 
													సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం పరామర్శించారు. తన భర్త అనిల్తో కలిసి కోకాపేటలోని హరీశ్రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణ రావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
హరీశ్రావు కుటుంబానికి కవిత దంపతులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీశ్రావు తల్లి, తన మేనత్త అయిన లక్ష్మిని కవిత పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతోపాటు పలువురు ప్రముఖులు కూడా హరీశ్ నివాసానికి వెళ్లి ఆయన తండ్రి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
