breaking news
Movies
-
ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి: హరి గౌర
‘‘మిరాయ్’ చిత్ర సంగీతం, నేపథ్య సంగీతానికి థియేటర్స్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషాన్నిచ్చింది. చిత్ర నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ కూడా చక్కని మ్యూజిక్ ఇచ్చానంటూ నన్ను అభినందించారు. సినిమా విడుదల తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. నా ఫోన్కి కాల్స్ ఏకధాటిగా వస్తూనే ఉన్నాయి. చాలా మెసేజ్లు కూడా వచ్చాయి. అయితే ఆ సమయంలో నేను జ్వరంతో ఉండటం వల్ల ఎక్కువ కాల్స్ మాట్లాడలేకపోయాను’’ అని సంగీత దర్శకుడు హరి గౌర చెప్పారు.తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రం ‘మిరాయ్’. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు హరి గౌర విలేకరులతో మాట్లాడుతూ–‘‘హనుమాన్, మిరాయ్’ వంటి బ్యాక్ టు బ్యాక్పాన్ ఇండియా హిట్స్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్గారు చాలా అద్భుతమైన సినిమా తీశారు. కీరవాణిగారు లాంటి లెజెండరీ కంపోజర్తో నన్నుపోల్చడం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ.. అదే సమయంలో భయంగా, బాధ్యతగా అనిపిస్తోంది.ఈ సినిమా కోసం ‘వైబ్ ఉంది బేబి...’ తోపాటు మరో స్పెషల్ సాంగ్ని చిత్రీకరించాం. అయితే ఎడిటింగ్లో చూసుకుంటే.. కథ ఫ్లోకి ఇబ్బంది కలిగిస్తుందేమో అనే ఫీలింగ్ కలిగింది.. దీంతో యూనిట్ అంతా కలిసి ఆపాటలను తీసేయాలనే నిర్ణయం తీసుకున్నాం. అయితే ఓటీటీ స్ట్రీమింగ్లో మాత్రం ‘వైబ్ ఉంది బేబి...’ సాంగ్ ఉంచాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో నాది పదేళ్ల ప్రయాణం. కన్నడలో ‘చార్మినార్’ వంటి హిట్ చిత్రం తర్వాత తెలుగులో నిరూపించుకోవాలని ఇక్కడికి వచ్చాను. ‘తుంగభద్ర, డియర్ మేఘ, గాలివాన’ వంటి సినిమాలు చేశాను. దర్శక–నిర్మాతల నమ్మకాన్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో చాలా టైమ్ పట్టింది’’ అన్నారు. -
సరికొత్త లోకం
సుధీర్బాబు, సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. దర్శక ద్వయం వెంకట్ కల్యాణ్– అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని నవంబరు 7న విడుదల చేయనున్నట్లు సోమవారం అధికారికంగా వెల్లడించారు మేకర్స్. ‘‘ఒక ఫోక్ టేల్ నుంచి పుట్టిన అద్భుతమైన కథే ‘జటాధర’. స్టోరీ టెల్లింగ్, సినిమా స్కేల్, విజన్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఓ సరికొత్త లోకంలోకి తీసుకువెళుతుంది.. అలాగే గొప్ప అనుభూతిని ఇస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
భద్రకాళి నిరుత్సాహ పరచదు: విజయ్ ఆంటోని
‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదని కచ్చితంగా చెప్పగలను’’ అని విజయ్ ఆంటోని చెప్పారు. ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా కలిసి తెలుగులో విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సురేష్ బాబు మాట్లాడుతూ–‘‘విజయ్గారి క్రమశిక్షణే ఆయన్ను గొప్పస్థాయికి తీసుకువెళ్తుంది’’ అన్నారు. ‘‘మంచి పొలిటికల్ థ్రిల్లర్ ఇది’’ అని తెలిపారు అరుణ్ ప్రభు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అన్నారు రామాంజనేయులు. ఈ వేడుకలో తృప్తి రవీంద్ర, రియా, రైటర్ భాష్యశ్రీ మాట్లాడారు. -
అతనితో పెళ్లి వార్తలు.. స్పందించిన జాన్వీ కపూర్!
ఇటీవలే పరమ్ సుందరితో అభిమానులను అలరించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. అంతలోనే మరో మూవీతో అలరించేందుకు సిద్ధమైంది. సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. వరుణ్ ధావన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు జాన్వీ కపూర్ కూడా హాజరైంది.ఈ సందర్భంగా జాన్వీ కపూర్కు తన పెళ్లి గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ స్పందించారు. ప్రస్తుతానికి తనకైతే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ఇప్పుడు నా దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని తెలిపింది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉందని వెల్లడించింది. దీంతో తనపై వస్తున్న మ్యారేజ్ రూమర్స్కు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ.అయితే గతంలో ఆమె.. శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే వీరిద్దరు చాలాసార్లు జంటగా కనిపించడంతో రూమర్స్ వినిపించాయి. గత ఇంటర్వ్యూలో తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్లో బోనీ కపూర్, ఖుషీ కపూర్తో పాటు శిఖర్ పేరును కూడా చెప్పడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా.. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. టాలీవుడ్లో రామ్ చరణ్ సరసన పెద్దిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. -
పవన్ కల్యాణ్ ఓజీ.. సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓమీ అనే సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఓమీ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు.తాజాగా ఈ చిత్రం నుంచి గన్స్ అండ్ రోజెస్ అనే పాటను విడుదల చేశారు. అద్వితీయ, హర్ష రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
'పురుషులు, మహిళలు ఓకే బెడ్పై.. బిగ్బాస్పై నటి షాకింగ్ కామెంట్స్'
బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తాజాగా ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 ఏళ్లుగా తనకు బిగ్బాస్ ఆఫర్ వస్తోందని తెలిపింది. కానీ ఈ అవకాశాన్ని తాను తిరస్కరిస్తూనే ఉన్నానని వెల్లడించింది. తనకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేసినా కూడా ఈ షోలో పాల్గొనని మేకర్స్కు తేల్చి చెప్పానని పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజైరన తనుశ్రీ దత్తా బిగ్బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా.. నా లైఫ్లో ఎప్పటికీ బిగ్బాస్లో పాల్గొనని చెప్పింది.తనుశ్రీ దత్తా మాట్లాడుతూ..'బిగ్బాస్ ఆఫర్ ప్రతి ఏటా వస్తోంది. ఈ షోలో పాల్గొనాలని మేకర్స్ తనను సంప్రదిస్తారు. ప్రతి ఏటా ఈ రియాలిటీ షో కోసం నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. ఎందుకంటే వారు మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కూడా అంతే మొత్తాన్ని ఇచ్చారు. ఆమె కూడా నా స్థాయి నటినే. అంతకంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని బిగ్బాస్ మేకర్స్లో ఒకరు ఆఫరిచ్చారు. కానీ తిరస్కరించాను. ఎందుకంటే ఈ షోలో పురుషులు, మహిళలు ఓకే బెడ్పై పడుకుంటారు. అదే ప్లేస్లో కోట్లాడుకుంటారు. నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని అని వారు ఎలా అనుకుంటారు?.. నేను అంత చీప్ కాదు. వారు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్బాస్కు వెళ్లను. నేను నా ఫ్యామిలీతోనే కలిసి ఉండనని.. తనకంటూ ప్రత్యేక స్పేస్ కోరుకునేదాన్ని' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.బిహార్కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. -
'మిరాయ్' బ్యూటీ ఇలా.. బ్యాంకాక్లో ఆండ్రియా అలా
బ్యాంకాక్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్న ఆండ్రియాచీరలో మెరిసిపోతున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్లఎర్రచీరలో సీతాకోకచిలుకలా 'మిరాయ్' రితికా నాయక్మాల్దీవుల్లో మేకప్ లేకుండా బాలీవుడ్ బ్యూటీ అనన్యఅందంగా ముస్తాబైన యాంకర్ శ్రీముఖిరోజురోజుకీ గ్లామరస్గా తయారవుతున్న ఛార్మీ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
రవితేజ వారసుడి కొత్త సినిమా.. మాస్ గ్లింప్స్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న చిత్రం మారెమ్మ. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఇవాళ మాధవ్ భూపతిరాజు పుట్టినరోజు కావడంతో గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్.తాజా గ్లింప్స్ చూస్తే మాధవ్ మాస్ లుక్లో కనిపించాడు. కబడ్డీ కోర్టులో ఫుల్ మాస్ యాక్షన్ హీరో లుక్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్నారు. కాగా.. మాధవ్ ఇప్పటికే మిస్టర్ ఇడియన్ అనే చిత్రంలో కనిపించారు. -
ఏడాదిగా డేటింగ్.. సీక్రెట్గా హీరోయిన్ నిశ్చితార్థం?
మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైపోయింది. బాలీవుడ్కి హ్యుమా ఖురేషి.. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏడాది నుంచి ఓ యాక్టింగ్ కోచ్తో ఈమె రిలేషన్లో ఉందని, రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా వెళ్లొచ్చారని, ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం? హ్యుమా కాబోయే భర్త ఎవరు?(ఇదీ చదవండి: నేను ధనుష్ని వెన్నుపోటు పొడవలేను: జీవీ)'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపుర్' సినిమాలతో నటిగా పరిచయమైన హ్యుమా ఖురేషి.. 2012 నుంచి హిందీలో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. మలయాళంలో వైట్, తమిళంలో అజిత 'వలిమై', రజినీకాంత్ 'కాలా' చిత్రాల్లోనూ హీరోయిన్గా చేసింది. 'మహారాణి' వెబ్ సిరీస్తోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. గత ఏడాది నుంచి యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్తో ప్రేమలో ఉందని తెలుస్తోంది. హీరోయిన్ సోనాక్షి పెళ్లికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారని, అయితే తమ రిలేషన్ గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా హ్యుమా-రచిత్ వెళ్లొచ్చారు. ఇప్పుడు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని బాలీవుడ్లో వినిపిస్తుంది. ఇది నిజమే అయినప్పటికీ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని సన్నిహితుల మాట. హ్యుమాకి ప్రస్తుతం 39 ఏళ్లు. రచిత్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్కి చెందిన కుర్రాడు. మోడలింగ్ చేసేటప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. 2016లో ముంబై వచ్చేసిన తర్వాత యాక్టింగ్ కోచ్గా మారిపోయి సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరి హ్యుమా-రచిత్.. తమ నిశ్చితార్థం నిజం ఎప్పుడు చెబుతారో చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?) -
వచ్చే నెలలో కత్రినా కైఫ్ గుడ్ న్యూస్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ను పెళ్లాడింది. 2021లో వీరిద్దరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఈ జంటపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కత్రినా గర్భంతో ఉన్నారని చాలాసార్లు కథనాలొచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.అయితే ఈసారి ఏకంగా ఈ జంటపై మరో ప్రచారం మొదలైంది. వచ్చేనెలలోనే కత్రినా కైఫ్ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోది. ప్రస్తుతం ఆమె మూడో త్రైమాసికంలో ఉన్నారని.. వచ్చేనెల లేదా నవంబర్లో బిడ్డకు స్వాగతం పలకనున్నారని నెట్టింట చర్చ మొదలైంది. కత్రినా ప్రసవం తర్వాత సుదీర్ఘంగా విరామం తీసుకోవాలని యోచిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.రెండు నెలల క్రితం కత్రినా కైఫ్ ఓవర్సైజ్ షర్ట్లో కనిపించడంతో మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్ వినిపించాయి. ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తమపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై గతంలోనే విక్కీ కౌశల్ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని.. ఏదైనా ఉంటే తామే స్వయంగా చెబుతామన్నారు. అంతేకాకుండా 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ సమయంలో కూడా కత్రినా గర్భం ధరించారని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో కూడా ఇలాంటి వార్తల్ని ఆయన ఖండించారు. అయినప్పటికీ ఈ జంటపై పలు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే కత్రినా తన కాస్మెటిక్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ మరోసారి ఆమె గర్భవతి అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా వస్తోన్న కథనాలపై కత్రినా, విక్కీ కౌశల్ క్లారిటీ ఇస్తే కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్కు చెక్ పడేలా కనిపించడం లేదు.మరోవైపు విక్కీ కౌశల్ ఈ ఏడాది ఛావాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. విక్కీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్తో కలిసి 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తున్నారు.We got #VickyKaushal - #KatrinaKaif content today, but wait a minute….. are they expecting 👩🍼? pic.twitter.com/QrhZ1z5Xnf— Bollywood Talkies (@bolly_talkies) July 30, 2025 -
ఆయన వల్లే నా పేరు మార్చుకున్నా: కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వీర చంద్రహాస మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన రవి తనకు సాయం చేసిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి అండగా నిలిచారు. అందుకే ఆయన పేరును పెట్టుకున్నానని తెలిపారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చింది మాత్రం ప్రశాంత్ నీల్ అన్నారు.రవి బస్రూర్ మాట్లాడుతూ.. ఎనిమిదో తరగతి ఫెయిల్ అయినా నాలో సంగీత దర్శకుడిని గుర్తించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నాపై నమ్మకంతో ఉగ్రం సినిమాలో అవకాశమిచ్చారు. అప్పటికే నా లైఫ్ అంతా గందరగోళంగా ఉంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి ఆర్థిక సాయం చేశారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. లేకుంటే ఉండేవాడిని కాదు. అందుకే కృతజ్ఞతగా నా పేరును రవి అని పెట్టుకున్నా. వృత్తిపరంగా నన్ను గుర్తించి అవకాశమిచ్చిన ప్రశాంత్ నీల్ నాకు దైవంతో సమానం. నా సంపాదనతో వచ్చిన డబ్బులతో ఏడాది ఒక సినిమా తీయాలని అనుకున్నా. అందుకే వీర చంద్రహాస తెరకెక్కించా. ఇది నా 12 ఏళ్ల కల’’ అని అన్నారు.కాగా.. వీర చంద్రహాస చిత్రం ఇప్పటికే కన్నడలో రిలీజైంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 19న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. కేజీఎఫ్ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన రవి బస్రూర్ నిర్మాతగా మారారు. ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్- నీల్ కాంబోలో వస్తోన్న మూవీకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు రవి బస్రూర్. -
నేను ధనుష్ని వెన్నుపోటు పొడవలేను: జీవీ
డబ్బింగ్ సినిమాల మూలాన తమిళ హీరోహీరోయిన్లతో పాటు టెక్నిషియన్లు కూడా తెలుగు ప్రేక్షకులకు చాలావరకు పరిచయమైపోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ వల్ల చాలామంది కోలీవుడ్.. మన దగ్గర పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఒకడు. తెలుగు, తమిళంలో పలు చిత్రాలు సంగీతమందిస్తూ బిజీగా ఉండే ఇతడు.. ఇప్పుడు ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ధనుష్ని తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చాడు.ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కడై'. దీన్ని 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబరు 01న థియేటర్లలోకి రానుంది. నిన్న అంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైల్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలోనే మాట్లాడిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.. గతేడాది రిలీజైన ధనుష్ 'రాయన్'లో తనకు నటించే అవకాశం వచ్చిందని, కానీ దాన్ని వద్దనుకున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?)'రాయన్ మూవీలో తమ్ముడి పాత్ర చేయమని ధనుష్ నన్ను మొదట అడిగారు. అయితే ఆ పాత్ర ధనుష్ పాత్రని వెన్నుపోటు పొడుస్తుంది. ఆ పాయింట్ నచ్చక నేను నో చెప్పేశాను. సినిమాలో కూడా నా స్నేహితుడిని మోసం చేసే పాత్రని చేయను' అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాయన్'లో ధనుష్ తమ్ముళ్లుగా కాళిదాస్, సందీప్ కిషన్ నటించారు. ఇందులో ఓ పాత్రనే జీవీ చేయాల్సింది కానీ వద్దనేశాడనమాట.ఇకపోతే 'ఇడ్లీ కొట్టు' సినిమా.. పూర్తిగా ఎమోషన్స్ బేస్ చేసుకుని తీశారు. ధనుష్, నిత్యామేనన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే లీడ్ రోల్స్ చేశారు. దసరా కానుకగా తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీనికి ఐదు రోజుల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ', ఓ రోజు తర్వాత 'కాంతార' సీక్వెల్ విడుదల కానున్నాయి. మరి వీటితో నిలబడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: రూ.100 కోట్లకు చేరువలో 'మిరాయ్' కలెక్షన్) -
ఐశ్వర్య-అభిషేక్ బాటలో ప్రముఖ నిర్మాత!
ఇటీవల బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వినియోగించకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఐశ్వర్య, అభిషేక్ తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తన పేరుతో నిధులను సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పిటిషన్ వేశారు. ఈ మేరకు కరణ్ తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతి లేకుండా తన ఫోటోలు వినియోగిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో కరణ్ పేరుతో అనధికార పేజీలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. -
అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?
బిగ్బాస్ హౌసులో రెండో వారం వచ్చేసింది. సెలబ్రిటీలతో పాటు ఎంట్రీ ఇచ్చిన కామనర్స్.. తొలివారం బాగానే లాక్కొచ్చారు కానీ ఇప్పుడు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్లలో వాళ్లే గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఈసారి నామినేషన్స్ జరగ్గా.. ఇందులోనూ చాలావరకు సామాన్యులే ఉన్నారు. ఇంతకీ ఈసారి లిస్టులో ఎవరెవరు ఉన్నారు? మాస్క్ మ్యాన్ హరీశ్.. నిరహారదీక్ష సంగతేంటి?తొలి వీకెండ్లో మాస్క్ మ్యాన్ హరీశ్ నిజస్వరూపాన్ని నాగార్జున బయటపెట్టడంతో మనోడు బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉన్నాడు. ఏం తినను, తాగను అంటూ నిరహారదీక్ష చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయం బయటపడింది. రెండో రోజుల నుంచి ఏం తినట్లేదు కాస్త తినండి అని చెప్పి ప్లేటులో ఫుడ్ పెట్టుకుని శ్రీజ రాగా.. మొహమాటం లేకుండా హరీశ్ వద్దనేశాడు. ఇంకొన్నిరోజుల వరకు తినను, కనీసం నీరు కూడా తాగను, మీలాంటోళ్ల మధ్యలో ఉండదల్చుకోలేదు అని అన్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు నేను ఏం తినను, తాగను అని క్లారిటీగా చెప్పేశాడు.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్)మరోవైపు శ్రీజ-మనీష్ వాదులాడుకున్నారు. నీ పనే అరవడం కదా అని శ్రీజతోనే మనీష్ అనేసరికి ఈమె హర్ట్ అయిపోయింది. పాయింట్ అవుట్ చేసేస్తున్నారని మూలకు వెళ్లి ఏడవడం నీ పని అని మనీష్కి ఇచ్చిపడేసింది. భరణి తన గురించి సంజన దగ్గర చాడీలు చెబుతున్నాడని హరీశ్.. రాము రాథోడ్తో చెబుతూ కనిపించాడు.సెల్ఫీష్ రూత్లెస్ ఇడియట్స్ అని తమ కామనర్స్నే మనీష్ తిట్టాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కామనర్స్ అనేదానికి వీళ్లు ఓ గలీజ్ మార్క్, వరస్ట్ కామనర్స్ అంటూ ఇమ్మాన్యుయేల్తో చెబుతూ తెగ బాధపడిపోయాడు.ఇకపోతే ఈ వారం నామినేషన్స్ విషయానికొస్తే.. ఒక్కొక్కరు ఇద్దరిద్దరి పేర్లు చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. నామినేషన్ ప్రక్రియ బాగానే జరిగింది. అయితే దాదాపు ఎనిమిది మంది మాస్క్ మ్యాన్ హరీశ్ పేరు చెప్పారు. తర్వాత ఎక్కువమంది భరణి పేరు చెప్పారు. వీళ్లిద్దరితో పాటు మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి సామాన్యుల నుంచి నలుగురు, సెలబ్రిటీల నుంచి ఇద్దరు నామినేట్ అయినట్లు టాక్. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?) -
నన్ను నేనే తిట్టుకున్నా.. చచ్చిపోవాలని ట్రై చేశా: నైనిక
డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక అనసురు (Nainika Anasuru) తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. టాస్కుల్లో బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ ఫినాలే వరకు వెళ్లలేకపోయింది. కవర్ సాంగ్స్తో అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను, కెరీర్లో అనుభవించిన బాధలను పంచుకుంది.చచ్చిపోవాలని ట్రై చేశా..నైనిక మాట్లాడుతూ.. 'ఢీ షో చేస్తున్న సమయంలోనే నేను డిప్రెషన్కు గురయ్యాను. నా ఫ్యామిలీతో సహా ఎవరూ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోలేదని బాధపడ్డాను. ఇంట్లోవాళ్లు పాతకాలం మనుషుల్లా ఆలోచించేవారు. వేధింపులను కూడా కొంతవరకు భరించాలన్నట్లుగా చెప్పేవారు. కానీ, అది నా వల్ల కాదు. ఎవర్నీ ఏమీ అనలేక, ఏం చేయలేక పది మంది ముందు నన్ను నేనే తిట్టుకుని ఏడ్చేదాన్ని. ఎందుకిలా అయిపోతున్నానో అర్థం కాలేదు. చనిపోయేందుకు ప్రయత్నించాను. దాదాపు ఏడాదిపాటు బాధపడుతూ నా జీవితాన్ని వృథా చేసుకున్నాను. ఇండస్ట్రీలో చీకటి కోణంకానీ, దానివల్లే నన్ను నేను ఎంత ప్రేమించుకోవాలో తెలిసొచ్చింది. ఇకపోతే ఇండస్ట్రీలో అందరూ నిలదొక్కుకోలేరు. నిజాయితీగా మాట్లాడాలంటే నాకు ఓ కూతురుంటే తనను ఈ ఇండస్ట్రీకి అస్సలు పంపించను. వద్దని చెప్పేస్తా! ఇండస్ట్రీలో చాలా చీకటికోణాలున్నాయి. అవన్నీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. కాస్టింగ్ కౌచ్లాంటివి ఫేస్ చేశాను. కొందరు డైరెక్ట్గా కాల్ చేసి మరీ అడుగుతుంటారు. సినిమా ఆఫర్లు ఇచ్చి కమిట్మెంట్స్ అడిగారు. అందరూ గలీజ్ అయిపోయారు.దరిద్రంగా తయారైందిఈ మధ్య నాకు ఓ రియల్ ఎస్టేట్ గ్రూప్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్ కోసం అనుకున్నా.. కాదు, పర్సనల్ అన్నారు. ఆయనేమంటున్నారో అర్థం కాకపోయినా డీల్ ఏంటో చెప్పండి అన్నాను. అందుకతడు.. మీ గురించి బయట ఓ ప్రచారం జరుగుతోంది. మీకు ఓ రేట్ ఫిక్స్ చేస్తున్నారు. మీ ఫోటోలతో పాటే ఆ రేట్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అన్నాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇండస్ట్రీ ఎంతో దరిద్రంగా తయారైందనేది! అని నైనిక బాధపడింది.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
నా ఫోన్ హ్యాక్ చేశారు.. అభిమానులకు స్టార్ హీరో హెచ్చరిక
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా నా ఫోన్ నుంచి కాల్ వస్తే స్పందించవద్దని కోరారు. తన ఫోన్ హ్యాక్ చేశారని ఉపేంద్ర తెలిపారు. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ కూడా ఇవ్వొద్దని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఉపేంద్ర వెల్లడించారు. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒకరు కాల్ చేశారని.. కొన్ని హ్యాష్ట్యాగ్స్, నంబర్లు ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని చెప్పాడని ఉపేంద్ర అన్నారు. ఆ కాల్ తర్వాతే ఫోన్ హ్యాక్ అయిందని తెలిపారు. ఇలాంచి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉపేంద్ర తన అభిమానులకు సూచించారుBeware… pic.twitter.com/ftbQDFodTf— Upendra (@nimmaupendra) September 15, 2025 -
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నెల ప్రారంభమైన బిగ్బాస్ షో ఇప్పటికే ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ఆరుగురు కామనర్స్ హౌస్లో అడుగుపెట్టారు. అంతే కాకుండా రాను.. బొంబాయికి రాను అంటూ ఊపేసిన రాము రాథోడ్ సైతం బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఫోక్ సాంగ్తో వైరలైన రాము రాథోడ్ బిగ్బాస్లోకి వెళ్లడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే రాము రాథోడ్ను బిగ్బాస్ హౌస్లో చూసిన తల్లిదండ్రులు మాత్రం ఫుల్ ఎమోషనలవుతున్నారు. రామును అలా చూడడం మేము తట్టుకోలేకపోతున్నామని రాము తండ్రి ఏడ్చేశారు. మాకు చదువు రాదని.. రాము నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉంటుందని.. ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తే మాకు నచ్చడం లేదన్నారు. కానీ అవన్నీ ఆటలో భాగమని మాకు తెల్వదని అంటున్నారు రాము పేరేంట్స్. అంతేకాకుండా రాము అందరికీ నచ్చే మనిషి అని అతని తల్లి అన్నారు. అందరినీ బాగా పలకరిస్తాడని చెప్పారు. రామును టీవీల్లో చూస్తుంటే మాకు బాధగా ఉందని అతని తండ్రి ఎమోషనల్గా మాట్లాడారు. నువ్వు చివరికీ వరకు హౌస్లో ఉండి కప్ గెలవాలని రాము తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాము గెలిస్తే మహబూబ్నగర్లోని గోపాలపురమంతా డ్యాన్స్ చేస్తామని అంటున్నారు అతని తల్లిదండ్రులు. ఏదేమైనా ఒక్క పాటతో ఫేమ్ తెచ్చుకుని బిగ్బాస్ వరకు వెళ్లిన రాము రాథోడ్ కప్ గెలవాలని అతని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. -
ఆరోజు సౌందర్యతో పాటు నేనూ చనిపోయేదాన్నే..: మీనా
అందం, అమాయకత్వం కలబోసినట్లు ఉంటుంది హీరోయిన్ మీనా (Actress Meena). బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తర్వాత హీరోయిన్గా దక్షిణాది భాషల్లో అనేక సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తాజాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ సౌందర్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.క్యాంపెయిన్కు నన్నూ పిలిచారుసౌందర్య, నేను చాలా క్లోజ్. తను చాలా మంచి అమ్మాయి. ప్రచారానికి వెళ్లి చనిపోవడం బాధాకరం. నిజానికి ఆ క్యాంపెయిన్కు నన్ను కూడా రమ్మని పిలిచారు. అప్పుడు నేను షూటింగ్స్తో బిజీగా ఉన్నాను. పైగా ప్రచారాలపై నాకంత ఆసక్తి కూడా లేదు. అందుకే నాకు కుదరదని చెప్పి వెళ్లలేదు. లేకపోయుంటే తనతోపాటు నేనూ వెళ్లాల్సింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తనను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది.భర్తను కోల్పోయిన బాధలో..మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ 28న కన్నుమూశారు. ఆ సమయంలో తనపై వచ్చిన రూమర్స్ చూసి మరింత బాధేసిందని పేర్కొంది. నా భర్తను కోల్పోయినప్పుడు ఎంతో బాధపడ్డా.. రెండేళ్లపాటు ఆ బాధ నుంచి బయటపడలేకపోయా.. నా ఫ్రెండ్స్ ఆ విషాదం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు. అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా లక్కీ. మళ్లీ పెళ్లంటూ రూమర్స్అయితే నా భర్త చనిపోయిన వారానికే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని వార్తలు రాశారు. వీళ్లకసలు మనసుండదా? ఫ్యామిలీ ఉండదా? అనిపించింది. తర్వాత కూడా ఈ రూమర్స్ కొనసాగించారు. ఎవరికి విడాకులైనా వారితో నా పెళ్లి జరగబోతోందని రాశారు. బాధలో ఉన్న నన్ను మరింత బాధపెట్టారు అని తెలిపింది. కాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో జీ5లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: అందరిముందు అలా అనేసరికి షాకయ్యా!: హీరోయిన్ -
మాజీ లవర్ పెళ్లికి వెళ్లి మరొకరితో ప్రేమలో.. ఫన్నీగా ట్రైలర్
ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఓ హిందీ మూవీని విడుదలకు సిద్ధం చేసింది. 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' పేరుతో తీసిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబరు 2న సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఇదో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సన్నీ(వరుణ్ ధావన్).. అనన్య (సన్య మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె ఇతడిని రిజెక్ట్ చేసి విక్రమ్(రోహిత్ షరాఫ్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. మరోవైపు విక్రమ్.. తన ప్రియురాలు తులసి(జాన్వీ కపూర్)కి బ్రేకప్ చెప్పేస్తాడు. దీంతో సన్నీ-తులసి కలిసి విక్రమ్-అనన్య పెళ్లికి వెళ్తారు. నానా హంగమా చేస్తారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్) -
అందం.. అభినయం.. రమ్యకృష్ణ తర్వాతే ఎవరైనా
అందం అపురూపం. అభినయం స్ఫూర్తి దీపం.. దక్షిణాది ఎవర్గ్రీన్ సూపర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. రమ్య కృష్ణన్... మన రమ్యకృష్ణ... భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ప్రసిద్ధ సినీ నాయిక. ఎంత మందికి తెలుసో గానీ... ఇప్పటికీ అంటే దాదాపు 55 ఏళ్ల వయసులో కూడా ఆమె దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. విశ్వసనీయ నివేదికల ప్రకారం చూస్తే ఈ దిగ్గజ నటి ఒక్కో చిత్రానికి రూ. 3-4 కోట్లు వరకూ వసూలు చేస్తుందని సమాచారం. గతేడాది ఆమె రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి గుంటూరు కారం కాగా మరొకటి పురుషోత్తముడు. సినిమా సినిమాకీ గ్లామర్తో పాటు స్టార్ డమ్ని పెంచుకుంటూ పోతున్న ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకోవడంలో కూడా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. 13ఏళ్లకే అభినయ యాత్ర ప్రారంభం...రమ్య సెప్టెంబర్ 15, 1970న మద్రాసులో (ప్రస్తుత చెన్నై) జన్మించారు. ఆమె తమిళ సినీ నటుడు మాజీ పార్లమెంటు సభ్యుడు చో రామస్వామి మేనకోడలు. రమ్య కృష్ణ నటనా ప్రయాణం 13 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది ప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళ చిత్రం నేరం పూలరంబోల్తో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, ఇది 1986లో ఆలస్యంగా విడుదలైంది. ఆమె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). ఆమె కృష్ణ రుక్మిణి చిత్రంతో కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది తన మొదటి హిందీ చిత్రంలో యష్ చోప్రాతో కలిసి పనిచేసింది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత యష్ చోప్రా చిత్రం పరంపర (1993)చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసిన తర్వాత ఆమె కెరీర్ తదుపరి స్థాయికి చేరింది. సుభాష్ ఘై 'ఖల్ నాయక్'(1993), మహేష్ భట్ 'చాహత్'(1996) , డేవిడ్ ధావన్ 'బనారసి బాబు' (1997), అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తిలతో కలిసి బడే మియాన్ చోటే మియాన్ (1998)లో గోవిందాతో కలిసి శపత్ లాంటి మరికొన్ని హిందీ చిత్రాలలోనూ నటించింది.నాలుగు దశాబ్ధాల నటనా ప్రస్థానం..ఒంపుసొంపుల అందాల భామగా మాత్రమే కాదు అమ్మోరుగానూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏకైన సినీ హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రమే. దీనితో పాటే మరెవరికీ దక్కని విధంగా నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట జీవితంలో టాప్ లోనే రాణిస్తున్నారామె. ఐదు భాషలలో 200 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు. కంటె కూతుర్నే కను, స్వీటీ నాన్న జోడి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పడయప్ప(నరసింహ), సూపర్ డీలక్స్ సినిమాలు ఆమె మరపురాని నటనా పటిమనకు నిదర్శనాలుగా నిలిచిన వాటిలో కొన్ని మాత్రమే. నరసింహ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగిన నీలాంబరిగా ఆమె నట విశ్వరూపం.. నభూతో అంటారు సినీ విమర్శకులు. అద్భుతమైన అభినయానికి నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, బిహైండ్వుడ్స్ గోల్డ్ మెడల్.. ఇలా మరెన్నో పురస్కారాలని స్వంతం చేసుకుంది. కాలక్రమంలో తన కెరీర్ను చిన్నితెరకూ విస్తరించి సన్ టీవీ కోసం కలసం, తంగం వంటి టీవీ సీరియల్లలో కనిపించింది. థంగా వెట్టై అనే గేమ్ షోను హోస్ట్ చేయడంతో పాటు ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో జోడి నంబర్ వన్ లో జడ్జిగా కనిపించింది. వివాదాలూ...ఎక్కువే...ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కామన్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా చర్చనీయాంశంగా మారిన రమ్యకృష్ణ గతంలో వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ప్రఖ్యాత దక్షిణ భారత దర్శకుడు కె.ఎస్. రవికుమార్తో వివాహేతర సంబంధం. 1999లో రమ్య కె.ఎస్.రవికుమార్తో పడయప్ప, పాటాలి (1999), పంచతంతిరం (2002) చిత్రాలలో కలిసి పనిచేసింది. తర్వాత వారి స్నేహం త్వరలోనే సంబంధంగా మారిందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రమ్య ఒంటరిగా ఉన్నప్పటికీ, కెఎస్ రవికుమార్ కర్పగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం, రమ్య కెఎస్ రవికుమార్ ద్వారా గర్భవతి అయిందని గర్భస్రావం కోసం రూ. 75 లక్షలు తీసుకుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వారు విడిపోయారని తెలుస్తోంది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత అపకీర్తికరమైన వ్యవహారాలలో ఒకటి, అయితే ఇలాంటి వ్యక్తిగత సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కుని తిరిగి కెరీర్ను పట్టాలెక్కించుకోగలిగింది రమ్య. ఆ తర్వాత, ఆమె ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని 2003 జూన్ 12న ప్రేమ వివాహం చేసుకుంది. వారి వివాహం జరిగే సమయానికి, రమ్య వయసు 33, కృష్ణ వంశీ వయసు 41. 2005 ఫిబ్రవరి 13నఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. పిల్లాడి పేరు రిత్విక్ వంశీ.అందానికి తెరరూపంగా...–అల్లుడుగారు–అల్లరిమొగుడు–అల్లరి ప్రియుడు–హలో బ్రదర్–మేజర్ చంద్రకాంత్అభినయానికి ప్రతిరూపంగా..–సూత్రధారులు–అమ్మోరు–నరసింహ–బాహుబలి ది బిగినింగ్–అన్నమయ్య–కంటే కూతుర్నే కనుచలనచిత్ర రంగంలో అటు అందం ఇటు అభినయం రెండింటినీ కలబోస్తూ అదే సమయంలో సమయానుకూలంగా మార్పు చేర్పులు చేసుకుంటూ సాగించిన రమ్యకృష్ణ ప్రయాణం... చిత్ర పరిశ్రమలోని యువతులకు నిస్సందేహంగా అనుసరణీయం. -
'బిగ్బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్
తెలుగులో బిగ్బాస్ షో మొదలై వారం రోజులైంది. శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. అయితే ప్రారంభం నుంచి ఏ మాత్రం జోష్ లేకుండా సాగుతోంది. మరోవైపు మలయాళంలోనూ 7వ సీజన్ షురూ అయి దాదాపు నెలరోజులకు పైనే అయింది. అక్కడ కూడా సాదాసీదాగానే సాగుతున్న షో కాస్త ఇప్పుడు మోహన్ లాల్ కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఓ లెస్బియన్ జంటని లేడీ కంటెస్టెంట్ అవమానించడమే దీనికి కారణం. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?)మలయాళ బిగ్బాస్ ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. దీనికి మోహన్ లాల్ హోస్ట్. రీసెంట్గా వీకెండ్ ఎపిసోడ్లో ఈయన విశ్వరూపం చూపించాడు. లక్ష్మీ అనే కంటెస్టెంట్.. అదిలా-నూరా అనే లెస్బియన్ జంటపై దారుణమైన కామెంట్స్ చేసింది. 'అసలు మిమ్మల్ని ఈ హౌసులోకి ఎవరు రానిచ్చారు? మీకు ఇక్కడికి వచ్చేందుకు ఏ మాత్రం అర్హత లేదు' అని అనేసింది.దీంతో మోహన్ లాల్.. హౌస్మేట్ లక్ష్మీపై ఫుల్ ఫైర్ అయిపోయారు. 'అసలు హౌసులోకి రావడానికి అర్హత లేని వ్యక్తులు ఎవరు?' అని మోహన్ లాల్ ప్రశ్నించాడు. తన కామెంట్స్ని కవర్ చేసేందుకు లక్ష్మీ ప్రయత్నించగా.. 'వాళ్లని నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు కాస్త ఆలోచించు. అసలు ఇలా మాట్లాడేందుకు నీకేం అర్హత ఉంది? వాళ్ల పక్కన ఉండలేకపోతే హౌస్ నుంచి వెళ్లిపో. గెటౌట్' అని మోహన్ లాల్ రెచ్చిపోయారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హౌస్టింగ్ అంటే ఇది అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్) -
ఏఐ సాయంతో నటుడి ఫోటోలు మార్ఫింగ్.. యువతిపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్లో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. ఏఐతో మార్ఫింగ్అతని ఇన్స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోదరికి సైతం అశ్లీల సందేశాలుదాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్ -
అందుకే ఆ పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు: కేంద్రమంత్రి సురేశ్ గోపీ
మలయాళ ప్రముఖ నటులు, త్రిశ్శూర్ ఎంపీ, కేంద్రమంత్రి సురేష్ గోపీని సాయం చేయాలని కొద్దిరోజుల క్రితం ఓ వృద్ధుడు కోరాడు. అయితే, దానిని ఆయన తిరస్కరించారు. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆపై అక్కడి రాజకీయ ప్రత్యర్దులు కూడా ఆయనపై విరుచుకపడ్డారు. ఈ అంశంపై తాజాగా కేంద్రమంత్రి సురేష్ గోపీ రియాక్ట్ అయ్యారు.ఇటీవల కేరళలో జరిగిన ఓ ర్యాలీలో సురేశ్ గోపీ పాల్గొన్నారు. ఆ సమయంలో ఇల్లు కట్టుకోవడానికి సహాయం కోరుతూ ఒక వృద్ధుడు ఇచ్చిన దరఖాస్తును ఆయన స్వీకరించలేదు. అందుకు సంబంధించి సురేష్ గోపీ ఇలా వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు రాజకీయ ఎజెండాగా ఉపయోగిస్తున్నారని ఆయన తప్పుబట్టారు.'ఒక ప్రజా సేవకుడిగా, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నిలబెట్టుకోలేని వాగ్దానాలు నేను చేయలేను. గృహ నిర్మాణం అనేది రాష్ట్ర సమస్య. కాబట్టి, అలాంటి అభ్యర్థనలను నేను ఒక్కడినే మంజూరుచేయలేను. రాష్ట్ర ప్రభుత్వమే దాని గురించి ఆలోచించాలి. ఈ సంఘటన ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇంటిని మంజూరు చేసింది.ఈ విషయం తెలిసిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. ఇది రాజకీయంగా ప్రేరేపించబడినప్పటికీ, నా వల్ల అతనికి మంచి జరిగింది. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు దీనిని గమనిస్తున్నారు.నా వల్ల ఇల్లు అందించడానికి వారు ముందుకు వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా ప్రయత్నాలు ఎల్లప్పుడూ వ్యవస్థలో పనిచేయడం, ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడంపైనే ఉంటాయి.' అని ఆయన అన్నారు. -
అందరిముందు అలా అనేసరికి షాకయ్యా!: హీరోయిన్
సన్నగా ఉంటే అస్థి పంజరంలా ఉన్నావని, బొద్దుగా ఉంటే బాగా లావైపోయావని ఏదో ఒకరకంగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. తనను కూడా ఇలాంటి కామెంట్లతో బాడీ షేమింగ్ చేశారంటోంది మలయాళ హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొందరు అదే పనిగా ఏదేదో వాగుతారు. ఏం చేస్తున్నావ్? ఇలా అయిపోతున్నావ్? అని కామెంట్లు చేస్తుంటారు. లెక్క చేయట్లేమొదట్లో ఫీలయ్యేదాన్ని. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. కానీ ఇప్పుడవేవీ పట్టించుకోవడం లేదు. ఇలా ధృడంగా మారడానికి నాకు చాలా సమయం పట్టింది. ఒకసారేమైందంటే.. చాలాదూరం ప్రయాణించి విమానాశ్రయంలో దిగాను. ఇంతలో సడన్గా నాకు పరిచయమే లేని వ్యక్తి ఎదురొచ్చి.. ఏంటి? ఇంత లావైపోయావ్? అన్నాడు. షాకయ్యాఅందరి ముందు సడన్గా అలా అనేసరికి షాకయ్యాను. తర్వాత ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాను. ఇలాంటివి జరిగినప్పుడు మనసుకు కష్టంగా అనిపించేది. కానీ, ఒకానొక సమయంలో ఈ బాధను అధిగమించాను. ఇప్పుడలాంటి కామెంట్లను పట్టించుకోవడమే మానేశాను అని చెప్పుకొచ్చింది. సినిమాఅపర్ణ బాలమురళి 2015లో ఒరు సెకండ్ క్లాస్ యాత్ర అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సూరరై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. మలయాళంలో సండే హాలీడే, 2018, ధూమం, రుధిరం వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 8 తొట్టకాల్, వీట్ల విశేషం, రాయన్ సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తోంది.చదవండి: 'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ.. -
'మిరాయ్' కలెక్షన్.. రూ.100 కోట్లకు చేరువలో
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అందుకు తగ్గట్లే కలెక్షన్ కూడా వస్తోంది. తొలిరోజు ఓ మాదిరి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం.. రెండు, మూడో రోజు మాత్రం కాస్త ఎక్కువగానే వసూలు చేసింది. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన 'మిరాయ్'కి తొలి నుంచి కాస్త హైప్ ఏర్పడింది. కంటెంట్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్గా విజువల్స్ పరంగా ఆకట్టుకోవడంతో పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. అలా తొలిరోజు రూ.27.20 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు వచ్చేసరికి రూ.55.60 కోట్లకు చేరింది. ఆదివారం మంచి ఆక్యుపెన్సీలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులకు కలిపి రూ.81.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరువలో వసూళ్లు ఉన్నాయి. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ విషయంలో కాస్త డ్రాప్ ఉంటుంది. ప్రేక్షకులు కాస్త తక్కువగానే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. మరి 'ఓజీ' రావడానికి ఇంకా 10 రోజులకు పైనే టైమ్ ఉంది. మరి అంతలోపు 'మిరాయ్' ఎన్ని కోట్లు అందుకుంటుందో చూడాలి? ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఇది కూడా 'మిరాయ్'కి ప్లస్ కావొచ్చేమో?(ఇదీ చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్)From South to North, from India to Overseas, #MIRAI is rewriting history everywhere ❤️🔥Record Breaking ₹81.2 Cr Gross Worldwide in just 3 DAYS for #BrahmandBlockbusterMirai 💥💥💥India’s most ambitious action adventure is now the most celebrated film across the globe🔥—… pic.twitter.com/7MqeKGvWwV— People Media Factory (@peoplemediafcy) September 15, 2025 -
ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కడై (Idli Kadai Movie). ఇది తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రానుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 14న) ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్ నిర్వహించారు. రోజూ తినాలనిపించేదిఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ప్రతిరోజు నాకు ఇడ్లీ తినాలనిపించేది. కానీ నాదగ్గర అంత డబ్బుండేది కాదు. అప్పుడేం చేశానంటే తోటలో పూలు తెంపడానికి పనికెళ్లేవాడిని. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి త్వరగా తోటకు వెళ్లి రెండు గంటలు పనిచేసేవాడిని. అప్పుడు నాకు రూ.2 ఇచ్చేవారు. అది తీసుకున్నాక ముందు చేతి పంపు దగ్గరకు వెళ్లి రోడ్డుపైనే స్నానం చేసేవాళ్లం. తర్వాత ఇడ్లీ కొట్టుకు వెళ్తే.. ఆ డబ్బుతో నాలుగైదు ఇడ్లీలు వచ్చేవి. హ్యాపీగా ఉందిమనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కుని తింటే వచ్చే టేస్ట్ దేంట్లోనూ రాదు. మిమ్మల్నందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలామంది అభిమానులను కలిశాను. వారిలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. నా ఫ్యాన్స్ ఇంత మంచి స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునేదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ..
తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా (Mirai Movie) భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. ఎడారిలో ఒయాసిస్సులా.. ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు మనోజ్కు సక్సెస్ దొరికినట్లైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ గ్రాండ్గా ఉండటం సినిమాకు మరింత ప్లస్సయింది.చివరిసారి ఎప్పుడు చూశానో..ఈ సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్) వేదికగా రివ్యూ ఇచ్చారు. మిరాయ్ చూశాక.. ఇంత మంచి వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తు రావడం లేదు. రూ.400 కోట్లకుపైగా ఖర్చు పెట్టి తీసిన సినిమాల్లోనూ ఇంత గ్రాండ్ విజువల్స్ చూడనేలేదు. ముందుగా మనోజ్ను ఈ సినిమాలో విలన్గా తీసుకుని తప్పు చేశారనుకున్నాను. కానీ సినిమా చూశాక అతడి పర్ఫామెన్స్ చూసి నన్ను నేనే కొట్టుకున్నా.. నా అంచనా తప్పుఇంత పెద్ద యాక్షన్ అడ్వెంచర్ మూవీలో తేజ మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తాడేమో అనుకున్నా.. ఇక్కడ కూడా నా అంచనా తప్పయింది. విజువల్స్, బీజీఎమ్, స్క్రీన్ప్లే.. అన్నీ అదిరిపోయాయి. ఇంటర్వెల్ సహా మరికొన్ని చోట్ల సినిమా నెక్స్ట్ లెవల్కు వెళ్లింది. కత్తులు, అతీంద్రియ శక్తుల బెదిరింపుల మధ్యలో ప్రేమ, మోసం వంటి అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించారు. లాభాలొక్కటే కాదు..కార్తీక్.. మిరాయ్ మీరు కన్న అద్భుతమైన కల. పురాణాలను, హీరోయిజాన్ని కలగలిపి చూపించారు. అన్ని విభాగాలపై మీకున్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. విశ్వప్రసాద్.. మీరు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా మీకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. తద్వారా విజయం సాధించారు. లాభాలు తీసుకురావడమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా చిత్రయూనిట్ బాధ్యత అని నిరూపించారు.మనోజ్ రిప్లైచివరగా నేను చెప్పేదేంటంటే.. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని రాసుకొచ్చారు. దీనికి మంచు మనోజ్ (Manchu Manoj).. అన్నా, మీ స్పంద చూస్తుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. చిన్నప్పటినుంచి మీ సినిమాలు చూస్తూ, మీతో కలిసి పనిచేస్తూ పెరిగాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు మీ నోటి నుంచి నా నటనకు ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు. Annaaaa …..reading this from you gave me goosebumps 🙏🏻 I grew up watching your cinema, working with you, learning from it and today to hear you speak of my performance like this… it’s beyond special ❤️ thank you anna 🙏🏼🙌🏽#Mirai #BlackSword https://t.co/y9hfmJUGkR— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2025 చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
ఇల్లు అమ్మేసి రూ. 3 కోట్లతో కారు కొనేసిన నటి
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) లగ్జరీ కారు కొనుగోలు చేసింది. అయితే, రీసెంట్గా ముంబైలోని తన ఫ్లాట్ అమ్మేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కారు కొనడంతో వార్తలో నిలిచింది. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ను గత నెలలోనే ఆమె విక్రయించింది. దాదాపు 182 గజాల వైశాల్యంలో ఉన్న తన ఫ్లాట్ను రూ.5.30 కోట్లకు అమ్మింది. గతంలో అంటే 2018లో మలైకా ఇదే ఫ్లాట్ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐదున్నర కోట్లకు విక్రయించింది. అంటే దాదాపు రెండు కోట్ల మేర లాభాలను ఆర్జించింది. ఇప్పుడు అలా వచ్చిన లాభంతో ఒక లగ్జరీ కారును ఆమె కొనుగోలు చేశారని బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.మలైకా అరోరా తాజాగా రేంజ్ రోవర్ SUV సెగ్మెంట్లో ఐకానిక్ మోడల్తో ఉన్న కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ. 3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అత్యుత్తమ కార్లలో ఒకటిగా సెలబ్రిటీలు ఈ మోడల్ను చూస్తారు. ఈ కారును సెలబ్రిటీలలో విపరీతంగా ఇష్టపడటానికి ప్రధాన కారణం దాని అద్భుతమైన ఫీచర్లతో కూడిన క్యాబిన్తో పాటు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మరింత లగ్జరీని తీసుకురావడమేనని చెబుతారు. ఆటోమేటిక్ గేర్బాక్స్తో ఈ కారు పనిచేస్తుంది. కేవలం 5.9 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ/గం వరకు పరుగెత్తగలదు.మలైకా కారు కొనడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది మలైకా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే, మరికొంతమంది ఆమెను సమర్థిస్తున్నారు. బాలీవుడ్లో ఎక్కువ మంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటారు. వారు తరుచుగా ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేయడం సరైన రేటు వచ్చాక తిరిగి అమ్మేయడం చేస్తుంటారు. ఈ రకంగా వారు అదనపు లాభాలను పొందుతుంటారు. అలా తను అమ్మేసిన ఇంటి మీది వచ్చిన లాభంతోనే మలైకా కొత్త కారు కొనుగోలు చేసిందని ఆమె అభిమానులు చెబుతున్నారు.మలైకా అరోరా చయ్య చయ్య (Dil Se)పాటతో బాలీవుడ్లో మొదట సెన్సేషనల్ అయింది. హిందీలో అనేక స్పెషల్ సాంగ్స్లో తళుక్కుమన్న ఈ బ్యూటీ తెలుగులో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి ఐటం సాంగ్స్తో అలరించింది. బుల్లితెరపై జలక్ దిక్లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది. View this post on Instagram A post shared by Car Blog India (@carblogindia) -
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్.. స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ!
కోలీవుడ్లోకి కొత్త హీరోయిన్ వచ్చేసింది. తృప్తి రవీంద్ర (Trupti Ravindra) ప్రధాన పాత్రలో నటించిన శక్తి తిరుమగన్ (భద్రకాళి) చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది.. మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ బ్యూటీ ఇంజినీరింగ్ పట్టభద్రురాలు, అలాగే స్టేజీ ఆర్టిస్ట్ కూడా! ఐదేళ్లపాటు నాటకాల్లో నటించిన తృప్తి రవీంద్ర పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. డాన్స్, యోగ వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో తృప్తి తమిళ భాషను నేర్చుకోవడం విశేషం. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం అందించారు.సంతోషంగా ఉందితాజాగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. థియేటర్ నాటకాల ద్వారా నటనలో శిక్షణ పొందినట్లు చెప్పింది. దర్శకుడు అరుణ్ ప్రభు, విజయ్ ఆంటోనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. శక్తి తిరుమగన్ మూవీ ద్వారా కథానాయక పరిచయం అవుతుండటం గొప్ప విషయంగా భావిస్తున్నానంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నట్లు తెలిపింది. ఇలాంటి అర్థవంతమైన కథాపాత్రల్లో, ఇతర భాషల్లోనూ నటించడానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చేసింది. అదేవిధంగా ప్రేక్షకులపై మంచి ప్రభావాన్ని చూపించే సినిమాలను అందించే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Trupti Ravindra (@trupti_ravindra_) -
ఎమ్మీ అవార్డ్స్- 2025 విన్నర్స్.. తొలిసారి రెండు రికార్డ్స్
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్- 2025 వేడుక లాస్ ఏంజిల్స్(యూఎస్)లోని పికాక్ థియేటర్లో జరిగింది. తాజాగా జరిగిన 76వ ఎమ్మీ అవార్డుల వేడుకలో రెండు రికార్డ్స్ నమోదు అయ్యాయి. హాలీవుడ్కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 27 నామినేషన్లతో అత్యధిక అవార్డులకు ఎంపికైన డ్రామా సిరీస్ "సెవెరెన్స్" ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. ఈ మూవీలో నటించిన టిల్మాన్ అత్యుత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డ్ అందుకున్న తొలి నల్లజాతి సంతతికి చెందిన వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. ఉత్తమ డ్రామా సీరిస్గా "ది పిట్" ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన నోహ్ వైల్ 26 సంవత్సరాల తర్వాత మరోసారి ఎమ్మీని గెలుచుకున్నాడు. నెట్ఫ్లిక్స్ హిట్ సీరిస్గా గుర్తింపు పొందిన "అడోలెసెన్స్"లో నటించిన ఓవెన్ కూపర్కు ఉత్తమ సహాయనటుడిగా అవార్డ్ దక్కింది. ఎమ్మీ అవార్డ్ అందుకున్న అత్యంత పిన్న వయసు ఉన్న వ్యక్తిగా ఓవెన్ కూపర్ (15) రికార్డ్ క్రియేట్ చేశాడు.ఉత్తమ డ్రామా సిరీస్- ది పిట్ (HBO Max)ఉత్తమ నటుడు- నోహ్ వైల్ (ది పిట్)ఉత్తమ నటి - బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)ఉత్తమ సహాయనటుడు - ట్రామెల్ టిల్మాన్ (సెవెరెన్స్)ఉత్తమ కామెడీ సిరీస్- ది స్టూడియో ఉత్తమ లిమిటెడ్ సిరీస్- అడోలెసెన్స్ (నెట్ఫ్లిక్స్)ఉత్తమ సహాయనటుడు లిమిటెడ్ సిరీస్- ఓవెన్ కూపర్ (అడోలెసెన్స్)ఉత్తమ డాక్యుమెంట్రీ సిరీస్- 100 ఫుట్ వేవ్ఉత్తమ యానిమేషన్- ఆర్కేన్ లీగ్ ఆర్ లెజెండ్స్ (నెట్ఫ్లిక్స్) -
ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి
మేమే తోపు.. మేము చెప్పిందే కరెక్ట్ అంటూ విర్రవీగిన కామనర్లకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అంతేకాదు, ఎవరూ సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఇంకా బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత మిరాయ్ హీరోహీరోయిన్ తేజ సజ్జ, రితికా స్టేజీపైకి వచ్చారు. ఇంటిసభ్యులను రెండు టీమ్స్గా డివైడ్ చేయగా వాటికి తేజ, రితిక లీడర్స్గా ఉన్నారు. రెచ్చిపోయిన భరణిహౌస్లో వాళ్లు ఓడిపోయినప్పుడల్లా స్టేజీపై వీళ్లతో డ్యాన్స్ చేయించాడు నాగ్ (Nagarjuna Akkineni). అలా గెస్టులుగా వచ్చినవారికి పనిష్మెంట్ ఇచ్చి పంపించాడు. అనంతరం టెనెంట్స్లో నుంచి ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్బాస్. ఇందుకోసం సెలబ్రిటీలు రెండు టీములుగా విడిపోయి ఫైట్ చేశారు. రెజ్లింగ్ పోటీలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు. భరణి అయితే దొరికిందే ఛాన్స్.. తన సత్తా ఏంటో చూపిస్తా అన్నట్లుగా రెచ్చిపోయి గేమ్ ఆడాడు.పర్మినెంట్ ఓనర్గా భరణిఆడ, మగ తేడా లేకుండా అందర్ని ఈడ్చి అవతల పారేశాడు. ఈ గేమ్లో భరణి, తనూజ, రాము రాథోడ్, శ్రష్టి ఉన్న రెడ్ టీమ్ గెలిచింది. వీళ్లలో ఎవరు ఓనర్ అవ్వాలనేది ఓడిన టీమ్ డిసైడ్ చేయాలన్నారు. సంచాలక్ ఫ్లోరా శ్రష్టికి ఓటేసింది. కానీ ఓడిన బ్లూ టీమ్లోని ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి అందరూ భరణికి ఓటేశారు. దీంతో అతడు పర్మినెంట్ ఓనర్గా మారిపోయాడు. భరణిని ఓనర్గా ప్రకటించగానే కామనర్ల ముఖాలు మాడిపోయాయి. మాట మార్చిన ఇమ్మాన్యుయేల్అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బందవుతోంది, తనకు ఛాన్స్ వస్తే అమ్మాయిలను ఓనర్లను చేస్తానన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే శ్రష్టి, తనూజలను కాదని భరణిని ఎంచుకోవడం గమనార్హం. భరణి.. తనూజను పర్సనల్ అసిస్టెంట్గా ఎంపిక చేసుకున్నాడు. చివర్లో డిమాన్ పవన్ సేవ్ అవగా శ్రష్టి వర్మ (Shrasti Verma) ఎలిమినేట్ అయింది. వెళ్లిపోయేముందు ఆమె ఓ టాస్క్ ఇచ్చారు. నమ్మకం మీద దెబ్బ కొట్టారుఅందులో భాగంగా జెన్యూన్గా ఉండే నలుగురు, కెమెరా ముందు యాక్ట్ చేసే నలుగురి పేర్లు చెప్పమన్నారు. అందుకామె రాము రాథోడ్, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీశ్, ఫ్లోరా సైనీ జెన్యూన్ అంది. రీతూ కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉంటుందని పేర్కొంది. నమ్మకం మీద దెబ్బ కొట్టారు, ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ రాదంటూ తనూజ, భరణి పేర్లు చెప్తూ శ్రష్టి ఎమోషనలైంది. సంజనా పేరు ప్రస్తావించింది.. కానీ తను చాలా స్ట్రాంగ్ అని పేర్కొంది. ఇక వెళ్లిపోయేముందు తను చేసే క్లీనింగ్ టాస్క్.. ఇకపై సుమన్ శెట్టి చేయాలంటూ బిగ్బాంబ్ వేసింది.చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..? -
అలాంటి మగవాడ్ని చీరలో ఊహించుకుంటాను: తమన్నా
ఇప్పుడు దేశంలో ఉన్న అగ్రగామి నటీమణుల్లో ఒకరుగా ఉంది తమన్నా భాటియా.. అటు సినిమాలు, ఇటు ఐటమ్ సాంగ్స్ మరోవైపు వెబ్ సిరీస్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం డయానా పెంటీతో కలిసి చేసిన ’డూ యు వాన్నా పార్టనర్’ వెబ్ సిరీస్ సక్సెస్ను ఆమె ఎంజాయ్ చేస్తోంది, ఒక మహిళ స్వంతంగా వ్యాపార రంగంలో అది కూడా పురుషులు మాత్రమే చేయగలరు అని అందరూ నమ్మే మద్యం తయారీ రంగంలోకి మహిళలు ప్రవేశించడం... తదనంతర పరిస్థితుల చుట్టూ అల్లుకున్న అంశాలతో ’డూ యు వాన్నా పార్టనర్’ రూపొందింది. ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె . ఒక పురుషుడు తనను ‘ఇక తనేమీ చేయడానికి లేదు‘ లేదా ‘అతనే తుది నిర్ణయం తీసుకున్నాడు అని భావించేలా చేసిన ప్రతిసారీ (అంటే ఆమెను చులకనగా తీసి పారేసిన సమయంలో) ఆమె ఎలా స్పందిస్తుందనే విషయం గురించి చెప్పుకొచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా పురుషాధిక్య చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్లేస్ను సొంతం చేసుకోవడం అనేది ఎలా సాధ్యమైందనే విషయంపైన కూడా తమన్నా ఈ సందర్భంగా మాట్లాడింది. అంతేకాక ఇటీవల తన నటన పట్ల విమర్శలు, ఎక్స్పోజింగ్పై వస్తున్న కొన్ని కామెంట్స్ గురించి కూడా ఆమె చెప్పాలనుకున్నట్టు ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.‘‘ఒక పురుషుడు నాకు సంబంధించిన విషయాలలో తుది నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక అందులో నేనేం చేయడానికి ఉండదు. అయితే, నాకు అనిపించేలా చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు’’ అంటూ చెప్పిందామె. అంటే ఒక సినిమాలో తాను చేసేదేముంది జస్ట్ ఏదో పాటల్లో అలా గ్లామరస్గా కనిపించడమే కదా అంటూ మాట్లాడి తన ప్రాధాన్యత తగ్గించాలని కొందరు మగవాళ్లు భావిస్తారనే అర్ధం వచ్చేలా మాట్లాడింది. అలా వారు ప్రయత్నించినప్పుడల్లా, తాను అలాంటి మగవాళ్లను చీరలో లేదా కొన్ని గ్లామరస్ దుస్తుల్లో ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు ఊహించుకునే దానిని అంటూ చెప్పింది. ఆ ఆ ఊహల్లో అతను చాలా అసహ్యంగా కనిపించేవాడనీ అప్పుడే తనకు తానేం చేయగలదో అతనేం చేయలేడో అనేది తనకు అర్ధమయ్యేదని అంటూ అమ్మాయిలు మాత్రమే గ్లామర్ కు కేరాఫ్ అని వారికి మాత్రమే ఎక్స్పోజింగ్ బాగుంటుందని చెప్పకనే చెప్పింది. కాబట్టి వారికి ఎప్పుడూ తన అవసరం ఉంటుందనే గ్రహింపు తెచ్చుకోవడమే తాను చేసే పనిని ధైర్యంగా చేసేలా చేసిందని అంది, ‘‘ఎందుకంటే ఒక మహిళ చేయగలది, ఒక మహిళ మాత్రమే చేయగలదని నేను విశ్వసిస్తున్నాను.‘ అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో మంచి చెడుల గురించి కూడా ఆమె మాట్లాడింది.‘‘నువ్వు మంచి వ్యక్తివి అయినంత మాత్రానే ఎవరూ నీకు పని ఇవ్వరు. నువ్వు ఏదో ఒకటి చేయగలవని నీ దగ్గర ఏదో ఉందని అనుకుంటేనే ఎవరైనా నీకు పని ఇస్తారు.’’ అంటూ తనకు ఎవరూ ఊరికే పని ఇవ్వడం లేదని గుర్తు చేసింది. ఏదేమైనా మన మనసులో ఉన్నదాన్ని బయట పెట్టడమే మంచిదని అంటోంది తమన్నా. ప్రజలు ఎలా భావిస్తారో అని ఎక్కువగా ఆందోళన చెందడం అంతిమంగా మనకు ప్రతికూలంగానే మారుతుంది‘’ అంటూ చెప్పుకొచ్చింది -
Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) మొదటి వారం పూర్తి అయిపోయింది. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) హౌస్ నుంచి బయటకు వచ్చింది. కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హోస్లో కొనసాగింది. మొదట ఫ్లోరా సైనీ(ఆషా షైనీ) ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో శ్రష్టి వర్మను ఇంటి నుంచి పంపించేశారు. దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే, వారం రోజులకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్మీడియాలో చర్చ జరుగుతుంది.బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభ పడింది లేదని చెప్పాలి. హౌస్లో ఆమె కేవలం వారంరోజులు మాత్రమే ఉండటంతో తను రెమ్యునరేషన్గా రూ. 2 లక్షలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్తో పోలిస్తే చాలా తక్కువని తెలుస్తోంది.బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్లో రీతూ చౌదరి, రాము రాథోడ్,సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్,సంజన, తనూజ గౌడ, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, డిమోన్ పవన్తో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు శ్రేష్టి వర్మకు పడ్డాయి. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా ఆమె బిగ్బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా నిజాయితీగా ఉన్న నలుగురు పేర్లు చెప్పమని నాగార్జున కోరారు.. మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. కెమెరా ముందు నటించేవారు ఎవరనే ప్రశ్నకు.. భరణి, రీతూ చౌదరి, తనూజ, పేర్లు చెప్పింది. -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే
మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో మిరాయ్, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ అలరిస్తున్నాయి. ఈ వీకెండ్ చాలానే సినిమాలు రాబోతున్నాయి. మంచు లక్ష్మీ 'దక్ష', బ్యూటీ, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు తదితర తెలుగు చిత్రాలతో పాటు భద్రకాళి, వీరచంద్రహాస, టన్నెల్ తదితర డబ్బింగ్ మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. అయితే వీటిలో దేనిపైనా ఏ మాత్రం హైప్ లేదు. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)మరోవైపు ఓటీటీల్లో 15కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 28 ఇయర్స్ లేటర్, ఎలియో, ఇంద్ర, హౌస్ మేట్స్ తదితర మూవీస్తో పాటు ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, ష్ సీజన్ 2, ద ట్రయల్ సీజన్ 2 సిరీస్లు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 15 నుంచి 21 వరకు)నెట్ఫ్లిక్స్ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 1828 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17బెలెన్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 18హాట్స్టార్ఎలియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 18పోలీస్ పోలీస్ (తమిళ సిరీస్) - సెప్టెంబరు 19ద ట్రయల్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 19స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19ఆహాష్ సీజన్ 2 (తెలగు సిరీస్) - సెప్టెంబరు 19జీ5హౌస్మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19ఆపిల్ ప్లస్ టీవీద మార్నింగ్ షో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17లయన్స్ గేట్ ప్లేద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19(ఇదీ చదవండి: శేఖర్ కమ్ముల హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?) -
ఊర్వశి రౌతేలాకు ఈడీ నోటీసులు
బాలీవుడ్ హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిపై కొద్దిరోజులుగా ఈడీ దూకుడు చూపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్లోని స్టార్స్ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. -
భద్రకాళి ఆలోచింపజేస్తుంది
విజయ్ ఆంటోనీ హీరోగా ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘శక్తి తిరుమగన్’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీల సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. తెలుగులో ‘భద్రకాళి’ టైటిల్తో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ– ‘‘మార్గన్’కు ముందు 11 సినిమాలకు నిర్మాతగా చేశాను. సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ‘భద్రకాళి’. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రం మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు విజయ్గారి పాత్రకు కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలు కూడా ఉన్నాయి. అరుణ్ ప్రభు మంచి కథ రాశారు. తమిళంలో మాత్రమే ‘శక్తి తిరుమగన్’ టైటిల్ ఉంది. మిగతా అన్ని భాషల్లో (తెలుగు, కన్నడ, హిందీ) ‘భద్రకాళి’ టైటిల్తోనే రిలీజ్ చేస్తున్నాం. మా ‘మార్గన్’ను రిలీజ్ చేసిన ఏషియన్ సునీల్, సురేష్, రానాగార్లే ‘భద్రకాళి’ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుత అజయ్ ధీషన్తో ‘బూకి’, మలయా ళంలో ఓ సినిమా చేస్తున్నాం. ‘బిచ్చగాడు’ కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, శశిగార్లు తమిళంలో ‘నూరు సామి’ సినిమా చేస్తున్నారు. తెలుగులో ‘వంద దేవుళ్ళు’ టైటిల్ అనుకుంటున్నాం. మా బ్యానర్లో సత్యదేవ్తో ‘ఫుల్ బాటిల్’ సినిమా చేస్తున్నాం’’ అని అన్నారు. -
ప్రతి పాట ఓ సవాల్
‘‘ఇటీవల సంగీతంలో సౌండ్ డిజైనింగ్ మారింది. ఈ సౌండ్కు తగ్గట్లుగా సాహిత్యం కూడా మారుతూ వస్తోంది. పదేళ్ల తర్వాత మన పాట విన్నా మంచి సాహిత్యం రాశారు అనిపించేలా నా పాటల ద్వారా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను’’ అని తెలిపారు గీత రచయిత శ్రీమణి. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాతో గీత రచయితగా పరిచయమైన శ్రీమణి దశాబ్ద కాలానికి పైగా రాణిస్తున్నారు. నేడు (సోమవారం) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదివారం శ్రీమణి తన కెరీర్ జర్నీ గురించి మాట్లాడుతూ – ‘‘ఇటీవల ‘తండేల్’ చిత్రంలో ‘బుజ్జి తల్లి, హైలెస్సా’ పాటలతో పాటు ‘లక్కీ భాస్కర్’లోని ‘నిజమా కలా’, ‘ఆయ్’ సినిమాలోని పాట నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ పాటలన్నీ కథలో ఉన్న సన్నివేశం తాలూకు లోతైన భావం చెప్పడమే. నేనీ పాటలు రాయగలనని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులకు, దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇక ప్రేమ పాటలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి కొత్త ఎక్స్ప్రెషన్తో రాయగలను అనేది, అలాగే హీరో ఎలివేషన్ సాంగ్ వచ్చినప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ ఓ డిఫరెంట్ కోణంలో ఎలా చెప్పగలను? అనేది ఛాలెంజ్ అవుతుంది. ఇలా ప్రతి పాటా ఓ సవాలే. నన్ను గీత రచయితగా పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్గారు ‘గీత గోవిందం’ సినిమాలో ‘వచ్చిందమ్మా పాట..’ను మెచ్చుకున్నారు. మహేశ్బాబుగారి ‘మహర్షి’లోని పాటలు విని, ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు అభినందించారు. ‘రంగ్ దే’లోని ‘ఊరంతా..’, ‘మహర్షి’లోని ‘ఇదే కదా..’, ‘ఉప్పెన’ లోని ‘నీ కళ్లు నీలి సముద్రం..’ పాటలను దేవిశ్రీ ప్రసాద్ మెచ్చుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ ‘ఆకాశంలో ఓ తార’, సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలకు సాహిత్యం అందిస్తున్నాను’’ అన్నారు. -
ఫారిన్ పోదాం చలో... చలో
సూట్కేసులు సర్దుకుని మరికొన్ని రోజుల్లో ఫారిన్కు మకాం మార్చనున్నారు కొందరు టాలీవుడ్ హీరోలు. వెకేషన్ కోసం అయితే కానే కాదు... సినిమాల చిత్రీకరణ కోసమే. ఈ స్టార్ హీరోల ఫారిన్ షూటింగ్ వివరాలు ఈ విధంగా...కెన్యా టు హైదరాబాద్ కెన్యా టు హైదరాబాద్ చక్కర్లు కొట్టనుందట ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా టీమ్. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్డూడియోలో షూటింగ్ జరుగుతోంది. అయితే కెన్యా షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదట. ఈ సినిమాకి కీలకమైన ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ అంతా కెన్యా అడవుల్లో జరిపేలా ప్లాన్ చేశారట రాజమౌళి. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఈ టీమ్ మళ్లీ కెన్యాకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ 2027లో రిలీజ్ కానుంది.ఆటా పాటా... ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. పాటలను అతి త్వరలోనే విదేశాల్లో చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే దర్శకుడు మారుతి గ్రీస్ వెళ్లి, అక్కడి లొకేషన్స్ను చూసొచ్చారట. త్వరలోనే ఈ టీమ్ అక్కడికి వెళ్లి రెండు పాటలను, కొంత టాకీ పార్టును షూట్ చేయనుంది. అయితే ఫారిన్ షూటింగ్ షెడ్యూల్కు ముందు ‘ది రాజా సాబ్’ టీమ్ కేరళకు వెళుతుందని, అక్కడ ప్రభాస్ పరిచయ పాటను చిత్రీకరిస్తారని సమాచారం. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది. పది దేశాల్లో డ్రాగన్ డ్రాగన్ విదేశీయానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కర్ణాటకలో వేసిన ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా కథలో ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందట. దీంతో తర్వాతి షూటింగ్ షెడ్యూల్ కోసం ‘డ్రాగన్’ టీమ్ విదేశాలకు వెళ్లనుందని తెలిసింది. అంతేకాదు... పదికి పైగా దేశాల్లోని లొకేషన్స్లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందని సమాచారం. కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. ఏడారిలో... హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ‘ఏఏ22 ఏ6’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దాదాపు 50 రోజులకు పైగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ అబుదాబిలో జరగనుందని, అతి త్వరలో అక్కడ షూట్ ప్రారంభం కానుందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొనగా కీలక యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట అట్లీ. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ఇలా షూటింగ్ కోసం త్వరలో విదేశాలు ప్రయాణం కానున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
రిలీజ్కి సిద్ధమైన ధనుష్ 'ఇడ్లీ కొట్టు'
తమిళ హీరో ధనుష్కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. దీంతో ఎప్పటికప్పుడు ఇతడి సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు కొత్త మూవీని రెడీ చేశాడు. ధనుష్ లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇడ్లీ కడై'. దీన్ని తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో తీసుకురానున్నారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?)పవన్ కల్యాణ్ 'ఓజీ'.. సెప్టెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇదొచ్చిన ఐదు రోజులకే 'ఇడ్లీ కొట్టు' థియేటర్లలోకి వస్తుంది. దీని తర్వాత రోజున 'కాంతార' ప్రీక్వెల్ విడుదల కానుంది. చూస్తుంటే ఈసారి దసరాకు బాక్సాఫీస్ దగ్గర మంచి సందడిగా ఉండనుందని అర్థమైపోతోంది. 'ఇడ్లీ కొట్టు' సినిమా పూర్తిగా కంటెంట్, ఎమోషన్స్పై ఆధారపడి తీశారు. ధనుష్, నిత్యామేనన్, అరుణ్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?) -
స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ అనగానే దాదాపు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తుంటారు. కానీ ఇతడు మాత్రం ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సైకో విలన్గా తెగ భయపెడుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో సైకో పాత్రలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?శాండీ మాస్టర్ అలియాస్ సంతోష్ కుమార్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ కమ్ నటుడు. చెన్నైకి చెందిన ఇతడు.. 2005లో డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ ఓంకార్ హోస్ట్ చేసిన ఛాలెంజ్ షోలో కొరియోగ్రాఫర్గా చేశాడు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మోనికా' పాటకు ఇతడే స్టెప్పులు కంపోజ్ చేశాడు. అంతకు ముందు విక్రమ్, థగ్ లైఫ్, ఆవేశం, తంగలాన్ తదితర సినిమాలకు పనిచేశాడు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)ఇక నటన విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ 'లియో' సినిమా ప్రారంభంలో చాక్లెట్ కాఫీ అంటూ నవ్వుతూనే భయపెట్టి సైకో విలన్గా చేసింది ఇతడే. ఈ మూవీతో చాలా క్రేజ్ వచ్చింది. అలా రీసెంట్ మలయాళ హిట్ 'లోక: ఛాప్టర్ 1'లోనూ నాచియప్ప అనే ప్రతినాయక పాత్ర చేశాడు. తాజాగా రిలీజైన తెలుగు మూవీ 'కిష్కింధపురి'లోనూ విస్త్రవ పుత్ర అనే సైకో పాత్ర చేశాడు. రీసెంట్ టైంలో ఇలా వరసగా సైకో పాత్రలే చేస్తున్నాడు గానీ ప్రతిసారి తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తున్నాడు.ప్రస్తుతం శాండీ మాస్టర్ మలయాళ సినిమాలైన 'కథనార్', 'బాబాబా'ల్లో లీడ్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఇలా ఓవైపు కొరియోగ్రాఫీ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. శాండీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తమిళ నటి కాజల్ పశుపతిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మూడేళ్లకే వీళ్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దొరతి స్లవియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. (ఇదీ చదవండి: 'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్) -
'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్
బాక్సాఫీస్ వద్ద తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మిడ్ రేంజ్ సినిమాలు, టైర్ 2 హీరోల విషయంలో రెండో రోజు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ని మిరాయ్ బద్దలు కొట్టింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లలో రూ.8.20 కోట్ల షేర్తో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించాడు. టైర్ 2 హీరోలుగా ఉన్న నాని హిట్ 3, శ్యామ్ సింగరాయ్, దసరా.. విజయ్ దేవరకొండ ఖుషి, కింగ్డమ్, గీత గోవిందం.. నాగ చైతన్య తండేల్, లవ్ స్టోరీ, మజిలీ లాంటి సినిమాల రికార్డులని ఈ చిత్రం దాటేసింది.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ సినిమాలలో హయెస్ట్ షేర్ వచ్చిన సినిమాగానూ టాలీవుడ్ చరిత్రలోనే మిరాయ్ ఘనత సాధించింది. ఈ సినిమాలో తేజ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో తేజ డూప్ లేకుండా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో పాటు కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయిందని ప్రశంసిస్తున్నారు. అన్ని భాషల్లోనూ తేజ పర్ఫామెన్స్కు యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ దక్కుతున్నాయి.ఈ దెబ్బతో టైర్ 2 హీరోలలో తేజ సజ్జా.. పైపైకి వచ్చినట్లుగానే ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు రోజుల్లో ఓవరాల్గా రూ.55 కోట్ల మేర గ్రాస వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!) -
ప్రతి తల్లి, తండ్రి చూడాల్సిన సినిమా: మారుతి
అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం బ్యూటీ.. ఈ మూవీకి జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడడంతో బ్యూటీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్కేఎన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్టార్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ .. ‘సుబ్బు మాకు ఎప్పుడూ క్రైమ్ కథలు చెబుతుండేవారు. కానీ ఓ పాయింట్ను సుబ్బు చెప్పాడు. ఆ కథ నాకు నచ్చింది. కానీ మా గ్రూపులో మాత్రం ఎవ్వరూ నమ్మలేదు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఆ ఫాదర్ ఫీలింగ్ను పేపర్ మీద పెట్టారని నాకు అనిపించింది. ఈ సినిమా చూసిన తరువాత హీరో హీరోయిన్లు ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతారు. అంకిత్ మంచి యాక్టర్ అని మరోసారి రుజువు అవుతుంది. ప్రతీ తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. అందరూ చూడండి’ అని అన్నారు.ఎస్కేఎన్ మాట్లాడుతూ .. 'బ్యూటీ కథ నా మనసుకి హత్తుకుంది. ప్రొడ్యూసర్స్ అంతా కూడా క్యాస్ట్ గురించి చూస్తారు.. కానీ ఆయన మాత్రం కంటెంట్లో టేస్ట్ చూస్తారు. టైటిల్ మాత్రమే కాదు.. కథ కూడా ఎంతో బ్యూటీఫుల్గా ఉంటుంది. పిల్లలు అడిగిందల్లా కొనివ్వలేని పేరెంట్స్ పడే మథనం గురించి అద్భుతంగా చూపించారు. అంకిత్ పర్ఫామెన్స్ నాకు చాలా ఇష్టం. నీలఖి ఒరిస్సా అమ్మాయి అయినా మన తెలుగు లెక్కే. బ్యూటీతో ఆమెకు మంచి బ్రేక్ రావాలి. సెప్టెంబర్ 19న బ్యూటీ చిత్రం రాబోతోంది. 18న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. అమీర్ పేట్ ఏఏఏలో నేను ఫ్రీ షో వేయిస్తాను. ఓ అమ్మాయి.. తన ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఆ షోని చూడొచ్చు' అని అన్నారు.హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ .. 'వర్దన్, మారుతి నాకు రెండో అవకాశం ఇచ్చారు. సక్సెస్ లేనప్పుడు కూడా మారుతి లాంటి వారు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంటారు. నన్ను నమ్మి నాకు ఇంత మంచి సినిమాను ఇచ్చిన మారుతి గారికి థాంక్స్. ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ థియేటర్ విజిట్కు వెళ్తే.. ‘తిమ్మరుసు’, ‘ఆయ్’లో చేసింది నువ్వేనా? అని అడిగారు. ‘బ్యూటీ’ చిత్రం ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు. జర్నలిస్ట్గా ఉన్న సుబ్రహ్మణ్యం ఈ కథను రాశారు. ఒక్కసారి వచ్చి సినిమా చూడండి.. నచ్చకపోతే సున్నా రేటింగ్ ఇవ్వండి.. నచ్చితే మాత్రం ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లండి’ అని అన్నారు. -
'మైండ్తో ఆలోచించండి.. ఇలాంటి ట్రాప్లో పడొద్దు': టాలీవుడ్ నటి
సోషల్ మీడియా వచ్చాక వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిగత డేటాను తీసుకొచ్చి సోషల్ మీడియా ఖాతాలో నింపేస్తున్నారు. ఇంకేముంది ఇదే అదునుగా చేసుకున్న కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. సెలబ్రిటీల పేర్లను వినియోగిస్తూ పెద్ద స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి పేరుతో కొందరు కేటుగాళ్లు స్కామ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కొందరు తన పేరును వాడి డొనేషన్స్ స్వీకరిస్తున్నారని తెలిసింది. దీనిపై ఇప్పటికే నార్సింగ్ పీఎస్ ఫిర్యాదు చేశానని ప్రగతి వెల్లడించింది. నా అభిమానులు దయచేసి ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందరూ కూడా చదువుకున్న వాళ్లే ఉన్నారు.. కొంచే మైండ్ పెట్టి ఇలాంటి స్కామ్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పలువురు అమౌంట్ పంపి స్క్రీన్ షాట్స్ను షేర్ చేసింది ప్రగతి. ఇప్పటికే చాలామంది డబ్బులు కూడా పంపారని.. చిన్న మొత్తాలు కావడంతో పోలీసులు సైతం చర్యలు తీసుకోవడానికి ఆలస్యం జరుగుతోందని అన్నారు. ఐదు రోజుల క్రితమే చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) -
ఓటీటీకి మరో మలయాళ మూవీ.. కేవలం వారికి మాత్రమే!
