breaking news
Wanaparthy District Latest News
-
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి
వనపర్తి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం పెబ్బేరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, అష్టోత్తరం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి భగవద్గీత పఠనం చేశారు. అనంతరం పట్టణ వీధుల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆర్యవైశ్య మహిళలు భారీగా ఊరేగింపు నిర్వహించారు. ర్యాలీలో కోలాటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం ఆలయంలో మహిళలు శ్రీకృష్ణుడి తులాభారం నిర్వహించి ఉట్టికొట్టి, మహా మంగళహారతి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
కిటకిటలాడిన తిరుమలయ్య గుట్ట
వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్టపై వెలిసిన తిరుమలనాఽథ వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయగా, గుట్ట కింద దాతలు అన్నప్రసాద వితరణ చేపట్టారు. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో గుట్టపైకి వెళ్లడానికి ఘాట్ రోడ్లో ఇరువైపులా వాహనాల రద్దీ ఏర్పడి రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి సిబ్బందితో చేరుకొని రాకపోకలను పునరుద్ధరించడంతో పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ నిర్వహించారు. గుట్టపైన భక్తులకు కనీస వసతులు కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గుట్టపై భక్తుల రద్దీ -
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
వనపర్తి: జిల్లాకేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో జరిగే 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయనతో పాటు సంఘం ప్రధానకార్యదర్శి ఏ.సాంబ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల కిందట ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పురుడు పోసుకున్న ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం శాసీ్త్రయ విద్య సాధనే లక్ష్యంగా సమసమాజ స్థాపనకు పోరాడుతోందన్నారు. విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ సమాజంలో ఉన్న వివక్షపై జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగిన పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జిల్లాకేంద్రంలో నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని.. ప్రభుత్వ విద్యారంగంపై పాలకులు కనీస దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయని.. పరిష్కరించే నాథుడే కరువయ్యారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్ఛలవిడిగా అనుమతులిస్తూ వాటి అభివృద్ధికి ప్రభుత్వం పరోక్షంగా మద్దతునిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, రియింబర్స్మెంట్ నాలుగేళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే సంబంధిత అధికారుల పర్యవేక్షణ తప్పా పరిష్కార చర్యలు ఏమీ లేవని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇచ్చిన హామీ హామీగానే మిగిలిందన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎన్ని జరిగినా ఆయా కళాశాలపై అధికారుల చర్యలు శూన్యమేనని తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్, రంజిత్, సహాయ కార్యదర్శులు గణేష్, పవన్, రాష్ట్ర నాయకులు గణేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కోడేరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి సంబంధించి మైనార్టీలకు 34 కట్టు మిషన్లు మంజూరయ్యాయని తెలిపారు. అదే విధంగా సాతాపూర్, గంట్రావుపల్లి, ఖానాపూర్, కోడేరు వరకు బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.13కోట్లు నిధుల కేటాయించినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా పస్పుల వాగు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. కోడేరుకు 76 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా, రూ.500 వందలకే గ్యాస్, రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రావణ్కుమార్, ఆర్ఐ జంబులయ్య, పంచాయతీ కార్యదర్శి రవితేజ, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ మహేష్రెడ్డి, రంగినేని జగదీశ్వరావు, మాజీ వార్డు సభ్యులు రాజు, సురేష్ యాదవ్, కురుమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు . -
రాష్ట్రంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
గోపాల్పేట: కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాటలతో కడుపు నింపే పార్టీలని.. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి ఒక్కసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని మహబూబ్నగర్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గురువారం ఆమె ఏదులలోని పెద్దగుట్టపై ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని.. తెలంగాణ ఏర్పడకముందు గొప్పలు చెప్పిన బీఆర్ఎస్, అమలుకాని ఆరు గ్యారెంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని.. త్వరలోనే తెలంగాణలో బీజేపీ పాగా వేయనుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర నిధులు వినియోగిస్తూ కాంగ్రెస్ పథకాలుగా పేర్లు మార్చి అమలు చేస్తూ పొంగిపోతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మహిళలకు రూ.2,500, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఏమయ్యాయని, సగం మంది రైతులకు పంట రుణమాఫీ వర్తించలేదని, నిరోద్యోగభృతి రాలేదని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం లేదని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబ్బిరెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధానకార్యదర్శి కృష్ణగౌడ్, మణివర్ధన్సాగర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలతో కడుపు నింపే పార్టీలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
యూరియా కష్టాలు..!
అమరచింత: వానాకాలం పంటలు సాగుచేసిన రైతులు పొలాల్లో చల్లేందుకు యూరియా కావాలంటూ ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట పడిగాపులు పడుతూ అందినకాడికి తీసుకెళ్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. యూరియా సరిపడా అందడం లేదంటూ రైతులు రెడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా.. అధికారులు మాత్రం సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆందోళన వద్దంటూ ప్రకటనలిస్తున్నారు. కాగా సరైన సమయానికి యూరియాను సరఫరా చేయలేక పోతున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వానకాలం వరిసాగు 2.75 లక్షల ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేసి 26 వేల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ ప్రభుత్వం జిల్లాకు కేవలం 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నామని చెప్పడంతో జిల్లా వ్యవసాయ ఆధికారులు మిగిలిన యూరియా కోసం మరోమారు ప్రభుత్వానికి నివేదించనున్నారు. సకాలంలో యూరియా పంటలకు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని.. ఎకరాకు రెండు బస్తాల చొప్పున సరఫరా చేయాలంటున్నారు రైతు సంఘాల నాయకులు. సొసైటీలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలకు కేటాయింపు.. యూరియాను జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ దుకాణాలకు కేటాయించకుండా కేవలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలకు మాత్రమే సరఫరా చేస్తుండటంతో రైతులు నిత్యం ఆయా కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధిక ధరలకు విక్రయిస్తే ఆయా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని.. ప్రస్తుతం వీటికి మాత్రమే సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మండలానికి కేవలం రెండు, మూడు కేంద్రాల్లోనే యూరియా లభిస్తుండటంతో అన్ని గ్రామాల రైతులు అక్కడికే తరలిరావడంతో కిటకిటలాడుతున్నాయి. వచ్చిన నిల్వలు సరిపోక పలువురు రైతులు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో యూరియా పంటలకు అందుతుందని.. అందుకే యూరియా బస్తాల కోసం పడిగాపులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. 2020 గణాంకాల ప్రకారం.. జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నందున అధికారులు ప్రతి సంవత్సరం పంటలకు సరిపడా యూరియా తెప్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఈసారి 2020 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఎంత మేర యూరియా దిగుమతి చేసుకున్నారనే గణాంకాలను పరిశీలించి సరఫరాకు సిద్ధమయ్యారు. 26 వేల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదనలు పంపితే కేవలం 19 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. పట్టణ శివారులో 4 ఎకరాల్లో వరి సాగుచేశా. ఎకరాకు రెండు బస్తాల యూరియా చల్లాలని.. 8 బస్తాలు ఇవ్వమని ఆగ్రో రైతు సేవాకేంద్రానికి వెళ్తే పట్టాదారు పాసు పుస్తకానికి రెండు మాత్రమే ఇచ్చారు. యూరి యా అందక ఇబ్బందులు పడుతున్నాం. – కడియాల నర్సింహులు, రైతు, అమరచింత ప్రభుత్వ వైఫల్యం.. యూరియా సకాలంలో సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫర్టిలైజర్ దుకాణాల వద్ద గంటల తరబడి వరుసలో నిలబడే పరిస్థితి నెలకొంది. అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 14 ఎకరాల్లో వరి సాగు చేసిన నాకు రెండు బస్తాల యూరియా ఏ మేరకు సరిపోతుంది. – మల్లారెడ్డి, రైతు, కిష్టంపల్లి సరిపడా సరఫరా చేయాలి.. నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. కానీ యూరియాకు వెళ్తే రెండు బస్తాలు ఇస్తామంటున్నారు. పంటలకు సరిపడా ఇవ్వాలని అడిగినా సంబంధిత ఫర్టిలైజర్ దుకాణ యాజమానులు పట్టించుకోవడం లేదు. ఎకరాకు రెండు బస్తాల లెక్కన యూరియా అందించి పంట కాపాడాలి. – ఆంజనేయులు, రైతు, కిష్టంపల్లి అధైర్యపడొద్దు.. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. జిల్లాకు 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి ప్రతిపాదనలు పంపించారు. కాగా 19 వేల మెట్రిక్ టన్నులు ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించి ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మిగతాది కూడా త్వరలోనే వస్తుంది.. రైతులకు సరిపడా సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – దామోదర్, ఏడీఏ ధరల నియంత్రణపై పర్యవేక్షణేది? అధిక ధరకు ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, సొసైటీలను తనిఖీ చేస్తున్నారు. యూరియా బస్తా ధర రూ.265 ఉండగా.. హమాలీ ఛార్జీలతో కలిపి కొందరు రూ.270, మరికొందరు రూ.285 తీసుకుంటున్నారని ఫిర్యాదులు అందుతుండటంతో వ్యవసాయ అధికారులు యూరియా పంపిణీపై దృష్టి సారిస్తున్నారు. దుకాణాల వద్ద అన్నదాతల పడిగాపులు ఎకరాకు రెండు బస్తాలు అంటున్న అధికారులు పట్టాదారు పాసు పుస్తకానికి రెండు ఇస్తామంటున్న దుకాణదారులు వానాకాలం సాగుకు 26 వేల మె.ట. అవసరమని అధికారుల నివేదిక 19 వేల మెట్రిక్ టన్నులే అందిస్తామంటున్న ప్రభుత్వం ఇప్పటి వరకు జిల్లాకు చేరింది 13 వేల మె.ట. మాత్రమే.. జిల్లాలో వానకాలం సాగు అంచనా 2.75 లక్షల ఎకరాలు -
సుస్థిర అభివృద్ధే లక్ష్యం
● చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ● ఘనంగా 79 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ● హాజరైన కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి వనపర్తి: జిల్లాలో సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అధికా రులు, పాలకులు పనిచేస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి, వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. వేదికపై కలెక్టర్ ఆదర్శ్సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి, దేవరకద్ర శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యానాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య హాజరయ్యారు. 60,545 రైతులకు రుణ విముక్తి గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టగా.. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ కాగా.. జిల్లాలో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల 91 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందించినట్లు పేర్కొన్నారు కొత్తగా 17,490 రేషన్ కార్డుల జారీ.. జిల్లాలో కొత్తగా 17,490 రేషన్ కార్డులను జారీచేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న కార్డుల్లో కొత్తగా 29,858 మందిని చేర్చినట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి రూ.13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి తిలకించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలోని మెప్మా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన రూ.10.08 కోట్ల చెక్కును అందజేశారు. గత విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు టెన్త్, ఇంటర్ విద్యార్థులను సత్కరించి, ఒక్కక్కరికి రూ.10వేల చెక్కు అందజేశారు. స్పీడ్ బోట్ ప్రారంభం కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల గ్రామ శివారు కృష్ణానదిలో పర్యాటకుల సౌకర్యార్థం జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ శుక్రవారం స్పీడ్ బోటు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం కార్పొరేషన్ నిధుల నుంచి 6 స్పీడ్ బోట్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు సోమశిల దగ్గర నదిలో స్పీడ్ బోటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానదిలో పర్యాటకుల కోసం సోమశిల నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించడానికి క్రూయిజ్ లాంచీని మంగళవారం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీశైలం వెళ్లాలనులకునే ప్రయాణికులు తెలంగాణ టూరిజం వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మద్దిలేటి, నాయకులు రంగస్వామి, రమేష్గౌడ్, మహే ష్, టూరిజం శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా శాంతిభద్రతల పరిరక్షణ జిల్లాలో మెరుగైన శాంతిభద్రతల కల్పనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి నిత్య పర్యవేక్షణ చేయడం ద్వారా నేరాలను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిసూ టీమ్స్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నార్కోటిక్ డాగ్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్, బస్టాండ్, కళాశాలలు, ఇతర రద్దీ గల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు, వనపర్తి, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్గౌడ్, ప్రమోదిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
180 పసుపు చీరలతో అమ్మవారికి అలంకరణ
వనపర్తి రూరల్: శ్రావణ మాసం నాల్గో శుక్రవారం సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని శ్రీ వాసవీ కన్యాకాపరమేశక్వరి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు కిట్టుస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, మహామంగళ హారతి నీరాజన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారు 180 పసుపు రంగు చీరల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అమ్మవారి ఆలయంలో లలితాసహస్ర పారాయణం, కుంకుమార్చన, పల్లకీసేవా తదితర పూజలు చేశారు.‘ఓట్లు చోరీ చేసి నీతులు చెప్పడం హాస్యాస్పదం’అమరచింత: ఓట్లు చోరీ చేస్తూ గద్దెనెక్కాలనుకున్న బీజేపీ ఇతర పార్టీలను విమర్శించడం ఎంత వరకు సమంజసమని డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆయూబ్ఖాన్ ప్రశ్నించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓట్కి చోర్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలను అడ్డుపెట్టుకొని కేంద్రంలో మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని లక్షలాది ఓట్లను తొలగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరిపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం తగదన్నారు. పూటకో రాజకీయ పార్టీలో చేరుతూ ప్రజా సమస్యలను గాలికొదిలిన బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మడం మానుకోవాలని హితువు పలికారు. అమరచింత పట్టణంలో రూ.13 కోట్లతో ఎంపీ డీకే అరుణ తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారని చెప్పిన నాయకులు వీటిలో 40 శాతం నిధులు రాష్ట్రానివి అన్న విషయం మరిచిపోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో మార్కెట్ డైరెక్టర్లు పోసిరిగారి విష్ణు, శ్యాం, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, తౌఫిక్, ప్రకాశం, హనుమంతునాయక్, వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ సేవలకు పురస్కారం
79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ సందర్భంగా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎస్టీ గురుకులం, వనపర్తి కేజీబీవీ విద్యార్థినులు సాంప్రదాయ దుస్తువుల్లో దేశభక్తి గేయాలకు నృత్యాలు చేశారు. కలెక్టరేట్ ఆవరణ జనసందడితో కళకలలాడింది. నృత్యాలు చేసిన విద్యార్థినులను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు అభినందించారు. – వనపర్తిడి. సుబ్రమణ్యం భూపాల్రెడ్డి, సీపీఓ టి.మేఘారెడ్డి, ఈఈ, మిషన్ భగీరథ విఠోభ, హౌసింగ్, వనపర్తి అంజయ్య, డీఐఈఓ, వనపర్తి మల్లయ్య, ఈఈ పీఆర్, వనపర్తి ఎ. శ్రీనివాసులు, డీఎంఅండ్హెచ్ఓ నరేష్, సీఐ, ఎస్బీ వెంకటేశ్వర్రావు, డీఎస్పీ కృష్ణయ్య, సీఐ అంజాద్, ఎస్ఐ ఎస్. సురేందర్బాబు, ఆర్ఎస్ఐ ఎస్. రాజగౌడ్, పీఆర్ఓ, ఎస్పీ ప్రవీణ్, డ్రైవర్, కలెక్టరేట్ అప్పలనాయుడు, ఆర్ఐ, అడ్మిన్వి.నరేందర్, ఎస్ఐ శివపార్వతి, ఏఎస్ఐ -
చదువుతో పాటు ఉపాధి కల్పనే లక్ష్యం
గద్వాలటౌన్: యువతకు చదువుతో పాటు పలు ఉపాధి కోర్సులు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీఐలను ఇటీవల ప్రభుత్వం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏజీసీ)గా ఉన్నతీకరించి పలు అధునాతన కోర్సులను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు ఏపీ జితేందర్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాన్ని, అక్కడ కొనసాగుతున్న పనులను శుక్రవారం కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో కలిసి జితేందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థల సహకారంతో ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. సమాజంలో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న రోబోటిక్, విద్యుత్ వాహనాల మరమ్మతులు, అడ్వాన్స్డ్ సీఎన్సీ టెక్నీషియన్ వంటి కోర్సులు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పోటీ ప్రపంచంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హనుమంతు, సహాయ లేబర్ కమిషనర్ మహేష్కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగాలు మరువలేనివి
వనపర్తి: స్వాతంత్య్ర పోరాటంలో అసువులుబాసిన మహనీయుల సేవలు మరువలేనివని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం లభించి నేటితో 78 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను అందరూ గుర్తుచేసుకుంటూ.. వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను గుర్తించుకుని పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యత, నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని, ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మన స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత లభిస్తుందన్నారు. అనంతరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసు అధికారులకు, సిబ్బందికి చదరంగం, క్యారమ్స్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ రవిపాల్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఎస్పీ రావుల గిరిధర్ ఎస్పీ రావుల గిరిధర్ -
ప్రభుత్వ చీఫ్ విప్కు పతాకావిష్కరణ బాధ్యతలు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ముఖఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. బుధవారం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏయే జిల్లాలో ఎవరెవరు జెండా ఆవిష్కరణ చేయాలనే వివరాలతో ప్రత్యేకంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో జిల్లా నుంచి ఆయన పేరును ప్రకటించింది. పోలీసుల తీరు సరికాదు : బీజేపీ వనపర్తిటౌన్: ఇటీవల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్చౌక్ వరకు ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో కాంగ్రెస్ నేతలు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేస్తుంటే పోలీసులు పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ అధ్యక్షతన రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలతో నాయకులు కార్యకర్తలు శవయాత్ర నిర్వహించబోగా పోలీసులు అడ్డుకొని కార్యాలయానికి తాళం వేసి చెల్లాచెదురు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహిస్తే అడ్డుకోని పోలీస్ యంత్రాంగం, సీఎం శవయాత్రను ఆదిలోనే అడ్డుకోవడం ఏమిటని, ఇదేం వివక్ష అని మండిపడ్డారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి అక్కల రామన్గౌడ్, కోశాధికారి భాసెట్టి శ్రీను, మోర్చాల రాష్ట్ర నాయకులు కదిరె మధు, అలివేలమ్మ, మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధ, అధికార ప్రతినిధి పెద్ది రాజు పాల్గొన్నారు. ఓట్ల చోరీపై విస్తృత చర్చ జరగాలి : కాంగ్రెస్ వనపర్తిటౌన్: ప్రజాస్వామ్యానికి వెలుగునిచ్చే ఎన్నికల వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని, ఓ కుటుంబంలో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ అధినాయకత్వం ఆధారాలతో బయటపెడుతుంటే రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఎన్నికల సంఘం వ్యవస్థలో లోపాలు, పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎల్సీడీ స్క్రీన్పై అవగాహన కల్పించారు. పేపర్ బ్యాలెట్ విధానంలో అన్ని ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే ప్రజాస్వామ్య పాలనకు అడుగులు పడతాయన్నారు. ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉదంతాలపై సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే జిల్లా ఆస్పత్రిలోని అంబులెన్స్ వాహనాలపై సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఉంటే మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తప్పుపట్టడం సరైంది కాదన్నారు. గతంలో సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్ వాహనాలపై జాయన ఫొటోలు ముద్రించినప్పుడు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. డీసీసీ ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీసెల్ అధ్యక్షుడు సమద్మియా, పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ, పెద్దమందడి మండల అధ్యక్షుడు పెంటన్న యాదవ్, సేవాదళ్ అధ్యక్షుడు జానకిరాములు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్, సీనియర్ నాయకులు రాగి వేణు, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం వినోద్ పాల్గొన్నారు. 16న ఎస్జీఎఫ్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అండర్–15 బాల, బాలికల వాలీబాల్ ఎంపికలను స్థానిక మెయిన్ స్టేడియంలో ఈనెల 16న ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ కాపీలతో రిపోర్టు చేయాలని ఆమె కోరారు. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మాత్రమే ఎంపికలకు రావాలని సూచించారు. -
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
పాన్గల్: రైతులు ఎరువులు, పురుగు మందులను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వినియోగించాలని, ఇష్టానుసారంగా వాడితే నేల సారం దెబ్బతినడంతో పాటు డబ్బులు వృథా అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్ రైతులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో రైతు ఈశ్వరయ్య సాగు చేసిన వరి పంటను అధికారులతో కలిసి పరిశీలించి ఎరువుల వినియోగం, తెగుళ్లు ఆశిస్తే వాడాల్సిన పురుగు మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియాను అవసరం మేరకు వాడాలని, ఎక్కువ మోతాదులో వినియోగించొద్దని సూచించారు. ఆయన వెంట ఏడీఏ తిప్పేస్వామి, ఇన్చార్జ్ ఏఓ డాకేశ్వర్గౌడ్, సిబ్బంది ఉన్నారు. -
వర్షాలకు ప్రాణనష్టం జరగొద్దు
● అధికారులు అప్రమత్తంగా ఉండాలి ● కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు ● కలెక్టర్ ఆదర్శ్ సురభివనపర్తి: జిల్లాలో రానున్న మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి జిల్లా, మండల అధికారులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లా ఇప్పటి వరకు ఎల్లో జోన్లో ఉండగా.. ప్రస్తుతం రెడ్ జోన్లోకి మారినట్లు వాతావరణశాఖ హెచ్చరించిందన్నారు. వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని.. అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆయా మండలాల్లో ఉన్న లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాలు, నది పరీవాహక ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పునరావాస కేంద్రాలను గుర్తించి నివేదికను గురువారం కలెక్టరేట్కు అందజేయాలని ఆదేశించారు. విపత్కర పరిస్థితిలో బాధ్యతల నుంచి ఏ ఒక్క అధికారి తప్పించుకోవడానికి వీలులేదని.. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మూడు రోజుల వరకు ఎలాంటి సెలవులు లేవని.. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, విద్యుత్ అధికారులు, స్టేషన్ హౌజ్ అధికారులు తమ కేంద్రాల్లో ఉంటూ పరిస్థితులను గమనించాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు, పశువుల కాపరులు మేపునకు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది వాహనాలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడైనా స్తంభాలు విరగడం, తీగలు తెగటం వంటి సమస్యలు తలెత్తితే సరఫరా నిలిపివేసి ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేయాలన్నారు. పోలీసు సిబ్బందికి ఆదేశాలిచ్చాం.. రానున్న మూడురోజులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చామని ఎస్పీ రావుల గిరిధర్ వివరించారు. సరళాసాగర్ జలాశయం సైఫన్లు తెరుచుకుని నీరు పారుతుందని.. పోలీస్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలు రోడ్డు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ప్రజలు ప్రవహిస్తున్న వాగులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ఎన్.కీమ్యానాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. వర్షాల విపత్తును ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే వెంటనే 08545-220351/233525 కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని.. రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల, విద్యుత్శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. -
ఆ ఊళ్లో 2 కుటుంబాలే..
వనపర్తి జిల్లా రేవల్లి మండలం పాత బండరాయిపాకులలో గతంలో 480 కుటుంబాలు నివసించేవి. సుమారు నాలుగు వేల మంది జనాభా ఉండగా.. 1,800 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో ఈ గ్రామం ముంపునకు గురవుతుండగా.. 2021లో ప్రజలను ఖాళీ చేయించారు. పునరవాసం కింద కొత్తగా నిర్మించిన బండరాయిపాకులకు తరలించారు. అందరూ వెళ్లగా ప్రస్తుతం పాత గ్రామంలో రెండు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. అన్నాదమ్ములైన మిద్దె పెద్ద లక్ష్మయ్య (మృతుడు హరిబాబు తండ్రి), మిద్దె చిన్న లక్ష్మయ్య కుటుంబాలు పక్కపక్కన గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. ఊరంతా నిర్మానుష్యం కాగా.. ప్రస్తుతం అడవిలా తయారైన ఈ పాత ఊళ్లో దొరికే ఆకులు, అలుములతోనే ఆ రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి. -
మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వనపర్తి: మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని, భావితరాలకు ఉజ్వల భవిష్యత్ అందిద్దామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్–2025లో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన అధికారులు, సిబ్బందితో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ) అమలు చేస్తోందన్నారు. అవగాహన ప్రచారం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిధిలో మాదకద్రవ్య వినియోగానికి వ్యతిరేకంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ప్రజలను భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశంతో సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో గంజాయి రవాణా చేసినా, సాగుచేసినా చట్టపరమైన చర్యలు తప్పవని.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేసి, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ సునందన, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రామేశ్వర్రెడ్డి, కార్యాలయ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రెడ్ అలర్ట్
జిల్లాకు మూడురోజుల పాటు భారీ వర్షసూచన అలుగుపారుతున్న గోపాల్దిన్నె రిజర్వాయర్ తేదీ నమోదైన వర్షపాతం 3 0.1 6 1.8 7 7.4 8 42.6 9 36.7 10 7.0 11 18.2 12 36.4 13 8.9 వనపర్తి: జిల్లావ్యాప్తంగా రానున్న మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎల్లో అలర్ట్లో ఉన్న జిల్లాను బుధవారం సాయంత్రం వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరళాసాగర్, గోపల్దిన్నె రిజర్వాయర్లతో పాటు సుమారు 250 చెరువులు, కుంటలు సైతం నిండుకుండగా మారి అలుగు పారుతున్నాయి. బుధవారం సాయంత్రం ఉకచెట్టువాగులో నీటి ఉధృతి పెరిగి ఆత్మకూర్–మదనాపురం మధ్య రాకపోకలు నిలిపివేసిన అధికారులు, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వీపనగండ్లలో 23.4 మి.మీ. వర్షపాతం.. జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వీపనగండ్ల, శ్రీరంగాపురం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. వీపనగండ్ల మండలంలో 23.4 మి.మీ., శ్రీరంగాపురంలో 21.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం జిల్లా సరాసరి వర్షపాతం 8.9 మి.మీ.గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క అమరచింత మినహా.. మిగతా అన్ని మండలాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్లో అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్లోకి మార్చిన వాతావరణశాఖ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం తెరుచుకున్న సరళాసాగర్ సైఫన్లు ఆత్మకూర్–మదనాపురం మధ్య నిలిచిన రాకపోకలు 250కిపైగా అలుగు పారుతున్న చెరువులు వానాకాలం ప్రారంభం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవగా.. ఆగస్టులో ఇప్పటి వరకు సాధారణం కంటే 202 శాతం అధిక వర్షపాతం నమోదు కావటం గమనార్హం. మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జూ రాల, భీమా ప్రాజెక్టుల నుంచి కాల్వలకు నీ టి విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. -
క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్
ఆత్మకూర్/అమరచింత: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చుదిద్దుతున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించామని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం అమరచింత జెడ్పీ పాఠశాల ఆవరణలో ఇండోర్ స్టేడియం, మినీ స్టేడియం నిర్మాణాలకు శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాల దేవి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థల పరిశీలన చేశారు. 4 తరగతి గదులను తొలగించి వాటి స్థానంలో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు పట్టణ ప్రజలు సహకరించాలన్నారు. అలాగే పాఠశాలకు 4 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆత్మకూర్లో మినీ స్టేడియాన్ని సందర్శించి ఈ నెల 25న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పాలకులు పదేళ్ల పాటు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించారని, ప్రస్తుత ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆత్మకూర్లో రూ.5 కోట్లు, అమరచింతలో రూ.2 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండోర్ స్టేడియం, మినీ స్టేడియం, షటిల్, కబడ్డీ క్రీడాకారులతో పాటు వాకర్స్కు సకల సౌకర్యాలు కల్పించేందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదనలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని.. అందులో భాగంగానే పట్టణంలోని సమ్మిళిత ఫౌండేషన్ అంధ విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు రూ.4.80 లక్షలు అందించామని వెల్లడించారు. జూరాల గ్రామం వద్ద రూ.122 కోట్లతో వంతెన నిర్మిస్తామని.. ఆత్మకూర్లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఘాటుగా సమాధానం ఇవ్వాలని కాంగ్రేస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ క్రీడాకారులను అందిస్తాం.. నూతన క్రీడా విధానంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ బాధ్యతలు మరింత విస్తరించబోతున్నాయని, రాష్ట్రం నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. సీఎం ఆదేశాలతో వివిధ శాఖల సమన్వయంతో విస్తృతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, శాట్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో రెట్టింపు స్థాయిలో చేపడతామని వెల్లడించారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, మార్కెట్ డైరెక్టర్లు శ్యాం, పోసిరిగారి విష్ణు, డి.మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, తౌఫిక్, హన్మంతు నాయక్, మాజీ ఎంపీటీసీ మహంకాళి విష్ణు, ఆత్మకూర్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సుధీర్కుమార్రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గంగాధర్గౌడ్, పరమేష్, నల్గొండ శ్రీను, తులసిరాజ్, మశ్ఛందర్గౌడ్, నాగేష్, అజ్మతుల్లా, షాలం, రఫీఖ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి -
కదిలిస్తే కన్నీరే..
..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్ఎల్ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ఎవరైనా పెడితేనే తింటున్న.. నేను పని చేయలేను కాబట్టి నెలనెలా మిత్తి వస్తే ఖర్చులకు సరిపోతాయి.. బతకొచ్చు అనుకుని వచ్చిన డబ్బులను నా పేరు మీద రూ.5 లక్షలు ఫైనాన్స్లో పెట్టాను. నా కూతుళ్లు లక్ష్మీ రూ.5 లక్షలు, రుక్మమ్మ రూ.6 లక్షలు.. మొత్తం రూ.16 లక్షలు పెట్టాం. మొదట్లో మిత్తి డబ్బులు 2 నెలలు ఇచ్చాడు. ఆ తర్వాత మిత్తి లేదు.. అసలు లేదు నాకు ప్రస్తుతం అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఎవరైనా బయట పెడితే తింటున్న.. గుడిసెలో వెళ్లి పడుకుంటున్నా. – భగవంతు, బాధితుడుక్యాన్సర్ పేషంట్ను..గోలీలకూ డబ్బుల్లేవు..పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు. – గోపాల బొజ్జమ్మ, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తిఅతికష్టం మీద బతుకుతున్నాం..నా పేరు, నా భర్త మీద రూ.6 లక్షలను 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో పెట్టాం. మాకు నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మాతో డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని ఎవరూ చూసుకోవడం లేదు. ఉన్న కొడుకు కూడా విడిగా ఉంటున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది. ఒక కన్ను సరిగా కనిపించడం లేదు. అతికష్టం మీద బతుకుతున్నాం. డబ్బులు అనవసరంగా ఎవరికో ఇచ్చి ఇలా చేశారని కొడుకు, కోడలు నిత్యం తిడుతూనే ఉన్నారు. మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. – మిద్దె నాగమ్మ, బాధితురాలునాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది.. మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు. – కుర్మయ్య, బాధితుడుకిరాయి ఇంట్లో ఉంటున్నాం.. తెలిసిన వాళ్లు మిత్తి వస్తుందని చెబితే.. మాకు పునరావాసం కోసం వచ్చిన డబ్బులు మొత్తం రూ.24 లక్షలను ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో నాలుగేళ్ల క్రితం పెట్టాం. ఇప్పటివరకు మాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేదు. కిరాయికి వేరొకరి ఇంట్లో ఉంటున్నాం. నేనూ మా ఆయన ఇద్దరం కూలీ చేసుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉంటే.. దుడ్డు మల్లయ్య అనే వాళ్లతో రూ.2.60 లక్షలు కట్టించాను. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – గోపాల పార్వతమ్మ, బాధితురాలు -
ప్రతిభను గుర్తించి వెలికితీయాలి
వనపర్తి: జిల్లాలో విభిన్న రంగాల్లో ప్రతిభ సాధించిన కళాకారులు ఎందరో ఉన్నారని.. అలాంటి వారు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి శిల్పకళా రంగంలో ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లాకు చెందిన శిల్పి బైరోజు చంద్రశేఖర్ను ఎస్పీ ఘనంగా సన్మానించి మాట్లాడారు. వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను చంద్రశేఖర్ చిన్ననాటి నుంచి నేర్చుకొని ఎన్నో ఆలయాలకు వందలాది విగ్రహాలు తయారు చేయడం అభినందనీయమన్నారు. శిల్పిగా, సాహితీవేత్తగా, పరిశోధకుడిగా బహుముఖ ప్రతిభకనబర్చిన బైరోజు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి జిల్లా విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మారోజు తిరుపతయ్య, బి.యాదగిరి పాల్గొన్నారు. ● ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తిచేసి ఆరు బంగారు పతకాలు సాధించిన జిల్లాకేంద్రానికి చెందిన గుండోజు భార్గవిని ఎస్పీ రావుల గిరిధర్ మంగళవారం తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు. చదువులో రాణించి పలువురికి స్ఫూర్తిగా నిలిచిన భార్గవితో ఎస్పీ మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తండ్రి యాదగిరి ఆచారి స్వర్ణకార వృత్తి చేస్తూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. -
ముగిసిన విద్యార్థుల ఎంపిక
వనపర్తి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట, రామంతపూర్)లో 2025–26 విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో ప్రవేశాలకుగాను గిరిజన బాల, బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరించగా మంగళవారం కలెక్టరేట్లో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. మూడు బాలుర, 3 బాలికలకుగాను బాలుర నుంచి 5 దరఖాస్తులు రాగా ముగ్గురిని పారదర్శకంగా ఎంపిక చేసినట్లు జిల్లా గిరిజన, సంక్షేమ అభివృద్ధిశాఖ అధికారి తెలిపారు. కార్యక్రమంలో డీటీడీఓ సభ్యురాలు ఉమాదేవి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.‘పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్’వనపర్తి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారీ దవాఖానాలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటంతో వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీ–హబ్, క్రిటికల్ కేర్ సెంటర్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడి టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలందించడంలో రాష్ట్రంలోనే రెండోస్థానం ఉండేదని.. ప్రస్తుతం 12వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. 134 రకాల వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 95 మాత్రమే నిర్వహిస్తున్నారని, వైద్యులు లేక హృద్రోగులను పరీక్షించే 2డి ఎకో యంత్రం వృథాగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉందని, రేడియాలజిస్ట్ సైతం అందుబాటులో లేకపోవటం శోచనీయమన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్త పరీక్షలకు వాడే రీ ఏజెంట్స్ లేక నాగర్కర్నూల్ నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. గర్భిణులకు మూడు రకాల థైరాయిడ్ పరీక్షలు చేయాల్సి ఉండగా.. యంత్రం మరమ్మతులో ఉందని పరీక్షలు చేయడం లేదన్నారు. అన్నిరకాల వైద్యపరీక్షలు, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని.. సమస్యలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాస్తామని చెప్పారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, గంధం పరంజ్యోతి, విజయ్కుమార్, ఉంగ్లం తిరుమల్, నాగన్న యాదవ్, హేమంత్ ముదిరాజ్, చిట్యాల రాము పాల్గొన్నారు.విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలివనపర్తిటౌన్: విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని వనపర్తి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్వీఎస్ రాజు అన్నారు. కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న చరణ్కుమార్ ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగిన తెలంగాణ 11వ జూనియర్, సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని బంగారు, రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ చరణ్కుమార్కు పూల మొక్క అందజేసి అభినందించారు. ట్రిపుల్ జంప్లో 13.14 మీటర్లు దూకి బంగారు, లాంగ్ జంప్లో 6.40 మీటర్లు దూకి రజత పతకం సాధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బీవీ రాం నరేష్ యాదవ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.రైతుబీమా దరఖాస్తునకు నేడు చివరి గడువుకొత్తకోట రూరల్: రైతుబీమాకు 18 నుంచి 59 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, బుధవారంతో గడువు ముగియనుందని.. సద్వినియోగం చేసుకోవాలని కొత్తకోట ఏడీఏ దామోదర్ కోరారు. క్లస్టర్ పరిధిలోని రైతులు సంబంధిత ఏఈఓలను కలిసి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్కార్డు జిరాక్స్ను దరఖాస్తునకు జతచేసి అందజేయాలని సూచించారు. -
కానరాని పురోగతి!
