిష్టంగా నీటిశుద్ధి ప్రక్రియ..
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా శుద్ధి ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా సమీపంలో ఉన్న 75 ఎంఎల్డీ మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మిషన్ భగీరథ సూపరింటెండెంట్తో కలిసి ప్లాంట్లోని నీటి ప్రవాహం, ఫిల్టరేషన్ ప్రక్రియను పరిశీలించారు. గౌరీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి ప్లాంట్కు ఏ విధంగా నీరు చేరుతుంది.. వివిధ దశల్లో శుద్ధిచేసి ప్రజలకు ఏ విధంగా సరఫరా చేస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కూడా నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట మిషన్ భగీరథ ఈఈ అంజద్, ఇంజినీరింగ్ అధికారులు, సర్పంచ్, సిబ్బంది ఉన్నారు. -
దేశభక్తి
వెల్లివిరిసిన240 అడుగుల మువ్వన్నెల జెండా ప్రదర్శన జిల్లాకేంద్రంలో గురువారం 240 అడుగుల పొడవున్న జాతీయ జెండాను ప్రదర్శించారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ బచ్చు రాము ఆధ్వర్యంలో విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేడ్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా పట్టణ వీధుల్లో దేశభక్తి నినాదాలు చేస్తూ ప్రదర్శించారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఆద్యంతం అందరిని కట్టిపడేసింది. – వనపర్తిటౌన్ -
సీఎంఆర్పై ఈడీ నజర్!
● మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం ● అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ● జిల్లాలో వరుసగా విజిలెన్స్ దాడులు వనపర్తి: జిల్లాలో సీఎంఆర్ అక్రమాల పుట్ట తొవ్వేకొద్దీ ఊటబావిలోని నీటిలా వెలికి వస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా నెలరోజులుగా చేపడుతున్న విజిలెన్స్ దాడులతో రూ.కోట్ల అక్రమాలు వెలుగులోకి రావడం, క్రిమినల్ కేసులు నమోదవుతున్న విషయం విధితమే. కాగా.. కొందరు రైస్మిల్లర్లు అవినీతిలో తిమింగలాలతో పోటీపడుతున్నారంటూ వారి విచారణ బాధ్యతలను ఈడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా సీఎంఆర్ కోసం చేసిన ధాన్యం కేటాయింపులను మాయం చేయడం, బియ్యం ఇవ్వకుండా వాయిదాలతో కాలం గడుపుతున్న 11 మిల్లుల యాజమాన్యాలపై ఈడీ తనదైన శైలిలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సదరు అక్రమాల్లో అగ్రగనుల చిట్టా ఈడీ చేతికి అందినట్లు తెలుస్తోంది. గత పది సీజన్లలో మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పెండింగ్ బియ్యం విలువ సుమారు రూ.623.45 కోట్లు. కాగా.. ఇందులో అత్యధికంగా బకాయి ఉన్న 11 మిల్లుల యాజమాన్యాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ.. వీరిపై విచారణ చేసే బాధ్యతను ఈడీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని విక్రయించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణాధికారాలు ఈడీ చేతికి వెళ్లినట్లు సమాచారం. జిల్లాలో 191 రైస్మిల్లులు ఉండగా.. 11 మిల్లుల బకాయిలు భారీ ఎత్తున దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నట్లు భావించిన అధికారులు వారు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి స్వప్రయోజనాల కోసం అందుకు సంబంధించిన డబ్బును వినియోగించిట్లు భావించి విచారణ బాధ్యతను ఈడీకి బదలాయించబడినట్లు తెలుస్తోంది. వీరి బ్యాంకు లావాదేవీలు.. వారు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువుల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులు.. నూతనంగా ప్రారంభించిన వ్యాపారాలు తదితర అంశాలపై లోతైన విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో.. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి గ్యారెంటీలు లేకుండా రూ.కోట్ల విలువైన వరి ధాన్యం కేవలం ఒక మిల్లుకు యజమాని అనే కారణంతో రికవరీతో సంబంధం లేకుండా విచ్ఛలవిడిగా కేటాయించడంతో అక్రమాలకు అవకాశం ఇచ్చినట్లయింది. జిల్లాలో అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు మిల్లర్లు ఇదే అదునుగా భావించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బయట మార్కెట్కు విక్రయించి ఆస్తులు, కొత్త వ్యాపారాలకు పెట్టుబడి కోసం వినియోగించుకున్నట్లుగా వచ్చిన ఆరోపణల మేరకు 11 మిల్లుల యజమానులపై మనీ లాండరింగ్ కోణంలో విచారణకు ఈడీ సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి సేకరించిన వరి ధాన్యం విక్రయించిన మిల్లుల యజమానుల్లో కొందరు పెద్దమొత్తంలో ఇతర వ్యాపారాల్లోకి, ఆస్తుల్లోకి మళ్లించినట్లుగా అనుమానం వచ్చి రాష్ట్ర అధికారులు ఈడీకి అప్పగించారు. ఇప్పటికై తే.. ఒకే యజమానికి చెందిన ఐదు రైస్మిల్లులపై ఈడీ విచారణ చేపట్టింది. హైదరాబాద్లో విచారణకు హాజరై వచ్చా ను. ఇంకా కొన్ని ఉన్నాయన్నారు కాని మాకు విచారణ విషయమై సమాచారం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అత్యధికంగా సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులపై విచారణ చేసేలా పౌరసరఫరా లశాఖ సిఫారస్ చేసింది. – ఆంజనేయులు, డీఎం, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లాలో నలుగురికి చెందిన 11 మిల్లులకు ఇప్పటి వరకు కేటాయించిన వరి ధాన్యంలో పెండింగ్ సీఎంఆర్ రూ.101.10 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టనుంది. ఇదే జిల్లాలో ఒక మిల్లరు రూ.వంద కోట్లకుపైగా బకాయి ఉన్నట్లు ఇటీవల ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పించారు. వారి మిల్లుపై ఇటీవల విజిలెన్స్ సోదాలు నిర్వహించినా.. ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. సీఎంఆర్ అక్రమాలపై కొంతకాలంగా జిల్లాలో వరుసగా విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం పెబ్బేరులోని ఓ మిల్లులో తనిఖీలు చేపట్టారు. కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపూరం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లోని మిల్లుల్లో వరుస తనిఖీలు చేస్తూ ధాన్యం లోటు ఉన్న మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తుండటం.. భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఈడీ విచారణకు సిఫారస్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోలేని కాంగ్రెస్ సర్కార్
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శ వనపర్తి: తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేస్తూ.. కాంగ్రెస్ సర్కార్ ఆంధ్రకు నీళ్లు దోచిపెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ముందుగా జూరాల ప్రాజెక్టును పరిశీలించి.. అనంతరం పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్తుండగా.. ఆంధ్ర పోలీసులు కర్నూలు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే మీడియాలో మాట్లాడారు. ఎల్నినో పేరిట తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు సాగు నీళ్లు దోచిపెడుతున్న రేవంత్రెడ్డి సర్కారును రైతాంగం క్షేమించబోదన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఆధారంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చూద్దామని వస్తే.. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో కూడా పంటలు పండాలి.. అభ్యంతరం లేదు కానీ.. గ్రావిటీతో రోజుకు నాలుగైదు టీఎంసీలు తోడేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వైపున 802 మీటర్లు అడుగున ఉన్న మోటార్లతో ఎత్తిపోయాలని, కేఎల్ఐ మూడు పంప్లు పనిచేస్తున్నా రోజుకు కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోవడం వల్ల.. ఒక టీఎంసీ నీటికే ఐదారు రోజులు సమయం పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘోరమైన వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేయడానికే వచ్చామని పేర్కొన్నారు. కల్వకుర్తి మోటార్లు సరిగా నడపడం లేదని, దీనిపై తాము ఒత్తిడి తెస్తేనే ఎత్తిపోతలు చేపట్టారన్నారు. 162 కిలోమీటర్ల పొడవు ఉండే కాల్వలో 102 కి.మీ., దూరానికి కూడా ఇప్పటికీ నీళ్లు పోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో శ్రీశైలంలో వంద టీఎంసీలు ఉన్నప్పుడు కూడా 40 టీఎంసీల నీళ్లు రైతులకు నీళ్లు ఇచ్చామని ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. దీనిపై పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఆగస్టులో సాగు సీజన్ దాదాపు అయిపోతుందని.. ఈ సమయంలో ఐఏబీ సమావేశంలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తామని చెప్పడం వింతగా ఉందని తెలిపారు. నిన్నటి వరకు జూరాలకు వరద వచ్చిందని.. ఈ సీజన్కు నీటికొరత లేకున్నా ఉన్నట్లు ప్రభుత్వమే రాద్ధాంతం చేయడం తగదన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు గట్టుయాదవ్, లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, జగదీశ్వర్రెడ్డి, పలుస రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, కురుమూర్తి యాదవ్, గంధం పరంజ్యోతి ఉన్నారు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
వనపర్తి: గణప సముద్రం రిజర్వాయర్తో ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతున్నారు.. కాబట్టి భూములు కోల్పోతున్న రైతులకు సైతం ప్రభుత్వం తరఫున సరైన న్యాయం అందించేందుకు బాధ్యత తీసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఆర్అండ్ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి బుద్ధారం, ఖిల్లాఘనపురం గణపసముద్రం భూ నిర్వాసితులతో సమావేశమై నష్టపరిహారం చెల్లింపు విషయంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణప సముద్రంలో లక్ష్యం మేర నీటినిల్వ సామర్థ్యం తగ్గించకుండా బండ్ ఎత్తు పెంచితే రైతుల నుంచి సేకరించాల్సిన నికర భూమి తగ్గుతుందని, తద్వారా ఇటు రైతులు అటు ప్రభుత్వానికి లాభం కలుగుతుందని, ఆ దిశగా సర్వే పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్శాఖ అధికారులను కోరారు. భూ నిర్వాసితులకు నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.11.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉందని.. కానీ సన్న, చిన్నకారు రైతులు నష్టపోతున్నందున కాస్త పెంచి ఇచ్చేవిధంగా చూడాలని కలెక్టర్ను కోరారు. భూ నిర్వాసితులు ఎకరాకు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరగా నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకొని రూ.14 లక్షలు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇల్లు లేని పేద నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తనదని, రైతులు సహకరించాలని కోరారు. ఇందుకు సమ్మతించిన రైతులు రూ.14 లక్షలకు కాస్త పెంచి ఇవ్వాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పీఎన్ చేసిన నాటికి ప్రభుత్వ భూ విలువ ఎంత ఉంటుందో దానికి మూడు రెట్లు లెక్కించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, కానీ రైతులు, శాసనసభ్యుల కోరిక మేరకు నేడు చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్అండ్ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్నాయుడు మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు నష్టం జరగడం సహజమేనని.. కానీ చాలామంది రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు మిగిలిన భూమికి ఎక్కువ డిమాండు వస్తుందని తెలిపారు. జనరల్ అవార్డుకు వెళ్తే రైతులు నష్టపోతారని.. అందుకే చర్చలు జరిపి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. బండరాయిపాకుల నిర్వాసితుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ తిరుపతయ్య, ఏడీ సర్వే శ్రీనివాసులు, తహసీల్దార్లు, పెద్దమందడి, ఖిల్లాఘనపురం మార్కెట్ కమిటీ చైర్మన్ నవనీత, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమరభేరి
వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. మోదీ, అమిత్షా అనుకుంటే ఎదురులేదని ప్రచారం జరుగుతున్న సమయంలో దేశ యువత పెద్దఎత్తున మోదీ విధానాలను వ్యతిరేకించి సీజేపీ రూపంలో పోరాటం చేపట్టిందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, రాజ్యాంగ పరిరక్షణకు యువత, మహిళలు పెద్దఎత్తున పోరాడి విజయం సాధించారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబాని, అదాని వంటి బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతోందని.. బొగ్గుగనులు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీ, రక్షణ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని దేశభక్తి అంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ, తక్షణమే రైతుభరోసా నిధులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని.. రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, బాల్రెడ్డి, మండ్ల రాజు, లక్ష్మి, గోపీ, జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వరాచారి, మేకల ఆంజనేయులు, ఆర్ఎన్ రమేష్, మండ్ల కృష్ణయ్య, రాజు, వెంకటేష్, బాల్యానాయక్, మహబూబ్పాషా, వెంకటయ్య పాల్గొన్నారు. -
మీసేవా కేంద్రాల్లో పారదర్శక సేవలు
వనపర్తి: మీసేవా కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. గురువారం జిల్లాకేంద్రంలో జిల్లాలోని మీసేవా కేంద్రాల నిర్వాహకుల సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై పలు సూచనలు చేశారు. వైకల్య గుర్తింపు కార్డులు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, కార్మికశాఖ సేవలపై సూచనలిచ్చారు. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, ఆన్లైన్ విధానం, సేవల ప్రాసెసింగ్ తదితర అంశాలను అధికారులు వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అదనంగా ఎలాంటి మొత్తాన్ని వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రతి సేవకు నిర్ణయించిన రుసుం వివరాలను కేంద్రాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రతి లావాదేవీకి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించడంతో పాటు కేంద్రాలను శుభ్రంగా, సౌకర్యవంతంగా నిర్వహించాలని సూచించారు. మీసేవా జిల్లా మేనేజర్ వెంకటేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైసుమిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
వనపర్తి రూరల్: రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం, అధికారుల బృందం గురువారం పెబ్బేరు మండలం చెలిమిళ్ల సమీపంలో ఉన్న శ్రీ సత్యసాయి రైసుమిల్, జాతీయ రహదారి పక్కనున్న రైస్మిల్, గోదాంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. 2022–23 యాసంగి సీజన్లో ఆయా మిల్లులకు కేటాయించిన వరి ధాన్యం, మిల్లు, గోదాముల్లో బస్తాలను లెక్కించారు. కేటాయించిన ధాన్యంలో 6,491.92 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా వచ్చిందని, విలువ రూ.18.51 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. కేఎల్ఐ కాల్వకు జలకళ గోపాల్పేట: కేఎల్ఐ డి–8 కాల్వకు బుధవారం అధికారులు నీటిని వదిలారు. గురువారం ఉదయం గోపాల్పేట – ఏదుట్ల వెళ్లే దారిలో ఉన్న మేజర్–2 కాల్వ నిండుగా పారుతోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఎంతోకొంత వరిసాగు చేసుకున్న రైతులకు కాల్వ నీరు వచ్చేసరికి సంతోషంలో మునిగిపోయారు. మేజర్–2 కాల్వకు గండిపడకుండా తూము ఏర్పాటు చేసి సరిపడా నీరు వదలాలని రైతులు కోరుతున్నారు. కేఎల్ఐ డీ–8 కాల్వ ద్వారా ఉమ్మడి గోపాల్పేట మండలంతో పా టు పాన్గల్, వనపర్తి, కోడేరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి రూరల్: బీసీ విద్యార్థులకు నీట్ యూజీ, జేఈఈ–2027 ఉచిత లాంగ్టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తునట్లు ఎంజేపీ సొసైటీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులతో పాటు నీట్, జేఈఈ–2026లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి https;//mjptbc admissions.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు నీట్లో 100, జేఈఈలో 40.. బాలురకు నీట్లో 50, జేఈఈలో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. బాలికలకు నాగోల్ సీఓఈ కళాశాలలో, బాలురకు అబ్దులాపూర్మెట్ సీఓఈ కళాశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. మెరిట్, సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని, దరఖాస్తులు అధికంగా వస్తే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట కొత్తకోట రూరల్: మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మహిళా సమైఖ్య సర్వసభ్య సమావేశం, ఇందిరా మహిళాశక్తి 23వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సభ్యులతో మాట్లాడి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగా కాకుండా ఆర్థిక, వ్యాపార శక్తులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులు, కామన్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్న ఎమ్మెల్యే, కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్బంక్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వీఓఏల వేతనాల పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
వనపర్తి: విద్యార్థులు రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని బండారునగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి విద్యాభ్యాసం, హాజరు, క్రమశిక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, భోజనం తయారు చేసే సమయంలో శుభ్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. వంటశాల, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చదవాలని సూచించారు. -
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ..
చాలామంది రైతులు ఇప్పటికే బోరుబావుల కింద వరి సాగు చేశారని, ఆయా పంటలను రక్షించుకునేందుకు వారాబంధి విధానంలో నీటిని విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఎల్నినో కమిటీ సిఫారసు చేసిన పంటలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని.. కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొత్తకోట మండలం కానాయపల్లి ఆర్అండ్ఆర్ సమస్యను పరిష్కరిస్తే శంకర సముద్రం రిజర్వాయర్ పరిధిలోని 12 గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని.. ఈ విషయంపై కేబినెట్లో చర్చించాలని మంత్రులను కోరారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
వనపర్తిటౌన్: విద్యార్థులు భవిష్యత్పై శ్రద్ధ చూపకుండా మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.కళార్చన ఆదేశాల మేరకు బుధవారం జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు కార్యాలయం, మహాత్మా జ్యోతిబా పూలే బాలుర జూనియర్ కళాశాలలో ప్రపంచ యువజన దినోత్సవం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై యువత, విద్యార్థులకు డ్రగ్స్, డ్రంకెన్ డ్రైవ్, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో, ఉచిత నిర్బంద విద్య, మోటారు వాహనాల చట్టం, సైబర్ క్రైం గురించి వివరించారు. ఉచిత న్యాయసేవలకై టోల్ఫ్రీ నంబర్ 15100లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, జువైనల్ జస్టిస్ బోర్డు సిబ్బంది, ప్యానెల్, పారా లీగల్ వలంటీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ...
రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూనే, ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా వీలైనంత నీరు విడుదల చేసేందుకు ప్రయత్నించాలన్నారు. నీటి విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో నాగర్కర్నూల్, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, విజయుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ కలెక్టర్లు ఖుష్బూగుప్తా, సీహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్బాషా, హేమంత కేశవ్ పాటిల్, ఉమ్మడి జిల్లా వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతే లక్ష్యంగా.. నిధుల విడుదల
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 70 శాతం నిధులు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.21.91 కోట్ల మంజూరు ● మహిళా సంఘాల భవనాలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాల వద్ద నిర్మాణాలు ● అక్టోబర్ 2 లక్ష్యంగా పనులు ముమ్మరం నర్వ: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాల భవనాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మార్కెట్యార్డులు, దేవాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధుల్లో 70 శాతం స్వచ్ఛభారత్ మిషన్ నుంచి సమకూరనున్నాయి. మిగిలిన 30 శాతం నిధులను గ్రామ పంచాయతీలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించనున్నారు. మహిళా సంఘాల భవనం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద రూ.52 వేలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.92,747 చొప్పున నిధులు అందించనున్నారు. జిల్లా మ.సం.భ మంజూరైన నిధులు నాగర్కర్నూల్ 209 రూ.1.77 కోట్లు నారాయణపేట 45 రూ.52.50 లక్షలు మహబూబ్నగర్ 427 రూ.2.36 కోట్లు వనపర్తి 73 రూ.66.89 లక్షలు జోగుళాంబ గద్వాల 50 రూ.49.73 లక్షలు మ.సం.భ : మహిళా సంఘాల భవనాలుకలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అందిపుచ్చుకునేలా మహిళా సమాఖ్య, ఎస్బీఎం అధికారులకు దిశానిర్దేశం చేశాం. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. కేంద్ర బృంధం యూనిసెఫ్ సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అంచనా నివేదికను తయారు చేసి కేంద్రానికి నివేదించేందుకు ఇటీవల పర్యటన చేపట్టారు. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట గతంలో ఉపాధిహామీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా నిర్మాణాలు చేపట్టినప్పుడు పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో సమస్యల కారణంగా పథకం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం స్వచ్ఛభారత్ మిషన్, మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, పంచాయతీ శాఖల సమన్వయంతో పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. -
డీఐజీ చౌహాన్పై బదిలీ వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ● ఇన్చార్జి డీఐజీగా షాన్వాజ్ ఖాసీం మహబూబ్నగర్ క్రైం: పోలీసుశాఖలో ఉన్నతస్థాయిలో ఉంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు.. తనిఖీలకు వెళ్లిన ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొన్న జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్పై ఆకస్మికంగా వేటు పడింది. ఆయనను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ (వెయిటింగ్) చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాత్కాలికంగా ఐజీ షాన్వాజ్ ఖాసీంకు ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. జోగుళాంబ జోన్–7 ఏర్పాటైన తర్వాత తొలి డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్ 2023 జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆయనను రామగుండం సీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినప్పటికీ.. అవి అమలు కాకపోవడంతో ఇక్కడే కొనసాగారు. దాదాపు మూడున్నరేళ్లుగా ఇదే పోస్టులో కొనసాగుతున్న ఆయన తీరుపై మొదటి నుంచీ పోలీసు వర్గాల్లో పలు విమర్శలు వినిపించాయి. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీల వ్యవహారంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తనిఖీల సందర్భంగా కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని, బదిలీల విషయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించేవారనే విమర్శలు పోలీసు వర్గాల్లో వినిపించాయి. -
భవన నిర్మాణ పనుల్లో జాప్యం సరికాదు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో జాప్యం సరికాదని.. నెలాఖరులోగా బేస్మెంట్ పనులు, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు, మ్యాప్ను పరిశీలించి ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి, చేపట్టాల్సిన వాటి వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆశించిన స్థాయిలో సాగకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేస్తూ పనులు ప్రారంభించి చాలా కాలం గడిచినందున ఇకపై ఎలాంటి జాప్యానికి తావులేదని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన సందర్భంగా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాల మేర పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ అంచనాలు పెంచకుండా పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. చేపట్టాల్సిన ప్రతి పనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసి సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప నుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ యాదయ్య, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు, ఇతర విద్యాశాఖ అధికారులు ఉన్నారు. -
అక్టోబర్ 2 లక్ష్యంగా వేగవంతం..
