Wanaparthy District Latest News
-
భూ సేకరణ వేగవంతం చేయాలి
వనపర్తి: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కేటగిరి–1 ప్రాధాన్యత కింద నిర్ధారించిన భూములను త్వరగా సేకరించి ఇరిగేషన్శాఖకు అప్పగించాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. జయన్న తిర్మలాపూర్లో 12.95 ఎకరాలు, రేవల్లి మండలం కేశంపేటలో 29.24 ఎకరాలు సర్వే చేసి పెగ్ మార్క్ చేయాలని, సర్వేయర్లను పంపించి వారంలో సర్వే చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రేమద్దుల డి–8, కర్నెతండా ఎత్తిపోతలకు సంబంధించిన భూ సేకరణ చేపట్టాలని సూచించారు. షాపూర్లో 28.32 ఎకరాలు, మల్కాపూర్లో 8.35 ఎకరాలు, పొల్కెపాడులో భూ సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. గణపసముద్రం, బుద్ధారంలో 96 ఎకరాలకు అవార్డ్ పాసైనందున రైతులకు పరిహారం చెల్లింపులు జరిగేలా చూడాలని భూ సేకరణ అధికారిని ఆదేశించారు. ఖిల్లాఘనపురం మండలం అల్లమాయపల్లిలో 10 ఎకరాలు, మిల్క్మియాన్పల్లిలో 6 ఎకరాలు, తిర్మలాయపల్లిలో 23 ఎకరాలు సైతం కేటగిరి–1లో ఉన్నందున జూన్ చివరి నాటికి సర్వే చేపట్టి అవార్డ్ పాస్చేసి ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి కావాలన్నారు. సర్వేయర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో భూ సేకరణ పూర్తి చేయాలని కోరారు. ఇక నుంచి ప్రతి వారం భూ సేకరణ పురోగతిపై సమీక్ష ఉంటుందని, పూర్తయిన నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో భూ సేకరణ ప్రత్యేక అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్ఈ జె.శ్రీనివాస్రెడ్డి, ఇరిగేషన్ కార్యనిర్వాహక ఇంజినీర్ మధుసూదన్రావు, ఏడీ సర్వే బాలకృష్ణ, ఇరిగేషన్ ఈఈ కేశవరావు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ పాల్గొన్నారు. -
బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం
వనపర్తి: బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ పని చేస్తోందని సంఘం రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీసీ జనభేరి మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమకాంక్ష ఒక్కరోజులో సఫలీకృతం కాదని.. దీర్ఘకాలం పోరాడాలని, ఈ సమయంలో ఏళ్లుగా రాజ్యాధికారం అనుభవిస్తున్న వారు హేళన చేసినా, తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినా బెదిరేది లేదన్నారు. ఓ వైపు బీసీల హక్కుల కోసం పోరాడుతూనే ఈ ప్రాంత బిడ్డగా సమాజంలో చోటు చేసుకుంటున్న అవినీతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధుల అలసత్వాన్ని ఎండగట్టేందుకు మరో అడుగు వేస్తున్నట్లు ప్రకటించారు. ఓర్వలేని కొందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుదిరగనని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని.. లేదంటే బీసీ పొలిటికల్ జేఏసీ తమ అభ్యర్థులను నిలబెట్టి ప్రజల ఆశీర్వాదంతో గెలిపించుకునేందుకు వెనుకాడబోదన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి రావడంతో మైదానం జనకళను సంతరించుకుంది. బుల్లితెర కళాకారులు జానులిరి, జంగిరెడ్డి బృందం తమ ప్రదర్శనలతో అలరించారు. -
ట్రిపుల్ ఐటీ సొబగులు
ఎడ్యుకేషన్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/జడ్చర్ల/జడ్చర్ల టౌన్: పాలమూరు జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారుతోంది. ఇప్పటికే పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేయగా.. తాజాగా ఆర్జీయూకేటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ) బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలకు అనుబంధంగా మహబూబ్నగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరైంది. ఇందుకు సంబంధించిన జీఓను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కళాశాల పూర్తిస్థాయి క్యాంపస్ ఏర్పాటు కోసం దివిటిపల్లి వద్ద స్థల పరిశీలన సైతం అధికారులు పూర్తి చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్ చాన్స్లర్ గోవర్ధన్ స్థల పరిశీలనలో పాల్గొని.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. మూడు కోర్సులతో ప్రారంభం ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ పూర్తిస్థాయిలో నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతోంది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు తాత్కాలిక భవనం ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా బండమీదిపల్లి వద్ద ఉన్న పాత రెడ్డి హాస్టల్ భవనంలో తరగతులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు కోర్సులతో కళాశాల ప్రారంభించనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరంలో ఒక్కో కోర్సులో 60 మంది చొప్పున 180 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కూడా కల్పించనున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 41.32 ఎకరాల్లో క్యాంపస్ జిల్లాకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ కోసం జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి శివారులోని సర్వే నంబర్ 1లో 21.26 ఎకరాలు, మహబూబ్నగర్ అర్బన్ మండలం పరిధిలోని 20.06 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ ఏర్పాటుతో జడ్చర్ల రూపురేఖలు మారనున్నాయి. జాతీయ రహదారికి ముఖద్వారంలా ఉన్న జడ్చర్ల మరింత అభివృద్ధి సాధించే అస్కారం ఉంది. జడ్చర్ల, మహబూబ్నగర్ శివార్లలోని జాతీయ రహదారి పక్కన కళాశాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చిట్టెబోయిన్పల్లి శివారు సర్వే నంబర్ 1లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నవాబుపేట మండలానికి తరలించనున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురుకుల పాఠశాలను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్థులకు విద్యనందిస్తూ వచ్చింది. అయితే ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు కావడంతో.. గురుకుల పాఠశాల వేరే ప్రాంతానికి తరలించడం అనివార్యమైంది. నవాబుపేట మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు ఈ విద్యా సంవత్సరం మూడు కోర్సులతో ప్రారంభం ప్రస్తుతానికి పాత రెడ్డి హాస్టల్ భవనంలో ఏర్పాటుకు కసరత్తు క్యాంపస్ నిర్మాణానికి జడ్చర్ల, మహబూబ్నగర్ శివార్లలో 41.32 ఎకరాల స్థలం కేటాయింపు -
చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ
పాన్గల్: చిన్నారుల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. పరిమళ, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. సాయినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, సబ్సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల వివరాల నమోదు రికార్డులు, వ్యాక్సిన్ నిల్వలు, అసంక్రమిత వ్యాధుల వివరాల నమోదు, వ్యాక్సిన్ పంపిణీ చేయని జాబితాను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించేలా, టీకాలు ఇప్పించడంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తల్లిదండ్రులను చైతన్యం చేయాలన్నారు. పాలిచ్చే తల్లులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ జిల్లా మేనేజర్ పరశురాం, జిల్లా ఎన్సీడీ కో–ఆర్డినేటర్ చంద్రయ్య, సీహెచ్ఓ రామయ్య, ఎంఎల్హెచ్పీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం
వనపర్తి విద్యావిభాగం/అమరచింత: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని రాష్ట్ర తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాకేంద్రానికి బడిబాట ప్రచార జాత చేరుకోగా యూటీఎఫ్ నాయకులు, సభ్యులు పెద్దఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. రాజీవ్ చౌక్, అంబేడ్కర్ చౌక్లో, సాయంత్రం అమరచింతలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు సంఖ్య పెంపునకు టీఎస్ యూటీఎఫ్తో పాటు తెలంగాణ పౌర స్పందన వేదిక కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలాలు ఉన్నాయని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాంలు అందించడంతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం నుంచి విముక్తి పొందాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని, సంపాదనలో సగానికిపైగా చదువులకే ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్లతో పాటు ఒత్తిడి లేని బోధన అందుతుందని వివరించారు. జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రవిప్రసాద్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి జిల్లా కార్యదర్శులు హమీద్, శ్రీనివాస్గౌడ్, తిమ్మప్ప, అరుణ, అనసూయ, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు భద్రశేనయ్య, రామన్గౌడ్, నారాయణ, గట్టయ్య, భీమయ్య, అమరచింతలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏఈ మంగ, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, కావ్య, ధనమూర్తి, అగ్రిప్ప, రాములు, కిరణ్, జీఎస్ గోపి, అజయ్, తౌఫిక్, అశోక్, రవి, ఎం.శ్రీనివాసులు, ఆదాం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
వీపనగండ్ల: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపై ఉందని జిల్లా నోడల్ అధికారి డా. వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కల్వరాల సబ్సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ముసురు వర్షాలతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని.. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లోని వీధులను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, మురుగు కాల్వల్లో నీరు నిల్వకుండా చూడాలన్నారు. చిన్నారులను ఆస్పత్రులకు తీసుకొచ్చి క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. -
సమస్యల పరిష్కారానికి పోరాటం : సీపీఎం
పాన్గల్: స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ నాయకులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల్లో మిగతా వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, తరలింపులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు అర్హులైన పేదలకే అందాలని కోరారు. స్థానిక సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలన్నారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్, సభ్యులు భాస్కర్, భగత్, ఎం.వెంకటయ్య, భీమయ్య, వెంకటయ్య, జంబులయ్య పాల్గొన్నారు. 4న ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: ది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 4వ తేదీన జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.శ్యాంసుందర్గౌడ్, ఎల్.రవికుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–13, అండర్–15, అండర్–17, అండర్–19, సీనియర్, వెటరన్ విభాగాల్లో సెలక్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆ రోజు ఉదయం 9 గంటలకు కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్ను రిపోర్టు చేయాలని, మిగ తా వివరాల కోసం 98480 85211, 98660 33377, 96189 75795, 98669 28835 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ, బీఎడ్ ఫలి తాలను బుధవారం పీయూ వీసీ శ్రీనివాస్ వి డుదల చేశారు. బీఫార్మసీ మొదటి సెమిస్టర్లో 5.52 శాతం, బీఎడ్ 3వ సెమిస్టర్లో 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. రేపు సీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని ఆయన కోరారు. మొక్కలే మానవాళికి జీవనాధారం ఎర్రవల్లి: మొక్కలే మానవాళికి జీవనాధారమని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుంచి నీటి కుంట ఏర్పాటు కోసం కమాండెంట్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటేనే మొక్కలకు అవసరమైనప్పుడు నీటిని వినియోగించుకోవచ్చునని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ద్వారా రూ. 3లక్షల వ్యయంతో బెటాలియన్లో నీటి కుంటను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే రాబోయే కాలానికి ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ రాజేశం, సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
ధాన్యం తరలింపులో జాప్యం వద్దు
గోపాల్పేట: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి జాప్యం చేయకుండా మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని ఏదుట్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం చేసేందుకు హమాలీలు ఎక్కువగా ఉండేలా చూడాలని, వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్కు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని గోదాంను పరిశీలించారు. గోదాంలో ధాన్యం నిల్వకు అనుకూలమైన వాతావరణం, పటిష్ట భద్రత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదాంలోని గన్నీబ్యాగులు తరలించి ఖాళీ చేయాలని, ధాన్యం తరలింపులో అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ‘భూ భారతి’పై సమీక్ష.. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పాండునాయక్, రెవెన్యూ సిబ్బందితో భూ భారతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన మండలంలో దరఖాస్తులను వచ్చే నెల రెండో తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 573 దరఖాస్తులు రాగా.. 246 దరఖాస్తులకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ పాండు వివరించారు. ఇందులో 155 సక్సేషన్ దరఖాస్తులు, మిగిలినవి సాదా బైనామా దరఖాస్తులని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, మిగతావి కలెక్టర్ లాగిన్కు పంపించాలని కలెక్టర్ సూచించారు. జూన్ 2 నాటికి రైతుల సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు సహకరించాలన్నారు. భూ ఫిర్యాదులను త్వరగాపరిష్కరించాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
జిల్లా తూనికలు, కొలతల అధికారి సస్పెన్షన్
వనపర్తి: జిల్లా తూనికలు, కొలతలశాఖ అధికారి సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. పెట్రోల్ పంపుల లైసెన్స్ రెన్యూవల్స్, తూకాల్లో మోసాలు, నిబంధనలు ఉల్లంఘించి చేతివాటం ప్రదర్శించారనే కారణాలతో విజిలెన్స్ విభాగం ఇచ్చిన విచారణ నివేధిక ఆధారంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్, రాష్ట్ర కంట్రోలర్ డీఎస్ చౌహాన్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన అవినీతి బాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం, గత నెల 8న ‘సాక్షి’ ప్రధాన పత్రికలో ‘రెన్యూవల్కు ఓ రేటుంది’ శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించి విచారణ చేసి చర్యలు తీసుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అధికారి నాగేశ్వర్రావుకు జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తె లుస్తోంది. ఈ విషయంపై కలెక్టరేట్కు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.నేడు జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలువనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు జూన్ 1న తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో జరిగే 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అండర్–8లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2017 నుంచి 01.06.2019, అండర్–10లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2015 నుండి 01.06.2017, అండర్–12లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2013 నుంచి 01.06.2015 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు కుల, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్లు 99086 29908, 94413 53375, 80961 15222 సంప్రదించాలని సూచించారు.ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలువనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరగగా.. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 2,374 మంది విద్యార్థులకుగాను 2,179 మంది హాజరు కాగా, 195 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 663 మంది విద్యార్థులకుగాను 614 మంది హాజరు కాగా 49 మంది రాలేదని వివరించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నరేంద్రకుమార్, శ్రీనివాసులు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు, బాలురు, వాగ్దేవి కేంద్రాలను తనిఖీ చేశారు. డీఐఈఓ ఎర్ర అంజయ్య రావూస్, స్కాలర్స్, సీవీ రామన్, విజ్ఞాన్ జూనియర్ కళాశాల కేంద్రాన్ని సందర్శించారు.నేడు జనభేరి బహిరంగ సభవనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారం.. హక్కుల సాధన కోసం బుధవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో జనభేరి బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ వెల్లడించారు. మంగళవారం జిల్లాకేంద్రంలో జేఏసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో తిరిగినప్పుడు మా దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, పలు ప్రజాసంఘాల నాయకులు హాజరవుతారని వివరించారు. పార్టీలకతీతంగా నిర్వహించే జనభేరికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు చింతపల్లి సతీష్, పాండురంగ యాదవ్, గోటూరి రవీందర్, వీవీ గౌడ్, కొన్నూర్ గూడు షా, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, రాఘవేందర్గౌడ్, ధర్మేందర్, ఆస్కని రమేష్, అక్కల మల్లేష్గౌడ్, చెలిమిళ్ల రామన్గౌడ్, యశ్వంత్, శ్రీనివాస్గౌడ్, రేనట్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేఎల్ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్కు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. -
కల్యాణలక్ష్మి పేదలకు వరం
కొత్తకోట రూరల్/మదనాపురం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రొ. జయశంకర్ సమావేశ మందిరం, మదనాపురం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలన పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దరిచేరక నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేవారని, ప్రజాపాలనలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాసులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, మదనాపురంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దారు జేకే మోహన్, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, మార్కెట్ డైరెక్టర్ పావనిరెడ్డి, జగదీష్, సాయిబాబా, ఖాజా మైనుద్దీన్, అంజద్ అలీ, ఆవుల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ఆత్మకూర్: కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దిగువ జూరాల జల విద్యుత్కేంద్రం వద్ద జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, వర్టికల్స్, డయల్ 100, బ్లూకోర్టు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, బీట్ సిస్టం సిబ్బందితో నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్లలో వర్టికల్స్ పనితీరును నిత్యం పర్యవేక్షిస్తుండాలని, ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. నేరస్తులను త్వరగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని, బీట్ సిస్టంను మరింత పటిష్టపర్చాలని, దొంగతనాలు జరగకుండా ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని, ఎక్కడబడితే అక్కడ మద్యం తాగకుండా, అమ్మకాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని, పట్టుబడితే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం సందర్శన.. దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాన్ని ఎస్పీతో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్లు సందర్శించారు. వియ్యర్, స్విచ్యార్డు, పవర్హౌజ్ను పరిశీలించి విద్యుత్ తయారీ తదితర వివరాలను జన్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐలు శివకుమార్, రాంబాబు, కృష్ణయ్య, ఎస్ఐలు నరేందర్, తిరుపతిరెడ్డి, సురేష్, శేఖర్రెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పోలీస్ అధికారులు నిత్యం పర్యటించాలి ఎస్పీ రావుల గిరిధర్ -
జలయజ్ఞం ప్రాజెక్ట్లపై నజర్
కోయిల్సాగర్: చివరి దశలో పనులు 2006లో రూ.349 కోట్లు కేటాయించి.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి కాకుండానే పదేళ్ల తర్వాత 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలు, లింక్ కెనాల్ కింద కొత్తగా పిల్ల కాల్వల పనులు చేపట్టడానికి రూ.50 కోట్లతో రీ టెండర్లు పిలిచారు. అలాగే నాగిరెడ్డిపల్లి ఫేస్1, తీలేర్ ఫేస్ 2 పంపుహౌస్లలో పెండింగ్లో ఉన్న పనులకు రూ.16.90 కోట్లతో రీ టెండర్లను పిలిచారు. ఎత్తిపోతల పథకం లక్ష్యం 50,250 ఎకరాలు కాగా.. వానాకాలం పంటల కింద 36 వేల ఎకరాలలకు, యాసంగిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుంచి దేవరకద్ర గ్రావిటీ కెనాల్ను రూ.23 కోట్లతో చేపట్టగా పనులు చివరిదశలో ఉన్నాయి. అజిలాపూర్, చౌదర్పల్లి ఎత్తిపోతల పథకం, రాజోలి నుంచి పేరూర్ వరకు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి ● నెట్టెంపాడులో 610 ఎకరాలకు రూ.25 కోట్లు విడుదల ● ‘పాలమూరు’లో 15 వేల ఎకరాలకు రూ.300 కోట్లు.. ● భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పనులపైనా కసరత్తు ● పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి రవినాయక్ ఆరా ● ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ప్రాజెక్ట్ -
నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు
వనపర్తి: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆధ్వర్యంలో జరిగిన టాస్క్ఫోర్స్ కమిటీ జిల్లాస్థాయి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభవుతున్నందున రైతులు విత్తనాలు నాటేందుకు సమాయత్తం అవుతుంటారని, పొరపాటున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడా నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ చేయని, లేబుల్ లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని.. టాస్క్ఫోర్స్ బృందాలు విత్తన విక్రయ దుకాణాలను తనిఖీ చేసి ఎక్కడైనా పట్టుబడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు ఖరీదైనవి కావడంతో నకిలీవి విక్రయించే ప్రమాదం ఉందని.. జిల్లా, మండలస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనుమతి ఉన్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలని, ఇతరులు అమ్మడానికి వీలు లేదన్నారు. ఫ జిల్లా రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైతులు సన్నరకం మాత్రమే సాగు చెసేలా అవగాహన కల్పించాలని, రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం ద్వారా నకిలీ విత్తనాలు, పంట మార్పిడీపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏడీఏ చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి మున్నా, సీఐలు, ఎస్ఐలు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
మంచి నడవడికతో గౌరవం పొందాలి
వనపర్తి: సమాజంలో మంచి నడవడికతో జీవిస్తూ అందరి ఆదరణ, గౌరవం పొందాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని ఠాణాల్లో నేరచరిత్ర కలిగిన 85 మంది రౌడీషీటర్లు, 75 మంది అనుమానితులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, సాధారణ ప్రజా జీవనానికి ఇబ్బందులు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని, అలాంటి వారిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. జిల్లా పరిధిలో సత్ప్రవర్తన కలిగి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను గుర్తించి పోలీసు రికార్డుల్లో నేరచరిత్రను తొలగిస్తామని, తమ కుటుంబ సభ్యులతో జీవితాన్ని గడపాలని కోరారు. అలాగే ఏదైనా, ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారం అందించే బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించారు. హింసతో ఏదీ సాధించలేమని, ప్రతికార చర్యలకు కాకుండా పరస్పరం చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ రవిపాల్, సీసీఎస్ ఎస్ఐ జయన్న, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ ప్రజావాణికి 12 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 12 వినతులు వచ్చినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. అర్జీదారులు వివిధ సమస్యలపై నేరుగా ఎస్పీని కలిసి వినతులు అందించారు. ఎస్పీ స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారికి ఫోన్చేసి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
సాగని పనులు.. పారని నీరు
నిలిచిన సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు కొల్లాపూర్: నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు ముందుకు సాగడం లేదు. భూ సేకరణ సమస్య కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ కాల్వ నిర్మాణంపై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. నిర్మాణం పూర్తయితే సాగునీటి సమస్యలు తీరుతాయని భావిస్తున్నా.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ● మూడేళ్ల కిందటరూ.147.7 కోట్లు మంజూరు ● భూ సేకరణే ప్రధాన అడ్డంకి ● నిర్మాణం పూర్తయితే 34 వేల ఎకరాలకు సాగునీరు -
ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అచ్చంపేట/ బల్మూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రణాళిక, జీఓ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతలు, ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో చేపట్టనున్న పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందే తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు. అచ్చంపేట నియోజవర్గానికి, తమకు విడదీయని బంధం ఉందని, అన్న మల్లు అనంతరాములుతోపాటు మల్లు రవి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేశారని, తాను అప్పట్లో విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికి వచ్చానని గుర్తుచేసుకున్నారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే.. నీళ్లు, నిధులు, నియామకాలంటూ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న యువతకు గత పాలకులు అన్యాయం చేశారని డిప్యూటీ సీఎం విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామని, ఇప్పటికే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేసిందని, దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు ఈ ఆలోచన చేయలేదని వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు సోలార్ కరెంట్, పంపుసెట్లు, డ్రిప్ స్ప్రింక్లర్లను వినియోగించి ఉద్యానశాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, నిమ్మ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని.. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించామని తెలిపారు. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం బీఆర్ఎస్ పనులు చేపట్టింది తప్పా పూర్తిచేయలే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
197 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. సోమవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయని.. సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారని వివరించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,907 మంది విద్యార్థులకుగాను 1,755 మంది హాజరుకాగా.. 152 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 607 మంది విద్యార్థులకుగాను 562 మంది హాజరుకాగా 45 మంది రాలేదని వివరించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నరేంద్రకుమార్, శ్రీనివాసులు పెబ్బేర్, కొత్తకోట పరీక్ష కేంద్రాలను, జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని తాను తనిఖీచేసినట్లు తెలిపారు. రామన్పాడులో 1,016 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం సముద్ర మట్టానికిపైన 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా జలాశయానికి నీటి సరఫరా నిలిపివేశారని.. రామన్పాడు జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
గోపాల్పేట: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. మిల్లులకు ఎంత తరలించారు, ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని గోదాంను పరిశీలించారు. గోదాంలో ధాన్యం నిల్వ చేసేందుకు అనుకూలమైన వాతావరణం, పటిష్ట భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తయితే మండలానికి సంబంధించిన ధాన్యం ఇక్కడే నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. స్థానిక నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. నేడు పీఎఫ్ సమస్యలపై సదస్సు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీఎఫ్ ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి గాను మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ‘నిధి ఆప్కే నిక్కత్–2’ నిర్వహించనున్నామని రీజినల్ పీఎఫ్ కమిషనర్–1 తేజ్ప్రతాప్సింగ్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సులు మహబూబ్నగర్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్, నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయం, వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం, నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాలలోని ఎన్ఎస్ ఎంటర్ప్రైజెస్ (బీడీ మాన్యుఫ్యాక్చర్స్), గద్వాల పీఏసీఎస్లో, రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మున్సిపల్ కార్యాలయంలో, వికారాబాద్ జిల్లా తాండూరులోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో కొనసాగుతాయన్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలోని షేక్పేట్ నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాలలో, హైదరాబాద్ పీఎఫ్ రీజినల్ ఆఫీస్–2లో జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని పీఎఫ్ ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నేడు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో మంగళవారం 11వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు బాలురు, బాలికలను ఎంపికలు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. స్థానిక మినీ స్టేడియంలో అండర్–8 బాలురు, బాలికల విభాగంలో 60తోపాటు 200 మీటర్ల పరుగు పందెం, టెన్నిస్ బాల్ త్రో, అండర్–10 బాలురు, బాలికల విభాగంలో 60తోపాటు 300 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్–12 బాలురు, బాలికల విభాగంలో 60, 300, 600 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ఫుట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని, వీరు జూన్ 1వ తేదీన సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
వనపర్తి: బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్తో ఆమెతో పాటు కమిషన్ సభ్యురాలు బండి అపర్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం, విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాలల హక్కులను రక్షించడంతో పాటు గౌరవించాలని, వాటిని కాపాడే అధికారం కమిషన్కు ఉంటుందని వివరించారు. జిల్లాల్లో బాలలకు అందుతున్న విద్య, పోక్సో చట్టం అమలు, బాధితులకు అందుతున్న పరిహారం తదితర విషయాలను సభ్యురాలు బండి అపర్ణను అడిగి తెలుసుకున్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, చిన్నారులు మానసిక రుగ్మతలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థినులు, యువతులు, మహిళల భద్రత పోలీసుశాఖ మొదటి ప్రాధాన్యమని, భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని కోరారు. బాలల సంరక్షణకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఎం
పాన్గల్: మండలంలోని రేమద్దులలో రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామంలోని పార్టీ కార్యాలయంలో రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న పేదలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, గ్రామ కొత్త చెరువు అలుగు వద్ద వంతెన నిర్మాణంతో పాటు నల్లకుంట వరకు సీసీ రహదారి నిర్మించాలని కోరారు. అలాగే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో మిగిలినవి అమలు చేయాలన్నారు. పేదలకు న్యాయం చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంకటయ్య, భగత్, ఎం.వెంకటయ్య, ఖాజా, మల్లేష్, భాస్కర్, నిరంజన్, భాస్కర్గౌడ్, తిరుపతయ్య, బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు. కోయిల్సాగర్లో 11 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్హౌస్ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్ సాగర్కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. -
ప్రశాంతంగా జీపీఓ ఎంపిక పరీక్ష
వనపర్తి: జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన గ్రామ పరిపాలన అధికారుల ఎంపిక పరీక్ష సజావుగా జరిగిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తం 97 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 90 మంది హాజరుకాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీచేసి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. జవాబు పత్రాలను స్పెషల్ మెస్సెంజర్ ద్వారా ఎస్కార్ట్తో జేఎన్టీయూ విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చేరవేయాలని లైజన్ అధికారి భానుప్రసాద్ను ఆదేశించారు. ఆయన వెంట పరీక్ష నిర్వహణ నోడల్ అధికారి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ నోడల్ అధికారి సుబ్రమణ్యం, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గురురాజ్, తహసీల్దార్ రమేష్రెడ్డి, అర్ఐ మధు, అబ్జర్వర్ సుధీర్రెడ్డి ఉన్నారు. -
సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ
వనపర్తిటౌన్: ఆపరేషన్ సిందూర్తో భారతదేశ రక్షణ వ్యవస్థ బలాన్ని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండకు ప్రతీకారంగా భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయం, సైనికులకు మద్దతుగా ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్ల మీదుగా పార్టీ జిల్లా కన్వీనర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్లామిక్ టెరర్రిస్ట్ గ్రూప్లు కుట్ర పూరితంగా పహల్గాంలో 28 మందిని అతికిరాతకంగా చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఈ నెల 7న ఉదయం కేవలం 20 నిమిషాల వ్యవధిలో పౌర సమాజానికి విఘాతం కలగకుండా 9 ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి వందలాది మంది టెరర్రిస్టులను అంతమొందించి దేశ రక్షణ వ్యవస్థ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేశారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా విద్యార్థి, యువజన, కుల, ప్రజాసంఘాలు, రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పెద్దసంఖ్యలో తిరంగా ర్యాలీలో పాల్గొని దేశ జవాన్లకు నేను సైతం మద్దతు అంటూ ఐక్యతను చాటారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్రెడ్డి, నాయకులు పురుషోత్తంరెడ్డి, బి.శ్రీశైలం, చిత్తారి ప్రభాకర్, హేమారెడ్డి, రిటైర్డ్ ఆర్మీ జవాన్ల సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్రెడ్డి, రత్నాకర్రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతను మించిన సంపద లేదు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వనపర్తి టౌన్: దేశ భవిష్యత్కు యువతను మించిన సంపద లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత సరైన మార్గంలో పయనించకుంటే దేశ భవిష్యత్ అంధకారమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పానియాలు, పదార్థాల బారిన పడకుండా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చెడు వ్యసనం లేని భారతావనే లక్ష్యంగా ముందుకు సాగితే అగ్రగామిగా నిలబడుతోందని దీమా వ్యక్తం చేశారు. ధనవంతుల పిల్లలు అత్యధికంగా ఫ్యాషన్ మోజులో పడి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని తెలిపారు. ఒత్తిడికి గురైనప్పుడు ధ్యానం, యోగా చేయాలని తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ప్రతి అంశానికి ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండటం నేర్చుకోవాలని, మౌనానికి మించిన సంపద లేదని వివరించారు. అనంతరం వ్యసనం లేని సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు నషాముక్త్ భారత్ రథాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అఖ్తర్, కమర్మియా, యాదయ్య, బాబా, సమద్, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు శోభ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
నేడు బల్మూర్కు ఉప ముఖ్యమంత్రి రాక
బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్కు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన గ్రామానికి చేరుకొని విద్యుత్ సబ్స్టేషన్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల పనులు, సభ ఏర్పాట్లను విద్యుత్శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లోని బేగంపేట ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు గ్రామానికి చేరుకుంటారన్నారు. అక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రూ.25 కోట్లతో పోల్కంపల్లి, రూ.1.82 కోట్లతో బొమ్మనపల్లి, రూ.1.73 కోట్లతో పదర, రూ.2.54 కోట్లతో గట్టుతుమ్మెన్, రూ.2.24 కోట్లతో లింగాల మండలం బాకారం, రూ.2.49 కోట్లతో ఉప్పునుంతల మండలం కంసాన్పల్లి, రూ.2.74 కోట్లతో వంగూరు మండలం ఉల్పర, రూ.1.99 కోట్ల అంచనాలతో అచ్చంపేట మండలం సింగారంలో నిర్మించనున్న సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం 12 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారని వివరించారు. కాగా ఉప ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రణాళికతో పక్కాగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన నాగర్కర్నూల్ కలెక్టర్ సంతోష్ -
నీటి వృథాకు అడ్డుకట్ట
పూర్తయిన జూరాల ఎడమ కాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతు సుమారు 30 ఏళ్ల కిందట.. జూరాల ఎడమ కాల్వ కింద జిల్లాలో సుమారు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏడాదికి రెండుసార్లు పంటలకు సాగునీరు అందిస్తారు. సుమారు 30 ఏళ్ల కిందట బిగించిన షట్టర్లు వంగిపోయి దెబ్బతినడంతో మూసినా నీరు వృథాగా పారుతోంది. వారబందీ సమయంలో లీకేజీల కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథా అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు. యాసంగిలో వారబందీ విధానంలో రామన్పాడు రిజర్వాయర్ వరకు సాగునీటిని వదిలారు. సమాంతర కాల్వకు మోక్షమెన్నడో? భీమా ఫేజ్–2 ఎత్తిపోతల కోసం సమాంతర కాల్వను ఏర్పాటు చేశారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు వస్తున్న నీటిని కాల్వ ద్వారా పంపింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. కాని భీమా అధికారులు కాల్వ ప్రధాన షట్టర్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం 150 క్యూసెక్కుల నీరు కాల్వలో వృథాగా పారుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమకాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిపివేసినా షట్టర్ల లీకేజీలతో రోజు కాల్వలో వృథాగా పారి జలాశయంలో నిల్వ నీటిమట్టం తగ్గుముఖం పట్టేది. నిత్యం 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు వృథా అవుతుండటంతో అధికారులు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వకు 4 సాధారణ, 4 ఎమరెన్సీ షటర్లు ఉండగా.. 4 సాధారణ షట్టర్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతుంది. దీంతో వీటి మరమ్మతుకు రూ.7.50 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వేగంగా మరమ్మతులు పూర్తిచేశారు. ఇకనుంచి యాసంగి సీజన్లో ఆయకట్టుకు వారబందీ సమయంలో సాగునీరు నిలిపివేసే సమయంలో చుక్కనీరు ముందుకు పారకుండా షట్టర్లను పక్కాగా బిగించనున్నారు. నాలుగు షట్టర్లకు రూ.7.50 లక్షల వ్యయం వారబందీ సమయంలో నీరు వృథా కాకుండా చర్యలు ఎట్టకేలకు మోక్షం -
జీలుగతో నేల సారవంతం
పాన్గల్: ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు 50 శాతం రాయితీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని.. పంటల సాగుకు ముందు పొలంలో విత్తి ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్నితే నేల సారవంతమవుతుందన్నారు. జీలుగ సాగుతో కలిగే లాభాలను వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలని సూచించారు. 30 కిలోల బస్తా రాయితీ పోను రూ.2,138 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, కాంగ్రెస్పార్టీ మండల నాయకులు మధుసూదన్రెడ్డి, రవికుమార్, రాముయాదవ్, భాస్కర్యాదవ్, బ్రహ్మయ్య, నరేందర్గౌడ్, మహేష్నాయుడు, ఏఓ రాజవర్ధన్రెడ్డి, సీఈఓ భాస్కర్గౌడ్, విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు నివేదిక అందజేయండి
వనపర్తి: జిల్లాలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల కేటాయింపుపై సమర్థన నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా. సువర్ణ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 41వ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా, ఇందులో 12 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 7.166 హెక్టార్ల అటవీ భూమి ఉన్నట్లు పటం ద్వారా తెలుస్తోందన్నారు. అటవీ భూమి కేటాయిస్తే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. స్పందించిన డా. సువర్ణ 7.166 హెక్టార్ల స్థలం దేని కొరకు కావాలో సమర్థన నివేదిక అందజేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఆదేశించారు. వీసీలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, సెక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునే వరకు పోరాటం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ సర్కారు తెచ్చిన వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునేవరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తులను గుంజుకునేందుకు బీజేపీ ఈ బిల్లును తెచ్చిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లింలకు ఈ బిల్లు వ్యతిరేకమని, అందుకు మద్దతు తెలిపిన టీడీపీకి ఏపీలో ముస్లిం ఓట్లు పడవన్నారు. వేలాది కోట్ల వక్ఫ్ ఆస్తులపై కన్ను వేసిన బీజేపీ సర్కారు వారికి కొల్లగొట్టేందుకు ఈ బిల్లును తెచ్చిందని అందకు సహకరించిన టీడీపీ, జేడీఎస్లకు భవిష్యత్లో బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఈనెల 25న స్థానిక బాలుర జూనియర్ కలాశాలలో నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ఎంఐఎం అధినేత ఆసదుద్దీన్తో పాటు ఇతర మత పెద్దలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు మోసిన్, అబ్దుల్ సుల్తాన్, అహ్మద్సన, ఇమ్రాన్, ఇద్రీస్, మేరాజ్, హనీజ్, షారుక్, సిద్దిక్, ఇబ్రహీం, నూర్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండోరోజు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 827 మంది విద్యార్థులకుగాను 754 మంది హాజరుకాగా.. 73 మంది గైర్హాజరయ్యారని, అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 74 మంది విద్యార్థులకుగాను 70 మంది హాజరుకాగా.. నలుగురు రాలేదని డీఐఈఓ ఎర్ర అంజయ్య వివరించారు. జిల్లాకేంద్రంలోని జాగృతి, రావూస్, వాగ్దేవి, విజ్ఞాన్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు వివరించారు. రేపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాక ఖిల్లాఘనపురం: మండలంలోని కర్నెతండాకు ఆదివారం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ వస్తున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. మండలంలోని మామిడిమాడ, షాపురం గ్రామాల రెవెన్యూ శివారుల పరిధిలోని 8 గిరిజన తండాల గిరిజనులు పట్టాల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. వెనికితండా, ముందలితండా, బక్కతండా, కర్నెతండా, మేడిబావితండా, ఆముదంబండ తండా, మిట్యాతండాకు చెందిన గిరిజనులు సుమారు 150 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న నాటి రాజుల భూములకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఏళ్ల తరబడి గిరిజనులు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలుపుతూ వారికి అండగా పోరాడేందుకు ముందుకొచ్చామని తెలిపారు. పట్టాల కోసం పోరాడుతున్న అన్ని తండాల గిరిజన రైతులు, భూ పోరాట సమితి సభ్యులు పర్యటనలో పాల్గొని సమస్యలను వివరించాలని కోరారు. పంచముఖికి ప్రత్యేక బస్సులు వనపర్తి టౌన్: అమావాస్య సందర్భంగా ఈ నెల 27న పంచముఖికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు బస్సులు బయలుదేరి పంచముఖికి చేరుతాయని.. దర్శనానంతరం మంత్రాలయం వెళ్లి అక్కడ దర్శనం పూర్తి చేసుకున్నాక తిరిగి పంచముఖికి చేరుకొని అదేరోజు రాత్రి బయలుదేరి ఉదయం 5 వరకు జిల్లాకేంద్రానికి చేరుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూరాలకు 5,609 క్యూసెక్కుల వరద ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం సాయంత్రానికి 5,609 క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.657 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. -
దేశ సమైక్యత కోసమే జై సంవిధాన్ యాత్ర
పెద్దకొత్తపల్లి: దేశ సమైక్యత కోసమే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర చేపట్టామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్ గ్రామంలో కొనసాగిన జైసంవిధాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి యాత్ర ప్రారంభించగా.. చెన్నపురావుపల్లి గ్రామం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, నాయకులు నర్సింహ, విష్ణువర్ధన్రెడ్డి, గోపాల్రావు, మధు, వెంకటస్వామి, శివకుమార్రావు, చిన్నయ్య, ఎల్లయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
వనపర్తి విద్యావిభాగం: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కలర్చన అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భావం, సంస్థ అందించే ప్రయోజనాలను వివరించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం 2012, మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకుగాను పోష్ యాక్ట్ 2013, డ్రగ్స్, మత్తు పదార్థాలు తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ నెల 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సాయం పొందాలని, మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్రెడ్డి, సైన్స్ ఉపాధ్యాయుడు జి.సుదర్శన్రావు, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, సురేష్, దయాకర్, వెంకటేష్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
నేతన్నలను ఆదుకుంటాం
అమరచింత: పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో వస్త్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నేత కార్మికులతో పాటు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు నాబార్డు తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీజీఎం ఉదయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని నాబార్డు సీజీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం సందర్శించి రోలింగ్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన చీరలు రోలింగ్ కోసం గద్వాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. మహిళలు కుట్టు శిక్షణ పొందడమే గాకుండా పలు రకాల డిజైన్ల వస్త్రాలను కుట్టడంలో మెళకువలు నేర్చుకున్నారని చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ తయారు చేస్తున్న వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయస్థాయితో పాటు ఆన్లైన్ మార్కెటింగ్కు కావాల్సిన మద్దతునిస్తామని హామీనిచ్చారు. అనంతరం మగ్గాలపై జరీ చీరలు తయారు చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి ఆదాయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తాము సైతం కంపెనీ యజమానులమని.. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి లాభాలు సమానంగా చేరుతాయని కార్మికులు వివరించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం దీప్తి సునీల్, డీడీఎం మనోహర్రెడ్డి, ఆర్డీఎస్ సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, కంపెనీ డైరెక్టర్లు పబ్బతి వెంకటస్వామి, అశోక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్ష
వనపర్తి: జిల్లాకేంద్రంలో మే 25న జరిగే గ్రామ పరిపాలన అధికారుల స్క్రీనింగ్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. గత ప్రభుత్వం వివిధ శాఖల్లో నియామకం చేసిన వీఆర్వోలు, డిగ్రీ ఉత్తీర్ణులైన వీఆర్ఏలను ప్రస్తుత ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులుగా నియమించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆసక్తిగల 97 మంది వీఆర్వోలు, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకోగా వారికి మే 25న ఆదివారం రాత పరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని, విద్యుత్ సదుపాయం ఉండాలన్నారు. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడానికి వీలులేదని.. అభ్యర్థులను ఉదయం 9.30 నుంచి 10 వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. పోలీసుశాఖ తగిన బందోబస్తు కల్పించాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఏఓ భానుప్రకాశ్, తహసీల్దార్ రమేష్రెడ్డి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, పుర అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణలో జాప్యం సరికాదు
వనపర్తి: వచ్చిన వరి ధాన్యం త్వరగా దించుకొని లారీలు తిరిగి పంపించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రైస్మిల్లు నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైస్మిల్లర్లతో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి తూకం చేసి మిల్లుకు చేరిన ధాన్యం లారీలను తాలు, దొడ్డు రకం తదితర కారణాలు చూపుతూ దించుకోకుండా జాప్యం చేస్తుండటంతో లారీలు ఎక్కడికక్కడ నిలిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతోందని.. లారీలు మిల్లుల వద్ద నిలుపుకోవడానికి వీలు లేదని హెచ్చరించారు. దొడ్డు రకం ధాన్యం తీసుకోమని చెప్పడం సరికాదని.. సన్న, దొడ్డు రకం 60:40 శాతం మేర కేటాయిస్తున్నందున దించుకోవాల్సిందే అని తేల్చిచెప్పారు. గతేడాది యాసంగిలో జిల్లావ్యాప్తంగా 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈసారి మూడింతలు అధికంగా పంట దిగుబడి వచ్చిందని.. ఇప్పటి వరకు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, మరో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల రైస్మిల్లర్లు సహకరించాలని, రైతులు ఇబ్బంది పడేలా చేయవద్దని కోరారు. అదేవిధంగా కొందరు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేదని, వెంటనే అందజేయాలని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని పౌరసరఫరాలశాఖ డీఎంను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, రైస్మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, మిల్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు. మిల్లర్లు లారీలను త్వరగా ఖాళీచేసి పంపించాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
మరమ్మతుల జాడేది?
జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట సమస్యలు●నిధులు కేటాయించాలి.. జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చటంతో పాటు లైనింగ్ దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి మరమ్మతులకు నిధులు కేటాయించాలి. రెండేళ్లుగా కాల్వ వెంట మరమ్మతులు చేపట్టడం లేదు. కనీసం పూడికతీత, ముళ్లపొదల తొలగింపు వంటి పనులైనా పూర్తిచేయాలి. – హన్మంతు, రైతు, నందిమళ్ల ప్రతిపాదనలు పంపించాం.. ప్రధాన ఎడమ కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి అందజేశాం. నిధులు మంజూరు చేస్తే మరమ్మతులు చేపడతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల జలాశయం అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ అధికారులు రెండేళ్లుగా సంబంధితశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నా.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుగాకపోవడంతో మరుగునపడ్డాయి. ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడటాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతులకు ఎన్ని నిధులు అవసరం అన్న విషయాలను నివేదిస్తూనే ఉన్నారు. వర్షాకాలం రాకముందే మరమ్మతులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. నిధులు ఎప్పుడు మంజూరవుతాయని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జూరాల ప్రధాన జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. ప్రాజెక్టు సమీపంలో ఉన్న వాటిని గుర్తించలేని అధికారులు వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎప్పుడు గుర్తిస్తారని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ మరమ్మతులకు అధికారులు సిద్ధమయ్యారు. వీటిని గతేడాది వేసవిలో పూర్తి చేయాలని నిర్ణయించినా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, కత్తేపల్లిలో రెండు ప్రధాన పనులు నిలిచిపోయాయి. వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఆయకట్టు ఇలా.. జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు మొత్తం 1.20 లక్షల ఎకరాలుగా నిర్ధారించినా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలుగుతున్నారు. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల మీదుగా 100 కిలోమీటర్ల పొడవునా కాల్వ విస్తరించి ఉంది. వీటిని ఆయా మండలాల్లో కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీటిని ఎడమకాల్వ వెంటే విడుదల చేస్తుంటారు. పెచ్చులూడిన లైనింగ్ రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం నిధుల మంజూరుకు ఎదురుచూపులు ముగుస్తున్న వేసవి.. వర్షాకాలంలో గండ్లు పడే ప్రమాదం -
అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే చర్యలు
వనపర్తి రూరల్: అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం శ్రీరంగాపురం మండలంలో పర్యటించారు. మొదట కంభాళాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు వడ్ల భారతమ్మ, శైలజ ఇళ్లను పరిశీలించారు. ఆన్లైన్లో వివరాల నమోదు సమయంలో ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోలు కాకుండా ప్లాట్ వద్ద దిగిన ఫొటోలు ఉండటంతో అనుమానం వచ్చిన కలెక్టర్ వారి ఇళ్ల వద్దకు వెళ్లి చూశారు. భారతమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో కూలగొట్టుకోవడం చూశారు. శైలజ ఇల్లు చూసి ఇందిరమ్మ ఇంటికి అర్హురాలిగా నిర్ధారించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. పనులు నాణ్యతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి శేరుపల్లికి చేరుకొని పక్కా ఇళ్లలో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సిఫారస్ చేసిన పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యను ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగి చేసిన సిఫారస్ను పరిశీలించకుండా అనుమతించినందుకు ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలని.. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాకే సిఫారస్ చేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ విఠోభా, తహసీల్దార్ మురళిగౌడ్, ఎంపీడీఓ రవినారాయణ తదితరులు ఉన్నారు. -
గోదాం వినియోగంలోకి తెస్తాం..
మండల కేంద్రంలో 1.20 లక్షల సంచుల సామర్థ్యంతో నిర్మించిన గోదాంను వినియోగంలోకి తెచ్చి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని గోదాంను ఆయన పరిశీలించి రహదారికి స్థలం ఇచ్చిన ఇరువురు రైతులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రహదారి సమస్యతో ఇంతకాలం గోదాంను వినియోగించుకోలేకపోయామని.. యుద్ధప్రాతిపదికన మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని రైతుల ధాన్యాన్ని గోదాంకు చేరవేస్తామని చెప్పారు. హమాలీల సంఖ్య తక్కువగా ఉండటంతో ధాన్యాన్ని సకాలంలో తూకం చేయడం లేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా.. పక్క గ్రామాల్లోని హమాలీలను వినియోగించుకోవాలని తహసీల్దార్ వరలక్ష్మిని ఆదేశించారు. గ్రామంలోని హమాలీలు అడ్డుకుంటే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్యయాదవ్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, నాయకులు రవీందర్రెడ్డి, బస్వరాజుగౌడ్, ఏపీఎం బిచ్చన్న ఉన్నారు. -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్లో జఠిలంగా పరిహారం.. పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం. రిజర్వాయర్లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ డెడ్లైన్.. డిసెంబర్ మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి డెడ్లైన్.. కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్లోపు కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో సాగు నీరందిస్తాం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం. – విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే జై సంవిధాన్
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే సహించం.. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను మోసం చేసి.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. రైతులు పంటను సకాలంలో కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులను తాలు పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. అనంతరం మండలంలోని మియాపూర్లో పిడుగుపాటుకు గురై మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు కొత్త కళ్యాణ్రావు, చంద్రశేఖర్ యాదవ్, రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి, జ్యోతిగౌడ్, మహదేవ్ గౌడ్, తేజారెడ్డి, రంజిత్కుమార్, విభీషన్, జగదీశ్, ప్రకాశ్, పురేందర్ పాల్గొన్నారు. చిన్నంబావి: రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం చిన్నంబావి మండలం వెల్టూరు నుంచి చిన్నమారూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు. ప్రధాని మోదీకి బడాబాబులే ముఖ్యమయ్యారని విమర్శించారు. మహాత్మా గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. -
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
కొత్తకోట రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యా న్ని వేగంగా తరలించేందుకు అదనపు లారీలను అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు సూచించా రు. బుధవారం కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో అదనపు కలెక్ట ర్ సమావేశమై మాట్లాడారు. మిల్లులకు ధాన్యం తర లింపులో జాప్యం చేయొద్దన్నారు. వీలైనంత వేగంగా ధాన్యాన్ని తరలించేందుకు అదనంగా లారీలను ఏర్పా టు చేయాలన్నారు. కొత్తకోట మండలంలో 80శాతం పైగా ధాన్యాన్ని తరలించినట్లు చెప్పారు. అనంతరం పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని రైస్మిల్లును అదనపు కలెక్టర్ పరిశీలించారు. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని సూ చించారు. ఆ తర్వాత పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి.. మండలంలో ఇంకా ఎంత ధాన్యం తరలించాల్సి ఉంది.. ఎన్ని లారీలు కావాల్సి ఉందనే వివరాలను అధికారులతో తెలుసుకున్నారు. -
లబ్ధిదారుల ఎంపిక వేగవంతం
వనపర్తి: జిల్లాలో రాజీవ్ యువవికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి 28,110 దరఖాస్తులు అందగా.. అర్హులైన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ. 126.34 కోట్లు సబ్సిడీ రూపంలో మంజూరయ్యాయని చెప్పారు. ఇందులో వనపర్తి నియోజక వర్గానికి రూ.72.03 కోట్లు మంజూరు కాగా.. 15,388 దరఖాస్తులు వచ్చాయన్నారు. మక్తల్ నియోజవర్గానికి సంబంధించి రూ. 14 కోట్లు మంజూరు కాగా.. 3,114 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. దేవరకద్ర నియోజకవర్గంలో 4,334 మంది దరఖాస్తు చేసుకోగా.. రూ.9.24 కోట్లు మంజూరయ్యాయన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి రూ. 22.19 కోట్లు మంజూరు చేయగా.. 5,274 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖలకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. నెలాఖరులోగా అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, మైనార్టీ కార్పొరేషన్ అధికారి అఫ్జలుద్దీన్ తదితరులు ఉన్నారు. రాజీవ్ యువవికాసం పథకానికి 28,110 దరఖాస్తులు నెలాఖరులోగా అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
పరీక్ష జరగలేదు.
సీయూఈటీ పరీక్ష రా సేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – మహేశ్కుమార్, విద్యార్థి, మద్దూరు వర్షంలో తడుచుకుంటూ వచ్చాం.. రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి. – సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల ఏపీ ఎంసెట్ వదులకున్నా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వర కు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు స మాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రా యాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి. – సాయివర్షిణి, విద్యార్థి, మరికల్ -
సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ప్రథమ సంవత్సరంలో 3,631 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,092 మందితో కలిపి మొత్తం 5,723 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు ఒక డీఈసీ, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను డీఐఈఓ ఎర్ర అంజయ్య పరిశీలించారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ● నేటి నుంచి 29వ తేదీ వరకు కొనసాగనున్న పరీక్షలు ● జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 5,723 మంది విద్యార్థులు -
పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు
వనపర్తి: వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఒక వటవృక్షం లాంటిదని.. పార్టీ నీడన ఉండే ప్రతి నాయకుడు, కార్యకర్తను కాపాడుకుంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో కొందరు ప్రతిపక్ష నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ తగాదాలు ఉన్నాయంటూ అసత్య విమర్శలు చేస్తున్నారన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు పరిశీలకులు సంజయ్ ముదిరాజ్, గౌరీ సతీష్ సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశం తమ ఐక్యతను చాటుతోందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలోనే అప్పులకుప్పగా మార్చిందని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం కొత్త, పాత భేదం లేకుండా పనిచేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు లభిస్తాయన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, పీసీసీ డెలిగేట్ శంకర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
అంతా మా ఇష్టం!
నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయింపులు వివరాలు 8లో u●డిక్లరేషన్ తీసుకున్నాం.. సాటెక్స్ యంత్రాలు లేని కొత్త మిల్లులకు ధాన్యం కేటాయించ లేదు. అయితే పాత మిల్లర్లతో రెండు, మూడు నెలల్లో ఏర్పాటు చేసుకుంటామని చెప్పడంతో.. వారితో డిక్లరేషన్ తీసుకుని ధాన్యం కేటాయించాం. పాత మిల్లుల్లో కొన్నింటిలో సాటెక్స్ యంత్రాలు లేని మాట వాస్తమే.. త్వరలో ఏర్పాటు చేయిస్తాం. – కాశీవిశ్వనాథ్, డీఎస్ఓ వనపర్తి: రైస్మిల్లులకు సీఎంఆర్ కేటాయింపుల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చితే చాలు.. సీఎంఆర్ పెండింగ్లో ఉన్నా, మిల్లుల్లో సాటెక్స్, బ్లెండింగ్ యంత్రాలు లేకపోయినా ధాన్యం కేటాయింపులు చేస్తూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. సాటెక్స్ యంత్రాలు లేని మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేయవద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఇక్కడి అధికారులు సీఎంఆర్ నాణ్యతా విషయాన్ని గాలికి వదిలేసి.. తమ స్వలాభం కోసం నచ్చిన మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. బియ్యం అప్పగించే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే తమకేంటి నష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బ్లెండింగ్ యంత్రాలు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం పేదలకు పౌష్టికాహారంతో కూడిన బియ్యం సరఫరా చేయాలనే సదుద్దేశంతో సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయించిన మిల్లులకు పౌరసరఫరాల శాఖ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్స్ సరఫరా చేస్తోంది. వాటిని సమపాళ్లలో కలిపి మిల్లర్లు సీఎంఆర్ అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా బ్లెండింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నిర్దేశించిన మేరకు ప్రతి 50 కేజీల బస్తాకు అర కిలో పౌష్టికాహారం గల బియ్యం కలుపబడుతుంది. కానీ మిల్లర్లు చాలా మంది ఈ యంత్రాలను సైతం ఏర్పాటు చేసుకోలేదు. సదరు మిల్లర్లు పౌరసరఫరాలశాఖ అధికారులను ప్రసన్నం చేసుకుని ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి మండలంలో సాటెక్స్ యంత్రాలు లేని మిల్లు మిల్లులో ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు, బియ్యం రంగు మారకుండా నాణ్యతగా మరాడించేందుకు సాటెక్స్ యంత్రాన్ని ప్రతి రైస్మిల్లులో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని.. ఈ యంత్రం ఏర్పాటు చేసుకున్న మిల్లులకే సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపులు చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. బియ్యాన్ని స్క్రీనింగ్ చేయడంతో పాటు కలుషితాలను ఈ యంత్రం సమర్థవంతంగా తీసివేసి శుద్ధి చేస్తుంది. ఈ యంత్రంలోని సెన్సార్లు బియ్యం రంగు, సైజును స్పష్టంగా గుర్తించి.. రంగుమారిన బియ్యం గింజలతో పాటు సాధారణ బియ్యం గింజ కంటే తక్కువ సైజు (నూకలను) వేరు చేస్తుంది. చెడు గింజలను గుర్తించి వెంటనే ఎయిర్ ప్రెషర్తో వాటిని బయటకు నెట్టివేస్తుంది. సీఎంఆర్ అప్పగించే మిల్లుల్లో ఈ సాటెక్స్ మిషన్లు ఉంటేనే.. ప్రజాపంపిణీ వ్యవస్థకు నాణ్యమైన బియ్యం వస్తాయనే దృక్పథంతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ పై నిబంధనలను రూపొందిస్తే.. స్థానిక అధికారులు వారి స్వార్థం కోసం నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. సాటెక్స్ యంత్రంతో బియ్యం నాణ్యత.. జిల్లాలో 74 రైస్మిల్లుల ఎంపిక సగానికి పైగా మిల్లుల్లో సాటెక్స్, బ్లెండింగ్ యంత్రాలు కరువు బియ్యం నాణ్యతపై తీవ్ర ప్రభావం సగానికి పైగా మిల్లుల్లో.. సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయించాలంటే ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, డీఎస్ఓ మిల్లులను పరిశీలించాలి. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ రూపొందించిన నిబంధనల మేరకు మిల్లుల్లో సాటెక్స్, బ్లెండింగ్ యంత్రాలు ఉన్నాయా.. ధాన్యం స్టోరేజీ కోసం గోదాములు, తూకాలు వేసేందుకు వే బ్రిడ్జి, ఆధునిక యంత్రాల సామర్థ్యం తదితర వివరాలను పరిశీలించిన తర్వాత ధాన్యం కేటాయింపులకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవేవీ లేకుండా స్థానిక పౌరసరఫరాలశాఖ అధికారులు అడ్డగోలుగా ధాన్యం కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టాస్క్ఫోర్స్ విచారణ చేపడితే.. చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి
వనపర్తి: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మత పెద్దలతో ఏర్పాటుచేసిన శాంతి సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. బక్రీద్, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు సమన్వయం చేయాలన్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా వచ్చే పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా పరిధిలో పశుసంవర్ధక శాఖ సిబ్బందితో మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్ధారిత పత్రాలు ఉంటేనే అనుమతిస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువుల అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు తీసుకురావద్దని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే.. సామరస్య పరిష్కారానికి పోలీసు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ప్రజల ఐక్యత, సామరస్యానికి భంగం కలిగించే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సామా జిక మాధ్యమాలపై పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా పెట్టిందని తెలిపారు. అదే విధంగా సభలు, సమావేశాలు, ర్యాలీలకు కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థ న కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, పశువైద్యశాఖ ఏడీ మీరజ్ అహ్మద్, వెటర్నరీ డాక్టర్ మల్లేష్ ఉన్నారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే సమాచారం ఇవ్వాలి ఎస్పీ రావుల గిరిధర్ -
వైద్యానికి వెతలు!
ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత ●సిబ్బందిని నియమించాలి.. ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి నర్వ, చిన్నచింతకుంట, దేవరకద్ర, మదనాపురం, అమరచింత తదితర ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది లేక సరైన వైద్యసేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఆస్పత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కొత్త భవనం నిర్మించి వైద్యులను నియమించాలి. – రాజు, సీపీఎం మండల కార్యదర్శి, ఆత్మకూర్ ఇబ్బందులు పడుతున్నాం.. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడుతోంది. వర్షాకాలంలో వర్షపు నీరు గదుల్లోకి చేరుతుండటంతో రోగు లు ఇబ్బందులు పడుతు న్నారు. వైద్యులు, సిబ్బంది నియామకం విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం. – డా. హరినారాయణ, వైద్యాధికారి, కమ్యూనిటీ హెల్త్సెంటర్, ఆత్మకూర్ విధివిధానాలు రావాల్సి ఉంది.. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో వైద్యు లు, సిబ్బంది నియామకాలు జరగాల్సి ఉంది. వైద్య విధాన పరిషత్ నుంచి కమ్యూనిటీ హెల్త్సెంటర్ల క్యాడర్ స్ట్రెంత్ నియామక వివరాలు వెలువడలేదు, విధివిధానాలు రావాల్సి ఉంది, త్వరలోనే పూర్తిస్థాయిలో నియామకాలు జరగనున్నాయి. – డా. చైతన్యగౌడ్, జిల్లా సూపరింటెండెంట్, కమ్యూనిటీ హెల్త్సెంటర్స్ ఆత్మకూర్: జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో వైద్యులు, సిబ్బంది సరిపడా లేక సరైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఆత్మకూర్, రేవల్లి ఆస్పత్రుల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడుతున్నాయి. పారుశుద్ధ్యం లోపించి రోగాలకు నిలయంగా మారుతున్నాయి. 2022లో వైద్యవిధాన పరిషత్లోకి.. ఖిల్లాఘనపురం, వీపనగండ్ల, రేవల్లి, ఆత్మకూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రులను 2022లో వైద్యవిధాన పరిషత్ పరిధిలో చేర్చి కమ్యూనిటీ హెల్త్సెంటర్లుగా ఉన్నతీకరించారు. ఆయా కేంద్రాల్లో గైనకాలజిస్ట్, డెంటిస్ట్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, ఆఫ్తాల్మిక్, ఈఎన్టీ, పిడియాట్రీషన్, ఇలా 16 మంది వైద్యులు, 14 మంది స్టాఫ్నర్సులు, అన్నిరకాల వైద్యు పరీక్షలు, 25 మందికిపైగా కార్మికులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఎక్కడ కూడా నియామకాలు జరగలేదు. ఆత్మకూర్, వీపనగండ్ల, ఖిల్లాఘ నపురం, రేవల్లి కేంద్రాల్లో ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్నర్సులు మాత్రమే పని చేస్తున్నారు. ● అత్యధిక సాధారణ, అసాధారణ (సిజేరియన్) ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు ఇతర వైద్యసేవలు అందిస్తూ ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రి రికార్డు సొంతం చేసుకుంది. ఏడాదిన్నరగా ఇక్కడి వైద్యులు బదిలీపై వెళ్లడం, కొత్త వైద్యులు, సిబ్బంది లేక పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. శిథిలావస్థకు చేరిన పలు భవనాలు సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్న రోగులు ఆత్మకూర్లో ప్రారంభంకాని డయాలసిస్ సేవలు రంగులు, హంగులతో.. గతంలో అప్పటి అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆత్మకూర్ కమ్యూనిటీ హెల్త్సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. గదుల్లోని పైకప్పు పెచ్చులూడటంతో పాటు వర్షపునీరు లోనికి చేరి రోగులు ఇబ్బందులు పడుతున్నారని, గోడలు తడిసి విద్యుత్షాక్ వస్తోందని సిబ్బంది తమ గోడు వెల్లబోసుకున్నారు. తాత్కాలిక మరమ్మతులకుగాను రూ.5.60 లక్షలు కలెక్టర్ విడుదల చేయగా కాంట్రాక్టర్ గోడలకు రంగులు వేసి బిల్లులు దండుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రైతుల మేలు కోసమే రైతు నేస్తం
మదనాపురం: రైతుల మేలు కోసమే ప్రభుత్వం రైతునేస్తం కార్యక్రమం అమలు చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్ సీజన్పై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ ప్రతి రైతు తన భూమి వివరాలను ధ్రువీకరించుకొని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. పంటల ముందస్తు నమోదు ద్వారా విత్తనాలు, ఎరువులు వంటి ఇన్పుట్స్ సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఆయిల్పాం పంట ద్వారా మార్కెట్లో డిమాండ్ మెరుగుపడే అంశాలు, పంట మార్పిడి, ప్రాసెసింగ్ పరిశ్రమలు అందుబాటులో ఉండటం వల్ల ఆదాయ వృద్ధి జరుగుతుందని వివరించారు. నేల పరీక్ష పునరుద్ధరణ చర్యలు, సరైన పంటల ఎంపిక, ఎరువుల వినియోగం, పొలాల సంరక్షణకు అవసరమైన చర్యలపై అవగాహన కల్పించారు. ఆధునిక టెక్నాలజీ ఆధారంగా వ్యవసాయాన్ని మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా తీర్చిదిద్దడం అవసరమన్నారు. -
పీఎఫ్, కేవైసీలో తప్పులు సరిచేయాలి
అమరచింత: పీఎఫ్, కేవైసీలో తప్పులను వెంటనే సరిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీడీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని ప్రావిడెంట్ ఫండ్ రీజినల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 2 వేల మంది బీడీ కార్మికులు పీఎఫ్, కేవైసీ కానీ ఫలితంగా తమ పీఎఫ్లో జమ చేసుకున్న రూ.కోట్లు అందుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రావిడెంట్ ఫండ్ చట్టం కార్మికుల సంక్షేమం, సోషల్ సెక్యూరిటీ కోసం ఏర్పడిందన్నారు. కానీ, 20 మంది పనిచేసే దగ్గర పీఎఫ్ అమలు చేయాల్సి ఉన్న రాష్ట్రంలో లక్షలాది మంది కార్మిక వర్గానికి అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జమ చేసుకున్న డబ్బులను తీసుకోవడం కోసం సరళమైన పద్ధతిలో విత్ డ్రా సిస్టం రూపొందించాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్లో వేలాది మంది బీడీ కార్మికులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 25 ఏళ్ల కిందట నమోదు చేసుకున్న పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు 2013లో వచ్చిన ఆధార్కు తేడా ఉండటంతో పీఎఫ్ కేవైసీలు కావడం లేదని వీటిని వెంటనే పునరుద్ధరించి బీడీ కార్మికులకు న్యాయం చేయాలని కమిషనర్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్, నాయకులు దేవదానం, బాలకిష్టమ్మ, బాలయ్య, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ వనపర్తి విద్యావిభాగం: ఉపాధ్యాయ వృత్యంత శిక్షణ ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మ్యాథ్స్, సోషల్, ఇంగ్లిష్, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో జీహెచ్ఎం తెలుగు ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియంలో బయాలజీ ఫిజికల్ డైరెక్టర్లు, జెడ్పీహెచ్ఎస్ హరిజనవాడలో హిందీ సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ శిబిరాలు ప్రారంభం కాగా మంగళవారం డీఈఓ అబ్దుల్ గని శిబిరాలను సందర్శించి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ బోధన, డిజిటల్ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రతి పాఠశాలలో పెంచాలని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని చెప్పారు. గ్రామీణ విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి వనపర్తి రూరల్: గ్రామీణ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అన్ని రంగాల్లో పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ అబ్దుల్ గని అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలంలోని యాపర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం శంకర్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యను అన్నివర్గాలు, అన్ని ప్రాంతాల వారికి చేరువ చేసిందన్నారు. ప్రతిఒక్కరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పడుతూ ఫలితాలు సాధించాలన్నారు. గ్రామానికి చెందిన దాత ఎన్ఆర్ఐ సూదిరెడ్డి శ్రీహరిరెడ్డి రూ.40 వేల విలువ చేసే బంగారు నాణేలు అందజేయడం ప్రశంసనీయమని కొనియాడారు. హెచ్ఎం మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సూదిరెడ్డి శ్రీహరిరెడ్డి పాఠశాల అభివృద్ధికి ఎంతో నగదు సహాయం అందించారని, అలాగే పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు 4 గ్రాముల బంగారు నానేలు ఇస్తామని ప్రకటించి, అందజేశారని చెప్పారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు శివాని, శివలక్ష్మిలకు డీఈఓ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, దాత తండ్రి నరేందర్రెడ్డి, హెచ్ఎంతో కలిసి శాలువాతో సన్మానించి ఒక్కొక్కరికి 2 గ్రాముల బంగారు నాణేలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఎంఓ మహానంది, గ్రామస్తులు స్వరాజ్యం, బాబురెడ్డి, ఉపాధ్యాయులు మైనొద్దీన్, ఈశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి సమస్యలు పరిష్కరించాలి
వనపర్తి: పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన గోపాల్పేట మండలంలోని భూ భారతి దరఖాస్తులను జూన్ 2లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గోపాల్పేట మండలంలో ఈ నెల 5 నుంచి 13 వరకు భూ భారతి సమస్యలపై 573 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 155 సెక్సేషన్, 131 సాదాబైనామా, పెండింగ్ మ్యుటేషన్, అసైన్మెంట్ తదితర దరఖాస్తులు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ వచ్చే నెల 2లోగా పరిష్కరించాల్సి ఉందన్నారు. తహసీల్దార్ లాగిన్లో పరిష్కారమయ్యే వాటిని త్వరగా పూర్తిచేయాలని, ఆర్డీఓ లాగిన్కు, కలెక్టర్ ద్వారా పరిష్కరించాల్సినవి కలెక్టర్ లాగిన్ కు పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూ భారతి చట్టం అమలు చేసేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, ఇందుకోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు పాండునాయక్, రాజు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. భూ సమస్య పరిష్కారం మదనాపురం: మండలంలోని ద్వారకనగర్ గ్రామంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యను కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వయంగా మోకా మీదకి వెళ్లి పరిష్కరించా రు. కలెక్టర్ వెంట తహసీల్దార్ అబ్రహం లింకన్, గిర్దా వర్ రాజేశ్వరి, సర్వేయర్ సుచరిత తదితరులున్నారు. -
విస్తరణకు గ్రీన్సిగ్నల్
మల్లన్న చెంతకు.. నాలుగు వరుసల రోడ్డు అనుసంధానంగా మరో రెండు.. ఎన్హెచ్–765కి అనుసంధానంగా కల్వకుర్తి (కొట్ర గేట్)–నంద్యాల–167కే జాతీయ రహదారి ఏర్పాటవుతుంది. అలాగే సోమశిల ఐకానిక్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరపతి వెళ్లే ప్రయాణికులకు 80 కి.మీ., దూరభారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని కల్వకుర్తి వరకు ట్రాఫిక్ మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రెండు వరుసల ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం అంత సులువు కాదు. దీంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ● హైదరాబాద్– డిండి, మన్ననూర్ రహదారికి మహర్దశ ● రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్హెచ్–765 నిర్మాణం ● మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటు ● స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ● మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ.. శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్) 105.6 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది. అత్యంత కీలక మార్గం హైదరాబాద్– శ్రీశైలం– తోకలపల్లి జాతీయ రహదారి–765 రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. దక్షిణకాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే ఎన్హెచ్–765లో 125 కి.మీ., దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. వన్యప్రాణులు తిరిగే 62.5 కి.మీ., ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తూ మిగతా ప్రాంతంలో భూ భాగంలోనే రోడ్డును విస్తరిస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, మైసిగండి, ఆమనగల్, డిండి, మన్ననూర్ మీదుగా ప్రయాణిస్తారు. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఈ మార్గం గుండానే వెళ్తారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 7,750 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని రవాణా శాఖ అంచనా. శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య 10 వేలకు చేరుతుంది. ఇక 2027 నాటికి 12,200, 2040 నాటికి 27,580కి చేరుతుందని ట్రాఫిక్ అధ్యయనంలో తేలింది. అయితే ఈ రహదారి నల్లమల అటవీ గుండా సాగుతోంది. సుమారు 56 కి.మీ., మార్గం అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉండటంతో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుంది. ఈ రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో అటవీ మార్గంలో ఎలివేటేడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. డీపీఆర్ రూపొందించారు.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎలివేటేడ్ కారిడార్ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ప్రమాదాలకు నెలవు.. హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై పెరిగిన వాహనాల రద్దీతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఈ హైవేపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే రహదారిపై తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరించకపోవడంతో పాటు మధ్యలో డివైడర్ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. -
ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
గోపాల్పేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో ధాన్యం సేకరణను నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏదుల మండలం చీర్కపల్లి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ గత పది రోజుల నుంచి లారీల కొరత వలన 7,500 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి కేంద్రంలో ఉండటంతో మిగతా కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీర్కపల్లికి రోజుకు 5 లారీలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్లు జిల్లావ్యాప్తంగా తరుగు, తాలు పేరుతో క్వింటాల్కు 3 కిలోల ధాన్యం తీస్తూ రైతులను దగా చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేవని, ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులకు అవసరమైన కవర్లను ప్రభుత్వమే అందించాలన్నారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసు అధికారులు వచ్చి జిల్లా సివిల్ సప్లయ్, ఐకేపీ అధికారులు, లారీ కాంట్రాక్టర్తో మాట్లాడి రోజుకు మూడు లారీలు వచ్చే విధంగా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. తరుగు, తాలు పేరుతో జరుగుతున్న విషయాన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రమేష్, శేఖర్, మహేష్, శివశంకర్, రాములు, మల్లేష్, కాసీం, శేషయ్య, సత్యనారాయణ, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ఉపాధి
50 రోజుల పాటు శిక్షణ నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు.. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిజాం పాలనలోని సర్వే వివరాలే కోలమానం జిల్లాలో నిజాం పాలనలో సేత్వార్ పేరిట 1938, 1945 మధ్యకాలంలో సర్వే నిర్వహించారు. అప్పట్లో రెవెన్యూ గ్రామాల వారీగా వాటాదారుల సమాచారంతో ఖస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. ప్రభు త్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగించింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వేకు ప్రభు త్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ భూముల సర్వేకు ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు భూ క్రయ విక్రయాల సమయంలో నక్ష సమర్పించాలనే నిబంధన పెట్టడంతో సర్వేయర్లకు ప్రాధాన్యం పెరిగింది. ‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయి భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం ● భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు.. ● లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ పొందేందుకు అర్హులకు అవకాశం ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు నారాయణపేట/నారాయణపేట రూరల్: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నా రు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది. జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు.. -
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు 8 మంది ఎంపిక
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అండర్–9, 11 విభాగంలో జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–9 విభాగంలో 20 మంది, అండర్–11 విభాగంలో 18 మంది క్రీడాకారులకు నాలుగు విడతలు పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ఆర్బిటర్ (కోచ్)లుగా కె.శివకుమార్, హర్షవర్ధన్ వ్యవహరించారు. ముగింపు కార్యక్రమానికి చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ప్రధానకార్యదర్శి మండ్ల వేణుగోపాల్, కోశాధికారి టీపీ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేధస్సుకు పదునుపెట్టే చెస్ క్రీడకు జిల్లాను కేరాఫ్గా మార్చాలనే లక్ష్యంతో అసోసియేషన్ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి రాములు, ప్రచార కార్యదర్శి సుధాకర్, ఈసీ మెంబర్ మోహన్బాబు (యేబు) తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు.. ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అండర్–9 బాలికల విభాగంలో వైష్ణవి రత్న, జె.చైత్రాంగణ, బాలుర విభాగంలో డి.సిద్ధార్థ్, అండర్–11 బాలికల విభాగంలో పాశం కార్తీక, సాన్వి శ్రీ, బాలుర విభాగంలో ఆరుష్రెడ్డి, జి.శ్రీహాన్ ఎంపికయ్యారు. ‘తరుగు పేరుతో తూకాల్లో కోతలు సరికాదు’ వనపర్తి: మిల్లర్లు తరుగు పేరుతో ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తూ రైతులను మోసం చేస్తున్నారని.. ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర అబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి సమీక్ష నిర్వహించి సూచనలు చేసినా మార్పు లేదని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ సోమవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో చిట్యాల రైతులకు జరిగిన అన్యాయంపై ట్రక్షీట్ల ప్రతులతో తూకాల్లో విధించిన కోతలను వివరించారు. అలాగే రైతు బాలస్వామిని అధికారుల ముందుకు తీసుకొచ్చి మిల్లర్లు చేస్తున్న అన్యాయాన్ని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లోనే 40 కిలోల సంచికి 1.50 కిలోలు అదనంగా తూకం చేస్తున్నా.. మిల్లర్లు కోత విధించడం రైతులను దోపిడీ చేయడమేనని మండిపట్టారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. అలాగే డీఎస్ఓ కార్యాలయంలో ఓ వ్యక్తి ఎలాంటి నియామక పత్రాలు లేకుండా కొన్ని నెలలుగా పని చేస్తూ రూ.కోట్ల విలువైన ధాన్యం కేటాయింపు ఉత్తర్వులు తయారు చేస్తున్నారని.. అతడి హోదా ఏమిటనే విషయం కలెక్టర్, అదనపు కలెక్టర్ వెల్లడించాలని కోరారు. ఆయన వెంట స్థానిక, జిల్లా నాయకులు పలువురు ఉన్నారు. గొప్ప నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వనపర్తి రూరల్: నీతి నిజాయితి, కమ్యూనిస్ట్ విలువలను కాపాడిన గొప్ప నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య.. ఆయనను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి అధ్యక్షతన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారితో పాటు పార్టీ జిల్లా నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య పేదల అభ్యున్నతికి పరితపించారని.. ఆయన ఆశయమైన సోషలిజం కోసం దీర్ఘకాలం పోరాటం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కురుమయ్య, బాలస్వామి, మదన్, గట్ట య్య, బీసన్న, రమేష్, నందిమళ్ల రాములు, ఉ మా, రాబర్ట్, బాలరాజు,భాస్కర్, కురుమయ్య, నారాయణ, ఆంజనేయులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
వనపర్తి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు 29వ తేదీ వరకు జరగనుండగా.. మొదటి సంవత్సరం పరీక్షలకు 3,631 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,092 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకుగాను జిల్లావ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్, సమయానికి బస్సులు నడపాలని సూచించారు. ప్రతి కేంద్రంలో మౌలిక వసతులతో పాటు ప్రథమ చికిత్స కిట్లు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలను నియమించాలని వైద్యాధికారిని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాల్లో పోలీసు గస్తీతో పాటు పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చూడాలన్నారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించవద్దని, చీఫ్ సూపరింటెండెంట్లతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. డీఐఈఓ అంజయ్య మాట్లాడుతూ.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 45 వినతులు.. ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అర్జీదారులకు సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ద్వారా జిల్లాకు సంబంధించిన వచ్చిన ఫిర్యా దుల తో పాటు జిల్లా ప్రజావాణి వినతులను ఎప్ప టికప్పుడు పరిష్కరించాలన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 45 వినతులు వచ్చినట్లు కలెక్టరేట్ కా ర్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు బాధ్యత నాదే
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు అవసరమైనా ఉచితంగా అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు చేపడతాం. రానున్న వంద రోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్ అందించి దేశానికి మోడల్గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ అదనపు విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలుబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. స్వంత నియోజకవర్గం నల్లమలలో సాగునీరు, విద్య, ఉపాధి, రోడ్లు, ఇతర అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందని సీఎం అన్నారు. ● ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలకు నిధులు ● ఈ ప్రాంత బిడ్డగా నా బాధ్యత మరింత పెరిగింది ● విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం ● స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రజలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నాదే బాధ్యత. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను గెలిపించి.. నాపై విశ్వాసాన్ని చూపి ఆశీర్వదించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడే అవకాశం దక్కింది. నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేస్తా. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాను’ అని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. సోమవా రం అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. మాచారంలోని చెంచు రైతుల పోడు భూముల్లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్, ప్లాంటేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను పరిశీలించారు. గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పాలమూరు బిడ్డలు అంటేనే తట్ట, పార పని.. ముంబయి, పుణె వలస వెళ్లి కష్టపడేవాళ్లని అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు బిడ్డలే కావాలి. దేశం నలుమూలలా భూములను సస్యశ్యామ లం చేసేందుకు మన బిడ్డలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఎవరైనా నేను పాలమూరుకు చెందిన వాడినని చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది’ అని పేర్కొన్నారు. సభావేదిక వద్దకు నడిచి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిర సౌర జల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి -
నేడు నల్లమలకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు.. ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ స్వగ్రామం కొండారెడ్డిపల్లెలోనూ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్తో నడిచే బోరు మోటారును ఆన్చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకిస్తారు. 11.35 గంటలకు గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి బయలుదేరుతారు. 3 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. -
గట్టెక్కించారు..
అధికారుల ముందుచూపుతో వేసవిలో సాగు, తాగునీటి ఎద్దడి నివారణ పంట ఎండిపోతుంది అనుకున్నా.. యాసంగిలో మూలమళ్ల శివారులో 5 ఎకరాల్లో వరి సాగుచేశా. చివరి రెండు తడులు నీరు అందకపోతే పంట ఎండిపోతుంది అనుకొని ఆశలు వదులుకున్నా. ఎమ్మెల్యే చొరవతో నీటిని వదలడంతో పంట చేతికొచ్చింది. ఎకరాకు 25 కింటాళ్ల దిగుబడి రావడం సంతోషంగా ఉంది. – మోహన్రెడ్డి, సింగంపేట ఉన్నతాధికారుల సూచనలతో.. ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో యాసంగిలో ఆయకట్టులో సాగు విస్తీర్ణం తగ్గించాం. దీంతోపాటు వారబందీ విధానాన్ని పక్కాగా అమలుచేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చివరి తడులుగా రెండు పర్యాయాలు నీటిని అందించాం. ఆయకట్టులో పంటలు ఎండకుండా తగిన చర్యలు తీసుకొని సమస్యను అధిగమించగలిగాం. – జగన్మోహన్రెడ్డి, ఈఈ పీజేపీ నందిమళ్ల డివిజన్ ఎప్పటికప్పుడు మరమ్మతులు.. వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. తాగునీటి పథకాల మోటార్ల మరమ్మతుతో పాటు పైపులైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేశాం. చిన్న చిన్న మరమ్మతులు, సిబ్బంది అలసత్వం కారణంగా అక్కడక్కడ తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగిందే తప్ప తాగునీటి కష్టాలు కలిగించలేదు. – మేఘారెడ్డి, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మిషన్ భగీరథ అధికారుల ముందుచూపు, పక్కా ప్రణాళికతో వేసవిలో సాగు, తాగునీటి కష్టాలు ఎదురుకాలేదు. వారబందీ విధానంలో నిర్దేశించిన ఆయకట్టు సాగునీటిని అందించడంతో రైతులు తమ పంటలను కాపాడుకొని ధాన్యాన్ని విక్రయించుకున్నారు. గ్రామాలు, పట్టణాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేయడంతో జిల్లాలో అక్కడక్కడ మినహా తాగునీటి కోసం జనం రోడ్డెక్కలేదని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 255 గ్రామాలకు జూరాల, కేఎల్ఐ ద్వారా తాగునీటి పథకాలకు నీటిని తరలించడంతో వేసవిలో ఇబ్బందులను అధిగమించినట్లు తెలిపారు. వారబందీ విధానంలో.. జలాశయంలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో యాసంగిలో జూరాల ఆయకట్టును కుదించారు. ఎడమకాల్వ విభాగంలో 85 వేల ఎకరాలకుగాను కేవలం 20 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని.. ఎడమకాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్, రామన్పాడు రిజర్వాయర్ వరకు మాత్రమే రైతులు పంటలు సాగు చేయాలని పీజేపీ అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. మిగిలిన ఆయకట్టు మండలాల్లోని రైతులు పంటలు సాగు చేయొద్దని.. వేసినా నీరందక ఎండిపోవడం ఖాయమని రైతులకు అవగాహన కల్పించడమేగాకుండా ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో టాంటాం వేయించారు. ప్రభుత్వ చర్చలు సఫలం.. జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతుందని, ఇక్కడి ప్రజలకు తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో చర్చలు జరిపింది. దీంతో నారాయణపూర్ డ్యాం నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో కష్టకాలంలో గట్టెక్కినట్లయింది. ప్రియదర్శిని జూరాల జలాశయం జూరాల ఆయకట్టుకు పక్కాగా వారబందీ అమలు ఎగువ నుంచి నీటి సరఫరాతో తీరిన ఇక్కట్లు తాగునీటి సరఫరా ఇలా.. ఏప్రిల్లో జూరాల జలాశయంలో 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉన్న నీటిని వినియోగించి పూర్తిస్థాయిలో అందించేలా మిషన్ భగీరథ అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు సాగారు. జూరాల ప్రాజెక్టు నందిమళ్ల క్యాంపు వద్ద ఉన్న సత్యసాయి తాగునీటి పథకం నుంచి నిత్యం 2 ఎంఎల్డీల నీటిని నారాయణపేట జిల్లాలోని 3 గ్రామాలు, వనపర్తి జిల్లాలోని 9 గ్రామాలకు అందిస్తూ వచ్చారు. రామన్పాడు తాగునీటి పథకం ద్వారా నిత్యం 24 ఎంఎల్డీల నీటిని 12 గ్రామాలు, ఎర్రగట్టు నుంచి 18.45 ఎంఎల్డీల నీటిని 34 గ్రామాలకు అందించారు. అదేవిధంగా కానాయపల్లి నుంచి 20 ఎంఎల్డీల నీటిని 115 గ్రామాలతో పాటు మహబూబ్నగర్లోని 3 గ్రామాలకు.. బుగ్గపల్లి తండా ద్వారా 75 ఎంఎల్డీల నీటిని 87 గ్రామాలతో పాటు కొత్తకోట, వనపర్తి పురపాలికలకు సరఫరా చేశారు. గోపాల్పేట ద్వారా 10 ఎంఎల్డీల నీటిని 44 గ్రామాలు, శ్రీరంగపురం నుంచి 5 ఎంఎల్డీల నీటిని 10 గ్రామాలతో పాటు పెబ్బేరు పురపాలికకు అందించారు. గోపల్దిన్నె ద్వారా 5 ఎంఎల్డీల నీటిని 19 గ్రామాలు, గౌరిదేవిపల్లి ద్వారా 7.7 ఎంఎల్డీల నీటిని రేవల్లి మండలంలోని 8 గ్రామాలు, ఎల్లూరు ద్వారా 13 ఎంఎల్డీల నీటిని వీపనగండ్ల, ఏదుల మండలాలకు సరఫరా చేశారు. -
పాలమూరు అందాలు చూసొదా్దం
పిల్లలమర్రి మహబూబ్నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగులాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ వృక్షానికి 750 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రి వృక్షం. పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. మహబూబ్నగర్లోని మెట్టుగడ్డ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏడు తరాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రి, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, ఆకట్టుకునే ప్రాజెక్టులు, ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో కృష్ణమ్మ ఒడిలో సాగే బోటు ప్రయాణాలు, జలపాతాలు, జంగిల్ సఫారీ.. ఇలాంటి ఎన్నో విశేషాలతో పాలమూరు పర్యాటకం సందర్శకులను కనువిందు చేస్తోంది. రోజురోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్ను జాలీడేస్గా మార్చేస్తోంది. -
50 వేల మె.ట. ధాన్యం ఎక్కడా?