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సివిల్, మెకానికల్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అదే విధంగా పలు రిజర్వాయర్ల కింద భూ సేకరణకు సంబంధించి సమస్యలు పెండింగ్లో కొనసాగుతున్నాయి. ● మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం. ● నారాయణపేట జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం పనులు సైతం పెండింగ్లో కొనసాగుతున్నాయి. ఫలితంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. కొనసా..గుతున్న ‘పాలమూరు’.. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన ● వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే.. ● ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు ● అమాత్యుల సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితం ● నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న ఆమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా.. గతేడాది సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యతలు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ● 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగానే ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. వివిధ కారణలతో రెండుపంపులు మరమ్మతుకు గురై మూలకు చేరాయి. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్టోల్, తూములు, ఆనకట్ట బండ్లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు.గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185 కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. నేడు సమీక్ష.. హైదరాబాద్లోని రాాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఉదయం సెషన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులు, మఽధ్యాహ్నం సెషన్లో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. నెరవేరని లక్ష్యం బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 1 0లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది. -
భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: ఆరుగాలం కష్టించి జీవనోపాధి పొందుతున్న వ్యవసాయ భూములతో పాటు ఉంటున్న ఇళ్లు, జ్ఞాపకాలన్నీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణంలో పోయాయి. ఆ తర్వాత వచ్చిన అరకొర పరిహారంతోనైనా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవాలన్న వారి ఆశలను బోగస్ ఫైనాన్స్ కంపెనీ గండి కొట్టింది. అధిక వడ్డీ చెల్లిస్తామనే పేరిట నిర్వాసితుల నుంచి భారీగా డబ్బులు సేకరించి.. చివరకు బోర్డు తిప్పేసింది. ఈ క్రమంలో రైతులు అంతకుముందు నుంచే అంటే నాలుగేళ్లుగా వారి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. బాధితుల్లో ఇప్పటివరకు పలువురు ఆత్మహత్య చేసుకోగా.. హార్ట్ అటాక్తో సుమారు 20 మంది.. కిడ్నీ ఇతర ఆరోగ్య కారణాలతో మరో 120 మంది వరకు మృత్యు కౌగిలికి చేరారు. ఇంకా కొందరు చికిత్సకు డబ్బులు లేక మరణశయ్యపై కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. 14 మందిపై కేసు.. రూ.50 కోట్ల ఆస్తి జప్తు డిపాజిట్ల అనంతరం కొన్ని రోజుల తర్వాత ఫైనాన్స్ నిర్వాహకులు సక్రమంగా వడ్డీ చెల్లించకపోవడంతో నిర్వాసితులు నాగర్కర్నూల్ మార్కెట్ సెంటర్లోని ఫైనాన్స్ కార్యాలయం వద్దకు క్యూకట్టారు. ఇలా 2020 నుంచి 2023 వరకు చక్కర్లు కొట్టారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబు, అతడి కుటుంబ సభ్యులు మాయమాటలు చెబుతూ చివరకు కంపెనీని ఎత్తివేశారు. దీంతో 2023 ఫిబ్రవరి 13న బాధితులు నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఇందులో ఇత్యాల సాయిబాబు (ఏ–1)తో పాటు ధనుంజయ్ (ఏ–2), బాలేశ్వర్ (ఏ–3), ఇత్యాల రజిత (ఏ–4), యామిని (ఏ–5), శారద (ఏ–6), సాయిదివ్య (ఏ–7), సాయి దీక్షిత్ (ఏ–8) అనుపటి శ్రీనివాసులు, తాడూరు మాజీ సర్పంచ్(ఏ–9), ఆర్అండ్ఆర్ కమిటీ చైర్మన్గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్రెడ్డి (ఏ–10), జానకీ రాంరెడ్డి (ఏ–11), కరుణాకర్రెడ్డి (ఏ–12), గువ్వ వెంకటేశ్వర్లు (ఏ–13), ఉర్సు హుస్సేన్ (ఏ–14)పై కేసు నమోదైంది. వీరిలో సాయిబాబు, సాయిదీక్షిత్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, హుస్సేన్ను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు ముందస్తు బెయిల్ పొందారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సాయిబాబు కుటుంబసభ్యుల ఆస్తులను జప్తు చేయాలని.. ఈ ఏడాది జూన్ 17న జీఓ నంబర్ 562ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ మార్కెట్ వాల్యు ప్రకారం ఇప్పటివరకు సదరు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులకు సంబంధించి రూ.50 కోట్ల ఆస్తిని జప్తు చేశారు. 2 వేల మంది.. సుమారు రూ.180 కోట్ల డిపాజిట్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న ప్రజలకు సంబంధించి గత ప్రభుత్వం పరిహారం అందజేసింది. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సుమారు 50 గ్రామాలు ముంపునకు గురి కాగా.. నిర్వాసితులకు సంబంధించి ఎకరా పట్టా భూమికి రూ.5.50 లక్షలు, లావణి పట్టా భూమికి రూ.3.50 లక్షలు.. ఇల్లు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.12.50లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది. అయితే ముంపు గ్రామమైన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్కు చెందిన సాయిబాబా తన కుటుంబసభ్యులతో కలిసి నాగర్కర్నూల్ మార్కెట్ యార్డు సమీపంలో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ పేరుతో 1995 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫైనాన్స్ను నడిపిస్తున్నాడు. మొదట రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలో రైతులకు ఒక్కసారిగా వచ్చిన నష్ట పరిహారంపై అతడి కన్ను పడింది. రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్త్తామని.. మీరు భూములు, ప్లాట్లు కొన్నప్పుడు 15 రోజుల ముందు చెబితే మీ డబ్బులు మీకు ఇస్తామని నమ్మబలికి 2018 నుంచి 2020 వరకు డిపాజిట్ చేయించుకున్నాడు. తొలుత వడ్డీ సక్రమంగా చెల్లిస్తూ రాగా.. సుమారు 2,500 మంది దాదాపు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకు సదరు ఫైనాన్స్ కంపెనీలో నిర్వాసితులు పరిహారం డబ్బులను జమ చేశారు. ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత వడ్డీ ఆశతో వచ్చిన పరిహారం డబ్బులుఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో జమ వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో సుమారు 2,500 మంది బాధితులు రూ.180 కోట్ల మేర కంపెనీలో డిపాజిట్.. బోర్డు తిప్పేయడంతో రైతుల గగ్గోలు మోసంతో చితికిన కుటుంబాలు.. అనారోగ్యంతో మంచం పాలు ఇప్పటికే ఒకరు ఆత్మహత్య.. హార్ట్ ఎటాక్తో 20 మంది వరకు మృతి వివిధ ఆరోగ్య కారణాలతో మరో 120 మంది కూడా.. -
పిల్లల్లో నులిపురుగులను నిర్మూలిద్దాం
వనపర్తి: చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులిపురుగులను నిర్మూలించడం ముఖ్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమ వారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అపరిశుభ్రతతో భోజనం చేయడం వల్ల క్రిములు శరీరంలోకి వెళ్లి నులిపురుగులు తయారై అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని తెలిపారు. 1–19 ఏళ్లలోపు వారందరికీ విధిగా అల్బెండజోల్ మాత్రలు వేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. కేజీబీవీ నుంచి ఎవరైనా ఐఐటీలో సీటు సంపాదిస్తే వారిని తన ఇంటికి ఆహ్వానించి భోజనం చేస్తానని కలెక్టర్ చెప్పారు. సీపీఆర్పై అవగాహన ఉండాలి.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్ విధానంపై అందరికీ అవగాహన ఉండాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వ ర్యంలో అధికారులకు సీపీఆర్ విధానంపై డాక్టర్ రఘు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వల్ల చనిపోతున్నారన్నా రు. అలాంటి వారికి కొన్ని క్షణాలలోపు సీపీఆర్ చే యడం వల్ల 85శాతం బతికే అవకాశం ఉందన్నారు. సీపీఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ శ్రీనివాసులును కలెక్టర్ ఆదేశించారు. ● జిల్లాలో ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతకోటలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న ఎరువుల నిల్వకు సంబంధించిన బోర్డుతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు అవసరం మేరకే యూరియా విక్రయించాలని సూచించారు. ● ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 45 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. ● పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో అన్నిశాఖల అధికారులతో ఆయన స మీక్షించారు. సమీకృత కలెక్టరేట్లో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్ల బాధ్యతలను ఆయా శా ఖల అధికారులకు అప్పగించారు. అదనపు కలెక్టర్లు కీమ్యనాయక్, యాదయ్య ఏఎస్పీ ఆర్.వీరారెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీజీసీఓ సుబ్బలక్ష్మి, ప్రోగ్రాం అధికారి రామచంద్రరావు పాల్గొన్నారు. 1–19ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కలెక్టర్ ఆదర్శ్ సురభి -
క్రీడలతో నూతనోత్తేజం
వనపర్తి: విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు నూతనోత్తేజం నింపుతాయని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గతనెలలో అమెరికాలో నిర్వహించిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ మీట్లో వనపర్తి జిల్లా ఏఆర్ హెడ్కానిస్టేబుల్ పసుపుల కృష్ణారావు బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ ఆయనను పూలమాలతో సత్కరించి అభినందించారు. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ మీట్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ విభాగం తరఫున ఇండోర్ రోయింగ్ గేమ్ అండర్–50 విభాగంలో 80 దేశాల నుంచి 8,500 మంది క్రీడాకారులు పాల్గొనగా.. హెడ్కానిస్టేబుల్ కృష్ణారావు అత్యంత ప్రతిభకనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. అంతర్జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని మరి న్ని విజయాలు సాధించి, దేశం, రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, రిజర్వు సీఐ అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరే శ్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. నిర్వాసితులను ఆదుకుంటాం : జూపల్లి కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్వాసితులను ఆదుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్, భూసేకరణ అధికారి మధుసూదన్ నాయక్తో ఆయన సమావేశమై.. ముంపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్రకారం ప్యాకేజీ చెల్లింపు అంశంపై చర్చించారు. పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులందరికీ సమాన పరిహారం అందేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలను అఽధికారులు మంత్రికి అందజేశారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, ఉపాధి, ఆరోగ్య సేవలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు మంత్రిని కలిసి సత్కరించారు. సమావేశంలో ఆర్డీఓ భన్సీలాల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. -
కోతలే కోతలు!
●చీటికీ మాటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ● కనీస సమాచారం లేకుండా కోతలు విధిస్తున్న వైనం ● ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నాం.. గ్రామాలతో పాటు పట్టణాల్లో ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో పనులకు ఆటంకం కలుగుతుంది. విద్యుత్పై ఆధారపడి జీవనం సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలి. – రవి, మోటారు మెకానిక్, కొత్తకోట చెట్లకొమ్మల తొలగింపుతోనే.. విద్యుత్ లైన్ల కింద ఏపుగా పెరిగే చెట్ల కొమ్మల తొలగింపు పనులను ఎప్పటికప్పుడు చేపడుతున్నాం. ఈ క్రమంలోనే ఆయా ఫీడర్ల పరిధిలో అవసరం మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటాం. దీనికి తోడు విద్యుత్ సబ్స్టేషన్లో సమస్యలు తలెత్తినప్పుడు, ఎక్కడైనా విద్యుత్ ట్రిప్ అయినప్పుడు మాత్రమే సరఫరాను నిలిపివేస్తాం. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నాం. – రాజశేఖరం, విద్యుత్ ఎస్ఈ వనపర్తిటౌన్: జిల్లాలో అధికారిక విద్యుత్ కోతలు అధికమవుతున్నాయి. చీటికీ మాటికి విద్యుత్ సరఫరాలో అధికారికంగా కోతలు విధిస్తున్నారు. జిల్లాలో 33కేవీ పరిధిలో 29 ఫీడర్లు, 11కేవీ పరిధిలో 241 ఫీడర్లు ఉన్నాయి. గత ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు మొత్తం 270 ఫీడర్ల పరిధిలో అధికారికంగా 2,839 గంటలు కోత విధించారు. దీంతో సగటున ఒక్కొక్క ఫీడర్ పరిధిలో సగటున 10.51 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత పెట్టారు. 11 కేవీ ఫీడర్ల కింద అత్యధికంగా 2,141.32 గంటలు, 33 కేవీ ఫీడర్ల పరిధిలో 698.39 గంటలు విద్యుత్ కోతలు విధించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన జూన్, జూలైలో వేసవికి పోటీగా 3నుంచి 5గంటల తేడాతో విద్యుత్ అంతరాయం ఏర్పడటం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 220కేవీ, 132/33కేవీ సబ్స్టేషన్లు ప్రధానమైనవి. 33కేవీ ఒక్కొక్కఫీడర్ పరిధిలో 2 నుంచి 4 సబ్స్టేషన్లు ఉన్నాయి. 11కేవీ పరిధిలోని 241 ఫీడర్ల ద్వారా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే ప్రధాన సబ్స్టేషన్ నుంచి 33కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా సమయంలో అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఫీడర్ పరిధిలో ఒక్కోలా విద్యుత్ కోతలు నమోదవుతున్నాయి. ● జిల్లాలోని 11కేవీ సబ్స్టేషన్ల నుంచి 241 ఫీడర్ల ద్వారా వ్యవసాయం, గృహ, ఇతర అవసరాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఒక్కొక్క ఫీడర్ పరిధిలో వ్యవసాయ, సాధారణ ట్రాన్స్ఫార్మర్లు 50 నుంచి 100 వరకు ఉంటాయి. అయితే వీటి పరిధిలో సాధారణంగా వేసవిలో అధికంగా విద్యుత్ కోతలు ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా వర్షాకాలం ప్రారంభమైన జూన్, జూలై నెలల్లోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఏప్రిల్లో 545.30 గంటల పాటు విద్యుత్ కోతలు విధించగా.. గతనెల (జూలై)లో 534.56 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం విస్మయం కలిగిస్తుంది. మేలో 532.28 గంటలు కాగా.. జూన్లో 529.18 గంటల విద్యుత్ కోత విధించారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా లేక నెలకొన్న అంధకారం ఫీడర్ పేరు ఫీడర్ల సంఖ్య ఏప్రిల్ మే జూన్ జూలై 33కేవీ 29 182.48 174.25 169.42 172.24 11కేవీ 241 545.30 532.28 529.18 534.56 -
బుద్దారం చరిత్ర గొప్పది
గోపాల్పేట: మండలంలోని బుద్దారం గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని.. ఎప్పుడు ఎలా ఏర్పడింది, అలాగే గండి ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర తదితర వివరాలను పుస్తక రూపంలోకి మార్చడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బుద్ధారం చరిత్ర–సంస్కృతి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వారి వారి చరిత్ర తెలుసుకోవడంతో ఏం సాధించాం.. ఇంకా ఏం సాధించాలనే అవగాహన కలుగుతుందని తెలిపారు. గ్రామ చరిత్రను పుస్తక రూపంలోకి మార్చిన రచయిత రమేష్బాబును, అలాగే గ్రామానికి చెందిన డా. లగిశెట్టి శ్రీనివాసులు ఎనిమిది డిగ్రీలు పూర్తిచేసినందుకుగాను అభినందించారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, సంఘం అధ్యక్షుడు పూల్యానాయక్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, అచ్యుతరామారావు, ఓంకార్, శివకుమార్, శేఖర్గౌడ్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు..!
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ను జెన్కో అధికారులు బాగు చేయించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించే సమయంలో వాటికి సంబంధించిన బ్లాక్ పూడుకుపోవడంతో క్రేన్లను రప్పించి వాటి సాయంతో బ్లాక్ను పైకెత్తడంతో ప్రాజెక్టు రహదారిపై వాహనాల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో జూరాల క్రస్ట్ గేట్లకు సంబంధించిన రోప్లు మొరాయించడంతో క్రేన్ల సాయంతో పైకెత్తుతున్నారన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. జూరాలకు మళ్లీ సమస్య తలెత్తిందా.. ప్రాజెక్టు భద్రమేనా అనే విషయాలను పరిసర గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. సమస్య క్రస్ట్ గేట్లది కాదని.. జెన్కో సమస్య అంటూ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ● జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని ఆరు యూనిట్లకు 12 గేట్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. వరద నిలిచిపోతే గేట్లు మూసివేస్తారు. వీటికి సంబంధించిన గేట్ల రోప్లు అప్పుడప్పుడు మొరాయించడం సాధారమేనని, వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని జెన్కో సిబ్బంది వెల్లడిస్తున్నారు. రెండేళ్ల కిందట.. జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరు యూనిట్లకుగాను మూడో యూనిట్కు సంబంధించిన టర్బైన్ రెండేళ్ల కిందట కాలిపోయింది. మరమ్మతుకుగాను జెన్కో అధికారులు టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అలస్యంగా చేపట్టారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తవడంతో అధికారులు విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 3వ యూనిట్కు నీటిని సరఫరా చేసే బ్లాక్ బురదలో ఇరుక్కొని పైకెత్తేందుకు మొరాయించడంతో అధికారులు కర్ణాటక నుంచి అధునాతన క్రేన్లను రప్పించి వాటి సాయంతో పనులు పూర్తి చేశారు. జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు 3వ యూనిట్ బ్లాక్ను పైకెత్తే సమయంలో జెన్కో అధికారులు ఆనకట్టపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 వరకు మరమ్మతులు భారీ క్రేన్ల సాయంతో చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టుపై తాగేందుకు కనీసం నీరు సైతం లభించలేదు. ఎలాంటి సమాచారం లేకుండా రాకపోకలు నిలిపివేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమస్యను వినేవారే కరువయ్యారు. జూరాల జలాశయం క్రస్ట్గేట్ల రోప్లు మొరాయిస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్త అవాస్తవం. విద్యుదుత్పత్తి కోసం ఆరు బ్లాక్లకు నీటిని వదులుతున్నాం. వాటికి సంబంధించిన వ్యవహారం జెన్కో అధికారులే పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు 64 క్రస్ట్గేట్ల రోప్లు బాగానే ఉన్నాయి. ఎలాంటి ముప్పులేదు. – ఖాజా జుబేర్ అహ్మద్, ప్రాజెక్టు ఈఈ, గద్వాల రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ టర్బైన్ను మరమ్మతుల తర్వాత ఆదివారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన బ్లాక్ బురదలో పూడుకుపోవడంతో రోప్ ద్వారా సాధ్యం కాకపోవడంతో క్రేన్ల సాయంతో పైకెత్తాం. అంతేగాని రోప్లు తెగిపోయాయనే మాటాల్లో వాస్తవం లేదు. – పవన్కుమార్, డీఈ, జెన్కో జూరాలలో 3వ యూనిట్ వినియోగంలోకి.. రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన వైనం బాగు చేసి ఆదివారం క్రేన్ల సాయంతో బ్లాక్ను పైకెత్తి నీటి సరఫరా ప్రాజెక్టుపై మూడుగంటల పాటు నిలిచిన వాహనాలు -
‘పోడు’ రైతుల ఆందోళన
పాన్గల్: తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏళ్లుగా అడుగుతున్నా పట్టించుకోకపోగా అటవీ అధికారులు భూములను అక్రమించి అక్రమ కేసులు నమోదు చేశారంటూ జిల్లాలోని పాన్గల్ మండలం కిష్టాపూర్తండా గిరిజన రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి కథనం మేరకు.. గ్రామశివారులోని సర్వేనంబర్ 34లో 12 ఎకరాల పోడు భూమి ఉండగా సుమారు 50 ఏళ్లుగా 25 గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. పనికిరాని భూములను సైతం చదును చేసి యోగ్యంగా మలుచుకోవడంతో పాటు ఆయా భూముల్లో బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములకు గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గిరిజన రైతులకు పోడు పట్టాలిచ్చినా ఇక్కడి రైతులకు మాత్రం పంపిణీ చేయలేదు. కాగా కొందరు రైతులు బతుకుదెరువు కోసం భూములు వదిలి ముంబై, పూణే వంటి నగరాలకు వలస వెళ్లగా అటవీశాఖ అధికారులు వారికి తెలియకుండా మొక్కలు నాటి ఆక్రమించే చర్యలు పూనుకున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో చేసేది లేక భూమిలో ఉన్న చెట్లను ధ్వంసం చేయడంతో ఈ నెల 5న అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12 మంది గిరిజన రైతులపై కేసులు నమోదయ్యాయి. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ రైతులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి సాగు చేసుకుంటున్న పోడు భూములపై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని.. లేనిచో ఆత్మహత్యే శరణ్యమని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ పరిధిలోని భూమిలో ఉన్న చెట్లను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో జిల్లా అధికారుల ఆదేశానుసారం గిరిజన రైతులపై కేసులు నమోదు చేశాం. రైతులు సాగు చేయని అటవీ భూముల్లో ఉపాధిహామీ పథకంలో నాటిన మొక్కలను కూడా తొలగించారు. వారి వద్ద ఉన్న ఆధారాలతో జిల్లా అధికారులను కలిసి భూములకు హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ అటవీ భూమిలోని చెట్లను ధ్వంసం చేయడం, అక్రమించడం నేరమే అవుతుంది. – బాలకిష్టమ్మ, డిప్యూటీ రేంజ్ అధికారి, ఖాసీంనగర్ సెక్షన్, వనపర్తి ఓ పక్క ప్రభుత్వం సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెబుతుండగా.. మరోపక్క గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్న కిష్టాపూర్తండా గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి. వారిపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. – బాల్యానాయక్, జిల్లా కార్యదర్శి, గిరిజన సంఘం, తెల్లరాళ్లపల్లితండా తండా శివారులో ఉన్న పోడు భూమిని ఏళ్లుగా సాగుచేసుకుంటున్నాం. వీటికి సంబంధించి గతంలో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు. మేము కొంతకాలం పాటు వలస వెళ్తే అటవీ అధికారులు మొక్కలు నాటారు. వచ్చిన తర్వాత పెరిగిన చెట్లను ధ్వంసం చేయడంతో కేసులు నమోదు చేశారు. జైలుకై నా వెళ్తాం.. కానీ సాగుచేసిన భూములను వదులుకోం. – మంగమ్మ, మహిళా రైతు, కిష్టాపూర్తండా మేము ఎన్నో సంవత్సరాల క్రితం బీడు భూములను మంచిగా చేసి సాగుకు అనువుగా మార్చుకున్నాం. అందులో బోర్లు కూడా వేసుకున్నాం. మాకు ఈ భూమి తప్ప వేరే భూమి లేదు, ఇదే అధారం. కొంత కాలం పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళితే అందులో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటి అవి అటవీశాఖకు చెందినవిగా చిత్రీకరిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. భూమి దక్కే వరకు పోరాడుతాం. – బొజ్జమ్మ, మహిళా రైతు, కిష్టాపూర్తండా సాగు భూమిని లాక్కున్నారని పోరుబాట అటవీశాఖ స్థలంలో చెట్లు తొలగించారని కేసుల నమోదు పాన్గల్ మండలం కిష్టాపూర్తండాలో ఘటన విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకోలు -
కేఎల్ఐ.. రికార్డు బ్రేక్!