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ఆయా మండలాల్లో కేటాయించిన సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడుగుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. జిల్లాలోని కొత్తపల్లి మండలం భూనీడు, గుండుమాల్ మండలం ఆమ్లీకుంటలలో కేంద్రబృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. అక్టోబర్ 2 డెడ్లైన్తో పనులు పూర్తి చేసేలా పనుల వేగవంతం చేస్తున్నాం. పైలెట్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో పనులను పర్యవేక్షిస్తున్నాను. మరో కొన్నిరోజుల్లో లక్షా్య్న్ని చేరుకుంటాం. – మాలిక్, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ ● -
ఆరుతడి సాగు చేయాలి
ఉమ్మడి జిల్లా ఐఏబీ సమావేశంలో మంత్రులు జూపల్లి, వాకిటి ● నీటి విడుదల, పంటల సాగుపై సుదీర్ఘంగా చర్చ ● పాల్గొన్న ఎమ్మెల్యేలు, సాగునీటి, వ్యవసాయశాఖ అధికారులు అధికారులు జవాబుదారీతనంతో ప్రజలకు అన్ని వివరాలు, వాస్తవాలను తెలియజేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఏమి ఇవ్వగలమో అదే చెప్పాలన్నారు. రూ.వేల పెట్టుబడితో పంటలు సాగు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిపుణుల సూచనల మేరకు ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని సూచించారు. వనపర్తి: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.. ఉమ్మడి పాలమూరు రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని నష్టపోకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశానికి వారితో పాటు ఎమ్మెల్యేలు, నీటిపారుదల, వ్యవసాయశాఖ అఽధికారులు హాజరయ్యారు. ఎల్నినో కారణంగా కరువు పరిస్థితులు, ఉమ్మడి జిల్లా పరిధిలోని జూరాల, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఆర్డీఎస్, కేఎల్ఐ, భీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టం, రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాల దృష్ట్యా నీటి నిల్వలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదతో ప్రస్తుతానికి ప్రాజెక్టులు నింపుకొన్నామని.. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచినట్లు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో తిరిగి నీటి విడుదల జరిగితేనే రైతులకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సాగునీటి విడుదలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలు సాగు చేసేలా సూచనలు చేయాలని నిర్ణయించారు. అదృష్టవశాత్తు కర్ణాటకలో కురిసిన కొద్దిపాటి వర్షాలతో జూరాలకు వరద వచ్చిందని.. వరి సాగు చేస్తే డిసెంబర్ వరకు నీరు అవసరం ఉంటుందన్నారు. అప్పటి వరకు ఇవ్వాలంటే వర్షాలు కురవడం తప్పనిసరని.. ఎల్నినో ప్రభావంతో రానున్న రెండు, మూడునెలలు ఆశించిన మేర వర్షాలు కురిసే అవకాశాలు లేవని తెలిపారు. రూ.వేల పెట్టుబడితో వరి సాగు చేసి నష్టపోవడం కంటే ఆరుతడి పంటలు సాగు చేయడమే రైతుకు శ్రేయస్కరమన్నారు. ప్రస్తుత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు సరిపడా సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని, లేకుంటే వారబంధి విధానంలో నీళ్లు వదలాలన్నారు. జిల్లాలోని జలాశయాలకు ఎంత నీరు వస్తోంది,. ఎంత వదులుతున్నామనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. -
జాతీయ బహుమతి అందుకున్న వగ్గు శ్రీరామ్
అమరచింత: ఢిల్లీలో జరిగిన జాతీయ హ్యండ్లూమ్ హ్యకథాన్లో పట్టణానికి చెందిన వగ్గు శ్రీరామ్ బుధవారం కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకున్నారు. పట్టువస్త్రాల తయారీలో నేతన్నలు వెన్నునొప్పితో బాధపడకుండా ఉండేందుకుగాను శ్రీరామ్ తయారు చేసిన పరికరాన్ని జాతీయస్థాయి ఇన్నోవేషన్లో ప్రదర్శించగా ప్రథమ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా అమరచింత పద్మశాలి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రఘురాం వగ్గు శ్రీరామ్కు అభినందనలు తెలిపారు. నిధులు, విధులు సర్పంచ్లకే ఉండాలి వనపర్తిటౌన్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే విధులు, నిధులు, బాధ్యతలు సర్పంచ్లకే ఉండాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధికార ప్రతినిధి పురుషోత్తంరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సర్పంచ్ హక్కుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో సంసారం చేసేది సర్పంచ్ అయితే అధికారం ఎమ్మెల్యేలకు అప్పజెప్పి గ్రామ స్వరాజ్య వ్యవస్థను ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని మండిపడ్డారు. విధులు సర్పంచ్లు నిర్వర్తిస్తుంటే నిధులు ఎమ్మెల్యేలకు కేటాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. గ్రామానికి, గ్రామసభకు సర్పంచే సర్వాధికారిగా ఉండాలనే నిబంధనకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలు అధికారం సర్పంచ్లకు కాకుండా ఇందిరమ్మ కమిటీల పేరుతో అనామకులకు అప్పగించడం సరికాదన్నారు. సర్పంచ్, గ్రామకార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వకుండా ఏదో ఒక వార్డులో గెలిచిన వ్యక్తిని ఉప సర్పంచ్గా చేసి సర్పంచ్ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనైతిక నిర్ణయాలతో సర్పంచ్ వ్యవస్థ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, అన్ని గ్రామపంచాయతీలకు నిర్వహణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధానకార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శి మందిపల్లి వెంకట్, అధికార ప్రతినిధి, బుద్ధారం సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు. జాతీయ జెండాల పంపిణీ వనపర్తిటౌన్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ భావాన్ని చాటాలన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కేతూరి బుడ్డన్న, శ్రీశైలం, మెంటపల్లి పురుషోత్తం, రామన్నగారి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, కల్పన, జిల్లా కార్యదర్శి కాటమోని కృష్ణగౌడ్, ఆఫీస్ సెక్రటరీ దారపోగు సుబ్రమణ్యం, కౌన్సిలర్ విజయ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో రుద్రహోమం కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో ఆషాడమాస అమావాస్య సందర్భంగా బుధవారం రుద్రహోమం, కోటిలింగాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రహోమం జరిగాయి. హోమం కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. -
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
వనపర్తి రూరల్: ఉపాధ్యాయులు, విద్యాధికారులు విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజంలోని పరిస్థితులపై అవగాహన కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని అంజనగిరి ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి తరగతి గదిలో ఉపాధ్యాయుడై శుభ్రత, మంచినీరు, ఆహార నాణ్యత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి ఆసక్తి పెంచేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గత నెలలో పాఠశాలను సందర్శించినప్పుడు సొంత ఖర్చుతో భోజనం అందిస్తానని ఇచ్చిన హామీ మేరకు తయారు చేయించి తన చేతులతో విద్యార్థులకు వడ్డించారు. ఆప్యాయంగా పలకరించి ఆహారం అందించే రైతు, రైతుకూలీల విశిష్టతను వివరించారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను గౌరవించాలని కోరారు. ప్రజాప్రతినిధులు తరచూ తనిఖీ చేస్తూ వసతులు, ఆహార నాణ్యతపై శ్రద్ధ చూపి మెరుగుపర్చాలని, తద్వారా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరిగి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతమ్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్విండో అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, నందిమళ్ల అశోక్, దేవకుమార్, ధర్మానాయక్, మాధవరెడ్డి, మహేశ్వర్రెడ్డి, చిట్యాల రాము, సురేష్, యాదగిరి, వాసు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
85.590 మి.యూ.విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో మంగళవారం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 49.266 ఎంయూ, దిగువ కేంద్రంలోని 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 36.324 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 85.590 ఎంయూ విద్యుదుత్పత్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 40,537 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కోడేరు: ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని సింగాయిపల్లిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, గుండ్యవాల్యానాయక్ తండా సర్పంచ్ కాట్రావత్ పార్వతి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం : సీపీఎం
అమరచింత: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సీపీఎం ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పిట్టల రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భారతదేశ రాజకీయ పరిస్థితులు, ప్రజ సమస్యలపై పోరాటాలు, కార్మిక, కర్షక ఉద్యమాల ప్రాధాన్యత, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నాయని.. సంక్షేమ పథకాలు పేదల దరి చేరడం లేదన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. స్థలం లేక నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వితంతువులు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేష్, ఆర్ఎన్ రమేష్, అజయ్, రాఘవేంద్ర, ఆత్మకూర్ మండల సీపీఎం కార్యదర్శి రాజు, గోపాల్, బుచ్చన్న, కౌన్సిలర్ మాధవి, కో–ఆప్షన్ సభ్యురాలు షాజహాన్, శ్రీను, చంటి తదితరులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్లు లేని పాఠశాల ఉండొద్దు
వనపర్తి: జిల్లాలో మరుగుదొడ్డి లేని పాఠశాల లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్మాణంలో ఉన్న అన్ని పనులు సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, విద్యా, గ్రామీణాభివృద్ధి, జిల్లా సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో కొనసాగుతున్న నిర్మాణాలపై చర్చించారు. పెబ్బేరు మండలానికి గవర్నర్ నిధుల నుంచి మంజూరు చేసిన రూ.15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు 4 బోర్లు వేయించడం వంటి పనులు ఇంకా పూర్తిగాకపోవడానికి కారణాలు ఏమిటని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన వేంకటేశ్వరస్వామి ఆలయ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా నాణ్యతగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడైనా పాఠశాలలో మరుగుదొడ్లు లేకుంటే వెంటనే తన దృష్టికి తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఇందిరాశక్తి భవనం త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని, జిల్లాకు 133 గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు మంజూరుకాగా.. పనులు పురోగతిలో ఉన్న 53 భవన నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. 33 ఫుడ్ గ్రైన్ స్టోరేజ్ భవనాలు అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. సహాయ ఇంజినీర్లు రోజూ క్షేత్రస్థాయికి వెళ్లి పనుల పురోగతిని పర్యవేక్షించాలని.. అందుకు సంబంధించిన ఫొటోలు తనకు పంపించాలని సూచించారు. అంగన్వాడీ, వీఓ భవనాలు, డీఎంఎఫ్టీ నిధుల ద్వారా చేపడుతున్న పనులు సైతం త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా స్థలం సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో వీబీజీ రాంజీ పథకంలో అత్యధిక పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ విజయ్కుమార్, ఇన్చార్జ్ డీఆర్డీఓ రామమహేశ్వర్రెడ్డి, సీపీఓ హరికృష్ణ, డీడబ్ల్యూఓ సుధారాణి, పంచాయతీరాజ్ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
పాత పింఛన్ను పునరుద్ధరించాలి
పాన్గల్: రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ధరలకు అనుగుణంగా మెరుగైన ఫిట్మెంట్తో పాటు 2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొని మాట్లాడారు. బకాయిపడ్డ 6 డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ను పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలు చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు శాపంగా మారిన జీఓ నంబర్ 25ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య 50 దాటితే తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున నియమించాలన్నారు. అంతకుముందు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మల్లేష్కుమార్, ప్రధానకార్యదర్శి రాముడు, జిల్లా కార్య దర్శి గడ్డం మురళి, సూరయ్య, సంఘం సీనియర్ సభ్యులు శ్రీరాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వైద్యాధికారిగా డా. భాస్కర్నాయక్
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా డా. భాస్కర్నాయక్ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్హెల్త్ డా. రవీంద్రనాయక్ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఎంహెచ్ఓగా కొనసాగుతున్న డా. సాయినాథ్రెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంతకాలంగా వైద్య, ఆరోగ్యశాఖలో చెప్పకోదగిన సంఘటనలు చోటు చేసుకోవడం.. వెనువెంటనే జిల్లా వైద్యాధికారిని మారుస్తూ ఉత్తర్వులు వెలువడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కోటిలింగేశ్వరస్వామికి అన్నాభిషేకం కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అన్నదాతలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలనే సంకల్పంతో ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమం చేపట్టి వివిధ పూజలు చేశారు. అన్నాభిషేకం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి వనపర్తిటౌన్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట, ప్రధాన కూడళ్లలో వాహనదారులకు జాతీయ జెండాలను పంపిణీ చేసి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ బచ్చు రాము, రాష్ట్ర మాజీ కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, సబిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతూరి బుడ్డన్న, ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బాశెట్టి శ్రీనివాసులు, మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేలమ్మ, జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి గద్వాల: ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొట్టడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఆయకట్టు.. ఆందోళన
● ఆరుతడి పంటలకే సాగునీరుసరఫరా అంటున్న అధికారులు ● ఇప్పటికే జూరాలకు తగ్గిన వరద.. క్రస్ట్గేట్లు మూసివేత ● నేడు వనపర్తి కలెక్టరేట్లో ఐఏబీ సమావేశం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకుపైగా వరి సాగు మూడున్నరేళ్ల తర్వాతఐఏబీ సమావేశం.. సాగునీటి లభ్యత, పంటల ప్రణాళిక, ఆయకట్టు ప్రాంతాలకు నీటి కేటాయింపులు, వినియోగంపై మార్గదర్శకాలు తదితర అంశాలపై ఏటా వానాకాలం, యాసంగి పంటల సాగుకు ముందు ఐఏబీ (ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు) సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పాలకులు మూడున్నరేళ్లుగా ఆ ఊసే ఎత్తలేదు. ఎల్నినో ప్రభావంతో సమస్య తీవ్రతరమైన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఐఏబీ సమావేశాలను పునరుద్ధరించి.. ఏటా రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, వాటి పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు, ఇప్పటి వరకు సాగుచేసిన పంటల వివరాలు, పంటకాలం ముగిసే వరకు సరిపడా నాటి నిల్వలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించేందుకు సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకు వనపర్తి కలెక్టరేట్ వేదిక కానుంది. ఉమ్మడి జిల్లాలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐ, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టుల పరిధిలో సుమారు 6లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఇప్పటికే సుమారు 4 లక్షల ఎకరాలకు పైబడి వరిసాగు చేసినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. కేవలం 5.5 టీఎంసీల నిల్వ ఉన్న జూరాల నీటితో పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించటంపై సాధ్యాసాధ్యాలను చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రియదర్శిని జూరాల జలాశయం వనపర్తి/గద్వాల: వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద వస్తోందని సంబురపడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. అయితే వీరి ఆనందం తాత్కాలికమేనని జూరాలకు తగ్గిన వరదతో స్పష్టమైంది. ప్రియదర్శిని జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 15 రోజులకు పైగా భారీగా వరద వచ్చి చేరగా.. ఆదివారం నాటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు జూరాల క్రస్ట్గేట్లను పూర్తిగా మూసివేశారు. పదేళ్ల కాలంలో వానాకాలం క్రస్ట్గేట్లను పూర్తిగా మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మంగళవారం తిరిగి ఎనిమిది గేట్లు తెరిచారు. దీనితో పాటు విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తుండగా.. నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వలకు నీటి విడుదలను తగ్గించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగుచేసిన వరిపంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంట పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే డిసెంబర్ వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలకే సాగునీటిని విడుదల చేస్తామంటున్న అధికారుల ప్రకటనతో అన్నదాతల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం వనపర్తిలో జరిగే ఇరిగేషన్ బోర్డు సమావేశంలో పంటలకు సాగునీటి లెక్కలు తేలనున్నాయి. గడ్డు కాలమే.. వానాకాలంలో నెలన్నర రోజులపాటు జూరాల జలాశయం నీరులేక వెలవెలబోయింది. వానాకాలంలో జలాశయం అడుగంటిన పరిస్థితి దశాబ్దకాలంలో ఇదే తొలిసారి. దీంతో అధికారులు జలాశయంలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రాజెక్టు ఆయకట్టులో ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అప్పటికే 60 వేలకు పైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే కృష్ణాబేసిన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఊరట పొందిన అన్నదాతలు.. వానదేవుడిపై భారం వేసి, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. నెట్టెంపాడు కింద 1.20లక్షలు, జూరాల కుడి కాల్వ పరిఽధిలో 20వేలు, భీమా లిఫ్ట్–2 కింద 92వేలు, జూరాల ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో 73,639, ఎంజీకేఎల్ఐ కింద 1,18,730 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఇందులో అత్యధికంగా వరిసాగైంది. -
ప్రభుత్వ కళాశాలలకు రాత పుస్తకాలు
● తొలిసారి రాత పుస్తకాలతో పాటు, యూనిఫాం పంపిణీ ● ఉమ్మడి జిల్లాలో 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు.. ● 40,382 మంది విద్యార్థులకు లబ్ధి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా రాత పుస్తకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు యూనిఫాం కూడా అందించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో ఉన్న 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రాత పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే 38 కళాశాలలకు నోటుపుస్తకాలు చేరాయి. మిగిలిన 23 కళాశాలలకు మరో రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కళాశాలలకు చేరిన రాత పుస్తకాలను మంగళవారం పలు కళాశాలల్లో విద్యార్థులకు అందజేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న ప్రతి విద్యార్థికి 12 నోటుపుస్తకాల చొప్పున పంపిణీ చేయనున్నారు. యూనిఫాంలు కూడా.. నోటుపుస్తకాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తొలిసారిగా యూనిఫాంలను కూడా ప్రభుత్వం అందించనుంది. ఇందుకు సంబంధించిన యూనిఫాం క్లాత్ ఎంఈఓ కార్యాలయాలకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మహిళా సంఘాలకు క్లాత్ను అందించి, మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలను కుట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. కుట్టు ప్రక్రియ పూర్తయిన అనంతరం విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేయనున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఒకవైపు విద్యార్థులకు అవసరమైన నోటుపుస్తకాలను అందిస్తూనే.. మరోవైపు యూనిఫాం కూ డా ఇవ్వడం ద్వారా ప్రభు త్వ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు, హాజరు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. -
వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
వీపనగండ్ల: సంక్షేమ పథకాల అమలులో మామూళ్లు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పుర్గర్చర్లలో కల్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.10 వేలు లంచం తీసుకున్నారని లబ్ధిదారు తెలుపగా వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవనం, కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. భీమా కాల్వ నుంచి శ్రీరంగాపురం రిజర్వాయర్కు సరిపడా సాగునీరు అందేవిధంగా కాల్వల విస్తరణకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ అధికారులు రైతులకు అందజేస్తున్న ట్రాన్స్ఫార్మర్లతో పాటు పరికరాల వివరాలను అందజేస్తే రైతులందరికి తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేలా చూస్తామన్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కేఎల్ఐ, జూరాల కాల్వల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, ఆరుతడి పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, సర్పంచ్లు మీసాల పార్వతమ్మ, రామన్గౌడ్, సుదర్శన్రెడ్డి, రాత్లావత్ గోపాల్, బండారు రాములు తదితరులు పాల్గొన్నారు. -
శుద్ధజలం.. పుష్కలం!
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొల్లాపూర్: మిషన్ భగీరథ పథకానికి నీటి కష్టాలు ఇకపై శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకానికి ప్రతి ఏటా వేసవిలో పలు సమస్యలు ఎదురయ్యేవి. రోజువారీగా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కేఎల్ఐ ప్రాజెక్టుపై తీవ్రమైన భారం పడేది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో కేఎల్ఐపై భారం తగ్గడమే కాకుండా.. మిషన్ భగీరథ స్కీంకు రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే వెసులుబాటు ఏర్పడింది. 84 మండలాలకు సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. నీటి అవసరాలు ఇలా.. మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీలు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్ భగీరత పథకానికి నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యేవి. శాశ్వత పరిష్కారం దిశగా.. మిషన్ భగీరథ స్కీం ప్రారంభమయ్యాక 2018లో నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటుచేసి, కేఎల్ఐ ప్రాజెక్టు వరకు నీటిని తరలించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 6కోట్ల మేరకు వెచ్చించింది. ఆ సమయంలో వరదలు రావడంతో సమస్య పరిష్కారమైంది. మళ్లీ నాలుగేళ్ల క్రితం కూడా నీటి తరలింపు సమస్య ఏర్పడింది. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి, తాగునీటి సమస్యను తీర్చారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. తీరిన ఇక్కట్లు.. తాగునీటి అవసరాలకు ఇన్నాళ్లు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిపైనే అధారపడిన అధికారులు.. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిని కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు కాగా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. వేసవికి ముందు నార్లాపూర్ రిజర్వాయర్ను నింపితే చాలు, మిషన్ భగీరథ స్కీంకు చాలినన్ని నీరు లభిస్తాయి. మిషన్ భగీరథ పథకానికి తీరిన నీటి కష్టాలు ఇకపై కేఎల్ఐతో పాటు పాలమూరు ప్రాజెక్టు నుంచి పంపింగ్ ఏడాది పొడవునా తాగునీటికి బేఫికర్ శాశ్వతంగా తీరనున్న తిప్పలు ఇకపై సమస్య ఉండదు.. గతంలో రెండు పర్యాయాలు వేసవిలో కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీటిి తరలింపునకు సమస్యలు ఎదురయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కావడం.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నూతనంగా నిర్మిస్తున్న చానల్ ద్వారా నీటిని తరలించే పనులు చివరి దశకు చేరడంతో మిషన్ భగీరథ స్కీంకు ఇకపై నీటి సమస్య ఉండదు. శాశ్వతంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు. – అంజాద్ పాషా, డీఈఈ -
‘జైల్భరో విజయవంతం చేద్దాం’
అమరచింత: కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం నిర్వహించే జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అఖిల భారత ఐక్యరైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజన్న, ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం జైల్భరోకు సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని దుకాణ యజమానులకు పంపిణీ చేసి మాట్లాడారు. దేశసంపదంతా అదాని, అంబానీలకు కట్టబెడుతూ కార్మికుల్ని మరింత బానిసలుగా, రైతుల్ని పేదలుగా మార్చడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు. కార్మిక చట్టాలను తిరిగి సాధించుకునే వరకు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, మసలమని, కురుమన్న, ఏసన్న, కుర్మానాయక్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. రేపు బీచుపల్లిలోసీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా నిర్వహించే రాములోరి కల్యాణోత్వసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. యునెస్కో గుర్తింపు కల్పించండి అలంపూర్: అలంపూర్ క్షేత్రానికి యునెస్కో గుర్తింపు కల్పించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్రావు కోరారు. ఈ మేరకు ఆదివారం నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపూర్లోని పురాతన ఆలయాల సముదాయం గత చరిత్ర, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. అదే విధంగా అలంపూర్ క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రసాద్ స్కీం భవనంలో భక్తులకు అన్నప్రసాద సత్రం, వసతి గృహాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. విద్యా సమానత్వం కోసం ప్రజలు పోరాడాలి అచ్చంపేట రూరల్: విద్యా సమానత్వం కోసం ప్రజలు పోరాడాల్సిన అవసరముందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నిర్వహించిన పాలమూరు అధ్యయన వేదిక జిల్లాశాఖ కన్వీనర్, సామాజికవేత్త బాలజంగయ్య 4వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విద్య వ్యాపార వస్తువుగా మారిపోయిందని.. మార్కెట్లో అధిక ధరకు విక్రయించే సరుకుగా విద్యను మార్చడం ఆందోళనకరమన్నారు. దేశంలో కామన్ స్కూల్ విద్యావిధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శతాబ్దాల క్రితమే వివిధ దేశాల్లో ప్రజల సామాజిక అవసరాలకు అనుగుణంగా ఈ విధానం అమలులోకి వచ్చిందన్నారు. దేశంలో సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోయే వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అన్నారు. ఇటీవల యువత చేపట్టిన ఉద్యమాలు అనేక సామాజిక అంశాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చాయన్నారు. బలమైన రాజకీయ, సామాజిక శక్తులు సైతం యువత ఉద్యమాల ముందు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రజలు, యువత అప్రమత్తంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పాలమూరు అధ్యయన వేదిక హైదరాబాద్ కమిటీ మెంబర్ ప్రొ. జి.విజయ్, డా. శ్రీనివాస్, పీబీ స్వామి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శ్రీశైలం పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం
వనపర్తిటౌన్: సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్కు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జీవితం ప్రభుత్వ సేవకు అంకితమై విధులు నిర్వర్తిస్తుంటే.. పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతతో గౌరవప్రదమైన జీవితం గడపడానికి పింఛన్ ఎంతో ముఖ్యమని చెప్పారు. సీపీఎస్ ఉద్యోగులు తమ భవిష్యత్తో పాటు కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకొని సీపీఎస్ రద్దు చేసేందుకు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి సాయిచందర్రెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్కుమార్, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు బౌద్ధారెడ్డి, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీనివాసులు, టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధానకార్యదర్శి శశి, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర బాధ్యులు మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉన్నత విలువలు
వనపర్తిటౌన్: క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన వంటి ఉన్నత విలువలను నేర్పుతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆరేపల్లి వెంకటేశ్వర్లు స్మారక 72వ స్టేట్ సీనియర్ మెన్, ఉమెన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ శారీరక దృఢత్వంతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంపొందించే క్రీడన్నారు. క్రీడాకారులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని నిరంతరం సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని సూచించారు. ఒలింపిక్స్లో మహబూబ్నగర్ జిల్లా నుంచి పాల్గొని పతకాలు సాధించి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో మహిళల భాగ్యస్వామ్యం పెరుగుతుండటం ఆనందకర విషయమని, తమ ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జీవితంలో గెలుపు, ఓటమి సహజమని, సమానంగా స్వీకరించే ఓర్పు, క్రమశిక్షణ క్రీడలతోనే అలవడుతాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు శ్రీనివాస్గౌడ్, భాస్కర్గౌడ్, రవీందర్రెడ్డి, రామ్మోహన్రావు, కోచ్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి బాబా, ద్వారపోగు విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. మహిళల జట్టు : విన్నర్ రంగారెడ్డి, రన్నర్ వరంగల్. పురుషుల జట్టు : విన్నర్ వరంగల్, రన్నర్ నల్గొండ. -
మత్తు.. భవిత చిత్తు!
చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువతరం ● మద్యం, గంజాయి, అశ్లీల వీడియోల మత్తులో.. ● జిల్లాలోని 25 మందిపై కేసులు నమోదు చేసిన సైబర్ పెట్రోలింగ్ విభాగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ, .. స్మార్ట్ఫోన్ల వినియోగంపై నియంత్రణ కరువు పర్యవేక్షణే కీలకం.. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? స్మార్ట్ఫోన్లలో ఏం చూస్తున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలి. వారితో నిత్యం కొంత సమయం గడుపుతూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి.. వాటిలోని మంచి, చెడులను అర్థమయ్యేలా వివరిస్తూ స్నేహపూర్వకంగా మెలగాలి. వారికి ఏదైన సమస్య ఉంటే మనతో చెప్పుకొనేలా మలుచుకోవాలి. వారిని క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలవైపు దృష్టి సారించేలా ప్రయత్నించాలి. విస్తృత అవగాహన అవసరం యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు పోలీస్, ఎకై ్సజ్, వైద్య, విద్య, యువజన సంక్షేమ శాఖలు ప్రస్తుతం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. యువత విద్య, ఉపాధి అవకాశాల్లో సాధించిన అంశాలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు చేరవేసి అందివచ్చిన సాంకేతికతను సక్రమ మార్గంలో వినియోగించుకునేలా నిత్యం అవగాహన కల్పించాలి. ఉదయం ప్రార్థన సమయంలో ప్రముఖుల విజయగాథ వినిపిస్తూ.. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలని నింపాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, చట్టపరమైన పరిణామాలు, మానసిక, శారీరక ప్రభావాలను సైతం వివరించాలి. వనపర్తి: ఉన్నత చదువులతో జీవితానికి బంగారు బాటలు వేసుకోవాల్సిన యువత చెడు వ్యసనాలతో పెడదోవపడుతోంది. కళ్లెదుటే భవిష్యత్ తరం మద్యం, గంజాయి, అశ్లీల వీడియోల కేసులో నిందితులై ఉజ్వల భవిష్యత్ను చేతులారా నాశనం చేసుకోవడం.. ఏటా కేసుల సంఖ్య పెరగుతుండటం ఆందోళనకర సంకేతాలేనని చెప్పవచ్చు. తాము కష్టాల ఊబిలో నుంచి వచ్చాం.. తమ పిల్లలకు ఆ పరిస్థితులు రావద్దని, వారి భవిష్యత్పై ఎన్నో కలలుగన్న తల్లిదండ్రులు ఏమరపాటుతో కల్పించే స్వేచ్ఛ, సౌకర్యాలు వారిని పెడదోవ పట్టిస్తున్నాయని పలు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో పాటు స్మార్ట్ఫోన్లలో నిషేధిత అశ్లీల వీడియోలకు బానిసలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరదాగా మొదలయ్యే అలవాట్లు క్రమంగా వ్యసనంగా మారి చదువు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తెరపై విష సంస్కృతి.. నేటి యువతరం చేతికి స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వీటిని చదువులో అదనపు సమాచారం, ఆధునిక విద్యావిధానం కోసం వినియోగించేవారు కొందరైతే.. మరికొందరు ఇతర వ్యసనాలకు వినియోగిస్తూ కేసుల బారిన పడుతున్నారు. అశ్లీల, హింసాత్మక కంటెంట్కు కూడా సులభంగా చేరువవుతూ బానిసలవుతున్నారు. చెడు వైపు అడుగులు.. ఏడాది వారీగా నమోదైన కేసులు -
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
మదనాపురం: రైల్వేలైన్ విస్తరణలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. మండల కేందరంతో పాటు మండలంలోని కొన్నూరు, నర్సింగాపురం, ద్వారకనగర్ గ్రామాల్లో మొత్తం 125 మంది రైతులు రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోగా.. ఆదివారం కొన్నూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి రూ.3,73,91,502 నష్ట పరిహారం చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రాంతీయ అభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. భూమి కోల్పోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా తగిన పరిహారం చెల్లించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రసూల్బీ, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
సాగు సంబురం
జూరాల, రామన్పాడు జలాశయాలకు జలకళ ● ఆయకట్టులో జోరందుకున్న సాగు పనులు ● వరి, ఆముదం, కంది, పత్తి సాగుపైనే రైతుల ఆశలు ● నీరులేక సరళాసాగర్ ఆయకట్టు వెలవెల ●మదనాపురం: వర్షాభావ పరిస్థితులతో అల్లాడిన అన్నదాతల కళ్లలో ఆనందాన్ని నింపుతూ ఇటీవల కురిసిన వర్షాలు నేలతల్లికి జీవం పోశాయి. వరుణుడి కరుణతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాల జలాశయానికి చేరి ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిగండాన్ని పూర్తిగా తొలగించింది. రామన్న్పాడు జలాశయానికి వరద చేరడంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగడంతో జలకళను సంతరించుకుంది. దీంతో నేరుగా రామన్పాడు జలశయానికి నిరంతరం నీటిని వదులుతున్నారు. ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమమైంది. వర్షాలు ఆలస్యం కావడంతో బోరుబావుల కింద మాత్రమే అరకొరగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు కాల్వల ద్వారా నీరు విడుదల అవుతుండటంతో సాగుపనులు ముమ్మరం చేశారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఆత్మకూర్, అమరచింత మండలాలకు, రామన్పాడు జలాశయం నుంచి కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, గోపల్దిన్నె రిజర్వాయర్ ద్వారా వీపనగండ్ల, పాన్గల్, గణప సముద్రం ద్వారా ఖిల్లా ఘనపురం మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆముదం, పత్తి, కంది సాగు చేసిన రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. రామన్పాడు జలాశయంలో నీటిమట్టం అన్నదాతలు బిజీ.. బిజీ... -
పెట్టుబడిపై నమ్మకం కలిగింది..
మాది రామన్పాడు జలాశయం పరిధిలోని అజ్జకొల్లు గ్రామం. వానాకాలం ఆరంభంలో వర్షాలు ఆలస్యం అవుతాయేమోనని చాలా భయమేసింది. కురవవు అనుకున్న సమయంలో వరణుడు కరుణించడంతో పాటు రామన్పాడు నుంచి నీరు వదలడం మాకు వరంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్నాం. వర్షాల పుణ్యమా అని ఈసారి పెట్టిన పెట్టుబడికి గింజ పండుతుందన్న నమ్మకం ఏర్పడింది. – తోకల రవి, రైతు, అజ్జకొల్లు (మదనాపురం) సాగు పనులు ముమ్మరం.. ఇటీవల కురిసిన వర్షాలు, ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందుతుండటంతో జిల్లాలో సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు అన్నదాతలకు వరంలా మారాయి. భూమిలో తగినంత తేమ శాతం రావడంతో దుక్కులు సులభతరమయ్యాయి. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి -
అధికారుల నిర్లక్ష్యం.. సరళాసాగర్కు శాపం..