వనపర్తి: ‘జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1.76 లక్షల మెట్రిక్ టన్నుల (మె.ట.) ధాన్యం కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.. 95 వేల మె.ట. ధాన్యం అందినట్లు మిల్లర్ల నుంచి రసీదులు వచ్చాయి.. కొనుగోలు కేంద్రాల్లో 18 వేల మె.ట. ధాన్యం నిల్వ ఉన్నట్లు చూపించారు.. మిగతా 50 వేల మె.ట.కుపైగా ధాన్యం ఎక్కడ ఉంది..? మీరు కాగితంపై ఏం రాసిచ్చినా గుర్తించలేమనుకుంటున్నారా..’ అంటూ అధికారుల తీరుపై రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం పట్టణంలోని కల్యాణసాయి గార్డెన్ ఫంక్షన్హాల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధ్యక్షతన వరి ధాన్యం కొనుగోలు, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం తరలింపునకు సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుందని ప్రశ్నించారు. ఆదివారం ఉదయం ఏడుగురు కాంట్రాక్టర్లు 350 లారీలను కలెక్టరేట్ వద్దకు తీసుకొచ్చి అధికారులకు చూపించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 179 రైస్మిల్లులు ఉండగా.. ఈ సీజన్లో పాత బకాయిలు లేని 74 మిల్లులకే మాత్రమే ధాన్యం కేటాయింపులు చేశామని.. సమావేశానికి 18 మంది మిల్లర్లు హాజరుకావడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. మిల్లర్ల తీరు సరికాదు.. కొందరు మిల్లర్లు కావాలనే తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 1.76 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని.. ఇందుకుగాను రైతుల ఖాతాల్లో రూ.274 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై.. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టుగా 1,208 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. ఇప్పటి వరకు 116 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తికాగా డబ్బులు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. రెండోవిడతలో నియోజకవర్గానికి 3,500 ప్రకారం.. జిల్లాలో 5,825 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా నిర్దేశించుకొని దరఖాస్తుల పరిశీలన చేస్తున్నామని చెప్పారు. అనంతరం రాజీవ్ యువ వికాసంపై బ్యాంకర్లు, ఎంపీడీఓలు, పుర కమిషనర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మార్కెట్ యార్డు చైర్మన్లు శ్రీనివాస్గౌడ్, ప్రమోదిని పాల్గొన్నారు. -
సేంద్రియ ఎరువులను వినియోగించాలి
గోపాల్పేట: పర్యావరణ పరిరక్షణతో రైతులకు మేలు చేకూరుతుందని.. వీలైనంత వరకు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి భూసారం పెంచే సేంద్రియ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్త డా. రాంరెడ్డి సూచించారు. శనివారం మండలంలోని చెన్నూరులో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయశాఖ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై నీరు, పంటలు, చెట్లను సంరక్షించుకునే విధానాలను వివరించారు. రైతులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు తీసుకున్న మందుల వివరాలు, రసీదులను భద్రంగా దాచుకోవాలని, దీంతో కల్తీమందులను నివారించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుందని వివరించారు. భూసార పరీక్షలు చేయించుకొని అనువైన పంటలనే సాగు చేయాలన్నారు. అనంతరం పశు వైద్యాధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి శివతేజ ఆయా శాఖల్లో రైతులకు అందించే రాయితీలను వివరించారు. కార్యక్రమంలో డా. విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రిలో అందగత్తెల సందడి
పిల్లలమర్రి మహావృక్షం వద్ద సుందరీమణులను సన్మానిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీహరి, మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పర్ణికారెడ్డి, తదితరులు విద్యార్థులతో మాటామంతీ.. మహా వృక్షం సందర్శించిన తర్వాత మిస్ వరల్డ్ పోటీదారులు జిల్లాకు చెందిన విద్యార్థులతో చిట్చాట్ చేశారు. నలుగురు విద్యార్థులు నాలుగు ప్రశ్నలు అడిగారు. అందులో ఓ చిన్నారి మీ మిస్ వరల్డ్ జర్నీ గురించి వివరించండని ప్రశ్నించగా.. జపాన్కు చెందిన పోటీదారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మరో చిన్నారి పిల్లలమర్రి సందర్శన తర్వాత వృక్ష సంరక్షణపై మీరు ఇతరులకు అవగాహన కల్పిస్తారా? అని అడిగారు. దీనిపై ఇండియాకు చెందిన పోటీదారు మాట్లాడుతూ ఇండియన్ అని, మాది రైతు కుటుంబమని, చెట్ల గురించి తనకు తెలుసని.. వాటి పెంపకం గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని వివరించారు. విశ్వ వేదికలపై మాట్లాడటానికి సూచనలివ్వాలని ఓ విద్యార్థి కోరగా.. బంగ్లాదేశ్ చెందిన కంటెస్టెంట్ సమాధానమిచ్చారు. ఆత్వవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పారు. చివరగా ఓ విద్యార్థి మీ చిన్ననాటి కలల గురించి చెప్పండని ప్రశ్నించగా.. నేపాల్, థాయ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్కు చెందిన మిస్వరల్డ్ పోటీదారులు స్పందించారు. మహావృక్షం వద్ద 2 గంటలు.. రాజరాజేశ్వర ఆలయం, మ్యూజియం సందర్శన తర్వాత సాయంత్రం 6.01 గంటలకు అందాలభామలు మహావృక్షం వద్దకు చేరుకున్నారు. జిల్లా అటవీ అధికారి సత్య నారాయణ పిల్లలమర్రి చరిత్రను వివరించారు. 700 ఏళ్ల నాటి ఈ వృక్షాన్ని 2018 నుంచి ఎలా సంరక్షిస్తూ వస్తున్నామనే అంశాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం మర్రిచెట్టు సమీపంలో 11 మొక్కలు నాటారు. ఆ తర్వాత మహావృక్షం చెంత ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే టీ, స్నాక్స్ తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దాదాపు 2 గంటలు మహావృక్షం వద్దే ఉన్నారు. అనంతరం చేనేత స్టాల్స్ను సందర్శించారు. గద్వాల, నారాయణపేట చేనేతలు తయారు చేసిన చీరలను పరిశీలించారు. అక్కడే ఉన్న మగ్గాన్ని, వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తొలుత రాజరాజేశ్వర ఆలయం నుంచి.. పిల్లలమర్రికి చేరుకున్న అందాల భామలకు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి సంపంగి, లైట్ పింక్ గులాబీ పువ్వులతో తయారు చేసిన మాలలను వేసి స్వాగతం పలికారు. ముందుగా 16వ శతాబ్దం కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ చరిత్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ ఆలయం ముంపునకు గురైతే ఇక్కడికి తీసుకొచ్చి పునఃప్రతిష్టించినట్లు మిస్వరల్డ్ పోటీదారులకు గైడ్ శివనాగిరెడ్డి వివరించారు. అక్కడి నుంచి మ్యూజియం వద్దకు చేరుకోగా.. వివిధ విగ్రహాలు, శిల్పాల విశిష్టత, పాత రాతియుగం పనిముట్లు, నవీన శిలాయుగపు పనిముట్లు, బృహత్ శిలాయుగపు పాత్రలు, విజయనగర, కుతుబ్ షాహీల కాలంనాటి ఆయుధాలు, విగ్రహాల గురించి వివరించారు. మ్యూజియంలో శాతవాహనుల నుంచి అసఫ్జాహి రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు, రాగి, బంగారు నాణేలతో పాటు మహా శివలింగం, దాని ముందు ఉన్న నంది విగ్రహాల గురించి శివనాగిరెడ్డి వివరించారు. -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ప్రపంచ సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సుందరీమణుల బృందానికి స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గురువారం ఎస్పీ డి.జానకితో కలిసి కలెక్టర్ పిల్లలమర్రిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు.. ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, ఏఎస్పీ రాములు, డీఎఫ్ఓసత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
సాగు ప్రణాళిక సిద్ధం
2025–26 వానాకాలంలో జిల్లాలో పెరగనున్న వరి, పత్తి సాగు విస్తీర్ణం వరి సాగే అధికం.. మండలంలో సాగునీటి వనరులు అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు అధికంగా వరి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ, అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టులో ఎలాంటి వరి వంగడాలు వినియోగించాలో రైతులకు వివరిస్తున్నాం. – అరవింద్, ఏఓ, అమరచింత ప్రణాళికతో ముందుకు.. జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళిక జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదేశాలతో పూర్తి చేశాం. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వాటి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పత్తి, చెరుకు, కంది సాగుకు రైతులు మక్కువ చూపుతున్నారు. వానాకాలం సాగుకు ఎంత మేర విత్తనాలు, ఎరువులు అవసరమనే వివరాలను ఏఓలతో సేకరించి సాగుకు ముందే నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – దామోదర్, ఏడీఏ, కొత్తకోట అమరచింత: జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు వేసవి దుక్కులు దున్నుతూ.. రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లా వ్యవసాయ అధికారి దిశా నిర్ధేశంతో మండల వ్యవసాయశాఖ అధికారులు, ఏఈఓలు వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతేడాది వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 2.48 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా.. ఈసారి 2,55,324 ఎకరాలకు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రైతుల వద్దకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, సంబంధితశాఖ అధికారులు వెళ్లి పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. పంట విస్తీర్ణం (ఎకరాల్లో..) వరి 2,05,570 జొన్న 2,020 పత్తి 15,303 మొక్కజొన్న 9,474 వేరుశనగ 8,266 కంది 7,111 మిర్చి 2,115 చెరుకు 1,356 మినుములు 1,082 ఆముదం 414 వరి, పత్తి సాగుకే ప్రాధాన్యం.. జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వానాకాలంలో రైతులు అత్యధికంగా వరికే ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని గ్రామాల్లో వర్షాధారంతో పత్తి సాగు చేసేందుకు రైతులు ఇప్పటికే తమ పొలాలను చదును చేసి ఉంచారు. జూరాల ఎడమ కాల్వతో పాటు ఎత్తిపోతల పథకాల ఆయకట్టులో వరి సాగు అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం ప్రకటించడంతో వాటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు విత్తేందుకు అనువు 2,05,570 ఎకరాల్లో వరి సాగు అంచనా మొత్తం పంటల సాగు విస్తీర్ణం 2,55,324 ఎకరాలు రైతువేదికల్లో అవగాహన కార్యక్రమాలు.. సాగునీరు పుష్కలంగా లభించే ప్రాంతాల్లో ఎలాంటి పంటలు సాగు చేయాలి.. నీటి వనరులు లేని ప్రాంతాల్లో ఏయే పంటలు సాగు చేయాలనే విషయాలపై రైతువేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంటల మార్పిడితో కలిగే ప్రయోజనాలు, జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో ఎలాంటి వరి వంగడాలను ఎంపికచేసుకోవాలనే విషయాలను వివరిస్తున్నారు. వీటికితోడు ఎరువులు ఏ సమయంలో ఎంత మొత్తం వినియోగించాలి, రసాయన మందులను ఎలా పిచికారీ చేయాలనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. శాసీ్త్రయ పద్ధతిలో సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందవచ్చని చెబుతున్నారు. వేసవిలో భూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలకు హాని కలిగించే కారకాలను నిర్మూలించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
వీపనగండ్ల: కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిల్వచేసిన వరి ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రైతుల ఫిర్యాదు మేరకు గురువారం మండల కేంద్రంలో తూంకుంట సింగిల్విండో ఆధ్వర్యంలో అదనపు కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 379 కొనుగోలు కేంద్రాల నుంచి 1.64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం (80 శాతం) రైతుల నుంచి సేకరించామని తెలిపారు. ధాన్యాన్ని జిల్లాలోని 71 రైస్మిల్లులకు తరలించి నిల్వ చేస్తున్నామని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్మిల్లుల్లో మరాడించి రైతులు నష్టపోకుండా చూస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ వరలక్ష్మి ఉన్నారు. లారీల సమస్య లేకుండా చూడాలి వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వరిధాన్యం తరలించేందుకు లారీల సమస్య లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఎస్పీ, డీటీఓ, కో–ఆపరేటివ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కేంద్రానికి అవసరాన్ని బట్టి లారీలను అందుబాటు లో ఉంచాలన్నారు. సకాలంలో లారీలను సమకూర్చకుంటే కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. గోదాం తనిఖీ.. పాన్గల్: మండల కేంద్రంలోని గోదాంను గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వ చేసిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాల లారీలను త్వరగా ఖాళీ చేసేలా చూడాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు సూచించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాల కోసం ఈ నెల 17 నుంచి 31 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి గురువారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశం 2025, మార్చిలో 10వ తరగతి ఉత్తీర్ణులై సీజీపీఏ 7.0 లేదా 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలలు, రెసిడెన్షియల్, ఎయిడెడ్, నవోదయ, కస్తూర్బా, బెస్ట్ అవైలబుల్, తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందఇ తెలిపారు. ఎంపిక జాబితా జూన్ 5న, ధ్రువపత్రాల పరిశీలన, కళాశాల కేటాయింపు, ఆర్డర్ పొందుట జూన్ 10న జరుగుతుందన్నారు. ఏకలవ్య మోడల్ కళాశాలల్లో.. తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాల బాలానగర్, కల్వకుర్తిలో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాలకుగాను ఎంపీసీలో 14, బైపీసీలో 48, సీఈసీలో 33 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రూపుల్లో (సీబీఎస్ఈ సిలబస్) ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకుగాను 10వ తరగతి పూర్తి చేసిన గిరిజన బాలుర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుకు ధ్రువపత్రాలు జతచేసి 24వ తేదీ సాయంత్రం 4 వరకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్కు అందజేయాలని సూచించారు. 26వ తేదీ ఉదయం 10 గంటలకు బాలానగర్ కళాశాలలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు వనపర్తిటౌన్: కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలకు వనపర్తి డిపో నుంచి డీలక్స్, సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రానుపోను సూపర్ లగ్జరీ బస్సుకు రూ.2,320, డీలక్స్కు రూ.2,040 టికెట్ ధర నిర్ణయించామని.. ఆసక్తి గల భక్తులు, ప్రయాణికులు టికెట్ను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాంటాలను విధిగా పునరుద్ధరించుకోవాలి ఖిల్లాఘనపురం: జిల్లాలోని ధర్మకాంటాలను సకాలంలో తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలని తూనికలు, కొలతల జిల్లా అధికారి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని రైస్మిల్లుల దగ్గర ఉన్న ధర్మకాంటాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల వరి ధాన్యం తూకం చేయించుకున్న రైతులు తూకాల్లో తేడాలను గుర్తించి ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. మూడు కాంటాల్లో వెయ్యి కిలోలకు 10 కిలోల నుంచి 50 కిలోల వరకు ఎక్కువ రావడం జరిగిందన్నారు. దీంతో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని.. టెక్నీషియన్లు అన్ని కాంటాలను సరిచేసినట్లు వివరించారు. సోళీపురంలో సీజ్.. మండలంలోని సోళీపురం గ్రామ ఎస్ఎల్ఎన్ఎస్ రైస్మిల్లు దగ్గర ఉన్న ధర్మ కాంటను సీజ్ చేసి కేసునమోదు చేసినట్లు జిల్లా తూనికలు, కొలతల అధికారి సత్యనారాయణ తెలిపారు. రైస్మిల్లు బయట ఉన్న కాంటను ఎలాంటి అనుమతి లేకుండా లోపలికి మార్చారని.. అదేవిధంగా కాంటా దగ్గర బాట్లు లేకపోవడం, గడువు ముగిసినా పునరుద్ధరించుకోకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. -
పిల్లలమర్రి ‘ముస్తాబు’
● 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి సందర్శన ● మహావృక్షం ఖ్యాతిపైపవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఏర్పాట్లు ● విజయనగర కాలం నాటి ఆలయం.. పురావస్తు మ్యూజియానికి సొబగులు ● తెలంగాణతోపాటు జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా అధికారుల సన్నాహాలు ● వెదురు ఆకృతులు, చేనేత చీరలు, మగ్గాలు, బతుకమ్మలు,బోనాల ప్రదర్శన ● గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం.. గురుకులాల విద్యార్థులతో మాటాముచ్చట ● సుమారు వెయ్యి మందితో పోలీసుల పటిష్ట బందోబస్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 16న ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో పాలమూరు ముస్తాబవుతోంది. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని వారు సందర్శించనుండగా.. మహావృక్షం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. ఆలయం.. మ్యూజియం.. ఆ తర్వాత పిల్లల మర్రి.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు. పిల్లలమర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పురావస్తు మ్యూజియానికి రానున్నారు. ఆ తర్వాత లంబాడాల నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకోనున్నారు. మహా వృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర ఆలయ విశిష్టతతోపాటు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం విశేషాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్లను నియమించారు. గద్వాల, నారాయణపేట చేనేత చీరల ప్రదర్శన.. మన నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రఖ్యాతి గాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజసిద్దంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించనున్నారు. దీంతోపాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్త కళానైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల మర్రి ఆవరణలో 22 మంది అందాల భామల చేతుల మీదుగా వివిధ రకాల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టారు. చివరగా గురుకుల విద్యార్థులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కాసేపు ముచ్చటించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 2 గంటలు.. మూడంచెల భద్రతమిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లకు చెందిన గ్రూప్–2 సభ్యులు 16న సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గాన మహబూబ్నగర్లోని పిల్లలమర్రి వద్దకు నేరుగా చేరుకుంటారు. పలు కార్యక్రమాల అనంతరం తిరిగి రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు తెలిసింది. ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు మూడంచెల బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. రేపు ప్రపంచ సుందరీమణుల రాక గ్రూప్–2లోని 22 మంది అందగత్తెలు.. ఏర్పాట్లు ఇలా.. మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లు పిల్లల మర్రి పర్యటనను పురస్కరించుకుని పురావస్తు, అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊడల మర్రి చుట్టూ మట్టిని చదును చేసి, గ్రాస్ మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహావృక్షం చుట్టూ గోడ, ఊడల మర్రి పునరుజ్జీవంలో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లరతోపాటు సిమెంట్ కుర్చీలకు రంగులు అద్దుతున్నారు. పిల్లలమర్రి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లతోపాటు ప్రత్యేకంగా వాష్రూంలను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మ్యూజియంలోని శిల్పాలను శుభ్రం చేయడంతోపాటు వాటికి నేమ్ బోర్డులు రాయిస్తున్నారు. ఆయా శిల్పాలు ఏ కాలానికి చెందినవి.. ఎవరి హయాంలో తయారు చేశారు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వంటి వివరాలు నేమ్ బోర్డులో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో సౌండ్ అండ్ లైటింగ్, పారిశుద్ధ్య పనులు చకచకా సాగుతున్నాయి. మిస్ వరల్డ్–25 పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరుగుతున్న పోటీల్లో వందకు పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిచెప్పేందుకు ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం వేదికగా మలుచుకుంది. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను గ్రూప్–1, గ్రూప్–2గా విభజించి.. ప్రత్యేక థీమ్, టూరిస్ట్ సర్క్యూట్ల వారీగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పాలమూరులో ప్రఖ్యాతిగాంచిన పిల్లల మర్రిని గ్రూప్–2లోని వివిధ దేశాలకు చెందిన 22 మంది అందగత్తెలు శుక్రవారం సందర్శించనున్నారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలి
వనపర్తి: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని ఠాణాల కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ అప్పగించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలన్నారు. అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ వారి మన్ననలు పొందాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని.. నీతి, నిజాయితీతో పనిచేసే వారికి ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. ఫిర్యాదుదారులు చాలా సమయం వేచి ఉండకుండా వారి బాధలు తెలుసుకొని సెల్నంబర్ కూడా తీసుకొని తక్షణమే పంపించాలని సూచించారు. ఫిర్యాదుదారుతో మర్యాదగా మాట్లాడటంతో చిన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అసాంఘిక, చట్టవ్యతిరేక పనులు చేసే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం సేకరించాలని, రాత్రిపూట ఎక్కువ సమయం పెట్రోలింగ్ నిర్వహిస్తే దొంగతనాలను అరికట్టవచ్చన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వాహన తనిఖీలు చేపడుతూ మైనర్లు వాహనాలు నడిపితే పట్టుకొని ప్రతి సోమవారం తల్లిదండ్రులు, వాహన యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి, ఎస్పీ భేటీ.. ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు బుధవారం సమావేశమయ్యారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఆస్పత్రులపై దాడులు, వైద్యసేవలకు అంతరాయంపై నమోదైన కేసులు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ప్రజారోగ్యంపై ప్రభావం, ఆహార భద్రత, పోలీసుల సహకారం తదితర అంశాలపై మాట్లాడారు. సమావేశంలో అస్పత్రి సూపరింటెండెంట్ రంగారావు, ఇతర సిబ్బంది ఉన్నారు. -
నేటినుంచి డిగ్రీ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలు పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏబీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లతోపాటు పలు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు మెటీరియల్ చేరుకుంది. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 17 ప్రభుత్వ.. 30 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సెమిస్టర్–2లో 16,073 మంది విద్యార్థులు, సెమిస్టర్– 6లో 13,787 మంది, సెమిస్టర్–4లో 9,240 మంది విద్యార్థులు కలిపి మొత్తం 39,100 మంది పరీక్ష రాయనున్నారు. 9 రూట్లలో ఫ్లయింగ్ స్క్వాడ్, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ను నియమించారు. మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. రెండుసార్లు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రారంభం 47 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 39,100 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తిచేశాం.. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా కాపీయింగ్ తావు లేకుండా పకడ్బందీగా, పాదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ -
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు
ఆత్మకూర్: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని, ధాన్యం తరలింపునకు లారీల సమస్య లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం మండలంలోని ఆరేపల్లిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం, పట్టణంలోని రైస్మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలరోజులుగా దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయకుండా సన్నాలను మాత్రమే సేకరిస్తున్నారని రైతులు ఆయనకు వివరించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నామని, ధాన్యం తరలింపునకు లారీలు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు రోజుకు నాలుగు లారీలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ధాన్యం తరలింపులో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తాలు, చెత్త లేకుండా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తూకం వేయాలని, వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ చాంద్పాషా, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, రైతులు ఉన్నారు. -
ఎద్దులబండ్లతో యథేచ్ఛగా
రామన్పాడు, ఊకచెట్టు, చిన్న వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా మదనాపురం: ఇసుక అక్రమ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామాల్లోని చోట మోటా రాజకీయ నాయకుల అండతో ఎద్దులబండ్ల వారితో కుమ్మకై ్క అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం వేళ వాగు నుంచి ఎద్దుల బండ్లపై ఇసుకను గ్రామాల్లోని ఓ చోటకు తరలించి అక్కడ నిల్వచేసి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లతో పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా మండలంలో ఇదే తంతుకొనసాగుతున్నా అధికారులు చూసీచూడ నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.చిన్నవాగు, ఊకచెట్టు వాగు నుంచి సైతం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కో ఎద్దుల బండితో ఐదు నుంచి ఆరు ట్రిప్పులు తరలిస్తున్నారు. రామన్పాడు నుంచేగాక చిన్నవాగు నుంచి దంతనూరు, గోవిందహళ్లి, మదనాపురం, తిర్మలాయపల్లి గ్రామాల ఎద్దుల బండ్లు, ఊకచెట్టు వాగు ఇసుకను దుప్పల్లి, కర్వెన, గోపన్పేట గ్రామాల వ్యాపారులు తరలిస్తున్నారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గి పొలాల్లోని బోరుబావులు ఎండిపోతున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతున్నారు. స్థానిక నేతల అండదండలతోనే.. గ్రామాల్లో డంపులు.. రాత్రిళ్లు ట్రాక్టర్లపై పట్టణాలకుతరలింపు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారులు అనుమతులు లేవు.. వాగుల నుంచి ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ట్రాక్టర్ల యజమానులు అనుమతులు లేకుండా ఇసుక తరలించొద్దు. ఎక్కడైనా ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తాం. – అబ్రహం లింకన్, తహసీల్దార్ -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
మదనాపురం: గ్రామాలు, మండల కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు మండల కేంద్రంతో పాటు ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట మండలాల ఫర్టిలైజర్ దుకాణ డీలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఎరువులు, పురుగు మందులు, విత్తన ధరలు, నిల్వల వివరాలు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలన్నారు. స్టాక్ రిజిస్టర్, రసీదు పుస్తకాలు నిబంధనల ప్రకారం నిర్వహించాలని, బిల్లులు తప్పనిసరిగా రైతులకు అందించాలని సూచించారు. ఇచ్చిన బిల్లులో విత్తనం లేదా పురుగుమందు పేరు, బ్యాచ్నంబర్, తేదీ, ధర తదితర వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. స్టాక్ రిజిస్టర్పై వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ పొందాలని తెలిపారు. సమావేశంలో ఆయా మండలాల ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. -
నాలుగు క్లినిక్లు సీజ్
వనపర్తి: జిల్లాకేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ మండలాల్లో అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ క్లినిక్లను బుధవారం సీజ్ చేసినట్లు డీఈఎంఓ రామకృష్ణ తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు జిల్లాలో అనుమతి లేకుండా, అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నామని.. పెద్దమందడి మండలం బలిజపల్లిలో రెండు, జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్లో రెండు ఆస్పత్రులను సీజ్ చేసినట్లు వివరించారు. అక్రమంగా ఆస్పత్రులు నిర్వహించడంతో పాటు అర్హతకు మించి వైద్యం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీఈఎంఓ హెచ్చరించారు.లేబర్ కోడ్లు రద్దు చేయాలివనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి వారితో కలిసి ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మె వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సార్వత్రిక సమ్మెకు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వివరించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు అధికసంఖ్యలో సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ వరుణ్కుమార్, శేఖర్, సైదాబేగం, భారతి, మణెమ్మ, లక్ష్మి, రాజేశ్వరి, శివలీల, అంజనమ్మ, శ్రీగంగ, శోభ, సుధ, రమ్య, శారద, జయలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.ఇంటి ఆవరణలోకి మొసలివనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండలం కంభాళాపురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈశ్వర్ ఇంటి ఆవరణలో మొసలి కనిపించింది. అతను చూసి చుట్టుపక్కల వారిని పిలిచి వారి సాయంతో మొసలిని తాళ్లతో బంధించారు. సుమారు 6 అడుగుల పొడవు, 60 కిలోల బరువు ఉంటుందని.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తీసుకెళ్లినట్లు ఈశ్వర్ వివరించారు. -
కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తాం
పాన్గల్: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వరి ధాన్యం నిల్వలను వెంటనే లారీల్లో గోదాంకు తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గోదాంను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్తో కలిసి పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో యాసంగిలో అధిక దిగుబడి రావడం, సరిపడా మిల్లులు లేకపోవడం, లారీలు, హామీల కొరతతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, అమరచింత, ఖిల్లాఘనపూర్ మండలాల్లో 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని.. పాన్గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో ధాన్యం సేకరణ, తరలింపులో వేగం పెంచి రైతుల ఇబ్బందులు తొలగిస్తామని వివరించారు. కేంద్రాలకు తాలు, చెత్త లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే మిల్లర్లు ఇబ్బందులకు గురిచేయరని చెప్పారు. మిల్లులు, గోదాంల వద్ద ఆర్ఐ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తూ రోజు వారి నివేదిక తీసుకుంటామన్నారు. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. దీంతో చిన్న, చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో విండో డైరెక్టర్ ఉస్మాన్, కాంగ్రెస్పార్టీ మండల నాయకులు వెంకటేష్నాయుడు, రవికుమార్, మధుసూదన్రెడ్డి, తిరుపతయ్యసాగర్, రాముయాదవ్, విష్ణు, రామచంద్రయ్య, నరేందర్గౌడ్, దర్గయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లలో వేగం పెంచుతాం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో 5 రోజుల పాటు కొనసాగే జిల్లాస్థాయి ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణను మంగళవారం జిల్లా విద్యాధికారి ఘనీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి శిక్షణకు హాజరుకావాలన్నారు. 21 రకాల వైకల్యాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించి వందశాతం సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులను గుర్తించి యూడైస్లో నమోదు చేయించాలన్నారు. సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా తగిన బోధన అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్లు యుగంధర్, శేఖర్, శుభలక్ష్మి, మహానంది, డీఆర్పీ పాల్గొన్నారు. -
సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
వనపర్తి/వనపర్తి రూరల్: రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ భావితరాలకు సారవంతమైన భూమిని అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం నాగవరం రైతువేదికలో జరిగిన రైతునేస్తం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూమిలో సారం తగ్గిందని ఏటా డీఏపీ, యూరియా తదితర రసాయన ఎరువులు అధికంగా వినియోగిస్తే అనతి కాలంలోనే భూమి సత్తువ కోల్పోయి చౌడు నేలగా మారుతుందన్నారు. భవిష్యత్ తరాలకు సైతం భూమి ఉపయోగపడి పంటలు పండాలంటే సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. పంట వేసే 45 రోజుల ముందు జీలుగ, పచ్చ రొట్ట, పెసర, జనుము వంటి పంటలు సాగు చేసి పూత దశలో ట్రాక్టర్తో తొక్కించడంతో సేంద్రియ ఎరువుగా మారుతుందని తెలిపారు. దీంతోపాటు పశువుల ఎరువు వాడటంతో అధిక దిగుబడి రావటమే కాకుండా భూమి సారవంతంగా మారుతుందన్నారు. జిల్లాకు జీలుగ విత్తనాలు 1,010 క్వింటాళ్లు సరఫరా అయ్యాయని, మరో రెండు వేల క్వింటాళ్ల విత్తనాలు పంపించాల్సిందిగా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. ప్రతి మంగళవారం రైతువేదికల్లో నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారని.. రైతులు సద్వినియోగం చేసుకొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. భారత్లో ఆయిల్పాంకు చాలా డిమాండ్ ఉందని, సాగు వైపు ఆలోచించాలని కోరారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ మాట్లాడుతూ.. జీలుగ, పచ్చ రొట్ట విత్తనాలు పీఏసీఎస్ కేంద్రాల్లో విక్రయిస్తున్నారని, పొలాల్లో పండించి పూత దశలో రోటోవేటర్తో దున్నటంతో మట్టిలో కలిసి నేల సారవంతంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్రెడ్డి, తహసీల్దార్ రమేష్రెడ్డి, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
భవిష్యత్ ఆయిల్పాం సాగుదే..
