YSR
-
సొమ్ము సర్కారుది.. సోకు కాంట్రాక్టరుది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీకి బరితెగించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని గండికోట పర్యాటక ప్రాంతంలో 3.94 ఎకరాల్లో రూ.5.04 కోట్లతో ‘టెంట్ సిటీ’ నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా.. కాంట్రాక్టు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది. అయితే, టీడీపీ కూటమి పెద్దలకు చెందిన అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధిచేకూర్చేందుకు టెండర్ పద్ధతినే మార్చేసింది. పైకి నీతి ఆయోగ్ నమూనాను అనుసరిస్తున్నామనే రీతిలో బిల్డప్ ఇస్తూ లోపాయికారిగా నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో సదరు కాంట్రాక్టరు పైసా పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణాలు చేసుకుని వచ్చిన ఆదాయాన్ని అనుభవించేలా నిబంధనలుండటం కొసమెరుపు!ఎక్కడాలేని రీతిలో టెండర్..ఏపీటీడీసీ టెంట్ సిటీ నిర్మాణానికి పిలిచిన టెండర్లను పరిశీలిస్తే లోగుట్టు ఇట్టే అర్థమవుతుంది. ఎక్కడైనా అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులతో నిర్మాణాలు చేస్తే వాటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద గుర్తిస్తారు. ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల్లో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో నిర్మాణాలు చేయిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు, డిజైన్లకు లోబడి నిర్మాణాలుంటే కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిస్తుంది. మరో పద్ధతిలో.. అప్పటికే ఉన్న ఆస్తుల నిర్వహణకు లీజు ప్రాతిపదికపైన ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కిందకి వస్తుంది. కానీ, టెంట్ సిటీకి కోసం ఏపీటీడీసీ పిలిచిన టెండర్లలో మాత్రం భూమి ప్రభుత్వానిది.. నిర్మాణ పెట్టుబడీ ప్రభుత్వానిదే.. కట్టేది కాంట్రాక్టరు. పైగా.. 33 ఏళ్ల పాటు దీనిని అనుభవించేది కూడా సదరు కాంట్రాక్టరే! దేశంలో ఎక్కడాలేని రీతిలో ఏపీటీడీసీ తీసుకొచ్చిన కొత్త తరహా టెండర్ ఇది! స్థానిక టీడీపీ కూటమి ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ రంగంలోని వ్యక్తులకు ఈ టెంట్ సిటీని కట్టబెట్టేందుకు అనుభవంతో పనిలేకుండా తెలివిగా నిబంధనలు రూపొందించారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, ఈ టెంట్ సిటీ నిర్వహణ ప్రారంభమైన 11 ఏళ్ల తర్వాతే లీజు రెంట్ పెంపు నిర్ణయం కొసమెరుపు. -
‘మహానాడు’ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
కడప అర్బన్ : ఈ నెల 27, 28, 29వతేదీలలో సికె.న్నె పరిధిలోని పబ్బాపురంలో జరగనున్న ‘మహానాడు’ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లా ఎస్పీలు ఈజీ.అశోక్కుమార్, వి.విద్యాసాగర్నాయుడు, అధిరాజ్సింగ్రాణా బుధవారం పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన వేదిక, ఫుడ్ కోర్ట్ ల వద్ద చేపట్టాల్సిన బందోబస్తుపై సిబ్బందికి డీఐజీ దిశా నిర్దేశం చేశారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ‘మహానాడు’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రేషన్ బియ్యం స్వాధీనం దువ్వూరు : మండలంలోని పెద్ద జొన్నవరంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 28 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మల్లికార్జున తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 17.5 క్వింటాళ్లు ఉంటాయని, వాటి విలువ రూ.79,542 ఉంటుందన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించామన్నారు. డీటీ మల్లికార్జున ఫిర్యాదు మేరకు రేషన్ బియ్యం నిల్వ ఉంచిన కొండా శేఖర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
వల్లూరు : మండలంలోని కొప్పోలు బస్టాపు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు... పిఠాపురానికి చెందిన కూలీలు కుమారునిపల్లె సమీపంలో ని ఇటుకల బట్టీల వద్ద పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి వల్లూరు బస్టాపు వద్దకు భోజనానికి వెళుతుండగా.. కొప్పో లు బస్టాపు సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొంది. ప్రమాదంలో కూలీల్లో ఒకరైన చరణ్ గాయపడ్డాడు. అదుపు త ప్పి కింద పడడంతో వాహనదారుడికి గాయాలయ్యాయి. 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఉపకరణాలు
పాఠశాల ఆర్జేడీ కాగిత శామ్యూల్కడప ఎడ్యుకేషన్ : విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఉపకారణాలు అందించినట్లు జోన్ 4 పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) కాగిత శామ్యూల్ అన్నారు. స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు బుధవారం ఉపకారణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో ఉపకరణాలు తయారుచేసి అందిస్తోందన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అర్హులను గుర్తించి వీల్ చైర్స్, సీపీచైర్స్, రోలేటర్స్ అందించామని తెలిపారు. ఉపకారణాలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానంద రాజు, విభిన్న ప్రతిభవంతుల శాఖ జిల్లా సంచాలకులు కృష్ణ కిశోర్ మాట్లాడుతూ ఉపకారణాలతో దివ్యాంగులు తమ లోపాలు అధిగమించి రాణించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్కుమార్, రమణమూర్తి, కేశవరెడ్డి, విశ్వనాథరెడ్డి, వీరేంద్ర, మమత, విజయమ్మ, పద్మ, గంగులప్ప, చంద్ర, రాజా, తదితరులు పాల్గొన్నారు. -
కళాశాల గదుల వేలం వాయిదా
ప్రొద్దుటూరు : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలోని మలయాళస్వామి బీఈడీ కళాశాల గదుల వేలంపాట వాయిదా పడింది. పర్యవేక్షణ అధికారి రాకపోవడంతో వాయిదా వేశామని ఈఓ రామచంద్రాచార్యులు ప్రకటించారు. దీంతో దేవాదాయ శాఖకు మరింత నష్టం వాటిల్లినట్లయింది. అయితే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రమేయంతోనే వేలంపాట నిర్వహించలేదని, కళాశాల నిర్వాహకులకు అనుకూలంగా సదరు ప్రజాప్రతినిధి వ్యవహరించి ఫోన్ చేయడంతోనే వాయిదా వేశారని చర్చ సాగుతోంది. బహిరంగ వేలం నిర్వహిస్తే ఈ గదులకు నెలకు రూ.లక్ష వరకు ఆదాయం లభించే అవకాశం ఉన్నా.. అధికారుల తీరుతో అందకుండాపోయింది. ఏడేళ్లుగా అద్దె చెల్లించలేదు దేవాదాయ శాఖ ఆధ్వర్యం శ్రీకృష్ణ గీతాశ్రమంలో 7,744 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో మలయాళ స్వామి బీఈడీ కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ భవనాలకు ఏడేళ్లుగా కళాశాల నిర్వాహకులు అద్దె చెల్లించడం లేదు. కళాశాల యాజమాన్యం గతంలో కోర్టును ఆశ్రయించడంతో గత ఏడాది సెప్టెంబర్ 11న అప్పీల్ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఈఓ ఏడేళ్ల బకాయిలు రూ.7 లక్షలు చెల్లించాలని పలుమార్లు నోటీసులిచ్చినా నిర్వాహకులు స్పందించలేదు. నాలుగు రోజుల కిందట కళాశాల భవనాలను ఈవో సీజ్ చేసి వేలం నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేశారు. విషయం తెలుసుకున్న కళాశాలల నిర్వాహకులు వేలం పాటలో పాల్గొనేందుకు గీతాశ్రమానికి వచ్చారు. అయితే పర్యవేక్షణ అధికారి రాకపోవడంతో వాయిదా వేశామని ఈఓ తెలిపారు. పది రోజుల తర్వాత తిరిగి వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాగే.. దేవాదాయశాఖకు సంబంధించిన గదులను లోపాయికారీ ఒప్పందాలతో తక్కువ ధరకే అద్దెకు ఇస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. వేలం పాట నిర్వహణను పరిశీలించేందుకు బుధవారం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈఓతో ఆయన మాట్లాడుతూ గతంలోలాగే జరుగుతోందని ఇక్కడికి వచ్చానని, ప్రస్తుతం అదే రీతిన వేలం పాట నిర్వహించకుండా వాయిదా వేశారని అన్నారు. గతంలో వేలం జరిపినట్లు రికార్డులు తయారుచేసి అతి తక్కువ బాడుగకు ఇచ్చారని ఆయన తెలిపారు. ఎవరైతే ఆశ్రమానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారో వారికే రూములను అప్పజెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పది రోజుల తర్వాత అయినా పారదర్శకంగా వేలం పాట నిర్వహించాలని ఈఓను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయశాఖ ఆదాయానికి గండి కొట్టొద్దని తెలిపారు. ఇలా జరిగితే న్యాయ పోరాటం చేస్తానన్నారు. అధికార పార్టీ నేత ఒత్తిడే కారణమా? -
దివ్యాంగుడి బతుకుపోరాటం
అతడు పుట్టుకతోనే దివ్యాంగుడు. ఎవరిపైనా ఆధారపడకుండా మనోధైర్యంతో పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు. పేద కుటుంబంలో పుట్టినా.. మంచంపట్టిన తల్లిని చూసుకుంటూ తోబుట్టువుల సాయం లేకపోయినా స్వశక్తితో జీవనం సాగిస్తున్నాడు. మూడు చక్రాల బండే తనకు జీవనాధారం. ఆ బండితోనూ తన బ్రతుకు పోరాటం సాగిస్తున్నాడు. ఉన్న సొమ్మంతా తల్లి వైద్యానికి ఖర్చు చేయడంతో ఇపుడు చేతిలో చిల్లిగవ్వలేక కటిక పేదరికంతో అల్లాడిపోతున్నాడు. బ్రహ్మంగారిమఠం : మండలంలోని ఎద్దులాయపల్లె గ్రామానికి చెందిన పెగడ వెంకటేశ్వర్లు, పెగడ లక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి పిల్లలను పెంచారు. పెద్దవారిని చేసి వివాహాలు చేశారు. వీరికి దివ్యాంగుడైన చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు ఉన్నాడు. కొన్నేళ్ల కిందట భర్త వెంకటేశ్వర్లు చనిపోవడంతో లక్ష్మమ్మ దివ్యాంగ కుమారుడికి తోడుగా ఉండేది. అన్నదమ్ములు ఎవరూ రాకపోయినా.. చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు తల్లి ఆలనాపాలనా తనపై వేసుకొని జీవనం సాగించాడు. రెండు కాళ్లు పనిచేయకపోయినా రిక్షాపైనే పనులు చేసుకుంటూ.. తనకు వచ్చే పింఛనుతో జీవనం సాగించాడు. ఇటీవల విధి వంచించింది. అతడి తల్లి లక్ష్మమ్మకు ఏడాది కిందట కిందపడి కాలు విరగడంతో మంచానికే పరిమితమైంది. 105 ఏళ్లు నిండడంతో ఆమె వైద్యం కోసం అప్పు చేసి రూ 2.50 లక్షలు ఖర్చు చేశారు. అన్నదమ్ములు ఆదుకోకపోవడంతో అప్పులు తీర్చలేక, దివ్యాంగుడు కావడంతో ఏమి చేయాలో తోచక కన్నతల్లిని చూసుకుంటూ విలపిస్తున్నాడు వెంకటేశ్వర్లు. దాతలు ఆదుకుంటే తాను తల్లిని కాపాడుకుంటానని వేడుకుంటున్నారు. సాయం చేసేవారెవరైనా 9346687016, 8309431953లో సహకరించాలంటూ కోరుతున్నాడు. మంచం పట్టిన తల్లిని కాపాడుకోలేక కన్నీరు మున్నీరు -
భూసార పరీక్ష.. పంట దిగుబడికి రక్ష
వ్యవసాయ డివిజన్ల వారీగా మట్టి నమూనాల సేకరణ లక్ష్యాలు ఇలా ఉన్నాయివ్యవసాయ మండలాల నమూనాల డివిజన్ సంఖ్య సంఖ్య కడప 6 3366 కమలాపురం 4 3300 పులివెందుల 5 3696 ముద్దనూరు 4 2674 ప్రొద్దుటూరు 4 3107 మైదుకూరు 4 2904 బద్వేలు 4 1814 పోరుమామిళ్ల 5 3427 మొత్తం 36 24,288 వల్లూరు : భూసార పరీక్షలను నిర్వహించుకుని భూముల స్వభావం, అందులోని పోషక విలువల ఆధారంగా తగిన పంటలను ఎంపిక చేసుకుని సాగులో మెలకువలు పాటించడం వలన అధిక దిగుబడులను సాఽధించడానికి అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు తెలుపుతున్నారు. నేలలు తమలో సహజంగా ఇమిడి వున్న పోషక పదార్థాలతోబాటు మనం అదనంగా వేసే సేంద్రీయ , రసాయనిక ఎరువుల్లోని పోషకాలను పంటలకు అందజేస్తాయి. ఈ పోషక విలువలతో బాటు భూమిలోని చౌడు గుణం, సున్నం శాతం, నేల కాలుష్యం మొదలైన వాటి స్థాయిలను తెలుసుకోవడానికి భూసార పరీక్ష ఉపయోగపడుతుంది. అంతేగాక నేలల్లో వివిధ రకాల నేలలు వుండగా అందులో కొన్ని రకాల నేలల్లో ప్రత్యేకించి కొన్ని పంటలు సాగుకు అనుకూలంగా వుండి మంచి దిగుబడులు వస్తాయి. భూమి స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా అందుకు తగిన పంటలను సాగు చేసి మంచి ఫలితాలను పొందవచ్చు. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి.. కనీసం రెండు లేక మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను చేయించుకుని తమ పొలాల్లోని వివిధ పోషక పదార్థాల విలువలను తెలుసుకోవడం ద్వారా తగిన మోతాదులోనే ఎరువులను వాడడానికి అవకాశం ఉంటుంది. దీని వలన అవసరమైన పోషకాలను మాత్రమే పంటలకు అందించడం వలన అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతే కాక భూమిలో నిల్వ ఉన్న వివిధ పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఆశించిన దిగుబడులను పొందవచ్చు. సరైన పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తేనే ఫలితం.. కాగా భూసార పరీక్ష నిర్వహించడంలో సరైన పద్ధతిని పాటిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. కావున భూసార పరీక్షలు నిర్వహించేటపుడు రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ● పొలంలో ఇంగ్లీషు వీ అక్షరం ఆకారంలో 15 సెం, మీ వరకు పారతో గుంత తీసి అందులో పై పొర నుండి కింది పొర వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ● ఒక ఎకరా విస్తీర్ణంలో 8 నుండి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక చోట చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదురెదురుగా వున్న భాగాలను తీసుకుని మిగిలిన భాగాలను తీసి వేయాలి. ఇదే విధంగా మట్టి పరిమాణం 1/2 కిలో వచ్చే వరకు చేయాలి. ● సేకరించిన మట్టిలో రాళ్లు, వేర్లు లేకుండా చేసి నీడలో ఆరబెట్టాలి. ● మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రీయ ఎరువులకు ఉపయోగించిన సంచులను వాడరాదు. ● గట్ల దగ్గర, పంట కాల్వలలో, చెట్ల కింద, ఎరువులను కుప్పలుగా వేసిన చోట, ఎప్పుడూ నీరు నిల్వ వుండే ప్రదేశంలో మట్టి నమూనాను సేకరించరాదు. ● పొలంలో చౌడు ప్రాంతం ఉన్నట్లైతే ప్రత్యేకంగా నమూనాను తీసి పంపాలి. ● పండ్ల తోటల సాగుకు పంట రకాన్ని బట్టి 3 నుండి 6 అడుగుల లోతు వరకు గుంతను తీసి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి పంపాల్సి ఉంటుంది. రైతులకు ఉపయుక్తంగా భూసార పరీక్షా పత్రాలు.. సేకరించిన మట్టి నమూనాలను అందుబాటులోని భూసార పరీక్షా కేంద్రాలకు పంపితే వారు పరీక్షలు నిర్వహించి వివిధ పోషక విలువల శాతాన్ని నమోదు చేస్తారు. వీటిని కార్డులలో పొందుపరిచి రైతులకు అందచేస్తారు. ఇందులో ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రీయ కర్బణంలతో బాటు ప్రధాన పోషకాలైన నత్రజని, బాస్వరం, పొటాషియం, సూక్ష్మ ధాతు పోషకాలైన గంధకం, జింక్, బోరాన్, ఇనుము, మాంగనీసు, రాగి వంటి వాటి విలువల శాతాన్ని నమోదు చేస్తారు. దీనితో బాటు సాధారణంగా అవి ఉండాల్సిన శాతాన్ని బట్టి పరీక్షల్లో నమోదైన విలువల స్థాయిలను తక్కువ, ఎక్కువ, సాధారణం, మధ్యస్థం, అతి తక్కువ, అతి ఎక్కువ వంటి వివరాలతో సూచిస్తారు. వీటిని ఆధారంగా చేసుకుని పంటలకు వాడాల్సిన ఎరువుల మోతాదులను, వాడే విధానాలను సైతం సూచిస్తారు. ఇవి పాటించడం వలన రైతులు పంటల సాగులో ఖర్చులను తగ్గించుకుని నికర ఆదాయాన్ని పెంపొందిచుకునే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో భూసార పరీక్షల నిర్వహణకు గానూ మట్టి నమూనా సేకరణను ఇప్పటికే ప్రారంభించారు. గత ఏడాది మట్టి నమూనాల సేకరణ లక్ష్యం 17800 కాగా, 2025– 26 సంవత్సరానికి గానూ జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో మొత్తం 24,288 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో మట్టి నమూనాల సేకరణ ప్రారంభం జిల్లా లక్ష్యం – 24,288 నమూనాలు భూసార పరీక్షతో ప్రయోజనాలు.. భూసార పరీక్ష చేయించుకుని నేల స్వభావాన్ని బట్టి పంటలను సాగు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. భూమిలోని పోషకాల విలువలను తెలుసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలను మాత్రమే ఎరువుల రూపంలో వాడవచ్చు. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. – ఏవీ నరసింహారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, కమలాపురం -
ఏపీ ఈఏపీ సెట్కు 2493 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్ ఆన్లైన్ పరీక్షలు బుధవారం రెండు సెషన్స్లో జరిగాయి. జిల్లావ్యాప్తంగా 2493 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కడపలో ఐదు పరీక్షా కేంద్రాలు, ప్రొద్దుటూరులోని మూడు పరీక్షా కేంద్రాలకుగాను 2621 మంది అభ్యర్థులకుగాను 128 మంది గైర్హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్కు సంబంధించి 95.12 శాతం హాజరు నమోదయింది. నేడు ఉద్యోగ మేళా కడప ఎడ్యుకేషన్: కడప రిమ్స్ రోడ్డులోని స్పిరిట్స్ కాలేజీలో నవత ట్రాన్స్ పోర్ట్ కంపెనీ వారు వివిధ పోస్టులకు సంబంధించి గురువారం ఉద్యోగ నియామక ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ సంచాలకులు ఎంసీ రవీంద్ర తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు ఉద యం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇంటర్, డిప్లొమా, డీగ్రీ పాస్ అయినవారు అర్హులని తెలిపారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్, ఫొటోస్, బ్యాంకు అకౌంట్స్ తో హాజరు కావాలని.. వివరాలకు తమ కాలేజి ఉద్యోగ నియామక అధికారి ఫోన్ నెంబర్ 988525 0955ను సంప్రదించాలని సూచించారు. జెడ్పీలో బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్లో సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 23, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తేది 15.05.2025 మేరకు జూన్ 2వ తేదిలోపు సాధారణ బదిలీలు జరగనున్నాయి. ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన ఎంపీడీఓలు, మినిస్ట్రీరియల్, నాల్గవ తరగతి సిబ్బంది అధికారుల అనుమతితో రిక్వెస్ట్ బదిలీ దరఖాస్తులు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోపు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సీఈఓ ఓబులమ్మ తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఏదైనా రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ కావాలని కోరుకునే వారు కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. క్రమశిక్షణా చర్యలుగానీ లేదా శాఖాపరమైన చర్యలు ఉన్నవారు బదిలీకి అనర్హులవుతారు. సాధారణ బదిలీలపై వచ్చేనెల 3 నుంచి మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఆర్డీఎస్ఎస్ పనుల్లో వేగం పెంచాలి కడప కార్పొరేషన్: రివాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్డీఎస్ఎస్) కింద మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. రమణ ఆదేశించారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్లో ఆర్డీఎస్ఎస్ పథకం కింద జరుగుతున్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రీఫేస్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఈ పనులలో వేగవంతం పెంచాలని, తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు త్వరగా లబ్ధి చేకూరటమే కాకుండా విద్యుత్ వ్యవస్థ పటిష్టవంతంగా తయారవుతుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు, డీఈఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్య యోగం