ప్రాజెక్టు ప్రారంభం నుంచి నీటి ఎత్తిపోతలు ఇలా.. ఈ ఏడాది ఇప్పటికే 4 టీఎంసీలు పంపింగ్ ● గత సీజన్లో 50 టీఎంసీల నీటి ఎత్తిపోతలు ● మూడు మోటార్లతోనే కొనసాగుతున్న లిఫ్టింగ్ ● భారం పడుతున్నా.. తప్పడం లేదంటున్న అధికారులు కొల్లాపూర్: జిల్లా వరప్రదాయిని కేఎల్ఐ ప్రాజెక్టు నీటి ఎత్తిపోతల్లో రికార్డు సృష్టిస్తోంది. కృష్ణానదికి వరద ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గత రికార్డుకు బ్రేక్ వేసింది. 2011లో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రారంభం కాగా.. నాటి నుంచి అవిశ్రాంతంగా మోటార్లు పనిచేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్లో రెండు మోటార్లు పాడయ్యాయి. మిగిలిన మూడు మోటార్లతోనే నీటిని ఎత్తిపోస్తూ ప్రాజెక్టు అధికారులు రికార్డు సృష్టిస్తున్నారు. పనితీరు ఇలా.. కేఎల్ఐ పరిధిలో ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటుచేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం, ఒక మోటార్ స్పేర్లో ఉంచేందుకు నిర్ణయించారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. మిషన్ భగీరథకు సైతం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకానికి కూడా కేఎల్ఐ ద్వారానే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. మోటార్లపై భారం.. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లకు గాను ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2011లో కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంమైన సమయంలో ఐదు మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి సంవత్సరం 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి. 2016 నుంచి నీటి పంపింగ్ శాతం భారీగా పెరుగుతూ వచ్చింది. మూడు మోటార్లతోనే రికార్డు స్థాయిలో పంపింగ్ జరుగుతోంది. సాగు, తాగునీటికి కేఎల్ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డుస్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరో వైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ప్రాజెక్టు చరిత్ర.. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కోతిగుండు వద్ద నుంచి కృష్ణా బ్యాక్వాటర్ను వినియోగించుకునేలా కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారు. 1998లో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేపట్టారు. 2003లో పనులు ప్రారంభమయ్యాయి. 2.50లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో ఈ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్హౌజ్లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తున్నారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు. రెగ్యులర్గా పంపింగ్.. వర్షాకాలంలో మినహాయిస్తే మిగతా రోజుల్లో ఎల్లూరు పంప్హౌజ్ లోని మూడు మోటార్ల ద్వారా రెగ్యులర్గా నీటిని పంపింగ్ చేస్తు న్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపో తలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గు తుంది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. గతేడాది 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్ నాయక్, డీఈ, పంపుహౌజ్ నిర్వహణ విభాగం కేఎల్ఐ ఎత్తిపోతల పథకం సీజన్ ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో) 2011–12 0.00864 2012–13 1.9062432 2013–14 1.351552 2014–15 1.7842464 2015–16 2.5099632 2016–17 14.01715 2017–18 27.35148 2018–19 35.97796 2019–20 49.99874 2020–21 30.29203 2021–22 31.71288 2022–23 37.50358 2023–24 30.38209 2024–25 50.72208 2025 జూన్ 1నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీలు ఎత్తిపోశారు. -
నులి పురుగును నిర్మూలిద్దాం
● జిల్లాలో నేడు, 18 తేదీల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య, ఆరోగ్యశాఖ పాన్గల్: ఆరోగ్య సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కడుపులో నులి పురుగులు ఉండటంతో పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. వీటి నివారణే లక్ష్యంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఏటా ఫిబ్రవరి 10న మొదటి విడత, ఆగస్టు 10న రెండో విడత ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఏడాది నిర్వహించాల్సిన మాత్రల పంపిణీ కార్యక్రమం వివిధ కారణాలతో వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ నెల 11, 18 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు బయట ఉండే 1 నుంచి 19 ఏళ్లలోపు వారిని ఇప్పటికే గుర్తించారు. వ్యాధి లక్షణాలు.. నులి పురుగులున్న పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం పడటం, వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరియైన సమయంలో చికిత్స..... పురుగుల పునరుత్పత్తి, ఎదుగుదల మొత్తం కడుపులోనే జరగడంతో మనం తీసుకునే ఆహారాన్ని అవే లాగేసుకుంటాయి. దీని ఫలితంగా పదేళ్ల వయసున్న వారిలో ఎక్కువగా రక్తహీనత, ఆకలి లేకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించి చి కిత్స చేయించుకోవాలి. ఆల్బెండజోల్ మాత్రలను ఏటా రెండు పర్యాయాలు వేయించడంతో నులి పు రుగుల సమస్యను నివారించే అవకాశం ఉంటుంది. మాత్రల మోతాదు.. రెండేళ్లలోపు పిల్లలకు ఆర మాత్ర (200 ఎంజీ), 2 నుంచి 3 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర (400 ఎంజీ) పొడి రూపంలో అందించాలి. 3 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర (400 ఎంజీ) చప్పరించాలి. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఈ మాత్ర వేసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. ఏదేని కారణంతో 11వ తేదీన మాత్ర వేసుకోని వారు 18వ తేదీన వేసుకునే అవకాశం కల్పించారు. అపోహలు వద్దు .. ఆల్బెండజోల్ మాత్రలతో ఎలాంటి దుష్పరిణామాలు, అపోహలు అవసరం లేదు. 19 ఏళ్లలోపు వారంతా మాత్రలు వేసుకునేలా ప్రోత్సహించాలి. మాత్రల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 100 శాతం పంపిణీకి కృషి చేస్తున్నాం. మధ్యాహ్న భోజనం తర్వాత మాత్ర వేసుకొని గంటపాటు నీరు తాగకుండా ఉండాలి. వైద్యసిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమన్వయంతో పూర్తి చేస్తాం. మాత్రల వినియోగం, చేతుల శుభ్రత, ఆరుబయట మల, మూత్ర విసర్జన తదితర అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. – డా. పరిమళ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మాత్రల పంపిణీ విధులు నిర్వర్తించే సిబ్బంది సూపర్వైజర్లు 36 ఏఎన్ఎంలు 154 అంగన్వాడీ టీచర్లు 577 ఆశా కార్యకర్తలు 559 -
రామన్పాడుకు వరద
మదనాపురం: జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి శంకరసముద్రం ద్వారా 1200 క్యూసెక్కులు, ఊకచెట్టు వాగు ద్వారా 300 క్యూసెక్కులు, జూరాల ఎడమ కాల్వ నుంచి 185 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 83 క్యూసెక్కుల వరద మండలంలోని రామన్పాడు జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు శనివారం రెండు గేట్లు పైకెత్తి 1,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 1,021 అడుగుల నీటిమట్టం ఉంది. అలాగే జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 97 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ వివరించారు. రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
జూరాల వెనక జలాల నుంచి..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెనక జలాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్కు సాగునీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలో రిజర్వాయర్కు నీటిని తరలించడంతో పాటు కాల్వల ద్వారా ఆయా గ్రామాల్లోని చెరువులు నింపుతున్నారు. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో పాటు మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. పదేళ్లుగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వానాకాలంలో నీటిని వదులుతుండటంతో అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్ మండలాల్లోని సుమారు 50 గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నారు. దింతో సాగునీరు లేక గత కొన్ని సంవత్సరాలుగా బీళ్ళుగా మారిన పంట పోలాలు పది సంవత్సరాలుగా పంట పోలాలు పచ్చని పంటలతో కళకళ లాడుతున్నాయి. భూత్పూర్ రిజర్వాయర్ ఎడమ కాల్వ అమరచింత పెద్ద చెరవు వరకు విస్తరించి ఉండటంతో చివరగా అమరచింత పెద్ద చెరువు నిండి అక్కడి నుంచి ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల, ఆత్మకూర్ చెరువులకు నీటిని తరలిస్తున్నారు. -
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
వాలీబాల్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్ అకాడమీకి ఎంపికై నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎస్జీఎఫ్ అండర్– 14, అండర్– 14 రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాను. గతేడాది సీఎం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా ద్వితీయ స్థానం వచ్చింది. భవిష్యత్లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఎదగడంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. – ప్రశాంత్, పల్లెగడ్డ, మహబూబ్నగర్ రెండేళ్ల నుంచి సాధన మొదటిసారి వాలీబాల్ అకాడమీకి ఎంపికయ్యాను. రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ చేస్తున్న. సిద్ధిపేట, మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్కు వెళ్లాను. ఈ రెండింట్లో కూడా ఎంపికయ్యాను. కానీ, మహబూబ్నగర్ అకాడమీలో చేరాను. ఇక్కడ వసతులు బాగున్నాయి. అటాకర్గా శిక్షణ తీసుకుంటున్న. – నరేష్, ఇప్పలపల్లి, రంగారెడ్డి -
శనేశ్వరుడికి తైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శి ంచుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
వీపనగండ్ల: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని.. అనారోగ్యం బారిన పడిన వారికి కార్పొరేట్ వైద్యం అందుతుందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. శనివారం మండలంలోని కల్వరాలలో బత్తుల ఈశ్వరమ్మకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసి మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే గాకుండా గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం గ్రామంలో 220 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ నాయకులు చింత దయాకర్, తిరుపతయ్య, ఆంజనేయులు, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోపాల్పేటలో భారీ వర్షం గోపాల్పేట: ఉమ్మడి గోపాల్పేట మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు అలుగు పారాయి. గోపాల్పేట పెద్దచెరువు, కత్వ, తాడిపర్తి చెరువు, రేవల్లి మండలంలోని చెరువులు, కుంటలు నిండాయి. కేశంపేట గేట్వద్ద నీరు రహదారిపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోపాల్పేట మండలంలో 96.2 మి.మీ., రేవల్లి మండలంలో 65.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది వర్షాకాలంలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపారు. గిరిజన రైతుల నిరసన ప్రదర్శన పాన్గల్: మండలంలోని కిష్టాపూర్తండాకు చెందిన 12 మంది గిరిజన రైతులపై అటవీశాఖ అధికారులు పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలంటూ శనివారం మండల కేంద్రంలో గిరిజనులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్నాయక్, మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. తండాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉండి సాగు చేసుకుంటున్న భూముల్లో చెట్లు నరికివేశారని అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి వేధించడం సరికాదన్నారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో గిరిజనులపై కేసుల నమోదు ప్రజాపాలనా అని ప్రశ్నించారు. ఇప్పటికై న అధికారులు, అధికార పార్టీ నేతలు స్పందించి గిరిజన రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సోంనాథ్నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండలఉపాధ్యక్షుడు తిలకేశ్వర్గౌడ్, నాయకులు భాస్కర్రెడ్డి, సరోజమ్మ, చంద్రూనాయక్, సుధాకర్యాదవ్, సుధాకర్నాయక్, బాలస్వామి, కృష్ణ, శాంతన్న, రాంచందర్రావు, ఈశ్వర్లాల్జీ, రవికుమార్రెడ్డి, గిరిజన రైతులు పాల్గొన్నారు. -
భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తకోట రూరల్: పట్టణ సమీపంలోని వెంకటగిరి క్షేత్రంలో వెలిసిన భూలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం శనివారం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళాలతో స్వామివారి కల్యాణ క్రతువు జరిపించారు. దంపతులకు అర్చకులు తలంబ్రాలు పోయగా ఆడపడుచులు అమ్మవారికి వడి బియ్యం పోశారు. వేడుకకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరాచార్యులుతో పాటు ఆలయ నిర్వాహకులు వేముల శ్రీనివాస్రెడ్డి, నరేందర్రెడ్డి, శ్రీనివాసులు శెట్టి, మొద్దు దామోదర్రెడ్డి, సంద వెంకటేష్, జలంధర్గౌడ్, తిరుపతయ్య, నీలేష్కుమార్, వెంకటేశ్వర్రెడ్డి, గురుస్వామి, కృష్ణారెడ్డి ఉన్నారు. తిరుమలయ్యగుట్ట భక్తజన సంద్రం.. వనపర్తి రూరల్: శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్ట భక్తజన సంద్రంగా మారింది. ఆలయ అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అంకురార్పణ పూజలు జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు దాతలు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెరువులకు జలకళ
భూత్పూర్ రిజర్వాయర్ కాల్వకు నీటి విడుదల ●ఆయకట్టుకు సాగునీటి సరఫరా.. రిజర్వాయర్ పరిధిలోని 22,700 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. కాల్వలో పూడికతీత, ముళ్లపొదల తొలగింపు ఉపాధిహామీ పనుల్లో చేపట్టాం. మరికొన్ని చోట్ల దేశాయి ప్రకాష్రెడ్డి సహకారంతో పూడిక తొలగింపు పనులు చేపట్టడంతో ప్రస్తుతం నీరు చెరువులకు చేరుతోంది. – సతీష్కుమార్, డీఈ, భూత్పూర్ రిజర్వాయర్ అమరచింత: భూత్పూర్ రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్, నర్వ మండలాలతో పాటు మక్తల్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తున్నారు. నెలరోజులుగా కాల్వకు నీటిని వదులుతుండటంతో ఆయా గ్రామాల్లోని రైతులు తమ పొలాలకు నీటిని మళ్లించుకొని పంటలు సాగు చేస్తుండటంతో పాటు 28 చెరువులు నీటితో నింపారు. దీంతో ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సైతం సాగునీరు అందించేందుకు భూత్పూర్ రిజర్వాయర్ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కాల్వ పరిధిలోని ఆయా మండలాల్లో 22,700 ఎకరాల ఆయకట్టులో ఈసారి వానాకాలం వరితో పాటు ఆరుతడి పంటలైన పత్తి, ఆముదం, కంది తదితర పంటలు సైతం సాగుచేస్తున్నారు. అలాగే ఆయకట్టు రైతులు కాల్వ వెంట ఉన్న డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుతో పాటు ముళ్లపొదలు, పూడికతీత పనులు సైతం చేపడుతూ నీటిని తమ పొలాలకు తరలించుకుపోతున్నారు. 32 కిలోమీటర్ల పొడవున్న కాల్వకు లైనింగ్ చేపట్టినా అంచుల వెంట ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో నీటిపారుదలశాఖ అధికారులు వేసవిలో జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా తొలగిచడంతో వానకాలంలో కాల్వలో నీటిని పొందగలుగుతున్నారు. దాత సహకారంతో.. రిజర్వాయర్ ఎడమ కాల్వలో ఈసారి భారీగా మట్టి పేరుకుపోవడం, ముళ్ల పొదలు ఏపుగా పెరగడంతో నీరు ముందుకు పారడం లేదని ఆయా గ్రామాల రైతులు నీటిపారుదలశాఖ అధికారులకు విన్నవించారు. వారు స్పందించకపోవడంతో నాగిరెడ్డిపల్లి, పాంరెడ్డిపల్లి, మస్తీపురం, పిన్నంచర్ల, అమరచింత రైతులు మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డిని కలిసి సాగునీటి కష్టాలను వివరించారు. కాల్వ పూడికతీతకు అవసరమైన ఖర్చు స్వయంగా భరిస్తానని అధికారులకు హామీ ఇవ్వడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత, ముళ్లపొదల తొలగింపు పనులు చేపట్టారు. ప్రస్తుతం కాల్వ ద్వారా ఆయా గ్రామాల చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 32.2 కిలోమీటర్ల పొడవున విస్తరించిన కాల్వ నిండుకుండను తలపిస్తున్న 28 చెరువులు మూడు మండలాలు.. 22,700 ఎకరాల ఆయకట్టు -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
ఖిల్లాఘనపురం: కాంగ్రెస్ పాలనలోనే పేదల సొంతింట కల నెరవేరుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టిన మహిళ రాజేశ్వరికి మొదటి చెక్కు రూ.లక్ష అందజేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలు ఇంటి మంజూరుకుగాను నాయకులు, అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఉపయోగం లేకపోయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు. పండుగలు భక్తిభావాన్ని పెంపొందిస్తాయి.. పండుగలు, ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించి సన్మార్గంలో పయనించేందుకు ఉయోగపడుతాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో భక్త మార్కండేయ ఉత్సవాలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని గ్రామంలోని దేవాలయం నుంచి గుట్ట పై ఉన్న నర్సింహస్వామి ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, డైరెక్టర్ సాయిచరణ్రెడ్డి, గంజాయి రమేష్, ఆగారం ప్రకాష్, నాయకులు బాలకృష్ణారెడ్డి, విజయలక్ష్మి, రామకృష్ణారెడ్డి, రవినాయక్, జయకర్, నవీన్కుమార్రెడ్డి, యాదగిరి, శ్రీరాములు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఔత్సాహికులకు వరం.. వాలీబాల్ అకాడమీ
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచేవారు. అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008 సంవత్సరంలో వాలీబాల్ అకాడమీని మూసివేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల కృషి, అధికారుల చొరవతో మరోసారి వాలీబాల్ అకాడమీ ఏర్పాటై.. పూర్వవైభవం సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోంది. అధునాతన సౌకర్యాలతో.. మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంలో నూతన వాలీబాల్ అకాడమీ రూ.19.70 లక్షల నిధులతో ఏర్పాటు చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునికీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు నిర్మించారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ 12న వాలీబాల్లో అకాడమీలో ప్రవేశాల కోసం సెలక్షన్స్ నిర్వహించగా.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు. అకాడమీలో 32 మంది బాలురు, బాలికలు ప్రవేశాలు పొందారు. స్విమ్మింగ్పూల్ అంతస్తులో బాలురకు, ఇండోర్ స్టేడియంలో బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజన వసతి కల్పించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన బాల, బాలికలకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక కోచ్ ఉండగా త్వరలో మరో కోచ్ రానున్నారు. కోచ్ పర్వేజ్పాషా క్రీడాకారులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళలో రిక్రియేషన్ గేమ్, స్టెచ్చింగ్ ఫ్లెక్సిబిలిటీ, గ్రౌండ్ మూమెంట్, బాల్ డ్రిల్స్, సా యంత్రం బ్లాకింగ్, అటాకింగ్ డ్రిల్స్, బాల్ ప్రాక్టిస్పై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి శుక్రవారం ఐదు సెట్ల మ్యాచ్ ఆడిపిస్తున్నారు. మహబూబ్నగర్లో నూతన వాలీబాల్ స్టేడియం ఏర్పాటు శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాల క్రీడాకారులు బాల, బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు.. -
సోదరభావానికి ప్రతీక ‘రక్షాబంధన్’
వనపర్తి: రక్షాబంధన్ సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ విద్యార్థినులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ, కార్యాలయ అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నదమ్ముల చేతికి అనురాగంతో రాఖీ కట్టడం గొప్ప సాంప్రదాయమన్నారు. 15న అరుణాచలానికి ప్రత్యేక బస్సు వనపర్తిటౌన్: వనపర్తి డిపో నుంచి ఈ నెల 15న సాయంత్రం 8 గంటలకు అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచలంతో పాటు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం తిరిగి 18వ తేదీన ఉదయం 4 గంటలకు జిల్లాకేంద్రానికి చేరుతుందని పేర్కొన్నారు. రాను, పోను టికెట్ ధర రూ.3,600గా నిర్ణయించామని.. భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీట్ల రిజర్వేషన్, పూర్తి వివరాలకు సెల్నంబర్లు 99592 26289, 79957 01851, 73828 29379 సంప్రదించాలని తెలిపారు. 108 వాహనం తనిఖీ పాన్గల్: మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఉన్న 108 వాహనాన్ని శుక్రవారం జిల్లా ఈఈఎం (ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్) మహబూబ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య పరికరాలు, ఆక్సిజన్, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితుల నుంచి ఫోన్కాల్ వచ్చిన వెంటనే త్వరగా ఘటనా స్థలానికి చేరుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించేలా చూడాలన్నారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనా? : బీజేపీ వనపర్తిటౌన్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, బీసీ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సుల్లో పూర్తి రియింబర్స్మెంట్ చెల్లిస్తామని ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధతతో కూడిన కమిషన్ వేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలు, బీసీ యువతకు వడ్డీ లేని రూ.10 లక్షల రుణాలు, కల్లుగీత, మత్స్యకార, రజక ఫెడరేషన్లకు రూ.10 లక్షలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, బి.కుమారస్వామి, భాశెట్టి శ్రీను, పెద్దిరాజు, ఆగుపోగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిండుకుండలా రామన్పాడు జలాశయం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,080 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 729 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. -
అవసరం మేరకే ఎరువుల విక్రయం
వనపర్తి: రైతులకు అవసరం మేరకే ఎరువులు విక్రయించాలని.. ఎక్కువగా అమ్మి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్తో కలిసి ఎంఏఓలు, ఏఈఓలతో వెబెక్స్లో సమావేశం సమావేశమయ్యారు. అనంతరం జిల్లాకేంద్రంలోని రాజనగరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల విక్రయ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఒక్కో రైతుకు ఎన్ని బస్తాల యూరియా విక్రయిస్తున్నారనే విషయాన్ని పరిశీలించి ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని.. మండల వ్యవసాయ అధికారులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎకరా సాగుకు ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఎరువుల నిల్వలకు సంబంధించిన బోర్డును పరిశీలించి ఎప్పటికప్పుడు వివరాలను సరి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మండల వ్యవసాయ అధికారి, సింగిల్ విండో చైర్మన్ రఘు, ఇతర అధికారులు ఉన్నారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.. రాజనగరం సమీపంలో శుక్రవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాల శిబిరాన్ని సందర్శించి గోర్రెలు, మేకలకు టీకాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని అన్ని గొర్రెలు, మేకలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పెంపకందారులకు సూచించారు. ప్రస్తుతం నీలి నాలుక వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. టీకాల పంపిణీకి ముందురోజు పెంపకందారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నట్టల నివారణ మందులు, శునకాల బారిన పడకుండా జాలీలు పంపిణీ చేయాలని పెంపకందారులు కలెక్టర్ను కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, పశు వైద్యులు, ఇతర అధికారులు, స్థానికులు కురుమూర్తి, గోపాల్ తదితరులు ఉన్నారు. -
‘రెవెన్యూ’ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం
వనపర్తి రూరల్: భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు, శ్రీరంగాపురం తహసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులందరూ సకాలంలో కార్యాలయానికి రావాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రికార్డు గదిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సక్రమంగా, భద్రంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అనంతరం పెబ్బేరులోని సత్యసాయి రైస్మిల్లును తనిఖీచేసి సీఎంఆర్ను త్వరగా అందించాలని.. రోజు ఒక ఏసీకే ధాన్యం ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మురళీగౌడ్, రాజు, డిప్యూటీ తహసీల్దార్ నందకిషోర్, ఆర్ఐ రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయాలు,రైస్మిల్లు తనిఖీ రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ -
సాగు సంబురం
జూరాల ఆయకట్టులో చివరి అంకానికి వరి నాట్లు ●ఐదెకరాల్లో వరి సాగు.. జూరాల కాల్వలకు సాగునీటిని వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. సకాలంలో నీటిని అందించడంతో నారుమడులు సిద్ధం చేసుకోవడంతో పాటు త్వరగా నాట్లు పూర్తి చేసుకునే అవకాశం కలిగింది. వరి సాగుకు ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి అవుతోంది. – రఘురాంరెడ్డి, అమరచింత అమరచింత ఎత్తిపోతల కింద.. అమరచింత ఎత్తిపోతల కాల్వ కింద నాలుగు ఎకరాల పంట పొలం ఉంది. ఏటా వరి పంట సాగుచేస్తున్నా. వానాకాలం వరిసాగుకు నారుమడిని సిద్ధం చేసుకున్నా. సకాలంలో నీటిని వదలడంతో సాగు పనులు ప్రారంభించా. పుష్కలంగా నీరు పారుతుండటంతో సకాలంలో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత ముందస్తుగానే నీటి విడుదల.. ప్రభుత్వ ఆదేశాలతో జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టుకు ముందస్తుగా సాగునీటిని వదులుతున్నాం. ఈసారి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సాగునీటిని నిరంతరం అందిస్తాం. చివరి ఆయకట్టు అయిన వీపనగండ్ల వరకు అంతరాయం లేకుండా కాల్వ ద్వారా సాగునీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసారి 85 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని సిబ్బంది తెలిపారు. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డ్యాం డివిజన్ అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగులో బిజీగా ఉన్నారు. ఆయకట్టుకు కేవలం ఆరుతడి పంటలకే సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించినా.. ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని వదులుతున్నారు. ఈ ఏడాది రైతులు ఆయకట్టు పరిధిలోని 85 వేల ఎకరాల్లో వరి పండించేందుకు సిద్ధమవగా.. ఇప్పటికే వరి నాట్లు వేసే ప్రక్రియ చివరి అంకానికి చేరింది. ఈసారి వరి నాట్లకు కూలీల కొరతతో పాటు కూలి అధికంగా డిమాండ్ చేస్తుండటంతో యంత్రాలతో సైతం నాట్లు వేసుకోవడం కనిపించింది. ఏడేళ్లుగా ఆయకట్టుకు వారబందీ విధానంలో నీటిని అందించి పంటలను కాపాడుతున్న అధికారులు ఈ ఏడాది ఎత్తేశారు. ఐఏబీ సమావేశంలో చర్చించిన అధికారులు ఏడమ కాల్వ పరిధిలోని పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల పరిధిలో 97 కిలోమీటర్ల పొడవున జూరాల ప్రధాన ఎడమ కాల్వ విస్తరించి ఉంది. ఆయా మండలాల్లోని పూర్తిస్థాయి ఆయకట్టు సాగుకుగాను అధికారులు ముందస్తుగా కాల్వలకు నీటిని వదులుతున్నారు. ఎత్తిపోతల పథకాలకు.. జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసిన అధికారులు జలాశయం ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని వదులుతున్నారు. దీంతో అమరచింత, చంద్రగడ్, కోయిల్సాగర్, భీమా ఎత్తిపోతలు, రంగసముద్రంతో పాటు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. అలాగే ఆయా ఎత్తిపోతల పథకాల ఆయకట్టులో సైతం సాగు పనులు కొనసాగుతున్నాయి. సన్నరకాలకే ఆసక్తి.. ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నరకం వరికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో రైతులు ఈసారి కూడా సన్నరకం వరి పండించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువగా సోనామసూరితో పాటు ఆర్ఎన్ఆర్ రకాలు సాగు చేయడం కనిపించింది. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల సాగు వరికే అన్నదాతల మక్కువ వానకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటి విడుదల -
28 ఏళ్ల నుంచి..
జిల్లాకేంద్రానికి చెందిన చిట్టెమ్మ 1997లో మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా నియామకమైంది. తనకు ఎంతో ఇష్టమైన రాఖీ పండుగను తోటి కండక్టర్లు, డ్రైవర్లతో జరుపుకోవాలనే ఉద్దేశంతో అదే ఏడాది నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించింది. డిపోలోని దాదాపు 220 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి కులమతాలకతీతంగా రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుతోంది. రాఖీపండుగ వచ్చిందంటే డిపోలోని అందరూ చిట్టెమ్మ కట్టే రాఖీ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా చిట్టెమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రతి ఏడాది రాఖీ పండుగ రోజు ఆర్టీసీ ఉద్యోగులందరికీ రాఖీలు కడతానని, రిటైర్డ్ అయ్యే వరకు రాఖీ పండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా డిపోలోని ఉద్యోగులందరికి రాఖీలు కడతానని పేర్కొన్నారు. -
యూరియా సరఫరాపై ఆందోళన వద్దు
ఖిల్లాఘనపురం: యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని ఎరువులు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు ప్రభాకర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కమాలోద్ధీన్పూర్ రైతువేధికలో ఎరువుల యాజమాన్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదని.. ఖిల్లాఘనపురం మండలంలోనే 124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. దొరుకుతుందో లేదోనని తొందరపడి ఎక్కువ కొనుగోలు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతాయని.. అవసరం మేరకు కొనుగోలు చేయాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపి కూడా మార్కెట్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఏఈఓ సునీల్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. పొంగిపొర్లిన వాగులు.. నిలిచిన రాకపోకలు వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని కిష్టారెడ్డిపేట, వెంకటాపురం శివారులో ఉన్న వాగులు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహించాయి. ఆయా వాగులపై వంతెన నిర్మాణాలు పూర్తిగాకపోవడం.. పక్కన ఏర్పాటుచేసిన మట్టిరోడ్డుపై నీరు పారుతుండటంతో శుక్రవారం ఉదయం పెబ్బేరు– కొలాపూర్ రహదారిపై పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేసి ఉధృతి తగ్గిన తర్వాత పునరుద్ధరించారు. జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు ప్రభాకర్రెడ్డి -
‘రక్షా’నుబంధం
అక్కాతమ్ముళ్లు.. అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనేదే రాఖీ పండుగ. సోదరి తన సోదరుడు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే.. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ సోదరికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. సమాజంలో నానాటికి బంధాలు చెదిరిపోతున్న తరుణంలో రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధాలను బలోపేతం చేస్తుంది. సోదర, సోదరీమణుల మధ్య ఉండే అనుబంధాలు.. ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగు, విచక్షణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఆత్మీయుల మధ్య అనుబంధానికి, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా నిలుస్తుంది రాఖీ. ఆధునిక కాలంలోనూ ఎక్కడ ఉన్నా తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు.. అక్కాచెల్లెళ్లు తరలివస్తుంటారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు సైతం కొరియర్లోనూ తమవారికి రాఖీలు పంపిస్తూ.. అనుబంధాలను చాటి చెబుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్ట్రాగాంలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. – స్టేషన్ మహబూబ్నగర్/అచ్చంపేట/వనపర్తి టౌన్ -
పాలమూరుకు ఆటుపోట్లు
ఇప్పట్లో నీటి ఎత్తిపోతలకు కనిపించని అవకాశాలు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ఇప్పట్లో చేపట్టేలా కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కచ్చితంగా నీటి ఎత్తిపోతలు చేపట్టాలని అధికారులు భావించినా.. ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది ఆఖరి వరకు ఎత్తిపోతల కోసం ఎదురుచూడక తప్పేలా లేదు. నార్లాపూర్లో నీటి నిల్వ ఇలా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తయిన పనుల ప్రకారం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది తరలింపునకు కేఆర్ఎంబీ అనుమతులు సైతం ఉన్నాయి. అయితే గతంలో నార్లాపూర్ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇటీవల కాాలంలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోసిన నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి మళ్లించడంతో నీటి నిల్వ 4 టీఎంసీలకు పెరిగింది. రిజర్వాయర్లోకి కొత్తగా నీటిని ఎత్తిపోస్తే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇళ్లు ఖాళీ చేయని నార్లాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు జలాశయంలో ఇప్పటికే నాలుగు టీఎంసీల నీటి నిల్వ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఒకవేళ నింపినా.. ఏదులకు తరలించేందుకు అడ్డంకులు -
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు..
గోపాల్పేట: విద్యార్థులు క్రమశిక్షణతో శ్రద్ధగా చదివితేనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆంగ్లం, గణితంలో నిర్వహించిన మండలస్థాయి పోటీ పరీక్షల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు బహుమతుల దాత సుఖేందర్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉండి వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభాకర్, ఏదుల, గోపాల్పేట మండలాల ఉపాద్యాయులు పాల్గొన్నారు. -
పౌర సేవలకు అధిక ప్రాధాన్యం
కొత్తకోట రూరల్: పౌర సేవలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, సమస్యలను శ్రద్ధగా ఆలకించి త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దమందడి మండలంలో ఆయన పర్యటించారు. మొదట మోజర్లలో నిర్మిస్తున్న పారాబాయిల్డ్ రైస్మిల్లును పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తేనే మిల్లుల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేస్తామని యజమానికి సూచించారు. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. రైతులకు సరైన మద్దతు ధర లభించడంలో ఇలాంటి మిల్లులు కీలక పాత్ర పోషిస్తాయని.. అయితే పర్యావరణ పరిరక్షణకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భూ భారతి రెవెన్యూ సదస్సుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంతో ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపర్చవచ్చని తెలిపారు. అనంతరం రికార్డు గదిని సందర్శించి నిర్వహణను పరిశీలించారు. అన్ని రికార్డులను సక్రమంగా, భద్రంగా నిర్వహించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీసీఎస్ఓ కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ సరస్వతి, ఇతర అధికారులు ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ
అలంపూర్: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని రక్షణ గోడ మరమ్మతు, ఇతర పనులను కాంట్రాక్టర్కు రూ.4 లక్షలకు అప్పగించారు. అయితే రెండురోజుల క్రితం కాంట్రాక్టర్ పనులకు సంబంధించిన ఎంబీ బుక్ మెజర్మైంట్ చేయడానికి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్నాయుడును కలిశారు. డీఈ రూ.12 వేలు లంచం అడగగా.. పనుల్లో నష్టం వచ్చిందని అన్ని డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు గురువారం కాంట్రాక్టర్ ఇరిగేషన్ కార్యాలయంలో డీఈకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నం.1064, వాట్సప్ నం.94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. రూ.11 వేలు తీసుకుంటూ పట్టుబడిన అధికారి -
చేనేతల ఆర్థిక సాధికారతకు కృషి
వనపర్తి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేత కార్మికులు వ్యాపార పరంగా నిలదొక్కుకుని ఆర్థిక సాధికారత సాధించేందుకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై నేత కార్మికులకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ నేత కార్మికులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి మాట్లాడారు. ప్రభుత్వం నేతన్నకు బీమా, రూ.లక్ష రుణమాఫీ, నేతన్న పొదుపు వంటి పథకాల ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటుందన్నారు. ఇటీవలే రూ.లక్ష వరకున్న చేనేత రుణాలను మాఫీ చేసిందని.. చేనేత భరోసా పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నారని గుర్తుచేశారు. కార్మికులు తమ నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ సైతం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానమంత్రి స్వయం ఉపాధి పథకంలో కూడా రుణాలు ఇస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని నేత కార్మికులు తయారు చేసిన దుస్తులు అందిస్తే డబ్బులు చెల్లించడమేగాకుండా ప్రచార నిమిత్తం కలెక్టరేట్లో నమూనాగా ప్రదర్శిస్తామని తెలిపారు. అధికారులు ప్రతి సోమవారం నేత దుస్తులు ధరించి విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇన్ఛార్స్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు సైతం ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన కొత్తరకం దుస్తులు తయారు చేయాలని సూచించారు. జిల్లాలో 590 మంది కార్మికులకు చేనేత పింఛన్లు అందిస్తున్నామని.. బ్యాంక్ లింకేజీ రుణాలు తీసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాధవి, హితస్విని, ఫజియా సుల్తానా, ఉపన్యాస పోటీలో సత్తా చాటిన ఎస్.నవ్య, సౌమ్య, గౌతమికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కలెక్టర్, అధికాారులు చేనేత స్టాళ్లను తిలకించారు. కార్యక్రమంలో చేనేతశాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ అధికారి ప్రియాంక, వెల్టూరు చేనేత సొసైటీ అధ్యక్షుడు వెంకటయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, జిల్లా అధికారులు, చేనేత కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలకం
వనపర్తి రూరల్: విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ చదువు కీలకమైందని.. భావి భవిష్యత్కు బీజం ఇక్కడే పడుతుందని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. గురువారం పెబ్బేరులోని మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ డా. టి.నరేష్కుమార్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ విద్యార్థుల స్వాగతోత్సవానికి ఆయనతో పాటు జీసీడీఓ శుభలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఐఓ మాట్లాడుతూ.. కళాశాలలో బాలికలు క్రమశిక్షణ, నైతిక విలువలు పాటిస్తూ శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చిన్న గోపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి వనపర్తిటౌన్: హర్ ఘర్ తిరంగా అభియాన్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని.. పంద్రాగస్ట్కి ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో అభియాన్ కన్వీనర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హర్ ఘర్ తిరంగా అనేది త్రివర్ణ పతాక వైభవాన్ని చాటే ప్రత్యేక పండుగగా మారిందన్నారు. ప్రధాని మోదీ ధృడ సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వం, సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సింధూర్ గొప్ప విజయం సాధించిందని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, కేతూరి బుడ్డన్న, మోర్చాల రాష్ట్ర నాయకులు జ్యోతి రమణ, అలివేలమ్మ, సహా కన్వీనర్లు కదిరె మధు, బాసెట్టి శ్రీను, అశ్విని రాధా, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్రెడ్డి, అధికార ప్రతినిధులు తిరుమల్లేష్, మణివర్ధన్ సాగర్, గొర్ల బాబురావు, కార్యదర్శి రామ్మోహన్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, మోర్చాల జిల్లా అధ్యక్షులు రాఘవేందర్గౌడ్, ఎండీ ఖలీల్, గంధం ప్రవీణ్, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం.. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, పథకాల అమలు ప్రతి ఇంటికి తెలియజేయాలనే లక్ష్యంతో ఇంటింటి ప్రచారం చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పీర్లగుట్ట, బండార్నగర్ కాలనీలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ ఓబీసీ అధికార ప్రతినిధి శ్రీశైలం, నాయకులు కేతూరి బుడ్డన్న, శ్రీనివాస్గౌడ్, తిరుమల్లేష్, సుమిత్రమ్మ, రాములు, దంతోజి నవీన్కుమార్ పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కరించాలి
గోపాల్పేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో భాగంగా ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం ఆయన మండల కేంద్రం, ఏదులలోని తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు కార్యాలయానికి వచ్చే రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం కాని వాటిని మరోమారు పరిశీలించాలన్నారు. ఆయన వెంట గోపాల్పేట, ఏదుల తహసీల్దార్లు పాండునాయక్, మల్లికార్జున్, సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
అమరచింత: విద్యార్థినులకు ఇబ్బందులు కలిగితే సహించమని.. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి ఉన్నతాధికారులకు విన్నవించాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి అఫ్జలుద్దీన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని కేజీబీవీని జీసీడీఓ శుభలక్ష్మితో కలిసి తనిఖీ చేసి విద్యార్థినులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 15 మరుగుదొడ్లకుగాను కేవలం 3 మాత్రమే వినియోగంలో ఉన్నాయని, తాగునీటి సమస్య ఉందని, రాత్రిళ్లు విషపు పురుగులు సంచరిస్తున్నాయని విద్యార్థినులు అధికారులకు వివరించారు. మరుగుదొడ్ల సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఎస్ఓను ప్రశ్నించగా.. విషయాన్ని జిల్లా అధికారులకు విన్నవించామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరించాలని జీసీడీఓకు సూచించారు. అదేవిధంగా రోజువారీగా అందించే ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ విధిగా పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలోని వంట గదిని పరిశీలించి ఎప్పడూ శుభ్రంగా ఉంచాలని, వంట కార్మికులు శుచి, శుభ్రత పాటించాలన్నారు. విద్యార్థినులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన అందించాలని కోరారు. అనంతరం పాంరెడ్డిపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి, ఎంఈఓ భాస్కర్సింగ్, ఎంపీఓ నర్సింహులు ఉన్నారు. -
ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?
