breaking news
Harish Rao
-
‘సీఎం రేవంత్ నోరు విప్పితే గోబెల్ ప్రచారం’
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి నోరు విప్పితే గోబెల్ ప్రచారమేనని, మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. అసత్యాల ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్నారని విమర్శించారు హరీష్. ఈ రోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తెలంగాణ భవన్లో హరీష్ మాట్లాడారు. ‘ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేమే కట్టం అంటున్నావు.. కత్తెర పట్టుకొని కేసీఆర్ కట్టినవి కట్ చేస్తున్నావ్.. పేర్లు మార్చుడు, కత్తెర పట్టుకొని కేసీఆర్ తిరగలేదు. ఎల్లంపల్లి కోసం 2వేల కోట్లు ఖర్చు పెట్టాము. రేవంత్ ప్రారంభోత్సవం చేసిన ఫ్లై ఓవర్లు, డ్యాములు కేసీఆర్ హాయంలోనివే. ఎల్లంపల్లి ద్వారా 20టిఎంసి హైదరాబాద్కు ఎలా తెస్తావ్?, సీఎం కుర్చీకి గౌరవం పోగొడుతున్నావ్. కాళేశ్వరం మోటర్లతోనే నీళ్లు ప్రాజెక్టులకు వస్తున్నాయి. కేసీఆర్ ముందుచూపుతో మల్లన్నసాగర్ నిర్మించారు. గండిపేట, హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లే. కాళేశ్వరం లో 12రిజర్వాయర్లు.. అందులో భాగమే మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటే నీళ్లు ఎక్కడివి..?, కాళేశ్వరం నీళ్లే మల్లన్న సాగర్కి వస్తాయి. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపడితే... రేవంత్ నియామక పత్రాలు ఇస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగం.. మల్లన్నసాగర్. కాళేశ్వరంను తిడుతావ్ అక్కడి నుండే నీళ్లు వచ్చేవి’ అని హరీష్ కౌంటర్ ఇచ్చారు. -
‘గ్రూప్-1’ తీర్పు.. రేవంత్కో గుణపాఠం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పిళ్లు, మళ్ళీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న కేటీఆర్.. ఇన్ని రోజుల పాటు గ్రూప్-1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.హైకోర్టు తీర్పు.. రేవంత్ సర్కార్ సమాధానం ఏంటి?: హరీష్హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలపై ఆయన మండిపడ్డారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ఈ కోర్టు తీర్పుకు చెప్పే సమాధానం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ మీ నిరక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు’’ అంటూ రేవంత్రెడ్డిపై హరీష్రావు మండిపడ్డారు.గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు..పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న…— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2025 -
తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు
-
కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, అందులో దాపరికాలు ఏం లేవని అన్నారాయన.విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియా నుంచి ఈ వ్యవహారంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. గత కొంతకాలంగా మా పార్టీ పైన, నా పైన కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యలనే కవిత ప్రస్తావించారు. వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు’’ అని అన్నారాయన.ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు. మరొకవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంత ఉంటుంది. మేం ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళు కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళు, సో, మా సమయాన్ని అంత కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటాం. ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం అని హరీష్రావు అన్నారు.ఇదిలా ఉంటే.. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లే తాను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యానని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ క్రమంలో హరీష్రావుకు బంగారు తెలంగాణపై చిత్తశుద్ధి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. హరీష్రావు మొదటి నుంచి పార్టీలో ఏం లేరని, బీఆర్ఎస్పై ఎప్పటి నుంచో హరీష్రావు కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్..బీజేపీలతో టచ్లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని, స్వలబ్ధి కోసమే తనను బయటకు పంపించేశారని ఆరోపించారామె. ఆరడుగుల బుల్లెట్టుగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్న హరీష్రావు తనకు గాయం చేశారని పేర్కొంటూ.. ఈ క్రమంలో హరీషన్నతో జాగ్రత్త అంటూ కేసీఆర్, కేటీఆర్లకు సూచిస్తూ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారామె. -
కేసీఆరే సుప్రీం.. తుది నిర్ణయం పార్టీదే: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు. ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం లండన్లో ఉన్నారు. తన కూతురి అడ్మిషన్ కోసం ఆయన లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్లో బీఆర్ఎస్ NRI నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం లీడర్. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ మాకు నేర్పించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా హరీశ్ రావు విమర్శలు చేశారు.మరోవైపు.. ఈ క్రమంలోనే అక్కడ మీడియా ఆయనను కవిత ఇష్యూపై ప్రశ్నించింది. కానీ, ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా వెళ్లిన తరువాతనే మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. రేపు ఆయన ఇండియాకు రాబోతున్నట్టు సమాచారం. అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తే ఏం మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ప్చ్.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు!
శత్రువులు ఎక్కడో ఉండరు.. ఇంట్లో మనచుట్టూనే తిరుగుతూంటారని ఈ మధ్య వచ్చిన ఒక సినిమా డైలాగుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఈ మాట ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుందని అనిపిస్తోంది. కేసీఆర్ కుమార్తె కవిత అంత పని చేశారు మరి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి, సీబీఐ విచారణ ప్రయత్నాలతోనే కేసీఆర్ సతమతమవుతున్న తరుణంలో ఉరుము లేని పిడుగు మాదిరి కవిత విరుచుకుపడ్డారు. నేరుగా ఏమీ అనకపోయినా, ఆమె వ్యాఖ్యలన్నిటికి కేసీఆర్ బాధ్యుడవుతారన్నది బహిరంగ రహస్యం. కవిత వైఖరి కొన్ని నెలలుగా పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. సోదరుడు పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించడమే కాకుండా.. అధినేత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ దనుమాడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. వీటన్నింటినీ ఓపికగా సహించిన కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ఆయుధాన్నిచ్చేలా వ్యవహరించడంతో సహించలేకపోయారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత కూడా పార్టీకి రాజీనామా చేసి ఒక రకంగా తండ్రితో బంధాలు తెంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్రావులతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిలపై కూడా కవిత ఆరోపణలు చేశారు. హరీశ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని, వీరిద్దరూ ఢిల్లీ నుంచి విమానంలో కలిసి వచ్చారని, ఆ సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకున్నారని ఆమె అంటున్నారు. బీఆర్ఎస్లో కాని,ఆయా రాజకీయ వర్గాలలో కాని, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ సలహా, సంప్రదింపులతోనే కవిత తన సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. దానిని పూర్వపక్షం చేయడానికి ఆమె ప్రయత్నించినట్లు కనిపించినా, ఎవరూ పెద్దగా నమ్మకపోవచ్చు. తన తండ్రిపై సీబీఐ విచారణ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత?, పోతే ఎంత అని ప్రశ్నించడం ద్వారా ఆమె తన మనసులో మాట చెప్పారన్న భావన కలుగుతుంది. కేసీఆర్పై అవినీతి మరక పడిందని కవిత కూడా చెప్పడం సహజంగానే బీఆర్ఎస్లో కలకలం రేపుతుంది.పైకి హరీశ్, సంతోష్ల గురించి ప్రస్తావించినా, వారు కేసీఆర్ను దెబ్బతీస్తారని అంటున్నా, ఆమె చేసే ప్రతి వ్యాఖ్య కేసీఆర్కు తగులుతుంది. కాకపోతే ఆమె నేరుగా ఈ మాట చెప్పకపోవచ్చు. ఈ మధ్య కాలంలో పార్టీకి దూరమైన కవిత ఇప్పుడు ఆ పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత అని ప్రశ్నించారు. దానికి తగిన విధంగా సస్పెన్షన్ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై, తండ్రిపై గౌరవం ఉంటే అలా మాట్లాడగలిగేవారా?. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం వివాదంపై మాజీ మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీశ్రావు సమర్థంగా వాదించారన్న ఆనందం ఎంతో సేపు లేకుండా చేశారు కవిత తన వ్యాఖ్యలతో!. పోనీ ఆమె అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారని అనుకున్నా, ఆమె పై కొంతకాలం క్రితం వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలు, కొద్ది నెలలపాటు జైలులో ఉన్న పరిస్థితి కూడా సహజంగానే చర్చకు వస్తాయి. కాళేశ్వరం దెబ్బతినడంతోపాటు, కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టు అవడం కూడా బీఆర్ఎస్ను ఎన్నికలలో దెబ్బతీసిందన్నది చాలామంది భావన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని ఏ బీఆర్ఎస్ నేత అయినా బహిరంగంగా అంటే ఒప్పుకుంటారా? కవిత చేసిన వ్యాఖ్యల గందరగోళాన్ని తగ్గించుకోవడానికి గాను ఆమెపై చర్య తీసుకోక తప్పని స్థితి ఏర్పడిందన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. అలా చేయలేకపోతే హరీశ్ సంతోష్ వంటివారికి అసంతృప్తి కలగవచ్చు. ఇప్పటికే కవిత దూరమైన నేపథ్యంలో వీరిని వదలుకునే పరిస్థితి ఉండదు. ఆమె తిరుగుబాటుకు పార్టీలో పెద్దగా అనుకూలత వచ్చినట్లు అనిపించదు. హరీశ్రావుకు పార్టీ అంతా అండగా ఉన్నట్లు తేలింది. వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఒక వ్యాఖ్య చేస్తూ హరీశ్ను ఆరడగుల బుల్లెట్ అని, మాస్టర్ క్లాస్ అని అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రశంసించారు. ఇవన్ని కవితకు బీఆర్ఎస్ ఇచ్చిన సమాధానాలే అవుతాయి. కవిత తొలుత తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా, ఆ తర్వాత కాలంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాని ఆ గెలుపును ఆమె నిలబెట్టుకోలేకపోయారు. నిజామాబాద్ లో మరోసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అయినా కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వ్యవహార శైలిపై కొంతమందిలో అసంతృప్తి ఉన్నప్పటికి, ఎవరూ పైకి మాట్లాడేవారు కారు. ఇప్పుడు వారు కూడా హరీశ్రావు పార్టీకి మూల స్తంభాలలో ఒకరని బదులు ఇస్తున్నారు. కొద్దికాలం క్రితం కవిత పై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాందీ కూడా పలికారు. కవిత సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? లేక కాంగ్రెస్లో చేరతారా? అన్న చర్చకు ఆమె అవకాశం ఇస్తున్నారు. తనను అరెస్టు చేయించింది బీజేపీనే అన్న భావనలో ఉన్నందున ఆ పార్టీ వైపు వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సంక్షోభం వెనుక తమకు ఎలాంటి పాత్ర లేదని, అది అవినీతి సొమ్ము పంచాయతీ అని సమాధానం ఇచ్చారు. కవిత తనకు తెలిసిన అవినీతి సమాచారం అంతటిని సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎంపీలు అరవింద్, రఘునందన్ వంటివారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో గొడవలు ఆ రెండు పార్టీలకు సహజంగానే సంతోషం కలిగిస్తాయి. కవిత ఒకరకంగా తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినట్లు కనిపిస్తోంది. పైకి ఆయనను గొప్పవాడుగా ప్రొజెక్టు చేసినట్లు అనిపించినా.. మొత్తం ఆయనను దృష్టిలో ఉంచుకుని చేశారన్న భావన కలుగుతుంది. రేవంత్ ను ఉద్దేశించి కొంత అనుచిత వ్యాఖ్య చేసినట్లు కనిపించినా, కవిత తీరు వల్ల కాంగ్రెస్ కు రాజకీయంగా లబ్ది చేకూరే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేస్తూ కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైందని వ్యాఖ్యానించారు.అందులో మామ వాటా ఎంతో అల్లుడి వాటా ఎంతో తేలాలి అని కూడా ఆయన అన్నారు. తనను కాంగ్రెస్, బీజేపీ, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఖబడ్దార్ అని కవిత హెచ్చరించారు. తాను ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదని, తనది కేసీఆర్ రక్తమని కవిత పేర్కొనడం బాగానే ఉన్నా, ఏ లక్ష్యంతో ఆమె ఈ వివాదాన్ని సృష్టించారన్న దానిపై ఎవరికి వారు ఊహించుకుంటారు. చర్చించుకుంటారు. గతంలో ఆమె కేసీఆర్కు ఒక లేఖ రాసి పార్టీలో అసమ్మతికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పార్టీకి దూరం అయ్యారు. కవిత భవిష్యత్తు రాజకీయం అంత తేలికగా ఉండదు. ఒక పెద్ద పార్టీ నీడలో, అది కూడా సొంత పార్టీలో, తండ్రి చెంత ఉండడం వేరు. సొంతంగా పార్టీని పెట్టుకున్నా, మరో పార్టీలో చేరినా, అది ముళ్లబాటే అవుతుంది. వాటన్నిటిని దాటుకుని కవిత తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకుంటే అది గొప్ప విషయమే అవుతుంది. కాని చరిత్రలో అలా సఫలం అయిన ఘట్టాలు చాలా తక్కువే అని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీఆర్ఎస్ హస్తగతానికి కుట్ర: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు హరీశ్రావు, సంతోష్రావు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు..’ అని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ‘నాన్నా.. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి. నేను కూడా మీలా ముక్కుసూటి మనిషిని కాబట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపి బలి చేశారు. రేపు మీకూ, రామన్నకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది..’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. పార్టీ ద్వారా తనకు లభించిన ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్కుమార్పై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. మా కుటుంబం బాగుండటం వారికిష్టం లేదు.. కేసీఆర్, కేటీఆర్తో నాది కుటుంబ, రక్త సంబంధం. పదవులు, పార్టీతో ముడిపడిన బంధం కాదు. కానీ పార్టీలో ఉంటూ డబ్బులు సంపాదించుకుని వ్యక్తిగత లబ్ధి పొందాలని భావించే వ్యక్తులకు మేము బాగుండటం ఇష్టం లేదు. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వారికి అధికారం వస్తుంది కాబట్టి నన్ను బయటకు నెట్టారు. ఇది ఇంతటితో ఆగదు అని దైవ సమానులు కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నా. వారిళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? నాకు జన్మనిచ్చి, ప్రాణభిక్ష పెట్టిన నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన నేను సామాజిక తెలంగాణ కోరుకోవడం కొందరికి నచ్చలేదు. హరీశ్రావు, సంతోష్ నాపై పనికట్టుకుని సామాజిక తెలంగాణ పేరిట పార్టీ పెడుతున్నట్లు ప్రచారం చేశారు. హరీశ్, సంతోష్ ఇళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? నేను అక్రమ కేసుల్లో తీహార్ జైలులో ఐదు నెలల పాటు గడిపి బయటకు వచ్చిన తర్వాత 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అనుమతితో గులాబీ కండువా కప్పుకుని అనేక ప్రజా సమస్యలు, అంశాలపై పోరాటం చేశా. వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన నా మీద జరుగుతున్న కుట్రల విషయంలో తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ పెట్టి చెప్పినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదు. మీ చెల్లి, మహిళా ఎమ్మెల్సీని అయిన నాపై కుట్రలు జరుగుతున్నాయంటే ‘బేటా ఏమైంది?’ అని నాకు ఫోన్ చేయరా? కేసీఆర్ నుంచి నేను స్పందన కోరుకోలేదు, కానీ మీరు స్పందించాలి కదా. రామన్నా.. నా మీద ఎవరేం చెప్పారో తెలియదు. నా ప్రాణం పోయినా కేసీఆర్, కేటీఆర్కు హాని జరగాలని కోరుకునే ఆడపిల్లను కాదు. ఎన్ని జన్మల పుణ్యముంటే కేసీఆర్ లాంటి తండ్రి నాకు దొరికాడు. కానీ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన. రేవంత్తో అవగాహన వల్లే వారిపై కేసులు మాఫీ హరీశ్రావు, సంతోష్ల అవినీతి వల్లే మా నాన్న కేసీఆర్పై సీబీఐ విచారణ వచ్చింది. హైదరాబాద్– ఢిల్లీ విమాన ప్రయాణంలో సీఎం రేవంత్ను హరీశ్ కలిసి కాళ్లు పట్టుకున్న నాటి నుంచి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు మొదలయ్యాయి. హరీశ్రావుకు సంబంధించిన పాల వ్యాపారం, రంగనాయక సాగర్ వద్ద భూ ఆక్రమణలు, మాజీ ఎంపీ సంతోష్పై మద్యం షాపుల కేసు తదితరాలన్నీ రేవంత్తో ఉన్న అవగాహన వల్లే తెరమరుగయ్యాయి. హరిత హారానికి నకిలీ కార్యక్రమం గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరిట సినీ నటులను మోసపూరితంగా రప్పించి అటవీ భూములను కొల్లగొట్టేందుకు సంతోష్ ప్రయత్నించాడు. శ్రవణ్రావుతో కలిసి మా ఫోన్లు ట్యాప్ చేయించారు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సంతోష్ అనుచరుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మోకిలలో రూ.750 కోట్ల బ్లూఫిన్ విల్లా ప్రాజెక్టు చేస్తున్నారు. సంతోష్ను మరో ఎమ్మెల్సీ నవీన్రావు తన గురువుగా చెప్పుకుంటున్నాడు. ఏసీబీకి వీరి అడ్రస్లు దొరకడం లేదా? రేవంత్ ప్రభుత్వంపై బరిగీసి కొట్లాడుతున్నందుకే మా కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయి. శ్రవణ్రావుతో కలిసి హరీశ్రావు, సంతోష్.. నా సిబ్బందితో పాటు కేటీఆర్, కేసీఆర్ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. హరీశ్, సంతోష్ మీతో బాగున్నట్లు నటించవచ్చు. కానీ వాళ్లు మన కుటుంబం, తెలంగాణ మంచి కోరుకునే వారు కాదు. వాళ్లను పక్కన పెట్టి కార్యకర్తలను అక్కున చేర్చుకుని ప్రజల్లోకి వెళ్తేనే పార్టీ బతికి బట్ట కడుతుంది. ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ హరీశ్ టీఆర్ఎస్ ఆరంభం నుంచి లేరు. టీడీపీ నుంచి కేసీఆర్ రాజీనామా చేసి బయటకు వస్తున్న సమయంలో రూ.కోటిన్నరతో వ్యాపారం చేసుకునేందుకు వెళ్లారు. 10 నెలల తర్వాత తిరిగి వచ్చిన హరీశ్ను క్షమించిన కేసీఆర్.. ఆయన ఎమ్మెల్యే కాకమునుపే మంత్రి పదవి ఇచ్చారు. హరీశ్రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్. ఆయనే ట్రబుల్స్ సృష్టించి వాటిని పరిష్కరించినట్లు చెప్పుకుంటారు. కేసీఆర్, కేటీఆర్ను ఓడించాలని హరీశ్ చూశారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్రావు 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీ నిధితో పాటు అదనపు నిధులు కూడా ఇచ్చారు. కాళేశ్వరం అవినీతిలో సంపాదించిన సొమ్ముతో తన మనుషులు కొందరు ఎమ్మెల్యేలుగా ఉండాలనుకున్నారు. 2009లో కేటీఆర్ను ఓడించేందుకు హరీశ్ రూ.60 లక్షలు పంపారు. కేసీఆర్ను కూడా గజ్వేల్లో ఓడించాలని చూశారు. నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఎమ్మెల్యేలను ప్రభావితం చేసి నన్ను ఓడించారు. ఇలాంటి వారిని పక్కన పెట్టుకుని నన్ను బయటకు పంపితే పార్టీ బాగు పడుతుందా? రామన్నా ఆరడుగుల బుల్లెట్తో జాగ్రత్తగా ఉండండి.. ఈ రోజు నన్ను గాయపరిచిన ఆరడుగుల బుల్లెట్..రేపు కేసీఆర్, కేటీఆర్లో ఎవరిని గాయపరుస్తుందో? రామన్నా జాగ్రత్తగా ఉండండి. హంపిలో భేటీ అయిన కొందరు నేతలు అవమానకరంగా మాట్లాడి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన సందర్భంలో కేటీఆర్ చేతులు పట్టుకుని హరీశ్ బ్రతిమిలాడారు. అక్కడ మాట్లాడిన వారిని పార్టీ నుంచి బయటకు పంపారు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ బయటకు వెళ్లారు. హరీశ్ వల్లే జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్రెడ్డి, రఘునందన్రావు, విజయశాంతి, విజయ రామారావు తదితరులు పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దుబ్బాక, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో హరీశ్ వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కొందరి ఒత్తిడి వల్లే సస్పెన్షన్ పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత? అని చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. కంప్యూటర్లో బీఆర్ఎస్ హార్డ్వేర్ అయితే తెలంగాణ జాగృతి సాఫ్ట్వేర్. తెలంగాణ జాగృతి ద్వారా పార్టీ అభివృద్ధిలో నా కంట్రిబ్యూషన్ ఉంది. కేసీఆర్పై కొందరు ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్ చేయించారని నమ్ముతున్నా. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తా. అయితే నా లేఖను లీక్ను లీక్ చేసిన వారిపై వంద రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. కేసీఆర్ సగం ఇడ్లీ తిన్నారనే సమాచారాన్ని కూడా లీక్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది. నా కుటుంబంలో జరిగిన అనేక అంశాలు బయటకు చెప్పలేను. రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడుతున్నా. నిజానికి నా లేఖ లీక్ కానంత వరకు నేను మాట్లాడలేదు. భవిష్యత్తులో అవసరమైన మరిన్ని విషయాలు బయట పెడతా. హరీశ్రావు, సంతోష్ మేక వన్నె పులులు. వాళ్లను పార్టీలో కొనసాగిస్తే నష్టం జరుగుతుంది. ఏ పార్టీలోనూ చేరడం లేదు.. నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు, మేధావులు, బీసీలు, సామాజిక తెలంగాణ కోసం పనిచేసే వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. రాఖీ పండుగ ముందు మెసేజ్ పెట్టినా రామన్న బిజీగా ఉండటంతో కుదరలేదు. కేసీఆర్ ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కోరుకుంటున్నా. -
హరీష్ రావుతో పార్టీకి గండం..!
-
Kavitha: నేను చాలా మొండి దాన్ని
-
సంతోష్ ధనదాహాన్ని బయటపెట్టిన కవిత
-
Kavitha: నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వీళ్లే కారణం
-
ఫోన్ ట్యాపింగ్.. మరో బాంబ్ పేల్చిన కవిత
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబ్ పేల్చారు. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని అన్నారామె. బుధవారం జాగృతి కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన అనంతరం చిట్చాట్లోనూ సంచలన ఆరోపణలకు దిగారు.ఫామ్హజ్ విషయాలన్నీ కాంగ్రెస్కు తెలుస్తాయి. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్రావు, సంతోష్రావు, శ్రవణ్రావులే(ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు) ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే అని అన్నారామె. ఈ గ్యాంగ్ గురించి కేసీఆర్కు గతంలో తాను స్వయంగా ఎంతో చెప్పానని.. బీఆర్ఎస్లో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని అన్నారామె. అలాగే.. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపైనా పల్లా రాజేశ్వర్రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ‘‘జనగామ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. అందుకే నాకు పల్లా సమాచారం ఇచ్చారు. నా దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్ఎస్ నేతలందరూ ఇబ్బంది పడతారు. నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా అని కవిత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవని.. అలాంటిది ఏమైనా జరిగినా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని కవిత స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్లో ఆ ఇద్దరూ మేకవన్నె పులులు! -
రామన్నను ఓడించడానికి హరీష్ కుట్రలు
-
హరీష్ ను టార్గెట్ చేయడం వెనుక..!
-
వాళ్లిద్దరూ మేకవన్నె పులులు
-
ఆ ఆరడుగుల బుల్లెట్టే నాకు గాయం చేసింది: కవిత
వ్యక్తిగత లబ్ది కోరుకునే కొందరు పార్టీ నుంచి తనను బయటపడేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బుధవారం జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘హరీష్రావు, సంతోష్రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదు. ప్రతీ సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. ఆయన బీజేపీతోనూ టచ్లో ఉన్నారు. హరీషన్నపై మొదటిరోజు మీడియాలో ఆరోపణలు వస్తాయి. రెండో రోజు నుంచి హరీష్రావు పేరు కనిపించదు. రేవంత్ రెడ్డి గురించి కూడా ఏనాడూ హరీష్రావు గురించి మాట్లాడలేదు. మ్యాచ్ఫిక్సింగ్ జరగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?. రేవంత్రెెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.హరీష్రావు మొదటి నుంచి బీఆర్ఎస్ లేరు. పార్టీ మనకెందుకు మామా అని కేసీఆర్కు చెప్పి.. వ్యాపారం చేసే ఆలోచన కూడా చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 8, 9 నెలలకే చేరారు. పార్టీకి వెన్నుపోటు పొడుదాం అని గతంలోనూ ఆయన అనుకున్నారు. కేటీఆర్ను బతిమాలి పార్టీలో కొనసాగారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ మేకర్. ఆయనే సమస్య సృష్టించి.. ఆయనే మాఫీ చేసినట్లు నటిస్తారు. ఎలాగైనా కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చుపెట్టి పార్టీని సొంతం చేసుకోవాలనే కుట్రలు చేస్తున్నారు. హరీష్రావును నమ్ముకుని మైనంపల్లి, ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు.. ఇలా ఎందరో పార్టీని వీడారు. 2018 ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి డబ్బులనే 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండ్గా పంచారు. ఆయన ఫండింగ్ వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను(కేటీఆర్ను ఉద్దేశించి.) ఓడించడానికి హరీష్ కుట్ర చేశారు. సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై అర్ధరాత్రి దాకా చర్చ జరిగింది. ‘‘ఓ హరీష్రావు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ పొగడ్తలు గుప్పిస్తున్నారు. కానీ, ఆ ఆరడుగుల బుల్లెట్టు నాకు గాయం చేసింది. తర్వాత మీ వంతే. రామన్న.. మళ్లీ రేపు మీపై కూడా కుట్ర జరగొచ్చు’’ అని అన్నారామె. సంతోష్రావు అనే వ్యక్తి చెప్పులో రాయి.. చెవిలో జోరీగా టైప్ అని అభివర్ణించారు. సంతోష్కు ధనదాహం చాలా ఎక్కువ. హరిత హరం పేరిట సినిమా హీరోలతో ఫోజులిప్పించి.. అడవులను కొట్టేయాలని చూశారు. రామన్న నియోజకవర్గం నేరెళ్లలో ఇసుక మాఫియా దళితులను చిత్రహింసలు పెట్టింది. చేయించింది అంతా సంతోష్రావు.. పేరు మాత్రం కేటీఆర్కు. పోచంపల్లి శ్రీనివాస్ వేల కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నారు?. సంతోష్రావు క్లాస్మేట్ కావడమే అందుకు కారణం. సంతోష్రావు వల్లే మాకు సంబంధించిన టీవీ, పేపర్లలోనూ నన్ను చూపించడం లేదు. సంతోష్, హరీష్ గ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. హరీషన్న, సంతోషన్నలు మేకవన్నె పులులు. వాళ్లను పక్కనపెడితే పార్టీ బతుకుతుంది’’ అని కవిత అన్నారు. -
బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా
ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం హైలైట్స్.. 👉పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేశారు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. 👉అక్రమ కేసుల్లో నేను జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను తప్ప.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా సస్పెన్షన్ వార్తలను మీడియాలో చూశాను. సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీ వ్యతిరేకమా?. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. కోట్లలో ఒక్కరు కేసీఆర్.. 👉కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నాను. పని గట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేశారు. నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. కేసీఆర్ లాంటి తండ్రి కోట్లలో ఒక్కరు ఉంటారు. అలాంటి వ్యక్తి నాకు తండ్రిగా ఉన్నారు. అది నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా నా తల్లితో కూడా నేను మాట్లాడటం లేదు. ఆమెను కలవలేకపోతున్నారు. ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదు. ఇద్దరు వ్యక్తులు నా కుటుంబాన్ని విచ్చినం చేశారు. నాశనం చేయాలని చూశారు. విధి అనేది ఒక్కటి ఉంది. కచ్చితంగా వారికి కాలమే సమాధానం చెబుతుంది. తప్పకుండా అనుభవిస్తారు. రేవంత్తో కలిసి హరీష్ కుట్రలు.. 👉నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. హరీష్ రావు, సంతోష్రావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ అయితదా?. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి నన్ను బయటపడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్ర ఇది. రేపటి రోజు రామన్నకు ప్రమాదమే.. 👉రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రేవంత్, హరీష్ కుమ్మకై నాపై కుట్రలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చినప్పుడు మంత్రి హరీష్రావే కదా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లకు హరీష్ డెయిరీ నుంచి పాల పంపిణీ జరిగింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా?. నన్ను సస్పెండ్ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది. హరీష్ వల్లే ఓటములు.. 👉హరీష్ ట్రబుట్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. ట్రబుట్ క్రియెట్ చేసి దీన్ని సాల్వ్ చేసినట్టు చెప్పుకుంటారు. మీడియా మేనేజ్మెంట్లో హరీష్ సూపర్. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. ఆయన ఫండింగ్ చేసిన వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపారు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి డే-1 నుంచి హరీష్ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్రావు వద్దన్నారు. తొమ్మిది, పది నెలల తర్వాత వచ్చారు. హరీష్ రావు నక్క జిత్తులను గమనించండి. నిజామాబాద్లో నా ఓటమిలో కూడా కుట్రలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ను కూడా ఓడించే ప్రయత్నం చేశారు. ఇందులో సంతోష్ రావు హస్తం కూడా ఉంది. హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలుపునకు కూడా హరీషే కారణం. హరీష్ వల్లే రఘునందన్ రావు, ఇతర కీలక నేతలు బయటకు వచ్చారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలాంటివి చాలానే జరిగాయి. జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీ వీడింది హరీష్ రావు వల్లే. ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు నాకు గాయం చేసింది. తర్వాత మీకు గాయం చేస్తుంది. గ్రీన్ ఇండియా పేరుతో సంతోష్ రావు ఓవరాక్షన్.. 👉హరితహారం కేసీఆర్ పెడితే.. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో నకిలీ కార్యక్రమం చేపట్టాడు. సంతోష్ రావు కూరలో ఉప్పు లాంటి వాడు. చిరంజీవి, ప్రభాస్ లాంటి సినీ నటులను మోసం చేసిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఫార్టెస్ట్ను కొట్టేద్దామనుకున్నారు. సిరిసిల్లలో ఏడుగురు దళిత బిడ్డలను పోలీసులు ఇసుక వ్యవహారంలో కొట్టడానికి సంతోష్ రావు బాధ్యుడు. ఆయన కారణంగా కేటీఆర్, పార్టీకి నష్టం కలిగింది. సంతోష్ రావుతోనూ రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది. బీఆర్ఎస్ పార్టీకి నేనేమీ చేయలేదా?. పార్టీలో నా కాంట్రిబ్యూషన్ లేదా?. హరీష్, సంతోష్లదే ఉందా?. వాళ్లు మేకవన్నె పులులు నాన్న. కలికాలం కాబట్టి వాళ్ల టైమ్ నడుస్తోంది. బీఆర్ఎస్ హార్డ్ వేర్ అయితే.. జాగృతి సాఫ్ట్వేర్ అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరను.. 👉చివరగా.. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలో గానీ చేరడం లేదన్నారు. తన భవిష్యత్ గురించి జాగృతి నేతలు, బీసీ నాయకులు, అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. -
రజతోత్సవాల నుంచే రగడ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై చేసిన వ్యాఖ్యలతో.. తొలిసారి ఎమ్మెల్సీ కవిత తన అసంతృప్త స్వరాన్ని విన్పించారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు మే 5న కవిత రాసిన లేఖ బయటకు రావడం, ఆ లేఖలో ఎల్కతుర్తి సభపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ ప్రసంగం ‘పంచ్ లేకుండా‘ ఉందని, బీజేపీపై స్పష్టంగా విమర్శలు చేయలేదని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి బీజేపీతో సంబంధమే కారణమై ఉండవచ్చని కార్యకర్తలు భావించారని పేర్కొన్నారు. కాగా ఈ లేఖ ఎవరు బహిర్గతం చేశారనే చర్చ జరగ్గా, బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలను లేఖ బయటపెట్టిందనే అభిప్రాయం వ్యక్తమైంది.మీడియాకు లేఖ లీక్పై సంచలన వ్యాఖ్యలుఅమెరికా పర్యటన నుంచి మే 29న తిరిగి వచ్చిన కవిత శంషాబాద్ విమానాశ్రయంలో లేఖ లీక్ వెనుక పార్టీ లోపలి వ్యక్తులే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న కోవర్ట్లు పార్టీని బలహీనం చేస్తున్నారని ఆరోపించారు. తాను జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదనలు వస్తే వ్యతిరేకించినట్లు వెల్లడించారు. మరోవైపు తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వ శైలిని కూడా పరోక్షంగా విమర్శిస్తూ పార్టీ ట్విట్టర్కు పరిమితం కావద్దని అన్నారు. తాను కొత్తగా పార్టీ పెట్టే అవకాశాన్ని ఆమె ఖండించకపోవడం అప్పట్లోనే ఊహాగానాలకు తెర లేపింది.పార్టీ నేతలపైనా ధ్వజంకేటీఆర్పై పరోక్ష విమర్శలు గుప్పించిన కవిత పార్టీతోనూ అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా గత నెల 9న కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం విభేదాలను మరింత స్పష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించిన మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ నేత కార్తీక్రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ బలహీనంగా ఉండటానికి జగదీశ్రెడ్డే బాధ్యుడని ఆమె పేర్కొన్నారు.ఇదిలా ఉంటే గత నెల 16న కవిత అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో.. సింగరేణి కాలరీస్లో బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించారు. దీనిపై కవిత తీవ్రంగా స్పందిస్తూ, తన లేఖ లీక్లో పాల్గొన్న ‘కుట్రదారులు‘ తనను హింసిస్తున్నారని ఆరోపించారు. ఇక సోమవారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్ కారణమని ఆరోపించడంతో పార్టీలో కలకలానికి కారణమయ్యారు.కవిత కేంద్రంగా వివాదాలు2023లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కవిత కేంద్రంగా వివాదాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 2023 మార్చి 11, 21 తేదీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను ప్రశ్నించింది. ఆమె సౌత్ గ్రూప్లో భాగమైనట్లు ఈడీ ఆరోపించింది. అయితే కవిత.. తనపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కవిత నివాసంలో తనిఖీలు చేసిన ఈడీ మార్చి 15న ఆమెను అరెస్టు చేసింది. సుమారు ఐదున్నర నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన కవిత తనను రాజకీయ కారణాలతో అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న కవిత.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ఈ ఏడాది జూన్లో ఆందోళనలు నిర్వహించారు. -
షాకులిచ్చిన కవితకే బిగ్ షాక్!