జూరాల, రామన్పాడు జలాశయాల ఆయకట్టు పంటల సాగుతో కళకళలాడుతుంటే.. చారిత్రాత్మక సరళాసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో మాత్రం నిరుత్సాహమే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద దంతనూరు, శంకరమ్మపేట, మదనాపురం, తిరుమలాయ్యపల్లి, అజ్జకొల్లు, రామన్పాడు, చర్లపల్లి, నెల్విడి, నర్సింగాపురం, కొన్నూరు గ్రామాలకు చెందిన సుమారు 4,200 ఎకరాల ఆయకట్టు ఉంది. యాసంగిలో నీటిపారుదలశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు ప్రణాళిక, కనీస నియంత్రణ లేకుండా సరళాసాగర్ జలాశయంలోని నీటిని అట్టడుగు భాగం వరకు వదిలారు. కొందరు రైతులు మోటార్లతో ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతున్నా పట్టించుకోలేదు. ఫలితంగా ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయింది. ప్రస్తుతం రామన్పాడు నుంచి సరళాసాగర్కు వారం రోజులుగా రెండు మోటార్లతో నీటిని తరలిస్తున్నా ప్రాజెక్టులో కనీసం 10 అడుగుల నీటిమట్టం రావడానికి మరో పదిరోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆయకట్టుకు నీటిని వదలనున్నారు. ఈలోగా అన్నదాతలకు అత్యంత కీలకమైన వరి నారుమడులు పోసుకునే సమయం పూర్తిగా దాటిపోనుంది. ప్రస్తుతం నాట్లు వేసే సమయం ముగిసిపోతున్న తరుణంలో మొక్కుబడిగా మోటార్లు ప్రారంభించడంతో ఒరిగేదేమి లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. -
మా గురించి ఎవరికీ పట్టదు
అడవిలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోయి బతకడం కష్టంగా మారింది. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ అధికారులు మా వైపే చూడటం లేదు. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నాం. అప్పుడప్పుడు దాతలు వచ్చి దుస్తులు, దుప్పట్లు, సరుకులు ఇస్తున్నారు. చెంచులకు గతంలో మాదిరిగా ప్రత్యేక ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – లింగేష్, సార్లపల్లి పథకాలు అందేలా చూస్తాం.. చెంచు, గిరిజనులకు ప్ర భుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం. చెంచుల కు టుంబాల పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, పోషకా హారం, కేంద్ర ప్రభుత్వ జన్ ధన్ వంటి పథకాల అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. – యాదిగిరి, ఆర్డీఓ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
వనపర్తిటౌన్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నీని ఆయన జ్యోతి వెలిగించి, జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం చాలా ముఖ్యమని, ఏ రంగంలో ఆసక్తి ఉంటే అందులో ప్రతిభ చాటాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసికోల్లాసం, ఏకాగ్రత పెంపొందుతాయన్నారు. జాతీయ క్రీడాకారుడు భాస్కర్గౌడ్, సీనియర్ క్రీడాకారుడు రవీందర్రెడ్డి ప్రోత్సాహంతో నిర్వహించిన పోటీలకు మహబూబ్నగర్ బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు పి.మన్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రామారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. మొదటిరోజు పోటీల్లో నిజామాబాద్ కరీంనగర్పై 35–29, 35–14 తేడాతో, రంగారెడ్డి ఖమ్మంపై 35–22, 35–14, వరంగల్ మహబూబ్నగర్పై 35–23, 35–10 తేడాతో విజయం సాధించాయి. మహిళా విభాగంలో మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ముందంజలో ఉన్నాయి. పురుషుల విభాగంలో రంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జట్లు సెమీ ఫైనల్స్కు చేరాయని, మహిళా విభాగంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జట్లు సెమీ ఫైనల్కు చేరే అవకాశాలు ఉన్నాయని డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వి.వెంకటరమణ, సంయుక్త కార్యదర్శులు కమల్కుమార్, బి.శ్యామ్, తిరుపతి, నారాయణరెడ్డి, తాడిపర్తి సర్పంచ్ లోకారెడ్డి, చీఫ్ రెఫరీ రామకృష్ణారెడ్డి, ఎన్.కృష్ణారెడ్డి, టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఈశ్వర్, వరప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ఆరోపణలు మానుకోవాలి : ఎమ్మెల్యే
వనపర్తి: కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా.. రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగునీటి పారుదల విషయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీడియాతో మాట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు. ఎంజీకేఎల్ఐ లిఫ్ట్–1 పంపులను ఈ నెల 1న ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి ఇప్పటి వరకు 2.7 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్లూరు రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 0.355 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.34 టీఎంసీలు, సింగోటం రిజర్వాయర్ సామర్థ్యం 0.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.40 టీఎంసీలు, జొన్నలబొగడ రిజర్వాయర్ సామర్థ్యం 2.14 టీఎంసీలు కాగా.. 7వ తేదీ నాటికి 1.753 టీఎంసీల నీటి నిల్వ ఉందని వివరించారు. మూడు పంపులతో ఇన్ఫ్లో 2,400 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,100 క్యూసెక్కులుగా నమోదైందన్నారు. కేఎల్ఐ 29 ప్యాకేజీ ఎడమ కాల్వ నుంచి 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవాలు కళ్ల ముందు ఉండగా.. మోటార్లు ఇంకా ప్రారంభించలేదని, సాగునీరు ఇవ్వడం లేదని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎల్నినో సాకు సరికాదు : బీఆర్ఎస్ వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్నినో పేరు చెప్పి పంటలకు నీరు వదలకుండా రోజులు గడుపుతోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ఆరోపించారు. శనివారం పెబ్బేరులోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పార్టీ నేతలకు వ్యవసాయంపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. ప్రస్తుత వర్షాలకు వస్తున్న వరదను ఎలా వినియోగించుకోవాలనే ధ్యాస కూడా లేదని.. జలాశయాల నుంచి నీరు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అనుక్షణం హెచ్చరిస్తున్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కాల్వలకు నీటిని వదలడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 11న నార్లాపూర్ను ముట్టడిస్తామని హెచ్చరించడంతోనే కాల్వలకు నీరు వదిలారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు కర్రె స్వామి, శంకర్నాయుడు, దిలీప్కుమార్రెడ్డి, వనం రాములు, రాజశేఖర్, సాయినాథ్, మన్యం, సాయిరెడ్డి, వడ్డే రమేష్, తదితరులు పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణం కరువు ● 35 వేల జనాభాకు ఏర్పాటు చేయని వైనం ● వాకింగ్ , రన్నింగ్కు ప్రైవేట్ స్థలాలే దిక్కు ● పట్టని పాలకులు, అధికారులు వివరాలు 9లో... -
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కృషి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హాశాంతివనంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ రెండో రోజు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను చదవలేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే పోటీ ప్రపంచంలో సమర్థంగా రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పీయూను నల్లగొండకు కేటాయించి నాగార్జునసాగర్తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. పాలమూరు ప్రాంతానికే యూనివర్సిటీ అవసరాన్ని వివరించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేశామన్నారు. ఉషా నిధులతో పీయూ అభివృద్ధి.. పీయూ అభివృద్ధికి ఉషా నిధులతో వేగం పుంజుకుందని వీసీ శ్రీనివాస్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాలతో పాటు పలు హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, సెమినార్ కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలి భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు యువత కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, నూతన వనరుల వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత యువత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ పరిశోధనలు, స్టార్టప్లు, నూతన ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా కొనసాగినప్పుడే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచేవిద్యా ప్రమాణాల పెంపు పోటీ ప్రపంచంలో రాణించాలంటేనాణ్యమైన విద్య తప్పనిసరి పీయూ నేషనల్ సెమినార్ ముగింపుకార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హాజరైన ఎంపీ డీకే అరుణ, వీసీ శ్రీనివాస్, ప్రొఫెసర్లు -
సమకూరే వసతులు..
పీఎంశ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్లు, స్మార్ట్ బోర్డులు, ఆన్లైన్ లెర్నింగ్ టూల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. కానీ మూడోవిడతలో ఎంపిక చేసి ప్రతిపాదించిన 24 ఉన్నత పాఠశాలలకు పథకం అమలు కాకపోవడంతో వేలాది మంది గ్రామీణ విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరమవుతున్నారు. సాధారణ పాఠ్యపుస్తకాలకే పరిమితమై ఆధునిక సాంకేతిక విద్యను నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. అలాగే ఆయా పాఠశాలల్లో ఉపాధి నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేకంగా వృత్తి విద్యా కోర్సులు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల నవీకరణను చేపడతారు. ఇవికూడా అందక విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితమవుతున్నారు. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన నైపుణ్య కోర్సులు, ఇంటర్న్షిప్ అవకాశాలు దక్కడం లేదు. చివరగా పీఎంశ్రీ పాఠశాలలను పర్యావరణహిత పాఠశాలలు (గ్రీన్ స్కూల్స్)గా రూపొందిస్తారు. సోలార్ ప్యానెళ్లు, వర్షపునీటి నిల్వ నిర్మాణాలు, శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేస్తారు. బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్లు సమకూరకపోతే వారి హాజరుపై ప్రభావం పడుతుంది. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక ర్యాంప్లు, ఆడిజం కేర్సెంటర్లు లేక వారు విద్యాభ్యాసంలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవచూపి తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పునరుద్ధరణ జరిగేనా..?!
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘార ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రారంభం కావడంతో నాలుగో యూనిట్ ప్రారంభానికి జెన్కో అధికారులు సిద్ధం చేశారు. వారం రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జెన్కో అధికారులు గురువారం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటం విశేషం. షార్ట్సర్క్యూట్ కారణంగా.. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటు చేసుకున్న షార్ట్సర్క్యూట్ కారణంగా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ఇచ్చే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రమాదం జరిగిన నాలుగో యూనిట్ను పునరుద్దరించే పనులు వివిధ కారణాలతో ఆలస్యమైనా.. ఎట్టకేలకు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎడమ గట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో యూనిట్లు 6 మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు ఒక యూనిట్లో చేపట్టే విద్యుదుత్పత్తి 150 మెగావాట్లు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రం వివరాలిలా.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ 162.81 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ప్రస్తుతం ఐదు యూనిట్లలో చేపడుతున్నది 750 మెగావాట్లు ఇదే తొలి ప్రమాదం.. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకు ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఆరేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధం చేస్తున్న నాలుగో యూనిట్ వరదలు వస్తుండటంతో వారంలో వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు 2020, ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృత్యువాత ఆరేళ్లుగా సా..గుతున్న మరమ్మతులు అందుబాటులోకి 150 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి రూ.14.93 కోట్లతో మరమ్మతు ప్రమాదం జరిగిన తర్వాత 2021లో నాలుగో యూనిట్ పనులు పునరుద్ధరించేందుకు మరమ్మతు చేపట్టిన అధికారులు ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్ను రూ.14.93 కోట్లతో మరమ్మతు చేపట్టి.. 2023లో పూర్తి చేసినా.. సాంకేతిక సమస్యలతో 72 గంటలు పనిచేసి మళ్లీ ఆగిపోయింది. దీనిపై జెన్కో అధికారులు కమిటీ వేసి పొరపాట్లు, లోపాలను గుర్తించింది. కాంట్రాక్టు సంస్థ పొరపాట్ల వల్లే ప్రమాదం సంభవించిందని, డిజైన్లోనూ లోపాలున్నాయని కమిటీ తేల్చింది. తిరిగి అదే సంస్థ పనులు చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల తర్వాత గతేడాది మాదిరిగానే మరోసారి మరమ్మతు చేపట్టగా.. మళ్లీ అదే తరహాలో 10 గంటలు పనిచేసి ఆగిపోయింది. అయితే రెండేళ్ల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జెన్కో అధికారులను ఆదేశించారు. దీంతో ఈసారి కాంట్రాక్టు సంస్థ, జెన్కో ఇంజినీర్ల పర్యవేక్షణలో మరమ్మతు చేపట్టి.. ట్రయల్ రన్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
సత్వర సేవలకు అప్రమత్తంగా ఉండాలి
కొత్తకోట రూరల్/ఆత్మకూర్: అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులు, రోగులకు అత్యుత్తమ, నాణ్యమైన సేవలు అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని 108, 102 వాహనాల రాష్ట్ర ఫ్లీట్ హెడ్ వరప్రసాదరాజు సిబ్బందిని ఆదేశించారు. గురువారం కొత్తకోట, ఆత్మకూర్లోని 108, 102 వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య పరికరాల పనితీరు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న అత్యవసర వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి క్షతగాత్రులు, రోగులను సమీప ఆస్పత్రులకు సకాలంలో తరలించాలని.. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి, ఎగ్జిక్యూటివ్లు రత్నం, దుర్గాప్రసాద్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఖాజా మైనుద్దీన్, రాము, పైలట్లు అక్బర్, చంద్రశేఖర్, ఆత్మకూర్లో మెడికల్ టెక్నీషియన్లు శ్రీనివాస్, సంజీవ్, అజీం ఉన్నారు. -
‘సీ్త్రనిధి’ సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సీ్త్రనిధి పథకంలో తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని సకాలంలో తిరిగి చెల్లించాలని.. వసూలు చేసిన డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగం చేసినా, అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీ్త్ర నిధి జోనల్ మేనేజర్ టీవీ రవికుమార్ అధ్యక్షతన ఏపీఎం, గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని రుణాలు గ్రౌండింగ్ చేశారు.. రికవరి ఎంత చేశారు అనే వివరాలను జోనల్ మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు, పురపాలికల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేసినా.. తిరిగి వసూలు చేసే విషయంలో జిల్లా చాలా వెనుకబడి ఉందని వివరించారు. కొందరు వీఓలు సభ్యుల నుంచి రుణాలు వసూలు చేసి బ్యాంకుకు చెల్లించకుండా దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. స్పందించిన కలెక్టర్ రుణాలు పొందిన సభ్యుల నుంచి డబ్బులు తిరిగి బ్యాంకుకు చెల్లించే విధంగా ఏపీఎంలు, వీఓలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మొండి బకాయిల కింద మారకుండా చూసుకునే బాధ్యత వీఓలదేనన్నారు. డబ్బులు బ్యాంకులో జమ చేయని వీఓలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు, వడ్డీ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వం సీ్త్ర నిధి పథకం ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తోందని.. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు అందించే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చూడాలని కోరారు. -
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి : ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా ఉత్సాహంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించగా.. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని, అండర్ ఇన్వెస్టిగేషన్, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్లు త్వరగా తెప్పించి ఛేదించాలని సూచించారు. ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని కోరారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఠాణాకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యను శ్రద్ధగా విని సత్వర పరిష్కారం అందించాలని కోరారు. పోలీస్శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే స్పందనలో మానవీయ దృక్పథం, సేవల్లో వేగం, దర్యాప్తులో నిబద్ధత ఉండాలన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీసు అధికారి తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించాలని, ప్రజలతో మమేకమై ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం వేగంగా చేరేలా చూడాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, దాబాలు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్హెచ్ఓలను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా తరచూ తనిఖీ చేసి సాంకేతిక సమస్యలుంటే వెంటనే మరమ్మతు చేయించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని, డ్రంకెన్ డ్రైవ్, నాకాబందీలు, నైట్ పెట్రోలింగ్ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సమీక్షలో డీఎస్పీ గిరిబాబు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
పీఎంశ్రీపై నీలినీడలు..!
జిల్లాలో మూడోవిడతకు 24 ఉన్నత పాఠశాలలు ఎంపిక ● ఏడాది గడుస్తున్నా.. ప్రతిపాదనలకే పరిమితం ● వసతులు, డిజిటల్ విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు ● నైపుణ్య కోర్సులను కోల్పోతున్న వైనం ఆమోదం రావాల్సి ఉంది.. జిల్లాలోని 24 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మూడోవిడత పీఎంశ్రీ పథకం అమలుకు ప్రతిపాదించాం. ఇప్పటి వరకు వాటికి ఆమోదం లభించలేదు. ఆమోదం లభిస్తేనే విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన విద్యను అందించడంతో పాటు పాఠశాలల రూపురేఖలు మారుతాయి. ఈ పథకంలో అధునిక సదుపాయాలకు నిధుల మంజూరుతో పాటు సివిల్ వర్క్స్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తారు. – శేఖర్, సెక్టోరియల్ అధికారి, వనపర్తి వనపర్తిటౌన్: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్స్థాయిలో తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంతికేక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంశ్రీ పథకం జిల్లాలో మూడోవిడత ప్రతిపాదనలకే పరిమితమైంది. మొదటి, రెండు విడతలు పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం మూడోవిడతలో 24 పాఠశాలలను ఎంపిక చేసి ఏడాది గడుస్తున్నా నేటికీ పెండింగ్లో ఉంచడంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయా పాఠశాలలకు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఆమోదం లభించకపోవడంతో విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. జిల్లాలో పీఎంశ్రీ పథకాన్ని దశల వారీగా అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మొదటి విడతలో 10 పాఠశాలలు ఎంపిక చేసి వాటిలో అభివృద్ధి పనులు, డిజిటల్ తరగతుల నిర్మాణం చేపట్టారు. ఆ విజయాన్ని ఆధారంగా చేసుకుని రెండోవిడతలో మరో 11 పాఠశాలలను ఎంపిక చేయగా కేంద్రం నిధులు మంజూరు చేసింది. వీటిలో 6 ప్రాథమిక పాఠశాలలు, 3 కేజీబీవీలు, 4 రెసిడెన్షియల్ పాఠశాలలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ), ఒక మోడల్ స్కూల్, 7 జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలకు డిజిటల్ పరికరాలు, నిధులు అందడంతో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు సమకూరాయి. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా మిగిలిన పాఠశాలల విద్యార్థులకు కూడా ఆయా ప్రయోజనాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు మూడోవిడతలో 24 జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించారు. ఏడాది గడుస్తున్నా ఆమోదముద్ర పడకపోవడంతో ఆయా పాఠశాలల విద్యార్థులు ముఖ్యమైన ప్రయోజనాలను కోల్పోతున్నారు. పాన్గల్లోని పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణలో విద్యార్థినులు (ఫైల్) -
రైస్మిల్లు యజమానిపై కేసు నమోదు
వనపర్తి రూరల్: పెబ్బేరులోని సాయిగోపాల ఇండోటెక్ ప్లాంట్ రైస్మిల్లు యజమానిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్గౌడ్ తెలిపారు. 2022–23 యాసంగి సీజన్లో ప్రభుత్వం అప్పగించిన వరి ధాన్యం లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు పౌరసరఫరాల అధికారులు గుర్తించారన్నారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి సీఎంఆర్ పూర్తిస్థాయిలో అందించకపోవడంతో సుమారు రూ.10 కోట్లకుపైగా నష్టం వాటినట్లు ప్రాథమికంగా నిర్ధారించారని, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. సంఘటితంతోనే ఉత్తమ ఫలితాలు అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం బలోపేతానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని నాబార్డు డీడీఎం మనోహర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2019లో ప్రారంభమైన సంఘం ప్రస్తుతం గుర్తింపు పొందిన స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. చేనేత కార్మికులు సంఘటితంగా పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరని తెలిపారు. కార్యక్రమంలో వీవర్ సర్వీస్ సెంటర్ శ్రీనివాసులు, సంఘం సీఈఓ చంద్రశేఖర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఘనంగా చేనేత ర్యాలీ.. జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులంతా పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి జై చేనేత అంటూ నినాదాలు చేశారు. బస్టాండ్ కూడలిలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్ధ చేనేత కా ర్మికులను పాలకవర్గం సన్మానించింది. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తిరుమల రఘురాం, కోటకొండ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు, కౌన్సిలర్లు మేర్వ రాజు, పారుపల్లి ఉశన్న, అమరచింత చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు పారుపల్లి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మేర్వ అనిల్, కోశాధికారి మ్యాడం కృష్ణయ్య పాల్గొన్నారు. -
మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత
వనపర్తి: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని అన్నివర్గాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమెతో పాటు జెడ్పీ సీఈఓ యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మానవ అక్రమ రవాణాతో మహిళలు, బాలికలు, చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలు, రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉద్యోగాలు, విదేశీ ఉపాధి, విద్య పేరుతో తప్పుడు హామీలిచ్చి మోసం చేయడం, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకొని వల వేయడం, నకిలీ వివాహలు, చిన్నారులను ప్రలోభపెట్టడం లేదా అపహరించడం వంటి మార్గాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందన్నారు. ఇలాంటి ముఠాల బారిన పడితే వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం, శారీరక–మానసిక హింసకు గురికావడం, చదువు, భవిష్యత్ దెబ్బతినడం, కుటుంబాలకు దూరమవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. అనంతరం అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుబడి పని చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్ఐ అంజాద్, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాఽధి అవకాశాలు పెరుగుతాయి..
వనపర్తి ఐటిఐని హబ్గా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతిక విద్యా విధానాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చదువుకున్న ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ది చేసేందుకు ఏఐపీ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కలగనుంది. గ్రామీణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించి దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు సాధించుకునే అవకాశాలు పెరగనున్నాయి. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి ● -
ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ
వనపర్తి: జిల్లాకేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులు, సమస్యలను వివరిస్తూ ఈ నెల 3న సోమవారం ‘ప్రజారోగ్యంపై పట్టింపేది’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు (25), అసోసియేట్ ప్రొఫెసర్లు (43), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (29), ట్యూటర్ (30) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన, 33 మంది సీనియర్ రెసిడెంట్లను గౌరవ వేతనం ఇచ్చే విధానంలో భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 12న తగిన విద్యార్హత ధ్రువపత్రాలతో వాక్–ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని, దరఖాస్తుఫారాలు, ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ఈ ప్రకటన కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. మల్లికార్జున్ సంయుక్తంగా జారీ చేశారు. ఈ నెల 3న ‘సాక్షి’లో ప్రచురించిన కథనం -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
మదనాపురం: గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) ప్రకారం జిల్లాలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రణాళికతో చేపట్టి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం మండలంలోని నర్సింగాపూర్లో పర్యటించి ఫాంపాండ్ నిర్మాణానికి గుర్తించిన స్థలం, మార్కింగ్ ప్రక్రియను పరిశీలించి భూమిపూజ చేశారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను రూపొందించి ప్రజలకు ఉపయోగపడేలా సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రతి పనిలో నాణ్యతతో పాటు పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ యాదయ్య, డీపీఓ రఘునాథ్, ఎంపీడీఓ, సర్పంచ్, సెర్ప్ ఏపీఎం, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు ఉన్నారు. -
పంటమార్పిడిపై దృష్టి సారించాలి
వనపర్తి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా పంటమార్పిడిని ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని రైతులు వరి సాగుపై మొగ్గు చూపినా.. రానున్న వాస్తవ పరిస్థితులను వారికి వివరించి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించేలా మండల వ్యవసాయ అధికారులు కృషి చేయాలన్నారు. జూరాల ప్రాజెక్టు నిండటంతో కేవలం 10 శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటి లభ్యత ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులు వేరుశనగ, ఆయిల్పాం, ఉల్లి, కూరగాయలు, కంది, మినుము తదితర పంటలు సాగు చేసేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యంగా నిర్దేశించినందున తప్పనిసరిగా సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి రోజూ ప్రగతి నివేదికలను సమర్పించాలని కోరారు. ఆయా అంశాలపై ప్రతి వారం సమీక్ష ఉంటుందని.. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ప్రత్యామ్నాయ పంటల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ వివరాల ఆధారంగా రైతులకు ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఫోన్కాల్స్ పంపించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఎంఏఓలు పాల్గొన్నారు. -
ఏఐపీ హబ్గా వనపర్తి ఐటీఐ
● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ వనపర్తి: సంస్థానాధీశుల కాలం నుంచే విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చే వనపర్తికి విద్యాపర్తిగా పేరొచ్చింది. తాజాగా వనపర్తి ఐటీఐని ఏఐపీ (అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్) హబ్గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) క్లస్టర్–8 లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది. రూ.240 కోట్లతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1953లోనే వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో సాంకేతిక విద్య, ఉన్నత విద్యకు నిలయంగా మారింది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో వనపర్తి ఐటీఐకి గద్వాల, మహబూబ్నగర్ బాలికలు, డిండి, మన్ననూరు ఐటీఐలను అనుసంధానం చేస్తూ ఏఐపీ హబ్గా ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించగా ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఉన్నత విద్యతో పాటు పారిశ్రామిక విద్యలోనూ రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలవనుంది. రాష్ట్రంలోని ప్రముఖ నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో వనపర్తి ఒకటిగా మారనుంది. ఈ ప్రాజెక్టుతో వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ల్యాబ్లు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, ఏఐ తదితర కోర్సులు, అధునాతన మిషన్ల తయారీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. -
ఉపాధి పొందుతున్నా..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. తర్వాత సంఘంలో సభ్యత్వం పొందడంతో మగ్గం, ముడి సరుకు అందించారు. తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధికంగా వేతనం చెల్లిస్తున్నారు. ఐదేళ్లుగా నెలకు రెండు జరి చీరలు తయారు చేస్తూ రూ.10 వేల వేతనం పొందుతున్నా. – మహంకాళి బాలస్వామి, నేత కార్మికుడు, అమరచింత అప్పట్లో మాస్టర్ వీవర్స్తో అడ్వాన్స్గా డబ్బులు తీసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. వాటిని విక్రయించాక తిరిగి డబ్బులు చెల్లించేవాళ్లం. ఇప్పడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారి వేతనం బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో ఖర్చులు తీరుతున్నాయి. – పుట్టా శ్రీనివాసులు, నేత కార్మికుడు, అమరచింత గతేడాది చేనేత ఉత్పత్తుల సంఘంలో సభ్యుడిగా చేరా. నెలకు రెండు చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో చేనేత కూలీ దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్రస్తుతం సంఘం అన్నీ భరిస్తూ ముడిసరుకు ఇవ్వడంతో పాటు వేతనం చెల్లించడం, లాభాల్లో వాటా పంచుతోంది. దీంతో కార్మికుడిగా కాకుండా యజమాని అనే ఆలోచనతో మగ్గాలపై చీరలు తయారు చేస్తున్నాం. – ఎం.లక్ష్మణ్, నేత కార్మికుడు, అమరచింత పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. చేనేతను కాపాడాలని, కార్మికులను యజమానులు చేయాలనుకొని నాబార్డు బృందంతో సంప్రదించి సంఘం ఏర్పాటుకు ప్రయత్నాలు చేశా. కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సంఘం ఏర్పాటు చేశా. 20 మందితో ప్రారంభించి నేడు 550 కార్మికుల భాగస్వామయ్యంతో సంఘం కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు ప్రతినెల వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం కంపేనీకి 11 ఎలక్ట్రికల్ జకాటీ మగ్గాలు వచ్చాయి. వీటితో కొత్త డిజైన్లతో పాటు చీరల తయారీ పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. – మహంకాళి శేఖర్, సీఈఓ, అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం ● -
నేటి యువతకు ఆదర్శం ప్రొ. జయశంకర్
వనపర్తి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి దిశగా యువత పయనించాలని ఎస్పీ డా. సునీతారెడ్డి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రొ. కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాది వేసిన మహోన్నత వ్యక్తి ప్రొ. జయశంకర్ అని కొనియాడారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, సమాన అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత, దూరదృష్టి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. జయశంకర్ ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునంద, సీఐ సుగంధ రత్నం, ిసీసీఎస్ సీఐ అశోక్కుమార్, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, రిజర్వ్ ఎస్ఐ వినోద్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి మహబూబ్గర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.మన్మోహన్రావు, వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రటనలో తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయని.. ఈ పోటీల్లో ఇదివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు సైతం పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలు సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో జరిగే 72వ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని వివరించారు. ‘కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతాం’ పాన్గల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధానకార్యదర్శి వంక గోపాల్, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యురాలు కళావతమ్మ తెలిపారు. సీపీఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గురువారం తెల్లరాళ్లపల్లి నుంచి వారు పాదయాత్ర ప్రారంభించి కేతేపల్లి, వెంగళాయిపల్లి, బండపల్లి, బహుదూర్గూడెం మీదుగా పాన్గల్కు 10 కిలోమీటర్లు పూర్తి చేశారు. వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. -
భూ భారతి ఆపరేటర్లకు మంగళం?
నాగర్కర్నూల్/ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఉద్వాసన పలకనుందా.. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నియమించనున్నారా.. అన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననే అనిపిస్తున్నాయి. బుధవారం ఏకంగా కలెక్టరేట్లలో జిల్లాలోని జూనియర్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ విధానంపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. నాగర్కర్నూల్లో స్వయంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వగా.. ఇతర అధికారులు రిజిస్ట్రేషన్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్ల స్థానంలో వీరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది.. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ చేయాలని 2018లో నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ–సెన్ట్రిక్ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకోగా.. వీరిని ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మధ్యలో రెన్యువల్ చేసేవారు. ముందుగా రూ.11 వేల వేతనం ఇవ్వగా ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో చివర్లో నెలవారి వేతనం రూ.21,500 పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్ కింద తీసుకొని.. నెలకు రూ.21,500 వేతనం ఇస్తున్నారు. అయితే ఇది నెలవారిగా ఇవ్వకుండా మూ డు, ఆరునెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఆందోళన భూ భారతి ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమిస్తున్నారని అనుమానంతో గత రెండు రోజుల నుంచి ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం రాష్ట్రంలోని ఆపరేటర్లందరూ హైదరాబాద్లోని గాంధీభవన్కు వెళ్లి నిరసన చేపట్టి తమగోడు వినిపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్, జగ్గారెడ్డిని సైతం కలిసి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని విన్నవించారు. వీరి స్థానంలో జూనియర్ అసిస్టెంట్ల నియామకం ఇప్పటికే కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లు.. 15 నెలల వేతనాలు పెండింగ్ రెండు రోజులుగా నిరసన చేపడుతున్నా స్పందించని ప్రభుత్వం -
ప్రత్యామ్నాయ సాగు బాధ్యత వ్యవసాయ అధికారులదే..