కడప ఎడ్యుకేషన్: యోగాతోనే సర్వ మానవాళికి ఆరోగ్య యోగం సిద్ధిస్తుందని దైనందిన జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకు ని బుధవారం కడప ఇండోర్ స్టేడియంలో ముందస్తు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్తోపాటు ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీ య యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగా మంత్‘నేటి నుంచి మొదలైందన్నారు. జూన్ 21న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నా రు. ఈ నేపథ్యంలో ఒక యాప్ని కూడా ప్రారంభించారని.. ఆ యాప్లో అందరూ రిజిస్టర్ కావచ్చన్నారు. మానసిక సమస్యలకు, శారీరక రుగ్మతలకు యోగ మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. జేసీ అదితిసింగ్ మాట్లాడారు. కలెక్టర్ యోగాసనాలు వేసి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, డిపివో రాజ్యలక్ష్మి, డిఎంహెచ్ఓ నాగరాజు, జెడ్పి సీఈవో ఓబులమ్మ, జిల్లా అధికారులు, ఆయుష్ సిబ్బందిపాల్గొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించాలి కడప సెవెన్రోడ్స్: జిల్లా అభివృద్ధిలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 20 లక్షలు మొక్కలు నాటాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని బోర్డు రూం హాల్లో డీఎఫ్ వినీత్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మొక్కల పెంపకం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రెండు దశలలో జూన్ 27వ తేదీ పది లక్షల మొక్కలు, ఆగస్టు 29వ తేదీన పదిలక్షలు మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడపలో ప్రారంభమైన ప్రపంచ యోగా ముందస్తు వేడుకలు -
ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటం
పులివెందుల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతరపున నిరంతరం పోరాటాలు చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరిత మాటలతో కాలం నెట్టుకొస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుకు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుండరని విమర్శించారు. ఆయనకు రాష్ట్ర భవిష్యత్తు కంటే కక్ష సాధింపు రాజకీయాలే ఎక్కువయ్యాయని మండిపడ్డారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎంపీని కలిసిన ఎండీయూ ఆపరేటర్లు బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్లు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఉన్నఫలంగా విధుల నుంచి తొలగించిందన్నా రు. 2027వ సంవత్సరం జనవరి వరకు అగ్రిమెంట్ ఉన్నా కూడా అక్రమంగా ప్రభుత్వం తొలగిస్తోందని ఎంపీ దృష్టికి తెచ్చారు. దీనికి ఎంపీ మాట్లాడుతూ ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం దారుణమని, జగనన్న ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ అందించడం ద్వారా ప్రజలకు మేలు జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఒక్కరూపాయి భారం పడకుండా క్రాప్ లోన్స్ రుణాలు చేయాలి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని రైతులు కలిశారు. ఈ సందర్భంగా వారు క్రాప్ లోన్ల విషయమై తాము పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన రైతులతో కలిసి స్థానిక స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్కు వెళ్లి మేనేజర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మేనేజర్తో మాట్లాడుతూ రైతుల మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా క్రాప్ లోన్స్ రుణాలు చేయాలన్నారు. ప్రస్తుతం రైతులపై అధిక వడ్డీ భారం మోపడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అనంతరం కడప రీజినల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ఎంపీని కలిసిన బ్యాంక్ అధికారులు కడప రీజినల్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి చీఫ్ మేనేజర్ సీఎస్ ఆనంద్ పులివెందుల మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్యామలారావు బుధవారం సాయంత్రం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లి ఆయన కలిసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రైతులపై ఒక రూపాయి కూడా భారం పడకుండా చూస్తామని ఎంపీకి వివరించారు. ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు దారుణం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
వాసువి చిల్లర రాజకీయాలు
● ఆయనవి ‘మార్ఫింగ్’ రాజకీయం ● నువ్వు నన్నేమీ చేయలేవు ● టీడీపీ సీనియర్ నేత లక్ష్మీరెడ్డి ధ్వజంకడప రూరల్: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఆలంఖాన్పల్లె లక్ష్మీరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ పనులు చేస్తూ అంకెలను ‘మార్ఫింగ్’ చేయడంలో శ్రీనివాసులురెడ్డిపై దిట్ట అని విమర్శనాస్త్రాలు సంధించారు. మినీ మహానాడులో తాను పార్టీకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడినట్లుగా మార్ఫింగ్ చేసి వినిపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఏనాడు పార్టీ నియమాలను ఉల్లంఘించలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో అధ్యక్షుడిగా శ్రీనివాసులురెడ్డి సహకారం లేకుండా ఆలంఖాన్పల్లెలో విజయకేతనం ఎగురవేశామన్నారు. తన కోడలు ఉమాదేవి కార్పొరేటర్గా గెలిచిందన్నారు. గత ఎన్నికల్లో శ్రీనివాసులురెడ్డి కడప పార్లమెంట్ టికెట్ నాకు, కడప ఎమ్మెల్యే సీటు మీకు అని చెప్పారన్నారు. యువ నేత నారా లోకేష్ కూడా కడప ఎమ్మెల్యే సీటును తన కోడలు ఉమాదేవికే ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఎంపీగా పోటీ చేయాలనుకున్న శ్రీనివాసులురెడ్డి కన్ను కడప ఎమ్మెల్యే స్ధానంపై పడిందని అన్నారు. ఈ విషయమై ఆయన విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయం చేశారన్నారు. తాజాగా ఆయన తన కొడుకును కడప మేయర్గా చేయాలనే ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజాదరణ కలిగిన తాము అందుకు అడ్డుపడుతామని, వాసు తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ‘వాసూ..నువ్వు నన్నేమీ చేయలేవు’ అని వ్యాఖ్యానించారు. కార్పొరేటర్ ఉమాదేవి మాట్లాడు తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడప మినీ మహానాడులో చిల్లర రాజకీయాలు చేశారన్నారు. -
ఇక పుస్తకాలతో దోస్తీ!
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. పుస్తకాలతో కుస్తీ షురూ అయింది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి గడువు తక్కువగా ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఒత్తిడి మొదలైంది. దీనికితోడు నోటిఫికేషన్లో ఊహించని విధంగా మెలికలు పెట్టడంతో చాలా మంది అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా జనరల్ అభ్యర్థులకు 45 శాతం మార్కుల నిబంధన పెట్టి వారి ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. ● ఉమ్మడి కడప జిల్లా పరిధిలో ఈ డీఎస్సీ పరీక్ష కోసం 29,915 దరఖాస్తులు రాగా.. ఇందులో 15,812 మంది అభ్యర్థులు పరీక్షను రాయనున్నారు. కొందరు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేశారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలుపుకుని 705 పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 20 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ పూర్తయింది. ఈనెల 30న హాల్టిక్కెట్లు విడుదల చేయనున్నారు. జూన్ 6 నుంచి పరీక్ష ప్రారంభమై జూలై 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఒక్కో పోస్టుకు 49 మంది వరకు పోటీ అందిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు 49 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఈ పోటీకి తగ్గట్టుగా పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం లేకపోవడంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొందరు కోచింగ్ సెంటర్లలో, మరి కొందరు అభ్యర్థులు ఇళ్లల్లో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ముగిసిన డీఎస్సీ దరఖాస్తు గడువు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 29,915 దరఖాస్తులు మొత్తం 705 డీఎస్సీ పోస్టులు ఒక్కో పోస్టుకు 49 మంది అభ్యర్థులు పోటీ ఈనెల 15తో ముగిసిన దరఖాస్తు ప్రక్రియ 20 నుంచి మాక్టెస్ట్....30 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ జూన్ 6 నుంచి నెలరోజులపాటు డీఎస్సీ నిర్వహణ మహిళలే అత్యధికం ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో మహిళలే అత్యధికంగా ఉన్నారు. 15812 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 9598 మంది మహిళలు ఉండగా 6214 మంది పురుషులు ఉన్నారు. కొందరు అభ్యర్థులు తమ అర్హతలను బట్టి పలు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు. -
నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత
కడప సెవెన్రోడ్స్: వర్షాలు సంవృద్ధిగా కురిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుణ్యక్షేత్రమైన గండిలో లక్ష లీటర్ల సామర్థ్యంతో నీటిట్యాంకు నిర్మించేందుకు జెడ్పీ నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తామని, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అంచనా వ్యయాలు రూపొందించి సమర్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి సూచించారు. కాశినాయన మండల జెడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామమైన నాయనిపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ వలసపల్లె గ్రామంలో మూడేళ్లుగా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిమెంట్ యాజమాన్యం తవ్వకాలు చేపట్టడం వల్ల భూగర్భజలాలు లేకుండా పోయాయన్నారు. చిలంకూరు–ఉప్పలూరు రోడ్డు అధ్వానంగా ఉందని, మరమ్మతులు చేయించాలని కోరారు. ● జెడ్పీ చైర్మన్రామగోవిందరెడ్డి మాట్లాడుతూ రాజంపేట బస్టాండులో టాయిలెట్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించి ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి సూచించారు. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లె చెరువు వద్దకు ఇటీవల ఈతకు వెళ్లి మృతి చెందిన పిల్లల కుటుంబాలకు కాంట్రాక్టర్ నుంచి పరిహారం ఇప్పించే విధంగా కలెక్టర్తో మాట్లాడాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా అనేక ఏళ్ల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 60 మందిని తొలగించడం అన్యాయమన్నారు. ఏ కారణంతో వారిని తొలగించారో చెప్పాలని డ్వామా అధికారులను ఆయన ప్రశ్నించారు. చిన్నచిన్న తప్పులు చేసిన వారినంతా తొలగించుకుంటూపోతే డ్వామా లో ఒక్కరూ కూడా మిగలరన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్స్రే ప్లాంట్లు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచడం మాత్రమే కాదని, వాటి నిర్వహణకు తగిన సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. ఎస్సీ,ఎస్టీల ఇళ్లకు ఉచితంగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. నాడు–నేడు కింద జిల్లాలోని పాఠశాలల మరమ్మతు పనులు చేపడతామన్నారు. జెడ్పీ సమావేశాలకు హాజరు కాని అధికారులకు కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేసేలా చూడాలని జెడ్పీ సీఈఓను కోరారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు పిట్టు బాలయ్య మాట్లాడుతూ జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందువల్ల రైతులకు నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండ్లిమర్రి మండలం యల్లటూరు రోడ్డుపై చిన్న వర్షానికే నీరు నిలబడుతోందని, రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ 50 ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పెన్షన్ మంజూరు చేస్తామంటున్న ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిందా? అంటూ ప్రశ్నించారు. మైదుకూరు నియోజకవర్గంలో 25 స్మశాన వాటికల పనుల కోసం ఉపాధి హామి నిధులను వినియోగించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నారని, మిగతా ప్రాంతాలకు కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని కోరారు. వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా తదితరులుమాట్లాడారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మతోపాటు పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అన్యాయం నాడు–నేడు కింద పాఠశాలలమరమ్మతు పనులు జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి -
కడపలో ‘మహా’ కలెక్షన్!
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు కొత్త దందాకు తెరతీశారు. కడపలో టీడీపీ మహానాడు కోసం మహా కలెక్షన్ మొదలుపెట్టారు. నిన్నటి వరకు కడప నగర అభివృద్ధి పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని చెప్పినవారు... నేడు ఆ సొమ్మును మహానాడు పేరుతో తమ జేబులో వేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో గెలవడం కోసం మాధవిరెడ్డి కడప నగరాభివృద్ధి కోసం చేసే పనుల వివరాలు తెలియజేస్తూ సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో భాగంగా కడప నగరంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు పెడతానని హామీ ఇచ్చారు. ఆమె గెలిచి ఏడాదైనా ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల ముందు సొంత నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన భార్యాభర్తలు, ఇప్పుడు విరాళాల పేరుతో బలవంతంగా వసూళ్లపర్వం మొదలుపెట్టారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వాలని ప్రముఖులకు వాట్సాప్ మెసేజ్లు పంపారు. ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలో కూడా వారే నిర్ణయించారు. ఎమ్మెల్యే సూచన మేరకు నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు రూ.లక్ష చొప్పున విరాళం ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నగర శాఖ ఆదేశించింది. ఎస్పీ పేరిట చెక్ లేదా డీడీ ఇవ్వాలని సూచించింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఎస్పీ ప్రకటించినట్లు తెలిసింది. ఇదే సమయంలో కడపలోనే మహానాడు నిర్వహిస్తుండడంతో ఎస్పీకి చెక్ లేదా డీడీ ఇవ్వాలన్న నేతలు ఇప్పుడు నేరుగా నగరంలోని ప్రముఖులందరికీ ఫోన్లు చేసి తమకే ఆ లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నగర అభివృద్ధి అనేది పక్కకుపోయి, ఇప్పుడు మహానాడు ఖర్చుల కోసం కొత్త కలెక్షన్లకు తెరలేపారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విరాళల కోసం శ్రీనివాసులురెడ్డి నేరుగా వైద్యులకు ఫోన్లు చేస్తున్నట్లు పలువురు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే కొంతమంది డాక్టర్లు డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం.నగరాభివృద్ధి కోసమే అయితే ‘కడప నగరాభివృద్ధికి చేయూతనివ్వండి. నేరాల కట్టడికి మీ వంతు బాధ్యతగా కృషి చేయండి. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించండి’ అని కోరితే ఆసక్తిగలవారు ముందుకొస్తారు. దాతలు నేరుగా సీసీ కెమెరాలను అందజేస్తారు. కానీ, ఇక్కడ దాతలకు ఆ వెసులుబాటు లేదు. బలవంతంగా తాము ఎంత చెబితే అంత సమరి్పంచుకుని వెళ్లాల్సిందేనని హుకుం జారీ అయ్యింది. తొలుత సీసీ కెమెరాల పేరుతో వైద్యులు మాత్రమే రూ.లక్ష ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు నగరంలోని ప్రముఖులకు ఫోన్లు చేసి మరీ ఎంత విరాళం ఇవ్వాలో చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇలాంటి సంస్కృతి కడపలో మునుపెన్నడూ లేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశారని, పైసా కూడా ప్రజల నుంచి విరాళం తీసుకోలేదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, ఆమె భర్త ఏడాదిలోనే ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలను స్వాహా చేస్తున్నారని, విరాళాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. -
ఆన్లైన్ బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి కడపజిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్, మునిపాలిటీ యాజమాన్యాల్లో పనిచేసే గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బుధవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు . తప్పనిసరి బదిలీ అయ్యేవారు.. అభ్యర్థన బదిలీల కోరేవారు నేటి నుంచి ఆన్లైన్లో బదిలీ అప్లికేషన్ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని డీఈఓ సూచించారు. 81 మంది హాజరు కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన హిందీ పరీక్షకు 81 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలలో 223 మంది విద్యార్థులకుగాను 81 మంది హాజరుకాగా 142 మంది గైర్హాజయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని డీఈఓ తెలిపారు. దరఖాస్తు గడుపు పొడిగింపు కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరేందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడగించినట్లు ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేక ఫెయిల్తోపాటు ఆపై విద్యార్హతలు కలిగి ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ దగ్గరలోని ఏ ప్రభుత్వ ఐటీఐ వద్దకు వెల్లి iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఆన్లైన్లో తమ దరఖాస్తును రిజిస్వేషన్ చేసుకో వాలని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్టర్ చేసిన దరఖాస్తును తప్పని సరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తుల వెల్లువ కడప అర్బన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, వైద్య కళాశాల (రిమ్స్)ఆవరణలోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ హాస్పిటల్లో కాంట్రాక్ట్ విధానంలో 19 పోస్టులు, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో 50 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ను విడుదల చేశారు. మంగళవారం ఆఖరిరోజు కావడంతో నిరుద్యోగులు వెల్లువలా వచ్చారు. సిబ్బంది పోస్టుల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. ఏపీ ఐసెట్లో మెరిసిన రైతుబిడ్డ కడప ఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్ ఫలితాల్లో రైతు బిడ్డ సందీప్రెడ్డి రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ద్వారకచర్ల జగదీశ్వర్రెడ్డి, సావిత్ర దంపతుల కుమారుడు సందీప్రెడ్డి ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాభ్యాసం స్థానికంగా, ఇంటర్ను హైదరాబాదులోని నారాయణ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీని డిల్లీలోని హిందూ కళాశాలలో పూర్తి చేశాడు. ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెనెజ్మెంట్(ఐఐఎం)లో ర్యాంకు సాధించాలనేదే తన లక్ష్యమని.. త్వరలో జరిగే ఐఐఎంలో కూడా మంచి ర్యాంకు సాధిస్తానని సందీప్రెడ్డి తెలిపారు. పోలీస్ జాగిలం మృతి కడప అర్బన్: జిల్లా పోలీస్ శాఖకు 2013 నుంచి విశేష సేవలందించి తొమ్మిది నెలల కిందట పదవీ విరమణ పొందిన పోలీస్ జాగిలం ’సన్నీ’ మంగళవారం వయోభారంతో మృతిచెందింది. ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ ఆదేశాల మేరకు ఆర్ఐ టైటస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ’సన్నీ’ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. లాబ్రడార్ జాతికి చెందిన సన్నీని పలు వీవీఐపీల బందోబస్తు విధులు, సీఎం బందో బస్తు విధులు, గోదావరి పుష్కరాలు, తిరుమల బ్రహ్మోత్సవాలలో విధులకు తీసుకెళ్లారు. అసెంబ్లీ బందోబస్తు, ఎన్నికల బందోబస్తు విధుల్లో సమర్ధంగా విధులు నిర్వహించి ఆ జాగిలం ప్రశంసలందుకుంది. దీంతో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