ఓటీటీలు వచ్చాక మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవల ఓటీటీల్లో మాత్రమే కాకుండా థియేటర్లలో సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది ముఖ్యం కాదు.. స్టోరీ ముఖ్యమంటున్నారు. దీంతో ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన మరో చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అసిఫ్ అలీ, దివ్య ప్రభ జంటగా నటించిన సర్కీట్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 26 నుంచి సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే కేవలం ఓవర్సీస్ ఆడియన్స్కు మాత్రమే అందుబాటులో ఉండనుందని ప్రకటించారు. 'ముగ్గురు ఆత్మలు. ఒక రోజు. ఒక మలుపు' అంటూ పోస్టర్ను పంచుకున్నారు.కాగా.. ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదలైంది. రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలోనైనా రాణిస్తుందేమో వేచి చూడాల్సిందే. ఈ మూవీని ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.Three souls. One day. A turning point.#Sarkeet, streaming on Simply South from September 26 worldwide, excluding India. pic.twitter.com/YJjcbmJRwG— Simply South (@SimplySouthApp) September 12, 2025 -
కొత్త టాటూతో కృతి సనన్.. ఏడేళ్ల క్రితం మృణాల్ ఇలా
కాలిపై పక్షి టాటూ వేయించుకున్న కృతిసనన్ఏడేళ్ల క్రితం నాటి జ్ఞాపకాలతో మృణాల్ ఠాకుర్ఆఫ్రికా టూర్లో పూజా హెగ్డే ఎంజాయ్మెంట్పాండిచ్చేరిలో ఫ్రెండ్స్తో అనికా చిల్ మోడ్మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండేచేతికి ఎర్రటి మట్టిగాజులతో అను ఇమ్మాన్యుయేల్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Nargis Fakhri (@nargisfakhri) -
శేఖర్ కమ్ముల హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
శేఖర్ కమ్ముల పేరు చెప్పగానే యూత్ఫుల్ సినిమాలే గుర్తొస్తాయి. తను తీసిన మూవీస్తో చాలామంది కొత్తవాళ్లని నటీనటులుగా పరిచయం చేశాడు. అయితే వారిలో నిలబడి స్టార్స్ అయినవాళ్లు కొందరైతే.. క్రేజ్ వచ్చినా సరే దాన్ని నిలబెట్టుకోలేకపోయిన వాళ్లు మరికొందరు. ఈ బ్యూటీ కూడా రెండో టైప్. ఈమె ఎవరు? తెలుగులో ఏ మూవీస్లో నటించింది? ఇప్పుడేం చేస్తోంది?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జరా షా. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈమె మోడలింగ్ చేసింది. మంచి పేరు తెచ్చుకుంది. అలా దర్శకుడు శేఖర్ కమ్ముల దృష్టిలో పడటంతో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో ఓ హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. నాగరాజు పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ లక్ష్మిగా నటించింది. ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. అలా ఈమెకు నాగార్జున 'భాయ్', అనుష్క 'రుద్రమదేవి' చిత్రాల్లో నటించే అవకాశమొచ్చింది.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)అలానే పైరేట్స్ 1.0, ఐతే 2.0 అనే తెలుగు సినిమాల్లోనూ జరా షా నటించింది. కానీ తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తర్వాత తగ్గిపోయింది. చేసిన మూవీస్ ఫెయిల్ కావడంతో ఈమె పూర్తిగా నటనని పక్కనబెట్టేసింది. అలానే మోడలింగ్ కూడా చేస్తున్నట్లు లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అడపాదడపా ఫొటోలు పోస్ట్ చేస్తోంది. సినిమాలో పాత్రకు ప్రస్తుతం ఈమెని చూస్తే కచ్చితంగా పోల్చలేరు. అంతలా డిఫరెన్స్ కనిపిస్తుంది. తాజాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాకు 13 ఏళ్లు పూర్తయిందని పోస్టర్ షేర్ చేయడంతో ఈమె మరోసారి టాపిక్ అయింది.ఇకపోతే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో లీడ్ రోల్స్ చేసిన అభిజిత్, సుధాకర్, జరా షా తదితరులు తర్వాత కాలంలో కనుమరుగైపోయారు కానీ ఇదే మూవీలో విలన్ గ్యాంగ్ వైపు కనిపించిన నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, శ్రీముఖి తదితరులు పెద్ద స్టార్స్ అయిపోయారు. ఇదే మూవీలో ఈషా రెబ్బా, శ్రీ విష్ణు కూడా నటించారు. ఇప్పుడు వీళ్లు హీరోహీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్) -
బిగ్బాస్ సీజన్-9 డేట్ వచ్చేసింది.. హోస్ట్గా ఆ స్టార్ హీరోనే!
బిగ్బాస్ రియాలిటీ షోకు ఆడియన్స్లో ఉన్న క్రేజ్తో అన్ని భాషల్లో సక్సెస్గా కొనసాగుతోంది. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. తెలుగులో సెప్టెంబర్ 7న గ్రాండ్గా మొదలైంది. ఇప్పుడు తమిళ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. అక్కడ తమిళ బిగ్బాస్ సీజన్-9 కావడం మరో విశేషం.ఈ సీజన్ను వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సీజన్కు కూడా స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రియులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. బిగ్బాస్ సీజన్ -7 తర్వాత కమల్ హాసన్ తప్పుకోవడంతో విజయ్ సేతుపతి హోస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. ఈ రియాలిటీ షో విజయ్ టీవీతో పాటు జియో హాట్స్టార్లోనూ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. பாக்க பாக்க தான் புரியும்.. போக போக தான் தெரியும்Bigg Boss Tamil Season 9 | Grand Launch - அக்டோபர் 5 முதல்..😎 #BiggBossSeasonTamil9 #OnnumePuriyala #BiggBoss9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #VijayTV #VijayTelevision pic.twitter.com/ZdbtAolWH8— Vijay Television (@vijaytelevision) September 13, 2025 -
'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?
థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్'.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతటా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే సూపర్ హీరో తరహా జానర్లో మూవీ తీసినప్పటికీ.. క్లైమాక్స్లో శ్రీ రాముడి రిఫరెన్స్ చూపించడం ప్రేక్షకులకు నచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఈ పాత్రలో ప్రభాస్ నటించాడని.. మూవీ రిలీజ్కి ముందు రూమర్స్ వచ్చాయి. కానీ ఆ పాత్రని ఓ యువ నటుడితో చేయించారు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? అతడి డీటైల్స్ ఏంటి?ఈ సినిమా చివరలో వచ్చే శ్రీ రాముడి పాత్ర.. కథని టర్న్ అయ్యేలా చేస్తుంది. పట్టుమని ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఆ పాత్రని చూపించారు. అది కూడా ముఖం కనిపించీ కనిపించకుండా చూపించారు. దీంతో ఆ పాత్రని ఎవరు చేశారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ రోల్లో హిందీ నటుడు గౌరవ్ బోరా కనిపించాడు. ఇతడిది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్. మాస్ కమ్యూనికేషన్ చదివిన గౌరవ్.. నటనపై ఇష్టంతో ఢిల్లీ వచ్చేసి థియేటర్ గ్రూప్లో చేరాడు. ఐదేళ్ల పాటు పలు నాటకాలు చేశాడు.(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)పలు షార్ట్ ఫిల్మ్స్, హిందీ సీరియల్స్ కూడా చేసిన గౌరవ్.. కొన్ని కమర్షియల్ యాడ్స్లోనూ నటించాడు. మరి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఎక్కడ చూశాడో ఏమో గానీ గౌరవ్ని శ్రీరాముడి పాత్ర కోసం ఎంపిక చేశాడు. రెండు రోజుల పాటు ఇతడికి సంబంధించిన షూటింగ్ అంతా జరిగింది. శ్రీ రాముడి సీన్స్కి వీఎఫ్ఎక్స్ కూడా జోడించేసరికి ఆ సన్నివేశాలు ఎలివేట్ అవుతున్నాయి.అయితే తెలుగులో శ్రీరాముడు అంటే చాలామంది సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. తర్వాత కాలంలో పలువురు నటులు.. ఈ పాత్రలో కనిపించినప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఒకవేళ 'మిరాయ్' టీమ్ ఎవరైనా తెలుగు నటుడిని ఈ పాత్రలో పెట్టుంటే కచ్చితంగా పోలిక వచ్చి ఉండేది. అందుకేనేమో ఉత్తరాది నటుడిని పెట్టి మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఏదైనా ఈ పాత్రకు కూడా రెస్పాన్స్ బాగానే వస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!) -
కాంతార ప్రీక్వెల్... రంగంలోకి నేషనల్ అవార్డ్ సింగర్!
కన్నడ ఇండస్ట్రీలో నుంచి బ్లాక్బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్ చేశారు.ఈ సాంగ్ను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంతార వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి, గాయకుడు దిల్జిత్ దోసాంజ్, హోంబలే ఫిల్మ్స్ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. Excited to join hands with @diljitdosanjh for the Kantara album 🙏✨By Shiva’s grace, everything fell into place. Much love, Paji ❤️🔥Another Shiva bhakt meets Kantara.#KantaraChapter1 #KantaraChapter1onOct2 pic.twitter.com/44ya4cyL8S— Rishab Shetty (@shetty_rishab) September 12, 2025 -
చిరంజీవితో 'మిరాయ్' దర్శకుడు సినిమా
తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ మిరాయ్... దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందాడు. సుమారు పదేళ్లుగా సినీ రంగంలో ఉన్న ఆయన మిరాయ్తో భారీ హిట్ అందుకున్నారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కార్తీక్ సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ, దర్శకుడిగా కాదు.వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. త్వరలోనే సెట్స్ మీదకు ఈ ప్రాజెక్ట్ వెళ్లనుంది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా కార్తిక్ ఘట్టమనేని చేయబోతున్నారు. మెగాస్టార్తో తొలిసారి ఆయనకు ఛాన్స్ రావడంతో ఆయన సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, ఎక్స్ప్రెస్ రాజా,ధమాకా, కార్తీకేయ, చిత్రలహరి వంటి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తాజాగా విడుదలైన మిరాయ్ మూవీ సినిమాటోగ్రాఫర్ కూడా కార్తిక్ కావడం విశేషం. సినిమాటోగ్రాఫర్గా కార్తీక్కు మంచి గుర్తింపు ఉంది. దర్శకుడిగా పనిచేస్తూనే ఆయన తన కెమెరాకు కూడా పని చెప్తారు. డైరెక్టర్గా తొలిచిత్రం సూర్య వర్సెస్ సూర్య తర్వాత మిరాయ్తో భారీ హిట్ అందుకున్నారు. -
100 రోజులు ఆడిన శ్రీలీల మూవీ.. ఇప్పుడు తమిళంలో..
వైరల్ వయ్యారి శ్రీలీల (Sreeleela) త్వరలో శివకార్తికేయన్కు జంటగా పరాశక్తి చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దీనికంటే ముందు 'కిస్ మీ ఇడియట్' అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఇది ఆమె కన్నడంలో నటించిన రెండవ చిత్రం కిస్కు రీమేక్ కావడం గమనార్హం. కన్నడలో కిస్ మూవీ 2019లో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. విరాట్ కథానాయకుడిగా నటించిన ఇందులో రోబో శంకర్, నాంజిల్ విజయమన్, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయశంకర్ రామలింగం ఛాయాగ్రహణం, ప్రకాష్ నిక్కి సంగీతాన్ని అందించారు. కథేంటంటే?మాతృకకు పనిచేసిన డైరెక్టర్ అర్జున్ తమిళ వర్షన్కూ పని చేస్తున్నారు. కిస్ మీ ఇడియట్ చిత్రం సెప్టెంబర్ 26వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు వెల్లడించాడు. 'కాలేజీలో చదువుకునే శ్రీలీల తన తోటి విద్యార్థులతో కలిసి ఆట పట్టించినందుకు గాను ప్రిన్సిపల్ ఆమెను తరగతి గది నుంచి ఒక రోజు బహిష్కరిస్తాడె. దీంతో కోపంతో బయటికి వచ్చిన శ్రీలీల కళాశాల వెలుపల ప్రిన్సిపల్ ఫొటో ఉన్న బ్యానర్పై రాయి విసురుతుంది. ఆ రాయి అటుగా వస్తున్న విరాట్ కారుపై పడటంతో అద్దం పగులుతుంది. తప్పని స్థితిలో..దీంతో శ్రీలీలను విరాట్ నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. అంత డబ్బు తన వద్ద లేదని శ్రీలీల ప్రాధేయ పడితే ఒక ముద్దు ఇవ్వు లేదా తన వద్ద రెండు నెలలు సహాయకురాలిగా పనిచేయమని చెబుతాడు. దీంతో శ్రీలీల అతని వద్ద రెండు నెలలు సహాయకురాలుగా పనిచేయడానికి అంగీకరిస్తుంది. అలా శ్రీలీల విరాట్పై ప్రేమ పెంచుకున్న తరుణంలో గడువు పూర్తి కావడంతో ఆమెను పని నుంచి తొలగిస్తాడు. ఆ తర్వాత ఆమె లేకుండా తాను ఉండలేనన్న భావన విరాట్కు కలుగుతుంది అలాంటి వారి ప్రేమ ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కిస్ మీ ఇడియట్ రూపొందింది అని దర్శకుడు చెప్పారు. -
డబుల్ మీనింగ్ డైలాగ్స్ నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు: మారుతి
హారర్ జానర్లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ది రాజా సాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ది రాజాసాబ్ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ వాయిదా పడేట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామా? అన్న ఆలోచనలో ఉన్నారు. పిచ్చిమాటలు, బూతులుతాజాగా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) బ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ డైరెక్టర్ తన సినిమాకు జనాలు రాలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. పది మంది కళాకారులను తయారు చేసే దర్శకుడు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. ఎందుకంటే.. ఆడియన్స్ను రప్పించడానికి పిచ్చిమాటలు, బూతులు మాట్లాడుతున్నారు. నాకంటే గొప్పగా ఎవరూ రాయలేడుచొక్కా తీసేస్తామంటున్నారు, సినిమాలు మానేస్తామంటున్నారు. ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఏంటిది? ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే సినిమాకు హైప్ వస్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు రాశాను. ఒక్కసారి నేను కూర్చుని రాయడం మొదలుపెడితే నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు. కానీ బస్టాప్ సినిమాతోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం ఆపేశాను. రూ.400 కోట్లతో రాజాసాబ్బూతు డైలాగులు ఎందుకని రాయడం లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? బ్యూటీ లాంటి సినిమాకు వంద డైలాగులు ఇస్తాను. కుటుంబంతో కలిసి ప్రేక్షకులు థియేటర్కు రావాలి. వారికి క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో, బస్టాప్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన బూతు డైరెక్టర్ని.. రూ.400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నా.. నా ఎదుగుదల, గ్రాఫ్, కెరీర్ చూడండి. చిల్లర పనులు చేయొద్దుఅందరూ ఊరికనే డైరెక్టర్లు అయిపోరు. పాన్ ఇండియా స్టార్స్.. ఊరికనే ఫ్లాప్ డైరెక్టర్ని పిలిచి సినిమా అవకాశాలివ్వరు. ఊరికనే సినిమాలిచ్చారంటే ప్రభాస్ మనసులో నేనున్నా! మేమిద్దరం ఎంత ప్రేమతో ఉంటామో మాకు తెలుసు. సినిమా ఆడించేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనమెప్పుడూ మంచి సినిమా చూస్తారు. అంతేకానీ చిల్లరపనులు చేయకండి అని మారుతి చెప్పుకొచ్చాడు.చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
ప్రముఖ దర్శకుడికి డాక్టరేట్ ప్రదానం
ప్రముఖ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ గౌరవ డాక్టరేటు పొందారు. చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ వేల్స్ ఇన్స్టిట్యూట్ తరపున ప్రదానం చేశారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 15వ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమలో అద్భుత విజయం సాధించిన శ్రీ గోకులం గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ ఎ.ఎం. గోపాలన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు వెట్రి మారన్కు గౌరవ డాక్టరేట్లను వారు ప్రదానం చేశారు. వడచెన్నై, అసురన్, విడుదలై, ఆడుకాలమ్,కాక్క ముట్టై వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనంతరం క్రికెట్లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ అశ్విన్కు కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4,992 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్స్ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతా గణేశ్, రిజిస్ట్రారర్ డాక్టర్.పి.శరవణన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్.ఎం.భాస్కరన్, అసోసియేట్ ఛాన్సలర్ డాక్టర్.ఎ.జ్యోతి మురుగల్, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. గతంలొ ఇదే యూనివర్సిటీ నుంచి మెగా హీరో రామ్ చరణ్ కూడా గౌరవ డాక్టరేట్ పొందారు. -
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్.. శుభవార్త చెప్పేసింది. ఈ ఏడాది మొదట్లో ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో సహ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: రెండోసారి ప్రసవం.. చాలా ఇబ్బందిపడ్డా: ఇలియానా)'దేవాన్ కే దేవ్ మహాదేవ్' సీరియల్లో పార్వతి దేవిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి సోనారిక.. దస్తాన్ ఈ మొహబ్బత్ సలీమ్ అనార్కలీ సీరియల్ కూడా చేసింది. మరో రెండు మూడింటిలోనూ కనిపించింది. బుల్లితెరకే ఈమె పరిమితమైపోలేదు. తెలుగులో 'జాదుగాడు', స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. కానీ ఇవి హిట్ కాకపోవడంతో టాలీవుడ్లో కనిపించలేదు. చివరగా 2022లో 'హిందుత్వ' అనే హిందీ మూవీ చేసింది.2022లోనే సోనారిక తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్తో నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోయింది. దాదాపు ఏడేనిమిదేళ్లుగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ 2022లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని బయటపెట్టారు. మాల్దీవులు వెళ్లి మరీ బేబీ బంప్తో ఫొటోలు దిగారు. వీటినే సోనారిక ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అందరి నుంచి విషెస్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్లో తెలుగు హారర్ కామెడీ సినిమా) -
కాపీరైట్.. ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఇళయరాజా : రజనీకాంత్
సినీ జీవితంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఇళయరాజా పేరును భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తెలిపారు. అనంతరం ఆయన్ను జ్ఞాపికతో సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్, కార్తి వంటి స్టార్స్ పాల్గొన్నారు.ఇళయరాజా తన 50ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు చూశారని సీఎం స్టాలిన్ అన్నారు. కృషి ఉంటే ఎంతటి ఉన్నత శిఖరానికైనా చేరవచ్చని ఇళయరాజా జీవితం చెబుతుందన్నారు. ఆయన సంగీతం విజయ ప్రస్థానానికి ప్రేరణ అందించడమే కాకుండా బాధలను కూడా ఓదార్చుతోందని సీఎం తెలిపారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు ఏటా తమిళనాడు ప్రభుత్వం తరఫున ఇళయరాజా పేరుతో ఒక పురస్కారం అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు.SP బాలు, ఇళయరాజా వివాదంపై రజనీ వ్యాఖ్యలు'ఇళయరాజా పాటలు నేడు చాలా సినిమాల్లో ఉపయోగిస్తున్నారని రజనీకాంత్ అన్నారు. దీంతో పలు సినిమా మేకర్స్పై కాపీరైట్ చట్టం ప్రకారం ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇళయరాజా తను స్వరపరచిన పాటలపై కాపీరైట్ హక్కులు తనకే ఉన్నాయని.. ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఆ పాటలు మళ్లీ పాడకూడదని కోరారు. దీంతో బాలు కూడా మళ్లీ ఎక్కడా ఆ పాటలు పాడలేదు. కానీ, కోవిడ్ సమయంలో SPB మరణించినప్పుడు, ఇళయరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరి ముందే విలవిల ఏడ్చారు. గతంలో తన సోదరుడు, కూతురు, భార్య మరణించిన సమయంలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టలేదు. కానీ బాలు కోసం ఏడ్చేశారు. వారి మధ్య స్నేహం ఎంత బలమైనదో ఇదొక్కటి చాలు.' అని రజనీకాంత్ అన్నారు. -
డిప్రెషన్.. చనిపోవాలని చాలాసార్లు ట్రై చేశా..: హీరోయిన్
ఒకానొక సమయంలో జీవితంపై విరక్తి వచ్చి తనువు చాలించాలనుకున్నాను అంటోంది హీరోయిన్ మోహిని (Actress Mohini). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడే సెటిలైపోయింది. మోహిని- భరత్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మోహిని. డిప్రెషన్లో..నా పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. కానీ, ఒకానొక సమయంలో నాలో తెలియని బాధ మొదలైంది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. పోనీ, నా జీవితంలో ఏమైనా కష్టాలున్నాయా? అంటే ఏమీ లేవు. అంతా ఎప్పటిలాగే ఉంది. కానీ, నేను మాత్రం డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోయాను. ఆత్మహత్యకు ప్రయత్నించాను. అలా ఒక్కసారి కాదు, పలుమార్లు చనిపోయేందుకు ట్రై చేశాను. ఆ సమయంలోనే ఓ జ్యోతిష్యుడిని కలవగా నాపై చేతబడి జరిగిందని చెప్పాడు. దాన్నుంచి బయటపడ్డా..మొదట నవ్వుకున్నాను. కానీ ఆలోచిస్తే అదే నిజమనిపించింది. నా అంతట నేనుగా చనిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. తర్వాత ఆ భగవంతుడిని నమ్ముకుని దాన్నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. కాగా మోహిని తెలుగులో ఆదిత్య 369 సినిమాతో పాపులర్ అయింది.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
ఆండ్రీతో ఫస్ట్ మీట్.. రాంగ్ ఫ్లైట్ బుక్ చేశా: శ్రియా శరణ్
టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించిన బ్యూటీ శ్రియా శరణ్. ఆ తర్వాత రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్ను పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. తాజాగా మరోసారి మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న శ్రియా శరణ్ తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆండ్రీ కోస్చీవ్తో తన ప్రేమకథ గురించి శ్రియ శరణ్ ఓపెన్ అయింది. ఆండ్రీని మొదటిసారి కలిసేందుకు మాల్దీవులకు వెళ్లానని శ్రియా పంచుకుంది. అయితే ఫస్ట్ మీట్ కావడంతో టెన్షన్లో రాంగ్ ఫ్లైట్ బుక్ చేశానని తెలిపింది.శ్రియా మాట్లాడుతూ.. "నా డైవింగ్ ట్రిప్ ఏప్రిల్లో ఉంది. కానీ మార్చిలో నేను మాల్దీవులకు వెళ్లాను. అక్కడ దిగినప్పుడు చాలా పెద్ద తప్పు చేశానని గ్రహించా. అక్కడ నేను ఒంటరిగా ఉన్నా. ఆ సాయంత్రం ఒక పడవ మాల్దీవులకు దక్షిణంగా వెళుతోందని నాకు తెలిసి అందులో వెళ్లా. అదొక అందమైన సూర్యాస్తమయం. అక్కడ నాకు ఎవరు తెలిసినవారు లేకపోవడంతో ఒంటరిగా ఉన్నా. భయపడి డెక్ మీద నిలబడి ఉన్నా. అదే సమయంలో తిరిగి చూడగానే ఆండ్రీ నా వెనకే ఉన్నాడు. అలా మేము మొదటిసారి కలుసుకున్నాం" అని గుర్తు చేసుకుంది.అయితే తన సినిమా దృశ్యం చూసిన తర్వాత ఆండీ కోస్చీవ్ నన్ను చూసి భయపడ్డాడని వెల్లడించింది. ఆండ్రీకి, తనకు మొదట్లో ఒకరి గురించి ఒకరు ఏమీ తెలియదని.. అయినా మా రిలేషన్ చాలా అందంగా అనిపించిందని శ్రియ తెలిపింది. అలా డైవింగ్కు వెళ్లామని.. మాట్లాడుకుంటూనే మా ఇద్దరి మధ్య డేటింగ్ ప్రారంభమైందని పంచుకుంది. తాను మొదట రష్యన్ భాషలో చెడు పదాలు నేర్చుకున్నానని శ్రియ శరణ్ చెప్పింది. కానీ ఇప్పుడు తన కుమార్తె రాధా శరణ్ కోస్చీవ్తో కలిసి భాషను సరిగ్గా నేర్చుకుంటున్నానని నవ్వుతూ మాట్లాడింది. అంతేకాకుడా ఆండ్రీకి హిందీ బాగా అర్థమవుతుంది.. అదృష్టవశాత్తూ ఆండ్రీ భారతదేశానికి వచ్చాడని పేర్కొంది. కాగా.. శ్రియా శరణ్ 2018లో ఆండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ సునామీ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?
మిరాయ్..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. తక్కువ బడ్జెట్లో గొప్ప సినిమా తీశారంటూ విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తొలి రోజు(సెప్టెంబర్ 12) 27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను సాధించింది. మొత్తం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.60 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.(చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!)ఓవర్సీస్లోనూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. నార్త్ అమెరికాలో రెండు రోజుల్లోనే 1 మిలియన్ల డాలర్లను రాబట్టింది. యూఎస్, కెనడాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ మూవీకి వచ్చిన హిట్ టాక్ని బట్టి చూస్తే..వీకెండ్లోగా ఈజీగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.(చదవండి: రెండోసారి ప్రసవం.. మానసికంగా దెబ్బతిన్నా: ఇలియానా)మిరాయ్ విషయానికొస్తే.. హనుమాన్ తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రమిది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషించాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించారు. -
రెండోసారి ప్రసవం.. మానసికంగా ఇబ్బందిపడ్డా: ఇలియానా
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మెప్పించిన బ్యూటీ ఇలియానా. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్డమ్ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది హిందీ చిత్రాల్లో కనిపించిన ఇలియానా.. ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. అయితే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన పోకిరి భామ.. రెండో బిడ్డ పుట్టాక ఎదురైన అనుభవాలను పంచుకుంది.అంతకుముందే అమెరికా నటుడు మైఖేల్ డోలన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఇలియానా.. 2023లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది జూలైలో రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పింది. రెండోసారి ప్రసవం తర్వాత తనకు ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వివరించింది. మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించిందని వెల్లడించింది.ఇలియానా మాట్లాడుతూ..' మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒంటరి మహిళగా బిడ్డను ఆరోగ్యంగా కాపాడుకోవాలి. అయితే రెండోసారి కేవలం బిడ్డ కాదు..నాతో పాటు మరో ఇద్దరు చిన్నపిల్లల బాధ్యత నాదే. ఇలాంటి సందర్భాల్లో మనం శారీరకంగా.. మన బలాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో మానసికంగా పూర్తి గందరగోళంగా అనిపించింది. అది చాలా కష్టంగా ఫీలయ్యాను. ఏమి జరగబోతోందో నాకు తెలిసినప్పటికీ.. మానసికంగా ఇది చాలా ఇబ్బందిగా భావించా. అదే సమయంలో ముంబయిని మిస్సయిన బాధ కూడా ఉంది. అక్కడైతే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారని" తెలిపింది.కాగా.. ఇలియానా, మైఖేల్ 2023 ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆమె చివరిసారిగా 2024 చిత్రం దో ఔర్ దో ప్యార్లో కనిపించింది. తెలుగులో 2006లో దేవదాస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. చివరిగా 2018లో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కనిపించింది . -
ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్?
'దేవుడు దిగొచ్చినా నా తీరు మార్చుకోను, నేను మాట్లాడేదే రైటు, నా నెత్తికెక్కాలని చూస్తే తొక్కిపడేస్తా..' ఈ డైలాగులు, పద్ధతి అంతా మాస్క్ మ్యాన్దే! తన తప్పులను నాగార్జున ఎత్తిచూపినా సరే.. అవసలు తప్పే కాదన్నట్లు అడ్డదిడ్డంగా వాదించాడు. ఇమ్మాన్యుయేల్ను రెడ్ ఫ్లవర్ అనడం, అబ్బాయిలను అడంగిలుగా పోల్చడం.. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ ఈ వారం హైలైట్ అయ్యాడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీశ్. అసలు ఇతడెవరు? చూసేద్దాం..మాస్క వెనక రహస్యంసమాజంలో చాలామంది కనబడని మాస్కు వేసుకుంటారు. అది చెప్పడానికే హరీశ్ మాస్కు ధరించడం మొదలుపెట్టాడు. అయితే అతడు మాత్రం లోపల ఏదీ దాచుకోకుండా మాట్లాడతాడు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దాదాపు 12 ఏళ్లుగా నోస్ మాస్క్ ధరిస్తూ వచ్చాడు. ఐదు నెలలుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించాడు. విజయవాడలో పుట్టిపెరిగిన హరీశ్ హైదరాబాద్లో సెటిలయ్యాడు.అన్ని ఉద్యోగాల్లో..ట్యూషన్స్ చెప్పాడు, ఇంటింటికీ తిరిగి చేతి గడియారాలు అమ్మాడు. స్కూల్లో టీచర్గా మారాడు. బ్యాంకింగ్, టెలికాం, ఫార్మా, ఫైనాన్స్.. ఇలా అన్ని రంగాల్లో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అయినా ఎక్కడా తనకు సంతృప్తి కలగలేదు. హరీశ్ది ప్రేమ పెళ్లి. హరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. దేవుడిని నమ్మని ఇతడి పెళ్లి గుడిలో జరిగింది. వివాహం తర్వాత విభేదాలు రావడంతో దాదాపు ఏడేళ్లపాటు ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నారు.యాక్సిడెంట్2017లో హరీశ్కు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత సిస్టర్ను కోల్పోయాడు. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఏళ్ల తరబడి ఆ డిప్రెషన్ను అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ బాధలోనే ఓసారి భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ డిప్రెషన్తోనే బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. ఇప్పుడు హౌస్లో అపరిచితుడిలా రకరకాల షేడ్స్ చూపిస్తున్నాడు. ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తన తప్పులను సరిదిద్దుకోకపోతే అతడు హౌస్లో కొనసాగడం కష్టమే!చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
30 సెకన్ల ముద్దు సీన్కు 47 రీటేక్స్.. ఐకానిక్ సీన్ స్టోరీ ఇదే
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త సంజయ్కపూర్ ఆస్తి వివాదానికి సంబంధించిన వార్తలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసింది. అయితే, ఇదే సమయంలో సుమారు 30 ఏళ్ల క్రితం ఆమె నటించిన రాజా హిందుస్తానీ (Raja Hindustani) సినిమా గురించి మరోసారి ట్రెండ్ అవుతుంది. సినీ ప్రియులను మెప్పించిన ఈ చిత్రంలో ఆమిర్ఖాన్ (Aamir Khan) - కరిష్మా కపూర్ (Karisma Kapoor) జంటగా నటించారు. దర్శకుడు ధర్మేష్ దర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం 1996లో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.30 సెకన్ల కిస్ సీన్కు 47 టేకులురాజా హిందుస్తానీ చిత్రంలో ఆమిర్ఖాన్, కరిష్మా కపూర్ ముద్దు సీన్ ఒకటి ఉంటుంది. ఆరోజుల్లో అది పెద్ద సంచలనంగా మారిపోయింది. అయితే, ఆ సీన్ చిత్రీకరణలో చాలా ఇబ్బంది పడ్డానని కరిష్మా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మూడు రోజుల పాటు తాము పడిన కష్టం ఎవరికీ తెలయదని ఆమె అన్నారు. ఊటీలో గడ్డకట్టే చలి ఉండే సమయం ఫిబ్రవరి.. అలాంటి సమయంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ కొనసాగుతూ ఉండేది. తీవ్రమైన చలి కావడంతో తాము వణుకుతూనే ఉండేవాళ్ళమని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ ముద్దు సీన్ ఎప్పుడు పూర్తవుతుంది..? అంటూ ఎదురుచూసేవాళ్లమని కరిష్మా కపూర్ చెప్పారు.ఫస్ట్ కిస్ సీన్ ఇదేకరిష్మా కపూర్ గురించి ఆ చిత్ర దర్శకుడు ధర్మేష్ కూడా గతంలో పలు విషయాలు పంచుకున్నారు. ఆమిర్, కరిష్మాతో పని చేసిన రోజులను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. సినిమా పరిశ్రమలోకి ఆమె ఎంట్రీ ఇచ్చి అప్పటికి కొత్త... కథలో భాగంగా నటీనటుల మధ్య ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉందని ముందే కరిష్మాతో పాటు ఆమె తల్లికి కూడా చెప్పామన్నారు. అయితే, అప్పటికి ఆమె ఏ చిత్రంలోనూ కిస్ సీన్ చేయలేదని ఆయన గుర్తుచేశారు. దీంతో ఆమె కాస్త కంగారు పడినట్లు కూడా పేర్కొన్నాడు. ఆమెకు ధైర్యంగా ఉండేందుకు తన అమ్మగారిని సెట్స్లో ఉంచామన్నారు. ఏకంగా మూడురోజుల పాటు ఆ లిప్లాక్ సీన్ కోసం షూట్ చేశామన్నారు. అందుకోసం ఏకంగా దాదాపు 47 రీటేక్స్ తీసుకున్నట్లు దర్శకుడు గుర్తుచేసుకున్నారు. ఆరోజుల్లో లిప్లాక్ సీన్స్ పెద్దగా ఉండేవి కాదు. దీంతో సినిమా విడుదలయ్యాక ఇదొక ఐకానిక్ కిస్ సీన్గా మారిపోయింది.కరిష్మా కపూర్ భర్త సంజయ్ గుండెపోటుతు మరణించాకా ఆయనకున్న రూ.30 వేల కోట్ల ఆస్తిలో వాటా కోరుతూ కరిష్మా పిల్లలు సమైరా (20), కియాన్ (15) హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఇప్పటికే కరిష్మా పిల్లలకు రూ. 1900 కోట్లు అందాయని సంజయ్ రెండో భార్య ప్రియ వాదనలు ఉన్నాయి. తనకు కూడా పిల్లలు ఉన్నారని తాను ఆయనకు చట్టబద్ధమైన భార్యనని తెలిపింది. ఆమెకు (కరిష్మాకు) చాలాకాలం క్రితమే ఆయన విడాకులు ఇచ్చారని న్యాయస్థానంలో పేర్కొంది. -
ఫోటోతో పాటు కింద నా రేటు కూడా వేసి వైరల్ చేశారు: బిగ్బాస్ నైనిక
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమని, సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే గతంలో దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నటీమణులు భయపడేవారు. కానీ ఈ మధ్య తమకు ఇబ్బంది కలిగిస్తే.. మీడియా ముఖంగా వారి పేర్లను బటయపెడతున్నారు. క్యాస్టింగ్ కౌచ్పై చర్చిస్తూ.. నూతన నటీనటులకు అవగాహన కలిగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపుల గురించి బాహాటంగానే వెల్లడించారు. తాజాగా డ్యాన్సర్, బిగ్బాస్ ఫేం నైనిక కూడా క్యాస్టింగ్ కౌచ్పై స్పందించారు. చాలామందిలాగానే తాను కూడా క్యాస్టింగ్ కౌచ్కి గురయ్యానని చెప్పింది. కమిట్మెంట్ ఇస్తే.. సినిమా చాన్స్ ఇస్తామని చాలా మంది అడిగారని, తాను నో చెప్పడంతో వాళ్లంతా మళ్లీ కాల్ చేయలేదని చెప్పింది. తాజాగా ఆమె ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.‘సినీ ఇండస్ట్రీ ఇప్పుడు వల్గర్గా తయారైంది. అందరూ గలీజ్ అయిపోయారు. ఓపెన్గానే కమిట్మెంట్ అడిగేస్తున్నారు. ఆ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి..‘పర్సనల్ రిక్వెర్మెంట్’ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన బ్రాండ్ని ప్రమోట్ చేయాలేమో అనుకున్నా. ఓకే చెప్పా. ఆయన మరోసారి ‘పర్సనల్ రిక్వెర్మెంట్’ అని చెప్పడంతో నాకు అర్థమైంది. నాకు తెలిసిన వ్యక్తి కావడంతో.. ‘మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా బయటకు వెళ్తుంది. బాగా వైరల్ అయింది’ అని చెప్పాడు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అమ్మాయిల వల్లే ఈ ఫార్మెట్ క్రియేట్ అయింది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది అలా చేస్తున్నారు కూడా. నేను ఆర్టిస్ట్ అయినా కూడా.. ఒకవేళ నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీలోకి రానివ్వను. ఈ ఫీల్డ్ మంచిది కాదని చెబుతా’అని నైనిక చెప్పుకొచ్చింది.ఇక తన తండ్రి గురించి కూడా నైనిక చెప్పుకొచ్చింది. ఆయన తమతో ఉండరని, తానే ఇంటి నుంచి పంపేశానని చెప్పింది. ‘డాడీ మాతో ఉండరు. డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. ఆయన మంచోడు కాదు. అమ్మని టార్చర్ చేశాడు. అందుకే నేను డాడీని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా. ‘నువ్వు ఉంటే నేను ఇంట్లో ఉండను’ అని డాడీతో చెప్పా. ఇప్పుడు ఆయన మాతో ఉండడం లేదు. డాడీని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. అమ్మ నన్ను చాలా బాగా పెంచింది. కష్టపడి ఆడిషన్స్కి తీసుకెళ్లేది. అమ్మలా నేను కూడా నా పిల్లలను పెంచలేను. ఆమెకు ఒక మంచి ఇళ్లు కొనివ్వడమే నా లక్ష్యం’ అని నైనిక చెప్పుకొచ్చింది. ఢీ షో ద్వారా డ్యాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. బిగ్బాస్ 8 లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కొరియోగ్రఫీ చేస్తూనే..ఆర్టిస్ట్గానూ ప్రయత్నాలు చేస్తుంది. -
మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!
మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించగా, రితికా నాయక్ హీరోయిన్గా చేసింది. శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు.రికార్డులు తిరగరాయడం ఖాయంమిరాయ్కు తొలి రోజే రూ.27 కోట్లు రావడంతో చిత్రయూనిట్ 'బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్ సక్సెస్' పేరిట విజయోత్సవాలు జరుపుకుంది. సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే మిరాయ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన గొంతు అరువిచ్చాడు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ గొంతు వినిపించగానే ప్రేక్షకులు ఎగిరిగంతేస్తున్నారు. మిరాయ్ మూవీకి అంత బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ దీనికోసం ఎంత డబ్బు తీసుకున్నాడని కొందరు చర్చలు మొదలుపెట్టారు. ఓటీటీ పార్ట్నర్అసలే ప్రభాస్ది వెన్నలాంటి మనసు. తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే సరేనని గొంతు అరువిచ్చి సాయం చేశాడే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదట! దీంతో రెబల్ స్టార్ను అభిమానులు మరోసారి ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకపోతే మిరాయ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాతే మిరాయ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ నెలలో మిరాయ్ ఓటీటీలో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది.చదవండి: ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి -
రూ. 200 కోట్లు నష్టం.. రెమ్యునరేషన్ కూడా రిటర్న్: ఆమిర్ఖాన్
లాల్ సింగ్ చడ్డా చిత్రంతో రూ. 200 కోట్టు నష్టాలను ఎదుర్కొన్నట్లు తాజాగా ఆమిర్ఖాన్ చెప్పారు . 2022లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీకి ఆమిర్, అతడి మాజీ భార్య కిరణ్రావ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు ముందు ఆమీర్ నటించిన ప్రతి సినిమా మినిమమ్ రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. అయితే, లాల్ సింగ్ చడ్డా మూవీకి వచ్చిన నష్టాల గురించి తాజాగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.'ఒక నిర్మాతగా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఏదైనా సినిమా ప్రారంభిస్తే లాభాల కంటే నష్టాలు రాకుంటే చాలు అనే విధంగా నా ప్రణాళిక ఉంటుంది. కానీ, లాల్ సింగ్ చడ్డా మూవీ బడ్జెట్ విషయంలో పొరపాటు చేశాను. వరుస విజయాలు నాకు దక్కడం వల్ల ఈ మూవీ విషయంలో కాస్త అతి నమ్మకం ఏర్పడింది. దీంతో బడ్జెట్పై ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. అందుకే నష్టపోయాను. దంగల్ సినిమాకు రూ. 390 కోట్లు ఇండియాలోనే వచ్చాయి. దీంతో లాల్ సింగ్ చడ్డాకు రూ. 200 కోట్లు వస్తాయని అంచనా పెట్టుకున్నాను. అదే నేను చేసిన పొరపాటు.ఒక సినిమా రూ. 120 కోట్లు చేస్తుందని అనుకుంటే అప్పుడు మీ బడ్జెట్ రూ. 80 కోట్లు దాటకూడదు. ఇలా ప్లాన్ ఉంటే సేఫ్గా ఉంటాం. ఇలాంటి ప్రణాళిక లాల్ సింగ్ చడ్డా సమయంలో చేయలేదు. దీంతో రూ. 200 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నాం. ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో కరోనా ప్రభావం ఉండటంతో ఎక్కువగా ట్రావెలింగ్కు ఖర్చు అయింది. చైనాలో తెరకెక్కించిన ఒక భారీ సీన్ ... ఎడిటింగ్లో తొలగించాం. ఆ ఖర్చు అంతా బుడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.' అని అన్నారు.ఈ సినిమాకుగానూ ఆమిర్ రెమ్యూనరేషన్ రూ.50కోట్లు తీసుకున్నాడు. అయితే, ఆ మొత్తం సొమ్ముని వదులుకుని తన సహ నిర్మాతలకు తిరిగిచ్చేశారు. వారికి నష్టాన్ని తగ్గించాలనుకునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆమిర్ భారీగానే నష్టపోయారు. ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్గా నటించగా ప్రముఖ తెలుగు నటుడు నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. -
2023లో బ్రేకప్.. తనే నన్ను వదిలేసింది: మెగా హీరో బ్రేకప్ స్టోరీ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej)కు 38 ఏళ్లు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా దానికింకా టైముంది అని ఆ ప్రశ్నను దాటవేస్తూ ఉంటాడు. తాజాగా హైదరాబాద్లో ఓ సదస్సుకు హాజరైన సాయి దుర్గ తేజ్కు మరోసారి అదే ప్రశ్న ఎదురైంది. అందుకు సాయిదుర్గ తేజ్ స్పందిస్తూ.. నాది చాలా విషాదకరమైన స్టోరీ.. 2023లో నాకు బ్రేకప్ జరిగింది. ఇప్పటివరకు అయినవాటిలో ఇదే చాలా బాధాకరమైన బ్రేకప్. మీడియా వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది. నా పెళ్లి నేనే ప్రకటిస్తాసినిమా హిట్టయింది, నెక్స్ పెళ్లే.. ఆ అమ్మాయితో వెడ్డింగ్, ఈ అమ్మాయితో వెడ్డింగ్ అంటూ నానా రకాల పుకార్లు సృష్టించారు. దానివల్లే మా ప్రేమ విఫలమైంది. ఆమె నా కాలేజీ గర్ల్ఫ్రెండ్.. తను ఆ పుకార్లు చూసి తట్టుకోలేకపోయింది. ఎక్కువగా ఆందోళన చెందింది. దాంతో బ్రేకప్ జరిగిపోయింది. కాస్త మీ అందరూ కాస్త సైలెంట్గా ఉంటే నా పెళ్లి వార్త నేనే ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చాడు.పిల్లలకు సమయం కేటాయించాలిఇంకా మాట్లాడుతూ.. ఇప్పుడు పిల్లలతో పేరెంట్స్ ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. చాట్ జీపీటీ, ఏఐ అంటున్నారు. నాకు మాత్రం మా అమ్మే నా ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు.. ఇలా వీళ్లతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. పిల్లలకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. నేను నా సెకండ్ క్లాస్ లవ్స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని ఆమె ఇచ్చారు. ఇకపోతే తెలంగాణలో కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నాను. వారి చదువు, పోషణ అన్నీ చూసుకుంటాను అని చెప్పుకొచ్చాడు.అప్పట్లోనూ ఓ బ్రేకప్ స్టోరీకాగా 2023లో విరూపాక్ష సినిమా రిలీజ్ సమయంలోనూ తన పర్సనల్ లైఫ్ గరించి మాట్లాడాడు తేజ్. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పాడు. అప్పటినుంచి అమ్మాయిలంటేనే భయమేస్తుందన్నాడు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ తన తల్లి పేరు వచ్చేలా తప నేమ్ను సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నాడు.చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
మలయాళం థ్రిల్లర్ సినిమా 'సూత్రవాక్యం' రివ్యూ
మలయాళంలో బడ్జెట్ తక్కువ కంటెంట్ ఎక్కువ ఉండేలా సినిమాలను నిర్మిస్తుంటారు. ఈ మధ్య మలయాళం నుంచి వచ్చిన చిత్రాలు తెలుగులో కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి మూవీస్ ఓటీటీలో మంచి ఆదరణతో దూసుకెల్తున్నాయి. దీంతో తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. తాజాగా హార్ట్ టచ్చింగ్ మూవీ "సూత్రవాక్యం" (Soothravakyam) మలయాళంలో మంచి విజయం అందుకుంది. కొద్దిరోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video)లో కూడా విడుదలైంది. ఇందులో దసరా విలన్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) హీరోగా అద్భుతంగా నటించాడు. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రలు పోషించారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా ఈ మూవీతో పరిచయం అయ్యాడు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం.కథేంటి..?పోలీస్ స్టేషన్కు నేరాలు చేసినవాళ్లతో పాటు ఆ నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలి..? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది... పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు..? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనతో "సూత్రవాక్యం" తెరకెక్కించారు. క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) పోలీస్ ఆఫీసర్. నిమిషా (విన్సీ లోషియస్) మ్యాథ్స్ టీచర్, వివేక్ పాత్రలో దీపక్ పరంబోల్, ఆర్య పాత్రలో అనఘా నటించారు. ఈ సినిమా కథ అంతా వీరి చుట్టే ఎక్కువగా ఉంటుంది. క్రిస్టో జేవియర్ తన విధులతో పాటు పిల్లలకు పాఠాలు కూడా చెబుతాడు. అయితే, అక్కడి పిల్లలు స్కూల్కు వెళ్లకుండా క్రిస్టో చెబుతున్న పాఠాలు వినేందుకు మాత్రమే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ విషయం నిమిషా టీచర్కు నచ్చదు. దీంతో తన ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేస్తుంది. అతని దగ్గరికి 11వ తరగతి చదివే ఆర్య (అనఘా) కూడా ట్యూషన్కు వస్తుంది. ఆమె అన్నయ్య అయిన వివేక్ (దీపక్ పరంబోర్) ఎప్పుడూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఇదే విషయం గురించి ఒకసారి వివేక్కు క్రిస్టో జేవియర్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అయినా అతనిలో మార్పు రాదు. ఇంతకు తన చెల్లి మీద వివేక్కు ఎందుకు కోపం..? ఆమెపై దాడి చేసి ఎక్కడికి వెళ్లిపోయాడు..? ఈ క్రమంలో ఊహించని పరిస్థితుల్లో వివేక్ ఎలా చనిపోతాడు..? అతడి ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో జేవియర్ చేసిన ఇన్వెస్టిగేషన్లో మరో యువతి మర్డర్ కేసు ఎలా బయట పడింది..? రెండు హత్యల వెనుక ఉన్నదెవరు..? ఎంతో ఉత్కంఠతో సాగిన విచారణలో క్రిస్టో జేవియర్ ఫైనల్గా హంతకులను ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మలయాళం సినిమా కథలు మొదట చాలా నెమ్మదిగా మొదలవుతాయి. సూత్రవాక్యం మూవీ కూడా అంతే.., అయితే, కాస్త ఒపికతో ఫస్ట్ 20 నిమిషాలు చూస్తే ఆ తర్వాత చాలా ఉత్కంఠతో ఈ చిత్రాన్ని చూస్తారు. సినిమా ప్రారంభంలోనే పోలీస్ స్టేషన్లోనే ట్యూషన్లు చెప్పే పోలీసు కాన్సెప్ట్ మొదలౌతుంది. దానికి ఒక టీజర్ బాధ పడటం వంటి సీన్లు ఎంగేజ్ చేస్తాయి. స్టోరీ మధ్యలో ఆ గ్రామం పొలిమేరలో ఉన్న ఒక బావి స్టోరీ ఆసక్తిగా చెప్పడం వంటి సంఘటనలు పర్వాలేదనిపిస్తాయి. కథలో వివేక్ మరణంతో సినిమా పరుగులు పెడుతుంది. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ను పంచుతుంది. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. వివేక్ హత్య కేసు విచారణలో ఉండగానే మరో యువతి మర్డర్ కేసు బయటకు వస్తుంది. ఇలాంటి ట్విస్ట్లు సినిమాకు మరింత బలాన్ని ఇస్తాయి. అమెజాన్ ప్రైమ్లో ఉన్న సూత్రవ్యాక్యం కేవలం 1 గంటా 52 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉంది. కుటుంబంతో పాటుగా చూడొచ్చు. -
రామ్ చరణ్, జూ.ఎన్టీయార్.. చేతి వాచీలు అంత ఖరీదా?
సగటు మనిషికి చేతి గడియారం అంటే సమయాన్ని తెలుసుకునే ఒక అవసరమైన వస్తువు మాత్రమే కావచ్చు. కానీ సెలబ్రిటీలకు, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్, పెట్టుబడి, స్టేటస్ సింబల్... అంతేకాదు అన్నింటికీ మించి ఒక కళా ఖండం కూడా. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్లు వ్యాపార దిగ్గజాల వరకు, భారతదేశంలోని అత్యంత ప్రముఖు వ్యక్తులలో కొందరు లగ్జరీ కార్లు లేదా బహుళ అంతస్తుల భవనాల కంటే ఎక్కువ ఖరీదు పెట్టి కేవలం చేతి గడియారాలను కలిగి ఉన్నారంటే.. అర్ధమవుతుంది విలాసం అనేది ఏ స్థాయిలో పెరిగిందో...ఒక్కసారి ఖరీదైన చేతివాచీలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితా చూద్దామా...అత్యంత ఖరీదైన వాచీ ఎవరిదంటే...నెం1 సినిమా తారల్ని సైతం ఇంటి ముంగిట డ్యాన్స్ చేయించేంత డబ్బు, పలుకుబడి ఉన్న భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వాచీ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సంక్లిష్టమైన గడియారాలలో ఒకటైన పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ స్కై మూన్ టూర్బిల్లాన్ ను అనంత్ అంబానీ కలిగి ఉన్నాడు. ఆ చేతి వాచీ విలువఏకంగా రూ. 70.48 కోట్లు , ఇది డబుల్ డయల్స్ తో ఖగోళ విధులను సైతం అందిస్తుంది, ఇది చేతివాచీల తయారీ శాస్త్రమైన హోరాలజీలో ఒక గొప్ప కళాఖండంగా ఖ్యాతి పొందింది.కండల వీరుడూ...కాస్ట్లీ వాచ్బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రూ. 64.43 కోట్లు విలువైన పటేక్ ఫిలిప్ అక్వానాట్ హౌట్ జోయిలెరీ రెయిన్ బో జెమ్స్టోన్స్, డైమండ్స్ వాచ్ను ధరిస్తాడు. విలువైన రాళ్లతో కూడిన అద్భుతమైన ఇంద్రధనస్సుతో, ఈ చేతివాచీ అతని ఆడంబరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.పాండ్యా... వాచ్ ఇట్...ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పిచ్ మీద బ్యాట్తో తన ఆటతీరుకు మాత్రమే కాదు బయట తన విలాసవంతమైన జీవనశైలికి కూడా అంతే ప్రసిద్ధి చెందాడు. అతని పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ బాగెట్స్ చేతి వాచీ దర ఏకంగా రూ. 43.83 కోట్లు వజ్రాల ధగధగలతో ఇది మైదానంలో అతని బ్యాటింగ్ మెరుపుల్ని తలపిస్తుంది.రిచ్ దా...బాద్షా...భారతదేశపు ర్యాప్ స్టార్ బాద్షా ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ఫైవ్3–01 టూర్బిల్లాన్ పాబ్లో మాక్ డోనఫ్’’ లిమిటెడ్ ఎడిషన్ ను కలిగి ఉన్నాడు. ఇది అడ్వాన్స్డ్ డిజైన్స్ తో ఈ రూ. 24.85 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ వాచ్ అతని సంగీతం లాగే మహా బోల్డ్గా ఉంటుంది.యంగ్ టైగర్...వాచ్ కా షేర్...టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 40–01 మెక్లారెన్ స్పీడ్టైల్ ఆటోమేటిక్ టూర్బిల్లాన్ ’’ను కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 8.93 కోట్లు. రేసింగ్–ప్రేరేపిత డిజైన్ కలిగిన ఈ వాచీ ఆయన పవర్ ప్యాక్డ్, శక్తివంతమైన పెర్మార్మెన్స్కు సరిగ్గా నప్పుతుంది.→ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ పెర్పెచువల్ క్యాలెండర్ క్రోనోగ్రాఫ్ క్లాసిక్ వాచీని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ధరిస్తాడు. ఆయన దీని కోసం రూ. 6.48 కోట్లు ఖర్చు చేశాడు→ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగురంగుల రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా రెయిన్ బో వాచీని వినియోగిస్తాడు. దీని ధర రూ. 4.36 కోట్లు ఇది రోలెక్స్ అత్యంత అద్భుతమైన పీస్లలో ఒకటి.→ మరో ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ: రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్65–01 వాచీని వాడతాడు. దీని ధర రూ. 4.36 కోట్లు.→ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవెరోస్ వాచ్ ఖరీదు రూ. 4.25 కోట్లు.→ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్: జాకబ్ – కో. ఆస్ట్రోనోమియా సోలార్ కాన్సెటలేషన్స్ వాచీని వినియోగిస్తున్నాడు. దీని ధర రూ. 3.05 కోట్లు.→ గాయకుడు, నటుడు యో యో హనీ సింగ్ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 011 ఫెలిపే మాస్సా వాచీతో కనిపిస్తాడు. ఈ వాచీ ఖరీదు రూ. 2.18 కోట్లు.→ అంబానీల కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్67–02 బ్రాండ్ని ధరిస్తాడు. ఈ వాచీ విలువ రూ. 2.51 కోట్లు. -
ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
ఎప్పుడూ ఏదో ఒకరకమైన గొడవలతో మంచు ఫ్యామిలీ నిత్యం వార్తల్లో ఉండేది. కానీ, ఈ మధ్య సినిమాల అప్డేట్స్తో మాత్రమే వార్తల్లో నిలుస్తోంది. మొన్నామధ్య విష్ణు 'కన్నప్ప', నిన్న మనోజ్ 'మిరాయ్', నేడు లక్ష్మి, మోహన్బాబుల 'దక్ష' సినిమాల అప్డేట్స్ నడుస్తున్నాయి. చూస్తుంటే మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కన్నప్పలో విష్ణు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రిలీజ్కు రెడీ అయిన దక్షపుష్కరకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్కు మిరాయ్తో భారీ విజయం దక్కింది. మంచు లక్ష్మి కూడా తన తమ్ముళ్లలాగే మంచి హిట్ కొట్టాలన్న కసితో దక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఓ సీక్రెట్ను బయటపెట్టేసింది. అలా అనుకుంటే జీవితం నరకం'మనోజ్ కమ్బ్యాక్ నాకు ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తుంటాయి. అవి ముగిసిపోతే బాగుండు అని అందరూ అనుకుంటారు. కానీ, జీవితం ఇంతే అనుకుంటే నరకం.. జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. మనోజ్.. ఎంతో మనోవేదనను దాటుకుని ఇంతదూరం వచ్చాడు. అయితే మనోజ్కు, నాకు వయసవుతుంది.. కానీ, మా నాన్నకు వయసవ్వడం లేదు. ఆయన ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. లీక్ చేసిన మంచు లక్ష్మి(అంతలోనే నాలుక్కరుచుకున) అఫీషియల్గా వచ్చిందా? లేదా నేనే లీక్ చేశానా? సరే పోనీ.. నాని ఏమీ అనుకోడు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు.. తన లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. ఈ వయసులో చాలామంది యాక్టర్స్ ఏదో రెండు గంటలు పని చేసి, నేను ఇంతకంటే ఎక్కువ చేయను అని బిల్డప్ ఇస్తుంటారు.చాలాకాలం తర్వాత విలన్గాకానీ, నాన్నగారు అలా చేయరు. ఆయన సెట్స్కు వస్తే ఒక చిన్నబిడ్డలా ప్రవర్తిస్తారు. పెద్ద డైరెక్టర్ అయినా, కొత్త డైరెక్టర్ అయినా అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్' అని లక్ష్మీ మంచు చెప్పుకొచ్చింది. కాగా దసరా తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాలాకాలం తర్వాత ఈ సినిమా కోసం మోహన్బాబు విలన్గా నటించనున్నారని ప్రచారం జరిగింది. మంచు లక్ష్మి కామెంట్స్తో ఇప్పుడది నిజమని రుజువైంది.చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో కామనర్స్ కామన్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్లను ఓనర్లను చేయగానే నిజమైన ఓనర్లలా తెగ ఫీలైపోతున్నారు. టెనెంట్స్/సెలబ్రిటీలతో కావాల్సినన్ని పనులు చేయించుకుంటూ వారితోనే చీటికిమాటికి గొడవలు పడుతున్నారు. అలా ఈ వారం చాలా గొడవలు జరిగాయి. వాటన్నిటి లెక్కలు సరిచేసేందుకు శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చేశాడు.కామనర్స్కు క్లాస్ పీకిన నాగ్సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ మధ్య ఏర్పడిన విభేదాలను క్లియర్ చేశాడు. ఫ్రీ బర్డ్, బ్యాక్ బిచ్చింగ్ అనేవి తప్పు పదాలు కావని క్లారిటీ ఇచ్చాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. చివరకు ఆ తప్పును తనూజ మీదకే నెట్టేసిన కామనర్స్ ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు. అలాగే గుండు అంకుల్ కామెంట్పై పెద్ద చర్చే జరిగింది. ఇమ్మాన్యుయేల్ నిన్ను గుండంకుల్ అనడం తప్పే, మరి దానికంటే ముందు రెడ్ ఫ్లవర్ అని నువ్వు అనడం తప్పు కాదా? అని మాస్క్ మ్యాన్ హరీశ్ను నిలదీశాడు నాగ్.రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా?అందుకతడు తను దురుద్దేశంతో ఆ మాట అనలేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగైతే గుండంకుల్ కూడా సరదాగా అన్నాడనుకోవచ్చుగా అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్. అగ్నిపరీక్ష కోసం గుండు చేయించుకున్నా.. అలాంటిది నాపై జోక్ వేస్తే తీసుకోను, బార్డర్ క్రాస్ చేస్తే ఊరుకోను అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు హరీశ్. గుండంకుల్ అన్నందుకు ఇమ్మాన్యుయేల్తో సారీ చెప్పించుకున్నావ్.. మరి రెడ్ ఫ్లవర్ అన్నందుకు నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదా? అని ప్రశ్నించాడు. వీడియో బయటకు లాగిన నాగ్అప్పటికే ముఖంలో నెత్తురు చుక్క లేని హరీశ్ (Haritha Harish).. సారీ బ్రదర్, అవసరం అయితే ఈ షో నుంచి వెళ్లిపోతా అని అసందర్భంగా మాట్లాడాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా హరీశ్ గురించి ఓ వీడియో ప్లే చేశాడు నాగ్. అందులో హరీశ్.. 'ఇమ్మాన్యుయేల్ ఆడాళ్లతో అయితేనే మాట్లాడతా అన్నాడు. నేను ఇప్పుడు ముగ్గురు ఆడాళ్లతో మాట్లాడా.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి.. ఈ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకిప్పుడు అర్థమైంది' అని మాట్లాడాడు. ఇందులో ఆడాళ్లపై హరీశ్కు చిన్నచూపు ఉందని క్లియర్గా అర్థమైందని రీతూ తప్ప హౌస్ అంతా ముక్తకంఠంతో చెప్పింది.అడ్డంగా వాదించిన మాస్క్ మ్యాన్కానీ మోనార్క్ హరీశ్ మాత్రం.. ఆడాళ్లను తక్కువ చేయలేదన్నాడు. పైగా.. నాపై ఆరోపణలు చేసి నా క్యారెక్టర్ను రాంగ్గా చిత్రీకరిస్తున్నారు అని హౌస్మేట్స్తో పాటు నాగ్పైనా ఆవేశపడ్డాడు. ఆ మాటతో నాగ్.. ఎవరు రాంగ్ సెట్ చేస్తున్నారు? అని ఫైర్ అయ్యాడు. అక్కడున్న లైవ్ ఆడియన్స్ని అడగ్గా వారు కూడా.. హరీశ్ ఫ్లిప్ అవుతున్నాడని చెప్పడంతో మాస్క్ మ్యాన్ దండం పెట్టేశాడు. ఎవరెన్ని చెప్పినా హరీశ్ మాత్రం తలపొగరుతో తను చెప్పిందే కరెక్ట్ అని అడ్డంగా వాదించాడు.చదవండి: ‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్ -
Lilo And Stitch: ఏలియన్తో స్నేహం.. ఓటీటీలోకి గిలిగింతలు పెట్టించే మూవీ!
హేయ్ కిడ్స్...జియో స్టార్ లో ఓ సూపర్ మూవీ వచ్చిందోచ్. అదే లిలో & స్టిచ్. ఇదో సైంటిఫిక్ కామెడీ మూవీ. ఎర్త్ కి దూరంగా ఓ ప్లానెట్ లో ఏలియన్స్ ఓ ఎక్సపరిమెంట్ చేస్తుంటారు. దాంట్లో 626 అనే సూపర్ పవర్స్ ఉన్న ఏలియన్ ను క్రియేట్ చేస్తారు. అయితే యాక్సిడెంటల్ గా ఆ 626 ఏలియన్ ఎర్త్ మీద పడుతుంది. అది కూడా సరిగ్గా లిలో అనే పాప ఇంటి దగ్గర పడుతుంది. ఏలియన్ ప్లానెట్ హెడ్ ఈ 626 ని ఎర్త్ నుండి తీసుకురావడానికి మరో రెండు ఏలియన్స్ ని భూమి మీదకు పంపిస్తారు. అయితే ఈ లోపు పేరెంట్స్ ,ఫ్రెండ్సూ లేని లిలో కి 626 దొరికి మంచి ఫ్రెండ్ అవుతుంది.లిలో దానికి స్టిచ్ అని పేరు పెడుతుంది. లిలో & స్టిచ్ చేసే అల్లరి ఈ సినిమాలో సూపర్ హైలైట్. మరీ ముఖ్యంగా స్టిచ్ చేసే అల్లరి మిమ్మల్ని గిలిగింతలు పెట్టిస్తుంది. స్టిచ్ ని ఎత్తుకెళ్ళడానికి వచ్చిన ఇద్దరు ఏలియన్లు మనుషుల్లా మారి చేసే అల్లరి ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇంకో సూపర్ విషయం ఏంటో తెలుసా, ఈ సినిమాని రూ. 10 కోట్లు పెట్టి తీస్తే వచ్చిన వందల కోట్ల లాభాలు వచ్చాయి. సో కిడ్స్..హావ్ ఎ నైస్ జర్నీ విత్ లిలో & స్టిచ్ ఆన్ జియో స్టార్.- హరికృష్ణ ఇంటూరు -
‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్
‘‘ప్రస్తుతం థియేటర్స్ అన్నీ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా హిట్ అయింది. బెల్లంకొండ సాయి ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మా ‘మిరాయ్’ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నెక్ట్స్ ‘దక్ష’ చిత్రం రాబోతోంది. ఆ తర్వాత ‘ఓజీ’ మూవీ వస్తోంది. ఈ నెల మూవీ లవర్స్కు ఫీస్ట్లా ఉంటుంది. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అని హీరో మంచు మనోజ్ తెలిపారు. మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో, మంచు మోహన్బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దక్ష–ది డెడ్లీ కాన్సిపిరసీ’. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ప్రెస్మీట్కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది. మా నాన్న, అక్క కలిసి నటించిన ‘దక్ష’ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ–‘‘నాన్నగారి తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజ్. మనోజ్ హీరోగానే కాదు... విలన్గానూ మెప్పించగలడు, కామెడీ చేయగలడు. వర్సెటైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. మా ‘దక్ష‘ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ వాళ్లు పంపిణీ చేస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘దక్ష’ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. విష్ణు అన్న ‘కన్నప్ప’, మనోజ్ అన్న ‘మిరాయ్’ సక్సెస్ అయినట్లే లక్ష్మి అక్క ‘దక్ష’ కూడా విజయం సాధించాలి’’ అన్నారు వంశీకృష్ణ మల్లా. -
ఒకప్పుడు కల, నేడు కలిసిన వాస్తవం
ఒకప్పుడు తెరపై మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు నేడు మన చేతిలోకి వచ్చేశాయి. సారథిలేని రథాలు కలల దృశ్యాల్లో నడిచేవి. ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లు రోడ్ల మీదకు వచ్చేశాయి. పురాణాల్లో అక్షయపాత్ర కోరిన భోజనాన్ని వెంటనే వడ్డించేది. నేడు ఫుడ్ డెలివరీ యాప్లు దాదాపు అదే తీరులో పనిచేస్తున్నాయి. విలన్ కోటలోని మంత్రదర్పణం నిఘా సాధనంగా ఉంటే, ఇపుడు సీసీ కెమెరాలు ప్రతిచోటా కాపలా కాస్తున్నాయి.శాస్త్ర సాంకేతికతలు ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో సినిమాలు ప్రేక్షకులకు చూపిన అద్భుత స్వప్నాలివి. మానవ మేధ వీటిని ఒక్కొక్కటిగా సాకారం చేస్తూ, వాస్తవ జీవితంలోకి తీసుకొచ్చేసింది.ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు గాల్లో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతే, కార్లు డ్రైవర్ లేకుండా పరిగెత్తితే, గడియారం తిప్పగానే కాలంలో వెనక్కు వెళ్లిపోతే – థియేటర్లో కూర్చున్న మనకు ఒక్కటే అనిపించేది: ‘అయ్యో! ఇది కలల్లోనూ జరగదు.’ కాని, జీవితం కూడా ఒక సినిమా కథలాంటిదే కదా! అందుకే, ఆ కల్పనలు ఒక్కొక్కటిగా నిజం అవుతూనే ఉన్నాయి. నేడు స్మార్ట్వాచ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాం. తెరపై కనిపించిన మాయా అక్షయపాత్రలాగా, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ రూపంలో ఇంటి గుమ్మం వద్దకే పిజ్జా చేరుస్తోంది. వర్చువల్ కళ్లజోడు పెట్టుకుంటే మనం గదిలో కూర్చుని కూడా చంద్రుడి మీద నడుస్తున్నాం. మరమనిషి ఒకప్పుడు హీరోకి తోడుగా పోరాడితే, ఇప్పుడు మనకి ఇళ్లలో వాక్యూమ్ క్లీనర్ రూపంలో గచ్చు తుడుస్తోంది. మనుషులు, వస్తువులను మాయం చేసే అదృశ్యశక్తుల పరికరాల ఆవిష్కరణలు, ఇప్పుడు పరీక్షల్లో నిజమయ్యే ఫలితాలను చూపిస్తున్నాయి. మొత్తానికి, సినిమాల్లో కనిపించిన కలల గాడ్జెట్లు ఒక్కొక్కటిగా మన దగ్గరికి వచ్చి, మనల్ని బులిపిస్తున్నాయి, ఆశ్చర్య పరుస్తున్నాయి. రేపు తెరపై కనిపించే కొత్త గాడ్జెట్ ఏ రూపంలో మన ఇంటి లివింగ్ రూమ్లో దిగిపోతుందో! ఒకవేళ అలా దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.జెట్ప్యాక్ – థండర్బాల్ (1965)సినిమాలో హీరో జెట్ప్యాక్ వేసుకొని భవనం మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయి ‘ఇది అసలు సాధ్యమేనా?’ అనుకున్నారు. కాని, 1961లోనే అమెరికా రక్షణ పరిశోధన సంస్థ బెల్ ఏరోసిస్టమ్స్ కంపెనీతో కలిసి మొదటి జెట్ప్యాక్ను పరీక్షించింది. తర్వాత 2011లో ఫ్రాన్స్లో, 2019లో అమెరికాలో పర్యాటక ప్రదర్శనల్లో వాడారు. కొన్ని దేశాల సైన్యాలు కూడా శిక్షణలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నాయి. ఇంకా మన దగ్గరకు రాలేదు కాని, ఒకవేళ వస్తే? మొదటగా ట్రాఫిక్ దాటడానికి ఉపయోగించవచ్చు. లేజర్ కట్టర్ – గోల్డ్ఫింగర్ (1964)సినిమాలో హీరోను కుర్చీకి కట్టి, కింద నుంచి లేజర్ ఆన్ చేసే సన్నివేశం మరచిపోలేనిది. అప్పట్లో అది కత్తి కంటే భయంకరంగా అనిపించింది. ఆ కాలంలో లేజర్ టెక్నాలజీ కొత్తగా ఉండేది, ప్రజలు అద్భుతంగా భావించారు. కాని, 1960లో అమెరికా శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ మొదటి లేజర్ను రూపొందించారు. 1970ల నుంచి వైద్యరంగంలో కంటి శస్త్రచికిత్సలకు, 1980లలో పారిశ్రామిక రంగంలో లోహాలను కత్తిరించడానికి ఉపయోగించడం మొదలైంది. నేడు పచ్చబొట్లను తొలగించడం నుంచి ఎన్నోరకాల శస్త్రచికిత్సల వరకు లేజర్ వాడకం సాధారణంగా మారింది. రోలెక్స్ గాడ్జెట్ వాచ్ – లివ్ అండ్ లెట్ డై (1973)గడియారం అంటే అప్పట్లో సమయం చెప్పే యంత్రం మాత్రమే! కాని, బాండ్ వాచ్? శత్రువు బుల్లెట్లను దూరంగా తోసే మాగ్నెట్, తలుపులు తెరిచే లేజర్, అవసరమైతే విద్యుత్ షాక్ కూడా! అది చూసి, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పనులన్నీ మన వాచ్ కూడా చేస్తుంది. 1972లో హామిల్టన్ కంపెనీ మొదటి డిజిటల్ వాచ్ విడుదల చేసింది. 2010లలో యాపిల్, శాంసంగ్ స్మార్ట్వాచ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒకప్పుడు బాండ్ వాచ్ శత్రువులను ఎదుర్కొంటే, ఇప్పుడున్న వాచ్ అంతకంటే ఎక్కువ పనులే చేస్తుంది. అడుగులు లెక్కపెడుతుంది, నిద్ర కొలుస్తుంది, గుండె కొట్టుకోవడమే కాదు – ‘నువ్వు ఎక్కువగా కూర్చున్నావు, ఇక లే’ అని హెల్త్ అలర్ట్ కూడా ఇస్తుంది. సబ్మరైన్ కారు – ది స్పై హూ లవ్డ్ మీ (1977)బాండ్ లోటస్ కారు నీటిలోకి దూకి సబ్మరైన్ గా మారిపోతే థియేటర్లో చప్పట్లు మిన్నంటాయి. ఆ సమయంలో ఇలాంటిది ఊహించడమే గొప్ప. ఇప్పుడు చిన్న పర్సనల్ సబ్మరైన్ ్స ఉన్నాయి. 2008లో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ కారుకు ప్రేరణగా ఒక సబ్మరైన్ కారు ప్రాజెక్ట్ ప్రకటించాడు. చిన్నపాటి వ్యక్తిగత సబ్మరైన్లు ఇప్పటికే లగ్జరీ యాట్స్లో ఆటబొమ్మల్లా వాడుతున్నారు. మన దగ్గర అయితే? పెద్ద పెద్ద చేపలు పట్టి బజారులో అమ్మడానికి కూడా వాడుతున్నారు. కమ్యూనికేటర్ వాచ్ – డిక్ ట్రేసీ (1946)హీరో తన గడియారంలోనే ఫోన్ కాల్ మాట్లాడిన సీన్ అప్పట్లో ప్రేక్షకులకు అద్భుతం. చాలామందికి అది జాదూగా అనిపించింది. ఇప్పుడేమో మనకు స్మార్ట్వాచ్లు సాధారణమే. 1970లలో మొదటి వాచ్ రేడియో వచ్చింది. 2000ల తర్వాత స్మార్ట్వాచ్లు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు వాచ్తోనే వీడియో కాల్స్ కూడా చేయగలుగుతున్నారు. దీంతోనే జీపీఎస్ ఆధారంగా లొకేషన్ షేరింగ్, అలెర్ట్ బటన్స్ వంటివి కూడా ఉపయోగించుకోగలుగుతున్నారు.స్టార్ట్రెక్ కమ్యూనికేటర్ – స్టార్ట్రెక్ (1966)చిన్న పరికరంలా కనిపిస్తూ ఓపెన్ చేసే ఫోన్. అంటే మన ఆధునిక భాషలో ఫోల్డబుల్ ఫోన్. అప్పట్లో ఫోన్ మూసే శబ్దం ‘క్లక్!’ ఒక స్టయిల్ ఐకాన్గా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఆకట్టుకున్న విషయం. ఇప్పుడు మనకు టచ్ స్క్రీన్ ఫోన్లకు డిమాండ్ ఉన్నా, ఫ్లిప్ ఫోన్ డిజైన్కే క్రేజ్ ఉంది. ట్రైకార్డర్ – స్టార్ట్రెక్ (1966)ఒక చిన్న పరికరం శరీరాన్ని స్కాన్ చేసి ఆరోగ్య ఫలితాలు చెబుతుంది. అప్పట్లో అది అద్భుతం. కాని, 2017లో అమెరికా ‘క్వాల్కమ్ ట్రైకార్డర్ ఎక్స్ ప్రైజ్’ పోటీలో కొన్ని కంపెనీలు వాస్తవికంగా రోగ నిర్ధారణ చేసే స్కానర్లు అభివృద్ధి చేశాయి. ఇప్పుడు పోర్టబుల్ మెడికల్ స్కానర్లు సాధారణం అవుతున్నాయి. మన ఇంట్లో ఉంటూనే రోజూ స్కాన్ చేసి మన ఆరోగ్య విషయాలను తెలుసుకోవచ్చు. హోవర్బోర్డ్ – బ్యాక్ టు ది ఫ్యూచర్ 2 (1989)గాల్లో ఎగిరే స్కేట్బోర్డ్ అప్పట్లో కలలా కనిపించింది. 2015లో లెక్సస్ కంపెనీ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో హోవర్బోర్డ్ను ప్రదర్శించింది. ఇప్పుడు వాటిల్లో ఎన్నో ప్రోటోటైప్లు ఉన్నాయి, అయితే ఖరీదు ఎక్కువ. వినియోగం పరిమితం. మన దగ్గర ఉంటే? ఎక్కువగా వర్షకాలంలో గుంతలు దాటడానికి ఉపయోగిస్తామేమో! ఎలక్ట్రికల్ కారు, ఎగిరే కార్లు – బ్యాక్ టు ది ఫ్యూచర్ (1985)ఇంధనంతో నడిచే కార్లు కామన్ కాని, విద్యుత్ శక్తితో నడిచే కారు– అది కూడా అవసరమైనప్పుడల్లా గాల్లో ఎగురుతుంది. ఇది చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. కాని, ప్రపంచంలోనే మొదటి విద్యుత్ కారు 1880లలోనే తయారైంది! కాలక్రమంలో పెట్రోల్ చౌక కావడంతో దాదాపు శతాబ్దానికి పైగా అవి మూలపడ్డాయి. పూర్తిగా, 1996లో అమెరికా ‘జీఎం ఈవీ1’ అనే ఆధునిక ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చింది. 2008 తర్వాత టెస్లా రాకతో విద్యుత్ కార్లు మళ్లీ పుంజుకున్నాయి. భారత్లో 2010 తర్వాత టాటా, మహీంద్రా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి. 2021లో జపాన్ ‘స్కైడ్రైవ్’ కంపెనీ ఫ్లైయింగ్ కారును విజయవంతంగా పరీక్షించింది. ఒకవేళ మన దగ్గర వస్తే? ట్రాఫిక్ టెన్షనే ఉండదు.వాయిస్ కార్ (కిట్) – నైట్రైడర్ (1982)హీరో కారుతో మాట్లాడుతూ – ‘హే కిట్, రా!’ అని పిలిస్తే వెంటనే కారు వచ్చేది. ఇప్పటి సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ఇదే చేస్తున్నాయి. కాని, కొన్నిసార్లు ఇవి పొరపాటున తప్పు దారి చూపించడం మాత్రం ఇంకా మానలేదు. భారతీయ సినిమాలు ఎప్పటి నుంచో కేవలం వినోదం మాత్రమే కాదు, ఊహాశక్తికి అద్దం పట్టే వేదికలు కూడా. ఇక్కడ హీరో పాట పాడితే పూలు కురుస్తాయి, విలన్ చేతిలోంచి మంటలు ఎగసిపడతాయి, దేవతలు ఆకాశం నుంచి దిగిపోతారు. కాని, వీటన్నింటికంటే ఆసక్తికరమైనవి సినిమాల్లో కనిపించే గాడ్జెట్లు. ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు తెరిచిన మాయాపేటిక– ప్రియదర్శిని, ‘ఆదిత్య 369’లో టైమ్ మెషిన్, జగదేకవీరుడు అతిలోకసుందరిలో కనిపించిన శ్రీదేవి ఉంగరం. ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాయి. ‘ఇలాంటివి నిజంగా ఎప్పుడైనా వస్తాయా?’అనుకున్నారు. ఆ కలలే తర్వాత ఒక్కొక్కటిగా వాస్తవ రూపం దాల్చాయి.టైమ్ మెషిన్ – ఆదిత్య 369 (1991)బాలకృష్ణ టైమ్ మెషిన్ లో కూర్చుని గతానికి, భవిష్యత్తుకి వెళ్తాడు. ఈ కాలయానం ఇప్పటికీ పూర్తిగా ఊహే. కానీ 1905లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కాంతి వేగానికి దగ్గరగా వెళ్తే కాలప్రవాహం మారుతుందని నిరూపించారు. అంటే సినిమా కల్పన అయినా, దానికి శాస్త్రీయ పునాది ఉంది. భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అదృశ్య గడియారం – మిస్టర్ ఇండియా (1987)అనిల్ కపూర్ గడియారం పెట్టుకున్న వెంటనే కనబడకుండా పోతాడు. ఇది 2006లో అమెరికాలో శాస్త్రవేత్తలు మెటా పదార్థాలు వాడి చిన్న వస్తువులను అదృశ్యం చేయగలిగారు. 2015లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మరింత మెరుగైన ప్రయోగాలు చేసి, మరికొన్ని వస్తువులను అదృశ్యం చేయడాన్ని ప్రదర్శించింది. మాయాపేటిక – మాయాబజార్ (1957)ఘటోత్కచుడు పెట్టె తెరిస్తే ఎవరు కోరుకున్నవి వాళ్లకు కనిపిస్తాయి– బంగారం కావచ్చు, భోజనం కావచ్చు. ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే భోజనం మన ఇంటి తలుపు దగ్గరే! 2010 తర్వాత ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఈ కలను వాస్తవం చేశాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా అచ్చం ఆ పెట్టెలా – మనం ఏం కోరుకుంటామో, దాన్నే చూపిస్తుంది.మరమనిషి – రోబో (2010)రజనీకాంత్ ఈ సినిమాలో ‘చిట్టి’ పాత్రలో జనాలను మెప్పించారు. ‘చిట్టి’ చదివే, ప్రేమించే, కోప్పడే మరమనిషి. 