ఇబ్బందులు లేకుండా చూస్తాం.. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవన ప్రతిపాదనలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కార్యాలయాలకు వచ్చే క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఫణీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎంత ఆదాయం ఆర్జించినా.. కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఈ శాఖ ఉంది. సరైన వసతులు లేకపోవడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయవిక్రయదారులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మాట అలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతుండటం మరో విశేషం. ఆడిట్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం ఇందులోనే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు సైతం వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు చోట్లే పక్కా భవనాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో కేవలం కల్వకుర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే పక్కా భవనాలు కలిగి ఉన్నాయి. మిగతా పది కార్యాలయాలు అద్దె భవనాల నుంచే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాయి. వీటికి గాను రూ.వేలల్లో ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్లతరబడిగా ఇలా చెల్లిస్తున్న అద్దెలతోనే పక్కా భవనాలు నిర్మించవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇటీవల నూతన భవనంలోకి మార్చినా.. అద్దె నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. వసతులు లేక అవస్థలు.. జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఎక్కడా సరైన వసతులు లేవు. ఒక్కో కార్యాలయానికి సగటున ప్రతిరోజు వందమంది వరకు వస్తుండటంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు వంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చిన్నగా ఉండటంతో పార్కింగ్ లేక అవస్థలు పడుతున్నారు. అచ్చంపేటలో చిన్నపాటి రోడ్డులో ఉండటంతో వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఇళ్లలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం ఎక్కువ.. వసతులు తక్కువ వాహనాల పార్కింగ్కూ స్థలం కరువు అవస్థలు పడుతున్న క్రయ విక్రయదారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి -
ముమ్మరంగా నిర్మాణాలు
ఇందిరమ్మ ఇళ్లలో 63 శాతం పురోగతి●అవగాహన కల్పిస్తున్నాం.. పురపాలికలోని 10 వార్డుల్లో 56 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్లు అందించాం. వీరిలో 26 మంది మార్కింగ్ పూర్తి చేసుకొని బేస్మెంట్ పనులు చేపడుతున్నారు. మిగిలిన వారిని కలిసి త్వరగా పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నాం. – నాగరాజు, పుర కమిషనర్, అమరచింత పురోగతి సాధిస్తున్నాం.. కలెక్టర్ ఆదేశాల మేరకు నిరంతరం గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు నిర్మాణాలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 3,084 మంది లబ్ధిదారులు మార్కింగ్ పూర్తి చేసుకోగా.. 488 మంది బేస్మెంట్ వరకు నిర్మాణాలు చేపట్టారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా డబ్బులు జమ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లావ్యాప్తంగా 63 శాతం పురోగతిలో సాధించాం. – విఠోభా, జిల్లా హౌసింగ్ అధికారి అమరచింత: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తూ పనుల్లో వేగం పెంచేందుకు కృషి చేస్తుండటంతో ప్రస్తుతం జిల్లాలో 63 శాతం పురోగతిలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 6,538 మందిని లబ్ధిదారులుగా గుర్తించగా.. 5,938 మందికి ప్రొసీడింగ్లు అందజేశారు. ఇప్పటి వరకు 3,048 మంది మార్కింగ్ వేసుకొని బేస్మెంట్ పనులు ప్రారంభించగా.. 488 మంది లబ్ధిదారులు బేస్మెంట్ నిర్మాణం పూర్తిచేసి ప్రభుత్వం నుంచి మొదటి విడతగా రూ.లక్ష అందుకున్నారు. నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు సూచనలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5 లక్షలకు తోడుగా అదనంగా మరో రూ.రెండు లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకు జోడించి సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు లబ్ధిదారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు వంట గది, హాలు, బెడ్రూంతో పాటు ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నారు. పాత ఇంటిని పడగొట్టి కొత్తగా నిర్మాణం చేపట్టే వారితో పాటు ఖాళీ ప్లాట్లలో ఇంటిని నిర్మించుకునే వారు చుట్టూ రెండు ఫీట్ల స్థలం వదలాలని అధికారులు సూచిస్తుండటంతో అలాగే చేపడుతున్నారు. విడతల వారీగా చెల్లింపులు.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో విడతల వారీగా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. బేస్మెంట్ నిర్మాణం పూర్తయితే రూ.లక్ష, పైకప్పు వరకు గోడలు నిర్మిస్తే రూ.లక్ష, పైకప్పు నిర్మాణం పూర్తిచేస్తే రూ.2 లక్షలు, మరుగుదొడ్డితో పాటు పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తిచేస్తే రూ.లక్ష వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని హౌసింగ్ అధికారులు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసుకున్న 488 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6 కోట్లు జమ చేసినట్లు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ మార్కింగ్ ఇచ్చిన 3 వేల నిర్మాణాలు బేస్మెంట్ వరకు పూర్తి చేసేలా రోజువారీగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని 255 గ్రామాలతో పాటు 5 పురపాలికల్లోని 80 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంజూరు పత్రాలు అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామనే ప్రభుత్వ హెచ్చరికతో లబ్ధిదారులు పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,048 లబ్ధిదారులు ఖాళీ స్థలాల్లో మార్కింగ్ పూర్తిచేయగా.. 488 మంది బేస్మెంట్ వరకు, 141 మంది గోడల వరకు, 78 మంది పైకప్పు వరకు నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్కరు మాత్రమే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 63 శాతం ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. జిల్లాలో 6,538 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు రూ.ఆరు కోట్ల చెల్లింపులు అధికారుల పర్యవేక్షణతోనే పనుల్లో వేగం -
నేడు చేనేత సంబురాలు
అమరచింత: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో గురువారం చేనేత సంబురాలు నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య తెలిపారు. కలెక్టరేట్ నుంచి చేనేత కార్మికులతో ర్యాలీ ఉంటుందని.. జిల్లాలోని నేత కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే చేనేతలో రాణిస్తున్న సీనియర్ కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం ఉంటుందన్నారు. విద్యార్థులకు చేనేతపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని చెప్పారు.రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టంమదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,080 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 646 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 65 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 569 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు.ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకం కావాలి : సీపీఎంమదనాపురం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విధ్వేషాలతో రెచ్చిపోతోందని.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్యార్డ్ ఆవరణలో నిర్వహించిన మండలశాఖ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. అనేక రాష్ట్రాల్లో ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు పాల్పడుతూ సంబరపడుతున్నారని.. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రజాభివృద్ధిని భ్రష్టు పట్టిస్తున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో సీపీఎం శాఖ సమావేశాలు ఏర్పాటు చేసుకొని బలోపేతం కావాలన్నారు. అంతకుముందు అమరులకు సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మండ్ల రాజు, మండల కార్యదర్శి వెంకట్రాములు, అజ్జకొల్లు గ్రామ కార్యదర్శి మనివర్ధన్, నాయకులు బడికి విష్ణుప్రసాద్, చిరంజీవి, చెన్నయ్య, వెంకటేష్, మొగిలి, ఆంజనేయులు, మాసన్న. వెంకటన్న సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.‘ఎస్సీ, ఎస్టీ టీచర్లకు న్యాయం చేయాలి’వనపర్తిటౌన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అన్ని క్యాడర్లలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కంటే నిరంజనయ్య కోరారు. బుధవారం డీఈఓ అబ్దుల్ ఘనీని కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా అమలవుతున్న గ్రూప్ 1, 2, 3లకు అడక్వేసి వర్తించదని, కొత్త జీఓ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. అదేవిధంగా బ్యాక్లాగ్ ఎస్సీ, ఎస్టీ పోస్టుల వివరాలు, గతంలో అన్ని సబ్జెక్టుల్లో ఏ రోస్టర్ వరకు పదోన్నతులు కల్పించారో ఆ వివరాలు సైతం వెల్లడించాలని పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బి.వెంకటయ్య, గగనం సీనయ్య, బౌద్దారెడ్డి, సూర చంద్రశేఖర్, మహిపాల్రెడ్డి, హమీద్, డి.కృష్ణయ్య, సుధాకర్ ఆచారి, కృష్ణయ్య, విష్ణువర్ధన్, అమరేందర్, బాలరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.నేడు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమావేశంస్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నేడు (గురువారం) స్థానిక తెలంగాణ చౌరస్తాలోని రెడ్క్రాస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎ.రాజసింహుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపుదల, నూతన కార్యవర్గం ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
మహబూబ్నగర్ క్రైం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఈఈ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ ఇరిగేషన్ సబ్ డివిజన్–1లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్.. ఓ వ్యక్తి తన 150 గజాల ప్లాట్కు సంబంధించి ఎల్ఆర్ఎస్, ఎన్ఓసీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని వన్టౌన్ చౌరస్తాలో ఉన్న ఓ బేకరి దగ్గరకు రావాలని ఏఈఈ ఫోన్ చేయడంతో బాధితుడు అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న రూ.3 వేల నగదు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న ఏఈఈ జేబులో పెట్టుకున్న కాసేపటికే అక్కడికి వచ్చిన ఏసీబీ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం ఏఈఈని నేరుగా కార్యాలయానికి తీసుకెళ్లి.. ఆయన చాంబర్తో పాటు వన్టౌన్ ఏరియాలో ఆయన అద్దె ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి ఆస్తులు, నగదు లభ్యం కాలేదని డీఎస్పీ వెల్లడించారు. మహ్మద్ ఫయాజ్ను గురువారం ఏసీబీ కోర్టు నాంపల్లిలో హాజరుపరుస్తామని తెలిపారు. రూ.3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం -
ప్రొ. జయశంకర్ ఆశయ సాధనకు కృషి..
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలకు ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య ముఖ్యఅతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అహర్నిశలు శ్రమించిన గొప్పవ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. స్వరాష్ట్ర ఏర్పాటే ఏకై క లక్ష్యంగా తెలంగాణ భావాజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
వీపనగండ్ల: భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సరికాదని.. రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమయ్యారు. కార్యాలయ ఆవరణలో పదుల సంఖ్యలో జనాలు ఉన్నారంటే వారి పనులు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తోందని, వచ్చిన వారు పని ముగించుకొని త్వరగా వెళ్లేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. త్వరలో జీపీఓలను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుందని.. వారి సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ వరలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి, ఆర్ఐ కురుమూర్తి తదితరులు ఉన్నారు. -
పవిత్రోత్సవాలు ప్రారంభం
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ప్రతిష్ఠ, చతుస్థానార్చన, ద్వారాతోరణ పూజ, హోమశాలలో హోమం, ఆలయంలోని అన్ని మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, ఆలయానికి పట్టు పవిత్రమాల అలంకరణ, మహా నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాలు మూడురోజుల పాటు కొనసాగనుండగా.. గురువారం మహా పూర్ణాహుతి అనంతరం పవిత్రమాలలను తొలగించి 108 కలశాలతో అమ్మ, స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. తదుపరి కై ంకర్యపరులకు పవిత్రమాలల బహూకరణ, ఆచార్య సన్మాన కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. -
కలెక్టర్ను కలిసిన రెవెన్యూ అదనపు కలెక్టర్
వనపర్తి: కొత్తగా విధుల్లో చేరిన రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.కీమ్యానాయక్ మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ఆ రోజు కలెక్టర్ లేకపోవడంతో మంగళవారం కలిశారు. ఇద్దరు పుర అధికారుల సస్పెన్షన్ వనపర్తి టౌన్: వనపర్తి పురపాలికలోని ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను గుర్తించారని కొన్నిరోజుల కిందట 12 మంది వార్డు అధికారులు, ఓ కీలక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా వార్డు అధికారి శివమ్మ, వార్డు అధికారులకు ఇన్చార్జ్గా ఉన్న శంకర్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఇరువురిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు వద్ద ప్రస్తావించగా దాటవేట వైఖరి ప్రదర్శించారు. ఐటీఐలో వాక్–ఇన్ అడ్మిషన్లు వనపర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు వాక్–ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రమేష్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో సీటు పొందని అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని.. కొత్త విద్యార్థులు విధిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఉండాలని పేర్కొన్నారు. పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తునకు ఈ నెల 28 వరకు గడువు ఉందని.. విద్యార్థులు ఏదేని ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలో దరఖాస్తు చేసుకొని ప్రింట్ కాపీతో పాటు అన్ని ఒరిజనల్ ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 94902 02037, 98492 44030, 79953 35372 సంప్రదించాలని సూచించారు. ‘అత్యాచార ఘటనలను అరికట్టడంలో విఫలం’ వీపనగండ్ల: మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని.. వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్రా మహిళా సంఘం) జిల్లా అధ్యక్షురాలు సాయిలీల ఆరోపించారు. జిల్లాకేంద్రంలో ఈ నెల 30, 31న నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు అవసరమైన నిధుల కోసం మంగళవారం మండల కేంద్రంలో విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుల దురాహంకార హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింస సమాజాన్ని సవాల్ చేస్తున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు మద్దతు పలుకుతూ సామాన్య ప్రజలు, మహిళల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆస్పత్రుల్లో వైద్యులు, మందుల కొరత ఉందన్నారు. కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు శాంతమ్మ, జిల్లా కార్యవర్గసభ్యురాలు లలిత తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
కొత్తకోట రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులతో పాటు తగిన వైద్యసిబ్బంది ఉన్నందున ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి గర్భిణుల ఈడీడీ, ప్రసవాల నమోదు, రక్త పరీక్షల రికార్డులను పరిశీలించారు. గత నెలలో పీహెచ్సీలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ప్రైవేట్లో ఎన్ని జరిగాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జులైలో కేవలం ఒక ప్రసవం జరిగినట్లు తెలుపడంతో కేంద్రంలో ఉన్న వసతులు, సిబ్బందిపై గర్భిణులకు అవగాహన కల్పించి వారికి నమ్మకం కలిగించి ప్రసవాలకు వచ్చేలా చూడాలన్నారు. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో వచ్చే రోగులకు రక్త పరీక్షలు విధిగా నిర్వహించాలని, డెంగీ, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. డెంగీ కేసులు నమోదైన చుట్టుపక్కన ప్రదేశాల్లో ఉన్న ఇళ్లలోని వారి రక్త నమూనాలు సేకరించాలన్నారు. కుక్క, పాము కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. నిల్వలు, ధరల పట్టిక ప్రదర్శించాలి.. పెద్దమందడిలోని హాకా ఫార్మర్స్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, ధర వివరాల పట్టికను దుకాణం బయట ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. మండలంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు అధికారులను అడిగి తెలుసున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, తహసీల్దార్ సరస్వతి, ప్రోగ్రాం అధికారి డా. మంజుల, మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
సాగునీరు అందించే వరకు పోరాడుతాం
పాన్గల్: ప్రాజెక్టుల్లో నీరు నిండుగా ఉన్నా.. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో రైతులకు సాగునీరు అందించలేని దుస్థితి నెలకొందని, నీటి సరఫరా జరిగే వరకు అన్నదాతల పక్షాన నిలబడి పోరాడుతామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులు, రైతులతో కలిసి మండలంలోని దావాజిపల్లి, మాందాపూర్, రాయినిపల్లిలో ఉన్న కేఎల్ఐ డీ–8 ఎంజే–4, భీమా డీ–18, డీ–19 కాల్వలను ఆయన పరిశీలించి మాట్లాడారు. కాల్వల్లో పేరుకుపోయిన జమ్మును తొలగించకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. గతంలో కాల్వలో పేరుకుపోయిన జమ్మును సొంత ఖర్చులతో తొలగించామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా గ్రామాల్లో రైతులే స్వయంగా జమ్ము తొలగించుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు. సాగునీరు అందని గ్రామాల రైతులు అధికారులకు ఫోన్లు చేసి ప్రశ్నిస్తే నీరు పారేంత వరకు పంటలు సాగు చేసుకోవాలని వింత జవాబులు ఇస్తున్నారని చెప్పారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి జమ్ము, అక్రమంగా ఏర్పాటు చేసిన పైపులను తొలగించి సాగునీరు సాఫీగా ముందుకు పారేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్నాయక్, మండల అధ్యక్షుడు వీరసాగర్, ఉపాధ్యక్షుడు తిలకేశ్వర్గౌడ్, కార్యదర్శి భాస్కర్ర్రెడ్డి, సుధాకర్యాదవ్, దశరథనాయుడు, రాజేశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, రమణయ్య, శేఖర్నాయుడు, కృష్ణయ్యగౌడ్, వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
రాములు దారెటో..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ను వీడుతూ బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉదంతం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దశాబ్దాలుగా పైగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల అనూహ్యంగా పార్టీ మారడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో వారంతా అయోమయంలో ఉన్నారు. అయితే పార్టీ మార్పుపై వదంతుల వ్యాప్తి ఉధృతంగా మారిన క్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ తాము పార్టీ వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. గువ్వల బీజేపీలో చేరుతుండటంతో బీఆర్ఎస్తో పాటు బీజేపీలోని నేతలను సైతం కలవరపెడుతుండటం గమనార్హం. గువ్వల వెంట వెళ్లేందుకు కేడర్ విముఖత.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తన ముఖ్య అనుచరులు, కేడర్గా ముందుగానే చెప్పారు. వారి నుంచి సహకారం కావాలని, తనతో పాటుగా బీజేపీకి రావాలని ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్లో బీజేపీతో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కన్నా ముందే తాము బీజేపీలో చేరితే గౌరవం నిలబడుతుందని కేడర్తో చెబుతున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా పనిచేయవచ్చని అంటున్నారు. అంబేద్కర్ ఆశయాలు, జాతీయవాదాన్ని ఆచరించే పార్టీతో పని చేస్తానని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనతో వెళ్లేందుకు బీఆర్ఎస్ కేడర్ విముఖంగా ఉందని తెలుస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, అనుచరులు గువ్వల పాటు బీజేపీకి వెళ్లేందుకు నిరాసక్తతను కనబరుస్తున్నారు. ఇప్పటికే గువ్వల పార్టీ మారుతున్న ప్రచారం మొదలైన క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్ సమక్షంలో పదర మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, గువ్వల ముఖ్య అనుచరుడు రాంబాబునాయక్ కాంగ్రెస్లో చేరారు. ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉండటం, బీజేపీ కన్నా బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉందన్న భావన నేపథ్యంలో ఎక్కువ మంది అనుచరులు బీజేపీలో చేరడానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ దక్కక కమలం గూటికెళ్లిన మాజీ ఎంపీ బీజేపీలోకి గువ్వల రాక నేపథ్యంలో మళ్లీ అలజడి కుమారుడి భవితవ్యంపై ఆందోళన గువ్వల బాటలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు -
నేరాల అదుపే ప్రధాన కర్తవ్యం
వనపర్తి: జిల్లాలో నేరాలను అదుపు చేయడమే ప్రధాన కర్తవ్యంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సందర్శిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఏ నేరాలు పెరిగాయి.. వాటికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేసుల ఛేదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న ఆరు నెలల్లో మరింత దృఢ నిశ్ఛయంతో పని చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి ఆ సంఖ్యను తగ్గించడానికి ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. తమ పరిధిలోని పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేసుల దర్యాప్తునకు సంబంధించి ఎస్సైలకు తగిన సూచనలు ఇవ్వాలని డీఎస్పీ, సీఐలను ఆదేశించారు. మహిళల భద్రతే లక్ష్యంగా పని చేయాలని, మహిళలు, చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని.. డ్రంకెన్ డ్రైవ్, వాహన తనిఖీలు నిరంతరం చేపట్టాలని కోరారు. గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని.. నిర్వాహకులతో ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలని ఎస్ఐ, సీఐలకు సూచించారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని ముందుగానే చెప్పాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని.. గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై రౌడీషీట్స్ తెరవాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలుపై నిఘా ఉంచాలని, జిల్లా, రాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చే గంజాయి మూలాలు, కీలక వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చించారు. నేర సమీక్షలో డీఎస్పీ జె.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, శివకుమార్, సీసీఎస్ సీఐ రవిపాల్, కొత్తకోట ఇన్చార్జ్ సీఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. నేర సమీక్షలో ఎస్పీ రావుల గిరిధర్ -
తప్పెవరిది..?!
● విచారణ చేపడతాం.. మర్రికుంట ఎఫ్టీఎల్ పరిఽధిలోని ప్లాట్ల విషయంపై సోమవారం ప్రజావాణిలో అర్జీ దాఖలైంది. సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. 2012లో ఆయా భూములకు నాలా అనుమతులు ఎలా మంజూరు చేశారనే విషయాన్ని సైతం పరిశీలిస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్ల ఏర్పాటుకు అనుమతి లభించదు. – రమేష్రెడ్డి, తహసీల్దార్, వనపర్తి ఎఫ్టీఎల్ పరిధిలోని భూములకు నాలా ధ్రువపత్రాలు జారీ చేసిన అధికారులు వనపర్తి: డబ్బు సంపాదనే ధ్యేయంగా రియల్ వ్యాపారులు.. నజనారాలకు తలొగ్గి అధికారులు అనుమతులు ఇవ్వడంతో చెరువులు, కుంటల్లో విచ్ఛలవిడిగా ప్లాట్లు వెలిశాయి. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వంలో ఎఫ్టీఎల్ పరిధి అంటూ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. సమస్య పరిష్కరించాలంటూ ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పరిష్కారం కావడం లేదని గతనెల 28న కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జిల్లాకేంద్రంలోని మర్రికుంట చెరువు బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. తప్పు ఎఫ్టీఎల్ పరిధిలోని పట్టాభూములని తెలిసి ప్లాట్లు చేసిన రియల్ వ్యాపారులదా.. లేక ప్లాట్లు చేస్తున్న సమయంలో చూసీచూడనట్లు వ్యవహరించిన నీటిపారుదలశాఖ అధికారులదా.. లేక నాన్ అగ్రికల్చర్ భూమిగా ధ్రువీకరించిన రెవెన్యూ అధికారులదా.. ఎవరిదనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. రూ.వేలు, రూ.లక్షలు ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటున్న ఆయా శాఖల అధికారులు విధి నిర్వహణ లోపంతో జిల్లాలో ఎంతోమంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మర్రికుంట చెరువు బాధితులేగాక తాళ్ల చెరువు, నల్ల చెరువు, ఈదుల చెరువు, అమ్మచెరువుతో పాటు పలు కుంటల ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిలో వెలిసిన వెంచర్లు కోకొల్లలని చెప్పవచ్చు. రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వం ఇలాంటి ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలోనే జిల్లాకేంద్రంలోనూ ఓ అధికార బృందాన్ని ఏర్పాటు చేసి కబ్జాకు గురైన చెరువులు, కుంటల్లోని ఆక్రమణలను తొలగించే ప్రయత్నం ఒకసారి నల్లచెరువు సమీపంలో చేసి వదిలేశారు. ఎఫ్టీఎల్ భూముల్లో ప్లాట్లు చేస్తున్న సమయంలో నిమ్మకుండా ఉండి ఏళ్ల తర్వాత ఆక్రమణలంటూ అధికారులు చర్యలకు ఉ పక్రమించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాసుల కక్కుర్తితో ఇష్టారీతిన అనుమతులు రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు నిర్మాణాలకు అనుమతి లభించక లబోదిబోమంటున్న బాధితులు -
రేపటి నుంచి బీచుపల్లిలో పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో 6వ తేదీ నుంచి 9వ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 6న విశ్వకేశ ఆరాధన, పుణ్యహం, రక్షాబంధనం, 7న మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షణం, వేద ప్రబంధ పారాయణం, 8న మూల మూర్తి హోమాలు, పూర్ణాహుతి, అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు, 9న లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, ఉత్సవ పరిసమాప్తి, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. శివాలయంలో ప్రత్యేక పూజలు బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం అందులోనూ రెండో సోమవారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయాన్నే అధిక సంఖ్యలో ప్రజలు బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకొన్నారు. -
వ్యవసాయ భూమి వేలానికి చర్యలు
అమరచింత: ఆత్మకూర్ ప్రాథమిక వ్యవసాయ కార్మిక సంఘంలో వ్యవసాయ భూములపై రుణాలు పొంది తిరిగి చెల్లించని రైతుల పొలాలను వేలం వేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అమరచింత మండలంలోని దీప్లానాయక్తండాకు చెందిన దీప్లానాయక్ ఎల్టీ రుణం తీసుకుని తిరిగి చెల్లించడం లేదంటూ సదరు వ్యక్తికి చెందిన వ్యవసాయ పొలాన్ని ఈ నెల 12న వేలం వేస్తున్నామంటూ సోమవారం పట్టణంలో టాంటాం వెయించారు. సహకార సంఘం సీఈఓ నరేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణంలోని ప్రధాన వీధులతోపాటు యూనియన్ బ్యాంక్ పరిసరాలు, దీప్లానాయక్తండాలో కరపత్రాలను పంచుతూ సరైన గడువులో డబ్బులు చెల్లించకుంటే పొలం వేలం వేస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలంలో పాల్గొనాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ నరేష్ మాట్లాడుతూ తమ సొసైటీలో 61 మంది రైతులు ఎల్టీ రుణాలు తీసుకుని మొండిబకాయి దారులుగా ఉన్నారని, వీరి ద్వారా సుమారు రూ.90 లక్షలు రావాల్సి ఉందన్నారు. బకాయిల వసూళ్ల కోసం పలుమార్లు నోటీసులు పంపామని, సదరు రైతుల ఇళ్లకు వెళ్లి చెల్లించాలని కోరినా ఫలితం లేదన్నారు. దీంతో మొండిబకాయిదారుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. వారి ఆదేశాల మేరకు రికవరీలో భాగంగా దీప్లానాయక్ ద్వారా రూ.16 లక్షలు వసూలు చేసుకునేందుకు సదరు వ్యక్తికి చెందిన సర్వే నంబర్ 203, 201, 221లో 13.26 ఎకరాల పొలాన్ని వేలం వేస్తున్నామని పేర్కొన్నారు. -
అధిక దిగుబడినిచ్చే ఉద్యాన పంటలపై దృష్టిసారించండి
కొత్తకోట రూరల్: తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డా.దండా రాజిరెడ్డి సూచించారు. సోమవారం పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులు, పంటలు సంబంధిత అంశాలపై లోతైన పరిశోధనల కోసం ప్రత్యేక పరిశోధన స్థానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా దూసుకొస్తున్న పర్యావరణ మార్పులను తట్టుకునేందుకు ఉద్యాన పంటలను విరివిగా పెంచాల్సిన అవసరముందన్నారు. మెట్ట ఉద్యాన పంటలైన ఉసిరి, చింత, జాము, సపోట, వాక్కాయ, కుంకుడు, దానిమ్మ, సీతాఫలం, మునగ తదితర తోటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. పండ్ల తోటల సాగుతో పాటు అంతర పంటలు తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు. అదే విధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఏక వార్షిక రకాలు, ప్రాంతానికి అనువైన ఔషధ మొక్కలను సైతం సాగు చేసుకోవచ్చన్నారు. సకాలంలో కత్తిరింపులు చేయడం, నీటి సంరక్షణ పద్ధతులు పాటించడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎ.భగవాన్, డీన్ చీనా, కన్సల్టెంట్ కె.వీరాంజనేయులు, అసోసియేట్ డీన్ పిడిగం సైదయ్య, ప్రొఫెసర్లు షహనాజ్, శ్రీనివాస్, శంకర్ స్వామి, గౌతమి, విద్య, భాస్కర్, నవ్య, శ్వేత పాల్గొన్నారు. -
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
వనపర్తి: భూ భారతి చట్టం–2025 రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సెక్రటరీ లోకేష్కుమార్ అదరపు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్లతో రెవెన్యూ సెక్రెటరీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని సూచించారు. ఆగస్టు 15న ఎల్బీ స్టేడియంలో గ్రామ పరిపాలన అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేస్తారని, అందుకు అవసరమైన ఖాళీలు, రోస్టర్ తదితర ప్రక్రియ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 7,648 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించడానికి ఇప్పటి వరకు 8,837 నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 696 దరఖాస్తులను ఆమోదించి అప్డేట్ చేశామన్నారు. నిబంధనలు పాటిస్తూ మిగిలిన దరఖాస్తులను పరిష్కరించడంలో వేగం పెంచుతామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 53 ఫిర్యాదులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
రాజకీయ కలకలం
అబ్రహం దారెటు? అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన స్పందించలేదు. పార్టీ మార్పును ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అలంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్లోనూ వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చర్చలు జరిగినట్టు చెబుతున్నా పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ● కారు పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ● ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం? ● ప్రచారంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. రెండు దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. ఈనెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రాధాన్యత తేలదని.. బీఆర్ఎస్ పార్టీలో 2007లో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో మొదటిసారిగా నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించినా భంగపాటు ఎదురైంది. ఈ సీటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, పార్టీ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనుచరులతో చెబుతున్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటారని, వారి కన్నా ముందే తానే బీజేపీలో చేరుతున్నట్లు ముఖ్య అనుచరులతో స్పష్టం చేశారు. అయోమయంలో పార్టీశ్రేణులు.. గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా గువ్వల రాజీనామా, పార్టీ మార్పు ప్రకటనతో పార్టీలో ఏం జరుగుతోందన్న అయోమయంలో పార్టీ శ్రేణులు ఉన్నారు. గువ్వల రాజీనామా క్రమంలో మిగతా నేతలు కూడా అదే బాటలో పడుతున్నారన్న ప్రచారం, వదంతుల నేపథ్యంలో పలువురు నేతలు స్పందించి పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ఎప్పటికీ పార్టీ లైన్లోనే ఉంటా: జైపాల్యాదవ్ చివరి శ్వాస వరకు బీఆర్ఎస్తోనే: మర్రి తాను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ దర్శకాలతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంటానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గువ్వల నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను నిత్యం పార్టీ కార్యకర్తల నడుమ ఉంటున్నానని, బీఆర్ఎస్ పార్టీ కోసమే నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు. -
పోలీసుల సేవలను వినియోగించుకోండి
వనపర్తి: జిల్లాలో ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని నేరుగా పోలీసులకు తెలియజేయాలని, పోలీసుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా బాధితుల నుంచి ఎస్పీ నేరుగా బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మందితో అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. మొత్తం 14 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ వనపర్తి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఎన్.కీమ్యానాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు అదనపు కలెక్టర్ పనిచేసిన వెంకటేశ్వర్లు ఫ్యూచర్ సిటీకి బదిలీ అయినందున ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన ఎన్.కీమ్యానాయక్ కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్కు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పకడ్బందీగా ‘వందరోజుల’ కార్యాచరణ అమలు వనపర్తి టౌన్: వనపర్తి మున్సిపాలిటీలో ‘వందరోజుల’ కార్యాచరణ అమలు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో సోమవారం జిల్లాకేంద్రంల్లోని 2, 20, 6, 15, 25, 32, 23, 1, 8, 29, 27 వార్డుల్లో 100 రోజుల కార్యాచరణ నిర్వహించారు. ఈ సందర్భంగా తడి, పొడి వ్యర్థాల విభజన, డెంగ్యూ, మలేరియాపై అవగాహన, వీధి, పెంపుడు కుక్కలపై ఏబీసీ ప్రచారం, వాణిజ్య లైసెన్స్, పారిశుద్ధ్యం, మురుగు కాల్వల్లోని డెస్టిల్ తొలగించే పనులను కమిషనర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో నిల్వ నీటిని వాడకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, డీఎంసీ బాలరాజు, సూపర్వైజర్, వార్డు ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొనారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి కొల్లాపూర్: జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్య దర్శి ఎస్ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. సోమవారం కొల్లాపూర్లోని కేఎల్ఐ అతిథి గృహంలో నిర్వహించిన సీపీఐ పార్టీ మండల స మావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన ఫయాజ్ ఇటీవలే సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడంతో ఆయనను పార్టీ నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఫయాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాగర్కర్నూల్ జిల్లాలో వేలాదిగా లంబాడీలు, చెంచులు ఉన్నారన్నారు. వారి జనాభా ఆధారంగా జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పా టు చేయాలన్నారు. నల్లమలలోని వనరులను వినియోగించుకునే విధంగా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. నల్లమల పరిసర ప్రాంతాల ను ఏజెన్సీ కారిడార్గా ప్రకటించాలని కోరా రు. కొల్లాపూర్లో మామిడి మార్కెట్, ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ స్థాపించాలన్నారు. మొలచింతలపల్లి, అసద్పూర్ శివార్లలో రాజవంశస్థుల భూములను సీలింగ్ యాక్టు ప్రకారం పే దలకు పంచాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శివుడు, ఇందిర, యూసుఫ్, కుర్మయ్య, కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
నేతన్నకు.. భరోసా
నూతన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ●రూ.18 వేలు ఇస్తామన్నారు.. నేతన్నకు భరోసా పథ కం ద్వారా ప్రతి సంవత్సరానికి రూ.18 వేలను ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు తె లిపారు. మగ్గానికి ఇద్దరికి అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో నాతోపాటు సహాయ కార్మికురాలిగా ఉన్న నా భార్యతో కలిసి ఇరువురం దరఖాస్తు చేసుకున్నాం. – చిన్ని ప్రకాష్, నేత కార్మికుడు, అమరచింత అవసరాలకు ఉపయోగం.. ప్రభుత్వం కొత్తగా నేతన్నకు భరోసా పథకం తీసుకొచ్చిందని సొసైటీ వాళ్లు చెప్పారు. సహాయ కార్మికులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఇస్తామన్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్నా. ఏడాదికి వస్తున్న రూ.6 వేలు కుటుంబ అవసరాలకు ఉపయోగపడనున్నాయి. – గాజుల సంధ్య, చేనేత సహాయ కార్మికురాలు, అమరచింత సద్వినియోగం చేసుకోండి.. నేతన్నకు భరోసా పథకం ద్వారా చేనేత కార్మికుల నుంచి మంగళవారం దరఖాస్తులు స్వీకరిస్తాం. జిల్లా మొత్తంలో 641 మంది కార్మికులు ఉండగా వీరందరికీ పథకం వర్తిస్తుంది. అయితే ఇప్పటి వరకు 346 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు కూడా మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – గోవిందయ్య, చేనేత, జౌళీశాఖ ఏడీ అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఆదుకోనేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు పరుస్తుంది. ఈ క్రమంలో కొత్తగా నేతన్నకు భరోసా పథకం ప్రవేశపెట్టి ఏడాదికి ప్రధాన కార్మికుడికి రూ.18 వేలు, సహాయ కార్మికుడికి రూ.6 వేల చొప్పున అందించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి గాను విధివిధానాలు సైతం రూపొందించడంతో సంబంధిత చేనేత జౌళీశాఖ అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గత నెల 30 వరకే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం తాజాగా మంగళవారం వరకు పొడిగింది. దీంతో ఇప్పటికీ నేతన్న భరోసాకు దరఖాస్తు చేసుకోలేని కార్మికులు త్వరితగతిన దరఖాస్తులను సంబంధిత చేనేత జౌళిశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులకు, సొసైటీ సభ్యులకు తెలియపరుస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చేనేత వృత్తిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నిరుపేద కార్మికులకు అందిస్తూ.. వారి అభ్యున్నతికి తమవంతు కృషిచేస్తుండటంతో అందివచ్చిన అవకాశాలను కార్మికులను సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా.. జిల్లాలో జియోట్యాగ్ కలిగిన నేత కార్మికులు 641 మంది ఉండగా.. నేతన్నకు భరోసా పథకం కోసం ఇప్పటి వరకు కేవలం 346 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు జౌళీశాఖ అధికారులు వెల్లడించారు. మిగతా వారంతా మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జియోట్యాగ్ కలిగిన నేత కార్మికులు 641 మంది నేతన్నకు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు 346 మంది సహాయ కార్మికుడికి అందించే సహాయం రూ.6,000 ప్రధాన కార్మికుడికి అందించే సహాయం రూ.18,000 ఇద్దరు కార్మికులకు అవకాశం.. ప్రభుత్వం తీసుకోచ్చిన నేతన్నకు భరోసా పథకం కార్మికుడి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని జౌళిశాఖ అధికారులు తెలిపారు. భరోసా పథకం ద్వారా జియో ట్యాగ్ కలిగిన మగ్గానికి ఇద్దరు కార్మికులకు అవకాశం కల్పించారు. వీరిలో ప్రధాన కార్మికుడికి ఏడాదికి రూ.18 వేలు ఇస్తుండగా.. సహాయ కార్మికుడికి రూ.6 వేలు అందిస్తుంది. వీటిని ఏడాదిలో రెండు పర్యాయాలు (6 నెలలకు ఒకసారి) భరోసా డబ్బులను అందించనున్నట్లు వెల్లడిస్తున్నారు. కార్మికుల పిల్లల చదువులతోపాటు ఇతర అవసరాలకు భరోసా ద్వారా వచ్చే డబ్బులు ఆదుకుంటాయని అభిప్రాయపడుతున్నారు. త్రిఫ్ట్ ఫండ్తోపాటు అదనపు ఆదాయం అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ నేటి వరకు గడువు పొడిగింపు జిల్లా అర్హులైన కార్మికులు 600 మందికిపైనే.. ఇంకో చేసుకోవాల్సిన వారు 295 -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో రజత పతకం