వనపర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణశాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎల్నినో పరిస్థితులు, పంటమార్పిడి, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, మిషన్ భగీరథ తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వర్షపాతం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై చర్చించారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉందని, ఉమ్మడి జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఒకసారి నిండితే సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతుందని నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పంటల మార్పిడిపై లక్ష్యాలు నిర్దేశించి వాటి అమలును నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. జిల్లాలో వేరుశనగ, మినుములు, కంది సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని.. వేరుశనగ సాగు విస్తీర్ణాన్ని 30 వేల నుంచి 40 వేల ఎకరాలు, మినుము సాగును 30 వేల ఎకరాలకు పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉద్యానశాఖ పనితీరును సమీక్షిస్తూ ఆయిల్పాం లక్ష్యాలపై పలు సూచనలు చేశారు. ఆయిల్పాం సాగు లక్ష్యాన్ని 6 వేల ఎకరాలకు పెంచాలని, కూరగాయల సాగు 7 వేల ఎకరాల్లో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని గుడిసెలను ఇందిరమ్మ ఇళ్ల పథకం పరిధిలోకి తీసుకురావడంతో పాటు రూఫ్ రీప్లేస్మెంట్ అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రూఫ్ రీప్లేస్మెంట్కు అర్హులైన కుటుంబాలను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎల్–1 జాబితాలో అర్హులైన కుటుంబాల వివరాలను ఉన్నతాధికారుల లాగిన్కు పంపించాలని సూచించారు. ఇసుకతో పాటు ఇతర నిర్మాణ సామగ్రి లబ్ధిదారులకు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ) హరికృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్లో 15 నెలల వేతనాలు
ఆపరేటర్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు సైతం ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అన్యాయం చేయొద్దు ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆపరేటర్లకు అన్యాయం చేయవద్దు. మా ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్యాయంగా తొలిగించి కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మొదట 300 మందిని తొలిగిస్తామని చెప్పి ఇప్పుడు అందరినీ తొలిగించే కుట్ర చేస్తుంది. వెంటనే తమకు పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలు ఇవ్వాలి. – రాంబాబు, భూ భారతి ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ ● -
సెమినార్కు వేళాయె
● హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీసీలు, కేంద్ర విద్యా శాఖ అధికారులు ● రెండోరోజు పీయూను సందర్శించనున్న వీసీలు ● వచ్చే అతిథులకు హోటళ్లలో బస, వాహనాల ఏర్పాటు ● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన యూనివర్సిటీ అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సెమినార్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 800 మంది వరకు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సమీపంలోని కన్హాశాంతి వనంలో శుక్ర, శనివారాల్లో సెమినార్లో నిర్వహించనున్న సెమినార్లో మొదటిరోజు ప్రారంభ కార్యక్రమం అక్కడే జరుగుతుండగా.. విద్యార్థుల కోరిక మేరకు రెండోరోజు పలు సెషన్స్ పీయూలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీయూలో ఉషా నిధులు వినియోగించి నిర్మించిన భవనాలు, ఇతర సదుపాయాలను పలు యూనివర్సిటీల వీసీలతో పరిశీలించనున్నారు. అలాగే పీయూ విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతి, పరిశోధన తదితర అంశాలను వచ్చిన అతిథులకు వివరించనున్నారు. అదేరోజు సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతివనంలో జరగనుంది. గత విద్యా సంవత్సరంలో యూనివర్సిటీకి పీఎం ఉషా (ప్రధానమంత్రి ఉచ్చత్తర్ శిక్షా అభియాన్) కార్యక్రమం కింద రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పీయూలో జాతీయ సెమినార్ ‘విజన్ ఇండియా–2047’ ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ పేరుతో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం రూ.36 లక్షలు కేటాయించింది. దీంతో దక్షిణ భారతదేశంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పీయూకు మొదటిసారి అవకాశం దక్కినట్లయింది. సెమినార్కు కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రీసెర్చి సాలర్స్, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. నేషనల్ సెమినార్లో వీరు తాము రూపొందించిన నూతన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ శాస్త్ర, సాంకేతికతతో కూడిన పరిశోధనలకు సంబంధించి పలు ఎంఓయూలు (మెమోరాండం ఆఫ్ అండ్ స్టాండింగ్) సంస్థలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఇతర యూనివర్సిటీలతోనూ ఎంఓయూలు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పీయూకు పలు ప్రాజెక్టులు, పరిశోధనల్లో సహకారం వంటివి లభించనున్నాయి. పీయూలో ప్రతి సంవత్సరం సుమారు 650 నుంచి 750 మంది విద్యార్థులు మాస్టర్ డిగ్రీలు పొందుతున్నారు. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ, మైక్రోబయోలజీ, కెమిస్ట్రీ వంటి డిపార్ట్మెంట్ల వారితోపాటు ముఖ్యంగా బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ వంటి కోర్సులు చదివినవారు ఉన్నారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన లా కళాశాల, ఇంజినీరింగ్లో మూడు డిపార్ట్మెంట్ల విద్యార్థులు ఉన్న నేపథ్యంలో కార్యక్రమానికి పలు ప్రైవేటు కంపెనీలు వచ్చి.. పీయూలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసేందుకు ఒప్పందాలు చేసుకోనున్నారు. నేషనల్ సెమినార్ను ఘనంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్ కన్వీనర్గా రిజిస్ట్రార్ రమేష్బాబు, కన్వీనర్లుగా వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ వ్యవహరిస్తున్నారు. కమిటీల్లో వివిధ స్థాయిల్లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు కన్హా శాంతివనంలోనే రెండు రోజుల కోసం వసతి ఏర్పాటు చేయనున్నారు. రెండోరోజు యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి మూడు బస్సుల్లో వివిధ యూనివర్సిటీల వీసీలను తీసుకురానున్నారు. ఎయిర్ పోర్టు, బస్టాండ్, రైల్వేస్టేషన్స్ నుంచి వచ్చే అతిథులను ప్రత్యేక వాహనాల ద్వారా శాంతివనానికి తరలించనున్నారు. పీయూ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ మొదటిరోజు కన్హా శాంతివనంలో ప్రారంభం కాగా.. రెండోరోజు పీయూలో పలు సెషన్లు నిర్వహించి.. అనంతరం సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతి వనంలోనే చేపడుతాం. పీయూకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం. యూనివర్సిటీ గొప్పతనం చాటేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీసీలు హాజరుకానున్నారు. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ పీయూకు దక్కిన అరుదైన అవకాశంతో యూనివర్సిటీ గొప్పతనం చాటేలా జాతీయ సెమినార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీని ద్వారా యూనివర్సిటీకి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరి సహకారంతో శాంతివనం, పీయూలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేస్తాం. – మధుసూదన్రెడ్డి, సెమినార్ కన్వీనర్ -
పథకాల అమలులో నిర్లక్ష్యం సరికాదు
వనపర్తి: అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు సత్వర ఫలితాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించి ఫాంపాండ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్), ఉపాధి కూలీల సమీకరణ, జలసిరి పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా గ్రామాల్లో నిర్మిస్తున్న ఫాంపాండ్ల నిర్మాణాలను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎన్ఎఫ్బీఎస్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధి కూలీల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జలసిరి పనులు నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు. నిర్లక్ష్యానికి తావులేకుండా పని చేసి ప్రతి కార్యక్రమంలో ఆశించిన పురోగతి సాధించాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నీరున్నా.. నిట్టూర్పే!
‘అమరచింత’ ఆయకట్టుకు అందని సాగునీరు అమరచింత: వేసవిలో చేపట్టాల్సిన ఎత్తిపోతల సెక్షన్ పైపుల మరమ్మతు ప్రస్తుత వానాకాలంలో కొనసాగుతున్నాయి. కృష్ణానదికి వరద వచ్చి జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి పారుతుంటే సమీపంలోనే ఉన్న అమరచింత ఎత్తిపోతల ఆయకట్టు రైతులు మాత్రం సాగునీరు వినియోగించుకోలేకపోతున్నారు. సెక్షక్షన్ పైపుల మరమ్మతు పూర్తయితే తప్పా లిఫ్ట్కు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో వరి నారుమడులు సిద్ధం చేసుకొని సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరో వారం పాటు మరమ్మతులు కొనసాగుతాయని.. పూర్తయిన వెంటనే ఆయకట్టుకు నీటిని అందిస్తామని లిఫ్ట్ నిర్వహణ కమిటీ చెబుతోంది. ఇప్పటికే సాగునీరు వదలాలని రైతుల నుంచి ఒత్తిడి వస్తున్నా.. 26 ఏళ్ల కిందట ఏర్పాటు చేసుకున్న సెక్షన్ పైపులను మార్చి కొత్త పైపులను అమర్చుకునే పనులు కొనసాగుతుండటంతో రైతుల విజ్ఞప్తిని వింటూనే త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే దయాకర్రెడ్డి హయంలో నాబార్డు నుంచి రూ.11 కోట్లతో 2,400 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అమరచింత ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. లిఫ్ట్ డ్రమ్ము మరమ్మతుకు గురికావడంతో తెలంగాణా ఉద్యమ సమయంలో లిఫ్ట్ సందర్శనకు వచ్చిన నాటి ఎమ్మెల్యే హరీశ్రావు ఎంపీ నిధుల నుంచి రూ.60 లక్షలు మంజూరు చేయించారు. చిన్న చిన్న మరమ్మతులతో సాగునీటిని అందించిన ఎత్తిపోతలకు ప్రస్తుతం అతిపెద్ద మరమ్మతు సెక్షన్ పైపులను మార్చడమేనని ఆయకట్టు రైతులు అంటున్నారు. యాసంగిలో క్రాప్హాలిడే.. అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు రెండేళ్లుగా యాసంగి సీజన్లో సాగునీరు సరఫరా చేయక క్రాప్ హాలీడే ప్రకటించారు. ఈసారైనా వానాకాలంలో సకాలంలో వరిసాగు చేద్దామనుకున్న రైతుల ఆశలకు ఎదురుచూపులే మిగిలాయి. వరద వేళ కొనసాగుతున్న సెక్షన్ పైపుల మరమ్మతు గతేడాదే రూ.56 లక్షలు మంజూరు టెండర్ పూర్తయినా.. అగ్రిమెంట్ ఆలస్యం సాగునీటికి ఆయకట్టు రైతుల ఎదురుచూపులు -
నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
పాన్గల్: ఫర్టిలైజర్ డీలర్లు నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మల్లాయిపల్లి, రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లి, పాన్గల్లోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వలు, రికార్డులను పరిశీలించారు. దుకాణం ఎదుట నిల్వ వివరాలు, ధరలు ప్రదర్శించాలన్నారు. ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎఫ్ఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ సేల్ యాప్ జిల్లాలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుండటంతో దుకాణాల్లో స్టాక్ వివరాలు, ఈపీఓఎస్ మిషన్ స్టాక్ను తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో తెలియని వ్యక్తులు విక్రయించే నకిలీ డీఏపీ, ఫెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ను కొనుగోలు చేయవద్దని కోరారు. అలాంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జ్ ఏఓ రమేష్నాయక్ ఉన్నారు. -
మరో వారం రోజులు..
త్వరగా సాగునీరు అందించాలి.. అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 4 ఎకరాల పొలం ఉంది. యాసంగిలో క్రాప్ హాలీడే ప్రకటించడంతో ఈసారి వానాకాలంలోనైనా వరి సాగుచేద్దామని బోరుమోటారు నీటితో వరి నారుమడిని సిద్ధం చేసుకున్నా. త్వరగా సాగునీరు విడుదల చేసి పంటలు పండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత 26 ఏళ్ల తర్వాత మరమ్మతు.. అమరచింత ఎత్తిపోతల పథకం నిర్మించి 26 ఏళ్లు అవుతోంది. లిఫ్ట్ ఏర్పాటు సమయంలో వేసిన 5 పైపులకు చిన్నపాటి రంధ్రాలు ఏర్పడటంతో మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా.. మరమ్మతుకు చిన్ననీటి పారుదలశాఖ నుంచి రూ.56 లక్షలు మంజూరు చేశారు. ఆయా పైపులతో పాటు బ్రేకర్ను ఈసారి మార్చుతున్నాం. – ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం నిర్వహణ కమిటీ ●అమరచింత ఎత్తిపోతల పథకం పంప్హౌజ్ వద్ద సెక్షన్ పైపుల బిగింపు పనులు మరో వారం పాటు కొనసాగనున్నాయి. యాసంగిలోనే పూర్తి కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించాం. పనులు పూర్తికాగానే ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రతిపాదనలు పంపాం. – వంశీకృష్ణ, ఏఈ చిన్ననీటిపారుదలశాఖ -
సకాలంలో యూనిఫాంల తయారీ
వనపర్తి/వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న యూనిఫాంల కుట్టు పనులు నాణ్యతగా, వేగంగా పూర్తిచేసి నిర్దేశిత గడువులోగా అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. వనపర్తి పురపాలికలో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుట్టు కేంద్రంతో పాటు మండలంలోని రాజపేటలో సెర్ఫ్ కుట్టుకేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ యూనిఫాంల కుట్టు పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. ప్రతి యూనిఫాంను నిర్ణీత ప్రమాణాల మేరకు కుట్టి ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. కుట్టు పనులు ఆగస్టు 10వ తేదీలోగా పూర్తిచేసి సకాలంలో సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట పుర కమిషనర్ నిరంజన్, డీపీఎం, మెప్మా, సెర్ప్ అధికారులు, కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. -
నీటి‘కబురు’
కలెక్టర్ సమీక్ష.. జూరాల ప్రాజెక్టుకు స్థిరంగా వరద నీరు కొనసాగుతుండడంతో కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ మంగళవారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సీజన్లో ప్రాజెక్టుకు ఎంతమేర వరద వచ్చింది.. కర్ణాటక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల వరద నీటి స్థితిగతులు వంటి వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం, గేట్ల పనితీరు, హైడల్ పవర్ హౌజ్లో విద్యుదుత్పత్తి వంటి వివరాలపై ఆరాతీశారు. అదేవిధంగా కుడి కాల్వ పరిధిలో లైనింగ్ మరమ్మతులను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జూరాల– ఆర్డీఎస్ లింక్ కెనాల్కు నీటి విడుదల వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరి పండించే రైతులు పంటకాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, చెరువులను కృష్ణాజలాలతో నింపుకోవాలని సూచించారు. అదేవిధంగా జూరాలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో ఎస్ఈ కేశవరావు, డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ నందిని తదితరులున్నారు. గద్వాల: వానాకాలం మొదలై రెండు నెలలు గడిచినా వరద నీరు లేక ఒట్టిపోయిన జూరాల జలాశయం.. వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో జలకళ సంతరించుకుంది. ఈ వానాకాలం సీజన్లో గరిష్టంగా మంగళవారం 2 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు భారీగా వరద కొనసాగుతుండడంతో మొన్నటి వరకు ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని ఇస్తామని చెప్పిన అధికారులు తాజాగా పూర్తిస్థాయి పంటల సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జూరాలను సందర్శించి వరద నీటి వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెలుగొందుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టు కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వల పరిధిలో 1.09 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.40 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో దాదాపు నెలన్నర రోజులపాటు వర్షాలు కురవక.. కృష్ణానదిలో నీరు పారక జూరాల ప్రాజెక్టు అడుగంటింది. దీంతో అధికారులు జలాశయంలో అందుబాటులో ఉన్ననీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టు కింద ఉన్న ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. కానీ, జూరాల కింద అప్పటికే సుమా రు 60 వేలకుపైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రై తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కృష్ణాబేసిన్ పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షా లు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వర ద వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయకట్టుకు నీటి విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతన్నకు తీపికబురు.. స్థానికంగా పెద్దగా వానలు కురవకపోయినా.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. గడిచిన వారం రోజులుగా వరద జలాల రాక స్థిరంగా కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి రిజర్వాయర్లకు ఎత్తిపోతలు చేపట్టారు. ఆయకట్టులోని సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఇన్నాళ్లు ఎల్నినో ప్రభావంతో వరి వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడిన అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కృష్ణానదికి పోటెత్తుతున్న భారీ వరద గడిచిన వారం రోజులుగా జూరాల స్థిరంగా ప్రవాహం జూరాల ఆయకట్టుకు సాగునీటి విడుదలకు నిర్ణయం నెట్టెంపాడు, ఆర్డీఎస్, జూరాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాలు అన్నదాతల హర్షం.. సాగు పనుల్లో నిమగ్నం -
పారదర్శకంగా భూ రిజిస్ట్రేషన్ల నిర్వహణ
వనపర్తి: భూ భారతి విధానంలో భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జూనియర్ అసిస్టెంట్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై జిల్లాలోని వివిధ మండలాల జూనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. రెవెన్యూశాఖలో భూ భారతి అత్యంత కీలకమైందని, రైతులు, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లక్ష్య సాధనలో జూనియర్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని.. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, డిజిటల్ సంతకాలు, సంబంధిత పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సాంకేతిక లోపాలకు తావులేకుండా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తూ లాగిన్ ప్రక్రియ నుంచి దరఖాస్తుల ఆమోదం వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, శిక్షణలోనే సందేహాలను మాస్టర్ ట్రైనర్ల ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. శిక్షణలో కలెక్టరేట్ పరిపాలనాధికారి భానుప్రకాష్ , మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
‘జైల్భరో’ జయప్రదం చేయండి
పాన్గల్: క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జిల్లాకేంద్రంలో ఈ నెల 10న నిర్వహించే జైల్భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు రేగిచెట్టు నిరంజన్ పిలుపునిచ్చారు. మంగళవారం సీఐటీయూ మండల కన్వీనర్ సూర్యవంశం రాము అధ్యక్షతన నిర్వహించిన మండల సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న జైల్భరోలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయా సంఘాల నాయకులు దేవేందర్, జంబులయ్య, భాస్కర్, శ్యామల, మహేశ్వరి, రేణుక, సుజాత, లక్ష్మి, సుగ్రీవుడు, డీవైఎఫ్ఐ మండల కన్వీనర్ కమలాకర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు కేజీబీవీ విద్యార్థి ఎంపిక ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న కోట్ల నందిని రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి లలిత, పీఈటీ చిట్టి తెలిపారు. ఈ నెల 1న జిల్లాకేంద్రంలో జరిగిన ఎంపికల్లో అండర్ 18 విభాగం వెయ్యి మీటర్ల పరుగుపందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందని.. ఈ నెల 7న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరుఫున పాల్గొంటుందని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని ప్రత్యేక అధికారి, పీఈటీతో పాటు గ్రామపెద్దలు ఆగారం ప్రకాష్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. పశువుల సంత @ రూ.1.94 లక్షలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని పశువుల సంత రూ.1.94 లక్షలు పలికింది. మంగళవారం పుర కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన బహిరంగ వేలం నిర్వహించగా ముగ్గు రు పాటదారులు పాల్గొన్నారు. సర్కార్ పాటను రూ.1.40 లక్షల పైచిలుకుతో పుర అధికారులు ప్రారంభించగా.. గుజ్జుల భరత్ రూ.1.94 లక్షలు పాడి దక్కించుకున్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ ఎం.మాధవి, కమిషనర్ నిరంజన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం : సీపీఐ
అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, నీటిపారుదల వసతులు కల్పించినప్పుడే వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దశాబ్ద కాలానికిపైగా ప్రధాని మోదీ అపూర్వ ప్రగతి సాధించినట్లు ఒక చిత్రాన్ని ప్రాజెక్టు చేస్తోందని ఆరోపించారు. దళిత ఆదివాసీలపై దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న న్యూడిల్లీలోని రాంలీలా మైదానంలో జరగబోయే యే బద్లావ్ జరూరీ హై ర్యాలీతో ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అబ్రహం, మక్తల్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీహరి, కో–కన్వీనర్ నర్సింహ, లక్ష్మి శెట్టి, శ్యాంసుందర్, భాస్కర్, మోషా, నాగరాజు, లక్ష్మీనారాయణ, అంజి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి
వనపర్తిటౌన్: విశ్రాంత ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన రూ.900 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యం డిమాండ్ చేశారు. బస్భవన్ ముట్టడిని అడ్డుకోవడంతో మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌక్లో విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు బకాయిలు చెల్లించండంటూ బస్భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయో వృద్ధులని చూడకుండా అరెస్టులు చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. 2017 నుంచి రావాల్సిన ఆర్బీఎస్, గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్నాథ్రెడ్డి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు రామచంద్రారెడ్డి, అంజయ్య, ఉపేందర్, ప్రకాష్, సత్యనారాయణగౌడ్, హుస్సేన్ అలీ, స్వామి, రాఘవరెడ్డి, బీవీ రావు, గాంధీ, కురుమయ్య, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలతో రోగ నిరోధకశక్తి మెరుగు
మదనాపురం: శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని, పుట్టిన ప్రతి బిడ్డకు 30 నిముషాల నుంచి గంటలోపు ముర్రుపాలు పట్టించడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండలంలోని తిరుమలాయపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శిశువుకు మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలన్నారు. బాలింతలు తమ రోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో బిడ్డకు సరిపడా పాల ఉత్పత్తి జరుగుతుందని సూచించారు. అంగన్న్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీపీఓ రాజలక్ష్మి, సూపర్వైజర్ జ్యోతి, ఉపాధ్యాయులు రాధ, శారద, అరుణ, తారమ్మ, హంసమ్మ, సుజాత, ఎంఎల్టీలు రతన్, ముజాఫర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోలీసు ప్రజావాణికి 22 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 22 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఎస్పీ సునీతారెడ్డికి వివరించి.. వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా విని, తక్షణ పరిష్కారం చూపడం పోలీసుశాఖ ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి.. సంబంధిత అధికారుల సమన్వయంతో చట్టబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ అన్నారు. అమరచింతలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు లొంగిపోయి.. వ్యవసాయ ఉత్పత్తులను జీరో ట్యాక్స్తో దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించడం దారుణమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించి.. పారిశ్రామిక యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బకొట్టి.. పెట్టుబడిదారుల ఖజానా నింపడమే ప్రధాని మోదీ తన కార్తవ్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న దేశవ్యాప్తంగా చేపట్టనున్న జైల్భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, రైతు సంఘం జిల్లా కోశాధికారి వెంకటేశ్, ప్రభాకర్, బుచ్చన్న, నాగేంద్రమ్మ, శంకర్, రాజు, మోహన్, భగవంతు, హరికృష్ణ, రేణుక ఉన్నారు. -
తుర్క కాషా ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొత్తకోటలోని ఓ కన్వెన్షన్ హాల్లో తుర్క కాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ. 54లక్షల వ్యయంతో (ఒక్కో లబ్ధిదారుడికి రూ. 60వేల విలువైన యూనిట్) వందశాతం రాయితీపై జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది లబ్ధిదారులకు రూ. 12కోట్ల వ్యయంతో పనిముట్ల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తుర్క కాషా కమ్యూనిటీ సభ్యులు అత్యంత కష్టమైన వృత్తితో జీవనోపాధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న జనరేటర్లు, టూల్ కిట్లు వారి ఉపాధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. తుర్క కాషా కమ్యూనిటీ కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా పథకాన్ని అమలు చేయడం సంతోషకరమన్నారు. ప్రజా పాలనలో అన్ని వర్గాలు, అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. తుర్క కాషా కమ్యూనిటీ అవసరాల దృష్ట్యా షాదీఖానాల నిర్మాణానికి సహకరించాలని ఆయన మంత్రిని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పల్లవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, తుర్క కాషా కమ్యూనిటీ అధ్యక్షుడు బడే సాబ్, టీజీఎంఎఫ్సీ ఏజీఎం ప్రవీణ్ కులకర్ణి, పవర్బిల్ట్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్, సీడీసీ చైర్మన్ చంద్రమోహన్రెడ్డి, నాయకులు పి.కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, ఎన్జే బోయేజ్, బీచుపల్లి యాదవ్, పెంటన్నయాదవ్, సుభాష్ పాల్గొన్నారు. -
ఇక్కడే సీటు ఇప్పించండి..
నేను 6 నుంచి 10వ తరగతి వరకు పెద్దమందడి టీజీడబ్ల్యూఆర్ఎస్/జేసీలో చదివాను. ఎస్సెస్సీలో 501 మార్కులతో పాసయ్యాను. అనంతరం ఇంటర్ ప్రవేశ పరీక్ష రాయగా.. నాకు మక్తల్లో సీటు కేటాయించారు. ఇక్కడ చదివిన వారికి ఇక్కడే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. అలా జరగలేదు. ఇక్కడ టీసీ ఇవ్వడంతో మక్తల్ టీజీడబ్ల్యూఆర్ఎస్/జేసీలో ఇంటర్ బైపీసీలో చేరాను. అక్కడ తాగునీరు పడక తరచుగా అనారోగ్యానికి గురవుతున్నా. చదువుకు ఇబ్బందిగా మారింది. మక్తల్ నుంచి పెద్దమందడి గురుకులానికి ట్రాన్స్పర్ చేసి.. నా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలి. – డి.పల్లవి, వెలగొండ, చిన్నంబావి మండలం -
సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం
వనపర్తి రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు, శ్రీరంగాపురం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ శాఖల వారీగా ప్రగతి నివేదికలపై నిశితంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయా శాఖల అధికారులు సరైన సమాచారం లేకుండా పొంతన లేని సమాధానాలు చెప్పడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సంబంధిత అంశాలపై స్పష్టత ఇవ్వని విద్యుత్ లైన్మ్యాన్కు నోటీస్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. శ్రీరంగాపురంలో విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోయిన ఎంఈఓ హనుమంతుకు మెమో జారీ చేయాలన్నారు. సమావేశానికి ఇరిగేషన్శాఖ అధికారులు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీరంగాపురంలో రూ. 10లక్షలతో నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవనం, రూ.10 లక్షలతో మండల మహిళా సమాఖ్య భవనం, రూ.30 లక్షలతో గోదాం నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పీఎంశ్రీ పాఠశాలలో రూ. 14.50 లక్షలతో ఏర్పాటుచేసిన కంపూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారులు సుధారాణి, యాదయ్య, సింగిల్విండో చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, వైస్చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు సత్యనారాయణరెడ్డి, వరలక్ష్మి ఉన్నారు. -
టెక్నికల్గా తగ్గించారా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పెట్టని, బకాయిలు చెల్లించని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అస్త్రం ప్రయోగించగా.. జిల్లాస్థాయిలో కొందరు అధికారులు, సిబ్బంది దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్తకోణం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పలువురు జిల్లా స్థాయి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ వర్గాలతో పాటు రైస్ మిల్లర్లలో ఈ చర్చ జోరుగా సాగుతుండగా.. కలకలం సృష్టిస్తోంది. అసలేం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. మిల్లర్లు బకాయి పడిన మొత్తం చెల్లించాలని ప్రభుత్వ ఇటీవల అల్టిమేటం జారీ చేసింది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నప్పటికీ.. స్పందన లేకపోవడంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ సిటీ యూనిట్–2, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా గత నెల 29న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుబ్బా అశోక్కు చెందిన ఇబ్రహీంబాద్లోని రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మెట్రిక్ టన్నుల (1,26,772 బస్తాలు) ధాన్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రెండు లారీలను సైతం సీజ్ చేశారు. లోపాయికారిగా సర్దుబాటు? మిల్లుల్లో భారీగా ఉండాల్సిన ధాన్యం కొరతను సిబ్బంది నామమాత్రంగా తక్కువ చేసి చూపే ప్రయత్నం జరిగినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ వర్గాల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 లక్షల బస్తాలు లేకున్నా.. కేవలం 1,26,772 బస్తాలు మాయమైనట్లు తేల్చడం వెనుక ఏదో మతలబు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కించిన సిబ్బందికి ఆ మిల్లర్తో గత పరిచయాలు ఉన్నాయని.. ఈ మేరకు సహకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఓ అధికారి చక్రం తిప్పి తక్కువ బస్తాలు చూపించేలా సర్దుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విచారణ జరిపిస్తేనే వెలుగులోకి.. శ్రీబాలాజీ మిల్లుకు సంబంధించి 2022–23 రబీ సీజన్ బకాయిలు సుమారు రూ.19.50 కోట్లు ఉండగా.. ఇప్పటివరకు మూడు దఫాలుగా రూ.2.60 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే విజిలెన్స్ అధికారులు మా సమ్మతి లేకుండానే సుమారు లక్ష ఇరవై వేల బస్తాలు లేవని ప్రెస్కు రిలీజ్ చేశారని సదరు మిల్లు నిర్వాహకుడు మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తే.. ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పలువురు అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. విచారణ జరిపినా ఇంకా కేసు నమోదు చేయకపోవడంపై ఉన్నతాధికారులు జిల్లా సివిల్ సప్లయ్ శాఖ సిబ్బందికి చీవాట్లు పెట్టినట్లు సమాచారం. రైస్ మిల్లర్లలో ముదిరిన పోరు.. తనిఖీలు నిర్వహించిన మిల్లుకు సంబంధించిన నిర్వాహకుడు ప్రస్తుతం మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2022–23 రబీకి సంబంధించిన సీఎమ్మార్ ధాన్యం అంశంపై ఆయన కొంత మంది మిల్లర్లతో కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని.. విజిలెన్స్ తనిఖీలు చేపట్టిందని.. సయోధ్యతో పోతే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేవని జిల్లాలోని పలువురు మిల్లర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఆయన నోటి దురుసుతో మాట్లాడడమే చేటు తెచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లర్లలో పోరు ముదురుతున్నట్లు తెలుస్తోంది. లెక్కింపు సమయంలోనే..రైస్ మిల్లుల్లో విజిలెన్స్ బృందం తనిఖీల సందర్భంగా జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకోవడం సహజం. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గణేష్ తదితర అధికారులు చేరుకుని ఇబ్రహీంబాద్లోని శ్రీ బాలాజీ మిల్లులో ఉన్న వడ్ల బస్తాల లెక్కింపు కోసం ఇద్దరు జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకున్నారు. ఈ మేరకు సదరు సిబ్బంది వడ్ల బస్తాల నిల్వలను గడ (స్టాక్) ఆధారిత భౌతిక లెక్కింపు (ఫిజికల్ వెరిఫికేషన్) విధానంలో లెక్కగట్టారు. గోదాంలో వడ్ల బస్తాలను చట్రంలా ఒక పద్ధతి ప్రకారం అమర్చిన మేర పొడవు, వెడల్పు, ఎత్తులను కొలిచి మిల్లులో ఉన్న బస్తాల సంఖ్యను తేల్చారు. గోనె సంచుల్లో బరువు ఆధారంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందనేది నిర్ధారించారు. అయితే ఇక్కడే మాయాజాలం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘శ్రీ లక్ష్మీ బాలాజీ’లో విజిలెన్స్ తనిఖీల్లో కొత్తకోణం వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం పౌరసరఫరాల శాఖ సిబ్బందిపై అనుమానాలు లోపాయికారి ఒప్పందంలో ఓ అధికారి హస్తం? సివిల్ సప్లయ్ డీఎస్ఓ, డీఎం మధ్య పంచనామా లొల్లి రైస్మిల్లర్స్ అసోసియేషన్లో ముదురుతున్న పోరు ఇరువురి మధ్య ‘పంచనామా’ లొల్లి.. నిబంధనల ప్రకారం వడ్ల బస్తాల లెక్కింపు పూర్తయిన వెంటనే అక్కడికక్కడే స్థల పంచనామా రికార్డులు రాస్తారు. బస్తాలు లెక్కించిన వివరాలు, కేటాయింపులతో పోలుస్తూ వ్యత్యాసాలు స్పష్టంగా నమోదు చేస్తారు. ఆ తర్వాత తనిఖీ చేసిన అధికారులు, మిల్లు యజమాని లేదంటే సదరు మిల్లు ప్రతినిధి, సాక్షులు (రెవెన్యూ, సివిల్ సప్లయ్ సిబ్బంది) సంతకాలు తీసుకుంటారు. ఇక్కడ సివిల్ సప్లయి డీఎస్ఓ గంప శ్రీనివాస్ మిల్లు యజమాని లేదా సదరు మిల్లు ప్రతినిధి సంతకం లేకుండానే రిపోర్ట్ను జిల్లా మేనేజర్ రవినాయక్కు పంపించినట్లు సమాచారం. దీన్ని డీఎం ధ్రువీకరించారు. దీనిపై వివరణ కోసం డీఎస్ఓతో ఫోన్లో మాట్లాడేందుకు ‘సాక్షి’ సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. ఆ శాఖలోని మరో అధికారిని సంప్రదిస్తే.. మిల్లు యజమాని లేదా ప్రతినిధి సంతకాలు అవసరం లేదని, విజిలెన్స్ అధికారులకు ఒక కాపీ ముందుగానే అందజేస్తారని తెలిపారు. -
రైతులకు కుచ్చుటోపీ..!
