breaking news
Wanaparthy District Latest News
-
హే కృష్ణా.. ఇకనైనా!
●సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని రైతుల రోదన అరణ్య రోదనగా మిగులుతోంది. వేల సంఖ్యలో కృష్ణ్ణ జింకలు పంటలను నాశనం చేస్తుండడం ఏటేటా నిత్యకృత్యంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో బాధిత రైతుల్లో ఆందోళన నెలకొంది. కృష్ణ జింకలను పట్టుకుని అడవులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా.. రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. అధికారుల్లో కొరవడిన ప్రణాళిక, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి వెరసీ రైతులకు తిప్పలు తప్పడం లేదు. సుమారు 12 వేల జింకలు.. కృష్ణానది పరివాహకమైన మాగనూరు, కృష్ణా, నర్వ, మరికల్, మక్తల్ మండలాల పరిధిలో ప్రధానంగా వరి, పత్తి, కంది సాగవుతోంది. సుమారు 10, 12 ఏళ్ల క్రితం ఆయా ప్రాంతాల్లో వందలలోపే ఉన్న కృష్ణ జింకల సంతతి క్రమక్రమంగా పెరిగింది. ప్రస్తుతం 10 వేల నుంచి 12 వేల వరకు కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ అంచనా. అవి ఆహారం కోసం మూకుమ్మడిగా పంట చేలల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, కాయలు, తీగలు.. కృష్ణ జింకలు పంట పొలాల్లో తిరగాడే క్రమంలో చేలల్లో మొదట్లో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో నాలుగైదు పర్యాయాలు విత్తనాలు వేయడం ఆయా రైతులకు ఏటా పరిపాటిగా మారింది. ఇంతే కాకుండా.. పత్తి కాయలు, కంది కాయలను సైతం జింకలు ఆహారంగా తీసుకుంటుండడంతో పంటలు సరిగ్గా చేతికి రావడం లేదు. వరి పంటలో గుంపులు గుంపులుగా జింకలు తిరుగుతుండడంతో వేసిన తీగలు తెగిపోయి నష్టం వాటిల్లుతోంది. దిగుబడి తగ్గుతుండడంతో ఆ రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. పంటలు కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే.. ప్రతి ఏటా నష్టం వాటిల్లుతుండడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎట్టకేలకు ముందడుగు.. కృష్ణ జింకల రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా ముడుమాల్ వద్ద 74.10 ఎకరాల భూమి హద్దులను రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కింగ్ చేశారు. ఇటీవల ఆ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. దీంతో అటవీ శాఖ ఎట్టకేలకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. చెరువు పరిధిలోకి రాని సుమారు 44 ఎకరాల్లో శాశ్వత, చెరువు పరిధిలోకి వచ్చే 30 ఎకరాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఎలాంటి జాప్యం లేకుండా చూసి.. జింకల సమస్య తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. కృష్ణానది పరీవాహకంలో అన్నదాతల అగచాట్లు విజ్ఞప్తులు.. ప్రతిపాదనలు.. ఆదేశాలకే పరిమితం రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం నష్టంతో పాటు నిత్య కాపలాతో రైతులకు తప్పని తప్పలు మా కుటుంబానికి దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతిఏటా పత్తి వేస్తున్నాం. జింకల వల్ల విత్తనాలను మళ్లీ మళ్లీ నాటడం ఆనవాయితీగా మారింది. కాయలు పడుతున్నప్పుడు గుంపులుగా దాడి చేసి తింటున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి చేనులోకే వస్తున్నాయి. జింకలను పట్టి పరిరక్షణ కేంద్రాలకు తరలించాలి. – అంపయ్య, గుడేబల్లూరు, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా కృష్ణాతీరంలో కృష్ణ జింకల బెడద నుంచి పంటలను కాపాడాలని రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జింకలను పట్టి నల్లమల, కవ్వాల్ అడవులకు తరలించాలని ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే నిర్ణయించి.. రూ.2.70 కోట్ల నిధులు సైతం కేటాయించింది. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ముందుగా రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా మండలం ముడుమాల్ వద్ద అందుబాటులో ఉన్న భూమిని అధికారులు పరిశీలించారు. సర్వే నం.192లోని 18.29 ఎకరాలు, సర్వే నం.194లోని 55.21 ఎకరాలు మొత్తం కలిపి 74.10 ఎకరాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కానీ, ఇందులో తొలుత ఎనిమిది ఎకరాలు, ఆ తర్వాత సుమారు 30 ఎకరాల్లో చెరువు ఉండడం, రెవెన్యూ శాఖ తిరకాస్తు వంటి సమస్యలతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
స్వచ్ఛత.. ప్రతి ఒక్కరి బాధ్యత
అమరచింత: స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ఇళ్లలోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా పురపాలిక ఆటోలు, ట్రాక్టర్లలో వేసి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్లోని క్యాంపు కార్యాలయంలో అమరచింత పురపాలికకు కేటాయించిన 2 ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పురపాలిక పరిశుభ్రంగా ఉండేందుకు పుర కార్యాలయాలకు చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, ఆటోలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పురపాలికలకు మాత్రమే వాహనాలు కేటాయించగా అందులో అమరచింత ఉండటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పుర మేనేజర్ యూసుఫ్, పీసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ కార్యదర్శి అయ్యూబ్ఖాన్, మహేందర్రెడ్డి, అరుణ్, మార్కెట్ డైరెక్టర్లు శ్యాం, విష్ణు, మోహన్, తౌఫిక్, అశు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు పరిష్కరించాలి..
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ఫిర్యాదుదారులతో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి వినతులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు 40 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వివరించారు. -
‘పీఎం దక్ష’తో దివ్యాంగులకు ప్రయోజనం
వనపర్తి రూరల్: దివ్యాంగులు పీఎం దక్ష యోజనలో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. సోమవారం పెబ్బేరు మండలంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానసిక, శారీరక దివ్యాంగ బాలలను పునరావాస కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా దివ్యాంగ్ జన్కౌశల్ వికాస్ పథకం గురించి వివరించారు. దివ్యాంగులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని.. టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మోటారు వాహనాలు, ఉచిత నిర్బంధ విద్య, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మహాత్మా జోతిబాపూలే పాఠశాలను సందర్శించి లీగల్ లిటరసీ క్లబ్ను ప్రారంభించి క్లబ్లో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వర్తించాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ ఓబుల్రెడ్డి, హెచ్ఎం కవిత, లీగల్ వలంటీర్లు సుశీల, శేఖరాచారి పాల్గొన్నారు. -
అక్టోబర్ 15 వరకు..
ముడుమాల్ వద్ద రిహాబిలిటేషన్ సెంటర్కు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి.. వచ్చేనెల 15 వరకు పనులు మొదలుపెడుతాం. దీంతోపాటు ఎక్కడైతే కృష్ణ జింకలు ఎక్కువ ఉన్నాయో.. అక్కడ మినీ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్కు.. ఆ తర్వాత క్రమంగా నల్లమల లేదా కవ్వాల్ అడవులకు తరలిస్తాం. నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో మినీ రిహాబిలిటేషన్ సెంటర్ కోసం పది ఎకరాల్లో భూమి గుర్తించాం. ఇక్కడ పైలెట్ ప్రాజెక్ట్గా ఈ సెంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – అరవింద్రెడ్డి, డీఎఫ్ఓ, నారాయణపేట నేను 20 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కాయలు కాసే దశ. ప్రతిరోజూ కాపలా ఉంటున్నా. ఇప్పుడే కాదు.. విత్తనాలు పెట్టిన నాటి నుంచి పత్తి చేతికొచ్చే వరకూ జింకలు రాకుండా ప్రతిరోజూ నాకు ఇదే పని. జింకలను ఇక్కడి నుంచి అటవీ ప్రాంతానికి తరలిస్తేనే మా సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికై నా పటిష్ట చర్యలు తీసుకోవాలి. – బస్లింగప్ప, చేగుంట, కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో 3 వైద్యాధికారుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 19 వరకు అవకాశం ఉందని.. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి ధ్రువపత్రాలతో డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఇతరులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 డీడీ జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీస్, వనపర్తి పేర తీయాలని, దరఖాస్తునకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన బోనఫైడ్, ఎస్ఎస్సీ, ఇంటర్ మెమో, ఎంబీబీఎస్ రిలేటెడ్ మెమో, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ జిరాక్స్లు జత చేయాలని సూచించారు. నేడు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ రాక వనపర్తి: జిల్లాలోని క్రైస్తవుల సమస్యలపై చర్చించడానికి తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్జాన్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు వస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి అఫ్జలుద్దీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగే సమవేశంలో క్రైస్తవుల శ్మశానవాటికకు స్థలం కేటాయింపు, భూ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్, చర్చి నిర్మాణం తదితర సమస్యలతో పాటు కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ప్రధానమంత్రి 15 పాయింట్ ఫార్ముల అమలుపై చర్చిస్తారని.. జిల్లాలోని పాస్టర్లు, పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రైస్తవ మత పెద్దలు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. రోబోటిక్స్పై విద్యార్థులకు అవగాహన కొత్తకోట: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోహమ్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏఎండీ సహకారంతో సోమవారం రోబోటిక్స్ వర్క్షాప్ నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ కొమరగిరి సహదేవ్ పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు దేవని ప్రవీణ్కుమార్తో కలిసి వర్క్షాప్ ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్లో ముగ్గురు విద్యార్థుల చొప్పున మొత్తం 50 బ్యాచ్లలో ఎలక్ట్రానిక్స్ ప్రాథమికాలు, సెన్సార్లు, మోటార్లు, రోబోటిక్ సూత్రాలు, హార్డ్వేర్ వినియోగం, ప్రాజెక్టు డిజైన్, డెవలప్మెంట్ గురించి ప్రయోగాత్మకంగా వివరించారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారని ఆయన కొనియాడారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, పాఠశాలకు రోబోటిక్స్ కిట్లను సోహం అకాడమీ అందజేసిందని ప్రిన్సిపాల్ వివరించారు. కార్యక్రమంలో అకాడమీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ జస్వంత్, టీం లీడర్ దినేష్, 12 మంది శిక్షకులు, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ప్రవీణ్రెడ్డి, సుమ, సుధారాణి, రామకృష్ణ పాల్గొన్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాలో.. అమరచింత/ఆత్మకూర్: అమరచింతలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆత్మకూర్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం సోహం అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్పై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, మోటార్లు, రోబోటిక్స్ సూత్రాలను శిక్షకులు ప్రయోగాత్మకంగా వివరించారు. ఆధునిక కాలం కంప్యూటర్, ఏఐతో ముందకు సాగుతోందని.. ప్రతి విద్యార్థి వీటి గురించి తెలుసుకొని పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షకుడు శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఘనంగా మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం చిన్నంబావి: మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్ తన 41 ఏళ్ల ప్రయాణంలో అనేక విజయాలు సాధించిందన్నారు. మహిళా సాధికారత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తూ దేశ నిర్మాణంలో మహిళల శక్తిని వెలుగులోకి తెచ్చిందని గుర్తు చేశారు. చట్టసభల్లో హక్కులు, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రధానపాత్ర పోషిందన్నారు. గతంలో రాష్ట్రంలో కూడా మహిళలపై అనేక దాడులు జరిగాయని.. రెండేళ్లుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. -
ఆసియాలోనే మొదటిది..
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే మొదటి ప్రాజెక్టుకు కాగా.. ప్రపంచంలో రెండోది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో సైఫన్ 520 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కి.మీ., ఎడమ కాల్వ 20 కి.మీ.,లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కట్ట ఇప్పటి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31న రెండోసారి కట్టకు గండిపడింది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రారంభించారు. వర్షం నీరు ఊకచెట్టువాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవడం, ఈ వాగు సమీపంలోని గ్రామాలను తరుచూ వరద ముంపునకు గురికావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం ఆధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అమెరికా వెళ్లి టెక్నాలజీని తీసుకువచ్చిన ప్రాజెక్టు రూపకర్త ఎస్ఈ పీఎస్ రామకృష్ణరాజు (ఫైల్) -
దోస్త్.. లాస్ట్ చాన్స్
● డిగ్రీలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్ పక్రియ ● నేడు, రేపు ప్రత్యేక చివరి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్కల్వకుర్తి టౌన్: డిగ్రీ కోర్సులలో చేరేందుకు పలు విడతలుగా నోటిఫికేషన్ జారీచేసిన ఉన్నత విద్యామండలి మరోమారు ఆయా కోర్సులలో చేరికకు చివరి అవకాశం కల్పించింది. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను సోమవారం, మంగళవారం ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి అవకాశంగా ఇచ్చిన స్పాట్ అడ్మిషన్ను ఉపయోగించుకోవాలని, ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆసక్తి గల కోర్సులలో చేరాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ను నోటీస్ బోర్డులలో ఉంచగా.. ఏయే కోర్సులలో ఖాళీలు ఉన్నాయో దోస్త్ పోర్టల్లో వివరాలను పొందుపరిచారు. నేరుగా రిపోర్టు.. దోస్త్ చివరి అవకాశంలో భాగంగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్త్ పోర్టల్లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో కట్టిన రుసుంతో వచ్చి న రశీదును వారు ఎంచుకున్న కళాశాలలో చూయించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా భర్తీ కాని సీట్లకు ఈ నెల 18, 19వ తేదీలలో వన్టైం స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందవచ్చు. ఇదే తేదీలలో నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ ప్ర క్రియలో పాల్గొనే అవకాశం ఉండదని ఉన్నత విద్యామండలి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేవాలి స్పాట్ అడ్మిషన్లో భాగంగా అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు వారి వెంట ఎస్సెస్సీ మెమో, ఇంటర్, టీసీ, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, రెసిడెన్సీ, ఏదైనా బ్రిడ్జి కోర్సు చదివి ఉంటే, దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫారంతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సులలో సీట్లను భర్తీ చేయనున్నారు. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఆయా కళాశాలలో ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
అన్యాక్రాంతమైన భూమిని పేదలకు పంచాలి
వనపర్తిటౌన్: తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల్లో చుక్క నీటిని ఆంధ్రాకు తరలించేందుకు ఒప్పుకోనంటున్న సీఎం రేవంత్రెడ్డి.. భూస్వాములు అన్యాక్రాంతం చేసిన భూములు అర అంగులం కూడా ఉండనివ్వమని ఎందుకు ప్రకటించడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా.విశారధన్ ప్రశ్నించారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ ఆవిర్భావ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నీటిని దక్కించుకోవడం మంచిదే అని.. మరి అన్యాక్రాంతంగా ఉన్న భూమిని పేదలకు పంచేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ప్రపంచంలో అధికారం ఏ ఒక్కరి చేతుల్లో లేదని.. తెలంగాణలో మాత్రమే ఇద్దరి కులాల నడుమ బంధీ అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సమాజంలో వనరులు పరిమితంగా ఉంటుండగా.. ప్రజల అవసరాలు అపరిమితంగా ఉంటున్నాయన్నారు. ఈ రెండింటి మధ్య వారధి కట్టే రాజకీయాన్ని నిరుపేద ప్రజలు చేజిక్కించుకుంటేనే భవిష్యత్ పూలబాటగా మారుతుందని వివరించారు. బడుగు బలహీన వర్గాలు అతి మంచితనంతో రాజకీయాలకు దూరంగా ఉండటం సరికాదని అన్నారు. రూ. 12వేల కోట్ల ఆస్తు లు, రూ. 6కోట్ల పార్టీ ఫండ్ ఉన్న బీఆర్ఎస్లో నలు గురి కోసం కొట్లాడుకుంటున్నారని, బీఆర్ఎస్ను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అప్పజెబుతున్నట్లు కేసీఆర్ ప్రకటిస్తే కాంగ్రెస్ అధికారం ఒక్క క్షణంలో నేలకూలుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల సమానత్వ సాధనకు సాగిస్తున్న సమరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగం కుమారస్వామి, లక్ష్మీకాంత్, రాము యాదవ్, పెబ్బే టి నిరంజన్, శంకర్ యాదవ్, సతీశ్ యాదవ్, కార్తీక్ ఏకలవ్య, బండాలయ్య, బీచుపల్లి యాదవ్, రమేశ్గౌడ్, దయానంద, బలరాం, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, శ్రీనుయాదవ్ పాల్గొన్నారు. -
లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
నారాయణపేట: పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం నారాయణపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో జీఓ 69 తీసుకొచ్చేందుకు కృషిచేసిన సీఎం రేవంత్రెడ్డి.. నేడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా భూనిర్వాసితుల ఆకాంక్ష మేరకు రూ.20 లక్షలకు పరిహారం పెంచినట్లు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజార్వాయర్తో పాటు జాయమ్మ చెరువుతో రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మూలన పడిందన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు డా.చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కావడం.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్రెడ్డి సీఎం కావడంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నేరడగాం, భూత్పూర్, సంగంబండ, అనుగొండ, జూరాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల బాధ తనకు తెలుసన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్ష మేరకు పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. ఈ ప్రాంతంలో ఏళ్లుగా సాగు, తాగునీరు లేక జనం గోస పడుతున్నారన్నారు. శ్రీశైలం బ్యాక్వాటర్ను ఎల్లూరు నుంచి మహబూబ్నగర్, దేవరకద్ర, మన్యంకొండ మీదుగా మరికల్ వరకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి మక్తల్, నారాయణపేటకు తాగునీరు అందిస్తున్నారన్నారు. భూ పరిహారం పెంచి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి విరమింపజేశారు. అనంతరం సీవీఆర్ భవన్కు చేరుకొని మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డికి స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు. రిలే దీక్షలను విరమింపజేసిన మంత్రి సీఎం రేవంత్రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎకరాకు రూ. 20లక్షల పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
కోయిల్సాగర్ @ రూ.84 లక్షలు
పాలమూరు జిల్లా వరప్రదాయిని కోయిల్సాగర్ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 71 ఏళ్లు పూర్తయింది. 1947లో తెలంగాణ ప్రాంతానికి ఇంకా స్వాతంత్య్ర రాక ముందు ఆనాటి నైజాం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. 1.20 టీఎంసీల సామర్థ్యంతో 26.6 అడుగుల ఎత్తు అలుగు ఉండే విధంగా ప్రాజెక్టుకు అప్పటి ఇంజినీర్లు రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించి 1954లో పూర్తిచేశారు. కేవలం రూ.84 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నుంచి మొదటిసారి 9 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.91 లక్ష వ్యయంతో 6 అడుగుల మేర కట్టను బలోపేతం చేసి ఎత్తును పెంచి అలుగుపై 13 గేట్లు నిర్మించారు. ఆనాటి ఎమ్మెల్యే వీరారెడ్డి కృషి ఫలితంగానే గేట్ల నిర్మాణం జరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. 2.27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆయకట్టు కుడి కాలువ కింద 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రూ.359 కోట్ల అంచనాతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి 2006లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచుతూ జూరాల నుంచి కృష్ణా జలాలను కోయిల్సాగర్కు తరలించేలా రూపకల్పన చేశారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి పరుగులు పెడుతున్న నీరు (ఫైల్)ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఏకై క ప్రాజెక్టు కోయిల్సాగర్. గతంలో చిన్ననీటి తరహా ప్రాజెక్టుగా ఉండగా ఎత్తిపోతల పథకం ప్రారంభం తర్వాత భారీ నీటి పారుదల శాఖ కిందకు మార్చారు. సాగునీటితోపాటు పాలమూరు పట్టణానికి తాగునీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నారాయణపేట జిల్లా, కొడంగల్ ప్రాంతానికి తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు ఉండగా.. నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్, ధన్వాడ మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు కాల్వ ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతున్నారు. నైజాం ప్రభుత్వ హయాంలో 1947– 54 మధ్య నిర్మించిన కోయిల్సాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదు. కోయిలకొండ కోట సమీపంలో ఉండడం వల్ల ప్రాజెక్టుకు కోయిల్సాగర్ అని పేరు పెట్టారు. రెండు గుట్టల మధ్య ప్రాజెక్టును పటిష్టంగా సున్నం, గచ్చు ఉపయోగించి నిర్మించారు. కట్టకు రెండు వైపులా రాతి గోడ నిర్మించి.. బయటి నుంచి మట్టితో నింపారు. ఇక అలుగును సైతం సున్నం గచ్చు ఉపయోగించి నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన పరికరాలు నేటికీ ప్రాజెక్టు సమీపంలోనే పడి ఉన్నాయి. ఇక ప్రాజెక్టు నమూనాను ముందుగా తయారు చేసి నిర్మాణం తర్వాత ప్రారంభించారు. ఆనాడు చేసిన నమూనా నేటికి ప్రాజెక్టు సమీపంలోనే కనిపిస్తుంది. ప్రాజెక్టును 10 జూలై 1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేఎం ఖార్జు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల చిన్నబొల్లారం, పెద్ద బొల్లారంతోపాటు మరో రెండు చిన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే బాధితులకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోవడంతో కొత్తగా బొల్లారం పేరుతో గ్రామం ఏర్పడింది. కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణం పనులు (ఫైల్) కట్టను నిర్మిస్తున్న ఆనాటి కూలీలు (ఫైల్) -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
● మూడుముళ్ల బంధంతో బాలల భవిష్యత్ నాశనం చేయొద్దు ● ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి: బాల్యవివాహాలకు బాధ్యులైన తల్లిదండ్రులు, బంధువులు, పూజారులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకోవాల్సిన వయసులో ఆడపిల్లలను పెళ్లి పీటలు ఎక్కించి వారి బంగారు భవిష్యత్ను నాశనం చేయొద్దన్నారు. ఆడపిల్లలను ఎప్పుడూ ఇంటికి భారంగా అనుకోవద్దని అన్నారు. 18ఏళ్లు నిండని బాలికలు కుటుంబ బాధ్యతలు స్వీకరించే స్థితిలో కూడా ఉండరని.. శారీరకంగా బలంగా ఉండకపోవడం వల్ల దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ఆడపిల్లలను ఉన్నతంగా చదివించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని సూచించారు. జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా వీల్లేదన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు చేసేందుకు యత్నిస్తే బాధ్యులైన తల్లిదండ్రులతో పాటు బంధువులు, పూజారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాల్యవివాహాల నియంత్రణ కోసం గ్రామస్థాయిలో బాలల సంరక్షణ కమిటీ (వీసీపీసీ), మండల బాలల పరిరక్షణ కమిటీ (ఎంసీపీసీ) ఏర్పాటుచేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల సంరక్షణకు హెల్ప్లైన్ నంబర్ 1098 నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా బాలికలు, మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తే కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. జాతీయ లోక్అదాలత్లో 2,737 కేసుల పరిష్కారం.. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదై కోర్టు విచారణలో ఉన్న ఐపీసీ కేసులు 171, డ్రంకెన్ డ్రైవ్, మోటార్ వెహికిల్ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 514, సైబర్ క్రైం 45 కేసుల్లో రూ. 15,10,698 బాధితుల అకౌంట్కు రీఫండ్ చేయడం జరిగిందని ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. 15 రోజుల నుంచి పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది ఆయా కేసుల్లోని కక్షిదారులను స్వయంగా కలిసి జాతీయ లోక్అదాలత్లో రాజీ అయ్యేలా అవగాహన కల్పించినట్లు తెలిపారు. శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన లోక్అదాలత్లో 2,737 కేసులను పరిష్కరించడం జరిగిందని.. ఈ కేసుల పరిష్కారంలో చక్కగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
‘కాలగమనం’ పుస్తకావిష్కరణ
వనపర్తిటౌన్: జిల్లా సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో రచయిత డా.కంటె నిరంజనయ్య రచించిన ‘కాలగమనం’ పుస్తకాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని చైతన్యపరిచే రచనలు మరిన్ని రావాలని అన్నారు. కవులు తమ కవిత్వాన్ని సమాజానికి స్ఫూర్తినిచ్చేలా రచించాలని సూచించారు. ఆనాటి కవులు కల్పిత సాహిత్యంతో పాటు యాదార్థ విషయాలను కళ్లకు కట్టినట్లు రచించే వారని.. పాఠకులను కదిలించే కవిత్వాలు రావాలని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్ అన్నారు. అనంతరం కంటె నిరంజనయ్యను పలువురు కవులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాండు, జనజ్వాల, ఎంఈఓలు మద్దిలేటి, నర్సింహ, జైభీమ్ సంస్థ అధ్యక్ష, కార్యద ర్శులు బండారు శ్రీనివాస్, రాంబాబు, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి కబడ్డీ జట్ల ఎంపిక వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ హైస్కూల్ మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి కబడ్డీ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో బాలికలు 48 మంది, బాలురు 85 మంది పాల్గొన్నట్లు అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 25నుంచి 28వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కుర్మయ్య, ఉపాధ్యక్షుడు దామోదర్, కోశాధికారి గోపాలం, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శులు మధు, వెంకట్రాములు, ఈసీ మెంబర్ కమలాకర్ పాల్గొన్నారు. -
అద్భుతం.. ఆ కట్టడాలు
వనపర్తిసరళమైన కోయిల్సాగర్ ● ‘ఇంజినీర్’ నైపుణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్న రెండు ప్రాజెక్టులు ● ఆసియా ఖండంలోనే మొదటిగా పేరుగాంచిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ● అప్పట్లోనే సాంకేతికతను పరిచయం చేసిన వనపర్తి సంస్థానాధీశులు ● అతి తక్కువ వ్యయంతో కోయిల్సాగర్ నిర్మాణం ● ఉమ్మడి పాలమూరుకు తలమానికంగా నిలిచిన జలాశయాలు సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
రాజీయే రాజమార్గం
వనపర్తిటౌన్: కక్షిదారులు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకొని మానసిక ప్రశాంతత పొందడంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎంఆర్ సునీత అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వనపర్తి, ఆత్మకూర్ కోర్టుల్లో రాజీ ప్రక్రియలు న్యాయవాదులు, న్యాయమూర్తుల సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను రాజీతో రూపుమాపుకోవడం వ్యక్తిగత, కుటుంబ జీవితం, సమాజంలో మానసిక ధృడత్వంగా ఉండేందుకు దోహదపడతాయని వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకునేలా కక్షిదారులకు అవగాహన కల్పిస్తుందన్నారు. జిల్లా పరిధిలోని కోర్టుల్లో శనివారం జరిగిన లోక్ అదాలత్లో 9,180 కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. ఇందులో సివిల్ కేసులు 26, క్రిమినల్ కేసులు 2,624, ప్రీ లిటిగేషన్ కేసులు 6,530 ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూని యర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రూ.29.30 లక్షల జరిమానా.. ఆత్మకూర్: స్థానిక మున్సి్ఫ్ మెజీస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతమైంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి శిరీష మాట్లాడుతూ.. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. క్షణికావేశంలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరుగడంతో ఎంతో విలువైన సమయం వృథా అవుతుందన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని పేర్కొన్నారు. అనంతరం వివిధ రకాల క్రిమినల్ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఇతర పోలీస్ కేసుల ద్వారా రూ.29.30 లక్షల జరిమానాలు, మొత్తం 408 కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో లోక్అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, లోక్అదాలత్ సిబ్బంది, ఆయా మండలాల పోలీసుసిబ్బంది పాల్గొన్నారు. లోక్ అదాలత్లో 9,180 కేసుల పరిష్కారం -
బకాయి వేతనాలు చెల్లించాలని ఆందోళన
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే రోజువారీ కూలీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల గేట్ ఎదుట చేస్తున్న ఆందోళన శనివారం రెండోరోజు కొనసాగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మండ్ల రాజు పాల్గొని వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. జిల్లాలో 16 మంది కార్మికులు పని చేస్తున్నారని.. వారికి 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.11,500 వేతనం చెల్లిస్తూ పెంచకుండా వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించడంతో పాటు ఐదేళ్లు నిండిన వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణమ్మ, రాజు, చెన్నకేశవులు, పార్వతమ్మ, పద్మ, వెంకటమ్మ, సక్రి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం : బీజేపీ
వనపర్తిటౌన్: కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు తప్పవని సేవాపక్షం రాష్ట్ర కో–కన్వీనర్ రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన వర్క్షాప్ నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ఓ పక్క మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే.. రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తామని ఇచ్చిన మాట ప్రకారం నాలుగు స్లాబ్లను రెండు స్లాబ్లుగా చేసిందని కొనియాడారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం–2025 పేరుతో రక్తదానాలు, మండలస్థాయి కార్యశాలలు, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, స్వచ్ఛభారత్, డాక్యుమెంటరీ ప్రదర్శన, దివ్యాంగులకు సన్మానం, ఉపకరణాల పంపిణీ, ప్రభుత్వ అవార్డులు పొందిన వ్యక్తుల సన్మానం, మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్బహద్దూర్ శాస్త్రి చిత్రపటాలకు పుష్పాంజలి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి శ్రీశైలం. స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు హేమారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్గౌడ్, నాయకులు పెద్దిరాజు, వారణాసి కల్పన, అక్కల రామన్గౌడ్, సుమిత్రమ్మ, రామన్నగారి వెంకటేశ్వర్రెడ్డి, పి.విష్ణువర్ధన్రెడ్డి, కదిరె మధు, బాశెట్టి శ్రీను, శివారెడ్డి, రాఘవేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వయం ఉపాధి’పై అవగాహన
పాన్గల్: మండలంలోని మల్లాయిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహిళా రైతులు, గ్రామీణ యువతకు సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి, వ్యాపార రంగాలపై శనివారం శాస్త్రవేత్త డా. భవాని అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత, మహిళా రైతులు శాసీ్త్రయ సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు ఆధునిక పద్ధతులను పాటిస్తూ అధిక లాభాలు పొందడం అనే అంశాల గురించి వివరించారు. మహిళలు, గ్రామీణ యువత అందుబాటులో ఉన్న శిక్షణ కార్యక్రమాలు, సూక్ష్మ వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం అనే అంశాలపై రెసెటి ప్రతినిధి చరణ్కుమార్ వివరించారు. మహిళా రైతులు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, రాయితీలు పొందడం అనే అంశాలపై పీఎంఎఫ్ఎంఈ ప్రతినిధి రవిసాగర్ తెలియజేశారు. ఐకేపీ ఏపీఎం వెంకటేష్యాదవ్, వీఓఏలు, మహిళ రైతులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆనందం
‘సింగోటం–గోపల్దిన్నె’ లింక్ కెనాల్ పనులు పునః ప్రారంభం –8లో u●భీమా కాల్వ ఫేజ్–2కు ఈ కాల్వను లింక్ చేయడంతో వందలాది ఎకరాలు సాగులోకి వస్తుంది. మా కుటుంబానికి సంబంధించి 10 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మంత్రి జూపల్లి చొరవచూపి భీమా కాల్వకు కూడా ఈ లింక్ కెనాల్ ద్వారా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. – తలకంటి వెంకటేశ్వర్రెడ్డి, రైతు, వీపనగండ్ల కాల్వ నిర్మాణంతో పలువురు పేద రైతులు భూములు కోల్పోవాల్సి వస్తోంది. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.20 లక్షలు చెల్లిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక జీఓ తీసుకొచ్చి రైతులకు సరైన పరిహారం అందించాలి. – బాల్రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి, వీపనగండ్ల భూ సేకరణకు రైతులు సహకరిస్తే లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తవుతుంది. కాల్వ నిర్మాణం జరిగితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. గ్రామాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు రైతులను సమన్వయపర్చి భూములు ఇచ్చేందుకు సహకరించాలి. – ఆసీఫ్, డిప్యూటీ తహసీల్దార్ (భూ సేకరణ) వీపనగండ్ల: మండలంతో పాటు ఇతర మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించే సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు పునః ప్రారంభం కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పనులు ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇటీవలే రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లింక్ కెనాల్ పనులను తిరిగి ప్రారంభించేందుకు భూమి పూజ చేసి భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు మండలాలకు ప్రయోజనం.. లింక్ కెనాల్ నిర్మాణంతో వీపనగండ్ల మండలం తూంకుంట, వీపనగండ్ల, గోపల్దిన్నె, సంపట్రావుపల్లి, చిన్నంబావి మండలంలోని వెలగొండ, దగడపల్లి, కొప్పునూరు, పెద్దమారూర్, కాలూరు, చెల్లపాడుతో పాటు పెంట్లవెల్లి మండలంలో కొండూరు, గోపాలాపురం, సింగవరం తదితర గ్రామాల రైతులకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు, ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపట్టాలని ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో నాటి కాంట్రాక్టర్ రూ.147 కోట్లతో కాల్వ పనులు ప్రారంభించి వల్లభాపురం సమీపంలో వంతెన, కొంతమేర కాల్వ నిర్మాణం చేపట్టినా.. మారిన రాజకీయ పరిస్థితులతో అర్ధాంతరంగా నిలిపివేశారు. నేడు మంత్రి జూపల్లి చొరవతో పనులు తిరిగి ప్రారంభించి ఆర్నెల్లలో పూర్తిచేసి సాగునీరు అందిస్తామని చెబుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సర్వే కోసం ఓ రైతు పొలంలో పాతిన జెండా నిర్మాణం పూర్తయితే 45 వేల ఎకరాలకు సాగు నీరు మూడు మండలాల రైతులకు తీరనున్న కష్టాలు భూ సేకరణపై అవగాహన కల్పిస్తున్న అధికారులు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతున్న రైతులు లింక్ కెనాల్ నిర్మాణానికి 298 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇందులో కల్వరాలలో 52.26 ఎకరాలు, బొల్లారంలో 73.13, వల్లభాపురంలో 87.03, తెల్లరాళ్లపల్లిలో 3.16, సంగినేనిపల్లిలో 82.02 ఎకరాల భూ సేకరణకు వనపర్తి ఆర్డీఓ, భూ సేకరణ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తూ కాల్వ నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నారు. -
సమన్వయంతో మెలగాలి..
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం, జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య. భావ ప్రకటనను ఎవరైనా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడకుండా.. సమన్వయంతో మెలిగేందుకు ప్రయత్నించాలి. పత్రికలు, జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు సరికాదు. – ఆల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, దేవరకద్ర ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణం. పత్రికలు తమ పని తాము స్వేచ్ఛగా చేసినప్పుడే సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలు ప్రజలకు చేరువవుతాయి. – వి.నరేందర్చారి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్నగర్ -
సద్వినియోగం చేసుకోవాలి..