గీత దాటితే బహిష్కరణలే తప్ప మరొకటి ఉండని పార్టీ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న సంచలన అభియోగం మీద గులాబీ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. గతంలో పార్టీ తీసుకున్న చర్యల దృష్ట్యా కవిత బహిష్కరణ తప్పదంటూ ఈ ఉదయం నుంచి జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అలాంటప్పుడు సస్పెన్షన్ వేటుతోనే ఎందుకు సరిపెట్టాల్సి వచ్చింది?.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా సరే క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. విచారణలు, నోటీసులు, షోకాజ్ల్లాంటివేం లేకుండా నేరుగా కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సాగనంపుతూ వచ్చింది. గతంలో.. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్ర, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపైనా బహిష్కరణ వేటే వేసింది. 2021లో ఈటల రాజేందర్పైనా నేరుగా బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. అలాంటిది గత 12 ఏళ్లుగా పార్టీలో మూలనపడిన క్రమశిక్షణ కమిటీని తెర మీదకు తెచ్చి మరీ.. కవితను సస్పెండ్ చేయడం ఆశ్యర్యానికి కలిగిస్తోంది. కిందటి ఏడాది ఆగస్టులో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలుకు వెళ్లొచ్చాక కవిత కొంతకాలం పాటు వ్యక్తిగత జీవితం మీదే ఫోకస్ చేశారు. అయితే.. ఈ ఏడాదిలో క్రియాశీలకంగా మారిన ఆమె 2.0 రాజకీయంతో సొంత పార్టీకే వరుస షాకులు ఇస్తూ వచ్చారు.షాక్ నెంబర్ 1..పార్టీ ఆవిర్భావ వేడుకలపై విమర్శలతో బహిరంగ లేఖ రాయడం మే నెలలో కలకలం రేపింది. రజతోత్సవ సభ(బీఆర్ఎస్ సస్లివర జూబ్లీ వేడుకలో)లో సాగిన అధినేత ప్రసంగంపై కేడర్ అసంతృప్తిగా ఉందంటూ.. కేసీఆర్కు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్ దేవుడేకానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన తండ్రికి రాసిన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారంటూ మండిపడ్డారామె.షాక్ నెంబర్ 2.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చించడం మంచిదికాదన్న సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి... కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని మే 29వ తేదీన జరిగిన మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించారు. ఆపై రెండు రోజులుగా కొత్తగా తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బంజారాహిల్స్లో ప్రారంభించారు. అంతేకాదు.. ఈ ఏడాది కేటీఆర్ చేతికి కవిత రాఖీ కూడా కట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.షాక్ నెంబర్ 3..కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు విచారణ నోటీసులు ఇవ్వడంపై నిరసనగా.. జూన్ 10వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారామె. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తిగా దూరంగా ఉంది. షాక్ నెంబర్ 4..జూన్ 16వ తేదీన.. ఫార్ములా ఈకార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరైతే.. అదేరోజు అదేంపట్టనట్లు జగిత్యాలలో ఆమె పర్యటించారు. షాక్ నెంబర్ 5..జులైలో.. జహీరాబాద్లో జరిగిన బీసీ రిజర్వేషన్ల సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మండలి చైర్మన్కు ఆమె మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. అయితే ఇంత జరిగినా.. బీఆర్ఎస్ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. షాక్ నెంబర్ 6..బీఆర్ఎస్ కేడర్ను అయోమయానికి గురిచేసిన పరిణామం ఇది. జులై 26వ తేదీన ఉప్పల్లో కేటీఆర్ బీఆర్ఎస్వీ సభ, కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కవిత నిర్వహించారు. షాక్ నెంబర్ 7..పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధనాదీక్ష చేపట్టారు. జై బీసీ.. జై జాగృతి నినాదాలు చేశారుషాక్ నెంబర్ 7..ఆగష్టు 5వ తేదీన మాజీ మంత్రి జగదీష్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన లిల్లీపుట్ నేత వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. షాక్ నెంబర్ 8.. కాళేశ్వరంపై బాంబ్ పేల్చారామె. హరీష్రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీనా?అంటూ రగిలిపోయిన ఆమె.. ఇంతదాకా వచ్చినా పట్టనట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. ఈ వరుస షాకులిస్తున్నా.. తనపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె విమర్శలకు మరింత పదును పెట్టారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను అధినేత కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కవితపై కఠిన చర్యలే ఉండాలని సీనియర్లు పలువురు కేసీఆర్ వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జాగృతి సుదీర్ఘంగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతుండడం.. కవిత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. కవితపై తీసుకోబోయే చర్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై తీవ్రంగా చర్చించారు. చివరాఖరికి సస్పెండ్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు.. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా.. బీఆర్ఎస్లో 2025 ఏడాది కల్వకుంట్ల కవిత కల్లోలనామ సంవత్సరంగా మిగిలిపోనుంది. -
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ
-
కాళేశ్వరం సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్పల్ప ఊరట లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా.. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్రావు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సుందరం, శేషాద్రిలు తమ విజ్ఞప్తిని కోర్టుకు తెలియజేశారు. అయితే.. ఈ కేసును సీబీఐకి ఇవ్వనున్నట్లు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ‘‘కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఆధారంగా సీబీఐకి సిఫార్సు చేశాం. మొత్తం దర్యాప్తు చేయాలని సీఐబీని కోరాం కమిషన్తో సంబంధం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ’’ అని ఏజీ అన్నారు. ఈ క్రమంలో సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను కోర్టుకు అందజేశారాయన.దీంతో కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే దసరా వెకేషన్ తర్వాత ఈ పిటిషన్లపై వాదనలు వింటామని పేర్కొంటూ.. అప్పటిదాకా ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఏజీకి స్పష్టం చేసింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ రాసింది. కాళేశ్వరంతో పాటు అంతరాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రేమయంపైనా విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని సైతం లేఖలో వెల్లడించింది. ఇంకా ఆ లేఖలో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని.. ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్డీఎస్ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు రాష్ట్రానికి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈలోపు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు బ్రేకులు పడ్డట్లయ్యింది. -
హరీష్ రావుపై కేటీఆర్ పొగడ్తల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి హరీష్రావును కొనియాడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని ప్రశంసలు కురిపించారు. . నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ’ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL— KTR (@KTRBRS) September 1, 2025 -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్!
సాక్షి,హైదరాబాద్: ‘కాళేశ్వరం పాపం హరీష్రావు,సంతోష్రావుదేనంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సైతం హరీష్రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్గానే’ వస్తుందని ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. హరీష్రావు,సంతోష్రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్రావుపై బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. హరీష్రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వో నవీన్ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్వో నవీన్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్వో నవీర్ను గ్రూప్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగించింది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్ మీడియా అకౌంట్లకు అన్ఫాలో చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్రెడ్డి,పల్లా రాజేశ్వర్రెడ్డి,ప్రశాంత్రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు. వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. LIVE: Addressing media https://t.co/C9qlcEwUnc— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 1, 2025 -
కవిత వెనక కాంగ్రెస్ పెద్దలున్నారని బీఆర్ఎస్ అనుమానాలు
-
‘ఇది ఆరడుగుల బుల్లెట్టు’.. హరీష్రావుకు మద్దతుగా బీఆర్ఎస్
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మాజీ మంత్రి హరీష్రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఆపార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు వీడియోను ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అని కామెంట్స్ పెట్టింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe— BRS Party (@BRSparty) September 1, 2025 -
కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్రావుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది.ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలాగే మాట్లాడతా. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్కు మరక అంటడానికి ఇద్దరు, ముగ్గురే కారణం. హరీష్రావు,సంతోష్రావు వల్లే కేసీఆర్పై అవినీతి మరక. ఇలాంటి వారిని ఎందుకు భరించాలి. కేసీఆర్కు అవినీతి మరక ఇలాంటివాళ్ల వల్లనే వచ్చింది. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు?.ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఇలా ఉండటం ఏంటి?.కేసీఆర్పై విచారణ వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత?.కేసీఆర్కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఎందుకండి?’.వీళ్లు సొంత వనరులు,ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారు. దమ్ముంటే హరీష్రావు,సంతోష్రావులపై చర్యలు తీసుకోండి.ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద వందలకోట్లు దొరికాయి. ఆ అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాదు. పిచ్చివాగుడు వాగితే తోలుతీస్తా. కాంప్రమైజ్ అయ్యే ప్రస్తక్తిలేదు. పార్టీ ఓటమికి కారణం కేసీఆర్ వెంట ఉన్నవాళ్లే’ అని ఆవేశంతో మాట్లాడారు. -
హరీష్రావు పిటిషన్.. ప్రభుత్వాన్ని ఆదేశించలేమన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను హరీష్రావు దాఖలు చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు.. లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ చేపడతామని ధర్మాసనం చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. -
నీటి లభ్యత కోసమే మేడిగడ్డకు..: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో కృషి చేశామని.. మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీడబ్ల్యూసీ, నిపుణుల కమిటీ, ఇతర సంస్థలన్నీ ఆ ప్రాజెక్టుకు ఒప్పుకోకపోవడం వల్లే దానిని మేడిగడ్డకు మార్చామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు హరీశ్రావుకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు అడ్డు తగిలారు. ఒక సమయంలో హరీశ్రావుకు స్పీకర్ మైక్ కట్ చేసి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు జోక్యంతో హరీశ్రావుకు స్పీకర్ కొంత సమయం ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద ఉపయోగం లేదంటేనే.. నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, చాప్రాల్ అభయారణ్యం ఉండటం వంటి కారణాలతోనే తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు ముందుకు సాగలేదని హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర సీఎంను కలిసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి రాసిన లేఖలోని మూడో పేజీలో తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ‘తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చినప్పుడు నీళ్ల ప్రవాహం ఎలా పెరిగింది అని మంత్రి జూపల్లి అంటున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో మహారాష్ట్రలోని 16 వాగులు, తెలంగాణలోని 8 వాగుల నీళ్లు కలుస్తాయి. మేడిగడ్డ దగ్గర అదనంగా 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. మా సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్లు కట్టి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చారని రిటైర్డ్ ఇంజినీర్లు కమిషన్కు స్పష్టంగా చెప్పారు. కానీ కమిషన్ వారి రిపోర్ట్ను పట్టించుకోలేదు’అని హరీశ్రావు వివరించారు. పోలవరం కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? డీపీఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా అంటున్నారు. ప్రాణహితకు డీపీఆర్ 2009లో వస్తే, 28 ప్యాకేజీలకు టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చింది మీరు (కాంగ్రెస్ ప్రభుత్వం). నారాయణపేట లిఫ్టు ఇరిగేషన్కు డీపీఆర్ లేకుండా టెండర్లు పిలిచింది మీరు కాదా? జలయజ్ఞంలో ఎన్నో ప్రాజెక్టులకు డీపీఆర్లు లేకుండానే టెండర్లు పిలిచారు. ఉత్తమ్కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ గురించి గొప్పగా చెపుతున్నారు. దేశం మొత్తానికి ఒక నీతి, కాళేశ్వరానికి ఒక నీతి ఉంటదా? గోదావరి నదిపై కట్టిన పోలవరం 10 సార్లు కూలింది. ఎందుకు ఒక్కసారి కూడా ఎన్డీఎస్ఏ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు? ఎన్డీఎస్ఏ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టు సీఈఓగా ఉన్న సమయంలోనే అది 5 సార్లు కూలింది. ఆయన ఇచ్చే రిపోర్టుకు ఇక విశ్వసనీయత ఏముంటది? ఎస్ఎల్బీసీ, సుంకిశాల కూలాయి. వట్టెం మునిగింది, పెద్దవాగు కొట్టుకుపోయింది. అయినా వీటి మీద ఎన్డీఎస్ఏ రాదు, కమిషన్లు వేయరు. ఎన్డీఎస్ఏ తన రిపోర్టులో మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాకు నిర్మించి ఆపరేషన్లోకి తేవాలి అని సూచిస్తే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?’అని ప్రశ్నించారు. మేడిగడ్డలో మరమ్మతు చేస్తే సరిపోతుంది.. మేడిగడ్డ బరాజ్లోని ఏడో బ్లాకులో మూడు పిల్లర్లు కుంగటం తప్ప వ్యవస్థ అంతా అద్భుతంగా ఉందని హరీశ్రావు తెలిపారు. ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకు మొత్తం తీసినా రూ.300 నుంచి రూ. రూ.4 వందల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. అది కూడా చేయకుండా ఎందుకు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఒకవైపు కాళేశ్వరం కూలిందని చెబుతూ.. మరోవైపు హైదరాబాద్కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని రూ.7,000 కోట్లతో టెండర్లు వేశారని, కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్కు కాళేశ్వరం నీళ్లు ఎక్కడికెళ్లి వస్తాయి?’అని ప్రశ్నించారు. -
ఎజెండాను రాత్రికి రాత్రే డిసైడ్ చేస్తామంటే ఎలా?: హరీష్రావు
హైదరాబాద్, సాక్షి: ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. రెండు రోజులే అసెంబ్లీ నిర్వహించి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. శనివారం బీఏసీ సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చిన ఆయన.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసన సభలో వరదల పై చర్చించాలని కోరాం. ఫీజ్ రీయింబర్స్మెంటుపై మాట్లాడాలని కోరాం. యూరియా కొరత పై మాట్లాడాలి కోరాం. ప్రభుత్వ ఉద్యోగుల టీఏ, డీఏపై మాట్లాడాలనీ కోరాం. ప్రజా సమస్యలు మాట్లాడకుండా రెండు రోజులే సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. మేం 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని కోరాం. వరదపై మాట్లాడకుండా బురద రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఎరువులపై చర్చించాలని ఇవాళ సభ నుంచి వాకౌట్ చేశాం. ప్రజా పాలన అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమా..?. బీఏసీ సమావేశం అర్థం పర్థం లేకుండా పోయింది. రేపటి ఎజెండా ఏందో ఇప్పటి వరకు చెప్పలేదు. రాత్రికి చెబితే ప్రతిపక్ష ఎమ్మెల్యే లు ఎప్పుడూ ప్రిపేర్ అవ్వాలి. అందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేశాం అని హరీష్రావు అన్నారు. ఇదిలా ఉంటే.. సభ ఎన్నిరోజులపాటు నిర్వహించాలన్నది రేపు(ఆదివారం) నిర్ణయిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అంటున్నారు. ‘‘కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రేపు సభలో చర్చ ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను రేపు సభలో పెడతాం. బీఆర్ఎస్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి సభ నడుపుతాం. గణేష్ నిమజ్జనం ,వరదల నేపథ్యంలో.. మధ్య లో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అని శ్రీధర్బాబు మీడియాకు తెలిపారు. -
తెలంగాణ పాలిటిక్స్లో ‘యూరియా’ వార్
సాక్షి, హైదరాబాద్: యూరియా కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. రైతుల కష్టాలపై చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకు? అంటూ హరీష్రావు ప్రశ్నించారు.‘‘వరద నష్టంపై చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎప్పటిలోగా ఎరువులు అందిస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతుల కష్టాలు వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదా?. రైతుల ఇబ్బందులపై సీఎం సమీక్ష కూడా చేయరా?. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అప్పటివరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం’’ అని హరీష్రావు హెచ్చరించారు.మరో వైపు, బీఆర్ఎస్ యూరియా కార్యక్రమం పట నాటకమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కారణం.. రాష్ట్ర ప్రభుత్వమా? లేక కేంద్ర ప్రభుత్వమా మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో విషయమని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా?. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా?. అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం?’ అంటూ తుమ్మల దుయ్బయట్టారు.‘‘జియో పాలిటిక్స్ వల్ల, దేశీయ ఉత్పత్తి డిమాండ్కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు?. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు?. రేవంత్రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మీకు తెలియదా?. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్పై మీ శాపనార్థాలు ఏమిటి?. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారు. రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరు’’ అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సచివాలయం వద్ద బీఆర్ఎస్ నేతల మెరుపు ధర్నా.. హరీష్ పరుగులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపిస్తున్నారు. దీంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు నిరసనలకు దిగారు. అగ్రికల్చర్ కమిషనర్కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ నినాదాలు చేస్తున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం, ఇనుప కంచెలను లెక్క చేయం..యూరియా రైతుల హక్కు... అది అందకుండా చేయడం కాంగ్రెస్, బీజేపీల తప్పు..#CongressFailedTelangana #CongressBetrayedFarmers pic.twitter.com/NwQiloWaKE— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2025దీంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. అనంతరం విడుదల చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. యూరియా సంక్షోభంకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. -
అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక వద్దు: హైకోర్టులో హరీష్రావు వినతి
హైదరాబాద్: కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టొద్దని కోరుతూ హైకోర్టులో బీఆర్ఎస్ నేత హరీష్రావు హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు.ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వారు అనుమతినివ్వడం లేదని హరీష్రావు ఆరోపించారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని హరీష్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించి, తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని హరీష్రావు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో వినతిచేశారు. -
బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకు?