పెబ్బేరు కేంద్రంగా ఓ వ్యాపారి మామిడి కొనుగోలు ● నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా కాలయాపన ● మోసపోయామని గుర్తించి ఎస్పీని ఆశ్రయించిన బాధిత రైతులు ● తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకోలు ●బుక్కచిట్టీ రాసిచ్చాడు.. రూ. 55వేల విలువైన మామిడి కాయలు విక్రయించగా.. బుక్క చిట్టీపై రాసిచ్చాడు. ఆ తర్వాత డబ్బుల కోసం మూడు నెలలుగా తిప్పించుకుంటున్నాడు. వీపనగండ్ల మండలంతో పాటు పాన్గల్, పెబ్బేరు మండల్లాలోని రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. రోజుకో తేదీ చెబుతూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రైతులకు రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. – వెంకట్రెడ్డి, మామిడి రైతు, వీపనగండ్ల నిర్లక్ష్యంగా సమాధానం.. మూడు నెలల క్రితం మామిడి కాయలు విక్రయించాను. నాకు రూ. 66వేలు రావాలి. హైదరాబాద్లోని మార్కెట్కు వెళ్లి విక్రయించేందుకు ఖర్చు, శ్రమ పడాల్సి వస్తుందని పెబ్బేరులోనే విక్రయించాను. సదరు వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బుల కోసం గట్టిగా ప్రశ్నిస్తే.. నేను నష్టపోయా.. ఇవ్వలేను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. – నారాయణ, మామిడి రైతు, వీపనగండ్ల త్వరలోనే చెల్లిస్తా.. రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలకు ఎగుమతి చేశా. అక్కడి వ్యాపారులు మోసం చేశారు. చివరగా తీసుకెళ్లిన లోడ్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్లో యాపిల్స్ సీజన్ ప్రారంభమవుతుంది. అందులో నుంచి రైతులకు డబ్బులు చెల్లిస్తాను. అందరు వ్యాపారుల మాదిరిగానే బుక్క చిట్టీలపై లావాదేవీలు చేశాను. కొందరు రైతులు ఒత్తిడి తీసుకొస్తే.. చెక్కులు ఇచ్చాను. – సోమశేఖర్, వ్యాపారి వనపర్తి: మూడు నెలల క్రితం రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసిన ఓ వ్యాపారి.. చెల్లింపుల సమయం వచ్చేసరికి మొఖం చాటేశాడు. చివరకు తాము మోసపోయిన గుర్తించిన బాధిత రైతులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ సునీతారెడ్డిని ఆశ్రయించి.. తమకు న్యాయం చేయాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి పెబ్బేరు కేంద్రంగా ఓ రైస్మిల్లు గోదాంలో పండ్లు నిల్వచేస్తున్నాడు. అయితే ఈ ప్రాంతంలో పండిన మామిడి కాయలను సరైన ధరకు కొనుగోలు చేస్తానంటూ.. రైతులను నమ్మబలికాడు. ఒకటి, రెండుసార్లు కాపు వచ్చిన తొలినాళ్లలో కొంత మొత్తంలో కొని చెప్పినట్టుగానే సకాలంలో డబ్బులు చెల్లించాడు. దీంతో వీపనగండ్ల, పెబ్బేరు, పాన్గల్ మండలాలకు చెందిన సుమారు 150 మంది రైతులు మామిడి ఉత్పత్తులను సదరు వ్యాపారికి విక్రయించారు. అయితే మామిడి కొనుగోలుకు సంబంధించి డబ్బుల లెక్కను బుక్కచిట్టీలపై రాసిచ్చిన సదరు వ్యాపారి.. నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అప్పుడూ.. ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తున్నాడంటూ సోమవారం పోలీసు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. 45రోజుల పాటు కొనుగోలు.. పెబ్బేరు శివారు ప్రాంతంలోని పాడుపడిన రైస్మిల్లులో రైతుల నుంచి మామిడి కాయల కొనుగోలు ప్రక్రియ నిర్వహించారు. 45రోజుల పాటు మామిడి కొనుగోళ్లు సాగినప్పటికీ స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కనీసం అనుమతులు తీసుకోవడం.. మార్కెట్ ఫీజు ఊసెత్తిన దాఖలాలు లేవు. -
సమస్యలు ఆలకించి.. వినతులు స్వీకరించి
● ప్రజావాణికి 50 ఫిర్యాదులు ● త్వరగా పరిష్కరించాలనిఅదనపు కలెక్టర్ల ఆదేశం వనపర్తి/వనపర్తి రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వినతులు స్వీకరించారు. మొత్తం 50 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించి.. ఆ సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదుదారుడికి తెలియజేయడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన దరఖాస్తులను సైతం సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రెండు అర్జీలు అందినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.తిరుపతయ్య పాల్గొన్నారు. -
పోలీసుల పహారా అవసరం..
జూరాలకు వరద వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలుతున్నారు. ఈ సమయంలో పోలీసుల పహార లేక పర్యాటకులు దిగువ నది వద్ద పరవళ్లను చూసేందుకు దిగువ నదిలోకి వెళ్తున్నారు. ఉధృతంగా పారుతున్న నీటితో ఆడుకుంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాలి. – వెంకటేష్, నందిమళ్ల జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఎక్కువగా ఉండటంతో భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం అధికసంఖ్యలో పర్యాటకులు రావడంతో దిగువ పుష్కరఘాట్ రోడ్ను మూసివేసి నదిలోకి వెళ్లకుండా పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశాం. సూచిక బోర్డుల ఏ ర్పాటుతో పాటు ప్రాజెక్టుపై వాహనాలు ని లుపకుండా తగిన చర్యలు చేపడుతున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూర్ ● -
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
వనపర్తిటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యన్న ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వనపర్తి బస్టాండ్ ఆవరణలో తొలగించిన కుర్చీలను తిరిగి ఏర్పాటు చేయించాలన్నారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని.. బస్టాండ్ ఆవరణలో సిమెంట్ కుర్చీలను తిరిగి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా స్నేహితుల దినోత్సవం వనపర్తిటౌన్: కుల, మత, ప్రాంతాల సరిహద్దులు లేని ఏకై క పవిత్ర బంధం స్నేహమని వాసవి వనితక్లబ్ అధ్యక్షురాలు కొంపల రజిత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో వాసవి వనిత క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పారు. వివిధ క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్నేహబంధం జీవితంలో అత్యంత విలువైందని.. కష్టసుఖాల్లో తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులని చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి పాపిశెట్టి రాధిక, కోశాధికారి కటకం ప్రశాంతి, వనితక్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలే అమృతం
జిల్లా పరిధిలో ఇలా.. వనపర్తి: తల్లీబిడ్డల మధ్య ఆత్మీయతను పెంచేవి తల్లిపాలు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని.. పోషక పదార్థాలను అందిస్తాయి. బిడ్డ పుట్టిన తల్లి ప్రతిరోజు లీటరు పాలు అదనంగా తాగితే నవజాత శిశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కానీ, ఇటీవల పాల డబ్బాలు పిల్లల ఆరోగ్యాన్ని, తల్లి ఆప్యాయతను దూరం చేస్తున్నాయి. బిడ్డకు సుమారు రెండేళ్లపాటు పాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువ మంది తల్లులు కేవలం ఏడాది మాత్రమే ఇస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనంలోనూ తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల విశిష్టతను తెలియజేసేలా.. 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల సంస్కృతిని రక్షించడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఏటా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందు లో భాగంగా తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బా లింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. పోతపాలు, పాల పౌడర్ కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి చెదిరిపోతుందనే ఉద్దేశంతో బిడ్డకు పాలివ్వడం లేదు. వీరిలో ప్రధానంగా సంపన్న వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్న ట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరికొందరు ఒక్కసారి బిడ్డకు ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత పాలు రావడం లేదని వదిలేస్తారు. వైద్యుల సలహా తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మెడిసిన్ ద్వారా 30 శాతం మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. డబ్బాపాలు తాగిస్తే బిడ్డ కడుపు నిండుతుందే కానీ పోషకాలు అందవు. ముర్రుపాలు ఎంతో శ్రేష్టం.. ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటివి. బిడ్డకు ఆ పాలు యాంటీ బయోటిక్స్లా ఉపయోగపడతాయి. మూడు రోజులపాటు పసుపురంగులో వచ్చే ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. పుట్టిన ప్రతి బిడ్డకు వచ్చే కామెర్లు.. ఈ పాలు తాగిస్తే 90 శాతం తగ్గుతాయి. తల్లిపాలతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మేధోసంపత్తి పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతోపాటు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలతో బిడ్డ పేగులో నుంచి విసర్జకాలు తొలగిపోతాయి. ఎలర్జీలు రావు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి. ఐసీడీఎస్ ప్రాజెక్టులు 3 అంగన్వాడీ కేంద్రాలు 589 గర్భిణులు, బాలింతలు సుమారు 14,800 డబ్బా పాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు -
జిల్లాస్థాయి అథ్లెటిక్స్లో కొత్తకోట క్రీడాకారుల ప్రతిభ
కొత్తకోట రూరల్: హన్మకొండ జేఎన్ స్టేడియంలో ఆగస్టు 7, 8 తేదీల్లో జరిగే 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జావెలిన్ డే అథ్లెటిక్స్ మీట్–2026కు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–6 విభాగంలో కొత్తకోటకు చెందిన టి.యశ్విక 60 మీటర్లు, 150 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం సాధించింది. అదే విభాగంలో అప్పరాలకు చెందిన యు.కారుణ్య 60 మీటర్లు, 150 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. అండర్–8 విభాగంలో కొత్తకోటకు చెందిన టి.గగన్కుమార్రెడ్డి 200 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. అండర్–10 విభాగంలో అప్పరాలకు చెందిన వి.జోష్నవి 300 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం, యు.భావన బ్రాడ్ జంప్లో ద్వితీయ స్థానం పొందారు. అండర్–12 విభాగంలో అప్పరాలకు చెందిన వి.లేఖన 400 మీటర్ల పరుగుపందెంలో, జి.నందిని షాట్పుట్ పోటీలో తృతీయ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందారని వ్యాయామ విద్యా శిక్షకుడు ఎం.అజయ్కుమార్ తెలిపారు. విజేతలను స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లా, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
కమిటీ సభ్యులు పరిశీలించాల్సిన అంశాలు..
● సమస్యల వలయంలో జీజీహెచ్ ● 205కుపైగా వైద్యులు, సిబ్బంది ఖాళీలు ● కదలిక లేని ఆర్కేఎస్, హెచ్ఎంసీ కమిటీలు ● రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య వనపర్తి: ఆస్పత్రి నిర్వహణ, రోగుల సంక్షేమం, నిధుల వినియోగం, సమస్యల పరిష్కారం, వైద్యసేవలను పర్యవేక్షించాల్సిన ఆర్కేఎస్ (రోగి సంక్షేమ సమితి), హెచ్ఎంసీ (హాస్పిటల్ మేనేజ్మెట్ కమిటీ)లు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తూ.. మమా అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల మంది రోగులు వైద్యం కోసం వచ్చే జిల్లా జనరల్ ఆస్పత్రిపై అధికార, పాలకవర్గం సరైన దృష్టి సారించడం లేదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో ఇనుప మంచాలు తుప్పుపట్టగా, కిటికీలు పగిలిన అద్దాలతో దర్శనమిస్తున్నాయి. ఇక శుద్ధజల కేంద్రం వద్ద నిత్యం చిత్తడే. రక్త పరీక్షల విభాగంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే విద్యార్థులతో రక్త సేకరణ చేయడం, కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షల కోసం బయటకు సిఫారస్ చేస్తుండటం లాంటివి వెలుగు చూస్తున్నాయి. రోగాల సీజన్ వచ్చినట్లే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యసేవలు, వైద్యుల కొరత లేకుండా చూడటంతో పాటు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వేర్వేరు కమిటీలు ముందస్తుగా సమావేశమై.. కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఆయా కమిటీలు ఆస్పత్రిని సందర్శించిన దాఖలాలు ఒకటి రెండు కంటే ఎక్కువగా లేవు. అందులోనూ.. ఒక్కరిద్దరు సభ్యులే వచ్చినట్లుగా తెలుస్తోంది. నిత్యం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు వెయ్యి నుంచి 1,100 మందికిపైగా ఓపీ వస్తుండటంతో జిల్లా జనరల్ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. సేవల మెరుగే ప్రధాన లక్ష్యం.. ఆర్కేఎస్, హెచ్ఎంసీ సభ్యులు జీజీహెచ్లో వైద్య, ఇతర సేవలను మెరుగుపర్చాలి. కానీ ఆ దిశగా కమిటీలు పని చేసింది తక్కువేనని చెప్పవచ్చు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి సభ్యులు హాజరై ఉచిత సలహాలు ఇవ్వటమనే ధోరణి ఇప్పటి వరకు కొనసాగడం శోచనీయం. పర్యవేక్షణకు నోచుకోని అంశాలు.. రోగులకు స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య చర్యలు నిర్దేశించిన సమయానికి చేపట్టడం, టోకెన్ల జారీ ప్రదేశాల్లో వసతులు, బెడ్లు, ఫర్నీచర్, విద్యుత్, జనరేటర్, పవర్ బ్యాకప్ అంశాలను పరిశశీలించాలి. విద్యుద్ధీపాలు, ఫ్యాన్లు, ఆస్పత్రి పైకప్పు నుంచి వర్షపునీరు లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వనపర్తి జీజీహెచ్లో అత్యవసర విభాగం ముఖద్వారం వద్ద వర్షపు నీరు లోనికి వస్తోంది. జిల్లా ఆస్పత్రిలో ఖాళీలు.. విభాగం మంజూరైన పనిచేస్తున్న ఖాళీలు పోస్టులు వారు ప్రొఫెసర్లు 22 13 9 అసోసియేట్ ప్రొఫెసర్లు 24 6 18 అసిస్టెంట్ 90 24(రెగ్యులర్) 53 13 (కాంట్రాక్ట్) సిబ్బంది (అన్ని విభాగాలు) 489 361 128 ● వైద్యులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా? సిబ్భంది అందుబాటులో ఉన్నారా..? ● మందుల కొరత, ఎక్స్రే, స్కానింగ్ యంత్రాల నిర్వహణ, శస్త్రచికిత్సలు, ఇతర వైద్యసేవలు నిర్వహణ, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, అంబులెన్స్ సేవలు, ఆస్పత్రిలో స్వచ్ఛత, రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యత, బయో వేస్టేజ్ నిర్వహణ, రోగుల ఫిర్యాదులు, మరణాలు, ముఖ్యంగా శిశు మరణా లపై సమీక్షలు, ఆస్పత్రి భద్రత, ప్రభుత్వ ఆరోగ్య పథకాలను నిత్యం పరిశీలించాల్సి ఉంటుంది. -
11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టొదు అమరచింత: ఉధృతంగా ప్రవహించే నీటితో ఆటలొద్దని.. సెల్ఫీల కోసం పోటీపడి ప్రాణాలను పణంగా పెట్టొదని అమరచింత ఎస్ఐ స్వాతి సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జూరాల ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామని.. దిగువ పుష్కరఘాట్ వద్దకు వెళ్లే రహదారిని మూసి వేయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు రహదారిపై వాహనాలు నిలువకుండా పార్కింగ్కు స్థలం కేటాయించామని తెలిపారు. వరదను చూడాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని.. పోలీసుల సూచనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు. సందర్శకులు సురక్షిత ప్రదేశాల నుంచే కృష్ణమ్మ అందాలను తిలకించాలని.. అ త్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. అన్నవరం క్షేత్రానికిప్రత్యేక బస్సు కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఈ నెల 8న ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. భద్రాచలం, విజయవాడ, అన్నవరం, వైజాగ్, సింహాచలం చేరుకుంటుందని పేర్కొన్నారు. 11న సాయంత్రం తిరిగి కొల్లాపూర్ చేరుకుంటుందని ఆయన వివరించారు. బస్సులో రానుపోను ప్రయాణ చార్జీలు నాలుగు రోజులకు పెద్దలకు రూ. 3వేలు, పిల్లలకు రూ. 2వేలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు టికెట్ల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సంప్రదించాలని సూచించారు. -
‘జైల్భరోను విజయవంతం చేయాలి’
ఖిల్లాఘనపురం: కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను నీరుగారుస్తోందని.. కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్కోడ్లు అమలు చేయడంతో కార్మికులు చట్టబద్దమైన హక్కులు కోల్పోతున్నారని, యాజమాన్యాలకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా.. పరోక్షంగా సమర్థిస్తున్నారని తెలిపారు. కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని చెబుతున్నా.. అమలుకు నోచుకోవడం లేదన్నారు. మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారని.. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నాయకులు, కార్మికులు సాయికృష్ణ, భీమయ్య, వెంకటేష్, నాగయ్య, మునేందర్, శివ, నజ్మ, పద్మ, సంగీత, ప్రియాంక, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..
జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టి తీసుకెళ్లాం. ఆయన తన నిధులిచ్చి పరిష్కరించేందుకు ఆదేశించారు. ఖాళీలున్నా.. నిత్యం వచ్చే ఓపీ సేవలు, ఇన్పేషంట్ల సేవల విషయంలో ఎక్కడా రాజీపడకుండా సేవలందిస్తున్నాం. కమిటీ సమావేశం చివరగా ఏప్రిల్ 6న నిర్వహించాం. మళ్లీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్య పరీక్షలు పూర్తిగా ఆస్పత్రిలోనే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. – డా. చంద్రమోహన్, సూపరింటెండెంట్, జీజీహెచ్ -
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే
గోపాల్పేట: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినందని.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ప్రజా ఆరోగ్యం, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తోందని, అందరూ సహకరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శనివారం రేవల్లి, ఏదుల మండలాల్లో జరిగిన మండల సర్వసభ్య సమావేశాలకు ఆయన హాజరయ్యారు. మూడు నెలల పురోగతిని శాఖల వారీగా అధికారులు వివరించగా.. సర్పంచుల ద్వారా సరైన సమాచారమా లేదా అని ఆరా తీశారు. రేవల్లిలో యూరియా బస్తాపై రూ.30 అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవల్లి, నాగపూర్లో రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించనున్నామని తెలిపారు. సభకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని.. మరోసారి రాకుంటే సస్పెండ్ చేయిస్తామన్నారు. ఏదులలో మిషన్ భగీరథ ట్యాంకులు మూడు మ్యాప్లో ఉన్నాయని.. ఊర్లో చూస్తే కేవలం రెండే ఉన్నాయని సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ మంచినీరు గ్రామాల్లో సరఫరా కాకుంటే సర్పంచులు సంతకాలు చేయొద్దని సూచించారు. ఎస్ఐఆర్, ఈ–కేవైసీపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కె వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశిలారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లోడె రఘు, ప్రత్యేక అధికారి జ్యోతి పాల్గొన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలు వనపర్తి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని.. 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ సంస్థ, సంఘం, వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించి అను మతి పొందాలన్నారు. చట్టాలను గౌరవించడ ం ప్రతి పౌరుడి బాధ్యతని.. ప్రజలందరూ పో లీసుశాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్ష ణలో భాగస్వాములు కావాలని సూచించారు. ‘కార్మికులపై తప్పుడు ఆరోపణలు సరికాదు’ వనపర్తి రూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటి, పేషెంట్కేర్ కా ర్మికులపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేసి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ హెచ్చరించారు. వనపర్తి మాత, శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని దొంగతనం నెపంతో తొలగించగా ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. శనివారం ఆయన జిల్లా ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం కార్మికలు, ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై చర్చలు జరిపారు. తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకోవడానికి ఏజేన్సీ నిర్వాహకులు అంగీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కనీస వేతనాలకు నోచుకోక ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తూ రోగులకు సేవలు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను చిన్న చిన్న పొరపాట్లు బూచిగా చూపి తొలగించడం సరికాదన్నారు. 14న వేలం పాటలు చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న ఆలయం వద్ద బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. లడ్డూ, ప్రసాదం, కొబ్బరికాయలు, పూల దండలు, పూజ సామగ్రి, వాహన పూజ సామగ్రి, తలనీలాల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణ, దుకాణదారులకు విద్యుత్ లైటింగ్ వసతి కల్పించుట, రంగుల రాట్నం, ,ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు వేలం నిర్వహించేలా దేవాదాయశాఖ నిర్ణయించినట్లు చెప్పారు. వేలంలో పాల్గొన దలచినవారు కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, తలనీలాలు, రంగు రాట్నం, ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం రూ.5లక్షల డీడీ, పూలు, పూలదండలు, టెంకాయల చిప్పల సేకరణ, విద్యుత్ లైటింగ్ వసతి కల్పించేందుకు రూ.2 లక్షల డీడీ తీసుకొని రావాలని ఈఓ తెలిపారు. -
సిబ్బందిని నియమించాలి..
పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత ఉండటంతో అత్యవసర సమయంలో వైద్య సేవలు అందడం లేదు. అనారోగ్యానికి గురైన గొర్రెలను కాపాడుకోలేకపోతున్నాం. దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతున్నారు పాలకులు వెంటనే ఖాళీలను భర్తీచేసి జీవాల ఇబ్బందులు తొలగించాలి. – మల్లేష్, గొర్రెల పెంపకందారు, కొత్తకోట గ్రామంలో పశుసంపద అధికంగా ఉంది. పశువుల దవాఖాన ఉన్నప్పటికీ శాశ్వత వైద్యుడు లేకపోవడంతో ఇన్చార్జితోనే సేవలు అందిస్తున్నారు. ఆయన ఎప్పడు వస్తారో తెలియదు. కంపౌండర్ పశువులకు వైద్యం చేస్తారు. అధికారులు స్పందించి శాశ్వత వైద్యుడిని నియమించాలి. – ఎం.రాజు, సంకిరెడ్డిపల్లి, కొత్తకోట పశువులకు వైద్యం చేయడానికి సరిపడా సిబ్బంది లేరు. దీంతో తామే తోచిన విధంగా చికిత్సలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలి.– వెంకటయ్య, పాడి రైతు, సూగూరు, పెబ్బేరు● -
యూడీఐడీ కార్డుల జారీ వేగవంతం
వనపర్తి: దివ్యాంగులకు సంబంధించిన యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అఽధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న యూడీఐడీ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 2025, మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,647 యూడీఐడీ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం 782 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆయా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. -
ఉన్నతాధికారులకు విన్నవించాం..
పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత ఉంది. వివిధ స్థాయిల్లో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పశువైద్య సేవలు, రైతులకు అందించే పలు సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పశువైద్యశాలలు, పశు ఆరోగ్య ఉపకేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక ప్రస్తుతం ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది. ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. – వెంకటయ్యగౌడ్, ఇన్చార్జి జిల్లా పశువైద్యాధికారి -
82 మంది బాల కార్మికులకు విముక్తి
వనపర్తి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోందని.. జిల్లాలో 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా పూర్తయిందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 82 మంది బాలకార్మికులను రక్షించామని, వీరిలో 78 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని చెప్పారు. బాలలను చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న 26 మంది యజమానులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకున్నామని. రక్షించిన బాలలను సంబంధిత శాఖల సమన్వయంతో పునరావాసం కల్పించి, వారి తల్లిదండ్రులకు బాలల హక్కులు, నిర్బంధ విద్య, కలిగే నష్టాలపై అవగాహన కల్పించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాలల హక్కులను పరిరక్షించడం, వారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయడంలో పోలీసుశాఖ, కార్మికశాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యా, వైద్యశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని వివరించారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించడం, బలవంతంగా భిక్షాటన చేయించడం, పశువుల కాపరులుగా, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు, పరిశ్రమలు లేదా ఇతర పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినా లేదా బాలలపై వేధింపులు, దోపిడీ జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
పశువుల ‘మూగ’ రోదన
జిల్లా పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత ● మొత్తం పోస్టులు 124.. ఖాళీలు 40 ● నియామకాలు చేపట్టని ప్రభుత్వం ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాడి రైతులు కొత్తకోట రూరల్: జిల్లా పశు సంవర్ధకశాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా.. నియామకాలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో పశువైద్య సేవలు అందడంలో జాప్యం నెలకొంటోంది. జిల్లాలో 2 ప్రాంతీయ పశువైద్యశాలలు, 19 ప్రాథమిక పశువైద్యశాలలు, 29 పశు ఆరోగ్య ఉపకేంద్రాలు మొత్తం 50 ఉన్నాయి. ప్రతి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఒక పశువైద్యుడు, సహాయకుడు, సబార్డినేట్.. అలాగే పశు ఆరోగ్య ఉప కేంద్రాల్లో లైవ్ స్టాక్ ఆఫీసర్, ఆఫీస్ సబార్డినేట్ ఉండాలి. జిల్లాలో మొత్తం 124 అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులు ఆర్థికంగా ఎదగడానికి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ పశువులు, గొర్రెలు, మేకలు రోగాల బారిన పడినప్పుడు చికిత్స అందించేందుకు సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. గొర్రెలకు నట్టల నివారణ, వ్యాధి నిరోధక, పారుడు రోగ నివారణ టీకాలు ఏటా రెండు నుంచి మూడుసార్లు వేస్తారు. అలాగే పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, వర్షాకాలం ప్రారంభంలో వచ్చే గొంతువాపు, జబ్బవాపు టీకాలు వేస్తుంటారు. అలాగే పశువులు, గొర్రెలు, మేకలు రోగాల బారిన పడినప్పుడు సత్వర చికిత్సలు అందించడానికి సరిపడా సిబ్బంది లేకపోవడంతో పెంపకందారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పశువులు అనారోగ్యానికి గురైతే ఎద్దులబండి కట్టుకొని పశు వైద్యశాలకు తీసుకొచ్చేవారు. ప్రస్తుతం అవి కనుమరుగుకావడంతో పశువులను వైద్యశాల వరకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. దీంతో పశు వైద్యాధికారులే ఇళ్లు, పొలాలకు వెళ్లి చికిత్సలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించినప్పుడే సత్వర వైద్యసేవలు అందుతాయి. ఎనిమల్ మొబైల్ మెడికల్ అంబులెన్స్ సేవలు సాయంత్రం ఐదుగంటల వరకే అందుతుండటంతో ఎమర్జెన్సీ సేవలు కరువయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికై నా పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత తీర్చాలని పాడి రైతులు, పెంపకందారులు కోరుతున్నారు. జిల్లా పశువైద్యాధికారి 1, సహాయ సంచాలకులు 2, పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులు 8, వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి 4, జూనియర్ వెటర్నరీ అధికారి 2, లైవ్ స్టాక్ అసిస్టెంట్ 2, వెటర్నరీ అసిస్టెంట్ 12, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) 9. -
గోల్మాల్..!