కోర్టుల్లోని పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. కక్షిదారులకు రెండు పద్ధతుల్లో మేలు చేకూరుతుంది. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న కేసులు పై కోర్టులకు వెళ్లినా చెల్లుబాటు కావు. ఇరువురి అభిప్రాయంతోనే తుది తీర్పు వెలువరుస్తాం. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు ఇద్దరి మధ్య పరిపూర్ణమైన అవగాహన కుదురుతుంది. లోక్ అదాలత్లో కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజు వాపస్ ఇవ్వబడుతుంది. – వి.రజని, కార్యదర్శి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ● -
గురుకులాలకు నాణ్యమైన బియ్యం
వనపర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ గురుకులాలకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్తో కలిసి అన్ని సంక్షేమ గురుకులాల డీసీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాసిరకం బియ్యం వస్తే వెంటనే తిప్పి పంపించాలని సూచించారు. బియ్యం సరఫరాలో ఏవైనా సమస్యలుంటే గురుకులాల ఇన్చార్జ్లు, డీసీఓలు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత లేని బియ్యంతో వండిన అన్నం విద్యార్థులకు అందించవద్దని కోరారు. సమావేశంలో జిల్లా మైనార్టీ అధికారి అఫ్జలుద్దీన్, జీసీడీఓ శుభలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అప్రజాస్వామ్యం..
పత్రికల గొంతు నొక్కడం ● సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు ● మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, రాజకీయ నాయకులు ●ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకొస్తాయి. అలాంటి పత్రికలు, మీడియాపై అణచివేతకు దిగడం.. కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఒకరు అనైతిక చర్యలకు దిగారంటే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే అభివృద్ధి కుంటుపడడమే కాకుండా రాష్ట్రం రావణకాష్టగా మారుతుంది. రాజకీయాల మాటున కక్షసాధింపు మంచిది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికై నా పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. – శ్రీనివాస్గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్నగర్ -
కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం
ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య. పోలీసులు కూడా కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేయడం తగదు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరపున ప్రశ్నించడం సహజం. ఎడిటర్ స్థాయి వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణం. ఏకంగా జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం, పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. – చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే (హెచ్–143), నాగర్కర్నూల్ -
రైస్మిల్లును సందర్శించిన అధికారులు
వనపర్తి: పెద్దమందడి మండలం మదిగట్ల శివారులో నిర్మాణంలో ఉన్న రైస్మిల్లుకు గత యాసంగిలో వరి ధాన్యం కేటాయింపులు చేయడంతో ‘ఇదెక్కిడి చోద్యం’ శీర్షికన గురువారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఇందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి గురువారం రైస్మిల్లును సందర్శించారు. ప్లాస్టిక్ నీటిట్యాంకులు తయారుచేసే పరిశ్రమలోనే రైస్మిల్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ధారించారు. అధికారులు వచ్చే వరకు ప్లాస్టిక్ నీటిట్యాంకుల తయారీ పరిశ్రమకు ఉన్న విద్యుత్ కనెక్షన్తోనే మిల్లు నడిపే ప్రయత్నం చేసినట్లు అవగతమవుతోంది. ఇప్పటి వరకు సీఎస్సీకి అప్పగించిన బియ్యం ఇక్కడే మర ఆడించినట్లు మిల్లరు చెప్పినా.. అక్కడ అందుకు సంబంఽధించిన పొట్టు, తవుడు కనిపించలేదు. సింగిల్ఫేస్ విద్యుత్ కనెక్షన్ కేవలం విద్యుద్ధీపాలకే వినియోగిస్తున్నట్లు మిల్లరు అధికారులకు వివరించారు. జిల్లా పరిశ్రమలశాఖ, పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు చెప్పుకొచ్చారు. బాయిల్డ్ మిల్లు ఏర్పాటుకుగాను యంత్రాలు, ఇతర సామగ్రి బిగింపు పనులు కొనసాగుతున్నాయి. కొంతకాలంగా కనీస విద్యుత్ బిల్లు వస్తున్నట్లు తెలిసింది. మిల్లు నడుస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ధాన్యం కేటాయింపులు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. మిల్లును సందర్శించిన వారిలో డీఎస్ఓ కాశీవిశ్వనాథం, డీపీఆర్వో సీతారాంనాయక్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ పరమేష్ ఉన్నారు. పాన్గల్లో భారీ వర్షం పాన్గల్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. పది రోజుల తర్వాత వర్షం కురవడంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 61.03 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మండల కేంద్రంలోని పొల్కి చెరువు అలుగు పారింది. -
జూరాలపై వెలుగులేవి?
ప్రాజెక్టు రహదారిపై వెలగని విద్యుద్దీపాలు –8లో u●అధికారుల నిర్లక్ష్యం.. జూరాల ప్రాజెక్టుపై విద్యుద్దీపాల ఏర్పాటు సమస్యను అధికారులు నేటికీ పరిష్కరించడం లేదు. తాగు, సాగునీటితో పాటు విద్యుదుత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టుపై అంధకారం నెలకొంది. రాత్రిళ్లు వెలుతురు ఉండేలా విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలి. – విష్ణువర్ధన్ యాదవ్, అమరచింత నిధులు మంజూరయ్యాయి.. జూరాల ప్రాజెక్టు రహదారిపై విద్యుద్దీపాల ఏర్పాటుకు రూ.18 లక్షలు మంజూరయ్యాయి. వీటితో పూర్తిస్థాయిలో విద్యుత్ బల్బులు బిగించేందుకు కార్యాచరణ రూపొందించాం. సంబంధిత పనులను కాంట్రాక్టర్కు అప్పజెప్పాం. డ్యాంపై రాత్రిళ్లు చీకటి లేకుండా చర్యలు తీసుకుంటాం. – జుబేర్ అహ్మద్, ఈఈ, గద్వాల ఏళ్లుగా తీరని సమస్య.. ప్రాజెక్టు రహదారిపై విద్యుద్దీపాలు ఏళ్ల తరబడి వెలగకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. రాత్రిళ్లు రహదారిపై ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాం. – వెంకటేష్, నందిమళ్ల (అమరచింత) అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయంపై రాత్రిళ్లు వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టు రహదారి రాత్రి సమయంలో చీకట్లు కమ్ముకొని వాహనదారులు, ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక ప్రజలు ప్రాజెక్టు రహదారి మీదుగా తమ తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సమస్యను పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. గుంతలమయంగా మారిన రహదారి.. ప్రాజెక్టు రహదారిపై అడుగడుగునా గుంతలపడి అధ్వానంగా మారింది. అమరచింత మండలం నందిమళ్ల పీజేపీ క్యాంపు సమీపంలోని సత్యసాయి తాగునీటి పథకం నుంచి ప్రారంభమైన ప్రాజెక్టు రహదారి జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం చింతరేవుల వరకు సుమారు 5 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతింది. రహదారి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాల్సి ఉన్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలే గుంతల రహదారి.. ఆపై రాత్రిళ్లు చీకట్లు అలుముకొని ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. రహదారి మరమ్మతుకు సైతం నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సైతం పంపలేని స్థితిలో అధికారులు ఉన్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. మరమ్మతుకు నోచుకోని వైనం ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి పట్టించుకోని అధికారులు నిధులు మంజూరైనా.. ముందుకు సాగని పనులు రూ.18 లక్షలు మంజూరైనా.. జూరాల ప్రాజెక్టు రహదారిపై విద్యుద్దీపాల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపడంతో రూ.18 లక్షలు మంజూరైనట్లు పీజేపీ అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ నేటికీ మరమ్మతుల్లో మాత్రం వేగం కనిపించడం లేదు. -
కోర్టుల్లో ‘మధ్యవర్తిత్వం’
● కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు ● లోక్ అదాలత్లో మూడేళ్లలో 32,288 కేసులు పరిష్కారం ● ఈ నెల 13న జాతీయ మెగా లోక్అదాలత్ వనపర్తిటౌన్: జిల్లాలోని 9 కోర్టుల్లో దేశం కోసం మధ్యవర్తిత్వం (మీడియేషన్ ఫర్ ద నేషన్) కార్యక్రమం కొనసాగుతోంది. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్లోనే కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు 90 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూలై 1న ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా విడాకులు, భరణం, చెక్బౌన్స్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకునే వీలు కల్పించారు. మధ్యవర్తిత్వంలో భాగంగా జిల్లాలో అనుభవం ఉన్న ఇద్దరు న్యాయవాదులకు రాష్ట్రస్థాయిలో శిక్షణనిచ్చారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోదలచిన కక్షిదారుల అభిప్రాయాలను న్యాయవాదులు వేర్వేగా తెలుసుకొని లోటుపాట్లను గుర్తిస్తారు. తర్వాత ఒకేదగ్గర కూర్చోబెట్టి సేకరించిన వివరాలను వివరించి పరిష్కరిస్తారు. లోపాలను క్షుణ్ణంగా కక్షిదారులకు వివరించి మధ్యవర్తిత్వంతో ఆర్డర్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తంలో మధ్యవర్తిత్వం వహించే న్యాయవాదులకు కక్షిదారులు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్టులే కేసు ప్రాధాన్యం ఆధారంగా న్యాయవాదులకు పారితోషికం చెల్లిస్తుంది. జిల్లాలోని వనపర్తి, ఆత్మకూర్ న్యాయస్థానాల్లో ఇప్పటి వరకు 654 కేసులను గుర్తించగా.. 95 కేసులు మీడియేషన్కు బెంచ్కి వచ్చాయి. 10 కేసు లు పరిష్కరించగా.. మిగతా వాటిని కక్షిదారుల్లో అవగాహన పెంపొందించి పరిష్కరించనున్నారు. లోక్ అదాలత్లో 32,288 కేసుల పరిష్కారం.. కక్షిదారులు రాజీపడి లోక్అదాలత్లో పరిష్కరించుకొనే కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2023 నుంచి 2025, సెప్టెంబర్ 10వ వరకు మూడేళ్లలో జరిగిన లోక్అదాలత్లో జిల్లావ్యాప్తంగా 32,288 కేసులు పరిష్కారమయ్యాయి. 2023లో 4,153, 2024లో 13,698, 2025 సెప్టెంబర్ 10వ తేదీ వరకు 14,437 కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్తో కక్షిదారుల రాజీకి న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా వాహన చలాన్లు, విద్యుత్ చౌర్యం, బ్యాంకు రుణాలు, టెలిఫోన్ కేసులు ఉండగా, తర్వాతి స్థానంలో సివిల్, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏడాది వారీగా పరిష్కారమైన కేసులు సంవత్సరం యాక్సిడెంట్ సివిల్ క్రిమినల్ ప్రీ లిటిగేషన్ 2023 9 24 3,789 331 2024 33 45 7,001 6,619 2025 8 26 14,403 (ఇప్పటివరకు) (క్రిమినల్, ప్రీ లిటిగేషన్) -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
వనపర్తి: మానవ తప్పిదంతోనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని.. సైబర్ పోలీసులు ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల సైబర్ పోలీసు వారియర్స్తో సమావేశం నిర్వహించి సైబర్ నేరాల నియంత్రణ, ఛేదించడంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. సైబర్ వారియర్స్గా వారి అనుభవాలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నందున ప్రజలకు సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. జిల్లా సైబర్సెల్తో సమన్వయంతో పనిచేస్తూ సామాజిక మాధ్యమాల్లో అనుమానాస్పద కంటెంట్పై నిఘా ఉంచాలని, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటలిజెన్స్ సేకరణ వంటి బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. బాధ్యతను నైతికంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం వారికి టీ షర్టులు అందజేశారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్వరరావు, సైబర్క్రైం ఎస్ఐ రవిప్రకాష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
కమిటీ తీర్మానం ఎలా సాధ్యం?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కొత్త మిల్లుకు కోడ్ ఇచ్చి ధాన్యం కేటాయించాలంటే యజమాని చేసుకున్న దరఖాస్తును డీఎస్ఓ కార్యాలయంలో పనిచేసే ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. సాటెక్స్తో పాటు అగ్నిమాపక, విద్యుత్, పరిశ్రమలు, మార్కెట్శాఖ అనుమతి పొందారని నిర్ధారించుకొని పంచనామా నివేదిక సిద్ధం చేసి డీఎస్ఓకు అందజేయాలి. ఆయన ఈ నివేదికను కమిటీ ముందు ఉంచితే.. వారు సంతృప్తి చెంది అందరి ఆమోదం మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ వద్దకు పౌరసరఫరాలశాఖ కమిషనర్కు సిఫారస్ చేసేందుకు దస్త్రం పంపిస్తారు. కమిషనర్ కోడ్ ఇచ్చిన తర్వాత ధాన్యం కేటాయింపులకు సైతం కమిషనర్కు పంపించాల్సి ఉంటుంది. కానీ మద్దిగట్ల మిల్లు విషయంలో నిబంధనలను తుంగలో తొక్కి ధాన్యం కేటాయింపులు చేసినట్లు స్పష్టమవుతోంది. -
ప్రారంభం కాని రైస్మిల్లుకు ధాన్యం కేటాయింపు
వనపర్తి: అధికారులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారనేందుకు గత యాసంగిలో ధాన్యం కేటాయింపులను పరిశీలిస్తే అవగతమవుతోంది. ఓ పక్క కలెక్టర్ సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు పలు సమీక్షల్లోనూ వెల్లడించారు. కానీ పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రారంభం కాని మిల్లుకు గత యాసంగిలోనే అక్షరాల 1.72 లక్షల బస్తాల ధాన్యం కేటాయించారు. మిల్లులో యంత్రాలు నడవకుండా బియ్యం ఎలా ఇవ్వగలరనే కనీస ఆలోచన చేయకుండా ధాన్యం కేటాయించడం.. అందుకు ఆయా శాఖల అధికారులతో కూడిన కమిటీ సైతం తప్పుడు నివేదికతో మోసం చేసి సంతకాలు చేసేంత అవసరం సదరు అధికారికి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరో విడ్డూరం.. ఇప్పటికీ ఇంకా మిల్లు ప్రారంభం కాలేదు.. రా మిల్లు పేరుతో ధాన్యం కేటాయించిన ఆ ప్రదేశంలో ప్రస్తుతం బాయిల్డ్ మిల్లు నిర్మాణం చేపడుతున్నారు. ఇటీవలే యంత్రాలు బిగించినా.. విద్యుత్ సరఫరా లేదు. కానీ తప్పుడు నివేదిక ఆధారంగా ఆయా శాఖలను తప్పుదోవపట్టించి తీసుకున్న ధాన్యానికి సంబంధించి ఇప్పటికే 5,410 బస్తాల బియ్యం సదరు మిల్లరు పౌరసరఫరాల కార్పొరేషన్కు అప్పగించారు. మిల్లే నడవకుండా బియ్యం ఎలా అప్పగించారనే విషయం అధికారుల వద్ద సైతం లేకపోవడం గమనార్హం. జిల్లాలో విచ్ఛలవిడిగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ అవుతుందనేందుకు ఈ మిల్లర్ బియ్యం అప్పగించడమే ఉదాహరణగా చెప్పవచ్చు. వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి మండలం మదిగట్ల శివారులో ప్లాస్టిక్ నీటిట్యాంకులు తయారయ్యే ఫ్యాక్టరీ ఉండేది. దీనిని రా రైస్మిల్లుగా చూపించి కోడ్ 43238 సంపాదించుకొని గత యాసంగిలో ధాన్యం తీసుకున్నారు. ఈ వ్యవహారం మదనాపురం మండలానికి చెందిన ఓ సీనియర్ మిల్లర్, ఇప్పటికే బ్లాక్ లిస్టులో ఉన్న వ్యక్తి నడిపించారు. తన పేరుతో ఇప్పటికే మిల్లు ఉండటంతో ధాన్యం కేటాయింపులు చేస్తే విషయం బహిర్గతం అవుతుందని పౌరసరఫరాలశాఖ అధికారి సలహా మేరకు అతను కొత్తకోట మండలం అప్పరాలకు చెందిన ఓ రేషన్ డీలర్తో ఒప్పందం కుదుర్చుకొని ఆయన పేరుతో మిల్లు నిర్వహణ అనుమతి పొంది అక్కడ వరి ధాన్యం మర ఆడించే యంత్రాలు లేకపోయినా ధాన్యం కేటాయింపులు చేయించుకునే విషయంలో సఫలీకృతులయ్యారు. రా మిల్లుకు భవిష్యత్ లేదని గుర్తించి అదే షెడ్ను మరింత పెద్దగా విస్తరించి బాయిల్డ్ మిల్లు నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికి ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ కనెక్షన్ సైతం సింగిల్ఫేస్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ నీటి ట్యాంకుల పరిశ్రమను రా మిల్లుగా చూపించి.. 5,410 బస్తాల బియ్యం సీఎస్సీకి అప్పగించిన వైనం బాయిల్డ్ మిల్లు ఏర్పాటుకు సన్నాహాలు ఎన్ఫోర్స్మెంట్ డీటీ క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక ఉత్తిదేనా? -
నాడు బీళ్లు.. నేడు సిరులు
ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ నీటి ట్యాంకులు ●పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఏటేటా వరి, పత్తినే అధికంగా పండిస్తున్నారు. ప్రతిసారి ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూమి చౌడు పొలంగా మారుతుంది. అన్ని రకాల పంటలు సాగు చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో మొక్కజొన్న సాగు పెరిగింది. పంట మార్పిడి చేసి కందులు, జొన్న, ఆముదం, ఇతర పంటలు కూడా సాగు చేస్తే.. భూసారం దెబ్బ తినదు. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్నగర్ పదేళ్ల క్రితం ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు. ఫలితంగా ఉపాధి కోసం కుటుంబాలతో సహా తట్ట, బుట్ట, పార పట్టుకుని ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బస్సుల్లో కిక్కిరిసి వెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలా వలసలకు కేరాఫ్గా నిలిచిన పాలమూరు జిల్లా హరితవనంగా మారింది. సాగునీరు లేక నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంట పండుతోంది. ఏటేటా సాగు గణనీయంగా పెరుగుతుండగా.. భూమికి పచ్చని రంగు వేసినట్లు కొత్త శోభను సంతరించుకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా వానాకాలం సీజన్కు సంబంధించి 2014లో 8.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు కాగా.. ప్రస్తుతం 18.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈ లెక్కన 11 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సాగు నీటి వసతి ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ.. విస్తారంగా వర్షాలు కురవడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తుండడం, రుణమాఫీ వంటి చర్యలు ఉమ్మడి జిల్లాలో సాగు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి మొత్తంగా అన్ని పంటలు కలిపి 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యాయి. మూడేళ్లుగా కొంత అటు ఇటుగా స్వల్పంగా లెక్కలు మారుతూ వస్తున్నాయి. 2023లో 18,24,268 ఎకరాలు కాగా.. 2024లో 18,11,953 ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సాగు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 18,07,052 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అదును దాటే సమయానికి అంటే వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో మరో 50 వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ● ఉమ్మడి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఏటేటా వీటి సాగు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వరి 2023 ఖరీఫ్ సీజన్లో 7,76,311 ఎకరాలు, గతేడాదిలో 8,09,784 ఎకరాల్లో సాగు కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 7,90,515 ఎకరాల్లో సాగైంది. మరో 50 వేల ఎకరాల్లో వరి సాగు కానుండగా.. 8.40 లక్షల ఎకరాలకు చేరుకోనుంది. ● ఉమ్మడి పాలమూరులో 2023లో 6,67,824 ఎకరాల్లో, 2024లో 6,04,004 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది 7,05,739 ఎకరాల్లో రైతులు తెల్లబంగారం పంట వేశారు. గతేడాదితో పోలిస్తే 1,01,735 ఎకరాల్లో పత్తి సాగు పెరిగినట్లు తెలుస్తోంది. ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2023 వానాకాలంలో 1,00,816 ఎకరాల్లో, 2024లో 85,476 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది ఇదే సీజన్లో 1,09,708 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. గతేడాదితో పోలిస్తే 24,232 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ● గతేడాదితో పోలిస్తే నాగర్కర్నూల్ జిల్లాలో 28,634 ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో 2,693 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 10,256 ఎకరాల్లో అధికంగా పంటలు సాగయ్యాయి. అదే వనపర్తిలో 28,216 ఎకరాల్లో, జోగుళాంబ గద్వాల జిల్లాలో 18,268 ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. ● గతేడాదితో పోలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో పత్తి సాగు స్వల్పంగా తగ్గింది. నాగర్కర్నూల్ జిల్లాలో 40 వేలకు పైగా, గద్వాల జిల్లాలో 50 వేలకు పైగా ఎకరాల్లో అధికంగా రైతులు సాగు చేశారు. మొక్కజొన్నకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో గతేడాది కంటే 14 వేల ఎకరాల్లో, నాగర్కర్నూల్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది. పచ్చందాలను సంతరించుకున్న పాలమూరు 2014లో కేవలం 8.5 లక్షల ఎకరాల్లోనే సాగు.. మూడేళ్లుగా అటూ ఇటు స్వల్పంగా మారుతున్న లెక్కలు ప్రస్తుతం అన్ని పంటలు కలిపి 18 లక్షల ఎకరాలకు పైగానే.. -
విద్యార్థులను ప్రోత్సహించాలి
వనపర్తి: గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు నిర్వాహకులు అండగా ఉండి చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని సంక్షేమ శాఖల అధికారులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, వసతిగృహ వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే కాకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో విద్యార్థి కమిటీ, ఫిర్యాదు పెట్టె ఏర్పాటు చేయాలని.. ఫిర్యాదు పెట్టే తాళం ప్రత్యేక అధికారి వద్ద మాత్రమే ఉండాలని సూచించారు. విద్యార్థి తన పేరు రాయకుండా సమస్యను కాగితంపై రాసి అందులో వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి విద్యా సంస్థకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ వారంలో కచ్చితంగా తనిఖీ చేసేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని.. జటిలం కాకుండా చూడాలని ఆదేశించారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని.. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, జిల్లాలోని ఎస్ఓలు, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ.. ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు ఉన్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోదాం తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. గోదాం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్రెడ్డి, సి–సెక్షన్ సిబ్బంది రాజేష్, నాగేంద్ర, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శంకర్, త్రినాథ్, పరమేశ్వరాచారి, కుమారస్వామి, జమీల్, ఇతర అధికారులు ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
వీపనగండ్ల: సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్కు నిర్మించనున్న లింక్ కెనాల్ పనులు పూర్తి కావాలంటే భూ సేకరణకు రైతులు సహకరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. మంగళవారం మండలంలోని తూంకుంట రైతువేదికలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్వ నిర్మాణం పూర్తయితే చిన్నంబావి, వీపనగండ్ల, పెంట్లవెల్లి మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు పరిహారం అందించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని వివరించారు. మార్కెట్ ధరకు అనుగుణంగా ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని రైతులు ఆర్డీఓకు విన్నవించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, భూ సేకరణ డిప్యూటీ తహసీల్దార్ ఆసీఫ్, డిప్యూటీ వర్క్ ఇన్స్పెక్టర్ ఆశన్న, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు.. పాన్గల్: తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలిగించకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో జిల్లావ్యాప్తంగా 8,979 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు 2,100 దరఖాస్తులను పరిష్కరించినట్లు వివరించారు. నిషేధిత భూముల వివరాలతో పాటు అసైన్డ్, సీలింగ్, వక్ఫ్, ఎండోమెంట్, అటాచ్మెంట్ భూముల వివరాలను మండలాల వారీగా సేకరిస్తున్నామన్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా అధికారులకు నివేదించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, డీటీ అశోక్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పాలమూరును జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..
● బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి ● మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు ● కేసీఆర్కు పేరు వస్తుందనే పడావు పెట్టారు ● సీఎం రేవంత్పై బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి 21 నెలల పాలనలో ఎక్కడ మాట్లాడినా.. నేను పాలమూరు బిడ్డను, నల్లమల బిడ్డను అని చెప్పుకుంటారని.. కానీ ఆయనే పాలమూరును ఎండబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ తర్వాత వారు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మారెడ్డి ఇంట్లో భోజనం చేశారు. హరీశ్రావు తిరిగి హైదరాబాద్కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు వెనుకబాటుతనానికి టీడీపీ, కాంగ్రెస్ కారణమని ఆయన టీడీపీలో ఉన్నప్పుడే చెప్పారన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారుతాయని.. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలవుతాయనే ఆశతో ఇక్కడి ప్రజలు 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. 21 నెలలుగా పడావు పెట్టారు.. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో వివిధ ప్రాజెక్ట్లను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పాలమూరును కోనసీమగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని.. కానీ పాలమూరుకు చెందిన సీఎం 21 నెలలు గడిచినా పనులు పూర్తిచేయడం లేదన్నారు. మిగతా పది శాతం పనులు పూర్తి చేసి.. నీళ్లు పారిస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతో పాలమూరును పడావు పెట్టారని మండిపడ్డారు. పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్ట్కు వారి మామ జైపాల్రెడ్డి పేరు పెట్టుకోవడంపై ప్రజలే ఆలోచన చేయాలన్నారు. దురాలోచనతో కొడంగల్కు శ్రీకారం.. పాలమూరు ఎత్తిపోతల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు, కొడంగల్ నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేసి.. ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. అయితే హడావుడిగా కొడంగల్, రంగారెడ్డికి నీరందించే సోర్స్ను శ్రీశైలం నుంచి జూరాలకు మార్చి రూ.4 వేల కోట్లతో సీఎం రేవంత్రెడ్డి టెండర్లు పూర్తి చేశారన్నారు. మనసులో ఏదో దురాలోచనతో పర్యావరణ అనుమతుల్లేకుండా టెండర్లు పూర్తి చేయడంతో రైతులు ఎన్జీటీని ఆశ్రయించగా.. స్టే ఇచ్చిందన్నారు. కొడంగల్ ఎత్తిపోతల కింద రైతులు కూడా పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారన్నారు. చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు కదా అంటూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘కృష్ణమోహన్రెడ్డి సమక్షంలోనే కేసీఆర్పై మంత్రులు పొంగులేటి, జూపల్లి ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఆయన ఎందుకు మౌనం వహించారు.. కాంగ్రెస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు’ అని విమర్శించారు. -
అయోమయంలో జీపీఓలు!