హవేళిఘణాపూర్ (మెదక్): ప్రజలు వరదలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుమిట్టాడు తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం వారి కష్టాలు పట్టించుకోకుండా మూసీ నది, క్రీడ లపై సమీక్షలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజ మెత్తారు.బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకని ప్రశ్నించారు. గురువారం ఆయన వరద లతో ప్రభావితమైన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం ధూప్సింగ్ తండా, నాగా పూర్, వాడి గ్రామాలను సందర్శించారు. కొట్టు కుపోయిన బ్రిడ్జి, రోడ్లను పరిశీలించారు. -
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్కు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో దక్కని ఊరట
-
KCR, హరీశ్ రావు పిటిషన్లు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
కేసీఆర్, హరీష్కు హైకోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో స్టే అవసరం లేదని పేర్కొంది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్బంగా పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్, హరీష్ ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున ఏజీ చెప్పుకొచ్చారు.హైకోర్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని తెలిపిన ఏజీ..కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం వాదనల్లో భాగంగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని కాపీ రూపకంగా అందజేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కమిషన్ నివేదికను వెబ్సైట్లలో పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో వెబ్సైట్లలో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. గురువారం జరిగింది ఇదే.. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ విచారణ చేపట్టారు.ఇక, వీరిద్దరి పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడియాకు అందజేశారా?. మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. -
కేసీఆర్, హరీష్రరావు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
-
హైకోర్టు కీలక ప్రశ్న.. రేపు చెబుతామన్న ఏజీ
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ తరఫు లాయర్ అన్నారు. నివేదికలో అంశాలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయని.. లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. సీఎం ప్రెస్మీట్ పెట్టి నివేదికను బయటకు ఇచ్చారన్నారు.కేసీఆర్ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ డొమైన్లో కమిషన్ రిపోర్టు ఉందని.. ప్రజెంటేషన్ ద్వారా వివరాలు బయటకు ఇచ్చారని కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఘోష్ కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో లేదన్న ఏజీ.. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని.. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతామన్నారు. కౌంటర్ మరిన్ని వివరాలు పొందుపరుస్తామని.. ఈ సమయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొదన్న ఏజీ.. అసెంబ్లీలో చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని ఏజీ కోరారు.కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు?. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా? అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా? ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అన్న హైకోర్టుకు.. రేపు సమాధానం చెబుతామంటూ ఏజీ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం తెలుసుకున్న విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తెలిపింది. రేపే సమాధానం చెబుతామంటూ ఏజీ తెలపడంతో తదుపరి విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది. -
పీసీ ఘోష్ నివేదిక నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను నిలిపివేయాలని కోరు తూ బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నివేదిక నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరు తూ కేసీఆర్తో పాటు మాజీమంత్రి హరీశ్రావు మంగళ వారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం–1952 ప్రకారం ప్రభుత్వం తమకు నోటీసులు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కమిషన్కు విచారణార్హత లేదని, నివేదికను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఘోష్ను ప్రతివాదులుగా చేర్చారు. కాపీ ఇవ్వకుండా పదేపదే ఆరోపణలు ‘నివేదిక కాపీని మాకు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న లేఖ రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నివేదిక మా పరువుకు నష్టం కలిగించేలా ఉందని ఈ నెల 4న మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించిన విషయాల ద్వారా తెలుస్తోంది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, కాపీని ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఎటువంటి సమర్థనీయమైన ఆధారం లేకుండా అప్రతిష్టపాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రతివాదులు జీవో 6ను జారీ చేశారు. నిబంధనల మేరకే బరాజ్లు.. అన్నీ పరిశీలించాకే కేంద్రం అనుమతులు ఏడు జిల్లాలకు తాగు, సాగునీటిని అందించడానికి 160 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించి కాళేశ్వరం ఎత్తిపో తలు పథకానికి నిబంధనల మేరకు రూపకల్పన చేసి నిర్మించాం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో బరాజ్ నిర్మాణాన్ని మరో చోటికి మార్చాలనే నిర్ణయం సహా ప్రతి అంశంపై కేబినెట్ ఆమోదం తర్వాతే చర్యలు చేపట్టాం. 13 జిల్లాలకు నీరందించేలా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బరాజ్లకు ప్రతిపాదనల నుంచి నిర్మాణం వరకు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రం అనుమతి మంజూరు చేసింది’ అని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దురుద్దేశపూరితంగానే కమిషన్ ‘ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ కాళేశ్వరాన్ని అప్రతిష్టపాలు చేస్తూ వస్తోంది. అధిక వర్షపాతంతో మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగడం దురదృష్టకరం. దీనికి బరాజ్ రూపకల్పన, ఇంజనీరింగ్తో సంబంధం లేదు. అయినా బీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ప్రభుత్వం దు్రష్పచారం ప్రారంభించింది. చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, దురుద్దేశపూరితంగా న్యాయవిచారణ కమిషన్ నియమించింది. అయినా ప్రజాజీవితంలో సమగ్రత, నిజాయితీకి కట్టుబడి ఉన్నందున కమిషన్ ముందు హాజరయ్యాం. నివేదిక పూర్తయిన తర్వాత మాకు ఇవ్వకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో మీడియాకు విడుదల చేసింది. దీన్ని పరిశీలిస్తే.. నివేదిక ఏకపక్షమని వెల్లడవుతోంది. విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధత, ప్రాథమిక సూత్రాలను కమిషన్ ఉల్లంఘించింది. ఎన్నికల్లో లబ్ధి కోసం..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి మంత్రులు మా ప్రతిష్టను కించపరిచేలా మీడియా ద్వారా దాడి ప్రారంభించారు. ‘పరిపాలనా అనుమతుల నుంచి నిర్మా ణం వరకు అక్రమాలు జరిగాయి.. అవకతవకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారే బాధ్యులు.. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, వ్యక్తుల నిర్ణయం.. నాటి సీఎం సూచన మేరకే బరాజ్ స్థలాలు ఎంపిక చేశారు.. నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు.. రూ.259 కోట్ల పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ ముందుంచలేదు.. సీఎం, హరీశ్ ఆదేశాల మేరకే జారీ చేశారు.. ఖజానాపై అదనపు భారం పడింది..’ లాంటి వాక్యాలను నివేదికలో పేర్కొనడం పరిశీలిస్తే.. కమిషన్ కావాలనే మాకు వ్యతిరేకంగా విచారణ సాగించినట్లు తేటతెల్లం అవుతోంది.మాతో పాటు నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను బాధ్యుడిగా పేర్కొనడం హాస్యాస్పదం. నివేదికను పరిశీలిస్తే.. పిటిషనర్లపై తప్పుడు భావనతో, ముందస్తు ప్రణాళికతో కమిషన్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన నాటి మంత్రుల వాదనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్ష నివేదికను రద్దు చేయాలి..’అని పిటిషన్లలో కేసీఆర్, హరీశ్ కోరారు. ఇదీ నేపథ్యం.. ప్రస్తుతం స్రూ్కటినీ దశలో ఉన్న ఈ పిటిషన్లకు రిజిస్ట్రీ నంబర్ కేటాయించాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇవి సింగిల్ జడ్జి వద్ద విచారణకొచ్చే అవకాశముంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, లోపాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం..2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. జూలై 31న కమిషన్ నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు.. కేసీఆర్, హరీశ్, ఈటల కారణమని నివేదిక తేలి్చనట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించగా.. ఈ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై హైకోర్టుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్రావు సవాల్ చేశారు. వేర్వేరుగా రెండు రిట్ పిటిషన్లను వారు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ నివేదిక అదేవిధంగా ఇచ్చిందని.. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్, హరీష్రావు విజ్ఞప్తి చేశారు.కాగా, మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. -
కాళేశ్వరంపై మరో కుట్ర.. మోటర్లే టార్గెట్: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం మోటర్లను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోటర్లను నాశనం చేసి అది.. బీఆర్ఎస్పై నెపం వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ మధ్య విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి.. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద పగ, ప్రతీకారం తీర్చుకుంది. నీళ్లను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నేను వారం రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్కు లేఖ రాశాను. సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్కు నీళ్ల విలువ తెలియదు. ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు.. ఎందుకు ప్రాజెక్టుల నీళ్లను వృథా చేస్తున్నారు. ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు, ప్రాజెక్టును నింపాలి. వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. మీరు ఆన్ చేయకుంటే మేమే ఆన్ చేస్తాం.కాళేశ్వరంపై మరో కుట్ర చేస్తున్నారు.. మోటర్లను ఆన్ అండ్ ఆన్ చేయడం వలన మోటార్లు పనికి రాకుండా చేస్తున్నారు. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి. ఆన్ చేసి ఆఫ్ చేయకూడడని బీహెచ్ఈఎల్ ఇప్పటికే హెచ్చరించింది. మోటర్లను నాశనం చేసి.. అది బీఆర్ఎస్పై వేయాలని కుట్ర చేస్తున్నారు. మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే మీరే చూసుకోండి. దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్కు నష్టం జరుగుతోంది. కమీషన్ పంచుకోవడానికి సమయం సరిపోవడం లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
ఆ 665 పేజీల నివేదిక ఇవ్వండి: సీఎస్తో హరీశ్ భేటీ
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. ఈ మేరకు నేడు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) సీఎస్తో సమావేశమయ్యారు హరీశ్. స్వల్ప సమయం పాట మాత్రమే సీఎస్తో భేటీ అయిన హరీశ్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే 665 పేజీల నివేదిక ఇచ్చిందో దాన్ని తమకు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంచితే, కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలంగాణ ప్రభుత్వం సృష్టం చేసిన సంగతి తెలిసిందే.‘ ఊరు, పేరు మార్చి అంచనాలు మించి కట్టిన ప్రాజెక్టు కూలిందని, కాశేళ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది దీనిలో భాగంగా ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే పరిశీలించాలనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఆ నివేదికను తీసుకుని అసలు కమిషన్ ఏం చెప్పింది అనే అంశాన్ని అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ భావనగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెబుతున్న బీఆర్ఎస్.. అది కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
ఘోష్ కమిషన్.. కాంగ్రెస్ దారెటు.. బీజేపీ కోర్టులోకి బంతి?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘట్టంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బ్యారేజీ దెబ్బతిన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 16 నెలలు విచారణ చేసి ఒక నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావులతో పాటు పలువురు అధికారుల పాత్రను తప్పుపట్టింది.అలాగే ప్రస్తుతం బీజేపీ ఎంపీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కూడా ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తదితర మంత్రుల సమక్షంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలోని ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ తన పార్టీ నేతల సమావేశంలో ఒక వ్యాఖ్య చేస్తూ అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. ఈ నివేదిక పేరుతో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని ఆయన అంచనా వేశారు. తదుపరి హరీష్ రావు బీఆర్ఎస్ పక్షాన మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కమిషన్ చేసిన అబ్జర్వేషన్స్ను తప్పుపట్టారు. హరీష్ అలా చేయడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ వాద ప్రతివాదాలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము.ఈ సందర్భంలో గతంలో ఆయా ప్రభుత్వాలపై వేసిన కమిషన్లతో ఎవరికి ఇబ్బంది కలగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరూ ఈ తరహా కేసులు ఎదుర్కోలేదు. చలన చిత్రాభివృద్ది సంస్థ అవకతవకలకు సంబంధించి జరిగిన కమిషన్ విచారణకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హాజరయ్యారు. కమిషన్ నివేదికలో ఆయనను తప్పు పట్టలేదు. ఒక భూ సేకరణ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇంకో మాజీ సీఎం స్టే పొందారు. విభజన తర్వాత ఏపీలో రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబే విచారణ సంఘాన్ని నియమించుకున్నారు. అందులో ఆయనను కమిషన్ ఆక్షేపించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఈ విచారణ సంఘం నివేదికను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. రేవంత్ ప్రభుత్వం ఆయనపై కేసు పెడుతుందా? అరెస్టు చేస్తారా?.ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కాంలపై దర్యాప్తు జరిపించి అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టింది. కొన్ని కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకోగా, ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అప్పుడే చెప్పలేం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ అనుభవం రీత్యా కేసీఆర్ను కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ ఉన్నప్పటికీ తాము కక్ష రాజకీయాలు చేయబోమని అంటున్నారు. పైగా కేసీఆర్కు ఫాం హౌసే ఒక జైలు అని, వేరే జైలు ఎందుకు అని వ్యాఖ్యానించి అరెస్టు జరగక పోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ఇది ఒక్క కేసీఆర్కే వర్తిస్తుందా? హరీష్ రావు, ఇతర అధికారులకు కూడా వర్తిస్తుందా అన్నది చెప్పలేం. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు ఇచ్చి కుంగిన ఘటన కేసీఆర్, హరీష్రావులకు, బీఆర్ఎస్కు అప్రతిష్ట తెచ్చిందన్నది వాస్తవం.అదే సమయంలో కేసీఆర్ లక్ష్య శుద్ధితోనే కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పించారని చెప్పాలి. కాకపోతే నిర్మాణం వేగంగా చేయాలన్న తొందరపాటులో ఆయన తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారి తీసి ఉండవచ్చునని అనిపిస్తుంది. కమిషన్ పరిశీలనల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వ స్థాయిలో కాకుండా, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నది ఒకటి. మంత్రివర్గం నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకోలేదన్నది ఇంకో పరిశీలన. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి, బరాజ్ను మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ కొరవడిందన్నది మరో వ్యాఖ్య. మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వ్యతిరేకత తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే యత్నం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ తప్పుడు డిజైన్లు ఇచ్చిందన్నది వేరొక ఆరోపణ. అధిక వడ్డీకి రూ.84 వేల కోట్ల అప్పు చేయడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. శాసనసభలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.ఘోష్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని బీఆర్ఎస్పై కాంగ్రెస్ దాడి పెంచింది. అయితే, వెంటనే ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అసెంబ్లీలో ఎటూ ఈ నివేదికను పెడతారు. అందులో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ వైఖరికి అనుగుణంగానే మాట్లాడుతారు తప్ప కొత్తగా చెప్పేది ఉంటుందా అన్నది సందేహం. అయినా అసెంబ్లీలో చర్చించడం మంచిదే. ఈ నివేదికలో కొంతమంది కీలక అధికారుల పాత్ర గురించి విస్మరించారన్న వాదన ఉంది. ప్రస్తుత సీఎస్గా ఉన్న రామకృష్ణారావు జోలికి కమిషన్ వెళ్లలేదని చెబుతున్నారు. బారేజ్ను మేడిగడ్డకు మార్చడం వల్ల ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని కమిషన్ అభిప్రాయపడిందని కథనం. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన దాదాపు లక్ష కోట్ల వ్యయం వృథా అయినట్లే అన్నట్లు ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టులో మరో రెండు బారేజీలు, కాల్వలు, టన్నెల్స్ తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం వంటివి కూడా ఉన్న విషయాన్ని ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అనిపిస్తుంది.స్థల ఎంపికపై నిపుణుల కమిటీ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కేసీఆర్ వివరించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లనిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. పైగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు ప్రశంసించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ స్వయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై కేసీఆర్ను మెచ్చుకున్నారు. మరో పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా, కాళేశ్వరం సబ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును సమర్థించినట్లే కదా!. దానిపై ఏం చెబుతారు?. ప్రాణహిత-చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మాణం చేసి ఘనత తెచ్చుకోవాలన్న క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని తప్పులు కూడా చేసినట్లు అర్దం అవుతుంది.అయితే, అవి పెద్ద తప్పులా? కాదా? అన్నది పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.. అది కూడా మంచిదే. మామూలుగా అయితే ఈ నివేదిక ఆధారంగా కేసులు పెట్టి ఉండవచ్చు. కానీ, అలా చేయకుండా అసెంబ్లీలో చర్చిస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేస్తుందా? అన్నది ఒక ప్రశ్న. తద్వారా ఈ బాల్ను బీజేపీ కోర్టులో వేస్తుందా? అలా జరిగితే కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధం పోయినట్లు అవుతుంది. కనుక ఆ పని చేయకపోవచ్చు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి ఇంతకాలమైనా ప్రభుత్వం మరమ్మతులకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రాజెక్టు నిరర్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఉన్న ప్రాజెక్టును వినియోగించుకుంటూనే ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్లితే మంచిదే.ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదన కూడా సమర్థంగానే ఉందని చెప్పాలి. ఇది ఏకపక్ష నిర్ణయం కాదని, అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని ఆయన అంటున్నారు. కేబినెట్ ఆమోదం కూడా ఉందన్నది ఆయన వాదన. మొత్తం 665 పేజీల రిపోర్ట్ కాకుండా సంక్షిప్త నివేదికను బహిర్గతం చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత సరిపడా లేదని కేంద్ర జల సంఘమే చెప్పిందని హరీష్ రావు వివరిస్తున్నారు. మరి కమిషన్ తన నివేదికలో అందుకు విరుద్దంగా ఎలా పెట్టిందో తెలియదు. అలాగే మంత్రివర్గ ఆమోదం ఉందన్న హరీష్ వాదనకు కేబినెట్ తీర్మానాలు చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. దానిని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదా అన్నది చూడాలి. ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం బీఆర్ఎస్కు నష్టం చేసింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలడం, పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన ప్రమాదం వంటి వాటిని ఈ సందర్భంగా హరీష్, కేటీఆర్ తదితరులు ప్రస్తావిస్తున్నారు. గుజరాత్లో ఒక వంతెన కూలిన ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే దానిని ముఖ్యమంత్రికి అంటగడితే, ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు రేవంత్, ఉత్తమ్ కుమార్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే మరీ తీవ్రమైన చర్య తీసుకుంటుందా అన్నది సందేహమే. రాజకీయంగా తమకు ప్రయోజనం అనుకుంటేనే అలా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్ నుంచి అఫెన్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.అందుకే కేసీఆర్ దీనిని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని ధ్వజమెత్తితే, కేటీఆర్ ఈ నివేదిక ఒక ట్రాష్ అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ఆ బారేజీకి రిపేర్లు చేయించి, నీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఉపయుక్తం అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏకపక్షం కాదు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు లేకుండా వండి వార్చిన నివేదికను రేవంత్రెడ్డి ప్రభుత్వం బయట పెట్టింది. ఈ ప్రాజెక్టుకు కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది. గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అంశం ఉండటం కేబినెట్ ఆమోదాన్ని సూచిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం నాటి సీఎం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. వ్యక్తుల నిర్ణయం ఆధారంగా బరాజ్ల నిర్మాణం జరగలేదు. వ్యాప్కోస్ నివేదిక, హై పవర్ కమిటీ సిఫారసులు, కేబినెట్ నిర్ణయం, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకు జరిగాయి. సీఎం రేవంత్రెడ్డి పాలనను గాలికి వదిలి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ‘డబ్బులు దండుకునేందుకు కమీషన్లు..కక్ష సాధింపుల కోసం కమిషన్లు’ అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ టీవీ సీరియళ్ల తరహాలో కమిషన్లు, విచారణలతో కాలం గడుపుతున్నాడు. కేసీఆర్ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై మంగళవారం తెలంగాణ భవన్లో హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నేతలు, రైతులు దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వద్దకు బరాజ్ మార్చడంలో నాటి సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. కుట్ర పూరిత విచారణ! కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యాలూ లేవు. అన్ని అంశాలు డీపీఆర్లో ఉన్నాయి. మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా తరలించలేమని నిపుణులు చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ కుట్రపూరితంగా జరిగినట్లు కనిపిస్తోంది. కమిషన్ ఎదుట విచారణకు రావాలని మాకు నోటీసులు రాకమునుపే మీడియాలో లీకులు ఇచ్చారు. సంక్షిప్త నివేదిక పేరిట అవాస్తవాలు, రాజకీయ కక్ష సాధింపులతో 60 పేజీలు వండి వార్చారు. నచ్చిన పేరాల లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్లుగా నివేదిక తీరు ఉంది. ఒక వైపే చూసి, విని, నిలబడి ఇచ్చిన నిరాధార నివేదిక ఇది. అసెంబ్లీలో 665 పేజీల పూర్తి నివేదికను పెడితే వాస్తవాలను నిగ్గు తేల్చేలా నిలదీసి చీల్చి చెండాడతాం. అనుమతుల్లేని ‘కొడంగల్’కు ఎలా శంకుస్థాపన చేస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఈ నివేదిక తప్పు పట్టింది. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయి. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ గతంలో ప్రధానికి లేఖ రాశారు. ఏ అనుమతులు లేని కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ ఎలా శంకుస్థాపన చేశారు? దీనిపై కూడా అసెంబ్లీలో దుమ్ము దులిపి అన్ని ఆధారాలు బయట పెడతాం. కానీ మైక్ కట్ చేయకుండా, సభను వాయిదా వేసుకోకుండా వాస్తవాలు చెప్పే అవకాశం మాకు ఇవ్వాలి. గతంలో దేశంలో వేసిన అనేక కమిషన్ల తరహాలోనే ఈ కమిషన్ నివేదిక కూడా న్యాయస్థానం ముందు నిలవదు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకే మేడిగడ్డకు మార్పు తుమ్మిడిహెట్టి వద్ద ఏ ప్రాతిపదికన గతంలో బరాజ్ను ప్రతిపాదించారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పింది. అందుకే మేడిగడ్డకు మార్చాం. ప్రతిపాదిత 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉంది. దాన్ని కాంగ్రెస్ దాచిపెట్టింది. ప్రాణహిత–చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్తోంది. కానీ 152 మీ. ఎత్తులో బరాజ్ నిర్మించవద్దని మహారాష్ట్ర స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే తుమ్మిడిహెట్టి నుంచి మార్చాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాలు చేసినా నాటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించ లేదు. అప్పట్లో ఖర్చు చేసింది రూ.3,700 కోట్లే.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11 వేల కోట్లతో 32 శాతం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పాడు. కానీ ఈ ప్రాజెక్టు కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.3700 కోట్లే. అందులోనూ మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. కేసీఆర్ వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఏ అనుమతి ఉందని రేవంత్రెడ్డి కొబ్బరికాయ కొట్టిండు. డీపీఆర్ లేకుండానే రేవంత్రెడ్డి పనులు ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్లులు కూడా చెల్లించారు. దీనికి ఒక్క అనుమతైనా ఉంటే ఉత్తమ్ చూపించాలి. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తున్న రేవంత్ గందమల్ల రిజర్వాయర్కు కొబ్బరికాయ కొట్టి, మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తానని టెండర్లు పిలుస్తున్నాడు. కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయని. ప్రజల గుండెల్లో కేసీఆర్ దేవుడిలా నిలుస్తారు. రాజకీయ కుట్రతోనే ఎన్డీఎస్ఏ నివేదిక గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు మూడుసార్లు కుప్పకూలినా స్పందించని ఎన్డీఎస్ఏ మేడిగడ్డ బరాజ్లో చిన్న ఘటన జరగ్గానే వచ్చింది. రాజకీయ కుట్రతోనే నివేదిక ఇచ్చింది. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే కేసీఆర్ను బాధ్యులుగా చేస్తున్న వారు పోలవరం కట్టిన ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? పోలవరం కట్టిన ప్రధాని మోదీపై చర్య తీసుకుంటారా? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిన ఘటనకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలి. అధికారంలోకి రాగానే మరమ్మతులు చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో బాగుంది. ప్రాజెక్టు ద్వారా రెండు పంటలు పండాయి. సుందిళ్ల, అన్నారం బరాజ్లు సురక్షితంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పాడు. మేడిగడ్డలో రెండు పియర్లు కుంగితే కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కుంగిన రెండు పియర్లను బాగు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయని అని నిరూపిస్తాం. -
కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
-
రాజకీయ దురుద్దేశంతో రిపోర్టులా?.. చర్చకు సిద్దంగా ఉన్నాం: హరీష్రావు
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కమీషన్ల పేరుతో పాలన నడుస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇంట్లోనే ఉంటున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. కమీషన్ల పేరుతో పాలన నడుస్తుంది. రాష్ట్రం మొత్తం కమీషన్ల మయం చేశారు. రెండు పార్టీలు రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయి. NDSA రిపోర్ట్ గురించి అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు రెండు సార్లు కూలిపోతే NDSA లేదు. మేడిగడ్డ బ్యారజ్లో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద NDSA రిపోర్ట్ వచ్చింది.కాళేశ్వరం కమిషన్ గడువు రాత్రికి రాత్రే పెంచారు. కేసీఆర్కు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని మీడియాకే ముందు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ పూర్తి రిపోర్ట్ వస్తే బీఆర్ఎస్ ఎలా స్పందించాలో మాకు తెలుసు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది. ప్రభుత్వం బయటపెట్టిన రిపోర్టు చూస్తుంటే పూర్తిగా ఆధారాల్లేవు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది.టీవీల్లో వచ్చే సీరియల్లా రోజుకో అంశంపైన రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. కన్నేపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా.. నీళ్లను ఇవ్వడం లేదు. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు పని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ గో బెల్స్ ప్రచారం చేస్తుంది. బేగంపేట ఎయిర్ పోర్టులో కేసీఆర్ సవాల్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించలేక పారిపోయాడు. తుమ్మడిహట్టి 152 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్టు కట్టేందుకు అనుమతి ఉన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
కేసీఆర్తో బీఆర్ఎస్ నేతల భేటీ.. కవిత, కాళేశ్వరంపై చర్చ!
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్లో కేసీఆర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్తో పాటుగా కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్లో కాళేశ్వరంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టుపై కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్లో లోపాలు లేవని అంటున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. -
రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం ఫైనల్ రిపోర్టు..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచించింది.ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైనా కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదికలో తెలిపింది. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదన్న కమిషన్.. ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నాలజీ వ్యవహారంలో లోటుపాట్లను కమిషన్ ప్రస్తావించింది. లోకేషన్ల విషయంలో కేసీఆర్ చొరవే ఎక్కువని కమిషన్ పేర్కొంది.రేపు(సోమవారం) కేబినెట్లో రిపోర్ట్పై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కేబినెట్ చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని పార్టీల ఆలోచన తెలుసుకునే పనిలో ప్రభుత్వం ఉంది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం.బరాజ్ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్ల అంచనాల పెంపు (ప్రైస్ అడ్జస్ట్మెంట్), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది.మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. -
రేవంత్ మౌనం వల్లే లోకేశ్ బరితెగింపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉందనే ధైర్యంతో బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బరితెగించి మాట్లాడుతు న్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. హరీశ్రావు శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకుని సహకరిస్తున్నందునే ఏపీ సీఎం చంద్రబాబు ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ ప్రకటనపై సీఎం రేవంత్, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బనకచర్ల అంశం ఎజెండాలో ఉంటే చర్చకు వెళ్లబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటిస్తే, సీఎం రేవంత్ మాత్రం భేటీకి హాజరై కమిటీ ఏర్పాటుకు అంగీకరించార ని మండిపడ్డారు.బనకచర్లపై చంద్రబాబు అనుస రిస్తున్న బుల్డోజ్ విధానానికి బీజేపీ, కాంగ్రెస్ మౌనమే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనా లను పక్కన పెట్టి చంద్రబాబు, బీజేపీ మెప్పుకోసం సీఎం రేవంత్ ప్రయత్నిస్తు న్నారని ధ్వజమెత్తారు. అధికారం, మందబలాన్ని చూసుకుని బనకచర్లపై లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.నీళ్లు తీసుకుపోతే ఊరుకుంటామా?గోదావరిలో మిగులు జలాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు బనకచర్లపై ఏపీ పంపిన డీపీఆర్ను ఎందుకు వెనక్కి తిప్పి పంపాయని హరీశ్రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లు పెట్టి నీళ్లు తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చెప్తున్న నారా లోకేశ్.. ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తన తండ్రి చంద్ర బాబు కేంద్రానికి రాసిన 7 లేఖల గురించి తెలుసుకో వాలని హితవు పలికారు. కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడి గడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి తరలించుకు పోయే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. బనకచర్లను ఏపీ కట్టి తీరితే, తాము అడ్డుకుని తీరుతా మని స్పష్టంచేశారు. ‘గోదావరి నదిలో మా వాటాను అడిగితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నా మని లోకేశ్ అంటున్నారు. గతంలో బాబ్లీ, ఆల్మట్టిపై చంద్ర బాబు చేసిన పోరాటాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టేందుకేనా? సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులను కాపాడుతుంది. అనుమతు లు తెచ్చుకునే పద్ధ తి మీకు తెలిస్తే, ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు. బనక చర్ల ద్వారా గోదావరి నీళ్లు మాత్రమే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించుకు పోయే కుట్రను చంద్రబాబు బయట పెట్టారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం వెనుక ఈ కుట్ర దాగి ఉంది. లోక్సభలో కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ నుంచి 8 మంది చొప్పున ఎంపీలున్నా బనకచర్లపై వాయిదా తీర్మాణం ఇచ్చి రాష్ట్ర హక్కు లను కాపాడటం లేదు’అని హరీశ్రావు మండిపడ్డారు. -
కాళేశ్వరంను ఆపేందుకు బాబు 7 లేఖలు రాశారు
-
లోకేష్.. అది మీ నాన్నను అడిగి తెలుసుకోండి
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.బనకచర్ల కట్టి తీరతామని నారా లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతదాకా స్పందించలేదు. సీఎం, మంత్రులు సహా ఎవరూ ఖండించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడిగి తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ నాన్న చంద్రబాబు ఏడు లేఖలు కేంద్రానికి రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి. కావాలంటే మీకు అన్ని ఆధారాలు పంపిస్తాం.కేంద్రం, రేవంత్ బలం చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. బనకచర్లను అడ్డుకుని తీరతాం అని హరీష్రావు హెచ్చరికలు జారీ చేశారు. -
చేతగానితనం వల్లే వరుస ఘటనలు
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం వల్లే పాఠశాలల్లో వరుస గా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లా డుతూ ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 80 మంది వరకు విద్యార్థులు ఆస్ప త్రిలో చేరారని చెప్పారు. ఇటీవల కాలంలోనే జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి బీసీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, హుజూరాబాద్ బీసీ గురుకులంలో ఎలుకలు కరిచి విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 20 నెలల సమయంలో రాష్ట్రంలోని గురుకు లాల్లో 100 మంది విద్యార్థులు చనిపోయారని, అయినా సీఎం రేవంత్ రాతి గుండె కరగడం లేదన్నా రు. విద్యాశాఖ సీఎం పరిధిలోనే ఉందని, ఆయన సొంత జిల్లాలోనే రోజుకో సంఘటన జరుగుతుంటే ఏమనాలని ప్రశ్నించారు.తాము పాఠశాలను సందర్శించేందుకు వస్తున్నామని తెలిసి, విద్యార్థుల ను చికిత్స మధ్యలోనే హడావుడిగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారన్నారు.గురుకులాల్లో చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు స్వీకరించాలని రెండు చేతులు జోడించి హరీశ్రావు అభ్యర్థించారు. పాఠశాలను సందర్శించిన వారిలో మాజీమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు. -
రంగనాయక సాగర్పై ఉత్సాహంగా హాఫ్ మారథాన్.. భారీగా పాల్గొన్న అథ్లెట్లు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫ్ మారథాన్ను ఆదివారం నిర్వహించారు. సపోర్టింగ్ స్పాన్సర్గా సాక్షి మీడియా గ్రూప్ వ్యవహరించింది. రన్నర్స్, యువత ప్రజలు ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. 5k,10 k, 21 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. రన్ చేసిన వారికి మెడల్స్ను అందజేశారు.200 మందికి పైగా..2023 మార్చి 8న సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు. పరుగెత్తుతూ.. ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఈ సంఘంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వివిధ వృత్తులు, వయసుల వారున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో అసోసియేషన్ సభ్యులు పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. 100 మంది మారథాన్ స్థాయికి ఎదిగారు.3100 మంది నమోదు..సిద్దిపేట వేదికగా హాఫ్ మారథాన్ నిర్వహణకు రెండు నెలలుగా కసరత్తు చేశారు. 40 మందితో కార్వనిర్వాహక కమిటీ ఏర్పాటైంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. రెండు నెలల కిందట ఆన్లైన్లో నమోదు ప్రారంభించారు. 5K, 10K, 21K విభాగాల్లో పోటీలు జరుగుతాయి. హాఫ్ మారథాన్లో 300 మంది, 10 కి.మీ. విభాగంలో 250 మంది, 5 కి.మీ. విభాగంలో 2550 మంది నమోదు చేసుకున్నారు.ఓసారి తెలుసుకుందాం..మారథాన్ అంటే 42.195 కి.మీ. మేర, హాఫ్ మారథాన్ అంటే 21.975 కి.మీ. మేర పరుగెత్తాలి. నడకతో మొదలెట్టి పరుగు వరకు.. ఏ దశలోనైనా చేరవచ్చు. విజయానికి సమయం నిర్దేశిస్తారు. పరుగెత్తే వారిని మారథాన్ రన్నర్స్గా పిలుస్తారు. ప్రపంచ జనాభాలో 0.01 శాతం మాత్రమే మారథాన్ రన్నర్స్ ఉన్నారు. -
మరో తెలంగాణ ఉద్యమం తప్పదు
సాక్షి, హైదరాబాద్/ ఉప్పల్ /కాప్రా: నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తామని..బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతామని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం మల్లాపూర్లోని ఓ గార్టెన్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ..తన శిష్యుడు రేవంత్రెడ్డితోపాటు...ఢిల్లీ కూడా తన చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటున్నారని..రేవంత్, ఢిల్లీ ఒప్పుకున్నా తెలంగాణ సమాజం మాత్రం బనకచర్లకు ఒప్పుకోదని హెచ్చరించారు. తెలంగాణ సమాజం మరో ఉద్యమానికి సిద్ధమవుతుందన్నారు. అవసరమైతే ఉస్మానియా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు మళ్లీ ఉద్యమానికి వేదికలై తెలంగాణ హక్కులు కాపాడుతాయని హెచ్చరించారు. బనకచర్ల విషయంలో రేవంత్రెడ్డి తలూపి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడని, తెలంగాణ రైతులు ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గోదావరి జలాలపై విద్యార్థులకు హరీశ్రావు అవగాహన కల్పించారు. తెలంగాణ ద్రోహుల లిస్ట్ రాస్తే మొదటి పేరు చంద్రబాబు, రెండో పేరు రేవంత్ రెడ్డిదేనన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని, ఉద్యమ జ్ఞాపకాలను తూడిచే ప్రయత్నం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీఎస్ను టీజీగా మార్చడమే అందుకు నిదర్శనమన్నారు. రేపటితరం నాయకులైన విద్యార్థులే తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇంటి దొంగలు తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారని చెప్పారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ జై తెలంగాణ అనే నినాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత నిషేధం కొనసాగిస్తుందని చెప్పారు. పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డే: కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెద్ద కోవర్ట్గా పనిచేస్తున్నాడని, ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని గ్రహించి గులాబీ పార్టీ లేకుండా కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బనకచర్ల పేరిట గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే కుట్రలను ఆపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్వీ ముగింపు కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ‘కేసీఆర్తో పాటు నన్ను, పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కట్టుగా కుట్రలు, దాడి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి అన్ని లెక్కలు తేలుస్తాం ‘ఫోన్ ట్యాపింగ్ తాము కూడా చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పాడు. ఆరు గ్యారంటీలు 420 హామీల అమలు గురించి ప్రజలు అడగకుండా ఉండేందుకు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కల్పిత కథలను సృష్టించారు. విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు గడ్డి తింటున్నారా. రేవంత్రెడ్డి కట్టు బానిసలు లాగా పనిచేస్తున్న కొందరు పోలీసులకు మెదడు ఉందా. అక్రమ కేసులు పెడుతూ, అధికార పార్టీ నేతల అండతో చెలరేగిపోతున్న పోలీసు అధికారుల పేర్లు రాసిపెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. మిత్తీతో సహా అన్ని లెక్కలు తే లుస్తాం. కేసులకు భయపడకుండా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
Harish Rao: గోదావరిపై ఏపీ మరో కుట్ర
-
ఒకేరోజు రెండు.. అయోమయంలో బీఆర్ఎస్ కేడర్
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. అటు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, ఇటు కేటీఆర్ ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నాయి. దీంతో ఎటు వెళ్లాలో పాలుపోక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ‘‘అన్నా.. ఎటు పోదామే’’ అంటూ నగరంలోని బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నేతలు ఒకరితో ఒకరు ఫోన్లలో చర్చించుకుంటున్నారు. ఇవాళ.. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వీ కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు కారణం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో జాగృతి తరఫన లీడర్ కార్యక్రమం జరగనుంది. ఈ మీటింగ్ను ఆసరాగా చేసుకుని జాగృతిని బలోపేతం చేయాలని.. గ్రామ స్థాయి దాకా కమిటీలు వేయాలని ఆమె నిర్ణయించారు కూడా. వాస్తవానికి ఈ మీటింగ్ను గత నెల 15వ తేదీనే కవిత ఫిక్స్ చేశారు. అయితే.. ఈలోపు బీఆర్ఎస్వీ తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విద్యార్థుల స్థాయి నుంచే ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించిది. ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తోంది కూడా. ఉదయం సెషన్ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాయంత్రం కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు మీటింగ్లు పార్టీ కేడర్లో మాత్రం గందరగోళానికి తెరదీశాయి. తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ.. ఒకే తేదీన నిర్వహిస్తుండడం గులాబీ దండులో చర్చనీయాంశమైంది. ఇద్దరిలో ఎవరికి జై కొట్టాలా? అని చర్చించుకుంటున్నారు. -
పదేళ్లు సెక్రటేరియట్ కు రాకుండా ప్రజలకు దూరంగా కేసీఆర్ పాలన చేశారు
-
రేవంత్వి చెత్త వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో ఢిల్లీ సమావేశంలో తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిన సీఎం రేవంత్రెడ్డి, తన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు కేటీఆర్పై చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ (చెత్త) బ్యాచేనని, కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో రేవంత్రెడ్డి చెత్త వ్యాఖ్యలతో అది మరింత పెరిగిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. బనకచర్లపై అబద్ధాలు చెబుతున్నారు.. ‘బనకచర్ల ప్రాజెక్టు ఢిల్లీ భేటీ ఎజెండాలో ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెపుతుంటే, రేవంత్రెడ్డి అసలు చర్చకే రాలేదని అంటున్నారు. కేంద్ర జలశక్తి నిర్వహించిన సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగినట్లు ఏపీలోని అన్ని పేపర్లలో వచి్చంది. లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్రెడ్డి బాధ పడుతున్నాడు. అందుకే అబద్ధాలు చెపుతున్నాడు. కేటీఆర్ మీలా బ్యాగ్లు మోయలేదు.. మేము బనకచర్ల గురించి మాట్లాడుతుంటే ఆయన డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు, బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్రెడ్డిలా కేటీఆర్ బ్యాగ్లు మోయలేదు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా బ్యాగులు మోసేవారే. పరిపాలన అంటే బ్యాగ్లు మోసుడు కాదని రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలి. కేటీఆర్ను లోకేశ్ అర్ధరాత్రి పూట కలిశాడని అంటున్నాడు. రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్రెడ్డికే ఉంది. ఎవడో దుబాయ్లో చనిపోతే కేటీఆర్కు ఏం సంబంధం? కేటీఆర్పై చేసిన ఆరోపణలకు రుజువులు ఉంటే చూపించాలి. లేదంటే కేటీఆర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా విఫలం ‘కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆస్పత్రుల్లో ఉంటున్నారు. మరోవైపు గ్రామాల్లో పాలన పడకేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై, నా క్యాంపు కార్యాలయంపై, పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై, సునీత లక్ష్మారెడ్డిపై, మర్రి రాజశేఖర్రెడ్డిపై దాడికి దిగుతున్నారు..’అని మాజీమంత్రి చెప్పారు. మా ఫోన్లతో పాటు విలేకరులవీ ట్యాప్ చేస్తున్నారు.. ‘రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి అండగా ఉంటున్నాడు కాబట్టే ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో నిఘా పెట్టినా మాకేం కాదు. రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. విలేకరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి..’అని హరీశ్రావు ఆరోపించారు. -
సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు సవాల్ చేశారు. తాము పూర్తి సమాచారంతో వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లో ఆరుసార్లు నిర్ణయాలు జరిగాయని, శాసనసభలో మూడుమార్లు ఆమోదం పొందాయని తెలిపారు. కేబినెట్, అసెంబ్లీ సమావేశాల తేదీలు, అందులో జరిగిన చర్చ, ఇతర అంశాల వివరాలను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న ‘పీసీ ఘోష్ కమిషన్’కు అందజేసినట్లు చెప్పారు. కేబినెట్ నిర్ణయాల కంటే శాసనసభ ఆమోదం మరింత ఉత్తమం అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు సి.లక్ష్మారెడ్డి, సు«దీర్రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని హరీశ్రావు అందజేశారు. అనంతరం బీఆర్కే భవన్ వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘కమిషన్కు మా వద్ద ఉన్న అదనపు సమాచారం అందజేశాం. ఈ అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉన్నందున గతంలో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు, కేబినెట్ నోట్ తదితర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ, నీటిపారుదల శాఖ కార్యదర్శులకు లేఖలు రాసినా స్పందన లేదు. దీంతో మాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నోట్ అందజేశాం. ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉన్నా కమిషన్కు అందజేసిన సమాచారం మాకు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలు ఇస్తోందని మాకు అనుమానాలు ఉన్నాయి’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. సీఎంది కవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ‘సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్ వేదికగా 50 ఏండ్ల ద్రోహ చరిత్రపై ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు. అది ‘కవర్ పాయింట్ ప్రజెంటేషన్’. కృష్ణా నదీ జలాల్లో గత ప్రభుత్వం 299ః512 నిష్పత్తిలో వినియోగానికి శాశ్వత ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టిందని రేవంత్ పదేపదే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి చేతగాని నాయకుల వల్లే తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలికంగా కేటాయించారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని సాధించి 763 టీఎంసీల వాటా కోసం పోరాటానికి బాటలు వేశారు.కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 299 టీఎంసీలు చాలు అంటూ రేవంత్, ఉత్తమ్ సంతకాలు చేసి వచ్చారు. నదుల బేసిన్స్ గురించి బేసిక్స్ తెలియని సీఎం రేవంత్.. అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే రీతిలో నడుచుకోవాలి. కాకతీయులు, నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చెరువులు, ప్రాజెక్టులను కూడా రేవంత్ కాంగ్రెస్ ఖాతాలో వేసి 54 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే అంతకు మునుపు పదేళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు లక్షల ఎకరాలకు మాత్రమే’అని హరీశ్రావు వివరించారు. తమ్మిడిహెట్టిపైనా అబద్ధాలే.. ‘తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పినందునే మేడిగడ్డకు బరాజ్ మారిందని చెప్తున్నా సీఎం రేవంత్ పదేపదే అబద్ధాలు చెప్తున్నారు. జలాశయాల సామర్థ్యం, నీటి వినియోగం, ఆయకట్టు, పంపింగ్ సామర్థ్యం, భూసేకరణ పరిహారం పెరగడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. గత ఏడాది తెలంగాణ వాటాలో కేవలం 28 శాతం కృష్ణా జలాలను వాడుకుని, చంద్రబాబుకు గురుదక్షిణగా 65 టీఎంసీలు ఆంధ్రాకు మళ్లించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో వస్తాం. దమ్ముంటే సీఎం రేవంత్కు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలి. కానీ ఒక్కటే షరతు.. మైక్ కట్ చేసి అసెంబ్లీని వాయిదా వేసి పారిపోవద్దు’అని హరీశ్రావు సూచించారు. ప్రఖ్యాత ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా హరీశ్రావు నివాళి అర్పించారు. -
నీళ్ల విషయంలో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది
-
‘అయ్యా రేవంత్.. 400 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్లు నీవేనా?’