టీడీపీలో నయా నియంత!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో జెండా మోసినోళ్లకే పెద్దపీట.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా వ్యక్తిగత భజన చేసినోళ్లకే పదవులు. ముఖ్యంగా కడప గడపలో అక్షరాల ఇదే నిజమని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఆశించిన గుర్తింపు లభించలేదు. పైగా భౌతికదాడులు తెరపైకి వస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నియంతృత్వం రాజ్యమేలుతోందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. ● కడప నియోజకవర్గంలో టీడీపీ విపక్షంలో ఉండగా జి.లక్ష్మిరెడ్డి, ఎస్. గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, అమీర్బాబు ఈ నలుగురు ప్రధానంగా తెరపై కన్పించేవారు. ఇప్పుడు వారి పరిస్థితి, ప్రాధాన్యత ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చని టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడొకరు చెప్పుకొస్తున్నారు. పైగా మినీ మహానాడు సందర్భంగా ఆ నలుగురు కూడా వాట్సాప్ మేసేజ్ ద్వారా హాజరు కావాల్సిన దుస్థితి నెలకొంది. అందులో ఇద్దరికి వాట్సాప్ మేసేజ్ కూడా అందలేదని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్న తరుణంలో చాలా వరకూ పార్టీనే సర్వస్వం అనుకున్న వారు క్రమంగా కనుమరుగు అవుతూ వస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొందని పలువురు వివరిస్తున్నారు. చిన్నచౌక్ కార్యాలయం మూత... ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి ఎన్నికై న తర్వాత అప్సరా హాల్ సమీపంలో 1 నుంచి 13 డివిజన్లు కోసం ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాంప్రసాదరెడ్డి కేంద్ర బిందువుగా ఏర్పాటైనా ఆ కార్యాలయం సరిగ్గా ఆరునెలలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మూపించారని ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయం ప్రారంభించడం ఎందుకు? అంతలోనే మూపించడం ఎందుకని ‘తమ్ముళ్లు’ ప్రశ్నిస్తున్నారు. నగరంలో మాధవిరెడ్డి విజయం కోసం రాంప్రసాదరెడ్డి, మరోవైపు రూరల్లో పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి విశేషంగా పనిచేశారు. ఏడాది తిరక్కముందే ఆ ఇరువురితో అంటీ ముట్టనట్లుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారిక పర్యటనల్లో కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి కనీస పిలుపు లేకుండా పోతోందని పలువురు వాపోతున్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం బ్రౌన్ లైబ్రరీ, స్టార్టప్ కార్యాలయాలకు భూమిపూజ కార్యక్రమాలను పలువురు ఉదహరిస్తున్నారు. ఆ కార్పొరేటర్లే పెద్దదిక్కు... కడప గడపలో తలలు పట్టుకుంటున్న టీడీపీ నేతలు విజయం కోసం పనిచేసిన నేతల్లో తీవ్ర అసంతృప్తి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినా నేతల్లో నిస్తేజం నేడు రాజరాజేశ్వరీ కళ్యాణమండపంలో మినీ మహానాడు తెలుగుదేశం పార్టీకి ఉమాదేవి ఒక్కరే కార్పోరేటర్. ఉన్న ఒక్కగానొక్క కార్పొరేటర్ను చేరదీయడం అటుంచితే, నిండు సభలో అవమానించారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆ విషయం ప్రస్ఫుటమైంది. మరోవైపు 8మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లును బెదిరించి బలవంతంగా తెలుగుదేశం కండువా కప్పా రు. అందుకు 8వ డివిజన్ కార్పొరేటర్ ఉదంతమే నిదర్శనం. కార్పొరేటర్ వెంచర్పైకి కార్పొరేషన్ అధికారులను ఉసిగొల్పి, ఆపై కార్పొరేటర్ దంపతులకు టీడీపీ కండువా కప్పారు. ఇలా బెదిరింపులకు లొంగి టీడీపీలో చేరిన వారే ప్రస్తుతం కడపలో టీడీపీకి పెద్ద దిక్కయ్యారని పలువురు సీనియర్లు వాపోతున్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా ప్రెస్మీట్ పెట్టాలన్నా వారే, భజన చేయాలన్నా వారే ప్రధానంగా నిలుస్తున్నారని విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం రాజరాజేశ్వరీ ఫంక్షన్ హాల్లో కడప మీనీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఆవిర్భావం నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఏపాటి మర్యాద లభిస్తోందో వేచిచూడాల్సిందే! -
హార్సిలీహిల్స్ సుందరీకరణకు ప్రణాళిక
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి, సుందరీకణ కోసం ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన మదనపల్లె సబ్కలెక్టర్, హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ మేఘస్వరూప్, తహసీల్దార్ మొహమ్మద్ అజారుద్దీన్, పీకేఎం ముడా ఇంజినీర్లు, డీఈ సూర్యనారాయణతో కలిసి కొండపై విస్త్రృతంగా పరిశీలనలు నిర్వహించారు. కొండపై అతిథిగృహాలు, గాలిబండ, జిడ్డు సర్కిల్, స్విమ్మింగ్ పూల్, గవర్నర్బంగ్లా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలి, సుందరీకణ పనులు చేయాలి, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై సమీక్ష చేశారు. రెవెన్యూ అతిథిగృహం ప్రయివేటుకు అప్పగించగా.. దాన్ని ఎప్పటి లోగా ప్రారంభిస్తారని జేసీ లీజుదారునితో చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి పర్యాటకులకు గదులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ గాలిబండ వద్ద సందర్శకులు ప్రకృతి అందాలను తిలకించేందుకు బెంచీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జేసీ ఆదర్శ్రాజేంద్ర -
● రాయితీ అందించినా గుదిబండే...!
రాయితీ ద్వారా ప్రాజెక్టు పెట్టుకోవచ్చంటూ అధికారులు ప్రచారం చేస్తున్నా వినియోగదారునికి మొదట భారం తప్పేలా కనిపించడం లేదు. ఉదాహరణకు 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలంటే రూ.78వేల వరకు గరిష్టంగా సబ్సిడీ అందిస్తామని చెబుతున్నారు. అయితే ఈ రాయితీ మనం వినియోగించుకునే పలకలకు అనుగుణంగా ఉంటుంది. అంటే రూ.78వేల కంటే తక్కువ సబ్సిడీ వస్తుంది కానీ వినియోగదారుడు మాత్రం రూ.1.80లక్షల వరకూ భరించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తుకు, నెట్ మీటర్కు కూడా చార్జీలు వసూలు చేసేవారు. ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ చార్జీల నుంచి ఉపశమనం కల్పించారు. -
పీఎం సూర్యనూ.. సీఎం చంద్రన్ననూ నమ్మని జనం
‘వంద అడుగులు ఉన్న ప్రతి ఇంటిపైనా ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోండి..’ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఇవి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పరుగులు పెడుతున్నారు. ఎంత అవగాహన కల్పించినా సదరు పథకాన్నీ..సీఎం చంద్రబాబు మాటల్ని నమ్మలేమంటూ జనాలు ఆసక్తిచూపకపోవడంతో సిబ్బందికి ఇబ్బంది తప్పడం లేదు.కడప కార్పొరేషన్: మన ఇంట్లోనే సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభు త్వం లక్ష్యంగా నిర్దేశింది. ఈ మేరకు వైఎస్సార్ కడప జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ రూఫ్ టాప్ అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పథకం మంచిదే అయినా కొన్ని చోట్ల వినియోగదారులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పీఎం సూర్యఘర్ పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించి ఏర్పాటు చేయాలని కూటమి సర్కార్ డిస్కమ్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ● ఈ పథకంలో చేరాలంటే ముందుగా ‘సూర్యఘర్’యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో వివరాలు నమోదు చేయాలి. ఆరునెలల కరెంటు బిల్లు కాపీలను జతపరచాలి. తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లలోపు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ అందరికీ వర్తింపజేస్తున్నారు. ట్రాన్స్ కో అనుమతులు పొందాక వెండర్లను ఎంపిక చేసుకోవాలి. ఇందులో కిలోవాట్కు నిర్ణయించిన దాని ప్రకారం రాయితీని అందిస్తారు. మిగిలిన మొత్తానికి బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయి. చివరగా ఇంటి పై కప్పుపై 100 చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం వాడే మీటర్ స్థానంలో నెట్ మీటర్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సోలార్ ఉత్పత్తిని...వినియోగదారుడు వాడుతున్న విద్యుత్ను లెక్కిస్తారు. కరెంట్ అమ్ముకోండి... అంటూ ప్రచారం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు...ఇప్పుడు ఎఫ్పీసీసీఏ చార్జీల మోత మోగిస్తూ గుండె గుభేల్మనేలా చేస్తున్నారు. సంపద సృష్టించడం తనకు బాగా తెలుసునన్న బాబు, ఓవైపు విద్యుత్ బిల్లులను అమాంతం పెంచేసి, మరోవైపు సూర్యఘర్ ప్రాజెక్టు పేరుతో వినియోగదారుల నడ్డి విరిచేందుకు యత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోలార్ రూఫ్ టాప్ అమర్చుకుంటే బిల్లు కట్టకపోవడంతోపాటు కరెంటు మీరే అమ్ముకొని లాభాలు పొందవచ్చునంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. అయినా ప్రజలు స్పందించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో సర్కిళ్లలోని జోన్ల వారీగా లక్ష్యాలు విధించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పీఎం సూర్యఘర్ పథకంపై లక్ష్యం విధింపు కేంద్రం ఆదేశాలతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారుల ఉరుకులు పరుగులు ప్యానెల్స్ పెట్టుకోవాలంటూవినియోగదారులకు అవగాహన ఆసక్తి చూపని జనం -
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రొటోకాల్ నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొనే సీకే దిన్నె మండల పరిధిలోని పబ్బాపురం సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభా స్థలం వద్ద అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా విధులు కేటాయించిన అధికారులందరూ.. ప్రొటోకాల్ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణం, పరిసరాలలో పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, డీపీఓ రాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ నాగరాజు, పోలీసు, ఫైర్ ఆఫీసర్ ధర్మారావ్, విద్యుత్, ఆర్అండ్బీ, పీఆర్ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బహిరంగ సభ స్థలం వద్ద అధికారులతో సమావేశం -
కడప విమానాశ్రయంలో మాక్ డ్రిల్
కడప అర్బన్ : ఉగ్రవాదులు విమానాశ్రయంపై దాడికి దిగితే ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో వివరించేలా ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో కడప విమానాశ్రయంలో మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, వైద్యం, అగ్ని మాపక శాఖల సమన్వయ చర్యలను ఏఎస్పీ మూర్తి పరిశీలించారు. డ్రిల్లో కమలాపురం సీఐ ఎస్కె.రోషన్, వల్లూరు ఎస్ఐ బి.పెద్ద ఓబన్న, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక అధికారులు చురుకుగా పాల్గొన్నారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో విభిన్న విభాగాల మధ్య సమన్వయం, స్పందన వేగం మరియు తక్షణ చర్యలపై స్పష్టత పెరిగిందని అధికారులు తెలిపారు. -
గౌరవం లేదు.. వేతనం రాదు
కాశినాయన : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండాపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రా మంలో ఏ పనులు చేయించలేని పరిస్థితి తమకు ఉండడంతో గౌరవం లేకుండాపోయిందని, దానికి తోడు కనీసం రెండేళ్ల నుంచి గౌరవ వేతనాలు అందలేదని పలువురు ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కడ ప జిల్లాలో 559 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వారికి ప్రతి నెలా రూ.3వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు విడతల్లో గౌరవ వేతనాలు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఎంపీటీసీలకు చెల్లించలేకపోయింది. 2024 జూలై, 30న కొత్తగా కూటమి ప్రభుత్వం కొలు వుదీరింది. అంతకుముందు పెండింగ్ వేతనాలతోపాటు దాదాపు రెండేళ్ల గౌరవ వేతనం రావాల్సి ఉంది. నేటికీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించలేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలచే ఎంపికై న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వసభ్య సమావేశాలకే పరిమితం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసభ్య సమావేశాలకు హాజరుకావడం మినహా ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారుల సమస్యలను తీసుకువచ్చినా పట్టించుకున్న పాపాన పోవడంలేదని చెబుతున్నారు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించక పోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరుపై తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, వివక్షకు గురిచేస్తున్నారని వారు మండిపడుతున్నారు. పలువురు ఎంపీటీసీల ఆవేదన -
50 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
దువ్వూరు : అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం ఎర్రబల్లె క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. బొలెరో వాహనంలో తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని, విచారించగా రేషన్ బియ్యాన్ని దువ్వూరుకు చెందిన మారుగాని సురేంద్ర కొనుగోలు చేసి, అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. పంచాయతీ అధికారుల సమక్షంలో పంచనామా చేశామని, 50 బస్తాల రేషన్ బియ్యం మొత్తం విలువ రూ.1,10,400 ఉంటుందని వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. -
పాఠశాల భవనాలు కూల్చివేయడం దారుణం
కడప ఎడ్యుకేషన్ : కడప సీఎస్ఐ చర్చి వెనుక ఉన్న న్యూ మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ భవనాలను ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి కూల్చి వేయించడం దారుణమని స్కూల్ కరస్పాండెంట్ షర్మిల అన్నారు. పాఠశాల ఆవరణలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ బిషప్ చెప్పినట్లు తాను నడుచుకోలేదని, కక్షపూరితంగా భవనాలను కూల్చి వేయించాడని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నమే చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీంతో తనను పిలిపించి మాట్లాడిన బిషప్ 2025–26 విద్యా సంవత్సరం వరకూ గడువిస్తున్నామని చెప్పారన్నారు. మళ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి 1.40 గంటలకు బిషప్ కుమారుడు కొంతమంది మనుషులతో వచ్చి భవనాలను కూల్చివేయించారన్నారు. పాఠశాలలో 250 మంది విద్యార్థులున్నారని, 20 రోజుల్లో పాఠశాల పునఃప్రారంభించాల్సి ఉండగా.. ఇలా చేయడం సరికాదన్నారు. జూన్లో పిల్లలను ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలిన భవనాల కింద ఫర్నిచర్, పిల్లల విద్యాసామాగ్రి ధ్వంసం అయ్యాయని, విద్యార్థుల సర్టిఫికెట్స్ ఉన్నాయన్నారు. విద్యా సంవత్సరం పూర్తయినవారు టీసీల కోసం వస్తున్నారని, వారికి ఏమివ్వాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూలు ఉందని, తాను 2020 లో తీసుకున్నానిని చెప్పారు. కరుణ, దయ, ప్రేమ అని బిషప్ చెప్పడమే తప్ప...ఆయన పాటించడం లేదన్నారు. ఉన్నతాధికారులు, మత పెద్దలు జోక్యం చేసుకుని పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పాస్టర్ కె.డి.ఐక్యతరావు మాట్లాడుతూ సీఎస్ఐ ఆస్తులపై బిషప్కు ఎలాంటి అధికారం లేదన్నారు. ఈ ఆస్తులన్నీ దక్షిణమండలి చైన్నె ఆధ్వర్యంలో ఉంటాయని, అక్రమంగా భవనాలు నిర్మిస్తూ ఉంటే కోర్టుకు వెళ్లి ఆపి వేయించామని చెప్పారు. ఈ సమావేశంలో స్కూల్ డైరెక్టర్లు మనోజ్, ప్రధానోపాధ్యాయుడు ధీరజ్ పాల్గొన్నారు. శిథిల గదులను కూల్చేశాం కడప సీఎస్ఐ ప్రాంగణంలోని శిథిల భవనాలను కూల్చివేశామని రాయలసీమ డయాసిస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డయాసిస్ బోర్డింగ్ హాస్టల్ గదుల సముదాయం వందేళ్ల కిందట పెంకులతో నిర్మించారని, శిథిలమవడంతో కూల్చివేశామని తెలిపారు. ఇక్కడ ఉన్న శ్రీన్యూ మోడల్ స్కూల్ఙ్కు 2022 వరకు అనుమతిచ్చారని, అప్పటి నుంచి ఖాళీ చేయమని పలుమార్లు చెప్పినా కాలయాపన చేస్తు వచ్చారన్నారు. పాత గదుల్లో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని భావించి కూల్చివేశామని తెలిపారు. స్కూల్ యజమాన్యానికి ఎలాంటి అగ్రిమెంట్, హక్కులు లేవన్నారు. కొందరు డయాసిస్ ప్రతిష్ట భంగం చేస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. న్యూ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ షర్మిల -
పోక్సో యాక్ట్ కేసులో యువకుడు అరెస్ట్