వనపర్తి: ఏడాదిగా ఊరిస్తున్న వీఆర్వోల సొంతగూటి ప్రయాణం ఆపసోపాలు పడుతూ గమ్యం చేరుకున్నా.. సమస్యల వలయం వారిని వీడలేదన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. త హసీల్దార్లు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, ఉన్నతాధికారులకు లేని సర్వీస్ రూల్స్ జీపీఓలు గా మారిన వీఆర్వోలకు వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీపీఓల విషయంలో సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వకూడదనే ని బంధన పేర్కొనడంతో ఎందుకు సొంతగూటికి వ చ్చామా అన్న నిరాశ చాలామందిలో కనిపించింది. ● గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వారిని లక్కీడిప్ విధానంలో ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం విధితమే. కాంగ్రెస్ ప్రభుత్వం వారి అభ్యర్థన మేరకు స్వీయ దరఖాస్తులు స్వీకరించి మరోసారి అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వో పోస్టును జీపీఓగా మార్చి ఇటీవల సొంత జిల్లాకు పంపించినా.. స్థానికత ఆధారంగా సొంత నియోజకవర్గంలో పని చేయడానికి అవకాశం లేకుండా చేయడంతో దూరాభారం తప్పడం లేదు. ఉదాహరణకు ఖిల్లాఘనపురంలో నివాసం ఉండే ఉద్యోగిని కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గంలోని మండలాలకు పంపించారు. ఈ మేరకు పోస్టింగ్ ఇచ్చేందుకు వారితోనే ఆప్షన్లను స్వీకరించారు. ఈ పరిస్థితి చూసి తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి తనను తిరిగి వెనక్కు పంపించాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు అభ్యర్థన పెట్టుకుంది. జూనియర్ల కింద పనిచేసే పరిస్థితి.. గతంలో వీఆర్వోలుగా పనిచేసిన సమయంలో వీరి కింద విధులు నిర్వర్తించిన కొందరు డబుల్ ప్రమోషన్లతో సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడేళ్లు ఇతర శాఖల్లో పనిచేసి సర్వీస్ నష్టపోయి తిరిగి జీపీఓలుగా వారికింద పని చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీకి దక్కని ప్రాధాన్యం.. గతంలో విద్యార్హత అంతగా లేకపోయినా.. ఏళ్లుగా రెవెన్యూశాఖలో పనిచేసి అనుభవం ఉన్నవారిని గత ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వారిని తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు విద్యార్హత లేదనే సాకు చూపిస్తూ పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో ఎంతో అనుభవం ఉన్నా సొంత గూటికి చేరుకునే అవకాశం లేకుండా పోయింది. నేడు విధుల్లో చేరనున్న జీపీఓలు.. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జీపీఓలకు ఓపెన్ కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా పరిపాలన అధికారులు సాంకేతిక కారణాలతో లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదు. పీహెచ్సీ, స్పౌస్ కేటగిరీల విషయమై ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యం కావడంతో బుధవారం ఆర్డర్ కాపీలు అందజేయనుంది. వారు వెంటనే కేటాయించిన గ్రామాల్లో జాయినింగ్ రిపోర్టులు ఇచ్చే అవకాశం ఉంది. ఇతర నియోజకవర్గాల్లో విధుల కేటాయింపుతో నిరాశ నేడు జాయినింగ్ రిపోర్టులు అందుకోనున్న 92 మంది ప్రభుత్వ నిబంధనల మేరకే.. ప్రభుత్వ నిబంధనల మేరకే జీపీఓలకు గ్రామా లు కేటాయించాం. గ్రామ స్థాయి ఉద్యోగులకు సొంత నియోజకవర్గంలో పని చేసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదో తెలియదు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించి గ్రామాలు కేటాయించాం. – భానుప్రకాష్, ఏఓ, కలెక్టరేట్ -
ఎదగని వరి పంట
నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 18 బస్తాల యూరియా వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు లభించకపోవడంతో పంట రంగుమారి గిటుక బారినట్లు అయింది. వారం రోజులు తిరిగితే మంగళవారం 12 బస్తాలు లభించింది. ఇప్పటికే మొదటి విడత పూర్తిచేసి రెండోవిడత వేయాల్సి ఉంది. గతంలో సింగిల్విండోతో పాటు ప్రైవేట్గా యూరియా లభించేది. ప్రస్తుతం సింగిల్విండోలో మాత్రమే లభిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – తిరుపతిరెడ్డి, రైతు, వెంగళాయిపల్లి (పాన్గల్) ● -
బాధ్యతతో మెలిగితే ఉత్తమ సమాజం
వనపర్తిటౌన్: నేరానికి శిక్ష తప్పదనే నిజాన్ని గ్రహించి బాధ్యతతో మెలగాలని.. అప్పడే సమాజంలో నేరాలు తగ్గి ఉత్తమ సమాజం రూపుదిద్దుకుంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీవీ రామన్ టాలెంట్ స్కూల్లో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే సమాజం తెలుస్తుందని, ఏ తప్పునకు ఏ శిక్ష పడుతుందో తెలుసుకుంటే ఎవరూ ఎలాంటి తప్పిదాలు చేసేందుకు ధైర్యం చేయరన్నారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మోటారు వాహనాల చట్టం, ఉచిత నిర్బంధ విద్య, పోక్సో యాక్ట్ గురించి వివరించారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కరస్పాండెంట్ డా. మురళీధర్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, స్కూల్ అడ్వైజర్ సత్తార్, ప్రిన్సిపాల్ షబానా పాల్గొన్నారు. -
తప్పులు లేని ఓటరు జాబితా రూపొందిద్దాం
వనపర్తి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల జిల్లాస్థాయి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 6వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా రూపొందించి అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. 8వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు అవకాశం కల్పించామని.. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, లొకేషన్లలో అభ్యంతరాలుంటే తెలుపాలని సూచించారు. 9వ తేదీన ఫిర్యాదులు పరిష్కరించి 10వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని వివరించారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,82,295 మంది ఓటర్లుండగా.. అందులో పురుషులు 1,90,068 మంది, మహిళలు 1,92,223 మంది, ఇతరులు నలుగురు ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 133 మంది ఎంపీటీసీలు, 15 మంది జెడ్పీటీసీలను ఎన్నుకుంటారని.. ఇందుకోసం 268 గ్రామపంచాయతీలు, 2,436 వార్డులు, 283 లొకేషన్లలో 657 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపించామని మొదటి విడతలో వనపర్తి నియోజకవర్గంలోని 8 మండలాలు, రెండో విడతలో మిగిలిన 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఆర్డీఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ముసాయిదా ఓటరు జాబితాలో 1,370 మందికి రెండుచోట్ల ఓటు హక్కు, 800 వరకు మృతిచెందిన వారి పేర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల్లోపు వారి పేర్లు తొలగించి ఓటరు జాబితా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమకు ముందుగానే ఓటరు జాబితా ఇవ్వాలని, సమావేశం మినిట్స్ కాపీని అందజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. సమావేశంలో జెడ్పీ సూపరింటెండెంట్ నాగేశ్వర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టుయాదవ్, బీజేపీ నుంచి డి.నారాయణ, సీపీఐ (ఎం) నుంచి ఎండీ జబ్బార్, ఎంఐఎం నుంచి ఎండీ రహీం పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
మద్దూరు: మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వివరాల మేరకు.. మద్దూరు మండలం రెనివట్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు తన 5 గుంటల భూమి డీఎస్ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని ఆర్ఐ కె.అమర్నాథ్ను సంప్రదించగా.. రూ. 5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. రైతు నుంచి ఆర్ఐ డబ్బులు తీసుకొని మహబూబ్నగర్కు కారులో వెళ్తుండగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట పట్టుకొని తనిఖీ చేశామన్నారు. రైతు నుంచి తీసుకున్న డబ్బులను రికవరీ చేసి ఆర్ఐని అదుపులోకి తీసుకు న్నామన్నారు. మంగళవారం అతడిని ఏసీబీ కోర్టులో హాజ రుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
అడవుల్లో అసైన్డ్ స్థలాలను గుర్తించాలి
వనపర్తి: జిల్లాలోని అటవీ భూమిలో ప్రభుత్వం ద్వారా ఏమైనా అసైన్డ్ చేసి ఉంటే గుర్తించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రత్యేక విచారణ కమిటీతో సమావేశమై మాట్లాడారు. అటవీ భూమిలో ఎలాంటి నిర్మాణాలుగాని, ఇతరులకు అప్పగించడానికి వీలు లేదన్నారు. ఎక్కడైనా పొరపాటున అసైన్డ్ చేసి ఉంటే ఆ భూమిని సర్వేనంబరుతో గుర్తించడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో అటవీశాఖ అధికారి, ఆర్డీఓ, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత తహసీల్దార్ ఉంటారన్నారు. జిల్లా అటవీ అధికారి ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ భూమి కొన్నచోట్ల తక్కువ, మరికొన్ని చోట్ల ఎక్కువ చూపిస్తున్నారని, సర్వే చేసి ఉండాల్సిన భూమి గుర్తించి ఇవ్వాల్సిందిగా కోరారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ, ఆర్అండ్బీ డి, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి.. ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి పాల్గొని ఫిర్యాదుదారులతో అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్జీదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు 44 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆగ్రహం
ఖిల్లాఘనపురం: యూరియా దొరక్కపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోమవారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం వద్ద మూడురోజుల కిందట యూరియా పంపిణీ చేశారు. సోమవారం కార్యాలయం వద్ద ఎదురుచూసిన రైతులకు యూరియా రాదని తెలియడంతో నేరుగా వనపర్తి–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. యూరియా ఇచ్చేదాక కదిలేది లేదని.. యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, తహసీల్దార్ సుగుణ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రోజుల తరబడి తిరుగుతున్నా రెండు బస్తాల యూరియా ఇవ్వడం లేదని.. బడా నాయకులను వందల సంచులు ఎలా వెళ్తుందని అధికారులను నిలదీశారు. మండలానికి ఎంత వచ్చిందో చెప్పాలని, వెంటనే తీసుకొచ్చి పంపిణీ చేయాలని పట్టుబట్టారు. సాయంత్రం వరకు యూరియా తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని, దయచేసి సహకరించాలని ఏఓ కోరారు. అప్పటి వరకు రైతువేదిక దగ్గర టోకన్లు పంపిణీ చేస్తామన్నారు. దీంతో రైతులు ఆందోళన విరమించి రైతువేదిక దగ్గరకు వెళ్లారు. రైతుల పడిగాపులు.. ఆత్మకూర్: స్థానిక పీఏసీఎస్ వద్ద సోమవారం తెల్లవారుజాము నుంచే వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం చెప్పులు, పట్టాదారు పాసు పుస్తకాలను వరుసలో పెట్టి పడిగాపులు పడ్డారు. మధ్యాహ్నం 300 సంచులు రాగా పోలీసులు కలుగజేసుకొని రైతులను వరుసలో నిల్చోబెట్టి 150 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 213 మంది రైతులకు టోకెన్లు అందించామని మంగళవారం సరఫరా చేస్తామని ఏఓ వినయ్కుమార్, సీఈఓ నరేష్ తెలిపారు. పాన్గల్లో అదే రద్దీ.. పాన్గల్: మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయానికి సోమవారం 300 బస్తాల యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కార్యాలయ ఆవరణ రైతులతో కిక్కిరిసిపోయింది. రెండ్రోజుల కిందట ఇచ్చిన టోకన్లు 816 ఉండగా వారికి పంపిణీ చేశారు. వారిలో ఇంకా 516 మంది మిగిలిపోగా.. కొత్తగా 400 వరకు టోకన్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మదనాపురంలో ధర్నా.. మదనాపురం: మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం వద్ద సోమవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణయ్య యాదవ్ మాట్లాడుతూ.. యూరియా కోసం ఒక్కో రైతు 15 రోజుల తరబడి దుకాణాల చుట్టూ తిప్పుకోవడం సరైంది కాదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ రైతులను మభ్యపెట్టడం మంచి పద్ధతి కాదని, వెంటనే సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ జేకే మోహన్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బిట్లు యాదగిరి, మాజీ మండల కో–ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, మాజీ సర్పంచ్లు విజయేందర్రెడ్డి, అనిమోని మాసన్న యాదవ్, కురుమూర్తి, శివశంకర్, శ్రీనివాసులు, రాజ్కుమార్, ఆవుల బాలు, మాజీ మార్కెట్ డైరెక్టర్లు దేశి వెంకటేష్ యాదవ్, నక్క సత్యం పాల్గొన్నారు. యూరియా ఇవ్వాలంటూ ఖిల్లాఘనపురంలో రాస్తారోకో చేసిన రైతులు -
నగదు కేంద్రాలుగా.. రేషన్ దుకాణాలు
● లబ్ధిదారు వేలిముద్ర వేయించుకొని నగదు చెల్లిస్తున్న వైనం ● అవే బియ్యం మిల్లులకు తరలింపు ● మెజార్టీ దుకాణాల్లో ఇదే తంతు.. సన్నబియ్యం కిలో రూ.16కు కొనుగోలు చేస్తున్న డీలర్లు వనపర్తి: ఏళ్లుగా రీసైక్లింగ్కు అలవాటుపడిన మిల్లర్లు ఏటా కొత్తదారులు వెదుక్కుంటున్నారు. గతంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఇల్లిల్లూ తిరిగి రేషన్ బియ్యం సేకరించి మిల్లులకు తరలించి ప్రభుత్వ గన్నీబ్యాగుల్లో నింపి సీఎంఆర్ పేరున తిరిగి అప్పగించేవారు. టాస్క్ఫోర్స్, పోలీసులు, పౌరసరఫరాలశాఖ అధికారుల పర్యవేక్షణ పెరగడంతో తమ పంథా మార్చుకున్నారు. గుట్టుగా రీసైక్లింగ్ దందా కొనసాగించేందుకు మిల్లర్లు లబ్ధిదారులను వదిలేసి అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు రేషన్ డీలర్లను ఎంచుకున్నారు. వీరు లబ్ధిదారుల వద్ద వేలిముద్ర వేయించుకొని కిలో బియ్యం రూ.16కు కొనుగోలు చేసి నేరుగా దుకాణం నుంచి మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఈ దందా గుట్టుగా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల మూడునెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సమయంలో పెద్దమొత్తంలో రేషన్ బియ్యం దుకాణల ద్వారా మిల్లులకు చేరినట్లు తెలుస్తోంది. తాజాగా వారం నుంచి జిల్లాలో బియ్యం పంపిణీ ప్రారంభమైన విషయం విధితమే. దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పుడు కిలో రూ.9 ప్రకారం లబ్ధిదారుల నుంచి డీలర్లు కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయించేవారు. ప్రస్తుతం సన్న బియ్యం సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి కిలో రూ.16 లెక్కన లబ్ధిదారు నుంచి కొని రూ.ఒకటి, రూ.రెండు అదనపు రేటుతో మిల్లర్లకు డీలర్లు విక్రయించి రీసైక్లింగ్కు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 5.23 లక్షల మంది లబ్ధిదారులు.. జిల్లాలోని 268 గ్రామపంచాయతీలు, ఐదు పురపాలికల పరిధిలో 324 రేషన్ దుకాణాలుండగా.. సుమారు 5.23 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ప్రతి నెలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల నుంచి పెద్దమొత్తంలో బియ్యం రీసైక్లింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సన్నబియ్యం పంపిణీ తర్వాత వినియోగం స్వల్పంగా పెరిగినా.. రీసైక్లింగ్ మాత్రం ఆగటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎఫ్సీఐ అంటే జంకు.. జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులు పొందిన మిల్లర్లలో కొందరు ఎఫ్సీఐకి అందించేందుకు జంకుతున్నారు. ఇందుకు కారణం ఎఫ్సీఐ గోదాం వద్ద ఉంటే టీఏలు నిబంధనలు పక్కాగా పాటిస్తారని.. ఏ మాత్రం తేడా ఉన్నా తిప్పి పంపుతారు. ఒక్క లారీ తిప్పిపంపితే రూ.వేలల్లో నష్టం వస్తోంది. దీంతో ఎక్కువగా సీఎస్సీ (రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పౌరసరఫరాలశాఖ)కు బియ్యం ఇవ్వడానికి మొగ్గుచూపుతారు. చక్రం తిప్పుతున్న టీఏలు.. రేషన్ డీలర్లు, లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యం సీఎంఆర్గా సీఎస్సీ (సివిల్ సప్లయ్ కార్పొరేషన్)కి అప్పగించే సమయంలో మిల్లర్లు చేసే మాయాజాలాన్ని గుర్తించడం సాంకేతిక సహాయకుల(టీఏ)కు సులభం. కానీ వారిచ్చే కానుకలకు తలొగ్గి అనుమతిస్తుండటంతో మిల్లర్ల రీసైక్లింగ్ దందా యథేచ్ఛగా సాగుతోందని చెప్పవచ్చు. పర్యవేక్షణ పెంచుతాం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ పై పర్యవేక్షణ పెంచుతాం. రేషన్ దుకాణాల్లో వేలిముద్ర వేయించుకొని బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చినట్లు నిర్ధారణ అయితే చర్యలు కఠినంగా ఉంటాయి. ప్రభుత్వం ఎంతో ఖర్చుతో ఉదారంగా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే విక్రయించడం సరికాదు. లబ్ధిదారులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వినియోగించుకోవాలిగాని డబ్బులకు విక్రయించవద్దు. – ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ -
పోలీసులపై ప్రజలకు పెరిగిన విశ్వసనీయత
వనపర్తి: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తామని రాష్ట్ర పోలీస్ హౌజింగ్బోర్డు మేనేజింగ్ డైరెక్టర్, ఐజీ రమేష్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని రాజపేట శివారులో వనపర్తి పోలీస్శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ను కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు పోలీసు వ్యవస్థపై విశ్వసనీయత పెరిగిందన్నారు. జిల్లాలో పోలీస్ విభాగం ద్వారా పెట్రోల్బంకు ఏర్పాటుకు ప్రతిపాదిస్తే కలెక్టర్, ఎమ్మెల్యే వేగంగా స్పందించి తక్కువ కాలంలో అనుమతులు ఇవ్వడంతో 4 నెలల వ్యవధిలో పూర్తి చేసినట్లు వివరించారు. భవిష్యత్లో బైపాస్ రోడ్, మదనాపురం రైల్వేస్టేషన్ నుంచి జిల్లాకేంద్రానికి నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తే వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని వివరించారు. పెట్రోల్బంక్ నిర్వహణలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజల ఆదరణ మరింత పొందుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో దేశంలోనే తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. వనపర్తి–కొత్తకోట కారిడార్కు ప్రతిపాదనలు.. వనపర్తి – కొత్తకోట కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆర్అండ్బీ మంత్రికి అందజేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. దీంతోపాటు వనపర్తికి ఒక బైపాస్ రోడ్డు పెబ్బేరును అనుసంధానిస్తూ ప్రతిపాదించామని.. అది కూడా మంజూరైందని త్వరలోనే పనులు చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఎస్పీ రావుల గిరిధర్ ప్రత్యేక చొరవతోనే తక్కువ కాలంలోనే పెట్రోల్బంక్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఎస్పీతో పాటు సిబ్బందిని అభినందించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే పెట్రోల్ బంకులను త్వరగా పూర్తిచేయాలని ఐఓసీఎల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, వివిధ పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పెట్రోల్బంక్ ప్రారంభోత్సవంలో ఐజీ రమేష్రెడ్డి -
918 టీఎంసీలు
వంద రోజుల్లో రికార్డుస్థాయిలో జూరాలకు పోటెత్తిన వరద ● 675 టీఎంసీలు నదిలోకి.. ● ఎత్తిపోతల పథకాల కోసం 17.2 టీఎంసీలు విడుదల ● సెప్టెంబర్ మొదటి వారంలోనే విద్యుదుత్పత్తి లక్ష్యం పూర్తి గద్వాల: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాలకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తూ దానికిందున్న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి జూరాలకు ముందస్తుగానే మే నెలలో 29వ తేదీన వరద మొదలవగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు 918 టీఎంసీల వరద వచ్చింది. ● గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణాబేసిన్కు భారీగా వరదనీటితో నిండిపోయింది. కృష్ణాబేసిన్లో ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో కృష్ణాబేసిన్లో తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల పాజెక్టుకు మే 29వ తేదీన మొదటిసారిగా వరద మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రాజెక్టుకు గరిష్టంగా 4.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, ప్రాజెక్టులోని 44 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టుకు మొత్తం 918 టీఎంసీల నీరు వచ్చింది. జూన్, జూలైలో మాసాల్లో వర్షాలు లేకపోవడంతో చాలా రోజులు జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. తిరిగి జూలై చివరి వారంలో వరద ప్రారంభం కావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు. భీమా లిఫ్ట్ – 2 2.9 నెట్టెంపాడుకు 4.3 విద్యుదుత్పత్తి 224 కోయిల్సాగర్ 1.9 ఎంజీకేఎల్ఐ 4 -
సీఎంఆర్ అప్పగించకుంటే కఠిన చర్యలు
● బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వని మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయాలి ● సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి: సీఎంఆర్ బకాయిలు అప్పగించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అవసరమైతే ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ యాక్టు) అమలు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లోని డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సీఎంఆర్ బకాయిలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎంత వరి ధాన్యం సేకరించారు? మిల్లర్ల వారీగా రావాల్సిన సీఎంఆర్ బకాయిలు, ధాన్యం సేకరణ, బకాయిదారులపై తీసుకున్న చర్యలు.. ధాన్యం నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 180 రైస్మిల్లులు ఉండగా అందులో 168 రా రైస్ మిల్లులు, 12 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయని, 29 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు, ఐదుగురు మిల్లర్లపై ఆర్ఆర్ యాక్టు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ బకాయిలు రావాల్సి ఉందని డీఎం వివరించారు. సీఎంఆర్ బకాయిలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని.. అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వలు లేకుంటే కేసులు నమోదు చేయాలని.. సీఎంఆర్ అప్పగించకుంటే ఆర్ఆర్ యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేయాలని సూచించారు. మిల్లర్లు అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై ఆరా తీశారు. సీఎంఆర్ బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ కాశీ విశ్వనాథం, జిల్లా మేనేజర్ జగన్మోహన్, అసిస్టెంట్ మేనేజర్ బాలూనాయక్, సీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
వరి నీట మునిగింది..
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో 4 ఎకరాల్లో వరి సాగు చేశా. ఆగస్టులో కురిసిన అధిక వర్షాలకు రెండు ఎకరాల పంట పూర్తిగా వరద నీటిలో మునిగింది. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి కాగా.. రూ.40 వేల వరకు నష్టం వాటిల్లింది. – రాజు, రైతు, నందిమళ్ల (అమరచింత) ఎకరా పంట దెబ్బతింది.. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు ఎకరా వరి పంట నీట మునిగింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులకు తెలియచేశా. రూ.20 వేలు పెట్టుబడి అయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ఎస్.కురుమన్న, ఖానాపురం ప్రభుత్వానికి నివేదించాం.. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. ఏఈఓలు పంటలు, రైతుల వివరాలు.. ఎంత మేర పంట నష్టం వాటిల్లింది అనే వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి వివరాలను నివేదించాం. నష్ట పరిహారం వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో జమచేస్తాం. – దామోదర్, ఏడీఏ, కొత్తకోట -
ఎర్రజెండా వారసత్వాన్ని ప్రజలకు అందించాలి
వనపర్తి రూరల్: తెలంగాణలో ఎర్ర జెండా ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు, పోరాటాల వారసత్వాన్ని ప్రజలకు అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్వెస్లీ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ రాజు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. దుష్ప్రచారం చేస్తూ హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. ఆ రోజుల్లో జాగీర్దారులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన ఎంతోమంది పోరాటంలో పాల్గొని విజయం సాధించారని గుర్తుచేశారు. డబ్బులు ఇవ్వకుండా అన్ని కులాల వృత్తిదారులతో ఊడిగం చేయించుకోవడాన్ని నాటి కమ్యూనిస్టు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం, నర్సింహారెడ్డి తదితరులు ఎందరో ఈ పోరాటాలకు నాయకత్వం వహించారని.. వారి త్యాగ ఫలితాన్ని కమ్యూనిస్టులు వారసత్వంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని.. గవర్నర్ బిల్లును ఆమోదించాలని కోరామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే సభలకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, ముఖ్య నాయకులు మండ్ల రాజు, మేకల ఆంజనేయులు, బొబ్బిలి నిక్సన్, సాయిలీల, ఆది, ఆర్ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
నష్ట పరిహారం అందేనా..?
అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలు ●అమరచింత: ఇటీవల కురిసిన అధిక వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన వివిధ రకాల పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. జిల్లాలోని 11 మండలాలు.. 70 గ్రామాల్లో 560 ఎకరాల పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకుంటామని ప్రకటించడంతో కాస్త ఊరట లభించినా.. ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో పరిహారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు దాపురించాయి. ఈసారి వానాకాలంలో జిల్లావ్యాప్తంగా వరి, మొక్కజొన్న, కంది, వేరుశనగ, పత్తి, ఉల్లి, ఎర్ర మిరప పంటలు అధికంగా సాగు చేశారు. వీటిలో అత్యధికంగా వరి పంట వర్షపు నీటిలో మునిగి ఇసుక మేటలు వేయడంతో అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ● అమరచింత మండలంలో 32 ఎకరాల్లో పత్తి, వరిపంట నీట మునిగింది. ● కొత్తకోట మండలంలోని 9 గ్రామాల్లో 65 ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిని 104 మంది రైతులు నష్టపోయారు. ● మదనాపురం మండలంలో 37 మంది రైతుల 13 ఎకరాల వరి పంట నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ● చిన్నంబావి మండలంలో మొక్కజొన్న, ఉల్లి, 2 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. ● పాన్గల్ మండలంలో 45 మంది రైతులకు సంబంధించి 40 ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ● గోపాల్పేట మండలంలో పత్తి, వరి, కంది, పెసర పంట 60 ఎకరాలు.. రేవల్లి మండలంలో 41 మంది రైతులు 36 ఎకరాల పత్తి, వరి పంట.. ఏదుల మండలంలో కంది, మిరప పంటలు 13 ఎకరాల్లో నష్టపోయారు. ● పెబ్బేరు మండలంలో ఆముదం, వేరుశనగ, ఉల్లి, వరి, మిర్చి పంటలు సుమారు 91 ఎకరాలకు నష్టం వాటిల్లింది. ● పెద్దమందడి మండలంలో 103 మంది రైతులు 104 ఎకరాల్లో పత్తి, వరి పంటలను సాగుచేసి వర్షాల కారణంగా నష్టాలను చవిచూశారు. ● వనపర్తి మండలంలో 73 మంది రైతులు సాగు చేసిన 42 ఎకరాల వరి, ఆముదం, మొక్కజొన్న పంటలకు నష్టం వాటల్లింది. మండలం గ్రామాలు పంటనష్టం రైతులు (ఎకరాలో..) పెబ్బేరు 11 98.21 54 పాన్గల్ 11 41.04 46 వనపర్తి 10 47.21 83 కొత్తకోట 9 66.18 106 గోపాల్పేట 6 60.34 68 పెద్దమందడి 6 107.24 106 మదనాపురం 4 13.16 37 రేవల్లి 4 37.05 42 ఏదుల 4 13.38 13 అమరచింత 3 22.24 32 చిన్నంబావి 2 51.20 45 మండలాల వారీగా పంట నష్టం వివరాలు.. పంటల వారీగా.. జిల్లావ్యాప్తంగా 70 గ్రామాల్లో 560 ఎకరాల నష్టం అత్యధికంగా వరి పంట.. నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్న అధికారులు -
గణపతి లడ్డు @ రూ.8,00,116
వనపర్తి: జిల్లాకేంద్రంలోని రాజమహల్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి నిమజ్జనం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. అంతకుముందు లడ్డుకు వేలం నిర్వహించారు. పదకొండు రోజుల పాటు వినాయకుడితో పాటు పూజలందుకు లడ్డును రాజస్థాన్కు చెందిన బంగారు వ్యాపారి సమధాన్ రూ.8,00,116కు వేలంలో దక్కించుకున్నారు. జిల్లాలో ఇంత పెద్దమొత్తంలో వినాయకుడి లడ్డు వేలం పాట పాడటం ఇదే ప్రథమమని స్థానికులు చర్చించుకుంటున్నారు, సామాజిక మాద్యమాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి రూరల్: జిల్లాలోని పెద్దగూడెం శివారు ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ బీఎస్సీ (హానర్స్) వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ ఇంజనీరింగ్, ప్లాంట్ పాథాలజీ బోధించేందుకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులైన వారు అర్హులని.. పీహెచ్డీ, నెట్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతల నిజ ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీ, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, పూర్తి బయోడేటాతో ఈ నెల 10న పెద్దగూడెం శివారు వ్యవసాయ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ‘ఏఈఓలకు పనిభారం తగ్గించాలి’ వనపర్తి రూరల్: తమపై పని భారం తగ్గించాలంటూ శనివారం కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని ఏఈఓలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఏఈఓలు మాట్లాడుతూ.. పని ఒత్తిడి కారణంగా కామారెడ్డి జిల్లా డోగ్లీ మండల ఏఈఓ బస్వరాజు శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడన్నారు. ఈ సందర్భంగా అతడి చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూలమాల వేసి నివాళులర్పించారు. డిజిటల్ క్రాప్ సర్వేతో పాటు 49 రకాల విధులు నిర్వర్తిస్తుండటంతో పని ఒత్తిడి పెరిగి రోగాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పని భారం తగ్గించాలని, తగిన సమయం ఇవ్వాలని కోరారు. మృతిచెందిన ఏఈఓ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏఈఓలు నందకిశోర్, యు గంధర్, మోహన్, సాయిరెడ్డి, అభిలాష్, సంతోష్, శైలజ, కవిత, హరితారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులే దేశానికి వనరులు కొత్తకోట రూరల్: విద్యార్థులు దేశానికి అపార వనరులని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. దండ రాజిరెడ్డి అన్నారు. 2025 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం అందించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మోజర్ల ఉద్యాన కళాశాల అధ్యాపకులు డా. షహనాజ్ అందుకున్న సందర్భంగా కళాశాలలో అభినందించి మాట్లాడారు. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన గుణాత్మక విద్య అందించేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. మెరుగైన ఆవిష్కరణలతో రాష్ట్రంలోని ఉద్యాన రైతులు పంటల సాగు లాభసాటిగా మార్చేందుకు ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు. -
‘సర్వేపల్లి’ జీవితం ఆదర్శం
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం ● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వనపర్తి: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తించి జిల్లాను విద్యాపరంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శం కావాలని.. తన పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకోవాలని సూచించడం ఉపాధ్యాయులకు గొప్ప గౌరవం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని.. అందులో భాగంగానే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కొత్త టీచర్ల నియామకం చేపట్టిందని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తోందన్నారు. కొత్త విద్యా విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందన్నారు. జనాభా సర్వే, ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు పనిచేస్తే అందరికీ ఒక నమ్మకం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో రెండు జిల్లాలను విద్యాపరంగా ఉత్తమ జిల్లాలుగా గుర్తించారని.. అందులో వనపర్తి లేకపోవడం బాధ కలిగించిందన్నారు. విద్యాపర్తిగా పేరున్న వనపర్తిని రానున్న రోజుల్లో చదువులో ఉత్తమంగా తీర్చిదిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు సృజనాత్మకత, నైతిక విలువలు నేర్పిస్తూ సమాజానికి మేలు చేసేలా తీర్చిదిద్దాలన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు బోధనతో పాటు శాస్త్రవేత్తల గురించి చెప్పి వారి మనసును ఆకర్షించాలని, అప్పుడే చదువుపై శ్రద్ధ చూపుతారని తెలిపారు. పోలీస్శాఖ నుంచి విద్యార్థులకు తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతకుముందు విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేకంగా నిలిచిన బోనాల పండుగ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 63 మందికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో పాటు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, జిల్లా విద్యాధికారి మహ్మద్ ఘనీ, ఏసీజీఈ గణేష్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు..
● రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిన బీఆర్ఎస్ ● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వనపర్తి: రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల కుప్పగా మార్చేశారని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. శనివారం పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి హాజరై లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలకులు పదేళ్ల కాలంలో రూ.8.19 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారని, ప్రజల దీవెనతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజామోద పాలన చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, రూ.రెండు లక్షల వరకు పంట రుణమాఫీ వర్తింపజేశామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న గత పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని.. ప్రజాపాలనలో తొలి విడతగా రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని చెప్పారు. మరో మూడు విడతల్లో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భూ భారతి చట్టంతో దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు భరోసా కల్పించామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.. ఆర్థిక ఇబ్బందులున్నా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఉమ్మడి పాలమూరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని ప్రజా ప్రభుత్వం మరోసారి నిరూపించిందని.. గతంలోనూ వైఎస్సార్ హయాంలో ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చుతామని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో తొలివిడత నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హతనే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక చేసినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి పొంగులేటి మాట ఇచ్చారని.. అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే ఒకసారి రూ.వెయ్యి కోట్లు, మరోసారి రూ.280 కోట్లు మంజూరు చేశారని.. పనులు పురోగతిలో ఉన్నాయని గుర్తుచేశారు. అభివృద్ధిలో పాలేరు నియోజకవర్గం తర్వాత వనపర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఇందిరమ్మ ఇళ్లు అదనంగా కేటాయించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, బ్రహ్మం, సతీష్ పాల్గొన్నారు. పేదోడి సొంతింటి కల సాకారం.. -
ఆగుతూ.. సాగుతూ...!
జిల్లాలో నత్తనడకన విద్యార్థుల వివరాల నమోదు ● ఏజెన్సీకి అప్పగింత.. పాఠశాలల్లోనే ఆన్లైన్ చేస్తున్న ఆపరేటర్లు ● పూర్తిస్థాయి నమోదే లక్ష్యంగా ముందుకు.. ● అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆలస్యం వనపర్తి టౌన్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల వివరాల ఆన్లైన్ నమోదుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ విధానంతో విద్యార్థుల సంఖ్య పక్కాగా నిర్ధారణ అవుతుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు జిల్లాలో ఆధార్ నమోదు, బయోమెట్రిక్ వేగవంతం చేసేందుకు ఎస్ఎన్ఆర్ ఏజెన్సీతో రాష్ట్ర ఉన్నతాధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏజెన్సీ ప్రతి మండలానికి ఒకటి, పెద్ద మండలాలకు 2, 3 చొప్పున ఆపరేటర్లను నియమించి ఆయా మండలాల్లో ప్రధాన పాఠశాల సమీపంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమీప ప్రాంత విద్యార్థుల వివరాలు నమోదు చేయనున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ఏజెన్సీ ఆపరేటర్లు విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, వేలిముద్రలు, ఆధార్ నంబర్, తరగతి, పుట్టిన తేదీ, ఫోన్నంబర్, ఐరీష్ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఆపరేటర్ రోజు సగటున 30 మంది విద్యార్థుల వివరాలు బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల వివరాలను ఆపరేటర్లు నమోదు చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం కొన్ని మండలాల్లో వివరాల నమోదు కొనసాగుతుండగా.. మరికొన్ని మండలాల్లో ప్రారంభించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 754 ఉండగా.. 91,830 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 5,537 మంది విద్యార్థులకు ఆధార్ నమోదు లేకపోవడం గమనార్హం. ఇందులో వనపర్తిలో 1,253, శ్రీరంగాపురంలో 174, ఆత్మకూర్లో 813, పెబ్బేరులో 667, వీపనగండ్లలో 121, పానగల్లో 245, కొత్తకోటలో 723, చిన్నంబావిలో 149, అమరచింతలో 270, గోపాల్పేటలో 226, మదనాపురంలో 195, పెద్దమందడిలో 276, రేవల్లిలో 108, ఖిల్లాఘనపురంలో 247, ఏదులలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. అడ్మిషన్ రిజిస్టర్, యూడైస్లో ఆధార్కు అనుగుణంగా 25,608 మంది విద్యార్థుల వివరాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆధార్, బయోమెట్రిక్, ఐరిష్ పూర్తిస్థాయిలో అనుసంధానం కాని విద్యార్థులు 5,843 మంది ఉన్నారు. పూర్తిస్థాయిలో అప్డేట్ అయిన విద్యార్థులు 54,844 మంది మాత్రమే ఉన్నారు. విద్యార్థి పేరు, ఆధార్తో పూర్తిస్థాయిలో మ్యాచ్ అయిన విద్యార్థులు 69,726 మంది మాత్రమే ఉన్నారు. కచ్చితంగా నమోదు.. విద్యార్థులకు తప్పనిసరిగా ఆధార్ గుర్తింపు ఉండాలి. ఆధార్ ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాలి. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ఆధార్ సేవలను విద్యార్థులకు చేరువ చేశాం. త్వరలోనే అన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తాం. డీఈఓ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. – శ్రీధర్రెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి -
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
కొత్తకోట రూరల్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం పెద్దమందడి మండలం వెల్టూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జ్వరంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ డెంగీ పరీక్షలు నిర్వహించాలని, ర్యాట్ పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయితే రక్త నమూనాను ఎలిజా పరీక్షకు పంపించాలని వైద్యులకు సూచించారు. వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతో మెరుగైన వైద్యం అందించవచ్చన్నారు. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ పాఠశాలలు, కేజీబీవీలు, అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత, సమస్యలు ఉంటే ప్రతిపాదనలు అందించా లని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం, గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, వైద్యాధికారులు ఉన్నారు. -
యూరియా తిప్పలు తప్పేదెన్నడో..?
పాన్గల్: మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయానికి యూరియా వచ్చిందనే విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు శనివారం ఉదయమే భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. 600 బస్తాల యూరియా రాగా.. మూడురోజుల కిందట టోకన్లు తీసుకున్న రైతులు ఒకపక్క, టోకన్లు లేని రైతులు మరోపక్క పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి టోకన్లు, యూరియా పంపిణీ చేపట్టారు. మూడురోజుల కిందట పంపిణీ చేసిన టోకన్లలో ఇంకా 416 మందికి, కొత్తగా 390 మందికి టోకన్లు పంపిణీ చేయడంతో మొత్తం 806 మంది రైతులకు యూరియా ఇవ్వాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. రోజు యూరియా పంపిణీ చేస్తున్నా.. రైతుల రద్దీ మాత్రం తగ్గడం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. యూరియా కోసం ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు తీసుకొచ్చి రోడ్డుపైనే నిలపడంతో మీ–సేవా కేంద్రాలు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, సిబ్బంది తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపి కార్యాలయానికి నడిచి వెళ్లడం కనిపించింది. ఆత్మకూర్: పట్టణంలోని పీఏసీఎస్కు శనివారం ఉదయమే వివిధ గ్రామాల రైతులు తరలివచ్చి చెప్పులు, పట్టాదారు పాసు పుస్తకాలను వరుసలో ఉంచి పడిగాపులు పడటం కనిపించింది. మధ్యాహ్నం 300 సంచుల యూరియారాగా పోలీసులు కలుగజేసుకొని రైతులను వరుస క్రమంలో నిలబెట్టి 140 మందికి 300 బస్తాలు పంపిణీ చేశారు. మిగిలిన 200 మంది రైతులకు టోకన్లు అందించామని.. సోమవారం యూరియా అందిస్తామని ఏఓ వినయ్కుమార్, సీఈఓ నరేష్ తెలిపారు. -
వంతెన నిర్మాణానికి స్థల పరిశీలన
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ ప్రాంతం నుంచి గద్వాలకు వెళ్లేందుకు వంతెన నిర్మాణానికిగాను స్థల పరిశీలన చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ నాగేంద్రం తెలిపారు. శనివారం మండలంలోని జూరాల పుష్కరఘాట్, అమరచింత మండలం ప్రారంభం వద్ద వంతెన నిర్మాణాలకు అనువైన స్థలాలను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు స్థల పరిశీలన జరిపామన్నారు. ఇటీవల జూరాలను సందర్శించిన మంత్రులు వంతెన నిర్మాణానికి కావాల్సిన రూ.120 కోట్లు మంజూరు చే స్తామని హామీ ఇచ్చారని.. అందులో భాగంగానే సందర్శించామన్నారు. జూరాల వద్ద వంతెన నిర్మాణంతో ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, డీఈ నారాయణ, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, కాంగ్రెస్ నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, మహమూద్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. -
అందుబాటులోకి కొత్త కాలేజీలు
● పూర్తయిన తరగతి గదుల నిర్మాణం, డ్యూయెల్ డెస్కుల ఏర్పాటు ● ఆయా కోర్సులో ఇప్పటికే పూర్తయిన అడ్మిషన్ల ప్రక్రియ ● ‘లా’లో 45 మంది, ఇంజినీరింగ్లో 191 మంది చేరిక ● ఓరియంటేషన్ క్లాస్లు పూర్తి.. త్వరలో తరగతులు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం పాలమూరు యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పీయూలోని అకాడమిక్ భవనం పైభాగంలో ఎడమ వైపు ఉన్న తరగతి గదులు ఇంజినీరింగ్, కుడి వైపు ఉన్న గదులు లా కళాశాల విద్యార్థులకు కేటాయించారు. కాగా ఆరు నెలల క్రితమే గదుల నిర్మాణం ప్రారంభించగా ఇటీవల పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థులకు అవసరమైన డ్యూయెల్ డెస్క్లు, టేబుళ్లు తదితర వాటిని అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా కోర్సుల్లో కలిపి మొత్తం 191 మంది విద్యార్థులను ప్రభుత్వం అలాట్ చేసింది. ఇంజినీంగ్లో చేరిన విద్యార్థులకు కళాశాలతోపాటు హాస్టల్లో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వీరికి కృష్ణవేణి బాలికల హాస్టల్ కొత్త భవనంలో వసతి ఏర్పాటు చేశారు. అలాగే వీరు కళాశాలలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలని అనే అంశాలపై ఓరియంటేషన్ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. త్వరలో రెండు కళాశాలల తరగతులు ప్రారంభించనున్నారు. లా, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులు బోధించేందుకు గెస్టు ఫ్యాకల్టీని అధికారులు నియమించారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం మూడు గ్రూప్లకు సంబంధించి 11 మందిని అధ్యాపకులకు ఇంటర్వ్యూలు, డెమో చేపట్టిన తర్వాత నియమించారు. అలాగే లా కళాశాలకు సంబంధించి 6 పోస్టుల భర్తీకి బుధవారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 6 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 10 మందిని షార్ట్లిస్టు చేశారు. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. వీటితోపాటు లా, ఇంజినీరింగ్ కళాశాలలకు నాన్ టీచింగ్ సిబ్బందిని వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నవారిని సర్దుబాటు చేయనున్నారు. మొత్తం 6 మందిని కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇక లా విద్యార్థులు మొత్తం 120 మంది లా సెట్ ద్వారా ఎంపికై , ఆన్లైన్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వారి లిస్టును ప్రభుత్వం పీయూకు పంపించింది. 45 విద్యార్థుల బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తు చేసుకోగా.. మిగతా వారికి గురువారం వరకు పీయూలో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పీయూ లా కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 120 మందితో పీయూను ఆన్లైన్లో ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే 45 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. విద్యార్థులకు కళాశాలలో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. – మాళవి, లా కళాశాల ప్రిన్సిపాల్ పీయూలో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇంజినీరింగ్లో గదులతోపాటు డ్యూయెల్ డెస్కుల్, టేబుల్స్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. రెండు కళాశాలలకు సంబంధించి సిబ్బంది నియామకం ప్రక్రియ సైతం పూర్తయ్యింది. – శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
నాలుగు దశాబ్ధాల్లో మొదటిసారి..