సాక్షి, బీఆర్కే భవన్: దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది. 50ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీవి.. అవే మోసాలు, అవే అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పినవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు.. కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్కు అవగాహన లేదని బాధతో చెప్తున్నా. 299 టీఎంసీల పేరుతో శాశ్వత ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతకాక కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే 299 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారు.చంద్రబాబుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారా..శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్-3పై ఎందుకు పోరాటం చేస్తారు?. సెక్షన్-3 విషయంలో ఉమా భారతి, గడ్కరీని కలిశారు. కేంద్రంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారు. బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం మాత్రమే వినియోగిస్తారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారు.. చాలా బాధతో చెప్తున్నాను. కృష్ణా నదిని దోచుకో అని రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని నేను బయటపెట్టిన తర్వాత సీఎం మాట మార్చారు.నిజాం కట్టినవీ నీవేనా..సీఎం రేవంత్కి ఎలాగూ తెలియదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదు అంటే బాధేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా?. 573 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అజ్ఞానం. 400 ఏళ్ల కింద కాకతీయ, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. బీఆర్ఎస్ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.తుమ్మడిహట్టి నుంచి బ్యారేజీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చింది.. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించు. ఎనిమిదేళ్లలో 160 టీఎంసీలకు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి తేలేదు?. దీనిపై అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మా మైక్ కట్ చేయకుండా, అసెంబ్లీ నుంచి పారిపోవద్దు. 20 నెలల పాలనలో ఇప్పుడు ఒక్క చెరువు, చెక్ డ్యామ్ కట్టించారా?. మీరు ఏమీ చేయకుండానే నీళ్లు ఎలా వచ్చాయి.. పంటలు ఎలా పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను వాడటం లేదు.. ఆరు శాతం నీళ్లను తక్కువగా వాడారు’ అని చెప్పుకొచ్చారు. -
నిజాలు చెప్పే దమ్ము లేదు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగంపై చర్చకు రావాలంటూ రంకెలు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాభవన్లో బుధవారం నిర్వహించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్కు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు ఆహ్వానించలేదని మాజీమంత్రి టి.హరీశ్రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. సభ్యుల హక్కులకు భంగం కలిగించినందుకు స్పీకర్, శాసనమండలి చైర్మన్కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హరీశ్రావు ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబద్ధాల పుట్ట అంటూ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం సవాలులో నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించి ఉండేవారన్నారు. ఎన్ని కొరడాలైనా తక్కువే.. ‘ఐదు దశాబ్దాలుగా తెలంగాణ నీటి హక్కులను కాలరాసి, గోదావరి, కృష్ణాలో తెలంగాణ వాటాను ఆంధ్రకు అప్పజెప్పిన కాంగ్రెస్ను కొట్టేందుకు ఎన్ని కొరడాలైనా సరిపోవు. బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలో చెప్పాలి. పవర్పాయింట్ ప్రజెంటేషన్ పేరిట కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలతో సీఎం రేవంత్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తమ అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. సీఎం, మంత్రులు చెబుతున్న అబద్ధాలను అసెంబ్లీ లోపలా, బయటా అనేకసార్లు సాక్ష్యాధారాలతో సహా వివరించాం. అయినా కుక్క తోక వంకర అన్నట్టు పదే పదే చెప్పిన అబద్ధాలు చెబుతూ నిజాలుగా భ్రమింపచేసే కుట్రలకు పాల్పడుతుండటం సిగ్గుచేటు’అని హరీశ్ విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డిపై కుట్రలు ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్లగొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్టం చూపుతూ రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నాడు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 12.30 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విషయం గురించి దాచిపెట్టే కుట్ర చేస్తుండు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మూలనపడింది. ప్రాణహిత–చేవెళ్ల తరహాలోనే మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా పండ బెడుతున్నారు. కేవలం 7 టీఎంసీల సామర్థ్యమున్న జూరాలపై అదనంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే పాలమూరు ప్రాజెక్టు భారం మోపడం సాధ్యం కాదని రేవంత్రెడ్డికి తెలియదా.. కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడక ముందే ఒప్పుకొని కాంగ్రెస్ మరణ శాసనం రాయడం వల్లే తెలంగాణ శిక్ష అనుభవిస్తోంది’అని హరీశ్రావు మండిపడ్డారు. నేడు పీసీ ఘోష్ కమిషన్ వద్దకు హరీశ్రావుకాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ను గురువారం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి హరీశ్రావు కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించేందుకు హరీశ్ సమయాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కలవడానికి కమిషన్ సమయం ఇచ్చింది. -
Harish Rao: రెండోసారి కాళేశ్వరం విచారణకు..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు కాళేశ్వరం కమిషన్ ముందు మరోసారి హాజరు కానున్నారు. మళ్లీ విచారణకు రావాలంటూ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు సిద్ధమయ్యారు. అయితే..విచారణకు ముందు హరీష్రావు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాతే ఆయన బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. గత విచారణలో.. ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతులు ఉన్నాయని హరీష్రావు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వం అందించిన కేబినెట్ నోట్స్ మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.మాజీ ENC అనిల్ కుమార్ హాజరు.. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుంగలు పూడ్చడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కమిషన్కు తెలియకుండా బ్యారేజీల్లో గ్రౌంటింగ్ చేయడంతో అనిల్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. కేబినెట్ మినిట్స్ పరిశీలనక్యాబినెట్ రాటిఫికేషన్స్ పై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ ప్రొసీజర్ పై ఇరిగేషన్, ఫైనాన్స్ ఉన్నతాధికారులను అడిగిన కమిషన్.. కేబినేట్ నిర్ణయాల ప్రొజిజర్ ఎలా ఉంటుందనే వివరాలను GAD అధికారులను అడిగి తెలుసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 28 ప్యాకేజీల్లో కేబినెట్ ముందుకు ఎన్ని వచ్చాయనే విషయాన్ని అడిగిన జస్టిస్ పీసీ ఘోష.. ప్రాజెక్టు లొకేషన్లు, డిజైన్ల మార్పుకు సంబంధించిన ఫైల్స్ కేబినేట్ ముందుకు వచ్చాయా? విషయంపై కమిషన్ ఆరా తీశౠరు. అలాగే.. నిధుల మంజూరులో పారదర్శకత ఉందా లేదా అనే విషయం పైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
Harish Rao: నీళ్ల విలువ తేలియని నాయకులు పాలకులుగా ఉన్నారు
-
నీళ్ల విలువ తెలియని వ్యక్తులా మన నాయకులు.. హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: నీళ్ల విలువ తెలియని నాయకులు తెలంగాణలో పాలన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మోటర్లు ఆన్ చేయని పక్షంలో రైతులతో కన్నెపల్లి వైపు కదులుతామని హరీష్ రావు హెచ్చరించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీరోజు ఏ నదిలో ఎంత నీరు ఉందో తెలుసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని విస్మరిస్తోంది. నీళ్ల విలువ తెలియని నాయకులు మనకు పాలకులుగా ఉన్నారు. ఇప్పుడు నీరు వస్తున్నా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?. కాళేశ్వరం మోట్లరు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. వెంటనే కాళ్లేశ్వరం మోటర్లు ఆన్ చేయండి. కాళేశ్వరం నీటితో రిజర్వాయర్లు నింపండి. లేదంటే లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి వైపు కదులుతాం’ అని హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరానికి మాత్రమే NDSA వర్తిసుందా? SLBC కి NDSA వర్తించదా?. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాతకు అక్షయ పాత్ర కాళేశ్వరం. మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి నీళ్ళను ఎత్తి పోయేచ్చు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజల నోరు కొడుతుండు. శ్రీశైలానికి వరద నీళ్లు వచ్చి 36 రోజుల అవుతుంది.కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చెయ్యడం లేదు. కల్వకుర్తి మోటార్లు ఇప్పటికైనా ఆన్ చేస్తరా, లేదంటే రైతులను ఆన్ చెయ్యమంటరా?. భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో పూర్తిగా నిర్లక్యం చేశారు. గేట్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్. కృష్ణా జలాల వాడుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్యం చేస్తోంది. ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హెచ్చరించారు. -
రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది
-
‘నాడు బాబుకు బ్యాగులు మోసి బ్యాడ్మెన్.. నేడు బనకచర్ల బొంకుమెన్’
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారని సంచలన ఆరోపణలు చేశారు. గురు దక్షిణలో భాగంగానే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తే.. కాంగ్రెస్ మొద్దు నిద్ర పోతోంది. మధ్యాహ్నం మేం ప్రెస్మీట్ పెడితే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారు. బ్యాక్ డేట్ వేసి మీడియాకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బనకచర్లపై బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలి. రేవంత్, ఉత్తమ్ కలిసిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయాన్ని జనవరిలో బీఆర్ఎస్ బయటపెట్టింది.సీఎం రేవంత్కు బేసిన్ల గురించి కనీసం అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో అని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది. బనకచర్లను ఆపే చిత్తశుద్ది రేవంత్కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు జెండా ఊపారు. నాడు బాబు బ్యాగులు మోసి బ్యాడ్మెన్గా పేరు తెచ్చుకున్నారు. నేడు అదే బాబు కోసం బనకచర్ల బొంకుమెన్గా మారిపోయారు. చంద్రబాబును ప్రజాభవన్లో కలిశాక చీకటి ఒప్పందం కుదిరింది. గురు దక్షిణలో భాగంగానే చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారు. తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. నిన్నటి ప్రజంటేషన్లో అన్ని అబద్దాలే. రేవంత్ అబద్ధాలను బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్ మీదు ముఖమంత్రి రేవంత్ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచర్లపై ప్రజంటేషన్ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా?. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. -
ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలి : హరీష్ రావు
-
నై.. తెలంగాణ అన్న వ్యక్తి సీఎం గద్దెనెక్కారు: హరీశ్రావు
అమరచింత: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో ‘నై తెలంగాణ’అన్న వ్యక్తి, నేడు తెలంగాణ సీఎంగా గద్దెనెక్కి ఇక్కడి వనరులను ఆంధ్రకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, తన పాటల తూటాలతో రేవంత్ను అక్కడి నుంచి తరిమికొట్టిన ఘనత సాయిచంద్కే దక్కిందన్నారు.అలాంటి సాయి మన మధ్య లేకపోవడంతోనే ఈనాడు నై తెలంగాణ అన్న వ్యక్తులు రాజ్యమేలుతు న్నారని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి తెలంగాణ వాది అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలుకుతు న్న సీఎం రేవంత్రెడ్డి.. కేసీఆర్ ఒక శక్తి అనే విషయాన్ని మరచిపోతున్నార న్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్..!
హైదరాబాద్: 'హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రిలీజ్ చేశారు. ఈ రోజు(శనివారం, జూన్ 28) తెలంగాణ భవన్లో నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్ను హరీష్ రావు విడుదల చేశారు. దీనిలో భాగంగా హరీష్ రావు మాల్లాడుతూ.. ‘ ఉస్మానియా యూనివర్శిటీ, అశోక్ నగర్ నుంచి పెద్ద ఎత్తును నిరుద్యోగులు తెలంగాణ భవన్కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జూలై 4వ తేదీన ఛలో సచివాలయానికి పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఛలో సచివాలయం కార్యక్రమంకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది.నిరుద్యోగుల ఛలో సచివాలయంకు CPM పార్టీ మద్దతు ఇచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారు. బీఆర్ఎస్ హయంలో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా కేసీఆర్ చొరవ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ ఇది దగా క్యాలెండర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న జాబ్ క్యాలెండర్ అమలు కావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు.ఎన్నికల సమయంలో ఇందిరమ్మ నమరాలుగా మాట ఇస్తున్న అని ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు.యూత్ డిక్లరేషన్ లో 5 అంశాల చెప్పిన ప్రియాంక గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. స్కూటీ అంటే నాకు ఇష్టమని చెప్పిన ప్రియాంక గాంధీ, మహిళ స్టూడెంట్స్ కి ఇస్తామన్న స్కూటీ ఏమైందొ సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్న చెప్పిన ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న నిరుద్యోగ భృతి అతి గతి లేదు. యూత్ డిక్లరేషన్ లో 5 హామీలు ఇచ్చిన ప్రియాంక గాంధీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. యూత్ డిక్లరేషన్ నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి పైన ఎందుకు మొట్టి కాయలు వెయ్యడం లేదు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం, ఆకూనురి మురళీ, రియాజ్, ఆఖరికి ప్రియాంక గాంధీకి ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంటుంది. నిరుద్యుగులరా మీరు పోరాడుతూనే ఉండండి. మీ న్యాయ బద్ధమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు బిఆర్ఎస్ ఇస్తుంది. రేపటి తరమైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
సంక్షోభంలో సాగునీటి రంగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ రంగానికి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి బాగు చేస్తే, ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణ గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి మేడిగడ్డపై దు్రష్పచారం మానుకోవాలని, ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అంటూ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హరీశ్రావు విమర్శించారు. ‘ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. నల్లగొండలో సుంకిశాల కుప్ప కూలింది. పాలమూరులో వట్టెం పంప్ హౌస్ జలమయమైంది. నల్లగొండలో ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్ తెగిపోయాయి. మంజీర డ్యామ్ ఆప్రాన్ వరద ధాటికి కొట్టుకుపోగా, పియ్యర్స్లలో పగుళ్లు వచ్చాయి. కాంగ్రెస్ చేతగానితనం వల్లే ఈ ప్రమాదాలు జరిగినా ఎన్డీఎస్ఏకు కనిపించవు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏకు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ప్రమాదాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. బనకచర్ల ద్వారా ఏపీకి నీళ్లు తరలించే కుట్ర జరుగుతోందని అన్నారు. రాజకీయ ఎజెండాల కోసం తెలంగాణకు ప్రాణాధారం అయిన సాగునీటి రంగాన్ని బలి చేయొద్దని హరీశ్రావు హితవు పలికారు.కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో జరిగిన 142 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శించారు. పటాన్చెరు ఆటోడ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీశ్రావును ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని వారు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం రేవంత్ ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని హరీశ్ డిమాండ్ చేశారు. -
సంగారెడ్డి BRS రైతు ధర్నాలో రప్పా రప్పా ప్లకార్డులు
-
2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్లో హరీష్ రావు ఫొటో
సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఫుల్ జోష్లో కనిపించారు.పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. మరోవైపు.. హరీష్ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్పై కేసు పెట్టడం.. కేసీఆర్ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది? అని అడుగుతున్నాడు. కౌశిక్ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సీఎం కుర్చీలో రేవంత్ను చూడలేకపోతున్నారు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్రావుకు కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. నీళ్ళు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని, బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్ తో ప్రాజెక్టులు కడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. వాళ్ల మామ కేసీఆర్ను హరీస్రావు విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్లు సంగతి పూర్తిగా అర్థమైంది. కేసీఆర్కి ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. హరీష్ వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారు..గోదావరి జలాలపై గొంతు చించుకునే బీఆర్ఎస్ నేతలు.. కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడరు?, హరీష్ రావుకి కంటెంట్ కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ. సీఎం కుర్చీలో రేవంత్ను బీఆర్ఎస్ నేతలుచూడలేకపోతున్నారు. నది జలాలు ఎవరి అయ్యా జాగీరు కాదని హరీష్ తెలుసుకోవాలి. నీళ్ళ అంశంపై తనకి తన మామకి తప్పా ఎవరికీ ఏం తెలియదని హరీష్ అనుకుంటున్నారు. తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేసిందే కేసీఆర్. హరీష్ ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైంది. బనకచర్ల విషయంలో కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్ నుండి బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేసారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. బేసిక్స్ కాదు మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ప్రజలు మాకు పట్టం కట్టారు’ అని ఎంపీ చామల కిరణ్ స్పష్టం చేశారు. -
రేవంత్కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జి ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నదుల బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ (కనీస అవగాహన) లేకుండా మాట్లాడారు. బేసిన్ (పరివాహక ప్రాంతం)ల కంటే కూడా బ్యాగుల మీదే నాలెడ్జి బాగా ఉన్నట్లు ఉంది. నదీ పరివాహాక ప్రదేశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ రాష్ట్రం పరువు తీశారు..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్లపై ఏపీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా కేంద్ర మంత్రులను కలుస్తూ అనుమతులు కోరుతుంటే, కనీసం ఆ ప్రాజెక్టు ఏ నది బేసిన్లో కడుతున్నారో కూడా సీఎం రేవంత్రెడ్డి తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.‘రేవంత్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారు. అంతులేని అజ్ఞానంతో మూర్తీభవించిన మూర్ఖత్వంతో మాట్లాడారు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదు. బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియదు. ఇవేవీ తెలుసుకోకుండా సీఎం ఏం చేస్తున్నట్లు..?’ అంటూ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలా?‘తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్కు అవగాహన, చిత్తశుద్ధి లేదని బుధవారం ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తేలిపోయింది. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కూడా బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉంది. బనకచర్ల విషయంలో మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అప్రమత్తం చేస్తే, సీఎం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో.. ‘ఈ భేటీని రాజకీయ వేదికగా మార్చకు..బనకచర్ల ఆపాలి’ అని మా రవిచంద్ర అంటే సీఎం అబద్ధాలకు వేదికగా మార్చారు. ఏపీ జలదోపిడీ, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం చేతకాని సీఎం చెప్తున్న అబద్ధాలకు అంతు ఉండటం లేదు. రేవంత్రెడ్డి కుసంస్కారి.. వదరుబోతు. ఆయన నల్లమల పులిబిడ్డ కాదు..వెకిలి మాటల వెర్రిబిడ్డ. మేం ఉద్యమాల నుంచి వచ్చినం. నీలాగా అడ్డమైన తొక్కులు తొక్కుతూ రాలేదు..’ అంటూ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రేవంత్ దాసోహం అవుతున్నారు..‘గోదావరిలో 1,000, కృష్ణా నదిలో 500 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, మిగిలిన జలాలను ఏపీకి తరలించుకునేందుకు ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ ఆయన జాగీరు కాదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతకడాన్ని రేవంత్ మానుకోలేక పోతున్నారు. ఏపీకి దాసోహం అవుతూ బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రేవంత్ చేసిన ద్రోహానికి ఆయనను ఉరి తీసినా తప్పులేదు. నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఏపీకి, చంద్రబాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. చంద్రబాబుకు రేవంత్కు మధ్య ఆదిత్యనాథ్ దాస్ అనుసంధాన కర్తగా పనిచేస్తున్నాడు. గోదావరి, కృష్ణా జలాలు ఏపీకి దోచి పెట్టేందుకు అవి రేవంత్ అయ్య సొమ్ము కాదు. ఆయన కేవలం తెలంగాణకు కాపలాదారు మాత్రమే..’ అని మాజీమంత్రి అన్నారు. మేం అంగీకరించామనడం శుద్ధ అబద్ధం‘తెలంగాణకు సాగునీటి కోసం పరితపించిన కేసీఆర్ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. పోలవరం ద్వారా పెన్నా బేసిన్కు నీరు తరలిస్తే కృష్ణా బేసిన్లో 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని గతంలో అఫిడవిట్ ఫైల్ చేశాం. గోదావరిలో సగటున ఏటా 3 వేలకు పైగా టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని సీడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా కేసీఆర్ అంచనా వేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ప్రస్తావించారు. కానీ రేవంత్రెడ్డి వాస్తవాలను వక్రీకరించి బనకచర్లకు గత ప్రభుత్వం అంగీకరించినట్లు అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణను సంప్రదించకుండా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపడితే అంగీకరించేది లేదని గతంలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. కానీ రేవంత్ మాత్రం 1,000 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి, మీరు ఎన్ని జలాలు అయినా తరలించుకోండి అని ఏపీకి చెప్తున్నారు..’ అని హరీశ్రావు ఆరోపించారు.ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం..‘కృష్ణా–గోదావరి నదీ జలాల అనుసంధానం గురించి కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు గతంలో ఏపీ సీఎం జగన్ అంగీకరించక పోవడంతో అది ముందుకు సాగలేదు. తెలంగాణతో సంబంధం లేకుండా కృష్ణా–గోదావరి అనుసంధానికి అంగీకరించే ప్రసక్తే లేదు. గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం. అవసరమైతే రైతుల పక్షాన కోర్టులను ఆశ్రయిస్తాం..’ అని హరీశ్రావు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, అనిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
Harish Rao: రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు
-
‘సీఎం రేవంత్కు విషయం తక్కువ.. విషం ఎక్కువ’
హైదరాబాద్ బనకచర్ల ప్రాజెక్టుకు ఆయనే గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు విమర్శించారు. రేవంత్కు విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(గురువారం, జూన్ 19) తెలంగాణ భవన్లో హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. తాను బనకచర్లపై మీటింగ్ పెట్టిన తర్వాతే.. మీరు మీటింగ్ పెట్టారన్నారు. అసలు మీరు మీటింగ్ పెట్టింది.. బనకచర్ల ప్రాజెక్టుల ఆపడానికా?, కట్టుకోమనడానికా? అంటూ సీఎం రేవంత్ను హరీష్ ప్రశ్నించారు. బనకచర్ల ఏ జిల్లాలో ఉందో కూడా తెలియకుండా సీఎం రేవంత్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. కృష్ణ బేసిన్ లో 500 TMC లు, గోదావరి బేసిన్ లో 1000 TMC నీళ్లు ఇచ్చి ఏపీ అన్ని ప్రాజెక్ట్ లు అయిన కట్టుకోండి...అని రేవంత్ అంటున్నారు.. అసలు మన సీఎంకు తెలివి ఉందా? అంటై హరీష్ మండిపడ్డారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్ -
బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా తప్పుడు ప్రచారం ఆపడం లేదని.. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో ఆ పార్టీ కలిసి రావడం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీల అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి ఎంపీలకు వివరించామని తెలిపారు.‘‘రాజకీయ ప్రయోజనాలు, సంకుచిత స్వభావంతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీల సూచనలు తీసుకున్నాం. అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించి, సుదీర్ఘంగా వివరించామని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బతికించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దురుద్దేశంతో బీఆర్ఎస్ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘2016 అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ 3 వేల టీఎంసీ నీళ్లు అనే పదం నుంచి బనకచర్ల పుట్టింది. 3 వందల టీఎంసీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రెండు వందల టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారు. అనాడు కేసీఆర్ నాలుగు వందల టీఎంసీలు అన్నారు. అందుకే చంద్రబాబు ప్లాన్ మొదలు పెట్టారు. చంద్రబాబు బనకచర్ల అనగానే కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రికి ఫిర్యాదులు చేశాం...బనకచర్ల పై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఉరి తీయ్యాల్సింది కేసీఆర్, హరీష్ రావునే. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. చేసిందంతా కేసీఆర్, హరీష్ రావు చేసి.. నింద మాపై మోపుతారా?. కమీషన్లకు కకుర్తిపడి తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్రావు. లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టు పై 2లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు.ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం 500 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మనుషులు చనిపోతే హరీష్రావు కళ్లలో పైశాచిక ఆనందం వెళ్లబుచ్చుతారు. పేదలు ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి పేదలకు ఇవ్వలేదు. హరీష్ రావు చిల్లర ప్రయత్నాలు మానాలి. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం హరీష్ రావు. ఢిల్లీ వెళ్తే తప్పేంటి.. మీరు చేసిన తప్పులు మేము సెట్రేట్ చేస్తున్నాం. పది పైసల మిత్తికి 50వేల మిత్తికి హరీష్ రావు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా టార్గెట్.తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం. బనకచర్ల పై అవసరం అయితే ప్రధాన మంత్రిని కలుస్తాం. అందరినీ కలిసిన తర్వాత కోర్టుకు సైతం వెళ్తాం. చంద్రబాబుకు నేను సూచన చేస్తునా!. కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు.. ప్రధాని ఏదైనా వినొచ్చు అనుకుంటే మీ భ్రమ. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడివరకైనా వెళ్తాం. మేము తెలంగాణ ప్రజల కోసం కోర్టుకు అయినా వెళ్తాం. 968 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాడుకోవడానికి బ్లాంకెట్గా అనుమతి ఇవ్వాలి’’ అని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’?