వనపర్తి రూరల్: ఆయిల్పాం సాగుకు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో బోయిని వాసు సాగుచేసిన ఆయిల్పాం తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించామని చెప్పారు. దీర్ఘకాలం ఆదాయం పొందడంతో పాటు అంతర్గతంగా ఇతర పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ శారద, నాయకులు ఆవన్ననాయుడు, చిట్యాల రాము, నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.18న చెస్ పోటీలువనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18న జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 9, 11 బాలలకు చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోటీలు జరుగుతాయని.. మొదటి, రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల బాలలు పోటీలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంఘం జిల్లా అధ్యక్షుడు (సెల్నంబర్ 97034 62115), కోశాధికారి టీపీ కృష్ణయ్య (సెల్నంబర్ 99591 54743) సంప్రదించాలని సూచించారు.రామన్పాడుకు నీటి సరఫరా నిలిపివేతమదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి నీటి సరఫరా నిలిపివేసినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. మంగళవారం నాటికి జలాశయంలో సముద్ర మట్టానికిపైన 1,015 అడుగులు ఉందన్నారు. తాగునీటి అవసరాలకు జలాశయం నుంచి 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలివనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అఽధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ నెల 20న జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని.. కార్మికులు, రైతులు, కూలీలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్వరాచారి, ఎండీ జబ్బార్, గోపి, లక్ష్మి, సాయిలీల, మదన్, బాలస్వామి, గంధం గట్టయ్య, అలివేలు తదితరులు పాల్గొన్నారు.ఉత్సాహంగాబండలాగుడు పోటీలువనపర్తి రూరల్: మండలంలోని చిమనగుంటపల్లిలో లక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం గ్రామస్తులు అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. మొత్తం 5 జతల ఎద్దులు పోటీలో పాల్గొనగా చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన ఎం.గోపాలకృష్ణ ఎద్దులు మొదటి బహుమతి గెలువగా రూ.40 వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. అలాగే తాడూరు మండలం యాదిరెడ్డిపల్లికి చెందిన డా. అఖిలేష్రెడ్డి ఎద్దులు రెండో స్థానంలో నిలువగా రూ.30 వేలు, జ్ఞాపిక, నల్గొండ జిల్లా కొప్పోలు ఐతరాజు సత్యనారాయణ ఎద్దులు మూడోస్థానంలో నిలువగా రూ.20 వేలు, జ్ఞాపిక అందించారు. -
ముగిసిన రెవెన్యూ సదస్సులు
గోపాల్పేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతిలో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలెట్ మండలంగా గోపాల్పేటను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 13 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మంగళవారం చివరిరోజు మండల కేంద్రంతో పాటు బుద్దారం గ్రామంలో సదస్సులు కొనసాగగా.. గోపాల్పేటలో 39, బుద్దారం గ్రా మంలో 67 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా మొత్తం 590 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ పాండు తెలిపారు. మంగళవారంతో దరఖాస్తుల స్వీకరణ ముగిసిందని.. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డితదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి కలెక్టర్ అర్జీదారులతో వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ద్వారా వచ్చిన వినతులతో పాటు జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి మొత్తం 66 వినతులు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ప్రజావాణిలో డీఆర్డీఓ ఉమాదేవి, అన్నిశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
పాన్గల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా సహకార అధికారి (డీసీఓ) రాణి ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రాల వద్ద నీడ, తాగునీటి వసతి కల్పించాలని, తేమశాతం, సన్న, దొడ్డురకం ధాన్యం గుర్తింపునకు యంత్రాలు, రైతుల వివరాల రికార్డు తప్పక ఉండాలన్నారు. అలాగే తాలు, చెత్త లేకుండా చూసి ధాన్యం తూకం చేయాలని, సేకరణలో జాప్యం చేయొద్దని.. ఆలస్యం జరిగితే కారణాలను రైతులకు వివరించాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాలు పేరుతో తరుగు, ధాన్యం తరలింపునకు లారీలు రాక కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని పలువురు రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏడీఏ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ రమేష్బాబు, సీనియర్ అడిటర్ బీక్యానాయక్, మహబూబ్అలీ, కిరణ్, రాజునాయక్, ఏఓలు రాజవర్ధన్రెడ్డి, డాకేశ్వర్గౌడ్, మురళీధర్, సీఈఓ భాస్కర్గౌడ్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. రేపు జాబ్ మేళా వనపర్తి టౌన్: జిల్లాలోని నిరుద్యోగులకు వనపర్తి, హైదరాబాద్లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేందుకుగాను జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో పీఎంకేకే సహకారంతో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని పీఎంకేకేలో జరిగే జాజ్ మేళాకు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి పది, ఐటీఐ, ఏదైన డిగ్రీ, బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ చదివిన వారు అర్హులని.. ఎంపికై న వారికి శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు అన్ని ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్నంబర్లు 99485 68830, 77990 73053, 91753 05435 సంప్రదించాలన్నారు. 15, 16న విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2025– 26)లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు గాను ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల మహబూబ్నగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కేటీదొడ్డి, అచ్చంపేట, మన్ననూర్, పెద్దమందడి, కొండాపూర్లో ఈ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో చేరేవారు మొదటి రోజు బాలురకు, రెండో రోజు బాలికలకు జిల్లాకేంద్రం శివారు ధర్మాపూర్లోని ఆల్ మదీనా బీఈడీ కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. -
పోలీసు ప్రజావాణికి 7..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 7 వినతులు వచ్చాయి. ఎస్పీ రావుల గిరిధర్ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యయత్నం.. జిల్లాకేంద్రంలోని బుడగజంగాలకాలనీకి చెందిన ఎస్.శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఎస్పీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు సంపాదించిన ప్లాట్లు, ఇల్లు పంపకంలో పెద్ద మనుషుల పేరుతో జోక్యం చేసుకున్న తాజా మాజీ కౌన్సిలర్ ధౌర్జన్యానికి పాల్పడుతున్నారని.. రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని తెలిపారు. గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై వారిని నిలువరించారు. అనంతరం బాధితుడిని ఎస్పీ వద్దకు తీసుకెళ్లగా తనకు జరిగిన అన్యాయం, పంపకాల పేరుతో తన వద్ద తీసుకున్న డబ్బుల వివరాలతో ఫిర్యాదు అందించారు. -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
గోపాల్పేట: రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. సోమవారం మండలంలోని మున్ననూరులో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరి యా, పురుగు మందులను తగిన మోతాదులో వినియోగించాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు భూసార పరీక్షలతో కలిగే లాభాలు, పంట అవశేషాలను కాల్చడంతో కలిగే నష్టాలను వివరించారు. సాగు సమయంలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, అలాగే పంటమార్పిడి చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో పంటల సాగు, ఆయిల్పాం సాగు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, కరుణశ్రీ, హరీశ్నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. వనపర్తి టౌన్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సోమవారం జిల్లాకేంద్రంలోని తన స్వగృహంలో 68 మంది లబ్ధిదారులకు రూ.34.03 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా మత్స్యకార సెల్ అధ్యక్షుడు నందిమళ్ల యాదయ్య, పెద్దమందడి మండల అధ్యక్షుడు సి.పెంటన్న, నారాయణ, జిల్లా సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్, పట్టణ ప్రధానకార్యదర్శి అడ్వొకేట్ బాబా, నాయకులు ఎత్తం చరణ్, రాగి వేణు, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్రెడ్డి, అబ్దుల్లా, జానంపేట నాగరాజు, అనీష్, గోవర్ధన్, గట్టు రాజు, సొప్పరి రమేష్ పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకుసాగాలి వనపర్తి: విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్ కోసం ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా ముందుకుసాగాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు సాయి శరణ్య, శ్రీచరణ్, భార్గవి, అమూల్యశ్రీని ఎస్పీ శాలువాలతో సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల కృషికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరమని, పిల్లలు సంస్కారాన్ని పెంపొందించుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. విశ్వకర్మ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారోజు తిరుపతయ్య, యాదగిరి, గౌరవ అధ్యక్షులు బైరోజు చంద్రశేఖర్, సూర్యనారాయణ, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, డా. బి.శ్యాంసుందర్, అరవింద్, ప్రకాష్, రామ్మోహన్, శ్రీనివాసాచారి, శ్రీశైలం పాల్గొన్నారు. -
మత్తు రహిత జిల్లాగా మారుద్దాం
వనపర్తి: జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి నార్కోటిక్, నషా ముక్త్ భారత్ సమీక్షలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని, విద్యాశాఖ అధికారులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు గట్టి నిఘా ఉంచి మత్తు పదార్థాల విక్రయం, రవాణాను అరికట్టాలని కోరారు. ఒకప్పుడు పట్టణాలకే పరితమైన గంజాయి వినియోగం రానురాను గ్రామీణ ప్రాంతాలకు పాకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ.. పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, నిఘా ఉంచాలని కోరారు. విద్యాలయాలు, ఆస్పత్రులకు 100 మీటర్ల పరిధిలో పాన్, గుట్కా, సిగరెట్ వంటివి అమ్మకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ క్యాంపెయిన్లు నిర్వహించి యువతకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల ఆవరణలో మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిని ఆదేశించారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో 2017 నుంచి గంజాయి కేసులు నమోదవుతున్నాయని, ఇటీవల వీపనగండ్ల మండలంలో ఓ పశువుల కాపరి గడ్డి వాములో గంజాయి దాచిన ఉదంతం వెలుగు చూసిందని తెలిపారు. అనంతరం మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, ఆబ్కారీ, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
వనపర్తి రూరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని ఆదేశానుసారం ఆదివారం మండలంలోని అచ్యుతాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య గ్రామస్తులకు చట్టాలు, భూ భారతిపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి రైతులు తెలుసుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణా చేసినా హెల్ప్లైన్ నంబర్ 1908కు ఫిర్యాదు చేయాలన్నారు. బాలలు, వృద్ధులు, మహిళలకు జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ తరఫున ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా న్యాయ సాయం పొందవచ్చతెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది తిరుపతయ్య, పారాలీగల్ వలంటీర్ రవి, దయాకర్, నవనీత్కుమార్, సాయికుమార్ పాల్గొన్నారు. -
యువత క్రీడల్లోనూ రాణించాలి
ఆత్మకూర్: యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టిసారించి జాతీయస్థాయిలో రాణించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని మోట్లంపల్లిలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలకు కులం, మతం, వర్గ విభేదాలు ఉండవని, ప్రతిభ ఉన్నవారు అవలీలగా రాణిస్తారని తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని.. లక్ష్యంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. పోటీల్లో మొత్తం 40 జట్లు తలపడగా మొదటి బహుమతి ఆరేపల్లి జట్టు, ద్వితీయ బహుమతి దేవరపల్లి జట్లు సాధించాయి. వీరికి నగదుతో పాటు జ్ఞాపికలు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో రహ్మతుల్లా, పరమేష్, తులసిరాజ్యాదవ్, నల్గొండ శ్రీను, చెన్నయ్యసాగర్, గంగాధర్గౌడ్, ఆనంద్గౌడ్, రవికుమార్, గోవర్ధన్, నిర్వాహకులు పాల్గొన్నారు. -
వేసవి శిక్షణ.. భవితకు నిచ్చెన
జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగుతున్న శిబిరం ● కోడింగ్ నేర్చుకుంటున్నా.. జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులో చేరాను. రోజువారి చదువులను పక్కనబెట్టి నృత్యం, యోగా, ఆటపాటలు, కోడింగ్ నేర్పుతున్నారు. కోడింగ్ను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. – చందన, 9వ తరగతి, కేజీబీవీ, మదనపురం సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి.. నాకు నృత్యం అంటే ఎంతో ఆసక్తి. దీంతో సమ్మర్ క్యాంపునకు హాజరై రోజువారి అభ్యసనతో పాటు నృత్యం నేర్పిస్తున్నారు. – లక్ష్మి, 8వ తరగతి, కేజిబివీ, మదనాపురం నిత్యం పర్యవేక్షణ.. జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో ఈ నెల 6 నుంచి వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు విద్యార్థినులకు కోడింగ్తో పాటు నృత్యం, కరాటే, యోగా, డ్యాన్స్ తదితర వాటిలో శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేశాం. ప్రతి కేజీబీవీ నుంచి సిబ్బందిని రప్పించి తరగతులు నిర్వహిస్తుండటంతో పాటు ఇతర అంశాలపై శిక్షణనిచ్చేందుకు వలంటీర్లను నియమించాం. రోజు పర్యవేక్షిస్తూ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – శుభలక్ష్మి, జీసీడీఓ అమరచింత: వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా, ఇతర వ్యాపకాలపై దృష్టి సారించకుండా ప్రభుత్వం కేజీబీవీ విద్యార్థినులకు వేసవి శిబిరాలు నిర్వహిస్తోంది. జిల్లాలో 15 కేజీబీవీలు ఉండగా.. ఒక్కో కేజీబీవీ నుంచి ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పదిమంది విద్యార్థినులను ఎంపికచేసి జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో 15 రోజుల పాటు శిక్షణనిస్తున్నారు. శిబిరంలో 100 మంది విద్యార్థులు ఉండాలనే నియమం ఉన్నా.. ఆసక్తిగల వారందరికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు జరిగే శిక్షణలో ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కోడింగ్, స్పోకెస్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. విద్యార్థులందరికీ అక్కడే వసతి కల్పించడంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తుండటంతో శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. నైపుణ్య శిక్షణ... కోడింగ్తో పాటు నృత్యం, కరాటే, యోగా, డ్యాన్స్, ఆటపాటలను నేర్పించేందుకు రోజువారి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం ఆయా రంగాల్లో శిక్షణ పొందిన వలంటీర్లను ఎంపిక చేసి వారికి 15 రోజులకుగాను రూ.2,500 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. రోజు తెల్లవారుజామున విద్యార్థులను నిద్ర లేపి మొదట యోగా చేయించి వాటితో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. అదేవిధంగా రోజు ఒక అంశంపై బోధన, నృత్యం తదితర అంశాలను నేర్పిస్తున్నారు. నేర్చుకున్న విషయాలను పునశ్ఛరణ చేయించడంతో విద్యార్థులు త్వరగా వాటిపై పట్టు సాధిస్తున్నారు. హాజరవుతున్న 15 కేజీబీవీల 115 విద్యార్థినులు ఈ నెల 6న ప్రారంభం.. 20 వరకు కొనసాగింపు కోడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు యోగా, నృత్యం తదితర అంశాల్లో.. ఒక్కో పాఠశాలకు ఒక రోజు.. జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగే వేసవి శిక్షణ శిబిరం నిర్వహణ బాధ్యతను ఆ పాఠశాల ఎస్ఓకు అప్పగించగా.. ఒక్కోరోజు ఒక్కో పాఠశాల సిబ్బందికి కేటాయించారు. కేటాయించిన రోజుల్లో ఎస్ఓతో పాటు సీఆర్టీలు హాజరై ఇచ్చిన టైంటేబుల్ ప్రకారం విద్యార్థినులకు వివిధ అంశాల గురించి బోధిస్తున్నారు. శిబిరం సవ్యంగా కొనసాగేలా జీసీడీఓ పర్యవేక్షణ చేస్తున్నారు. -
పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
వనపర్తి: ప్రస్తుతం వేసవి సెలవులు రావడంతో చాలామంది సొంతూళ్లు, ఇతరత్రా టూర్లకు వెళ్తుంటారని, ఇదే అదునుగా చోరీలు పెరిగే ఆస్కారం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం పెబ్బేరు పోలీస్స్టేషన్ను ఎస్పీ రావుల గిరిధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసి ఆవరణలో ఉన్న వాహనాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పటిష్ట గస్తీ నిర్వహిస్తూ అరికట్టాలను సూచించారు. పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ తప్పకుండా నవీకరిస్తూ ఉండాలని, ఎలాంటి పెండెన్సీ లేకుండా రికార్డుల నిర్వహణ చేపట్టాలన్నారు. పోలీస్స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ను పరిశీలించి బాధితుల పట్ల వ్యవహరించే తీరు, ఫిర్యాదులు పరిష్కరించే విధానాన్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మమేకమై సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, ఎలాంటి రిమార్కులు లేకుండా, ప్రజలలో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించేలా విధులను నిర్వర్తించాలని చెప్పారు. డయల్ 100, బ్లూ కోర్టు సిబ్బంది గ్రామ గ్రామాన సందర్శిస్తూ సమాచార సేకరణలో ముందుండాలన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు ఎస్ఐ యుగంధర్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న ధాన్యం..
గట్టు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఎప్పుడెప్పుడు చేస్తారా అంటూ వేయ్యికళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు. సరిపడా గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపక పోవడంతో ధాన్యం కొనుగోలు నత్తనడకసాగుతున్నట్లు రైతులు ఆరోపించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సంబందించి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక గట్టు విషయానికి వస్తే.. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ధాన్యం కొనుగోళ్లు అప్పగించారు. గట్టు, మాచర్ల, పెంచికలపాడు, ఆలూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా ఆయా కొనుగోలు కేంద్రాల దగ్గర 292 మంది రైతులకు సంబంధించి 33,786 బస్తాలు(40కేజీలు), 13,514 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు సహకార సంఘం అధికారులు తెలిపారు. ఇవి కాక మరిన్ని ధాన్యం రాసులు కొనుగోలు కేంద్రాల దగ్గర అలాగే ఉండిపోయాయి. గట్టులో సుమారుగా 30 వేల బస్తాలు, మాచర్లలో సుమారుగా 25 వేల బస్తాలు, పెంచికలపాడులో 15వేల బస్తాలు, ఆలూరులో 12వేల బస్తాల వరకు కొనుగోలు చేయాల్సి ఉన్నట్లు అంచనా. బయటి మార్కెట్ కన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న చోట వడ్ల ధర అధికంగా ఉండడంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అకాల వర్షాల వలన వడ్లు తడిస్తే ఇబ్బంది అని రైతులు వాపోతున్నారు. అధికారులు త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత గన్నీ బ్యాగులు లేక వడ్ల కొనుగోలు మరింత ఆలస్యం అవుతున్నట్లు రైతులు ఆరోపించారు. గన్నీ బ్యాగుల కోసం ఎదురుచూస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటి వరకు 4 కొనుగోలు కేంద్రాలకు కేవలం 33వేల గన్నీ బ్యాగులు మాత్రమే పంపారని, ఇంకా సుమారుగా 80 వేల బస్తాలు అవసరం ఉన్నట్లు అంచనా. ఇక కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు లారీల సమస్య నెలకొంది. ఇప్పటిదాకా పంపిన గన్నీ బ్యాగులకు సంబందించి వడ్లను తూకం వేసిన అధికారులు వాటిని మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు అధికారులు తెలిపారు. తూకం పట్టిన వడ్ల బస్తాలు సుమారుగా 3వేల వరకు కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన వడ్లను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, సీఈఓ భీమిరెడ్డి తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోలు ఆలస్యమవుతుందని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వేధిస్తున్న గన్నీ బ్యాగుల కొరత కొన్న ధాన్యం తరలింపునకు ఇబ్బందులు రైతులకు తప్పని పడిగాపులు -
సమీకృతం.. పిల్లర్లకే పరిమితం
మున్సిపల్ కేంద్రాల్లో ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం ఒకే దగ్గర విక్రయించాలన్న సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసి సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో అమరచింతలో ఆగమేఘాల మీద చేపట్టిన ఈ పనులు.. ఆ తర్వాత బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ అర్ధంతరంగా వదిలేశారు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా.. పిల్లర్లకే పరిమితమైన సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. – అమరచింత -
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
వీపనగండ్ల: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు సిబ్బందికి సహకరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కల్వరాల, వీపనగండ్ల, తూంకుంట గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు తరలించే ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యాన్ని సమకూర్చాల్సి ఉంటుందని తాలు, మట్టి పెల్లలు ఉండటం వల్ల రైస్ మిల్లు యజమానులు కూడా నష్టపోయే పరిస్థితులు నెలకొంటాయని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రైతులు నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కొర్రీలు పెట్టొద్దు.. చిన్నంబావి: ధాన్యం కొనుగోలులో రైస్మిల్లర్ల యజమానుల పేరుతో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెడుతున్నారని మండలంలోని వెలగొండ గ్రామంలో రైతులు పబ్బేరు ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. ధాన్యంలో దుమ్ము ఉందని తరుగు పేరుతో బస్తాకు 4, 5 కిలోలు తీస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ధర్నాకు మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, సీపీఎం జిల్లా నాయకులు ఆంజనేయులు మద్దతు ఇచ్చారు. దాదాపు అరగంటకుపైగా సాగిన ధర్నాతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎస్ఐ జగన్మోహన్ అక్కడికి చేరుకొని అదనపు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడించడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించి రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, తరుగు పేరుతో అధిక మొత్తంలో ధాన్యం తీస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అమ్మా.. నీకు వందనం
వనపర్తివాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి. వేగంగా ‘టర్ఫ్’ పనులు పాలమూరు ఎండీసీఏ క్రికెట్ మైదానంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025వివరాలు 10లో uసృష్టిలో అమ్మ పాత్ర గురించి వివరిచేందుకు, వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అయితే నా వరకు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా సొంత గ్రామం అప్పారెడ్డిపల్లి వనపర్తి జిల్లా. అమ్మ మణెమ్మ, నాన్న బుచ్చన్న. మేము ఐదుగురం సంతానం కాగా.. ఇద్దరం మగ పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా నాన్న ప్రధానంగా కులవృత్తి వడ్రంగి పనిచేసేవారు. నేను పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలకున్నాను. కానీ, అప్పట్లో కులవృత్తికి బాగా డిమాండ్ ఉండడం, మాది పెద్ద కుటుంబం కావడం.. ఇంట్లో నేనే పెద్ద కుమారుడిని కావడంతో మానాన్న పదో తరగతిలోనే ఆపేసి వండ్రంగి పని నేర్చుకోవాలన్నారు. అయితే మా అమ్మ చదువుకుంటేనే విలువ ఉంటుందని, నన్ను ఇంటర్మీడియట్లో చేర్పించారు. అలా అమ్మ ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పటికీ శనివారం, ఆదివారం వచ్చిందటే చాలు పెద్దోడ ఇంటికి వచ్చివెళ్లు అంటుంది. అంత ప్రేమ పంచడం సృష్టిలో ఒక్క అమ్మకే సాధ్యం. పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లలే. అందుకే మనకోసం కష్టించే అమ్మకు మనం పెద్దవారం అయిన తర్వాత గౌరవించి బాగా చూసుకుంటే వారికి అదే చాలు. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● అమ్మ మాట.. బంగారు బాట.. ● తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. తల్లి ప్రేమ మారదు.. ఉద్యోగరీత్యా మా పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎలాంటి సందర్భంలో నీకు దూరంగా ఉన్నా అనే విషయం చెబితే మా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు మహబూబ్నగర్ ఎస్పీ జానకి. మాకు ఒకే ఒక్క కూతురు హైదరాబాద్లో 8వ తరగతి చదువుతుంది. విధుల్లో భాగంగా నేను మహబూబ్నగర్లో ఉంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడి రావడం.. లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికై నా పిల్లలపై చూపే తల్లి ప్రేమ, వాత్సల్యంలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో జనరేషన్కు ఇప్పటి పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సాంకేతికపరంగా టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. భవిష్యత్పరంగా ఎలా ఉండాలి.. ఇతర అంశాలపై చర్చించడం చేస్తాను. చదువులో కూడా ఏదైనా సందేహాలు, సలహాలు ఇస్తాను. అమ్మాయికి దూరంగా ఉన్నా.. నిత్యం ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటాను. ‘నా చిన్నతనం నుంచి మా అమ్మ శోభ నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా నిలిచారు. మా అన్న, చెల్లెలితో పాటు నన్ను బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెకన్నా ముఖ్యమైన వారు మన జీవితంలో ఎవరూ ఉండరు. నాకు సమయం కుదిరినప్పుడల్లా అమ్మ, నాన్న, కుటుంబసభ్యులతో గడుపుతాను. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎస్పీ, నాగర్కర్నూల్ నేడు మాతృ దినోత్సవం అమ్మను తొలి గురువుగా భావించి ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్ లక్ష్యం నిర్దేశించుకున్నా. వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సాహం అందించి నేడు సమాజంలో గౌరవ ప్రదమైన కలెక్టర్గా ప్రజలకు సేవలందించేందుకు సహకారం అందించారు. నా లైఫ్లో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో మా అమ్మ నర్సమ్మ పాత్ర చాలా కీలకం. ప్రాథమిక విద్య హైదరాబాద్లో.. ఐదో తరగతి నుంచి ఢిల్లీలో చదువుకునేందుకు అమ్మ తన ఉద్యోగ బాధ్యతలను నా కోసం పదేళ్లపాటు ఢిల్లీకి మార్చుకున్నారు. నా జీవిత లక్ష్యం సాధించేందుకు ఎంతగానో మార్గనిర్దేశనం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా అమ్మ పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసించి ఆదాయపన్ను శాఖ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. నా కెరీర్లో రోల్ మోడల్గా నిలిచారు. చిన్న వయస్సు నుంచే ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ.. జీవిత లక్ష్యం సాధించుకునేందుకు వెన్నంటి నడిపించారు. మారుమూల ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టారు. మా నాన్న సురభి సత్యన్నతో జీవితాన్ని పంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్కు వచ్చారు. నాన్న రాష్ట్ర సర్సీసుల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మా కుటుంబ ఉన్నతి కోసం మా అమ్మ ఎంతగానో కృషి చేశారు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్, వనపర్తి అమృత పదం అమ్మ పదాలు తెలియని పెదవులకు అమృత పదం అమ్మ. అమృతం ఆయుష్షు పోస్తుందో.. లేదో.. తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకు అందిస్తుంది. నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవ మాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటిపాపలా చూసుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే తల్లి రుణం తీర్చుకోలేం. అమ్మ మన రేపటి భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – విజయేందిర, కలెక్టర్, మహబూబ్నగర్ తొలి గురువుగా అందరికీ స్ఫూర్తి అమ్మ లేకుంటే నేను లేను సృష్టికి ప్రతి రూపం అమ్మ.. పిలిచే తియ్యని పిలుపే అమ్మ.. ప్రాణం పోసే దేవత అమ్మ.. కన్నపేగు గుండెచప్పుడు అమ్మ.. మమతల ఒడి.. త్యాగాల గుడి.. తొలిబడి అమ్మ.. అమితమైన ప్రేమ.. అంతులేని అనురాగం.. అలుపెరగని ఓర్పు.. మాటల్లో వ్యక్తపరచలేని భావం.. చేతల్లో ప్రదర్శించలేని భాష్యం.. అందుకే అమ్మకు సాటి అమ్మే.. అమ్మకు మించిన దైవం లేదంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. – సాక్షి, నాగర్కర్నూల్/పాలమూరు/ వనపర్తి/గద్వాల/జెడ్పీసెంటర్ తల్లికంటే ముఖ్యులు ఎవరూ ఉండరు.. నా కెరీర్లో రోల్ మోడల్ -
18న నల్లమలకు సీఎం రాక
మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో సభాస్థలం ఇతరత్రా ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రూ.12,600 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రాజెక్టును ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే జిల్లా అధికారులు, ఐటీడీఏతో అనుసంధానంగా ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఆ దివాసీలతో సమావేశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో అనుకూల ప్రదేశం కోసం పదర మండలంలోని పెట్రాల్చేన్, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, మాచారం, వెంకటేశ్వర్లబావి గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ రోహిత్రెడ్డి, డీటీడీఓ ఫిరంగి, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉస్సేన్, మండల అధికారులు, చెంచులు పాల్గొన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్ -
జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు
వనపర్తి: జిల్లాలోని అన్ని మండలాల్లో జూన్ 2 నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్టుగా గోపాల్పేట మండలంలో ఈ నెల 5 నుంచి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిబ్బంది, తీసుకెళ్లాల్సిన రికార్డులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను వెంటనే ఆర్డీఓ లాగిన్కు, అక్కడి నుంచి తన లాగిన్కు పంపించాలని ఆదేశించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించే నాటికి ధరణి లాగిన్లో పెండింగ్ ఉండకూడదని చెప్పారు. భూ భారతి చట్టంలోని నిబంధనలు, ధరణిలో పరిష్కారం కాని వాటిని ఎలా పరిష్కరించాలి.. తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పైలెట్ మండలం గోపాల్పేటలో రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులు, పరిష్కారానికి ఉన్న అవకాశాలు, ఎదురైన సమస్యలను తహసీల్దార్ పాండు వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. అనుమతి లేని ఇళ్లకు నోటీసులివ్వాలి.. ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పుర కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి లేఅవుట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ లే అవుట్ ఆమోదం పొంది ఫైనల్ లే అవుట్ ఆమోదానికి వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించిన రెండు లేఅవుట్లకు కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్న ఏడు దరఖాస్తులను పక్కనబెట్టారు. నిబంధనల ప్రకారం అన్ని మౌలిక వసతులు కల్పిస్తేనే కమిటీ ఆమోదం పొందుతుందన్నారు. అదనపు కలెక్టర్లు జి,వెంకటేశ్వర్లు, యాదయ్య, ఇరిగేషన్ ఇంజినీర్లు, ఆర్అండ్బీ డీఈ, టీపీఓలు, లే అవుట్ యజమానులు, ప్లానర్లు పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం సేకరణ
పాన్గల్: కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన ధాన్యం జాప్యం లేకుండా వెంటనే మిల్లులకు తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం సేకరణ, నిల్వలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గత యాసంగిలో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని మరో రెండ్రోజుల్లో పూర్తిగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు కేంద్రాలకు తాలు, మట్టి, గడ్డి లేకుండా ధాన్యం తీసుకురావాలని, అలాంటి ధాన్యంలో తరుగు తీస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం చిరిగిన బస్తాల్లో కాకుండా కొత్త బస్తాల్లో నింపాలని సూచించారు. లారీలు సక్రమంగా రాకపోవడంతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని, దీంతోపాటు సేకరణ కూడా మందకొడిగా సాగుతుందని పలువురు రైతులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. మిల్లర్లతో మాట్లాడి లారీలను సమకూర్చాలని సూచించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో సింగిల్విండో, ఐకేపీ సిబ్బందితో సమావేశమై కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, సేకరణపై అధికారులతో ఆరా తీశారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందుల గురించి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ జేసీకి వివరించారు. కార్యక్రమంలో సింగిల్విండో సీఈఓ భాస్కర్గౌడ్, ఐకేపీ ఏపీఎం వెంకటేష్యాదవ్, ఆ యా కార్యాలయాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు కొర్రీలు?
లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం ●వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవస్థలు తప్పడం లేదు. తాలు, తేమశాతం, లారీలు, హమాలీల కొరత, మట్టిపెడ్డల శాతం పేరుతో ధాన్యం కొనుగోలుకు కొర్రీలు పెడుతుండటంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. ఇందుకు పలు గ్రామాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఘటనలే ఉదాహరణగా చెప్పవచ్చు. జిల్లాలో సన్న, దొడ్డురకం వరి ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా 481 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో దొడ్డురకం కేంద్రాలు 226, సన్నాలు కొనేందుకు 255 కేంద్రాలు ఉన్నాయి. దొడ్డురకం కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని తరలించేందుకు లారీ డ్రైవర్లు సైతం విముఖత చూపుతున్నారు. మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోరనే భావన డ్రైవర్లలో నెలకొంది. మిల్లర్లు సన్నాలను మాత్రమే తీసుకోవడం, దొడ్డు రకాలను చాలావరకు ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తుండటంతో గోదాముల వద్ద హమాలీలు లేక నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నదాతల ఆందోళన.. తాలు ఎక్కువగా ఉందని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వీపనగండ్ల మండలం తూంకుంట, గోవర్ధనగిరిలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఇటీవల వనపర్తి మండలం అంకూరు, గోపాల్పేట మండలం బుద్దారం గ్రామాల్లోనూ కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాస్తారోకోలు చేశారు. ఈ విషయంపై అధికారులు నిత్యం క్షేత్ర పర్యటనలు చేస్తున్నా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు.. కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు లారీలు సరిపోవడం లేదు. దీంతో రోజురోజు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ధాన్యం కేంద్రానికి తీసుకొచ్చినప్పటి నుంచి లారీల్లో తరలించే వరకు రైతుదే బాధ్యత కావడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శుక్రవారం వరకు జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. రూ.275 కోట్ల ధాన్యం కొనుగోలు.. జిల్లావ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు రూ.275 కోట్ల విలువైన 1,18,871 మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసింది. 65 శాతం మేర ట్యాబ్ ఎంట్రీలు పూర్తికావడంతో చెల్లింపులు సుమారు రూ.165 కోట్ల మేర చేసినట్లు తెలుస్తోంది. తాలు పేరుతో ఇబ్బందులు.. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ.. కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పెట్టారు. తాలును సాకుగా చూపి బస్తాకు మూడు కిలోల వరకు అధికంగా ఽతీసుకుంటున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేసేవారు. – జగన్రెడ్డి, రైతు, తూంకుంట (వీపనగండ్ల) హమాలీల కొరతతో జాప్యం.. ధాన్యం కొనుగోలులో సమస్యలు ఉత్పన్నం కాకుండా రెవెన్యూ అదనపు కలెక్టర్తో కలిసి పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సమస్య వస్తే అక్కడికి వెళ్లి పరిష్కరించి వెంటనే కొనుగోళ్లు చేయిస్తున్నాం. హమాలీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోంది. – జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాలశాఖ తాలు పేరుతో అధికంగా తూకం ఆందోళన బాటలో అన్నదాతలు తరుగు పేరిట దోపిడీ.. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో 40 కిలోల బస్తాకు సుమారు 3 కిలోల ధాన్యం ఎక్కువగా తూకం చేయాలని నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వివిధ ప్రజాసంఘాల నాయకులు నిరసనలు చేసినా.. తీరు మారడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆన్లైన్ వేదికలు.. టీనేజ్ ప్రేమలు
సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ● మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న వైనం ● ఆన్లైన్, మొబైల్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలంటున్న చైల్డ్ సేఫ్టీ అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఘటనలు సాక్షి, నాగర్కర్నూల్: ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, స్నాప్ చాట్, వాట్సప్.. తదితర సామాజిక మాధ్యమాల్లో నిత్యం గంటల తరబడి గడపడం ప్రస్తుతం టీనేజర్లకు సాధారణంగా మారింది. ఇదే క్రమంలో ఆన్లైన్ వేదికల ద్వారా కొత్తగా పరిచయం అయిన వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. బాల్య దశలోనే ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోవడం, మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చాలావరకు ఘటనలు సంబంధిత అధికారుల దృష్టికి సైతం రావడం లేదు. తీరా మైనర్గా ఉన్న బాలికలకు వివాహతంతు పూర్తయ్యాక అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. కఠిన నిబంధనలు ఉన్నా.. మైనర్ వివాహాలు జరిపిస్తే కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మైనర్ పెళ్లిళ్లు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికలను వివాహం చేసుకుంటే యువకుడు, బంధులవులతో పాటు బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. చాలాసందర్భాల్లో ఈ నిబంధనలు అమలుకావడం లేదు. మండలస్థాయిలో చైల్డ్ మ్యారేజీ ప్రొహిబిషన్ ఆఫీసర్లుగా సంబంధిత ఎమ్మార్వోలు, జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా, చాలావరకు వివాహాలు జరిగాక కేవలం కౌన్సిలింగ్లకే పరిమితమవుతున్నారు. చిన్నవయసులోనే ఆన్లైన్ ద్వారా పరిచయాలు ప్రేమ వ్యవహారాలకు దారి తీస్తుండటంతో తల్లిదండ్రులే మైనర్ బాలికలకు గుట్టుగా వివాహాలు జరిపిస్తున్నారు. మరికొంత మంది మైనర్ దశలోనే ఆన్లైన్ పరిచయస్తులను నమ్మి ఇల్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
కొత్తకోట రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో నమూనా ఇందిరమ్మ ఇంటిని తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. అన్ని మండల కేంద్రాల్లో రూ.5 లక్షలతో నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్నామని.. వాటిని చూసి అదే బడ్జెట్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తహసీల్దార్ అనుమతితో ఉచితంగా ఇసుక పొందవచ్చన్నారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే సమయంలో పంచాయతీ కార్యదర్శి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారని, ఇల్లు నిర్మించుకునే వారు స్థానిక నాయకులు, పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత దశల వారీగా నగదు బ్యాంకు ఖాతాలో జమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లినాయుడు, శ్రీనివాస్రెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
‘శ్రామికవర్గ పోరాటాలు ఉధృతం చేయాలి’
వనపర్తి రూరల్: శ్రామికవర్గ పోరాటాలను ఉధృతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కోరారు. కమ్యూనిజం విజయానికి 80 ఏళ్లు పూర్తయినందున శుక్రవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ఆయన హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించాలని సీపీఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని.. అందులో భాగంగా జిల్లాకేంద్రంలో సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్వరాచారి, బాలస్వామి, గట్టయ్య, బీసయ్య, నందిమళ్ల రాములు, శ్రీనివాసులు, విజయ్కుమార్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
రెన్యువల్కు రాశాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.86 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సంవత్సరం చివరలో నిధులు రావడంతో సమయానికి లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. దీంతో ప్రస్తుత 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు కేంద్రానికి రెన్యువల్ కోసం లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పునరుద్ధరించి నిధులు ఇస్తామని ప్రకటించింది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్కర్నూల్ రాయితీపై ట్రాక్టర్లు ఇవ్వాలి.. గతంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇస్తే అన్నదాతలకు ఎంతో ఊరట కలుగుతోంది. పంటల సాగుకు ఖర్చు తగ్గుతుంది. – కదిరే కృష్ణయ్య, రైతు, ఉప్పునుంతల దున్నడానికే రూ.11 వేలు.. ఏటా సాగు ఖర్చు పె రుగుతోంది. ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎద్దులతో చేద్దా మంటే వాటిని మేపేందుక ు మేత లేదు. ఎక రా సాగుకు రూ.25 వేల పెట్టుబడి అయితే అ ందులో రూ.11 వేలు దున్నడానికే పోతోంది. – పుల్యానాయక్, రైతు, గుట్టమీది తండా -
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
వనపర్తి విద్యావిభాగం: పత్రికా స్వేచ్ఛను హరించేలా సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏపీ పోలీసులు అమానుషంగా దాడులు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. గురువారం సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి ప్రెస్క్లబ్ (కమిటీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రెస్క్లబ్ నాయకులు తప్పుబట్టారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చర్యపై న్యాయవ్యవస్థ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించాలని డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం హేయమైన చర్యగా నేతలు అభివర్ణించారు. నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజెప్పే స్వేచ్ఛ పత్రికలకు ఉందని.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు ఎదురుకావద్దని ఆకాంక్షించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న దురుద్దేశంతో ఏపీ పోలీసులతో అక్రమంగా కేసులు నమోదు చేయించడం, వారి వ్యక్తిగత వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు నిర్వహించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ సభ్యులు బోలెమోని రమేష్, రాజు, కొండన్నయాదవ్, శ్రీనాథ్, తరుణ్, శ్రీనివాస్గౌడ్, పురుషోత్తం, గోపాలకృష్ణ యాదవ్, అంజి, యూసుఫ్, రాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. -
ప్రథమ చికిత్స.. ప్రశ్నార్థకం?
వనపర్తిటౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. బస్సుల్లో గాయపడిన, వేసవి తాపానికి తట్టుకోలేక అస్వస్థతకు గురైన వారికి కనీస చికిత్స అందించేందుకు కూడా సౌకర్యాలు లేదు. చిన్నపాటి గాయమైన ప్రయాణికులు ఆస్పత్రులు, మందుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అత్యవసర సమయంలో అవసరమయ్యే మందులు, వేసవిలో కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం లేదు. వనపర్తి డిపో పరిధిలోని 108 బస్సులు రోజు వివిధ ప్రాంతాలకు 60 వేల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తాయి. దీంతో ఆర్టీసీకి రోజుకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా.. ప్రయాణికుల అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ప్రథమ చికిత్స కిట్లను కూడా అధికారులు సమకూర్చలేకపోతున్నారు. కొన్ని బస్సుల్లో పెట్టెలు కనిపిస్తున్నా వాటిలో మందులు లేవు. సూపర్లగ్జరీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెల స్థానంలో టీవీలు, టేప్రికార్డులు బిగించగా.. మరికొన్నింటిలో ఖాళీగా ఉంచారు. కొంతకాలం కింద జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో బస్సు చెట్టును ఢీకొట్టగా డ్రైవర్, ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పెట్టెలో ఉండాల్సినవి.. దూది, బ్యాండేజ్ క్లాథ్, అయింట్మెంట్, గాయం శుభ్రం చేసేందుకు హైడ్రోజన్ పెరాకై ్సడ్, నార్మల్ సైలెన్ తప్పనిసరిగా ఉండాలి. వీటికి అదనంగా పారాసిటమాల్ మాత్రలు, వేసవిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాల్సి ఉంటుంది. డిపోలో ఉన్న బస్సులో చాలా వరకు ప్రథమ చికిత్స పెట్టెలు లేవు. మరికొన్నింట్లో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. కొత్తగా బస్సులు వచ్చినప్పుడే ప్రథమ చికిత్స పెట్టెలో మందులు ఉంటాయని సిబ్బంది పేర్కొంటున్నారు. అద్దె బస్సుల్లో సైతం ఈ పెట్టెలు ఉండటం లేదు. శిక్షణ కరువు.. బస్డ్రైవర్లు, కండక్టర్లకు ప్రథమ చికిత్సపై కనీస అవగాహన కల్పిస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రథమ చికిత్స పెట్టెలో మందులు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తేగాని సమకూర్చరని సిబ్బంది చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధుల కేటాయింపు కూడా అవసరం. ఆర్టీసీ బస్సుల్లో కానరాని కిట్లు కనీస మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లుఅందుబాటులోని లేని వైనం పట్టించుకోని యంత్రాంగం -
వేగంగా సంక్షేమ పథకాల అమలు
వనపర్తి: మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లో ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పుర కమిషనర్లతో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ఉపాధిహామీ పథకం, వర్షాకాలంలో అంటురోగాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జనవరి 26న ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 1,300 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అందులో ఇప్పటి వరకు గ్రౌండింగ్ పూర్తయినవి.. మిగిలినవి పెండింగ్లో ఉండటానికి గల కారణాలు మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదో వారితో ఇష్టం లేదని రాతపూర్వకంగా లేఖలు తీసుకోవాలని.. వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రెండోవిడతలో భాగంగా ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా లక్ష్యం మేరకు ప్రత్యేక అధికారులు స్క్రూటినీ చేసిన జాబితాను తన లాగిన్కు త్వరగా పంపించాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను బ్యాంకులకు అందజేయాలని, ఈ ప్రక్రియ 15వ తేదీగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు 15 లక్షల పనిదినాలు కల్పించేందుకు లక్ష్యంగా నిర్ధేశించామని.. ఇప్పటి వరకు కేవలం 2.60 లక్షల పని దినాలు మాత్రమే కల్పించామని, ఇప్పుడు రోజుకు 40 వేల పని దినాలు కల్పిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేమని చెప్పారు. గ్రామాల్లో ఉపాధి పనులు గుర్తించి అత్యధికంగా కార్మికుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు అవకాశం ఉంటుందని, వచ్చే వన మహోత్సవంలో ప్రతి గ్రామ రహదారికి ఇరువైపులా 6 అడుగుల ఎత్తుగల మొక్కలు నాటాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో దోమలతో డెంగీ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను ప్రతి నెల 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేసేలా చూడాలని, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం.. లైెసన్స్ సర్వేయర్ల శిక్షణకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం) అంశంగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు, ఐటీఐలో డ్రాఫ్ట్ మెన్ సివిల్, డిప్లొమా ఇన్ సివిల్, బీటెక్ సివిల్, ఇతర సమానమైన విద్యార్హత కలిగి వారు అర్హులని.. మీ–సేవ కేంద్రాల్లో ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శిక్షణ ఫీజు ఓసీలు రూ. వేలు, బీసీలు రూ.ఐదు వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని.. ఎంపికై న వారికి జిల్లాకేంద్రంలో 50 పనిదినాల్లో తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 98490 81489, 94419 47339 సంప్రదించాలని సూచించారు. -
అన్నదాతలపై ఆరి్థక భారం
పంచాయతీ కార్యదర్శుల శిక్షణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యఅచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాల ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాకు వివిధ రకాల పరికరాలను అందించేందుకు గాను నిధులు మంజూరు చేస్తుంది. మార్చి 21న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. 2024– 25 ఆర్థిక సంవత్సరం ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాకు 1,341 యూనిట్లకు గాను రూ.3,30,53,000 నిధులు మంజూరయ్యాయి. మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతంపై వీటి ఇవ్వాలని సూచించారు. తక్కువ సమయం ఉండటంతో ప్రచారం కల్పించలేకపోయారు. దీనిపై ఇప్పటికే వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరణలో జాప్యంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైంది. ఈలోగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను వినియోగించలేకపోయారు. దీంతో 2025– 26 కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారా.. లేదా.. అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సం కింద నిధులు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపించారు. అందించే పరికరాలు ఇవే.. రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న పట్టే యంత్రాలు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. కేజీ వీల్స్, తైవాన్ పంపులు, రొటోవేటర్లు, చేతిపంపులు ఎక్కువగా మంజూరయ్యాయి. ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్ల తర్వాత.. వ్వవసాయానికి సంబంధించి ఐదేళ్లుగా వాతావరణం అనుకూలిస్తున్నా.. అన్నదాతలకు ప్రభుత్వం సాయం కరువైంది. ఏడేళ్లుగా యంత్ర సాయం లేకపోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి. 2017 వరకు ఏటా వానాకాలంలో రాయితీ పరికరాలను అందించగా తర్వాత నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖర్చులు, సమయం ఆదా.. కూలీ ఖర్చులతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవాలని రైతులు ఎక్కువగా యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఏటా యంత్రాల కోసం దరఖాస్తు చేయడం.. ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి నెల గడువు కాగా.. కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను మండలాలకు కేటాయించడం తదుపరి మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం.. అనంతరం జిల్లా కమిటీ ద్వారా ఆమోదం తెలిపి, కలెక్టర్ అనుమతితో రైతులకు అందజేయాలి. కాగా.. జిల్లాకు 2014– 15లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయగా.. 2016 నుంచి మాత్రం కేటాయింపులు ఒక రకంగా మంజూరు మరో రకంగా ఉంటోంది. మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో నిధులిచ్చే ప్రక్రియ ఊసేలేదు. ట్రాక్టర్తో కరిగెట దున్నుతున్న ఓ రైతు 2016లో తొలి విడత.. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఈ పథకానికి రూ.5 కోట్లు కేటాయించి, రైతులకు పరికరాలు, అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చేవారు. ఏళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యవసాయ యంత్రాలకు చేయూత కరువు మహిళా రైతులకు 50, ఇతరులకు 40 శాతం రాయితీ పరికరాలు ఆర్థిక సంవత్సరం ముగియడంతో లబ్ధిదారుల ఎంపికకు బ్రేక్ 2018 నుంచి నిధులుకేటాయించని వైనం వ్యవసాయ యాంత్రీకరణ పథకంపునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం -
దరఖాస్తుల ఆహ్వానం
అమరచింత: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుల కోసం నైపుణ్యం గల చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య గురువారం కోరారు. చేనేత వృత్తిలో అత్యంత నైపుణ్యం కలిగి ఉండి 31.12.2024 నాటికి 30 ఏళ్లు నిండి పదేళ్లకు తగ్గకుండా అనుభవం ఉన్నవారు.. డిజైనింగ్ కేటగిరీలో 31.12.2024 నాటికి 25 ఏళ్లు నిండి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, డర్రీస్, జనరల్ వైరెటీస్లో చీరల తయారీపై నైపుణ్యం ఉన్నవారు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న కార్మికులకు రూ.25 వేల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారని తెలిపారు. ఐకేపీ సీసీ శోభకు రాష్ట్రస్థాయి పురస్కారం ఖిల్లాఘనపురం: మండల కేంద్రం క్లస్టర్ సీసీగా పనిచేస్తున్న శోభకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పురస్కారం లభించిందని ఏపీఎం రాంబాబు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు సీసీల్లో జిల్లా నుంచి శోభ ఒక్కరే ఎంపికై నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్యారాజన్ అవార్డును అందజేసినట్లు వివరించారు. దీన్దయాళ్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకంలో భాగంగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు అందించే రుణాల్లో శోభ తన క్లస్టర్ పరిధిలోని ఖిల్లాఘనపురం, వెంకటాంపల్లి, గట్టుకాడిపల్లి, ఆగారం, అంతాయపల్లి, షాపురం గ్రామాల్లోని మహిళా సంఘాలకు రూ.11.50 కోట్ల రుణాలు ఇప్పించినట్లు వివరించారు. ఈ సందర్భంగా శోభను ఐకేపి సిబ్బంది, ఏపీఎంలు అభినందించారు. యూరియా తక్కువగా వినియోగించాలి వనపర్తి రూరల్: రైతులు తమ పంటలకు యూరియాను తక్కువగా వినియోగించాలని పాలెం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరామ్ తెలిపారు. గురువారం మండలంలోని కిష్టగిరి గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని యూరియా వినియోగం, పంటమార్పిడి, సాగునీటి పొదుపు, నాణ్యమైన విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించారు. భూమిలో సారం ఉండాలంటే రైతులు పంటల సాగుకు 40 రోజులు ముందుగానే పచ్చిరొట్ట పైర్లు వేసుకొని పూత దశలో కలియ దున్నాలని, దీంతో భూ సారం దెబ్బ తినకుండా ఉంటుందన్నారు. ముఖ్యంగా వరి, ఇతర పంటల కోతల అనంతరం కొయ్యలను తగలబెట్టరాదని సూచించారు. ఉద్యాన అధికారి శివతేజ మాట్లాడుతూ.. ఆహార పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్పాం తోటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాజారెడ్డి, ఉమా, మహేష్, మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, ఏఈఓ యుగంధర్, గ్రామ రైతులు పాల్గొన్నారు. నిబంధనల మేరకేధాన్యం కొనుగోలు వనపర్తి రూరల్: తాలు, మట్టి లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వాహకులకు సూచించారు. గురువారం మండలంలోని రాజాపేట వరి కొనుగోలు కేంద్రం, కొత్తకోట మండలం అమడబాకుల లక్ష్మీనర్సింహ, పెబ్బేరు మండలం సప్తగిరి, లక్ష్మివారాసి రైస్మిల్, శ్రీరంగాపురం మండలం కంభాళాపురంలోని రైస్మిల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మిల్లులో దొడ్డురకం వరి ధాన్యం 5 వేల బస్తాలు దించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వచ్చిన లారీలను త్వరగా అన్లోడ్ చేసేలా హమాలీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక లారీని అందుబాటులో ఉంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు. -
సాగునీటి రంగం పటిష్టతకు కృషి
వనపర్తి: నియోజకవర్గంలోని గొల్లపల్లి, బుద్ధారం రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాములు, కాల్వల మరమ్మతుకు రూ.1,323 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని నీటిపారుదలశాఖ సీఈ కార్యాలయంలో ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. గొల్లపల్లి రిజర్వాయర్, బుద్ధారం ఆన్లైన్ రిజర్వాయర్, కేఎల్ఐ, డి–5, డి–8 కాల్వల పటిష్టత, విస్తరణ, స్ట్రక్చర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, బుద్ధారం కుడి, ఎడమ కాల్వల పటిష్టత, గణపురం బ్రాంచ్ కెనాల్, కర్నె తండా, ఖాసీంనగర్ ఎత్తిపోతలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలోనే చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల నిర్మాణాలు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఈఈలు కేశవరావు, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రిలో ఏర్పాట్లు
● ఈనెల 16న రానున్న మిస్వరల్డ్ పోటీదారులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని విదేశీ పర్యాటకుల బృందం సందర్శించనుంది. దీంతో ఈనెల 2 నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడా చెత్తాచెదారం లేకుండా సుమారు 25 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అలాగే 500 చదరపు గజాల విస్తీర్ణంలో లాన్ (కార్పెట్ గ్రాస్) ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాకర వాతావరణం ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. మరోవైపు మెట్టుగడ్డ (ఎన్హెచ్–167) నుంచి మొదలుకొని పిల్లలమర్రి వరకు గల విశాలమైన రోడ్డుకు ఇరువైపులా మొక్కలను పెంచుతున్నారు. వీటి మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను సైతం తొలగిస్తున్నారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను క్యాంపులకు పంపించేలా అవగాహన కల్పిస్తున్నాం. వేసవి దృష్ట్యా ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు క్యాంపు నిర్వహణ ఉంటుంది. – భాస్కర్ సింగ్. ఎంఈఓ, అమరచింత నైపుణ్యాల పెంపు.. వేసవి సెలవుల్లో వి ద్యార్థులు ఇతర వ్యాపకాలకు గురికాకుండా పాఠశాల వాతావరణంలో ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో గడిపేందుకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 50 ఉన్నత పాఠశాలల్లో శిబిరాలను కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటి వరకు 35 శిక్షణ శిబిరాలను ప్రారంభించాం.వలంటీర్లను నియమించి శిక్షణకు హాజరవుతున్న వారికి రోజువారీ అల్పాహారం అందిస్తున్నాం. – అబ్దుల్ ఘని, డీఈఓ -
ధాన్యం తరలించడం లేదని రైతుల ఆందోళన
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన దొడ్డురకం ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి మండలంలోని రాజపేట, అంకూర్ గ్రామాల్లో ప్రధాన రహదారులపై రైతులు పెద్దఎత్తున బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సన్ననకం, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరుగా కొంటున్నారని తెలిపారు. సన్నరకాలను కాంటా వేసిన వెంటనే లారీల్లో మిల్లులకు తరలిస్తుండగా.. దొడ్డురకం ధాన్యాన్ని మాత్రం 15 రోజులుగా తరలించడం లేదన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులు మాత్రం లారీలు రావడం లేదని చెబుతూ దాటవేత దోరణి అవలంబిస్తున్నారని వాపోయారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఆయా రహదారులపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగిల్విండో చైర్మన్లు వెంకట్రావు, రఘు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, రూరల్ ఎస్ఐ జలేందర్రెడ్డిలు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
మిల్లర్లు ధాన్యం దించుకోవాల్సిందే..
వనపర్తి రూరల్: ప్రతి రైస్మిల్లులో 5వేల బస్తాల దొడ్డురకం వడ్లు కచ్చితంగా దించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలంలోని చిట్యాల గోదాముతో పాటు చిమనగుంటపల్లి, నాగవరం గ్రామాల్లోని రైస్మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మిల్లుకు దొడ్డురకం వడ్లు వస్తే దింపుకోమని పక్కన పెట్టడానికి వీలు లేదన్నారు. కచ్చితంగా ప్రతి మిల్లులో దించుకోవాలన్నారు. అదే విధంగా వచ్చిన లారీలను త్వరగా అన్లోడ్ చేసే విధంగా హమాలీల సంఖ్య పెంచుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక లారీ పెట్టాలని టాన్స్ఫోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. -
నైపుణ్యాభివృద్ధి దిశగా..
అమరచింత: యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఒక్కొక్క క్యాంపులో 100 మంది విద్యార్థులు ఉండేలా ప్రణాళిక రూపొందించింది. నిబంధనలతో వీరికి ఆటపాటలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఒక్కొక్క పాఠశాలకు నలుగురి చొప్పున వలంటీర్లను నియమించింది. వీరికి రూ. 3వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లాలో 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఎంపిక కాగా.. ఇప్పటి వరకు 35 పాఠశాలల్లో శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో శిక్షణ శిబిరాలు కొనసాగేలా సంబంధిత అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని హెచ్ఎంలకు ఉన్నతాధికారులు ఆదేశించడంతో.. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. సర్కార్ బడుల్లో వేసవి శిబిరాలు ● జిల్లాలో 50 ఉన్నత పాఠశాలల ఎంపిక ● ఒక్కో క్యాంపులో 100 మంది విద్యార్థులు ● అల్పాహారం కోసం రూ.15 చొప్పున చెల్లింపు ● శిక్షణకు నలుగురి చొప్పున వలంటీర్ల నియామకం సెలవులతో ఇబ్బందులు.. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో సమ్మర్ క్యాంపుల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారింది. విద్యార్థుల వివరాలతో వారి వారి ఇళ్లకు పాఠశాలకు రావాల్సిందిగా కోరుతున్నారు. అత్యధికంగా విద్యార్థులు సెలవుల్లో తమ బంధువుల ఇళ్లకు వెళ్లడంతో చివరికి క్యాంపు నిర్వహణ కోసం కేజీబీవీ విద్యార్థినులను సైతం చేర్పించుకుంటున్నారు. 6నుంచి 9 తరగతులకు సంబంధించి 25 మంది చొప్పున విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఆయా పాఠశాలల్లోని క్యాంపుల్లో కేవలం 30 నుంచి 50 మందితోనే నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న విద్యార్థులను క్యాంపులకు రప్పించే యత్నం చేస్తున్నారు. మొత్తానికి క్యాంపు నిర్వహణ ప్రారంభం నుంచి 15 రోజులపాటు యథావిధిగా నిర్వహించి ముగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుంటే ఇకపై రోడ్డుపై నడిపేందుకు అవకాశం లేదు. కాలపరిమితి ముగిసిన వాహహనాల నంబర్ ప్లేట్ల పైనా నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని రకాల పాత వాహనాలకు ఇప్పుడున్నవి కాకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తుది గడువు సెప్టెంబర్ 30గా ప్రకటించింది. లేని పక్షంలో భారీ జరిమానాలు, శిక్షలు వేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని అమర్చుకునేందుకు ప్రత్యేక రుసుములు ప్రకటించారు. వాహనాల తీరు ఆధారంగా ధరలు నిర్ణయించింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. పటిష్ట చర్యలు నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడపకుండా ఉండేందుకు రవాణాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. నిర్ణీత కాల పరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబర్ ప్లేట్లపై రోడ్డుపై తిరుగుతూ ప్రమాదాల కారణం అవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్యం పరీక్షలు చేయడం లేదు. ఇలాంటి వాటికి ఆడ్డుకట్టు పడనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2018 డిసెంబర్ 31 నాటికి 6,01,677 వాహనాలు ఉండగా 2019 జనవరి 1 నుంచి 2025 ఏప్రిల్ 30 వరకు 3,68,574 వాహనాలతో మొత్తం 9,65,761 వాహనాలు ఉన్నాయి. ఐదు జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. సాధారణ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు 4 లక్షలకు పైగానే ఉంటాయని సమాచారం. ఈ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నిరాధరణ పత్రాల వంటి తదితర సేవలను నిలిపివేస్తారు. వాటిని అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పవు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం లేదా వాహనాలు సీజ్ చేయడం చేస్తారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్కు చెల్లించే రుసుము ఇలా.. ద్విచక్రవాహనం 320-360 కార్లు 590-700కమర్షియల్ వాహనాలు 600-800 త్రిచక్రవాహనాలు 350-450 2018 డిసెంబర్ 31వ తేదీకి ముందు వాహనాల వివరాలిలా.. జిల్లా బైక్లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబూబ్నగర్ 2,70,491 26,069 14,585 9,872 19,493 433 వనపర్తి 37,407 6093 2,415 3,845 6,678 2,424 నాగర్కర్నూల్ 41,291 6,893 3,610 4,391 9,770 342 గద్వాల 58,956 4,856 1,648 3,267 6,811 218 నారాయణపేట 40,059 4,953 3,135 2,700 8,823 149 2019 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు కొనుగోలు చేసిన వాహనాలు జిల్లా బైక్లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబ్బ్నగర్ 84,061 13,548 5,873 4,310 7,917 163 వనపర్తి 36,767 4,376 1,968 2,114 7,373 01 నాగర్కర్నూల్ 47,797 6,225 1,947 3,416 15,093 78 గద్వాల 56,329 4,199 697 2,101 6,803 44 నారాయణపేట 42,405 3,719 2,409 1,423 5,404 44 పాత వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్పాత వాహనాలకు అమర్చుకోవాలి పాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు అమర్చుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం వాహనాలకు ఫీజును నిర్ధారించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు మరో 5 ఏళ్లు గడువు పొడిగించాలంటే వాహనదారుడు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానికి బార్కోడ్ వస్తోంది. అప్పడు వాటికి హైసెక్యూరిటీ నంబర్ల ప్లేటు అమర్చుకోవాల్సి ఉంటుంది. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం. వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తాం. – చిన్నబాలు, రీజినల్ ట్రాన్స్పోర్టు అధికారి, నాగర్కర్నూల్ మార్పు ఇలా.. పాత వాహనానికి కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఎస్ఐఏఎం.ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి వాహనం నంబర్, ఫోన్నంబర్, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి అమర్చుకొని ఫొటోను తీసి మరోసారి వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సిన బాధత వాహనదారుడిపైనే ఉంటుంది. ఇదిలాఉండగా, నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్లు లేని వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ 2019 కంటే ముందు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు నకిలీ నంబర్ ప్లేట్ల కట్టడి.. రహదారి భద్రతే లక్ష్యం -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
గోపాల్పేట: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గోపాల్పేట మండలం పొలికెపహాడ్, చాకల్పల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని.. కొత్త చట్టం అమలును పరిశీలించారు. రైతులు భూ సమస్యలపై సమర్పించిన అర్జీలను వీలైనంత వరకు స్థానికంగానే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు తమ సమస్యలను ఒక పద్ధతి ప్రకారం ప్రొఫార్మాలో పూరించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సక్సెషన్ దరఖాస్తులు వస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. పొలికెపహాడ్లో 44, చాకల్పల్లిలో 29 దరఖాస్తులు వచ్చాయని.. వాటిని త్వరగా పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లోకలెక్టర్ ఆదర్శ్ సురభి -
సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గం
వనపర్తి రూరల్: సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని.. పెట్టుబడిదారి విధానానికి విసిగిపోయిన ప్రజలు కమ్యూనిజం వైపు చూస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కారల్మార్క్స్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. కార్మికులు వందేళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి నిర్ణయించిన నేపథ్యంలో ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నూరు శాతం అమలు చేయాలని.. రైతు రుణమాఫీ అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు స్థలాలు లేని వారికి ప్రభుత్వమే కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కేరళ తరహాలో పౌరసరఫరాలశాఖ ద్వారా రేషన్ కార్డుకు ఉన్న ప్రతి లబ్ధిదారుకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, పుట్టా ఆంజనేయులు, లక్ష్మి, జీఎస్ గోపి, పరమేశ్వరాచారి, నాయకులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
గోపాల్పేట: భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని.. మండలంలో కొనసాగుతున్న సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం మండలంలోని తాడిపర్తి, మున్ననూరులో జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. అధికారులు అందుబాటులో ఉండి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు సదస్సుల్లోనే సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని, సక్సేషన్ దరఖాస్తులు వస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు. తాడిపర్తిలో 36, మున్ననూరులో 35.. మొత్తం 71 దరఖాస్తులు వచ్చాయని, వెంటనే పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. రెవెన్యూ సదస్సులు జరిగే గ్రామాల్లో ఒకరోజు ముందుగానే చాటింపు వేయించాలన్నారు. కేంద్రాల నుంచి వెనువెంటనే ధాన్యం తరలింపు వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చిన వెంటనే తేమశాతం పరిశీలించి కొనుగోలు చేసి గోదాములు, మిల్లులకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం మండలంలోని తాడిపర్తిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా శుభ్రంగా ఉంటే మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ఒకటో నంబర్ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి వచ్చిన బియ్యం, ఇప్పటి వరకు పంపిణీ చేసిన బియ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ నివేదికను పరిశీలించి ఎప్పటికప్పుడు రిజిస్టర్లో బియ్యం పంపిణీ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ పాండు తదితరులు ఉన్నారు. -
పని ప్రదేశాల్లోవసతులు కల్పించండి
ఆత్మకూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డీఆర్డీఓ ఉమాదేవి సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పిన్నంచర్లలో మంగళవారం జరుగుతున్న ఉపాధి పనులను ఆమె పరిశీలించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలిగించకుండా ఎప్పటికప్పుడు ధాన్యం సేకరించాలని ఐకేపీ సిబ్బందిని డీఆర్డీఓ ఆదేశించారు. పిన్నంచర్లలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరామ్రెడ్డి, ఏపీఓ విజయభాస్కర్ పాల్గొన్నారు. కూలీలకు కనీస సౌకర్యాల కల్పన పాన్గల్: వేసవి దృష్ట్యా ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలుగకుండా పనుల వద్ద వసతులు కల్పించాలని ఏపీడీ సయ్యద్ సుల్తాన్ సూచించారు. మంగళవారం మండలంలోని బుసిరెడ్డిపల్లి, రాయినిపల్లి, మాందాపూర్లో కొనసాగుతున్న ఉపాధి పనులు, ఆయా గ్రామపంచాయతీల్లో ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన రోజు వారి కూలి అందేలా పనులు కల్పించాలని, రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఉపయోగపడే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. నర్సరీల్లో మొక్కల సంరక్షణకు చర్యలు చేపడుతూ నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పెంచాలన్నారు. రైతులు పండ్ల తోటలను పెంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామాల వారిగా ఉపాధి పనులు, నర్సరీలు, మొక్కల లక్ష్యం, కూలీల సంఖ్య అంశాలపై ఆరా తీశారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఎంపీడీఓ గోవింద్రావు, ఏపీఓ కుర్మయ్య, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు తప్పనిసరి
వనపర్తి రూరల్/మదనాపురం: ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో నాణ్యత పరిశీలించి కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లి, కడుకుంట్ల కొనుగోలు కేంద్రాలు, మదనాపురంలోని గోదాం, దంతనూరులోని లక్ష్మీనర్సింహ రైస్మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతుల వద్ద ధాన్యం తీసుకునేటప్పుడు తాలు, గడ్డి లేకుండా చూసి వెంటనే తూకం చేసి వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. పాత గన్నీ బ్యాగులను కాకుండా కొత్తవాటిని రైతులకు అందించాలని కోరారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, తూకాలు సక్రమంగా ఉండాలన్నారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, నాయకులు శేఖర్రెడ్డి, తహసీల్దార్ అబ్రహం లింకన్ తదితరులు ఉన్నారు. -
మామిడి రైతు కుదేలు
అకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రనష్టం ●300 టన్నులకు పైగా.. నాగర్కర్నూల్ జిల్లాలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఏప్రిల్ నెలాఖరులో 300 టన్నులకు పైగా మామిడి కాయలు నేల రాలాయి. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్ మార్కెట్కు తీసుకువచ్చారు. మార్కెట్లో రాలిన కాయలను తక్కువ ధరలకు రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా రోజూ రాలిన కాయలు మార్కెట్కు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడు గాలివానల వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సలీం, మామిడి ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్, కొల్లాపూర్ నష్టంపై నివేదికలిచ్చాం.. అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా మామిడి తోటల్లో పెద్దమొత్తంలో కాయలు రాలాయి. నియోజకవర్గాల వారీగా పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో చెట్లు విరిగిపడిన సంఘటనలు లేవు. కానీ, కాయలు చాలా రాలాయి. రాలిన కాయలను మార్కెట్లో ధరలు ఉండవు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్ కొల్లాపూర్: వాతావరణ ప్రభావంతో అంతంత మేరకే దిగుబడులు.. చేతికొచ్చిన దాన్ని అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు మామిడి రైతులను కుదేలు చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు లాభాలు రాకపోగా.. కష్టాలు.. నష్టాలు చుట్టుముట్టి రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. నామమాత్రపు దిగుబడులు ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం మామిడి దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. మొదట్లో పూతలు బాగా పూసినప్పటికీ వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాలేదు. సాధారణ దిగుబడి కంటే సగం మేరకు తక్కువగా దిగుబడులు వచ్చాయి. పండిన ఆ కాస్త పంటను అమ్ముకునే సమయంలో మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఏప్రిల్ నెల మూడో వారం నుంచి తరచూ వీస్తున్న భారీ ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా మామిడి తోటలు దెబ్బతిని.. కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు సైతం నెలకొరిగాయి. సరైన ధరలు లేక.. మామిడి దిగుబడుల సంగతి పక్కన పెడితే.. ధరలు ఈ ఏడాది కూడా పెరగలేదు. ఇందుకు వ్యాపారుల సిండికేటే ప్రధాన కారణం. ఫిబ్రవరి నెలలో టన్ను రూ.లక్షకు పైగా పలికిన మామిడి ధర.. మార్చి మొదటి వారంలో పూర్తిగా తగ్గిపోయాయి. టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే పలుకుతోంది. గాలివానల కారణంగా రాలిన మామిడి కాయలను హైదరాబాద్ మార్కెట్లో టన్నుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతులు పండించిన పంటకు రవాణా, కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి. నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బీభత్సం సృష్టించిన గాలులు కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు వాతావరణం అనుకూలించకపంట దిగుబడిపై ప్రభావం ఆర్థికంగా చితికిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
స్పందన అంతంతే..