కడప అర్బన్ : పోక్సో కేసులో కుమారుడిని అరెస్టు చేయడంతో తల్లి విష ద్రావణం తాగి అస్వస్థతకు గురైన సంఘటన కడప నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తమకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ వారి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వివరాల మేరకు.. కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరాజుపల్లికి చెందిన విజయ్(22) మంగళవారం తెల్లవారుజామున తన కుమార్తె(17)కు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని హరిజనవాడకు చెందిన జయమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రెడ్డెప్ప, ఎస్ఐ తులసీ నాగప్రసాద్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సాయంత్రం నిందితుడు విజయ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి తల్లి ఆత్మహత్యాయత్నం పోక్సో యాక్టు కేసులో కుమారుడు విజయ్ అరెస్టు కావడంతో అతడి తల్లి నాగరాణి, సోదరి రూప, బంధువులు, స్నేహితులు మంగళవారం కడప తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో తన వెంట తెచ్చుకున్న విష ద్రావణం నాగరాణి, రూప తాగారు. అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. రూపను మరికొంతసేపటికి తమ వెంట బంధువులు తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, నిందితుడి బంధువులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు తమకు అన్యాయం చేశారని, రాజీ చేస్తామని చెప్పి చివరకు విజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారనిఆరోపించారు. చట్ట ప్రకారమే చర్యలు: సీఐ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరాజుపల్లెకు చెందిన జయమణి తన కుమార్తెను విజయ్ మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని చట్ట ప్రకారమే అరెస్ట్ చేశామన్నారు. కేసు, అరెస్ట్ల గురించి నిందితుడి బంధువులకు స్పష్టంగా తెలియజేశామన్నారు. అనవసరంగా ఆందోళన చేశారన్నారు. విష ద్రావణం తాగి తల్లి ఆత్మహత్యాయత్నం పోలీస్స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన -
తహసీల్దారుకు కోర్టు ధిక్కార నోటీసులు
రాయచోటి టౌన్ : సివిల్ కేసులో ప్రిన్సిపల్ జూనియర్ సివి ల్ జడ్జి ఆదేశాల ధిక్కరణపై రాయచోటి తహశీల్దారు, మున్సి పల్ కమిషనర్, టౌన్ ఫ్లానింగ్ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసినట్లు భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కడప జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ టి.ఈశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. రాయచోటి పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన మల్లికార్జున స్థలం అదే వీధిలో ఉంటున్న బండి మురళి, బండి హారిణిలు దౌర్జన్యంగా ఆక్రమించుకొన్నారని జూనియర్ సివిల్ కోర్టులో కేసు దాఖాలు చేశారని తెలిపారు. సదరు వ్యక్తులు ఆ స్థలంలోకి వెళ్లరాదని 121/23 కేసు నమోదు చేశారన్నారు. పాముల మల్లిఖార్జున ఆ స్థలంలోకి వెళ్లరాదని తెలిసినప్పటికీ రాయచోటి తహసీల్దార్ తన కార్యాలయానికి పిలిచి మల్లిఖార్జునకు వ్యతిరేకంగా మాట్లాడటంతోపాటు వారికి వ్యతిరేకంగా వచ్చిన వారికి అనుకూలంగా మాట్లాడటం కోర్టు దేశాలను ధిక్కరించడమేనని చెప్పారు. దానిపై తహశీల్దార్తో పాటు మున్సిపల్ కమీషనర్, టౌన్ ఫ్లానింగ్ అధికారికి నోటీసులు పంపడంతో పాటు ప్రైవేట్ కేసు కూడా చేయనున్నట్లు న్యాయవాది టి.ఈశ్వర్ తెలిపారు. మహిళ మెడలో గొలుసు చోరీ రాజంపేట : మహిళకు మాయమాటలు చెబుతూ.. ఉన్నపాటుగా మెడలో గొలుసు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఉప్పరపల్లెలో ఉన్న ఓ మహిళ వద్దకు బైక్పై వచ్చిన ఇద్దరు ఈ అడ్రస్ ఎక్కడంటూ ఆరా తీశారు. ఆమెను మాటల్లోకి దించి అదును చూసి మెడలో నుంచి సరుడు అపహరించుకుపోయారు. పట్టపగలే జరిగిన ఈ సంఘటనతో స్ధానికులు ఆందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ మండల కమిటీల నియమాకం కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని పలు మండలాలకు మండల పార్టీ కమిటీలను నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కురబలకోట మండలం: ఉపాధ్యక్షులుగా డి.అశోక్కుమార్రెడ్డి, వి.ముస్తాక్, ప్ర ధాన కార్యదర్శులుగా ఎం.గోపీనాథ్రెడ్డి, వి.శంకర్రె డ్డి, కె.శివశంకర్, జి.రమేష్రెడ్డి, కార్యదర్శులుగా పి.రమణ, వేణుగోపాల్రెడ్డి, వై.నారాయణ, ఎస్.అంజద్, బి,తులసిరామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఇ.చలపతి, ఎన్.మంజునాథ్, బి.వేణుగోపాల్రెడ్డి, ఆర్.శ్రీనివాసులు, బి.రవీంద్ర, ఎస్.సురేంద్రారెడ్డి, మునాఫ్, జి.సోమశేఖర్రెడ్డి, జి.నాగేశ్వర్, మహబూబ్అలీ, ఎస్. బావాజీ, ఎం.శ్రీనివాసులు, కె.మహబూబ్పీర్, ఈరప్ప, బాబు, సి.రమణారెడ్డి, శివలను నియమించారు. పెద్దముడియం: ఉపాధ్యక్షులుగా సి.రెడ్డెప్పరెడ్డి, కె.జగన్మోహన్ ఆచా రి, ప్రధాన కార్యదర్శులుగా ఎం.సుబ్బారెడ్డి, బి.సాంబశివారెడ్డి, ఎం.భాస్కర్, ఎం.సుధాకర్, కార్యదర్శులుగా ఎం.మహేశ్వర్, బి.మోహన్రెడ్డి, కె.రామాంజులు, ఎ.రామచంద్ర, బి.అబ్దుల్ మునాఫ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డి.వెంకట శివయ్య, పి.ఆలంఖాన్, ఎం.అబ్దుల్లా, టి.అంజి, ఎం.శివయ్య, ఎస్.గౌస్మోద్దీన్, బి.గోపాల్నాయక్, పి.శ్రీనివాసులు, వై.లక్ష్మిపతి నాయుడు, బి.రవీంద్రనాయక్, పి.రమణారెడ్డి, ఎం.భాస్కర్ నాయక్, సి.ప్రతాప్రెడ్డి, జి.రామకృష్ణారెడ్డి, బి.రవీంద్ర, కె.ఓబుల్రెడ్డిలను నియమించారు. తంబళ్లపల్లె: ఉపాధ్యక్షులుగా వెంకటరెడ్డి, మహేష్రెడ్డి, ప్రధాన కా ర్యదర్శులుగా జె.జగదీష్, వాసుదేవరెడ్డి, బి.రెడ్డెప్ప నా యక్, కార్యదర్శులుగా షఫీ, బావాజాన్, చలపతినా యుడు, రమణారెడ్డి, మల్లప్ప, మధురాయల్, ఎగ్జిక్యూ టివ్ మెంబర్లుగా రవి, శ్రీరాములు, శంకర్నాయక్, మురళీధర్, వి.ప్రభాకర్రెడ్డి, రవీంద్రారెడ్డి, మహేష్, బి.రవీందర్నాయక్, డి.రమణారెడ్డి, ఎ.అంజన్కుమా ర్, ఆంజనేయులు, ఆర్.చిన్నప్ప, టి.మధు, బి.వెంకట రమణ, సి.శ్రీనివాసులును నియమించారు. -
వడ్డీ కట్టలేదని.. ఇంటి నుంచి గెంటేశారు
వృద్ధ మహిళపై వ్యాపారుల దాష్టీకంకడప అర్బన్ : పక్షవాతంతో బాధపడుతున్న మహిళపై కారుణ్యం చూపకుండా.. వడ్డీ వ్యాపారులు కర్కశంగా వ్యవహరించారు. తమ భర్త చేసిన అప్పు కట్టలేదనే నెపంతో ఇంటికి తాళం వేసి వృద్ధురాలు, ఆమె కుమార్తెను బయటికి నెట్టేశారు. ఎండ, వానకు ఇద్దరూ బిక్కుమంటూ బయటే ఉండాల్సి వచ్చింది.. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివానందపురంలో భూమన పిచ్చమ్మ, ఆమె కుమార్తె వెంకటసుబ్బమ్మ నివాసముంటున్నారు. స్థానిక వడ్డీ వ్యాపారులు బాలగురవయ్య, అతడి కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా వచ్చి.. డబ్బు కట్టలేదంటూ పిచ్చమ్మ, వెంకటసుబ్బమ్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి.. సామాన్లు బయటపడేసి వెళ్లిపోయారు. దీంతో ఆదివారం నుంచి తల్లి, కుమార్తె ఇంటి ఎదుటే బిక్కు మంటూ ఉండిపోయారు. పిచ్చమ్మ మాట్లాడుతూ తన మనుమరాలు వివాహం సమయంలో బాలగురవయ్య వద్ద రూ.4 లక్షలు అప్పు తీసుకున్నారని, ఆ సొమ్ము చెల్లించలేదని తమ రెండున్నర సెంట్ల స్థలంలో ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకున్నారన్నారు. డాక్యుమెంట్లలో సంతకాలు చేయించుకుని దౌర్జన్యంగా బయటకు తోసి వెళ్లిపోయారని బోరున విలపించారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ నిరసన కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహిళలను ఇంటినుంచి గెంటేసిన బాలగురవయ్య, వారి కుమారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, ఆర్సీపీ నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. బాధితుల ఇంటి ఎదుట బైఠాయించి మంగళవారం నిరసన తెలిపారు. పిచ్చమ్మకు చెరందిన ఐదు సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు బాలగురయ్య కుట్ర చేశారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాల గురవయ్య, మురళి, బాలచంద్ర, బాలుడు, ఓబులేసు, ఓబుళపతి, లక్ష్మీదేవి, బాలమ్మ తదితరులు ఇంట్లోకి చొరబడి పిచ్చమ్మపై దాడి చేశారన్నారు. మూడు బంగారు ఉంగరాలు, రూ.16 వేల నగదు, ఇతర సామగ్రి కాజేశారన్నారు. వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ మహిళలు బిక్కుమంటున్నారని వాపోయారు. ఇరువురి బాధితులకు న్యాయం జరిగేంతవరకూ ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఆర్సీపీ నాయకులు మల్లికార్జున, భాగ్యలక్ష్మి, విజయ్, రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
రాయచోటి టౌన్(అన్నమయ్య): కాళ్లు.. చేతులు కట్టేశారు.. గొంతుకు తాడుతో బిగించారు.. చనిపోయిన తరువాత ఆనవాళ్లు లభించకుండా చేసేందుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అయితే మృతి చెందిన మహిళ చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్య జరిగిన వా రం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని రామసముద్రం ప్రాంతానికి చెందిన వెంకటరమణ భార్య బూసిపల్లె శివమ్మ(27) గా గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం విలేకరుల స మావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం చెంబుకూరు ఎలకపల్లె రహదారిలో ఈనెల 11వ తేదీ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ పెట్రోల్ కోసం వాడిన బాటిల్ మాత్రమే ఉండింది. అయితే మృతురాలి చేతిపై యస్మిత అనే పచ్చబొట్టు ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. పచ్చ బొట్టును సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనే విషయం తెలిసింది. అలాగే డాగ్స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి బెంగళూరు రోడ్డు వైపు వెళ్లడంతో ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను గుర్తించారు. నిందితులంతా మృతురాలి బంధువులే అని తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బెంగళూరులో నివాసం ఉంటున్న ఎం.నీలావతి, రామసముద్రం మండలం గుండేవారిపల్లె నడింపల్లె ప్రాంతానికి చెందిన కన్నెమడుగు గణేష్, బెంగళూరులోని బి.హోసహళ్లి సజ్జాపురం ప్రాంతం అంబేద్కర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్ ఉన్నారు.ఎందుకు హత్య చేశారంటే..మృతురాలు బూసిపల్లె శివమ్మ అదే ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె బంధువులు భర్తకు తెలియకుండా ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా మృతురాలి బంధువైన నీలావతి బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్తో హత్య చేసేందుకు బేరం కుదుర్చుకుంది. వీరికి కన్నెమడుగు గణేష్ అనే వ్యక్తి సహకరించాడు. ఆ తర్వాత వారు రామసముద్రం వచ్చి శివమ్మకు మాయమాటలు చెప్పి ఆమెను తమ వెంట శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకు తాడు బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ముందుగానే తమ వెంట తెచ్చుకున్న పెట్రోలును మృతదేహంపై పోసి నిప్పంటించారు. అయితే ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రూరల్ సీఐ సత్యనారాయణ, రామసముద్రం ఎస్ఐ జి.రవికుమార్, మరికొంతమంది సిబ్బంది చాకచక్యంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారని ఎస్పీ ప్రశంసించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారుసోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలురాయచోటి టౌన్ : సమాజంలో ప్రజలను ఉద్రేకపరిచేలా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లాఎస్పీ విద్యా సాగర్నాయుడు హెచ్చరించారు. మదనపల్లెలో హనుమాన్ శోభాయాత్రలో జరిగిన సంఘటనపై సోమవారం ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. శోభాయాత్ర నిర్వాహకులు ముందుగా తమతో అనుమతులు పొందే సమయంలో ఇచ్చిన రూట్మ్యాప్ ప్రకారం కాకుండా వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా సమస్యలు సృష్టించాలని చూశారన్నారు. ప్రకటించిన సమయానికి రాకుండా సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా రావడమే కాకుండా దారి మళ్లించి సమస్య ను సృష్టించడంతో తమ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. కావాలనే శోభాయాత్రను దారి మళ్లించి సమస్యలు సృష్టించేందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే అక్కడ ఏదో జరిగిందని ఒక వర్గాన్ని అణచివేస్తున్నట్లుగా తప్పు డు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపైన కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించుకోవాలని సూచించారు. -
జల్సాలకు అలవాటుపడి.. దారి దోపిడీలకు పాల్పడి..
కడప అర్బన్ : జల్సాలకు అలవాటు పడి, అక్రమ ధనార్జన కోసం ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కొని పోవడం, రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి వారిని కొట్టి డబ్బు, నగలు దోపిడీ చేయడం వంటి నేరాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు(5 తులాలు), ఒక బుల్లెట్ మోటారు సైకిల్, ఒక కత్తి, 4 సెల్ ఫోన్లు, రూ.10200 నగదు కలిపి మొత్తం రూ.6,50,000 విలువ గల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కడప సబ్ డివిజన్ పరిధిలో కమలాపురం మెయిన్ రోడ్ వేదాస్ స్కూల్ దగ్గర సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ రోషన్ పర్యవేక్షణలో వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న, కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ తమ సిబ్బందితో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. చాపాడు మండలం, పల్లవోలు గ్రామానికి చెందిన చక్రకోళ్ల ప్రశాంత్ 13 కేసులలో నిందితుడిగా వున్నాడు. చాపాడు మండలం బద్రిపల్లెకు చెందిన పందిటి ఉదయ్ కుమార్ పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతనిపై జిల్లాలో 10 కేసులున్నాయి. చాపాడు మండలం, పల్లవోలు గ్రామానికి చెందిన దుంపల వినోద్ కూలిపని చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతను జిల్లాలో 23 కేసులలో నిందితుడిగా వున్నాడు. వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు పొందేందుకు దోపిడీలను మార్గంగా ఎంచుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లడం, ఒంటరిగా బైకుపై వెళ్లే వారిని బెదిరించి వారి వద్ద నుంచి నగలు, నగదు దోపిడీ చేయడం లాంటి నేరాలకు పాల్పడేవారు. నేరాలు చేసేందుకు వీరు వాడుతున్న బుల్లెట్ మోటార్ బైకును తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో డీ మార్ట్ వద్ద చోరీ చేసి తీసుకొచ్చారు. సోమవారం వారు ముగ్గురు నేరం చేసేందుకు మోటార్ బైకుపై వస్తుండగా కడప–కమలాపురం మార్గంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నేరాల వివరాలు ఇలా.. ● ఫిబ్రవరి 11న తేదీ వల్లూరు మండలం ఇ.కొత్తపల్లి గ్రామ సమీపంలో కాంతమ్మ అనే మహిళ మెడలో నుంచి 31.63 గ్రాముల పురి తిరిగిన బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. ● మార్చి 3వ తేదీన తిరుపతి కరకంబాడి రోడ్ లో ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్ వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ను చోరీ చేశారు. ● ఏప్రిల్ 5వ తేదీన కడప–కమలాపురం మెయిన్ రోడ్ మదీనా కాలేజీ వద్ద కడప వైపు నుంచి టీవీఎస్ ఎక్స్ఎల్పై పాల డబ్బాలను పెట్టుకొని వస్తున్న వ్యక్తిని బలవంతంగా ఆపి బెదిరించి అతని వద్ద నుంచి ఐదు వేల రూపాయలు దోచుకున్నారు. ● కమలాపురం మండలం కోగటం గ్రామ సమీపంలో పొలాల వద్ద ఒక మహిళ మెడలో ఉన్న 4. 20 గ్రాముల సాదా బంగారు గొలుసును లాక్కెళ్లారు. ● వల్లూరు మండలం గోటూరు క్రాస్ దాటిన తరువాత ఓబాయపల్లి గ్రామ సమీపంలో ఆటోలోని వ్యక్తిని బయటికి లాగి అతని జేబులో ఉన్న 5200 రూపాయల నగదును బలవంతంగా లాక్కెళ్లారు. ఈ కేసులలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల సూచనలు.. తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని డీఎస్పీ కోరారు. పిల్లల మీద శ్రద్ధ చూపకపోతే వారి బంగారు భవిష్యత్తు పాడు కావడమే కాకుండా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరన్నారు. మహిళలు బయటకు వచ్చే సందర్భంలో తాము ధరించిన ఆభరణాలు కనిపించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలన్నారు. అనుమానితులు గ్రామ పరిసరాల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముగ్గురు నిందితుల అరెస్టు నగలు, నగదు, బుల్లెట్ వాహనం స్వాధీనం నిందితులంతా చాపాడు మండల వాసులు విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడి -
ఓరియెంటేషన్ కార్యక్రమంపై అవగాహన
కడప అర్బన్ : మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ ఎల్. వెంకటేశ్వరరావు సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి సెక్రటరీ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సి.ఆసిఫా సుల్తానా కడపలోని న్యాయ సేవా సదన్లో సోమవారం ‘నిరుపేద పిల్లల కోసం సతి ప్రచార పత్రం అమలు – ఆధార్ కోసం సర్వే, ట్రాకింగ్ మరియు సమగ్ర చేరికకు ప్రాప్యత‘ అనే అంశంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కమిటీ పేద పిల్లల అవసరాలను గుర్తించి వారికి న్యాయ సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనోజ్ హెగ్డే, డీఆర్ఓ ఎంవీ నాయుడు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ శ్రీలక్ష్మి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, పారా లీగల్ వలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
గోపవరం ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచింది
ప్రొద్దుటూరు : గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ఉప సర్పంచ్ అభ్యర్థిగా బీరం రాఘవేంద్రారెడ్డి ఎన్నికైన అనంతరం సోమవారం తన స్వగృహంలో ఆయన విజయం సాధించిన అభ్యర్థులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ అనేక అవాంతరాల మధ్య, అభద్రత పరిస్థితుల నడుమ ఉప సర్పంచ్ ఎన్నిక ఎట్టకేలకు జరిగిందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్యంత ప్రశాంతంగా, సజావుగా ఎన్నిక జరిపించి ప్రజా స్వామ్యాన్ని గెలిపించారన్నారు. ఎన్నికలో విజయం సాధించడం కన్నా ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి చక్కగా విధులు నిర్వహించారన్నారు. ఎన్ని మార్లు ఓడినా, గెలిచినా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడమే ముఖ్యమన్నారు. గతంలో జరిగిన పొరపాటును వరదరాజులరెడ్డి సరిదిద్దుకున్నారన్నారు. వాస్తవానికి మార్చి 27న జరిగిన ఎన్నికల్లోనే తాము గెలవాల్సి ఉందని, టీడీపీ వైఖరి వల్ల ఎన్నిక వాయిదా పడిందన్నారు. 20 మంది వార్డు సభ్యుల్లో తమ వైపు 14 మంది ఉన్నా అడ్డదారిన గెలవాలని టీడీపీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదన్నారు. వార్డు సభ్యులను స్ఫూర్తిగా తీసుకుంటాం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరి వరకు తమ వెంట నడిచిన గోపవరం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లను తాము స్ఫూర్తిగా తీసుకుంటామని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. డబ్బులు ఇస్తామని, ప్రలోభాలకు గురిచేయడంతోపాటు బెదిరించి భయపెట్టారన్నారు. ఏమి చేసినా తమ వార్డు సభ్యులు ఎదరొడ్డి నిలబడి చివరకు తమకు విజయాన్ని అందించారన్నారు. ఇది మా జెండా గొప్పతనమని తెలిపారు. వైఎస్సార్సీపీలో ఉండి పదవులు అనుభవించిన తర్వాత పార్టీని వీడిన రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని, 2029 ఎన్నికల్లో తమ పార్టీ తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