2016లో హాంకాంగ్ ‘హాన్సన్ రోబోటిక్స్’ రూపొందించిన ‘సోఫియా’ రోబో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2021లో టెస్లా కూడా మానవాకార రోబో ప్రాజెక్ట్ను ప్రకటించింది. నేడు రోబోలు ప్రధానంగా పరిశ్రమల్లో, స్మార్ట్ హోమ్లలో సహాయకులుగా ఉన్నా, మన ‘చిట్టి’లా భావోద్వేగాలు పంచుకునే రోబోలు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు.భవిష్యత్ కళ్లజోడు – రావన్ (2011)ఈ సినిమాలో కళ్లజోడు పెట్టుకుంటే హీరో ఆటలోకి ప్రవేశిస్తాడు. 2012లో మొదటి వర్చువల్ రియాలిటీ పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని గేమ్స్, పాఠశాలలు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో వాడుతున్నారు.శక్తిమంతమైన దుస్తులు – క్రిష్ (2006)హీరో ప్రత్యేక దుస్తులు వేసుకున్న వెంటనే అద్భుత శక్తులు పొందుతాడు. 2013లో అమెరికా సైన్యం ‘ఎక్సోస్కెలిటన్ ’ సూట్లను అభివృద్ధి చేసింది. ఇవి ధరిస్తే భారాన్ని మోయడం సులభం అవుతుంది, ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. భవిష్యత్తులో ఇవి సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. మాయా పరికరం– జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)శ్రీదేవి దగ్గర ఉన్న మాయా ఉంగరం ఏ పనైనా ఇట్టే చేసేస్తుంది. 2007 తర్వాత స్మార్ట్ఫోన్లు మన జీవితంలోకి వచ్చి బ్యాంకింగ్, షాపింగ్, భోజనం ఆర్డర్, సంభాషణ – అన్నీ ఒకే పరికరంలో సాధ్యమయ్యాయి. సినిమాలో మాదిరే బటన్ నొక్కగానే ఇంట్లో తలుపులు తెరుచుకోవడం, భోజనం సిద్ధమవ్వడం, బట్టలు మడతవేయడం చూసి ప్రేక్షకులు ‘అరే వాహ్!’ అనుకున్నారు. కాని, నేడు మన ఇళ్లలోని వాషింగ్ మెషిన్ , డిష్ వాషర్, మైక్రోవేవ్, వాక్యూమ్ క్లీనర్ అన్నీ ఆటోమేటిక్. ఇంకా మొబైల్తో నియంత్రించే ‘స్మార్ట్ హోమ్’ అప్లికేషన్స్ ఎన్నో వచ్చేశాయి. ఒక్క సైగ చేస్తే లైటు వెలిగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది. సీసీ కెమెరా – రాక్షసరాజు, గజని గంధర్వుడుపాత సినిమాల్లో విలన్ కోటలోకి ఎవరెవరు వస్తున్నారో కనిపెట్టడానికి ఒక పెద్ద అద్దం ముందు కూర్చుని ‘సీసీ టీవీ’లా చూపించే సన్నివేశాలు గుర్తున్నాయా? అప్పట్లో అది మాంత్రిక ప్రభావంలా అనిపించింది. కాని, 1960లోనే మొదటి సీసీ కెమెరాలను జర్మనీలో సైనిక వినియోగానికి వాడారు. తర్వాత 1990లలో వాణిజ్య రంగంలోకి వచ్చి, 2000ల తర్వాత భారత్లో ఇళ్లలో, ఆఫీసుల్లో, రోడ్లపైకి కూడా విస్తరించాయి. ఇప్పుడు ఇవి లేకుండా భద్రత ఊహించలేము.హోలోగ్రామ్ సన్నివేశం – జీన్స్ (1998)హీరోయిన్ హోలోగ్రామ్ టెక్నాలజీని వినియోగించి సంగీతం, నృత్యం, కొన్ని విచిత్ర సందర్భాలు చూపిస్తూ నవ్వించే ప్రదర్శన ఇస్తుంది. ఆ హోలోగ్రామ్ సన్నివేశం అప్పట్లో కేవలం సినిమా మ్యాజిక్, స్పెషల్ ఎఫెక్ట్ మాత్రమే! కాని, హోలీగ్రామ్ టెక్నాలజీ నిజ జీవితంలో అంతకుముందే రూపుదిద్దుకుంది. 1960లో లేజర్ ఆవిష్కరణతో హోలోగ్రఫీ శాస్త్రానికి పునాది పడింది. 2012లో టుపాక్ షకూర్ అనే ర్యాపర్ మరణించినా, అతని హోలోగ్రామ్ ప్రదర్శన కోచెల్లా స్టేజ్పై ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ , ఎల్విస్ ప్రెస్లీ వంటి ప్రముఖుల ప్రదర్శనలకు కూడా హోలోగ్రామ్ను వినియోగించారు. నేడు హోలోగ్రామ్లు విద్య, వైద్యం, వ్యాపార సమావేశాలు, వర్చువల్ ఈవెంట్స్ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. ఇక భవిష్యత్తులో మన ఇళ్లలో, పెళ్లిళ్లలో, సమావేశాల్లో హోలోగ్రామ్ రూపంలో అతిథులకు ‘హాయ్!’ చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. డ్రైవర్ లేని కార్లు – శ్రీకృష్ణ పాండవీయమ్ (1966)ఘటోత్కచుడు తన మాయాశక్తితో రథాన్ని సారథి లేకుండానే నడిపిస్తాడు. ఇదే విధంగా మరెన్నో పాత చిత్రాల్లో రథం లేదా కారు దేవతా శక్తితో తనంతట తానే నడుస్తుంది. డ్రైవర్ లేని వాహనం అప్పట్లో కల్పన. 2010 తర్వాత గూగుల్, టెస్లా, ఊబెర్ వంటి కంపెనీలు అమెరికా, జపాన్ , యూరప్లలో స్వయంచాలిత కార్లను రోడ్లపై పరీక్షించాయి. 2020లలో కొన్ని నగరాల్లో టాక్సీ సర్వీసులుగా కూడా ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. నిన్న సినిమాల్లో కలలా కనబడినవి, నేడు శాస్త్రవేత్తల చేతుల్లో వాస్తవమయ్యాయి. రేపు మరెన్నో ఆవిష్కరణలతో, ఊహలకు కూడా అందని పరికరాలు జీవితంలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా రీల్ నుంచి రియల్కి ప్రయాణించే ఈ గాడ్జెట్ కథలు అంతులేని కథలా కొనసాగుతూనే ఉంటాయి! ఊహలకు అందని ఆవిష్కరణలు! భవిష్యత్తు ఊహలు ఇప్పటికీ తెరపై మాయాజాలంలా కనబడుతున్నా, రేపటికి అవి మన జీవితంలో రొటీన్ గా మారిపోవడం ఖాయం. ఒక టెలిపోర్టేషన్ మెషిన్ తో ఇంటి గుమ్మం నుంచి నేరుగా ఆఫీసు కుర్చీలో కూర్చోవచ్చు. అప్పుడు ట్రాఫిక్ అనే టెన్షన్ ఉండదు. మెమరీ ట్రాన్ ్సఫర్ గాడ్జెట్తో పరీక్ష ముందు రాత్రుళ్లు నిద్ర మానుకుని పుస్తకం చదవాల్సిన అవసరమే లేదు, సబ్జెక్ట్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు! ఆలోచన చదివే పరికరం మన మైండ్లో దాగి ఉన్న మాటల్ని బయటపెడుతుంది, అప్పుడు ‘ఏం అనుకుంటున్నావు?’ అనే ప్రశ్నే ఉండదు. రోబో–షెఫ్ మన ఇష్టం అడిగి భోజనం సిద్ధం చేస్తాడు, డ్రోన్లు కిరాణా వస్తువులను గుమ్మం ముందు పడేస్తాయి. నిద్రలో చూసిన కలలను కలల ప్రొజెక్టర్లో సినిమాలా తిరిగి చూడగలిగే రోజులు కూడా వస్తాయి. గాల్లో ఎగిరే మనుషుల్లా మారిపోతే, ట్రాఫిక్ను చరిత్రలోకి నెట్టేయవచ్చు. స్వయంచాలిత డ్రోన్ ప్యాకేజీలతో పాటు మనల్ని కూడా ఎయిర్టాక్సీలా తీసుకెళ్తాయి. ఇక ఇంట్లో పనులు? రోబో మేడ్స్, స్మార్ట్ ఫర్నిచర్ అన్నీ స్వయంగా చూసుకుంటాయి. నేడు ఇవన్నీ సైన్ ్స ఫిక్షన్ లా అనిపిస్తున్నా, నిన్న ఫోన్ లేకుండా ఊహించలేనట్టు, రేపు ఈ గాడ్జెట్లు లేకుండా కూడా జీవితాన్ని ఊహించలేకపోవచ్చు. -
పెళ్లి, తల్లి అయితే ఏంటి.. దూసుకెళ్తున్న హీరోయిన్లు!
హీరోయిన్ల కెరీర్ అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనే నానుడి ఇండస్ట్రీలో ఉంది. పెళ్లికి ముందు ఫుల్ క్రేజ్తో దూసుకెళ్లే నాయికల కెరీర్ మిసెస్ అయ్యాక జోరు తగ్గుతుందని, అవకాశాలు అరకొరగా వస్తాయని అంటుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ‘మిసెస్ అయితే ఏంటి?’ అని ఇండస్ట్రీ అనుకుంటోంది... పెళ్లయ్యాకా కెరీర్లో దూసుకెళ్లాలని హీరోయిన్లు అనుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత చాన్స్లు వచ్చినా అక్క, చెల్లి, వదిన... వంటి పాత్రలకే వారిని పరిమితం చేస్తుంటారనే వారూ ఇండస్ట్రీలో లేకపోలేదు. కానీ ఈ పరిస్థితి కూడా మారింది. ప్రస్తుతం మాత్రం పెళ్లి అయినా కెరీర్లో ఏ మాత్రం జోరు తగ్గకుండా దూసుకెళుతున్నారు పలువురు హీరోయిన్లు. మిసెస్ అయినా క్రేజ్, చాన్స్ల విషయంలో తగ్గేదే లే అంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా ఆయా భాషల హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగు పెట్టినా, తల్లిగా ప్రమోషన్ పొందినా అవకాశాల్లో మాత్రం జోరు చూపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్లో విజయవంతంగా దూసుకుపోతున్న హీరోయిన్లు ఎవరో ఓ లుక్ వేద్దాం. ఇష్టంతో... తెలుగు చిత్ర పరిశ్రమకు ‘ఇష్టం’తో (2001) వచ్చారు శ్రియ శరణ్. ఆ తర్వాత ‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, ఎలా చెప్పను, నేనున్నాను, ఛత్రపతి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు శ్రియ. అదే విధంగా మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారామె. కెరీర్ జోరుగా ఉన్న సమయంలోనే 2018 మార్చి 19న ఆండ్రీ కోస్చీవ్తో పెళ్లి పీటలెక్కారు శ్రియ. అయితే వివాహం తర్వాత కూడా ఆమె వరుస చాన్స్లు అందిపుచ్చుకున్నారు. 2021 జనవరి 10న ఓ ΄ాపకు జన్మనిచ్చారు శ్రియ. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఆమె 2022 నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన సూర్య ‘రెట్రో’ (ప్రత్యేక పాట) సినిమా మే 1న విడుదలైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ చిత్రం శుక్రవారం ΄ాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సజ్జా తల్లిగా అంబిక ΄ాత్రలో నటించారు శ్రియ. ఆమె ΄ాత్రకి మంచి ఆదరణ వస్తోంది. ఇంకా శ్రియ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. తన తొలి సినిమా (ఇష్టం) లానే కెరీర్ అంటే ఉన్న ఇష్టంతో సినిమాల్లో కంటిన్యూ కావాలనుకుంటున్నారు శ్రియ. జోరుగా చందమామ రెండు దశాబ్దాలుగా అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కాజల్ అగర్వాల్. ‘క్యూ! హో గయా నా’ (2004) అనే బాలీవుడ్ మూవీలో అతిథి ΄ాత్రలో కనిపించిన ఈ బ్యూటీ తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కళ్యాణం’ (2007) సినిమా ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. అయితే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ (2007) చిత్రంతో ఓవర్ నైట్ ΄ాపులర్ అయ్యారు కాజల్. ఆ సినిమా తర్వాత ఆమెని టాలీవుడ్ చందమామ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఆ తర్వాత తెలుగులో ‘మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్, సారొచ్చారు, నాయక్, బాద్షా, టెంపర్, ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారామె. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఈ బ్యూటీ 2020 అక్టోబరు 30న గౌతమ్ కిచ్లుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేశారు ఈ బ్యూటీ. 2022 ఏప్రిల్ 19న ఓ బాబుకి జన్మనిచ్చారు కాజల్. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఈ చందమామ సెకండ్ ఇన్నింగ్స్లోనూ మళ్లీ అదే జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ది ఇండియా స్టోరీ, రామాయణ: పార్ట్ 1, రామాయణ: పార్ట్ 2’ వంటి హిందీ మూవీస్తో పాటు ‘ఇండియన్ 3’ అనే తమిళ సినిమా చేస్తున్నారు. అదే జోరు చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా కెరీర్ని సొంతం చేసుకున్నారు నయనతార. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్ని సంపాదించుకున్నారామె. ‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్గా కంటిన్యూ అవుతున్నారు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ తానేంటో నిరూపించుకుంటున్నారు. హీరోయిన్గా జెట్ స్పీడ్లో దూసుకెళుతున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పెళ్లి పీటలెక్కారు నయన్. 2022 జూన్ 9న వీరి వివాహం జరిగింది. వారికి ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరీర్లో స్లో అయినప్పటికీ నయన్∙మాత్రం ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్నారామె. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అరడజనుకు పైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. బిజీ బిజీగా... ‘గిల్లి’ (2009) సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు రకుల్ప్రీత్ సింగ్. ‘కెరటం’ (2011) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారామె. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ (2013) సినిమాతో తెలుగులో తొలి హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. ఆ తర్వాత ‘లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి పలు హిట్ మూవీస్ చేశారు. తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన ఈ బ్యూటీ హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి, ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త, నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 2024 ఫిబ్రవరి 21న ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత కూడా వరుస చాన్స్లతో కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారామె. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మేరే హస్బెండ్ కి బీవీ’ చిత్రంతో సందడి చేశారు రకుల్. ప్రస్తుతం హిందీలో ‘దే దే ΄్యార్ దే 2, పతీ పత్నీ ఔర్ ఓ 2’ వంటి మూవీస్తో బిజీ బిజీగా ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్. అలాగే కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘ఇండియన్ 3’లో రకుల్ నటించారు. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. షార్ట్ బ్రేక్ తర్వాత... ‘అందాల రాక్షసి’ (2010) సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయమయ్యారు లావణ్యా త్రి΄ాఠి. ఆ తర్వాత ‘మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా’ వంటి పలు హిట్ మూవీస్లో యాక్ట్ చేశారామె. తెలుగులోనే కాదు... పలు తమిళ చిత్రాల్లోనూ నటించారు లావణ్య. 2023 నవంబరు 1న హీరో వరుణ్ తేజ్ని ప్రేమ వివాహం చేసుకున్నారు లావణ్య. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాలు చేశారు. లావణ్య నటించిన తమిళ చిత్రం ‘టన్నెల్’, తెలుగు సినిమా ‘సతీ లీలావతి’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అథర్వా మురళి, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్పై ఎ.రాజు నాయక్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా లావణ్యా త్రి΄ాఠి, దేవ్ మోహ¯Œ జంటగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(‘శివ మనసులో శృతి’) సినిమాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 10న లావణ్యా త్రి΄ాఠి ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుని, మళ్లీ సినిమాలతో బిజీ అవుతారని ఊహించవచ్చు. పెళ్లయిన వెంటనే ప్రమోషన్తో... ‘పైలెట్స్’ (2000) సినిమాతో బాలనటిగా మలయాళంలో అడుగుపెట్టారు కీర్తీ సురేశ్. 2013లో విడుదలైన ‘గీతాంజలి’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మలయాళ, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2016లో విడుదలైన ‘నేను శైలజ’ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యారామె. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్, ఉప్పు కప్పురంబు’ వంటి పలు సినిమాల్లో నటించారు. దివంగత నటి సావిత్రి బయోపిక్గా రూపొందిన ‘మహానటి’ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు కీర్తి. వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న ఆమె... తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ని 2024 డిసెంబరు 12న వివాహం చేసుకున్నారు. గోవాలో హిందు, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం హనీమూన్కి కూడా వెళ్లకుండా తాను కథానాయికగా నటించిన తొలి హిందీ చిత్రం ‘మేరీ జాన్’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో మెడలో పసుపుతాడుతో పాల్గొని, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. పెళ్లి తర్వాత కూడా కీర్తీ సురేశ్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నటించిన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ఈ ఏడాది జూలై 4న రిలీజ్ అయింది. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా, కన్నివెడి’ వంటి తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి. టాప్ ప్లేస్లో... బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ్ర΄ాజెక్టులను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె. ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక ΄ారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే ΄ాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా ఉంది. భలే జోరు... అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు ఆలియా భట్. ‘సంఘర్‡్ష’ (1999) సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసిన ఆమె ఇప్పటికీ కెరీర్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. హీరోయిన్గా బిజీ బిజీగా ఉన్న సమయంలోనే హీరో రణబీర్ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ 14న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే కెరీర్ కంటిన్యూ చేశారు ఆలియా. వరుస అవకాశాలు అందిపుచ్చుకుని తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ నిరూపించారామె. రణబీర్ కపూర్–ఆలియా భట్లకు రాహా అనే పాప ఉంది. 2022 నవంబరు 6న వీరు తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందారు. పాప పుట్టిన తర్వాత సినిమాలకు కొంచెం విరామం ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ బిజీ బిజీ అయ్యారు. వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆల్ఫా, లవ్ అండ్ వార్’ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే... 2022లో రిలీజైన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్కి జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక బ్రేక్ లేకుండా... హీరోయిన్ కియారా అద్వానీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం బాలీవుడ్లోనే కాదు... టాలీవుడ్లోనూ ఈ బ్యూటీకి యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఫగ్లీ’ (2014) అనే సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కియారా దశాబ్దానికి పైగా దూసుకెళుతున్నారు. మహేశ్బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో వరుస అవశాలతో దూసుకెళుతున్న సమయంలోనే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్నారామె. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు కియారా. ఆమె నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది జనవరి 10న, ‘వార్ 2’ మూవీ ఆగస్టులో విడుదలైంది. ఈ ఏడాది జూలై 15న ఒక పాపకు జన్మనిచ్చారామె. ప్రస్తుతం ఆమె చేతిలో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే కన్నడ– ఇంగ్లిష్ చిత్రం ఉంది. పెళ్లి, తల్లయిన కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నారు కియారా. అయితే ఇక బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. వీళ్లే కాదు... ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, కాజోల్, రాణీ ముఖర్జీ, జ్యోతిక, కత్రినా కైఫ్, విద్యాబాలన్, యామి గౌతమ్, మౌని రాయ్.. ఇలా పలువురు హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా అవకాశాలు అందుకుంటూ తమ జోరు చూపిస్తున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
ప్రభాస్గారి వాయిస్ మిరాయ్కి మంచి వెయిట్ : తేజ సజ్జా
‘‘మిరాయ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. వాళ్ళ ఆదరణ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నాను. ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శ్రియ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్’ పేరిట శనివారం చిత్రయూనిట్ నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో తేజ సజ్జా మాట్లాడుతూ–‘‘దర్శకుడు కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్గార్లు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. మా మీద విశ్వప్రసాద్గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. మంచు మనోజ్గారి రాకతో మా సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ‘మిరాయ్’ కథ ప్రభాస్గారి వాయిస్ ఓవర్తో ప్రారంభమవ్వడం వల్లే మా సినిమాకు వెయిట్ వచ్చింది. మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రభాస్, రానాగార్లకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సక్సెస్తో నా ఫోన్ మోగుతూనే ఉంది. నాకు ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసిన కార్తీక్కు రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. తమ్ముడు తేజ మంచి స్థాయికి వెళ్తాడు. మా అన్నతమ్ముళ్లు ఇద్దరి కోసం ప్రభాస్గారు నిలబడ్డారు (మంచు విష్ణు ‘కన్నప్ప’లో ప్రభాస్ కీలక పాత్రలో నటించారు). ఆయనకు థ్యాంక్స్’’ అని తెలిపారు మనోజ్ మంచు. ‘‘మిరాయ్’ నాలుగేళ్ల జర్నీ. తేజ అప్పట్నుంచి ట్రావెల్ అవుతున్నాడు. నన్ను నమ్మిన విశ్వప్రసాద్ గారికి, ఈ సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు దర్శకుడు కార్తీక్. ‘‘2024 మాకు అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మిరాయ్’ సక్సెస్ మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీ ఇచ్చింది. గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా తర్వాతి నాలుగు సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. మా అమ్మాయి కృతి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా తన జర్నీ మొదలుపెట్టి, ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్మ్ అని భావిస్తున్నాం’’ అని తెలిపారు. -
స్నేహితుల కథ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ‘హోమ్బౌండ్’ సినిమా థియేటర్స్లో విడుదలకు సిద్ధమైంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘హోమ్ బౌండ్’. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు. కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ శనివారం వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ ‘హోమ్ బౌండ్’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా చేశారు. అంతర్జాతీయ రిలీజ్ను మార్టిన్ పర్యవేక్షిస్తున్నారట. ఇక నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. -
క్లాసికల్ డ్యాన్సర్గా...
‘స్త్రీ 2’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించనున్న సినిమాపై అతి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విక్కీ కౌశల్తో ‘ఛావా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో శ్రద్ధా కపూర్ నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయని, ఈ చిత్రంలో క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటించనున్నారని టాక్. నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట దర్శకుడు లక్ష్మణ్. మరోవైపు ఈ సినిమా కోసం ప్రస్తుతం శ్రద్ధగా క్లాసికల్ డ్యాన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకునే పనిలో ఉన్నారట శ్రద్ధా కపూర్. మహారాష్ట్ర చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని ఈ చిత్రనిర్మాత దినేష్ విజన్ ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. -
ఎలిమినేషన్లో ట్విస్ట్.. 'పుష్ప' కొరియోగ్రాఫర్ ఔట్!
మొన్ననే బిగ్బాస్ 9 మొదలైంది. అప్పుడే మొదటి వీకెండ్ వచ్చేసింది. వారాంతం వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. నామినేట్ అయినవాళ్లలో కచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేసేస్తారు. అయితే ఈసారి సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో భరణి తప్పితే అందరూ నామినేషన్స్లో నిలిచారు. మరోవైపు సామాన్యుల నుంచి డీమాన్ పవన్ ఇందులో ఉన్నాడు. వీరిలో ఇద్దరు మాత్రం చివరి ప్లేసుల్లో నిలిచారు. ఇప్పుడు వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తేలింది.ఈ వారం నామినేట్ అయినవాళ్లలో లక్స్ పాప ఫ్లోరా సైనీ.. బయటకొచ్చేస్తుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే సంజనతో గొడవ పడటం తప్పితే ఈమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. అలా అని కెప్టెన్సీ టాస్క్లో ఏమైనా ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిందా అంటే అదీ లేదు. దీంతో ఈమెనే తొలివారం ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ 'పుష్ప' కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మీదే తప్పు షో నుంచి వెళ్లిపోతా.. నాగార్జునకు మాస్క్ మ్యాన్ ఝలక్)బిగ్బాస్ హౌసులోకి శ్రష్ఠి వర్మ వస్తుందని రూమర్స్ వచ్చినప్పడు.. ఈమె కచ్చితంగా కొన్నివారాలైనా సరే ఉంటుంది. తన జీవితంలో జరిగిన వివాదం గురించి ఎప్పుడైనా మాట్లాడకపోదా అని అందరూ అనుకున్నారు. అలానే షో మొదలైన రోజు నాగార్జునతో మాట్లాడుతూ.. మనం కలిసి సినిమా చేయాలి సర్ అని అడిగింది. దీంతో త్వరగా బయటకొచ్చేయ్ అని నాగ్ సరదాగా అన్నాడు. మరి ఈ మాటల్ని సీరియస్గా తీసుకుందో ఏమో తొలివారమే ఈమెని ఎలిమినేట్ చేసినట్లు అనిపిస్తుంది.సాధారణంగా తొలివారం ఎలిమినేషన్ అనగానే సీనియర్ నటుల్ని బయటకు పంపిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం అనుహ్యంగా యంగ్ బ్యూటీని ఔట్ చేయడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు బిగ్బాస్ కూడా ఊహలకు అందని విధంగా చేస్తుంటాడు. మరి ఈసారి అసలేం జరిగింది? అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?) -
ఓటీటీలోకి బోల్డ్ సిరీస్ కొత్త సీజన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలు, సిరీసులతో పాటు బోల్డ్, రొమాంటిక్ కంటెంట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆడియెన్స్ వీటిని కూడా చూస్తుంటారు. అందుకు తగ్గట్లు అప్పుడప్పుడు ఈ తరహా కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ సిరీస్కి రెండో సీజన్ తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడంతో పాటు ఓ పోస్టర్ కూడా వదిలారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి?(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) నాలుగు వేర్వేరు కథలతో 'ష్' అనే సిరీస్ని తమిళంలో తీశారు. గతేడాది దీన్ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. దీంతో కొన్ని నెలల క్రితం ఈ ఏడాదిలోనే తెలుగు డబ్బింగ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఆంథాలజీకి రెండో సీజన్ కూడా రెడీ చేశారు. సెప్టెంబరు 19 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.తొలి సీజన్లానే ఈసారి కూడా నాలుగైదు వేర్వేరు కథలు ఉండబోతున్నాయి. పోస్టర్ చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. తొలి భాగంలోని వాళ్లు కాకుండా ఈసారి జినాల్, ఉమ, ఐశ్వర్య దత్తా, వేదిక తదితరులు లీడ్ రోల్స్ చేశారు. తొలి సీజన్ విషయానికొస్తే ఇందులో లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని చూపించారు. స్కూల్ ఏజ్లో సె*క్స్ ఎడ్యుకేషన్, ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిస్తే, మిడిల్ ఏజ్ రొమాన్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ కుర్రాడు అమ్మాయికి ఆకర్షితుడై ఏం చేశాడు తదితర స్టోరీలతో ఈ సిరీస్ తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్లో తెలుగు హారర్ కామెడీ సినిమా) -
మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్
బిగ్బాస్ షోలో ఇప్పటివరకు 8 సీజన్లు జరిగాయి. ప్రతి వీకెండ్లోనూ వచ్చే నాగార్జున.. హౌస్మేట్స్ తప్పొప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్లతో మాట్లాడేవారు. చాలావరకు నాగ్ చెప్పిన దానికి వాళ్ల వైపు నుంచి సానుకూలంగా సమాధానం వచ్చేది. కొన్నిసార్లు మాత్రం హోస్ట్తో వాదించేవారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాగార్జున తనని తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తున్నారని మాస్క్ మ్యాన్ సీరియస్ అయిపోయాడు. దీంతో హరీశ్ vs నాగార్జున అన్నట్లు సాగింది.(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్?)శనివారం ఎపిసోడ్కి సంబంధించి ఇదివరకు ఓ ప్రోమో రిలీజ్ చేయగా అందులో సంజనకు నాగార్జున కౌంటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేయగా.. ఇమ్మాన్యుయేల్-హరీశ్ గొడవ గురించి మాట్లాడారు. ఇమ్ము.. సరదాకే గుండంకుల్ అని అన్నాడని ఎంతమంది అనుకుంటున్నారని అడగ్గా హౌసులోని అందరూ చేతులెత్తారు. దీంతో మాస్క్ మ్యాన్ హరీశ్దే తప్పు అన్నట్లు తేలింది. మరోవైపు ఇతడు.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి గురించి మాట్లాడిన ఓ వీడియోని స్క్రీన్ పై ప్రసారం చేయడంతో కొత్త వివాదం మొదలైంది.ఆ వీడియోలో మాస్క్ మ్యాన్ హరీశ్.. తనూజతో పాటు ఉన్న ఇమ్మాన్యుయేల్, భరణిని ఆడవాళ్లు అని పరోక్షంగా అన్నాడు. అయితే కావాలనే తనని తప్పుగా చూపిస్తున్నారని హరీశ్.. నాగార్జుననే నేరుగా అనేశాడు. నేను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నానా అని ఆశ్చర్యపోవడం నాగ్ వంతైంది. దీంతో ఈ గొడవకు సమాధానం చెప్పలేకపోయిన హరీశ్.. షో నుంచి క్విట్(వెళ్లిపోతా) అయిపోతా అని అన్నట్లు ప్రోమోలో చూపించారు. మరి నిజంగానే మాస్క్ మ్యాన్ని హౌస్ నుంచి బయటకు పంపేస్తారా? లేదంటే ఈ వివాదానికి ఎలా పుల్స్టాప్ పెడతారో చూడాలి?(ఇదీ చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?) -
ఓటీటీ ట్రెండింగ్లో తెలుగు హారర్ కామెడీ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. కూలీ, పరదా, సయారా, సు ఫ్రమ్ సో.. ఇలా చాలా హిట్ చిత్రాలు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ కూడా రీసెంట్గానే డిజిటల్గా అందుబాటులోకి వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల వచ్చే ఇబ్బందులు అనే కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?గత కొన్నేళ్లలో తెలుగులో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్.. లీడ్ రోల్ చేసిన సినిమా 'బకాసుర రెస్టారెంట్'. ఆగస్టు తొలివారం థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాంటిది నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. ఈ సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాంటిది ఈ చిత్రం ఇప్పుడు సదరు ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) 'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఉద్యోగం చేస్తుంటాడు కానీ వ్యాపారం చేయాలని కోరిక. దీంతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ మొదలుపెడతాడు. ఓ దెయ్యంపై తొలి వీడియో చేస్తే అది తెగ వైరల్ అవుతుంది. అలాంటిదే మరో వీడియో చేసేందుకు ఓ పాత బంగ్లాకు తన స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తాడు. కట్ చేస్తే బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.బక్క సూరి ఆత్మతో పరమేశ్వర్, అతడి స్నేహితులు ఆడుకునే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దీనికి ఆకలికి ఎక్కువ. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్) -
హృదయాలను హత్తుకునేలా ‘బ్యూటీ’ ట్రైలర్
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యూటీ’. ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. కథ, స్క్రీన్ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. యువ సామ్రాట్ నాగ చైతన్య విడుదల చేసిన ఈ ట్రైలర్.. హృదయాలను హత్తుకునేలా ఉంది.ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి పెట్టి వెళ్ళకు'.., 'నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా' అంటూ హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేశారు. స్కూటీ కొనిస్తాను అని తండ్రి మాట ఇవ్వడం, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్, 'క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్ లా ఉండాలి గానీ కలెక్టర్ లా ప్రామిస్ చేయొద్దు' అనే డైలాగ్ ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉంది.ఈ ట్రైలర్ లోని డైలాగ్స్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఫాదర్ డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఇక మ్యూజిక్, ఆర్ ఆర్, విజువల్స్ అయితే టాప్ నాచ్ గా ఉన్నాయి. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు నటించారు. -
రూట్ మార్చిన సంయుక్త.. జపనీస్ బ్యూటీలా మీనాక్షి
'జాతిరత్నాలు' ఫరియా వింటేజ్ పోజులుగ్లామర్ చూపిస్తూ రూట్ మార్చిన సంయుక్తమోడ్రన్ డ్రస్సులో మెరిసిపోతున్న శ్రీలీలపూల్లో తడిసిపోతూ నభా నటేశ్ స్టిల్స్జపనీస్ అమ్మాయిలా మీనాక్షి చౌదరిఇంగ్లీష్ బ్యూటీలా దక్ష నగర్కర్ స్టైలింగ్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
అవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది : సాయి దుర్గ తేజ్
‘సోషల్ మీడియాలో పిల్లల మీద అబ్యూజ్ చేస్తున్నారు. అలాంటి కామెంట్లు చేస్తే కూడా లైక్స్ చేస్తున్నారు.నవ్వుతున్నారు. అవన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకున్నామా?’ అని సాయి దుర్గతేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్లో జరిగిన ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ..సోషల్ మీడియాలో చిన్న పిల్లల మీద పిచ్చి కామెంట్లు చేస్తున్నా..అవి చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా అది తప్పని చెప్పడం లేదు. డార్క్ కామెడీ టాపిక్పై ఎవరైనా మాట్లాడాతారా? మీడియా స్పందిస్తుందా? అని నేను ఎదురు చూశాను. కానీ ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. ఇక ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అందుకే నేను ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను. డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది.. కానీ ఎదుటి వాళ్లని బాధ పెట్టే వరకు ఉండకూడదు.ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. ఇప్పుడంటే చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు.. కానీ నాకు మాత్రం మా అమ్మే ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు ఇలా అందరితో నేను సమయాన్ని ఎక్కువగా గడిపేవాడ్ని. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. నేను నా సెకండ్ క్లాస్లోని లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని నాకు ఆమె ఇచ్చారు. పేరెంట్స్తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలకు ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పే ప్రయత్నం చేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల్ని స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేయాలి.ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో బిజీగా మారిపోయారు. కనీసం వారంలో ఓ పూట అయినా మన ఫ్యామిలీతో కలిసి గడపాలి.. కలిసి మాట్లాడుకోవాలి. అందరికీ బాధ్యతల్ని నేర్పించాలి. సోషల్ మీడియాలో పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. సోషల్ మీడియా ఐడీలు తల్లిదండ్రుల నంబర్లకు కనెక్ట్ చేయడమో లేదా ఆధార్ కార్డ్కి లింక్ చేయడమో ఏదో ఒకటి చేయాలి’ అని సాయి దుర్గతేజ్ డిమాండ్ చేశారు. -
‘మంచు’ బ్రదర్స్కి అండగా ప్రభాస్.. మనోజ్ ఎమోషనల్!