వనపర్తిటౌన్: హన్మకొండలోని జేఎన్ మైదానంలో కొనసాగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆదివారం జిల్లాకు చెందిన బద్దూనాయక్ ఐదు వేల మీటర్ల పరుగు పందెం పోటీలో రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాలిన్ పతకాన్ని అందజేశారు. జిల్లా క్రీడాకారులు రజత పతకం సాధించడంతో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రతినిధులు నర్సింహ, ఆంజనేయులు, సంఘం కార్యదర్శి సారంగపాణి, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, జనరల్ సెక్రెటరీ నందిమళ్ల శ్రీకాంత్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. భార్గవికి 6 బంగారు పతకాలు వనపర్తిటౌన్: ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పట్టణానికి చెందిన యాదగిరిచారి, విజయ హైమావతి దంపతుల కుమార్తె భార్గవిచారి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. ఆదివారం యూనివర్సిటీలో జరిగిన 55వ స్నాతకోత్సవంలో ఓవరాల్ క్యాటగిరిలో 4, ఫామ్ మిషనరీ, ఫుడ్ ప్రాసెసింగ్లో రెండు 2 మొత్తం 6 బంగారు పతకాలు సాధించింది. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ భార్గవికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఐసీఏఆర్ ఢిల్లీ డా. మంగిలాల్ జాట్, వైస్ ఛాన్స్లర్ ప్రొ. అల్డాస్ జానయ్య, యూనివర్సిటీ ప్రముఖులు పాల్గొన్నారు. బీచుపల్లి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయాన్ని ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎంపీ రాములు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఈఓ రామన్గౌడ్ వారిని శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చకుడు మారుతిచారి తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను వివరించారు. వారి వెంట ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. సమాజ మార్గదర్శి గురువు : ఎమ్మెల్సీ వనపర్తి విద్యావిభాగం: తరతరాలుగా సమాజానికి మార్గదర్శిగా ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి గురువని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కొనియాడారు. తపస్ వనపర్తి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గురువందనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జిల్లాలోని 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి మాట్లాడారు. గురువులు అందించిన విద్యే తన అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. అనంతరం ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము మాట్లాడుతూ.. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైందన్నారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్రావు, జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్, జిల్లా గౌరవ అధ్యక్షురాలు కరుణ, మండల విద్యాధికారి మద్దిలేటి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వరప్రసాద్గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ దామోదర్రెడ్డి, శశివర్ధన్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
చదరంగం క్రీడా నైపుణ్యానికి నిదర్శనం
వనపర్తి: బుద్ధిబలం ప్రదర్శించే చదరంగం భారతీయుల ప్రాచీన క్రీడల్లో ఒకటని.. ఇందులో భారతీయులకు అత్యంత నైపుణ్యం ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని స్పోర్ట్ కార్యాలయంలో కొనసాగుతున్న ఉమ్మడి జిల్లా ఓపెన్ చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చదరంగంతో ఆలోచన శక్తి పెంపొందడమేగాక బుద్ధిబలం పెరుగుతుందన్నారు. చదరంగం క్రీడపై చిన్నారులు ప్రాథమిక దశ నుంచే ఆసక్తి కనబర్చేలా ప్రోత్సహించాలని సూచించారు. పోటీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, నిర్వాహకులు యాదగిరి, టీపీ కృష్ణయ్య, గణేష్ కుమార్, నర్సింహ, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి చేద్దాం
కొల్లాపూర్: పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో జెన్కో, ట్రాన్స్కో అధికారులతో విద్యుదుత్పత్తి, వినియోగం, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైడల్ పవర్తోపాటు పంప్డ్ స్టోరేజీతో పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 పాయింట్స్ గుర్తించి, వాటిమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకు గల హైడల్ ప్రాజెక్టులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అంతర్జాతీయంగా పేరుగాంచిన కన్సల్టెంట్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్ను స్టోరేజీ చేసి రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక, స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1978లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోషిబా, మిస్టుబుషి వంటి సంస్థల సాంకేతికతను వినియోగించుకున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. సాంకేతికత వినియోగం కోసం కిందిస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యు త్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం స్థానిక లంబాడీ గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
సరిగమలు
చదువులమ్మ ఒడిలో.. ప్రభుత్వ పాఠశాలల్లో సంగీత పాఠాలు ● ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక ● శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు ● వారానికి ఒక తరగతి చొప్పున నిర్వహణ ● పీఎంశ్రీ స్కూల్స్కు వాయిద్య పరికరాలు అందజేత ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతోపాటు క్రీడలు, యోగా, కరాటే వంటి అంశాలను ఐచ్చికంగా నేర్చుకునే అవకాశాలు కల్పించింది. తాజాగా సంగీత పాటలు నేర్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎం శ్రీ కింద ఎంపిక కాబడిన బడులకు ముందు అవకాశం కల్పించనుంది. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలను మొదటి విడత కింద ఎంపిక చేసి సంబంధిత పరికరాలను ఆ బడులకు పంపిణీ చేశారు. ఈమేరకు విద్యార్థులు రోజు పాఠ్యాంశాల బోధనకు పరిమితం కాకుండా వారంలో ఒక రోజు సంగీత పాఠాలు నేర్చుకోకున్నారు. దీంతో పిల్లలకు శ్రావణానందంతో పాటు ఏకాగ్రత పెరగనుంది. సంగీత సాధనతో వివిధ రకాలైన కళల్లో ప్రావీణ్యం పొందనున్నారు. పిల్లలు వాటిని నేర్చుకునేందుకు మరింత ఆసక్తి చూపనున్నారు. సంగీత సాధనతో టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయా వృత్తులలో సైతం స్థిరపడేందుకు ఉపకరిస్తుంది. 36 పాఠశాలలకు పరికరాల పంపిణీ ఉమ్మడి జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికై న 36 పాఠశాలలకు సంగీత పరికరాలను పంపిణీ చేశారు. డోలక్, తబలా, హార్మోనియం, డ్రమ్స్, వయోలిన్ వంటివి అందించారు. వీటిని 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులతో పాటు కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులకు సైతం నేర్పించనున్నారు. జిల్లాలో ఎంపికై న పాఠశాలల వివరాలు.. శిక్షకులు వస్తే ప్రయోజనం పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలు అంది నెల రోజులు అవుతుంది. కానీ, విద్యార్థులతో సాధన చేయించే శిక్షకులను మాత్రం ఇంకా నియమించలేదు. అన్ని రకాల వాయిద్యాలు తెలిసినవారు అరుదుగా ఉంటారు. సాధారణంగా ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి ప్రావీణ్యం ఉంటుంది. ఇలాంటి వారిని ఎంపిక చేయడం సులభమే కానీ అన్ని తెలిసిన వారికి రూ.10వేల గౌరవ వేతనం సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. భిన్న రంగాల్లో ప్రతిభ ఉన్న ఇద్దరిని నియమించి వేతన సర్దుబాటు చేస్తే పరిష్కారం లభిస్తుందని పలువురు అంటున్నారు. సంగీత పాటలు బోధించడంలో ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే సంగీత ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే సంగీత పాటలు బోధించేందుకు ఆస్కారం ఉంటుంది. -
హరిత.. హరం
జిల్లాకేంద్రంలో యథేచ్ఛగా చెట్ల నరికివేత ●అటవీశాఖ నిర్లక్ష్యం.. వృక్షాల తొలగింపులో అధికారులు ఏ మాత్రం నిబంధనలు పాటించడం లేదు. భారీ చెట్లను సంరక్షించేందుకు కృషి చేయాలే తప్పా అడ్డగోలుగా నరికివేయడం సరికాదు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. – తిరుమల్, మాజీ కౌన్సిలర్ భారీ వృక్షాలను తొలగించారు.. మున్సిపాలిటీ పార్క్ను సొంత పార్క్లా భావించి అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. దీనికితోడు పచ్చదనం కూడా అదేస్థాయిలో పెంపొందించాం. ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నఫలంగా చెట్లను నరికివేశారు. ఎలాంటి ఇబ్బంది లేకపోయినా నరికివేయడం సరికాదు. – డా. ఎల్.మురళీధర్, వనపర్తి మౌఖిక ఆదేశాలతోనే.. చెట్ల తొలగింపునకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలని సిబ్బందికి సూచించాం. కొన్ని చెట్ల తొలగింపులో మౌఖిక ఆదేశాలతో ముందుకెళ్లాం. జిల్లాకేంద్రంలో లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. – ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి ఎక్కడెక్కడ తొలగించారు.. చెట్లు ఎక్కడెక్కడ తొలగించారో ఫొటోలు ఉంటే అందించండి.. కొన్ని నా దృష్టికి వచ్చాయి. చలానా చెల్లిస్తే ఆన్లైన్లో అనుమతి లభిస్తుంది. ప్రతినెల ఎన్ని అనుమతులు తీసుకున్నారని సమీక్షిస్తుంటాం. రెండు, మూడు నెలల్లో ఎన్ని వచ్చాయో గుర్తుకు లేదు. – అరవింద్రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి వనపర్తిటౌన్: పర్యావరణ పరిరక్షణకు పచ్చదనాన్ని పెంపొందించాలంటూ ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతూ రూ.కోట్లు వెచ్చిస్తుండగా.. మరోవైపు ఏపుగా పెరిగిన వృక్షాలను అక్రమంగా తొలగిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని అంతర్గత, ప్రధాన రహదారుల పరిసరాలు, పార్క్ల్లో 3 నెలలుగా వృక్షాల తొలగింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.500 చలానా తీసి అటవీ అధికారులను సంప్రదించి వృక్షాలను తొలగించాలి. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ (పునర్జీవం) ద్వారా ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చెట్లను తరలించి రసాయనాల ద్వారా నాటి సంరక్షిస్తారు. దీంతో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వృక్షసంపదను కాపాడినట్లు అవుతుంది. పట్టణాభివృద్ధి దృష్ట్యా ఐదేళ్ల కిందట ఇలాంటి సమస్య ఎదురైతే చెట్లను ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా నాగవరం ప్రాంతంలో పరిరక్షించారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారులు ఉన్నా.. రాజకీయ పార్టీల నేతల ప్రోద్భలంతో యథేచ్ఛగా చెట్లను కొట్టేస్తున్నారు. మూడు నెలలుగా ఈ తతంగం కొనసాగుతున్నా అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు తూట్లు.. ప్రభుత్వ నిబంధనల మేరకు సీసీ రహదారి నిర్మాణంలో రహదారికి ఇరువైపులా మొక్కల పెంపకానికి స్థలం వదలాల్సి ఉంటుంది. పుర కేంద్రంలో అంతర్గత రహదారులను సీసీగా మారుస్తుండగా ఆ నిబంధనలను పూర్తిగా విస్మరించారు. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, స్థానికుల ప్రోద్భలంతో వీధులన్నీ సిమెంట్మయంగా మారాయి. కొన్నిచోట్ల వృక్షాలను సైతం తొలగించి రోడ్డు నిర్మించారు. దీంతో కాలనీల్లో పచ్చదనం కరువైంది. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్, బాలానగర్, పానగల్ రోడ్, వేంకటేశ్వరస్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో మూడునెలల కాలంలో పెద్ద సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. 25 ఏళ్ల కిందట ప్రజా వైద్యశాల పార్క్లో మొక్కలు నాటగా అవి ఏపుగా పెరిగాయి. పార్క్ నిర్వహణను పుర అధికారులు పట్టించుకోకపోవడంతో వైద్యులు డా. మురళీధర్, శారద పరిరక్షించారు. పార్క్ ప్రహరీ వెలుపల ఉన్న నివాసాలు దెబ్బతింటున్నాయని కలెక్టర్ను తప్పుదోవ పట్టించి చెట్లను విచ్ఛలవిడిగా తొలగించారు. రోడ్డుకు అడ్డుగా లేకపోయినా తొలగింపు నాయకుల ఒత్తిళ్లతో మిన్నకుంటున్న అధికారులు కన్నెత్తి చూడని అటవీ అధికారులు -
ముఖ గుర్తింపుతో హాజరు!
వనపర్తి: జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారుల పాలన కొనసాగుతున్న ఏడాది కాలంగా కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయా కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ మాదిరిగా జెడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నేషన్) హాజరు నమోదు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గత నెల 16నే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. యంత్రాల కొనుగోలుకు నిధులు లేవని ఎంపీడీఓలు చేతులు ఎత్తేశారు. దీంతో జిల్లా పరిషత్తో పాటు 15 మండలాలకు జెడ్పీ నిధులతో యంత్రాల కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను కలెక్టర్ అనుమతి కోసం నోట్ఫైల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ● ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నేషన్ యంత్రాలు ఏర్పాటు చేయాలంటే ముందుగా ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల హోదా, ఇతర వివరాలు సేకరించి యంత్రంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం యంత్రంలో నిక్షిప్తమైన ముఖ హాజరును లెక్కించి ఉద్యోగులకు ప్రతి నెల వేతనం చెల్లించే పద్ధతి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం సమీకృత కలెక్టరేట్లో అమలవుతోంది. అదే తరహాలో నాణ్యమైన యంత్రాలు కొనుగోలు చేసేందుకు జెడ్పీ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జెడ్పీ, ఎంపీడీవో కార్యాలయాల్లో అమలుకు ఏర్పాట్లు గత నెల 16నే ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం యంత్రాల కొనుగోలు జాప్యం అధికారులు, సిబ్బంది విధుల డుమ్మాలకు చెక్ పంద్రాగస్టు వరకు పూర్తిచేస్తాం.. పంద్రాగస్టు వరకు జెడ్పీతో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ముఖగుర్తింపు యంత్రాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నాం. ధరలు ఎక్కువగా ఉన్నందున తక్కువ ధరకు యంత్రాలు సరఫరా చేసే ఏజెన్సీని ఎంపిక చేసేందుకు ప్రయత్నించటంతో కొంత ఆలస్యమైంది. ఉద్యోగుల వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. – యాదయ్య, జెడ్పీ సీఈఓ, వనపర్తి -
సృజనాత్మకత వెలికితీయొచ్చు..
పీఎంశ్రీ పాఠశాలల్లో సంగీత పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయొచ్చు. ఇప్పటికే పాఠశాలకు నాలుగు రకాల వాయిద్య పరికరాలు అందాయి. త్వరగా శిక్షకులను నియ మిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడ లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – గోపాల్, హెచ్ఎం, అచ్చంపేట ఉన్నత పాఠశాల మార్గదర్శకాలు రాలే.. జిల్లాలో ఎంపికై న ఎనిమిది పీఎంశ్రీ పాఠశాలలకు వాయిద్య పరికరాలు చేరాయి. తరగతుల నిర్వహణపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాలేదు. ఆదేశాలు అందగానే జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. త్వరలోనే ప్రత్యేక టీచర్ల నియామకం జరగనుంది. – షర్పొద్దీన్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ● -
అమ్మ.. నాన్న.. ఫ్రెండ్
స్నేహమంటే ఇదేరా !ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025● తల్లిదండ్రుల తర్వాత స్నేహితులకే ప్రాధాన్యం ● మధురమైన జీవితంలో స్నేహబంధం మరుపురానిదని కితాబు ● మంచి స్నేహితులు ఒక్కరు చాలంటున్న యువత ● మారుతున్న పరిస్థితుల్లో విలువలు దిగజారుతున్నాయని ఆవేదన ‘స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.. కడదాక నీడ లాగ నిను వీడిపోదునురా.. నీ గుండెలో పూచేటిదీ, నీ శ్వాసగా నిలిచేటిదీ ఈ స్నేహమొకటేనురా..’ ..స్నేహం గురించి తెలిపేలా ఓ కవి రాసిన మధుర గీతమిది. చిన్ననాటి నుంచి మొదలు చరమాంకం వరకు తీపి గుర్తులుగా మదిలో నిలిచేది స్నేహ బంధం. అందుకే జీవితంలో మధురమైనది, మరపురానిది అంటే స్నేహమేనని చెబుతారు. కాలంతో పాటు మారిన జీవన పరిస్థితుల్లో సైతం ఫ్రెండ్షిప్ అనేది యువత ఉన్నతిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు వారు ఏం కోరుకుంటున్నారు.. ఎలాంటి నేస్తం కావాలి.. వారికి మీరిచ్చే స్థానం ఏమిటి ? వంటి తదితర అంశాలపై ‘సాక్షి’ ఒక చిన్న ప్రయత్నం చేసింది. నేడు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించింది. తల్లిదండ్రుల తర్వాత స్నేహితులకే ప్రాధాన్యం అంటూ యువతీ యువకులు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ న్యూస్రీల్సర్వే ఇలా.. -
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
వనపర్తిటౌన్: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో 2025–26 విద్యాసంవత్సరం ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు గడుపు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు గడువు ఉందని.. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాలలో చేరవచ్చని పేర్కొన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు అమరచింత: యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఏడీఏ దామోదర్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా, ఎరువులు, పురుగు మందుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో అన్నిరకాల ఎరువులతో పాటు యూరియాను అందుబాటులో ఉంచుతుందన్నారు. కొందరు డీలర్లు అవసరం మేరకు యూరియా తెప్పించుకోలేకపోతున్నారని.. దీంతో రైతులు యూ రియా కోసం ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్న సమాచారం తమ దృష్టికి వచ్చిందని వివరించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని లేనిపక్షంలో లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ అరవింద్, ఇతర సిబ్బంది ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: హైదరాబాద్ రామంతాపూర్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి జిల్లాలోని ఎస్సీ కుల బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 2025–2026 విద్యా సంవత్సరంలో డే స్కాలర్ విధానంలో ప్రవేశానికి 01–06–2018 నుంచి 31–05–2019 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని, కుల, ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, ఆధార్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించుకొని 8వ తేదీలోగా జిల్లాకేంద్రంలోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో పనివేళల్లో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు జిల్లా క్రీడాకారులు వనపర్తి రూరల్: పెబ్బేరు మత్స్య కళాశాల విద్యార్థులు గణేష్, శిరీష లాంగ్జంప్ సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల అసోసియేట్ డీన్ డా. దుర్గం సకారం తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలో పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి శాలువాలతో సన్మానించారు. ఓఎస్ఏ డా. భానుప్రకాష్, ిపీడీ దామోదర్ పాల్గొన్నారు. కల్వరాల విద్యార్థిని.. వీపనగండ్ల: మండలంలోని కల్వరాల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మీనాక్షి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. జిల్లాస్థాయి రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్లో ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందన్నారు. అదనపు కలెక్టర్కు డిప్యూటేషన్ వనపర్తి: రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఫారెన్ సర్వీసు కింద హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి డిప్యూటేషన్పై వెళ్తున్నట్లు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఆర్టీఓ సుబ్రమణ్యంకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయినట్లు పేర్కొన్నారు. -
నిర్వాసితుల అరిగోస
‘ఏదుల’ నిర్మాణంలో ముంపునకు గురైన రెండు గ్రామాలు పరిహారం రాలేదు.. అధికారులు విచారణకు వచ్చిన సమయాల్లో నేను ఇంటివద్దే ఉన్నా. కానీ నేటికీ నాకు రావాల్సిన పరిహారం రూ.12.54 లక్షలు, ఇతర బెనిఫిట్స్ రాలేదు. నాలాగే డబ్బులు రానివారు ఏడెనిమిది మంది ఉన్నారు. సారోళ్లు ఇప్పటికై నా గుర్తించి డబ్బులు అందేలా చూడాలి. – మిరిగిళ్ల శాంతమ్మ, కొంకలపల్లి విద్యుత్ సమస్య పరిష్కరించాలి.. ఎస్సీకాలనీలో విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు పాతి అలాగే వదిలేశారు. రాత్రివేళల్లో చీకట్లో ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం కావడంతో విషపు పురుగులు సంచరిస్తున్నాయి. విద్యుత్, మురుగు సమస్య వెంటనే పరిష్కరించాలి. – మిద్దె మహేష్, బండరావిపాకుల (రేవల్లి) ఉన్నతాధికారులకు నివేదించాం కొత్త బండరావిపాకులలో ప్లాట్లు రానివారు బాధపడాల్సిన అవసరం లేదు. భూ సేకరణకు సంబంధించి గతంలో ప్రైమరీ నోటిఫికేషన్, పబ్లిక్ డిక్లరేషన్ ఉన్నతాధికారులకు పంపించాం. వారి ఆదేశాల మేరకు ముందుకుసాగుతాం. బండరావిపాకులలో మురుగు, విద్యుత్ సమస్య ఉన్నది వాస్తవమే. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. – లక్ష్మీదేవి, తహసీల్దార్, రేవల్లి గోపాల్పేట: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 2016లో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో మండలంలోని బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాలు ముంపునకు గురికాగా.. పునరావాసం క ల్పించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయా గ్రామస్తులకు అధికారులు నచ్చజెప్పి భూ సేకరణ చేపట్టారు. ప్రస్తుతం రిజర్వాయర్ నిర్మాణం కొనసాగుతుండగా.. నేటికీ ఇచ్చిన హామీ మేరకు పునరావాసం, నష్ట పరిహారం, ప్లాట్ల కే టాయింపు పూర్తిస్థాయిలో జరగలేదని ఆయా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. నాటి పాలకులు అన్నివిధాలా న్యాయం చేస్తామని చెప్పి గ్రామాలు ఖాళీ చేయించారని, వారి మాటలు నమ్మి మోసపోయామని.. ప్రస్తుత పాలకులైనా తమను ఆదుకోవాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదీ పరిస్థితి.. బండరావిపాకులలో మొత్తం 987 మందిని నిర్వాసితులుగా గుర్తించిన అధికారులు.. పునరావాసం కోసం శానాయిపల్లి సమీపంలో 52 ఎకరాల్లో 520 ప్లాట్లు కేటాయించారు. మరో 467 ప్లాట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇందుకోసం అదే గ్రామ సమీపంలో స్థలాలు పరిశీలించగా గ్రామస్తులు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. తమకు ఎక్కడ, ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తారంటూ బాధితులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఖాళీ స్థలాలకు సంబంధించిన విచారణ కూడా పూర్తయినా నేటికీ డబ్బులు రాలేదు. అలాగే స్టాటిస్టికల్ ఎకనామికల్ సర్వే (ఎస్ఈఎస్) చేసినప్పుడు గ్రామంలోనే ఉండి డబ్బులు రానివారు సుమారు 20 మంది వరకు ఉన్నారని.. వారికి కూడా న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ● కొంకలపల్లి గ్రామస్తులకు 382 ప్లాట్లు ఇచ్చారు. ఈ గ్రామంలో సైతం ఎస్ఈఎస్ చేసినప్పుడు గ్రామంలోనే ఉండి నేటికీ డబ్బులు రాని వృద్ధులు ఏడుగురు ఉన్నారని వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు సైతం తక్కువ సంఖ్యలో కేటాయించారని.. ఇంటి నిర్మాణం చేపట్టలేని స్థితిలో చాలామంది ఉన్నారని, అర్హులందరికీ మంజూరు చేయాలని ముంపు బాధితులు అధికారులు, పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని నమ్మించి మోసం చేశారని నిర్వాసితులు బోరుమంటున్నారు. అరకొరగా పరిహారం పంపిణీ పునరావాస గ్రామంలో సమస్యల వెల్లువ వేధిస్తున్న విద్యుత్, మురుగు సమస్య 450 మందికి లభించని ప్లాట్లు -
ఎరువుల విక్రయాలపై నజర్
మదనాపురం: ఎరువుల విక్రయాలపై నెలకొన్న సందిగ్ధతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎరువుల కొరత తలెత్తకుండా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. కలెక్టర్ సారథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారులు సరఫరా, విక్రయాల ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఎరువుల విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అంతేగాకుండా ప్రతి విక్రయ కేంద్రంలో నోటీసు బోర్డులు ఏర్పాటుచేసి వాటిపై ఎరువుల ధరలతో పాటు నిల్వల వివరాలు పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. యూరియా కొరత లేదు.. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలంలో 19 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించగా.. ఈసారి జిల్లాకు 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని ప్రతిపాదనలు అధికారులు పంపించారు. గతేడాది మాదిరిగా 19 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా.. 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, మిగతాది త్వరలో రానుందని చెబుతున్నారు. పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు జిల్లాకు 19 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. జిల్లాలో ఎరువులు, యూరియా కొరత లేదు. వానాకాలం సీజన్కుగాను 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా.. ఇప్పటి వరకు 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చింది. దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తాం. రైతులు మూస పద్ధతిలో ఎరువులను అధికంగా వాడకుండా మండల వ్యవసాయ అఽధికారుల సూచనలు పాటించాలి. – ఆంజనేయులుగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి నిరంతర పర్యవేక్షణ.. వారం రోజులుగా జిల్లాలోని ఎరువుల దుకాణాలను జిల్లా, మండల అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. దుకాణదారులు వచ్చిన ఎరువులను అధిక ధరలకు విక్రయించకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ధరలు, నిల్వల పట్టిక దుకాణంలో రైతులకు కనబడేలా విధిగా ఏర్పాటు చేయాలని వత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన మందులను వాడవద్దని, అధికారుల సలహాలు లేకుండా పొలాల్లో మందులు వేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూర్, వీపనగండ్ల, శ్రీరంగాపురం, ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాల్లో వరి అధికంగా సాగు చేస్తారు. -
తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన
వనపర్తి రూరల్: తల్లిపాల ప్రయోజనాలపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈ నెల 7 వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో పర్యటించారు. మొదట పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడివెల్నెస్ సెంటర్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు తాగిన బిడ్డ జీవితాంతం బలంగా, ఆరోగ్యంగా ఉంటారని.. శిశువు జన్మించిన 6 నెలల వరకు కచ్చితంగా తల్లిపాలు పట్టించాలన్నారు. అనంతరం కిసాన్ జంక్షన్ ఫర్టిలైజర్ దుకాణం, శ్రీరంగాపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, గోదాంను తనిఖీ చేశారు. దుకాణాల బయట ప్రదర్శించిన సమాచార బోర్డులు, దుకాణం, గోదాంలో ఎరువులు, యూరియా నిల్వలను పరిశీలించారు. యూరియా, డీఏపీ నిల్వలు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలతో సరిపోల్చి చూశారు. జిల్లాల్లో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని.. అవసరం మేరకు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. ఎరువులకు ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఆవసరమైన మేరకు ఎరువులు ఇవ్వాలని.. కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎరువుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, జిల్లా పోగ్రాం అధికారి డా. సాయినాథ్రెడ్డి, వైద్యాధికారి డా. ప్రవళిక, డా. పరిమళ, వ్యవసాయ అధికారులు షేక్ మున్నా, హైమావతి తదిరులు ఉన్నారు. -
టీచర్లకు తీపికబురు
●నిలిచిన డిప్యూటేషన్లు.. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంఈఓల నుంచి డిప్యూటేషన్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల వివరాలను డీఈఓలు సేకరించారు. వీటికి కలెక్టర్ అనుమతితో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 680 మందికి డిప్యూటేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మహబూబ్నగర్లోనే 330 మంది బదిలీ కావాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు నిలిచిపోయాయి. పదోన్నతుల అనంతరం అక్కడ ఏర్పడిన ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్లు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 11లోగా పూర్తయితే 15లోగా డిప్యూటేషన్లు కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నేటినుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే.. ప్రభుత్వం ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11లోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఆదేశించింది. అందులో భాగంగా ఆదివారం సీనియార్టీ లిస్టులను ప్రదర్శిస్తాం. జిల్లా పరిధిలో 1:3 ప్రకారం 450 మందిని ఎంపిక చేసి 150 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక డిప్యూటేషన్లు ఆగిపోయే అవకాశం లేదు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఫైల్ ప్రాసెస్ చేసి డిప్యూటేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. గత మూడేళ్ల క్రితమే ప్రమోషన్లు ఇచ్చిన తాజాగా ప్రభుత్వం మరోసారి ప్రక్రియ చేపట్టాలని పేర్కొంటూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పదోన్నతులతో సుమారు 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులు అర్హత పొందే అవకాశం ఉందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా పదోతున్నతులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11 వరకు.. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 -
అర్హులందరికీ రేషన్ కార్డులు
వనపర్తి రూరల్: అర్హులందరికీ రేషన్కార్డు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు, శ్రీరంగాపురంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెబ్బేరు మండలంలో 2,014, శ్రీరంగాపురం మండలంలో 345 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయిందని.. పాలకులే లబ్ధి పొందారు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని.. పార్టీలకతీతంగా పారదర్శకంగా అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. మహిళలకు రూ.360 కోట్లు వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని.. రంగసముద్రం దగ్గర టూరిజంశాఖ ఆధ్వర్యంలో పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేవాలయం వద్ద రథోత్సవ సమయంలో ఇబ్బందులు కలగకుండా రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తునట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్యాదవ్, మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ ఎద్దుల విజవర్ధన్రెడ్డి, తహసీల్దార్లు మురళీగౌడ్, రాజు, నాయకులు అక్కి శ్రీనివాసులుగౌడ్, సురేందర్గౌడ్, దయాకర్రెడ్డి, వెంకట్రాములు, రంజిత్కుమార్ పాల్గొన్నారు. -
నేడు జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు శుక్రవారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ప్రధానకార్యదర్శి కురుమయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే యువ తెలంగాణ కబడ్డీ ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఈ ఎంపికలు నిర్వహిసున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల క్రీడాకారులు సాయంత్రం 4 నుంచి ప్రారంభించే ఎంపికల్లో పాల్గొనాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్ 85001 65900 సంప్రదించాలని సూచించారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు గోపాల్పేట: కాంగ్రెస్ పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. కొండలు, ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేశారని ఆరోపించారు. తాను కేవలం ప్రజల కోసం పని చేస్తున్నానని.. ఎన్నికల ముందు ప్రకటించిన ఆస్తులు, ఎన్నికల తర్వాత తన ఆస్తులు చూపిస్తానని తెలిపారు. మూడు మండలాల్లో మొత్తం 3,500 రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సులు నడిపిస్తున్నామని.. పెట్రోల్బంకు నిర్వహణ సైతం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పనిని గుర్తించి ఓట్లు వేయాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. రేషన్కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియని.. ప్రతి మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఇన్చార్జ్స సత్యశిలారెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు వెంకటేష్, పీఏసీఎస్ చైర్మన్ రఘు, మూడు మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికిస్థల పరిశీలన పాన్గల్: మండలానికి మంజూరైన 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గురువారం మండలంలోని గోప్లాపూర్, కిష్టాపూర్లో ఆర్డీఓ సుబ్రమణ్యం మండలస్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోప్లాపూర్ శివారు సర్వేనంబర్ 61, కిష్టాపూర్ శివారులోని సర్వే నంబర్ 32ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి సుమారు 10 ఎకరాల స్థలం అవసరమవుతుందని.. పక్కపక్కనే ఉన్న ఈ రెండు సర్వేనంబర్లలో నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని పేర్కొన్నారు. ఆర్డీఓ వెంట ఇన్చార్జ్ తహసీల్దార్ అబ్రహంలింకన్, ఆర్ఐ మహేష్, సర్వేయర్ ఇలాయత్, జూనియర్ అసిస్టెంట్ మహేష్, మల్లేష్ తదితరులు ఉన్నారు. బుద్దారం చెరువుకు గండి గోపాల్పేట: మండలంలోని బుద్దారం పెద్ద చెరువు (మినీ రిజర్వాయర్) అలుగు వద్ద గురువారం కట్ట తెగింది. రైతులు వెంటనే నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకొని పొక్లెయిన్తో మట్టి వేసి మూసివేశారు. ఈ విషయాన్ని కేఎల్ఐ డీఈ గఫార్ వద్ద ప్రస్తావించగా.. గుర్తు తెలియని వ్యక్తులు గేట్ ఎక్కువ తెరవడంతో కొంత కట్ట తెగిందన్నారు. సిబ్బంది వెంటనే స్పందించి కట్టను పునరుద్ధరించారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్
ఆత్మకూర్: సమగ్ర తెలంగాణ క్రీడా విధానం–2025ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనల మేరకు రూపొందించామని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం స్థానిక మార్కెట్యార్డులో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి స్పోర్ట్స్ కాంక్లెవ్ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. తాను క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన మొదటి క్యాబినెట్ సమావేషంలోనే నూతన క్రీడా విధానం ఆమోదింపబడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రీడారంగ నిష్ణాతులు, క్రీడాసమాఖ్యల ప్రతినిధులతో కలిసి విస్తృతస్థాయిలో స్పోర్ట్స్ కాంక్లెవ్ నిర్వహిస్తున్నామని వివరించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు, మట్టిలోని మాణిక్యాలను ప్రపంచ ఛాంపియన్లుగా అందించేందుకు నూతన క్రీడావిధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సాట్ బాధ్యతలు మరింత విస్తృతం.. నూతన క్రీడా విధానంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్) బాధ్యతలు మరింత విస్తరించనున్నాయని.. రాష్ట్రం నుండి అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఏడాది కాలంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారటీ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో రెట్టింపుస్థాయిలో చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సుధీర్కుమార్రెడ్డి, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, మాజీ ఎంపీపీ డా. శ్రీధర్గౌడ్, నాయకులు పరమేష్, నల్గొండ శ్రీను, తులసిరాజ్, భాస్కర్, మశ్ఛందర్గౌడ్, అజ్మతుల్లా, షాలం, రఫీక్, దామోదర్, సాయిరాఘవ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురికావొద్దు
వనపర్తి: వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జిల్లాలోని అన్ని పురపాలికల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి జిల్లాలోని అన్ని పురపాలికల కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనావాసాలకు ఇబ్బందులు కలిగించే పెద్ద డ్రైనేజీల జాబితా సిద్ధం చేసి బాగు చేయించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని.. జిల్లాకేంద్రంలో మూడు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా తాగునీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని.. ట్యాంకులను శుభ్రం చేయించాలని సూచించారు. ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టి కాలనీలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని, అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్లెక్సీల ఏర్పాటును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని.. ఏర్పాటు చేసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో తొలగించాలన్నారు. వనపర్తి పుర పరిధిలోని శ్రీనివాసపురం వద్ద కొత్తగా ఏర్పాటు చేయనున్న వెంచర్ లేఅవుట్ డ్రాఫ్ట్ ఆమోదానికి గూగుల్ మ్యాప్లో పరిశీలించారు. ఎలాంటి సమస్యలు లేవని అధికారులు తెలుపడంతో ఆమోదం తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ మల్లయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్రెడి పాల్గొన్నారు. -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు ●పునాది కూల్చేస్తేనే బిల్లు ఇస్తామన్నారు.. మొదటి విడతలో నా పేరు మీద ఇందిరమ్మ ఇలు్ల్ మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో నింబంధనల ప్రకారం రెండు వరుసల పునాది వేశాం. అధికారులు పరిశీలనకు రాగా.. మేం ముగ్గు వేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని.. పునాది కూల్చివేయాలని చెప్పారు. ఆ తర్వాతే ముగ్గు పోస్తామని.. మళ్లీ పునాది నిర్మించిన తర్వాత బిల్లు మంజూరవుతుందన్నారు. లేదంటే ఇల్లు రద్దు చేస్తామని చెప్పారు. చేసేదేమీ లేక పక్కనే చిన్న పూరి గుడిసె వేసుకుని అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. – లక్ష్మమ్మ, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట బిల్లు అడిగితే స్పందించడం లేదు.. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో అధికారులు 60 గజాలు కొలిచి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. నాకు ఇద్దరు కుమారులు. దీంతో పక్కన మరింత ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణ పునాదిని విస్తరించాను. అధికారులు పరిశీలించి నిబంధనలు ఒప్పుకోవన్నారు. మేం ముగ్గు వేసిన వరకు నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుందని చెప్పారు. దీంతో వారు వేసిన ముగ్గు వరకే ఇల్లు నిర్మిస్తున్నా. గోడల పని పూర్తయింది. మొదటి బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించడం లేదు. – గోపాల్, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట ● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. -