ముగ్గురిపైకి దూసుకొచ్చిన కారు
కొండాపురం: మండల పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామం అంకాలమ్మ గుడి సమీపంలో తాడిపత్రి– ముద్దనూరు జాతీయ రహదారిలో సోమవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురిని కారు ఢీకొంది. ఈ ఘటనలో బోయ రాజన్న(64) అక్కడికక్కడే మృతి చెందినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని అంకాలమ్మ దేవాలయంలో పుట్టువెంట్రుకల కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్ గ్రామానికి చెందిన బోయ రాజన్న మృతి చెందగా ఓబులేసుకు కాలు విరిగిందన్నారు. చంద్రభాస్కర్రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఒకరి దుర్మరణంమరో ఇద్దరికి గాయాలు -
గోపవరం ఉప సర్పంచ్ పదవి వైఎస్సార్సీపీకే
ప్రొద్దుటూరు రూరల్ : ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఆ పదవి వైఎస్సార్సీపీకే దక్కింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించారు. సర్పంచ్తో పాటు మొత్తం 20 మంది వార్డు మెంబర్లు ఉండగా వైఎస్సార్సీపీ తరపున 14 మంది వార్డు మెంబర్లు హాజరయ్యారు. సర్పంచ్ మోషాతోపాటు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఉపసర్పంచ్గా బీరం రాఘవేంద్రారెడ్డికి మద్దతు తెలిపి ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఉప సర్పంచ్ ఎన్నిక ధ్రువపత్రాన్ని బీరం రాఘవేంద్రారెడ్డికి అందించారు. డీఎస్పీ భావన ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు. 8వ వార్డు అభ్యర్థి వైఎస్సార్సీపీకే మద్దతు వైఎస్సార్సీపీ తరపున విజయం సాధించిన 8వ వార్డు మెంబర్ గాయత్రి గతంలో టీడీపీలో చేరారు. మార్చి నెలలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించినప్పుడు కూడా ఆమె టీడీపీ తరపునే ఉన్నారు. అనూహ్యంగా సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో గాయత్రి వైఎస్సార్సీపీ ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డికి మద్దతు తెలపడం విశేషం. సంబరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఒత్తిళ్లకు గురి చేసినా, ప్రలోభాలకు లొంగకుండా వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన వార్డు సభ్యులను అందరూ ప్రశంసిస్తున్నారు. -
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్ బాబు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ -
అర్జీలకు త్వరగా పరిష్కారం
కడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన, నాణ్యమైన పరిష్కారం అందించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులపై సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అనంతరం డీఆర్వో అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈ ఓబులమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, సర్వే ల్యాండ్ అధికారి మురళికృష్ణ, ఎస్డీసీలు శ్రీనివాసులు, వెంకటపతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంలో నియామకాలు కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురిని.. పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగ కమిటీలో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా కడపకు చెందిన షేక్ జిలానీబాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్ళులుగా జమ్మలమడుగుకు చెందిన సి.ఆంజనేయరెడ్డి, కడపకు చెందిన ఎం.సుమన్కుమార్రెడ్డిలను నియమించారు. జూన్ 5న ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం రాయచోటి జగదాంబసెంటర్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర 3వ కౌన్సిల్ సమావేశం జూన్ 5న నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. సోమవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాయచోటి తాలూకా అధ్యక్షుడు సాయికుమార్, కార్యదర్శి సుజిత్ డాల్, కోశాధికారి సురేష్, ఉపాధ్యక్షుడు వలి, సంయుక్త కార్యదర్శి రఘు, సభ్యులు శివనాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల రైలు వచ్చేసింది
రాజంపేట : 2025–2026 బడ్జెట్ నుంచి విడదులైన నిధుల రైలు ఎట్టకేలకు వచ్చేసింది..బడ్జెట్ నిధుల కేటాయింపులకు సంబంధించి పింక్ బుక్ (కీ బడ్జెట్ డేటా)ఆలస్యంగా విడుదలైంది. దీనిని పరిశీలిస్తే బడ్జెట్లో ఉభయ వైఎస్సార్ జల్లాకు పెద్దగా ఒరిగిందేమిలేదు. కొత్తలైన్లు, కొత్తరైళ్లు లేవు. పాడిందేపాటరా అన్న సామెత ఇప్పుడు విడుదలైన నిధులకు సరిగ్గా సరిపోతుందని రైల్వే నిపుణులు భావిస్తున్నారు . ● 255.4కిలోమీటర్ల దూరం కలిగిన కడప–బెంగళూరు రైల్వేలైన్ 2014లో ప్రారంభమైంది. యూపీఏ ప్రభుత్వంలో మంజూరైన రైలుమార్గానికి వ్యయం రూ.20వేలకోట్లు అంచనా వేశారు .2016–2017లో రూ.58కోట్లు, 2017–2018లో రూ.240కోట్లు. 2018–2019లో రూ.175 కోట్లు, 2022–2023లో రూ.289 కోట్లు– 2023–2024లో రూ.10లక్షలు, 2025–2026లో ఈబీఆర్(ఎస్) కింద రూ.21లక్షలు కేటాయింపులు జరిగాయి. కడప–బెంగళూరు రైల్వేలైన్పై కేంద్ర ప్రభుత్వం స్పందన ఆశాజనకంగా లేదనేది నిధుల కేటాయింపులను బట్టి తెలుస్తోంది. అందువల్ల పనులు వేగం అందుకోలేకపోతున్నాయి. 14 ఏళ్లవుతున్నా ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో రైల్వేలైన్కు రూ.185 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు.. 126 కిలోమీటర్ల దూరం కలిగిన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గానికి ఈబీఆర్(ఎస్) కింద రూ.30.15 కోట్లు కేటాయించారు. 113 కిలోమీటర్ల దూరం కలిగిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైలుమార్గానికి డిపాజిట్(ఆర్వీఎన్) కింద 267 కోట్ల వ్యయం చేస్తున్నారు. ● 2020లో బడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బ అనే కొత్త లైన్ తెరపైకి రావడంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు అప్పట్లో రేకేత్తించాయి. ఈ సారి బడ్జెట్లో 65 కిలోమీటర్ల దూరం ఉన్న ముద్దనూరు–ముదిగుబ్బ కొత్తలైన్ ఆర్ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు. ● 110 కిలో మీటర్ల దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం లైన్కు రూ.2 కోట్లు ఫైనల్ లొకేషన్ సర్వేకు కేటాయించారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో రైలుకూత కోసం ఎన్నో ఏళ్లుగా అక్కడి వాసులు ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంత మీదుగా రైలుమార్గం వెళితే రైలుకూత వినివచ్చునన్న భావనలో ఉన్నారు. మొక్కుబడిగా నిధుల కేటాయింపు ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వలో తెరపైకి వచ్చిన కొత్త లైన్ల సర్వేలకు ప్రతి బడ్జెట్లో మొక్కుబడిగా నిధులు కేటాయింపులు జరిగాయి. కంభం–ప్రొద్దుటూరు లైన్(142కి.మీ) రూ.10లక్షలు డిపాజిట్ చేశారు. సర్వేకు పరిమితమైన భాకారాపేట–గిద్దలూరు లైన్ను గాలికి వదిలేశారు. గుంతకల్–రేణిగుంటలైన్లో 3, 4 లైన్కు సర్వే గుంతకల్–రేణిగుంట మధ్య 3, 4 లైన్ నిర్మాణానికి రైల్వేబోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బడ్జెట్లో సర్వేకు ఉపక్రమించింది. ఫైనల్ లోకేషన్ సర్వే కింద గుంతకల్–ఓబులవారిపల్లెకు(256 కి.మీ) రూ.5 కోట్ల కేటాయింపులు జరిగాయి. 56 కిలోమీటర్ల దూరం ఉన్న ఓబలవారిపల్లె– రేణిగుంటకు ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.1 కోటి వ్యయం చేయనుంది. ప్రస్తుతం డబుల్లైనులో రైళ్లు నడుస్తున్నాయి. 3,4 లైన్ల నిర్మాణం సకాలంలో పూర్తయితే రైళ్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. కడప రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు నిధుల కేటాయిపు ఉభయవైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.18 కోట్ల కేటాయింపులు జరిగాయి. పార్శిల్ ఆఫీసు ఆధునికీకరణ చేయనున్నారు. ఓపెన్ వెయిటింగ్ హాల్తోపాటు , రూ.4 కోట్లతో ఎస్కలేటర్స్ సౌకర్యం కోసం బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అప్గ్రేడ్స్టేషన్ కింద పీలేరు, రాజంపేటలో స్టేషన్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు జరిగాయి. గుత్తి–పుల్లంపేట రూ.18కోట్లతో 29 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్సిస్టమ్ బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ప్లాట్ఫాంల పొడిగింపు గుంతకల్–రేణిగుంట మార్గంలో ప్లాట్ఫాంలను పొడిగించనున్నారు. రూ.3 కోట్లతో 24/26/ఎల్హెచ్బీ బోగీలకు అనుకూలంగా రాజంపేట, కోడూరు స్టేషన్లలో నిర్మితం చేయనున్నారు. ఇదే విధంగా ముద్దనూరులో రూ.3 కోట్లతో ప్లాట్ఫాం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గూడ్స్షెడ్ల అభివృద్ధి రైల్వేకోడూరులో గూడ్స్షెడ్ను రూ.11 కోట్లతో, ముద్దనూరు గూడ్స్షెడ్ రూ.13 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. శెట్టిగుంట, రాజంపేటలో ట్రాక్మిషన్ సైడింగ్స్,రెస్ట్రూం తదితర సౌకర్యాల కోసం రూ.5 కోట్లు కేటాయించారు. రాజంపేట యార్డులోని సబ్వేకు రూ.5 కోట్ల కేటాయింపులు జరిగాయి. కడప–బెంగళూరు లైన్కు స్వల్పనిధులు రేణిగుంట–గుంతకల్ 3,4లైన్కు సర్వే -
బ్రౌన్ గ్రంథాలయం.. కడపకు వరం
కడప కల్చరల్ : విజ్ఞానదాయకమైన గొప్ప పుస్తక సంపదను కలిగిన బ్రౌన్ గ్రంథాలయం కడపకు వరమని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత అన్నారు. సోమవారం యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ిసీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర ప్రాంగణంలో అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంతోపాటు శిలాఫలకం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణాన్ని నాటి సీఎం చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రారంభించారని, త్వరలో నిర్మించనున్న భవనాలను కూడా ఆయనే ప్రారంభిస్తారని తెలిపారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి (ఇన్చార్జి), సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం చైర్మన్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన భవనాలను ఆధునిక సదుపాయాలతో పాఠకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. గౌరవ అతిథి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సాయం మరింతగా అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్చెరుకూరి, జేసీ అదితిసింగ్, సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహా మండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, బ్రౌన్ కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, వైవీయూ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రఘునాథరెడ్డి, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్రెడ్డి, మెప్మా పీడీ కృష్ణకుమార్, వైవీయూ పాలక మండలి సభ్యులు, బోధన బోధనేతర సిబ్బంది, బ్రౌన్ కేంద్రం సిబ్బంది, గ్రంథాలయ అభిమానులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత అదనపు భవనాలకు శంకుస్థాపన -
సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయండి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, నగర కమీషనర్ మనోజ్రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగర సమీపంలోని పబ్బాపురం గ్రామ పరిధిలో జరిగే ‘మహానాడు’ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పాటించేలా సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీపీవో రాజ్యలక్ష్మి, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, పోలీసు, ఫైర్ ఆఫీసర్ ధర్మారావు, విద్యుత్, ఆర్అండ్బీ, పీఆర్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సేవలపై మరింత దృష్టి ప్రభుత్వ పథకాలు, సేవల ప్రజాస్పందనలపై మరింత దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్, యోగాంధ్ర –2025 క్యాంపెయిన్, ప్రభుత్వ పథకాలు, సేవలపై ప్రజా స్పందనలు, జిల్లా సబ్ ఆర్డినేట్ కోర్టులలో టాయిలెట్స్ కాంప్లెక్స్ వంటి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లా కలెక్టర్తోపాటు జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎస్ వీసీలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పెద్దముడియం మండల సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి రెవెన్యూ భూముల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీవో హాజరతయ్య, ఆర్అండ్బీఎస్ ఈ.చంద్ర శేఖర్, జిల్లా పర్యాటక అధికారి సురేష్, తదితర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
అధికారులు ఒత్తిడి తీసుకువచ్చి.. నిర్మాణం చేయించి..
రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన గోకులం షెడ్లను ఉపాధి హామీ సిబ్బంది.. లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాలు పూర్తి చేయించారు. గోకులం షెడ్ల నిర్మాణంలో మూడు దశల్లో బిల్లులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. అయితే బిల్లులు పడకపోయినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేయాలని, మూడు బిల్లులు ఒకేసారి పడతాయని చెప్పి పనులు పూర్తి చేయించారు. ఈ ఏడాది జనవరి 10, 12వ తేదీలలో షెడ్యూల్ ఏర్పాటు చేసి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయి నాయకులు అధికారులతో కలసి అట్టహాసంగా ప్రారంభించారు. వీటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.30–40 కోట్ల వరకు బిల్లులు అందాల్సి ఉందని ఉపాధి హామీ పథకం అధికారులు చెబుతున్నారు. అధికారుల ఒత్తిడి వల్ల అప్పులు చేసి షెడ్లను నిర్మించుకున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. -
మినీ మహానాడుకు.. పొదుపు సంఘాల మహిళలను తరలించండి
ప్రొద్దుటూరు : తెలుగు దేశం పార్టీకి సంబంధించి ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న మినీ మహానాడును.. ప్రభుత్వ కార్యక్రమంగా అధికారులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో జరిగే మినీ మహానాడుకు 3 వేల మంది పొదుపు సంఘాల మహిళలను తరలించాలని మున్సిపాలిటీకి చెందిన మెప్మా టీఈ మహాలక్ష్మి ఆర్పీలను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో 30 మంది ఆర్పీలు ఉండగా, ప్రతి ఆర్పీ వంద మందికి తగ్గకుండా మహిళలను మినీ మహానాడుకు తీసుకురావాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి.. విజయవంతం చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి మెప్మా టీఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్పీలతో పలు దఫాలుగా చర్చించారు. ఈ చర్చల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఆమె సిబ్బందికి చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇది ప్రభుత్వ కార్యక్రమమా.. పార్టీ కార్యక్రమమా అని ప్రజలు విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. మెప్మా టీఈ మహాలక్ష్మి ఆడియో వైరల్ -
వేసవి వేళ.. చల్లటి జల్లు
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో నెల రోజులుగా ఎండల దెబ్బకు జనం గగ్గోలు పెడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపడంతో.. బయటికి రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి జనం కాసింత ఉపశమనం పొందుతున్నారు. రైతులు వేసవి దుక్కులు చేసుకునేందుకు ఈ వర్షాలు అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో సోమ వారం కూడా వర్షం కురిసింది. అత్యధికంగా దువ్వూ రులో 15.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలం వర్షపాతం జిల్లాలో కురిసిన వర్షం దువ్వూరులో అత్యధికంం ఎండ వేడిమి నుంచి ఉపశమనం దువ్వూరు 15.8 ప్రొద్దుటూరు 11.4 కొండాపురం 10.4 గోపవరం 10.2 బి.కోడూరు 10.2 బి.మఠం 9.8 అట్లూరు 8.4 బద్వేలు 7.4 రాజుపాళెం 6.8 చెన్నూరు 6.4 ఖాజీపేట 6.4 వేంపల్లి 5.2 కడప 4.8 చాపాడు 4.2 కలసపాడు 4.0 వేముల 3.8 ఎర్రగుంట్ల 3.8 కాశినాయన 2.8 సింహాద్రిపురం 2.6 సిద్దవటం 2.4 మైదుకూరు 2.2 జమ్మలమడుగు 2.0 ఒంటిమిట్ట 1.8 పోరుమామిళ్ల 1.8 సీకే దిన్నె 1.2 పులివెందుల 1.2 -
పాఠశాలల్లో సమాంతర మీడియం కొనసాగించాలి
మదనపల్లె సిటీ : పిల్లలకు స్వేచ్ఛనిచ్చి ఇష్టం వచ్చిన మీడియంను ఎంచుకునే విధంగా పాఠశాలల్లో తెలుగు మీడియంను ఇంగ్లీషు మీడియంకు సమాంతరంగా పునః ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండవ సెక్షన్కు అనుమతించాలన్నారు. ఈనెల 21వతేదీన పాత జిల్లా కేంద్రంలో జరగబోయే డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు పురం రమణ, ఆదినారాయణ, నాయకులు విజయకుమార్, సుధాకర్, రవిప్రకాష్, మురళి, అజంతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం
కడప కార్పొరేషన్ : కడప నగరం మద్రాసు రోడ్డులోని డాక్టర్ వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో లీజుకు ఉన్న వ్యాపారులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగించడం అన్యాయమని మేయర్ సురేష్ బాబు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి నగరపాలక అధికారులు తొలగించిన షాపులను పరిశీలించి, వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, హత్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. మహిళలని చూడకుండా అనంతపురం, వైజాగ్, గుంటూరు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారని, హత్యలు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి రెడ్బుక్ పాలన పాలన సాగిస్తున్నారని, 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి అరాచక పాలన లేదన్నారు. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే కడపలో మరొక ఎత్తుగా ఉందన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి గొంతునొక్కే విధంగా కక్ష సాధిస్తున్నారన్నారు. నగర ప్రథమ పౌరుడినైన తన ఇంటిపైనే చెత్త వేయించారని, ప్రశ్నించే వారు ఉండకూడదని వారి నోరు నొక్కేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో 10 గదులు ఉన్నాయని, 2007లో వీరంతా బహిరంగ వేలంలో రూ.7.50 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్నారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వ్యాపారం జరిగినా, జరక్కపోయినా, కోవిడ్ సమయంలోనూ బాడుగ చెల్లిస్తూ ఉన్నారన్నారు. వీటిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డికి కూడా ఒక గది ఉందని, ఆయన్ను లక్ష్యంగా చేసుకొని అందరి షాపులు ధ్వంసం చేయడం దారుణమన్నారు. గదుల పక్కనే కార్పొరేషన్ నిర్మించిన పబ్లిక్ టాయ్లెట్లు, ఉర్దూ పాఠశాల ప్రహరీ వీటికంటే ముందుకు ఉన్నాయని మీడియాకు చూపారు. వ్యాపారులు ట్రేడ్లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ఎన్క్రోచ్మెంట్ ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ ఆక్రమణల పేరిట తొలగించడం అన్యాయమన్నారు. కడపలో ముడుపులు చెల్లించలేదని వెంచర్లను నిషేధించారని, గతంలో ఏడాదికి 3వేలకు పైగా ప్లాన్ అప్రూవల్స్ అయ్యేవని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి దానికి కప్పం కట్టాల్సి రావడం వల్లే ఈ ఏడాది 500 అప్రూవల్స్ కూడా కాలేదన్నారు. నగరపాలక అధికారుల వల్ల నష్టపోయిన వ్యాపారులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వారికి నష్ట పరిహారం ఇప్పించడానికి న్యాయ పోరాటం చేస్తామన్నారు. నాపై ఉన్న కక్షతో ఇతరుల జీవనోపాధి దెబ్బతీయడం దారుణం– జయచంద్రారెడ్డి తనపై కక్ష ఉంటే నా గదులు మాత్రమే తొలగించాలిగానీ, పక్కనున్నవారి షాపులు కూడా తొలగించి వారి జీవనోపాధి దెబ్బతీయడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 60 అడుగుల రోడ్డు ఉంది, నాగులపుట్ట, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయ్లెట్లు, పాఠశాల ప్రహరీ కంటే లోపలే షాపులు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేసే వారి గొంతు నొక్కాలనే ఇలా చేశారన్నారు. సాయంత్రవేళ అంగళ్లన్నీ మూసిన తర్వాత కూల్చివేయడం అన్యాయమన్నారు. సూర్యనారాయణ వల్లే తాను కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నానే తప్పా, వారిలాగా వేరే పార్టీ కండువా కప్పుకోలేదన్నారు. ఆడిటోరియం బయట, నెహ్రూపార్కు బయట ఉన్న షాపుల వద్ద సూర్యనారాయణరావు డబ్బులు వసూలు చేశాడన్నది అక్షర సత్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, యానాదయ్య, శ్రీరంజన్రెడ్డి, బీహెచ్ ఇలియాస్, ఐస్క్రీం రవి, త్యాగరాజు, దేవిరెడ్డి ఆదిత్య, సింధు, దాసరి శివ, షఫీ, రామ్మోహన్రెడ్డి, బసవరాజు, సుబ్బరాయుడు, శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్రెడ్డి, కె. బాబు, చెన్నయ్య, రెడ్డి ప్రసాద్, లక్ష్మయ్య పాల్గొన్నారు. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కొక్కరికి రూ.2లక్షల మేర నష్టం వ్యాపారులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది రాష్ట్రమంతా ఒక రకమైన పాలన.. కడపలో మరో రకమైన పాలన మేయర్ సురేష్ బాబు మండిపాటు -
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్దాలి
కడప రూరల్ : ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్దాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కోరారు. ఆదివారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చట్టం చేసేలోపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్ది మాల, మాదిగ వర్గాలకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణ ముఖ్యమంతి రేవంత్రెడ్డి వర్గీకరణ అంశానికి సంబంధించి సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య, ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గొడుగునూరు మునెయ్య, తప్పెట హరిబాబు, మాతంగి సుబ్బరాయుడు, తప్పెట శివ, వెంకటసుబ్బయ్య, కొన్నెపల్లె మునెయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో రెండు బర్రెలు మృతి
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్తో రెండు బర్రెలు మృతి చెందాయి. మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని ఏపీజీబీ బ్యాంకుకు ఎదురుగా శనివారం రాత్రి ఏర్పడిన గాలి, వాన బీభత్సానికి విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దళితవాడకు చెందిన శ్రీనివాసులు, నాగులమ్మకు చెందిన బర్రెలు పొలంలో మేత మేస్తుండగా రోడ్డు వైపు వచ్చాయి. అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురైన బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రెండు బర్రెల విలువ రూ.30వేలు పైగా ఉంటుందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అట్లూరులో.. అట్లూరు : మండల పరిధిలోని కుమ్మరవారిపల్లి గ్రామానికి చెందిన అంబవరం అనసూయమ్మ గేదె విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు అనసూయమ్మకు చెందిన పాడి గేదె రోజు మాదిరిగానే పచ్చిక మేసేందుకు పొలాలకు వెళ్లింది. సాయంత్రం వరకూ ఇంటికి రాక పోవడంతో పొలాల్లోకి వెళ్లి వెతకగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ వైరుకు విద్యుత్ సరఫరా అయి మృతి చెంది ఉంది. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంతో గేదె మృత్యువాత పడిందని రూ.70 వేలు విలువ చేసే గేదె మృతికి కారకులైన ట్రాన్స్కో అధికారులు నష్ట పరిహారం చెల్లించాలని బాధితురాలు కోరారు. -
21న డీఈఓ కార్యాలయం ముట్టడి
మైదుకూరు : తొమ్మిది రకాల పాఠశాలల విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన అన్ని జిల్లాల్లో డీఈఓ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్టు ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా తెలిపారు. మైదుకూరులో ఆదివారం యూటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 రకాల బడుల విధానం తీసుకొచ్చి పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వేలాది పాఠశాలల మూసివేత, వేలాది ఉపాధ్యాయుల మిగులు దిశగా ఆ విధానం ఉందన్నారు. దానిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మోడల్, ప్రైమరీ పాఠశాలల పేరుతో 2 కిలోమీటర్ల నుండి 7 కిలోమీటర్ల వరకు పాఠశాలలను కలపడం వల్ల చిన్న పిల్లలు ముఖ్యంగా బాలికలు బడికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యను కార్పొరేటీకరణ చేయడంలో భాగంగానే 19, 20, 21 జీఓలను విడుదల చేసిందని విమర్శించారు. ఇంగ్లీషు మీడియానికి తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్బాబు, జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్, జిల్లా కార్యదర్శి అజాజ్ అహ్మద్, సంఘం మండల నాయకులు ఎన్.గంగులయ్య, ఎం.గురివిరెడ్డి, టి.వెంకట రమణారెడ్డి, శ్రీనివాసులు, ఎన్.తిరుపాలయ్య, రామ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కడప ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)– 2025 నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ(బైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి వైఎస్సార్ జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 13049 మంది ఇంజినీరింగ్కు, 3389 మంది మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను రాయనుండగా మరో 35 మంది రెండు కలిపి పరీక్షలను రాయనున్నారు. ఇందులో ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, అలాగే మధ్యాహ్న సెషన్ 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. జిల్లాలో పరీక్షా కేంద్ర వివరాలు ఇలా.. ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష కోసం జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కడపలో ఐదు పరీక్షా కేంద్రాలను, ప్రొద్దుటూరులో మూడు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. కడపకు సంబంధించి కేఎస్ఆర్ఎం, కేఎల్ఎం, కేఓఆర్ఎం, అన్నమాచార్య, శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రొద్దుటూరుకు సంబంధించి చైతన్య భారతి ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ, సాయి రాజేశ్వరి ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాగ్దేవి ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలను సిద్ధం చేశారు. జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలకు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 13049, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి 3389 మంది రెండు విభాగాలకు సంబంధించి 35 మంది అభ్యర్థులు పరీక్షలను రాయనున్నారు. రెండు సెషన్స్లో పరీక్ష.. ఉదయం సెషన్కు సంబంధించి 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 12.30 గంటల నుంచి 2 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష జరిగే రోజు కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి. విద్యార్థులు వెంట తీసుకురావాల్సిన వస్తువులు.. ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్ –2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీతో పొందుపర్చిన నిర్ణీత బాక్స్లో విద్యార్థి కలర్ పాస్ పోర్టు సైజ్ ఫొటోను అతికించి సంబంధిత కళా శాల ప్రిన్సిపాల్తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు. గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్పోర్టు, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర ఏ వస్తువులు అనుమతించరు. ● విద్యార్థి ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీ పై పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి ఎడమ చేతి బొటనవేలి ముద్ర వేయాలి. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఏర్పాట్లను సిద్ధం చేసిన అధికారులు జిల్లాలో 8 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహణ 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 16,473 మంది అభ్యర్థులు -
గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
చాపాడు : మండల పరిధిలోని అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం వద్ద గల సత్రంలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. మైదుకూరు వైపు వెళ్లే దారిలో గల సత్రంలో వృద్ధురాలు మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె గురించిన వివరాలు తెలియకపోవడంతో పంచాయతీ అధికారులకు అ ప్పగించి అంత్యక్రియలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. నాలుగు రోజుల నుంచి ఈమె ఇక్కడ ఉందని కొందరు వ్యక్తులు వదిలేసి వెళ్లారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎస్పీ, డీఎస్పీని కలిసిన వార్డు మెంబర్లుప్రొద్దుటూరు : హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ గోపవరం గ్రామ పంచాయతీకి చెందిన 13 మంది వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఆదివారం జిల్లా ఎస్పీ, ప్రొద్దుటూరు డీఎస్పీని కలిశారు. ఈ మేరకు కోర్టు ఉత్తర్వుల ప్రతులను ఆయా కార్యాలయాల్లో అందజేశారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సోమవారం ఉదయం జరగనుంది. గతంలో అరాచకాలకు, విధ్వంసాలకు పాల్పడిన టీడీపీ నేతల కారణంగా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించి ఉప సర్పంచ్ ఎన్నికను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిపేందుకు ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎన్నిక ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయాలని హైకోర్టును కోరారు. సర్పంచ్ గద్దా మోషాతోపాటు ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలుమదనపల్లె సిటీ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడిన సంఘటన ఆదివారం కురబలకోట మండలం చేనేతనగర్ వద్ద జరిగింది. తెట్టు గ్రామానికి చెందిన అఖిల్(21), విష్ణు(20) ద్విచక్ర వాహనంలో మదనపల్లె వైపు వస్తుండగా మదనపల్లె నుంచి ఆర్సి కురపల్లికి చెందిన రామమూర్తి(65) మరో ద్విచక్రవాహనంలో వెళుతుండగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోని వారు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే అంగళ్లు విశ్వం కాలేజీ వద్ద గొళ్లపల్లె పంచాయతీ చీకిచెట్టిపల్లెకు చెందిన మౌలా కుమారుడు రోషన్జమీర్(19) ద్విచక్రవాహనంలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రోషన్ జమీర్ను స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలపై ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. -
‘స్టార్టప్ కడప సెంటర్’కు శ్రీకారం
కడప ఎడ్యుకేషన్: పారిశ్రామిక ప్రగతికి, యువతలో ఆవిష్కరణకు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్షిప్ సెంటర్’ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈ కేంద్రానికి కడప ఆర్ట్స్ కాలేజీ సమీపంలో సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల అభివృద్ధికి పునాది వేస్తూ, కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషించనుందన్నారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన కడప జిల్లా వాసుల సహకారంతో, వారిని అనుసంధానం చేసుకుని ఈ స్టార్ట్ అప్ హబ్ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. ప్రాజెక్ట్ లక్ష్యాలు: స్టార్టప్ కడప కేంద్రం ఆవిష్కరణను ప్రోత్సహించడమే కాక, ఆలోచనల నుంచి అభివృద్ధి చెందిన వ్యాపారాల వరకు అన్ని దశల్లో స్టార్టప్లకు మద్దతు అందించేందుకు రూపొందించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వృత్తిపరమైన వర్క్స్పేస్లు, సహకార వాతావరణం వంటి అంశాలతో యువతకు అవసరమైన అన్ని వనరులు ఈ కేంద్రం అందించనుంది. నేడు శంకుస్థాపన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నిర్మాణ వివరాలు ఎ+3 అంతస్తులు, 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం పీఈబీ టెక్నాలజీ ఆధారంగా నిర్మాణం. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం: ఈ ప్రాజెక్టును రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తారు. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ రూ.4 కోట్ల విరాళం అందించింది. -
గంగమ్మా..చల్లంగా చూడమ్మా..
లక్కిరెడ్డిపల్లి: చల్లంగా చూడమ్మా..గంగమ్మా అంటూ అనంతపురం గంగమ్మను భక్తులు వేడుకున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు.తలనీలాలు అర్పించారు. ఆలయ పూజారులు అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు జరిపారు.పూజల అనంతరం భక్తులక తీర్థప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయండి పులివెందుల రూరల్: పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు. పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయానికి ఆమె ఆదివారం విచ్చేశారు. కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తూ.. ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులతో మాట్లాడారు. వారితో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు జోగిరెడ్డి, విశ్వనాథ్రెడ్డి, వెంకటరామిరెడ్డి, శశిభూషణ్రెడ్డి, భానుప్రకాష్రెడ్డి, బాషా, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి సమరశీల పోరాటం బద్వేల్ అర్బన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి సమరశీల పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించిన జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బద్వేల్లో జరగబోవు సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. 2025 డిసెంబర్ 26 నాటికి సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవం నిర్వహించుకోబోతోందని అన్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు జి.చంద్ర, వీరశేఖర్, అబ్దుల్ఖాదర్, మస్తాన్, బాలు, రమణారెడ్డి, పెంచలయ్య, వెంకటశివ, నాగసుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, టి.సుబ్బరాయుడు, జి.వలరాజు, ఎం.వి.సుబ్బారెడ్డి, జి.వేణుగోపాల్, కె.సి.బాదుల్లా, విజయలక్ష్మి, శ్రీరాములు, సుబ్రమణ్యం, పి.వి.రమణ, వెంకటరమణ, ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ సప్లిమెంటరీకి వేళాయె
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం.. ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ పదో సప్లిమెంటరీని 5667 మంది విద్యార్థులు.. ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలను 1484 మంది రాయనున్నారు. ప్రత్యేక తరగతులు గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఆయా సబ్జెక్టులకు చెందిన ఉపాధ్యాయులు రోజూ క్లాస్లు తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దారు. జిల్లా వ్యాప్తంగా 5767 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 28 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఓపెన్ పది, ఇంటర్ విద్యార్థుల కోసం.. ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 1484 మంది రాయనున్నారు. వీరి కోసం 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 19 నుంచి 24 వరకు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అధికారుల నియామకం: పది సప్లిమెంటరీ పరీక్షల పర్యవేక్షణకు అధికారుల నియామకం పూర్తయింది. 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్మెంట్ అధికారులతోపాటు నలుగురు స్క్వాడ్ సభ్యులను నియమించారు. అలాగే ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలకు 13 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 13 డిపార్ట్మెంట్ అధికారులతోపాటు స్క్వాడ్ సభ్యులను సిద్ధం చేశారు. నేటి నుంచి 28 వరకు పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలు పకడ్బందీగా ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అవుతున్న పది సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
వర్సిటీ.. ఈ దుస్థితి ఏమిటీ!