ప్రభాస్ మంచితనం గురించి అందరికి తెలిసిందే. సాయం కోరి వస్తే.. తనకు సాధ్యమైనంతవరకు చేస్తాడని ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. తన వల్ల ఒక సినిమాకు హెల్ప్ అవుతుందని చెబితే.. ‘స్టార్’ హోదాని సైతం పక్కకు పెట్టి వస్తాడని ‘కన్నప్ప’తో నిరూపించాడు.(చదవండి: నా కుటుంబాన్ని నిలబెట్టారు, నాలో భయాన్ని చంపేశారు: మనోజ్ భావోద్వేగం)ప్రభాస్కి ఉన్న క్రేజ్కి ‘కన్నప్ప’లోని రుద్ర పాత్ర చాలా చిన్నదనే చెప్పాలి. కానీ మోహన్ బాబు, మంచు విష్ణుల కోసం ప్రభాస్ ఆ పాత్ర ఒప్పుకున్నాడు. ప్రభాస్ కనిపించినంత సేపు థియేటర్స్ ఊగిపోయాయి. ఆయన ఉండడం వల్లే కన్నప్ప తొలి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టగలిగింది. అయితే ఈ చిత్రానికి ప్రభాస్ కూడా ఒక్క రూపాయి పారితోషికంగా తీసుకోకపోవడం గమనార్హం. ప్రభాస్ స్థానంలో మరో ఏ హీరో ఉన్నా.. ఇలా ఒప్పుకునేవారు కాదేమో. ఈ విషయాన్ని మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు(చదవండి: రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన మిరాయ్.. తేజ కెరీర్లోనే అత్యధికం..)అలా కన్నప్పతో మంచు విష్ణుకి తోడుగా నిలిచిన ప్రభాస్.. ఇప్పుడు ‘మిరాయ్’తో తమ్ముడు మనోజ్కి అండగా నిలిచాడు. తేజ సజ్జ, మనోజ్ నటించిన ఈ చిత్రానికి ప్రభాస్ గాత్రదానం చేశాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన చిత్ర యూనిట్..రిలీజ్కి కొన్ని గంటల ముందు అఫిషియల్గా ప్రకటించింది. ప్రభాస్ వాయిస్ ఓవర్కి థియేటర్స్ దద్దరిల్లిపోతుండగా, సోషల్ మీడియా ఊగిపోతుంది. ఇలా అటు కన్నప్ప, ఇటు మిరాయ్ చిత్రాలకు తనవంతు సాయం అందించి, మంచు బ్రదర్స్కి రెబల్ స్టార్ అండగా నిలిచాడు. ఇదే విషయాన్ని మిరాయ్ సక్సెస్ మీట్లో మంచు మనోజ్ గుర్తు చేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘మా అన్నదమ్ములకు సపోర్ట్గా నిలబడినందుకు థ్యాంక్యూ సో మచ్ డార్లింగ్’ అంటూ ప్రభాస్కి కృతజ్ఞతలు తెలిపాడు. -
'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్
బిగ్బాస్ 9లో ఐదు రోజులు విజయవంతంగా పూర్తయింది. అలానే వీకెండ్ వచ్చేసింది. దీంతో హోస్ట్ నాగార్జున.. హౌస్మేట్స్ ముందుకు వచ్చేశారు. ఓవైపు అందరినీ సరదాగా నవ్విస్తూనే మరోవైపు తనదైన స్టైల్లో కౌంటర్స్ వేశారు. ఈసారి కెప్టెన్ సంజనకి కాస్త గట్టిగానే పంచులు పడ్డాయి. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోంది. మరోవైపు శనివారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందా అనేది ప్రోమోతో కాస్త క్లారిటీ ఇచ్చారు. వస్తూవస్తూనే అందరిని పలకరించిన నాగార్జున.. రాము రాథోడ్ బట్టలు ఉతకడం గురించి, ఇమ్మాన్యుయేల్.. హరీశ్ని గుండంకుల్ అనడం గురించి పంచులు వేశారు. అలానే సంజన.. ఫ్లోరా రిలేషన్ గురించి కల్పించుకోవడంపైన స్పందించారు.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రాము రాథోడ్కి తన రిలేషన్ టాపిక్ గురించి చెబుతుంటే మధ్యలో వచ్చిన సంజన.. తనని ఫ్రీ బర్డ్ అనడం అస్సలు నచ్చలేదని ఫ్లోరా, నాగార్జునకు కంప్లైంట్ చేసింది. తను చెబుతున్నప్పుడు సంజన మధ్యలో దూరడం కరెక్ట్ కాదనేది ఫ్లోరా వాదన. కానీ సంజన మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫ్రీ బర్డ్ అనడం తప్పెలా అవుతుందని అడిగింది. కెప్టెన్ అయిన తర్వాత సంజన.. తనకు కాఫీ ఇవ్వొద్దని హౌస్మేట్స్తో చెప్పిందని ఫ్లోరా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కాఫీ టాపిక్కే రాలేదని సంజన చెప్పింది గానీ మిగతా టీమ్ మేట్స్ మాత్రం సంజన అలానే అనిందని క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్ ఏదీ ఇవ్వకూడదని మిమ్మల్ని మందలించినప్పుడు రాముకి టీ ఇవ్వాలని మీరు ఎలా డిసైడ్ చేశారు? అని సంజనని నాగ్ అడిగాడు. ఇలా అడిగిన అన్ని ప్రశ్నలకు సంజన ఎలాంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. మూడేళ్ల తర్వాత
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్', 'కిష్కింధపురి' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అందుకు తగ్గట్లే ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ కూలీ, సయారా, సు ఫ్రమ్ సో, పరదా లాంటి హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలా వీకెండ్ని ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు మూవీ కూడా డిజిటల్గా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?)ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.. గతంలో ఓ సినిమాలో ప్రతినాయకుడిగా చేశారు. అదే 'పగ పగ పగ'. 2022 సెప్టెంబరు 22న ఇది థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ ఎవరూ లేకపోవడం, కథాకథనాలు ఓ మాదిరిగా ఉండేసరికి ఈ చిత్రంపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తర్వాత ఇన్నాళ్లకు ఆహా ఓటీటీ దీన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.'పగ పగ పగ' విషయానికొస్తే.. జగదీశ్ (కోటి), కృష్ణ (బెనర్జీ) రౌడీలు. జగదీశ్ చెప్పడంతో కృష్ణ, ఓ కుర్రాడిని హత్య చేస్తాడు. జైలుకెళ్లిన కృష్ణకి జగదీశ్ ధైర్యం చెబుతాడు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తాడు. కానీ కృష్ణ కుటుంబాన్ని జగదీశ్ గాలికొదిలేస్తాడు. మరోవైపు కృష్ణ కొడుకు అభి కాలేజీలో చదువుతుంటాడు. జగదీశ్ కూతురు సిరితో ప్రేమిస్తుంటాడు. కూతురి ప్రేమ విషయం జగదీశ్కి తెలుస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదని కూతురితో చెబుతాడు. దాంతో లేచిపోయి వెళ్లిపోయిన సిరి, అభిని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మిరాయ్'తో పోటీ.. 'కిష్కింధపురి' తొలిరోజు కలెక్షన్ ఎంత?) -
Heer Express: బాలీవుడ్లోకి వచ్చిన మరో ప్రేమ కథ
‘సైయారా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్లో మరో లవ్ స్టోరీ రిలీజైంది. అదే ‘హీరో ఎక్స్ప్రెస్’. ’ఓ మై గాడ్’, ‘102 నాట్ అవుట్’ ఫేం ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివిత జునేజా, ప్రిత్ కమాని హీరోహీరోయిన్లుగా నటించారు. అశుతోష్ రానా, గుల్షన్ గ్రోవర్, సంజయ్ మిశ్రా, మేఘనా మాలిక్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నిన్న(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే హిట్ టాక్ వచ్చింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. వంట చేయడంలో ఆసక్తిగల హీర్ వాలియా(దివిత జునేజా) అనే పంజాబీ అమ్మాయి, తన వంట నైపుణ్యాలతో ప్రపంచాన్ని జయించాలని కలలు కంటుంది. సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాలనే లక్ష్యంతో చెఫ్గా పనిచేయడానికి లండన్కు వెళ్తుంది. అక్కడ ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి, హీర్ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? అనేదే మిగతా కథ. ఫ్యామిలీ ఎమోషన్, వినోదం, క్యూట్ లవ్స్టోరీతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉందని బాలీవుడ్ రివ్యూస్ చెబుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఉమేష్ శుక్లా, ఆశిష్ వాఘ్, మోహిత్ ఛబ్రా, మరియు సంజయ్ గ్రోవర్ సంయుక్తంగా నిర్మించారు. సంపదా వాఘ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. -
సక్సెస్ చూసి 12 ఏళ్లు.. నా ఫ్యామిలీని నిలబెట్టారు: మనోజ్ ఎమోషనల్
విజువల్ వండర్గా తెరకెక్కిన మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ మూవీ తొలి రోజు రూ.27.20 కోట్లు రాబట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. శనివారం (సెప్టెంబర్ 13) ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. రుణపడి ఉంటా..ఇలాంటి సక్సెస్ మీట్లో పాల్గొని చాలాకాలమైందంటూ మనోజ్ (Manchu Manoj) భావోద్వేగానికి లోనయ్యాడు. సక్సెస్ వేదికపై నిలబడ్డందుకు సంతోషంగా ఉంది. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత నా ఫోన్ మోగుతోంది. అందరూ సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. కానీ, నాకు చాలాకాలమైంది. నిన్నటినుంచి అందరూ ఫోన్లు చేసి విషెస్ చెప్తుంటే అంతా కలలాగే ఉంది. దర్శకుడు కార్తీక్ ఏం ఆలోచించుకుని కథ రాసుకున్నారో కానీ నాకోసం ఓ పాత్ర రాసుకుని అడిగారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కమ్బ్యాక్ ఎప్పుడని అడిగేవారుఈ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని కార్తీక్ నాకు చెబుతూ ఉండేవాడు. ఆ మాట చాలనుకున్నాను. ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతూ ఉండేవాడిని. అప్పుడు సోషల్ మీడియాలో.. అన్నా, కమ్బ్యాక్ ఎప్పుడు? సినిమా చేయు, నీకు హిట్టు పడాలి, కమ్బ్యాక్ ఇవ్వు అని అడుగుతూ ఉండేవారు. వస్తున్నాను తమ్ముడు, త్వరలోనే చేస్తాను అనేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా లోపల మాత్రం ఏదో తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు దగ్గరివరకు వచ్చి వెళ్లిపోయాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరిగేది. నా కుటుంబాన్ని నిలబెట్టారుఇలాంటి సమయంలో డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్ నన్ను నమ్మారు. కార్తీక్లాంటి దర్శకుడు, టెక్నీషియన్ను నా జీవితంలో చూడలేదు. మిమ్మల్ని దగ్గరినుంచి చూసినందుకు సంతోషంగా ఉంది. మీరు నన్నొక్కడినే కాదు, నా కుటుంబాన్ని సైతం నిలబెట్టారు. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కానీ నాలో ఓ భయం ఉండేది. నేను పెరిగినట్లుగా నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా? వాళ్లను బాగా చూసుకోగలుగుతానా? అని రోజూ భయపడేవాడిని. ఆ భయాన్ని మీరు చంపేశారు. నేను గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి పాదాలకు నా వందనం అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు? -
'మిరాయ్'తో పోటీ.. 'కిష్కింధపురి' తొలిరోజు కలెక్షన్ ఎంత?
ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఒకటి తేజ సజ్జా 'మిరాయ్' కాగా.. మరొకటి బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కింధపురి'. అయితే ఈ రెండింటికీ యునానిమస్ హిట్ టాక్ ఏం రాలేదు. కొందరికి ఈ చిత్రాలు నచ్చగా.. మరికొందరు మాత్రం రెండూ యావరేజ్గానే ఉన్నాయని అంటున్నారు. కలెక్షన్ విషయానికొస్తే 'మిరాయ్'కి రూ.27.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అధికారికంగానే వెల్లడించారు.(ఇదీ చదవండి: Bigg Boss 9 డేంజర్ జోన్లో వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)మరోవైపు 'కిష్కింధపురి' టీమ్ నుంచి అధికారిక ప్రకటన అయితే ఏం లేదు. కానీ తొలిరోజు ఈ చిత్రానికి ఓ మాదిరి వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో మాత్రం ఈ చిత్రం రిలీజ్ కాగా.. దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కాస్తోకూస్తో ఎంటర్టైన్ చేస్తోంది. అయితే 'మిరాయ్' వల్ల కాస్త నంబర్స్ తగ్గొచ్చు గానీ 25వ తేదీ వరకు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం లేవు. ఇది 'కిష్కింధపురి'కి ఏమైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.'కిష్కింధపురి' విషయానికొస్తే.. రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి(అనుపమ) లవర్స్. ఓ సంస్థలో పనిచేస్తుంటారు. ఘోస్ట్ వాకింగ్ టూర్స్ పేరుతో కొందరిని హాంటెడ్ ప్లేసులకు పట్టుకెళ్తుంటారు. ఓ సందర్భంలో ఊరికి చివరలో ఉన్న 'సువర్ణమాయ రేడియో స్టేషన్'కి వెళ్లొస్తారు. అలా వెళ్లొచ్చిన 11 మందిలో ముగ్గురు చనిపోతారు. దీంతో అసలు ఎందుకు ఇలా జరుగుతుందా అని రాఘవ్ కనుక్కొనే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ రేడియో స్టేషన్లో ఉన్న దెయ్యం ఎవరు? చివరకు రాఘవ్ అతడితోపాటు వెళ్లిన వాళ్లు బతికారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?) -
'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?
గత నెలలో మంచి హైప్తో థియేటర్లలోకి వచ్చిన సినిమా 'కూలీ'. రజినీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్.. ఇలా చాలామంది స్టార్స్ ఉండేసరికి ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ మూవీ ఓ మాదిరిగా ఉండటం వాళ్లని నిరాశపరిచింది. అసలు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రం తీశాడా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆమిర్ కూడా ఈ సినిమాలో నటించానని తప్పు చేశానని అన్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ నిజమేంటి?'కూలీ'లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. క్లైమాక్స్లో దహా అనే రోల్ చేశాడు. అయితే ఇది కేవలం రజినీకాంత్ కోసమే చేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమిర్ చెప్పాడు. తీరా మూవీలో చూస్తే అది ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా, సీరియస్ సీన్లో ఆమిర్ కామియో మరీ కామెడీగా అనిపించింది. విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: Bigg Boss 9 డేంజర్ జోన్లో వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)అసలు విషయానికొస్తే రెండు మూడు రోజుల నుంచి బాలీవుడ్ మీడియాలో ఆమిర్-లోకేశ్ కనగరాజ్ చేయాల్సిన సూపర్ హీరో సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందనేది తెలియదు గానీ ఇప్పుడు ఏకంగా ఆమిర్ మాట్లాడినట్లు ఓ పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. 'కూలీలో నటించి పెద్ద తప్పు చేశా' అని ఆమిర్ అన్నట్లు అందులో రాసుకొచ్చారు. అయితే ఎక్కడ ఎప్పుడు ఆమిర్ ఇలా మాట్లాడారనేది వెతికితే మాత్రం అలాంటి సమాచారం కనిపించలేదు.అయితే ఈ రూమర్స్ని దళపతి విజయ్ ఫ్యాన్స్ కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారని ట్విటర్లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ని పోస్ట్ చేస్తున్నారు. తమిళంలో విజయ్-రజినీకాంత్ అభిమానుల మధ్య అప్పుడప్పుడు ఇలా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా విజయ్ ఫ్యాన్సే ఈ పుకారు సృష్టించారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: ‘మిరాయ్’పై మంచు విష్ణు ట్వీట్.. రిప్లై ఇచ్చిన మనోజ్!) -
సింహాలతో ఆటలాడిన బ్యూటీ.. ఇంత ధైర్యం ఎలా?
'ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు' అన్నది సినిమా డైలాగ్. ఎహె.. ఫ్లూటు ఊదడం కాదు, డైరెక్ట్గా వెళ్లి వాటితో ఆడుకుంటానంటోంది నటి వైగా రోజ్. థాయిల్యాండ్లో బ్యాంకాక్ ట్రిప్కు వెళ్లిన ఈ బ్యూటీ ఓ రెండు సింహాల దగ్గరకు వెళ్లి వాటిని నిమురుతూ సరదాగా ఆడుకుంది. సివంగిపై చేయి వేసి తను కూడా ఆడసింహంలా కెమెరాకు ఫోజిచ్చింది. సింహాలతో ఆటఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జైలర్కా హుకుం పాటను యాడ్ చేసింది. ఇది చూసిన అభిమానులు వీడియోలో మాకు మూడు సింహాలు కనిపిస్తున్నాయి, ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? సివంగిలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైగా రోస్.. అలెగ్జాండర్ ద గ్రేట్ మూవీతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆర్డినరీ, ఎన్ను నింటె మొయిదీన్ వంటి పలు చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు? -
'మహావతార్ నరసింహ' 50 రోజులు పూర్తి
'మహావతార్ నరసింహ' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్స్ నిండిపోయాయి. ఈ మూవీ ఆఫ్ సెంచరీ కొట్టడంతో డిలీటెడ్ సీన్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. ఇప్పటికీ ఎన్ని థియేటర్స్లలో రన్ అవుతుందో కూడా పేర్కొంది.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం 200 థియేటర్స్ పైగానే 50 రోజులు పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. ఆపై ఇప్పటి వరకు ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా బుక్మైషోలో రోజుకు సుమారు 10వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ 50రోజుల్లో బుక్మైషో ద్వారా సుమారు 67 లక్షలకు పైగానే టికెట్లు కొనుగోలు చేశారు. -
డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?
గంపెడాశలతో బిగ్బాస్ హౌస్కు వచ్చిన కంటెస్టెంట్లలో ఒకర్ని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, డిమాన్ పవన్, తనూజ, ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్లో ఉన్నారు.వీళ్లంతా కనిపించారువీరిలో అందరికంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు ఇమ్మాన్యుయేల్ (Emmanuel). ఓనర్ల (కామన్మ్యాన్)కు నచ్చిన వంటలు చేస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది తనూజ. కెప్టెన్సీ టాస్క్లో ఇరగదీశాడు రాము రాథోడ్. ఒక్క గుడ్డు దొంగిలించి హౌస్ను షేక్ చేసింది సంజనా. చివరకు తనను వ్యతిరేకించిన 14 మందిపై అజమాయిషీ చూపించే కెప్టెన్గా నిలించింది. గ్లామరస్ కంటెంట్నిచ్చే రీతూకు ఎలాగో బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఎపిసోడ్లో జాడ లేని కంటెస్టెంట్లుమిగిలిందల్లా డిమాన్ పవన్, శ్రష్టి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ (Flora Saini). సోషల్ మీడియా పోల్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన పవన్ హౌస్లో అప్పుడప్పుడు పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు. కాబట్టి కొన్నాళ్లు అతడిని ఉంచే అవకాశం లేకపోలేదు. ఇక శ్రష్టి, ఫ్లోరా ఎపిసోడ్లో పెద్దగా కనిపించడమే లేదు. ఫ్లోరా అయితే సంజనాతో గొడవైనప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది. బాత్రూమ్ క్లీన్ చేసే పని అప్పజెప్పడంతో రోజులో ఎక్కువభాగం ఆ వాషింగ్ ఏరియా దగ్గరే గడుపుతోంది.ఇలాగైతే ఎలిమినేషన్ ఖాయంఆమె నుంచి పాజిటివ్ లేదా నెగెటివ్.. ఎటువంటి వైబ్స్ రాకపోయేసరికి జనాలు తనను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఈ లెక్కన ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే అప్పుడే ఎలిమినేషన్ ఎందుకని నాగ్ (Nagarjuna Akkineni) కనికరించాడంటే మాత్రం ఈ వారం ఫ్లోరాకు గండం గడిచినట్లే! మరి నాగార్జున కనికరిస్తాడా? లేదంటే ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడనేది వేచి చూడాలి!చదవండి: ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
‘మిరాయ్’పై మంచు విష్ణు ట్వీట్.. రిప్లై ఇచ్చిన మనోజ్!
ఎంతో అన్యోన్యంగా ఉండే మంచు ఫ్యామిలీలో కొన్నాళ్ల క్రితం పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. మనోజ్పై తండ్రి మోహన్ బాబు కేసు పెడితే.. తండ్రి,అన్నయ్యలపై మనోజ్ కేసులు పెట్టాడు. మీడియా ముఖంగా దాడికి దిగారు. బౌన్సర్లను పెట్టుకొని హడావుడి చేశారు. కట్ చేస్తే..ఇప్పుడు అన్నదమ్ములిద్దరు కలిసిపోయినట్లు ఉన్నారు. ఒకరి సినిమాపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. ఆ మధ్య రిలీజైన కన్నప్ప సినిమాపై మనోజ్ ప్రశంసలు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సినిమా బాగుందని.. విష్ణు యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఇప్పుడేమో తమ్ముడు నటించిన మిరాయ్ సినిమాపై విష్ణు ట్వీట్ చేశారు.(‘మిరాయ్’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)సినిమా రిలీజ్ సందర్భంగా నిన్న(సెప్టెంబర్ 12) ‘మిరాయ్’ బృందానికి విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ దేవుని దయ మీపై ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్ చేశాడు. అన్నయ్య ట్వీట్కి తమ్ముడు మనోజ్ రిప్లై ఇచ్చాడు. మిరాయ్ యూనిట్ తరపున ‘థాంక్యూ సో మచ్ అన్న’ అంటూ మనోజ్ ట్విట్ చేశాడు. వీరిద్దరి ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని.. త్వరలోనే మంచు ఫ్యామిలీ ఒకటవ్వాలని కోరుకుంటున్నామంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించిన వెంకటేశ్, మహేశ్బాబు కలిసిపోయే ఎమోషనల్ సీన్కు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..‘అన్నదమ్ములు కలిసిపోయారు’ అని రీట్వీట్స్ చేస్తున్నారు.(చదవండి: బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు మిరాయ్ కలెక్షన్స్ ఎంతంటే?)ఇక మిరాయ్ విషయానికొస్తే.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటించగా, మనోజ్ విలన్ మహావీర్ లామా పాత్రను పోషించాడు. రిలీజ్ తర్వాత మనోజ్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మనోజ్ విలనిజం అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. హిట్ టాక్ రావడంతో తొలి రోజే రూ. 12 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. -
చాలా బాధపడ్డాను.. సోషల్మీడియాకు గుడ్బై చెప్పిన ఐశ్వర్య
మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్మీడియాకు గుడ్బై చెప్పేసింది. ఇకనుంచి తాను ఎలాంటి పోస్ట్లు. అభిప్రాయాలను తన ఖాతాలో పోస్ట్ చేయనని చెప్పింది. మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. థగ్ లైఫ్, మామన్, కింగ్ ఆఫ్ కొత్త, మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్-2 వంటి చిత్రాలతో ఆమె పాపులర్ అయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్తో సంబరాల ఏటి గట్టు చిత్రంలో ఆమె నటిస్తుంది.సోషల్మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఐశ్వర్య లక్ష్మి ఇలా చెప్పుకొచ్చింది. ' ప్రస్తుతం సినిమా అనే ఆటలో నేను ఉండాలంటే సోషల్ మీడియా చాలా ముఖ్యం. ఈ మాటకు నేను ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.., కాలానికి అనుగుణంగా మారడం అవసరమని నేను భావించాను. ఈ క్రమంలోనే ఏదో విధంగా కొన్ని అంశాల్లో సోషల్మీడియా నాకు అనుకూలంగా ఉంటుందని భావించాను. ఈ నిర్ణయమే అలవాటు పడేలా చేసింది. అయితే, అది నా పనిని పూర్తిగా డిస్ట్రబ్ చేసింది. నేను చేయాలనుకున్న పనులకు దూరం చేసింది. నాలోని దాగి ఉన్న నిజమైన ఆలోచనలను సోషల్మీడియా దోచుకుంది. నా చిన్న చిన్న ఆనందాన్ని కూడా దుఃఖంగా మార్చేసింది. నా భాషను, పదాలను దెబ్బతీసింది. నా బాల్య ఆనందాలన్నింటినీ తీసివేసింది. ఒక మహిళగా, సోషల్ మీడియా వల్ల వచ్చిన ఇబ్బందులను ఎదుర్కునేందుకు చాలా కష్టపడ్డాను. ఇంటర్నెట్ కోరుకునే ఊహలకు తగ్గట్టుగా నేను జీవించలేకపోతున్నాను. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లేని వారిని ప్రజలు నెమ్మదిగా మరచిపోతారని నాకు తెలుసు.. కానీ, నేను ఆ సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక నటిగా, మహిళగా, నేను సరైన నిర్ణయం ఎంచుకున్నట్లు అనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది.నాలోని కళాకారిణిని, నాలో దాగిన అమాయకత్వం, వాస్తవికతను నిలుపుకోవడానికి నేను ఇంటర్నెట్కు పూర్తిగా దూరంగా ఉంటాను. నేను సరైన దారిలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీని ద్వారా నా జీవితంలో మరింత బలమైన బంధాలు ఏర్పడుతాయనుకుంటున్నా.. ఎక్కువ సినిమాలలో నటించగలనని ఆశిస్తున్నాను. నేను మంచి సినిమాలు చేస్తూనే ఉంటా.. మునుపటిలాగా నన్ను ప్రేమతో గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. ప్రేమతో మీ ఐశ్వర్య లక్ష్మి.' అంటూ షేర్ చేసింది. View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
ఆ తెలుగు మూవీలో హీరోయిన్గా చేస్తానన్నా.. కాజల్కు ఇచ్చారు!
శివ మనసులో శృతి (2012) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ మద్దుగుమ్మ రెజీనా కసాండ్రా (Regina Cassandra). తొలి సినిమాతోనే బాగా క్లిక్ అవడంతో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. కొత్త జంట, రారా.. కృష్ణయ్య, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ, ఎవరు.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఆచార్య మూవీలో సానా కష్టం అనే స్పెషల్ సాంగ్లోనూ తళుక్కుమని మెరిసింది. హీరోయిన్ ఛాన్స్ అడిగాఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించిన రెజీనా ప్రస్తుతం మాత్రం తమిళ, హిందీ భాషల్లో బిజీ అయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రెజీనా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ అ సినిమా స్క్రిప్ట్ చెప్పారు. నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే చేస్తానన్నాను, లేదంటే అందులోనే బలమైన పాత్ర అడిగాను. అందుకాయన హీరోయిన్ పాత్ర కోసం అప్పటికే కాజల్ను సంప్రదించినట్లు చెప్పాడు. సరే, పర్లేదని మరో (మీరా) పాత్ర ఇవ్వమన్నాను. అది కూడా లేదంటే మాత్రం నేను సినిమా చేయనని తెగేసి చెప్పాను.జాట్లో ఆ పాత్ర కోసం అడిగారుజాట్ సినిమాలో గోపీచంద్ మలినేని నాకు పోలీసాఫీసర్ పాత్ర ఆఫర్ చేశాడు. కథ మొత్తం విన్నాక నాకు భారతి రోల్ ఇస్తేనే చేస్తానన్నాను. ఎందుకంటే అంతకుముందెన్నడూ అలాంటి పాత్ర చేయలేదు. అలా జాట్ సినిమాలో భారతిగా కనిపించాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా.. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 మూవీ చేస్తోంది. హిందీలో ద వైఫ్స్, సెక్షన్ 108 సినిమాల్లో నటిస్తోంది.చదవండి: హనుమాన్ రికార్డు బద్ధలు కొట్టిన మిరాయ్! ఫస్ట్డే కలెక్షన్స్ -
తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్లు.. గొప్ప చిత్రాన్ని కాపాడతారు: బెల్లంకొండ
‘‘కిష్కింధపురి’ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. గురువారం మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని, మొదలైన మా సినిమాకు 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్కు చేరువైంది. మా ‘కిష్కింధపురి’కి వారి ప్రేమ దక్కింది. ఈ ప్రేమ కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్ళు. గొప్ప చిత్రాన్ని కాపాడతారు’’ అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే కృషితో చేసిన సినిమా ‘కిష్కింధపురి’. సాహుగారు ఎంతగానో సపోర్ట్ చేసి, ఈ సినిమాను నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మేము అనుకున్నదానికంటే డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తోంది. మా బ్యానర్లో మంచి సినిమా పడింది’’ అని తెలిపారు సాహు. ‘‘ఫస్ట్ టైమ్ హిట్ కొట్టినప్పుడు ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ మూమెంట్స్ని నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను’’ అని పేర్కొన్నారు కౌశిక్. ‘‘ప్రేక్షకుల స్పందన మా సినిమాకు గొప్ప బలాన్నిచ్చింది’’ అని చెప్పారు చేతన్ భరద్వాజ్. -
బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు ఎన్నికోట్లంటే?
ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్ (Mirai Movie) మాత్రం తక్కువ బడ్జెట్తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. హీరోయిన్గా రితికా నాయక్, విలన్గా మంచు మనోజ్, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.ఫస్ట్డే కలెక్షన్స్సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది హనుమాన్ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ మొదటిరోజు రూ.25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ రికార్డును మిరాయ్ బద్ధలు కొట్టింది. మిరాయ్ మూవీ నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా మిరాయ్ నిలిచింది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. BRAHMAND DAY 1 💥💥💥27.20 Crores WORLDWIDE GROSS for #MIRAI ᴡɪᴛʜ ɴᴏʀᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 🔥🔥🔥Keep showering your love on #BrahmandBlockbusterMIRAI and experience it ONLY on the Big Screens ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star… pic.twitter.com/lvYrluMkZS— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 #SuperYodha is setting the box office on fire 🔥🔥🔥#Mirai North America Gross $700K+ & counting 🇺🇸❤️🔥❤️🔥❤️🔥Experience '𝗕𝗥𝗔𝗛𝗠𝗔𝗡𝗗 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥' in cinemas now 💥North America by @ShlokaEnts @peoplecinemas Superhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/zDHsgJiJjQ— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 Blockbuster Vibes & Grateful Smiles 🤩🤩🤩Team #MIRAI shares overwhelming joy for the BRAHMAND BLOCKBUSTER ❤️🔥❤️🔥❤️🔥Experience India's Most Ambitious Action Adventure Only On the Big Screens 💥💥💥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/OxOzGeWKbr— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 చదవండి: ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
ఎస్తర్ ప్రకటన.. రెండో పెళ్లి గురించేనా?
సినీ నటి ఎస్తర్ నోరోన్హ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఒక ఫోటోను షేర్ చేసి త్వరలో శుభవార్త చెబుతానంటూ పంచుకుంది. దీంతో అభిమానులు కూడా పెళ్లి గురించే ఉంటుంది అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.తెలుగులో 'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్ నోరోన్హ. ఆమె ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్ కాలనీ,డెవిల్,టనెంట్ వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్లో కూడా మెప్పించిన ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గతంలో తెలిపింది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్లేనని తెలుస్తోంది.కొత్త ప్రకటన అంటూ ఒక ఫోటోతో ఎస్తర్ ఇలా పంచుకుంది. 'జీవితంలో నాకు మరో అందమైన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. అవకాశాలతో పాటు ఎన్నో అద్భుతాలను ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పుట్టినరోజున నాపై మీ అందరూ ప్రేమతో ఆశీర్వాదాలను కురిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీతో ఒక "ప్రత్యేక ప్రకటన" పంచుకోబుతున్నాను. త్వరలోనే ప్రకటిస్తాను. దయచేసి వేచి ఉండండి.' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె రెండో పెళ్లి గురించి చెబుతుందని ఆందరూ ఆశిస్తున్నారు.రెండో పెళ్లి గురించి గతంలో ఎస్తర్ ఏం చెప్పిందంటే..టాలీవుడ్ సింగర్, నటుడు నోయల్ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తర్.. వారి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ తన గ్లామర్తో కుర్రకారును అదరగొట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎస్తర్ ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. అయితే, మేము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము. పెళ్లయిన 16 రోజుల తర్వాత అతనితో దూరంగానే ఉంటూ వచ్చాను. అలా 2020లో విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఒంటరిగా బతకాలని లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. నాకు అందమైన జీవితం కావాలి. అందుకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నాను. అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను.. అందులో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు దొరుకుతే సంతోషం. షోకేస్ లాంటి భర్త వద్దు.' అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Ester Valerie Noronha (@esternoronhaofficial) -
సిరిసిల్లవాసి.. బాలీవుడ్లో తిరుగులేని హీరోగా స్టార్డమ్
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు. మూకీ సినిమాలుఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.బాలీవుడ్లో రాణించిన తెలుగు వ్యక్తిమంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు. జీవితంపై డాక్యుమెంటరీనటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్ -
ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ కూడా!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపు ఉంటే, సంజనా ఒక్కరే మరోవైపు నిలబడింది. కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, మరికొన్నిసార్లు అమాయకంగా ముఖం పెడుతుంది. ఒక్కోసారి తనపై నోరుపారేసుకున్నవారిపై ఒంటికాలిపై లేస్తుంది. ఏదేమైనా బిగ్బాస్ షోకి కావాల్సిన కంటెంట్ మాత్రం బాగానే ఇస్తుంది. ఇప్పుడేకంగా ఫస్ట్ కెప్టెన్గా నిలిచింది.సత్తా చూపించిన రాముఅయితే ఈ కెప్టెన్సీ టాస్క్లో కామనర్లు అతి చేశారు. పవన్ కల్యాణ్ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీశ్.. నేను వేరే వాళ్లలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయేల్పై సెటైర్లు వేశాడు. ఎవరూ శ్రీజ నిల్చున్న రాడ్స్ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ, ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్! సంజనాకోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజనా కెప్టెన్ అయింది.బాడీ షేమింగ్నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్లు ఎన్ని మాటలంటున్నారు? నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సంజనా.. తన లగేజీకి రూమ్లోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకి చెప్తే తను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజనా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్ కోసం బిగ్బాస్ చాక్లెట్లు, చిప్స్ పంపిస్తే.. కామనర్లు ప్రియ, శ్రీజ వాటిని కొట్టేశారు. ముగ్గురు ఆడోళ్లుఒక్క గుడ్డు తిన్నందుకు ఆమెను రెండురోజులపాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీశ్.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఒకమ్మాయి, ఇద్దరు మగాళ్లు అనుకున్నా.. కానీ వాళ్లు ముగ్గురు ఆడోళ్లని ఇప్పుడే తెలిసింది. ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు.దొంగతనం చేసిన మాస్క్ మ్యాన్కెప్టెన్ సంజనా హౌస్మేట్స్కు బంపరాఫర్ ఇచ్చింది. తనను ఇంప్రెస్ చేస్తే కూల్డ్రింక్ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి? అనుకున్నాడో, ఏమో కానీ హరీశ్ ఓ కూల్డ్రింక్ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్ చేసేందుకు అందరూ స్కిట్ చేశారు. స్కిట్ చేసిన వాళ్లలో ఫలానా వాళ్లు బెస్ట్ అంటూ ప్రకటించింది. కానీ, అందరికీ కూల్డ్రింక్ ఇచ్చేముందు ఓ కూల్డ్రింక్ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీశ్ దాన్ని బయటపెడతాడా? లేదా? చూడాలి! -
సాయిపల్లవి చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్
కోలీవుడ్లో నటుడు శింబుది ప్రత్యేక స్థానం. విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నా, అపజయాలను ఎదుర్కొన్నా, ఆయన క్రేజే వేరు. 50 చిత్రాలకు చేరుకున్న ఈయన తాజాగా కొన్ని క్రేజీ చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ కథా చిత్రం అని చిత్ర వర్గాల సమాచారం. వెట్రిమారన్కు దర్శకుడిగా ఒక ప్రత్యేక బాణి ఉంది. ఆయన కథలన్నీ సమాజంలోంచి, ముఖ్యంగా అట్టడుగు జనాల జీవితాలను ఆవిష్కరించేవిగా ఉంటాయి. కాగా ఇంతకుముందు ధనుష్ హీరోగా ఉత్తర చెన్నై నేపథ్యంలో వడచెన్నై అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా తాజాగా మరోసారి అదే నేపథ్యంలో మరో కోణంలో శింబు హీరోగా చిత్రం చేస్తున్నారు. ఇది శింబు కథానాయకుడుగా నటిస్తున్న 49వ చిత్రం అవుతుంది. ఇందులో ఈయనకు జంటగా పూజాహెగ్డే నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్రలో సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ప్రస్తుతం హిందీలో ఏక్ దిన్ చిత్రాన్ని పూర్తి చేసి, రామాయణ 1, 2 చిత్రాలను చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె మళ్లీ తమిళంలో నటించనున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
కథ విని షాకయ్యా: రాజేంద్రప్రసాద్
‘‘దర్శకుడు చిరంజీవి ‘నేనెవరు?’ చిత్ర కథ చెప్పినప్పుడు షాకయ్యా. ఇంత గొప్ప కథను కరెక్ట్గా తెరకెక్కించగలడా? అని సందేహపడ్డాను. కానీ, షూటింగ్కి వెళ్లాక అతను ఎంత జీనియస్ అన్నది అర్థం అయింది. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. ఈ సినిమాతో వారికి మంచి విజయం సొంతం కావాలి. నేను నటించిన మంచి సినిమాల్లో ‘నేనెవరు?’ ఒకటిగా నిలిచిపోతుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తెలిపారు. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెవరు?’. సరికొండ మల్లికార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు–సకినాన భూలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు.హైదరాబాద్లో నిర్వహించిన ‘నేనెవరు?’ ఆడియో, టీజర్ లాంచ్ ఈవెంట్కి హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, దర్శకుడు వి.సముద్ర అతిథులుగా హాజరై, యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజేంద్రప్రసాద్ వంటి గొప్ప ఆర్టిస్టుతో ‘నేనెవరు?’ చిత్రం రూపొందించే చాన్స్ లభించడం మా అదృష్టం. దసరాకి మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.చదవండి: దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు -
'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్
'మిరాయ్' సినిమా మంచు మనోజ్ టాలెంట్ను బయటకు తెచ్చింది. తన సత్తా ఏంటో ఈ చిత్రంలో చూపించాడు. గతంలో ఆయన నటించిన చాల సినిమాలు ప్రత్యేక గుర్తింపును పొందాయని చెప్పవచ్చు. వేదం, నేను మీకు తెలుసా, ఒక్కడు మిగిలాడు, ప్రయాణం వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని తనలో మంచి నటుడు ఉన్నాడని ప్రేక్షకులకు తెలిపాడు. అయితే, కుటుంబంలో వివాదాలు, తన వ్యక్తిగత కారణాల వల్ల సరైన సినిమాలు చేయలేకపోయాడు. ఇప్పుడు మిరాయ్లో మహావీర్ లామా పాత్రలో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే తన అమ్మగారు నిర్మలా దేవి ఆనందంతో ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను మనోజ్ పోస్ట్ చేశారు.'మిరాయ్ విజయం మా అమ్మ అందరికంటే ఎక్కు గర్వంగా ఫీల్ అయింది. దీన్ని సాధ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా చుట్టూ ఉన్న నా ప్రియమైన వారితో ఇలా సంతోషాన్ని పంచుకోవడం మరింత చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ప్రతి సినిమా ప్రేమికుడికి మీరు చూపించే అపారమైన ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.' అని ఆయన తెలిపారు. మిరాయ్లో మంచు మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. మనోజ్ మాత్రమే చేయగలిగే పాత్ర అనేలా ఉంటుంది. ఈ సినిమా అతనికి మరిన్ని ఛాన్స్లు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు.మంచు కుటుంబంలో వివాదాల తర్వాత వారందరూ మళ్లీ కలిసిపోవాలని అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. మనోజ్ సోదరుడు మంచు విష్ణు కూడా మిరాయ్ యూనిట్ టీమ్ కోసం ఒక ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబం ఒక్కటి కాబోతుందని వారి అభిమానులు సంతోషిస్తున్నారు.My mom was the proudest 🙏🏼❤️ Thank u all for making this happen ♥️ Celebrating it with my dearest ones around me makes it even more memorable 🙌🏼My heartfelt thanks to each and every movie lover for the immense love 🙏🏻#Mirai #BlackSword pic.twitter.com/eJYQIWr7MU— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025 -
దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ బరేలీలోని తన నివాసం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కాల్పుల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు .అయితే, ఈ కాల్పులు తామే జరిపామని గోల్టీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. -
రామాయణ కంటే ముందే సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ..