సాక్షి,తెలంగాణ: రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బుధవారం (జూన్18) ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే ఢిల్లోలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఒరిగేదేమీ లేదు. డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు. కేటీఆర్ ఏసీబీ విచారణ అంతా టైంపాస్నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. లీకేజీ పాయింట్ తుపాకుల గూడెం బ్యారేజి వద్ద ఉండాలని కేసీఆర్ తెలిపారు. పోలవరం వద్ద లీకేజీ పాయింట్ పెడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో తుపాకుల గూడెం వద్ద లీకేజీ పాయింట్ను చేపట్టాలని ఎందుకు చెప్పడం లేదు? రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్. చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్లపై కోర్టుకు వెళ్తాం. బనక చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం.కేటీఆర్పై ఏసీబీది టైం పాస్ విచారణ.ఇలాంటి విచారణలు చాలా చూశాం. హరీష్ రావుకు అస్వస్థత విషయం నాకు తెలియదు. నేను ఏ కార్యక్రమం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. బీఆర్ఎస్కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ’ అని కవిత స్పష్టం చేశారు. -
మాజీ మంత్రి హరీష్రావుకు అస్వస్థత
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(జూన్ 16) సాయంత్రం సమయంలో తెలంగాణ భవన్లో హరీష్ రావు అస్వస్థతకు లోనయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆచ్.. ఏసీబీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత నిర్విహించిన సమావేశంలో హరీష్రావు స్వల్పపాటి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను అక్కడ నుంచి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హై ఫీవర్తో హరీష్రావు ఆస్పత్రిలో చేరారు.వైరల్ ఫీవర్, డి ఐడ్రేషన్తో బాధ పడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు.. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ భవన్లోనే ఉన్నారు.సాయంత్రం 7 గంటలకు బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో హరీష్రావును జాయిన్ చేయగా, ఆయన్ను కేటీఆర్, ఇతర బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. -
చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది: హరీష్రావు
హైదరాబాద్: చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరంటూ మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయమన్నారు. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీచ డీఎంఈలు ఎన్ఎమ్సీ ముందు హాజరు కావాలని తాఖీదులు ఇవ్వడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శమన్నారు హరీష్రావు. ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం.. ఈరోజు కమిటీ వేయడం హాస్యస్పదమన్నాఆరు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న సీఎం రేవంత్.. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్కు ఎవరు భరోసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన.. మెడికల్ కాలేజీ విద్యార్థులకు శాపంగా మారుతుందన్నారు. ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థుల జీవితాలు నిలబెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీమంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్టు డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్) సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్... ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ మేరకు గోదావరి బనకచర్ల అంశంపై మంత్రి ఉత్తమ్కు మాజీమంత్రి హరీశ్రావు ఆదివారం ఒక లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించేలోపే, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా, ఏపీ యూనిలేటరల్గా ముందుకెళ్తుండటం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి ఈ ఏడాది జూన్ 13న మంత్రి ఉత్తమ్ లేఖ రాయడాన్ని హరీశ్రావు అభినందించారు. ‘ఏపీ తీసుకుంటున్న చర్యలు.. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతోపాటు నదీ జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించడమే. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలి. గోదావరి జలాల్లో 969 టీఎంసీల తెలంగాణ వాటాలో ఇప్పటివరకు వినియోగం 600 టీఎంసీలకు పెరిగింది. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి బరాజ్లు, 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో గోదావరి బేసిన్ అభివృద్ధి, చెరువులు, చెక్ డ్యామ్లు, మిషన్ కాకతీయ, కాల్వల ద్వారా గోదావరి నీటిని వ్యవస్థీకృతంగా వినియోగంలోకి తెచ్చాం. కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్కసాగర్, వార్ధా (బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టు) డీపీఆర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఏపీ వానాకాలపు వరద జలాలే తరలిస్తామన్నా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్లో ‘ఆల్ వాటర్స్’అనే పదమే ఉన్నదని నిపుణుల అభిప్రాయం. అదనపు జలాలు అనే అంశం గోదావరి అవార్డులో లేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు ఈ 157.5 టీఎంసీల అదనపు వాటాను కోరాలి. న్యాయ నిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలి. కేసీఆర్ పోరాట ఫలితంగా ఇప్పుడు 45 టీఎంసీలతో పాటు 112.5 టీఎంసీల అదనపు వాటా కోసం ట్రిబ్యునల్ ముందు వాదించే అవకాశం వచ్చింది’అని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు. -
నదులు, నిధులు.. రెండూ ఆంధ్రాకేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల్లో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు ద్రోహం చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం పైసా సాయం చేయలేదని, కానీ ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి– బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మాట సాయం, మూట సాయం అందిస్తోందని మండిపడ్డారు. ‘బనకచర్ల ప్రాజెక్ట్ పేరిట ఏపీ చేస్తున్న జల దోపిడి – కాంగ్రెస్ మౌనం’అనే అంశంపై హరీశ్రావు శనివారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఇరిటేషన్ తప్ప ఇరిగేషన్ ఎక్కడ?‘రేవంత్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఇరిటేట్ (అసహనానికి గురిచేయటం) చేయడం తప్ప ఇరిగేషన్పై దృష్టి పెట్టడం లేదు. బనకచర్ల లింక్ ద్వారా గోదావరి జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా ప్రతిపక్షాలపై కేసులు, విచారణలు, మంత్రివర్గ విస్తరణ అంటూ సీఎం దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నాడు. నీటిపారుదలపై అఖిలపక్ష సమావేశానికి ముందుకు రాకుండా తాము సన్నద్ధం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్తున్నాడు.బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేకున్నా కేంద్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీకి వత్తాసు పలుకుతోంది. సమైక్య పాలనలో సమైక్య పాలకుల వద్ద బానిసల్లా బతికిన వారు స్వరాష్ట్రంగా ఏర్పడినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్ర నాయకత్వం వద్ద తాకట్టు పెడుతున్నారు. నదీ జలాలను ఏపీకి కేంద్రం దోచి పెడుతున్నా సీఎం రేవంత్ స్పందించడం లేదు’అని హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా నదీ జలాల్లో అన్యాయంపై మాట్లాడటం లేదని ఆరోపించారు. చంద్రబాబుతో బీజేపీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ ప్రాజెక్టులను కేంద్ర మంత్రులు అడ్డుకోవడం పాటు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి ఏపీ జలదోపిడీని అడ్డుకునేలా ఏకగ్రీవ తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. కాళేశ్వరంపై త్వరలో ప్రజల వద్దకుత్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్హౌజ్లను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని హరీశ్రావు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత రైతులతో కలిసి బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపైనా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని పేర్కొన్నారు. సొంత అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడితే రేవంత్రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. -
తెలంగాణకు మాట.. మూట సాయం కూడా లేదు: కేంద్రంపై హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మాట సాయం, మూట సాయం కూడా కేంద్రం చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్కు ఎలా నోటీసులు ఇవ్వాలనే ఆలోచనతోనే రేవంత్ సర్కార్ పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న హరీష్రావు.. బనకచర్లకు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, అపెక్స్ కమిటీ అనుమతులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా?. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని చూశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు’’ అంటూ హరీష్రావు మండిపడ్డారు. -
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్కు హరీష్ రావు
-
మరోసారి.. కేసీఆర్తో హరీష్ రావు భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లిన ఆయన.. కేసీఆర్తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్కు వివరించినట్లు తెలిసింది. వీరి భేటీ సుమారు 3గంటల పాటు సాగింది. అయితే, ఇవాళ మరోసారి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లి కేసీఆర్తో భేటీ అయ్యారు. -
హైకోర్టులో హరీష్ రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ అనే అభ్యర్థి ఈ పిటిషన్ దాఖలు చేశారు.నాడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన హరీష్ రావు తమ ఆస్తులను సరిగా వెల్లడించలేదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు చక్రధర్ గౌడ్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. ఈ కేసులో హరీష్ రావు తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. ఇది కూడా చదవండి: ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య.. బెంగళూరు తొక్కిసలాటపై చర్చ? -
అన్ని నిర్ణయాలూ మంత్రివర్గ ఆమోదంతోనే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగిందని నీటిపారు దల శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు చెప్పారు. మంత్రివర్గ ఆమోదంతోనే డీపీఆర్ తయారీ పనులను వ్యాప్కోస్కు అందించినట్టు తెలిపారు. బరాజ్ల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం తన కార్యాలయంలో హరీశ్రావుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలు సంధించింది.సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పరిధి ఏమిటి? అని కమిషన్ ప్రశ్నించగా, హరీశ్రావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర వివాదాలు ఉండటం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో.. వాటి నిర్మాణాన్ని పునఃసమీక్షించి రీఇంజనీరింగ్పై సిఫారసులు చేసేందుకు గత ప్రభుత్వం తన నేతృత్వంలో నాటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావుతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల ఆధారంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించడం జరిగిందని, ఒక భాగాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేయగా, రెండో భాగాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా నిర్మించడం జరిగిందని తెలిపారు. అందుకే మేడిగడ్డకు బరాజ్.. మహారాష్ట్ర అభ్యంతరాలు, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ పేర్కొనడంతో బరాజ్ లొకేషన్ను మేడిగడ్డ వద్దకు మార్చినట్టు హరీశ్రావు చెప్పారు. ‘2014 జూలై 23న నేను మహారాష్ట్ర వెళ్లి అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రీఫ్ను కలవగా, తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తేల్చి చెప్పారు. అక్కడ బరాజ్ నిర్మాణానికి అంగీకరించమబోని, పనులు చేపట్టి నిధులు వృధా చేసుకోవద్దని కోరుతూ నాటి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి రాసిన లేఖ ప్రతిని ముష్రీఫ్ నాకు అందజేశారు.బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ధర్నాలు చేస్తుండడంతో అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015 ఫిబ్రవరి 17న మహారాష్ట్ర రాజ్భవన్లో ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తాను స్వయంగా ఆందోళనలు చేసిన నేపథ్యంలో అనుమతించడం సాధ్యం కాదని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు..’ అని హరీశ్రావు వివరించారు.అలాగైతే 48 టీఎంసీల లభ్యతే.. ‘మహారాష్ట్ర అనుమతించిన మేరకు తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 48 టీఎంసీల లభ్యతే ఉంటుంది. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీలను తరలించుకోగలం. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత మాత్రమే ఉండగా, అందులో 63 టీఎంసీలపై ఎగువ రాష్ట్రాలకు హక్కులున్నట్టు తేల్చుతూ 2015 ఫిబ్రవరి 18న సీడబ్ల్యూసీ లేఖ రాసింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు 160 టీఎంసీల నీళ్లు అవసరం. ఆ మేరకు నీళ్లను నిల్వ చేసుకోవడానికి బరాజ్ల నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని 2008 ఆగస్టు 12న సీడబ్ల్యూసీ ఇంకో లేఖ రాసింది. అందుకే ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది.మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని 2017 నవంబర్ 12న సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. అక్కడ బరాజ్ నిర్మించాలని 2016 జనవరి 17న వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది..’ అని మాజీమంత్రి చెప్పారు. అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ మార్చాలని హైపవర్ కమిటీ సిఫారసు చేసిందా? అని కమిషన్ అడగగా.. ఇలాంటి సాంకేతిక అంశాలపై నీటిపారుదల శాఖ నిర్ణయాలు తీసుకుందని బదులిచ్చారు. ఇంజనీర్ల సూచనలను గౌరవించారా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని హరీశ్ చెప్పారు. సైట్ పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టుల లొకేషన్లు మారడం సహజమేనని, నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్ వంటి ప్రాజెక్టుల విషయంలో సైతం అలానే జరిగిందని అన్నారు. కేఐపీసీఎల్ ఏర్పాటుపై కేబినెట్లో నిర్ణయం ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉండడంతోనే రుణాల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్(కేఐపీసీఎల్)ను ఏర్పాటు చేశాం. కేఐపీసీఎల్ ఏర్పాటుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా, దాని రుణాలు, వడ్డీలను ఎలా తిరిగి చెల్లించాలనే అంశంపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు..’ అని హరీశ్ తెలిపారు. రుణాలకు ప్రభుత్వం పూర్తి గ్యారెంటీ ఇచ్చి వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించిందని వివరించారు. నీటి నిల్వ ఇంజినీర్లకు సంబంధించిన బాధ్యత ఎవరి ఆదేశాలతో బరాజ్లలో నీళ్లను నిరంతరంగా నిల్వ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. ఇది ఇంజనీర్లకు సంబంధించిన బాధ్యత అని హరీశ్ చెప్పారు. ఈ విషయంలో తామెలాంటి సూచనలు చేయలేదన్నారు. నీటి నిల్వ కోసమే బరాజ్లు నిర్మించారా? అని కమిషన్ అడగగా, ఇది పూర్తిగా సాంకేతిక పరమైన అంశమని జవాబిచ్చారు. బరాజ్లలో ఏ పరిమాణంలో నీళ్లను నిల్వ చేయాలి అని కమిషన్ ప్రశ్నించగా, మొత్తం 141 టీఎంసీలను నిల్వ చేసేందుకు వాటిని నిర్మించామని చెప్పారు.కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాక కొత్తగా ఫ్లడ్ బ్యాంకులు, డిశ్చార్జి ఛానల్స్ నిర్మాణం పనులు అప్పగించడం ప్రణాళిక లోపం కాదా? అని కమిషన్ అడగగా, సాంకేతిక అంశాలపై సమాధానమివ్వలేనని హరీశ్ బదులిచ్చారు. టెండర్లు పూర్తై కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాక నిబంధనలు మార్చవచ్చా? అని ప్రశ్నించగా, క్షేత్ర స్థాయి పరిస్థితుల ఆధారంగా నీటిపారుదల శాఖ సిఫారసులు చేస్తే మార్చవచ్చని వివరణ ఇచ్చారు. నిపుణుల కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని కమిషన్ అడగగా, మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నీటి తరలింపుపై సిఫారసులు చేసేందుకని బదులిచ్చారు. ఎన్టీపీపీసీ పవర్ ప్లాంట్తో పాటు బొగ్గు గనులుండడంతో నేరుగా నీటి తరలింపు సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిందన్నారు. హిందీలో చెప్పండి పరవాలేదు.. దాదాపు గంట పాటు హరీశ్రావు క్రాస్ ఎగ్జామినేషన్ను కమిషన్ నిర్వహించింది. తెలుగు మాధ్యమంలో చదివిన తనకు ఆంగ్లంపై పట్టులేదని ప్రారంభంలోనే హరీశ్రావు తెలపగా, హిందీలో సమాధానమిస్తే ఆంగ్లంలో తర్జుమా చేసుకుంటామని జస్టిస్ ఘోష్ చెప్పారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలకు సైతం కోర్టు హాల్లోకి కమిషన్ అనుమతినిచ్చింది.న్యాయవాదులకు అనుమతి లేదని కమిషన్ సిబ్బంది తెలియజేయగా, లిఖిత పూర్వక ఆదేశాలు తీసుకొస్తేనే బయటకు వెళ్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత సోమ భరత్కుమార్ వాగ్వాదానికి దిగారు. దీంతో సాధారణ వ్యక్తులుగా కూర్చోవడానికి వారికి కమిషన్ అనుమతినిచ్చింది. క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం బీఆర్కేఆర్ భవన్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన హరీశ్రావు వివరాలను వెల్లడించారు. -
Kaleshwaram Commission: 40 నిమిషాలు హరీశ్ రావును ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
-
మాజీ సీఎం కేసీఆర్తో హరీష్రావు భేటీ..
సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హారీస్రావు సమావేశమయ్యారు. ఈరోజు(జూన్9వ తేదీ) కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్రావు.. ఆపై నేరుగా కేసీఆర్తో సమావేశం కావడానికి బయల్దేరి వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హరీష్ రావు హాజరు అయిన నేపద్యంలో వీరి మధ్య సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్య క్రమంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు భారీ కాన్వాయ్తో వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్కు హరీష్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళం నడుమే హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు,. అనంతరం హరీష్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తాను వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు. -
బీఆర్కే భవన్కు హరీష్రావు.. లీగల్ టీమ్తో పోలీసుల వాగ్వాదం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలుదేరారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు భారీ కాన్వాయ్తో హరీష్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్కు హరీష్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ లీగల్ టీమ్.. ఓపెన్ కోర్టులో కూర్చున్న సమయంలో పోలీసులు వారి వద్దకు వెళ్లి.. ఇక్కడ అనుమతి లేదని, బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా లీగల్ టీమ్ స్పందిస్తూ.. ఓపెన్ కోర్టులో ఎవరైనా ఉండవచ్చు.. రాకూడదని గెజిట్ ఇవ్వాలని పోలీసులకు తెలిపారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు హారీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తోంది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటుచేసినా, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను.గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఆలోచించవలసింది ఉద్దేశంతో కాదు, విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయ దుర్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తుంది. విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాలరాయద్దు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది. ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తిస్థాయిలో సమాధానం చెప్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో లేము కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను వారికి అందిస్తాం’ అని తెలిపారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై వాస్తవాలు వివరించినా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అబద్ధాల ప్రవాహాన్ని ఆపడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై స్పందిస్తూ మంత్రి ఉత్తమ్ చేసిన విమర్శలను హరీశ్రావు ఖండించారు. ‘ఐదేళ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలు మాత్రమేనని చెబుతున్న ఉత్తమ్.. కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు లిఫ్ట్ చేసిన నీటి వివరాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్హౌస్ల నుంచి ఎత్తిపోసిన నీళ్ల వివరాలు దాచిపెడుతున్నారని విమర్శించారు.కాళేశ్వరం కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీలు, నంది మేడారం పంప్హౌస్ నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంప్హౌస్ నుంచి 179.41 టీఎంసీల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఎత్తిపోశామన్నారు. మంత్రికి తెలియకుంటే ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా తొలి దశలోనే పూర్తి ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యపడదనే విషయంతోపాటు కాల్వలు తవ్వుతున్నకొద్దీ నీరు అందే ఆయకట్టు పెరుగుతుందనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు.ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, కల్వకుర్తి దేవాదుల సహా ఏ ప్రాజెక్టులో అయినా మొదట హెడ్ వర్క్స్ పూర్తి చేసి టెయిల్ వర్క్స్ తర్వాత పూర్తి చేస్తుంటారని.. కానీ కాంగ్రెస్ మాత్రం కమీషన్ల కోసం తోక పనులు ముందు మొదలుపెట్టి, హెడ్ వర్క్స్ వదిలి పెట్టిందని హరీశ్రావు విమర్శించారు. తలాతోక లేని మాటలు మానుకొని అబద్ధాల ప్రచారం మానాలని హితవు పలికారు. -
అబద్ధాలను పటాపంచలు చేస్తాం: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో బీఆర్ఎస్కు మంచిపేరు రావడంతోపాటు లబ్ధి జరుగుతుందనే దురుద్దేశంతో నాడు ప్రతిపక్షంలో, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బురద జల్లుతోందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నిజమని నిరూపించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం. తెలంగాణ జీవధార. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణకు కల్పతరువు. అలాంటి ప్రాజెక్టును రీఇంజనీరింగ్ను చేయడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు నిజాలు వివరిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందుకు వెళ్లి నిజాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను పటాపంచలు చేస్తాం. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ నాయకత్వం బెదరదు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేసి సాగునీటిని అందించాలి. లేనిపక్షంలో ప్రజాఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం’అని హరీశ్రావు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం–వాస్తవాలు అనే అంశంపై హరీశ్రావు సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సహా పార్టీ ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో సుమారు గంటన్నరపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. సీఎం, మంత్రులది దుష్ప్రచారం.. ‘మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాళేశ్వరం కుప్పకూలిందంటూ దుష్ప్రచారం చేస్తున్న వారు ఈ ప్రాజెక్టు అనేక రిజర్వాయర్లు, బ్యారేజీలు, కాలువలు, పంప్హౌస్ల సమాహారమని గుర్తించాలి. కానీ ఈ అంశాన్ని విస్మరించి ప్రాజెక్టు వ్యయం పెంపు, ఆయకట్టు మొదలుకొని అనేక విషయాలపట్ల సీఎం, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతోంది. రాష్ట్ర అవతరణకు ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు చెప్పినా ఒక్క అనుమతి సాధించలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ. 2,328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది. పనులు చేపట్టకుండానే అంచనాలను రూ. 17,875 కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచింది. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించకపోవడం, నీటి లభ్యత కేవలం 44 టీఎంసీలు ఉండటం, పర్యావరణ, అటవీ అనుమతులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే ప్రాజెక్టు రీడిజైనింగ్పై ఆలోచన చేశాం’అని హరీశ్రావు వివరించారు. తుమ్మడిహెట్టి వద్ద ప్రయత్నాలు విఫలమైనందునే.. ‘తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు మహారాష్ట్రలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు విఫలమయ్యాయి. తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచన మేరకు మేడిగడ్డను ఎంపిక చేశాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. ప్రాజెక్టును విస్తరించడం వల్లే అంచనా వ్యయం పెరిగింది. దేశంలో అతితక్కువ అంచనా వ్యయం పెంపుతో, అతితక్కువ సమయంలో నిర్మితమైన ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమే. పోలవరం ప్రాజెక్టు కుప్పకూలినా ఎన్నడూ సందర్శించని ఎన్డీఎస్ఏ.. ఇప్పుడు ఈడీ, సీబీఐ తరహాలో కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలా వ్యవహరిస్తోంది. ఎన్డీఎస్ఏ నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేసిన గంధమల్లకు నీరు ఎక్కడి నుంచి వస్తోందో చెప్పాలి’అని హరీశ్రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. నిందలు, దందాలు, చందాల నినాదంతో రేవంత్ పాలన: కేటీఆర్ ‘తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలకు పాతరేసిన సీఎం రేవంత్ దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నాడు. బీఆర్ఎస్పై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చందాలు అనే నినాదంతో పాలన సాగిస్తున్నాడు. గోదావరి, కృష్ణాలో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్ కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, సీతారామ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారు. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా సీఎం, మంత్రులు, బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు. దేశంలో, రాష్ట్రంలో ఏ ప్రాజక్టులు, బ్రిడ్జీలు కూలినా స్పందించని ఎన్డీఎస్ఏ.. కాళేశ్వరంలోని 100 కాంపోనెంట్లలో కేవలం ఒక్కచోట రెండు పిల్లర్లు కుంగితే ఏడాదిన్నరగా మరమ్మత్తు చేయకుండా రాద్ధాంతం చేస్తోంది. ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట బీజేపీ ఆఫీసులో ఎన్డీఏ రిపోర్ట్ తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నివేదిక చెత్తబుట్టలో వేయడానికి తప్ప దేనికీ పనికి రాదని ఎల్ అండ్ టీ సంస్థ తేల్చిచెప్పింది. పార్లమెంటు నూతన భవనం, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది కూడా ఎల్ అండ్ టీ సంస్థే. కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తెలంగాణ రైతుల గొంతు నొక్కే కుట్ర చేస్తున్న నేపథ్యంలో జిల్లాకు కూడా వెళ్లి వాస్తవాలు చెప్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. ‘చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీతో కుమక్కు అయ్యారని మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. కాళ్లేశ్వరం కమిషన్ విచారణపై శనివారం హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) చెప్పిన విషయాలను ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చాం. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదుఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో నేను, ఈటల,తుమ్మల ఉన్నాం. సబ్ కమిటీ రిపోర్ట్పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను.గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమక్కు అయ్యాడు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది. కమీషన్ దగ్గర అది బయట పెడతా. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తాను’ అని హరీష్ రావు చిట్ చాట్లో తెలిపారు. -
‘మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే.. కాళేశ్వరమే కూలిపోయిందా?’