ఈ నెల 3తో ముగిసిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు ● మూడుసార్లు గడువు పెంచినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ● ఉమ్మడి జిల్లాలో రూ.67.33 కోట్ల ఆదాయం ● అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్కు రూ.18.08 కోట్లు.. ● అలంపూర్ మున్సిపాలిటీకి రూ.16 లక్షలు మాత్రమే.. ● వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 29,450 దరఖాస్తులు రాగా.. 25,827కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 5,214 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. 2,766 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. పెబ్బేరులో 7,432 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 6,484 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,561 మంది రూ.1.88 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 417 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కొత్తకోటలో 7,740 దరఖాస్తులు రాగా 7,318కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,355 మంది రూ.1.60 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ఆత్మకూరులో 3,827 దరఖాస్తులకు 3,150కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 822 మంది రూ.98 లక్షలు చెల్లించగా..623 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అమరచింతలో 619 దరఖాస్తుల్లో 333కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 164 మంది రూ.56 లక్షలు చెల్లించారు. ఇప్పటి వరకు 121 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు పెద్దగా స్పందన రాలేదు. అనధికార లేఔట్లలోని స్థలాను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువు ముగిసినా.. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. మూడుసార్లు గడువు పెంచినా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 21 పురపాలికల్లో కలిపి కేవలం రూ.67.33కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లించే వారికి మొత్తం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ గడువును ఏప్రిల్ 30 వరకు, మళ్లీ ఈనెల 3వ తేదీ వరకు ఇలా మూడుసార్లు పెంచింది. పురపాలికల వారీగా ఆదాయం ఇలా.. ● మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 32,005 దరఖాస్తులు రాగా.. వీటిలో ఎల్ఆర్ఎస్కు అర్హత కలిగిన 22,183కి ఫీజు చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఇందులో 7,424 మంది దరఖాస్తుదారులు రూ.18.08 కోట్లు చెల్లించగా..ఇప్పటివరకు 2,910 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. జడ్చర్ల పరిధిలో 17,935 దరఖాస్తులు రాగా.. అర్హత కలిగిన 11,071కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,933 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 847కి మాత్రమే ప్రొసీడింగ్స్ అందాయి. భూత్పూర్లో 6,341 దరఖాస్తుల్లో 4,703కి ఫీజు చెల్లించాల్సి ఉంంది. 1,375 మంది దరఖాస్తుదారులు రూ.2.67 కోట్లు చెల్లించగా.. 651కి ప్రొసీడింగ్స్ అందాయి. దేవరకద్ర పరిధిలో 6,765 దరఖాస్తులకు 6,699కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 1,036 మంది రూ.1.69 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 16,266 దరఖాస్తులు రాగా 10,782 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 2,895 మంది రూ.4.78 కోట్లు చెల్లించగా..1,728 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కల్వకుర్తిలో 11,643 దరఖాస్తులు రాగా 9,491 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,160 మంది రూ.4.85 కోట్లు చెల్లించారు. 1,088 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. కొల్లాపూర్లో 4,654 దరఖాస్తులకు 3,718కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 713 మంది రూ.1.23 కోట్లు చెల్లించారు. 264 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అచ్చంపేటలో 12,291 దరఖాస్తులకు 10,765కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,871 మంది రూ.2.72 కోట్లు చెల్లించారు.106 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● నారాయణపేట మున్సిపాలిటీలో 7,154 దరఖాస్తులలో 2,036కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,639 మంది రూ.4.19 కోట్లు చెల్లించారు. 772 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మక్తల్లో 10,616 దరఖాస్తులకు 9,063కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,288 మంది రూ.2.44 కోట్లు చెల్లించారు.599 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కోస్గి పరిధిలో 4,168 దరఖాస్తులు రాగా 1,987కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 965 మంది రూ.1.94 కోట్లు చెల్లించారు. 135 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మద్దూరులో 1,493 దరఖాస్తులు రాగా 1,232 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 322 మంది రూ.34 లక్షలు చెల్లించారు. 234 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ● గద్వాల పట్టణ పరిధిలో 14,607 దరఖాస్తులు రాగా 4,000కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,844 మంది రూ.2.96 కోట్లు చెల్లించారు. 927 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అయిజలో 10,166 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 5,244కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,155 మంది రూ.1.47 కోట్లు చెల్లించారు. 689 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అలంపూర్లో 431 దరఖాస్తులే రాగా 366కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 122 మంది కేవలం రూ.16 లక్షలే చెల్లించారు. 64 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. వడ్డేపల్లిలో 1,967 దరఖాస్తులు రాగా 1,787కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 378 మంది రూ.73 లక్షలు చెల్లించారు.304 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. -
శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి
వనపర్తి రూరల్: యంగ్ ఇండియా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది కోరారు. సోమవారం పెబ్బేరు మండలం యాపర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లో 40 రోజుల పాటు వేసవి శిబిరాలు నిర్వహిస్తునట్లు తెలిపారు. చిన్నారులకు స్పోకెన్ ఇంగ్లీష్, గణితంలో బేసిక్స్, ఇతర సబ్జెక్టులతో పాటు చెస్, కార్యమ్స్, టెన్నీస్, గ్రామీణ ఆటల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించామన్నారు. శిబిరంలో 90 మంది విద్యార్థులు ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకర్గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేందర్రెడ్డి, స్వరాజ్యం, బాబురెడ్డి, ఉపాధ్యాయులు మైనుద్దీన్, ఈశ్వర్, స్వచ్ఛంద సేవకులు అనూష, కవిత, సరిత, శివాని గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
గోపాల్పేట: భూ భారతి చట్టం అమలుతో రైతుల భూ సమస్యలు తొలగిపోతాయని.. ప్రశాంతంగా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని పైలట్ మండలం గోపాల్పేటలో ఉన్న చెన్నూరు, జయన్న తిర్మలాపూర్లో రెవెన్యూ సదస్సులు జరగగా.. జయన్న తిర్మలాపూర్లో జరిగిన సదస్సులో ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ చేస్తే పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూములు లాక్కుందని ఆరోపించారు. పట్టాదారు పాసు పుస్తకంలో తప్పులుంటే సరి చేసుకునేందుకు అవకాశం ఉండేదని.. అధికారులు ఇష్టానుసారంగా పోర్టల్ను వినియోగించే వారన్నారు. ధరణితో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. భూ భారతిలో అధికారులు ఎటువంటి తప్పులు చేయకుండా, ఒకవేళ తప్పులు దొర్లినా సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, రైతులు ఫిర్యాదు చేసేందుకు రెండంచెల వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. స్వీకరించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరులో 36, జయన్న తిర్మలాపూర్లో 25 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సెక్సేషన్–18, మిస్సింగ్ సర్వేనంబర్–2, పెండింగ్ మ్యూటేషన్–1, డిజిటల్ సైన్–1, భూ విస్తీర్ణంలో సవరణలు 2, పేర్ల సవరణ–5, పార్ట్–బి–1, అసైన్డ్ పట్టా–3, తదితరాలు 28 దరఖాస్తులు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలని, సక్సేషన్కు సంబంధించి వెంటనే నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కుటుంబసభ్యుల ధ్రువపత్రాలకు సంబంధించి మీసేవ సిబ్బందిని వెంట ఉంచుకొని త్వరగా అయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ప్రత్యేక అధికారి రాజు, మండల రెవెన్యూ అధికారి పాండు తదితరులు పాల్గొన్నారు. గోపాల్పేట మండలంలో ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు మొదటిరోజు 61 దరఖాస్తులు.. స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు
గోపాల్పేట: ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తోందని.. పాడి రైతులు తమ పశువులకు వేయించి రోగాలబారిన పడకుండా చూసుకోవాలని స్టేట్ మానిటరింగ్ అధికారి విజయభాస్కర్రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం మండలంలోని జయన్న తిర్మలాపూర్లో గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి టీకాలు ఎలా వేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు రిజస్టర్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. 140 తెల్ల, 526 నల్ల పశువులకు టీకాలు వేసినట్లు సిబ్బంది చెప్పారు. వారి వెంట మండల పశువైద్యాధికారి డా. ఆంజనేయులు, లైవ్స్టాక్ అసిస్టెంట్ శ్రీనివాసులు, మండల పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షలు వాయిదా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ కోరులకు సంబంధించి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలు బుధవారం (మే 6) నుంచి జరగాల్సి ఉంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘాలు.. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ చేసి, ఆందోళనకు దిగిన నేపథ్యంలో పీయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వయం ఉపాధికి కార్పొరేషన్ల తోడ్పాటు స్టేషన్ మహబూబ్నగర్: స్వయం ఉపాధికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడుతాయని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రం షాసాబ్గుట్ట ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెహందీ, కంప్యూటర్ కోర్సులు పూర్తిచేసిన మహిళలకు సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే విధంగా కార్పొరేషన్లు చేయూత అందిస్తాయని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున స్కిల్డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మెహందీ, కంప్యూటర్ కోర్సులతో పాటు అనేక విభాగాల్లో శిక్షణ పొందిన వారికి రుణాలు, వాటిపై సబ్సిడీలు కూడా మంజూరవుతాయని అన్నారు. -
సౌర విద్యుత్పై దృష్టి సారించాలి : కలెక్టర్
వనపర్తి: గ్రామాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెడ్కో, విద్యుత్ అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను అమలు చేస్తోందని.. ఐదు వేల కన్నా ఎక్కువ ఇళ్లు ఉన్న రెవెన్యూ గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజెస్ పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని దీర్ఘకాలం ఆదాయం సమకూర్చే సోలార్ ప్యానెల్ల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రెడ్కో ఎండీ మనోహర్రెడ్డిని ఆదేశించారు. ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఇళ్లు సోలార్ ప్యానెల్తో విద్యుత్ ఆదా చేస్తాయో ఆ గ్రామానికి కేంద్రం సౌర విద్యుత్ ఉపకరణాలకుగా రూ.కోటి అందజేస్తుందని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్కు 5 కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ పొలంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని విద్యుత్శాఖకు విక్రయించడంతో ఒక యూనిట్కు రూ.3.13 సంపాదించవచ్చని వివరించారు. పీఎం సూర్యఘర్ పథకంలో గృహ సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, కుసుమ్ పథకం కింద బ్యాంకు ద్వారా 75 శాతం రుణం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇందులో 4 శాతం బ్యాంకు వడ్డీని కేంద్రమే భరిస్తుందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు సమన్వయంతో గ్రామాల్లో సౌర విద్యుత్పై అవగాహన సదస్సులు నిర్వహించాలి సూచించారు. దరఖాస్తు చేసే విధానంపై మీ–సేవ కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇప్పించాలని రెడ్కో డీఎంని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, విద్యుత్శాఖ ఎస్ఈ రాజశేఖర్, డీఎ ల్పీఓ రఘునాథ్రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయితేజ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం.. ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరగగా 65 అర్జీలు వచ్చినట్లు గ్రీవెన్స్సెల్ అధికారులు వెల్లడించారు. అర్జీలను పరిష్కరించాలంటూ ఆయా శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. -
చరిత్ర పుస్తక రూపంలో పదిలం
వనపర్తి టౌన్: చరిత్రను పుస్తక రూపంలో భద్రపరిస్తే భవిష్యత్ తరాలు తెలుసుకొనే వెసులుబాటు ఉంటుందని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్ అన్నారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జ్ఞానదర్శిని ఎల్లూరు చరిత్ర’ పేరున రూపొందించిన పుస్తకాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలో సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. కవులు, కళాకారులు, రచయితలు, చరిత్రకారులు, విద్యావంతులు గతంలోని అంశాలను శోధించి, ధ్రువీకరించుకొని పుస్తక రూపంలోకి తీసుకొస్తారని, ఒక పుస్తకం వెనుక ఎంతో ప్రయత్నం, పర్యవేక్షణ ఉండటంతో వాటిలోని విజ్ఞానం నేటి సమాజానికి అందుతుందని చెప్పారు. ఈ గ్రంఽథ రచనకు నిరంజనయ్య కృషిని ఆయన కొనియాడారు. విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ఎల్లూరు కొల్లాపూర్ సంస్థానానికి కొంతకాలం పాటు రాజధానిగా ఉందని.. చోళులు, కాకతీయుల కాలానికి సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు జనజ్వాల, ఓంకార్, బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, రాజారాంప్రకాశ్, కిరణ్కుమార్, గంధం నాగరాజు, డి.కృష్ణయ్య, ఆనంద్, దాసరి కృష్ణ, మోజర్ల కృష్ణ, సురేందర్, రంగస్వామి, వహీద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం : బీజేపీ ఖిల్లాఘనపురం: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మండల ఇన్చార్జ్ సీతారాములు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుడు శివ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలోని అన్ని కార్యవర్గ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పని చేయాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి పార్టీ తరుఫున కృషి చేయాలని, అలాంటప్పుడే ప్రజల్లో పార్టీపై, నాయకులపై మంచి అభిప్రాయం కలుగుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కేంద్ర పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిబాబుగౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవినాయక్, మండల ప్రధానకార్యదర్శులు దశరథం, గోపాల్రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం.రాజు, గోపి ముదిరాజ్, చక్రవర్తిగౌడ్, హేమంత్ నాయక్, ఎస్.సాయినాథ్, శివ, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
వనపర్తి రూరల్: మెప్మా ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో మెప్మా ఆర్పీల సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్పీలకు పీఎఫ్, ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు, డ్రెస్కోడ్, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటి అమలుకు తీవ్రంగా యత్నిస్తోందని విమర్శించారు. దేశంలోని పరిస్థితిని సమీక్షించిన కేంద్ర కార్మిక సంఘాలు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని.. అన్నిరంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మెప్మా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, కార్యదర్శి లావణ్య, కురుమూర్తి, వేణుగోపాల్, గోపమ్మ, మంజుల, కళావతి, మాలతి తదితరులు పాల్గొన్నారు. -
2 వేల ఏళ్ల నాటి గ్రామం..
నందివడ్డెమాన్గా మారిన వర్ధమానపురం ● 400 ఏళ్లు పాలించిన కాకతీయ సామంత రాజులు ● నేటికీ సజీవంగా చారిత్రక ఆనవాళ్లు ● గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడు ● రాష్ట్రంలోనే ఏకై క ఆలయంగా ప్రసిద్ధి శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వస్త్రాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు. నాగర్కర్నూల్: కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి. మహిళలు సైతం పూజలు చేయొచ్చు.. -
విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి
వనపర్తి టౌన్: విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు మెచ్చేలా విజయాలు సాధిస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయని అంబాత్రేయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రం సమీపంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఆవరణలో వేప, రావి మొక్కలు నాటారు. అలాగే సామాజిక కార్యకర్త పోచ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో బాలుర, బాలికల, హరిజనవాడ, తెలుగువాడ ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఆశీర్వదించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు సర్వం ధారపోస్తున్నారని.. నైపుణ్యం కలిగిన చదువుకు సమాజంలో విలువ పెరుగుతుందని, విద్యార్థులు అక్షర, లోక జ్ఞానాన్ని తెలుసుకునేందుకు విద్యారంగంలో పురోగమించడమే ఏకై క మార్గమన్నారు. విద్యార్థులు కృషిని నమ్ముకొని దైవచింతన, సరైన ప్రణాళికతో ముందుకుసాగితే ప్రతి అడుగులోనూ విజయం తారసపడుతుందని చెప్పారు. యువతరం సన్మార్గం వైపు పయనించేందుకు పాఠ్య పుస్తకాల్లోనూ అధ్యాత్మిక భావన, సైన్స్ భావజాలాన్ని మేళవింపు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రోజురోజుకు పడిపోతున్న విలువల పునరుద్ధరణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. సామాజిక కార్యకర్త పోచ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో అధ్యాత్మికత లోపించడంతోనే వ్యవస్థ భ్రష్టు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించి మిఠాయి బాక్స్లను అందించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పవన్కుమార్, ఉపాధ్యాయులు తిరుపతి, రవికుమార్, రమాదేవి, గురురాజ్ప్రసాద్, నాయకులు దాడి యోగానందరెడ్డి, కంది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
పైలెట్ మండలంగా గోపాల్పేట ఎంపిక
వనపర్తి: భూ భారతి–2025 రెవెన్యూ సదస్సుల నిర్వహణకుగాను జిల్లాలో గోపాల్పేటను పైలెట్ మండలంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి మండలంలో జరిగే రెవెన్యూ సదస్సులను మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో రెండు రెవెన్యూ బృందాలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించి మిగిలిన సమస్యలను మే 13 నుంచి 20వ తేదీలోపు పరిష్కరించేలా సూచనలు చేస్తారని తెలిపారు. గ్రామ ప్రజలకు భూ సమస్యలకు సంబంధించిన నమూనా దరఖాస్తులు ముందుగానే పంపిణీ చేస్తారని, వాటిని సరిగా పూరించి రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఉష్ణోగ్రతలు పెరిగిన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఇంట్లో ఉండే వృద్ధులు, పిల్లలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని.. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12లోపే బయటి పనులు పూర్తి చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళలో బయట తిరగకపోవడం మంచిదని, బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ లేదా గొడుగు వెంట తీసుకువెళ్లాలి, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం పొందాలన్నారు. వడదెబ్బ తగలకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని.. చల్లటి నీరు, ఓఆర్ఎస్ ద్రావణం, పండ్ల రసాలు తీసుకోవడం, తేలికై న దుస్తులు ధరించడం ముఖ్యమని తెలిపారు. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు -
హాకీ గుర్తింపును మరింత పెంచాలి
వనపర్తి టౌన్: హాకీలో జిల్లాకు ఉన్న పేరును మరింత పెంచాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండా విజయ్కుమార్ క్రీడాకారులకు సూచించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో హాకీ వేసవి శిక్షణ శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలను ఉపయోగించి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కుమార్, ప్రధానోపాధ్యాయుడు గురురాజ్, మన్యం యాదవ్, వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
పడకేసిన పల్లె పాలన
గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువు ●పనిభారం.. నిధులు కరువు... పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీంతో గ్రామంలో కనీస మౌలిక వసతుల కల్పనకు తప్పనిసరిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీటి బోర్ల మరమ్మతులకు పంచాయతీ ఖాతాల్లో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను ప్రత్యేక అధికారులకు విన్నవిస్తున్నా.. నిధులు లేక పరిష్కరించలేక పోతున్నాం. – రాజీక్, పంచాయతీ కార్యదర్శి. మోట్లంపల్లి (ఆత్మకూర్) నిధులు మంజూరైతేనే.. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరాలి. ఇందుకుగాను పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరగాలి. ప్రభుత్వం త్వరలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 15 ఆర్థిక సంఘం నిధులు మంజూరుగాకపోవడంతో చిన్న పంచాయతీల్లో నిర్వహణ భారంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. – సురేష్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి అమరచింత: సర్పంచ్ల పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటం.. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులపైనే పనిభారం పెరగడం.. 15 ఆర్థిక సంఘం నిధులు మంజూరుగాక కార్మికులకు ప్రతి నెలా వేతనాలు అందకపోవడం తదితర కారణాలతో గ్రామాల్లో పాలన పడకేసింది. గతేడాది జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగియగా.. ప్రభుత్వం ఫిబ్రవరి 1న క్లస్టర్ గ్రామాలు ఎంపికచేసి జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నిధులు, విధులపై స్పష్టత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండటంతో కనీసం వీధిదీపాలు, బోర్ల మరమ్మతులు, గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీల్లో విధులు నిర్వర్తించే మల్టీపర్పస్ వర్కర్స్కు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి తలెత్తింది. పనిభారంతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులు చెత్త సేకరణ వాహనాలకు డీజిల్, బోర్ల మరమ్మతుకు నిధుల లేమి జిల్లాలో 255 గ్రామపంచాయతీలు -
తడిసిన ధాన్యం.. అన్నదాతల ఆందోళన
వనపర్తి: జిల్లాకేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ఉన్న కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం చాలావరకు తడిసిపోయింది. దీంతో శనివారం అన్నదాతలు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, ధర తక్కువగా ఇస్తే.. ఒప్పుకునేది లేదంటూ సుమారు గంటన్నర పాటు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా వాహనాలు చాలాదూరం వరకు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమేష్రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అకాల వర్షానికి సుమారు 5 వేల బస్తాల ధాన్యం తడిసినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రైతులకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించారు. -
భూ సమస్యల ప్రక్షాళనకే ‘భూ భారతి’
పాన్గల్/చిన్నంబావి: నిజమైన హక్కుదారులకు భూ భారతి చట్టం అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పాన్గల్, చిన్నంబావిలోని ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల ప్రక్షాళనకు భూ భారతి చట్టం తీసుకొచ్చిందని, పాత చట్టంలోని లొసగులను సవరిస్తూ కొత్త చట్టం రూపొందించినట్లు చెప్పారు. గతంలో ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని అనేక భూ ఆక్రమణలు జరిగాయని.. వాటన్నింటిని భూ భారతి చట్టం ద్వారా సరిచేసి ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పారు. ధాన్యం కాంటా, తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యంత పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సూచించారు. కమిటీ సభ్యులు, అధికారులు నిజాయతీగా వ్యవహరిస్తూ అర్హులకే ప్రాధాన్యం ఇవ్వాలని.. అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించి బలోపేతానికి సహకరించాలని కోరారు. పాన్గల్లో వివిధ గ్రామాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.21,59,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి అందజేశారు. కొత్త చట్టం గురించి వివరించేందుకే అవగాహన సదస్సులు.. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి ప్రజలకు వివరించేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ధరణిలోని సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్ట భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అఽధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకొని తప్పును సరిచేసే అవకాశం కొత్త చట్టంలో ఉందన్నారు. పాన్గల్లో జరిగిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ గోవింద్నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఆర్ఓ సీతారాంనాయక్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఏఓ రాజవర్ధన్రెడ్డి, మండల నాయకులు వెంకటేష్నాయుడు, రవికుమార్, మధుసూదన్రెడ్డి, రాముయాదవ్, పుల్లారావు, భాస్కర్యాదవ్, చిన్నంబావిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, డీటీ శ్రీనివాసులు, ఎంపీడీఓ రమణారావు, సింగిల్విండో చైర్మన్ బగ్గారి నర్సింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కళ్యాణ్రావు, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి యాదవ్, చిదంబర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పోలీసులంతా ఒకే కుటుంబం : ఎస్పీ
వనపర్తి: యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ ఒకే కుటుంబమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం సాయుద దళ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో అన్ని పోలీస్స్టేషన్ల సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి ఆర్మీ డ్రిల్, ఫూట్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై పోలీసు, హోంగార్డుల పరేడ్ నిర్వహించి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సిబ్బంది, అధికారులు సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, శక్తి సామరా్థ్య్లతో పాటు అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని తెలిపారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని.. మంచి జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్తర్తిస్తూ జిల్లాకు, తెలంగాణ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సిబ్బంది విధులు, చేయకూడని పనుల గురించి వివరించారు. కార్యక్రమంలో మెదక్ స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, సీసీఎస్ ఎస్ఐ జయన్న, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, రిజర్వ్ ఎస్ఐ వినోద్, శిక్షణ ఎస్ఐలు, జిల్లా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
వనపర్తి: అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చిట్యాల మార్కెట్యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసింది. శనివారం ఉదయం ఆయన మార్కెట్యార్డ్ను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మార్కెట్, పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని.. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించి ధాన్యం తడవకుండా చూడాలని మార్కెటింగ్శాఖ అధికారికి సూచించారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే రైతులకు ఇబ్బందులు
పాన్గల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం చేయకపోవడం, తూకం చేశాక మిల్లులకు తరలించడంలో జాప్యం చేస్తుండటంతో వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని వివరించారు. అలాగే తాలు పేరుతో మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారని.. ఇది సరికాదన్నారు. జిల్లా అధికారులు కలగజేసుకొని ధాన్యం తూకం త్వరగా పూర్తి చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లు లు, గోదాములకు తరలించేలా చూడాలని కోరారు. సమస్య పరిష్కారంగాకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు భగత్, సీఐటీయూ జిల్లా నాయకుడు వెంకటయ్య, ప్రజాసంఘాల నాయకులు ఆంజనేయులు, శేఖర్, మల్లేష్, భాస్కర్, కృష్ణయ్య, వెంకటమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. -
అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పాతజంగమాయపల్లి–కనిమెట్ట మధ్య కొత్తగా నిర్మించిన వంతెనను, కనిమెట్టలో రూ.37 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను విడతల వారీగా అమలు చేస్తున్నామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో ప్రతి రైతుకు మేలు చేకూరుతుందని.. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరం ఉన్నచోట కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. సన్నాలకు రూ.500 బోనస్ సైతం చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, బోయేజ్, శ్రీనివాస్రెడ్డి, మేస్త్రి శ్రీను, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీటీ రోడ్డు ప్రారంభం.. మదనాపురం: మండలంలోని లక్ష్మీపురం గ్రామం నుంచి నెల్విడితండా వరకు వేసిన బీటీ రహదారిని శనివారం ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు తాగు, సాగునీరు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్పాడుకు నీటి సరఫరా నిలిపివేత మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో నీటిమట్టం తగ్గింది. శనివారం జలాశయంలో సముద్ర మట్టానికి పైన 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. రేపటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో వైస్చాన్స్లర్తో జరిగిన సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దీనికి తోడు పీయూ అధికారులు సైతం కళాశాలల అఫ్లియేషన్స్, ర్యాటిఫికేషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే వరకు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఈ నెల 6న జరిగే డిగ్రీ పరీక్షలను సైతం నిర్వహించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జహీర్అక్తర్, ఫణిప్రసాద్, సత్యనారాయణగౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.వేరుశనగ క్వింటా రూ.6,169 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శనివారం 218 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6169, కనిష్టం రూ. 2700, సరాసరి రూ. 5969 ధరలు పలికాయి. అలాగే, 60 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5839, కనిష్టం రూ. 5209, సరాసరి రూ. 57 59 ధరలు పలికాయి. 1980 క్వింటాళ్ల వరి (సో న) రాగా గరిష్టం రూ.2026, కనిష్టం రూ. 170 1, సరాసరి రూ.1729 ధరలు లభించాయి. -
దొడ్డురకం మాకొద్దు..!?