మాధవరెడ్డి ఎత్తిపోతలకు గ్రీన్సిగ్నల్
వనపర్తిటౌన్: ఖాసీంనగర్ (మాధవరెడ్డి) ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారని.. దీంతో 6 గ్రామాలు, 13 తండాల్లోని 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖాసీంనగర్, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లి, అంజనగిరి గ్రామాలతో పాటు మరో 13 గిరిజన తండాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఖాసీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్కు మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్గా నామకరణం హర్షణీయమని, ఆయన వైద్యసేవలను గుర్తిస్తూ సీఎం పేరు పెట్టారని వివరించారు. రామన్నగట్టు రిజర్వాయర్కి నీరు తెచ్చి మూడు లిఫ్ట్ట్ల ద్వారా సాగునీరు అందిస్తామని, మొదటి లిఫ్ట్ ద్వారా ఖాసీంనగర్లోని వెయ్యి ఎకరాలకు, రెండో లిఫ్ట్ ద్వారా దత్తాయపల్లి, అంజనగిరిలోని వెయ్యి ఎకరాలకు, మూడో లిఫ్ట్ ద్వారా జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లిలోని రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఏళ్లుగా చివరి ఆయకట్టుకు సాగునీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నందిమళ్ల యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు సమద్మియా, సీనియర్ నాయకులు కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్రెడ్డి, మెంటెపల్లి రాములు, అబ్దుల్లా, కమర్ రహమాన్, గడ్డం వినోద్, రాగి అక్షయ్, నాగార్జున, ఇర్ఫాన్, చరణ్, రాంబాబు, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
పనితీరు ప్రజలు మెచ్చేలా ఉండాలి
వీపనగండ్ల: సిబ్బంది పనితీరు ప్రజలు మెచ్చేలా ఉండాలని.. అప్పుడే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, గ్రామానికి ఒక పోలీసు అధికారిని కేటాయించి వీపీఓ విధానం పకడ్బందీగా అమలు చేస్తామని వెల్లడించారు. నేరాల నియంత్రణకు రాత్రిళ్లు పటిష్టంగా గస్తీ నిర్వహిస్తామని, ఏవైనా ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మెలుగుతూ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా మహిళల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించినప్పుడే ఆ స్టేషన్కు మంచి పేరు వస్తుందన్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్రావు, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ రాణి, మంజునాథరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ.. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం మండలంలోని పుర్గర్చర్లలో గ్రామ రైతు సంఘం, మహిళా సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని.. గ్రామాల్లో ఏర్పాటు చేసుకుంటే శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ రావుల గిరిధర్ -
అందుబాటులోకి ఆధునిక వృత్తివిద్య కోర్సులు
వనపర్తి: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని.. ఆసక్తిగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్కు సంబంధించిన వాల్పోస్టర్ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) నెలకొల్పి వాటిలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు. ఈ ఆధునిక వృత్తి విద్య కోర్సుల్లో రెండోవిడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయని.. జిల్లాలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ (40 సీట్లు), మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (24 సీట్లు), బేసిక్ డిజైనర్ మరియు వర్చువల్ వెరిఫైర్ మెకానికల్ (24 సీట్లు), ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ (20 సీట్లు), అడ్వాన్స్డ్ సీఎంసీ మిషన్ టెక్నీషియన్ (24 సీట్లు), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (40 సీట్లు) ఉన్నాయని వివరించారు. వీటితో పాటు రెగ్యులర్ కోర్సులైన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్, సీఓపీఏ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని చెప్పారు. దరఖాస్తునకు 31వ తేదీ వరకు గడువు ఉందని.. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ http://iti.telangana.gov.in, లేదా సెల్నంబర్ 94902 02037, 98492 44030, 79953 35372 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, టీగెట్ చంద్రశేఖర్గౌడ్, ఏఎల్ఓ వేణుగోపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణా నేరం
వనపర్తి: అన్ని ప్రభుత్వ శాఖల సమష్టి కృషితోనే మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో యాక్సెస్ టు జస్టిస్లో భాగంగా జిల్లా రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ మరియు మహిళ, శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా సఖి, భరోసా, ఆపరేషన్ ముస్కాన్, షీటీం, లీగల్ సర్వీసెస్, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, జిల్లా వైద్యాధికారి, జస్టిస్ జోనల్ బోర్డ్ తదితర శాఖలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మానవ అక్రమ రవాణాకు సంబంధించి చట్టపరమైన నిబంధనలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, దర్యాప్తు విధానం, న్యాయపరమైన సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో చదువు మానేసిన మహేష్ చెత్త కాగితాలు ఏరుకుంటున్న మహేష్ను 2022లో ఆర్డీఎస్ సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ చేరదీసి పాఠశాలలో చేర్పించారు. 2025లో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 480 మార్కులు సాధించి ఆదర్శంగా నిలవడంతో మహేష్ను ఎస్పీ శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు. భవిష్యత్లో ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం సాధించి పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అనే స్వచ్ఛంద సంస్థ పని చేస్తుందని తెలిపారు. ఇలాంటి కేసులు మొదటగా గుర్తించేది పోలీస్శాఖ కాబట్టి వీటిపైన పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే జిల్లా పరిధిలో మానవ అక్రమ రవాణా జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చట్టాలు ఉన్నాయని.. నేరస్తులను శిక్షించవచ్చని తెలిపారు. రోజు గ్రామాల్లో సందర్శిస్తూ మానవ అక్రమ రవాణా, బాల కార్మికులను గుర్తించే చర్యలు కొనసాగాలన్నారు. మానవ అక్రమ రవాణా జరిగితే ఉమెన్ హెల్ప్లైన్ నంబర్ 181, చైల్డ్లైన్ 1098, డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చెన్నమ్మ థామస్, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, ఆపరేషన్ ముస్కాన్ ఎస్ఐ రాము, జస్టిస్ జువనైల్ బోర్డు సభ్యురాలు గిరిజ, మానసిక వైద్యురాలు పుష్పలత, సఖి కో–ఆర్డినేటర్ కవిత, భరోసా కో–ఆర్డినేటర్ శిరీష, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాంబాబు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు వనజ, విజయ్, భరోసా, సఖి, ఆపరేషన్ ముస్కాన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే బాలలకు బంగారు భవిష్యత్ ఎస్పీ రావుల గిరిధర్ -
ఆదాయ మార్గాలపై దృష్టి సారించండి
అమరచింత: పురపాలికకు ఆదాయం సమకూర్చే ఆస్తి, వాణిజ్య, కొళాయి పన్నులను క్రమం తప్పకుండా వసూలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు ఆదేశించారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా పురపాలికలోని 4వ వార్డులో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పరిసరాల శుభ్రత, తాగునీటి సరఫరాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పుర కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం పుర సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆగస్టు చివరి నాటికి 40 శాతం పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కొళాయి పన్నును సైతం క్రమం తప్పకుండా వసూలు చేయాలని.. వీటితోనే పుర అభివృద్ధితో పాటు కార్మికుల వేతనాలు చెల్లించే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. పారిశుద్ధ్య పనులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు దోమల నివారణ మందు పిచికారీ చేయాలని సూచించారు. ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్లు నిత్యం వెలిగేలా చూడాలని, మెప్మా సిబ్బంది పట్టణ మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడంతో పాటు సకాలంలో తిరిగి చెల్లించేలా ప్రతినెల సమావేశాలు నిర్వహించాలన్నారు. కొత్త సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో పుర కమిషనర్ నాగరాజు, మేనేజర్ యూసుఫ్, మెప్మా జిల్లా కో–ఆర్టినేటర్ బాలరాజు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల పటిష్టతకు ప్రభుత్వం కృషి
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని గురుకులాల పటిష్టతకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మండలంలోని చిట్యాల శివారు ఎంజేపీ గురుకుల పాఠశాల పీఎంశ్రీ నిర్వహణలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. పీఎంశ్రీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 5వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంగళవారం జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఎంశ్రీ బెస్ట్ పాఠశాలగా చిట్యాల ఎంజేపీ గురుకులం ఎంపిక కావడానికి కృషి చేసిన పాఠశాల అధ్యాపక బృందాన్ని అభినందించారు. విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలను తమ ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. పాఠశాల సముదాయంలో ఇంటర్ కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని, సీసీ రోడ్డు, ఓవర్హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు ప్రిన్సిపాల్ గురువయ్యగౌడ్ వినతిపత్రం అందజేశారు. ఓవర్హెడ్ ట్యాంక్, సీసీ రహదారుల నిర్మాణాలకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ గురుకుల కళాశాల భవన నిర్మాణానికి రూ.10 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని.. తమ ప్రభుత్వ హయంలో పూర్తిస్థాయిలో పటిష్టపరుస్తునట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ నాయకులు శంకర్నాయక్, రవి, రఘుపతిరావు, రాంరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
కొత్తకోట రూరల్: కానాయపల్లి నిర్వాసితుల సమస్యలు త్వరగా పరిష్కరించి గ్రామ తరలింపు చేపడతామని.. శంకర సముద్రం కుడి కాల్వ ద్వారా 12 గ్రామాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని కానాయపల్లి పునరావాస కేంద్రంలో రూ.43.50 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రూ.75 లక్షలో నిర్మించే వడ్డెర, యాదవ, హమాలీ సామూహిక మందిరాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సువిశాల ప్రాంతంలో సకల సౌకర్యాలతో పాఠశాల నిర్మించినట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పునరావాస కేంద్రం, ఆయకట్టుకు సాగునీరు అందించలేదని విమర్శించారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముందుగా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించానని చెప్పారు. గ్రామం నుంచి పాఠశాల దూరమైనందున విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా త్వరలోనే నిర్వాసితులకు ప్లాట్లు ఇచ్చి రావాల్సిన నష్టపరిహారం సైతం అందించి పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పునరావాస కేంద్రంలో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చామని.. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాఠశాలలో ఏఐ విద్య అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మహ్మద్ అబ్దుల్ ఘనీ, మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు విజయ్కుమార్, కాంగ్రెస్పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, బోయేజ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రావుల సురేంద్రనాథ్రెడ్డి, కరుణాకర్రెడ్డి, పుర కమిషనర్ సైదయ్య, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
వీధి వ్యాపారుల సంఘాలు
ఆత్మనిర్భర్ భారత్లో మరో ముందడుగు అమరచింత: కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా చిన్న మొత్తంలో రుణాలు ఇప్పించి ఆదుకుంది. రూ. పది వేల నుంచి మొదలైన రుణం.. ప్రస్తుతం రూ.20 వేలు, రూ.50 వేల రూపాయల వరకు బ్యాంకులు ఇస్తుండటంతో తమ వ్యాపారాలను పెంపొందించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 6,463 మంది వీధి విక్రయదారులు బ్యాంకుల్లో రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ క్రమం తప్పకుండా నెలనెలా కిస్తులు చెల్లిస్తూ తిరిగి రుణాలు పొందుతున్నారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో కేంద్రం వీధి విక్రయదారులకు మరో అవకాశం కల్పిస్తూ సంఘాలు ఏర్పాటుచేసి ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా మెప్మా అధికారులు పురపాలికల్లో వీధి విక్రయదారులను కలిసి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి సంఘంలో 5 నుంచి 10 మంది సభ్యులు ఉండేందుకు అవకాశం కల్పించడంతో వీధి విక్రయదారుల సంఘాల ఆవిర్భావానికి అంకురార్పణ జరిగినట్లయింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 50కి పైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మెప్మా అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు.. ప్రస్తుతం కొనసాగుతున్న మహిళా సంఘాల మాదిరిగానే వీధి విక్రయదారులను జత చేస్తూ సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘాల్లో 10 నుంచి 15 మంది సభ్యులు ఉండటం తెలిసిందే. ఇదే తరహలో వీధి విక్రయదారులు తమకు అనుకూలంగా ఉండే వారితో జత కలిసి సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి సంఘంలో కనీసం 5 మంది సభ్యులు ఉండాలనే నియమం ఉంది. మహిళా సంఘాల్లో సభ్యులు ఒక్కొక్కరు ప్రతి నెల రూ.100 నుంచి రూ.200 పొదుపు చేస్తున్నట్లుగానే వీరుకూడా ప్రతినెల కొంత మొత్తం జమ చేయాలని మెప్మా అధికారులు సూచిస్తున్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాల మాదిరిగానే వీరికి కూడా భవిష్యత్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. పురపాలికల్లో కొత్తగా ఏర్పాటు ఐదు మున్సిపాల్టీలు.. 6,463 మంది వీధి విక్రయదారులు మహిళా పొదుపు సంఘాల తరహాలో.. అవగాహన కల్పిస్తున్న అధికారులు ఎక్కువ రుణాలు పొందే అవకాశం.. వీది విక్రయదారులతో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో అనుకున్న రుణం కన్నా ఎక్కువ మొత్తం ఇప్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాల మాదిరిగా భవిష్యత్లో వీరి పొదుపును దృష్టిలో ఉంచుకొని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. వీధి విక్రయదారులకు అవగాహన కల్పిస్తూ సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – బాలరాజు, జిల్లా కో–ఆర్డినేటర్, మెప్మా -
తేళ్లు కుట్టని పంచమి
అరచేతిలో తేలు.. ఆనందంలో యువతి తేళ్లను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎక్కడ కుడతాయోనన్న భయంతో ఆమడదూరం పారిపోతాం. కానీ.. తేలు కుట్టని రోజంటూ ఒకటుందని మీకు తెలుసా.. అదే తేళ్ల పంచమి. ఈ రోజు తేలును పట్టుకున్నా.. ఒంటిపై, చెంపపై, చేతిపై వేసుకున్నా.. ఏకంగా నాలుకపై పెట్టుకున్నా ఏమీ చేయని అరుదైన దృశ్యాలు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా కందుకూరులో చూడవచ్చు. మంగళవారం నాగుల పంచమి నాడు కొండమవ్వగుట్టపైకి వందలాది మంది తరలివెళ్లి తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై రాళ్ల కింద, చెట్ల పొదల్లో ఉన్న తేళ్లను చిన్నా, పెద్ద తేడా లేకుండా పట్టుకొని సందడి చేశారు. తేళ్ల పంచమి జరుపుకోవడంతో తేళ్ల బారి నుంచి రక్షించుకోవచ్చని వారి నమ్ముతారు. తేళ్ల పంచమి జాతరకు వేలాది మంది తరలిరావడంతో గుర్మిట్కల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – నారాయణపేట -
అసలేం జరుగుతోంది!
కలెక్టరేట్లో ఆగని చోరీల పర్వం ●ఫిర్యాదు చేశాం మా కార్యాలయంలో ఇటీవల రెండు బ్యాటరీలు, ఒక ఇన్వర్టర్, కొన్ని ట్యాబ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాం. సీసీ పుటేజీ కేవలం ఐదు రోజుల వరకే ఉంటుందట. ఆ విషయం మాకు తెలియదు. సీసీ కెమెరాలను పరిశీలిస్తే బ్యాటరీలు ఎత్తుకెళ్లిన పుటేజీ లభ్యం కాలేదు. – డాక్టర్ ఎ.శ్రీనివాసులు, డీఎంఅండ్హెచ్ఓవనపర్తి: జిల్లా సమీకృత కలెక్టరేట్లో బ్యాటరీల చోరీ పరంపర కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో బ్యాటరీల చోరీకి బాధ్యులు ఎవరనే విషయం తేలకముందే.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఇటీవల రెండు బ్యాటరీలు, ఒక ఇన్వటర్, పదికిపైగా ట్యాబ్లు చోరీకి గురయ్యాయి. నిత్యం వందలాది మంది ప్రజలు, పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది, పది మందికిపైగా సెక్యూరిటీ గార్డులు ఉండే కలెక్టరేట్లో అందరి కళ్లు గప్పి వరుస చోరీలు జరుగుతుండడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రెండు ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో బ్యాటరీల చోరీకి సంబంధించిన విషయమై అధికారుల ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అది కొలిక్కిరాలేదు. వరుసగా ట్యాబ్లు అదృశ్యమవుతున్నా దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు. సీసీ కెమెరాల నిర్వహణ లోపం కలెక్టరేట్లో అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా.. వాటి నిర్వహణపై అధికారులు సరైన దృష్టి సారించకపోవటంతోనే వరుస చోరీలు జరుగుతున్నాయి. మొదటిసారి చోరీ జరిగినప్పుడు అధికారులు అప్రమత్తమై సీసీ కెమెరాలకు మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొచ్చామని ప్రకటించారు. కానీ ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బ్యాటరీలు, ఇన్వటర్, ట్యాబ్లు సైతం ఎత్తుకెళ్లినప్పుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు పట్టుకుంటారనే నమ్మకం కలిగినా.. గంటల వ్యవధిలోనే అది కూడా నీరుగారిపోయింది. సీసీ కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉండి స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉన్న సామగ్రిని ఏర్పాటు చేసిన కారణంగా కేవలం ఐదురోజుల పుటేజీ మాత్రమే అందుబాటులో ఉంటుందని తేలటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. సీసీ కెమెరాలు ఉన్నాయిలే అనే ధైర్యంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చోరీ ఘటన అంశాన్ని నిర్లక్ష్యం చేశారు. వారి నాన్చుడుతో ఐదురోజుల గడువు పూర్తి కావటంతో ఫుటేజీ లభించలేదనే అలవాటైన సమాధానం అధికారుల నోటి నుంచి వినిపిస్తోంది. గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పించే అధికారులు కలెక్టరేట్లో వాటి నిర్వహణపై ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో చేటు చేసుకున్న బ్యాటరీలు, ఇన్వటర్, ట్యాబ్ల చోరీ విషయంపై అందిన ఫిర్యాదు మేరకు నాలుగు రోజులుగా రూరల్ పోలీసులు కార్యాలయంలోని అంటెండర్లు, ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించటం లేదని తెలుస్తోంది. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించినా కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ స్పందించలేదు. డీఎస్పీ వెంకటేశ్వర్రావును వివరణ కోరగా.. విషయం తమ వరకు రాలేదని, రూరల్ ఎస్ఐ విచారణ చేస్తున్నారని తెలిపారు. గతంలో నమోదు చేసిన కేసు విచారణలో ఉన్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖలో రెండు బ్యాటరీలు, ఒక ఇన్వర్టర్ చోరీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఏప్రిల్లో చోరీ చేసిన నిందితులు దొరకలే.. ఇంటి దొంగలా.. బయటి వ్యక్తులా తేల్చాలని డిమాండ్ ఫైళ్లు మాయమైతే పరిస్థితి ఏంటి? ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లా పాలనాపరమైన అన్ని రకాల ఫైళ్లను ఆన్లైన్లో నమోదు చేసి ఏ స్థితిలో ఉందనే విషయం అప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఈ–ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలనే నిబంధనలు జిల్లాలో అమలు కావడం లేదు. ఇలాంటి చోరీలు ఫైళ్ల విషయంలోనూ చోటు చేసుకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. -
పాఠ్యాంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి
వనపర్తి రూరల్: విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకోవాలని, అర్థం కాకపోతే వెంటనే ఉపాధ్యాయులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్సురభి సూచించారు. సోమవారం మండలంలోని కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. కడుకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి గదిలో ఉపాధ్యాయుడు గణిత పాఠ్యాంశాలను బోధిస్తుండగా అక్కడే కూర్చొని పర్యవేక్షించారు. కలెక్టర్ విద్యార్థులకు గణితం బోధించడంతో పాటు ప్రశ్నలను సంధించి వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రసవాల సంఖ్యను పెంచాలని వైద్యాధికారులకు సూచించారు. డెలివరీ, ఓపీ రిజిస్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. పెద్దగూడెంలో తిరుమల ఎరువుల దుకాణాన్ని, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎరువుల నిల్వను పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద యూరియా, ఇతర ఎరువుల నిల్వకు సంబంధించిన బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఎరువుల కృతిమ కొరత సృష్టించొద్దని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, తహసీల్దార్ రమేష్రెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బడుల బలోపేతం దిశగా..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రీప్రైమరీ (పూర్వపు ప్రాథమిక విద్య)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పిస్తున్నారు. తద్వారా అన్ని స్థాయిల్లో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు అలవాటు పడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం పూర్వపు ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 90 ప్రీ ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో 4–5 ఏళ్ల పిల్లలను చేర్చుకోవాలని సూచించింది. ఇద్దరు చొప్పున నియామకం.. ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఇద్దరు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఒక టీచర్ ఇంటర్మీడియట్తోపాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్లో అర్హులై ఉండాలి. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించాల్సి ఉంది. ఆమెకు కనీసం 7వ తరగతి అర్హత ఉండి స్థానికులై ఉండాలి. వీరిని జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఎస్సీఆర్టీ జాతీయ స్థాయిలో అమలుపరుస్తున్న సిలబస్ను బోధించాల్సి ఉంటుంది. ప్రైమరీ పాఠశాలల్లో.. నూతనంగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయించనున్నారు. అనంతరం అందుబాటులో ఉండే నిధుల ఆధారంగా కొత్త గదులను నిర్మించనున్నారు. వీటిలో వసతుల కల్పన కోసం ఒక్కో బడికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు బొమ్మలు, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బేంచీలు, బోర్డులు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలి. వీటితోపా టు అన్ని పాఠశాలల మాదిరిగానే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి విద్యార్థులకు అందిస్తారు. ఏయే పాఠశాలల్లో అంటే.. ఎంపీపీఎస్ ఉప్పరిపల్లి, గొల్లపల్లి, బొల్లారం, రాజనగరం, అంజనగిరి, కన్నాయిపల్లి, నాటవెల్లి, పాతపల్లి, మల్కిమియాన్పల్లి, కొత్తపేట, పామిరెడ్డిపల్లి, కేతిపల్లి, నగర్లబండతండా, రామంపేట, అమరచిత, రామకృష్ణాపూర్లో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు ఇలా.. జిల్లా పాఠశాలలు మహబూబ్నగర్ 25 జోగుళాంబ గద్వాల 18 నారాయణపేట 10 నాగర్కర్నూల్ 20 వనపర్తి 17 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న 90 పాఠశాలలు వసతుల కల్పనకు రూ.1.50 లక్షల చొప్పున మంజూరు ఈసారి నుంచే ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అనుమతి జాతీయ స్థాయి సిలబస్ బోధనకు చర్యలు అడ్మిషన్లు తీసుకుంటాం.. మహబూబ్నగర్ జిల్లాలో 26 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలల్లోనే ఒక గదిలో ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభిస్తాం. ఇందుకోసం ఒక్కో పాఠశాలలో వసతుల కల్పన కోసం రూ.1.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకుంటాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ -
బీజేపీలో రగడ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2019 నుంచీ కోల్డ్వార్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆమెకు పరాజయం ఎదురైంది. అనంతరం రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2019 ఏప్రిల్లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెతోపాటు శాంతికుమార్ టికెట్ ఆశించారు. బీజేపీని గెలిపించాలని పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. పోటీగా డీకే అరుణ వర్గం కూడా ఆమె ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇలా అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇక 2024 ఎంపీ ఎన్నికల్లో సైతం ఇద్దరూ టికెట్ ఆశించారు. బీజేపీ అధిష్టానం డీకే అరుణ వైపు మొగ్గు చూపగా.. ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఇలా రెండు పర్యాయాలు శాంతికుమార్కు టికెట్ వచ్చినట్లే వచ్చి చివరలో చేజారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో జరిగిన పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు శాంతికుమార్ కుట్ర చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి పనిచేయకుండా రాజీనామా చేసిన వారిని ఆయన సమావేశానికి తీసుకొచ్చారని.. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. తాము ఎవరి వర్గం కాదని.. పార్టీకి రాజీనామా చేసిన వారు సమావేశానికి రావడంతో ప్రశ్నించినట్లు కొందరు చెబుతున్నారు. ఇదే క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట, మక్తల్, గద్వాలలో డీకే అరుణ తన కుటుంబ సభ్యుల కోసం బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని.. ఆమె అవకాశవాద రాజకీయ పోకడలతో విసిగి ఇద్దరు, ముగ్గురు ముఖ్య నేతలు పార్టీని వీడారని ఆరోపిస్తున్నారు. పాలమూరులో బీజేపీ బలోపేతానికి శాంతికుమార్ ఎంతో కష్టపడ్డారని.. ఆయనకు రెండు సార్లు ఎంపీ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిందని.. అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన సమక్షంలో జరిగిన ఈ ఘటనను ఖండించకపోవడం.. తన ప్రసంగంలో శాంతికుమార్ పేరును ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్లో బీజేపీ ఇటీవల నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. రెండు వర్గాలుగా విడిపోయిన ఎంపీ డీకే అరుణ, శాంతికుమార్ అనుచరులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఎదుటే బాహాబాహీకి దిగారు. శాంతికుమార్ను వేదికపై రాకుండా డీకే వర్గం యత్నించడంతోపాటు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా శాంతికుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆయన అనుచరులు నినదించారు. ఈ క్రమంలో పలువురు నాయకులు కలుగుజేసుకుని గొడవ సద్దుమణిగించారు. ఆ తర్వాత డీకే అరుణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ఓడించేందుకు పనిచేశారని.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పరోక్షంగా శాంతికుమార్ను ప్రస్తావిస్తూ రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు. ఈ పరిణామాలతో శాంతికుమార్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. అరుణ శాంతికుమార్ బీసీ సంఘాల ఆగ్రహం..బీజేపీలో తాజా పరిణామాల క్రమంలో బీసీ వాదం తెరపైకి వచ్చింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన శాంతికుమార్ను డీకే అరుణ అవమానించారని.. ఇది తగదంటూ పలు సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. లేకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, బీసీ మేధావుల సంఘం, మున్నూరు కాపు సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. శ్రేణుల్లో భిన్న స్వరాలు.. గో బ్యాక్ నినాదాలు.. మాటల తూటాలు సీనియర్ల మండిపాటు.. పార్టీలో లోటుపాట్లు, నేతల మధ్య విభేదాలపై అంతర్గత వేదికలపైనే చర్చించుకోవడం.. సమస్యలను పరిష్కరించుకోవడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత రాంచందర్రావు తొలిసారి చేపట్టిన జిల్లా పర్యటనలో నేతల మధ్య విభేదాలు బహిరంగ సమావేశంలో రచ్చకెక్కడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని.. ఇది మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారు. ఆదిలోనే కట్టడి చేయాలని.. లేకుంటే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని.. పార్టీ అధిష్టానం దృష్టిసారించి సమస్య సద్దుమణిగేలా చూడాలని కోరుతున్నారు. నేతల మధ్య రచ్చకెక్కిన అంతర్గత పోరు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలోనే బహిర్గతం చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్? ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం ‘స్థానిక’ ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన -
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
పాన్గల్: నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. సోమవారం మండలంలోని కొత్తపేట వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రిని నూతనంగా ఎన్నికై న బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అక్కల తిలకేశ్వర్గౌడ్ కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని నిరంజన్రెడ్డి అన్నారు. అనంతరం మాజీ మంత్రి తిలకేశ్వర్గౌడ్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేష్గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కనులపండువగా గోదారంగనాథుడి రథోత్సవం వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని గోదాదేవి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం రథాంగ హోమం, రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు గోదాదేవి, రంగనాథస్వామి రథోత్సవం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పర్యవేక్షణలో వేద పండితులు ఉత్సవ మూర్తులైన గోదాదేవి, రంగనాథుడికి పట్టువస్రాలు, ఆభరణాలతో అలంకరించి, వేద మంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో గోదారంగనాథుని రథంపైకి తీసుకొచ్చారు. భక్తులు రథానికి పూజలు నిర్వహించి ఆలయం నుంచి గోవింద నామస్మరనతో రథాన్ని ముందుకు లాగారు. తిరిగి మళ్లీ పూజలు నిర్వహించి రథాన్ని రథశాలకు చేర్చారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం బిజినేపల్లి: మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవోదయ వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నవోదయ విద్యాలయం లేదా ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు. కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు అవకాశం కందనూలు: జిల్లాలోని 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేశ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో సీట్ల ఖాళీలు ఉన్నాయని.. ఆసక్తిగల విద్యార్థినులు ఈ నెల 30వ తేదీలోగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కేజీబీవీల ప్రత్యేకాధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
భూ సమస్యలు పరిష్కరిస్తాం
రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పూర్తిచేస్తాం వనపర్తి: రైతులు తమ భూ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేలా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆగష్టు 15లోగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. భూ భారతి చట్టం అమలు, జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ ఫిర్యాదుల పరిష్కారంపై రెవెన్యూ అదనపు కలెక్టర్తో ‘సాక్షి’ చర్చించగా పలు విషయాలు వెల్లడించారు. ప్రశ్న: ధరణితో పోలిస్తే భూ భారతి చట్టం రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తోంది. అదనపు కలెక్టర్: ధరణిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది కాదు. నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో రైతులు ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. భూ భారతి చట్టంతో ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో మునుపటిలా కోర్టులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రశ్న: భూ భారతి చట్టంపై కొందరు తహసీల్దార్లు పూర్తిస్థాయిలో అవగాహన పొందలేదనే ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితి ఏమిటి? అదనపు కలెక్టర్: భూ భారతి చట్టంపై ఇప్పటికే పలుమార్లు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. కొందరితో సమస్యలు ఉన్నాయి. మెల్లిగా దారిలోకి వస్తున్నారు. ఎప్పటికప్పుడు వారికి సలహాలు, సూచనలిస్తూ దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ప్రశ్న: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ప్రస్తుతం వాటి పురోగతి ఎలా ఉంది? అదనపు కలెక్టర్: జూన్ మొదటి వారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జిల్లావ్యాప్తంగా 7,648 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5 వేల పైచిలుకు దరఖాస్తుల పరిష్కారానికి నోటీసులు జారీ, అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ పూర్తిచేశాం. సుమారు 920 దరఖాస్తుల పరిష్కారానికి అధికారిక ఆమోదం ఇచ్చాం. ఇప్పటి వరకు కేవలం 101 దరఖాస్తులు మాత్రమే తిరస్కరించాం. ప్రశ్న: ప్రభుత్వ భూమిని ఏళ్లుగా సాగు చేస్తూ రికార్డులేని వారికి హక్కులు కల్పిస్తారా? అదనపు కలెక్టర్: ఈ అంశంపై జిల్లాలో కొన్ని దరఖాస్తులు వచ్చాయి. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న పేదలకు హక్కు కల్పిస్తాం. అసైన్డ్ కమిటీల నియామకం తర్వాత వారికి కమిటీ సిఫారస్ మేరకు రికార్డు ప్రకారం హక్కు కల్పిస్తాం. ప్రశ్న: అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ, శిఖం భూములు కాపాడేందుకు చట్టంలో ఎలాంటి వెసులుబాటు ఉంది? అదనపు కలెక్టర్: ప్రభుత్వ భూమి, చెరువులు, కుంటలు కబ్జా చేసినట్లు అధికారుల దృష్టికి వస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇటీవల ఏదుల శివారులో 20 ఎకరాలు, పెబ్బేరులో శిఖం భూమి రెండు ఎకరాలు కబ్జా నుంచి విడిపించాం. ఇలాంటి ఘటనలు ఏమైనా ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకురావాలి. ప్రశ్న: రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం ఆగస్టు 15లోగా వందశాతం పరిష్కారం సాధ్యమేనా? అదనపు కలెక్టర్: రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారంలో ప్రస్తుతం రాష్ట్రంలోనే జిల్లా టాప్ టెన్లో ఉంది. సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తాం. సిబ్బంది సహకరిస్తే మరింత పురోగతి పెంచుతాం. ప్రశ్న: అసైన్డ్ పట్టా పొందిన భూమిని వ్యక్తిగత అవసరాలకు విక్రయించుకుంటే కొన్నవారికి హక్కులు వర్తిస్తాయా? రికార్డులో పేరు మార్చే అవకాశం ఉందా? అదనపు కలెక్టర్: కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిలో కాస్తులో ఉంటూ.. పేద కుటుంబానికి చెందిన వారై ఉండాలి. అప్పుడు అసైన్డ్ కమిటీ సిఫారస్ మేరకు రికార్డులో కొత్తవారి పేరు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. కోర్టు కేసులు, సాదా బైనామాల అమలుకు కోర్టు అనుమతి తప్పనిసరి ‘భూ భారతిపై తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించాం ‘సాక్షి’తో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ప్రశ్న: ఎన్నిరకాల భూ సమస్యలపై దరఖాస్తులు అందాయి? అదనపు కలెక్టర్: సక్సెషన్, మ్యుటేషన్, డీఎస్ పెండింగ్, మిస్సింగ్ సర్వేనంబర్లు, మిస్సింగ్ ల్యాండ్, సాదాబైనామా అమలు, అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్కు దరఖాస్తులు వచ్చాయి. కోర్టు పరిధిలో ఉన్న వాటిని పెండింగ్లో ఉంచి మిగతా దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభించాం. -
ఆరు హామీల అమలు ఏమైంది..? : సీపీఎం
అమరచింత: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు ప్రశ్నించారు. మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో కొనసాగుతున్న పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల రెండోరోజు ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా.. మహిళలకు నెలకు రూ.2,500 నగదు, చేయూత పింఛన్ రెట్టింపు నీటి మూటలుగానే మిగిలాయని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల హామీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పురపాలికల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధాని మోదీతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కేంద్రం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయని.. కొత్త నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అమరచింత దుంపాయికుంటలో ప్లాట్ల హద్దులు చూపించాలంటూ మూడేళ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తున్నామని, సమస్యను మంత్రికి విన్నవించినా పెండింగ్లో ఉంచడం సరైంది కాదన్నారు. జిల్లాలో అంసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు మహమూద్, మండల కార్యదర్శి జీఎస్ గోపి, ఆత్మకూర్, మదనాపురం మండల కార్యదర్శులు రాజు, వెంకట్రాములు, జిల్లా నాయకులు వెంకటేష్, ఆర్ఎన్ రమేష్, అజయ్, అనంతమ్మ, రాఘవేంద్ర, నర్సింహ, శంకర్, బుచ్చన్న, రాఘవ, కాకి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన జీపీఓ రాత పరీక్ష
వనపర్తి: గ్రామపాలన అధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ల రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి హాజరు వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపాలన అధికారుల పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష ఉదయం సెషన్తో పాటు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగింది. అభ్యర్థులను గంట ముందుగానే కేంద్రంలోకి అనుమతించారు. జీపీఓ పరీక్షకు 62 మంది అభ్యర్థులకుగాను 55 మంది హాజరుకాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని, లైసెన్స్డ్ సర్వేయర్లకు పరీక్షకు 112 మంది అభ్యర్థులకు గా నూ 100 మంది హాజరుకాగా.. 12 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, ఏడీ సర్వే బాలకృష్ణ, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
జాబ్ క్యాలెండర్ జాడేది?