సాక్షి, తెలంగాణభవన్: రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బనకచర్లపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్లపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ‘నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్పై అభాండాలు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామన్ డైలాగ్ చెబుతున్నారు. మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటే రెండు పిల్లర్సే కూలాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు. కానీ, బనకచర్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం లేదు. తెలంగాణలో కమీషన్ల పాలన సాగుతోంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా హరీష్ రావు అద్భుతంగా పనిచేశారు. తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావు గారిది. తెలంగాణ తెచ్చుకున్న నీళ్ళు నిధులు నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయింది. నిందలు, దందాలు, చందాలు ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పాలన. సుంకిశాల, slbc టన్నెల్ కూలినా.. కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదు. టన్నెల్ కూలిపోయి కూలీలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.చిన్న పిల్లర్ మెడిగడ్డలో కూలితే దాన్ని రాద్దాంతం చేస్తోంది. గుజరాత్లో బ్రిడ్జ్ కూలి 140 మంది చనిపోతే.. ఏ రిపోర్ట్ ఉండదు.. బాధ్యులపై చర్యలు ఉండవు. బీహార్లో రోజుకో బ్రిడ్జి కూలిపోతే ఏ రిపోర్ట్ ఉండదు. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చింది.. పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. Ndsa రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారైంది. కాంగ్రెస్, బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ కమీషన్తో కాంగ్రెస్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మించారు. L and T సంస్థ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది. అదే సంస్థ మేడిగడ్డ బ్యారేజినీ నిర్మించింది. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు అని అన్నారు. -
ఎప్పుడేం జరుగుతుందో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ లోపల, వెలుపల చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ కేడర్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు విచారణ సంస్థల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో విచారణ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో కేడర్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకొని శనివారం హైదరాబాద్కు చేరుకోనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీటన్నింటిపై ఎలా స్పందిస్తారనే చర్చ నడుస్తోంది.కేసీఆర్ విచారణ నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఏమిటో?కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ ఎదుట విచారణకు ఈ నెల 9న హరీశ్రావు, 11న కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయంలో కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ ఇప్పటివరకు స్పందించక పోవడాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ చేపట్టే కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కవిత ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలపడం తెలిసిందే. ఈ నెల 11న కూడా తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.‘ఫార్ములా–ఈ’పై విచారణకు కేటీఆర్‘ఫార్ములా–ఈ’ కారు రేసు అంశంలో గతంలో విచారణకు హాజరైన కేటీఆర్కు ఈ నెల 5న రావాల్సిందిగా ఏసీబీ మరోసారి నోటీసు జారీ చేయగా అమెరికా పర్యటన ముగించుకొని వచ్చాక హాజరవుతానని పేర్కొనడం తెలిసిందే. శనివారం హైదరాబాద్ చేరుకోనున్న కేటీఆర్ ఈ నెల 3వ వారంలో ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్, మరో కీలక నేత హరీష్రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే సమయంలోనే కేటీఆర్కు కూడా నోటీసులు రావడం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.‘కవిత ఎపిసోడ్’పైనా పార్టీలో ఉత్కంఠఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడం కలకలం సృష్టించింది. గత నెల 23న అమెరికా నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో కేసీఆర్కు తాను లేఖ రాసిన విషయాన్ని అంగీకరిస్తూనే ‘కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అలాగే గత నెల 29న కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ జెండా, కండువాలు లేకుండా ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ కేడర్లో వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్ తాజా పరిణామాల జోలికి వెళ్లకుండా కేవలం సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు వంటి అంశాలపైనే దృష్టి సారించే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. -
బాబుకు సీఎం రేవంత్ రెడ్డి దాసోహం: హరీష్ రావు ఫైర్
సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దాసోహమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన క్యాబినెట్ సమావేశం వలన ఎటువంటి ప్రయోజనం లేకపోగా, తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిగా మరచిపోయిందని, రాష్టంలోని కాంగ్రెస్ నేతలు గాలి మోటార్పై తిరుగుతూ, గాలి మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. తాము ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారని, అది తీవ్ర నిరాశనే మిగిల్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని, దీనిపై క్యాబినెట్లో ఐదు గంటలపాటు చర్చించడం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను నిట్ట నిలువునా ముంచుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. సక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి, గ్రామాభివృద్ధికి పాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో సీఎం రెవంత్ రెడ్డిని మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడిన అబద్ధమేనని, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్లు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని హరీష్ రావు ఆరోపించారు.రైతులను దెబ్బతీసేలా క్రాఫ్ హాలీడేను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, 65 టీఎంసీల నీటిని ఉపయోగించకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నీతి అయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు నిలదీశారు. అలాగే చంద్రబాబు ఎదురించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్లనున్నదని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. శ్రీశైలం రైడింగ్ పాజెక్టు పనులు నిలిపివేయాలని కోరారు. కాళేశ్వరం కుప్ప కూలిందని చెబుతున్న సీఎం రెవంత్ రెడ్డి గంగమళ్లకు నీటిని ఎక్కడి నుంచి తెస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల -
పేదలను కొట్టి పెద్దలకు భూములు
సాక్షి, హైదరాబాద్: బీద రైతుల కడుపుకొట్టి వారి భూములను బడా పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే బాధ్యతను సీఎం భుజాన వేసుకున్నారని ఆరోపించారు. దీంతో రైతులపై తరచూ ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు, పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమని ‘ఎక్స్’లో గురువారం పోస్టు పెట్టారు. పాలమూరు బిడ్డనని పదేపదే చెప్పుకునే సీఎం.. తన సొంత జిల్లాలో ఘటన జరిగినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు పెద్ద ధన్వాడతోపాటు మొత్తం 12 గ్రామాల రైతులపై దాడి చేసి, 40 మందిపై కేసులు నమోదుచేశారని, 12 మందిని రిమాండ్కు పంపారని తెలిపారు. రైతులపై దాడి చేయించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాని, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ధన్వాడ తరహా ఘటనలు ఏడాదిగా రాష్ట్రంలో అనేకచోట్ల జరుగుతున్నాయని విమర్శించారు. పెద్ద ధన్వాడ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం హరితహారంమాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని హరీశ్రావు అన్నారు. -
ఎవరితోనూ పొత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అన్నట్లుగా ఎవరో మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. సొంతంగానే మనుగడ సాగిస్తూ.. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుంది. వంద అసెంబ్లీ సీట్లతో గులాబీ జెండా ఎగురుతుంది’అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొ న్న అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్రావు ప్రసంగించారు. ‘బీజేపీకి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు.పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు శాపం కాబోతున్నా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడటం లేదు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి నిలుపుదల చేస్తాం. కృష్ణా నదిలో నీళ్లు ఆపకుండా, గురువు చంద్రబాబుకు దాసోహం అయిన సీఎం ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే చేస్తున్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టినా, ఢిల్లీలో ధర్నా చేసినా కలసి వచ్చేందుకు సిద్ధం, బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఏదైనా చేస్తాం’అని హరీశ్ అన్నారు. ఆ ఫుటేజీ బయట పెట్టాలి..‘సీఎంకు దగ్గరగా ఉండే ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి.. మిస్ ఇంగ్లండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయట పెట్టి, వారిపై కేసులు నమోదు చేయాలి. తెలంగాణను కేసీఆర్ ప్రపంచ పటంలో నిలబెడితే, రేవంత్ తెలంగాణకు తలవంపులు తెచ్చారు’అని హరీశ్ ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో ఆదాయం నేలచూపులు..‘రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేసే వాళ్లు దివానా గాళ్లు. ఆరు గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చి, తాను తీసుకున్న గోతిలో రేవంత్ తానే పడిపోయారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నది. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్రెడ్డి.. తెలంగాణ ద్రోహి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్కు లేదు’అని హరీశ్ విమర్శించారు.దుర్మార్గుల చేతుల్లోకి తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి గందర గోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు కలిచివేశాయని, ఓ దశలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనుకున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు ప్రసంగించారు. మధుసూదనాచారి, హరీశ్రావు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే జయశంకర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తర్వాత జాతీయ పతాకాన్ని మధుసూదనాచారి ఆవిష్కరించారు. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్, పార్టీ నేతల శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం. అదే స్పూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారాయన. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హరీష్రావు ట్విట్టర్ వేదికగా.. దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు. ‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. .. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ. స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువ లేనివి. వారికి జోహార్లు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు.సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు.‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో..కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. సబ్బండ… pic.twitter.com/K83N9b19CV— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2025 -
సెల్ఫోన్ టార్చ్తో ట్రీట్మెంట్పై హరీష్రావు ఫైర్
హైదరాబాద్, సాక్షి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో(Zaheerabad Govt Hospital Incident) సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం చేసిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish rao) స్పందించారు. పాలన పడకేసిన రాష్ట్రంలో చివరకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారాయన.ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు.. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో(Cell Phone Torch Treatment) చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.రోజుకు 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా(Zaheerabad Area Hospital) ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతున్నది అన్నారాయన. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించండి’’ అని రేవంత్ను ట్యాగ్ చేస్తూ హరీశ్రావు పోస్ట్ చేశారు.ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి.300 పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు.ఏడాదిన్నరగా… pic.twitter.com/rm1o4SKaXS— Harish Rao Thanneeru (@BRSHarish) May 31, 2025 -
త్వరలోనే ఆ బండారాన్ని ఆధారాలతో బయటపెడతా: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ మాజీ మంత్రి హరీష్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది’’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు.అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరు నమ్మడం లేదని ప్రతీ వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్రెడ్డి.. 6,200 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దింపడం ఇంకో తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదు. హిమాచల్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్ని కట్టేందుకు టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అంటూ హరీష్రావు డిమాండ్ చేశారు.‘‘రెండు దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందు రాని ప్రాజెక్ట్ను ఎందుకు నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసి వస్తోంది?. డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వంతో ఎంవోయు చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద 26 కోట్ల రూపాయలు చెల్లించి మరో 26 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడడాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయి’’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు...2009లోనే మోసర్ బేర్ కంపెనీ 64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిపాదిత సేలి, మియార్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించింది. కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం తాము చెల్లించిన 64 కోట్ల ప్రీమియంని హిమాచల్ ప్రభుత్వం తిరిగి ఇవ్వనందుకు గాను ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించింది. హిమాచల్ హైకోర్టు మోసర్ బేర్ కంపెనీకి వడ్డీతో సహా తీసుకున్న డబ్బును 2023 జనవరిలోనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్ధ రేవంత్ సర్కారు హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది.…— Harish Rao Thanneeru (@BRSHarish) May 30, 2025..10 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢిల్లీలోని హిమాచల్ భవన్ ను వేలం వేసి ఆ డబ్బుని కంపెనీకి చెల్లించాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 7 నెలలకు పైగా అత్యధికంగా మంచు కురిసే ప్రాంతంలో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదని 2019లో ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా చేతులు ఎత్తేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాంటి అనువు కాని ప్రాంతం లో 6,200 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో 510 మెగా వాట్ల హైడ్రల్ ప్రవర్ ప్రాజెక్టులకు ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉబలాటపడుతుందో శ్వేతా పత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నాం.ఫీజిబిలిటీ రిపోర్ట్లు, డీపీఆర్ లు లేకున్నా, జెన్ కో బోర్డు ఆమోదం లేకున్నా కూడా ఎంవోయూ చేసుకొని 26 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గూడు పుఠాణి ఏందో గల్లీ కాంగ్రెస్ చెప్తుందా? ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్తుందా?. సాధ్యం కాదు అని 20 ఏండ్లుగా కట్టని ప్రాజెక్టును ఎవరి లాభం కొరకు, ఎవరి మెప్పు కోసం కడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి.రైతు రుణమాఫీకి డబ్బు లేదంటారు.. రైతు బంధుకు డబ్బు లేదంటారు. రైతు బీమాకి డబ్బు లేదంటారు. ఆసరా పెన్షన్ కి డబ్బు లేదంటారు. మహాలక్ష్మి కింద నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకానికి డబ్బు లేదంటారు. తులం బంగారానికి డబ్బు లేదంటారు. విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్కి డబ్బు లేదంటారు. విద్యా భరోసాకి డబ్బు లేదంటారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు డబ్బు లేదంటారు. ఉద్యోగుల డీఏలకు, పీఆర్సీకి దిక్కు లేదంటారు. చివరికి అప్పు కూడా పుడుతలేదు అని అన్న రేవంత్ రెడ్డికి హిమాచల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్కు 6,200 కోట్లు ఎక్కడ నుండి వస్తాయో చెప్పాలి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్థిష్టమైన సమాచారం మా వద్ద ఉంది. త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతాం’’ అంటూ హరీష్రావు హెచ్చరించారు. -
కవిత కొత్త పార్టీ ప్రకటన అప్పుడే.. చేరబోయేది ఎవరంటే
సాక్షి,హైదరాబాద్: ‘మై డియర్ డాడీ అంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. తండ్రి కేసీఆర్కు రాసిన ఆరు పేజీల లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించింది. అయితే, ఆ లేఖ బీఆర్ఎస్తో పాటు, ఆ పార్టీ కీలక నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో నాటి నుంచి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ కీలక నేతల గురించి, అంతర్గత వ్యవహారాల గురించి ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని ఒకరు? కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మరొకరు బహిరంగ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇదే తరహా సంచలన వ్యాఖ్యలు చేశారు.జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కవిత సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయనున్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న తరుణంలో కొత్త పార్టీ పేరుతో కేసీఆర్ కుటుంబం డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వారి కుటుంబంలో ఎవరికి ఎవరు నచ్చకపోయినా కవిత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు రఘునందన్ రావు. కేసీఆర్కు కవిత లేఖఇటీవల కేసీఆర్కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన సమయంలో రఘునందన్ రావు కవిత, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీ నా , ఆస్తుల పంచాయతీ నా? కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమని తెలుస్తోంది. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త పార్టీ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్కు సంబంధించిన పత్రిక, టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సీఎం ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఇటీవలే బీఆర్ఎస్ సిద్ధాంత కర్త, పునాది అని చెప్పుకునే వ్యక్తి హరీష్తో కొత్త పార్టీ పెట్టించాలని అన్నారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నం సాగుతున్నది. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఆపడం ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఏకంగా కవిత కొత్త పార్టీ పెట్టడమే కాదు, అందులో చేరబోయే నేతల గురించి ప్రస్తావిస్తూ రఘునందన్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. -
కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. స్పందించిన కవిత
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది’’ అంటూ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత అన్నారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025 హరీష్రావు రియాక్షన్.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్రావు స్పందిస్తూ.. ప్రతీకార రాజకీయాలు రేవంత్ రెడ్డి అభద్రతకు స్పష్టమైన సంకేతమన్నారు. ‘‘కల్పిత కేసులు కోర్టులో నిలబడవు. ప్రజల విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గెలుచుకోవు. కేటీఆర్కు అండగా నిలబడతాం. కేటీఆర్ ఏసీబీ కేసులో సత్యం గెలుస్తుంది’’ అని హరీష్రావు అన్నారు. -
బనకచర్లతో తెలంగాణకు భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవలసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు.. తమకేమీ పట్టనట్లుగా ఉన్నారని ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జల దోపిడీ మళ్లీ షురూ ఉమ్మడి పాలనలో సాగిన జల దోపిడీ, నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని, ఎప్పటిలాగే పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదిలి సీఎం రేవంత్రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందన్నారు.ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని విమర్శించారు. నాడు తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని లేఖలు రాసిన చంద్రబాబు నేడు మిగులు జలాలను తీసుకుంటున్నట్లు చెప్పడం శోచనీయమన్నారు. ఏ ఒక్క అనుమతి లేకుండా, నిబంధనలు బుల్డోజ్ చేస్తూ, కేంద్రం జుట్టు తమ చేతిలో ఉందని ఏపీలో రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనుమతుల్లేని ప్రాజెక్టుకు నిధులెలా ఇస్తారు? గత అసెంబ్లీలో నీతి అయోగ్ బహిష్కరిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందరి కంటే ముందే నీతి అయోగ్ మీటింగ్కు వెళ్లారని, బనకచర్లను అడ్డుకుంటారని భావిస్తే ఏమీ మాట్లాడకుండా వచ్చారని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు 50 శాతం కేంద్రం గ్రాంటు ఇవ్వడంతో పాటు, మరో 50 శాతం ఎఫ్ఆర్బీఎంను మించి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తారని చెపుతున్నారని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించే ప్రాజెక్టుకు ఇలా నిధులు, అనుమతులు, రుణాలు ఎలా ఇస్తారని నిలదీశారు. కిషన్రెడ్డి చొరవ చూపి ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు. లేదంటే ఢిల్లీ సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణపై ఎందుకింత కక్ష? పోలవరానికి జాతీయ హోదా ఇచి్చ..కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని హరీశ్రావు ప్రశ్నించారు. పోలవరానికి రూ.80 వేల కోట్లు, బనకచర్లకు రూ.80 వేల కోట్లు కలిపి రూ.1.6 లక్షల కోట్లు ఏపీకి ఇస్తున్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు అందులో ఒక్క శాతం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి ఎందుకింత కక్ష, సవతి తల్లి ప్రేమో అర్థం కావడం లేదన్నారు.కృష్ణాలో వాటా కోసం కేసీఆర్ పోరాటం చేసి సెక్షన్ 3ని సాధించారని,. కొత్త ట్రిబ్యునల్ సాధించారని చెప్పారు. గోదావరి మీద కూడా భవిష్యత్తులో కొత్త ట్రిబ్యునల్ వస్తుందని భావించి ప్రాణహితకు 160 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే, కాళేశ్వరానికి 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పలు ప్రాజెక్టులు చేపట్టి కొన్నింటిని పూర్తి చేశామని వివరించారు. కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఉండబట్టే నీళ్లు కిందకు వెళుతున్నాయని అన్నారు. -
తెలంగాణకు రేవంత్, ఉత్తమ్ తెల్ల ఏనుగులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును వైట్ ఎలిఫెంట్ (తెల్ల ఏనుగు) అని విమర్శిస్తూ.. మరోవైపు అవే ప్రాజెక్టులో అంతర్భాగమైన రిజర్వాయర్లను ప్రభుత్వం వాడుకుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీమళ్లీ చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దు్రష్పచారం చేయడమే సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ఏకైక ఎజెండాగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్, ఉత్తమ్ తెలంగాణ పాలిట నిజమైన తెల్ల ఏనుగులు అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం హరీశ్రావు సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రాష్ట్ర ఆదాయానికి, మంత్రి ఉత్తమ్ నీటి వాటాకు గండి కొడుతున్నారని విమర్శించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు మినహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆరోపించారు. ఏడాదిన్నర అయినా తట్టెడు మట్టి తీయలేదు గతంలో ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రతో పాటు కేంద్రంలోనూ ఏకకాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు సాధించలేదని హరీశ్రావు విమర్శించారు. ‘తట్టెడు మట్టి తీయకుండా, ఒక్క ఇటుక పేర్చకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2,328 కోట్లు స్వాహా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టులో భూ సేకరణ, ఇతర పనుల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,780 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మీరు ఆనాడు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి, ఎల్లంపల్లి వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి ఉంటే ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నరగా తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి తీయలేదు’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారని, మంత్రి మనసులో ఉన్న కుట్రకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని హరీశ్రావు మండిపడ్డారు. గోదావరి జలాలు ఎత్తుకుపోతుంటే ఏం చేస్తున్నారు? తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేసున్నా.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని హరీశ్రావు ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తూ, మిగతా 50 శాతం నిధులకోసం ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి అప్పు చేసేందుకు అనుమతి ఇవ్వడం అన్యాయం, అనైతికం అని మండిపడ్డారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతూ, ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. -
‘కవిత లేఖ ఓ డ్రామా.. ఇది ఆ ఇద్దరి పనే!’
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయాలను కాస్త హీటెక్కించాయి. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని ఇరు పార్టీలు తేల్చేశాయి. ఈలోపు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ కలకలం రేపింది. అయితే ఈ లేఖపై కవిత లేఖ(Kavitha Letter)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెరలేపిందన్నారు. ‘‘కవిత లేఖ ఉత్తదే. కేసీఆర్కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా?. బీజేపీ పై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తదా?. కేటీఆర్ హరీష్ రావులే ఈ లేఖ తయారు చేయించారు. కవిత పేరుతో బయటకు వదిలారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలసి పోటీ చేయడం ఖాయం. ఈ లేఖతోనే బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడింది. వరంగల్ సభతో బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయింది. అందుకే ఈ డ్రామాలు’’ అని అన్నారాయన. మరోవైపు.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కీలక నేతలు స్పందించేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత లేఖపై స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సీనియర్ నేత హరీష్రావును మీడియా కోరగా.. ఇద్దరూ స్పందించలేదు. ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మైక్ను పక్కకు తోసేయగా.. హరీష్రావు(Harish Rao) మాత్రం కవిత లేఖపై త్వరలో స్పందిస్తామంటూ హడావిడిగా కారెక్కి వెళ్లిపోయారు. కిందటి నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ ధూం ధాం సభ సక్సెస్ అయ్యిదంటూనే.. అది పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయిందంటూ కొన్ని ప్రతికూల పాయింట్లను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు నోట్ ఒకటి తెర మీదకు వచ్చింది. పైగా బీజేపీ గురించి తక్కువ మాట్లాడేసరికి ఆ పార్టీతో పొత్తు ఉండబోతుందనే ప్రచారం బలంగా సాగుతోందంటూ అందులో వివరణాత్మకంగా రాసి ఉంది. ‘‘బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు(BRS-BJP Alliance) పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీతో ఇబ్బంది పడిన నేను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నా. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది’’ అయితే ఆ నోట్ ఆమె రాసిందేనా? అనేదానిపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కవిత లేఖపై అనుమానాలు: డీకే అరుణకేసీఆర్కు కవిత లేఖ లేఖ రాయాల్సిన అవసరం ఏముందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారామె. ఇదీ చదవండి: మై డియర్ డాడీ.. -
నోటీసులపై ఏం చేద్దాం?.. ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్తో హరీష్రావు భేటీ
సాక్షి, సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్రావు.. సుమారు మూడు గంటల పాటు కేసీఆర్తో మంతనాలు సాగించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా? వద్దా? అన్న దానిపై చర్చించినట్లు సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది.కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది.బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్రావు, ఈటల రాజేందర్లకు సైతం నోటీసులు ఇచ్చింది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్కు తెలిపింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. బరాజ్ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కేసీఆర్కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్రావు, ఈటల రాజేందర్లకు సైతం నోటీసులు ఇచి్చంది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్కు తెలిపింది. ఇప్పటికే పలువురి విచారణ పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమరి్పంచేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. బరాజ్ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సహజ న్యాయ సూత్రాల మేరకు ఈ ముగ్గురి వాదనలు సైతం వినాలని జస్టిస్ ఘోష్ నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం నిర్మాణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్లను ప్రశ్నించి మరింత సమాచారం జోడిస్తే సమగ్ర నివేదిక ఇచ్చినట్లు అవుతుందని భావించిన కమిషన్ వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 సెక్షన్ 311ను అనుసరించి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు ఇంజనీర్లు, నిర్మాణదారులు, అప్పట్లో నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను విచారించిన సంగతి విదితమే. 2019లో బరాజ్ల నిర్మాణం పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బరాజ్ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించగా 2019 మేలో పూర్తయ్యాయి. అయితే 2023 సెపె్టంబర్లో మేడిగడ్డ బరాజ్లోని ఒక బ్లాక్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే నివేదిక ఇచి్చంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మొదటి దఫాలో హరీశ్రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రెండో దఫాలో కేసీఆర్ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించగా.. హరీశ్రావు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం తదితర అంశాల్లో వీరి నిర్ణయాలు కీలకంగా ఉన్నాయనే ఉద్దేశంతో, వారిని విచారించి వాదనలు రికార్డు చేయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. నోటీసుల ప్రకారం వారంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఒకవేళ వారు కోరితే వర్చువల్గా కూడా విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్తో హరీశ్రావు భేటీపీసీ ఘోష్ కమిషన్ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్రావు ఎర్రవల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. నోటీసులు, తదుపరి పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగగా.. కేసీఆర్, హరీశ్రావు విచారణకు హాజరవుతారా? లేదా సమయం కోరతారా అన్న అంశంలో స్పష్టత రాలేదు. -
కేసీఆర్ తో పాటు హరీష్రావు, ఈటలకు నోటీసులు
-
KCR: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. కాగా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో హరీష్రావు నిటి పారుదల వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పొడిగింపు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Kaleshwaram commission) విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్,హరీష్రావు,ఈటల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది. -
‘హరీష్ పై కేటీఆర్కు ఎందుకంత ప్రేమో..’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటూ ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేసిన రామచంద్రనాయక్.. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.‘పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. రెండు గంటలకు పైగా హరీష్ రావుతో చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు.హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సడన్గా హరీష్ రావు పైన కేటీఆర్కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.హరీష్రావు నివాసానికి కేటీఆర్హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
హరీష్రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
కొనుగోలు కేంద్రాల్లో రైతులు చనిపోతున్నా పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో సైనికుల తరహాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు యుద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అందాల పోటీలపై సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతుల కష్టాలు తీర్చేందుకు సమయం దొరకడం లేదని విమర్శించారు. ధాన్యపు రాశులను గాలికి వదిలి.. సీఎం రేవంత్ అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్నా.. సీఎం జూబ్లీహిల్స్ ప్యాలెస్కు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పరిమితమవుతూ సచివాలయం ముఖం కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మరణాలకు సీఎందే బాధ్యత కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో వేచి చూడటంతో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యపు రాశుల సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్న ఈ మరణాలకు సీఎం రేవంత్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ‘వానకాలంలో రైతుబంధు సాయం ఎగవేసిన ప్రభుత్వం.. యాసంగిలో మూడు ఎకరాలకు మించిన రైతులకు ఇవ్వనే లేదు. రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదు. పాకిస్తాన్ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ.. రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరూ అప్పు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం మీద బురద చల్లే తొందరలో సీఎం తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదు’అని ఎద్దేవా చేశారు. తాము రైతుల సమస్యల గురించి మాట్లాడితే మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వం అందజేసిన వివరాల ప్రకారమే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.4 వేల కోట్లు చెల్లించాలని, సన్న వడ్లకు చెల్లించాల్సిన బోనస్ రూ.767 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి ఒప్పుకున్నారని తెలిపారు. చనిపోయిన రైతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.4 వేల కోట్ల బకాయి ప్రస్తుత యాసంగి సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని హరీశ్రావు విమర్శించారు. రైతులకు 48 గంటల్లో వడ్ల కొనుగోలు డబ్బులు ఇస్తామని చెప్పినా.. నేటికీ రూ.4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. సన్న ధాన్యానికి రూ.512 కోట్ల బోనస్ కూడా విడుదల చేయలేదని చెప్పారు. రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్రావు, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.కేటీఆర్కు నాయకత్వం ఇచ్చినా ఓకేబీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ సమస్య లేదని హరీశ్రావు తెలిపారు. ‘నేను పార్టీ పెడుతున్నట్లు, మరో పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వచి్చన తప్పుడు ప్రచారాన్ని గతంలోనే ఖండించా. మా పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ అంశంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా పార్టీలో నాయకత్వ పంచాయితీ లేదు. కేసీఆర్ మా పార్టీ అ«ధ్యక్షుడు. ఆయన ఆదేశాలను పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను. కేటీఆర్కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా. కేసీఆర్ నిర్ణయాన్ని నేను జవదాటను’అని హరీశ్రావు స్పష్టంచేశారు. -
హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వదిలేసి అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల లెక్కలను విడుదల చేశారు ఉత్తమ్. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. 43. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీష్ కు ఉత్తమ్ హితవు పలికారు. ఒకసారి హరీష్ లెక్కలు చూసి మాట్లాడితే మంచిదని సూచించారు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లాగ కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇందిరమ్మ ఇండ్ల కోటా ఇస్తామన్నారు పొంగులేటి. ఇక ఏపీలో కలిసిన ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే.. : హరీష్ రావు ఏమన్నారంటే
హైదరాబాద్: బీఆర్ఎస్ లో విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు చెక్ పెట్టారు. అసలు బీఆర్ఎస్ లో విభేదాలున్నాయనే వార్తల్లో నిజం లేదన్నారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ‘ మా పార్టీ బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. మా అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.కాగా, ఎప్పట్నుంచో ‘బీఆర్ఎస్ లో విభేదాలు’ అనే మాట తరచు వినిపిస్తూ వస్తోంది. ప్రధానంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బాధ్యతల్ని ఎవరు మోస్తారు అనేది ప్రధానంగా నడిచే చర్చ. ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆ బాధ్యతల్ని తీసుకుంటారా?, లేక మేనల్లుడైన హరీష్ రావు తీసుకుంటారా? అనే దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి?, హరీష్ రావు మరొక పార్టీవైపు కన్నేస్తారా? అనేదే ప్రధానంగా నడిచిన చర్చ.దీనికి ముగింపు పలికారు హరీష్ రావు. తమ పార్టీలో విభేదాలు లేవని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే తనకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు. , దాన్ని తాను స్వాగతిస్తాననన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానన్నారు హరీష్ రావు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. -
రాజకీయ ప్రేరేపిత చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. 2024 మే 1 వరకు ఎన్డీఎస్ఏ సిఫారసులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రిపోర్టు ఇచ్చిన తర్వాత మరమ్మతులు చేయకపోవడం మరో కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర చేశాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మౖక్కై ఎన్డీఎస్ఏ నివేదికను ఈడీ, సీబీఐ తరహాలో వాడుతున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీఎస్ఏ బిల్లును లోక్సభలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ వ్యతిరేకించారని చెప్పారు. గతంలో ఆయన కు ఎన్డీఎస్ఏ తప్పుగా కన్పించిందని, ఇప్పుడు అదే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక..ఆయనకు భగవద్గీతలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ సమ్మిట్, రైతు మహోత్సవాలు, ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేరిట బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయినా కేసీఆర్ గర్జనతో కాంగ్రెస్ కకావికలం అయిందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికను ప్రశ్నిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఎన్డీఎస్ఏ నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కుప్పకూలినా నాలుగేళ్లుగా ఎందుకు సందర్శించ లేదు..’ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నివేదిక తప్పుబట్టింది ‘బీఆర్ఎస్పై విమర్శలు చేయాలనే తొందరపాటులో మంత్రి ఉత్తమ్ కనీసం ఎన్డీఎస్ఏ నివేదికను కూడా అధ్యయనం చేయలేదు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా.. బురద చల్లేందుకు ఉత్తమ్ అపసోపాలు పడ్డారు. బ్లాక్ 7ను తిరిగి నిర్మించడం ద్వారా మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. లక్ష కోట్లు వృధా అయితే నీళ్లెలా వస్తున్నాయి? మహారాష్ట్రతో అంతర్ రాష్ట ఒప్పందం లేకుండానే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కాంగ్రెస్ నేతలకు కమీషన్లు దోచిపెట్టారు. అనుమతులు తేవడంలో విఫలం కావడం వల్లే సీడబ్ల్యూసీ, వాప్కోస్ సూచన మేరకు నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాం. నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నిపుణుల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల వృధా జరిగితే నీళ్లు ఎలా వస్తున్నాయి?..’ అని హరీశ్రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
BRSలో నెం 2 అతనేనా? రజతోత్సవ సభ గేమ్ ఛేంజర్ అవుతుందా?