రూ.1,000 కోట్ల 2022–23 రబీ సీఎమ్మార్లో మాయాజాలం సీఎమ్మార్ చెల్లించని డీఫాల్టర్ల నుంచి క్రమక్రమంగా డబ్బుల వసూలుకు ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టింది. నిర్దేశిత గడువు విధిస్తూ.. ఆ లోపు చెల్లించాలని సూచించింది. తొలి గడువు ఆగస్టు 5 సమీపిస్తున్నా.. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జూలై చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఒక్కో మిల్లులో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం లేకపోవడంతో పాటు పలువురు మిల్లర్ల దందా వెలుగులోకి రాగా చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా గోల్మాల్ చోటుచేసుకుంది. 2022–23 యాసంగికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)లో అక్రమాలకు అంతే లేకుండా పోయింది. మిల్లర్ల మాయాజాలం, పౌర సరఫరాల శాఖ ఉదాసీనత, పలువురు సిబ్బంది ధనదాహం వెరసి ప్రభుత్వానికి పెట్టిన పెట్టుబడి సైతం అందకుండాపోయింది. ఎట్టకేలకు దృష్టి సారించిన సర్కార్.. విజిలెన్స్ తనిఖీలకు శ్రీకారం చుట్టడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. సోదాల్లో ఒక్కో మిల్లు బాగోతం వెలుగులోకి వస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో ఈ అంశం హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు అప్పట్లో ఏం జరిగింది, ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్.. యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యాన్ని ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మర ఆడించి బియ్యం ఇచ్చేలా.. లేదంటే టెండర్ ద్వారా ధాన్యం విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే 2022–23 యాసంగిలో ఎక్సెస్ ధాన్యం రావడం, అంతగా నాణ్యత లేకపోవడం (తడిసిన ధాన్యం)తో మిల్లర్లు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెండర్ ద్వారా వేలం వేసినా.. పలు కారణాలతో రద్దయింది. కొన్ని మిల్లులు కొంత మేర సీఎమ్మార్ బియ్యం పెట్టడం, వేలంలో కొంత మేర విక్రయించింది పోనూ.. 90 శాతానికి పైగా ధాన్యం ఆయా మిల్లుల వద్దే ఉన్నాయి. 86జిల్లాలోని హన్వాడ మండలపరిధిలో ఉన్న ఎంఎస్ శ్రీలక్ష్మి బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో జూలై 29న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ సిటీ–2 యూనిట్ అధికారులు.. జిల్లా సివిల్ సప్లయ్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 1,26,772 ధాన్యం బస్తాలు లేవని నిర్ధారించారు. అంతేకాదు.. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న రెండు లారీలను మిల్లు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో మిల్లర్లలో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. 2022–23 యాసంగి సీఎమ్మార్ బకాయిలను వసూలు చేస్తున్నాం. ఆ సీజన్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 71,060 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లుల్లో ఉన్నాయి. వీటి విలువ రూ.152 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే ఆయా మిల్లర్లకు నోటీసులు అందజేశాం. అందరూ నిర్దేశిత గడువులోపు కట్టాల్సిందే. లేకుంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తప్పవు. ఈ రెండు రోజుల్లో రూ.21 కోట్లు వసూలయ్యాయి. – రవినాయక్, సివిల్ సప్లయ్ డీఎం, మహబూబ్నగర్ ఎక్సెస్ పేరిట మిల్లర్ల అక్రమాల పర్వం టెండర్ రద్దుతో మిల్లుల వద్దే లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోవడంతో పంచాయితీ సీరియస్గా తీసుకున్న సర్కార్.. డీఫాల్టర్లపై చర్యలకు ఆదేశాలు విజిలెన్స్ తనిఖీలతో మిల్లర్లలో వణుకు.. పౌరసరఫరాలశాఖలో సైతం.. 2022–23 రబీ సీఎమ్మార్ డబ్బులను త్వరగా చెల్లించేలా.. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. చాలామంది మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడం.. మిల్లుల్లో ధాన్యం, బియ్యం లేకపోవడాన్ని ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సదరు మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. డీఫాల్టు మిల్లులకు సీఎమ్మార్ కేటాయింపులు చేసిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు విజిలెన్స్ ఉన్నతాధికారులు సమాయత్తమవుతుండడం జిల్లా పౌర సరఫరాల శాఖలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. ఇటీవల సర్కారు సీరియస్గా దృష్టి సారించింది. మిల్లర్లు బకాయి పడిన సీఎమ్మార్ మొత్తం అందజేయాలని, లేకుంటే తీసుకున్న ధాన్యం తిరిగి ఇవ్వాలని.. లేదంటే క్వింటాల్కు రూ.2,260 చొప్పున డబ్బులు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు డబ్బులు కట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో నిర్దేశిత గడువు (ఈనెల ఐదో తేదీ లోగా 50 శాతం, సెప్టెంబర్లో 25 శాతం, అక్టోబర్లో మిగిలిన 25 శాతం)లోపు చెల్లించేలా మిల్లర్లతో సంతకాలు తీసుకున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి..
సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసులో భాగంగా వీబీజీ రాంజీ పథకంలో 20 ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్నాం. సరైన సమయానికి వేతనం రాదు.. పనికి తగిన వేతనం చెల్లించడం లేదు. అయినా ఎప్పటికై నా క్రమబద్ధీకరిస్తారనే ఆలోచనతో విధులు నిర్వర్తిస్తున్నా నేటికీ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇక చేసేది లేక హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టడం తప్పడం లేదు. – బాలయ్య, జిల్లా అధ్యక్షుడు, వీబీజీ రాంజీ తాత్కాలిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల ఆందోళన ఉండటంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకేళుతున్నాం. ప్రస్తుతం కొత్తగా ఇంచార్జి తీసుకోవడం ద్వార పూర్తి స్థాయిలో ఉద్యమం గురించి తెలుసుకోని, గ్రామీణ ప్రాంతాలలో వీబీజీ రాంజీ పనులు కొనసాగేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో ముందుకు వెలుతాం. – రాంమహేశ్వరరావు, ఇన్చార్జి డీఆర్డీఓ -
నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
వనపర్తిటౌన్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జావెలిన్ డే అథ్లెటిక్స్ మీట్– 2026కుగాను జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–6లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్జంప్, 150 మీటర్లు, అండర్–8లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్జంప్, 200 మీటర్లు, అండర్ –12లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్జంప్, 300 మీటర్లు, అండర్ –14లో కిడ్స్ జావెలిన్, అండర్–16, 18, 20, మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో జావెలిన్ త్రో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో ఎంపికలు కొనసాగుతాయని.. ఉదయం 8 గంటలలోపు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్నంబర్ 94413 53375 సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ అమరచింత: ఎల్నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం చౌకధర దుకాణాల్లో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీకి శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి లబ్ధిదారు ఒక్కరికి 6 కిలోల చొప్పున 3 నెలలకుగాను 18 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు 8,600 మెట్రిక్ టన్నుల బియ్యం విడతల వారీగా సరఫరా చేయనున్నారు. 3 నెలల బియ్యం బస్తాలను నిల్వ చేసేందుకు స్థలం కొరత ఉందని రేషన్ డీలర్ల అభ్యర్థన మేరకు విడతల వారీగా సరఫరా చేయడానికి పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో 1,83,568 రేషన్ కార్డులు ఉండగా ఇందులో తెల్ల రేషన్ కార్డులు 1,67,367, అంత్యోదయ కార్డులు 9,912, అన్నపూర్ణ కార్డులు 114 ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా కొనసాగుతుండటంతో దిగువ, ఎగువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 11.141 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 11.86 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 12.327 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ప్రస్తుతం 35 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. -
డ్రై డేను సమర్థవంతంగా నిర్వహించాలి
వనపర్తి రూరల్: ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల సహకారంతో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులను నివారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పెబ్బేర్లోని 7వ వార్డుతో పాటు మండలంలోని బునియాదిపూర్లో పర్యటించి ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమ నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నివాస ప్రాంతాలను పరిశీలిస్తూ వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన ఆరోగ్య, పారిశుద్ధ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో పాత్రలు, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర వ్యర్థ వస్తువుల్లో నీటి నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నివారణ మందులను పిచికారీ చేయడం, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చడం, పిచ్చి మొక్కలను తొలగించడం, మురుగు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలను వ్యాధి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బునియాదిపూర్లో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ వెంట పుర చైర్మన్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కుల సాధనకు పోరాటం
వనపర్తి రూరల్: జిల్లాలోని అసంఘటితరంగ కార్మికులందరినీ ఏకం చేసి వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాలరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం పెబ్బేరులోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సంఘం జిల్లా 4వ మహాసభల ముగింపు కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ ఎన్నికకు ఉప ప్రధానకార్యదర్శి నర్సింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రతిఘటించేందుకు, హక్కులు కాపాడుకునేందుకు కార్మిక లోకాన్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీహరి, ప్రధానకార్యదర్శిగా మోషా, ఉపాధ్యక్షులుగా రఘు, శ్యాంసుందర్, సహాయ కార్యదర్శులుగా శ్రీరామ్, గోపాలకృష్ణ, కోశాధికారిగా భాస్కర్తో పాటు 15 మంది కార్యవర్గసభ్యులు ఎన్నికయ్యారు. జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. -
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళిక
వనపర్తి: పదోతరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో జరిగిన జిల్లా జీహెచ్ఎంల సమావేశంలో ఆయన పాల్గొని పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక బోధన కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. గణితం, ఆంగ్లం, సైనన్స్ పాఠ్యాంశాల స్టడీ మెటీరియల్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆగస్టు 12 నాటికి సంబంధిత ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక స్టడీ మెటీరియల్ పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆయా సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించాలని.. పరీక్షల ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని కోరారు. ఆయా విద్యార్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ బలహీనతలను అధిగమించేలా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో వంట గ్యాస్ కనెక్షన్లను తప్పనిసరిగా వినియోగించి శుభ్రంగా, నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
ఉద్యమకారులను విస్మరిస్తే ఉద్యమిస్తాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి హెచ్చరించారు. శుక్రవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని.. కేకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రక్రియను వేగవంతం చేసి, ఉద్యమకారులను గుర్తించాలన్నారు. మొదట్లో మూడు నెలల సమయం పెట్టి.. ఇప్పుడు కాలయాపన చేసేందుకు డిసెంబర్ వరకు కమిటీ టైం బాండ్ పెట్టడం ఉద్యమకారులను విస్మరించేందుకేనని అరోపించారు. ఉద్యమకారులుగా ఉన్న తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేదుకు సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని ఓయూలో ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఉద్యమకారులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. -
నల్లమలకు బుల్లెట్ రైల్
● శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, సోమశిల, కర్నూలు నుంచి బెంగళూరుకు.. ● గతంలో ప్రతిపాదించిన మార్గంలో కీలక మార్పులు ● సవరించిన వాటిని ఖరారు చేయాలని కేంద్రానికి రాష్ట్రం వినతి ● సాకారమైతే పర్యాటకంగా.. అభివృద్ధి పరంగా కీలక ముందడుగు ●శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల మీదుగా కర్నూలు, బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్కు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం జరిగింది. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న నల్లమల గుండా రూట్ మ్యాప్ను ఖరారు చేసిన సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం ఆదేశాల మేరకు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యే బ్రాహ్మణపల్లి వద్ద హైస్పీడ్ రైల్వే స్టేషన్కు స్థల పరిశీలన చేశాం. తుది అలైన్మెంట్ ఖరారు చేశారు. రావిర్యాల– ఆమనగల్ రతన్టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి ప్రతిపాదించడం వల్ల భూసేకరణ సమస్య కూడా లేదు. – వంశీకృష్ణ ఎమ్మెల్యే, అచ్చంపేట అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్– బెంగళూరు బుల్లెట్ రైల్ మార్గం నల్లమల మీదుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మార్గంలో హైస్పీడ్ రైలులైన్ల అలైన్మెంట్లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేయాలని కేంద్రానికి విన్నవించింది. మొదట కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన రూట్ మ్యాప్ ప్రకారం శంషాబాద్, మహబూబ్నగర్, కర్నూలు మీదుగా 218 కి.మీ., మార్గంలో 3 స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల, కర్నూలు మీదుగా రైల్వే లైన్ అలైన్మెంట్ను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు కీలక సవరణలు చేస్తూ నివేదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ మార్పులు చేసిన అలైన్మెంట్ ఖరారు చేయాలని కోరింది. దీంతో హైదరాబాద్– బెంగుళూరు హైస్పీడ్ రైల్వే లైన్ అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే నల్లమల ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ప్రాంతం హబ్గా మారనుండటంతో భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూర్, సోమశిలలో నల్లమల హైస్పీడ్ రైలు స్టేషన్లుగా మార్చనున్నారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా.. నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా హైస్పీడ్ రైలు కారిడార్ ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ అలైన్మెంట్ మార్పులు చేసినట్లు తెలిసింది. భూ సేకరణలో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వంద మీటర్ల వెడల్పుతో రూ.4,030 కోట్లతో ప్రారంభమైన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి) 41.5 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తోంది. ఈ మార్గాన్ని ఆకుతోటపల్లి నుంచి మన్ననూర్– శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అనుసంధానం కానుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల జాతీయ రహదారి–167కేలోని మల్లేశ్వరం– సిద్ధేశ్వరం ఐకానిక్ వంతెన మీదుగా కర్నూలు వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ రైల్వేలైన్ అలైన్మెంట్ను కర్నూలు నుంచి ధర్మవరం, పుట్టపర్తి మీదుగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ రూపకల్పనకు ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు మార్గాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయడం వల్ల భూ సేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించేలా ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు మార్గం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్కు పంపించి.. అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
వైభవం.. శతమాస కల్యాణోత్సవం
కొత్తకోట రూరల్: కొత్తకోట సమీపంలోని వెంకటగిరి క్షేత్రంలో వెలిసిన భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి శ్రావణ నక్షత్ర శతమాస కల్యాణోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విష్ణునారాయణస్వామి, కన్నయ్యస్వామి, సింగారాచార్యుల వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ కల్యాణ క్రతువు కనులపండువగా సాగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి గర్భగుడి నుంచి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు జీలకర్ర–బెల్లం, మంగళసూత్ర ధారణ తదితర సంప్రదాయ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి కొత్తకోటతో పాటు పరిసర గ్రామాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమ అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాసులు, నరోత్తంరెడ్డి, వెంకటేష్, ఎన్.శ్రీనివారెడ్డి, మోహన్యాదవ్, మేడిశెట్టి జ్యోతి, ప్రసన్నలక్ష్మి, బీమా రజిని, రాణి, అనిత, విజయలక్ష్మి, రాజేశ్వరి, వసంత తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్తో పాటు ఎస్పీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తహసీల్దార్లు తమ తమ మండలాల్లో అందుబాటులో ఉండాలని సూచించామన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వెంటనే సహాయక చర్యలు అందించాలని చెప్పామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గోపాల్పేట: రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని.. రాబోయే మూడేళ్లలో ఇళ్లు నిర్మించి తీరుతామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ అయేషా అంజుం అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. మొదట అధికారులతో శాఖల వారీగా పురోగతి అడిగి తెలుసుకొన్నారు. ఎన్నినో ప్రభావం ఉన్నందున రైతులు మెట్టపంటల సాగుపై దృష్టి సారించాలని, వరి తక్కువగా సాగు చేయాలని.. ఒకవేళ వరి సాగు చేసినా సన్నరకం మేలని వ్యవసాయ అధికారి రమేష్ వివరించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తర్వాత ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సర్పంచ్లను అడిగారు. అభివృద్ధి పనులు చేసిన తర్వాత గ్రామపంచాయతీలకు బిల్లులు కావడం లేదని చెప్పడంతో ఎందుకు పని సరిగా చేయడం లేదని ఎంపీఓ భవాని, కంప్యూటర్ ఆపరేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ తాగునీరు వారానికి ఒకసారి వస్తున్నాయని లక్ష్మీతండా సర్పంచ్ చెప్పడంతో ఇదేమిటని అధికారులను నిలదీశారు. ఎస్ఐఆర్ 99 శాతం పూర్తి చేసినందుకుగాను అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. విద్య విషయంలో ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కె వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశిలారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లోడె రఘు, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. -
లక్ష్యం.. జలసిరి
● ఇంటికో గుంత, పంటకో కుంట, గ్రామానికి ఊటకుంట నిర్మాణానికి చర్యలు ● భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రణాళిక ఖరారు ● ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ● వచ్చేనెల 14 నాటికి పూర్తిచేసేలా గడువు విధింపు నర్వ: ఎల్నినో ప్రభావంతో వానలు పడక.. పల్లెలు, పట్టణాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. సమీప భవిష్యత్లో ఇలాంటి ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు మేల్కొన్నాయి. నీటి సంరక్షణతోపాటు భూగర్భజలాల పెంపునకు ప్రతి చుక్క– ప్రజల కోసం నినాదంతో ‘జల సిరి’కి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వీబీ జీ రాంజీ పథకంలో ఇళ్ల వద్ద వ్యక్తిగత, గ్రామాల్లో సామూహిక ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి కుంట, ఓపెన్ వెల్, పొలాల్లో నీటికుంటల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.9 లక్షల ఇంకుడు గుంతలు, 6,776 పాంపాండ్ల నిర్మాణం.. ఆగస్టు 14 వరకు పూర్తిచేసేలా అధికారులు లక్ష్యం నిర్దేశించారు. సామూహిక ఇంకుడు గుంతలు గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి. ఈ నిర్మాణం వీలుకాని చోట సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవచ్చు. వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్దిష్ట కొలతలు రూపొందించింది. పరిమాణం 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పుతో 1.8 మీటర్ల లోతు ఉండాలి. నిర్మాణ వ్యయంగా రూ.7,500 ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడు గుంత నిర్మాణం కోసం పొడవు, వెడల్పు 2.4 మీటర్లు, లోతు 2 మీటర్లు ఉండాలి. నిర్మాణం వ్యయం రూ.13 వేలుగా నిర్ణయించింది. పాంపాండ్స్ నిర్మాణం వ్యవసాయ భూముల వద్ద నీటి సామర్థ్యం పెంపొందించడానికి పాంపాండ్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. వాటిని రెండు రకాల కొలతలతో ఏర్పాటు చేసుకోవచ్చు. గుంట భూమి కేటాయించి.. 12 మీటర్ల పొడవు, వెడల్పుతో నిర్మిస్తే రూ.80 వేలు, 5 గుంటల భూమి కేటాయిస్తే 20 మీటర్ల పొడవు, వెడల్పు ఉండాలి. దీని ఏర్పాటుకు రూ.4 లక్షలు ఖర్చు చేయనుంది. గ్రామానికో ఊటకుంట ప్రతి గ్రామంలో ఒక ఊటకుంట తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ నీటి అవసరాల కోసం భూగర్భ జలాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం. ఊటకుంట నిర్మాణం కోసం రూ.5 లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించనుంది. అలాగే వ్యవసాయ అవసరాలు బోరు బావుల రీచార్జి కోసం రూ.25 వేలు మంజూరు చేయనుంది. వ్యవసాయ అవసరాల కోసం బావులు తవ్వుకోవడానికి సైతం రూ.3.50 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడు గుంత కొలతలు తీసుకుంటున్న అధికారులు శాసీ్త్రయంగా ఇంటి పైకప్పు నుంచి 50 చదరపు అడుగుల వైశాల్యంలో వర్షపు నీరు పడి ఒక్క ఇంకుడు గుంత ద్వారా 25 వేల లీటర్ల నీటిని భూమిలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకుడు గుంత ఏర్పాటును తమకు నచ్చినట్లుగా కాకుండా.. శాసీ్త్రయంగా నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి పైకప్పును బట్టి ఇంకుడు గుంత పొడవు, వెడల్పు నిర్ణయించుకోవాలని, ఇంటి వృథా నీరు ఇందులో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంత 4 అడుగుల పొడవు, 6 అడుగుల లోతున ఉండాలి. మూడు అడుగుల కింద భాగాన్ని పెద్ద, పెద్ద రాళ్లతో నింపాలి. ఒక సిమెంట్ గొళ్లెం తీసుకొని పైభాగంలో సరిపడా రంద్రాలు ఏర్పాటు చేసి గుంత మధ్య భాగంలో అమర్చాలి. ఇక గుంతలో మిగిలిన ఖాళీ భాగాన్ని మూడు ఫీట్లు (45ఎంఎం) కంకర నింపాలి. వృథాగా పారే వర్షపు నీటిని పైపు ద్వారా గొళ్లెంలోకి వెళ్లేలా చూసుకోవాలి. -
అవగాహన కల్పిస్తున్నాం..
వీబీజీ రాంజీ అమలులో భాగంగా జలసిరికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాల్లో నిర్మించనున్న ఇంకుడు గుంతలు, బోరుబావుల రీచార్జి, నీటి, ఊటకుంటల గురించి ప్రజలతోపాటు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీకి రెండు చొప్పున 272 గ్రామాల్లో 544 పాంపాండ్లు.. ఆగస్టు 14 వరకు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇందులో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రజలు, అన్నదాతలు భాగస్వామ్యులు కావాలి. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట ● -
కాగిత రహిత పాలన సాగిద్దాం
వనపర్తి: ఇక నుంచి కాగిత రహిత పాలన సాగిద్దామని.. జిల్లాలోని అన్ని కార్యాలయాలు ఈ–ఆఫీస్ ద్వారా మాత్రమే దస్త్రాలు పంపించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎంలతో సంక్షేమ పథకాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా భూ భారతి రికార్డులు ఈ–ఆఫీస్ ద్వారానే రావాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షిస్తూ ప్రభుత్వం గుడిసెల్లో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని.. సర్వే చేయించి త్వరగా నివేదిక ఇస్తే అనుమతుల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా చూడాలని, అవసరమైన వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. ఎస్ఐఆర్ గడువు మరో మూడురోజులు మాత్రమే ఉందని.. పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్క ఓటరు నుంచి కూడా ఫిర్యాదు రావద్దని హెచ్చరించారు. అదేవిధంగా భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. తహసీల్దార్ వారీగా పెండింగ్లో ఉన్న భూ భారతి ఫైళ్లపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 7లోగా అన్ని పూర్తి కావాలని సూచించారు. భూగర్భ జలాలు పెంచేందుకు వీబీజీ రాంజీ పథకం కింద అన్ని మండలాల్లో నీటికుంటల ఏర్పాటుకు స్థలం చూసి పనులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. జిల్లాలో 222 నీటి కుంటలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వన మహోత్సవం లక్ష్యం పూర్తి చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్కుమార్, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఓ రఘునాథ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, హౌసింగ్ పీడీ విఠోబా పాల్గొన్నారు. -
రీ–సర్వేతో భూ సమస్యలు పరిష్కారం
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీ–సర్వే పూర్తయితే భూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని కొర్లకుంటలో నిర్వహిస్తున్న భూ రీ–సర్వేను ఆయన పరిశీలించి సర్వేయర్లకు పలు సూచనలు, సలహాలిచ్చారు. గ్రామంలోని రైతుల భూములను సమగ్రంగా సర్వే చేస్తామని.. మోఖాపైన ఉండి పట్టాదారు పాసు పుస్తకాల్లో రాని రైతుల వివరాలు సేకరిస్తామని, ప్రభుత్వ భూములు కూడా గుర్తిస్తామని వివరించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఖాజా మైనుద్దీన్, మాజీ ఎంపీపీ కమలేశ్వర్రావు, ఆర్ఐ రాములు, పలువురు రైతులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త వీపనగండ్ల: ముసురు వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా నోడల్ అధికారి డా. వంశీకృష్ణ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకోవచ్చన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఫై డే.. డ్రై డే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మురుగుకుంటల్లో దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డా. శ్వేత, డా. కరుణశ్రీ, డా. భాగ్యశ్రీ, డా. కవిత, డా. మౌనిక, సూపర్వైజర్లు, పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ (థామస్రెడ్డి) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మణ్గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం మహబూబ్నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్లు కవిత, జయరాంలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి అన్నివిధాల క ట్టుబడి ఉన్నామన్నారు. కొ త్తగా ఎన్నికై న తమ యూనియన్ డిపో కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.కె.రెడ్డి, ముజీబ్, టి.ఆర్.సి. శేఖర్రె డ్డి, తెల్కపల్లి రాములు, హబీబ్ హసన్, చంద్రమోహన్, నిజామాబాద్ శ్రీనివాస్, ప్రేమలత, అమరేశ్వరి, రాగిణి, శిరీష, శ్రీదేవి, పద్మ పాల్గొన్నారు. నేడు రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98857 04173, 98852 42848 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
స్పాట్ అడ్మిషన్లు
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని కడుకుంట్ల, చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం బైపీసీలో మిగిలిన సీట్లకు ఆగస్టు 1న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని డీసీఓ శ్రీవేణి, కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్యగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు కళాశాలల్లో కలిపి 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని.. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. పదోతరగతిలో 450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా సంబంధిత కళాశాలలో హాజరై అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 91549 02278 సంప్రదించాలన్నారు. -
వెల్లువాయె...!