సాక్షి ప్రతినిధి, కడప: యోగివేమన యూనివర్సిటీ వైస్ చాన్సలర్లకు మొన్నటి వరకూ గౌరవ, మర్యాదలకు కొదవ లేదు. అభివృద్ధి పని ఏదైనా సరే యూనివర్సిటీ విభాగం కోరితే.. ఠక్కున ఆదేశాలు లభించేవి. మధ్యలో వాహనాలు వెళితే విద్యార్థుల చదువులకు ఆటంకం అంటే యూనివర్సిటీకి బైపాస్ రోడ్డు వచ్చేసింది. నాటి రాజసం, గౌరవ మర్యాదలు నేడు కోల్పోయారు. చేసిన శంకుస్థాపన మరోమారు చేయడమే విడ్డూరమైతే.. అందులోనూ అధికార పార్టీ నేతలు ప్రొటోకాల్ వివాదానికి తెరలేపారు. యూనివర్సిటీ అధికారులపై చిందులేశారు. ఒక సమావేశానికి ‘సభాధ్యక్షులు, సమావేశపు అధ్యక్షులు’గా ఇద్దరిని పెట్టుకొని కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేశారు. ఎట్టకేలకు బ్రౌన్ లైబ్రరీ నూతన భవనానికి సోమవారం శంకుస్థాపన చేపట్టనున్నారు. గత నెల 29న జరగాల్సి ఉండగా.. సీపీ బ్రౌన్ లైబ్రరీకి గత నెల 29న ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత చేతుల మీదుగా శంకుస్థాపన చేయాల్సి ఉంది. కాగా శిలాఫలకంలో తన పేరు పెద్ద అక్షరాలతో లేదని కడప ఎమ్మెల్యే వివాదం చేశారు. తనకు మాత్రమే ప్రాధాన్యత ఉండాలని పెద్ద ఎత్తున రగడ చేయడంతో.. తొలుత తయారు చేసిన శిలాఫలకం స్థానంలో మరో శిలాఫలకం తయారు చేయించారు. ఈ విషయంపై సాక్షి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పట్లో శంకుస్థాపన కార్యక్రమం ఆగిపోయింది. తాజాగా సోమవారం శంకుస్థాపన చేస్తున్న శిలాఫలకంలో సభాధ్యక్షులు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, సమావేశపు అధ్యక్షులుగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పేర్లు పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సీపీ బ్రౌన్ లైబ్రరీలో మన చరిత్రకు సజీవ సాక్ష్యాలైన తాళపత్ర గ్రంథాల నుంచి ఎన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగు భాషా పరిశోధన కేంద్రం కూడా ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు. కాగా కార్యకలాపాలకు ప్రస్తుతం ఉన్న భవనం సరిపోవడం లేదని గతంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తే.. స్పందించి జీఓ నంబర్ 94/హెఈ/యూఈ–డీఈపీటీ ద్వారా 2021 జూలై 7న రూ.5.5 కోట్ల నిధులు విడుదల చేశారు. ఆ వెంటనే 2021 జూలై 9న నూతన భవనానికి శంకుస్థాపన కూడా చేశారు. ప్రైవేటు భూమి కొనుగోలు చేసేందుకు, నిర్మాణ ధరలు పెరిగాయని తిరిగి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తే.. జీఓ నంబర్ 92/హెచ్ఈ/ యూఈ– డీఈపీటీ ద్వారా 2023 నవంబర్ 7న రూ.6.874 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పనులను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. భూమి కొనుగోలు చేసేందుకు రూ.3.11 కోట్లు, నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.3.76 కోట్ల నిధులు డిపాజిట్ చేశారు. టెండర్లు కూడా పూర్తి అయ్యాయి. పనులు చేపట్టడంలో జాప్యం చేయడం, ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. ప్రారంభం కాకుండా నిలిచిపోయాయి. కాగా వైఎస్ జగన్ సర్కార్ ఏపీఈడబ్లూఐడీసీ సంస్థకు గ్రాంటు డిపాజిట్టు చేసిన ఆ పనులు మొదలు పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రజాప్రతినిధులు ఆటంకం కల్గించారు. కూటమి ప్రభుత్వమే చేసినట్లుగా శంకుస్థాపన చేయాలనే పట్టుదలకు పోయారు. శిలాఫలకం పేర్ల వద్ద రగడ యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని బ్రౌన్ గ్రంథాలయం శంకుస్థాపనలో రగడ మొదలైంది. జిల్లా కేంద్రంలోని సీపీ బ్రౌన్ గంథాలయ నిర్మాణానికి ఇది వరకే సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం అందరి పేర్లు శిలాఫలకంలో పొందుపర్చారు. మళ్లీ శంకుస్థాపన చేసేందుకు సిద్ధమైన కూటమి సర్కారు.. ఇన్చార్జి మంత్రి సవిత ద్వారా చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రొటో కాల్ నిబంధనల ప్రకారం శిలాఫకలంలో పేర్లు పెట్టగా, కమలాపురం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఆదినారాయణరెడ్డి పేర్లు ప్రధానంగా కన్పించడంపై అభ్యంతరం చెప్పడం, యూనివర్సిటీ అధికారులకు ప్రాధాన్యత లేకుండా చేయడంతో వివాదం తారా స్థాయికి చేరింది. ఒక దశలో యూనివర్సిటీ ఉన్నతస్థాయి అధికారి క్షమాపణ చెబితేనే.. శంకుస్థాపన అనే స్థాయికి వ్యవహారం చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎట్టకేలకు కొత్తగా సోమవారం శంకుస్థాపన చేపట్టి సంబరాలు చేసుకునేందుకు కూట మి సర్కారు నేతలు సిద్ధమవడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో రూ.6.87 కోట్ల మంజూరు ఎట్టకేలకు నేడు బ్రౌన్ లైబ్రరీకి శంకుస్థాపన పాపం యూనివర్సిటీ అధికారులు నాడు గౌరవం.. నేడు అవమానాలు, చీదరింపులు ప్రొటోకాల్ వివాదం నుంచిగట్టెక్కిన వైవీయూ ఒక సమావేశానికి ఇద్దరు అధ్యక్షులట! -
ఆక్రమణల పేరు చెప్పి అరాచకం
కడప కార్పొరేషన్ : కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి ఆదేశాలతో కడప నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు ఆక్రమణల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి ఆస్తులను ధ్వంసం చేయడం లేదా వారి ఆర్థిక మూలలను దెబ్బతీసే పనిలో ఎమ్మెల్యే, వారి అనుచరులు నిత్యం నిమగ్నమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలినుంచి జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపై గళం విప్పుతున్నారు. తాజాగా ఇటీవల వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు, వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెట్టి విమర్శించారు. 24వ డివిజన్ కార్పొరేటర్ కె. సూర్యనారాయణ, 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డిలపై ఆరోపణలు చేశారు. అలా మాట్లాడిన మరుసటి రోజే మద్రాసు రోడ్డులో నగరపాలక సంస్థకు చెందిన వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో ఆక్రమణలున్నాయంటూ టౌన్ప్లానింగ్ అధికారులను ఉసిగొల్పి కూల్చివేశారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో రెండు గదులను జయచంద్రారెడ్డి లీజుకు తీసుకొని ఉండటం గమనార్హం. షాపింగ్ కాంప్లెక్స్ లీజుకు ఉన్నవారంతా వర్షపునీరు షాపు ముందు నిలబడకుండా, షాపులోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా రేకులు అమర్చుకొని, ముందువైపు తాపలు, ర్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపల్ ఉర్దూ బాలుర హైస్కూల్ ప్రహరీ, మున్సిపల్ స్డేడియం పక్కన నగరపాలక సంస్థ నిర్మించిన పబ్లిక్ టాయ్లెట్లు వీటికంటే ముందుకు ఉన్నా టౌన్ప్లానింగ్ అధికారులు వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం. తాత్కాలిక నిర్మాణాలన్నీ విద్యుత్ స్తంభాలకు లోపలే ఉన్నప్పటికీ కూల్చివేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో తాత్కాలిక నిర్మాణాల తొలగింపు ఎమ్మెల్యేకు, ఫిరాయింపు కార్పొరేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు కక్ష సాధింపు -
సిమెంటు రోడ్డుకు అడ్డంగా గోడ
కడప కార్పొరేషన్ : కడప నగరంలో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అధికారముంది కదా అని ఏమైనా చేయొచ్చు... ఏ స్థలమైనా కబ్జా చేసి స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు. చిన్నచౌకులోని మద్రాసు రోడ్డులో టయోటా షోరూం పక్కనున్న జయమ్మ కాలనీలో నిర్మించిన సిమెంటు రోడ్డుకు అడ్డంగా కమలాపురానికి చెందిన టీడీపీ నేత రాజగోపాల్రెడ్డి గోడ నిర్మించారు. రోడ్డు నిర్మించిన స్థలంలో 0.11 సెంట్లు తనదే అని చెబుతూ శనివారం ఉదయం సుమారు 100 మంది అనుచరులతో వెళ్లి దౌర్జన్యంగా సిమెంటు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి మేయర్గా ఉన్న సమయంలో 2007లో ఈ సిమెంటు రోడ్డును నిర్మించారు. అంటే సుమారు 18 ఏళ్లక్రితం నగరపాలక సంస్థ నిర్మించిన సీసీ రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఇదొక్కటే రహదారిగా ఉంది. దీన్ని కూడా ఇప్పుడు గోడకట్టి మూసివేయడంతో తాము ఎలా రాకపోకలు సాగించాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వారు నగరపాలక సంస్థ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల దౌర్జన్యం నగరపాలక అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు -
పశువులు మేపుకునేందుకు వెళ్లి..
చాపాడు : మండల పరిధిలోని పల్లవోలు గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగు పడి బాలాయపల్లె సుబ్బ రమణయ్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలోని దళితవాడకు చెందిన బాలాయపల్లె సుబ్బరమణయ్య అలియాస్ సుబ్రమణ్యం శనివారం సాయంత్రం గేదెలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోని స్మశానవాటిక దగ్గర ఉండే పొలాల్లోకి వెళ్లాడు. ఇతనితో పాటు సమీపంలో మరికొంత మంది మహిళలు గేదెలను మేపుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను పడిపోయిన స్థలం వద్ద పశువులన్నీ గుంపుగా ఉండటంతో గుర్తించిన సమీపంలోని మహిళలు అతని వద్దకు వెళ్లారు. వెంటనే ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఆదిలక్ష్మితో పాటు యుక్త వయస్సుకు వచ్చిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిడుగు పాటుకు సుబ్బరమణయ్య మృతి చెందటంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పిడుగుపాటుకు వ్యక్తి మృతి -
కడప నగరంలో తిరంగా ర్యాలీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలు, ప్రధాని నరేంద్రమోదీకి సంఘీభావంగా శనివారం కడప నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహిచారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి పౌరుడు జాతీయ భద్రతకు అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్రెడ్డి, బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ జమ్మలమడుగు ఇన్చార్జి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, జనసేన జిల్లా కో ఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, కూటమి నేతలు పాల్గొన్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న తహసీల్దార్ లింగాల : లింగాల మండల తహసీల్దార్గా 2022 నుంచి 2024 వరకు పనిచేసిన లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసులు అందుకున్నారు. 20 ఏళ్ల కాల పరిమితితో అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో 2003 సంవత్సరానికి ముందు ఉన్న భూములను చేయాల్సి ఉంది. అయితే లక్ష్మీనారాయణ 2024–25 సంవత్సర భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేశారని విచారణలో తేలింది. మండలంలోని లోపట్నూతల, లింగాల, కామసముద్రం గ్రామాల్లోని 76 ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రస్తుత తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. సత్యదేవుని దర్శనానికి వచ్చి గుండెపోటుతో మృతి అన్నవరం : కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని దర్శనానికి వచ్చిన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వెంకట రమణ అనే భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వెంకట రమణ స్వామివారి దర్శనం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం దేవస్థానం ప్రాంగణంలో గుండెనొప్పితో పడిపోయాడు. దేవస్థానం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం 108లో తుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుని బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు రమణ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. కియా కారెన్స్ క్లానిస్ కారు ఆవిష్కరణ కడప కోటిరెడ్డిసర్కిల్ : కియా సంస్థకు చెందిన కియా కారెన్స్ క్లానిస్ కారును కడప హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ షోరూం ఎండీ జగన్నాథరెడ్డి డైరెక్టర్లు చెరకు నిరంజన్, సి.భారతి, హోషిమారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్నాథరెడ్డి మాట్లాడుతూ కియా సంస్థ విడుదల చేసిన నూతన వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ప్రజలు తమ షోరూంను సందర్శించి వాహనాన్ని పరిశీలించడంతోపాటు బుక్ చేసుకోవచ్చన్నారు. వినియోగదారులు 9100773485 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు, సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలి – జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కడప అర్బన్ : పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని జిల్లా పోలీస్ సంక్షేమ ఆస్పత్రిలో రూ. 4.5 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సెల్ కౌంట్ అనలైజర్ మిషన్ ( కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మిషన్) ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ పనితీరును యూనిట్ డాక్టర్ మేరీ సుజాతను అడిగి తెలుసుకున్నారు. ఖరీదైన రక్త పరీక్షలను పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు అందుబాటులోకి తేవడం పట్ల పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్ హర్షం వ్యక్తం చేశారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పోలీస్ సంక్షేమ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మొక్కను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావించి అందరూ సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పరిపాలన) కె.ప్రకాష్ బాబు, ఆర్.ఐ లు టైటస్, వీరేష్, శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్యారమ్స్ పోటీలు
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో శనివారం క్యారమ్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బాలికల విభాగంలో ప్రశాంతి ప్రథమ, దేవిశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో అండర్ 11 పోటీలలో రెమంత్ ప్రథమ, అబ్దుల్ఖాదర్ ద్వితీయ స్థానంలో, అండర్ 14 విభాగంలో రంగనాథ్ ప్రథమ, ద్వారకనాథ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆబిద్ ప్రథమ, జశ్వంత్ ద్వితీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ శ్రీనివాసులు, హ్యాండబాల్ కోచ్ మునాఫ్, బాడ్మింటన్ కోచ్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో అవ్వ, మనవడు దుర్మరణం
కలసపాడు : మండలంలోని సింగరాయపల్లె గ్రామానికి చెందిన యంబడి సౌరమ్మ (45), తలారి జశ్వంత్ (15) కలసపాడు సమీపంలోని ఐటీఐ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సౌరమ్మ, ఆమె మనుమడు జశ్వంత్ సింగరాయపల్లెలో మూడు రోజులు జరిగే తిరునాలకు సరుకులు తీసుకువచ్చేందుకు కలసపాడుకు వెళ్లారు. సరుకులు తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా కలసపాడు సమీపంలోని ఐటీఐ వద్ద చెన్నుపల్లె నుంచి గొర్రెల లోడుతో వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. సౌరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా జశ్వంత్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జశ్వంత్ను కలసపాడులోని ఓ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని వృద్ధుడి మృతి పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక వైఎస్సార్ సర్కిల్ సమీపంలోని వెంకటేశ్వర వైన్స్ ముందు శనివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు(70) మృతి చెందాడు. ఇతను గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో యాచన చేస్తూ తిరుగుతుండేవాడు. మద్యం కోసం వైన్ షాపు వద్దకు వెళ్లి మద్యం తీసుకొని వర్షం వస్తుండడంతో అక్కడే నిలబడ్డాడు. ఉన్నట్లుండి కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేరాల నియంత్రణలో కొరవడిన నిఘా
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లాలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీతో పాటు, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కానీ దొంగతనాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా యి. కొందరు పోలీసు అధికారుల అవినీతి చర్యలతో నేరాల నియంత్రణపై నిఘా కొరవడిందని చెప్పవ చ్చు. పోలీసుశాఖ ఉన్నతాధికారులు మాత్రం ‘ఫ్రెండ్లీ పోలీస్’గా ఉండాలని విధించిన నిబంధనలు పోలీసు అధికారుల కాళ్లకు బంధనాలు వేసినట్లుగా భావించాల్సి వస్తోంది. దీనికి తోడు జిల్లా పోలీసు శాఖలో పోలీసు అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ● కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 15వ తేదీన రాత్రి సమయంలో బిల్టప్ వద్ద పులివెందుల రహదారిలో వున్న వైన్షాపు ముందు రాయప్ప అనే వ్యక్తి సాదిక్వలీ అనే వ్యక్తిని కత్తితో దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. అలాగే ఈనెల 11వ తేదీన రాత్రి సమయంలో వరుణ్తేజ్ అనే యువకుడిని ఆంజనేయులు, అతని కుమారుడు జ్ఞానేశ్వర్లు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కడప– పులివెందుల రహదారిలో బిల్టప్ వద్ద ఓ బార్, రెండు వైన్షాపులు, అనధికారిక పర్మిట్రూమ్లు ఉన్నాయి. బిల్టప్ సర్కిల్ ఇలాంటి నేరాలకు అడ్డాగా మారి సమస్యాత్మక ప్రదేశంగా తయారైంది. ● కడప నగరంతో పాటు జిల్లాలోని ప్రొద్దుటూరు, ఇ తర ప్రాంతాలలో ఇళ్లలో దొంగతనాలు ఇటీవలి కా లంలో జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను నమోదు చేయకుండా వారికి నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు వారికి ఇబ్బంది రాకుండా ఉండేలా తక్కువ మొత్తంలో బంగారు ఆభరణా లు, డబ్బులు పోయినట్లుగా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ● గత ఏడాదిలో కడప నగరంతో పాటు, ఒంటిమిట్ట ప్రాంతాలలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం మిషన్ల చోరీ కేసును ఇప్పటివరకు పోలీసులు నిగ్గు తేల్చలేకపోయారు. ● జిల్లాలో సైబర్ నేరాల బారినపడి తమ బ్యాంకు ఖాతాలలోని లక్షలాది రూపాయలను పోగొట్టుకుని బాధితులు కడపలోని సైబర్ నేరాల నియంత్రణ పోలీసు విభాగానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయలను ఏడాది కాలంలోనే పోగొట్టుకున్న బాధితులకు సాంకేతిక, ప్రాక్టికల్ సమస్యలతో రికవరీ చేయలేకపోతున్నారు. ● జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ వాహనదారులను ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తనిఖీలు, అవగాహన కల్పిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనదారుల మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడంలాంటి చర్యలతో ప్రమాదాలను నిలువరించలేకపోతున్నారు. ● పోలీసుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘పోలీస్ కో–ఆపరేటివ్ మ్యూచువల్ సొసైటీ’లో సభ్యుల డబ్బులను గోల్మాల్ చేసి రూ.కోటి 20 లక్షల మేరకు అవినీతికి పాల్పడిన ఉద్యోగిపై విచారణ అటకెక్కిందనే విమర్శలు వస్తున్నాయి. సభ్యులు తమ సభ్యత్వం డబ్బులను ఎప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ● నేరాల నియంత్రణకు కడప నగరంలో 250, ప్రొద్దుటూరు పట్టణంలో 220 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. పోలీసు అధికారుల ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం సహకరిస్తేనే సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ● జిల్లా పోలీసు శాఖలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న సిద్దారెడ్డిని అవినీతి ఆరోపణలపై, యువతి ఆత్మహత్యకు కారణమైన రామ్మోహన్రెడ్డిని జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా వుంచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ● ప్రతి సోమవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితులు చేసే ఫిర్యాదులలో ఎక్కువగా భూములు, స్థలాల ఆక్రమణలు, డబ్బుల బాకీ వ్యవహాలే వస్తున్నాయి. ఇటీవల జిల్లాలో షేర్ మార్కెట్, క్విడ్ప్రోకో పేరుతో కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి దాదాపుగా 12 నుంచి 20 కోట్ల రూపాయలు కాజేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రోజురోజుకు పెరుగుతున్న వివిధ రకాల నేరాలు చోరీలలో ఫిర్యాదుదారులచేత తక్కువగా పోగొట్టుకున్నట్లు కేసుల నమోదు జిల్లాలో సీసీ కెమెరాల పనితీరులో లోపం పోలీసు కో–ఆపరేటివ్ సొసైటీలో గోల్మాల్పై చర్యలు నిల్ పోలీసుశాఖలో కొందరు అధికారులు, సిబ్బంది పనితీరు అవినీతిమయం సైబర్ నేరాలలో కోట్లాది రూపాయలను పోగొట్టుకుంటున్న బాధితులు నేడు కడపలో పర్యటించనున్న రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత నేడు జిల్లాకు హోంమంత్రి రాక ... టీడీపీ మహానాడు కార్యక్రమం కడప నగర శివార్లలోని పబ్బాపురం వద్ద ఈనెల 27, 28, 29 తేదీలలో నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు మంత్రులు విచ్చేసి పరిశీలించి వెళ్లారు. ఈక్రమంలోనే రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత ఆదివారం కడపకు విచ్చేసి మహానాడు ప్రాంగణాన్ని అధికారులతో కలసి పరిశీలించనున్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు సంబంధించి ఆమె పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేస్తారేమోననే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కడప సెవెన్రోడ్స్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, కడప, అన్నమయ్య జిల్లాల అధికారులు హాజరు కావాలని కోరారు. నేడు తిరంగ యాత్ర ర్యాలీ కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సైనికులకు మద్దతు తెలియజేస్తూ సిటీజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే పేరున శనివారం కడప నగరంలో తిరంగ యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు కడపలోని ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతి చర్యగా.. ఆపరేషన్ సింధూర్ ద్వారా అద్భుతమైన విజయం అందుకున్న తరుణంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేయాలని కోరారు. పశువైద్య కళాశాలకు వీసీఐ బృందం ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాలను వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు పరిశీలించింది. వీసీఐ పరిశీలకులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సాహత్పురే కళాశాలలోని వివిధ విభాగాలు, పశుచికిత్సాలయం, పశుగణక్షేత్ర సముదాయాలు, విద్యార్థుల వసతి గృహాలు, క్రీడా విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్ డాక్టర్ వి.చెంగల్వరాయులు, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. 20న ఉద్యోగమేళా రాయచోటి టౌన్: రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఏ. సురేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో హెడీఎఫ్సీ బ్యాంక్, జప్టో, టాటా ఏఐఏ, ఎస్బీఐ కార్ుడ్స, పేటీఎం, సూపర్ కె, ఏఐఎఎల్ డిక్స్న్,మూత్తూట్ ఫైనాన్స్, నియోలైక్, డాయికిన్, యంగ్ ఇండియా వంటి కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 88977 76368 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: ఎస్పీకేఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి ఓఎస్డీ ఎస్.గిరిధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో సంవత్సరం, మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు, నేరుగా రెండవ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వెంకటగిరిలో ఎస్పీకేఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 52 సీట్లు, తమిళనాడు సేలంలో 12, కర్ణాటకలోని గదక్లో 4 సీట్లు మూడు సంవత్సరాల హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ఉన్నాయని వివరించారు. అర్హతలు: 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. జూలై 1 నాటికి బీసీ, జనరల్ కేటగిరీలకు 15–23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. లేటరల్ ఎంట్రీ: మూడేళ్ల డీహెచ్ టీటీ కోర్సులో ఇంటర్మీడియెట్ ఎంపీసీ, ఒకేషనల్ (టెక్స్టైల్స్), ఐటీఐ (రెండేళ్లు) కోర్సులో ఉత్తీర్ణులైన వారు నేరుగా డీహెచ్టీటీ రెండవ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల కోసం మే, జూన్ మాసాల్లో డబ్లూడబ్లూడబ్లూ.ఐహెచ్టీవీజీఆర్.కామ్ వెబ్సైట్ను పరిశీలించాలి. చివరి తేదీ జూన్ 1వ తేదీగా అభ్యర్థులు గుర్తించాలి. ఇతర వివరాలకు 08625–295003, 93999 36872, 9866169908, 9010243054 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. -
రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పాలన
వల్లూరు: రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పాలన జరుగు తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పీ రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా.. తప్పుడు సంప్రదాయాలకు తెరతీస్తోందని మండిపడ్డారు. కడపలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న కక్ష రాజకీయాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలు దెబ్బతింటున్నాయని అన్నారు. మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్, ఇతర అధికారులపై సైతం తప్పుడు కేసులు పెట్టి సాక్షాలు, వాంగ్మూలాలు సృష్టించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్న్రెడ్డిల అరెస్టులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు రాష్ట్రానికి చేటుగా మారుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాధికారులు, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపించడం తగదన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తున్నాయన్నారు. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు చూపలేదని.. కానీ బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు మాత్రం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించిన టీడీపీ.. ఇప్పుడు అధికారంలో వుండి అవే డిస్టలరీల నుంచి కొనుగోలు చేస్తుండటం ఆ పార్టీ మోసపూరిత విధానాలకు నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానాకు నష్టం వచ్చిందన్న టీడీపీ.. నేడు అధికారంలో వుండి ప్రభుత్వమే విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథరెడ్డి -
ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు
వేంపల్లె: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అవినీతి జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వేంపల్లె పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. అలాగే కూలీలతో మాట్లాడి.. పనులు, సౌకర్యాలు, బిల్లుల చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన పంటలను సాగు చేసిన నిమ్మ, చీనీ పంటలను పరిశీలించి.. రైతుల ద్వారా బిల్లుల చెల్లింపులు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీలు డీకేటీ భూములను సాగు చేసుకుంటుంటే అలాంటి వారికి పట్టాలు ఇస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి పనులను తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, తహసీల్దార్ హరినాథ్రెడ్డి, ఎంపీడీఓ కుళాయమ్మ, ఉపాధి ఏపీఓ పార్వతి, ఉపాధి హామీ పథక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందించండి ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మండలంలోని ఇడుపులపాయ పంచాయతీలో ఉన్న ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తాతో కలిసి ఆయా శాఖల అధికారులతో అడ్మినిస్ట్రేషన్పై సమావేశం నిర్వహించారు. ఫ్యాకల్టీ, సిబ్బంది తదితర అంశాలపై ఆరా తీశారు. పాలనపరంగా ఉన్న సమస్యలను తమ దృష్టికి తేవాలని డైరెక్టర్కు కలెక్టర్ సూచించారు. పరిశ్రమలకు అనుగుణంగా ట్రిపుల్ ఐటీలో కొత్త ల్యాబ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రిపుల్ ఐటీ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వ్యాపారి.. తీరు మారి..