వనపర్తి: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీస్ రూల్స్ను వర్తింపజేసేందుకు విడుదల చేసిన జీఓనంబర్ 44 ఆధారంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలకు వారం వ్యవధిలో రెండు విడతల్లో స్థాన చలనం కల్పించారు. నాలుగు దశాబ్ధాల కాలంలో పీఏసీఎస్లలో పనిచేసే సీఈఓలు, ఇతరల ఉద్యోగులను బదిలీ చేసిన దాఖలాలు లేవు. రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఇతర పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందుతున్న పీఏసీఎస్ల దశ మారుతున్న దృష్ట్యా పూర్తిగా సంఘం పరిధిలో పనిచేసే ఉద్యోగులే అయినా.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని జీఓ విడుదల చేసిన విషయం విధితమే. ఈ జీఓ ఆధారంగా సిబ్బందికి బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ డీసీసీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 45 మంది సీఈఓలను, తాజాగా బుధవారం మరో 33 మందిని బదిలీ చేస్తూ డీసీసీబీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల ప్రక్రియను సీఈఓల్లో 80 శాతం సానుకూలంగా తీసుకోగా.. 20 శాతం వ్యతిరేకిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏళ్లుగా ఒకేచోట పని చేయడంతో పాలనలో కొంత నిర్లక్ష్యం.. మూస పద్ధతి పాటిస్తున్నారన్న ఆరోపణలకు ఈ బదిలీలతో చెక్ పడుతోందని అధికారులు, డీసీసీబీ పాలకవర్గం భావిస్తోంది. కొందరు పని చేయడానికి బద్ధకిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 78 మంది బదిలీ రెండు విడతల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీబీ అధికారులు జీఓనంబర్ 44 సర్వీస్ రూల్స్ వర్తింపుతో సాధ్యమైనట్లు చర్చ -
ఘనంగా వీడ్కోలు
గణనాథుడికి.. నిమజ్జనానికి తరలుతున్న గ్రీన్పార్క్ గణనాథుడు జిల్లాకేంద్రంలో శుక్రవారం రాత్రి 9 తర్వాత గణనాథుల శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. సంతబజార్, బండారునగర్, గాంధీనగర్, వడ్డెగేరి, జమ్ములమ్మ ఆలయం తదితర ప్రాంతాలు, వివిధ కాలనీలు, రహదారులపై ఏర్పాటుచేసిన భారీ గణనాథులను ట్రాక్టర్లు, లారీలు, భారీ వాహనాల్లో మేళతాళాలు, డప్పు వాయిదాలు, మహిళల కోలాటాలు, యువత నృత్యాల నడుమ ఊరేగించారు. రాత్రి పొద్దుపోయే వరకు శోభాయాత్ర కొనసాగగా తెల్లవారుజామున పట్టణంలోని నల్ల చెరువులో నిమజ్జనం చేశారు. – వనపర్తి -
వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు..
అక్కడక్కడ నెలకొన్న చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసి పీఏసీఎస్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీఓనంబర్ 44 ఆధారంగా దశాబ్ధాలుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న సీఈఓలు, ఆఫీస్ అసిస్టెంట్లకు స్థానచలనం కల్పించాం. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు కల్పించి పనిచేసే వారిని ప్రోత్సహించడంతో పాటు నిర్లక్ష్యం వహించే వారితోనూ పని చేయించేందుకు ఒక్కరిద్దరు మినహా.. దాదాపుగా అందరికి స్థానచలనం కల్పించాం. ఉద్యోగం చేసేచోటే నివాసం ఉండేలా ఆదేశాలిచ్చాం. రైతులకు అన్నివేళల్లో అందుబాటులో ఉండాలని సూచించాం. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్, మహబూబ్నగర్ ● -
ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మిస్తాం
మదనాపురం: ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టామని.. త్వరలోనే భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని అజ్జకొల్లులో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మండల కేంద్రం నుంచి అజ్జకొల్లు వరకు రెండు వరుసల బీటీరోడ్డు నిర్మాణం చేపట్టి ఆర్టీసీ బస్సు నడిపించే బాధ్యత తనదేనన్నారు. అలాగే నూతన పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన స్వయంగా పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. తిరుమలాయపల్లిలో ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చెర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు శ్రీనివాస్యాదవ్, కృష్ణవర్ధన్రెడ్డి, సాయిబాబా, మాజీ సర్పంచ్ సత్యం, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు మంత్రులు పొంగులేటి, జూపల్లి రాక
వనపర్తి: పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవాలకు శనివారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గృహ నిర్మాణశాఖ డైరెక్టర్ వస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతం గ్రామంలోనే బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో మిలాద్–ఉన్–నబీ అమరచింత: జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు శుక్రవారం మిలాద్–ఉన్–నబీని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, దివ్యా ఖురాన్ పఠనం చేస్తూ జాగరం చేశారు. అమరచింత జామియా మసీదులో శుక్రవారం అన్న ప్రసాద వితరణ చేశారు. నబీసా మసీద్లో మహ్మద్ ప్రవక్త కేశాలను ఆసర్ ముఖారక్ ద్వారా భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ముస్లింలు మసీద్కు చేరుకొని ప్రవక్త కేశాలను దర్శించుకున్నారు. వందల ఏళ్ల కిందట మక్కా, మదీనాకు ఇక్కడి నుంచి వెళ్లిన ముస్లింలు ప్రవక్త కేశాలను భక్తితో ఇక్కడికి తీసుకొచ్చి ఏటా దర్శించుకునేలా ఉర్సు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నబీషా మసీద్ నిర్వాహకులు తెలిపారు. వట్టెంలో ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఆలయ అర్చక బృందం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు, మహాపూర్ణాహుతి, పవిత్ర మాలధారణ వంటివి జరిపించారు. చివరిరోజు నిర్వహించిన స్వామివారి పవిత్రోత్సవాల కార్యక్రమానికి వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంత నర్సింహారెడ్డి, కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, సురేందర్రెడ్డి, దేవేందర్రెడ్డి పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. పవిత్రోత్సవాలను తిలకిచండానికి ఆయా ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. -
పేదల సొంతింటి కల సాకారం
వనపర్తి రూరల్: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలం తోమాలపల్లిలో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు ఎదురుచూసినా ఇళ్ల నిర్మాణాలు జరగలేదని.. రెండు పడకల గదుల ఇల్లు కేటాయించాలని నాయకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో వారి కళ్లల్లో సంతోషం కనబడుతుందని తెలిపారు. అనంతరం అదే గ్రామంలో కొద్దిరోజలు కిందట అనారోగ్యంతో మృతిచెందిన గొల్ల విష్ణు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. పెబ్బేరులో జరిగిన మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్పార్టీ నాయకులు అక్కి శ్రీనివాస్గౌడ్, సురేందర్గౌడ్, రామన్గౌడ్, నరేందర్, వెంకటేష్సాగర్, రంజిత్, షకీల్, ఎండీ అఫ్సర్, మైనుద్దీన్, షబ్బీర్, మాజీద్, ముస్తాక్, అతిక్పాషా, బాషా, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
శాంతియుత వాతావరణంలో నిమజ్జనం
వనపర్తి: భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి గణనాథులకు ఘనమైన వీడ్కోలు పలుకుదామని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రత, బందోబస్తు కల్పిస్తున్నట్లు వివరించారు. గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని నల్లచెరువు వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశం, శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తయ్యేలా నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రహదారుల మరమ్మతు, ఫ్లడ్ లైట్లు, క్రేన్లు, తాగునీటి వసతి కల్పించామని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఊరేగింపు కొనసాగుతుందని.. నిర్వాహకులు పూజలు త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలని సూచించారు. చిన్నపిల్లలు, మహిళలు శోభాయాత్రలో పాల్గొంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని, ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలపై వచ్చే చిన్నారులు జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. క్రేన్ సాయంతో నిమజ్జనం చేసే సమయంలో యువత, చిన్నారులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, సహాయకులు అందుబాటులో ఉండాలన్నారు. శోభాయాత్రలో డీజేలు, బాణసంచా వినియోగించడం నిషేధమని.. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమం శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, వనపర్తి సీఐ కృష్ణయ్య, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, పుర, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
గురువే నమః
చెప్పడం కంటే కళ్లకు కట్టినట్లు చూపిస్తే పిల్లలకు పాఠాలు సులభంగా అర్థమవుతాయన్నది నిజం. పలువురు ఉపాధ్యాయులు కొంతకాలంగా ఇదే విధానాన్ని అవలంబిస్తూ పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. బోర్డుపై చిత్రాలు గీచి, పాఠ్య పుస్తకాల్లోని ఫొటోలు చూపించి బోధించడంలాంటి మూసధోరణికి స్వస్తి పలికి సాంకేతికతను జోడించి యానిమేషన్ వీడియోల ద్వారా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు పలువురు ఉపాధ్యాయులు. పాఠ్యాంశం చాలా కాలం గుర్తుండేలా వినూత్నంగా బోధిస్తూ.. వారిలోని సృజనాత్మకతను వెలికితీసి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా సంసిద్ధులను చేస్తున్నారు. మొత్తంగా గ్రామీణ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతూ పలువురు ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..దేవన్నకు రాష్ట్రస్థాయి పురస్కారం.. కొత్తకోట: మండలంలోని అప్పరాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న దేవన్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. అందరి ఉపాధ్యాయులుగా కాకుండా తాను ప్రత్యేకంగా ఉండాలన్న ఆయన తపన రాష్ట్రస్థాయి గుర్తింపునకు కారణమైంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో సాంఘికశాస్త్ర ఫోరం నిర్వహించే ప్రతిభా పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దేవన్న ఎంతో కృషి చేశారు. గ్రామస్తులు, పూర్వ విద్యార్థుల చేయూతతో పాఠశాలలో మైక్సెట్, డ్యూయల్ డెస్క్ బేంచీలు, ప్రింటర్, అనేక పుస్తకాలు, గోడలపై రాష్ట్ర, దేశపటాలు, జాతీయ నాయకుల చిత్రచిత్రాలు గీయించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.‘డిజిటల్’ టీచర్.. సంతోష్కుమార్అమరచింత: సాంకేతికతపై పట్టు సాధించేందుకు నిరంతరం పరితపిస్తుంటారు ఆత్మకూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్కుమార్. ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన ప్రత్యేకమైన తరగతి గదిలో ఆంగ్ల అక్షరాలు, ప్రొజెక్టర్ ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు బోధన అందిస్తూ ఆంగ్లంలో మెళకువలు నేర్పిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు సైతం ఈయనను సత్కరించారు. 1990లో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన సంతోష్కుమార్ ఉమ్మడి ఆత్మకూర్ మండలంలో 30 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.ప్రత్యేక తరగతి గదిలో.. విద్యార్థులకు పుస్తకాల్లో ఉన్న విషయాలను నేర్పించడంతో పాటు సాంకేతికంగా కూడా విద్య అందిస్తున్నాం. వాయిస్ టోనింగ్ ద్వారా ఆంగ్లం, తెలుగు భాషలో పదాలు చెప్పడం, విద్యార్థులతో చెప్పించడంతో సులభంగా అర్థమవుతుంది. పాఠశాలలో తన కోసం ప్రత్యేక తరగతి గదిని కేటాయించడంతో ప్రయోగత్మకంగా డిజిటల్ ఆంగ్ల బోధన సాధ్యమవుతుంది. బోధనే కాకుండా ఆంగ్లంలో రైటింగ్ స్కిల్స్ను సైతం నేర్పిస్తున్నా. బోధన పరికరాలకు వేతనం నుంచి కొంత ఖర్చు చేయడంతోనే ఇది సాధ్యమవుతుంది.– సంతోష్కుమార్, ఆంగ్ల ఉపాధ్యాయుడుఈ సారు.. బడిని మార్చారురాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న విష్ణువర్ధన్నాయుడువనపర్తి రూరల్: పెబ్బేరు మండలం పెంచికలపాడుకు చెందిన ఎన్.విష్ణువర్ధన్నాయుడు 2010లో ఎస్జీటీగా ఎంపికై మాగనూర్ మండలం ఓబులాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో చేరారు. అక్కడి నుంచి 2015లో పెబ్బేరు మండలం సూగూరు ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఈ పాఠశాలలో వాల్ పెయింటింగ్ చేయించి విద్యార్థులకు వినూత్న బోధన అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. అక్కడి నుంచి 2024లో శ్రీరంగాపురం మండలం నాగరాల 3వ కేంద్రం ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. ఇక్కడ ఏకోపాధ్యాయుడిగా విధులో చేరి ఒకేగదిలో ఇద్దరు విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. తన స్నేహితుల సాయంతో పాఠశాలకు రంగులు వేయించి సామగ్రి సమకూర్చుకున్నారు. ఇతడికి పెయింటింగ్పై ఆసక్తి ఎక్కువ. పాఠశాల గోడలపై తెలుగు వర్ణమాల, ఇంగ్లీష్ అల్పాబెట్, అంకెలు, బొమ్మలు వేసి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థులకు సంఖ్య 16కి చేరింది. ఈయన కృషికిగాను ప్రభుత్వం ఆయనను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డుకు ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందని.. అవార్డు నాపై మరింత బాధ్యత పెంచిందన్నారు. నా సేవలను విద్యాశాఖ గుర్తించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. – జీవశాస్త్రంలో వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న ఉపాధ్యాయుడుప్రయోగాల మాస్టారు మల్లేష్పాన్గల్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయుడు మల్లేష్కుమార్ తన వినూత్న బోధనతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. ఈయనకు ప్రయోగాల మాస్టారుగా పేరుంది. సైన్స్ ప్రయోగాల ద్వారా విద్యార్థి సంపూర్ణంగా నేర్చుకుంటారని చెబుతుంటారాయన. గుండె, మూత్రపిండాలు, జ్ఞానేంద్రియాలు మొదలగు అవయవాలను డిజిటిల్ బోర్డుపై చూపిస్తూ బోధిస్తుంటారు.● పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్జీసీ ఏకో క్లబ్ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్స్ అభివృద్ధి, వన మహోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం, ప్లాస్టిక్ నిషేధం వంటివి నిర్వహించి పిల్లలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛతలో భాగంగా పిల్లలు చేతులు శుభ్రం చేసుకునే విధానం, మరుగుదొడ్లను వినియోగించడం, నులిపురుగులు, అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు.● ఎకో క్లబ్లో భాగంగా మట్టి గణపతులు, పేపర్ బ్యాగుల తయారీ , ఏకో రాఖీ, ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులు పాఠశాల, మండల, జిల్లాస్థాయి సైన్స్ మేళాల్లో పాల్గొనేలా సిద్ధం చేస్తుంటారు. సైన్స్, బాలల, గణిత దినోత్సవం సందర్భంగా పిల్లలకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు.● తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిపై చర్చించడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. అందుకు అనుగుణంగా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థులకు బోధిస్తూ ఆయా లక్ష్యాల వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నా.– మల్లేష్కుమార్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, పాన్గల్జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు 56 మంది● శనివారం పురస్కారాల అందజేతవనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా 56 మంది ఉత్తమ ఉపాధ్యాయును ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ గురువారం రాత్రి తెలిపారు. ఏ ప్రాతిపదికన, ఏయే అంశాలు పరిగణలోకి తీసుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని ఉదయం నుంచి పలు ఉపాధ్యాయ సంఘాలతో ఆయన విస్తృతంగా చర్చించారు. డీఈఓ కార్యాలయంలో అదనపు బాధ్యతలు, ఫారెన్ సర్వీస్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల కనుసన్నల్లో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ కొనసాగినట్లు ప్రచారం సాగింది. గురువారం రాత్రి 9 వరకు కూడా కసరత్తు ఓ కొలిక్కి రాలేదు. మండలాల వారీగా, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని డీఈఓ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక కమిటీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ సెలవురోజు కావడంతో ఎంపిక వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచాలని అధికారులు నిర్ణయించినట్లు చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందనే ఉద్ధేశంతో డీఈఓ వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడటం లేదని విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. ఒక గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, 24 మంది స్కూల్ అసిస్టెంట్లు, 21 మంది ఎస్జీటీలు, నలుగురు ఎల్ఎఫ్ఎల్ ఉపాధ్యాయులు, ఇద్దరు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, కేజీబీవీ ఉపాధ్యాయులు ముగ్గురు, ఒక పీడీ ఉన్నారు. ఈసారి మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు తొలిసారిగా వరించాయి.విశేష సేవలకు గుర్తింపుపీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డికి రాష్ట్రస్థాయి అవార్డుమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తూ.. పీజీ కళాశాల ప్రిన్సిపాల్, ఐక్యూఏసీ డైరెక్టర్ మధుసూదన్రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డును ప్రకటించింది. ఆయన యూజీ, పీజీ స్థాయిలో పనిచేయడంతోపాటు ఆయన చేసిన 35 పరిశోధనలకు జాతీయ, అంతర్జాతయ స్థాయిలో రీసెర్చ్ పత్రాలను సమర్పించారు. 11పుస్తకాలను జాతీయ, అంతర్జాతీయ పబ్లిషర్స్ పబ్లిష్ చేశాయి. ఆయన చేసిన రెండు రీసెర్చ్లకు రూ.56లక్షలతో ప్రాజెక్టులు వచ్చాయి. దీంతోపాటు పీయూ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వీసీ ఓఎస్డీ, ఐక్యూఏసీ డైరెక్టర్, బోర్డు ఆఫ్ స్టడీస్ డైరెక్టర్తోపాటు ఐదుగురు వీసీలు, ఏడుగురు రిజిస్ట్రార్ల వద్ద అడ్మినిస్ట్రేషన్ పరంగా విధులు నిర్వహించడంతో ఆయనకు ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. -
ఎఫ్డీఆర్ నిధులు ఖర్చు చేయాలి
వనపర్తి: జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాలకు కేంద్ర విపత్తు నిర్వహణ ద్వారా మంజూరైన రూ.3 కోట్లను ఖర్చుచేసి యూసీలు సిద్ధం చేసి పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గత వర్షాకాలంలో వరదలతో ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది.. వాటి మరమ్మతుకు ఖర్చు చేసిన బిల్లులు సిద్ధం చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్య, రహదారులు, భవనాలు, సంక్షేమ, వైద్య, ఆరోగ్యశాఖ, నీటిపారుదల, మున్సిపాలిటీ తదితర శాఖల అధికారులో సమీక్ష నిర్వహించి నష్టాలు, చేపట్టిన మరమ్మతుపై చర్చించారు. పనులు ఎంత మేర పూర్తయ్యాయి, ఎన్ని పురోగతిలో ఉన్నాయన్న వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లిందో నివేదిక అందజేయాలని, వాటి మరమ్మతుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి మమ్మద్ ఘనీ, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, పుర కమిషనర్లు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులు, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్మిల్లుల ఏర్పాటులో నిబంధనలు తప్పనిసరి
ఖిల్లాఘనపురం: జిల్లాలో కొత్త రైస్మిల్లులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. గురువారం మండలంలోని మొగులుకుంటతండా సమీపంలో నిర్మాణంలో ఉన్న రైస్మిల్లును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే వరి ధాన్యాన్ని సకాలంలో మర ఆడించి ఎఫ్సీఐకి సీఎంఆర్ అప్పగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో మిల్లులోని ధాన్యం నిల్వలో తేడాలు ఉండొద్దన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు.. భూ రిజిస్ట్రేషన్లకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి వివిధ పనుల నిమిత్తం వచ్చిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రోజుల తరబడి తిప్పించుకోకుండా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. దాతల సహకారంతో కార్యాలయం వెలుపల బెంచీలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అధికంగా వసూలు చేస్తే చర్యలు.. మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధికంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్కు వచ్చిన ఓ రైతుతో మాట్లాడి మీ సేవా వారు ఎన్ని డబ్బులు తీసుకున్నారని అడిగారు. రూ.2,200 చెల్లించామని చెప్పగా.. 0.13 ఎకరాలకు రూ.850 తీసుకోవాల్సి ఉండగా అన్ని డబ్బులు ఎందుకు వసూలు చేశారని తహసీల్దార్ను ప్రశ్నించారు. సదరు కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. అనంతరం రికార్డుగదిని పరిశీలించారు. పాతవి తొలగించి కొత్తవాటిని ఉంచాలని చెప్పారు. ఆయనవెంట పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్, సీనియర్ అసిస్టెంట్ కురుమూర్తి, ఆర్ఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ -
ముగిసిన ‘కళా ఉత్సవ్’
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని బాలభవన్లో రెండ్రోజులుగా కొనసాగిన జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి పోటీల కో–ఆర్డినేటర్, ఏఎంఓ మహానంది పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నట్లు చెప్పారు. గాత్ర, వాద్య సంగీతం, శాసీ్త్రయ నృత్యం, జానపద బృంద నృత్యం, విజువల్ ఆర్డ్ 2డీ, 3డీ, దేశీయ బొమ్మల తయారీ, డ్రామా, కథ, కథనం తదితర అంశాల్లో విద్యార్థులు పోటీ పడ్డారని వివరించారు. మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీల జ్యూరీ కమిటీ సభ్యులు బైరోజు చంద్రశేఖర్, సుధాకరాచారి, ఎస్.సుజాత, బి.యాదగిరి, గోపాల్, ప్రసన్న, బాలవర్దన్, సరిత, షబానా, రాధిక, రమేష్ పాల్గొన్నారు. ‘బండి’ ఉత్సవాలను జయప్రదం చేయండి పాన్గల్: మండలంలోని రేమద్దులలో ఈ నెల 30న నిర్వహించే బండి యాదగిరి సాంస్కృతిక మండలస్థాయి ఉత్సవాలను జయప్రదం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు మధు, సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్, పార్టీ జిల్లా నాయకుడు ఎండీ జబ్బార్ కోరారు. ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గ్రామంలో నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కళలతో ప్రజలను మేల్కొలిపి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొనేలా చేసిన గొప్ప కళాకారుడు బండి యాదగిరి అని కొనియాడారు. డప్పు, డోలు, మృదంగం, భజన, కోలాటం, బొడ్డెమ్మ, పల్లెసుద్దులు, జానపద కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. ఐద్వా జిల్లాకార్యదర్శి వెంకటయ్య, భగత్, ఎం.వెంకటయ్య, భాస్కర్, చంద్రశేఖర్, మల్లేష్, ఎండీ ఖాజా, నిరంజన్, కృష్ణ య్య, భాస్కర్గౌడ్, కమలాకర్ పాల్గొన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడుదాం అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లకు వ్యతిరేకంగా ప్రతి కార్మికుడు పోరాడాల్సిన అవసరం ఉందని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో జరిగిన టీయూసీఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ కనుసన్నల్లో పెట్టుబడిదారులు, సంపన్న వర్గాలను అందలం ఎక్కించే కార్యక్రమాలు చేస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను ఆమోదించాలని చూస్తోందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీం తీర్పును నేటికీ అమలు చేయడం లేదని వివరించారు. రాజు, గణేష్, ప్రేమరత్నం, కురుమన్న, శ్రీను, చెన్నయ్య, ఏసేపు పాల్గొన్నారు. రోడ్డెక్కిన అన్నదాతలు గోపాల్పేట: యూరియా కోసం బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట ఉన్న రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించగా ఓ రైతు మహిళ వేషధారణలో చీర కట్టుకొని యూరియా కావాలంటూ వ్యవసాయ అధికారులను కొంగు పట్టి అడుక్కున్నారు. మంగళవారం రాత్రి అయిపోయిందని.. మధ్యాహ్నం మూడు వరకు రెండు లారీలు వస్తుందని నచ్చ జెప్పడంతో శాంతించారు. ఒంటిగంట ప్రాంతంలో 450 సంచులు రాగా సిబ్బంది పంపిణీ చేశారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి, రేవల్లి పోలీసులు అక్కడకు చేరుకొని రాకపోకలను పునరుద్ధరించారు. -
చేప పిల్లలు.. చెరువులకు చేరేనా?