వాన.. వాన.. జిల్లాలోని 12 మండలాల్లో కురిసిన వర్షం మండలాల వారీగా ఇలా.. (మి.మీ.లలో..) ● అధికంగా పెద్దమందడిలో 24.8 మి.మీ. ● మెట్ట పంటలకు జీవం.. అన్నదాతల్లో చిగురించిన ఆశలు ● వాతావరణంలో ఒక్కసారిగా మార్పు –8లో uజిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 98 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా.. అందులో వరి ఒక్కటే 78 వేల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. వరి నాట్లు కొనసాగుతున్న సమయంలో వర్షం కురవడం రైతులకు కొంత ఊరటనిచ్చినట్లయింది. మరో ఇరవై వేల ఎకరాల వరకు మెట్ట పంటలైన జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, పత్తి సాగు చేశారు. వనపర్తి: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎదురుచూస్తున్న వర్షం బుధవారం జిల్లాలోని నేలను తడిపేసింది. వర్షాధారంగా సాగు చేసిన పంటలకు ఈ వర్షంతో జీవం పోసినట్లయింది. జిల్లాలో అత్యధికంగా పెద్దమందడిలో 24.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు నివేదిక విడుదల చేశారు. వర్షాభావంతో ఆందోళనలో ఉన్న అన్నదాతల్లో సాగు ఆశలు చిగురించాయి. కొద్దిరోజులుగా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుండగా, బుధవారం ఉదయం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి తదితర పంటలకు కొంత మేలు చేసింది. ఇటీవల వర్షాలు కురువక మొక్కల ఎదుగుదల మందగించడంతో పాటు పలుచోట్ల వాడిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కురిసిన వర్షంతో భూమిలో తేమశాతం పెరిగి పంటలు కోలుకునే అవకాశాలు మెరుగుపడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడురోజులు ఇదే తరహాలో వర్షాలు కురిస్తే సాగు పూర్తిగా గాడిన పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు, రైతులు భావిస్తున్నారు. ఎన్నినో ప్రభావంతో ఈ వర్షాకాలం ఇక పంటలు సాగినట్లే అని నిరాశలో ఉన్న రైతులకు ఈ వర్షంతో ఊరట లభించిందని చెప్పవచ్చు. వర్షంతో చెరువులు, కుంటలకు నీరు చేరకపోయినా.. నేల బాగా తడిసింది. ఇకపై కురిసే వర్షాలకు నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. నాలుగు మండలాల్లో నిల్.. జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా.. చిన్నంబావి, పాన్గల్, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో బుధవారం ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. మిగతా 11 మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. పెద్దమందడి, అమరచింత, కొత్తకోట, మదనాపురం మండలాల్లో 15 మిల్లిమీటర్లకుపైబడి, మరో ఏడు మండలాల్లో 10.3 మి.మీ. అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మదనాపురంలో కురుస్తున్న వర్షం అమరచింత: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు అధికారులు సాగునీటిని విడుదల చేశారు. వరి నారుమడులు వేసుకున్నామని.. ఎగువ నుంచి వరద వస్తున్నందున కాల్వకు సరఫరా చేయాలని ఆయకట్టు రైతులు కోరడంతో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో చర్చించి సాగునీటిని విడుదల చేయించినట్లు కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు రాజేందర్రెడ్డి తెలిపారు. రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్ సమస్యను పలుమార్లు మంత్రి వాకిటి దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు నీటి విడుదల సాధ్యమైందన్నారు. -
పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
వనపర్తి: నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పక్కా ఇళ్లు నిర్మించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనపర్తిని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా కూడా నిర్మాణాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులను వెంటనే గుర్తించాలన్నారు. వాటిని అర్హులైన పేదలకు మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన 287 గుడిసెలతో పాటు నియోజకవర్గంలో మిగిలిన గుడిసెలను పూర్తిస్థాయిలో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని, ఈ ప్రక్రియతో పాటు పెండింగ్ అంశాలన్నింటినీ వారంలోగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన పరిమితులకు లోబడే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ విఠోబా, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చేపల సంరక్షణపై అవగాహన
అమరచింత (ఆత్మకూర్): చేపపిల్లల పెంపకందారులు సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు ఖమ్మం జిల్లా శాస్త్రవేత్తలు షిగా నాగరాజు, బానోత్ దివ్య సూచించారు. బుధవారం ఆత్మకూర్ మండలం ఆరేపల్లిలో ఏటి ఆనంద్ చేపల ఫారంను వారు సందర్శించి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధుల లక్షణాలు, నివారణ పద్ధతులు, నీటి నాణ్యత నిర్వహణ, బయో సెక్యూరిటీ చర్యల గురించి వివరించారు. -
‘సర్’ శతశాతం పూర్తికి సహకరించాలి
వనపర్తి: ఎస్ఐఆర్ ప్రక్రియ వందశాతం పూర్తి చేసేందుకు బీఎల్ఏలు సహకరించేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తిలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కేవలం 68 శాతమే పూర్తయిందని తెలిపారు. మిగిలిన వారు ఎవరు.. ఎక్కడున్నారో గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసే విధంగా చొరవ చూపాలన్నారు. 2026, అక్టోబర్, 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఫారం 6 ద్వారా ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కుగాను ఇప్పటి వరకు 4 దరఖాస్తులు వచ్చాయని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని కోరారు. ఆర్డీఓ సు బ్రమణ్యం, తహసీల్దార్ రమేష్రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు తిరుపతయ్య, వే ణాచారి, గట్టుయాదవ్, కుమారస్వామి, పుట్టా ఆంజనేయులు, గంధం నాగరాజు, పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
● భీమా ఫేజ్–1, ఫేజ్–2కు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు కొత్తకోట/మదనాపురం: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదుగాకపోయినా, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సాగునీటిని విడుదల చేస్తున్నామని వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం కొత్తకోట, మదనాపురం మండలాల మధ్యలో ఉన్న భీమా ఫేజ్–1, మదనాపురం మండలం తిర్మలాయపల్లి సమీపంలో రామన్పాడు జలాశయ బ్యాక్వాటర్ ద్వారా శంకరసముద్రం భీమా ఫేజ్–2 ఎత్తిపోతల పథకం ద్వారా దిగువకు నీటిని విడుదల చేసి ఆయా ప్రాంతాల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎగువన కర్ణాటక నుంచి జూరాలకు వరద వస్తోందని.. జలాశయంలో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వదులుతున్నామన్నారు. రైతుల పొలాలు పచ్చగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని.. అవసరమైన మేర నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదని, నేడు సాగునీటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతోనే నీరు విడుదల అవుతుంటే, వాటి ఘనతను వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నారని.. ప్రజల అవసరాలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలు, ఫామ్హౌస్ల నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. శంకరసముద్రం రిజర్వాయర్కు నీటి విడుదలతో పరిసర ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా తాగునీటి ఎద్దడి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భీమా ఫేజ్–2 నీటి విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ పోతుగంటి రాములు, మండలపార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. -
అన్నదాతకు మద్దతుగా పోరాటం
అమరచింత: ఎగువ నుంచి వస్తున్న వరదను తోడుకునే వీలున్నా.. దిగువన ఉన్న ఆంధ్రాకు పంపుతామంటే ఇక్కడి రైతులు చోద్యం చూస్తూ ఉండరని, అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆత్మకూర్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు ఉందని, సాగునీరు ఇవ్వలేమని.. ఆరుతడి పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి రైతులను భయపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడేళ్లకుపైగా వర్షం కురవకపోయినా ఇక్కడి ప్రాజెక్టులకు నీటి కొరత ఉండదని.. పచ్చిమ కనుమల్లో దట్టమైన అడవులు ఉండటంతో ప్రతి వర్షాకాలంలో తుంగభద్ర, కృష్ణా, భీమానదులు ఉధృతంగా పారుతుంటాయని వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు ఎల్లూరు నుంచి 9 టీఏంసీల నీరు అవసరమని.. వచ్చే జూన్ వరకు మిషన్ భగీరథ నీటికి ఇబ్బంది లేదని, వీటిని సాకుగా చూపుతూ జూరాల ఆయకట్టును ఎండబెట్టుదామనే ఆలోచనలో ఇక్కడిి మంత్రి ఆలోచించడం ఏమిటన్నారు. ప్రస్తుతం ఆల్మట్టిలో 123 టీఏంసీలు, నారాయణపూర్లో 30 టీఏంసీల నీరు ఉందని.. అక్కడ పంటలు సాగైతే వర్షం పడకపోయినా జూరాలకు ఐదువేల క్యూసెక్కుల వరద రోజు వచ్చి చేరుతుందని చెప్పారు. పాలమూర్లో కృష్ణానది మీద ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు కలిపినా రోజుకు ఒక టీఎంసీ మించి వాడుకోలేమని.. అందుకే పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టుతో రోజు రెండు టీఏంసీల నీరు ఎత్తిపోసేలా డిజైన్ చేసి తమ పాలనలో పనులు చేపట్టామని, మిగిలిన పనులు చేయలేక.. నీటిని ఎత్తిపోయకుండా సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేయడం ఏమిటన్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూరాల వద్ద బుధవారం ఆందోళన చేయడానికి వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగానే అక్కడి లష్కర్లతో కాల్వ గేట్లు తెరిపించారని మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. కేఎల్ఐ ఒక పంప్ ఆన్ చేశారని.. నిరంతరంగా మూడు పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాగునీటి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు రవికుమార్ యాదవ్, మాజీ పుర చైర్పర్సన్ గాయత్రి, పలుస రమేష్గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డంకులు తొలగేనా..?
జిల్లాలోని నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశాం. సేకరించాల్సిన భూమిలో ఇప్పటికే 65శాతం భూమిని సేకరించాం. మల్లమ్మకుంట రిజార్వాయర్కు సంబంధించి రైతులతో ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశం ఏర్పాటుచేశాం. కాని రైతుల నుంచి సానుకూలత రాలేదు. మరోసారి సమావేశం ఏర్పాటుచేసి మలమ్మకుంట రిజర్వాయర్కు ఇబ్బందులను తొలగిస్తాం. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు అమరచింత: గురుపౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని షిర్డీసాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి తరలివచ్చి సాయినాథుడికి పూజలు చేశారు. ఆలయంలో జరిగిన హోమం, యజ్ఞం, అభిషేకం, పల్లకీసేవలో మహిళా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికి అన్నప్రసాద వితరణ చేశారు. గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూముల్లో సాగునీటిని పారించి సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నా యి. పాలమూరు–రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతో పాటు ఆర్డీఎస్ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందాల్సి ఉండగా.. అసంపూర్తి పనులతో కేవలం 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పెండింగ్ పనులకు నిధుల లేమితో పాటు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు జిల్లాల వారీగా ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షిస్తూ.. భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా కేవలం 1.45లక్షల ఎకరాలకే నీరందుతోంది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతో పాటు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 283 ఎకరాలు అవసరం ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత ప్రభుత్వం రాజోళి మండలంలో మలమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. స్థానిక రైతులు అభ్యంతరం తెలుపుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతో పాటు, భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమిని సేకరించి పనులను పూర్తిచేయాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. భీమా ఎత్తిపోతల పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులోని గూడెందొడ్డి రిజర్వాయర్ భూ సేకరణ పూర్తయితేనే పెండింగ్ పనులు ముందుకు పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపై సీఎం ప్రత్యేక దృష్టి అధికారులతో ఆర్అండ్ఆర్ కమిషనర్ వరుస సమీక్షలు -
భూ వివాదాలకు కోర్టుల్లోనే శాశ్వత పరిష్కారం
వనపర్తి: భూ వివాదాలు సివిల్ స్వభావం కలిగినవని.. వాటి శాశ్వత పరిష్కారం కోర్టుల్లోనే సాధ్యమని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఆమె హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, బెదిరింపులు, ధౌర్జన్యాలు, మోసాలకు పాల్పడితే పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి, వేగవంతమైన స్పందనతో పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. మొత్తం 25 వినతులు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్చేసి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. -
సీజేపీ ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతాం
చిన్నంబావి: ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనత పార్టీ (సీజేపీ) ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమానికి శ్రీకారం చూడతామని.. ఈసారి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పొరాడుతామని, అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీశైలం నిర్వాసితులు వివరించారు. సోమవారం మండలంలోని పెద్దమారూర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. తరాలు మారినా నిర్వాసితుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా.. సమస్యను ఎన్నికల హామీగానే తీసుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి తమకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప చేతల్లో కనిపించడం లేదని, మంత్రి 30 ఏళ్లు అధికారంలో ఉన్నా తమకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దామోదర్రెడ్డి, దాగోజి గోవిందు, షబ్బీర్, సోమ భాస్కర్, బాలయ్య, మైనుద్దీన్, మహబూబ్పాషా, జహంగీర్పాషా, రంగస్వామి, కొండన్న, రాఘవేంద్ర శెట్టి, కాంతయ్య, గూడెం బాలస్వామి, పెద్దమారూర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఉద్యాన సాగుపై దృష్టి సారించాలి
వనపర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కృష్ణా, గోదావరి జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగుపై దృష్టి సారించాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. డి.రాజిరెడ్డి సూచించారు. జిల్లాలోని నందిమళ్లగడ్డలో కూరగాయలు సాగు చేస్తున్న రైతుల పొలాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమగ్ర సాగు విధానాలు అనుసరించడంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందడంతో పాటు రైతులకు నికర లాభాలు పెరుగుతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత సాగు, సూక్ష్మ నీటిపారుదల విధానాలను వినియోగించి తక్కువ నీటితోనే కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డా. చీనా, విశ్వవిద్యాలయ కన్సల్టెంట్ డా. వీరాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. వీణాజోషి, కేవీకే శాస్త్రవేత్త డా. రాజేందర్రెడ్డి, మండల ఉద్యాన అధికారులు శ్రీకాంత్, సాయితేజ, సురేష్, డా. శంకరస్వామి, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఆగని సంతర్పణం..!
పెబ్బేరులో ఏళ్లుగా నిలిచిన సంత బహిరంగ వేలం ● కోర్టు వివాదంతో నిలిపివేత ● అక్రమార్కుల చేతికి ఆదాయం ● నకిలీ రసీదులతో వసూళ్లకు తెగబడిన వైనం ● నిద్రావస్థలో పాలకవర్గం విచారించి చర్యలు తీసుకుంటాం.. కొందరు అక్రమార్కులు పుర కార్యాలయం పేరిట రసీదులు ముద్రించి సంతలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృషికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకుంటాం. గతంలో వీరిపై స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంతకు ప్రభుత్వ స్థలం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న స్థలం కోర్టు కేసులో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్తాం. – గణేష్, పుర కమిషనర్, పెబ్బేరు త్వరలోనే పరిష్కారం.. సంత స్థల వివాద పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృషి చేస్తున్నారు. కోర్టు తీర్పు వరకు వేచి చూ డాలి. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. పురపాలికకు చెల్లించే సొమ్ము వేణుగోపాలస్వామి ట్రస్ట్ పేరిట బ్యాంకులో జమ చేస్తున్నాం. – అక్కి శ్రీనివాస్గౌడ్, పుర చైర్మన్, పెబ్బేరు ‘రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూరే సంతగా పెబ్బేరు సంతకు పేరుంది. పుర ఖజానాకు చేరాల్సిన రూ.కోట్ల ఆదాయం కొందరు అక్రమార్కులు దోచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడి అధికార పాలకవర్గం నిద్రావస్థలో ఉండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఆదాయాన్ని కొల్లగొడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విషయాన్ని మీడియా, పలు రాజకీయ పార్టీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించడం లేదు.’ వనపర్తి: పెబ్బేరులోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల భూమిలో 16 దశాబ్దాలుగా ప్రతి శనివారం వారాంతపు సంత కొనసాగేది. సంతపై వచ్చే ఆదాయాన్ని నాడు పంచాయతీ, నేడు పుర పాలకవర్గం తీర్మానం మేరకు పట్టణాభివృద్ధికి వెచ్చించడం ఆనవాయితీ. ఈ స్థలం తమదంటూ ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మధ్యలో కొన్నేళ్లపాటు కోర్టులో కేసు నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం తీర్పు వెలువడగా.. నాటి నుంచి ఇప్పటి వరకు ఏటా నిర్వహించే సంత వేలం నిలిపివేశారు. చివరిసారి నిర్వహించిన వేలంలో పురపాలికకు రూ.కోట్లలోనే ఆదాయం సమకూరింది. సీపీఎం నాయకుల ఫిర్యాదుతో వెలుగులోకి.. ఇటీవల సీపీఎం జిల్లా కమిటీ నాయకులు పలువురు పెబ్బేరు సంతలో అక్రమార్కులు చేస్తున్న దోపిడీతో పాటు పురపాలిక పేరుతో ముద్రించిన నకిలీ రసీదుల విషయాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరోసారి పెబ్బేరు సంత ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై పుర అధికార, పాలకవర్గం స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
హే.. కృష్ణా!
గద్వాల: కృష్ణా బేసిన్లో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద తాకిడి ఎట్టకేలకు మొదలైంది. కృష్ణమ్మ పరవళ్లను చూసిన అన్నదాతల్లో రేకెత్తిన ఆశలు.. ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిరాశగా మారాయి. ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం రాత్రి 33వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారానికి 27వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని జూరాల జలాశయం ఎఫ్ఆర్ఎల్ 3,018 మీటర్ల వరకు నింపి.. తాగునీటి అవసరాలకు వినియోగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరద జలాలతో వానాకాలంలో పంటలు సాగుచేసుకోవచ్చని ఆశపడిన రైతన్నలకు నిరాశే ఎదురైంది. అగమ్యగోచరంగా ఆయకట్టు సాగు.. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్నిన్ ప్రభావంతో వరుణుడు మోహం చాటేశాడు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సరైనా వర్షాలు లేక పంట పొలాలు బీడుపడ్డాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలోనే వరద జలాలు జూరాలకు చేరగా.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వర్షాకాలంలో జూరాల జలాశయం అడుగంటిందంటే.. పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 69వేల ఎకరాలు, కుడి కాల్వ పరిధిలోని 37,400 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆరుతడి పంటల వైపు.. రాష్ట్రంలో తలెత్తిన ఎల్నినో పరిస్థితులను గుర్తించిన అధికారులు.. వానాకాలంలో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. అయితే జూరాల ఆయకట్టులో చాలా వరకు వరిసాగు తప్ప.. ఇతర పంటలను సాగుచేయడానికి రైతులు మొగ్గు చూపడం లేదు. 80వేల ఎకరాల్లో నారుమళ్లు.. ఏటా వానాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు వరిసాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఏర్పడ్డాయి. అయితే రైతులు మాత్రం వరుణ దేవుడు కరుణించకపోతాడా అన్న భరోసాతో యథావిధిగానే వరిపంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఎడమ, కుడి కాల్వల పరిధిలో సుమారు 80వేల ఎకరాలకు పైగా నారుమళ్లు పోసుకున్నారు. అయితే మూడు రోజులుగా జూరాలకు వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే రెండు రోజులకే వరద తగ్గిపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే జూరాలకు తగ్గిన వరద వరద జలాల్లో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ప్రశ్నార్థకంగా 1.9లక్షల ఆయకట్టు సాగు ఆందోళనలో అన్నదాతలు -
పొలంబాట ఆక్రమించారు..
గ్రామంలోని 10 మంది రైతులం 15 ఎకరాలు సాగు చేసుకోవడానికి 70 ఏళ్లుగా సర్వేనంబర్ 467 ప్రభుత్వ భూమిలో నుంచి పొలానికి వెళ్తున్నాం. గ్రామానికి చెందిన రైతు బండారు చంద్రయ్య దారిని ఆక్రమించి రాళ్లతో గోడ కట్టి రాకపోకలు నిలిపివేశారు. మోఖాపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. – పెద్దదగడ రైతులు, చిన్నంబావి మండలం భూ పరిహారం చెల్లించాలి.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండేళ్ల కిందట గ్రామశివారులోని 25 మంది రైతుల భూముల్లో నుంచి డీ–5 కాల్వను తవ్వారు. కాల్వ తవ్వకంతో 22 ఎకరాల భూమి కోల్పోయాం. ఇప్పటి వరకు నష్ట పరిహారం చెల్లించ లేదు. మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలని కలెక్టర్కు విన్నవించాం. – పర్వతాపూర్ రైతులు, ఖిల్లా ఘనపురం మండలం ● -
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
వనపర్తి/వనపర్తి రూరల్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా ప్రజావాణికి వచ్చిన అర్జీలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టర్లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణికి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్తో కలిసి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత అంశం తమ శాఖ పరిధిలో కానిదైతే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి మధాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి 45 అర్జీలు, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 2 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, శిక్షణ ఉప కలెక్టర్ శ్రావ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ను నిర్లక్ష్యం చేయొద్దు : మాజీ ఎమ్మెల్యే
పాన్గల్: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్లక్ష్యం చేయొద్దని.. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ అర్హుల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలన్నారు. గ్రామాల్లో అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి ఫారాలు అందించాలని సూచించారు. నియోజకవర్గంలో ఏకంగా 24 వేల డబుల్ ఓట్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రికి అఽధికార దాహం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంతో మండలంలోని సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగుతాయని.. చేపట్టే వరకు పార్టీ పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరసాగర్, చంద్రశేఖర్నాయక్, సుధాకర్యాదవ్, తిలకేశ్వర్గౌడ్, రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిక.. మండలంలోని శాగాపూర్ 5వ వార్డు సభ్యుడు లక్ష్మీనర్సింహ, మాజీ వార్డు సభ్యుడు కుర్మయ్య మాజీ ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు తిరుపతయ్యయాదవ్, కృష్ణయ్యయాదవ్, డా. తిరుపతయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పుట్టిన ఊర్లో ఉండాలని..
నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓటు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా సొంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం. – కట్టా జనార్దన్రెడ్డి, ఉప్పునుంతల అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్ఓలు చొరవ చూపాలి. ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే చేపట్టి.. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ఆపై అభ్యంతరాలు స్వీకరించి.. పరిశీలన అనంతరం 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. డిజిటలైజేషన్ వందశాతం పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకుల సహకరించాలి. – హేమంత కేశవ పాటిల్, కలెక్టర్ ● -
అర్హుల పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి
వనపర్తిటౌన్: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ఓటర్లు తుది జాబితాలో కచ్చితంగా ఉండేలా చూడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 9వ వార్డులో సర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, మృతిచెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు దొంగ ఓట్లకు తావివ్వొద్దన్నారు. అదేవిధంగా బీఎల్వోలు, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు దేవర్ల నర్సింహ, డేగ మహేశ్వర్రెడ్డి, చిట్యాల రాము, శ్రీనివాసులు, బేదడి కుమార్, గోవర్ధన్ సాగర్, కిరణ్కుమార్, నాగేంద్రం, నాగనమోని రవి, బీఎల్వోలు అనురాధ, నాగలక్ష్మి ఉన్నారు. సాగునీరు వదలాలి.. వనపర్తి రూరల్: రాజకీయాలు పక్కనబెట్టి రైతులను ఆదుకునేందుకు వెంటనే కన్నెపల్లి, పాలమూరు–రంగారెడ్డితో పాటు అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని మాజి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి చంద్రబాబుకు తాబేదారుగా మారారని.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమైఖ్యవాది, ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తెలంగాణ ప్రజల ఆకలి, ఆకాంక్షల మీద సోయి లేదని పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఒడిసిపట్టడాన్ని సర్కారు మరిచిందని తెలిపారు. కుంటిసాకులతో పంటలను ఎండబెడితే అన్నదాతలు కన్నెర్ర చేయడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మోటార్లు ప్రారంభించి ఎత్తిపోతల పథకాల కింద ఉన్న చెరువులు, కుంటలు నీటితో నింపాలని డిమాండ్ చేశారు. ‘పీఆర్సీ వెంటనే ప్రకటించాలి’ వనపర్తిటౌన్: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్పార్టీ మరిచిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఊర్దూ మీడియం హైస్కూల్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. నేటికీ పీఆర్సీ ప్రకటించడం లేదని, ఇకపై తాత్సారం చేస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు విడతల డీఏలు పెండింగ్లో ఉన్నాయని.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగే ఓబీఎస్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని, ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ కార్డుల్లో ఎన్నో లోపాలున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.వెంకటేష్, కె.జ్యోతి, జిల్లా కోశాధికారి తిమ్మప్ప, జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాస్ గౌడ్, ఎండీ హమీద్, జి.మురళి, లక్ష్మణ్ నాయక్, బి.అరుణ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాభావాన్ని అధిగమించేందుకే ‘జలసిరి’
మదనాపురం: వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారమని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. ఆదివారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఎంసీఎల్ఎఫ్ (మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్) శిక్షణకు ఆమె హాజరై సంఘ సభ్యులకు ‘విజన్ బిల్డింగ్’ అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి గ్రామాల్లో విస్తృతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులకు నీటి సంరక్షణ ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూగర్భ జలమట్టం పెంపునకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంట, ప్రతి రైతు పొలంలో ఊట కుంటలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యపర్చాలన్నారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడంతో భవిష్యత్లో నీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఐబీ ఏపీఎం వెంకన్న, ఏపీఎంలు, ఏపీఓలు, సీసీలు, వీఓఏలు, మండల సమాఖ్య సిబ్బంది, కార్యవర్గ సభ్యులు, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు ఆదివారం జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ఎగువ నుంచి 18,300 క్యూసెక్కుల కొత్త నీరు వచ్చింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.356 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.310 మీటర్ల 5.653 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్నినో ప్రభావంతో వరిపంట సాగుపై ఆశలు వదులుకున్న రైతులు కృష్ణానదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూరాల జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం -
సాగు, తాగునీటి ఇబ్బందులు
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్లే.. ● మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ మక్తల్/ కృష్ణా: కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని అరికట్టకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ బృందంతో కలిసి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వారు కృష్ణానదిపై ఉన్న గూగల్ ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో దిగువకు వచ్చే నీరు తగ్గిపోతుందని, ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూరాలలో పూడిక పేరుకుపోవడంతో 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తే.. కేవలం 6 నుంచి 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నామన్నారు. ఈ విషయం గ్రహించే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని నిల్వలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం నర్సిరెడ్డి ఉన్న సమయంలో నియోజకవర్గంలో కృష్ణా, భీమానదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారని, ప్రస్తుతం నదిలో నీళ్లులేక అవి మూతపడ్డాయన్నారు. ఏడారిగా మారుతుంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. కృష్ణా, భీమా నదులపై దివంగత ఎమ్మెల్యే నర్సిరెడ్డి నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొంతకాలంగా ఎగువన ఉన్న ప్రాజెక్టుల ఎత్తును పెంచడంతో పాటు కొత్తగా ఎక్కడపడితే అక్కడ బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తుందని, ఇదిలాగే కొనసాగితే త్వరలోనే ఉమ్మడి పాలమూరు ఎడారిగా మారుతుందని వాపోయారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు కలుగకుండగా తగు చర్యలు తీసుకోవాలని, కూసుమర్తి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, అంజయ్యయాదవ్, నాయకులు శ్రీనివాస్గుప్తా, నర్సింహగౌడ్, మహిపాల్రెడ్డి, శివరాజ్పాటిల్, సంతోష్, సురేష్రెడ్డి, నర్సింహారెడ్డి, ఈశ్వర్ పాల్గొన్నారు. -
పాలకవర్గానికి పట్టింపేది?