వనపర్తిటౌన్: వేలాది మంది నిరుద్యోగులు పట్టాలు చేతబట్టుకొని ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారని, ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ప్రశ్నించారు. ఆదివారం గద్వాల నుంచి జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు మర్రికుంట వద్ద స్వాగతం పలకగా భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో పట్టణంలోని ఛత్రపతి శివాజీ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ భారీ గజమాలతో స్వాగతం పలికిన అనంతరం ర్యాలీగా లక్ష్మీకృష్ణ గార్డెన్స్కు చేరుకున్నారు. అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల అవినీతి రహిత పాలన, వికసిత్ భారత్ లక్ష్యాన్ని గడపగడపకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. పేదలు ఆర్థికంగా ఎదిగితేనే ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందని, మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో పేదలు, మహిళలు, యువత, రైతులకు అండగా నిలిచేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. కరోనా సమయం నుంచి నేటి వరకు 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారని, ప్రతి రైతుకు ఏటా పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6 వేలు అందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు చేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ పి.రాములు, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, మాజీ శాసనసభ్యుడు డా.రావుల రవీంద్రనాథ్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు సబిరెడ్డి వెంకటరెడ్డి, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, మున్నూరు రవీందర్, మెంటేపల్లి రాములు, గౌని హేమారెడ్డి, బి.శ్రీశైలం, జ్యోతి రమణ, చిత్తారి ప్రభాకర్, కదిరె మధు, అలివేలమ్మ, రామన్గౌడ్, సుమిత్రమ్మ, కుమారస్వామి, వెంకటేశ్వరరెడ్డి, బాశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు -
కాంగ్రెస్తోనే సగరులకు గుర్తింపు
వనపర్తిటౌన్: కాంగ్రెస్ పాలనలోనే నియోజకవర్గంలోని సగరులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన సగరుల జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సన్మాన సభకు ఆయనతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి హాజరై ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, కార్యదర్శులను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా గోవర్ధనసాగర్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీర్ల విజయచందర్కు సముచిత స్థానం కల్పించి కాంగ్రెస్ గౌరవిస్తున్నటు చెప్పారు. నియోజకవర్గ సగరుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని, కమ్యూనిటీ హాల్తో పాటు వనపర్తి నల్లచెరువు కట్టపై సగరుడి విగ్రహావిష్కరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, సగర సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యం సాగర్, జిల్లా ప్రధానకార్యదర్శి గొబ్బూరి చంద్రాయుడు సాగర్, జిల్లా కోశాధికారి గుంటి సత్యం సాగర్, రాష్ట్ర సగర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ సాగర్, రాష్ట్ర సంఘం ముఖ్య సలహాదారు ఆంజనేయులు సాగర్, యాదాద్రి సగర సంఘం అధ్యక్షుడు కేపీ రాములు సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక సత్యంసాగర్, యాదాద్రి సంఘం ఉపాధ్యక్షుడు పల్లె సత్యనారాయణ, రాష్ట్ర సగర సంఘం సంయుక్త కార్యదర్శి విష్ణు సాగర్ పాల్గొన్నారు. -
కనులపండువగా విగ్రహ ప్రతిష్టాపనోత్సవం
కొత్తకోట రూరల్: పట్టణ సమీపంలోని సంకల్పసిద్ధి సాయినాథ ఆలయంలో ఆదివారం ఓంకారేశ్వర శివలింగం, శ్రీ గురు దత్తాత్రేయస్వామి పాలరాతి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం కనులపండువగా సాగింది. పూజా కార్యక్రమాలను రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వేద పండితుడు జ్యోషి గోపాలశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం నిర్వహించింది. వివిధ ప్రాంతాల భక్తులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షిర్డీసాయి ఆలయంలో భక్తులు ఓంకారేశ్వర శివలింగం, శ్రీ గురు దత్తాత్రేయస్వామిని దర్శించుకునే అవకాశం ఆలయ నిర్వాహకులు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో ఆలయం ఉందని, భక్తులు ప్రశాంతత పొందవచ్చునని తెలిపారు. ఆలయ నిర్వాహకులు భక్షి శ్రీధర్రావు, కమిటీ సభ్యులు సాక చెన్నయ్య, నాగరాల శ్రీనివాస్రెడ్డి, అశ్విని కృష్ణయ్య, రాచాల కృష్ణయ్య, హరగోపాల్, మూలమళ్ల బాలకృష్ణారెడ్డి, మాధవరెడ్డి, మేస్త్రి శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పట్టణవాసులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
కందనూలులో కలకలం
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతతకు గురైన విద్యార్థినులు 64 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆదివారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే పాఠశాలలో వంట కోసం వినియోగించిన సరుకులు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పాలు, పెరుగు పదార్థాలను వినియోగించడం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలకు సంబంధించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ బయట నుంచి పాలు, పెరుగు డబ్బాలను కొనుగోలు చేసి విద్యార్థినులకు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నిర్ణీత కాలం పాటు, రెండు, మూడు రోజుల్లోపే వినియోగించాల్సిన పాలు, పెరుగు డబ్బాలను ఎక్స్పైరీ తేదీ దాటినా వినియోగించడంతోపాటు ప్రధానంగా పెరుగన్నం తిన్న విద్యార్థినులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. భయంతో ఇంటిదారి.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులతోపాటు మరో 360 మంది ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్తో 64 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరో 30 మంది వరకు భయాందోళనకు గురై జనరల్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చూయించుకున్నారు. విద్యార్థినులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కొంతమంది తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. చాలామంది విద్యార్థులు భయాందోళనలో ఉన్న కారణంగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. అమలుకాని మెనూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడా డైట్ మెనూ సరిగా అమలుకావడం లేదు. ఉదయం పూట టిఫిన్ కింద పూరి, ఇడ్లి, చపాతి, దోశ ఇవ్వాల్సి ఉండగా.. చాలాసార్లు లెమన్ రైస్, కిచిడీ, పులిహోరతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మిక్స్డ్ వెజ్ బిర్యానీ, రెండేసి కూరలతో వడ్డించాల్సి ఉండగా.. పప్పులు, సాంబారుతో నెట్టుకొస్తున్నారు. వారంలో చికెన్, గుడ్డు, స్నాక్స్ విషయంలో కోత విధిస్తున్నారు. వంట గదుల్లో శుచి, శుభ్రత పాటించకపోవడం, శుభ్రమైన నీటిని వినియోగించకపోవడంతో తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురుకుల హాస్టళ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థతత కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక గడువు తీరిన పాలు, పెరుగు వినియోగంతోనే ఘటన ఉడకని భోజనం, నాసిరకం సరుకుల వినియోగం జిల్లాలోని అన్నిచోట్ల ఇష్టారాజ్యంగా క్యాటరింగ్ నిర్వహణ? -
రామన్పాడులో నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 200 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 679 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 30 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ఆధార్, బయోమెట్రిక్ నవీకరణ తప్పనిసరి వనపర్తి విద్యావిభాగం: యూడైస్లో ఆధార్, అపార్ వివరాల నమోదు తప్పనిసరి కావడంతో ఇంటర్బోర్డు కార్యదర్శి ఆదేశానుసారం జిల్లాల్లోని జూనియర్ కళాశాలల విద్యార్థుల ఆధార్ నమోదు, బయోమెట్రిక్ నవీకరణ ప్రక్రియ ప్రారంభమైందని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కళాశాలల్లోనే ఈ ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారని చెప్పారు. విద్యార్థుల ఆధార్ నమోదు, బయోమెట్రిక్ నవీకరణకు SNRE&data Pvt Ltd ఏజెన్సీ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు వస్తుందని, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ప్రతి విద్యార్థి వివరాలను నవీకరించాలని సూచించారు. నిరుద్యోగ సమస్యలపై నిరంతర పోరాటం అమరచింత: నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి డీవైఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బనిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ గేమ్ల పేరిట తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి యువతరం చేరుకోవడం శోచనీయమన్నారు. కళాశాల, పాఠశాలల వద్ద జరిగే మత్తు పదార్థాల ముఠాలను అడ్డుకోనేందుకు డీవైఎఫ్ఐ ప్రణాళికతో ముందుకు సాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, చంటి, తిరుపతి, అశోక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. 30న కొలువుదీరనున్న మార్కెట్ పాలకవర్గం ● హాజరుకానున్న మంత్రులు ఆత్మకూర్: స్థానిక వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ఈ నెల 30న కొలువుదీరనుంది. చైర్మన్గా ఎండీ రహ్మతుల్లాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీసీ, ఎఫ్ఏసీ కార్యదర్శి సురేంద్రకుమార్ ఇదివరకే ఉత్తర్వులు వెలువరించగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు అజారుద్దీన్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ సీతమ్మ తదితరులు హాజరుకానున్నట్లు రహ్మతుల్లా తెలిపారు. మొదట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట మధ్యాహ్నం 12 గంటలకు బాబు జగ్జీవన్రాం విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని వివరించారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులు, మార్కెట్ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎరువుల నిల్వలపై ఆరోపణలు నమ్మొద్దు
మదనాపురం: యూరియా, డీఏపీ నిల్వలపై ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదని, అబద్ధపు ఆరోపణలు నమ్మొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కొత్తపల్లి వద్ద కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం మోటార్లను ఆయన ప్రారంభించి సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, రైతుబిడ్డ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందుకే రైతులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. రైతుల అభ్యున్నతిని దృష్టికి ఉంచుకొని ప్రభుత్వం పంట రుణమాఫీ, పెట్టుబడి సాయం, వరికి మద్దతు ధర, బోనస్ అందజేస్తోందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని.. గత పాలకుల నిర్లక్ష్యంతోనే నియోజకవర్గంలోని అన్ని ఎత్తిపోతల పథకాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాకే లిఫ్ట్లకు పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు పల్లెపాగ ప్రశాంత్, కతలన్న యాదవ్, మండల సమన్వయ కమిటీ అధ్యక్షుడు చుక్కా మహేష్, కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం చైర్మన్ రాజవర్ధన్రెడ్డి, నాయకులు హనుమాన్రావు, టీసీ నాగన్న యాదవ్, శ్రీనివాసరెడ్డి, వడ్డె రాములు, వెంకట్ నారాయణ, వడ్డె కృష్ణ, సాయిబాబా, మహదేవన్గౌడ్, శ్రావణ్కుమార్, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం : ఎస్పీ
పాన్గల్: మండలంలోని రేమద్దులకు చెందిన కానిస్టేబుల్ తలారి శివకుమార్ (43) కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. రేవల్లి పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న తలారి శివకుమార్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. శుక్రవారం ఎస్పీతో పాటు డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ కృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఎస్ఐలు గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంత్యక్రియల ఖర్చులకు రూ.30 వేలు బాధిత కుటుంబానికి అందజేశారు. భార్య సుజాత, కుమార్తెలు రష్మిత, అర్పిత, కుమారుడు హిమాన్షును ఎస్పీ ఓదార్చి మాట్లాడారు. శివకుమార్ నిజాయితీగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో రేవల్లి, పాన్గల్, పెద్దమందడి ఎస్ఐలు రజిత, శ్రీనివాసులు, శివకుమార్, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు జాన్వెస్లీ రాక అమరచింత: మండల కేంద్రంలో శనివారం జరిగే సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరతున్నారని పార్టీ మండల కార్యదర్శి జీఎస్ గోపి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పోరాటం చేసే విధంగా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సీపీఎం నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొ ని విజయవంతం చేయాలని కోరారు. జూరాల కాల్వలో జమ్ము తొలగింపు వీపనగండ్ల: మండలంలోని తూంకుంట సమీపంలో ఉన్న జూరాల సాగునీటి కాల్వలో జమ్ము, సిల్ట్ తొలగింపు పనులను శుక్రవారం అధికారులు, రైతులు, కాంగ్రెస్పార్టీ నాయకులు ప్రారంభించారు. చిన్నంబావి మండలంలోని డి–36 నుంచి కొండూరు వరకు ఉన్న డి–40 వరకు 23 కిలోమీటర్ల కాల్వలోని జమ్ము, సిల్ట్ను తొలగించనున్నట్లు జూరాల ఇరిగేషన్ జూనియర్ ఇంజినీర్ నాగేంద్రం తెలిపారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో అత్యవసరంగా పనులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు కొండూరు గోపాల్, తూంకుంట గ్రామ నాయకులు పెద్ద రాంబాబు, తిరుపతయ్య, రాజశేఖర్ తెలిపారు. ‘పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి’ పాన్గల్: కొత్త కార్యవర్గాలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికై న వీరసాగర్ శుక్రవారం నాయకులతో కలిసి మాజీ మంత్రిని ఆయన స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకుసాగాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్నాయక్, చిట్యాల రాము, నాయకులు సుధాకర్యాదవ్, రాజేశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మిద్దె కృష్ణ, రాంబాబునాయక్, ఎల్లస్వామి, మిద్దెరాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయానికి బస్సు సౌకర్యం వనపర్తిటౌన్: వనపర్తి డిపో నుంచి మంత్రాలయానికి ప్రతిరోజు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.30కి చేరుకుంటుందని.. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తిరిగి వనపర్తికి బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసు కోవాలని పేర్కొన్నారు. -
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం గ్రామ పరిపాలన అధికారులు, సర్వేయర్ల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. 49 మంది వీఆర్వోలు, వీఆర్ఏలు, 112 మంది సర్వేయర్లు పరీక్షలకు హాజరు కానున్నారని వివరించారు. గ్రామ పరిపాలన అధికారుల పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. సర్వేయర్ల పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతుందన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి అనుమతి లేదని.. ఉదయం 9.30 నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. 10 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని.. టీజీపీఎస్సీ పోటీ పరీక్షల నిబంధనలు అమలవుతాయని వివరించారు. పోలీస్శాఖ ద్వారా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీవెంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఏడీ సర్వే బాలకృష్ణ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, తహసీల్దార్ రమేష్రెడ్డి, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి మృతి.. వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన
వనపర్తి: వైద్యులు చేసిన శస్త్రిచికత్స వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడంటూ బంధువులు శుక్రవారం పెబ్బేరులోని ఓ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెంచికలపాడుకు చెందిన రాజు (39) మెడపై ఉన్న కణతిని తొలగించాలంటూ ఈ నెల 19న పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలోని ఓ వైద్యుడు చిన్నపాటి సర్జరీ చేసి కణతి తొలగించి అదే రోజు ఇంటికి పంపించారు. ఇన్ఫెక్షన్ కావడంతో మరునాడు వైద్యులను సంప్రదించగా.. మందులు వాడాలని సలహా ఇచ్చారు. గురువారం పొలంలో పని చేస్తూ రాజు స్పృహ కోల్పోయి పడిపోయాడు. చుట్టుపక్కల పొలాల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో వారు స్పందించి వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని మహబూబ్నగర్కు సిఫారస్ చేశారు. అక్కడి వైద్యులు రక్తనాళం తెగి రక్తస్రావం అవుతుందని హైదరాబాద్లోని నీమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. శుక్రవారం నీమ్స్కు వెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, పలువురు ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేసి వైద్యులకు రక్షణ కల్పించారు. రాజుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి కిక్బాక్సింగ్కు జిల్లా క్రీడాకారులు
వనపర్తిటౌన్: హైదరాబాద్ లాల్ బహద్దూర్ ఇండోర్ స్టేడియంలో అస్మిత రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 పోటీలు రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శని, ఆదివారం జరగనున్నట్లు డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు. జిల్లా తరుఫున ఎంపికై న క్రీడాకారులను శుక్రవారం ఆయన అభినందించి మాట్లాడారు. పట్టణానికి చెందిన గుజూరియో కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమి విద్యార్థినులు ఝాన్సీ, డి.అనన్య, ఆరాధ్య 38, డి.లౌక్య, హరిణి, ప్రియ, గోమతి పోటీ పడనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ సురేందర్రెడ్డి, రాష్ట్ర కిక్బాక్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కరాటే శేఖర్, గుజూరియో కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీ సీనియర్ విద్యార్థులు ఎం.శివకృష్ణ యాదవ్, ఎస్.వరుణ్కుమార్, చంద్రకాంత్, చక్రవర్తి, ఎం.రేణుక తదితరులు పాల్గొన్నారు. -
కొరవడిన పర్యవేక్షణ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హతకు మించిన వైద్యం ●విచారణ చేపడతాం.. పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెలకొన్న వివాదంపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ ఆస్పత్రిలో సర్జరీ చేసే వైద్యులు ఎందరు పని చేస్తున్నారు.. ఎవరు సర్జరీ చేశారు.. విద్యార్హత ఏమిటని విచారణ చేస్తాం. శుక్రవారం కలెక్టర్ వెంట పర్యటనలో ఉండటంతో పెబ్బేరుకు వెళ్లలేకపోయాం. – డా. శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి రాజీకి రూ.లక్షలు..? పోలీసులు, స్థానిక పెద్దలు పలువురు సదరు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి రూ.మూడు లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చడంతో ఆందోళన సద్దుమణిగినట్లు స్థానికంగా చర్చ వినిపిస్తోంది. మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపడుతున్న సమయంలో ఆస్పత్రిలోని ఎవరినీ రానివ్వకుండా పోలీసులు పహారా కాస్తూ యాజమాన్యానికి రక్షణ కల్పించారు. అనంతరం ఆస్పత్రిలో చాలా సమయం చర్చలు జరిపి కాసులకు రాజీ కుదిర్చినట్లు ప్రచారం సాగుతోంది. వనపర్తి: జిల్లాలో ఆర్ఎంపీలు, ఎంబీబీఎస్ వైద్యులు అర్హతకు మించి వైద్యం చేస్తూ.. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. శుక్రవారం పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడు అర్హతకు మించిన వైద్యం చేయడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. వైద్యశాఖ అధికారులు కనీసం పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించకపోవడం శోచనీయం. జిల్లావ్యాప్తంగా ఆర్ఎంపీలు సైతం ప్రథమ చికిత్సకు బదులు రాజకీయ నేతల అండదండలతో యథేచ్ఛగా నర్సింగ్ హోంలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు విస్త్రృతంగా దాడులు చేసి పలు కేంద్రాలను సీజ్ చేశారు. స్థానిక అధికార పార్టీ నేతలు అధికారులపై ఎదురుదాడికి దిగి ఎలాంటి చర్యలు లేకుండానే ఆయా కేంద్రాలు పునః ప్రారంభించుకునేలా చేయడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వైద్యులు అక్రమార్జన కోసం ఇష్టానుసారంగా అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యం.. వైద్యవృత్తి ఎంతో పవిత్రమైంది. కాసుల కోసం అర్హతకు మించిన వైద్యం చేసిన ఘటన తాజాగా పెబ్బేరులో వెలుగు చూసింది. ఐదురోజుల కిందట ఓ వ్యక్తి మెడభాగంలో ఏర్పడిన కణతిని ఎంబీబీఎస్ వైద్యుడు తొలగించారు. ఈ శస్త్రచికిత్సలో అతడి మెదడుకు రక్తం సరఫరా అయ్యే నాళం కట్ కావడంతో మెదడులో రక్తం పేరుకుపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి.. అటు నుంచి హైదరాబాద్లోని పెద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సదరు వైద్యుడు సరైన వైద్యం అందించని కారణంగానే మృతి చెందాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగగా పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను సద్దుమణిగించినట్లు సమాచారం. కాసుల కోసం ప్రాణాలతో చెలగాటం? పెబ్బేరులో కణతి తొలగించిన ఎంబీబీఎస్ వైద్యుడు.. ఐదురోజుల తర్వాత వ్యక్తి మృతి ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
వనపర్తి రూరల్: రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు సరఫరా చేయాలని.. ప్రతి డీలర్ సరిపడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్ సూచించారు. శుక్రవారం నాగవరం శివారులోని రైతువేదికలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతుసేవ కేంద్రాలు, ఎరువుల డీలర్ల శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి దుకాణంలో 20 టన్నుల కన్నా ఎక్కువ ఎరువులు నిల్వ చేయాలని.. వివరాలను దుకాణంలో రైతులకు కనబడేలా ప్రదర్శించాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా ఎరువుల నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు ప్రభాకర్రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
● పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు త్వరగా పేమెంట్ ఆర్డర్ అందజేతకు చర్యలు ● రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ ● ప్రిన్సిపల్, అకౌంటెంట్ జనరల్, కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ ● పెన్షన్, జీపీఎఫ్, అకౌంట్ సమస్యలపై వర్క్షాప్ విజయవంతం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కేసుల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అకౌంటెంట్ జనరల్ (ఏఅండ్ఈ), కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్లో కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు, జీపీఎఫ్ అందజేతలో ఏమైనా సందేశాలు ఉంటే అదాలత్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ పత్రాలు, సాధారణ భవిష్య నిధి పత్రాలు అందిన వెంటనే వాటిని పరిశీలించి మంజూరు ఉత్తర్వులు అందిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ ఉత్తర్వులు అందేలా ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలన్నారు. ఉద్యోగ బాధ్యతలతోపాటు ఆర్థిక నిర్వహణ కూడా ఇది ముఖ్యమన్నారు. అలాగే పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి పెన్షన్ పత్రాలు, జీపీఎఫ్ ఫైనల్ పత్రాలు సత్వరమే ఏజీకి పంపించాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న పెన్షన్ సమస్యలను అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా.. పెన్షన్ అదాలత్లో 116 ప్రభుత్వ శాఖల అధికారులు, 50 మంది పెన్షనర్లు, 28 మంది చందాదారులు, పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేత.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్తో కలిసి కలెక్టర్ 20 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 16 జీపీఎఫ్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్లను రిటైర్డ్ ఉద్యోగులకు అందజేశారు. 10 పెండింగ్ పెన్షన్ కేసులను పరిష్కరించారు. ఉదయం పెన్షన్ అదాలత్ తర్వాత మధ్యాహ్నం పెన్షన్, జీపీఎఫ్, అకౌంట్ సంబంధిత సమస్యలపై నిర్వహించిన వర్క్షాప్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పెన్షన్ మంజూరు అధికారులు, పెన్షన్ జారీ, పంపిణీ అధికారులకు మార్గదర్శకాలు వివరించి అవగాహన కల్పించారు. అకౌంట్ సంబంధిత సమస్యలు చేసే తప్పుల గురించి వివరించారు. సమావేశంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్– వీఎల్సీ) నరేష్కుమార్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఎన్ టైటిల్మెంట్స్) అభయ్ అనిల్ సోనార్కర్, వనపర్తి, గద్వాల అదనపు కలెక్టర్లు యాదయ్య, నర్సింగ్రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మహిళా చట్టాలపై అవగాహన
వనపర్తిటౌన్: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా మహిళా సమైఖ్య సంఘం కార్యాలయంలో మండల మహిళా సమైఖ్య అధ్యక్షులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అన్నివర్గాల మహిళలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసేవలు అందిస్తామన్నారు. ఉచిత న్యాయ సలహాలకు టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. గృహహింస, పోక్సో చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, జి ల్లా మహిళా సమైఖ్య అధ్యక్షురాలు స్వరూప, జిల్లా మేనేజర్లు ఆనందం, నాగమల్లిక పాల్గొన్నారు. -
పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం
కొత్తకోట రూరల్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రోగాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం మండలంలోని రామనంతాపూర్లో నిర్వహించిన ఫ్రై డే – డ్రై డే కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పరిసరాల శుభ్రతపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని, పాత టైర్లు, మరేమైన పాత వస్తువులుంటే తీసివేయాలని, వాటితో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. మురుగు కాల్వలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఓ చిన్నారి డెంగీ బారినపడగా వారి ఇంటికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. పాప ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్టులు చూశారు. ఇతరులకు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ ప్రక్రియ దశల వారీగా పూర్తి చేసిన వెంటనే ఫొటోలను అప్లోడ్ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇంకా పనులు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, ప్రాజెక్టు అధికారి డా. సాయినాథ్రెడ్డి, హౌసింగ్ అధికారి విఠోభా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
వనపర్తి: బాలకార్మికులను గుర్తించి వారిని సంరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోందని.. అన్ని శాఖల సమష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దామని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎస్పీ సమావేశమై పలు సూచనలు చేశారు. హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులు లేదా సంరక్షణ గృహాలకు చేర్చి యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బాల్యం బడులకు అంకితం కావాలని, కార్మికులు, కర్షకులుగా కొనసాగరాదని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 50 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులు, సంరక్షణ స్థలాలకు చేర్చడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలలో చేర్పించామని.. మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు కనిపిస్తే హెల్ప్లైన్ నంబర్ 1098 గాని, డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు. వారం పాటు పర్యటించి బాల కార్మికులను గు ర్తించాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ఎస్ఐ రా ము, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, లేబర్ అధి కారి రఫీ, చైల్డ్ ప్రొటెక్షన్శాఖ అధికారి రవిరాజు, వైద్యశాఖ అధికారి నరేందర్ పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు వనపర్తి: భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు వివరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్ఏ లోకేష్కుమార్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో రెవెన్యూ సదస్సుల దరఖాస్తులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
కొత్తకోట: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలు, ఈడీడీ రిజిస్టర్లు, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పురపాలికలో ఫ్రై డే–డ్రై డేను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భిణుల ఏఎన్సీ నమోదు పక్కాగా ఉండాలని సూచించారు. ప్రసవం రోజులు దగ్గర పడినప్పుడు ఆశా వర్కర్లు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లు, అబార్షన్లపై దృష్టి సారించి నియంత్రించాలని సిబ్బందిని ఆదేశించారు. కొత్తకోటలో గతేడాది డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని.. ఈ ఏడాది వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల ఆవరణల్లో నీటి నిల్వ లేకుండా, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. కొత్తకోటలో బస్తీ దవాఖాన ఏర్పాటుకు భవనం చూడాలని పుర కమిషనర్, తహసీల్దార్ను ఆదేశించారు. పెట్రోల్బంక్ ఏర్పాటుకు స్థల పరిశీలన.. కొత్తకోట రూరల్: మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకుగాను కొత్తకోట–పెబ్బేరు జాతీయ రహదారి మిరాసిపల్లి వద్ద స్థలాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం పరిశీలించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ కేటాయిస్తున్నందున జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని డీఆర్డీఓ ఉమాదేవిని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఆదాయమే లక్ష్యంగా..!