-
ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని విద్యుత్ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం వంటివి టీఆర్ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమంవైపు ఆకర్షితుడినయ్యా.సాక్షి, హైదరాబాద్ : కుటుంబ పార్టీ అంటూ బీఆర్ఎస్పై చేసే విమర్శలు అర్థ రహితమని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించిన తాము.. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు చేపట్టామన్నారు. బ్యాక్డోర్లో తాము పదవులు పొందలేదని చెప్పారు. కేటీఆర్, కవిత సహా ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఇచి్చన నివేదిక ఎన్డీఏ ప్రభుత్వ నివేదిక తరహాలో ఉందని తెలిపారు.మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులో ఉద్దేశపూర్వకంగా కాలయాపన జరుగుతోందన్నారు. ఏడాదిన్నరలోనే రేవంత్ పాలన తేలిపోయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా తిరిగి అధికారంలోకి వచ్చి కేంద్రంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి నడిచిన హరీశ్రావు ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో నెమరువేసుకున్నారు. ఉద్యమంలో తన అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు.పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నాటి పరిస్థితులతోనే టీఆర్ఎస్ స్థాపన తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం తదితరాలు టీఆర్ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమం పట్ల ఆకర్షితుడిని అయ్యా. ప్రొఫెసర్ జయశంకర్ తదితరులతో జరిగిన చర్చల్లో అనేక అంశాల పట్ల అవగాహన ఏర్పడటంతో ఉద్యమం పట్ల ఆకర్షణ, పాల్గొనాలనే ఉత్సాహం పెరిగింది.తెలంగాణకు సంబంధించిన అంశాలను ఆకళింపు చేసుకునే క్రమంలో కేసీఆర్ వందలాది మందితో గంటల కొద్దీ సంప్రదింపులు జరిపారు. వారిని సమన్వయం చేయడం నా ప్రధాన బాధ్యతగా ఉండేది. టీఆర్ఎస్ ఆరంభంలోనే పార్టీ కోశాధికారిగా, ప్రచార కార్యదర్శిగా మీడియా బాధ్యతలు, ఆర్థిక అంశాలు, ఎన్నికల బాధ్యతలు చూసేవాడిని. పార్టీ పెట్టిన రెండు నెలల్లోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు జెడ్పీటీసీ సభ్యులతో క్యాంప్ల నిర్వహణ బాధ్యత కేసీఆర్ నాకు అప్పగించారు. వైఎస్ మంత్రివర్గంలోకి అనగానే..నాకు ఎమ్మెల్యే పదవి లేకున్నా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేరమని కేసీఆర్ ఆదేశించినప్పుడు నేను ఆశ్చర్యానికి లోనయ్యా. మంత్రివర్గంలో కొనసాగుతూ పార్టీ బలోపేతం చేయమని ఆదేశిస్తూ టీఆర్ఎస్ తరఫున మంత్రివర్గంలో చేరే వారి జాబితాను నాతోనే కేసీఆర్ రాయించి కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చారు. 33 ఏళ్ల వయసులోనే రాష్ట్ర మంత్రివర్గంలో చేరినా, పాలన కంటే ఉద్యమం మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మంత్రిగా పనిచేస్తూనే 2004 అక్టోబర్లో సిద్దిపేట ఉప ఎన్నికలో తొలిసారి పోటీ చేశాం. అంతకు మునుపే కేసీఆర్కు సంబంధించిన 2001 ఉపఎన్నిక, 2004 అసెంబ్లీ ఎన్నిక బాధ్యతలను నేనే చూశా. దీంతో నాకు సిద్దిపేట, ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో ఉన్న సన్నిహిత సంబంధం ఉండటం కలిసొచి్చంది. నివేదికల పేరిట పార్టీని దెబ్బతీసే కుట్ర తెలంగాణలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో మిషన్ కాకతీయతోపాటు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆయకట్టును పెంచాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పనులు వేగంగా పూర్తి చేసేందుకు సైట్ వద్దే నిద్రించిన సందర్భాలు అనేకం. ఈడీ, సీబీఐతరహాలోనే ఎన్డీఎస్ఏ కూడా ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర నివేదిక, రజతోత్సవ సందర్భంలో తుది నివేదిక అంటూ మా పార్టీని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. పదవులొస్తాయని అనుకోలేదు కుటుంబ పార్టీ, ఆ నలుగురు అంటూ మాపై చేసే విమర్శలు అర్థ రహితం. రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించడం మినహా, అధికారం, పదవులు వస్తాయని మాలో ఎవరూ అనుకోలేదు. మేము వెనుక డోర్ నుంచి పదవుల్లోకి రాలేదు. ప్రజల ఆశీర్వాదంతో వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వాళ్లం. కేసీఆర్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో కార్యకర్తలుగా పనిచేస్తాం. నాతో సహా పార్టీలో అందరమూ కేసీఆర్ సైనికులమే.బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతుంది ఏడాదిన్నరలోనే రేవంత్ ప్రభుత్వం తేలిపోయింది. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగితే వారి పాలన సామర్థ్యం ప్రజలకు మరింత అర్థమవుతుంది. ఇప్పటికే బీజేపీ కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు వల్లే మనుగడలో ఉంది. రేపు కేంద్రంలో అధికారంలోకి వచి్చనా ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. బీఆర్ఎస్ బలమైన శక్తిగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తుంది. మహాగర్జన అపురూప జ్ఞాపకంHarish Rao ,Interview with Sakshi, telanganaఉద్యమ సమయంలో వరంగల్లో 25 లక్షల మందితో నిర్వహించిన మహాగర్జన అపురూప జ్ఞాపకంగా మిగిలిపోయింది. కేసీఆర్ ఈ సభకు సిద్దిపేట నుంచి సైకిల్పై వచ్చారు. అలాంటి సభలు ఈ రోజుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. పార్టీ వద్ద అప్పట్లో పెద్దగా డబ్బులు లేకున్నా ప్రజలు ఈ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. -
చిన్నారి కథ విని హరీష్రావు కంటతడి..
సాక్షి, సిద్ధిపేట: ఓ చిన్నారి కథ విని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేటలో విద్యార్థుల కోసం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి' అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన చలించిపోయారు.. కంటతడి పెట్టారు.ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని.. తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీష్రావుతో పాటు ఆ వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకునన్న హరీష్రావు.. వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు. -
మాట తప్పడమే రేవంత్ బ్రాండ్
గజ్వేల్: ‘యంగ్ ఇండియా’పాఠశాలలు తన బ్రాండ్ అని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్రెడ్డికి ఆ మాట వర్తించదని, మాట తప్పడమే తన బ్రాండ్గా ఆయన చెప్పుకోచ్చని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో, బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలను ప్రభుత్వం తరఫున ఖర్చు చేసి గురుకుల పాఠశాలలు తీసుకొస్తే.. సీఎం రేవంత్రెడ్డి మాత్రం ‘యంగ్ ఇండియా’పేరిట పాఠశాలలు తీసుకొస్తూ, ఏటా రూ.1.50 లక్షల ఫీజు, బస్సు ఫీజు చెల్లించాలని సూచిస్తున్నారని విమర్శించారు. చెట్లు నరికితే సామాన్యులపై వాల్టా చట్టాన్ని ప్రయోగించి శిక్షిస్తున్న అధికారులు.. హెచ్సీయూ భూముల్లో చెట్లను నరికేసి, నాలుగు జింకల మరణానికి కారణమైన సీఎం రేవంత్రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలో చెప్పాలన్నారు.400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు తెచ్చి, బ్రోకర్ ఫీజు కింద రూ.170 కోట్ల లంచం చెల్లించారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వరంగల్ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను హరీశ్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బరితెగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో వేలాది చెట్లను నరికి, జింకలను చంపి జీవ వైవిధ్యా న్ని విధ్వంసం చేస్తున్న తీరు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభు త్వం బరితెగింపు వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వందల ఎకరాల్లో చెట్ల నరికివేతకు బాధ్యులైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర సాధికార కమిటీ చైర్పర్సన్ సిద్దాంత్దాస్, సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్ను హరీశ్రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం కలిసింది. పర్యావరణ విధ్వంసంపై వినతిపత్రం సమర్పించింది. అనంతరం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవీ ప్రసాద్తో కలిసి హరీశ్రావు మీడి యాతో మాట్లాడారు.రేవంత్ మూడు జింకల చావుకు కారణమయ్యారు.. ‘హెచ్సీయూ భూముల్లో ఏడు చట్టాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది. వరుస సెలవు దినాలను అడ్డుపెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేసిన తీరును 11 పేజీల వినతిపత్రంలో వివరించడంతోపాటు 200 పత్రాలను కమిటీకి అందజేశాం. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు టీజీఐఐసీ పోలీసు విభాగానికి తప్ప ఏ ఒక్క ప్రభుత్వ శాఖకూ దరఖాస్తు చేయలేదు. పోలీసుల రక్షణలో జరిగిన విధ్వంసంతో మూడు జింకలు చనిపోగా, అనేక జంతువులు ఆవాసం కోల్పోయాయి. గతంలో జింకను వేటాడిన కేసులో సినీ నటుడు సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లాడు. మరి మూడు జింకల చావుకు కారణమైన రేవంత్పై ఏ తరహా చర్యలు తీసుకోవాలి’ అని హరీశ్రావు పేర్కొన్నారు.సుప్రీం తీర్పులను ఉల్లంఘించడమే‘అటవీ స్వభావం కలిగిన భూముల వివరాలు ఇవ్వాలని ఓ వైపు సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను కోరుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ భూ ములను తెగనమ్మే ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పట్ల కూడా రేవంత్కు భయం లేకుండా పోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా కంచ గచ్చిబౌలి భూములు టీజీఐఐసీకి చెందినవే అని బోర్డులు పె ట్టారు. గతంలో కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో గ్రీన్ ట్రిబ్యున ల్లో ఫిర్యాదు చేసి ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేసిన రేవంత్ ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాలి. పర్యావరణ విధ్వంసాన్ని ప్రశ్నించిన విద్యార్థులను పది రోజులుగా జైల్లో పెట్టారు. గత ఏడాది అక్టోబర్లో కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.169.84 కోట్లు బ్రోకర్కు చెల్లించింది’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జింకల మృతికి కారణమైన వారిపై చర్యలేవీ?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నియమ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అన్ని ఆధారాలతో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులతో సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిశామన్నారు. రైతు ఒక్క చెట్టు కొడితే కేసు నమోదు చేస్తున్నారు.. రైతుకు ఒక చట్టం.. రేవంత్ రెడ్డికి ఒక చట్టమా?’’ అంటూ హరీష్రావు ప్రశ్నించారు.‘‘కంచె చేను మేసినట్టిగా ప్రభుత్వం వేలాది చెట్లు నరికివేసింది. వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టా యాక్ట్ ఉల్లంఘించి ప్రభుత్వం వ్యవహరించింది. మూడు జింకలు చనిపోయాయి. వన్య ప్రాణుల గూడును చెదరగొట్టారు. జింకల మృతికి కారణమైన అధికారులపైన చర్యలేవీ? పర్యావరణ విధ్వoసం జరిగితే అటవీ అధికారులు నిద్ర పోతున్నారా?. ప్రైవేట్ భూమి అయినా అందులో చెట్లు పెరిగితే అందులో వన్య ప్రాణులు గూడు ఏర్పాటుచేసుకుంటే అది అటవీ భూమిగా పరిగణిస్తారు. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంటే.. అందులో చెట్లు ఉంటే అది అటవీ భూమిగానే పరిగణిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కంచ గచ్చిబౌలిలో చెట్లు నాటారు’’ అని హరీష్రావు గుర్తు చేశారు.హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సెలవు దినాలు చూసుకుని మరి జేసీబీలతో చెట్లు నరికివేశారు. కంచ గచ్చి బౌలి భూములు హెచ్సీయూ అధీనంలో ఉందని గతంలోనే ఆర్డీవో, కలెక్టర్ కలెక్టర్ లేఖ రాశారు. సీఎం రేవంత్ ఈ భూమిని మాడ్యూగేట్ చేసి 10 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పు ఇప్పించిన బ్రోకర్కు 169 కోట్ల 83 లక్షలు చెల్లించారు. ఈ భూములను అమ్మి సీఎం రేవంత్ 40 వేల కోట్లు తేవాలని సీఎం రేవంత్ ప్రయత్నం’’ అంటూ హరీష్రావు ఆరోపించారు.సుప్రీoకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతుంది. నిన్న సాయంత్రం టీజీఐఐసీ భూమి అని బోర్టులు ఏర్పాటు చేశారు. కంచ భూముల విధ్వంసంలో పోలీస్ శాఖ పాత్ర కూడా ఉంది. గతంలో కొత్త సచివాలయం నిర్మించే సమయంలో చెట్లు నరకొద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లిన రేవంత్కు ఇన్ని చెట్లు నరకొద్దూ అని తెలియదా?. యూనివర్సిటీ భూములు తమకే చెందాలని విద్యార్థులు అడిగితే వారిపై కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం శాశ్వతo కాదు’’ అని హరీష్రావు వ్యాఖ్యానించారు. -
‘కాళేశ్వరం బాధ్యుల’పై చర్యలకు విజిలెన్స్ ఓకే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన నివేదికను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ ఆమోదించింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీకైన విషయం తెలిసిందే. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించగా.. బరాజ్ల వైఫల్యానికి 40 మందికి పైగా ఇంజనీర్లు, ఇతర అధికారులు బాధ్యులని తేల్చుతూ, వారిపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది. ఈ నివేదికను తాజాగా విజిలెన్స్ కమిషన్ ఆమోదించడంతో.. బాధ్యులైన ఇంజనీర్లు, ఇతర అధికారులపై చర్యలకు మార్గం సుగమమైంది. బాధ్యులైన అధికారుల జాబితాలో కొందరు ఐఏఎస్, మాజీ ఐఏఎస్లతో పాటు పలువురు మాజీ ఈఎన్సీల పేర్లు సైతం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిని రక్షించడానికి కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నతాధికార వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఓ అండ్ ఎం వైఫల్యంతోనే.. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో సాంకేతిక తప్పిదాలు చోటుచేసుకున్నాయని, బరాజ్ పునాదుల కింద రక్షణగా ఉండే సికెంట్ పైల్స్ నిర్మాణంలో లోపాలతోనే 7వ బ్లాక్ కుంగిపోయిందని విజిలెన్స్ నిర్థారించినట్టు తెలిసింది. ఇక బరాజ్ల పనులు పూర్తికాక ముందే పూర్తైనట్టు నిర్మాణ సంస్థలకు వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం నేరపూరిత చర్య అని పేర్కొంది. బ్యాంక్ గ్యారెంటీల విడుదలలో సైతం నిర్మాణ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించేలా వ్యవహరించినట్టు తప్పుబట్టినట్లు సమాచారం. మేడిగడ్డ బరాజ్ 2019లో వినియోగంలోకి రాగా అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ బ్లాకులు (అప్రాన్) కొట్టుకుపోగా, మూడేళ్ల పాటు మరమ్మతులు నిర్వహించకుండా ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్ (ఓ అండ్ ఎం) విభాగం నిర్లక్ష్యం చేయడంతోనే 2022 అక్టోబర్లో బరాజ్ కుంగిందని పేర్కొంది. ఏటా వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత బరాజ్ స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదికను తయారు చేయాల్సి ఉండగా, నాటి రామగుండం ఈఎన్సీ నిర్వహించలేదని తప్పుబట్టినట్లు తెలిసింది. నిర్మాణం పూర్తైన తర్వాత లోపలి భాగంలో షీట్పైల్స్తో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్ను తొలగించక పోవడంతో నది సహజ ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్పై ఒత్తిడి పెంచిందని అభిప్రాయపడింది. ఈ విషయంలో నిర్మాణ సంస్థతో పాటు రామగుండం మాజీ ఈఎన్సీ, ఎస్ఈ, ఈఈలే బాధ్యులని తేల్చినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్కు విజిలెన్స్ నివేదిక బరాజ్ల వైఫల్యాలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తమ నివేదికను అందించింది. ఈ నెల 20 తర్వాత జస్టిస్ ఘోష్ హైదరాబాద్కు చేరుకుని సాక్షుల తుది దఫా క్రాస్ ఎగ్జామినేషన్ జరపనున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లకు లేఖ రాసి, క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొనడం ద్వారా కమిషన్కు సహకరించాలని కోరనున్నట్టు తెలిసింది. -
రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది: హరీశ్
-
‘కేసీఆర్ది సాగు భాష..రేవంత్ది చావు భాష’
హైదరాబాద్,సాక్షి: దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవుణ్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Silver jubilee) సభను విజయంతం చేయాలని సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోంది. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. జీవో 58,59ను కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది. రైతు రుణమాఫీ, 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి.13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత కేసీఆర్ది. రేవంత్ మాయ మాటలతో మోసం చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ పడగొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్,ఇతర ఆదాయాలు తగ్గిపోయాయి.కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికాడు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 4వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, అడవిలోని మూగజీవులను చంపిన శాపం రేవంత్దే. కేసీఆర్ది సాగు భాష..రేవంత్ రెడ్డిది చావు భాష.ఢిల్లిలో ధర్నా,సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాందీ రాలేదు.రేవంత్ పాలన ఆగమాగం అయ్యింది.. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు.దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవున్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది. అన్ని వర్గాలు దివాళా తీశారు.మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు.కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి.ఏడాది తిరగకుండానే లక్షా50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది. పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారింది.. ధాన్యాగారంగా మారింది. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ను కోరుకుంటున్నారు. వరంగల్ జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి’ అని పిలుపు నిచ్చారు. -
‘హైదరాబాద్లో కూర్చొని మాట్లాడటం కాదు.. అది చేసిన కేసీఆర్ పుణ్యం’
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని.. హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం.. చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్రావు మాట్లాడుతూ..‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది. గత ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో భూసేకరణ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. ఇవ్వాళ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి. రంగనాయక సాగర్ లో, కొండపోచమ్మ, మిడ్ మానేరు లో నీళ్ళు ఉన్నాయి. కక్షపూరితంగానే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరం భూ సేకరణ చేయడం లేదు.కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సిస్టం అంత రెడీ చేశారు. పంపు హౌస్లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కేవలం భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది ఉంది. కానీ, ఈ సంవత్సరం కాలంలో ఒక్క ఎకరా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయలేదు. చేయకపోవడం వల్ల చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న సందర్భం ఉన్నది.కొండెంగులకుంట, బిక్కబండ రైతులు అందరూ వస్తే.. స్వంత డబ్బులతో మిషన్లు పెట్టి.. స్వంత డబ్బులు పెట్టీ, భూ సేకరణలో నష్ట పోతున్న వారికి డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వి నీళ్లు అందిస్తున్నాం. ప్రభుత్వం పనిచేయట్లేదు. ప్రేమతో పని చేయాలి కానీ కక్షతో పని చేస్తున్నది. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడాను. పిల్ల కాలువలు తవ్వితే రైతులకు ఆయకట్టు పెరుగుతుంది. కనీసం 15, 20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండి అని కోరాను.చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువ కు నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి @BRSHarish గారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..- కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది.- గత ఏడాదిన్నర… pic.twitter.com/o9z1QQTWWm— Office of Harish Rao (@HarishRaoOffice) April 6, 2025అసెంబ్లీలో కూడా కట్ మోషన్ ఇచ్చి నిరసన తెలపడం జరిగింది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని. కోకాకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం నీళ్లు ఉండబట్టి వచ్చింది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన ఒకటో రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్న. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలోని పెద్దవాగు, సుంకిశాల, SLBC సొరంగం, వట్టెం ప్రాజెక్టులు కూలిపోయాయి. కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. కాళేశ్వరం ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. ఇది కేసీఆర్ చేసిన పుణ్యం. హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు. సిద్ధిపేట ఒక్కటే కాదు ఎన్నో నియోజకవర్గాలకు నీళ్ళు అందుతున్నాయి. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మీ అనుమతితోనే ఈ విధ్వంసమా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ బోధిస్తున్న నీతి సూత్రాలను తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుంగలో తొక్కుతున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఓ వైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతుండగా, రేవంత్ తన అనాలోచిత చర్యలతో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్గాందీని ఉద్దేశిస్తూ హరీశ్రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో వికృత పాలన సాగుతోందని ఆరోపించారు.‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చట్టం చేస్తామని మీరు అంటున్నా, రేవంత్రెడ్డి మాత్రం బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూలుస్తున్నా, మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? రేవంత్ విధ్వంసపూరిత వైఖరితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జంతుజాలం ఆవాసాన్ని కోల్పోయింది. వర్సిటీ అంశంలో మీ పార్టీ అనుబంధ విభాగం ఎన్ఎస్యూఐ సహా అన్ని వర్గాలు రేవంత్ ప్రభుత్వ తీరును ఖండించాయి’అని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ విధ్వంసం మీ అనుమతితోనే సాగుతోందా? ‘రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో హెచ్సీయూ సందర్శన వచ్చిన మీకు.. బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్తో పంపి నిరసన తెలిపే అవకాశం కల్పించింది. ఆపదలో అండగా ఉంటానని హెచ్సీయూ విద్యార్థులకు మీరు హామీ ఇచ్చినా.. రేవంత్ దుర్మార్గాలపై మౌనం వహించడం ఆశ్చర్యకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంతరవరకు వర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసకాండ కొనసాగించింది. క్రోనీ కాపిటలిజం, అదానీ వ్యాపార విస్తరణపై దేశవ్యాప్తంగా మీరు పోరాటం చేస్తున్నారు.కానీ మీ సీఎం రేవంత్ తెలంగాణలో అదానీకి ఎర్ర తివాచీ పరిచారు. నల్లగొండలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో ఫార్మా విలేజ్ మూలంగా భూములు కోల్పోతున్న రైతులపై దాడులు జరుగుతున్నా మీరు మౌనంగానే ఉన్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండ, విధ్వంస పాలన మీ అనుమతితో కొనసాగుతోందా?’అని రాహుల్గాం«దీని హరీశ్రావు ప్రశ్నించారు. -
కృష్ణాజలాలు, కాళేశ్వరంపై వాదోపవాదాలు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి జలాల విషయంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మధ్య మాటల యుద్ధం సాగింది. గోదావరిలో తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్లు్యసీ సూచించిందని హరీశ్రావు చెబుతూ అందుకు సంబంధించిన లేఖ తన వద్ద ఉందన్నారు. దీంతో మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ..‘మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడానికి సీడబ్లు్యసీ ఎలాంటి సిఫారసు చేయలేదు. ఆ తప్పుడు వాదనతో రూ. లక్ష కోట్లు వృథా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన ఐదుగురు చీఫ్ ఇంజనీర్ల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేయొద్దని సిఫారసు చేసినా పట్టించుకోలేదు’అని అన్నారు, సాగునీటి పద్దుపై బుధవారం రాత్రి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ వాదోపవాదాలు జరిగాయి. ‘ఐదుగురు చీఫ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించొద్దని కాదు. మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా ఎత్తిపోయడం సాధ్యం కాదు’అని మాత్రమేనని హరీశ్రావు అన్నారు. కృష్ణాజలాల్లో్ల తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు తీసుకునేలా ఒప్పందంపై సంతకాలు పెట్టిందే హరీశ్రావు, కేసీఆర్ హయాంలో అని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఏపీకి నీటిని తరలించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మౌనంగా ఉన్నారని మంత్రి ఆరోపించారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. అది కేవలం తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, సెక్షన్ మూడు కింద సుప్రీంకోర్టుకు వెళ్లి,.. బచావత్ విచారణ జరిగేలా ఉత్తర్వులు తీసుకొచ్చామని ఇప్పుడు ప్రభుత్వం సరిగా వాదిస్తే 555 టీఎంసీలు తెలంగాణకు సులభంగా తెచ్చుకోవచ్చని సూచించారు. ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించి తీరుతాం : ఉత్తమ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలంగా చేసే ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఉత్తమ్ అన్నారు. పదేళ్లపాటు ఆదిలాబాద్ జిల్లాను ఎండబెట్టి అక్కడి రైతులను అష్టకష్టాల్లోకి నెట్టింది బీఆర్ఎస్ పాలన ఘనకార్యమే అని విమర్శించారు. పదేళ్లలో కాళేశ్వరం వల్ల ఆయకట్టు పెరగలేదన్నారు. ఏడాదిన్నరగా కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేయనప్పటికీ యాసంగిలో 153 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 131 లక్షల టన్నుల వరి దిగుబడి రానున్నట్టుచెప్పారు. ఈ సమయంలో హరీశ్రావు జోక్యం చేసుకుంటూ కేసీఆర్ ముందుచూపు వల్లే వరిసాగు పెరుగుతూ వచ్చిందన్నారు. ఇంతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాదప్రతివాదనలకు దిగడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేస్తూ కూర్చుంటున్నట్టు హరీశ్రావు తెలిపారు. నేరపూరిత నిర్లక్ష్యం బీఆర్ఎస్ది : బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నేరపూరిత నిర్లక్ష్యం వల్లనే ఆదిలాబాద్ జిల్లా రైతులు కరువులో కొట్టుమిట్టాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. ‘సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్రగోసలోకి నెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల ఊసురు ముట్టింది. మరింత అనుభవిస్తారు’అని ఆవేశంగా పాల్వాయి హరీశ్ అన్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం చోటుచేసుకుంది. మంత్రి సీతక్క జోక్యం చేసుకుంటూ ఆదిలాబాద్ రైతుల గోసను పాల్వాయి హరీశ్ వ్యక్తం చేశారని. ఆయనపైకి బీఆర్ఎస్ సభ్యులు గొడవకు దిగడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెడిపోయిన ధాన్యం టెండరు వేశారని, ఏడాదిన్న గడిచినా కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడంపై సమాధానం చెప్పాలన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మార్చిలోగా డబ్బు చెల్లించకపోతే ఆ టెండర్ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. -
నాణ్యమైన విద్య, వైద్యం మా ప్రభుత్వ విధానం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కుప్పకూలిన విద్యావ్యవస్థను బాగు చేసుకుంటూ ముందుకువెళుతున్నామని, పూర్తిగా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 11 వేలకుపైగా టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా చేపట్టామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పర్యాటకం, ఎక్సైజ్శాఖ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ పద్దుపై సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రస్తుతం విద్యావ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదే సమయంలో కలుగజేసుకున్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు.. పైవిధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 79 పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించామని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టును సైతం భర్తీ చేయలేదంటూ మంత్రి శ్రీధర్బాబు విమర్శించడంతో బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్రావు కలుగజేసుకున్నారు. ‘మా హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా చేశాం. గురుకులాల్లో 18 వేల నియామకాలు పూర్తి చేశాం’అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,913 స్కూళ్లు మూతపడ్డాయని, 257 గ్రామపంచాయతీల్లో అసలు ప్రభుత్వ పాఠశాలలే లేవని సబిత తెలిపారు. కాళేశ్వరం అప్పుల కుప్ప: యెన్నం బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయని పనులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బీటెక్ చదివిన విద్యార్థులు సైతం ఎందు కూ పనికిరానివారిగా మారుతున్న దుర్భర స్థితి ప్రస్తుత విద్యావ్యస్థలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉపాధ్యాయులనే పెట్టడంతో విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ, దశ దిశ లేకుండా బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల కు ప్ప చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణంతో ఎన్నో మార్పులు వచ్చాయని, విద్యారంగంలోనూ విద్యారి్థనులు పోటీపడుతున్నారని వివరించారు. -
‘దేవుళ్లని మోసం చేసిన రేవంత్కు రైతులను మోసం చేయడం ఓ లెక్క’
సాక్షి,మెదక్ జిల్లా : దేవుళ్లను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్క’ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజే రూ 2లక్షలు చేస్తామని చేతులెత్తేశారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్కు రైతులను మోసం చేయడం ఓ లెక్క. రైతులతో మిత్తిలు కట్టించి రుణాలు ఇవ్వలేదు. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసింది. అన్ని వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిందది. రూ 2లక్షల రుణమాఫీ మీద రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. రైతుబందు ఎగ్గొట్టింది. కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు అందించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలు లేవు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తాం’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్రావు