అమరచింత: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం రూ.122 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. కానీ వీటికి సంబంధించిన విధివిధానాలు జిల్లాలకు అందకపోవడంతో ఉచిత చేపపిల్లల పంపిణీ ఎప్పుడు జరుగుతుందోనని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం.. జిల్లాలోని చెరువులకు ఎన్ని లక్షల చేప పిల్లలను ఇస్తున్నారనే విషయాలను నేటికీ అంచనా వేయకపోవడంతో మరో నెల సమయం పడుతుందన్న సందేహాలతో మత్స్యకారులు కాలం నెట్టుకొస్తున్నారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే ఆశించిన మేర పెరగవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో కేవలం 54.84 లక్షల చేప పిల్లలను మాత్రమే మత్స్యశాఖ అధికారులు వదిలారు. ఈ ఏడాది రెండు కోట్ల చేప పిల్లలను పూర్తిస్థాయిలో అన్ని సొసైటీలకు ఉచితంగా అందించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇప్పటికే పుణ్యకాలం దాటిపోతుందని.. త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తిచేసి చేప పిల్లలను వెంటనే అందించాలంటున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా 1,052 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో గతేడాది అనుకున్న లక్ష్యంలో సగం అంటే 54.84 లక్షల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో 143 మత్స్య సహకార సంఘాలు ఉండగా, 13,600 మంది మత్స్యకారులు చేపల విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాది పొడవునా జీవనాధారంగా ఉన్న చేపలను చెరువుల్లో పెంచుకొనేందుకు ఇప్పటికే మత్స్యకారులు సొంతంగా సీడ్ను ఆంధ్రా నుంచి దిగుమతి చేసుకొని వదిలేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలతో పాటు సొసైటీ ద్వారా డబ్బులు వెచ్చించి తమ ప్రాంతాల్లో అమ్ముడుపోయే చేప పిల్లలను కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయని.. ప్రభుత్వం త్వరగా పిల్లలను కొనుగోలు చేసి సొసైటీలకు అప్పగించాలని కోరుతున్నారు. చేప పిల్లల పరిశీలనలు.. నాణ్యమైన చేప పిల్లలను మత్స్యకారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా మత్స్యశాఖ అధికారుల బృందాలుగా ఏర్పడి పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు వెళ్లి చేప పిల్లలు, ధరలు తెలుసుకుంటారు. ఈసారి ఇప్పటికే పర్యటించి టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది. కాని ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో అధికారులు వేగంగా ఇందుకు సంబంధించిన విధివిధానాలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే జిల్లా మత్స్య సొసైటీలకు ఎంత మేరకు చేప పిల్లలు ఇవ్వాలనే ప్రణాళికలు రూపొందించుకొని వాటి ప్రకారం కొనుగోలుకు టెండర్లు ఆహ్వానిస్తాం. చేప పిల్లలు వచ్చిన వెంటనే పంపిణీకి చర్యలు తీసుకుంటాం. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ ఆలస్యంగా వదిలితే నష్టమే.. అమరచింత పెద్ద చెరువుపై ఆధారపడి 300 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను త్వరగా పంపిణీ చేసి ఆదుకోవాలి. ఆలస్యంగా పంపిణీ చేస్తే నష్టాలు తప్ప లాభాలు రావు. చేప పిల్లల పంపిణీ కోసం మరో నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. – గోపి, మత్స్యకారుడు, అమరచింత చేప పిల్లలకు ఎదురుచూపులు.. ఈ ఏడాది ప్రభుత్వం పంపిణీ చేస్తే ఉచిత చేప పిల్లల కోసం ఎదురుచూస్తున్నాం. ప్రతి ఏటా ఇప్పటి వరకే చేప పిల్లలు చెరువులో వదిలేవాళ్లం. అధికారులు సైతం తమ చెరువుకు రావాల్సిన సబ్సిడీ చేప పిల్లలను అందించే వారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెబుతున్నారు.. త్వరగా సరఫరా చేసి ఆదుకోవాలి. – తెలుగు రాములు, పాన్గల్ నిధులు విడుదల చేస్తున్నట్లు గత నెల ప్రకటించిన ప్రభుత్వం విధివిధానాలపై అధికారుల కసరత్తు జిల్లాలో 143 మత్స్య పారిశ్రామిక సొసైటీలు గతేడాది పంపిణీ చేసింది 54.84 లక్షలే.. 13,600 మంది మత్స్యకారులకు ఉపాధి -
చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం
అమరచింత: ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్యతో కలిసి సందర్శించి కార్మికులు మగ్గాలపై తయారు చేస్తున్న జరి చీరలను పరిశీలించారు. అనంతరం పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల మార్ట్లో జరి చీరల డిజైన్లను చూసి ఆనందం వ్యక్తం చేశారు. కార్మికులు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లను తెలుసుకొని చీరలు తయారు చేస్తూ మార్కెట్కు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు చాలీచాలని కూలితో చీరల తయారీకి దూరమైన కార్మికులు.. ప్రస్తుతం కంపెనీలో వాటాదారులుగా మారి ప్రతినెల వేతనం పొందుతున్నారని కంపెనీ సీఈఓ శేఖర్ వివరించారు. నేతన్నలను ఆదుకునేందుకు కంపెనీని ఏర్పాటు చేసి ప్రోత్సహించడం అభినందనీయమని శేఖర్ను అదనపు కలెక్టర్ అభినందించారు. అనంతరం చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య మాట్లాడుతూ.. అమరచింతలో తయారు చేసిన జరి చీరలను గద్వాల చీరలని గతంలో విక్రయించే వారని, అలాంటిది కంపెనీ ఏర్పాటు అనంతరం అమరచింత పేరు మీద ఆన్లైన్లో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో సైతం విక్రయిస్తున్నారని చెప్పారు. కంపెనీ ప్రారంభించిన ఐదేళ్లలో 450 మంది పైచిలుకు కార్మికులు చేరి ఉపాధి పొందడమేకాకుండా కంపెనీలో భాగస్తులుగా ఉంటున్నారని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు ఉన్నారు. -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: జిల్లాలో కొలువుదీరిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్ర, శనివారం జిల్లాకేంద్రంలోని నల్ల చెరువు, అమ్మ చెరువుల్లో వినాయక నిమజ్జనానికి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం నల్లచెరువు పరిసరాలను ఆయన పరిశీలించారు. పట్టణం, మండలంలో 450 విగ్రహాలు ఉన్నాయని పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఏర్పాట్లు, చెరువులో ప్రమాద స్థలలు ఎక్కడెక్కడ ఉన్నాయని మున్సిపాలిటీ డీఈ మహ్మద్ యూసఫ్ను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. నిమజ్జనానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని.. సహాయక చర్యలు చేపట్టే వారికి కావాల్సిన సేఫ్టీ పరికరాలు సమకూర్చాలన్నారు. కలెక్టర్ వెంట ఏఈలు, మున్సిపల్ శానిటరీ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. 5న గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు వనపర్తి: ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ పరిపాలన అధికారుల పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సెప్టెంబర్ 5న నియామక పత్రాలను హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందజేయనున్నందున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి సీసీఎల్ఏ ఉన్నతాధికారి లోకేష్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 15 మండలాలు 228 గ్రామపంచాయతీల్లో 133 క్లస్టర్ ఉండగా.. 135 మంది పరీక్షలు రాశారన్నారు. 109 మంది అర్హుల జాబితాను అధికారులు తయారు చేశారని.. ప్రస్తుతం 81 మందికి నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీరందరిని హైదరాబాద్కు తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఎడ్యుకేషన్.. ఇరిగేషన్
పాలమూరుకే మొదటి ముద్ద.. పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి నాటి పాలకులు ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవారు. భవిష్యత్లో మన అభివృద్ధి, పరిశ్రమలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేలా అభివృద్ధి చేసుకోవాలి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావాలి. పరిశ్రమలు కావాలంటే భూములు కావాలి. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు నాకు పంపాలి. ఏ పరిశ్రమ వచ్చినా మొదటగా పాలమూరుకు పంపుతాను. నాకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరు ప్రజలకు పెడుతా. మంత్రి వర్గంలోని మంత్రులు ఏమనుకున్నా మంచిదే.సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో భాక్రానంగల్, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ.. ఇలా ఏ మూలన ప్రాజెక్ట్లు కట్టినా తట్ట పని, మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలే కావాలి. వారి భాగస్వామ్యం లేకుంటే ఏ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి ప్రధానం కారణం చదువులో వెనకబాటు, సాగు నీరు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాల్లోని పెద్దలు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ వలసలు ఆగలేదు. అందుకే పాలమూరు బిడ్డగా నా బాధ్యత నెరవేరుస్తా. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లక్ష్యంగా పాలమూరు జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు కృషి చేస్తా.’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘పాలమూరు బిడ్డల చదువు కోసం ఏది కావాలన్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్ట్లకు గ్రీన్చానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తాం. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లమవుతాం.’ అని పేర్కొన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. రైతులకు న్యాయం చేస్తాం..కర్ణాటక సరిహద్దులో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్, నారాయణపేట, కొడంగల్. ఈ ప్రాంతానికి నీళ్ల కోసం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 69 జీఓ ద్వారా తెచ్చుకుంటే ఎంపీగా పనిచేసిన కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రాజెక్టును తొక్కిపెట్టి అన్యాయం చేశారు. అందుకే సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్కు టెండర్లు పిలిచి ముందుకు వెళుతుంటే.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారు. కొడంగల్లో కోల్పోయినవి కమర్షియల్ భూములు కావడంతో అక్కడి వారికి ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో రూ.11 లక్షల వరకు ఇచ్చాం. నారాయణపేటలో రూ.14 లక్షలు ఇస్తున్నాం. భూసేకరణకు సంబంధించిన వివాదాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే, కలెక్టర్ రైతులతో మాట్లాడాలి.. భూసేకరణ విషయంలో వారంపాటు సమయం కేటాయించి రైతులతో మాట్లాడాలి. వారిని ఒప్పించి.. మంచి పరిహారం అందించాలి. భూములు కోల్పోతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి. రైతులకు నష్టం జరిగితే మాకు జరిగినట్లే. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రాజెక్ట్తో పాటు వికారాబాద్– కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేసుకోకపోతే, పాలమూరు–రంగారెడ్డి, భీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్ట్లు పూర్తి చేసుకోకపోతే.. ఎప్పుడూ పూర్తి చేసుకోలేం. నిధుల ఇబ్బందులు ఉన్నా.. మన జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందజేస్తున్నాం. రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, పర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎస్జీడీ టెక్నాలజీస్ ఎండీ దీపక్ సర్జిత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.నియోజకవర్గానికో ఏటీసీ..హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మళ్లీ 75 ఏళ్ల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు నాయకత్వం వహిస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. విద్య, ఇరిగేషన్, ఉపాధి రంగాల్లో సరైన ప్రణాళికతో జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే శాశ్వాతంగా మన జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే ఇంజనీరింగ్, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు ట్రిపుల్ ఐటీని పాలమూరు జిల్లాకు మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున రూ.2,800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అంతేకాకుండా ఉమ్మడి పాలమూరులో 14 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆ సెంటర్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది. పాలమూరు బిడ్డలు వలసల బారి నుంచి బయటపడాలంటే చదువొక్కటే మార్గం. పాలమూరు జిల్లా నుంచి ఇంజినీర్లు, డాక్టర్లే కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఎదగాలి. నూతన పరిశ్రమలకు వేదిక మహబూబ్నగర్ కాబోతోంది.రాష్ట్రం వచ్చినా సముచిత న్యాయం జరగలేదు..ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా ప్రజలు అండగా నిలిచి మాజీ సీఎంను ఎంపీగా గెలిపించారు. పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో లోక్సభకు ప్రాతినిధ్యం వహించినా.. రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి సముచిత న్యాయం జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, జూరాల, నెట్టంపాడు, కోయిల్సాగర్, భీమా లాంటి ప్రాజెక్టులు ఏవి కూడా సంపూర్ణంగా పూర్తికాలేదు. ఆనాడు సోనియాగాంధీ నాయకత్వంలో పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసినా అదొక పీజీ కళాశాలగా మిగిలిపోయింది. యూనివర్సిటీ హోదాలో ఉండాల్సిన ఇంజినీరింగ్, లా, ఇతర కళాశాలలు లేకపోయాయి. -
పారిశుద్ధ్యంపై ముందడుగు
వనపర్తి టౌన్: స్థానిక మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణలో వేగం పెంచేందుకు పురపాలక శాఖ అడుగులేస్తుంది. పట్టణంతో పాటు నాలుగు విలీన గ్రామాలు ఉండడంతో మున్సిపాలిటీ పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రతి నివాసం, కమర్షియల్ దుకాణంలో చెత్తను సేకరించేందుకు మున్సిపాలిటీకి తలకుమించిన భారంగా మారింది. పట్టణంలో అధికారుల లెక్కల ప్రకారం నివాసాలు, కమర్షియల్ దుకాణాలు కలిపి 20వేలకు పైగా ఉ న్నాయి. దీంట్లో లెక్కకు రాని నివాసాలు సైతం అనే కంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త వాహనాలకు మొగ్గు పురపాలికలో చెత్త సేకరణలో కలుగుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించారు. ఈ మేరకు సుమారు రూ.60.5 లక్షల అంచనాతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 3 ట్రాక్టర్లు, 3 ట్రాలీలు, 3 ఆటోలు కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందారు. ఈ మేరకు ఆటోలకు రూ. 27.50 లక్షలు, ట్రాక్టర్లు, ట్రాలీలకు రూ.33లక్షల చొప్పున ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సిబ్బంది నియామకం లేని కారణంగా అదనపు ఆటోలకు, ట్రాక్టర్లకు ఉన్న సిబ్బందిలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి డ్రైవర్ హోదా, జీతాన్ని ఇచ్చి కొత్త వాహనాలను నడిపించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఒకవేళ ఇలాగే ముందుకెళ్తే పారిశుద్ధ్య సిబ్బందిపై పనిభారం మరింత పెరగనుంది. మూడు నెలల కిందట వాహనాల కొనుగోలుకు ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ ఇప్పటి వరకు కార్యాచరణలో ముందడుగు పడటం లేదు. మున్సిపల్ డీఈ యునోస్ వీటి పురోగతిపై పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ ప్రభావం చెత్త సేకరణపై పడుతోంది. ఉన్నతాధికారులు సైతం ఈ అంశంపై దృష్టి సారించకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో 13 ట్రాక్టర్లు, 4 ఆటోలు కలిపి 17వాహనాల ద్వారా 50 మంది కార్మికులు చెత్త సేకరణ, దుర్గంధం ఎత్తిపోసే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 10ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయి. ఈ మేరకు పట్టణంలో ప్రతి రోజు 20 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఏళ్ల కిందట ఉన్న సిబ్బంది, వాహనాలతోనే అన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ చేపడుతుండటంతో సకాలంలో ఇంటింటి చెత్త సేకరణ చేయలేకపోతుంది. ఈ క్రమంలో పుర పరిధిలోని నివాసాల్లో తడి, పొడి చెత్త పేరుకుపోతుండటంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఒక్కో వార్డుల్లో ఐదారు వీధుల ఉండటంతో రోజుకు 2, 3 వార్డులు తిరగ్గానే సిబ్బంది సమయం ముగిసిపోతుంది. ఈ క్రమంలో ఒక్కొక్క వార్డులో ఇంటింటి చెత్త సేకరణకు వారానికి ఒకటి, రెండు సార్లే ట్రాక్టర్ వెళ్తుతుంది. దీనికి తోడు ప్రధాన, వరద కాల్వ, అంతర్గత రహదారుల డ్రెయినేజీల్లో పేరుకుపోయిన చెత్త, దుర్గంధాన్ని వెలికితీసి శివారు ప్రాంతాలకు తరలించేందుకు సైతం ఇంటింటి చెత్త సేకరణ ట్రాక్టర్లే వాడుతుండటంతో పుర పరిధిలో ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదనే అపవాదు ఉంది. ప్రధాన రాజకీయ పార్టీ ముఖ్య నాయకుల ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రాంతాల్లో చెత్త సేకరణ, దుర్గంధం తొలగింపు పనులు పూర్తి స్థాయిలో చేయట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిని అధిగమించేందుకు అధికార యంత్రాంగం శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇంటింటి చెత్త సేకరణకు అనువుగా ట్రాక్టర్లను, ఆటోలను కొనుగోలుకు టెండర్లు పిలిచాం. వారం రోజుల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు వస్తాయి. ఆటోలు తయారు అవుతున్నందున మరో 15 రోజులు పడుతుంది. టెండర్ దక్కించుకున్న వారు నాకు తెలిసిన వాళ్లు, బంధువులు కానే కాదు. – యునూస్, డీఈ వనపర్తి మున్సిపాలిటీ. మున్సిపాలిటీలో కొత్తగా ఆటోలు, ట్రాక్టర్ల కొనుగోలుకు నిర్ణయం జనాభాకు అనుగుణంగా పెరగనున్న చెత్త సేకరణ వాహనాలు పుర ప్రజలకు తప్పనున్న అవస్థలు సిబ్బంది పెరిగితే మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ టెండర్లు పూర్తయినా ఇంకా రాని వాహనాలు -
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ దష్ట్యా జిల్లావ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని సూచించారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారితీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, రాజకీయ నాయకుల, కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజావాణికి 6 ఫిర్యాదులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల సీఐ, ఎస్ఐలకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమే యం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకునేలా వారికి భరోసా కల్పించాలని సూచించారు. -
యూరియా తిప్పలు.. చెప్పుల బారులు
ఆత్మకూర్: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఉదయం నుంచి యూరియా కోసం చెప్పులు, పాస్పుస్తకాలను వరుస క్రమంలో పెట్టి పీఏసీఎస్ల వద్ద పడిగాపులు కాసారు. సాయంత్రం 5 గంటలకు ఒక లోడ్ 600 బ్యాగులు రావడంతో ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. స్థానిక పోలీసులు కలుగజేసుకుని 215 మంది రైతులకు యూరియా పంపిణీ చేశారు. మిగిలిన 36 మంది రైతులకు టోకెన్లు అందించామని, మంగళవారం యూరియా అందిస్తామని ఏఓ వినయ్కుమార్, సీఈఓ నరేష్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్ల పంపిణీ అమరచింత: పట్టణంలోని పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులు సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూలైన్లో చెప్పులు, రాళ్లు పెట్టి నిల్చున్నారు. కానీ మధ్యాహ్నం 2 గంటలకు యూరియా రాదని చెప్పిన అధికారులు లైన్లలో నిల్చున్న రైతులకు టోకెన్లు అందించి, మంగళవారం యూరియా తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాతలు పనులు వదులుకొని యూరియా కోసం ఇంకా ఎన్నాళ్లు తిరగాలని అధికారులను నిలదీశారు. ఖిల్లాఘనపురం: సాగు చేసుకున్న పంటకు సకాలంలో యూరియా వేసేందుకు అన్నదాతలు అరిగోసపడుతున్నారు. నాలుగు రోజులైనా తనకు యూరియా ఇవ్వడం లేదని ఓ కౌలు రైతు ఏకంగా సింగిల్విండో కార్యాలయంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన ఖిల్లాఘనపురంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం వద్ద 15 రోజులుగా రెండు రోజులకు ఒకసారి యూరియా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకే వివిధ గ్రామాల నుంచి సుమారు 300 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన కౌలు రైతు బిక్కి చెన్నకేశవులు అక్కడికి వచ్చి యూరియా కోసం ఎదురు చూశాడు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న రైతులను చూసి ఇక తనకు యూరియా దొరకదని ఆందోళనకు గురై సింగిల్విండో కార్యాలయం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నిస్తుండగా ఎస్ఐ వెంకటేష్ అప్రమత్తమై తన సిబ్బంది రక్షించారు. -
బడుగుల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
వనపర్తి టౌన్: బడుగుల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్యాదవ్ అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో డీసీసీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బడుగులు అభ్యున్నతి చెందాలనే రాహుల్గాంధీ లక్ష్యాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ద్వారా విద్యా, ఉద్యోగ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్రెడ్డి, రాగివేణుగోపాల్, కురుమూర్తి, మన్యం, రాగి అక్ష య్, రాములు, జానకీరాములు, లక్ష్మయ్య, పెంటన్న పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్ఫలితాలు
కొత్తకోట రూరల్: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.రజిని అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని నివేదిత డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు తీసుకోవడం వలన మేథోపరమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు. మాదకద్రవ్యాలను విక్రయించడం, కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని, కేసులు నమోదవుతాయని తెలియజేశారు. గూగుల్లో నషా ముక్త్ భారత్ సైట్ను సందర్శించి డ్రగ్స్ తీసుకోం అని ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. అదేవిధంగా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ సభ్యుల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో తమ పిల్లలు ర్యాగింగ్కు పాల్పడరని అంగీకార పత్రం తీసుకోవాలని తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి మోహన్కుమార్, కళాశాల డైరెక్టర్ సూరిబాబు, కళాశాల సిబ్బంది సహదేవుడు, వెంకటేష్ గౌడ్, విద్యార్థులు ఉన్నారు. -
గిరిజన రైతులపై కేసులు ఎత్తివేయాలి
పాన్గల్: గిరిజన రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కిష్టాపూర్తండాలో పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ వివిధ రూపాల్లో గిరిజన రైతులు చేస్తున్న పోరాటానికి సీపీఎం బృందం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కిష్టాపూర్తండాలో సర్వే నెం.34లో 12 ఎకరాల భూమిని 25 మంది గిరిజన రైతులు 70 ఏళ్లుగా సాగు చేస్తున్నారన్నారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులపై అకారణంగా అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేయించారని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తండాను సందర్శించి సమగ్ర విచారణ జరిపి గిరిజన రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బా ల్యనాయక్, వెంకటయ్య, వేణుగోపాల్, ఎం.వెంకటయ్య, చంద్రశేఖర్, కోదండరాములు, నిరంజన్, కృష్ణయ్య, గిరిజన రైతులు పాల్గొన్నారు. -
గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం
వనపర్తి: జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం, వినియోగించడం కానీ జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశంలో సంబంధిత శాఖల నుంచి అధికారులు నివేదిక సమర్పించారు. మాదక ద్రవ్యాల సరఫరాపై పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ఉన్న క్యాంటీన్లు, పాన్షాప్లు, వైన్ షాపుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నిఘా పెట్టాలని ఎకై ్సజ్, డ్రగ్ తనిఖీ అధికారులకు సూచించారు. జిల్లాలోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ కమిటీలను క్రియాశీలంగా మార్చి, ప్రతి నెల మొదటి శుక్రవారం యాంటీ డ్రగ్ సమావేశాలు నిర్వహించాలని, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో 6 కేసులు 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు వనపర్తి పట్టణంలో 2, గోపాల్పేట మండలంలో 2, పెబ్బేరులో 2 కేసులు కలిపి మొత్తం 6 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై, సరఫరా చేసే వారిపై, గంజాయి పండించే వారిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల శిక్షణ పొందిన పోలీస్ శునకాలు మాదక ద్రవ్యాలను సులువుగా గుర్తిస్తున్నాయని, వీటి సహాయంతో అనుమానం వస్తే కళాశాలల్లోనూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్యానాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి 36 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్సురభి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
లొసుగులను తప్పించేందుకే సీబీఐకి అప్పగింత
పాలమూరు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కాళేశ్వరంపై సీబీఐకి అప్పగించడానికి సిద్ధమయ్యాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 19 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు సీబీఐకి ఇస్తున్నానని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఉన్న లొసుగులను గుర్తించి వాటన్నింటిని తప్పించడానికే సీబీఐని తెరముందుకు తెస్తున్నారన్నారు. కాళేశ్వరంపై విచారణ చేయడానికి సీబీఐకి అప్పగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో సహకరిస్తుందో తెలియదని, ఇదంతా లోపాయికారి ఒప్పందంలో భాగమే తప్పా వేరే ఏమీ లేదన్నారు. బీజేపీ మొదటి నుంచి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. ఎలాంటి రాజకీయాల కోసం కవిత డైలాగ్లు చెబుతుందో తెలియదు కానీ కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల అందరి పాత్ర ఉందని మనం భావించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ రౌడీయిజం మానుకోవాలి
వనపర్తి టౌన్: నియోజకవర్గంలో కాంగ్రెస్ దౌర్జన్యాలు పెరిగిపోయి నాయకులు రౌడీయిజం చెలాయిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వివేకానంద మార్గ్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆగడాలు వనపర్తిలో రోజురోజుకూ శృతిమించుతున్నాయని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడే పోలీసులు కాంగ్రెస్పై ఒకలా, బీజేపీపై మరోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విష సంస్కృతికి కాంగ్రెస్ పునాదులు వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే మహిళలు అని కూడా చూడకుండా అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులను అక్రమ కేసులతో వేధించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. పోలీసులు, కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మంగళవారం కేంద్ర బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడంతో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది రాజు, వారణాసి కల్పన, నాయకులు శ్రీనివాసులు, పద్మ, సూరి, శివారెడ్డి, రామ్రెడ్డి, సరోజ, రాము, తిరుమలేష్, కరీం, రాయన్న సాగర్ పాల్గొన్నారు. నేడు పట్టణ బంద్కు బీజేపీ పిలుపు -
బీఆర్ఎస్ పాలనలోనే నీటికుంటల ఆధునికీకరణ
వనపర్తి రూరల్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటలను ఆధునికీకరించి చెరువులను తలపించేలా పునర్నిర్మించామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దగూడెంతండా, తిరుమలయ్యగుట్ట అటవీ ప్రాంతంలో గత ప్రభుత్వం నిర్మించిన తిరుమలయ్యకుంట, దీద్యాకుంటను రైతులతో కలిసి ట్రాక్టర్పై వెళ్లి సందర్శించారు. నీటితో కళకళలాడుతున్న ఆయా కుంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చెక్డ్యామ్లు, కుంటలు నిర్మించి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టామని, ఈ ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న 32 మంది రైతులకు పట్టాలిచ్చామని.. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మిగిలిన వారికి కూడా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, మాణిక్యం, రవిప్రకాష్రెడ్డి, మాధవరెడ్డి, నరేష్, మహేశ్వర్రెడ్డి, ధర్మానాయక్, ఏర్వ సాయిప్రసాద్, కొండన్న, టీక్యానాయక్, చత్రూనాయక్, నారాయణనాయక్, నాగరా జు, అంజినాయుడు, బాబునాయక్, రవినాయక్ తదితరలు పాల్గొన్నారు. నిర్ణీత రోజుల్లో నిమజ్జనం చేయాలి వనపర్తి: గణేష్ ఉత్సవ సమితి వారు వేద పండితులను సంప్రదించి మంచిరోజులైన 6వ రోజు లేదా 10వ రోజు మాత్రమే నిమజ్జనం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శోభాయాత్రను సాంస్కృతిక కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా అనేక మండపాలు ఏర్పాటుచేసి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజించారని.. అలాగే చివరి ఘట్టం నిమజ్జనం కూడా సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ సమైఖ్యతను చాటి చెప్పేలా ముగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శోభాయాత్రను సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించాలని.. అతి ధ్వనులైన డీజే సౌండ్స్ ఉపయోగించకుండా ఆకతాయి చేష్టలు లేకుండా భజనలు, డోలు సన్నాయిలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ సాగాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా పూర్తి చేయాలని పేర్కొన్నారు. -
మరో ఆరు నెలలు..
చేనేత సహకార పాలకవర్గాల గడువు పొడిగింపు ● 2013లో జరిగిన ఎన్నికలే చివరవి.. ● చతికిల పడుతున్న సొసైటీలు ● పేరుకే బాధ్యతలంటున్న అధ్యక్షులు ●అమరచింత: చేనేత, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పదవీకాలం మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించిన జీఓలను ఆయా సొసైటీలకు చేనేత, జౌళిశాఖ అధికారులు పంపించారు. దీంతో చేనేత సహకార సంఘాల ఎన్నికల తంతు మరో ఆరునెలల పాటు అటకెక్కినట్లయింది. ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధ్యక్షులు తమను నామ్కే వాస్తేగా నియమిస్తున్నారే తప్పా నిధులు, విధులు లేవంటున్నారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాత పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం చేతులు దుపులుకొంటుంది. ఇప్పటికే 15 పర్యాయాలు పాత పాలకమండలికే బాధ్యతలు అప్పగించిన జౌళీశాఖ అధికారులు మరో 6 నెలల పాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేతన్నలు సైతం ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారా లేదా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలను పొడిగిస్తూ వచ్చిందని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిర్వహించి సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆశపడిన నేతన్నలకు నిరాశే మిగిలింది. తూతూమంతరంగా.. పదవి కాలం పొడిస్తున్నా.. తగిన నిధులు లేని కారణంగా సొసైటీల నిర్వహణ తూతూమంత్రంగా కొనసాగుతోంది. అధ్యక్షుడికి నామమాత్రపు అధికారం ఉండటంతో సొసైటీ ద్వారా అందే పథకాల, కొత్త సభ్యుల చేరికలు వంటి కార్యక్రమాలు జౌళిశాఖ అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్నాయని ఆయా సంఘాల అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల సాధారణ సమావేశంతో పాటు సభ్యుల సమావేశాల సమయంలో కనీస ఖర్చులు, స్వీపర్ల వేతనాలకు సైతం నిధులు లేని దుస్థితి నెలకొందని చెబుతున్నారు. నాగర్కర్నూల్ 3 చేనేత పారిశ్రామిక సహకార సంఘాలకు చివరిసారి 2013, ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. ఆయా పాలకవర్గాల గడువు 2018, ఫిబ్రవరి 10 నాటికి ముగిశాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. గతంలో ఉన్న పాలకవర్గాలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఇప్పటి వరకు 16 దఫాలు బాధ్యతలు అప్పగించడంతో పాటు ప ర్సన్–ఇన్– చార్జిలతో కాలం నెట్టుకొస్తున్నారు. -
కేంద్రం పరిశీలనలో..
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి ఏర్పాటు, వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లాం. ముబాయి, బెంగుళూరు జాతీయ రహదారులను కలుపుతూ ఏర్పాటవుతున్న చించోలి– భూత్పూర్–167 అనుసంధానంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. మొదటి దశలో చించోలి రహదారిని మన్ననూర్ వరకు విస్తరించాలనే ప్రతిపాదనలను కేంద్రానికి పంపించారు. – నరేందర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి ఆవశ్యకత గురించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే వంతెన, రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది నల్లమల ప్రజల చిరకాల ఆంకాక్ష నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో చేర్చడంతో కేంద్రం పరిశీలనలో ఉంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై మద్దిమడుగు వద్ద వంతెన అవసరం గుర్తించాం. ఇప్పటికే కొత్త జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. జాతీయ రహదారి– 44 నుంచి నాగర్కర్నూల్, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా ఏపీలోని చిరిగిరిపాడు(మాచర్ల) వరకు 165 కి.మీ., రోడ్డును ప్రతిపాదించాం. ఈ రోడ్డు మార్గంలో కృష్ణానదిపై వంతెన ఏర్పాటు ఉంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ● -
గుట్టుగా మట్టిదందా!
● సెలవు రోజుల్లో అక్రమ రవాణాకు తెరతీసిన వైనం ● చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల చాటున తరలింపు వనపర్తి: ‘ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులం.. కాబోయే ప్రజాప్రతినిధులం..’ అంటూ పలువురు జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీనివాసపురం, రాజనగరం శివారులోని గుట్టలను గుట్టుగా తవ్వి మట్టిని అక్రమంగా విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అధికారపార్టీ నేతల అండదండలతో అధికారులు అందుబాటులో లేని సెలవు రోజుల్లో మట్టిదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పొక్లెయిన్లు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని తరలిస్తున్నారు. సెలవు వచ్చిందంటే చాలు ఉదయం నుంచి రాత్రి చీకటి పడే వరకు మట్టి దందా చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్థానికంగా విధులు నిర్వహించాల్సిన మైనింగ్శాఖ ఏడీని రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అదనపు బాధ్యతల పేరుతో పంపించడంతో జిల్లాలో మట్టిదందాకు తెరతీసినట్లయిందన్న విమర్శలు ఉన్నాయి. ● ఆగస్టు 27 వినాయక చవితి సెలవు రోజున రాజనగరం సమీపంలోని ఓ గుట్టపై, అదే గ్రామానికి చెందిన కొండలయ్య గుట్టపై నాగవరం తండాకు చెందిన పొక్లెయిన్ ఏర్పాటు చేసుకొని మట్టిని జిల్లాకేంద్రానికి తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు పలువురు ఫిర్యాదులు అందినా వారు స్పందించలేదు. దీంతో వారు ఆదివారం కూడా మట్టి తరలింపు యథేచ్ఛగా చేసినట్లు సమాచారం. ● శ్రీనివాసపురం శివారులోని మబ్బుగుట్ట ఇరువైపులా.. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన పలువురు, మెట్పల్లి ప్రాంతానికి చెందిన మరికొందరు వేర్వేరు చోట్ల పొక్లెయిన్లు ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టిని అక్రమంగా తవ్వి కొత్త ఇళ్ల నిర్మాణాలు, ఇతర అవసరాలకు విక్రయించుకుంటూ అక్రమార్జనకు తెగబడ్డారు. సెలవురోజు వచ్చిందంటే చాలు జిల్లాకేంద్రంలో మట్టి ట్రాక్టర్ల మోత పట్టణవాసులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నది బహిరంగ రహస్యమేనని చెప్పవచ్చు. భవిష్యత్ అవసరాల మాటేమిటి..? ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న అక్రమార్కులకు అధికారులు అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్లో ఇక్కడ గుట్టలు ఉండేవని చెప్పుకొనే పరిస్థితి దాపురించనుంది. అభివృద్ధి పనులకు మట్టి కావాలంటే ప్రైవేట్ భూముల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయనే భయాందోళన స్థానికుల్లో లేకపోలేదు. కొందరు ఇందిరమ్మ కమిటీ సభ్యులమని, ఇళ్ల కోసం మట్టి కావాల్సి ఉందంటూ ఎలాంటి అనుమతి తీసుకోకుండా, అధికారులకు తెలియకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాతో ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. ఒకవేళ అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వానికి చెల్లించేది ఒక వంతు ఉంటే.. వందశాతం ఎక్కువ క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తుంటారు. గుట్టలు అక్రమంగా తవ్వి మట్టి తరలించడం సరికాదు. సమాచారం ఇస్తే దాడి చేసి చర్యలు తీసుకుంటాం. హాస్టల్ భవనానికి మట్టి కావాలంటే కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సర్వేనంబర్ 55లో వెయ్యి టన్నులు (సుమారు 300 ట్రాక్టర్లు) మట్టి తరలింపునకు అనుమతి ఇచ్చాం. మిగతా ప్రాంతాల్లో ఎక్కడా మట్టి తవ్వకానికి అనుమతి ఇవ్వలేదు. రెవెన్యూశాఖ అధికారులతో సమన్వయంతో దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటాం. – గోవిందరాజులు, ఏడీ మైనింగ్, వనపర్తి -
ప్రవాహం.. ప్రమాదం
ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద రోజురోజుకు పెరుగుతోంది. కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వివిధ ప్రాంతాల సందర్శకులు తరలివస్తున్నారు. ఆదివారం దిగువ పుష్కరఘాట్ నది సమీపంలోకి వెళ్లే రహదారి మూసి ఉంచినా పర్యాటకులు మాత్రం ఉధృతంగా పారుతున్న జలాల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడంతో పాటు స్నానాలు చేయడం కనిపించింది. ఆదమరిస్తే ప్రమాదమని తెలిసినా.. ఎగిసి పడుతున్న జలాల ముందు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. నిత్యం పహారా కాస్తున్నామని చెబుతున్న పోలీసులకు వీరిని గమనించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. – అమరచింత -
ప్రభుత్వం చొరవచూపాలి..
ప్రభుత్వం చేనేతరంగానికి ప్రాధాన్యమిస్తూ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపాలి. ఎన్నో ఏళ్లుగా ఎన్నికలు లేని చేనేత సహకార సంఘాలకు త్వరితగతిన జరిగేలా ప్రకటన జారీ చేయాలి. – తాటికొండ రమేష్, చేనేత కార్మిక సంఘం నాయకుడు, అమరచింత చేనేత సహకార సంఘాల ఎన్నికలు త్వరితగతిన నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. పాలకవర్గం పదవీకాలం పూర్తయిన వెంటనే ఎన్నికల ఉండాలి. అప్పుడే సంఘాలకు నిధుల మంజూరు, సొసైటీల అభివృద్ధి సాధ్యమవుతుంది. – మహంకాళి విష్ణు, జిల్లా అధ్యక్షుడు, చేనేత కార్మిక సంఘం, అమరచింత -
అన్నదాతల బారులు..
ఆత్మకూర్: పట్టణంలోని పీఏసీఎస్ వద్ద రోజూవారి పరిస్థితే శనివారం కూడా కనిపించింది. మండలంలోని వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజామునే చెప్పులు, పట్టాదారు పాస్పుస్తకాలు వరుసలో పడిగాపులు పడటం కనిపించింది. మధ్యాహ్నం 3 గంటలకు 300 బ్యాగులు రాగా పోలీసుల సహకారంతో రైతులను వరుస క్రమంలో నిల్చోబెట్టి సాయంత్రం వరకు 136 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 96 మంది రైతులకు టోకన్లు ఇచ్చామని.. సోమవారం పంపిణీ చేస్తామని ఏఓ వినయ్కుమార్, సీఈఓ నరేష్ తెలిపారు. ఎస్ఐలు నరేందర్, హిమబిందు రాథోడ్ పర్యవేక్షించారు. -
వానాకాలం వరి కొనుగోళ్లకు ప్రణాళికలు
● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు పీఏసీఎస్, ఐకేపీ, మెప్మా ద్వారా 414 కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. సన్న, దొడ్డు రకం కలిపి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కనీస మద్దతు ధర క్వింటాకు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, కామన్ రకం రూ.2,369గా నిర్ణయించిందని తెలిపారు. పంట కోతలు ప్రారంభమయ్యే నాటికి కొనుగోలు చేసేలా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. పీపీసీ ఇన్చార్జీలకు కమీషన్ విడుదల.. 2023–24 వానాకాలానికి సంబంధించి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేసిన పీపీసీ ఇన్చార్జ్లకు క్వింటాకు రూ.32 చొప్పున రూ.6.06 కోట్లు, అదే ఏడాది యాసంగి సీజన్కు సంబంధించి రూ.2.79 కోట్ల కమీషన్ మంజూరైనట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కులను పౌరసరఫరాలశాఖ డీఎం, పౌరసరఫరాల అధికారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు అందజేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాల డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ ఆంజనేయులుగౌడ్, డీసీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న డెంగీ..
పల్లెల్లో లోపించిన పారిశుద్ధ్యం ●జిల్లాలో విష జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. డెంగీ కేసు నమోదైన గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదయ్యాయి. కలెక్టర్ ఆదేశాలతో ఏఎల్ఓ బృందాలతో దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. – డా. శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి అమరచింత: గ్రామాల్లో డెంగీ పంజా విసురుతోంది. ఆగస్టు నెలలో జిల్లావ్యాప్తంగా 12 కేసులు నమోదు కాగా.. ఈ సీజన్ మొత్తం 28 కేసులు నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సీజనల్ వ్యాధిగ్రస్తులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వీటితో పాటు గ్రామాల్లోని ఆర్ఎంపీ క్లీనిక్లను రోగులు ఆశ్రయిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల అమరచింత మండలం కొంకన్వానిపల్లెలో 11 ఏళ్ల బాలుడికి డెంగీ నిర్ధారణ కావడంతో వైద్యబృందం గ్రామంలో పర్యటించి దోమల నివారణ మందు పిచికారీ చేయడంతో పాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అనుమానితుల రక్త నమూనాలు సేకరించారు. అంతేగాకుండా ఖిల్లాఘనపురంలోని ప్రభుత్వ వసతి గృహం, కొత్తకోటలోని గురుకుల విద్యార్థులు విష జ్వారాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ఈ నెలలో ఆత్మకూర్ మండలంలో 5 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు లెక్కలు వేస్తున్నారే తప్ప విష జ్వరాలు, దోమల నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. డ్రెయినేజీలు శుభ్రం చేయడంతోనే సరిపెడుతున్న పంచాయతీ అధికారులు దోమలు, ఈగల నివారణకు సరైన చర్యలు చేపట్టడం లేదు. పేరుకే పల్లె దవాఖానాలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి వైద్యులను నియమించి ప్రజలకు వైద్య సేవలు సకాలంలో అందించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇక్కడి వైద్యులను మండల కేంద్రంలోని పీహెచ్సీలకు కేటాయించడంతో పల్లె దవాఖానాలు కేవలం సూచిన బోర్డులకే పరిమితమయ్యాయి. నామమాత్రంగా ఆరోగ్య సర్వే.. గ్రామాల్లో ఆరోగ్యశాఖ చేపట్టే వైరల్ ఫీవర్ సర్వే నామమాత్రంగా కొనసాగుతోంది. సర్వే ఆశ వర్కర్లతో చేపడుతున్నారని.. ఏఎన్ఎంలతో పాటు హెల్త్ సూపర్వైజర్, పీహెచ్సీ వైద్యులను భాగస్వాములు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆశించిన మేర కొనసాగడం లేదు. ప్రతి వారం కార్యక్రమం నిర్వహిస్తున్నామంటూ పత్రికలకు ఫొటోలిస్తూ చేతులు దులుపుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే తప్ప వైద్య శిబిరాలు నిర్వహించలేని పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పొంచి ఉన్న విష జ్వరాల ముప్పు అస్వస్థతకు గురవుతున్న ప్రజలు ఆస్పత్రుల్లో రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య ఫాగింగ్కు నిధులు లేక చేతులెత్తేసిన అధికారులు -
క్షణికావేశం సరికాదు..
జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అధికంగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, చదువులో రాణించకపోవడం వంటి కారణాలతోనే జరుగుతున్నాయి. ఆత్మహత్యల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా పట్టాలపై అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఇలాంటి వారిని జిల్లాలో చాలా వరకు గుర్తించాం. – రాజా, రైల్వే ఎస్ఐ, మహబూబ్నగర్ తల్లిదండ్రుల పాత్ర కీలకం.. చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో చర్చించుకోవాలి. ఏ సమస్యకై నా పరిష్కారం ఉంటుంది. ఇది చిన్న వయస్సు వారిలో అంతగా అర్థం కాదు. 20 నుంచి 30 ఏళ్లలోపు వారిలో హర్మోన్లు ఎక్కువగా పెరుగుతాయి. అన్నీ సాధిస్తామని అనుకుంటారు.. చిన్న చిన్న సమస్యలు వచ్చినా తట్టుకోలేరు. ఎక్కువ మంది ఆకర్షణకు లోనై అనుకున్నది సాధించలేనప్పుడు ఆత్మహత్యల వరకు వెళ్తుంటారు. మరికొందరు మత్తు పదార్థాలకు బానిసై మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి వారిపై తల్లిదండ్రులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. – డా. అనిల్రాజ్, మానసిక వైద్యుడు ● -
యూరియాకు తప్పని పాట్లు
● చెప్పుల వరుసలు.. రైతుల బారులు ● అందని వారికి టోకన్ల జారీ అమరచింత: యూరియా కోసం మండల రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రెండ్రోజులకు ఓసారి మండలంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేసిన అధికారులు శనివారం పీఏసీఎస్ ద్వారా పంపిణీ చేశారు. మస్తీపురం క్రాస్రోడ్లోని ప్రైవేట్ గోదాం వద్ద యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించడంతో వేకువజామునే అక్కడకు చేరుకున్నారు. చెప్పులను వరుసలో పెట్టి అధికారుల రాక కోసం ఎదురు చూడటం కనిపించింది. సీఈఓ నరేష్ వచ్చి వరుసలో ఉన్న చెప్పుల ప్రకారం టోకన్లు ఇచ్చి సరఫరా చేశారు. మొత్తం 300 బస్తాలను సాయంత్రం 4 వరకు పంపిణీ చేశారు. ● మండలంలోని చంద్రగడ్కు చెందిన మహిళా రైతు పార్వతమ్మ తీవ్ర జ్వరంతో క్యూలైన్లో నిలుచుంది. సైలెన్ ఎక్కించుకొని నేరుగా రావడంతో నిరసంగా కనిపించగా ఆమె బాధను గుర్తించిన రైతులు ముందుగా ఆమెకు అందించమని అధికారులకు సిఫారస్ చేశారు. వృద్ధులు చాలా సమయం నిల్చోలేక అక్కడే నేలపై కూర్చొని కునుకు తీయడం కనిపించింది. -
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరపాలి
వనపర్తి: గణేష్ నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షేర్ బ్యాండ్, సన్నాయి, డిల్లెం బల్లెం, కోలాటం, చెక్కభజన, పండరి భజన, నృత్య ప్రదర్శనలతో శబ్ద కాలుష్యాన్ని నివారిస్తూ శోభాయాత్రలు జరపాలని, దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. డీజేల నుంచి అధిక డెసిబుల్స్తో ఉత్పన్నమయ్యే శబ్ధాలతో హృద్రోగులు, చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయన్నారు. జిల్లా పరిధిలో డీజే సౌండ్ మిక్సర్లు, ఆంప్లిఫయర్, బాణాసంచా వినియోగాన్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శోభాయాత్రను సాయంత్రం 4 వరకు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మంచారి, రవి యాదవ్, చీర్లచందర్, లక్కాకుల సతీష్, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
రైతులు వదంతులు నమ్మొద్దు
పాన్గల్: మండలంలో యూరియా కొరత లేదని.. రైతులు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయాన్ని ఆయన సందర్శించి యూరియా సరఫరాపై అధికారులతో ఆరా తీశారు. అలాగే వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. యూరియా కొరత ఉందనే వదంతులతో రైతులు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు చేరుకుంటున్నారన్నారు. మండలంలోని సింగిల్విండో కార్యాలయం ద్వారా ఇప్పటి వరకు 13,500 బస్తాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రోజుకు 750 బస్తాల చొప్పున రైతులకు అందిస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసే యూరియా పక్కదారి పట్టకుండా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో బయోమెట్రిక్ విధానం ద్వారా ఎకరాకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని.. వారికి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన మేరకు యూరియా అందిస్తామన్నారు. ఆయన వెంట కార్యాలయం సిబ్బంది ఉన్నారు. -
సీఎం ఇలాకాలో భూసేక‘రణం’!
‘కొడంగల్–నారాయణపేట’కు అడుగడుగునా అడ్డంకులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన జరిగినా.. అప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక అవాంతరాలతో అడుగు ముందుకు పడలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఈ పథకం అమలుకు కృషి చేసిన ఉమ్మడి పాలమూరుకు చెందిన రేవంత్రెడ్డి సీఎం కావడంతో ఈ ఎత్తిపోతలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. అయితే.. పరిహారం పెంచాలనే డిమాండ్తో భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఉమ్మడి ఏపీలో రూపకల్పన.. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 1.05 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 5.50 లక్షల జనాభాకు తాగు నీరందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో 2014లో జీఓ 69తో పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.133 కోట్ల నిధులు విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటికే నిర్మించిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించిన నికర జలాలను ఈ ఎత్తిపోతలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. డిజైన్లో మార్పు.. అయినా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. జీఓ 69అమలు కోసం రైతులు, మేధావులు, ప్రతిపక్షాలు, జలసాధన సమితి నేతలు ఉద్యమాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ పథకం డిజైన్ మార్చింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా నారాయణపేట, కొడంగల్ సెగ్మెంట్లలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరందేలా ప్రణాళికలు రూపొందించినా.. అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు గత ఏడాది శంకుస్థాపన.. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పాత డిజైన్ ప్రకారం కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలకు మళ్లీ అడుగు పడింది. రూ.4,369 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 21న అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి కోస్గిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రకటించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జూరాల బ్యాక్ వాటర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకు వినియోగించనున్నారు. 350 మంది రైతులకు పరిహారం అందజేత.. తొలి రెండు ప్యాకేజీల పనుల కోసం నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,957 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది జూన్లో సేకరణ చేపట్టగా.. ఇప్పటివరకు 590 ఎకరాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. 134 ఎకరాలకు సంబంధించి అధికారులు 350 మంది రైతులకు ఎకరాకు రూ.14 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. ● తొలి రెండు ప్యాకేజీల్లో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో కాట్రేవులపల్లి నుంచి కానుకుర్తి వరకు చేపట్టిన భూసేకరణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఆయా మండలాల భూ నిర్వాసిత రైతులు ఎకరాకు రూ.14 లక్షల పరిహారం సరిపోదంటూ భూ సేకరణను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాస్తారోకోలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలతో సుమారు 45 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నారాయణపేటలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తాము ప్రాజెక్ట్కు వ్యతిరేకం కాదని.. బహిరంగ మార్కెట్ విలువననుసరించి 2013 చట్ట ప్రకారం పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. కానుకుర్తిలో రాస్తారోకో చేస్తున్న భూ నిర్వాసిత రైతులు తొలి దశలో భూ సేకరణ లక్ష్యం 1,957 ఎకరాలు 3 నెలలుగా సేకరించింది 597 ఎకరాలే.. కాట్రేవులపల్లి నుంచి కానుకుర్తి వరకు మిన్నంటిన నిరసనలు పరిహారం పెంచే వరకూ ఆందోళనలు తప్పవని రైతుల హెచ్చరిక ఎత్తిపోతల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ నుంచి కానుకుర్తి చెరువు వరకు రెండు ప్యాకేజీల్లో అప్రోచ్ కాల్వలు, పంప్హౌస్లు, ప్రెషర్ మెయిన్లు, లీడ్ చానెల్, డెలివరీ సిస్టర్న్లతో పాటు సివిల్, ఎలక్ట్రిక్ పనులు చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీకి రూ.1,134.62 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,126.23 కోట్లు.. మొత్తం రూ.2,260.85 కోట్లు కేటాయించారు. మొత్తంగా 207 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంప్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. 2026 ఆగస్ట్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. మలి దశలో కానుకుర్తి నుంచి కొడంగల్ నియోజవర్గ పరిధిలోని బొంరాస్పేట మండలంలోని చెరువు వరకు నీటిని తరలించనున్నారు. దీనికి టెండర్లు పిలవాల్సి ఉంది. -
అన్నదాతల అవస్థలు
ఆత్మకూర్/అమరచింత/పాన్గల్: యూరియా కోసం జిల్లా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆత్మకూర్ పీఏసీఎస్కు శుక్రవారం ఉదయం నుంచే రైతులు వరుస కట్టారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 300 బస్తాలు రాగా ఆత్మకూర్ రెండో ఎస్ఐ హిమబిందు రాథోడ్, సిబ్బంది పోలీసులు వరుస క్రమంలో నిలబెట్టి సాయంత్రం వరకు 142 మంది రైతులకు పంపిణీ చేశారు. మిగిలిన 196 మంది రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. ● అమరచింత ఆగ్రో రైతు సేవాకేంద్రానికి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే రైతులు చేరుకొని వరుసలో నిల్చున్నారు. 300 బస్తాల యూరియా రాగా గతంలో తీసుకెళ్లిన రైతులకు ఇవ్వమని.. తీసుకెళ్లనివారికి పాసు పుస్తకానికి రెండు సంచులు మాత్రమే ఇస్తామని ఏఓ అరవింద్ చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులు గంటల తరబడి పడిగాపులు పడి రెండు సంచులు తీసుకెళ్లడం కనిపించింది. ● పాన్గల్ సింగిల్విండో కార్యాలయానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసు సిబ్బంది రైతులను వరుసలో నిలబెట్టి యూరియా పంపిణీ చేశారు. ఏడీఏ తిప్పేస్వామి, ఇన్చార్జ్ ఏఓ డాకేశ్వర్గౌడ్ పర్యవేక్షించారు. -
14 ఎకరాలు కోల్పోతున్నాం..
మా తాతల నాటి నుంచి ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. సర్వే నంబర్ 355లో మాకు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వ్యవసాయంతో పాటు ఆయిల్పాం, కాస్మోటిక్ ఆయిల్ మిషన్, గేదెల షెడ్డు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఎకరాలకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీతో పరిహారం ఇస్తేగానీ భూములను వదులుకోలేం. – శ్రీనివాస్రెడ్డి, భూ నిర్వాసిత రైతు. కాన్కుర్తి ఉన్న ఎకరన్నర భూమిని కోల్పోతే.. బతకడం కష్టమవుతుంది. మాది నిరుపేద కుటుంబం, భూమిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే చాలనుకున్నాం. బలవంతంగా భూ సేకరణ చేస్తే ప్రాణాలైనా వదులకుంటాం.. కానీ భూమి వదలం. – భీమప్ప, భూ నిర్వాసిత రైతు, కాన్కుర్తి -
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
పాన్గల్: వ్యవసాయ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించిన రైతులకు సామగ్రి అందించే విషయంలో ఇబ్బందులకు గురి చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని దావాజిపల్లిలో రూ.1.97 కోట్లతో నిర్మించే 33 కేవీ సబ్స్టేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో సబ్స్టేషన్లు నిర్మిస్తుందన్నారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో దావాజిపల్లి, దొండాయిపల్లి, దొండాయిపల్లితండా, అన్నారం, అన్నారంతండాతో పాటు వనపర్తి మండలం ఖాసీంనగర్, అంజనగిరి గ్రామాల వినియోగదారులకు మేలు చేకూరుతుందని తెలిపారు. రైతులు డీడీలు చెల్లించిన 60 రోజుల్లో కనెక్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను కాంట్రాక్టరే నిర్మించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని.. అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేద లబ్ధిదారులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దావాజిపల్లి – ఖాసీంనగర్ మట్టి రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మంత్రి దృష్టికి తీసుకురాగా మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశాలు నిర్వహించి సమస్యలను గుర్తించాలన్నారు. ● సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీశాఖ అధికారులు తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ మండలంలోని కిష్టాపూర్తండా గిరిజన రైతులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. గోప్లాపూర్ స్టేజీ సమీపంలో మంత్రి కాన్వాయ్ను నిలిపి సమస్యను మంత్రికి విన్నవించారు. మంత్రి సమస్యలను సానుకూలంగా విని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మండలంలో ఏర్పాటు చేసే గురుకుల పాఠశాలకు కేతేపల్లి సమీపంలో ప్రభుత్వ భూమిని మంత్రి పరిశీలించి రైతులు సాగు చేస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. పాఠశాల నిర్మాణానికి సరిపడా స్థలం అందుబాటులో ఉందా, అనువైన ప్రాంతమా కాదా అనే విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విద్యుత్శాఖ ఏస్ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాస్, ఏడీఏ రాజయ్యగౌడ్, ఏఈ చందన్కుమార్రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, కాంగ్రెస్ నాయకులు రవికుమార్, వెంకటేష్నాయుడు, మధుసూదన్రెడ్డి, రాముయాదవ్, వెంకటయ్యయాదవ్,ఠాకూర్నాయక్, లోక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి..
బుద్దారం చెరువును రిజర్వాయర్గా మారుస్తామని చెప్పారు. కొందరు రైతులకు మాత్రమే డబ్బులు వచ్చాయి. పనులు ప్రారంభించినా.. నెమ్మదిగా సాగుతున్నాయి. వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలి. భూములు కోల్పోయే రైతులకు డబ్బులు త్వరగా చెల్లించాలి. – మైబూస్, రైతు, బుద్దారం గ్రామం గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పనులు నెమ్మదించాయి. రెండో విడతలో రైతులకు రావాల్సిన డబ్బులు త్వరలోనే వస్తాయి. ఇప్పటికే సర్వే పూర్తయింది. రిజర్వాయర్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుబాటులోకి వస్తే రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. – గఫార్, డీఈ, నీటిపారుదలశాఖ ● -
ఇదీ పరిస్థితి..
బుద్దారం పెద్దచెరువును రూ.22 కోట్లతో 0.098 టీఎంసీ నీటినిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి పనులు ప్రారంభించింది. ఈ రిజర్వాయర్కు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–8 కాల్వ 16.5 కిలోమీటర్ల వద్ద అల్లీపూర్ సమీపం నుంచి రిజర్వాయర్కు నీరు వస్తోంది. బండ్ నిర్మాణానికి 11.57 ఎకరాల భూ సేకరణ చేపట్టగా.. ప్రస్తుతం ఉన్న కట్టను ఆరు మీటర్లు వెడల్పు, కిలోమీటర్ పొడవు నిర్మించనున్నారు. అలాగే 96 ఎకరాలు సేకరించి భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.12.15 లక్షల చొప్పున ఇప్పటికే రైతులకు పరిహారం అందించారు. రిజర్వాయర్కు మరో 101 ఎకరాలు అవసరం కాగా.. ఇందుకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం పీఎన్ (ప్రిలిమినరీ నోటిఫికేషన్) పెండింగ్లో ఉంది. రూ.18 కోట్లతో 26 కిలోమీటర్ల పొడవునా కుడి కాల్వ నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 14 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సుమారు నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. నిర్మాణం పూర్తయితే 20 వేల ఎకరాలకు అందనుంది. అలాగే ఎడమ కాల్వ 9 కిలోమీటర్లు కాగా ఇప్పటికే నిర్మాణం పూర్తయి పది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. -
నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి : ఎస్పీ
వనపర్తి రూరల్: పోలీస్ పెట్రోల్ బంక్ నిర్మాణంలో నాణ్యత పాటించాలని.. రాజీ పడొద్దని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ కాంట్రాక్టర్కు సూచించారు. మండలంలోని రాజాపేట శివారు గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల పక్కన నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినియోగంలోకి వస్తే వినియోగదారులకు నాణ్యమైన ఇందనం అందుతుందని, పోలీస్శాఖ పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఆయన వెంట ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సైట్ ఇంజినీర్ నరేష్, ఏఆర్ ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కల్యాణలక్ష్మి పేదలకు వరం : ఎమ్మెల్యేకొత్తకోట రూరల్/గోపాల్పేట: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెద్దమందడిలోని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో 35 మందికి, గోపాల్పేటలో 52 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పెద్దమందడిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటస్వామి, తిరుపతిరెడ్డి, టైలర్ రవి, గోపాల్పేటలో జరిగిన ఉమ్మడి మండలాల ఇన్చార్జ్ సత్యశిలారెడ్డి, రేవల్లి మండల అధ్యక్షుడు పర్వతాలు పాల్గొన్నారు.‘1న కలెక్టరేట్ ముట్టడి’వనపర్తిటౌన్: స్థానిక సమస్యల పరిష్కారానికిగాను సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన పదాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు హేమారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్దిరాజు, నాయకులు శ్రీనివాస్గౌడ్, కల్పన, బండారు కుమారస్వామి, బాశెట్టి శ్రీను, శివారెడ్డి, రాఘవేందర్, గోర్ల బాబురావు పాల్గొన్నారు. -
తప్పులు లేని ఓటరు జాబితా రూపొందిద్దాం
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకుగాను తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల జిల్లాస్థాయి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామపంచాయతీలో ముసాయిదా ఓటరు జాబితా, వార్డుల వివరాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రదర్శించామని, క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలుంటే మండల అభివృద్ధి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలన్నారు. శనివారం మండలస్థాయిలో సైతం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని చెప్పారు. మరణించిన వారి పేర్లు సైతం జాబితాలో ఉన్నాయని.. వాటిని తొలగించాలని పలువురు తెలిపారు. స్పందించిన కలెక్టర్ గుర్తించిన పేర్లను ఎంపీడీఓలకు ఇవ్వాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీపీఓ రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
వీడని యూరియా కష్టాలు
ఆత్మకూర్/ఖిల్లాఘనపురం: యూరియా కోసం జిల్లా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆత్మకూర్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు పట్టణంలోని పీఏసీఎస్ వద్దకు గురువారం తెల్లవారుజామున చేరుకొని చెప్పులను వరుసలో ఉంచి పడిగాపులు పడటం కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 300 సంచులు రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి రైతులను వరుసలో నిల్చోబెట్టి సాయంత్రం వరకు పంపిణీ చేశారు. 248 మంది అందగా.. మిగిలిన 96 మందికి శుక్రవారం పంపిణీ చేస్తామని ఏఓ వినయ్కుమార్, సీఈఓ నరేష్ వివరించారు. ● ఖిల్లాఘనపురం మండలంలోని సింగిల్విండోకు 300 బస్తాలు, పట్టణంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి 300 బస్తాల యూరియా బుధవారం వచ్చింది. గురువారం పంపిణీ చేస్తారని తెలియడంతో రైతులు ఉదయమే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది ఒక్కో రైతుకు రెండు చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇప్పటి వరకు 37,600 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేశామని ఏఓ తెలిపారు. -
వసతులున్నా.. ఆటలు అంతంతే..!
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో క్రీడారంగాన్ని కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అన్ని జిల్లాల్లో మైదానాలు ఉన్నప్పటికీ కోచ్లు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణకు దూరమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు తమకున్న ఆసక్తితో క్రీడాకారులకు స్వచ్ఛందంగా శిక్షణనిస్తున్నారు. కాని కోచ్లు లేకపోవడంతో చాలా క్రీడల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు వెనుకబడుతున్నారు.● మహబూబ్నగర్లోని ప్రధాన స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికం. ఇంత గతంలో కోచ్లతో కళకళలాడిన ఈ స్టేడియం ప్రస్తుతం నలుగురు కోచ్లతోనే నెట్టుకొస్తున్నారు. 18 ఏళ్లుగా కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేవలం అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్విమ్మింగ్ కోచ్లు మాత్రమే ఉన్నారు. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ కోచ్ శిక్షణ ఇస్తారు. ఖేలో ఇండియా ఫుట్బాల్ కోచ్ ఉండగా ఇండోర్ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో బ్యా డ్మింటన్ కోచ్ మాత్రమే ఉన్నారు. మిగతా క్రీడలకు శిక్షకులు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు నిరాశకు గురవుతున్నారు. కబడ్డీ, హాకీ, ఖో–ఖో, హ్యాండ్బాల్, ఇండోర్లో బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నీస్ తదితర క్రీడలకు కోచ్ల అవసరం ఉంది.● 2007 నుంచి స్టేడియంలలో శాశ్వత పద్ధతిన కోచ్ల నియామకం చేపట్టలేదు. ఇప్పుడున్న కోచ్లు కూడా తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా యువజన, క్రీడాశాఖ పరిధిలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంతో పాటు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాలలోని ఇండోర్ స్టేడియం, జడ్చర్లలోని మినీ స్టేడియం, సీసీకుంట అల్లీపూర్, భూత్పూర్ మండలం పోతులమడుగులో మినీ ఇండోర్ స్టేడియంలు ఉన్నాయి. మెయిన్ స్టేడియంలో ఐదుగురు, అల్లీపూర్లో కబడ్డీ కోచ్ మాత్రమే ఉన్నారు.● వనపర్తిలో ఒక క్రీడా ప్రాంగణం, మరో ఇండోర్ స్టేడియం ఉండగా ఒక్క కోచ్ కూడా లేరు. హాకీ అకాడమీలో ఇద్దరు కోచ్లు ఉన్నారు.● నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేటలో మినీ స్టేడియంలు, కల్వకుర్తిలో ఇండోర్ స్టేడి యం ఉన్నాయి. కొల్లాపూర్కు ఇటీవల అథ్లెటిక్స్ కోచ్ రాగా కల్వకుర్తిలో ఫుట్బాల్ కోచ్, ఖేలో ఇండియా కబడ్డీ కోచ్ ఉన్నారు.● నారాయణపేట జిల్లా మక్తల్లో స్టేడియం ఉండ గా ఒక్క కోచ్ లేరు. ధన్వాడలో ఒక రెజ్లింగ్ కోచ్, నారాయణపేటలో ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ ఉన్నారు.● గద్వాలలో స్టేడియం, ఇండోర్ స్టేడియం, ఎర్రవల్లి చౌరస్తాలో ఇండోర్ స్టేడియం ఉన్నాయి. గద్వాలలో ఖేలో ఇండియా ఫుట్బాల్ కోచ్ మాత్రమే ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని చాలా మైదానాల్లో వాచ్మెన్లు కూడా లేని పరిస్థితి నెలకొంది.ప్రధాన స్టేడియంలో 1997 నుంచి 2006 వరకు రవికుమార్ హ్యాండ్బాల్ కోచ్గా పనిచేసినప్పుడు ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అనంతరం నేను 2009 వరకు కోచ్గా పనిచేసి అనివార్య కారణాలతో మానేశాను. తర్వాత కోచ్ నియామకం చేపట్టలేదు. అయినా క్రీడపై ఉన్న ఆసక్తితో ఇప్పటికీ శిక్షణనిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాశ్వత పద్ధతిన కోచ్ను నియమిస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు. – ఎండీ జియావుద్దీన్, సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు, మహబూబ్నగర్ప్రతిపాదనలు పంపించాం..కోచ్ల నియామకంపై ఇదివరకే ప్రతిపాదనలు పంపించాం. నూతన క్రీ డాపాలసీతో ఔత్సాహిక క్రీడాకారులకు మేలు జరగనుంది. స్టేడియంలలో కోచ్ల నియామకం జరిగే అవకాశం ఉంది. క్రీడా శిక్షణతో నైపుణ్యంగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. గ్రామీణస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేసుకోవచ్చు.– ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ -
పాలకవర్గాలు లేకనే..
పాలకవర్గాలు లేకపోవడంతోనే గ్రామపంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలకవర్గాలు కొలువుదీరితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రాంట్స్ విడుదల అవుతాయి. ఎన్నికల ప్రక్రియపై ఈసీ నుంచి కదలిక ప్రారంభమైంది. రెండు విడుతల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. నిర్వహణకు అవసరమయ్యే సిబ్బందిని ఎంపిక చేస్తున్నాం. త్వరలోనే శిక్షణ కార్యక్రమం ఉంటుంది. – రఽఘునాథ్రెడ్డి, ఇన్చార్జ్ డీపీఓ, వనపర్తి ● -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
వనపర్తి: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి ప్రతిమలను ఏర్పాటుచేసి పూజిద్దామని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి ప్రతిమల పంపిణీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పండుగలు, పర్వదినాలు ప్రజలు తమ కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఏర్పాటు చేసుకున్నవని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరస్పరం ప్రేమపూర్వకంగా జరుపుకోవాలనేది ప్రధాన ఉద్దేశమన్నారు. సమాజంలో కొన్ని పండుగలు ఇతరులకు ఇబ్బందులు కలిగించడమేగాక పర్యావరణానికి కూడా విఘాతం కలిగిస్తున్నాయని.. అలాంటి వాటిని నియంత్రించకపోతే మనకేగాక రానున్న తరాలపై కూడా దుష్ప్రభావం చూపుతాయని వివరించారు. కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, డీసీఆర్బీ ఎస్ఐలు తిరుపతిరెడ్డి, బాలయ్య, రిజర్వ్ ఎస్ఐ వినోద్, ట్రాఫిక్ రిజర్వ్ ఎస్ఐ సురేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థులకు అస్వస్థత ...
కొత్తకోట రూరల్/కొత్తకోట: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఒకేసారి చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యసిబ్బంది అక్కడికి చేరుకొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చాలామంది అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు వంటి లక్షణాలకు గురయ్యారని తెలిపారు. తమ పిల్లలను ఇంటికి పంపించాలని కోరినా వదలడం లేదని.. జ్వరంతో బాధపడుతూ ఇక్కడే ఉండాలంటూ ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక విద్యార్థి సంఘాల నాయకులు వసతి గృహం ఎదుట బైఠాయించి ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు వచ్చి విద్యార్థినుల ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. వైద్యులు పరీక్షించి అవసరమైన మందులు ఇచ్చారని సమాధానమిచ్చారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా కుటుంబ సభ్యుల వెంట పంపాలని ప్రిన్సిపాల్కు సూచించారు. వసతి గృహం చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని కోరారు. నిరసన కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, సీడీసీ మాజీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి, గాడీల ప్రశాంత్, అయ్యన్న, మాజీ కౌన్సిలర్ చీర్ల నాగన్న, కె.శ్రీనివాస్జీ, కిరణ్, ఏసు, యుగంధర్రెడ్డి, బుచ్చన్న పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ సందర్శన..కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. శ్రీనివాసులు గురువారం సాయంత్రం గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, ఆహారం అందించడాన్ని పరిశీలించారు. వైద్య పరీక్షల్లో ఇద్దరికి టైఫాయిడ్ నిర్ధారణ కాగా.. చికిత్స అనంతరం తిరిగి తరగతులకు పంపించినట్టు డీఎంహెచ్ఓ వివరించారు. 22 మంది విద్యార్థులు వైరల్ జ్వరాలతో బాధపడుతుండగా.. చికిత్స అందించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని.. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.సీపీఎస్ రద్దే లక్ష్యం : ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డికొత్తకోట: కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దే లక్ష్యంగా పీఆర్టీయూ పని చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం పట్టణంలో సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ధర్నాకు ఉపాధ్యాయులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పులగం దామోదర్రెడ్డి, గుండు లక్ష్మణ్, పేరి వెంకట్రెడ్డి, సూర చంద్రశేఖర్, భక్తరాజు, సత్యనారాయణ, ఎస్.గోపాల్, ఎస్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.‘ప్రజా ఉద్యమాల్లోభాగస్వాములు కావాలి’పాన్గల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి సీపీఎం నిర్వహించే ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ పిలుపునిచ్చారు. బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరుల దినోత్సవంలో భాగంగా గురువారం మండలంలోని రేమద్దులలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంస్మరణ సభలో మాట్లాడారు. నాడు జరిగిన విద్యుత్ ఉద్యమంలో ముగ్గురు పోలీసుల కాల్పుల్లో మరణించారని.. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకపోయాయని తెలిపారు. -
భూ సేకరణ త్వరగా పూర్తి చేయండి
వనపర్తి: జిల్లాలోని అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందించేలా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ కాల్వ పనులు త్వరగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ప్రత్యేక ఉప కలెక్టర్ (భూ సేకరణ), ఇరిగేషన్, సర్వే అధికారులతో పెండింగ్ భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. కేఎల్ఐకు సంబంధించిన కాల్వలు, రిజర్వాయర్ల భూ సేకరణ పూర్తిచేసి ఇరిగేషన్శాఖకు అప్పగిస్తే పనులు త్వరగా పూర్తయి రైతులకు సాగునీరు అందుతుందన్నారు. గోపాల్పేట మండలం జయన్న తిర్మలాపూర్ ప్రాంతానికి చెందిన 12.95 ఎకరాల భూ సేకరణకు సర్వే పూర్తయినందున మార్కెట్ విలువ నిర్ధారించి అవార్డు పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెప్టెంబర్ 15 వరకు ప్రాథమిక నోటీసు ప్రచురించేలా చూడాలని సూచించారు. రేవల్లి మండలం కేశంపేట పరిధిలోని 29.94 ఎకరాలకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయించాలన్నారు. రేమద్దుల పరిధిలోని డి–8 భూ సేకరణకు సంబంధించి ఇరిగేషన్ ఇంజినీర్లు పెగ్ మార్కింగ్ ఇవ్వాలన్నారు. దత్తాయిపల్లి, బుద్ధారం, షాపూర్, మల్కాపూర్ పరిధిలోని భూ సేకరణకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే చేస్తూ మిషన్ భగీరథ, ఉద్యానశాఖ అధికారులతో బోర్లు, వృక్షాల నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా బుద్ధారం పరిధిలోని 109.17 ఎకరాల్లో ఉన్న స్ట్రక్చర్ పేమెంట్ పూర్తిచేసి స్థలాన్ని ఇరిగేషన్శాఖకు అప్పగించాలన్నారు. ఖిల్లాఘనపురం మండలంలోని గణప సముద్రం ఎఫ్ఆర్ఎల్కు సంబంధించిన 197.09 ఎకరాల ఎంజాయ్మెంట్ సర్వే త్వరగా పూర్తి చేయాలని సర్వే అధికారిని ఆదేశించారు. కాం చెరువు, చందాపూర్, సవాయిగూడెం, పెద్దగూడెం గ్రామాలకు సంబంధించిన భూ సేకరణ నివేదిక అటవీశాఖకు సంబంధించిన పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిందిగా సూచించారు. సమీక్షలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్శాఖ ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ కేశవరావు, ఏడీ మధుసూదన్, సర్వే ల్యాండ్ బాలకృష్ణ, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మధు, గోకుల్ దాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
భూమిని వెనక్కి తీసుకుంటాం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం అధికారులు 500 గజాల భూమి కేటాయించడం, ట్రాన్స్కో అధికారులు కేటాయించిన దాని కంటే ఎక్కువ భూమిని చదును చేయడంతో వివాదం నెలకొంది. ఈ విషయమై ‘సాక్షిశ్రీలో మంగళవారం ‘పీయూలో సబ్స్టేషన్ వివాదం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై మంగళవారం ఉదయం విద్యార్థి సంఘాల నాయకులు పీయూ ముఖద్వారం వద్ద గంటసేపు నిరసన చేపట్టారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే భూములను వెనక్కి తీసుకోవాలని, ట్రాన్స్కో అధికారులు కట్టిన ప్రహరీని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కేటాయించిన భూమి కంటే ఎక్కువ వినియోగించుకుంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు వైస్ చాన్స్లర్ నుంచి స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టి అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించారు. రిజిస్ట్రార్ రమేష్బాబు కూడా విద్యార్థి సంఘాల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా వినిపించుకోలేదు. దీంతో వీసీ శ్రీనివాస్ బయటకు వచ్చి విద్యార్థులకు వివరణ ఇచ్చారు. కేటాయించిన భూమికంటే ఎక్కువ భూమిని వారు చదును చేశారని తెలిసిన వెంటనే నోటీసులు ఇచ్చామని, దీనికి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఎక్కువగా వినియోగించిన భూమిని తిరిగి తీసుకుంటామని, కేటాయించిన భూమి వరకు హద్దులు నిర్ణయిస్తామని వీసీ పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్ దగ్గరకు వెళ్లి ఎక్కడి వరకు భూమి కేటాయించారు.. ఎక్కడి వరకు చదును చేశారు.. అని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, ఆయా సంఘాల నాయకులు కార్తిక్, రాము, గణేష్, తాయప్ప, రాజేష్, శ్రీను, ఆంజనేయులు, శివ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు యూరియా సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టిసారించి నిశితంగా పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో జిల్లాల వారీగా యూరియా లభ్యత, సరఫరా, ఇండెంట్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎరువులు, యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరిగినా.. దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా సదరు డీలర్లపై కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా పంపిణీ జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, వాస్తవంగా కేంద్రం నుంచి 9 లక్షల మె.ట., యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.72 మె.ట., మాత్రమే వచ్చిందని ఇంకా సుమారు 3 లక్షల మె.ట., రావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రైవేటు షాపులలో ఎక్కువ రేటుకు విక్రయిస్తూ ఇతర అనవసరమైన ఎరువులు అంటగడుతున్నారని, అలాంటి వాటిని సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ప్రతి ఎరువుల షాప్, పీఏసీఎస్, ఆగ్రో సేవా కేంద్రాలు, ఒక్కొక్క షాప్ వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించేలా చూడాలన్నారు. నానో యూరి యా వాడకం– ప్రయోజనాల గురించి కూడా వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలని సూచించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు విజయేందిర, సిక్తాపట్నాయక్, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్, ఆయా జిల్లాల ఎస్పీలు జానకి, ఎస్పీ యోగేష్ గౌతమ్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రావుల గిరిధర్, శ్రీనివాస్రావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధిక ధరలకు అమ్మినా డీలర్పై కేసుల నమోదు విక్రయాలపై కలెక్టర్లు, ఎస్పీలు నిశితంగా పర్యవేక్షించాలి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం మహబూబ్నగర్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం -
జై జై గణేశా..
నేటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ● వాడవాడలా ముస్తాబైన మండపాలు ● గ్రామాలకు తరలుతున్న లంబోదరుడు ● సందడిగా మారిన పూజాసామగ్రి దుకాణాలు బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025–10లో uసీజనల్ వ్యాధులతో జాగ్రత్త వనపర్తి రూరల్: సీజనల్ వ్యాధుల బారినపడకుండా అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో జరిగిన ప్రసవాలు, సిబ్బంది పనితీరు, మందుల నిల్వ, ఓపీ రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున గ్రామాల్లో శానిటేషన్, క్లోరినేషన్పై ప్రత్యేక దృష్టిసారించాలని.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. డీఎంహెచ్ఓ వెంట డా.చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, సిబ్బంది రాజేశ్గౌడ్, కృష్ణ, విజయలక్ష్మి, కుమారి, రాజు ఉన్నారు. జెన్కోలో ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడలు ఆత్మకూర్: ఎగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జెన్కో రాష్ట్రస్థాయి క్యారం, చెస్ పోటీలు మంగళవారం ముగిశాయి. క్యారమ్స్లో మొదటి బహుమతిని యాదాద్రి జట్టు కై వసం చేసుకోగా, చెస్లో కాకతీయ థర్మల్ కేంద్రం జట్టు కై వసం చేసుకుంది. విజేతలకు జెన్కో ఎస్ఈలు శ్రీధర్, సురేష్ బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో కొత్తగూడెం తర్మల్ కేంద్రం, శ్రీశైలం, జూరాల, భద్రాద్రి, విద్యుత్సౌథ, యాదాద్రి, పులిచింతల, కాకతీయ ప్రాజెక్టులకు చెందిన 60 మంది ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పథకాల పేరుతో కాంగ్రెస్ మోసం వనపర్తిటౌన్: పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లు పెంచాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వనపర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వృద్ధాప్య పింఛన్ రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్ రూ. 6వేలకు పెంచాలని, యూత్ డిక్లరేషన్ ప్రకారం రూ. 4,016 నిరుద్యోగ భృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, నాయకులు శ్రీశైలం, వెంకటేశ్వర్రెడ్డి, సీతారాములు, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్రెడ్డి, పెద్ది రాజు, శ్రీనివాస్గౌడ్, వారణాసి కల్పన, బాబురావు, మురారి నాయక్, సరోజ పాల్గొన్నారు. పోలీసుల సూచనలు పాటించాలి : ఎస్పీ గణేశ్ ఉత్సవ కమిటీల సభ్యులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేశ్ మండపాలను విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ఫార్మర్లకు దగ్గరగా ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల్లో ఈఎల్సీబీ, అవసరమైన చోట ఎంసీబీఎస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వైరింగ్ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషన్తోనే చేయించుకోవాలని తెలిపారు. వైరింగ్లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నారు. సర్వీస్ కేబుల్స్ హుకింగ్ చేయరాదన్నారు. వైర్లు నేలపై వేయరాదని.. సరైన ఎర్తింగ్తో 3 పిన్ ప్లగ్లు ఉపయోగించాలని సూచించారు. మండపాల నిర్మాణంలో ఇనుప పైపులు వాడితే.. వాటిని తప్పక ఇన్సులేషన్ పదార్థంతో కవర్ చేయాలన్నారు. సర్వీస్ వైరు విద్యుత్ స్తంభానికి అమర్చిన తర్వాత సంబంధిత లైన్మేన్ లేదా జేఎల్ఎం అనుమతి లేకుండా మార్పులు చేయరాదన్నారు. ఇన్వర్టర్ లేదా జనరేటర్ వాడితే రిటర్న్ కరెంట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వనపర్తిటౌన్: విఘ్నేశ్వరుడి పూజకు వేళైంది. వాడవాడలా లంబోదరుడిని కొలువుదీర్చేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని బుధవారం గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఇప్పటికే మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి వినాయక మండపం నుంచి 20–60 అడుగుల వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లా కేంద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ముఖద్వారం వద్ద గణేశ్ మండపాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. అదే విధంగా చింతల హనుమాన్, కన్యకా పరమేశ్వరి, రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రతి ఏటా ప్రతిష్ఠించే గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టీచర్స్ కాలనీ, వెంగళ్రావునగర్, శాంతినగర్, పీర్లగుట్ట, బ్రాహ్మణవీధి, బ్రహ్మంగారి వీధి, పాతబజార్, జమ్మిచెట్టు, 40 ఫీట్ల రోడ్డు, రాంనగర్, చందాపూర్ రోడ్డు, వల్లబ్నగర్, బండారునగర్, శ్వేతానగర్, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో 3–4 గణనాథులను కొలువుదీర్చేందుకు సర్వం సిద్ధం చేశారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలను నిర్వాహకుల అనుకూలత మేరకు ఉదయం నుంచి రాత్రి పది గంటలలోగా పూర్తిచేస్తారు. మార్కెట్ కిటకిట వినాయక చవితి సందర్భంగా మంగళవారం మార్కెట్ కిటకిటలాడింది. వినాయకుడి పూజకు అవసరమైన సామగ్రి, పూలు, పండ్ల కొనుగోలుతో పాటు అలంకరణ వస్తువుల కోసం ఉత్సవ కమిటీల సభ్యులు సంబంధిత దుకాణాలకు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. లంబోధరుడు కొలువుదీరేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో స్టేజ్ నిర్మాణం, మండపాల అలంకరణ తదితర ఏర్పాట్లలో నిర్వాహకులు తలమునకలయ్యారు. జిల్లా కేంద్రంలోని గ్రీన్ పార్కులో సుందరంగా ముస్తాబైన గణనాథుడి మండపం మట్టి గణపతులతో పర్యావరణాన్ని కాపాడుదాం వనపర్తి: పర్యావరణ హితమై ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కాకుండా మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారుచేసిన విగ్రహాలతో నీరు కాలుష్యమై పర్యావరణానికి హాని కలిగిస్తుందన్నారు. మట్టి విగ్రహాలను నెలకొల్పి పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినవారవుతారన్నారు. బీసీ సంక్షేమశాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా ప్రజలకు 2వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఏఈఎస్ సురేశ్, ఏఓ భానుప్రకాశ్, బీసీ సంక్షేమశాఖ సూపరింటెండెంట్ ప్రభాకర్ పాల్గొన్నారు. వేకువజామున 5గంటలకే క్యూ.. యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. మంగళవారం అమరచింతలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు వేకువజామున 5 గంటల నుంచే క్యూ కట్టారు. మస్తీపురం, పాంరెడ్డిపల్లె, అమరచింత గ్రామాలకు చెందిన రైతులు రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. సాయంత్రం వరకు 300 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. – అమరచింత -
రోజువారీగా యూరియా వివరాలు ఇవ్వండి
● ప్రైవేటు డీలర్లతో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: జిల్లాలో యూరియా విక్రయాలకు సంబంధించి రోజువారీగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం యూరియా విక్రయాలపై వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా విక్రయాల విషయంలో మండల వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువుల డీలర్ల వద్ద భారీగా యూరియా స్టాక్ ఉందని.. విక్రయాలను పర్యవేక్షించేందుకు ఒక ఏఈఓను కేటాయించాలని సూచించారు. ప్రైవేటు డీలర్లతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఏసీఎస్ల్లో స్టాక్ అందుబాటులో లేకపోతే, స్టాక్ అధికంగా ఉన్న ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల వివరాలతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ● త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శించాలని.. జిల్లా స్థాయిలో 29న, మండల స్థాయిలో 30న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు స్వీకరించాలని తెలిపారు. ● జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని.. శ్యామ్, మ్యామ్ పిల్లల సంఖ్య జీరో ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మూడు నెలల్లో 25 మంది బాలికలకు వివాహాలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని.. వాటిని ముందుగానే తెలుసుకొని నివారించి కొందరిపై కేసులు నమోదు చేయించినట్లు డీసీపీఓ రాంబాబు తెలిపారు. కాగా, వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను ఎన్ఆర్సీ సెంటర్కు తీసుకెళ్లి వైద్యం చేయించడంతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ● ప్రభుత్వ ఆస్పత్రులకు ఏ విధమైన జ్వరం కేసు వచ్చినా డెంగీ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ అధికారులతో డెంగీ సహా సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో యాంటీ లార్వా కార్యక్రమం చేపట్టాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లో టీబీ స్క్రీనింగ్ పెంచాలన్నారు. మిషన్ మధుమేహలో భాగంగా డయాబెటీస్ తేలిన వారికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అప్డేట్ చేయాలన్నారు. మెరుగైన వైద్యం అందించాలి కొత్తకోట: రపభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగీ, ఇతర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యసిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్రెడ్డి ఉన్నారు. -
ముఖ గుర్తింపుతో సామాజిక పింఛన్లు
● 165 జీపీల్లో పోస్టల్ సిబ్బందిచే పంపిణీ ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: జిల్లాలో గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా అందించే సామాజిక పింఛన్లు ఇక నుంచి లబ్ధిదారుల ముఖ గుర్తింపుతో ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో పోస్టల్ సిబ్బందికి 74 సెల్ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత తదితర సామాజిక పింఛన్లు 71వేల మందికి పైగా లబ్ధిదారులు పొందుతున్నట్లు తెలిపారు. వీరిలో దాదాపు 50శాతం మందికి ప్రతినెలా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండగా.. మిగతా 32వేల మంది పింఛన్దారులు 165 జీపీల్లో పోస్టాల్ సిబ్బందిచే పింఛన్లు పొందుతున్నారన్నారు. ఆయా జీపీల్లో కొందరు పింఛన్దారులకు ఆధార్ కార్డు ప్రకారం వెలిముద్రల గుర్తింపు జరగక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇక నుంచి సెల్ఫోన్లో ముఖచిత్ర గుర్తింపు ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ప్రభాకర్ పాల్గొన్నారు. ● జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట వద్ద రూ. 1.25 కోట్లతో చేపట్టిన కళాశాల బాలికల వసతిగృహ నిర్మాణ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. వసతిగృహ నిర్మాణ పనులను నవంబర్లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మొత్తం 120మంది విద్యార్థులు వసతి ఉండే విధంగా భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసులు, ఆర్ఐ మధు ఉన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి.. వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 45 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు. -
పీయూలో ‘సబ్స్టేషన్’ వివాదం..!
పాలమూరు యూనివర్సిటీలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. తాము 500 గజాల భూమిని కేటాయించామని పీయూ అధికారులు.. తమకు ఒక ఎకరా భూమిని కేటాయించారని ట్రాన్స్కో అధికారులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. తాజాగా ఎకరంన్నర భూమిని చదును చేయడంపై అటు పీయూ అధికారులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులకు బాసటగా నిలిచే పీయూకు నూతన హాస్టల్స్, ల్యాబ్స్, తదితర వాటి ఏర్పాటు నేపథ్యంలో మరింత భూమి సమకూర్చాల్సింది పోయి..ఉన్న భూమిని వేరే వాటికి కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క గజం ఎక్కువ తీసుకోం.. పీయూలో సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఒక ఎకరా భూమిని కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ భూమిని చదును చేశాం. ఎకరం కంటే ఎక్కువ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోం. – సుదీర్రెడ్డి, ఈఈ, ట్రాన్స్కో లేఖ రాశాం పీయూలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు కేవలం 500 గజాల భూమిని మాత్రమే కేటాయించాం. వారు ఎక్కువ భూమిని చదును చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సదరు డిపార్ట్మెంట్ వారికి లేఖ సైతం రాశాం. ఎక్కువ భూమిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. – శ్రీనివాస్, పీయూ వైస్చాన్స్లర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బండమీదిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలకు నాణ్యమైన విద్యుత్ను అందజేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలం కోసం వెతికారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీయూలో పీజీ కళాశాల పక్కన..రాయచూర్ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతితో విద్యుత్శాఖకు 500 గజాల భూమిని కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారు. సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా పనులు సైతం ప్రారంభించారు. అయితే, వారికి కేటాయించిన భూమికి మించి ఎక్కువ భూమిని చదును చేసుకుని వినియోగిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తాము కేవలం 500 గజాలు ఇచ్చామని పీయూ అధికారులు పేర్కొంటుంటే, విద్యుత్ శాఖ తమకు ఒక ఎకరా భూమి కేటాయించారని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఎకరంన్నర భూమిని చదును చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఎక్కువ భూమిని ఎలా చదును చేసి వినియోగిస్తారంటూ ఇటీవల పీయూ వీసీ శ్రీనివాస్.. ట్రాన్స్కో అధికారులకు లేఖ రాశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. రోడ్డు విస్తరణ పనుల్లో మరింత భూమి.. పీయూకు ఆనుకుని ఉన్న వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సుమారు 20 ఎకరాల భూమిని పీయూకు అధికారులు బదిలీ చేశారు. ఇందుకు 2019లో కలెక్టర్ రొనాల్డ్రోస్, వీసీ రాజతర్నం ఎంతో కృషి చేశారు. అయితే, గతేడాది భూత్పూర్– చించోలి రోడ్డు పనులు ప్రారంభం కాగా.. పీయూకు చెందిన భూమి సైతం పోయింది. పీయూ కాంపౌండ్ వాల్ను తొలగించి పనులు కొనసాగించారు. ఇటు రోడ్డు విస్తరణ, అటు సబ్స్టేషన్ నిర్మాణం కోసం దాదాపు 5 ఎకరాల వరకు పీయూ భూమిని కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పీయూకు ప్రభుత్వం మరింత భూమిని కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారులు పీయూకు భూమిని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తే.. ప్రస్తుత అధికారులు ఉన్న భూమిని కాపాడే పరిస్థితి లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇకనైన అధికారులు మేల్కొని పీయూ భూములను పరిరక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. 500 గజాలే కేటాయించామని పీయూ అధికారుల స్పష్టం ఎకరా కేటాయించారని విద్యుత్ అధికారుల వాదన అధిక భూసేకరణపై వీసీ లేఖ.. నేటికీ స్పందించని ట్రాన్స్కో పీయూ భూమి కాపాడాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన -
కేజీబీవీల్లో వైద్యశిబిరాలు
ఖిల్లాఘనపురం: మండలంలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఎస్టీ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లతో పాటు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థులు విషజ్వరాల బారినపడి ఇంటిబాట పట్టారు. ఇందుకు సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హాస్టళ్లలో ఫీవర్రీ’ కథనానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. డీఎంహెచ్ఓ డా.శ్రీనివాసులు ఆదేశాల మేరకు సోమవారం రెండు కేజీబీవీల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లిష్ మీడియం కేజీబీవీలో అనారోగ్యంతో బాధపడుతున్న 50మంది విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి.. అవసరమైన మందులు అందజేసినట్లు మండల వైద్యాధికారి ప్రవీణ్కుమార్ తెలిపారు. అదే విధంగా తెలుగు మీడియం కేజీబీవీలో ఆర్బీఎస్కే వైద్యులు స్వప్న, రఘు 60మంది విద్యార్థినులకు చికిత్స అందించారు. 30మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. వైద్యపరీక్షల అనంతరం విద్యార్థినులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫార్మసిస్టు శ్రీవిద్య, ఏఎన్ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఏఐ నిఘా.!
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలపై నజర్ ● అధునాతన సాంకేతికత వినియోగిస్తున్న గృహనిర్మాణశాఖ ● అక్రమార్కులపై కలెక్టర్ కఠిన చర్యలు ● అనర్హులకు ఇళ్ల మంజూరు, పాత నిర్మాణాలకు బిల్లులు చేసిన నలుగురిపై సస్పెన్షన్ వేటు ●జిల్లాకు 6,004 ఇళ్లు మంజూరు.. జిల్లావ్యాప్తంగా 6,004 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రజాపాలన దరఖాస్తుల పూర్తిస్థాయి పరిశీలన, ఇంటింటి సర్వే అనంతరం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో 3,285 ఇళ్లు గ్రౌండింగ్ కాగా.. 2,130 ఇళ్లు మార్కింగ్, 908 బేస్మెట్, 152 ఆర్సీ, 91 రూఫ్ లేవెల్లో ఉన్నాయి. రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అత్యధికంగా జిల్లా కేంద్రంలోనే సుమారు 580 ఇళ్లు మంజూరు చేసినట్లు అధికారిక నివేదికల్లో పేర్కొన్నారు. వనపర్తి: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు గృహనిర్మాణశాఖ అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇటీవల ఏఐ టెక్నాలజీతో వనపర్తి మండలం అప్పాయిపల్లిలో పాత బేస్మెట్కు బిల్లు చేయించినట్లు గుర్తించి.. పంచాయతీ కార్యదర్శి, అసిస్టెంట్ ఇంజినీర్పై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాకు రెండు విడతల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఏఐ నిఘా పటిష్టంగా పనిచేస్తోందనేందుకు అధికారుల సస్పెన్షన్ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. భవిష్యత్లో అన్ని ఇంజినీరింగ్ శాఖలకు ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా తర్ఫీదు.. ఏఐ సాంకేతికతపై ఇటీవల పలువురు కలెక్టర్లకు కేంద్ర సర్వీసులశాఖ ముస్సోరిలో చాంపియన్ ఫర్ డిజిటల్ ఫార్మెషన్పై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సైతం వెళ్లిన విషయం విదితమే. అయితే ట్రైనింగ్కు వెళ్లకముందే.. ఏఐ సాంకేతికత ఆధారంగా ఇద్దరు అధికారులపై ఈ నెల 14న కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. -
ప్రజల దీవెనలతో ప్రజా పాలన
● ‘పనుల జాతర’లో రూ.20,200 కోట్లు ఖర్చు ● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అమ్రాబాద్/వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాలు బాగుండాలని ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించాలని సూచించారు. ఆయా కార్యక్రమంల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా పునరుద్ధరించలే!
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటుచేసుకున్న షార్ట్సర్క్యూట్ కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రమాదం సంభవించిన నాలుగో యూనిట్ను నేటికీ పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. ఇదే తొలి ప్రమాదం.. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గానూ ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకూ ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. ఐదేళ్లుగా సా..గదీత ప్రమాదం జరిగినప్పటి నుంచి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులను చేపట్టినా ఇప్పటి వరకు అధికారులు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్ను పునరుద్ధరణ పనులు రెండేళ్ల కిందట పూర్తిచేసినా, సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. గతేడాది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రం పూర్తి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల సామర్థ్యంతోనే విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. నాలుగో యూనిట్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తేనే గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయమై శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం సీఈ సత్యనారాయణను సంప్రదించగా నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు 24 గంటల పాటు కొనసాగుతున్నాయని, మరో నెల రోజుల్లో విద్యుదుత్పత్తి చేపట్టేలా కృషిచేస్తామన్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధం కాని నాలుగో యూనిట్ 2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి ఏళ్లతరబడిగా సాగుతున్న మరమ్మతు ప్రక్రియ ప్రస్తుతానికి ఐదు యూనిట్లతోనే విద్యుదుత్పత్తి -
రెండు రోజుల్లో 3,900 మె.ట. యూరియా రాక
ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్లోని పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి.. రైతులకు యూరియా పంపిణీపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం నాటికి జిల్లాకు 2,600 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని.. 27న మరో 1,300 మెట్రి క్ టన్నుల యూరియా వస్తుందని వివరించారు. జిల్లాలోని 15 సొసైటీల పరిధిలో గతేడాది 11వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. ఈఏడాది ఇదివరకే 13వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వెల్లడించారు. పీఏసీఎస్ కార్యాలయా ల్లో యూరియా ధర తక్కువగా ఉండటంతో రైతు లు అధికంగా తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1.20కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని.. వర్షాలు సమృద్ధిగా కురియడంతో యూరియా అవసరం పెరిగిందన్నారు. ఒక ఎకరా కు ఒక బస్తా యూరియా వేసినా 1.20 కోట్ల మెట్రిక్ టన్నులు అవసరమవుతుందన్నారు. కొన్ని పంటలకు రెండు లేదా మూడు బస్తాలు వేయాల్సి రావడంతోనే కొరత కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి 8.50లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇదివకు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే కొరత సమస్యే ఉండదన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా ఉన్నారు. -
హాస్టళ్లలో ఫీవర్రీ .!
ఇంటిబాట పట్టిన కేజీబీవీ, వసతిగృహాల విద్యార్థులు ● పాఠశాలల్లో మచ్చుకై నా కనిపించని వైద్యశిబిరాలు ● ఎవరైనా అనారోగ్యం బారినపడితే మందు గోళీలతోనే సరిపెడుతున్న వైనం ● ఇటీవల అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థిని మృతి విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ ఎవరికీ పట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమ పాఠశాల, కేజీబీవీలు, ఎస్సీ హాస్టల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లి మందులు ఇప్పించడం తప్ప.. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించడం లేదని విద్యార్థులే బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల ఖిల్లాఘనపురం కస్తూర్బాగాంధీ తెలుగు మీడియం పాఠశాలలో 11మంది విద్యార్థినులు అనారోగ్యం బారిన పడితే సిబ్బంది స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వైద్యసిబ్బంది ఎలాంటి పరీక్షలు చేయకుండానే.. జ్వరం వచ్చిందని చెప్పి గ్లూకోస్ పెట్టి, కొన్ని మందులు ఇచ్చి పంపారు. అయితే వీరిలో 9వ తరగతి విద్యార్థిని కేతావత్ జ్యోతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మహబూబ్నగర్, హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. తెల్లపసిరికల కారణంగా ఈ నెల 17న మృతిచెందింది. అయితే సదరు విద్యార్థిని తెల్లపసిరికలకు గురైనట్లు ముందుగానే గుర్తించి.. సరైన చికిత్స అందించి ఉంటే ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ చేయొద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఖిల్లాఘనపురం: జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పేదలు తమ పిల్లలను ఎలాగైనా చదివించాలనే సంకల్పంతో ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను సైతం కుటుంబ సభ్యులు కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు అనారోగ్యానికి గురై ఇళ్లకు చేరుకోవడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా మంది విద్యార్థులు విషజ్వరాలకు గురై ఇంటిబాట పడుతున్నారు. ఇళ్ల వద్ద తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడం.. ఇతర కుటుంబ సభ్యులు వారిని ఆర్ఎంపీల వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో వారాల పాటు విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఎక్కడా లేనివిదంగా ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండటంతో పాటు ఎస్టీ ఆశ్రమ పాఠశాల, ఎస్సీ వసతిగృహాలు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం కేజీబీవీలో ఈ సంవత్సరం ఇంటర్ తరగతులను ప్రారంభించారు. రెండు కేజీబీవీలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థినులు చదువుకోవడానికి వస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆయా పాఠశాలలు, ఎస్సీ వసతిగృహంలో మొత్తం 919 మంది విద్యార్థులు చదువుకుంటుండగా.. ఇప్పటి వరకు 269 మంది పలు అనారోగ్య కారణాలతో ఇళ్లకు వెళ్లారు. వారు మళ్లీ ఎప్పుడు పాఠశాలకు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాల విద్యార్థుల ఇళ్లకు సంఖ్య వెళ్లిన వారు కేజీబీవీ తెలుగు మీడియం 207 117 కేజీబీవీ ఇంగ్లిష్ మీడియం 226 36 ఎస్టీ ఆశ్రమ 366 66 ఎస్సీ హాస్టల్ 120 50 మొత్తం 919 269 -
అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
● ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పొరపాట్లు జరిగితే అధికారులదే బాధ్యత ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు బొల్లారంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా రూ. 3.90లక్షలతో చేపట్టనున్న వీపనగండ్ల–బెక్కెం బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వీపనగండ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు 19 కుట్టు మిషన్లు అందజేశారు. ఆ తర్వాత బొల్లారంలో రూ. 20లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రూ. 5లక్షలతో ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి పొరపాట్లు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. గతంలో తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో రూ. 300కోట్లతో సీసీరోడ్లు, రూ. 600కోట్లతో బీటీరోడ్లు నిర్మించినట్లు తెలిపారు. పలు గ్రామాల ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం చిన్నంబావి మండలాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు వైద్య, విద్యరంగాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. వీపనగండ్లలో తన పేరున ఉన్న నాలుగెకరాల భూమిని మినీ స్టేడియం ఏర్పాటు కోసం ఉచితంగా అందజేయడంతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ద్వారా రూ. 3కోట్లతో స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, పీఆర్ ఈఈ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరయ్యయాదవ్, నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య, సుదర్శన్రెడ్డి, రఘునాథ్రెడ్డి, రవీందర్రెడ్డి, గోపి, మహేశ్, బాల్రెడ్డి, గోపాల్నాయక్, రాంరెడ్డి, భరత్రెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యమ నేతకు జోహార్లు
● స్వగ్రామం కంచుపాడులో సురవరం సుధాకర్రెడ్డికి ఘనంగా నివాళి ● నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న గ్రామస్తులు ●సురవరం జీవనం నిరాడంబరంగా సాగింది. పార్టీలో జాతీయస్థాయి పదవితో పాటు ఎంపీగా రెండు పర్యాయలు సేవలందించారు. కానీ సొంతూరికి వచ్చిన సమయాల్లో ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఇంటి వద్ద బయట కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. గ్రామ వీధుల్లో సైతం సాదాసీదాగా తిరుగుతూ అందరిని పలుకరించేవారు. అలంపూర్/ఉండవెల్లి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి (83) మృతితో ఆయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమై శ్రద్ధాంజలి ఘటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. మారుముల గ్రామం నుంచి జాతీయ నేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి చర్చించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. జాతీయ రాజకీయాలను శాసించిన సురవరానికి సొంతూరిపై మమకారం ఎక్కువ. సీపీఐ అగ్రనేతగా ఉన్న సమయంలోనూ తరుచూ వచ్చి వెళ్లేవారు. తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రం నెలకొల్పి యువతులు, మహిళలకు కుట్టు శిక్షణ, యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారు. అలాగే ఏటా సంక్రాంతికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఐసోలేషన్ కిట్స్, నిత్యావసర సరుకులు అందించి ఆసరాగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. సీపీఐ మహాసభలు, యువజన ఉత్సవాలు సురవరం విజ్ఞాన కేంద్రంలోనే నిర్వహించి సొంతూరిపై అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రిని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తూనే సొంత ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకును నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులను ప్రోత్సహించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించారు. -
యూరియా ఇక్కట్లు
సోమశిల వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.68.10 కోట్లు సోమశిలవీఐపీ ఘాట్ రూ.1.60 కోట్లు అమరగిరి ఐలాండ్ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్ట్ వ్యయం రూ.45.84 కోట్లు ఈగలపెంట రివర్ క్రూయిజ్ నోడ్ రూ.7.69 కోట్లు ఈగలపెంట అరైవల్ జోన్, ప్రోమోనోడ్ రూ.8.36 కోట్లు ఈగలపెంట చెంచు మ్యూజియం రూ.3.60 కోట్లు అమరచింత/ఖిల్లాఘనపురం: అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. శనివారం అమరచింత ఆగ్రో రైతు సేవాకేంద్రం వద్ద ఉదయం 6 నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. 300 బస్తాల యూరియా రాగా మస్తీపురం, పాంరెడ్డిపల్లి, అమరచింత రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు చేతబట్టుకొని గంటల తరబడి వేచి ఉండి అతి కష్టం మీద రెండు సంచులు తీసుకెళ్లడం కనిపించింది. బస్తాకు రూ. 265 ఉండగా.. హమాలీ చార్జీలతో కలిపి రూ.285 తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ● ఖిల్లాఘనపురం సింగిల్విండోకు శుక్రవారం రెండు లారీల్లో మొత్తం 600 బస్తాలు, హాకా–1, హాకా–2 దుకాణాలకు 600 బస్తాలు మొత్తం 1,200 బస్తాలు వచ్చింది. శనివారం ఉదయం నుంచే రైతులు బారులు తీరగా.. అంతకుముందే టోకన్లు ఇచ్చిన రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మండలంలో సాగైన పంటలకు 1,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటి వరకు 1,600 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి మల్లయ్య వివరించారు. -
అడిగిన సమాచారం ఇవ్వడం బాధ్యత
వనపర్తి: సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ప్రజలు కోరిన సమాచారం నిర్ణీత గడువులోగా అందించడం అధికారుల బాధ్యతని స.హ. చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యారెడ్డి, వైష్ణవి మెర్ల అన్నారు. శనివారం కలెక్టరేట్లో పీఐఓలకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం, పారదర్శక పాలన అందించడమే సమాచార హక్కు చట్టం (స.హ. చట్టం) ముఖ్య ఉద్దేశమన్నారు. పీఐఓలు, ప్రభుత్వ అధికారులు చాలామంది సమాచారం ఇచ్చేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని.. విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పీఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు, అప్పీలేటు అధికారులు చట్టాన్ని పూర్తిగా చదివి ఆకలింపు చేసుకుంటేనే అర్జీదారులు కోరిన సమాచారం ఎలా ఇవ్వాలి.. తమ దగ్గర లేని సమాచారం ఇతర శాఖల అధికారులకు ఎలా పంపించాలనే విషయంపై అవగాహన వస్తుందని చెప్పారు. ప్రభుత్వ అధికారిక సమాచారం ఏది కోరినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రపంచంలో ఆర్టీఐ చట్టం సుమారు 130 దేశాల్లో అమలవుతుండగా.. అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్న దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు. అధికారులకు చట్టంపై అవగాహన లేకపోవడంతోనే అప్పీలేటు అధికారి, కమిషనరేట్ వరకు అర్జీలు వస్తున్నాయని.. పీఐఓలు ఎప్పటికప్పుడు స్పందించి 30 రోజుల గడువులోగా అర్జీదారుకు సమాచారం ఇవ్వాలని, పౌరుల చేతిలో ఈ చట్టం ఓ ఆయుధంగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని అధికారులు చట్టంపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటేనే అర్జీలు ప్రాథమిక దశలోనే పరిష్కారమవుతాయన్నారు. రెండేళ్లుగా కమిషనర్ల నియామకం లేకపోవడంతో పేరుకుపోయిన అర్జీలను పరిష్కరించేందుకు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు వివరించారు. పీఐఓలు అడిగిన సందేహాలను వారు నివృత్తి చేశారు. ప్రతి కార్యాలయంలో స.హ. చట్టం బోర్డు, అందులో పీఐఓ, ఏపీఐఓ వివరాలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల బాధ్యతను తెలియజేసే 4(1)(బి) తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. జిల్లాలో 83 అప్పీళ్లు పెండింగ్లో ఉండగా.. అందరిని పిలిపించి సంబంధిత శాఖల అధికారులతో సమాచారం ఇప్పించారు. ఇంకా సంతృప్తి చెందని అర్జీదారులకు కోరిన విధంగా 15 రోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. అర్జీదారులకు ఈ విచారణ సంతృప్తినివ్వలేదనే మాటలు వినిపించాయి. అఫిడవిట్ దాఖలు రాకపోవటం శోచనీయం.. విచారణ సమయంలో అందజేయాల్సిన అఫిడవిట్లు సైతం పీఐఓలకు రాయడం రాకపోవడం ఏమిటని కమిషనర్లు విస్మయం వ్యక్తం చేశారు. తమవెంట వచ్చిన సీసీలతో ఎలా రాయాలంటూ గుసగుసలాడుకోవడం పరిశీలించామన్నారు. చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉంటే అఫిడవిట్లతో పాటు పౌరులు కోరిన ప్రతి అర్జీకి సమాచారం నిర్ణీత సమయంలో ఇచ్చేస్తారని తెలిపారు. 18 వేల అప్పీళ్లు పెండింగ్... రాష్ట్రంలో సమాచార హక్కు చట్టానికి మూడున్నర ఏళ్లుగా కమిషనర్ల నియామకం లేకపోవడంతో 18 వేల అప్పీళ్లు పెండింగ్లో ఉండగా.. జిల్లాల పర్యటనలు చేపడుతూ ఇప్పటి వరకు 3,500 పరిష్కరించినట్లు తెలిపారు. విచారణలో విభిన్న అంశాలు వెలుగుచూస్తున్నాయని వారు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా సమాచారం కోరుతూ కొందరు.. అధికారులను ఇరకాటంలో పెట్టేందుకు మరికొందరు అర్జీలు దాఖలు చేసినట్లు గుర్తిస్తున్నామని చెప్పారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సమాచారం ఇవ్వని కేసులు సైతం మా దృష్టికి వచ్చాయన్నారు. పారదర్శకంగా చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. -
సాగులో మెళకువలు చెప్పేవారు..
సురవరం పొలాలను మేమే సాగు చేస్తాం. గ్రామానికి వచ్చినప్పుడు పంటలను తప్పక పరిశీలించేవారు. దిగుబడి, చీడపీడల గురించి అడిగి తెలుసుకొని కొత్త పంటల గురించి వివరించేవారు. అందరికి సహకరిస్తూ సాయంగా ఉండేవారు. – చిన్న కర్రెన్న, కంచుపాడు సురవరం సుధాకర్రెడ్డి గ్రామానికి వచ్చిన సమయాల్లో రాజకీయాల గురించి అడిగి తెలుసుకునే అలవాటు. అలాగే ప్రతి సంక్రాంతికి యు వతను ప్రోత్సహించడానికి క్రీడాపోటీలు నిర్వహించేవారు. తనతోపాటు కూర్చున్న యువకులకు క్రీడలు, జీవితంలో రాణించడం తదితర అనేక అంశాలపై అవగాహన కల్పించేవారు. అందరితో ఎంతో అనోన్యంగా ఉండేవారు. – వీరేష్, మండల అధ్యక్షుడు, ఏఐవైఎఫ్ -
కథ కంచికేనా..?
ఏడురోజుల తర్వాత ధాన్యం లారీని వదిలేసిన అధికారులు ● సింగిల్లైన్ నివేదిక ఇచ్చిన టీఏ ● మిల్లులో లెక్కకు మించి నిల్వల మాటేమిటి? ● నామమాత్రపు జరిమానా విధింపు●వనపర్తి: పెబ్బేరులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం లారీని విచారణ పేరుతో ఏడురోజుల కాలయాపన తర్వాత క్లీన్చిట్ ఇచ్చి నామమాత్రపు జరిమానా విధించి అధికారులు రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. ఒక్కో లోపానికి ఒక్కో కారణం చెబుతూ అన్ని సక్రమంగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు సైతం సంతృప్తి చెందడంతో వదిలేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ గన్నీబ్యాగుల్లో ధాన్యం తరలిస్తున్నారనే విషయంపై ఇదే అధికారులు సీరియస్గా స్పందించి కేసునమోదు చేసిందేలా.. ప్రస్తుతం రేషన్ డీలర్లతో సంచులు కొనుగోలు చేసినట్లు సాకు చూపుతూ సమర్థించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 14 సాయంత్రం అధికారులంతా స్వాతంత్య్ర వేడుకల హడావుడిలో ఉన్న సమయంలో జిల్లాకేంద్రం నుంచి కర్ణాటకకు ధాన్యం లారీలో తరలుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకొని విచారణ నిమిత్తం పౌరసరఫరాలశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. విచారణ పేరుతో ఏడురోజుల పాటు కాలయాపన చేసి తుదకు కథను సుఖాంతం చేశారు. సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం ప్రభుత్వానిదేనా? ఏ రకం? ఏ సీజన్కు సంబంధించి? అనే విషయాలు తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాల టీఏ, హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించి అనాలసిస్ చేయించాల్సి ఉండింది. కాగా స్థానిక టీఏ మాత్రం పట్టుబడిన ధాన్యం బీపీటీ రకమని, సన్నరకం వరి ధాన్యమని సింగిల్లైన్ నివేదిక ఇచ్చి వదిలేశారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు ఈ అంశంలో ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు విముఖత చూపడం గమనార్హం. పట్టుబడిన ధాన్యానికి సంబంధించిన రైస్మిల్లు యజమాని సీఎంఆర్ 99 శాతం పూర్తిచేశారు. బయటి మార్కెట్ నుంచి ధాన్యం తీసుకొచ్చి మర ఆడించినట్లు రికార్డుల్లో చూపించినా.. అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఉండాల్సిన ధాన్యం కంటే ఎక్కువ నిల్వలు ఉన్నట్లు గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ కోణంలో విచారణ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ, బీ రిజిస్టర్లలో వివరాలు సరిపోలకపోయినా.. ఎందుకు మిన్నకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆగస్టులో రూ.3.50 కోట్ల రుణాలిచ్చాం : డీసీసీబీ
వనపర్తి: జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకు పరిధిలోని ఆరు పీఏసీఎస్ల పరిధిలో ఉన్న రైతులకు ఆగస్టులో వివిధ రకాల రుణాలు రూ.3.50 కోట్లు అందజేసినట్లు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పలువురు లబ్ధిదారులకు కర్షకమిత్ర చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైన పాడి పశువుల పోషణ, ఇతర వ్యాపారాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రెండు ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కర్షక మిత్ర పథకంలో భాగంగా రుణ చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నాగవరం పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, రాజనగరం పీఏసీఎస్ చైర్మన్ రఘువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కథ ముగిసిందా..?