●సేకరణకు విముఖత చూపుతున్న మిల్లర్లు ● సన్నాల కోసం అధికారుల వద్ద పైరవీలు ● ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యంపై రైతుల ఆందోళనలు ● జిల్లాలో 10 వేల మె.ట. పైగానే ధాన్యం కేంద్రాల్లోనే.. హమాలీల కొరతతోనే ఇబ్బందులు.. హమాలీల కొరతతో మిల్లులు, గోదాముల వద్ద లారీల్లోని వరి ధాన్యం త్వరగా అన్లోడ్ కావడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని కేంద్రాల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్, వనపర్తి వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా కొన్ని మిల్లులకే ధాన్యం కేటాయించే అవకాశం ఉండటం.. వారు కూడా సన్నరకం ధాన్యం కేటాయించాలంటూ అధికారుల వద్ద పైరవీలు సాగిస్తున్నారు. ఇటీవల గోపాల్పేట మండలం బుద్దారం, వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో తాలు, తేమ శాతం, లారీల కొరత తదితర కారణాలు చూపిస్తూ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. హామాలీల కొరతతో ధాన్యం తరలించిన లారీలు మిల్లులు, గోదాంల వద్ద నిలిచిపోవడంతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత నెల 29న 7,493.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండగా.. శనివారం వరకు అది 10,139 మె.ట.లకు చేరినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. బాయిల్డ్ రైస్మిల్లర్లు సైతం.. యాసంగి సీజన్లో వరి ధాన్యం ఎక్కువగా బాయిల్డ్ మిల్లులకు కేటాయిస్తారు. ఇందుకు కారణం బాయిల్డ్ మిల్లులో ధాన్యం మర ఆడిస్తే నూక శాతం తక్కువగా వస్తుంది. కానీ.. మార్కెట్లో దొడ్డు రకాలకు డిమాండ్ లేదనే కారణంతో ఆ మిల్లర్లు సైతం తమకు కూడా సన్న రకాలే కేటాయించాలంటూ అధికారులపై వత్తిడి తీసుకొస్తుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి మిల్లుకు 60:40 శాతంలో సన్నాలు, దొడ్డు రకం ధాన్యం కేటాయింపులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఎదుట సరేనంటూ తల ఊపిన మిల్లర్లు.. అధికారుల వద్ద వారికున్న చనువు, ఇతర బహుమతులను ఎరజూపి సన్నరకం ధాన్యం కేటాయింపునకు వత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అధికసంఖ్యలో రైస్మిల్లులు ఉన్నా.. 85 శాతం మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు ఇవ్వకపోవడం, మిల్లుల్లో కనీస ధాన్యపు నిల్వలు లేకపోవడంతో కలెక్టర్ వాటిని బ్లాక్ లిస్టులో ఉంచి ధాన్యం కేటాయింపులు నిలిపివేశారు. దీంతో మిగిలిన మిల్లులకు మాత్రమే అధికారులు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. జిల్లా యాసంగి వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం 3.40 లక్షల మెట్రిక్ టన్నులుగా అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 71 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా అందులో 50 శాతం దొడ్డురకం ఉంది. ఈ ధాన్యాన్ని మిల్లల్లు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చకపోవడంతో కేవలం నాలుగు వేల మె.ట. మాత్రమే మిల్లర్లకు కేటాయించి మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదాములలో నిల్వ చేశారు. తాజాగా వచ్చిన నిబంధనల మేరకు ప్రతి మిల్లరు దొడ్డురకాలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. 3.40 లక్షల మె.ట. లక్ష్యం.. -
తాగుతూ.. ఊగుతూ...!
నిబంధనలు పాటించని మద్యం దుకాణాదారులు బార్లకు మించి పర్మిట్ రూములు.. మద్యం దుకాణాల నిర్వాహకులు ఎకై ్సజ్శాఖ ఇచ్చే టార్గెట్లను ఆసరాగా చేసుకొని పరిమిత కొలతలతో ఇచ్చే పర్మిట్ రూములను పెద్దగా నిర్మించుకొని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మద్యం విక్రయాల టార్గెట్ను చేరుకునేందుకు అక్రమ సిట్టింగ్లను సైతం ఎకై ్సజ్శాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని శ్రీరామా టాకీస్ సమీపంలో ఉన్న బార్ పురాతన ఆలయం సమీపంలో ఉండటం.. ప్రతి సోమ, శనివారం ఆలయానికి వెళ్లే భక్తులు అటుగా రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు పలుమార్లు ఎకై ్సజ్శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ● కొత్తకోటలో కర్నూలు రోడ్ వైపు ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద సాయంత్రం 7.30 దాటితే రోడ్డు పక్కన మూసి ఉన్న దుకాణాల ఎదుట మద్యం తాగేవారు అత్యధికంగా కనిపిస్తారు. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మున్సిపాలిటీల్లో శివారు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా మద్యం తాగేవారు కనిపించడం సర్వసాధారణమైంది. వనపర్తి: జిల్లాకేంద్రం శివారులోని దాబాలు, హోటళ్లతో పాటు ఇళ్ల నడుమ ఉన్న పలు హోటళ్లు సైతం బార్లను తలపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలోని కొత్తకోట రహదారిలో ఉన్న ఓ హోటల్లో అర్ధరాత్రి మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్రంలోని పలు హోటళ్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు మాత్రం జోక్యం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలుమార్లు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు అందినా ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో సిట్టింగ్ల పర్వం రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్లో ఉన్న ఓ మద్యం దుకాణం ఎదుట కనిపించిన చిత్రమిది. రోడ్డుపై వాహనాలు, రోడ్డు పక్కన పాదచారులు వెళ్తున్నా.. మందు బాబులు దుకాణం ముందే మద్యం తాగుతూ కనిపించారు. అనుమతికి మించి ఎక్కువ గదుల్లో సెట్టింగ్లు ఏర్పాటు చేసుకున్నా.. రోడ్లపై అందరూ చూస్తుండగానే మద్యం తాగుతున్నారు. వారాంతపు సంత రోజు పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం ఏదో ఒక ఘర్షణ చూడాల్సి వస్తోందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. దుకాణాల ఎదుట మద్యం తాగుతున్న మందుబాబులు ఇళ్ల మధ్య హోటళ్ల పేరుతో అనధికార సిట్టింగ్లు రోజుకో లొల్లి.. పట్టించుకోని అధికారులు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు -
ఆశలు.. అడియాసలేనా?!
●నిబంధనల మేరకే.. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక చేపడుతున్నాం. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చిన విధంగానే విచారణ జరిపి నివేదిక తయారు చేసుకున్నాం. వార్డుకు 10 చొప్పున పట్టణానికి 100 ఇళ్లు మాత్రమే వచ్చాయి. కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎంపిక విధానం జరుగుతుంది. – రవిబాబు, మున్సిపల్ కమిషనర్, అమరచింత అమరచింత: ప్రజా పాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు ప్రజాపాలన సదస్సులలో తమకు ఇళ్లు కావాలంటూ వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే పాత మట్టి ఇంటిని తొలగించి కొత్త ఇంటిని నిర్మించుకుందామని ఆశపడిన లబ్ధిదారుల ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పట్టణాల్లో వార్డుల వారిగా ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారానే లబ్ధిదారులను గుర్తించే బాధ్యత అప్పగించడంతో కమిటీలో సభ్యులుగా ఉన్న అధికార పార్టీ నాయకులదే పైచేయి అన్నవిధంగా తయారైంది. పట్టణానికి సుమారు 500 మేర ఇళ్లు మంజూరవుతాయి అనుకుంటే కేవలం పట్టణానికి 100 నుంచి 150 మాత్రమే కేటాయించడంతో ఎంపిక ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో వార్డుల వారిగా ఎంపిక ఇందిరమ్మ కమిటీలకే వదిలేయడం, వారిచ్చిన జాబితానే అధికారులు పరిశీలించే కార్యక్రమం చేపట్టడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. లోపాయికారిగా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కమిటీలో ఉన్న అధికార పార్టీ నాయకులు తమకు కావాల్సిన వారి పేర్లను రాసుకుని అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం జనం బేజారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఇలా.. వేలల్లో దరఖాస్తులు.. పదుల్లో కేటాయింపు ఖాళీ స్థలం ఉంటేనే ఇల్లు మంజూరుకు సిఫార్సు నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన ఇందిరమ్మ కమిటీలదే తుది నిర్ణయమంటున్న అధికారులు -
మామిడిమాడలో ‘డబుల్’ ఇళ్ల పరిశీలన
ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను శుక్రవారం పీఆర్డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏఈ రమేష్నాయుడు, తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ పరిశీలించారు. గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసులు చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణానికి ఫిల్టర్ ఇసుక వాడుతున్నారని కొందరు గ్రామస్తులు వెల్లడించిన విషయం శుక్రవారం పలు పత్రికల్లో ప్రచురితం కావడంతో గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. అక్కడ ఫిల్టర్ ఇసుక మాత్రమే ఉండటంతో దీనినే ఇంటి నిర్మాణానికి ఉపయోగించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా డీఈ, తహసీల్దార్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి పరిశీలించామన్నారు. అయితే ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన వారు అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో మాట్లాడామని, శనివారం మళ్లీ వచ్చి బాధితులతో వివరాలు తెలుసుకుంటామన్నారు. అలాగే ఇళ్ల ముందు ఉన్న ఫిల్టర్ ఇసుకను సీజ్ చేసి.. గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్కుమార్కు అప్పగించామన్నారు. అయితే ఇన్నాళ్లు ఏఈ కనీసం ఇక్కడికి వచ్చి పరిశీలించకుండానే.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు కోరారు. -
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాలోని 12 ప్రభుత్వ కళాశాలలో 1 నుంచి 3 సబ్జెక్ట్ల వరకు ఫెయిలైన విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో 488 మంది, ద్వితీయ సంవత్సరంలో 237 మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఐఈఓ కోరారు. -
బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి
వనపర్తి: జిల్లాలో బాధితులకు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అండగా ఉండాలని ఎస్పీ రావుల గిరధర్ అన్నారు. జిల్లాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేరస్థుడికి కఠిన కారాగార శిక్ష, రూ.25 వేలు జరిమానా విధించడంలోనే కాక వివిధ కేసుల్లో నేరస్తులకు శిక్ష పడడంలో కృషిచేసిన పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.శ్రీనివాసచారి, కోర్టు లైజనింగ్ అధికారి హెడ్ కానిస్టేబుల్ సత్యంను శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిజాన్ని గెలిపించే బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులపై ఉందన్నారు. పోలీసు న్యాయ వ్యవస్థలో బాగా పనిచేసిన అధికారులను తప్పక గుర్తిస్తామన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా పోలీసులు ఇంకా బాగా పనిచేసి జిల్లా న్యాయస్థానానికి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి వనపర్తి రూరల్: ఉపాధి హామీ పథకం పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. శుక్రవారం శ్రీరంగాపురం మండలంలోని కంభాళాపురంలో ‘గావ్ చలో– బస్తీ చలో’ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, రాష్ట్ర నాయకుడు పురుషోత్తంరెడ్డి, మండల ఇన్చార్జ్ రాఘవేందర్గౌడ్తో కలిసి ప్రతి ఇంటికి బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల దగ్గరకి వెళ్లి కూలీలతో మాట్లాడారు. సరైన సమయంలో కూలీ డబ్బులు అందడం లేదని వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లపై గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని, కానీ, కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా వారికి నచ్చిన మంజూరు చేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.2.61 లక్షలు ఇస్తుందని, అయితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఒక్క కార్యకర్తను కూడా చేర్చుకోలేదని మండిపడ్డారు. అనంతరం వివిద పార్టీలకు చెందిన నాయకులు, యువకులు బీజేపీలో చేరగా.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు రాములు, జానీ, రాజేష్, శివ, నరేందర్రెడ్డి, కార్తీక్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి వనపర్తి టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానానికి కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఓబీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించడంతో శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌక్లో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి ఆధ్వర్యంలో రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోట్ల రవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి దేవుజా నాయక్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యల పరిష్కారానికి కృషి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలోని గోపాల్పేటను పైలెట్ మండలంగా గుర్తించామని, ఇక్కడి 9 గ్రామ పంచాయతీల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ద్వారా నిర్ణీత నమూనాలో దరఖాస్తులు గ్రామంలో ముందుగానే పంచుతామని, వాటిని సరిగా పూరించేందుకు ఇద్దరు ఉద్యోగులను సైతం నియమిస్తామని చెప్పారు. గ్రామానికి సంబంధించిన అన్ని భూ రికార్డులు, మ్యాప్లు వెంట తీసుకువెళ్లాలని, అప్పటికప్పుడు పరిష్కరించదగినవి అక్కడే పూర్తిచేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ● మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల స్క్రూట్నీ అనంతరం జాబితా విడుదల చేయాలన్నారు. జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతో లబ్ధిదారులకు ఇల్లు మంజూరు కాపీ అందిస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. రెండో విడతలో భాగంగా ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా లక్ష్యం మేరకు ప్రత్యేకాధికారులు స్క్రూట్నీ చేసిన జాబితాను కలెక్టర్ లాగిన్కు పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన లే అవుట్లను దస్తావేజులు, గూగుల్ ఎర్త్ మ్యాపింగ్ ద్వారా పరిశీలించి అన్ని అర్హతలు ఉన్న వాటిని ఆమోదించాలని కలెక్టర్ చెప్పారు. ఇరిగేషన్ కెనాల్, ముంపు, నాలా సమస్యలు లేకుండా నిబంధనల ప్రకారం రోడ్లు, ఖాళీ స్థలం, పార్కింగ్ ఉన్న లే అవుట్లను మాత్రమే కమిటీ ద్వారా ఆమోదించడం జరుగుతుందన్నారు. రోడ్లు, 10 శాతం ఖాళీ స్థలం ప్రభుత్వం పేరిట రిజిష్టర్ చేయాలని, అలాగే రోడ్లు, డ్రెయిన్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. కాగా.. శుక్రవారం కమిటీ ముందు మొత్తం 6 లే అవుట్లు పరిశీలనకు రాగా ఇందులో నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉన్న నాలుగింటిని ఆమోదించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, హౌసింగ్ పీడీ పర్వతాలు, డీఈ విటోబ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే వనపర్తికి ఈఎస్ఐ ఆస్పత్రి
వనపర్తి టౌన్: కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పుర కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో లక్షలాది మందికి నిరంతరాయంగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు కొత్త నియమకాలను చేపడతామన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం కార్మికులకు ప్రతి బెనిఫిట్ను అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు విజయ చందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, లైట్, హెవీ వెహికల్స్ సంఘం అధ్యక్షులు అయూబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులిస్తేనే.. డబుల్ బెడ్రూం ఇళ్లు
లబ్ధిదారులకు ఓ పార్టీ నాయకుడి బెదిరింపు ● ఇప్పటికే ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు ● మళ్లీ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి ● ఇళ్ల నిర్మాణంలోనూ ఫిల్టర్ ఇసుక వాడుతున్నట్లు ఆరోపణ ● అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన బెదిరిస్తున్నాడు.. మీకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైంది మంచిగ కట్టిస్తామం అని మా ఊరి నాయకులు కొందరు వెంకటేశ్వరావు ఇంటికి పిలిచి రూ.లక్ష తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రూ.1.16 లక్షలు ఇవ్వమంటున్నారు. ఇవ్వకుంటే ఇల్లు ఇవ్వమని చెబుతున్నారు. ఎందుకు ఇవ్వాలని అడిగితే నీ ఇష్టం.. ఇస్తేనే ఇల్లు.. లేకుంటే లేదు అని బెదిరిస్తున్నారు. – గంగని చిన్న నాగయ్య, మామిడిమాడ చర్యలు తీసుకుంటాం.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం డబ్బులు ఎవరికి, ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి సంబంధిత అధికారులకు అప్పగించడం వరకు నా బాధ్యత. లబ్ధిదారుల ఎంపికతో నాకు సంబంధం లేదు. డబ్బులు తీసుకోవాలని ఎవరికీ చెప్పలేదు. ఫిల్టర్ ఇసుక వాడుతున్నట్లు ఆరోపించిన దానిపై శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – రమేష్నాయుడు, పీఆర్ఏఈ ఖిల్లాఘనపురం: గత ప్రభుత్వంలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి డబ్బులిస్తేనే ఇల్లు ఇస్తామని.. లేకుంటే లేదని.. ఓ నాయకుడు తమను బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కొంతమంది లబ్ధిదారులను ఆరోపించారు. మండలంలోని మామిడిమాడ గ్రామానికి గత ప్రభుత్వ హయాంలో 40 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నం.40, 41లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించగా.. నిర్మాణానికి సోళీపురం గ్రామానికి చెందిన బాలీశ్వర్రెడ్డి టెండర్ వేశారు. అప్పట్లో 24 ఇళ్ల నిర్మాణాలు చెత్తు వరకు నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన నిర్మాణాలను ఇటీవల తిరిగి ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేలా తీర్మానించారు. అయితే మామిడిమాడలో నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఒక్కొక్కరి నుంచి గతంలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కాకుండా గ్రామానికి చెందిన ఓ నాయకుడు వసూలు చేశాడు. అది చాలదన్నట్లు ఇప్పుడు మళ్లీ మొత్తంగా ఒక్కో ఇంటికి రూ.2.16 లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని గ్రామానికి చెందిన కొందరు దళితులు ఆరోపించారు. తాము ఇవ్వలేమని ఇల్లు లేకున్నా సరే గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నాకు ఎప్పుడు ఇచ్చినవు అంటూ దబాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అడిగినన్ని డబ్బులు ఇచ్చిన వారి ఇళ్లే నిర్మిస్తున్నారని, మిగతా వారికి ఆపేశారని గురువారం స్థానిక విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఫిల్టర్ ఇసుకతో నిర్మాణాలు.. గ్రామంలో డబ్బులు ఇచ్చిన వారి ఇళ్ల నిర్మాణాలకు ఫిల్టర్ ఇసుక వాడుతున్నారని, దీనిని గ్రామ శివారులోని నేరెడు చెరువులో తయారు చేస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇళ్ల ముందు పోసిన ఫిల్టర్ ఇసుకను చూపుతు దీంతో ఇళ్లు కడితే ఉంటాయా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సదరు నాయకుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ● ఈ విషయమై సదరు గ్రామ నాయకుడు వెంకటేశ్వర్రావు స్పందిస్తూ డబ్బులు ఇచ్చిన దాంతో నాకు సంబంధం లేదని, కాంట్రాక్టర్కు ఇళ్లు మంచిగా కట్టాలని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. రూ.1.20 లక్షలు ఇచ్చా.. మాకు గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఇల్లు మంజూరైందని చెప్పారు. గవర్నమెంట్ వాల్లు ఇచ్చే డబ్బులతోపాటు మీరు కూడా ఇవ్వాలని చెబితే ఇప్పటికే రూ.1.20 లక్షలు మా గ్రామంలోని వెంకట్రావ్కు ఇచ్చినం. ఇప్పుడు మరో రూ.1.16 లక్షలు ఇస్తేనే ఇల్లు ఉంటది.. లేకుంటే లేదంటున్నారు. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. – గంగని చిన్ననాగమ్మ, మామిడిమాడ ఇల్లు లేదంటున్నాడు.. మాకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని చెప్పి మా ఊరికి చెందిన నాయకుడు వెంకటేశ్వర్రావు డ బ్బులు అడిగితే రూ.1.50 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు మళ్లీ రూ.1.20 లక్షలు అడుగుతున్నాడు. లేవంటే ఇల్లు లేదంటున్నాడు. ఆ ఇంటిని కూడా ఫిల్టర్ ఇసుకతోనే కడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. – ప్రేమ్కుమార్, మామిడిమాడ -
దొడ్డు వడ్లను విధిగా తీసుకోవాలి
ఎప్పటికప్పుడు ధాన్యం తరలించాలి గోపాల్పేట: వరి కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన వెంటనే ధాన్యం మిల్లులకు తరలించాలని, ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని బుద్దారం, పొలికెపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేని సమయంలో స్థానికంగా ఉండే ట్రాక్టర్లను వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి, ఆర్ఐ యాదయ్య తదితరులున్నారు. వనపర్తి: సన్నబియ్యంతోపాటు ప్రతి మిల్లరు 5 వేల బస్తాల దొడ్డు వడ్లు విధిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిల్లర్లు, మిల్లు అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్లో సన్నవడ్లతోపాటు కొంతమంది రైతులు దొడ్డు వడ్లు సైతం పండించారని, కాబట్టి సన్న వడ్లతో పాటు ప్రతి మిల్లు 5 వేల బస్తాల దొడ్డు రకం వడ్లు సేకరించాలని, ఎవరైనా నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాయిల్డ్ రైస్ మిల్లులకు 60 శాతం దొడ్డు రకం, 40 శాతం సన్న రకం వడ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత సీజన్ సంబంధించి సీఎంఆర్ రైస్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, మిల్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా.. అచేతనంగా!
గద్వాల: గద్వాల చేనేతకు దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు ఉన్నాయి.. అంతటి ప్రాశ్యస్తం ఉన్న చేనేతను గడచిన దశాబ్దంన్నర కాలంగా పాలకులు, అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ గద్వాల చేనేత అంతరించిపోయేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. 2008లో చేనేత పార్కును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరీ చేశారు. అనంతరం వచ్చిన ప్రభుత్వ పెద్దలు దానిని గాలికొదిలేయడంతో 17ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా గద్వాలకు చేనేత పార్కు పరిస్థితి మారింది. 2009లో జీఐ గుర్తింపు సైతం సాధించుకున్న గద్వాల చేనేత కాలక్రమంలో మసకబారే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గద్వాల చీరల పేరిట బెంగుళూరు, పుణె వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున పవర్లూం యంత్రాలతో తయారు చేసిన నకిలీ గద్వాల చీరలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో ఒరిజినల్ గద్వాల చేనేత చీరలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. చేనేతకు ఊతమిచ్చేందుకు.. గద్వాల చేనేతకు ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకున్న 2008లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గద్వాలకు చేనేత పార్కును మంజూరీ చేశారు. అంతేకాకుండా పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలం, నిధులు సైతం కేటాయించారు. పూడూరులోని సర్వే నంబర్ 368లో 50 ఎకరాల స్థలం, ఈ స్థలం అభివృద్ధి కోసం రూ.50లక్షల నిధులను మంజూరీ చేశారు. ఆ తర్వాత కాలంలో పార్కు స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు విడుదల చేసిన రూ.50 లక్షల నిధులలో రూ.11లక్షలు ఖర్చు పెట్టినట్లు అధికారులు కాకిలెక్కలు చూపెడుతున్నారు. ఇందులో పార్కు స్థలం చుట్టూ హద్దులు పెడుతూ దిమ్మెలు కట్టినట్లు, స్థలరక్షణకు ఓ సెక్యూరిటీ గార్డును నియమించినట్లు ఇందుకోసం రూ.8.50లక్షలు ఖర్చు అయినట్లు చెబుతుండగా, ఫొటోగ్రఫీ సర్వే చేసేందుకు రూ.2.50లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు కాగితాలపై కాకిలెక్కలు చూపెట్టి మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గద్వాల మండలం పూడూరు శివారులో చేనేత పార్కు స్థలం చేనేత పార్కు ఏర్పాటుపై ముందడుగు పడని వైనం నిధులున్నా పట్టించుకోని అధికారులు రూ.11లక్షలు ఖర్చు చేసినట్లు అధికారుల కాకిలెక్కలు మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్న పార్కుకు కేటాయించిన స్థలం -
జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, నిర్వహించరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, రాజకీయ నాయకుల, కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేస్తామన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా పోలీసులకు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని సూచించారు. -
జూన్ రెండు నాటికి భూ భారతి అమలు
వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2 నాటికి భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణి చట్టంలో సమస్యలను కోర్టులో తేల్చుకోవాల్సి వచ్చేదని.. ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో అధికారులే గ్రామాలకు వెళ్లి రైతులను సమస్యలు అడిగి పరిష్కరించేలా రూపొందించామన్నారు. ఆగష్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అన్ని భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం పని చేస్తుందని హామీ ఇచ్చారు. అమలులో చోటుచేసుకున్న చిన్నపాటి పొరపాట్లను సరి చేసుకునేందుకు అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ, వెసులుబాటు కల్పించామని మంత్రి వెల్లడించారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం వెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను త్వరలో పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. అంతకుముందు మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, షాట్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న భూ దరఖాస్తులు పరిష్కరించేందుకు సులువైన మార్గం సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంలో లభించిందన్నారు. భూ భారతి 2025 చట్టం రూపకల్పనలో మంత్రి పొంగులేటి పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం.. బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు మల్లు రవితో కలిసి జిల్లాలో రూ.193 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ.8.50 కోట్లతో నిర్మించిన పీజీ విద్యార్థుల వసతిగృహం, రూ.4 కోట్లతో నిర్మించిన ప్రిన్సిపాల్, సిబ్బంది నివాస భవనాలను ప్రారంభించారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.5 లక్షలతో నిర్మించిన నమూన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అక్కడే రేవల్లి, శ్రీరంగాపూర్, ఏదుల తహసీల్దార్ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎంపీ నిధులు రూ.1.20 కోట్లతో నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహ భవనానికి శంకుస్థాపన చేశారు. కేఆర్డీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో రూ.69 లక్షలతో పునర్నిర్మించిన కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. రూ. 55 లక్షలతో డా. బీఆర్ అంబేడ్కర్ (నల్ల చెరువు) చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా మైనార్టీ మహిళలకు 200 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, కూచుకుళ్ల రాజేష్రెడ్డి , శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
‘పది’లో పెరిగిన ఉత్తీర్ణత
రాష్ట్రస్థాయిలో పడిపోయిన జిల్లా స్థానం వనపర్తిటౌన్/విద్యావిభాగం: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడగా.. జిల్లాకు రాష్ట్రస్థాయిలో 29వ స్థానం దక్కింది. ఉత్తీర్ణత మాత్రం గతేడాది కంటే 2.3 శాతం మెరుగుపడింది. గతేడాది రాష్ట్రస్థాయిలో 27వ స్థానం.. ఉత్తీర్ణత శాతం 86.9 శాతం ఉండగా.. ఈసారి 29వ స్థానానికి చేరడం నిరాశే మిగిల్చింది. కాగా ఉత్తీర్ణత శాతం మాత్రం 89.21కు చేరడం కొంత ఊరట కలిగించే విషయం. జిల్లావ్యాప్తంగా 6,842 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 6,104 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 738 మంది ఫెయిలయ్యారు. 3,415 మంది బాలురు పరీక్షలు రాయగా.. 2,982 మంది ఉత్తీర్ణత సాధించగా 87.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే 3,427 మంది బాలికలకుగాను 3,122 మంది ఉత్తీర్ణులు కాగా.. 90.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పది ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 30 పాఠశాలల్లో 100 శాతం.. జిల్లాలోని చిన్నంబావి. ఖిల్లాఘనపురం, రేవల్లి, శ్రీరంగాపూర్, వీపనగండ్ల కేజీబీవీలతో పాటు 25 జెడ్పీ ఉన్నత పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పదోతరగతి ఫలితాల్లో 2.3 శాతం పెరుగుదల గతేడాది ఉత్తీర్ణత శాతం 86.9.. ర్యాంకు 27 ఈ ఏడాది 89.2 శాతం ఉత్తీర్ణత.. 29వ ర్యాంకు బాలికలదే పైచేయి -
ఇంటింటికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
వనపర్తి: మహాత్మాగాంధీ అహింసావాదాన్ని, అంబేడ్కర్ ఆశయ సాధన, రాజ్యాంగ పీఠికను పరిరక్షించుకునే అవసరం ఎంతైనా ఉందని భావించి కాంగ్రెస్పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా జై భీమ్ పదాన్ని అవమానపరుస్తూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, రాజ్యాంగాన్ని కాపాడాలని భావించి కాంగ్రెస్పార్టీ అది నాయకత్వం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. సామాజిక మాధ్యమం వేదికగా కాంగ్రెస్పార్టీపై విష ప్రచారం చేసే వారికి బుద్ధి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఇంటింటికి చేరవేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఒకేరోజు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టామని.. మరికొద్ది రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు తీసుకురాబోతున్నామని చెప్పారు. అంతకుముందు రాజీవ్గాంధీ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, జాన్, మహ్మద్ నసీర్, సంజీవ్, గౌరీ సతీష్, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచందర్, పీసీసీ సభ్యుడు శంకర్ప్రసాద్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి తదితరులు పాల్గొన్నారు.