హీరోయిన్ సాయిపల్లవి హిందీలో నటించిన తొలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్స్టోరీ చిత్రం ‘మేరే రహో’. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, అమ్మాయి ఓ రోజు విచిత్రకరమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు.ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అన్న కోణంలో ఈ ‘మేరే రహో’ సాగుతుందని బాలీవుడ్ సమాచారం. తొలుత ఈ సినిమాకు ‘ఏక్ దిన్’ అనే టైటిల్ అనుకున్నారు. నవంబరులో రిలీజ్ ప్లాన్ చేశారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా కాకుండా హిందీలో ‘రామాయణ’ సినిమాలో సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. -
స్టంట్ స్టార్ట్
కమల్హాసన్ కొత్త చిత్రం ప్రారంభమైంది. కమల్హాసన్ కెరీర్లోని ఈ 237వ సినిమాతో ‘కేజీఎఫ్, ఖైదీ, అమరన్, కల్కి 2898 ఏడీ’ వంటి సూపర్హిట్ సినిమాలకు పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు–అరివు ద్వయం దర్శకులుగా పరిచయం అవుతున్నారు. 2024 ప్రారంభంలోనే ఈ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సెట్స్కు వెళ్లలేదు.కాగా ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయని, ‘ప్రేమలు, రైఫిల్క్లబ్’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్గా పని చేసిన శ్యామ్ పుస్కరన్ ఈ సినిమాకు అసోసియేట్ అయ్యారని చిత్రయూనిట్ శుక్రవారం అధికారికంగా పేర్కొంది. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే... ఫైట్ మాస్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం యాక్షన్ ప్రాధాన్యంగా ఉంటుందని, కమల్ రిస్కీ స్టంట్స్ చేయనున్నారని కోలీవుడ్ టాక్. -
శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ.. వేకేషన్లో హంసానందిని చిల్!
వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ సిమ్రత్ కౌర్.. 8 హీరోయిన్ అనంతిక సనీల్కుమార్ స్మైలీ లుక్స్... బ్లాక్ బ్యూటీ శృతిహాసన్ హోయలు.. వేకేషన్లో ఫుల్గా చిల్ అవుతోన్న హంసానందిని.. శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్.. View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Surveen Chawla (@surveenchawla) -
30 ఏళ్లకే తల్లి పాత్రలా?.. ఛావా నటి ఆవేదన
ఈ ఏడాది ఛావా, ఆజాద్ చిత్రాలతో మెప్పించిన బాలీవుడ్ డయానా పెంటీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళలను ట్రీట్ చేసే విధానంపై స్పందించారు. ఇండస్ట్రీలో మహిళలను సామర్థ్యం కంటే.. కేవలం బాహ్య రూపానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. కేవలం 30 ఏళ్ల వయసులేనే ఎంతోమంది పిల్లలకు తల్లిగా నటించే పాత్రలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డయానా మహిళా నటుల పట్ల చిత్ర పరిశ్రమ వైఖరిని ప్రశ్నించింది.డయానా మాట్లాడుతూ.. 'ఉదాహరణకు ఒక వేదికపై మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు.. మీ అందం మీరు అద్భుతం ప్రశంసిస్తారు. ప్రజలు మర్యాదగా ప్రవర్తిస్తూ మీ రూపాన్ని ప్రశంసించడం చాలా బాగుంది. కానీ ఒక మహిళగా అది అంతకు మించి ఉంటుందని ఆశిస్తారు. ఒక నటిగా కేవలం అందం మాత్రమే కాకుండా.. నైపుణ్యం, నటనతో ప్రసిద్ధి చెందగలమని ఆశిస్తాం. అది మాకు చాలా అవసరం కూడా. మహిళ నటులను కేవలం బ్యూటీఫుల్, అద్భుతం అని పిలవడం మంచిదే.. కానీ అది సరిపోదు. ఇది ఒక పోరాటం కాదు. కొంతకాలంగా ఒక ఈ పద్ధతిని అంగీకరించడం ప్రారంభించారు. నేను అలాంటి దానిలో భాగం కావాలా వద్దా అనేది నా సొంత నిర్ణయం. దీన్ని ఎదుర్కోవడానికి అదే ఉత్తమ మార్గం. ఇది నాకు మాత్రమే కాదు.. అందరికీ వర్తిస్తుంది' అని పంచుకున్నారు.కాగా.. డయానా ప్రస్తుతం 'డు యు వాన్నా పార్టనర్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో తమన్నా భాటియా, జావేద్ జాఫెరి, నకుల్ మెహతా, శ్వేతా తివారీ, నీరజ్ కబీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్కు కోలిన్ డి'కున్హా, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సహ నిర్మాతలుగా ఉన్నారు. ప్రస్తుతం డు యు వన్నా పార్టనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
'పవన్ కల్యాణ్ అభిమాని చీప్ కామెంట్స్'.. గట్టిగా ఇచ్చిపడేసిన రేణు దేశాయ్!
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఆమె చివరిసారిగా మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటోంది. ముఖ్యంగా వన్యప్రాణుల విషయంలో పోరాటం చేస్తోంది. అలాగే మూగజీవాలను ఎవరైనా హింసించినా వెంటనే సోషల్ మీడియా రియాక్ట్ అవుతుంది రేణు దేశాయ్.ఇదిలా ఉంచితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్గా మారింది. పవన్ కల్యాణ్ అభిమాని కామెంట్ చూసిన రేణు దేశాయ్.. తనదైన స్టైల్లో ఇచ్చిపడేసింది. మీ పక్కన పవన్ కల్యాణ్ కాకుండా మరొకరిని ఊహించుకోలేమని అభిమాని ఇన్స్టాలో కామెంట్ చేశాడు. ఇది చూసిన రేణు దేశాయ్ సుదీర్ఘమైన పోస్ట్తో దిమ్మదిరిగేలా రిప్లై ఇచ్చింది. రేణు దేశాయ్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఈ అబ్బాయి/అమ్మాయి కొంతవరకు చదువుకున్న వారిలా ఉన్నారు. అందుకే స్మార్ట్ఫోన్లో సొంత ఇమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుని.. తన పోస్ట్పై కామెంట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినట్లున్నాడు. మనమందరం ఇప్పుడు 2025లో ఉన్నాం. కానీ పితృస్వామ్యం ఎంతగా పాతుకుపోయిందంటే.. నేటికీ చాలా మంది ప్రజలు ఆమెకు స్వంత స్వేచ్ఛా సంకల్పం లేకుండా స్త్రీ కేవలం తండ్రి లేదా భర్త ఆస్తి అని నమ్ముతారు. . నేటికీ మహిళలకు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అనుమతి అవసరం. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు స్త్రీ స్థానం వంట చేయడం, పిల్లలకు జన్మనివ్వడం వంటగదికే పరిమితమని భావిస్తారని' కౌంటరిచ్చింది.రేణు దేశాయ్ ఇంకా రాస్తూ.. 'నేను ఇలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా.. నా స్వరం వినిపించడానికి.. నా స్నేహితులు, అనుచరులు నా గురించి ఏమనుకుంటారో అని భయపడకుండా ఉండటానికి ఇష్టపడతాను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పులకు మార్గం సుగమం చేయడానికి ఒక స్త్రీగా, ఒక ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తున్నా. స్త్రీవాదం అంటే వారాంతాల్లో తాగి తిరగడం కాదు.. మహిళలను పశువులు, ఫర్నిచర్లా చూసే ప్రాథమిక మనస్తత్వం ఉన్న మూలాలను ప్రశ్నించడం! రాబోయే కొద్ది తరాల్లోనే స్త్రీలు విశ్వంలో తమదైన ఉన్నత స్థానాన్ని కనుగొంటారని.. తల్లి గర్భంలో స్త్రీగా పుట్టినందుకు, పరువు హత్యలు, వరకట్న మరణాల కోసం చంపబడరని ఆశిస్తున్నా' అని తనపై కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ అభిమానికి ఘాటుగానే ఇచ్చిపడేసింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.. ఆత్మకథ ఆవిష్కరణలో బ్రహ్మనందం
టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ బయోగ్రఫీని బుక్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మీ అండ్ మై పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పుస్తకం రాసేందుకు ఎందరో నాకు స్పూర్తినిచ్చారని అన్నారు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని.. లెక్చరర్గా పనిచేశాకే.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. నటరాజ ఆశీర్వాదంతో 1200 సినిమాల్లో నటించానని వెల్లడించారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..' నేనెందుకు ఆత్మకథ రాశాను అనేది పెద్ద ప్రశ్న. నాకు ఎటువంటి పొలిటికల్, ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశా. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. బురద నుంచి కమలం పుడుతుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. నాకు వెంకయ్య నాయుడు ఎంతో స్పూర్తి. ఈ మధ్య గ్లోబల్ కమెడియన్ అవార్డ్ ఇచ్చారు. మీమ్స్ బాయ్గా కూడా మార్చారని' అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..' యువకుడిగా ఉన్నపుడు రాజకీయాల్లోకి వచ్చా. నాకు మీడియాతో ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రహ్మానందం జీవిత చరిత్ర పుస్తకం హిందీ, ఇంగ్లీష్లో విడుదలైంది. భారత దేశ చలనచిత్రలో ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం. స్క్రీన్పై ఆయన కనిపిస్తే అందరూ ఆనంద పడేస్తారు. ఎప్పటికీ అందరికీ బ్రహ్మానందం ఫేవరేట్. ఆయన సినిమాలు చూస్తే జనం ఎంజాయ్ చేస్తారు. ఇండియన్ స్క్రీన్ ప్రతిఒక్కరూ మాతృ భాషను నేర్చుకోవాలి, ఆదరించాలి, దాంతో పాటూ ఇతర భాషలు నేర్చుకోవాలి. దేశంలో ఎక్కువ మందికి చేరువ కావాలంటే హిందీ భాష అవసరం. ప్రపంచవ్యాప్తంగా చేరువ కావాలంటే ఇంగ్లీష్ అవసరం. భారత అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు తట్టుకోలేక పోతున్నాయి. ప్రపంచంలో రెండో ఆర్థిక దేశంగా 2035 నాటికి ఇండియా ఎదగటం ఖాయం' అని అన్నారు. Pleased to launch the autobiography of renowned film comedian & Padmashri awardee, Shri Brahmanandam Me and मैं in English & Hindi at the Foreign Correspondents Club of South Asia in New Delhi this evening. Shri Brahmanandam’s long career in movies spanning more than 3 decades… pic.twitter.com/xrf1y7mqpn— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 12, 2025 -
పొంగల్కు పెరుగుతోన్న పోటీ.. రేసులో శ్రీలీల చిత్రం!
టాలీవుడ్ సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజే వేరు. అంతేకాదు ఈ పండుగకు రిలీజ్కు పెద్దఎత్తున పోటీ ఉంటుంది. దాదాపు ఏడాది ముందు నుంచే ప్లాన్ చేస్తారు మేకర్స్. సినీ ఇండస్ట్రీలో అంతలా డిమాండ్ ఉన్న ఫెస్టివల్ ఇదొక్కటే. ఇప్పటికే టాలీవుడ్ నుంచి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, మెగాస్టార్ చిరంజీవి మనశివశంకర వరప్రసాద్ గారు చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటితో పాటు ప్రభాస్ ది రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు సైతం పొంగల్ పోటీకి సై అంటున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి విజయ్ మూవీ జన నాయగన్ సైతం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.ఇంతలా పోటీ ఉన్న పొంగల్కు మరో చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే మదరాసితో ఆకట్టుకున్న శివ కార్తికేయన్ మూవీ పరాశక్తి సైతం సంక్రాంతి పోటీకి సై అంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ రెడ్ జైయింట్ మూవీస్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలకు సైతం పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇంకా సమయం ఉండడంతో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.కాగా.. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. பராசக்(தீ) பரவட்டும்🔥🔥 A stunning ride through history awaits#Parasakthi in Theatres from 14th January 2026@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @redgiantmovies_ @Aakashbaskaran @sreeleela14 @dop007 @editorsuriya @supremesundar… pic.twitter.com/SdgUEdwQCK— Red Giant Movies (@RedGiantMovies_) September 12, 2025 -
దృశ్యం-3 మూవీ.. ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు: డైరెక్టర్
మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం.. అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో దృశ్యం-3 కూడా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ పూర్తయిందని తెలిపారు.అయితే దృశ్యం-3 మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని జీతూ జోసెఫ్ తెలిపారు. అయితే ఆడియన్స్కు మాత్రం గట్టి ఝలక్ ఇచ్చారు. ఈ మూవీపై మొదటి రెండు పార్ట్స్లా ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ సినిమా నుంచి ఎక్కువగా ఆశించవద్దని కోరారు.జీతూ జోసెఫ్ మాట్లాడూతూ.. 'రెండవ భాగం దృశ్యం-2లా ఈ సినిమాను ఆశించవద్దు. అలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే నిరాశ చెందుతారు. ఇప్పుడు రాబోయే భాగం 'దృశ్యం' చిత్రాల మైండ్ గేమ్కు భిన్నంగా ఉండనుంది. దృశ్యం 3 కథాంశాలపై తక్కువ దృష్టి సారించి.. కథలోని మెయిన్ పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టాం. దృశ్యం 1, 2 సినిమాలతో నేను సంతోషంగా ఉన్నా. 'దృశ్యం 3' కూడా మంచి సినిమా అవుతుంది. బాక్సాఫీస్ గురించి నాకు తెలియదు'అని వివరించారు. ఈ మూవీతో పాటు జీతూ జోసెఫ్ మరో రెండు ప్రాజెక్టులను తెరెకెక్కిస్తున్నారు. ఆయన డైరెక్షన్లో వస్తోన్న మిరాజ్ ఈనెల 19న విడుదల కానుంది. అంతేకాకుండా జోజు జార్జ్తో 'వలతు వశతే కల్లన్' ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. -
'పరదా' పవర్ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమక్ష ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే, ఈ మూవీలో ప్రేక్షకులను మెప్పించిన ఒక వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేశారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' అంటూ సాగే ఈ పాట ఆందరినీ ఆలోచింపజేస్తుంది. వనమాలి రిచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. -
'మిరాయ్' స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్.. చాలా తక్కువే
తేజ సజ్జా (Teja Sajja), మంచు మనోజ్ (Manchu Manoj) కాంబినేషన్లో తాజాగా విడుదలైన చిత్రం మిరాయ్... కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మిరాయ్లో ఈ మూడు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా బాగుందని ఇప్పటికే సోషల్మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇందులోని విజువల్స్ ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. అయితే, మిరాయ్ కోసం తేజ సజ్జా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది..? అనే చర్చ జరుగుతుంది.సినిమా హిట్ అయితే.. రెమ్యునరేషన్పై తేజమిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కోసం రూ. 60 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ ఔట్ పుట్ చూస్తే మాత్రం సుమారు. 200 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉంటారనిపించేలా ఉంటుంది. అందరూ మిరాయ్ కోసం తేజ సజ్జా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని భావించినా, వాస్తవం కొంచెం భిన్నంగా ఉన్నట్లు సమాచారం. తేజా స్వయంగా చెప్పిన ప్రకారం, హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్నే మిరాయ్కు కూడా తీసుకున్నానని ఒక వేదికపై చెప్పారు. అయితే, ప్రొడ్యూసర్ మీద తనకున్న నమ్మకం వల్ల, సినిమా హిట్ అయితే మంచి అమౌంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అది కేవలం నిర్మాత ఇష్ట ప్రకారంగా తీసుకునే నిర్ణయం మాత్రమేనని అన్నారు. హనుమాన్ హిట్ అయిన తర్వాత కూడా తాను ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడగలేదన్నారు. ఆ సినిమా నిర్మాతల నుంచి కూడా తనకు రెమ్యునరేషన్ మించి ఒక్క రూపాయి కూడా అదనంగా అందలేదని సమాచారం. మనోజ్కే ఎక్కువ రెమ్యునరేషన్హనుమాన్ కోసం తేజ సజ్జా రూ. 2 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతంలో తేజ చెప్పిన ప్రకారం మిరాయ్ సినిమాకు కూడా రూ. 2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు అర్థం అవుతుంది. అయితే, ఇకనుంచి ఆయన నటించనున్న కొత్త సినిమాలకు సుమారు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్.. హనుమాన్ సినిమా కంటే ముందే మిరాయ్తో తేజ సజ్జా ఒప్పందం చేసుకున్నారు. కానీ, తనకు కథ నచ్చితే రెమ్యునరేషన్ పెంచబోనని కూడా తేజ చెప్పడం విశేషం. మంచు మనోజ్ కూడా మిరాయ్ సినిమా కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రియ మాత్రం రూ. 2 కోట్ల వరకు అందుకున్నారని టాక్.. అయితే, ఇందులో హీరోయిన్గా అద్భుతంగా మెప్పించిన రితిక నాయక్ మాత్రం రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం ఉంది. -
బాహుబలి తర్వాత ఈ సినిమానే: రాం గోపాల్ వర్మ ట్వీట్
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025 -
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్.. స్పందించిన రష్మిక!
టాలీవుడ్లో కొన్నేళ్లుగా ఈ జంటపై రూమర్స్ ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఎక్కడా కనిపించినా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు కథనాలొచ్చాయి. ఇంతకీ ఆ జంట ఎవరని అనుకుంటున్నారా? టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ లవ్ బర్డ్స్గా పేరున్న రష్మిక, విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మాత్రమే వచ్చాయి. వీటిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.అయితే ఈ సారి ఏకంగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని కథనాలొచ్చాయి. ఇటీవల సైమా అవార్డుల వేడుకలకు హాజరైన రష్మిక చేతికి ఉంగరం కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో హీరోయిన్ రష్మిక తన చేతి వేలి ఉంగరంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం నా సెంటిమెంట్ ఉంగరమని.. తాను నిశ్చితార్థం చేసుకుంటే అందరికీ చెప్తానని తెలిపింది. కాగా.. ఈ ఏడాది ఛావా, కుబేర సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. -
విరాట్- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్మోడల్.కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.ఒకే హోటల్లో బస.. అనుష్క కూడా అక్కడే‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్ను కలవాలి అనుకున్నాం.మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.ఇక చాలు.. బయటకు వెళ్లండిఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.లండన్లోనే నివాసంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. లండన్లో అకాయ్కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
సొంత ఇళ్లు వాళ్లకు ఇచ్చేసి అద్దె ఇంట్లోకి రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ తన సినీ జీవితం కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ట్రస్ట్ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సహాయం, విద్యా సహాయం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. అనాథ పిల్లలకు ఆశ్రయ, ఆహారం, విద్య, సంరక్షణ వంటి విషయంలో ఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా రాఘవ లారెన్స్ సోషల్మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. 'మీ అందరితో కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. నా సినిమా కాంచన- 4 అధికారికంగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మీలో చాలా మందికి తెలిసినట్లుగా.., నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ నేను ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిసిందే. ఈ క్రమంలోనే నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం ప్రకటించడానికి నేను నిజంగా సంతోషస్తున్నాను.ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత, నేను దానిని అనాథాశ్రమ పిల్లల కోసం గృహంగా మార్చాను. ఆ సమయంలో కుటుంబంతో నేను అద్దె ఇంటిలోకి మారాను. ప్రస్తుతం నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను ప్రారంభిస్తున్న ఉచిత పాఠశాలలో మొదటి ఉపాధ్యాయులు కూడా నా ఇంట్లో పెరిగిన బిడ్డే కావడం విశేషం. నేను చేరదీసిన బిడ్డ ఇప్పుడు చదువుకుని తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఈ విషయం నాకు మరింత సంతోషంగా, గర్వంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.Kanchana 4 is rolling and halfway through — I’m Happy to Announce That I’m Transforming My First Home into a Free School for Children with my Kanchana 4 Advance - with the First Teacher Being a Child Who Grew Up in my home 🙏 I’m so delighted to share some exciting news with… pic.twitter.com/qvcCYQruGE— Raghava Lawrence (@offl_Lawrence) September 11, 2025 -
నాభర్తకు డిగ్రీలేదు, నేనే పోషిస్తున్నా.. నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టా!
కన్నడ దర్శకనటుడు ఎస్ నారాయణ్ (S Narayan)పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. నారాయణ్ కుటుంబం వరకట్నం కోసం వేధిస్తోందంటూ ఆయన కోడలు పవిత్ర బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. తనకేదైనా జరిగితే భర్త, అత్తమామలదే పూర్తి బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రమ్మని నారాయణ్, అతడి భార్య భాగ్యవతి, కుమారుడు పవన్కు నోటీసులు పంపారు.ఫిర్యాదులో ఏముందంటే?'నా భర్త పవన్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అతడికి ఎటువంటి ఉద్యోగం లేదు. దీంతో నేనే కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఓసారి అతడు కారు కొనాలంటూ నా దగ్గర రూ.1 లక్ష, నా తల్లి దగ్గరి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. నా భర్త కుటుంబం కళా సామ్రాట్ ఫిలిం అకాడమీ స్థాపించినప్పుడు నేను నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టి వారికి ఆర్థిక సాయం చేశాను. కానీ, ఆ అకాడమీ ఎంతోకాలం నడపలేదు, కొంతకాలానికి మూసివేశారు. నేను సంపాదించి పోషించా..తర్వాత మళ్లీ నన్ను డబ్బు అడగడం ప్రారంభించారు. రూ.10 లక్షలు లోన్ తీసుకునిచ్చాను. కొన్నినెలలు సరిగానే చెల్లించి తర్వాత ఆపేశారు. నా పెళ్లి సమయంలో నాన్న పవన్కు రూ.1 లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా పెళ్లి విషయంలో నారాయణ్ దంపతులు గొడవపడ్డారు. పెళ్లయిన కొన్ని నెలలకే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓ అద్దెగదిలో ఉన్నాం. ఓ సంవత్సరం తర్వాత తిరిగి మళ్లీ అత్తింట్లో అడుగుపెట్టాం' అని పవిత్ర పేర్కొంది.సినిమాచైత్రద ప్రేమాంజలి (1992) కన్నడ సినిమాతో నారాయణ్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. అనురాగద అలెగలు, మేఘ మాలె, తవరిన తొట్టిలు, బేవు బెల్ల, సూర్యవంశం, సింహాద్రియా సింహ, దక్ష, చంద్ర చకోరి, మనసు మల్లిగె.. ఇలా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశాడు. తమిళంలో జై సినిమా తీశాడు. చైత్రద ప్రేమాంజలి, కురిగలు సార్ కురిగలు, హనీమూన్ ఎక్స్ప్రెస్, తిప్పరల్లి తర్లెగలు, ఓల్డ్ మాంక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్! -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో బిగ్బాస్ 8 తెలుగు ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్రలో నటించింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.సంతోష్ కల్వచెర్ల, క్రిషికా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'కిల్లర్ ఆర్టిస్ట్'. సోనియా ఆకుల కీలకపాత్రలో నటించింది. రతన్ రిషి దర్శకుడు. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, మూవీ కూడా అంతంత మాత్రంగానే ఉండేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం దీనితోపాటు పరదా, కూలీ, సయారా, సు ఫ్రమ్ సో లాంటి సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ 'పరదా' సినిమా)'కిల్లర్ ఆర్టిస్ట్' విషయానికొస్తే.. విక్కీ (సంతోష్), స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలు. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తుతెలియని కొందరు వీరిపై దాడి చేస్తారు. స్వాతిని చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. జాను (క్రిషేక్ పటేల్) ఇతడి జీవితంలోకి వస్తుంది. మామూలు మనిషిగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు ఓ హీరోయిన్ మాస్క్ ధరించి 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు.ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే అయ్యుంటాడని విక్కీ అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకుంటాడు. విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతడు ప్రత్యక్షమవుతాడు. అయితే తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీకి తెలుస్తుంది. అసలు స్వాతిని చంపింది ఎవరు? సిటీలోని హత్యలు చేస్తున్నది ఒకరా? లేదా ఇద్దరా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ) -
తమన్నా లాంటి భార్య దొరికిందని అతడు ఆనందపడాలి
దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న తమన్నా.. ఇప్పటికీ అదే ఊపు, జోష్ చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు అంతే ఉత్సాహంతో ప్రమోషన్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. నటన పరంగా ఈమె దూసుకుపోతున్నప్పటికీ.. ప్రేమ పరంగా ఈమె జీవితంలో ఓ బ్రేకప్ ఉంది. హిందీ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసుకుంది. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉంటోంది.అయితే త్వరలోనే తనకు కాబోయే అదృష్టవంతుడిని చూస్తారని తమన్నా ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయ్ వర్మతో బ్రేకప్ అయి ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు తమన్నా ఈ తరహా కామెంట్స్ చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'డూ యూ వాన్నా పార్ట్నర్' ఈరోజు(సెప్టెంబరు 12) నుంచే స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన కాబోయే భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)'మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన అదే. గత జన్మలో ఎంత పుణ్యం చేసుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. దానికోసమే నా ప్రయత్నం. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది నాకు తెలియదు. త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో?' అని తమన్నా చెప్పింది. ఈమె మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే మళ్లీ ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తోంది. ఒకవేళ రిలేషన్లో ఉంటే అతడెవరా అనేది తెలియాల్సి ఉంది.2005 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నా ఇప్పటివరకు దాదాపు 90 సినిమాలు చేసింది. అలానే పలు వెబ్ సిరీసులు కూడా చేసింది. వయసు పెరుగుతున్నా సరే అదే అందాన్ని మెంటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ యూత్ని అలరిస్తోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాదిన్నర గ్యాప్.. హీరోయిన్ చేతిలో ఇప్పుడు 8 సినిమాలు) -
మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్!
ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్నెస్పై మరింత ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.శాఖాహారిగా మారిపోయాప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్బీర్ తన లైఫ్స్టైల్లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.సినిమారామాయణ సినిమాను నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్ 2.. 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రామాయణ్తో పాటు రణ్బీర్ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్ ఆలియా భట్తో కలిసి లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది. 🚨 Ranbir Kapoor has given up smoking, drinking, and has even turned vegetarian — all in preparation for his role as Lord Ram in #Ramayana. A true embodiment of discipline and devotion. ✨🔥 pic.twitter.com/W5F3akrREK— Ramayana: The Epic (@RamayanaMovieHQ) September 7, 2025 చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి -
విరామం ఇస్తున్నాను.. అనుష్క ట్వీట్ వైరల్
హీరోయిన్ ప్రాధాన్య చిత్రాల విషయంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ట్రెండ్ సెట్ చేశారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటేడ్ కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా స్టోరీ ప్రేక్షకులను థియేటర్కు రప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఆమె ఒక నోట్ రాసి ట్వీట్ చేశారు.కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు.. సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నాను. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మరిన్న కథలతో ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు.క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. మూవీ బాగాలేదని విమర్శలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి నటనను మాత్రం అందరూ ప్రశంసించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాత్ర గురించి కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టిని, మీరు ఇంకా ఏదైనా పాత్ర చేయాలనుకుంటున్నారా అని మీడియా వారు అడిగారు. దీనికి నటి, "నేను పూర్తిగా ప్రతికూల పాత్రను చేయాలనుకుంటున్నాను. బలమైన పాత్ర వస్తే, నేను ఖచ్చితంగా ప్రతికూల పాత్రను చేస్తాను" అని చెప్పారు.Love.... always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025 -
ఏడాదిన్నర గ్యాప్.. ఇప్పుడేమో చేతిలో 8 సినిమాలు
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా చాలా తక్కువగానే సినిమాలు చేస్తున్నారు. ఉన్నంతలో రష్మిక పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె కంటే బిజీగా ఉన్న మరో బ్యూటీ ఉంది. ఆమెనే మలయాళ బ్యూటీ సంయుక్త. దాదాపు ఏడాదిన్నరగా ఈమె నుంచి కొత్త మూవీ అప్డేట్ అనేదే లేదు. అలాంటిది ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 8 మూవీస్ ఉండటం విశేషం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?2016 నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త.. 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్లోకి వచ్చింది. దీని తర్వాత బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరస హిట్స్ అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే 2023లో ఈమె హీరోయిన్గా చేసిన 'డెవిల్' ఫ్లాప్ అయింది. గతేడాది ఓ తెలుగు మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. అప్పటినుంచి ఈమె నుంచి రిలీజులు ఏం లేవు. తీరా ఇప్పుడు చూస్తే ఎనిమిది చిత్రాలు లైన్లో ఉన్నాయి.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం)సంయుక్త చేస్తున్న వాటిలో బాలకృష్ణ 'అఖండ 2', పూరీ-విజయ్ సేతుపతి సినిమా, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ', బెల్లంకొండ శ్రీనివాస్ 'హైందవ', నిఖిల్ 'స్వయంభు', లారెన్స్ 'బెంజ్', మహారాణి అనే హిందీ చిత్రం, తెలుగులో ఓ ఫిమేల్ సెంట్రిక్ చిత్రం ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. వీటిలో 'అఖండ 2'.. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ కూడా దాదాపు వచ్చే ఏడాది, ఆపై ఏడాది థియేటర్లలోకి రానున్నాయి.సంయుక్త ప్రస్తుతం చేస్తున్న వాటిలో పూరీ-విజయ్ సేతుపతి, అఖండ 2, స్వయంభు.. పాన్ ఇండియా టార్గెట్గా తీస్తున్న మిగిలినవన్నీ కూడా ఆయా భాషల్లో తీస్తున్నారు. మరి వీటి వల్ల సంయుక్త కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా? హీరోయిన్గా నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ) -
‘మిరాయ్’ మూవీ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ఈ కుర్ర హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్డమ్ని నిలబెట్టుకోవాలంటే.. తేజకి ఇంకో హిట్ కచ్చితంగా కావాలి. అందుకే వెంటనే సినిమా చేయకుండా.. కాస్త సమయం తీసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మిరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తేజా సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ కథ అశోకుడి పాలన(క్రీ.పూ.232)లో ప్రారంభమై.. ప్రస్తుత కాలంలో సాగుతుంది. కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్ ఆశోకుడు పశ్చాత్తాపానికి లోనై.. తనలో దాగి ఉన్న దివ్య శక్తిని 9 గ్రంథాలలోకి ఇముడింపజేస్తాడు. ఒక్కో గ్రంథంలో ఒక్కో శక్తి ఉంటుంది. వాటికి తరతరాలుగా 9 మంది యోధులు రక్షకుల ఉంటారు. మహావీర్ లామా(మంచు మనోజ్) వాటిని చేజిక్కుంచుకుని దివ్య శక్తిలను పొంది.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తాడు. తనకున్న తాంత్రిక శక్తుల బలంతో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. తొమ్మిదో గ్రంథం అంభిక(శ్రియా శరన్) రక్షణలో ఉంటుంది. మహావీర్ కుట్రను ముందే పసిగట్టిన అంభిక.. తొమ్మిదో గ్రంథం రక్షణ కోసం తన కొడుకు వేద(తేజ సజ్జా)ను తయారు చేస్తుంది. అనాథగా పెరిగిన వేదకు విభా(రితిక నాయక్) దిశానిర్దేశం చేస్తుంది. మహావీర్ని ఆడ్డుకునే శక్తి ‘మిరాయ్’ ఆయుధంలో ఉందని వేదకు తెలిసేలా చేస్తుంది. మరి మిరాయ్ ఆయుధం కోసం వేద ఏం చేశాడు? ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? హిమాలయాల్లో ఉన్న ఆగస్త్య(జయరాం) అతనికి ఎలాంటి సహాయం చేశాడు. చివరకు ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ చేతికి వెళ్లిందా లేదా? మహావీర్ నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాణాలు, ఇతీహాసాల్లోని కథలను తీసుకొని, దానికి కాస్త ఫిక్షన్ జోడించి సినిమా చేయడం..ఈ మధ్య టాలీవుడ్లోనూ ట్రెండింగ్గా మారింది. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే ‘మిరాయ్’. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ని తీసుకొని.. ఒకవేళ ఆ గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నిస్తే.. మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. కథగా చూస్తే.. ఇది మరీ అంత కొత్తదేమి కాదు. హను-మాన్, కార్తీకేయ 2 తో పాటు హాలీవుడ్లోనూ ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, విజువల్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉన్నాయి. కార్తీకేయ 2లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే.. మిరాయ్లో శ్రీరాముడి కోదండం కోసం వెతుకుతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నిశాలు స్క్రీన్పై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్. అలాగే సెకండాఫ్లో కూడా ఒకటి, రెండు సీన్లు అదిరిపోయాయి. రాముడి ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే... సెకండాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ట్రైన్ ఎపిసోడ్, శ్రీరాముడి ఎపిసోడ్ .. ఆ సాగదీతను మరిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా ‘మిరాయ్’ మాత్రం థియేటర్స్లో చూడాల్సిన విజువల్ వండర్. ఎవరెలా చేశారంటే.. వేద పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఇదే తరహాలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పోతే మాత్రం..తేజ రేంజ్ ఊహించని స్థాయికి వెళ్తుంది. ఇక మంచు మనోజ్ విలనిజం అద్భుతంగా పండించాడు. తేజ సజ్జ కంటే మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి. మహావీర్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. శ్రీయకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. వేద తల్లి అంభిక పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. ఆగస్త్య పాత్రలో జయరాం చక్కగా నటించాడు. రితికా నాయక్, జగపతి బాబు, వెంకటేశ్ మహా, తిరుమల కిశోర్, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గౌర హరి నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా సంపాతి పక్షి ఎపిసోడ్, రాముడి ఎపిసోడ్కి ఇచ్చిన బీజీఎం గూస్బంప్స్ తెప్పిస్తాయి. దర్శకుడిగానే కాకుంగా సినిమాటోగ్రాఫర్గాను కార్తీక్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్గా ఉంది. ఇక వీఎఫెక్స్ పని తీరు గురించి ముఖ్యంగా చెప్పుకొవాలి. వందల కోట్ల పెట్టి తీసిన సినిమాల్లోనూ గ్రాఫిక్స్ పేలవంగా ఉంటుంది. కానీ రూ. 60 కోట్ల బడ్జెట్లో ఈ స్థాయి ఔట్ పుల్ తీసుకురావడం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి
ప్రేమించిన ప్రియుడు తనను అష్టకష్టాలు పెట్టాడని వాపోయింది మలయాళ బుల్లితెర నటి జసీలా ప్రవీణ్ (Jaseela Parveen). మాటలతోనే కాకుండా చేతలతో నరకం చూపించాడని పేర్కొంది. ఈ మేరకు సాక్ష్యాలను సోతం సోషల్ మీడియాలో బయటపెట్టింది. అందులో ఓ ఫోటోలో జసీలా తలపై గాయాలున్నాయి, పెదవి చిట్లిపోయి ఉంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగిందని నటి తెలిపింది.చర్మం ఊడివచ్చేలా..జసీలా మాట్లాడుతూ.. 'నా కడుపులో రెండుసార్లు తన్నాడు. తన చేతి కడియంతో నా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దానివల్ల నా చర్మం ఊడివచ్చింది. అతడు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నేను కాలు జారి కిందపడిపోవడం వల్లే ఈ గాయాలయ్యాయని చెప్తేనే ఆస్పత్రికి తీసుకెళ్తానన్నాడు. హాస్పిటల్ వెళ్లాక అదే అబద్ధం చెప్పాడు. డాక్టర్ నా ముఖంపై చీలిన చర్మాన్ని చూసి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. కొన్ని రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకుని జరిగిందంతా పోలీసులకు చెప్పాను. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.అందవిహీనంగా మారిపోయాశారీరక హింస, మానసిక వేదన అనుభవించాక నన్ను నేనే కోల్పోయినట్లుగా అనిపించింది. అందవిహీనంగా మారిపోయాను. అద్దంలో చూసుకోవడం కూడా మానేశాను. సరిగా తినలేకపోయాను, కంటినిండా నిద్రపోలేకపోయాను. దాదాపు పది కిలోలు తగ్గాను. అతడు మాత్రం హాయిగా నార్మల్ లైప్ గడుపుతున్నాడు. అసలేదీ జరగనట్లే ఉన్నాడు. కొంచెం కూడా బాధపడలేదు, నా గురించి ఆలోచించనేలేదు. కనీసం జరిగినదానికి క్షమాపణలు కూడా చెప్పలేదు.సారీ చెప్తే వదిలేస్తానన్నా కూడా..అతడికి చిట్టచివరగా ఓ ఛాన్స్ ఇచ్చి చూశాను. నాకు సారీ చెప్తే ఇంతటితో దీన్ని వదిలేస్తానన్నాను. కానీ అతడు క్షమాపణలు చెప్పడానికి బదులుగా కోర్టుకెళ్లి బెయిల్ తీసుకోవడానికే సుముఖత చూపించాడు. తనే ఏదీ జరగనట్లు ఉంటే నేను మాత్రం ఎందుకు కుమిలిపోతూ ఉండాలి. బాధపడుతూ కూర్చుంటే ఏదీ మారదు.. అందుకే ఇప్పుడిప్పుడే గతాన్ని మర్చిపోయి మళ్లీ మామూలు మనిషినయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అతడితో తెగదెంపులు చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. జసీలా పర్వీన్.. మలయాళ సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు పోషించింది.చదవండి: రైలు నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్ -
ఇన్నాళ్లూ భరణి, ఇమ్మాన్యుయేల్ మగాళ్లనుకున్నా.. అంతమాటన్నాడేంటి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీశ్ ఇప్పుడదే చేశాడు. హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. సంచాలక్ మర్యాద మనీష్ వల్ల ఈ టాస్క్ గందరగోళంగా మారింది. ఫైనల్గా ఈ గేమ్లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.భరణి, ఇమ్మాన్యుయేల్.. ఆడవాళ్లు!అయితే తాజా ప్రోమోలో హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్ చేశాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. బాడీ షేమింగ్ చేసినట్లు ఎపిసోడ్లో క్లిప్ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్ చేతిలో పవన్ కల్యాణ్కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్, మనీష్లకు కూడా క్లాస్ పడేట్లు కనిపిస్తోంది. చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం
రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాల్లో కచ్చితంగా డివోషనల్ ఎలిమెంట్స్ లేదా క్లైమాక్స్లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ వరకు కొన్నింటిని దాస్తుంటే మరికొన్నింటిని మాత్రం ముందే రివీల్ చేస్తున్నారు. కానీ తాజాగా థియేటర్లలో రిలీజైన 'మిరాయ్'లో మాత్రం ప్రభాస్ నటించాడనే రూమర్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఓ ఫొటో కూడా సర్కూలేట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన సినిమా 'మిరాయ్'. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్తోనే తీశారు. మంచు మనోజ్ విలన్ కాగా.. ఇందులో రాముడి రిఫరెన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేసుంటారా అని అందరూ మాట్లాడుకున్నారు. అలానే నిన్న రాత్రి తేజ్ సజ్జా.. సినిమాలో ప్రభాస్ సర్ప్రైజ్ కూడా ఉందని ట్వీట్ చేశాడు. దీంతో ఏంటా సంగతి అనుకున్నారు.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)అయితే సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్.. ప్రభాస్తో చెప్పించారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రభాస్ని రాముడిగా ఎడిట్ చేసి థియేటర్ స్క్రీన్పై ఆ బొమ్మని పెట్టేశారు. దీంతో చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇదో ఎడిటెడ్ ఫొటో. 'మిరాయ్' చిత్రం కోసం ప్రభాస్.. తన గొంతు మాత్రమే ఇచ్చాడు. ఇదే నిర్మాణ సంస్థ 'రాజాసాబ్' తీస్తుంది.ప్రస్తుతం 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. కానీ తొలిరోజు వచ్చే టాక్ కాదు, ఒకటి రెండు రోజుల తర్వాత అసలు టాక్ వస్తుంది. అప్పుడు సినిమా రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
రైల్లో నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ (Actress Karishma Sharma) కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది.కదులుతున్న రైలు నుంచి దూకేశా'షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో చర్చ్గేట్కు వెళ్దామనుకున్నాను. స్టేషన్కు వెళ్లి ట్రైన్ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కలేదన్న విషయం గమనించాను. అప్పుడు నేను చీర కట్టుకుని ఉన్నాను. అయినా ధైర్యం చేసి దూకేయగా తలకు, వెన్నెముకకు దెబ్బ తగిలింది. MRI స్కాన్ చేశారు. కొద్దిరోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. సినిమాఈ ప్రమాదం జరిగినప్పటినుంచి నొప్పితో విలవిల్లాడుతున్నాను. మీ ప్రేమాభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి. దయచేసి నా కోసం ప్రార్థించండి' అని కోరింది. కాగా కరిష్మా శర్మ.. ప్యార్ కా పంచనామా 2, ఉజ్దా చమాన్, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ మూవీస్లో నటించింది. రాగిణి ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది. బుల్లితెరపై పవిత్ర రిష్తా, కామెడీ సర్కస్, సిల్సిలా ప్యార్ కా వంటి సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
ఆ హీరోతో కలిసి పనిచేసినందుకు హ్యాపీ: లావణ్య త్రిపాఠి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రెండు రోజుల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందారు. ఉత్రరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఈమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం టన్నెల్ నేడు (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వారం వాయిదా పడింది. ఈ నెల 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. టన్నెల్ చిత్రం చూసినవారందరూ నా నటనను ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సంతోషంగా ఉందిచిత్ర ప్రథమార్థం రొమాంటిక్ సంఘటనలతోనూ, రెండవ భాగం ఎమోషనన్స్ అంశాలతో ఉంటుందని చెప్పారు. సినిమాలో తన పాత్ర సాధారణంగా కాకుండా కథకు కీలకంగా ఉంటుందన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రవీంద్ర మాధవకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో అంకిత భావంతో పని చేసే హీరో అధర్వతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కెరీర్లావణ్య త్రిపాఠి 2012లో అందాల రాక్షసి చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత బ్రహ్మ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగులోనే వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్లో బిజీ అయ్యారు. కాగా 2017లో మాయాన్ అనే తమిళ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు టన్నెల్ అనే తమిళ చిత్రంలో నటించారు. తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అన్నై ఫిలిమ్ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎం.జాన్ పీటర్ నిర్మించారు. రవీంద్ర మాదవ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Annai Film Production (@annaifilmproductionofficial)చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
'కిష్కింధపురి' సినిమా రివ్యూ
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ సినిమా 'కిష్కింధపురి'. ఇది ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్లే ట్రైలర్, పోస్టర్స్ లాంటివి కాస్త ఆసక్తికరంగా అనిపించాయి. మరి మూవీ టీమ్ చెప్పినట్లు ఈ చిత్రం భయపెడుతూ థ్రిల్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా)కథేంటి?రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. మరో స్నేహితుడితో కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తుంటారు. దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్లందరూ కలిసి జన సంచారం లేని కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఓ సందర్భంలో 'సువర్ణమాయ' అనే పాడుబడ్డ రేడియో స్టేషన్కి 11 మంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు చనిపోతారు. అనంతరం ఈ బృందంలోని ఓ చిన్నారి.. దెయ్యానికి టార్గెట్ అవుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతున్న దెయ్యం ఎవరు? రాఘవ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమా ప్రమోషన్స్లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూవీ మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరూ ఫోన్ కూడా పట్టుకోరు, ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తానని ఛాలెంజ్ చేశాడు. తర్వాత దీన్ని కవర్ చేసుకున్నాడు అదే వేరే సంగతి. మరి హీరో చెప్పినట్లు సినిమాలో అంత సీన్ ఉందా అంటే ఓ మాదిరిగా ఉంది అంతే!హారర్ సినిమా అనగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది. దాదాపు దాన్ని ఫాలో అవుతూనే 'కిష్కింధపురి' కూడా తీశారు. ఫస్టాఫ్ అంతా దెయ్యం ఎలిమెంట్స్ చూపిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది పార్ట్స్ పార్ట్స్గానే వర్కౌట్ అయింది. దెయ్యం వెనకున్న ఫ్లాష్ బ్యాక్ చెబుతూ థ్రిల్ పంచే ఎలిమెంట్స్ అన్నీ సెకండాఫ్లోనే ఉంటాయి. సౌండ్స్తో భయపెట్టడం వరకు సరే గానీ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం సెకండాఫ్లో తగ్గిపోయాయి. సాధారణంగా హారర్ మూవీస్ అనగానే చిల్ మూమెంట్స్ కీలకం. అంటే ప్రేక్షకుల్ని సడన్గా భయపెట్టాలి. ఇందులో ఒకటి రెండు చోట్ల తప్పితే అలాంటి సన్నివేశాలు పెద్దగా లేవు.ప్రారంభంలో సగటు తెలుగు సినిమాల్లో ఉన్నట్లే హీరో ఇంట్రడక్షన్, లవ్ సాంగ్.. ఇలా సాగుతుంది. ఎప్పుడైతే 'సూవర్ణమాయ' రేడియో స్టేషన్లో హీరోహీరోయిన్తో అడుగుపెడతారో అసలు కథ మొదలవుతుంది. ఇందులోకి వచ్చి వెళ్లిన ఇద్దరు లోకో పైలెట్స్ని, అలానే ఓ నిర్మాణ కూలీని చంపడం లాంటి సీన్స్ రెగ్యులర్గానే అనిపించాయి. ఓవైపు సూవర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే, మరోవైపు మిగతా వాళ్లు చనిపోకుండా ఆపడం లాంటి అంశాలతో సెకండాఫ్ అంతా ఉంటుంది. ఫ్లాష్బ్యాక్లో వచ్చే స్టోరీ, ట్విస్టులు బాగున్నాయి. కానీ ఇదంతా ఎక్కడో తెలుగు సినిమాలో చూసేశామే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారు?బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. రాఘవ్ పాత్రలో పర్లేదనిపించాడు. హీరోయిన్ అనుపమకి మాత్రం మంచి స్కోప్ దొరికింది. మొదట్లో రెగ్యులర్ కమర్షియల్ పాత్రలానే అనిపిస్తుంది గానీ సెకండాఫ్లో ఈమె దెయ్యంగా మారే సీన్స్లో ఆకట్టుకుంది. విశ్రవ పుత్రగా శాండీ మాస్టర్ మెప్పించాడు. ప్రారంభంలో హైపర్ ఆది, సుదర్శన్ కాస్త నవ్వించేందుకు ప్రయత్నించారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్ పాండే తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్నిచోట్ల స్టోరీలో లాజిక్స్ మిస్ కావడం డిసప్పాయింట్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా ఇది గ్రాఫిక్స్ అని తెలిసిపోయేలా ఉంది. దాన్ని కాస్త నేచురల్గా చేసుండాల్సింది. దర్శకుడు భయపెడదామని బాగానే ప్రయత్నించాడు కాకపోతే పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది!అలానే 'కిష్కింధపురి' అనే టైటిల్ పెట్టారు. ప్రారంభంలో కోతులతో ఓ సీన్ చూపించడం, సినిమాలో ఊరి పేరు తప్పితే ఎక్కడా టైటిల్కి స్టోరీకి కనెక్షన్ అనిపించలేదు. దీని బదులు 'సూవర్ణమాయ రేడియో స్టేషన్' అని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది.- చందు డొంకాన(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లుబిగ్బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్గా నిలబడేవారని బిగ్బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్కు భరణి, సంజనకు శ్రీజ, పవన్కు ప్రియ, హరీశ్కు పవన్ కల్యాణ్ సపోర్ట్గా వచ్చారు.సంచాలక్గా మర్యాద మనీష్వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమ్మాన్యుయేల్ను ఎలిమినేట్ చేసిన సంచాలక్శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్గా ఫెయిల్ఇమ్మూ ఆవేశంతో సంచాలక్గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్ఫెయిర్ అంటూ అని మనీష్ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్బాస్కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా చేసిన హారర్ మూవీ 'కిష్కింధపురి' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. మరోవైపు ఈమె నటించిన లేటెస్ట్ మూవీ ఒకటి ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా అందుబాటులోకి వచ్చింది. కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తరచుగా తెలుగు సినిమాలు చేస్తూనే ఉంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. అలా ఈమె చేసిన ఫిమేల్ సెంట్రిక్ మూవీ 'పరదా'. తన కెరీర్లోనే బెస్ట్ మూవీని అనుపమ కూడా చెప్పింది. అలా ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకుల నుంచి భిన్నమైన రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా యావరేజ్గా మిగిలింది.(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ)ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో తెలుగు, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకవేళ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది.'పరదా' విషయానికొస్తే.. పడతి అనే ఊరిలో మహిళలంతా పరదాలేసుకుని తిరుగుతుంటారు. ఇంట్లో తండ్రికి తప్పితే పరాయి పురుషుడు వాళ్ల ముఖాలు చూడకూడదు. చూస్తే ఊరికి అరిష్టం దాపురించి, ఇక్కడ పిల్లలు పుట్టకుండా పురిటిలోనే చనిపోతారని ఈ ఊరి ప్రజల నమ్మకం. దానికి జ్వాలమ్మ అనే ఓ కథ ఉంటుంది. ఇదే ఊరిలో పుట్టి పెరిగిన సుబ్బలక్ష్మి (అనుపమ) అదే ఊళ్లోని రాజేష్(రాగ్ మయూర్)ని ఇష్టపడుతుంది. నిశ్చితార్ధం టైంకి ఓ షాకింగ్ సంఘటన జరుగుతుంది. దాంతో గొడవ జరిగి ఆ శుభకార్యం ఆగిపోతుంది. సుబ్బు ఆత్మాహుతి చేసుకోవాలని ఊరంతా నిర్ణయిస్తారు. అసలేమైంది? సుబ్బు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది మిగతా సినిమా.(ఇదీ చదవండి: అమ్మవారికి రూ.4 కోట్ల కిరీటం సమర్పించిన ఇళయరాజా) -
మిరాయ్ ట్విటర్ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సిసిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిరాయ్’ ఎలా ఉంది? తేజ సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదతర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్లో మిరాయ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉందంటూ చాలా మంది ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే ఇందులో ప్రభాస్ కనిపించడం పెద్ద సర్ప్రైజింగ్ అంశం. ఎక్స్లో ప్రభాస్ పాత్రలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ సినిమాకు ప్లస్ అయిందని చెబుతున్నారు.#Mirai A Worthy Action Adventure Infused with Devotional Elements! Mirai delivers an engaging first half, with a few dips in the middle, but a good pre-interval to interval block. The second half slows down in places, but a few strong sequences and a superb climax hold it…— Venky Reviews (@venkyreviews) September 11, 2025‘చిన్న చిన్న మలుపులతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్ కొన్ని చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా..కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టినట్లు అనిపించదు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. #MiraiReview Positives@shriya1109#Jayaram@tejasajja123@HeroManoj1 (Mohan babu)#RitikaAnd everyone gave their best -VFX 👌👏-Second half BGM-Mirai daggariki vellaka vache sequence -Second half till climaxNegatives:Time ayipothundhani fast fast ga end chesinattundhi— ZoomOnZindagi (@ZoomOnZindagi) September 12, 2025 ‘తేజ సజ్జ, శ్రియ, మనోజ్, జయరామ్, రితికా..ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీఎఫెక్స్ అదిరిపోయింది. సెకండాఫ్ బీజీఎం బాగుంది. మిరాయ్ దగ్గరకు వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్. క్లైమాక్స్ బాగుంది. సినిమాలో నెగెటివ్ పాయింట్ ఏంటంటే.. టైమ్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఎండ్ చేసినట్లు ఉంటుంది’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Just a voice over turned the entire film reception into rebel vibe 🔥🔥🔥Just his name is enough 💥💥💥 #Prabhas #Mirai pic.twitter.com/rhvvntcNGO— Prabhas RULES (@PrabhasRules) September 11, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai – A Divine Action Adventure! 🔥✨High moments, solid interval, superb climax.Tech brilliance + Gowra Hari BGM elevate big time.@tejasajja123 shines bright.@HeroManoj1 👌💥Unique, engaging & worth a big-screen watch!Rating: ⭐⭐⭐⭐/5— 𝐕𝐢𝐡𝐚𝐚𝐧 (@TheRealPKFan) September 12, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai 12 सितम्बर को रिलीज़ हो रही है ये फ़िल्म सनातन धर्म के आदर्श और राम जी की ताक़त से प्रेरित है 🚩दक्षिण भारत हमें सुपरहीरो देता है, बॉलीवुड बस स्टारकिड्स 😏आधुनिक युग में एक बेहतरीन फिल्मइस बार सिनेमा हॉल भरकर दिखाओ कि असली कंटेंट ही जीतेगा 💪#Mirai— ठाकुर राजन तोमर (@rajanbhajpa) September 12, 2025#Mirai - 🆗Teja Sajja delivers a gud Perf. Graceful Shreya. Superb Visuals & BGM. Promising start, middle portions r draggy. Post Interval Transformation fight gud. Lord Rama saved d climax. Though not extra ordinary, it Deserves a One Time Watch for its Cinematic Experience!— Christopher Kanagaraj (@Chrissuccess) September 12, 2025#Mirai Baane undi, Parledu!A decent fantasy action adventure film which has similar tones of #Karthikeya2 & #HanumanFew sequences are fantastic but few are subpar.Loved #ShriyaSaran role👍🏻#TejaSajja is brilliant and he killed it👌#ManchuManoj role is underwhelming🥲 pic.twitter.com/r7gHrlhsph— Sanjeev (@edokatile) September 12, 2025 -
ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ
సహజ నటి జయసుధ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘లక్ష్మణ రేఖ’కు 50 ఏళ్లు. ఈ సినిమాకి ముందు ఓ నాలుగైదు సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేశారు. ఎన్. గో పాలకృష్ణ దర్శకత్వంలో షణ్ముగం చెట్టియార్, ఏవీ కృష్ణారావు నిర్మించిన ‘లక్ష్మణ రేఖ’లో చేసిన సీరియస్ క్యారెక్టర్ జయసధకు మంచి పేరు తెచ్చిపెడితే, దర్శకుడు ఎన్. గో పాలకృష్ణకి ‘లక్ష్మణ రేఖ’ ఇంటి పేరుగా మారి పోయింది. ఈ చిత్రంలో మురళీమోహన్ – జయసుధ జంటగా నటించగా, చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, గుమ్మడి, అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1975 సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లయిన సందర్భంగా ‘సాక్షి’తో జయసుధ ప్రత్యేకంగా పంచుకున్న విషయాలు. ‘లక్షణ రేఖ’ ఓ మరాఠీ చిత్రానికి మూలం. తండ్రి చెప్పిన మాట వినకుండా ప్రేమికుడి కోసం ఇంటి నుంచి వెళ్లిన ఒక అమ్మాయి మోస పోతుంది. ఆ ప్రేమికుడిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ మోసగాడు ఆమె చెల్లెలి భర్తతో పరిచయం పెంచుకుని, వారి కాపురంలో చిచ్చుపెడతాడు. భర్త వదిలేస్తాడు. నేను చెల్లెలి పాత్ర చేశాను. ఇది బరువైన పాత్ర కాబట్టి నా వయసు సరి పోదని, నన్ను వద్దని డైరెక్టర్, ప్రొడ్యూసర్స్తో పెద్దలు చె΄్పారు. అయితే ఆ సినిమా నాకే వచ్చింది. ‘లక్ష్మణ రేఖ’ తర్వాత ‘జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖలు’ వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నావి టఫ్ రోల్స్. అన్నిటికంటే కష్టమైనది ‘ఆమె కథ’. ఆ సినిమా ఇప్పుడు తీసినా ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది. ఏ భాషలో అయినా పనికొస్తుంది. ఇంగ్లిష్లో కూడా తీయొచ్చు. అప్పటి ఆ టైమ్, ఆ సీజన్లో అన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే. ఆ సినిమాలకు ఒక అమ్మాయి దొరికింది... ఆమె జయసుధ (నవ్వుతూ). ఆ రోజుల్లో హీరోయిన్లను బాలీవుడ్ నుంచో వేరే ఉడ్ నుంచో తీసుకురావడం తక్కువ. తెలుగు లేదంటే తమిళ పరిశ్రమ నుంచే ఆర్టిస్టులు ఉండేవారు. దాంతో మాకు ఎక్కువ పాత్రలు వచ్చేవి. సీరియస్గా, మేకప్ లేకుండా, టైట్గా జెడ వేసుకుని, కాటన్ చీరలు కట్టుకుని... ఇలా పాత్రలకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను. ఫిజిక్కి తగ్గ డ్రెస్ వేసుకునేవాళ్లంఅప్పట్లో మా ఫిజిక్కి తగ్గట్టు డ్రెస్ వేసుకునేవాళ్లం. ఆ రోజుల్లో 90 శాతం మంది డైరెక్టర్స్ మా డ్రెస్లు అభ్యంతరకరంగా ఉండకుండా జాగ్రత్త పడేవారు. నేను ట్రెడిషనల్ క్యారెక్టర్స్తో పాటు మోడ్రన్ క్యారెక్టర్స్ చేశాను. ‘నోము’ సినిమాలో అంత వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నా అసభ్యంగా అనిపించలేదు. ‘యుగంధర్’ సినిమాలో అయితే స్విమ్ డ్రెస్ వేసుకున్నాను. అయితే అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అయినా ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టలేదు కథ చెప్పేటప్పుడు నా పాత్ర ఒకలా చెప్పి, షూటింగ్కి వచ్చాక మారిస్తే ఒప్పుకునేదాన్ని కాదు. అప్పటికి నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ‘ఎందుకు ఇలా చేశారు?’ అని ప్రశ్నించేదాన్ని. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉండేది కాబట్టి ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టలేదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్గా, అమ్మ కామ్గా ఉండేవారు. అయితే నచ్చక పోతే వీళ్లు సినిమా వదులుకుంటారని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఒక పద్ధతి ఉండేది... విలువలు ఉండేవి. మహా నటి ఆమె ఒక్కరే... ‘సహజ నటి’ అనే టైటిల్ సూపర్ స్టార్ అని ఒక కార్యక్రమంలో నాకు మీడియా ఇచ్చింది. ఇప్పుడు పది లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసి ఉండరు, అప్పుడే ‘మహా నటి’ అనేస్తారు. మహా నటి అనే బిరుదుకి అర్హత ఉన్న ఏకైక నటి సావిత్రిగారే. ఎన్నో గొప్ప పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిస్తే, ఆమెకు దక్కిన బిరుదు అది. ఇప్పుడున్నవారిని తక్కువ చేయడం లేదు. కానీ, కనీసం ఓ పాతిక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశాక అలాంటి బిరుదులిస్తే బాగుంటుంది. నా బయోపిక్కి ఓకే నా బయోపిక్ ఎవరైనా తీస్తానంటే అభ్యంతరం లేదు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ విషయం గురించి నాతో చె΄్పారు. అయితే ముందుగా ఒక బుక్గా వస్తే బాగుంటుంది. నేనో 350 సినిమాలు చేశానంటే... వదులుకున్నవి ఓ 200 వరకూ ఉంటాయి. ఆ 350 సినిమాల్లో నా పాత్రల్లో నేను ఒదిగి పోవడానికి చేసిన కృషి గురించి తెలియాలి. అప్పటి స్టార్స్ గురించి ఈ జనరేషన్కి తెలియాలి. అది వారికి స్ఫూర్తిగా ఉంటుంది. ఒక చిన్న అమ్మాయిగా సినిమాల్లో మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ జర్నీ తెలియాలి. వెబ్ సిరీస్గా అయితే బాగుంటుందనుకుంటున్నాను.నా పరిచయ చిత్రం ఓ సంచలనంహీరోయిన్ ఓరియంటెడ్ సినిమా... అందులోనూ కొత్త డైరెక్టర్తో... లేని పోని రిస్క్ చేస్తున్నారని నిర్మాతల్ని భయపెట్టారు. జయసుధను ఎంపిక చేయడాన్ని పలు వురు పెద్దలు విమర్శించారు. కానీ నా మీద, నా సబ్జెక్ట్ మీద నమ్మకంతో నిర్మాతలు వెనకడుగు వేయలేదు. వాళ్లు చేసిన రిస్క్ ఫలించి, టేబుల్ ప్రాఫిట్గా ‘లక్ష్మణ రేఖ’ నిలిచి... నా ఇంటిపేరుగా మారింది. ఏరియాల వారిగా బిజినెస్ జరుపుకున్న తొలి చిత్రంగానూ దర్శకుడిగా నా పరిచయ చిత్రం చరిత్ర సృష్టించడం పట్ల ఇప్పటికీ గర్వపడుతుంటాను. – ఎన్. గో పాలకృష్ణ -
ఆయన కోసం కిష్కింధపురి చూస్తాను: అనిల్ రావిపూడి
‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కానీ, మా నిర్మాత సాహుగారి కోసం ‘కిష్కింధపురి’ చూస్తా’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలి పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో సాహు గార పాటి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సాయి శ్రీనివాస్ చాలా కష్టపడతాడు.తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మాత సాహుగారితో ‘భగవంత్ కేసరి’ చేశాను. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాక్షసుడు’లానే ‘కిష్కింధపురి’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బుచ్చిబాబు. ‘‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరి పోయింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుస్మిత కొణిదల. చెప్పారు. -
నా చిన్నప్పుడే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు: హీరో తేజ సజ్జా
‘‘మనం ఎంత ఖర్చుపెట్టినా ప్రేక్షకుల నమ్మకాన్ని కొనలేం. సినిమాలు స్పీడ్గా చేయాలని, రెండు మూడు సినిమాలు వరుసగా చేసేసి, ప్రేక్షకులను ఒక్కసారి నిరుత్సాహపరిచినా నాకు బాధగా ఉంటుంది. నేను దక్కించుకున్న క్రెడిబిలిటీ, నా కష్టం తాలూకు విలువ పోతుంది. నా సినిమా వస్తోంది... థియేటర్స్కు రండి అని ఆడియన్స్ని నేను కాన్ఫిడెంట్గా, ధైర్యంగా పిలిచేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. ‘మిరాయ్’ ఇలాంటి చిత్రమే’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా చెప్పిన సంగతులు. ⇒ ఫుల్ ఫ్యామిలీ అండ్ క్లీన్ ఫిల్మ్ ‘మిరాయ్’. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్... ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రం ఇది. చార్మినార్లోని కుర్రాడు వాడి ధర్మం ఏంటో వాడు గ్రహించి, తనకి, యోధ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని, ఓ పెద్ద ఆపదను ఆపడానికి ఎంత దూరం వెళ్లాడు? తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ప్రపంచం అంతరించబోతున్నటువంటి ఓ పెద్ద ఆపద రాబోతున్నప్పుడు మన ఇతిహాసాల్లో వేల సంవత్సరాల క్రితం పెట్టి ఉంచిన సమాధానాన్ని ఈ కుర్రాడు ఎలా కనుక్కుంటాడు? అన్నది ఈ సినిమా కథాంశం. ⇒ ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ సీక్వెన్స్లు వరకు ఉన్నాయి. వయసులో ఉన్నాను కాబట్టి ఫిజికల్ చాలెంజ్లు ఏం అనిపించలేదు. ఈ సీక్వెన్స్లు చూసి, ఆడియన్స్ ఎంత థ్రిల్ అవుతారో చూడాలనుకుంటున్నాను. టీజీ విశ్వప్రసాద్గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆడియన్స్కు నచ్చే మంచి సినిమా తీద్దామనుకునే నిర్మాత. ఆయనలాంటి నిర్మాతలు అరుదు. అందుకే ఆయనతో మరో సినిమా చేస్తున్నాను. ⇒ నా చిత్రాలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలని తపన పడుతుంటాను. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనుకుంటాను. ఆ ప్రెజర్ ఉంది. కానీ ‘హను–మాన్’ సినిమా సక్సెస్తో నాపై కొత్తగా పెరిగిన ఒత్తిడి ఏం లేదు. చె΄్పాలంటే ఒక రకంగా ‘హను–మాన్’ సినిమా విషయంలోనే ఒత్తిడి ఫీలయ్యాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించింది కదా అని ‘మిరాయ్’ సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు. ⇒ మా నాన్నగారు హార్డ్వర్కింగ్ పర్సన్. ఆయన వయసు 65. ఈ రోజుకీ ఆయన ఉదయం 6.30కి ఉద్యోగానికి వెళ్తారు. సాయంత్రం 8 గంటలకు వస్తారు. పనిని ఫస్ట్ ప్లేస్లో పెట్టేవారిలో మా ఫాదర్ ఒకరు. అలాంటి ఇంటి నుంచి వస్తున్నాను కాబట్టే పనికి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానేమో అనిపిస్తోంది. పనే దైవం అని భావిస్తాను. ⇒ కథ కుదరితే పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా రిలీజ్ చేస్తాం. నిజానికి పాన్ ఇండియా సూపర్ స్టార్లు నా చిన్నప్పట్నుంచి ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావుగార్ల సినిమాలు చెన్నైలో చూసేశారు. చిరంజీవిగారు స్ట్రయిట్గా హిందీలో సినిమాలు చేశారు. రజనీకాంత్, కమల్హాసన్గార్ల సినిమాలు నేను నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. అలాంటి వారికి జోడించాల్సిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని నాలాంటి యంగ్ హీరోస్కి పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నమ్మేవారిలో నేనొకడిని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మేం సినిమాలు చేస్తున్నాం. ఒకవేళ మేం చేసే చిత్రం ఇతర భాషల ఆడియన్స్కు కూడా నచ్చితే, అది మాకు బోనస్. దీని కోసం రిలీజ్ చేయడమే. అంతేకానీ... అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ప్రయత్నం ఏమీ లేదు. ⇒ ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నానా? లేదా అనేది ప్రశాంత్ వర్మగారు చెబుతారు. ‘జాంబిరెడ్డి 2’ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. ప్రశాంత్గారు కథ అందిస్తున్నారు. విశ్వప్రసాద్గారు నిర్మిస్తారు. ‘మిరాయ్’ సినిమా విజయం సాధిస్తే, రెండో భాగం కూడా ఉంటుంది. -
కాంత వాయిదా
‘కాంత’ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా సముద్ర ఖని ఓ కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ పేర్కొంది. కానీ ఆ తేదీకి విడుదల చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని గురువారం చిత్రయూనిట్ ఓ నోట్ను విడుదల చేసింది. ‘‘కాంత’ సినిమా టీజర్ విడుదలైనప్పట్నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆ ప్యాయత, మద్దతు మా హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ‘కాంత’ చిత్రం యూనిట్ పేర్కొంది. -
కొత్త విలన్ గురూ
తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్ గురించి తెలుసుకుందాం. ఓజీ వర్సెస్ ఓమి బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్ ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్ విలన్గా నటిస్తున్నారని తెలిసింది. రామ్ బుజ్జిగా వస్తున్నాడు హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్ సిరీస్ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్’ మున్నా ఇప్పుడు టాలీవుడ్కు వచ్చారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. రామ్బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్చరణ్ క్రికెట్ బ్యాటింగ్ – దివ్యేందు బౌలింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్’ సిరీస్తో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం. వృషకర్మలో.. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్ శ్రీవాత్సవ్. ఈ బాలీవుడ్ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ అండ్ మిథికల్ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో స్పర్‡్ష శ్రీవాత్సవ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్’లో పాజిటివ్ రోల్ చేసిన స్పర్‡్ష శ్రీవాత్సవ్ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. పోటా పోటీ బాలీవుడ్ యాక్షన్ హిట్ ఫిల్మ్ ‘కిల్’ (2023)లో విలన్గా నటించి, ఆడియన్స్ను మెప్పించారు రాఘవ్ జూయల్. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం యాక్షన్ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్ జూయల్ పేరు బాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్ ఇండియన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశం రాఘవ్కు లభించింది. ‘దసరా’ వంటి హిట్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’.ఈ చిత్రంలో రాఘవ్ జూయల్ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఓ మెయిన్ విలన్ రోల్ని రాఘవ్ చేస్తున్నారని, నానీతో రాఘవ్కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్లో ‘కిల్’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, సిద్ధాంత్ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్ ఆడియన్స్ను అలరించారు రాఘవ్. మరి... టాలీవుడ్లోనూ రాణిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్ స్వామి అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, సునీల్తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్స్పెక్టర్ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్స్పెక్టర్ స్వామి క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ సమచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్’ సినిమా కథాంశం.డ్రాగన్తో పోటీ! ‘మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎమ్’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో టొవినో థామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్ చేస్తున్నది విలన్ రోల్ అని, ఆల్రెడీ ‘డ్రాగన్’ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.తెలుగులో విలన్స్గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ⇒ హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఆమె విలన్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్లో ఉండటం సహజం.నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి సీనియర్ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్గా చేశారు. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు.‘దోశె కింగ్’ అనే కొత్త చిత్రం కోసం మోహన్ లాల్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్ రోల్ చేశారు. అలాగే జితిన్ కే జోస్ డైరెక్షన్లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్ యాక్టర్స్ విలన్ రోల్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.కెరీర్లో హీరోగా మంచి పీక్ స్టేజ్లో ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా విభిన్నమైన విలన్ రోల్ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్గా నటించారు. హిందీలో ఎన్టీఆర్కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంలో విలన్గా నటించారు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లోనూ మనోజ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (బడే మియా చోటే మియా), ఫాహద్ ఫాజిల్ (పుష్ప 3), అర్జున్ కపూర్ (సింగమ్ ఎగైన్) వంటి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్ విలన్గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
టోరంటోలో జాన్వీ కపూర్ హోయలు.. ఊహల్లో తెలిపోతున్న బిగ్బాస్ దివి!
గుజరాత్లో శ్వేతా బసు ప్రసాద్ టూర్..డిజైనర్ డ్రెస్లో రష్మిక మందన్నా సూపర్బ్ లుక్..టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..అంతా నీ ఆలోచనలే అంటూ బిగ్బాస్ దివి ప్రేమ కావ్యం..బ్లాక్ బ్యూటీలా జ్యోతి పూర్వాజ్ హోయలు.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
థియేటర్లలో మిరాయ్, కిష్కింధపురి... ఓటీటీల్లో ఏకంగా 17 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో రెండు సినిమాలు రిలీజ్ రెడీ అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద మిరాయ్, కిష్కింధపురి సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే వచ్చిందంటే స్ట్రీమింగ్కు రెడీ అయిపోతున్నాయి. ఈ వారం హిందీలో బిగ్ హిట్ కొట్టిన సయారా, తెలుగులో బకాసుర రెస్టారెంట్, రాంబో ఇన్ లవ్ లాంటి వెబ్ సిరీస్లు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్సయారా (హిందీ సినిమా) - సెప్టెంబరు 12యూ అండ్ ఎవరిథింగ్ ఎల్స్(కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 12మాలెడిక్షన్స్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12రటు రటు క్వీన్స్-(ఇండోనేషియా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12ది రాంగ్ పారిస్(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 12మెటిరియలిస్ట్స్(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 14అమెజాన్ ప్రైమ్డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12ఎవ్రీ మినిట్ కౌంట్స్ - సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12ల్యారీ ద కేబుల్ గాయ్- (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 12స్క్రీమ్ బోట్- (ఇంగ్లీష్ మూవీ)-సెప్టెంబరు 12జియో హాట్ స్టార్రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) - సెప్టెంబరు 12సన్ నెక్ట్స్మీషా (మలయాళ సినిమా) - సెప్టెంబరు 12బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 12లయన్స్ గేట్ ప్లేడిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 12ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12హులు అండ్ డిస్నీ ప్లస్లాస్ట్ ఇన్ ది జంగిల్- (డాక్యుమెంటరీ ఫిల్మ్)- సెప్టెంబర్ 12హెచ్బీవో మ్యాక్స్వార్ఫేర్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
'మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు'.. మర్యాద మనీశ్ ఫైర్!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. మొదటి వారం నుంచే హౌస్ హాట్హాట్గా సాగుతోంది. నామినేషన్స్ తంతు ముగియగానే ఒకరిపై ఒకరు తమ ఆగ్రహాన్ని ప్రదరిస్తునే ఉన్నారు. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఎపిసోడ్ ఫుల్ సీరియస్గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ఇవాల్టి బిగ్బాస్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మర్యాద మనీశ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ముల మధ్య పెద్ద వార్ నడిచింది. మీ ఇద్దరు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటున్నారని ప్రియా, శ్రీజపై మర్యాద మనీశ్ మండిపడ్డారు.నేను కామ్గా ఉన్నానని నన్ను సెపరేట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు. ఆ తర్వాత ప్రియాశెట్టి.. మర్యాద మనీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ప్రోమో చూస్తుంటే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఫైటింగ్ నడిచినట్లు తెలుస్తోంది.Fights heating up! 🔥 #PriyaShetty & #SrijaDammu Vs #ManishMaryada🤯Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat–Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/EUTUXSKlR4— JioHotstar Telugu (@JioHotstarTel_) September 11, 2025 -
ఈ లవ్ స్టోరీ చూసి ఫుల్ ఎంటర్టైన్ అయ్యా: అల్లు అర్జున్ ప్రశంసలు
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg— Allu Arjun (@alluarjun) September 11, 2025 -
రజినీకాంత్ కూలీ.. పూజా హెగ్డే మోనికా వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. పూజాహెగ్డే తన డ్యాన్స్తో మెప్పించిన మోనికా ఫుల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో సౌబిన్ షాహిర్ ఆడియన్స్ను మెప్పించారు.కాగా.. పాటను తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్స్ కూడా విడుదల చేశారు. గతంలో కుర్రకారును ఓ రేంజ్లో ఊపేసిన మోనికా ఫుల్ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. మరోవైపు ఈ సూపర్ హిట్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. Finally, Our Monica Bellucci erangi vandhachi 💃🏻 #Monica video song is out now! 💘Tamil ▶️ https://t.co/HqBfqY7AdbTelugu ▶️ https://t.co/tnMJvrUCZBHindi ▶️ https://t.co/SDtC7RjCdyKannada ▶️ https://t.co/BrwN1rAbV7Malayalam ▶️ https://t.co/viT48NIpOR@rajinikanth… pic.twitter.com/Qoy1Y3rhdc— Sun Pictures (@sunpictures) September 11, 2025 -
అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన కిరీటం సమర్పించిన ఇళయరాజా
కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా రూ. 4 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని బహుకరించారు. తాజాగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. స్వయంగా ఈ కిరీటంతో పాటు వీరభద్ర స్వామికి వెండి ఆయుధాన్ని అందజేశారు. గుడి అర్చకులు దగ్గర ఉండి ఇళయరాజాతో పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతోపాటు అమ్మవారి ఫొటో అందజేశారు. ఇళయరాజా వెంట ఆయన తనయుడు కార్తిక్, మనవడు యతీశ్ తదితరులు ఉన్నారు. ఇళయరాజాకు దైవభక్తి ఎక్కువే. తరచు ఆయన మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. 2006లో కూడా ఆయన అమ్మవారికి ఓ కిరీటం బహుమతిగా ఇచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. -
ఐసీయూలో ఉన్నాడు.. సాయానికి ముందుకు రండి: మంచు మనోజ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మన రామచంద్రకు సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామచంద్ర ఐసీయూలో ఉన్నారని.. ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి సాయం చేసి మీ ప్రేమ, మద్దతు తెలపాలని మనోజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. రామచంద్ర ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపరిచారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని గతంలో రామచంద్ర వెల్లడించారు.కాగా.. 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.Urgent 🚨 Namasthe All🙏🏻 Our dearest Rama Chandra garu is fighting for his life in the ICU. Now is the time for us to come together. Please show your love and support by contributing whatever you can even if it’s just 1 rupee.Details: Kalaga NarayanaGPay & PhonePe:…— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 11, 2025