ఏడురోజుల తర్వాత ధాన్యం లారీని వదిలేసిన అధికారులు ● సింగిల్లైన్ నివేదిక ఇచ్చిన టీఏ ● మిల్లులో లెక్కకు మించి నిల్వల మాటేమిటి? ● నామమాత్రపు జరిమానా విధింపు●వనపర్తి: పెబ్బేరులో సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం లారీని విచారణ పేరుతో ఏడురోజుల కాలయాపన తర్వాత క్లీన్చిట్ ఇచ్చి నామమాత్రపు జరిమానా విధించి అధికారులు రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. ఒక్కో లోపానికి ఒక్కో కారణం చెబుతూ అన్ని సక్రమంగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు సైతం సంతృప్తి చెందడంతో వదిలేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ గన్నీబ్యాగుల్లో ధాన్యం తరలిస్తున్నారనే విషయంపై ఇదే అధికారులు సీరియస్గా స్పందించి కేసునమోదు చేసిందేలా.. ప్రస్తుతం రేషన్ డీలర్లతో సంచులు కొనుగోలు చేసినట్లు సాకు చూపుతూ సమర్థించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 14 సాయంత్రం అధికారులంతా స్వాతంత్య్ర వేడుకల హడావుడిలో ఉన్న సమయంలో జిల్లాకేంద్రం నుంచి కర్ణాటకకు ధాన్యం లారీలో తరలుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకొని విచారణ నిమిత్తం పౌరసరఫరాలశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. విచారణ పేరుతో ఏడురోజుల పాటు కాలయాపన చేసి తుదకు కథను సుఖాంతం చేశారు. సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ధాన్యం ప్రభుత్వానిదేనా? ఏ రకం? ఏ సీజన్కు సంబంధించి? అనే విషయాలు తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాల టీఏ, హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించి అనాలసిస్ చేయించాల్సి ఉండింది. కాగా స్థానిక టీఏ మాత్రం పట్టుబడిన ధాన్యం బీపీటీ రకమని, సన్నరకం వరి ధాన్యమని సింగిల్లైన్ నివేదిక ఇచ్చి వదిలేశారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు ఈ అంశంలో ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు విముఖత చూపడం గమనార్హం. పట్టుబడిన ధాన్యానికి సంబంధించిన రైస్మిల్లు యజమాని సీఎంఆర్ 99 శాతం పూర్తిచేశారు. బయటి మార్కెట్ నుంచి ధాన్యం తీసుకొచ్చి మర ఆడించినట్లు రికార్డుల్లో చూపించినా.. అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఉండాల్సిన ధాన్యం కంటే ఎక్కువ నిల్వలు ఉన్నట్లు గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ కోణంలో విచారణ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ, బీ రిజిస్టర్లలో వివరాలు సరిపోలకపోయినా.. ఎందుకు మిన్నకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విహారం.. కావొద్దు విషాదం
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ పుష్కరఘాట్ వద్ద నది సమీపంలోకి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసి ఉంచినా.. పర్యాటకులు మాత్రం ఉధృతంగా పారుతున్న ప్రవాహం సమీపానికి వెళ్లి సెల్ఫీలకు ఫోజులివ్వడంతో పాటు జలకాలాడుతున్నారు. ఆదమరిస్తే ప్రమాదమని తెలిసినా.. ఎగిసి పడుతున్న వరద ముందు ఫొటోలు దిగుతున్నారు. గస్తీ నిర్వహిస్తున్నామంటున్న పోలీసులు వీటిని గమనించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. – అమరచింత -
అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన అజెండా
● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కొత్తకోట రూరల్: అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పనుల జాతర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్వయం ఉపాధి పనులకు సంబంధించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను అధికారులతో కలిసి ఆయన అందజేశారు. అనంతరం మండలంలోని నాటవెల్లిలో రూ.25 లక్షలతో నిర్మిస్తున్న యూపీఎస్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, మౌలిక వసతులు, ఉపాధి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షే, అభివృద్ధి ఫలాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, రావుల కరుణాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజా బహదూర్ వెంకట రామరెడ్డికి నివాళి.. రాజా బహదూర్ వెంకట రామరెడ్డి జయంతి సందర్భంగా రాయిణిపేట శివారులో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహనీయుడు, గొప్ప సంఘసంస్కర్త అయిన వెంకట రామరెడ్డి ఈ గడ్డపై జన్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రెడ్డి సేవాసమితి సభ్యులు, కాంగ్రెస్పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల్లో ‘ఆర్టీఐ’ వణుకు..
వనపర్తి: సుదీర్ఘకాలంగా సమాచార కమిషనర్ లేక పెండింగ్లో ఉన్న అర్జీలను పరిష్కరించేందుకు శనివారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమాచారం ఇచ్చే విషయంలో అర్జీలను నిర్లక్ష్యం చేసిన కొన్ని శాఖల అధికారులు ప్రత్యేక విచారణలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయనే భయంతో అర్జీదారులతో రాజీ పత్రాలు రాయించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా సమాచార హక్కు చట్టం–2005ను నిర్లక్ష్యం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన అధికారుల్లో కనిపించింది. జిల్లాలో మొత్తం 90 అర్జీలు పెండింగ్లో ఉండగా.. మున్సిపాల్టీలు, రెవెన్యూశాఖకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అమృత్ 2.0’ నీటి ట్యాంకుల పరిశీలన అమరచింత: అమృత్ 2.0 పథకంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న నీటిట్యాంకుల నిర్మాణ పనులను శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇంటర్నల్ రిపోర్టింగ్, మానిటరింగ్ ఏజెన్సీ బృందం పరిశీలించింది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింతలో కొనసాగుతున్న నీటిట్యాంకుల నిర్మాణ పనులను నిషితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలలకు ఓసారి ఇర్మా ఆధ్వర్యంలో పనులను పరిశీలించి నాణ్యత వివరాలను కేంద్రానికి నివేదిస్తున్నట్లు వెల్లడించారు. డీఈ చంద్రశేఖర్, కంపెని మేనేజర్ ఎన్.శ్రీనివాసులు, ఇర్మా కో–ఆర్డినేటర్ నవీన్ పాల్గొన్నారు. నేటి ధర్నాను విజయవంతం చేయండి వనపర్తిటౌన్: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించే ధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడంతో పాటు ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి డి.కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బి.వెంకటేష్, కె.జ్యోతి, హమీద్, శ్రీనివాస్గౌడ్, రామన్గౌడ్, జి.మురళి, అరుణ, వెంకటేశ్వర్లు, సూరయ్య, మల్లికార్జున్, డి.రాముడు, మద్దిలేటి, రాములు యాదవ్ పాల్గొన్నారు. విద్యుత్తు సరఫరా నిలిపివేత వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని బాలానగర్లో ఉన్న 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో అదనంగా 55 హెపీ ట్రాన్స్ఫార్మర్ బిగింపు సందర్భంగా శనివారం ఉదయం 9 నుంచి 11 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలానగర్, నర్సింగాయపల్లిరోడ్లోని డిగ్రీ కళాశాల, మెటర్నిటీ, చిల్డ్రన్ ఆస్పత్రి, అప్పాయపల్లిరోడ్, నందిమళ్లగడ్డ, వశ్యానాయక్తండా, పాతబజార్, కుమ్మరిగేరి, సవరం స్ట్రీట్, కమలానగర్, గాంధీనగర్, రాయిగడ్డకాలనీ, రాంనగర్కాలనీ, బ్రహ్మంగారి వీధి, శారదనగర్, చిట్యాలరోడ్, శ్వేతానగర్, తిరుమలకాలనీ, వల్లభ్నగర్, పీర్లగుట్ట, బంగారునగర్, పాన్గల్ రోడ్, గాంధీచౌక్, భగత్సింగ్నగర్, మెంటేపల్లితో పాటు చిన్నగుంటపల్లి, గోపాల్పేట, రాజపేట ఫీడర్లోని ప్రాంతాలకు ఆయా సమయంలో విద్యుత్ సరఫరా ఉండదని.. గృహ, వ్యాపార, పరిశ్రమలు, వ్యవసాయ వినియోగదారులు అంతరాయా న్ని గమనించి సహకరించాలని పేర్కొన్నారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే సంక్షేమ ఫలాలు
ఖిల్లాఘనపురం: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన పోచమ్మ బోనాల్లో పాల్గొన్న ఆయన రాత్రి తన స్వగ్రామం సల్కెలాపురంలో బసచేశారు. శుక్రవారం ఉదయం గ్రామంలో మార్నింగ్వాక్ నిర్వహించారు. వీధుల్లో తిరిగి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఇళ్లు, రేషన్కార్డులు, సన్నబియ్యం ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని పలువురు మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రూ.20 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి అదనపు తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత తొలగిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అప్పారెడ్డిపల్లికి చెందిన కొత్తగొల్ల అంజమ్మ ఉపాధి నిధులు రూ.3 లక్షలతో నిర్మించిన నాటుకోళ్ల ఫాంను ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఖిల్లాఘనపురం–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై రూ.2.95 కోట్లతో నిర్మించిన హైలేవల్ వంతెనను ప్రారంభించడంతో పాటు రూ.45 లక్షలతో నిర్మించే మత్య్సకారుల సామూహిక భవనానికి భూమి పూజ చేశారు. సింగిల్విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, నాయకులు సాయిచరణ్రెడ్డి, ఆగారం ప్రకాష్, వెంకటేశ్వర్రావు, విజయ్కుమార్, గంజాయి రమేష్, నాగేశ్వర్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం.. గోపాల్పేట: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం గోపాల్పేట, రేవల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రంలో కాంగ్రెస్పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు నాగశేషు మరణించిన విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించాడు. అనంతరం బుద్దారం గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని, చాకల్పల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. రేవల్లి మండలంలోని తల్పునూరుతండాలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త బండరావిపాకులలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఏదుల, చెన్నారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు, కేశంపేట గేట్వద్ద హై లేవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
ఎరువు.. కరువు...
రైతులకు తీరని యూరియా కష్టాలు ● క్యూలైన్లలో నిలుచున్న వారికి టోకన్లు పంపిణీ ఖిల్లాఘనపురం: మండల రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. బుధవారం సాయంత్రం 450 బస్తాలు సింగిల్విండో కార్యాలయానికి చేరింది. గురువారం ఉదయం యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా రైతులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయ సిబ్బంది చేసేదిలేక బుధవారం టోకన్లు ఇచ్చిన ఒక్కో రైతుకు రెండు బస్తాలను పంపిణీ చేశారు. వచ్చిన రైతులకు యూరియా సరిపోకపోవడంతో మిగిలిన వారికి టోకన్లు ఇచ్చి పంపారు. 243 టోకన్లు పెండింగ్లో ఉన్నాయని.. యూరియా వచ్చిన వెంటనే ముందుగా వారికి పంపిణీ చేస్తామని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఖిల్లాఘనపురం సింగిల్విండో కార్యాలయం వద్ద అన్నదాతలు ఆత్మకూర్: స్థానిక పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం మండల రైతులు గురువారం తెల్లవారుజామున ఐదు నుంచి పడిగాపులు పడ్డారు. సాయంత్రం వరకు లారీ రాకపోవడంతో సిబ్బంది చేసేది లేక నో–స్టాక్ బోర్డును ఏర్పాటు చేయడంతో రైతులు కంగుతిన్నారు. పొలం పనులు వదిలి రైతులు పొద్దంతా నిలుచుంటే యూరియా లేదంటూ బోర్డు పెట్టి వెళ్లిపోవడం ఏమిటని.. రైతులంటే అలుసుగా ఉందా అంటూ పలువురు రైతుసంఘం నాయకులు అధికారులను నిలదీశారు. ఒకానొక దశలో రైతులు, పీఏసీఎస్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో సీఐ శివకుమార్ అక్కడకు చేరుకుని క్యూలో నిలుచున్న రైతులకు టోకన్లు ఇప్పించారు. శుక్రవారం యూరియా రాగానే మొదట టోకన్లు ఇచ్చిన వారికి పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. మొత్తం 72 మంది రైతులకు టోకెన్లు ఇచ్చినట్లు రైతులు వివరించారు. -
ఘనంగా పోచమ్మ బోనాలు
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోచమ్మ బోనాల మహోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు అందంగా అలంకరించిన బోనపు కుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యంతో ఆలయానికి బారులు తీరారు. గొర్రె పొటేళ్లతో తయారు చేసిన రథంలో అమ్మవారిని ఉంచి గుట్టపైకి తీసుకొచ్చారు. అమ్మవారి పెద్ద బోనాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన జోగురాలు తలపై పెట్టుకొని నృత్యం చేస్తూ ఆలయానికి చేరుకుంది. పోతురాజుల సయ్యాట, యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారికి కోడిపుంజులు, గొర్రె పొటేళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముదిరాజ్ దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే .. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉత్సవాలకు హాజరై పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమన్నారు. అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఆయన వెంట సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, నాయకులు సాయిచరణ్రెడ్డి, వెంకటేశ్వర్రావు, విజయ్కుమార్, ఆగారం ప్రకాష్, శ్యాంసుందర్, రవినాయక్, కృష్ణయ్య, శంకర్, మదు, నవీన్, డాక్టర్ నరేందర్గౌడ్, శ్రీను వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
ప్రారంభానికి ‘ట్రిపుల్ ఐటీ’ సిద్ధం
● ఇప్పటికే ఎస్సెస్సీ మెరిట్ ఆధారంగా 208 మందికి అడ్మిషన్లు ● ఇంటర్మీడియట్తో పాటు ఇంజినీరింగ్చదివేందుకు వెసులుబాటు ● బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు ● టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపడుతున్న బాసర అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనుంది. దీంతో పాలమూరు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానునుంది. కళాశాల ఏర్పాటుకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ విద్యార్థులకు, ప్రత్యేక తరగతి గదులతోపాటు అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికి హాస్టల్ గదులు, డైనింగ్ హాల్ వంటివి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కళాశాలను ప్రారంభించి.. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రెగ్యులర్ కళాశాల భవనం కోసం జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీటిలో త్వరలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టనున్నారు. సాధారణంగా ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎఫ్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాస్తే సీటు లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఎస్సెస్సీ పూర్తయిన తర్వాత నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్ను పొందవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులు కావడంతో 2 ప్లస్ 4 విధానంలో విద్యాబోధన జరుగుతుంది. మొదటి రెండేళ్లు అందరికీ కామన్ సిలబస్ ఉండగా.. తర్వాత మరో నాలుగేళ్లు వివిధ డిపార్ట్మెంట్లు విడిగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇందులోనే ఇంటర్తోపాటు ఇంజినీరింగ్ విద్య కూడా పూర్తి అవుతుంది. ఒక విద్యార్థి ఎస్సెస్సీ తర్వాత అడ్మిషన్ పొందితే నేరుగా ఇంజినీరింగ్ సర్టిఫికెట్తో బయటికి వచ్చి.. ఉద్యోగం పొందేందుకు సంసిద్ధంగా ఉంటారు. ఆన్లైన్ విధానంలోనే.. ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు మొదటి సంవత్సరం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా యూనివర్సిటీ నుంచి నేరుగా ఆన్లైన్ విధానంలో జరిగింది. ఈ మేరకు ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన 208 మంది విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం 144 మంది బాలికలు, 64 మంది బాలురకు అవకాశం కల్పించారు. ఇక స్టాఫ్ నియామకాల ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు. గత నెల టీచింగ్ సిబ్బంది నియామకానికి ప్రకటన ఇవ్వగా.. 31 మంది దరఖాస్తు చేసుకుంటే 9 మందిని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అధ్యాపకులను భర్తీ చేశారు. మరో 6 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో వార్డెన్లు, అటెండర్లు, స్వీపర్ ఇతర సిబ్బంది ఉన్నారు. -
ఫౌండేషన్ శిక్షణ పేద విద్యార్థులకు వరం
వనపర్తిటౌన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదవలేని, ఆర్థికంగా వెనుకబడిన బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోనే ఐఐటీ, నీట్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ లభించడం వరమని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.వేలు వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు ఈ అవకాశం లభించడం శుభపరిణామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం ఇదే పాఠశాలలో విద్యనభ్యసించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ప్రధానోపాధ్యాయుడు గురురాజు యాదవ్ శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం గురురాజుయాదవ్, మండల విద్యాధికారి మద్దిలేటి, ఉపాధ్యాయ బృందం, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే చర్యలు
వనపర్తిటౌన్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలను పిల్లలు తీర్చకపోతే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై చట్టాల గురించి వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న వారిని గౌరవించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి అత్యధికంగా రూ.10 వేల వరకు మెయింటనెన్స్ కోరవచ్చన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకపోయిన, గృహంలో స్థానం కల్పించకపోయినా వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం 2007 ప్రకారం ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎవరైనా తల్లిదండ్రులను నిరాశ్రయులను చేస్తే టోల్ఫ్రీ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని, న్యాయ సలహాల కోసం టోల్ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించాలని పేర్కొన్నారు. అనంతరం వృద్ధుల హక్కులకు సంబంధించిన లఘు చిత్రాన్ని వృద్ధులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మండల సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ సకాలంలో అందించాలి
● మిల్లులను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్ పాన్గల్: వానాకాలం సీజన్లో ప్రభుత్వం మిల్లులకు ఇచ్చిన ధాన్యానికి సరిపడా సీఎంఆర్ వచ్చే నెల 12వ తేదీలోగా అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం మండలంలోని కేతేపల్లి, మాందాపూర్లోని రైస్మిల్లులను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కేతేపల్లి రైస్మిల్లు సీఎంఆర్ చెల్లింపుల్లో జిల్లాలోనే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ విషయంలో మిల్లుల యజమానులు అలసత్వం వహించడం సరికాదని.. ప్రభుత్వ నిబంధనల మేరకు గడువులోగా అందించాలని లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ వెంట డీఎస్ఓ విశ్వనాథం, డీఎం జగన్మోహన్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఆర్ఐ తిరుపతయ్య పాల్గొన్నారు. -
ఉజ్వల భవిష్యత్..
పాలమూరులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇక్కడ చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఉజ్వల భవిష్యత్ లభిస్తుంది. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు సాధ్యపడింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఇంజినీరింగ్ కళాశాలలు రావడంతో భవిష్యత్లో వేల సంఖ్యలో సీట్లు కేటాయించే అవకాశం ఉంది. తద్వారా కార్పొరేట్ కంపెనీలు జిల్లాకు వచ్చి.. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులు మొదలు, హాస్టల్ ఇతర వసతులు కూడా కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ● -
కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించేనా..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మంజూరైన జీపీ భవన నిర్మాణ పనులు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పూర్తయ్యేనా అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ● పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడక ముందే పెండింగ్ బిల్లులు మంజూరు చేయడంతో పాటు అసంపూర్తి పనులు పూర్తిచేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరుతున్నారు. అప్పటి ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయగా.. ప్రస్తుతం సిమెంట్, ఇసుక, ఇనుము తదితర వస్తు సామగ్రి ధర పెరగడంతో నిర్మాణ వ్యయం పెంచాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 25 గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు మాత్రమే పూర్తికాగా.. కొన్నిచోట్ల స్థలాలు లేక, మరికొన్ని చోట్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. అమరచింత మండలం నాగల్కడ్మూర్లో పిల్లర్లకే పరిమితమైన గ్రామపంచాయతీ భవనం -
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం
వనపర్తి రూరల్: పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన శ్రీరంగాపురం పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఠాణా పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. పరిసరాలు, సీజ్చేసిన వాహనాలు, రిసెప్షన్, రికార్డు గదిని పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నేరాల అదుపునకు కృషి చేయాలని, నిరంతరం గస్తీ నిర్వహిస్తూ గంజాయి, మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి గ్రామానికి పోలీసు అధికారిని కేటాయించి వీపీఓ విధానం పక్కాగా అమలు చేయాలన్నారు. వీపీఓలు రోజు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా చూడాలని, బ్లూకోర్ట్, పెట్రోకార్ విధులు నిర్వర్తించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సాయంత్రం వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నరేష్, ఎస్ఐలు రామకృష్ణ, యుగంధర్రెడ్డి, పోలీస్ అధికారులు ఉన్నారు. బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి ఎస్పీ రావుల గిరిధర్ -
‘యమ’డేంజర్..!
ప్రమాదకరంగా ఆర్యూబీలు ● ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి ● పలు గ్రామాలు, కాలనీలకు నిలిచిపోయిన రాకపోకలు ● భారీ వర్షాలతో అండర్ పాస్లకు పోటెత్తుతున్న వరద ● ప్రత్యేక పైపులైన్ల ఏర్పాటును పట్టించుకోని రైల్వే శాఖ ● డ్రెయినేజీల విస్తరణ, అనుసంధానంపై నిర్లక్ష్యం2022 జూలై 08: ఇది మహబూబ్నగర్ రూరల్ మండలం సూగురుగడ్డ రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా చేరిన వరద నీటిలో చిక్కుకున్న ఓ స్కూల్ బస్సు. ఆ సమయంలో 30 మంది విద్యార్థులు బస్సులో ఉండగా.. యువకుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పింది. 2025 ఆగస్ట్ 14: ఇది మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి)లోని రైల్వే అండర్ బ్రిడ్జి. భారీ వర్షంతో వరద పోటెత్తగా చెరువును తలపిస్తోంది. ఐదు రోజులుగా అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. -
చేనేత ఉత్పత్తులను ఆదరిద్దాం
అమరచింత: చేనేత ఉత్పత్తులను ఆదరించి కళలను ప్రోత్సహిస్తూ కాపాడుకుందామని నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలో చేనేత ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రూరల్ మార్ట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాబార్డ్ సహకారంతో నెలకొల్పిన ఈ మార్ట్లో చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెడీమేడ్ దుకాణాన్ని కంపెనీ డైరెక్టర్ పొబ్బతి వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరచింత చేనేత ఉత్పత్తుల కంపెనీ ఐదేళ్లుగా నేత కార్మికుల భాగస్వామ్యంతో కొనసాగుతూ ఉత్పత్తులను తయారు చేస్తున్నారని వివరించారు. మగ్గాలపై నేసిన జరీ చీరలను ఇతర ప్రాంతాలతో పాటు ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు కొత్తగా రూరల్ మార్ట్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ అధికారులతో పాటు కంపెనీ సీఈఓ శేఖర్, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. నాబార్డ్ డీడీఎం మనోహర్ -
యూరియాకు పడిగాపులు
ఆత్మకూర్: యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలోని పీఏసీఎస్ వద్ద తెల్లవార్లు పడిగాపులు పడుతున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం ఉదయం రాగా మధ్యాహ్నం 3.30కి 700 బస్తాలు రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసులు కలుగజేసుకొని రైతులను వరుస క్రమంలో నిలబెట్టి సాయంత్రం వరకు పంపిణీ చేశారు. చాలామంది రైతులకు దొరకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం వద్ద బుధవారం పోలీసుల గస్తీ నడుమ రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఒక లారీ యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్సై నరేష్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను వరుసలో నిలబెట్టి టోకన్ ప్రకారం పంపారు. యూరియా తక్కువగా ఉండటంతో ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. అయినా సరిపోకపోవడంతో చేసేది లేక కార్యాలయ సిబ్బంది మిగిలిన రైతులకు టోకన్లు ఇచ్చి పంపారు. గురువారం ఉదయం వస్తుందని.. వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. ఏఓ మల్లయ్య పర్యవేక్షణ చేపట్టారు. ఖిల్లాఘనపురం సింగిల్విండో వద్ద ఇలా.. అన్నదాతలకు తప్పని తిప్పలు అందక నిరుత్సాహంతో వెనుదిరిగిన రైతులు -
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్, ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా -
పేదరిక నిర్మూలనకు రాజీవ్గాంధీ కృషి
వనపర్తిటౌన్: పేదరికం రూపుమాపేందుకు కృషి చేసిన మహానేత దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌక్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని రాజీవ్విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, బాలల పోషణకు కేంద్ర సహాయ పథకాలు రాజీవ్గాంధీ కృషితోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. గ్రామీణ టెలిఫోన్ నెట్వర్క్, టెలివిజన్ ప్రసారాలను విస్తరించి సమాచార విప్లవానికి బీజం వేశారని కొనియాడారు. టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, రాష్ట్ర మైనార్టీ నాయకులు సయ్యద్ అక్తర్, కమర్మియా, నాయకులు కిరణ్కుమార్, బాబా, జానకిరాములు, నారాయణ, సి.పెంటన్న, రోహిత్, నాగార్జున, రాగి అక్షయ్, ఇర్ఫాన్, సురేష్గౌడ్, జానకమ్మ పాల్గొన్నారు. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య బుధవార ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కోల్పోకుండా అర్హత గల వారిని చేర్చుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. రేపు జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలు వనపర్తిటౌన్: మహబూబ్నగర్లోని పాల మూరు యూనివర్సిటీలో ఈ నెల 30, 31న జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు జిల్లాకేంద్రంలోని బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఉదయం 9 గంటల వరకు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ (సెల్నంబర్ 80961 15222) సంప్రదించాలని సూచించారు. ‘నీట్’ పీజీలో ప్రతిభ వనపర్తిటౌన్: జిల్లాకేంద్రానికి చెందిన స్వప్న, భాస్కర్రెడ్డి దంపతుల కుమారుడు రిత్విక్రెడ్డి ఇటీవల వెలువడిన నీట్ పీజీ ఫలితాల్లో ఆలిండియాలో 16వ ర్యాంక్ సాధించారు. 2019 నీట్ యూజీలోనూ 430 ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్లోని భూపాల్ ఎయిమ్స్లో మెడిసిన్ పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంట్లోనే చదివి 684 మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఏటా ఇబ్బందులే..
● మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి, దివిటిపల్లి, న్యూమోతీనగర్, ఏనుగొండ, బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాల దారి), మన్యంకొండ స్టేషన్ దగ్గర సూగురుగడ్డ ఆర్యూబీల్లో వరద నీరు పారడం నిత్యకృత్యంగా మారింది. ప్రతి ఏటా పలు కాలనీలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నా.. అధికారులు శాశ్వత చర్యల దిశగా అడుగులు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● దేవరకద్రలోని దళితవాడ వద్ద ఆర్యూబీ గుండా రైతులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. భారీ వర్షం వస్తే అండర్ పాస్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలుస్తున్నాయి. వ్యవసాయ పనులకు ఆటంకాలు ఎదురవుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ● జడ్చర్ల నుంచి ఆలూరు గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఆర్యూబీలో నీళ్లు నిలుస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం నీరు సాఫీగా వెళ్లేందుకు పైపులైన్ వేసే పనులు కొనసాగుతున్నాయి. -
ఇబ్బందులు పడుతున్నాం..
నేను ఐదురోజులుగా యూరియా కోసం వస్తు న్నా దొరకడం లేదు. దొరకుతుందో లేదోనని తెల్లవారుజామున పీఏసీఎస్ వద్దకు వస్తున్నాం. అప్పటికే పెద్దసంఖ్యలో రైతులు ఉండటంతో వర్షంలోనూ చెప్పులను వరుసలో పెడుతున్నాం. పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. – చెన్నమ్మ, రైతు, మోట్లంపల్లి రైతులంటే లెక్కలేదు.. రైతులంటే అధికారులు, పాలకులకు లెక్కలేకుండా పోయింది.. పంటల సాగంటేనే నరకప్రాయంగా మారుతోంది. నాలు గు రోజులుగా పీఏసీఎస్ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నా. నా చె ప్పుల వరుస వచ్చే సరికి అయిపోయిందని అంటున్నారు. ఓట్లు వేయించుకున్న ప్రజాప్రతినిధులు మా బాధలను పట్టించుకొని న్యాయం చేయాలి. – చిన్న హన్మంతు, రైతు, బాలకిష్టాపూర్ ఆరు వేల బస్తాలు పంపిణీ చేశాం.. పీఏసీఎస్ పరిధిలో ఇప్పటి వరకు ఆరువేల బస్తాల యూరియా పంపిణీ చేశాం. తీసుకున్న రైతులే మళ్లీ తీసుకొని వారి బంధువులకు పంపిస్తున్నారు. వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో పంపిణీలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. రోజుకు 700 సంచుల యూరియా వస్తోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – గాడి కృష్ణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షుడు, ఆత్మకూర్ ● -
ఇక సాగనంపడమే..
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న ఐదు చెంచుపెంటల రీలొకేషన్కు కేంద్ర పర్యావరణ శాఖ సలహాకమిటీ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో ఐదు చెంచుపెంటల్లోని స్థానికులను అడవి నుంచి బయటకు తరలించి అక్కడ పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ శాఖ సలహా కమిటీ సూత్రప్రాయంగా ఆమోదించడంతో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల పెంటల్లోని 417 కుటుంబాలతో పాటు రెండోవిడతలో వటవర్లపల్లి, సార్లపల్లి గ్రామాల్లోని 836 కుటుంబాలను అడవి నుంచి బయటకు తరలించి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. వన్యప్రాణులు– మనుషులకు మధ్య ఘర్షణ నివారించేందుకు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో నివసిస్తున్న స్థానిక చెంచులను ఇక్కడి నుంచి తరలించి నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలో పునరావాసం కల్పించనున్నారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని పులులు, వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాలకు ఆటంకాలను నిర్మూలించడం, మనుషులకు – వన్యప్రాణులకు మధ్య ఘర్షణలను నివారించేందుకు, పర్యావరణ సంరక్షణలో భాగంగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) నిర్వాసితులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందిస్తోంది. స్వచ్ఛందంగా అడవి నుంచి బయట నివసించాలనుకునే వారికి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా ఇల్లు, ఐదెకరాల వ్యవసాయ భూమిని అందిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రీలొకేషన్ సర్వే, గ్రామసభలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు గ్రామస్తుల నుంచి అంగీకారపత్రాలను తీసుకున్నారు. సార్లపల్లి గ్రామంలోని 30 కుటుంబాలు మినహా, కొల్లంపెంట, కుడిచింతల్ బైల్, తాటిగుండాల, వటవర్లపల్లి గ్రామాల్లోని స్థానికులు రీలొకేషన్కు అంగీకారం తెలిపారు. ఎంఓయూ తర్వాత.. గ్రామసభలు, జిల్లాస్థాయి కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) కమిటీల ఆమోదం మంగళవారం కేంద్రం పర్యావరణశాఖ సలహా కమిటీ సైతం ఆమోదం తెలిపింది. దీంతో నిర్వాసితుల నుంచి మెమొరెండమ్ ఆఫ్ అండర్ స్టాడింగ్(ఎంఓయూ) పత్రాలపై సంతకాలను తీసుకున్న తర్వాత గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మరో రెండు నెలల్లోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని చెంచుపెంటల తరలింపునకు కేంద్రం ఆమోదం నల్లమల అడవి నుంచి రెండు దశల్లో 5 గ్రామాల రీలొకేషన్ నిర్వాసితుల నుంచి ఎంఓయూ అనంతరంప్రారంభం కానున్న తరలింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాకే పంపించాలంటున్న చెంచులు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద పునరావాస కేంద్రం జీవనోపాధిపై నమ్మకం కల్పించాకే..తమకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా పూర్తిస్థాయిలో పునరావాసం పూర్తయిన తర్వాతే అడవి నుంచి తరలించాలని చెంచులు కోరుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకున్న తమకు బయటకు తీసుకెళ్లాక జీవనోపాధి కరువవుతుందని ఆందోళన చెందుతున్నారు. పునరావాసం తర్వాత ఉపాధి లేక ఇబ్బందులు పడతామని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించడంతో పాటు జీవనోపాధిపై నమ్మకం కలిగించాకే తమను అడవి నుంచి బయటకు తరలించాలని కోరుతున్నారు. మానవీయ కోణంలో తరలింపు చేపడతాంఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో రెండు దశల్లో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ఉంటుంది. నిర్వాసితులకు ఎన్టీసీఏ ద్వారా పూర్తిస్థాయిలో పరిహారం అందించాకే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రీలొకేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకువచ్చిన వారికే ప్యాకేజీ అందించి తరలింపు చేపడతాం. – రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ అడవిలో తప్ప బయట బతకలేం.. మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటు న్నాం. అడవిలో ఉన్న ఆధా రం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం. – దంసాని లింగయ్య, కొల్లంపెంట, అమ్రాబాద్ మండలం పునరావాసం ఇచ్చాకే పోతాంమేం ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు వేరే పని తెలువదు. పులులు, వన్యప్రాణుల కోసం మమ్మల్ని బయటకు పొమ్మని అంటున్నారు. మాకు చెప్పినట్టుగా పూర్తిగా పరిహారం, ఇల్లు, భూమి ఇచ్చాకనే పోతాం. – గోరటి చంద్రమ్మ, కుడిచింతల్బైల్ -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
వనపర్తిటౌన్: బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్య నేరమని.. నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహం జరిగిన రెండేళ్లలోపు రద్దు చేసుకునేందుకు జిల్లా న్యాయస్థానంలో పిటీషన్ వేసుకోవచ్చని సూచించారు. మోటారు వెహికల్, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సాయం కోసం టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రఘు, సూర్యనారాయణ, పాఠశాల అధ్యక్షుడు మందడి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి: డ్రైవర్లు రహదారి భద్రత నిబంధనలు విధిగా పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్ధేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఆపాలన్నారు. మద్యం తాగి, సెల్ఫోన్లలో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలని.. సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని కోరారు. బస్సును రోజూ తనిఖీ చేయాలని, టైర్లు, బ్రేకులు, ఇతర భాగాలను పరిశీలించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే, యాజమాన్యానికి చెప్పి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సిగ్నల్స్, మలుపులు, ప్రధాన కూడళ్లలో వేగాన్ని నియంత్రించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని.. సమయపాలన పాటిస్తూ విద్యార్థులతో ఓపిక, సహనంగా, మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి సీఐ కృష్ణయ్య, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్ఎస్సై సురేందర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్