వనపర్తి పురపాలికలో కొనసాగుతున్న సర్వే ●కమిషనర్ ఆదేశాల మేరకు.. పుర కమిషనర్ ఆదేశాల మేరకు ఆదాయం సమకూరే మార్గాలపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా ఇంటి కొలతలు లేని, పాత ఇంటికి తీసుకున్న కొలతల ఆధారంగా కొత్త ఇంటికి పన్ను చెల్లిస్తున్న వాటిని గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు కొలతల్లో వ్యత్యాసాలు ఉన్న ఇళ్లను గుర్తించి పురపాలికకు సుమారు రూ.4 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూర్చాం. నివాసాలపై ట్రేడ్ లైసెన్స్లు, కమర్షియల్ దుకాణాలు రెసిడెన్షియల్గా ఉన్న వాటిని గుర్తించి సరిచేస్తున్నాం. ప్రతి వార్డు నుంచి సమగ్ర వివరాలు ఇవ్వాలని వార్డు అధికారులకు సూచించాం. – డి.సాయిలు, ఇన్చార్జ్ ఆర్వో, వనపర్తి పురపాలిక -
పాలమూరులో పోకిరీలు
ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న పోక్సో కేసులు బాలికలకు అండగా.. ● చైల్డ్ హెల్ప్లైన్ 1098, ఉమెన్ హెల్ప్లైన్ 181, డయల్ 100 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ● షీటీంకు ఫిర్యాదు చేయాల్సిన నం.87126 59365, భరోసాకు ఫిర్యాదు చేయాల్సిన నం.87126 59280 ● భరోసా సెంటర్లో మైనర్లకు రక్షణతోపాటు న్యాయం అందుతుంది. ● మహిళా, శిశు సంక్షేమ శాఖలోని చిన్నారుల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) సహాయం పొందవచ్చు. ● లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం–2012 (పోక్సో) కఠిన శిక్షలు పడేలా చేస్తోంది. ● సఖి సెంటర్ ద్వారా అన్యాయానికి గురైన చిన్నారులు, అమ్మాయిలకు ప్రత్యేక వసతి, రక్షణతో,పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ● మహబూబ్నగర్ జిల్లా షీటీం విభాగానికి నెల రోజుల్లో 27 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వగా.. 25 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న బాలికలు, అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దీనికి కారకులపై కూడా పోక్సో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిలో మైనర్ అబ్బాయిలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా జులాయిగా తిరిగే కొందరు యువకులే ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు అయితే పనిగట్టుకొని పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం, వదిలే సమయానికి బైక్లపై ఉంటూ వచ్చిపోయే వారిని టీజ్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటే.. మరికొందరు సర్దుకుపోతున్నారు. ఇలాంటి వారిని అలుసుగా తీసుకొని కొ ందరు యువకులు మరింత రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2022 నుంచి 1,412 పోక్సో కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్నగర్లో 451, నాగర్కర్నూల్లో 327, గద్వాలలో 234, నారా యణపేటలో 211, వనపర్తిలో 189 కేసులున్నాయి. నిత్యం తనిఖీలు చేస్తే.. మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ, పోలీస్శాఖ ఆధ్వర్యంలోని షీటీం బృందాలు తనిఖీలు చేపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ తనిఖీలు మరింతగా పెరగాలి. ముఖ్యంగా బాలికల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం తనిఖీలు చేయడం చాలా అవసరం. వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాలకు వెళ్లి చిన్నారులు తమ బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. ఎక్కడైనా అనుమానంగా అనిపించినా.. బాలికలకు సరైన రక్షణ అందని పరిస్థితులను గుర్తించినా తగు చర్యలు తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే.. ● లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ● వేధింపులకు గురైతే ఎవరి సహాయం కోరాలి.. ఎలా స్పందించాలో వివరంగా చెప్పాలి. ● ఒంటరిగా ఎక్కడికీ వెళ్దొదని, వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించాలి. ● శరీరంలోని ఏ భాగాలను ఇతరులు తాకకూడదనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ● ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముట్టొద్దు అని గట్టిగా అరవడం, అక్కడి నుంచి పారిపోవడం, ఎదురించడం వంటివి తెలియజెప్పాలి. ‘మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు కొన్నిరోజుల నుంచి పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఈ నెల 4న విద్యార్థులు షీటీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాఠశాలను పరిశీలించి జరిగిన ఘటనపై విచారణ చేయగా ఉపాధ్యాయుడు తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై రూరల్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు.’ మహమ్మదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఆందోళన కలిగిస్తున్న అఘాయిత్యాలు కీచకులుగా మారుతున్న పలువురు ఉపాధ్యాయులు పాఠశాలల్లోనూ విద్యార్థినులపై లైంగిక దాడులు నాలుగేళ్లలో 1,412 కేసులు నమోదు అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి మెరుగుపరుచుకోవాలి. సో షల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ -
అప్పుడే.. లోకల్ ఫైట్!
ఎమ్మెల్యే అనడం కన్నా.. 1300 ఓట్లతో గెలిచిన గఫ్లత్ ఎమ్మెల్యే అంటే బాగుంటుంది. అటువంటి ఎమ్మెల్యే కల్లు తాగిన కోతి లాగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్రావును విమర్శిస్తున్నాడు. సీఎం రేవంత్రెడ్డితో మెప్పు పొందాలనే ఈ విమర్శలు చేస్తున్నాడు. – దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అవినీతి చిట్టనా దగ్గర ఉంది. భారీగా ఆస్తులు సంపాదించాడు. పదేళ్లుగా నియోజకవర్గ కేంద్రాన్ని గాలి కొదిలేశాడు. – దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు అక్రమంగా తీసుకున్న అసైన్డ్ ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగించాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి పాత బస్టాండ్ వైపు నేరుగా వాహనాలు వెళ్లేందుకు మార్గం లేదు. డిజైన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి. – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ దేవాలయం భూములపై శ్వేతపత్రంవిడుదల చేయాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణ పనుల డిజైన్లో ఎలాంటి లోపాలు లేవు. పోలేపల్లి సెజ్ నుంచి నా ఖాతాకు డబ్బులు వచ్చాయని ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి. – లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ● షెడ్యూల్ విడుదలకు ముందుగానే చేరికలకు తెరలేపిన పార్టీలు ● ముఖ్య నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు ● గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాల కసరత్తు ● సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ‘హస్తం’ ముందడుగు ● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ‘కారు’ కార్యాచరణ ● పట్టు సాధించాలనే తపనతో ‘కమలం’ స్థానిక ఎన్నికల వేళ వేడెక్కినరాజకీయం -
అందుబాటులోకి రానున్న భవనాలివే..
ప్రస్తుతం వైద్య కళాశాల కొనసాగుతున్న నర్సింగ్ కళాశాల భవనం మూడేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చింది. ● యూజీ, పీజీ విద్యార్థులు 1,500 చదువుకునేలా మూడంతస్తుల వైద్య కళాశాల భవనం నిర్మాణంలో ఉంది. ఇందులో 8 డిపార్ట్మెంట్ల తరగతి గదులు, 8 ల్యాబ్లు ఉంటాయి. ● 514 మంది విద్యార్థినులు ఉండేలా హాస్టల్ భవనాన్ని ఆరు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో 225 గదులు, అదనంగా 32 గదులు నిర్మాణం చేస్తున్నారు. ● 391 మంది విద్యార్థులు ఉండేలా ఐదు అంతస్తుల పురుషుల హాస్టల్ భవనం నిర్మాణం చేశారు. ● గ్రౌండ్ఫ్లోర్లో 9,047 ఎస్ఎఫ్టీలో ఏకకాలంలో 300 మంది విద్యార్థులు భోజనం చేసేందుకు సౌకర్యంగా డైనింగ్ హాల్, కిచెన్ నిర్మాణం చేశారు. ● 78 మంది నివాసం ఉండేలా 78 గదులతో బాలికల రెసిడెన్సీ నిర్మాణం చేశారు. ● మూడంతస్తుల భవనంలో కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఎస్ఆర్లు, మెడికల్ కళాశాల అధ్యాపకులు ఉండేలా భవనం నిర్మాణం చేశారు. -
మత రాజకీయం దేశ ప్రగతికి విఘాతం
ఆత్మకూర్: మత రాజకీయాలు దేశ ప్రగతికి విఘాతమని.. భారత రాజ్యాంగంలో లౌకిక, ప్రజాస్వామ్య, సోషలిస్టు అంశాల తొలగింపు అంటూ రాజ్యాంగ పీఠికకు ఉరితాడు పేనితే మోదీ సర్కార్కు పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో సీపీఐ జిల్లా మూడో మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి పాత విద్యుత్ కార్యాలయం, గాంధీచౌరస్తా, బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను ఆర్థిక నేరగాళ్లకు దోచిపెడుతూ లూటీ చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ సవరణల పేరుతో ప్రజల మధ్య మత విధ్వేషాలకు ఆజ్యం పోస్తూ సంఘ్ పరివార్ శక్తుల ఎజెండాను పాలన రంగంలో జొప్పిస్తున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేసే కుట్ర బాధాకరమన్నారు. కమ్యూనిస్ట్లు ఎల్లప్పుడు జనం పక్షాన నిలబడి సమస్యల సాధనకు పోరాటం చేస్తారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. జనం పక్షాన పోరాడుతున్న సీపీఐకి వందేళ్లు నిండాయన్నారు. పేదల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసేందుకు గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు మహాసభలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కళావతమ్మ, శ్రీహరి, శ్రీరామ్, మోషా, అబ్రహం, నర్సింహ శెట్టి, గోపాలకృష్ణ, చంద్రయ్య, భాస్కర్, కుతుబ్, శాంతయ్య, ప్రజాకవి జనజ్వాల, గంధం నాగరాజు, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం జోలికొస్తే మోదీ సర్కార్కు పుట్టగతులుండవు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ -
‘రామన్నగట్టు’ నిర్మాణంపై పోరాటం
పాన్గల్: మండలంలోని కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంపై రైతులతో కలిసి పోరాటం చేస్తామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన మండలస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంతో పాటు వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించే రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని.. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయకుండా మంత్రి జూపల్లి రద్దు చేయిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి కాల్వలో పేరుకుపోయిన జమ్మును రైతులే స్వయంగా తొలగించుకుంటున్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామాల్లోని రచ్చకట్టల వద్ద ప్రభుత్వ హామీలపై ప్రజలతో చర్చించాలన్నారు. మండలంలోని చాలా గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని.. ఇది సరికాదని, మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటూ వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. అనంతరం పార్టీ మండల కన్వీనర్గా కిష్టాపూర్కు చెందిన వీరసాగర్, కో–కన్వీనర్గా చింతకుంటకు చెందిన తిలకేశ్వర్గౌడు, కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన భాస్కర్రెడ్డిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్రెడ్డి, చంద్రశేఖర్నాయక్, అడ్వొకేట్ రవికుమార్, సరోజమ్మ, సుధాకర్యాదవ్, జ్యోతినందన్రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీకి పూర్వ వైభవం
వనపర్తిటౌన్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటవైపు నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. 2023, డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మహిళలను సన్మానించి మాట్లాడారు. గత ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారం పొంది ఆర్టీసీని భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు మహిళలు ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత సాధించేందుకు మహాలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 2023, డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు సాగించారని, ఇందుకు ప్రభుత్వం ఆర్టీసీకి రూ.6,680 కోట్లు విడతల వారీగా చెల్లించిందని తెలిపారు. ఒక్క వనపర్తి జిల్లాలోనే 2.35 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని పేర్కొన్నారు. జిల్లాకు 10 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయని, త్వరలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాను సందర్శించి బస్సులను ప్రారంభించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, డిపో అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘క్షయ’ మరణాలను నియంత్రించాలి
వనపర్తి: క్షయను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని.. అవసరం ఉన్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 408 మంది క్షయ బారినపడగా.. 12 మంది మృతి చెందారని చెప్పారు. ఇక మీదట ఏ ఒక్కరూ చనిపోవడానికి వీలులేదని, పీహెచ్సీల్లో వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కంటిచూపు సమస్యలతో బాధపడుకున్న వారిని కంటివెలుగు ద్వారా గుర్తించామని.. ఆశా కార్యకర్తలు ఆ జాబితా నుంచి ఐదుగురిని ఎంపికచేసి పరీక్షించి అవసరం ఉన్న వారికి ఉచితంగా శస్త్రచికిత్స చేయించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాలు, పాఠశాలల్లోని వంట కార్మికులకు వైడల్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వస్తే వారం పాటు క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసరం అయినప్పుడు వెంటనే వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, అధికారులు డా. సాయినాథ్రెడ్డి, డా. పరిమళ, డా. చైతన్య, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు. -
‘ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్’
వనపర్తి రూరల్: కాంగ్రెస్పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి ఆరోపించారు. మంగళవారం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయనతో పాటు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాములు యాదవ్, సత్యనారాయణ, శివ, నరేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, లక్ష్మీనారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతికతతో కేసుల పరిష్కారం
వనపర్తి: ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని ఠాణాల కానిస్టేబుళ్లకు పని విభాగాల నిర్వహణపై ఇచ్చిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. పోలీస్స్టేషన్లలో కేసులు పెండింగ్ ఉండకుండా చూడాలని, కేసు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎఫ్ఐఆర్, పంచనామా, స్టేట్మెంట్ నమోదు గురించి శిక్షణలో క్షుణ్ణంగా నేర్చుకోవాలని కోరారు. కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించాలో వివరించారు. శిక్షణ మూడురోజుల పాటు కొనసాగుతుందని.. ఠాణాలకు వెళ్లిన తర్వాత తోటి సిబ్బంది, సంబంధిత అధికారికి శిక్షణ కాలంలో నేర్చుకున్నది సవివరంగా తెలియజేయాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసుల విచారణలో పరిపక్వత సాధించాలనే నిష్ణాతులైన సిబ్బందితో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తాయని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఇక్కడి నుంచే పర్యవేక్షణ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, ఐటీ కోర్ టెక్నికల్ టీం సిబ్బంది, గోవింద్, రవీందర్బాబు, పోలీసు సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
అమృత్ 2.0.. ఆలస్యం
జిల్లాలోని పురపాలికలకు రూ.128.29 కోట్లు మంజూరు ●పనులు త్వరగా పూర్తి చేయండి.. పట్టణంలో అమృత్ 2.0 పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పనులు ప్రారంభంకాగా.. ఇప్పటి వరకు సగం కూడా పూర్తి చేయలేదు. పట్టణంలో ఇప్పటికే తాగునీటి సమస్య అధికంగా ఉంది. బీసీకాలనీలోని 6, 7 వార్డుల్లో చేతి పంపులు, పుర కొళాయిలు ఉన్నా నీటి సరఫరా సక్రమంగా జరగక ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – వెంకటేష్, అమరచింత కొత్త కాలనీల్లోనూచేపట్టాలి.. పురపాలికల్లో కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న కొత్త పథకాన్ని తాగునీరు అందని వార్డులకు విస్తరించి పనులు చేపట్టాలి. అప్పుడే పట్టణ ప్రజలకు నిత్యం తాగునీరు అందుతుంది. – లాల్కోట రవి, కొత్తకోట నిర్దేశిత గడువులోగా.. జిల్లాలోని అన్ని పురపాలికల్లో ఇచ్చిన లక్ష్యం మేర పనులు చేపడుతున్నాం. ఇప్పటికే వనపర్తి, అమరచింత, ఆత్మకూర్లో పనులు కొనసాగుతుండగా.. మిగిలిన కొత్తకోట, పెబ్బేరులోనూ పనులు చేపట్టి నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు తాగునీటిని అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. – విజయభాస్కర్రెడ్డి, ఈఈ, ప్రజారోగ్యశాఖ, మహబూబ్నగర్ డివిజన్ అమరచింత: మున్సిపల్, అర్బన్, నగరపాలక ప్రాంతాల్లోని ప్రజలకు శాశ్వతంగా శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించి రూ.కోట్లు వెచ్చిస్తున్నా పనుల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు. జిల్లాలోని 5 పురపాలికలకు రూ.128.29 కోట్లు కేటాయించి జనాభా ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు ఓవర్హెడ్ ట్యాంకులు, పైప్లైన్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పనులు దక్కించుకున్న ఓ కంపెనీ ఆరంభంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా.. నేటికి ఆయా పురపాలికల్లో 50 శాతం పనులు సైతం పూర్తిగాని పరిస్థితి ఉంది. 2024, ఆగష్టులో పనులు ప్రారంభం.. కేంద్రం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకంలో భాగంగా గతేడాది ఆగష్టులో తాగునీటి ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణాలను జిల్లాలోని వనపర్తి, అమరచింత, ఆత్మకూర్ పురపాలికల్లో ప్రారంభించిన అధికారులు కొత్తకోట, పెబ్బేరులో ట్యాంకుల నిర్మాణాలకు స్థలాల కేటాయింపులో జాప్యం జరిగింది. రెండు నెలల కిందటే ఆయా పురపాలికల్లోనూ పనులు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా.. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుండటంతోనే పనులు నత్తనడకన సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఆగష్టులో పనులు ప్రారంభం నేటికీ పైప్లైన్లు కూడా పూర్తికాని వైనం పెబ్బేరు, కొత్తకోటలో మరింత ఆలస్యం -
పకడ్బందీగా ఏఐ విద్యాబోధన
వనపర్తి: ఏఐ విద్యాబోధనను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఒకే చోట ఉండి కంప్యూటర్లు ఉన్న 23 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో విద్యా సామర్థ్యాలు తక్కువగా విద్యార్థులను గుర్తించి రోజు అరగంట పాటు ఏఐ బోధన చేపట్టాలన్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఏఐ బోధన ప్రారంభమైందని.. మిగిలిన పాఠశాలల్లో ఇంటర్నెట్, హెడ్సెట్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించాలని కోరారు. ఇందుకు టైంటేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఉదయం 10 నుంచి కంప్యూటర్ తరగతులు ప్రారంభం కావాలన్నారు. 23 పాఠశాలల్లో ప్రస్తుతం 117 పనిచేస్తున్న కంప్యూటర్లు ఉన్నాయని విద్యాశాఖ ఏఎంఓ మహానంది తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామినేషన్) గణేష్, జీసీడీఓ శుభలక్ష్మి, శేఖర్ పాల్గొన్నారు. -
చట్టాలపై విద్యార్థులకు అవగాహన
వనపర్తి రూరల్: మండలంలోని గాయత్రి పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని పాల్గొని విద్యార్థులకు మోటారు వెహికల్, పోక్సో, విద్యాహక్కు చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, ఉచిత న్యాయ సాయం గురించి అవగాహన కల్పించారు. విద్యాసంస్థల్లో కొత్తగా చేరే విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసే ప్రమాదం ఉందని, ర్యాగింగ్తో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పా రు. ర్యాగింగ్కు స్వస్తి పలికేందుకు ప్రత్యేక చట్టాలు రూపొందించారని వివరించారు. ప్రతి విద్యార్థితో ర్యాగింగ్కు పాల్పడమని అంగీకార పత్రం తీసుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సలహాలకు టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రనదించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ రఘువీరారెడ్డి, కృష్ణయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రేపు పంచముఖికి ప్రత్యేక బస్సు వనపర్తిటౌన్: అమావాస్యను పురస్కరించుకొని గురువారం పంచముఖి పుణ్యక్షేత్రానికి వనపర్తి డిపో నుంచి ప్రత్యేక డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24న మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి నుంచిి ప్రత్యేక బస్సు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పంచముఖికి చేరుకుంటుందన్నారు. దర్శనానంతరం మంత్రాలయానికి వెళ్లి తిరిగి పంచముఖికి చేరుకొని రాత్రి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు వనపర్తికి వస్తుందని వివరించారు. టిక్కెట్ ధర రూ.600గా నిర్ణయించామని.. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్నంబర్లు 99592 26289, 73828 29379 సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి వనపర్తి విద్యావిభాగం: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం పాఠశాలలు, కళాశాలల బంద్కు పిలుపునిచ్చామని.. విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట సహాయ కార్యదర్శి కె.పవన్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆది కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, డీఈఓ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ, అనిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో 24వ తేదీ (గురువారం)న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ అఽధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలో 500 ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు. గడువు పొడిగింపు గద్వాల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు తేదీని ఆగస్టు 31వ తేదీవరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నుషిత ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 210 సీట్ల నుంచి 500 సీట్ల వరకు పెంచినందున ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు www.epass.cgg.gov.in వెబ్సైట్లో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రూ.100 కోట్ల పంట రుణాలు
పాన్గల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రూ.100 కోట్ల పంట రుణాలు ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు సహకార బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను సకాలంలో పునరుద్ధరించుకుంటే వడ్డీ తగ్గుతుందని.. దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సహకార సంఘం పరిధిలో గ్రామానికి 10 మంది రైతులను ఎఫ్పీఓ ద్వారా వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు పెంచేందుకు సభ్యులుగా చేర్చుతామని.. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగు ఉత్పత్తులు పెంచుతామన్నారు. పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక, వ్యవసాయేతర రుణాలను కూడా అందిస్తున్నామని.. కర్షకమిత్ర ద్వారా 2 నుంచి 4 ఎకరాలున్న రైతులకు ఎకరాకు రూ.4 లక్షల చొప్పున మార్టిగేజ్ రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాన్గల్ సింగిల్విండో ద్వారా రైతులకు రూ.కోటి వరకు రుణాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని అపోహలను నమ్మవద్దన్నారు. మండలంలోని కేతేపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు. విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్గౌడ్, విండో డైరెక్టర్లు జైపాల్రెడ్డి, ప్రసాద్గౌడ్, బాలరాజు, బీరయ్య పాల్గొన్నారు. -
పీయూలో ఏం జరుగుతోంది?
బదిలీల పరంపర.. ●నాన్ టీచింగ్ సిబ్బందిపై వేధింపుల పర్వం ● ఇటీవల పలువురిపై సస్పెన్షన్ వేటు ● చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు ● వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు ● టీచింగ్ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం సిబ్బంది తరఫున పోరాడతాం.. సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేస్తే వారిని విచారణ చేయాలి.. నోటీసులు ఇవ్వాలి.. కానీ, నేరుగా సస్పెండ్ చేయడం అనేది సిబ్బందిని వేధింపులకు గురిచేయడమే. బాధిత సిబ్బంది తరఫున మే ము పోరాటం చేస్తాం. అధికారులు అణచివేత ధోరణి అవలంబించడం సరైంది కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారుల వ్యవహారశైలిని ఖండిస్తున్నాం. వేతనాలు పెంచకుండా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దు. – రాము, పీయూ ఎస్ఎఫ్ఐ నాయకులు అందరినీ సమానంగా చూస్తాం.. పీజీ కళాశాలలో సిబ్బంది నేరుగా సంతకం పెట్టి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. అప్పటికే సంతకం పెట్టి బయటికి వెళ్తున్న ఓ సిబ్బందిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగా.. సంతకం పెట్టి బయటికి పోతే ఎలా అని సస్పెండ్ చేశాం. ఏ సిబ్బంది పైనా మాకు కోపం లేదు. అందరినీ సమానంగా చూస్తాం. వేతనాల పెంపు కోసం కృషి చేస్తున్నాం. వేసవి సెలవుల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి సెలవులు ఉండవు. గతంలో సెలవులు ఎలా ఇచ్చారో నాకు తెలియదు. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్టీచింగ్ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్టీచింగ్ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం చేస్తారో.. మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న పీయూ పీజీ కళాశాల ఓ మహిళా నాన్టీచింగ్ సిబ్బంది తన కొడుకుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్తుండగా.. రిజిస్ట్రార్ అడ్డుకుని సదరు మహిళను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్ తీరుతో నాన్టీచింగ్ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎలాంటి విచారణ, హెచ్చరిక, నోటీస్ లేకుండా సస్పెన్షన్ వేటు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు గతంలో ఓ టీచింగ్, ఓ నాన్టీచింగ్ గొడవపడిన వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన అధికారులు నేరుగా నెల రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేశారన్న ఆరోపణలతో వారిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీలు వేశారు. దీంతో ఏం మాట్లాడితే.. ఏం చేస్తారోనన్న భయాందోళన నాన్ టీచింగ్ సిబ్బందిలో నెలకొంది. నాన్టీచింగ్లో రెగ్యులర్ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్టీచింగ్ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్ చాన్స్లర్ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్ బ్రాంచ్కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్ అధ్యాపకుడిని చీఫ్ వార్డెన్గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్కు గతంలో ఉన్న చీఫ్ వార్డెన్ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించారు. బాలికల హాస్టల్లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. టీచింగ్ సిబ్బందిలోనూ అసంతృప్తి.. పీయూలో ప్రొఫెసర్ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కోస్గి లేదా అయిజ..
ప్రస్తుత నారాయణపేట జిల్లా, కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, పరిగి నియోజకవర్గంలోని గండేడ్ కలుపుకొని కోస్గి అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలాన్ని కూడా కలిపే చాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యం కాని పక్షంలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న అయిజకు చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, రాజోళి, గద్వాల నియోజకవర్గంలోని గట్టు కలిపి అయిజ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోస్గిగండేడ్దామరగిద్ద మద్దూరు -
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు
వనపర్తిటౌన్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని.. బీఆర్ఎస్ నాయకులు లేనిపోని విమర్శలు చేయడం మానుకొని అభివృద్ధికి సహకరించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వకుండా కాలం గడిపిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఒక్క వనపర్తి జిల్లాలో 36,323 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లావ్యాప్తంగా 61,687 రైతులకు రూ.49,11,43,107 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతుభరోసా కింద 1,75,869 మంది రైతులకు రూ. 205 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించామని వివరించారు. ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమనే సత్యాన్ని సీఎం రేవంత్రెడ్డి నిరూపిస్తున్నారని అన్నారు. రెండు మార్లు అధికారంలోకి వచ్చి కృష్ణా, గోదావరి నీళ్ల వాటా కోసం నోరు మెదపని నాయకులు.. నేడు సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ నెల 25న న్యూఢిల్లీ తల్కటోరా స్టేడియంలో నిర్వహించే భాగీ దారి న్యాయ సమ్మేళనానికి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీసెల్ అధ్యక్షుడు సమద్ మియా, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు జానకీ రాములు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరె రాములు, వివిధ మండలాల అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, పెంటన్న యాదవ్ తదితరులు ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● వర్షాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి సాగునీటి లభ్యత, రైతులకు ఎరువుల పంపిణీ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్యం, డ్రై డే కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే బాధితులకు అండగా నిలవాలన్నారు. ముఖ్యంగా గిరిజన అటవీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా చూడాలన్నారు. ఈ నెల 25నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు మండలాల వారీగా రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పౌరసరఫరాలశాఖ అధికారికి సూచించారు. అదే విధంగా ఎరువుల దుకాణాల్లో స్టాక్ వివరాలు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వ్యవసాయానికి అవసరం మేరకు నీటిని విడుదల చేసే విధంగా వ్యవసాయ, నీటిపారుదలశాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ముందస్తు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. విపత్తు నిర్వహణకు సంబంధించి మాక్ డ్రిల్ ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వరదలకు సంబంధించి రోజు ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
రైతులే నడుం బిగించి.. జమ్ము తొలగించి
పాన్గల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–1 కాల్వలో నీటి పారుదలకు అడ్డంకిగా మారిన జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు ఆయకట్టు రైతులు నడుం బిగించారు. కాల్వలో పూడిక తీయించడంతో పాటు జమ్ము, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. రోజుకు కొంతమంది చొప్పున మూడు రోజులుగా కాల్వలో పెరిగిన జమ్ము, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లితండా సమీపంలో ప్రవహిస్తున్న కేఎల్ఐ డీ–1 కాల్వ కింద దాదాపు 100 మంది గిరిజన రైతులు 300 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఈ కాల్వకు కొన్నేళ్లుగా మరమ్మతు చేపట్టకపోవడం.. కనీసం జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాది సాగునీటి కోసం ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ ఏడాది అయినా సాగునీరు విడుదలకు ముందే కాల్వకు మరమ్మతు చేయించి.. సాగునీరు సాఫీగా అందేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆయకట్టు రైతులు తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కేఎల్ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేయించడంతో పాటు పూడిక, జమ్మును పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. కేఎల్ఐ డీ–1 కాల్వను శుభ్రం చేసుకున్న ఆయకట్టు రైతులు -
మహబూబ్నగర్ రూరల్
మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు (మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర) ఉన్నాయి. మరో నియోజకవర్గంగా మహబూబ్నగర్ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మహబూబ్నగర్ పరిధిలోని మహబూబ్నగర్ రూరల్ మండలం, హన్వాడ, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, నారాయణపేట సెగ్మెంట్లోని కోయిల్కొండ, జడ్చర్ల పరిధిలోని నవాబుపేట మండలాలతో కలిపి మహబూబ్నగర్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి (2011 లెక్కల ప్రకారం జనాభా 2,17,942)ని మహబూబ్నగర్ అర్బన్ నియోజకవర్గం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మండలం జనాభా మహబూబ్నగర్ రూరల్ 42,523 హన్వాడ (మహబూబ్నగర్) 55,044 మహమ్మదాబాద్ (పరిగి) 34,087 కోయిల్కొండ (నారాయణపేట) 66,721 నవాబుపేట (జడ్చర్ల) 52,061 మొత్తం 2,50,436 -
మున్సిపల్ వాహనాలకు రోడ్లే దిక్కు!
● వనపర్తి పురపాలికలో పార్కింగ్ స్థలం కరువు ● చెత్త సేకరణ ట్రాక్టర్లు,వాటర్ ట్యాంకర్లు, ఇతర వాహనాలు రోడ్లపైనే నిలిపివేత ● ప్రతిపాదనలకే పరిమితమైన స్థలం కేటాయింపు వనపర్తిటౌన్: జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీ వాహనాల పార్కింగ్కు స్థలం కరువైంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలుచేసిన మున్సిపల్ వాహనాలు నిలిపేందుకు రోడ్లే దిక్కయ్యాయి. పురపాలికలో ఎక్కడైనా పార్కింగ్ సమస్య ఉంటే అధికారులే ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ మున్సిపాలిటీ వాహనాల పార్కింగ్ సమస్య కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా వాహనాలకు భద్రత లేకుండా పోతోంది. వనపర్తి మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణ కోసం 14 ట్రాక్టర్లు, మూడు ఆటోలతో పాటు రెండు ప్రొక్లెయిన్లు, రెండు వైకుంఠ రథాలు, రెండు వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ట్రాక్టర్లు, ఆటోలద్వారా చెత్తను సేకరించిన అనంతరం వాటిని రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. మిగతా వాహనాలను సైతం ఎక్కడబడితే అక్కడే నిలిపివేస్తున్నారు. భద్రత కరువు.. రోడ్లపైన నిలుపుతున్న వాహనాలకు తరచుగా మరమ్మతులు తప్పడం లేదు. వాహనాలకు సంబంధించి కేబుల్ వైర్లు, ఇతర సామగ్రి చోరీకి గురవుతున్నాయి. వాటిని రీప్లేస్మెంట్ చేసేందుకు మున్సిపాలిటీ నిధులను భారీగా వెచ్చించాల్సి వస్తోంది. వాహనాల్లోని ఇంధనం సైతం చోరీకి గురవుతుందని తెలుస్తోంది. దీనికి తోడు వాహనాలకు నీడ సౌకర్యం లేకుండా పోవడంతో వాటి సామర్థ్యం తగ్గడంతో పాటు పలు పరికరాలు పాడైపోతున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. అయితే కొన్ని వాహనాలకు మంటలు చెలరేగి పాడైపోయిన ఉదంతాలు ఉన్నాయి. 2020లో రహదారులను శుభ్రం చేసేందుకు రూ. 62లక్షలతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేయగా.. ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. అయితే మున్సిపల్ వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం అవసరమని గుర్తించిన జిల్లా మొదటి కలెక్టర్ శ్వేతా మహంతి.. ప్రస్తుత పుర కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలోని చౌడేశ్వరి ఆలయ సమీపంలో ఎకరా స్థలం కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తదనంతరం ఆమె బదిలీ కావడంతో ప్రతిపాదించిన స్థలాన్ని పార్కింగ్కు మలుచుకునేందుకు ఏ అధికారి ప్రయత్నం చేయకపోవడంతో వనపర్తి మున్సిపాలిటీ వాహనాలకు పార్కింగ్ సమస్య తీరనిలోటుగా మారింది. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. మున్సిపల్ వాహనాల పార్కింగ్కు కార్యాలయ ఆవరణలో స్థలం లేని మాట వాస్తవమే. గతంలో ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయో తెలుసుకొని మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఉంటే వాటి భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు. – ఎన్.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, వనపర్తి -
ఆమనగల్
ఉమ్మడి మహబూబ్నగర్లో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలు జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డికి వెళ్లాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ మండలాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం కలిసి ఆమనగల్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2011 సగటు జనాభాతో పాటు భౌగోళికంగా సరిపోనుండడంతో కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి మండలం మిగలగా.. ఈ నియోజకవర్గంలో అచ్చంపేట నుంచి వంగూరు, చారకొండ.. జడ్చర్ల నుంచి ఊర్కొండ, నాగర్కర్నూల్ నుంచి తాడూరు మండలాలను చేర్చే అవకాశం ఉంది. -
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
వనపర్తి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మెంటెపల్లి పురుషోత్తంరెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు పట్టణంలో ఏర్పాటుచేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ప్రతి బూత్లో కమిటీలను ఏర్పాటుచేసి.. ఈ నెల 25, 26 తేదీల్లో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 1, 2 తేదీల్లో గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి.. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు నాగరాజుయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, రాఘవేందర్గౌడ్, వెంకట్రామారెడ్డి, నారాయణ తదితరులు ఉన్నారు. రామన్పాడులో 1,019 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో సో మవారం 1,019 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030, స మాంతర కాల్వ ద్వారా 700 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 894, కుడి, ఎడమ కాల్వలకు 52, వివిధ లిఫ్ట్లకు 872, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తి చేయరా? వనపర్తి: జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు సంవత్సరాల తరబడి అసంపూర్తిగా ఉండటం సిగ్గుచేటని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని చింతల ఆంజనేయస్వామి, కాళికాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. రూ.కోట్లతో నిర్మించిన టౌన్ హాల్, కూరగాయల మార్కెట్ సముదాయం, ఇండోర్ స్టేడియాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. పాత బస్టాండ్ను పునర్నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ అధికారులను కోరారు. హాకీ అకాడమీలో క్రీడాకారులకు సరైన వసతులు కల్పించకపోవడం సరికాదన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ సొంత జిల్లాలో క్రీడాకారులు ఇబ్బందులకు గురికావడం బాధాకరమని అన్నారు. అసంపూర్తి పనులపై ప్రత్యేక దృష్టిసారించి త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్, నాయకులు వహీద్, రమేశ్సాగర్, దేవర శివ, వీవీ గౌడ్, గూడుషా, ధర్మేంద్ర సాగర్, రమేశ్, నర్సింహ యాదవ్, ప్రసాద్గౌడ్, నాగరాజు, నరేందర్, యశ్వంత్ పాల్గొన్నారు.