సాక్షి, సిద్దిపేట: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో నిన్న(శనివారం) రాత్రి కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారు. వానా కాలం యాసంగి రైతుబంధు రూ. 15 వేలు వెంటనే విడుదల చేయాలి. పంటల బీమా ఉండే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు. రైతులకు మూడు పంటల బీమా రాలేదు. రుణమాఫీ చేయలేదు ఇచ్చామని.. అబద్ధాలు ఆడుతున్నారు’’ అని కాంగ్రెస్పై హరీష్రావు మండిపడ్డారు.‘‘రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎండల వల్ల పంటలు ఎండటం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆర్థిక సాయం చేసి అందుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’’ అని హరీష్రావు పేర్కొన్నారు. -
రూ. 2 లక్షలపైన రుణమాఫీ లేదు: తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ. 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ. 2 లక్షలపైన మాఫీ లేదు. కుటుంబానికి రూ. 2 లక్షలలోపు రుణం ఉన్న వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్లు మాకు వివరాలు అందాయి. ఆయా కుటుంబాలకు రూ. 20,616 కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పశుసంవర్థక శాఖ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆది శ్రీనివాస్ మహేశ్వర్రెడ్డి సహా మొత్తం 13 మంది సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులపై రుణభారం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రుణమాఫీని ప్రధానాంశంగా తీసుకుందన్నారు. అలాగే రైతు భరోసా కోసం రూ. 7,625 కోట్లు విడుదల చేశామని.. ఈ పంటకు కూడా రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వంపై భారం పడినా రైతులకు ఉచిత విద్యుత్ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులను ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతులకు మేలు చేసేందుకే సన్న వడ్లకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. సన్నాలకు ఇప్పటివరకు రూ. 1,200 కోట్ల మేర బోనస్ ఇచ్చినట్లు తుమ్మల వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నాల సాగు 25 శాతం నుంచి 45 శాతానికి పెరిగిందన్నారు. ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. పంట నష్టపరిహారం ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని.. రైతులు నష్టపోయిన పూర్తి పంటకు కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. భవిష్యత్తులో బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు: హరీశ్రావు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ మోసం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘రూ. 2 లక్షలు పైబడిన రైతు రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలకు.. చేతలకు పొంతన లేదని రుజువు చేసింది. సీఎం మాటలు నమ్మి రూ. 2 లక్షలు పైబడిన రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. అలాగే రూ. 2 లక్షలలోపు తీసుకున్న రుణం ఇంకా మాఫీ కాక చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాల్లోని లోపాలను సవరించకుండా రైతులపైనే నెపం నెట్టి రుణమాఫీ నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన విధంగా రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేయాలి’అని హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
బడ్జెట్ పై 'సభ'భగలు
⇒ ఆర్థిక మాంద్యం కాదు.. మీ బుద్ధి మాంద్యం: మాజీ మంత్రి హరీశ్రావు ⇒ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజం⇒ అంతా తనకే తెలుసనుకునే సీఎం ⇒అజ్ఞానంతో ఆదాయం దిగజారింది⇒పాలన చేతకాక నెగెటివ్ రిజల్ట్.. బడ్జెట్ అంకెలు, లెక్కలన్నీ ఉత్తవే ⇒ఆరు గ్యారంటీలకు దిక్కులేదు గానీ.. అందాల పోటీలా? ⇒అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే.. సీఎం రేవంత్రెడ్డికే వస్తుందిసాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గిందని ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఇది పాలకుల బుద్ధి మాంద్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు టి.హరీశ్రావు వ్యాఖ్యానించారు. ‘‘ఇచ్చిన హామీలను అమలు చేసే దిక్కులేదు, వాటికి సరిపడా ఆదాయం లేదని ప్రభుత్వమే చెప్తోంది. ఆదాయం ఎందుకు లేదంటే ఆర్థిక మాంద్యం అంటోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉంటుంది? ఇది ఆర్థిక మాంద్యం కాదు..పాలకుల బుద్ధిమాంద్యం. అంతా తనకే తెలుసు అనుకునే సీఎం అజ్ఞానం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం దిగజారింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం మాటెత్తుకున్నారు..’’అని పేర్కొన్నారు. బడ్జెట్పై చర్చలో భాగంగా శుక్రవారం ఆయన బీఆర్ఎస్ పక్షాన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. వివరాలు హరీశ్రావు మాటల్లోనే... ఇది దిగజారుడు రాజకీయం రాష్ట్ర ఆదాయం తగ్గిపోవటంతో భూములను తెగనమ్మి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని భూములమ్మితేనే గగ్గోలు పెట్టిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు రూ.50 వేల కోట్లు లక్ష్యంగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇది దిగజారుడు రాజకీయం కాదా? పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రైజింగ్ తెలంగాణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు గానీ, అందాల పోటీలు నిర్వహిస్తారట. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల విధ్వంసం.. రాష్ట్రంలో వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసం వల్ల పేద, మధ్య తరగతి జనం గుండె ఆగి చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన తిండి లేక హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా హయాంలో గురుకులాల సంఖ్యను 289 నుంచి 1,020కి పెంచి బలోపేతం చేస్తే.. ఇప్పుడు వాటి లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చారు. దీనితో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అన్ని వర్గాలను మోసం చేశారు గతేడాది రూ.2,91,159 కోట్లుగా గొప్పగా చెప్పుకున్న బడ్జెట్ వాస్తవిక బడ్జెట్ కాదని నేను అప్పుడే చెప్పాను. రివైజ్డ్ బడ్జెట్ అంకెల్లో రూ.27 వేల కోట్లు తక్కువ చేసి చూపటం ద్వారా అదే నిజమని తేలింది. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు పేదల రక్తమాంసాలు పిండి ఎల్ఆర్ఎస్ వసూలుకు సిద్ధమయ్యారు. ఫార్మాసిటీకి మేం భూములు సేకరిస్తుంటే తప్పుపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ పేరుతో అదనంగా మరో 14 వేల ఎకరాలు లాక్కుంటున్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. సభకు క్షమాపణ చెప్పండి.. గత బడ్జెజ్లో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి ఈ 16 నెలల్లో నాలుగు ఇళ్లు కూడా నిర్మించలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష అదనంగా ఇస్తామని.. ఇప్పుడు ఆ మాటే ఎత్తలేదు. ఇది దళిత, గిరిజనులను మోసం చేయడం కాదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ కేలండర్ అమలుచేస్తామని చెప్పి జాబ్లెస్ కేలండర్గా మార్చారు. దాని సంగతేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తే అశోక్నగర్లో వారి వీపులు పగలగొడుతున్నారు. తుదిదశలో ఉన్న ఆరు సాగునీటి ప్రాజెక్టులని బడ్జెట్లో ప్రస్తావించారు కదా.. ఆ ప్రాజెక్టుల పేర్లేమిటో చెప్పండి.లేదా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న మొదటి సంవత్సరంలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఎన్నికల ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని ప్రకటనలు చేసి.. ఇప్పుడు మేమిచ్చి న నోటిఫికేషన్కు 5 వేల పోస్టులు మాత్రమే పెంచి దగా డీఎస్సీ చేశారు. ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు.. కేసీఆర్ ముల్కీ రూల్స్ నుంచి 610 జీవో కోసం పోరాడి స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసి.. తొమ్మిదిన్నరేళ్లలో 1.62 లక్షల ఉద్యోగాలిచ్చారు. మా హయాంలో ఇచ్చి న నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు పంచటం తప్ప కొత్త ఉ ద్యోగాల కల్పన ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 57 వేల ఉద్యోగాల్లో 50 వేలు మా హయాంలోనివే. ఈ ప్రభుత్వం ఆరు వేలు కూడా భర్తీ చేయలేదు. రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ మొహబ్బత్ కా దుకాణ్ (ప్రేమ దుకాణం) అంటుంటే.. రేవంత్ మాత్రం నఫ్రత్ కా మాకాన్ (విద్వేషాల ఇల్లు) అంటున్నారు..’’అని హరీశ్రావు మండిపడ్డారు. వాటిని వడ్డీలేని రుణాలుగా పరిగణిస్తారా? ‘‘ఐదేళ్లలో వడ్డీ లేని రుణాల కింద రూ.లక్ష కోట్లు అందజేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉంటే ఆ ఉత్తర్వులు సభ ముందుంచాలి. లేని పక్షంలో సభను తప్పుదోవ పట్టించినందుకు సభకు క్షమాపణ చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామంటున్నారు. వాటిని వడ్డీ లేని రుణాలుగా పరిగణిస్తారా చెప్పాలి?’’ పాలనా వైఫల్యాలతో దెబ్బతిన్న పురోగతి‘‘జీఎస్టీ వృద్ధిరేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఆదాయం తగ్గడం, వాహనాల అమ్మకాల్లో తగ్గుదల.. ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గింది. కేసీఆర్ హయాంలో దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా, దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గాయి. ఫార్మా సిటీ రద్దు, ఎయిర్ పోర్టుకు మెట్రో రద్దు, హైæడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ, మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా, ఆర్ఆర్ టాక్స్లు, సంక్షేమ పథకాల అమలు సరిగా లేక గ్రామాలకు ద్రవ్య ప్రవాహం తగ్గడం, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం.. ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి, వృద్ధి రేటు మందగించింది. పరిస్థితి ఇలా ఉంటే, బడ్జెట్లో మాత్రం ఘనమైన అంకెలు చూపి ప్రజలను మోసం చేస్తున్నారు.ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేది?: భట్టి విక్రమార్క⇒ బడ్జెట్పై చర్చకు సమాధానంలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ ⇒ ఆదాయం లేకున్నా పెంచుతూ పోయింది మీరే... మీరు చేసిన అప్పులు తీర్చలేక చస్తున్నాం ⇒ పదేళ్లు ఎంతో అవమానించారు.. మౌనంగా భరించాం ⇒ అన్నీ అనుభవించే ఇక్కడకొచ్చాం.. మీరెన్ని మాట్లాడినా బాధపడంసాక్షి, హైదరాబాద్: ‘‘గత పదేళ్ల పాలనలో రూ.16.70 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఏం సాధించారు? నాగార్జునసాగర్ నిర్మించారా? ఎస్సారెస్పీ, ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు వంటివేమైనా నిర్మించారా? హైటెక్ సిటీ కట్టారా? ఏం చేశారయ్యా అంటే కాళేశ్వరం అంటారు. ఆ కాళేశ్వరం ఏమైందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇక మీరు చెప్పడానికేముంది? సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం చేసి, వ్యవస్థలను నాశనం చేసిన మీరు.. వాస్తవిక బడ్జెట్ను పెట్టిన మమ్మల్ని విమర్శిస్తారా?’’ అని బీఆర్ఎస్పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.బడ్జెట్పై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు శుక్రవారం రాత్రి శాసనసభలో, శాసన మండలిలో భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. బడ్జెట్పై మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర నేతలు చేసిన విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు. భట్టి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చూపినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. 2016–17లో రూ.8వేల కోట్లు, 2018–19లో రూ.40 వేల కోట్లు, 2021–22లో రూ.48 వేల కోట్లు, 2022–23లో రూ.52 వేల కోట్లకుపైగా, 2023–24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదు.మేం మీలాగా బడ్జెట్ను ప్రతీసారి 20 శాతానికిపైగా పెంచుకుంటూ పోలేదు. అలా పెంచితే ఈసారి బడ్జెట్ రూ.4 లక్షల 18 వేల కోట్లు అయ్యేది. మేం అలా చేయకుండా.. వాస్తవాల మీద బడ్జెట్ పెట్టాం. మీరు ఆదాయం ఉన్నా, లేకున్నా పెంచుతూ పోయారు. ఔటర్ రింగ్రోడ్డును రూ.7 వేల కోట్లకే 30 ఏళ్ల కాలానికి అమ్ముకున్నారు. దొడ్డిదారిన ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. తర్వాత వచ్చే ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని కూడా ముందే తీసుకున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేశాం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అమ్మకాల ద్వారా రోజుకు కోటిన్నర ఆదాయం వచ్చేది. 30 వేల టన్నులు అమ్మేవారు. ఆరేడు నెలలుగా సీరియస్గా దృష్టి పెట్టాం. ఇసుక మాఫియాను కట్టడి చేశాం. రోజుకు 70 వేల టన్నులు అమ్ముతున్నాం. ఆదాయం రోజుకు రూ.3 కోట్లకు పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా ఏటా రూ.600 కోట్ల ఆదాయం కోల్పోయాం. పదేళ్లలో రూ.6 వేల కోట్ల ప్రభుత్వ ధనం ఎక్కడికి పోయిందో బీఆర్ఎస్ వాళ్లే చెప్పాలి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మాఫియాలను కట్టడి చేస్తాం. ఆదాయం పెంచుతాం. అవమానాలను పదేళ్లు మౌనంగా భరించాం రైతు రుణమాఫీ కింద పదేళ్లలో మీరు రూ.28,053 కోట్లు ఇస్తే.. మేం నాలుగు నెలల్లోనే రూ.20,617 కోట్లు ఇచ్చాం. మీరు జాప్యం చేయడంతో రైతు రుణమాఫీ కంటే వడ్డీల కింద రూ.13 వేల కోట్లు జమ చేసుకున్నారు. నిర్బంధం, స్వేచ్ఛ, నిరంకుశత్వం గురించి మీరా మాట్లాడేది? ఏ ఒక్కరోజైనా సభను ప్రజాస్వామికంగా నడిపారా? నేను పదేళ్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, సీఎల్పీ నేతగా అక్కడ కూర్చుని ఉంటే ఎంత అవమానించారో తెలియదా?తలవంచుకుని భరిస్తూ, మీకు సహకరించామే తప్ప అడ్డగోలుగా ఏదంటే అది మాట్లాడలేదు. సభాపతి, సభా నాయకుడు, ప్రభుత్వం గురించి తూలనాడలేదు. మేం పడిన అనుమానాలు ఈ సభలో ఎవరూ పడి ఉండరు. అయినా సభ ఔన్నత్యాన్ని కాపాడాం. అన్నీ చూసే ఇక్కడికి వచ్చాం.. మీరెన్ని మాట్లాడినా, రన్నింగ్ కామెంట్రీలు చేసినా బాధపడేది లేదు. అవన్నీ చూసి చూసి, అనుభవించి ఇక్కడకు వచ్చాం. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలందరికీ లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు బరాబర్ ఇస్తాం. రాష్ట్రంలోని మహిళలందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేట్టు చేయాలన్నదే మా ప్రభుత్వం. సీఎం ఆలోచన. మేం ఉద్యోగాలు రాని పిల్లలకు రాజీవ్ యువ వికాసంతో రూ.6 వేల కోట్లు ఇవ్వబోతున్నాం. బ్రాహ్మణ పరిషత్కు రూ.50 కోట్లు ఉండే.. ఇంకో 50 కోట్లు కలిపి ఇచ్చాం. వైశ్యులు కార్పొరేషన్ కావాలని అడిగితే మీరు ఇవ్వలేదు. మేం రాగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.25 కోట్లు ఇచ్చాం..’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్నీ ఉత్త మాటలే.. పదేళ్లలో కృష్ణానది, గోదావరి నదుల మీద నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లందించారా? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు. పదేళ్లలో దళితుల అభివృద్ధి కోసం రూ.1,81,877 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు చేయలేదు. దళితబంధు గురించి బడ్జెట్లో రూ.17,700 కోట్లు పెట్టి ఒక్క రూపా యి అయినా విడుదల చేశారా? అమాయకులైన గిరిజనులను ఆడవాళ్లని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టించారు. మేం సబ్ప్లాన్ నిధులను తు.చ. తప్పకుండా ఖర్చు చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు.మీ అప్పులే కడుతున్నాం స్వామీ.. కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. ఈ ఏడాది రూ.1,58,041 కోట్ల అప్పులు తెచ్చి .. రూ.1,53,359 కోట్ల మేర గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల కింద చెల్లించాం. మీరు చేసిన అప్పులు తీర్చలేక, తప్పులు సరిదిద్దలేక, నిద్రలేక చస్తున్నాం. మీ అప్పులే కడుతున్నాం స్వామీ. తెచ్చి న అప్పుల్లో కట్టిన అప్పులు పోను ఈ సంవత్సరానికి మా ప్రభుత్వం అవసరాల కోసం వాడుకున్నది రూ.4,682 కోట్లు మాత్రమే. మీలాగా నాలుగు గోడల మధ్య బంధించుకుని ఎవరికీ ఏమీ చెప్పకుండా, ఎవరినీ కలవకుండా మూసేసి పాలన చేయదల్చుకోలేదు. మా ప్రభుత్వం 24/7 తలుపులు తెరిచి ఉంటాయి. -
‘మహాలక్ష్మి పథకం లేదు కానీ.. అందాలు పోటీలకు మాత్రం సిద్ధం’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రతీ విషయంలోనూ పారియిందంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం తాము అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ బడ్జెట్ పై ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వకుండా పారిపోయింది. శాసన సభ చరిత్రలో చీకటి రోజు. ప్రభుత్వం తలుపు లు తెచిచే ఉంటాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి... కేవలం 20 శాతం కమిషన్ కోసం మాత్రమే తెరిచి ఉంచారని ఎద్దేవా చేశారు హరీష్.ప్రభుత్వం 20 శాతం కమిషన్ అడుగుతుందని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్మ చేశారు. ఉద్యోగుల విషయంలో భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టించారు. 2 లక్షల ఉద్యోగలా గురించి ప్రశ్నిస్తే సభను వాయిదా వేసి పారిపోయారు. ఎల్ఆర్ఎస్ అంశంలో భట్టి విక్రమార్క దాట వేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తే డబ్బులు చెల్లించాల్సిదేని భట్టి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదు. బీఆర్ఎస్ అప్పులపై లెక్కలు చూపించాలంటే పారిపోయారు. కాంట్రాక్టర్లు అంటే పెద్ద పీట .. ఉద్యోగులు అంటే చిన్నచూపు. మహాలక్ష్మి పథకం అమలు లేదు కానీ.. అందాల పోటీలు పెడుతున్నారు. ప్రభుత్వం దగ్గర మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయింది. సభలో అబద్ధాలు చెప్పి ప్రభుత్వం పారిపోయింది’ హరీష్ విమర్శనాస్త్రాలు సంధించారు. -
సీఎం రేవంత్రెడ్డితో హరీష్రావు భేటీ
-
సీఎం రేవంత్రెడ్డితో హరీష్రావు భేటీ.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డితో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు భేటీ అయ్యారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎంతో అరగంటకు పైగా హరీష్రావు మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం పద్మారావు మీడియాతో మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్లామని పేర్కొన్నారు.‘‘మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదు. పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరాం. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు’’అని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నారని తాను కూడా వెళ్లినట్లు హరీష్రావు పేర్కొన్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్ను బహిష్కరించాం. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు. డీఎంకే వాళ్ళు పిలిచారని మేము వెళ్తున్నాం. డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ. ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు’’ అని హరీష్రావు చెప్పారు.కాగా, అంతకు ముందు.. సీఎం రేవంత్ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమినేషన్పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్ హాజరుకానున్నారు. -
ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయలేదు: హరీష్ రావు
-
ఎనుముల వారి పాలనలో ఎన్ని ఎకరాలు అమ్ముతారు?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్పై అసెంబ్లీ వేదికగా వాడీ వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మంత్రులు.. మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బడ్జెట్ కేటాయింపులు... కాంగ్రెస్ పాలనపై హారీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారని వ్యాఖ్యలు చేశారు.గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘గత సంవత్సరం బడ్జెట్ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్గా క్యాలెండర్గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్నగర్లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను.👉భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?.👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి హరీష్రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్లో హరీష్రావు, రాధాకిషన్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరద్దర్నీ పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఇక, తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఫోన్ టాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని.. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు.. హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సహా ముగ్గురి అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్కార్డు కొనుగోలు చేశారని.. ఆ సిమ్ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇక ఈ కేసులో ఏ-1గా హరీష్ రావు, ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు. -
సమాధానాలు చెప్పలేక సర్కారు పారిపోతోంది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ‘క్వశ్చన్ అవర్’లో సభ్యులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం పారిపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కీలకమైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ‘క్వశ్చన్ అవర్’ను రద్దు చేసిందన్నారు. సభ్యులకు తెలియకుండా ప్రశ్నల్లోనూ మార్పులు జరుగుతున్నా యని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ లాబీల్లో హరీశ్రావు మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు.హెచ్ఎండీఏ భూములు తాకట్టు పెట్టడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), జల మండలి (హెచ్ఎండబ్ల్యూఎస్) నుంచి అప్పులు తెచ్చిన విషయంపై ప్రశ్నలు ఉండటంతో ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనే ప్రశ్నోత్తరాలను రద్దు చేశారన్నారు. మొత్తం రూ.50 వేల కోట్లు అప్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. యాసంగి పంటలు ఎండిపోవడంపై కేటీఆర్కు సంబంధించిన ప్రశ్న కూడా ప్రశ్నావళిలో ఉందని, ఈ అంశంపై స్పీకర్కు సోమవారం తాను ఫోన్ చేసి క్వశ్చన్ అవర్ రద్దుపై ప్రశ్నించానని తెలిపారు. ఆంధ్రా జలదోపిడీతో ఎండుతున్న పంటలు ఆంధ్రా జలదోపిడీ కారణంగా మహబూబ్నగర్, నల్లగొండలో పంటలు ఎండిపోతున్నాయని హరీశ్రావు విమర్శించారు. వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు రైతు భరోసా ఇచ్చారా లేదా అనే ప్రశ్న వేస్తే ఏకంగా ప్రశ్నోత్తరాలే రద్దయ్యాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల తక్కువ ధరకు రైతులు పంటలు అమ్ముకొని నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో 42,363 మంది రైతులకుగాను 22,949 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని హరీశ్ చెప్పారు. -
సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన హరీష్ రావు
సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 184 లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ పేదల కోసం సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఊళ్లలో కరెంట్ కష్టాలు మళ్లీ వచ్చాయి.ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. పేద ప్రజల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచించేవాడు. రేవంత్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. సిద్ధిపేటకు రేవంత్ అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు సిద్ధిపేట బాగా అభివృద్ధి చెందింది. మళ్లీ కేసీఆర్ రావాలి అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిద్ధిపేట అభివృద్ధి కోసం అసెంబ్లీలో కూడా కొట్లాడతా. కేసీఆర్ అన్ని ప్రాజెక్టులు నిర్మించాడు. బుద్ధి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది’ అని హరీష్ విమర్శించారు. -
‘అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం’
సాక్షి, వరంగల్ : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంచనాల మేరకు రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు.కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించారు. కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కూలింది. అది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా 15 నెలల్లో రూ. 58 లక్షల జీతం తీసుకున్నారు.ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్,హరీష్ రావు చర్చకు రావాలి. ఎనిటైం. ఏ ప్రాజెక్ట్ దగ్గరైనా చర్చకు రెడీ. రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? తెలంగాణకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్.త్యాగాలు చేసిన వారు జాతిపితలు అవుతారు’అని పునరుద్ఘాటించారు. సభలో రేవంత్ అసహనంజనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. నిరుద్యోగులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలను చూసిన రేవంత్.. చూశాను ఇక దించండి అంటూ అసహనానికి లోనయ్యారు. దీంతో నిరుద్యోగులు ఫ్లెక్సీలను దించడంతో రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
సీఎం రేవంత్.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్: హరీష్ రావు
-
కేసీఆర్పై వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్కు హరీష్రావు సవాల్
సాక్షి, తెలంగాణభవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్రావు కౌంటరిచ్చారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతుందన్నారు. అలాగే, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని అన్నారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్కు సంస్కారం ఉందా?. కేసీఆర్ను మార్చురీకి పంపాలని ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చేసి.. మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్ పార్టీని అన్నట్టుగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ పెద్ద మనసుతో క్షమిస్తారు. రేవంత్ భాష వలన తెలంగాణ పరువుపోతుంది.అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలని పేదలను వేధిస్తోంది. ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగి ఇస్తామని రైతులకు చెప్పారు. ఫోర్త్ సిటీ అని మరో 15వేల ఎకరాలు సేకరణ చేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఏమనాలి. ఫార్మా సిటీ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలి. లేకపోతే ఫార్మా సిటీ నిర్మాణం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించండి.కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా నిన్న రేవంత్ సభలో మాట్లాడారు. మోదీ మంచోడు.. కిషన్ రెడ్డి చెడ్డ వ్యక్తి అని రేవంత్ అంటాడు. అటు రాహుల్ గాంధీ మాత్రం మోదీ చెడ్డ వ్యక్తి అని అంటాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు రేవంత్ సర్కార్ను బండకేసి కొట్టారు. 15 నెలలకే రాష్ట్రానికి ఈ ప్రభుత్వం భారమైంది.రేవంత్కు సవాల్..రేవంత్ రెడ్డి నీకు సవాల్ విసురుతున్నా. మధిరకు పోదామా? కొడంగల్ పోదామా? సిద్దిపేట పోదామా? ఏ ఊరుకు పోదాం?. సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్’ అని ప్రశ్నించారు. -
ఉత్తమ్ ద్రోహ చరిత్ర వల్లే.. రేవంత్ కృష్ణా జలాల విమర్శలకు హరీష్ కౌంటర్
హైదరాబాద్, సాక్షి: ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధిస్తే.. సంస్కారం లేకుండా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియాతో చిట్చాట్లో మాట్లాడారాయన. ‘‘కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి బయటకు వచ్చేశాం. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను కేసీఆర్ సాధించారు. కానీ, సీఎం అనే విజ్ఞత కోల్పోయి, సంస్కారం లేకుండా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి.. ఆ వ్యాఖ్యలపై సభలో మాట్లాడామన్నా మాకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు’’ అని హరీష్ అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన ద్రోహం వల్లే తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని హరీష్ ఆరోపించారు. ఈ తప్పు ముమ్మాటికీ కాంగ్రెస్దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వల్ల నిర్లక్ష్యం జరిగింది. అప్పటి లెక్కల ప్రకారం నీళ్లు, ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పటి లెక్కల ప్రకారం నీళ్ల పంపకాలు జరిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు మంత్రి పదవి కోసం తెలంగాణ కోసం మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు కోసం 40 రోజులు పీజేఆర్ తప్ప ఎవరూ పోరాడలేదు. ఆ సమయంలో ఉత్తమ్ మౌనంగా ఉండిపోయారు. .. తెలంగాణకు ద్రోహం చేసి పోతిరెడ్డిపాడుపై పెదవులు మూసుకున్నందుకే ఉత్తమ్కు మంత్రి పదవి వచ్చింది. విజయవాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చంద్రబాబు ఇంట్లో భోజనం చేశారు. ఆపై శ్రీశైలం ఖాళీ అయ్యే వరకు చూశారు. సెక్షన్-3 తెచ్చి తెలంగాణకు న్యాయం చేసింది కేసీఆర్. ద్రోహ చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది.. త్యాగ చరిత్ర మాది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను మేము వ్యతిరేకించాం. నీళ్లు ఉన్నా ఖమ్మం, నల్గొండ లో పంటలు ఎండిపోయాయి ఎందుకు?. కేసీఆర్ కట్టిన సీతారామ పుణ్యమాని ఖమ్మం పంటలు కాపాడుకుంటున్నారు. -
జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను పునఃసమీక్షించాలి: హరీష్ రావు
-
కేసీఆర్ ఎప్పుడూ చెప్తుండేవారు.. మీపై గౌరవం ఉంది: హరీష్రావు
హైదరాబాద్, సాక్షి: సభలో ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలని తమ పార్టీ అధినేత కేసీఆర్(KCR) చెబుతుండేవారని, ఆ మాటను తాము తూచా తప్పకుండా పాటిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అంటున్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. తమ పార్టీ నేత జగదీష్రెడ్డిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారాయన.‘‘స్పీకర్ అంటే జగదీష్రెడ్డికి, మాకు ఎంతో గౌరవం ఉంది. సభలో హుందాగా ఉండాలని మా అధినేత చెబుతుండేవారు. మేం అలాగే ఉంటున్నాం. స్పీకర్ పట్ల ఆయన అమర్యాదగా ప్రవర్తించలేదు. జగదీష్రెడ్డికి మైక్ ఇచ్చి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా ఆయన స్పీకర్ను ఏకవచనంతో పిలవలేదు. కాబట్టి జగదీష్రెడ్డి(jagadish Reddy)పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలి’’ అని హరీష్ రావు స్పీకర్ను కోరారు. అంతకు ముందు.. సభ ప్రారంభానికి ముందు స్పీకర్ను ఆయన ఛాంబర్లో బీఆర్ఎస్ శాసనసభా పక్షం కలిసిసింది. జగదీష్రెడ్డి సస్పెన్షన్ అక్రమం, అన్యాయన్న బీఆర్ఎస్ సభ్యులు.. సస్పెన్షన్పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, చివరకు సస్పెన్షన్కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి నుంచి వివరణ కూడా తీసుకోలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి.. నిర్ణయాన్ని పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.