సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతినివ్వడంతోపాటు టికెట్ల ధరలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం పెంచింది. ఈ నెల 19న తెల్లవారుజామున ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. ఇక సినిమా విడుదలయ్యాక పది రోజులపాటు మలీ్టప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.125, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.100 పెంచుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