నేడు వనపర్తి పుర కౌన్సిల్ సమావేశం వనపర్తిటౌన్: పుర ఎన్నికలు జరిగి ఏడు నెలలు.. పాలకవర్గం కొలువుదీరి ఆరు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు కేవలం రెండు సాధారణ కౌన్సిల్ సమావేశాలు మాత్రమే నిర్వహించడంపై పుర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల లోలోపల ఒక సభ నిర్వహించినట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా పుర కార్యాలయం నుంచి విడుదల కాకపోవడం గమనార్హం. రహస్యంగా కౌన్సిలర్లతో సంతకాలు తీసుకొని సమావేశం నిర్వహించే ముందు, తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండా ముగిసినట్లు చెప్పుకోవడం పాలక మండలి నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. దీనిపై ప్రతిపక్ష, అధికార పార్టీ కౌన్సిలర్లు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల నిర్వహణ గాలికొదిలేయడంతో పుర పాలనలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నెలకొకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. మార్చిలో బడ్జెట్ మీటింగ్, మే నెలలో సాధారణ సమావేశం నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు సమావేశం జరపకపోతే పాలకమండలిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశాలు జరిగితేనే చైర్పర్సన్కు రూ.15,600, వైస్ చైర్మన్కు రూ.6,900, కౌన్సిలర్లకు రూ.3,250 చొప్పున గౌరవ వేతనం తీసుకోవాలి. సమావేశాలు నిర్వహించకుంటే గౌరవ వేతనం తీసుకునే అవకాశం ఉండదని సీనియర్ కౌన్సిలర్లు, అధికారులు పేర్కొంటున్నారు. అభివృద్ధిపై ప్రభావం.. పట్టణాభివృద్ధిలో భాగంగా వార్డుల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్లైన్ల లీకేజీల మరమ్మతు తదితర అంశాలను ప్రతి నెల కౌన్సిల్లో ఆమోదించాల్సి ఉంటుంది. చైర్పర్సన్ అధ్యక్షతన సభ నిర్వహించాలి. చైర్పర్సన్ అందుబాటులో లేకపోతే వైస్ చైర్మన్ కూడా సభ నడపొచ్చు. ఒకవేళ ఆయన కూడా అందుబాటులో లేకపోతే ఎవరైన ఒక కౌన్సిలర్ కౌన్సిల్ను కొనసాగించొచ్చు. సభలో 1/3 మెజార్టీ సభ్యులు ఉంటే కౌన్సిల్ నిర్వహణకు అర్హత ఉంటుంది. కానీ పాలక పెద్దలు తాము అనుకుప్పుడే సభలు జరగాలనే ధోరణితోనే ప్రతి నెల నిర్వహించడం లేదని అధికారపార్టీ సభ్యులు వాపోతున్నారు. కో–ఆప్షన్ ఊసే లేదు.. పుర ఎన్నికలు జరిగి 7 నెలలు గడుస్తున్నా.. కో–ఆప్షన్ ఎన్నిక ఉంటుందా? ఉండదా అనేది అధికారపార్టీ ఆశావహుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో హామీ పొందిన ఆశావహులు ఎదురుచూస్తున్న ఎన్నిక జరగడం లేదు. పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీలో 20మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. గతంలో రెండునెలల్లోపే ఈ ప్రక్రియ ముగిసేది. చైర్పర్సన్ మౌనం వీడేనా..? ఇప్పటి వరకు జరిగిన రెండు సాధారణ సమావేశాల్లో చైర్పర్సన్ పట్టణ ఎజెండా అంశాల, కౌన్సిలర్లు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, సమస్యలపై చైర్పర్సన్ మౌనంగానే ఉంటున్నారు. ఈ మౌనం అధికార పార్టీ సభ్యుల్లో చర్చకు దారితీస్తుంది. ఈ విషయమై చైర్పర్సన్తో ప్రస్తావించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. వనపర్తి పురపాలిక ఏడు నెలల్లో కేవలం రెండుసార్లే నిర్వహణ కో–ఆప్షన్ ఎన్నికపై వీడని సందిగ్ధం ఈ సమావేశంలోనైనా చైర్పర్సన్ గళం విప్పేనా? పుర కమిషనర్ లేకపోవడంతోనే సమావేశాలు నిర్వహించలేదు. ఒక్క జూన్లోనే ఇద్దరు కమిషనర్లు మారడంతో సమావేశం నిర్వహించేందుకు వీలు కాలేదు. కమిషనర్ లేకుండా సభ నిర్వహించడం సాధ్యం కాదు. మున్సిపాలిటీలోని పలు విభాగాల్లో అధ్యాయనం చేసేందుకు ఎమ్మెల్యే సూచించిన కమిటీలను త్వరలోనే వేస్తాం. – మధుసూదన్ గౌడ్, వైస్ చైర్మన్, వనపర్తి పురపాలిక -
సొంతూరులోనే ఓటు
● ఎన్యూమరేషన్ ఫారాలు అప్పగిస్తున్న జనం ● సర్ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్ ● ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకే మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు అందిస్తున్నారు. అసలైన ఓటర్లు 75 – 85 శాతమే.. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో అసలైన ఓటర్లు 75 నుంచి 85శాతం మాత్రమే మిగలనున్నారు. మిగతా ఓటర్లు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటిని వందశాతం డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందులో అసలైన ఓటర్లను గుర్తిస్తూనే.. మిగిలిన వారిని నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాలి. బీఎల్ఓల విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతే పర్మినెంట్గా షిఫ్ట్ అయినట్లుగా, ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదైతే సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి.. రెండో దాని డూప్లికెట్గా, ఫారాలు తీసుకోని వారు, తిరిగి ఇవ్వని వారి పేర్లను ఇతర కేటగిరీలో చేరుస్తున్నారు. ఇలా నమోదైన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వందశాతం పూర్తికి.. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందక డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకవైపు గడువులోగా డిజిటలైషన్ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్ అధికారుల నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలామంది ఇవ్వడం లేదని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైషన్ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు. పట్టణాల్లో మందకొడిగా.. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ ఫారాలు శాతం రానివి మహబూబ్నగర్ 7,32,488 5,93,167 55,743 86.12 నాగర్కర్నూల్ 7,31,632 5,80,793 56,482 79.38 వనపర్తి 2,75,570 2,18,488 16,515 79.29 జోగుళాంబ గద్వాల 5,03,859 4,19,973 43,961 83.32 నారాయణపేట 4,95,574 3,93,911 45,959 79.49 -
కేంద్ర ప్రభుత్వంపై యువత విజయం : సీపీఎం
అమరచింత: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే యత్నంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై యువత విజయం హర్షనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్ భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశ రాజధానిలో యువత చేసిన ఆందోళన చివరకు విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కేవలం మొదటి అడుగు మాత్రమేనని.. ఇప్పుడు ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు. విద్యార్థి వ్యతిరేక, వాణిజ్యపరమైన, మతతత్వ ధోరణి కలిగిన ఎన్ఈపీ –2020 కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాట మార్గంలో అన్నిరకాల బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొని దృఢంగా నిలిచిన విద్యార్థి సంఘాలకు అభినందనలు తెలిపారు. క్రీడలు, కళలు, సినిమా, సంస్కృతి తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం సంతోషకరమన్నారు. ఐక్య పోరాటాలు విజయాన్ని సాధిస్తాయని చెప్పడానికి ఇదో ఉదహారణ అన్నారు. డిమాండ్లన్నీ నెరవేరే వరకు యువత ధృడంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లాకార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు జబ్బార్, సీనియర్ నాయకులు మహమూద్, మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
సాగునీరు పారేనా..?
జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ● వరి సాగుకు సన్నద్ధమవుతున్న ఆయకట్టు రైతులు ● ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ● నీటి విడుదలపై స్పష్టత లేదంటున్న అధికారులు ●నేను ఇప్పటికే 16 ఎకరాల్లో వరి సాగు చేశాఆ. బోరు ద్వారా పారే నీరు సరిపోక ఎండుముఖం పడుతోంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ప్రధాన ఎడమ కాల్వ ద్వారా విడుదల చేసి పంట ఎండిపోకుండా కాపాడాలి. – ఎర్రన్న, రైతు, మూలమళ్ల జూరాల ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని అందించడంతో ఆయకట్టు రైతులు వరి సాగుచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నారుమడులను సిద్ధం చేసుకొని సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవచూపి సాగునీరు అందించి ఆదుకోవాలి. – కృష్ణారెడ్డి, రైతు, అమరచింత ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఇప్పుడిప్పుడే ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అధికారికంగా ఆదేశాలు వస్తే తప్ప సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వలేం. – షమీ ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు రెండ్రోజులుగా ఎగువ నుంచి వరద చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో సాగు ఆశలు చిగురించాయి. కాల్వలకు ఎలాగైనా నీటిని వదులుతారని వరి నారుమడులు సిద్ధం చేసుకోవడంతో పాటు పొలాలు దుక్కిదున్ని చదును చేసే పనులకు సిద్ధమయ్యారు. యాసంగిలో కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందడంతో.. ఈ ఏడాది వానాకాలంలో పూర్తి ఆయకట్టు 85 వేల ఎకరాలకు సాగునీరు వదులుతారని ఆశించారు. ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవకపోవడం.. ప్రాజెక్టుకు సకాలంలో వరద చేరకపోవడంతో ఆశలు వదులుకున్నారు. కాగా ఆయకట్టు పరిధిలో అక్కడక్కడ బోరుబావులున్న రైతులు వరి నారుమడులు వేసుకున్నారు. మిగిలిన రైతులు కాల్వ ద్వారా ఎప్పుడు నీరు వస్తుందోనని ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎగువనున్న నారాయణపూర్ డ్యాం క్రస్ట్గేట్లు తెరిచి రెండోజ్రులుగా నీటిని వదలడంతో జూరాలకు 18,300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నందిమళ్ల శివారులో వరి నారుమడి -
ఎల్నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
కొత్తకోట రూరల్: ఎల్నినో నేపథ్యంలో తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. శనివారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు వర్షపు నీటిని ప్రతి గ్రామంలో సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రైతులు వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమున్న పంటల సాగును తగ్గించి ఆరుతడి పంటలు, ఆయిల్పాం సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లాలని, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకొని శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేపట్టాలన్నారు. జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు. నిల్వ గోదాములు తనిఖీ వనపర్తి రూరల్: పెబ్బేరులోని సాయి గోపాల్ రైస్మిల్లుకు కేటాయించిన ధాన్యం ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలో ఉన్న స్టాక్ గోదాంలలో భద్రపర్చారు. శనివారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు కాలేదని సమాచారం. -
కృష్ణమ్మ వచ్చింది
పాలమూరు మురిసేలా.. పుడమితల్లి మెరిసేలా.. సాగు ఆశలు తీర్చేలా.. రైతన్న పంట పండేలా.. కరువును పారద్రోలేలా.. కృష్ణమ్మ వచ్చింది అంటూ అన్నదాతలు సంబరపడ్డారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రెండు రోజుల క్రితం దిగువకు నీటిని విడుదల చేయగా.. శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రామమైన తంగిడి వద్ద తెలంగాణలోకి అడుగుపెట్టింది. కృష్ణానదిలో నీటిని చూసిన తీర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటలకు అవసరమయ్యే నీరు వచ్చిందని.. ఎల్నినోపై దిగులు పోయిందని అభిప్రాయపడుతున్నారు. – కృష్ణా కృష్ణా మండలంలోని గుడేబల్లూరు వద్ద కృష్ణానదిలో పారుతున్న వరద నీరు -
‘నకిలీ’పై నజర్..!
జిల్లాలో విస్తృతంగా వ్యవసాయ అధికారుల స్పెషల్ డ్రైవ్ ● చిన్నంబావి ఘటనతో రంగంలోకి.. ● ఇద్దరు డీలర్ల అరెస్ట్ ● నాణ్యతపై రైతుల్లో పెరుగుతున్న అనుమానాలు ●వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా నకిలీ ఎరువులు వెలుగు చూస్తున్న నేపథ్యం.. జిల్లాలోని చిన్నంబావి మండలం వెల్టూరులో అక్రమ డీఏపీ విక్రయాల ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 15 మండలాల వ్యవసాయశాఖ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ జిల్లాలోని సుమారు 300కుపైగా ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నిల్వలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ అనధికారిక ఎరువుల విక్రయాలు జరిగినా, లైసెన్స్ పొందిన కంపెనీలు కాకుండా ఇతర కంపెనీల ఎరువులు, పురుగు మందులు విక్రయించినా కఠిన చర్యలు తీసుకునేలా నిఘా పెంచారు. అనధికారిక మిశ్రమ ఎరువుల పట్టివేత.. అధికారుల స్పెషల్ డ్రైవ్లో రాష్ట్ర ఎకై ్సజ్మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలోని పాన్గల్ మండలంలో ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన అనధికార ఎరువు (మిశ్రమ ఎరువు) 25 బస్తాలు పట్టుబడింది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఎరువుల విక్రయాల ఘటనలు వెలుగుచూస్తున్న వేళ సమీప మండలంలో అక్రమ డీఏపీ విక్రయంలో పోలీసు కేసులు, అరెస్టులు అవుతున్నా.. సదరు దుకాణ యజమాని అనధికారిక మిశ్రమ ఎరువును రైతులకు విక్రయించేందుకు గోదాంలో నిల్వ చేయడం శోచనీయం. ల్యాబ్కు నమూనాలు.. అనధికారికంగా రైతులకు విక్రయించిన డీఏపీ నమూనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చేందుకు కనీసం 15 రోజుల వ్యవధి పడుతుండగా.. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. రిపేర్టు నకిలీ అని వస్తే.. కోర్టులో దాఖలు చేసే చార్జిషీట్లో ఈ విషయాన్ని పోలీసులు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తమైన రైతులు.. నకిలీ, అనధికారిక ఎరువుల విక్రయాల ఘటనలతో అప్రమత్తమైన రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు వెళ్లినప్పుడు అక్కడి బస్తాల ఫొటోలను ఆయా మండలాల ఏఓలకు పంపిస్తున్నారు. వారు పరిశీలించి అనుమతించిన తర్వాతే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎరువులు, యూరియా నిల్వలు (మెట్రిక్ టన్నుల్లో..) చిన్నంబావి మండలం వెల్టూరులో అనధికారిక డీఏపీ విక్రయాలను గుర్తించి వ్యవసాయశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసునమోదు చేశారు. వారిలో ఇద్దరిని ఇటీవలే అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వీరిలో ఒకరు గద్వాల జిల్లాకు చెందిన వారు కాగా.. మరొకరు జిల్లాలోని పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ దుకాణ యజమాని. మరొకరు హైదరాబాద్లో అనధికార ఎరువులను స్టాక్ చేసిన వ్యక్తి ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
సాగు విధానాల్లో మార్పు అవసరం
గోపాల్పేట: ఎల్నినో కారణంగా సాంప్రదాయ సాగు విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిర్మలాపూర్లో ఎన్నినో ప్రభావం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రైతులు దిగుబడి మాత్రమే కాకుండా పెట్టుబడి, నీటి లభ్యత, మార్కెటింగ్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం సూచిస్తున్న పద్ధతులను పాటించాలని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు నీటిగుంతలు, ఇంకుడు గుంతలు, సూక్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. కంది, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్నినో రాష్ట్ర కమిటీ చైర్మన్గా డా. చిన్నారెడ్డి ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో ఈ ఏడాది 34 శాతం మేర కరువు పరిస్థితులు ఉన్నాయని.. మండలంలో 40 శాతం వరకు నమోదు అయిందని తెలిపారు. జయన్న తిర్మలాపూర్లో సుమారు మూడు వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా.. అందులో 700 ఎకరాలు పూర్తిగా వర్షాధార పంటలే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సమయాల్లో అధిక నీరు అవసరం ఉన్న వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీగోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి సుధీర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు గగనం నరహరి, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఆయుధ వినియోగంలో నైపుణ్యాలు ఉండాలి
వనపర్తి: పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయుధాల వినియోగంపై సంపూర్ణ అవగాహన, నైపుణ్యం అవసరమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లి 10వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన రెండ్రోజుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ శనివారం ముగిసింది. చివరిరోజు ఎస్పీ పాల్గొని అదనపు ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ నిర్వహించి తమ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. శిక్షణలో భాగంగా విధుల్లో వినియోగించే ఆయుధాలతో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పది రౌండ్ల ఫైరింగ్ చేసే అవకాశం కల్పించారు. ఫైరింగ్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ వద్ద ఉన్న ఆయుధాల పనితీరు, వినియోగ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సక్రమంగా ఉంచాలన్నారు. విధి నిర్వహణలో శారీరక దృఢత్వం ఎంతో కీలకమని, రోజు వ్యాయామం జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఆరోగ్యం, మానసిక స్థైర్యం, అప్రమత్తతతో పనిచేస్తేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమన్నారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, పోలీసుశాఖ గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదని కోరారు. వ్యక్తిగత, కుటుంబ, విధి నిర్వహణ, ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, రిజర్వ్ సబ్ ఇనన్స్పెక్టర్ వినోద్, జిల్లా పోలీసు అధికారులు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో పోలీసు సిబ్బంది ఫైరింగ్ చేస్తున్న ఎస్పీ డి.సునీతారెడ్డి -
అర్హుల ఓట్లు కాపాడాలి : మాజీ మంత్రి
కొత్తకోట రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు, బీఎల్ఏలపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా, అమ్మపల్లి, అమ్మపల్లితండాలో పర్యటించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం బీఎల్వోలు, పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. సమయం తక్కువగా ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించి అర్హుల ఓట్లు తప్పకుండా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని బూత్లలో బీఎల్వోలపై పని భారం అధికంగా ఉందని, అదనపు సిబ్బందిని నియమించి సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను కోరారు. వెంట జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, జెడ్పీ టీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి పాన్గల్: వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని డీఆర్డీఓ ఉమాదేవి సూచించారు. శనివారం మండలంలోని చింతకుంటలో సర్పంచ్ కోట్ల రాములు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. పొలాల్లోని బోరుబావుల దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో వీబీజీ రాంజీ ద్వారా రూ.7 వేలు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే వారికి రూ.12 వేలు అందుతాయన్నారు. పశువుల షెడ్, ఫాంపాండ్ నిర్మాణాలు చేపడితే ఆర్థిక సాయం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కొలతల ప్రకారం పనిచేస్తేనే ఉపాధిహామీ డబ్బులు వస్తాయన్నా రు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమా వేశంలో ఎంపీడీఓ గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. నేడు బ్యారేజీల పరిశీలన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: భీమా, కృష్ణానదులపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చెక్డ్యాంలు, బ్యారేజీలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం పరిశీలిస్తామని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కర్ణాటక నుంచి నీరు రాకుంటే తెలంగాణ రైతులు వచ్చే యాసంగిలో పంటలు వేసే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితి మారే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేపడుతామని హెచ్చరించారు. -
ఆస్తుల కంటే విజ్ఞానం గొప్పది
వనపర్తిటౌన్: ఆస్తుల కంటే విజ్ఞానం గొప్పదని.. విద్యార్థులు కష్టపడి చదివి ఎంచుకున్న ఉన్నత లక్ష్యాన్ని సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నగదు ప్రతిభ ప్రోత్సాహక పురస్కార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆస్తులు తింటే తరుగుతాయి.. కానీ విజ్ఞానం ఉంటే ఎన్ని ఆస్తులైనా సంపాదించ వచ్చన్నారు. వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవడంతో పాటు తోటి వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2026లో 10వ తరగతిలో 566 మార్కులు సాధించి మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన నజీరా, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న కృతికకు నగదు ప్రోత్సాహకం అందజేయడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కృతిక ఉన్నత విద్యకు ఆత్మకూర్ బాలవర్ధన్ రెడ్డి గతేడది రూ.20 వేలు, ఈ ఏడాది రూ.50 వేలు, 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్ రూ.10 వేలు, సీనియర్ ఉపాధ్యాయుడు వాకిట రవికుమార్ రూ.10 వేలు, అరవింద్ రూ.10 వేలు అందజేశారు. 500కు పైగా మార్కులు సాధించిన అబ్దుల్ ఆదిల్, భార్గవి, భానుప్రకాశ్, జయచంద్ర, జ్ఞానేశ్వరికి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రూ.వెయ్యి, ఆత్మకూర్ బాలవర్ధన్రెడ్డి రూ.వెయ్యి చొప్పున నగదు అందజేశారు. కార్యక్రమంలో ఏసీజీ అండ్ జీహెచ్ఎం గణేష్కుమార్, సామాజిక కార్యకర్తలు గంధం నాగరాజు, భోజరాజు వెంకటేష్, విశ్వంబాబు, శంకర్గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, మహిపాల్రెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలి ఖిల్లాఘనపురం: సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ తదితర కార్మికులకు మూడునెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని చెప్పినా ఎక్కడా అమలుకావడం లేదని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు సాయికృష్ణ, భీమయ్య, శివ, స్వాతి, ప్రియాంక, నజ్మ, నాగయ్య, వెంకటేష్, మునీందర్ పాల్గొన్నారు. ‘కేంద్ర విధానాలు దేశానికి ప్రమాదం’ వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు దేశానికి తీవ్ర ప్రమాదకరమని.. యువత భవిష్యత్ను దోచుకుంటున్న పాలకులపై ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్లూరి ధరేంద్ర పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన 3వ మహాసభలు నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ దోపిడీ, పరిశ్రమల కొరతతో జిల్లా యువత వలసబాట పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ల కోసం యువత జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని.. నీట్ అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం, క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడమే నిజమైన ప్రగతని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, శాంతి, అభ్యుదయం, శాసీ్త్రయ సోషలిజం అనే సిద్ధాంతంతో ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి బిజ్జ శ్రీనివాసులు, కుతుబ్, సీపీఐ నేత రమేష్, సురేష్, విష్ణు, మహబూబ్, పరమేష్, వివిధ మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సకాలంలో యూనిఫామ్స్ పంపిణీ
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఆగస్టు 15లోగా యూనిఫామ్స్ అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటమార్పిడి చేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని, అందుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించామన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు విద్యార్థుల యూనిఫామ్స్ పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 512 పాఠశాలల్లో 38,653 విద్యార్థులు, 15 కేజీబీవీల్లో 4,531 మంది విద్యార్థులు, 3 మోడల్ స్కూళ్లలో 1,919 విద్యార్థులు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో శిక్షణ పొందిన 358 స్వయం సహాయక సంఘాల టైలర్లను గుర్తించామని.. ఇప్పటి వరకు వచ్చిన వస్త్రాన్ని ఎప్పటికప్పుడు మండలాలకు విభజించి కుట్టేందుకు టైలర్లకు అందజేస్తామన్నారు. ప్రతి విద్యార్థికి ఆగస్ట్ 15లోగా ఒక జత, ఆగస్టు 25లోగా రెండోజత అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. ● వ్యవసాయశాఖకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, సమస్యాత్మక గ్రామాలు, ఇప్పటి వరకు చేపట్టిన సాగు విస్తీర్ణాన్ని వివరించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కంది, నువ్వులు, వేరుశనగ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో కూరగాయల సాగు సైతం పెంచేందుకు వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించామని చెప్పారు. వీడియో కాన్ఫరెనన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్సురభి.. జిల్లా అధికారులు -
రికార్డుస్థాయిలో సెల్ఫోన్ల రికవరీ : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు అధికారులు నెలరోజుల వ్యవధిలో సుమారు రూ.65 లక్షల విలువైన 236 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు ఫోన్లను అందజేసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ఫోన్ పోగొట్టుకుంటే ఎలా ఫిర్యాదు చేయాలనే విషయాన్ని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఉన్న సెల్ఫోన్లను స్థానిక బృందాలు ప్రత్యేక దృష్టి సారించి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సీఈఐఆర్ వ్యవస్థను ఉపయోగించి చోరీకి గురైన ఫోన్లను గుర్తించి బాధితులకు అందించినట్లు చెప్పారు. పోగొట్టుకున్న మొబైల్ విలువ కంటే అందులోని ఫొటోలు, సమాచారం, కాంటాక్ట్ నంబర్ల విలువ ఎంతో ఎక్కువని అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, చోరీకి గురైనప్పుడు బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్లోగాని దగ్గర్లోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశామన్నారు. సెల్ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీసీఎస్ సీఐ పవార్ అశోక్కుమార్, ఎస్ఐ రామరాజు, ఏఎస్ఐ తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు ఎన్.రాజగౌడ్, శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, రాఘవేందర్, కానిస్టేబుళ్లు బెద్దడి స్వామి, మురళీకృష్ణ, సమరసింహారెడ్డి, మురళి, సత్యనారాయణ, భూపాల్కు ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా భూముల రీ సర్వే
ఖిల్లాఘనపురం: పారదర్శకంగా భూముల రీ సర్వే చేపడుతున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. మండలంలోని మల్కాపురం గ్రామం ల్యాండ్ రీ సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. సర్వే గురించి గ్రామస్తులకు వివరించేందుకు శుక్రవారం గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న భూముల రీ సర్వేకు గ్రామం ఎంపికై ందని.. గ్రామంలోని భూములు రీ సర్వే చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా, పారదర్శకంగా నవీకరించడంతో పాటు సర్వేనంబర్ల వారీగా హద్దులను గుర్తించి వివాదాలను పరిష్కరిస్తామన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో సర్వే కొనసాగుతుందని.. రైతులు సర్వే అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అఽధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని.. రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుగుణ, సర్పంచ్ రవీందర్, ఆర్ఐ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి ఖాదర్బీ పాల్గొన్నారు. -
అడ్మిషన్లు ‘ఓపెన్’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ పరిస్థితులతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దిక్సూచిగా నిలుస్తోంది ఓపెన్ స్కూల్ సొసైటీ. ఒకవైపు సొంత పనులు లేదా ఉద్యోగాలు చేసుకుంటూనే.. మరోవైపు పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసేలా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్ విద్యతో సమానమైన గుర్తింపు కలిగి ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా విద్యార్థుల సౌకర్యార్థం 104 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపిక చేసిన మండలాల్లో.. ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని 2008–09 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట కేవలం ఎస్సెస్సీ చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా.. 2011 నుంచి ఇంటర్ చదివే వారికి కూడా అవకాశం కల్పించారు. అయితే ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు (అధ్యయన కేంద్రాలు) ఏర్పాటు చేశారు. ఇలా ఉమ్మడి పాలమూరులో మొత్తం 104 స్టడీ సెంటర్లలో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. వారంలో మొత్తం వారికి అవసరం ఉన్న పనులు చేసుకుంటూ ఆదివారం స్టడీ సెంటర్లలో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంది. నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ వంటి కొన్ని అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల్లో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులతో మధ్యలో ఆపేసిన వారికి సదావకాశం ఇతరత్రా పనులు చేసుకుంటూనే చదివేందుకు అవకాశం సర్టిఫికెట్కు రెగ్యులర్ కోర్సులతో సమాన ప్రాధాన్యం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలంటున్న అధికారులు డిస్టెన్స్ విధానంలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ఆసక్తి గల విద్యార్థులు సూచించిన ఫీజులను చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును.. తమకు అనుకూలమైన సమయంలో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఆది, రెండో శనివారాల్లో తరగతులు నిర్వహిస్తాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఆన్లైన్ విధానంలో WWW.TELANGA NAOPENSCHOOL.ORG వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సెస్సీలో జనరల్ వారికి రూ.1,400, మహిళలు ఇతర రిజర్వేషన్ వారు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు రిజిస్ట్రేషన్కు రూ.150 సాధారణంగా చెల్లించాలి. ఇంటర్లో పురుషులు జనరల్ వారు రూ.1,500, మిగతా వారికి రూ.1,200తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించిన రశీదు, అడ్మిషన్ ఫాం భర్తీ చేసి స్టడీ సెంటర్లో అందజేయాలి. చెల్లించిన ఫీజులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో స్టడీ సెంటర్లు.. గతేడాది ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తీర్ణత పొందినవారు ఇలా.. ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదివిన వారికి రెగ్యులర్ కోర్సులకు సమానంగా సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్తో అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ బోధన అంశాలను మూడు గ్రూపులుగా విభజించి బోధిస్తారు. గ్రూప్–ఏలో భాషలు, గ్రూప్–బీలో ప్రధాన అంశాలు, గ్రూప్–సీలో వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులు ఉంటాయి. మొదటి రెండింటిని కలిపి కనీసం రెండు సబ్జెక్టుల చొప్పున ఐదింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో కొనసాగిస్తారు. ఇంటర్లో గ్రూప్–ఏలో భాషలు, బీలో ఆప్షనల్స్, సీలో వృత్తి విద్యా కోర్సులు ఉండగా.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్–ఏలో ఇంగ్లిష్తోపాటు నచ్చిన ఏదో ఒక భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బీ, సీలో నచ్చిన ఆప్షనల్స్, వృత్తి విద్య కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
30 ఏళ్లుగా పనిచేస్తున్నా..
ఆలయంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. అర్చకుడు మరణించి రెండేళ్లు గడుస్తుంది. నాటి నుంచి ఆలయం మూతబడింది. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో మేలు జరుగుతుందని భావించా. అర్చకుడు బతికి ఉన్నప్పుడు కూడా నెలకు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. ఉన్నతాధికారులు స్పందించి ఆలయాన్ని తెరిపించాలి. – బాలీశ్వరమ్మ, స్వీపర్, వీపనగండ్ల ఆలయ భూములు పేదలు సాగు చేసుకునేలా చేస్తే ఆర్థికంగా బలపడుతారు. ఒకే వర్గానికి చెందినవారు ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారేగాని కనీసం అర్చకుడిని కూడా నియమించడం లేదు. దేవాదాయశాఖ అధికారుల ఏక పక్ష నిర్ణయం సరికాదు. ఉన్నతాధికారులు స్పందించి భూముల వేలం నిర్వహిస్తే ఆదాయం సమకూరడంతో పాటు నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. – ఎత్తం కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు, మండల రైతుబంధు సమితి చెన్నకేశవస్వామి ఆలయ భూములను అదే గ్రామానికి చెందిన పలువురు రైతులు సిట్టింగ్ టెనెంట్ యాక్టు కింద మూడేళ్లు సాగు చేసుకునేందుకు దేవాదాయశాఖ కమిషరేట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. గ్రామానికి చెందిన మరికొందరు సాగుహక్కు కోసం నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామంలో పర్యటించి సమస్యను పూర్తిగా తెలుసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. ఆలయంలో నిత్య పూజలు కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లను వీలైనంత త్వరలో చేపడతాం. – శేఖర్గౌడ్, ఈఓ, దేవాదాయశాఖ, వనపర్తి ● -
ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
పాన్గల్: వాతావరణ మార్పులకు అనుగుణంగా శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తూ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలన్నారు. భూసార పరీక్షల నివేదికల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, భూసారాన్ని కాపాడటంతో దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయం స్థిరమైన అభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు. భూమి, ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణల్లో మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట డీఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఆయా గ్రామాల సర్పంచులు హేమాద్రినాయుడు, ప్రభాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
ఖిల్లాఘనపురం: విద్యాపరంగా జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ఇన్చార్జి జిల్లా విద్యాధికారి యాదయ్య కోరారు. మండలంలోని సోళీపురం ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే దొంతికుంటతండా స్టేజీ సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాలను సందర్శించి కొనసాగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇంటర్ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వసతులపై ఆరా తీశారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఐదేళ్లుగా నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో నిలిచిందని, ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై శిక్షణనిస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో అందించే అంశాలను ఉపాధ్యాయులు అర్థం చేసుకొని విద్యార్థులను టాపర్లుగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జీసీడీఓ నారాయణమ్మ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఎస్ఓ శేఖర్, ఎంఈఓ జయశంకర్, ఏఓ మల్లయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