● ఒక్కరోజులో రూ.10 వేల ధర వ్యత్యాసం ● జెడ్పీలో గళమెత్తిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ● అక్రమాలు కట్టడి చేయాలని కలెక్టర్కు విన్నపం ● కలెక్టర్ ఆకస్మిక పర్యటనకు వస్తున్నారని ప్రచారం ● ఒక్కమారుగా పెరిగిన చీనీకాయల రేటు పులివెందుల మార్కెట్ యార్డులో చీనీ కాయల ధరలు తేదీ అమ్మకం జరిగిన మార్కెట్యార్డులో సరుకు పరిమాణం టన్ను ధర (టన్నులలో) (రూ.లలో) సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతికి దీటుగా ఎదురొడ్డి నిలబడ్డారు. కష్టానికి వెరవక కన్నబిడ్డల లెక్కన చెట్లను పెంచుకున్నారు. అందుకు తగ్గట్టుగా పంట దిగుబడి లభించింది. ఎంతో సంతోషించిన రైతన్నలు.. చివరికి మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్నారు. పెట్టుబడులకు తగ్గ గిట్టుబాటు ధర లభించడం లేదు. శ్రమంతా వృథా అవుతోంది. ఏమి పాలుపోలేని స్థితికి చేరుకోవడంతో.. కొందరు ఏకంగా చెట్లను పెకలిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు లేవా అంటే.. భారీగా పలుకుతున్నాయి. రైతులు విక్రయాల వద్దకు తీసుకువచ్చే సమయంలో గణనీయంగా తగ్గుతున్నాయి. చీనీ రైతుల పరిస్థితిపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జెడ్పీలో గళమిప్పారు. 24 గంటల వ్యవధిలో భారీగా మార్పు లభించింది. వ్యాపారులు సిండికేట్గా మారి.. పులివెందుల మార్కెట్ యార్డులో చీనీకాయల విక్రయాల కేంద్రం ఏర్పాటు చేశారు. ఎంతో ఉపయోగకరంగా మారిన ఈ కేంద్రంలో.. ఇటీవల వ్యాపారులు సిండికేట్ అయ్యారు. కొందరు దళారుల అవతారమెత్తి దోచుకుంటున్నారు. మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. కొందరు స్థానిక అధికారులు వ్యాపారులకు దాసోహం అయ్యారు. పొరుగు జిల్లాలో అధికంగా ఉన్న ధరలు.. వైఎస్సార్ జిల్లాలో లభించడం లేదు. గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ విషయమై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గళమెత్తారు. రైతులను దోచుకుంటున్నారని వాపోయారు. వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, వేంపల్లె, వేముల జెడ్పీటీసీలు రవికుమార్రెడ్డి, బయపురెడ్డి తదితరులు సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘కలెక్టర్ సార్ చొరవ తీసుకోండి.. దళారులను కట్టడి చేయండి, వ్యాపారులను అనుమతించండి. పొరుగునే ఉన్న అనంతపురంలో ఉన్న ధరలు పులివెందులలో లేవు’ అని ఏకరువు పెట్టారు. టన్నుకు రూ.10 వేలు అదనంగా పలికిన ధర మార్కెట్ యార్డులో వ్యవహరిస్తున్న ధోరణి జెడ్పీ సమావేశంలో బహిర్గతం కావడం, ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు డిజిటల్ బోర్డు ద్వారా డిస్ప్లే చేస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటించడం, పులివెందుల వ్యవహారంలో సమీక్ష చేస్తామని ప్రకటించడంతో మార్కెటింగ్శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో 24 గంటలు గడవక మునుపే టన్నుపై రూ.10 వేల ధర అదనంగా పెరిగింది. బుధ, గురువారాల్లో రూ.31 వేలు, రూ.32 వేలు ఉన్న ధర శుక్రవారం టన్ను చీనీ కాయలు రూ.41,500 కొనుగోలు చేశారు. మే 1న రూ.21 వేలు మాత్రమే పలికాయి. మే 8న రూ.22 వేల ధర ఉంది. మే 16 నాటికి రూ.41,500 పలికాయి. ఈ వ్యత్యాసంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శుక్రవారం పులివెందుల మార్కెట్లో 44.08 టన్నుల చీనీకాయలు విక్రయాలు జరిగాయి. గడిచిన రెండు వారాల్లో 1090 టన్నుల చీనీ కాయలు విక్రయించారు. దాదాపు 1050 టన్నులను సగం ధరకే రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. కోట్లాది రూపాయాలు మార్కెటింగ్ మాయజాలంతో రైతులు కోల్పోయారని పలువురు వాపోతున్నారు. కలెక్టర్ వస్తున్నారని ప్రచారం... జిల్లా కలెక్టర్ శుక్రవారం వేంపల్లె, గండి ప్రాంతాల్లో పర్యటించారు. పులివెందుల మార్కెట్లో కూడా పర్యటిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో మార్కెటింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాపారులను హెచ్చరించారు. ఒక్కరోజులో టన్నుకు రూ.10 వేల ధర అదనంగా పెరిగింది. కార్యాలయానికి పరిమితం కాకుండా కలెక్టర్ జిల్లాలో పర్యటిస్తే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయో.. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చునని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గళమిప్పితే ప్రయోజనమే మే 1 54.72 21,600 2 84.43 21.100 3 65.45 18,100 5 163.43 31,000 6 142.18 22,000 7 75.79 23,200 8 72.41 22,000 9 53.88 26,700 10 40.71 21,500 12 72.19 26,700 13 62.44 26,000 14 68.37 31,000 15 90.28 32,100 16 44.08 42,500 మొత్తం: 1090.36 టన్నులు ఎంపీపీ రఘనాథరెడ్డి, జెడ్పీటీసీలు రవికుమార్రెడ్డి, బయపురెడ్డి తదితరులు మార్కెటింగ్శాఖ పరిధిలో చోటుచేసుకున్న అక్రమాలు, రైతులు నష్టపోతున్న తీరుపై వాస్తవిక విషయాలను సభ దృష్టికి తీసుకొస్తే.. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరాలి. అలా కాకుండా దళారులంతా స్థానిక ప్రజాప్రతినిధుల వర్గీయులే కదా అంటూ సీనియర్ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వ్యాఖ్యానించి జెడ్పీ సభలో అభాసుపాలైయ్యారు. రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించపోగా, అక్కడ కూడా రాజకీయం దృక్పథంతో వ్యవహరించడం నవ్వులపాలు కావాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కలెక్టర్ చొరవ అభినందనీయం జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు చీనీ రైతుల దుస్థితిని వివరించారు. ఆకస్మిక పర్యటన పెట్టుకొని పరిశీలించాలని కలెక్టర్ను అభ్యర్థించాం. తక్షణమే స్పందించి ఆయన మార్కెట్లో ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు డిస్ప్లే అయ్యేలా బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కలెక్టర్ సమీక్ష వల్లే మార్కెట్ ధరల్లో ఒక్కమారుగా మార్పు వచ్చింది. చీనీ రైతుల దుస్థితిపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆవేదనపై కలెక్టర్ చొరవ అభినందనీయం. – ముత్యాల రామగోవిందురెడ్డి, జెడ్పీ చైర్మన్ పర్యవేక్షణ కొరవడింది చీనీ కాయల విక్రయాల కొనుగోలు కేంద్రంలో మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ కొరవడింది. ఉన్నతాధికారులు సమీక్ష చేస్తూ ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో లభిస్తున్న ధరల వ్యత్యాసాన్ని గమనించాలి. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. ఒక్క రోజులో టన్నుకు రూ.10 వేలు అదనంగా ధర పలికింది. ఇంతకాలం వడపు కాయలంటూ రకరకాల కొర్రిలు పెట్టి దోచుకున్నారు. శుక్రవారం మండీలో ఉన్న కాయలన్నీ కొనుగోలు చేశారు. –ఎంపీపీ రఘునాథరెడ్డి, వీరపునాయునిపల్లె -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నిమ్మనపల్లె : రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం ఎగువ కురవంకలో నివాసముంటున్న షేక్ రెడ్డిబాషా శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి నిమ్మనపల్లెలోని సయ్యద్షావలి దర్గా వద్ద జరిగే ఉరుసు చూసేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి సింగంవారిపల్లెకు వెళ్లేందుకు చిన్నళ్లవారిపల్లెకు చెందిన పఠాన్ ముస్తఫా ఆటో బాడుగకు మాట్లాడుకుని కుటుంబసభ్యులతో బయలుదేరారు. మార్గమధ్యంలో సైదాపేట మలుపు వద్ద కందూరు వైపు నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. ప్రమాదంలో రెడ్డిబాషా(46), తాజున్బీ(40), ఇమ్రాన్(17), అసిఫా(14)తోపాటు ఆటో డ్రైవర్ ముస్తఫా(60)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను నిమ్మనపల్లె పీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
● మేయర్ సురేష్బాబుపై కక్ష సాధింపు
● ‘ఎస్ మేడమ్’.. అనకపోతే ప్రతీకారమే ఎమ్మెల్యే మాధవీరెడ్డి పార్టీలో అంకితభావంతో పని చేసిన వారి పట్ల అయినా.. సానుకూలతతో ఉన్నారా? అంటే.. అది కూడా కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. ఎస్..మేడమ్ అన్నోళ్లు మినహా తక్కిన వారందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆ పార్టీ నుంచి ఎంపికైన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి పట్ల కార్పొరేషన్ సమావేశంలో.. ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించిన తీరును పలువురు ఉదహరిస్తున్నారు. ఇవన్నీ కూడా నడిమంత్రపు హోదా కారణంగా జరుగుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: ‘అంతా నా ఇష్టం’ అన్నట్లుగా.. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి వ్యవహరిస్తున్నారు. నిత్యం ఏదో ఓ కారణంతో.. వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. కడప గడపలో మునుపెన్నడూ లేని రీతిలో రాజకీయ దుమారం రేపుతున్నారు. ప్రత్యర్థులపై ప్రతీకారేక్షతో విరుచుకుపడుతున్నారు. అడ్డుగా నిలుస్తున్నారనుకున్న వారందరిపై.. తరతమ భేదం లేకుండా.. అధికారం అడ్డుపెట్టుకొని వేటు వేస్తున్నారు. ఆపై ప్రత్యక్షంగా నోరు పారేసుకుకోవడం కూడా చేస్తున్నారు. నడిమంత్రపు హోదానే దుష్ట సంప్రదాయానికి ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ ముసుగులో పార్టీ ప్రతిష్టను పాతిపెట్టేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు తల పట్టుకుంటున్నారు. పార్టీ నగర అధ్యక్షుడిపై దాడి జిల్లా కేంద్రమైన కడపలో ప్రశాంత వాతావరణం ఉండేది. గడిచిన ముప్పై ఏళ్లుగా ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు లేవు. కాగా మాధవీరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేసిన తర్వాత ఉద్రిక్తత వాతావారణం కడప గడపలో ఉత్పన్నమైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేయర్ సురేష్బాబు ఇంటిపై చెత్త వేయించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ‘వీపులు విమానం మోత మోగుతాయ’ని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవీ ప్రత్యక్ష బెదిరింపులకు దిగడం.. ఇవన్నీ కూడా టీడీపీ ప్రతిష్టను దిగజార్చనున్నట్లు పలువురు వివరిస్తున్నారు. టపాసులు పేల్చుతూ కవ్వింపులు కడపలో తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహారశైలి కన్పించడంపై ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు, మాజీ మంత్రి అంజద్బాషా సోదరుడు అహమ్మద్బాషా ఓ కేసులో అరెస్టు అయితే, వారి ఇంటికి కూత వేటు దూరంలో ఎమ్మెల్యే అనుచరులు టపాసులు పేల్చడం, మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటు వేయగానే కార్పొరేషన్ వద్ద టపాసులు పేల్చడం, ఇలాంటి కవ్వింపు చర్యలు మునుపెన్నడూ కడపలో కన్పించడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరుతో విసిగి పోతున్న తెలుగు తమ్ముళ్లు నడిమంత్రపు హోదానే కారణమంటున్న విశ్లేషకులు ప్రతి సందర్భంలోనూ కవ్వింపు చర్యలు దిగజారుతున్న టీడీపీ ప్రతిష్ట ప్రశాంతతకు నిలయమైన కడపలో దుష్ట సంప్రదాయం నష్టనివారణ చర్యలు ఎలా? ఎమ్మెల్యే ఏకపక్ష చర్యల కారణంగా టీడీపీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. నష్ట నివారణ చర్యలు ఎలా అనే సందిగ్ధంలో ఆ పార్టీ సీనియర్లు పడ్డారు. మునుపెన్నడూ లేని రాజకీయ కక్ష సాధింపు చర్యలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అనే ఆవేదనను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో జెండా మోసి కష్టనష్టాలను భరించిన వారి పట్ల కూడా సానుకూలత లేదని పలువురు వాపోతున్నారు. అదే విషయాన్ని బాహాటంగా తెలుగుతమ్ముళ్లు వెల్లడించలేని దుస్థితిలో ఉండటం గమనార్హం. మహానాడు సందర్భంగా రాష్ట్ర ముఖ్యనేతల దృష్టికి కడపలో నెలకొన్న పరిస్థితులపై నివేదికలు ఇవ్వాలనే దిశగా ఆ పార్టీ శ్రేయోభిలాషులు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కడప మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటుతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర దుమారం రేగుతోంది. రూ.36 లక్షల విలువైన కాంట్రాక్టు పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని.. ఏకంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చి చెప్పినా చర్యలకు ఉపక్రమించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సురేష్బాబు.. ముఖ్యమంత్రులుగా పని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. కాంట్రాక్టు పనులే కావాలనుకుంటే వందల కోట్ల పనులు చేసి ఉండేవారు కదా? అని విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు. రాజకీయంగా అడ్డు నిలుస్తున్నారనే భావనతోనే మేయర్పై దొంగదెబ్బ తీశారని పరిశీలకులు పేర్కొంటున్నారు. మేయర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న కాంట్రాక్టు సంస్థ పనులు చేయరాదంటూ నిలువరించాల్సిన అధికారులపై చర్యలు తీసుకోకపోగా.. మేయర్పై మాత్రమే చర్యలు చేపట్టడం వెనుక కక్ష సాధింపే ప్రధాన కారణమని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
ఉత్సవమూర్తులకు చక్రస్నానం
రాజుపాళెం : మండలంలోని వెల్లాల క్షేత్రంలో జరుగుతున్న బ్రహోత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజున శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ, సంజీవరాయ స్వాముల విగ్రహాలను హంస వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వసంతం చల్లుతూ, భజన పాటలు పాడుతూ, నవ ధాన్యాల మొలకలు తీసుకొని కుందూనదికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవ విగ్రహాలకు స్నపనం గావించి చక్రస్నానం చేయించారు. అనంతరం అక్కడకు వచ్చిన భక్తులంతా కుందూ నదిలో స్నానం ఆచరించారు. భక్తులకు వేద పండితులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈఓ వెంకటరమణ, లక్ష్మినారాయణరెడ్డి, రామ్మోహన్, అర్చకులు పాల్గొన్నారు. -
పట్టుపట్టి.. ర్యాంకులు కొట్టి
కడప ఎడ్యుకేషన్ : తల్లిదండ్రుల కష్టాలను చూసిన విద్యార్థులు తమ లక్ష్యం ఎంచుకున్నారు. కష్టపడి చదవి తమ కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీ ఈసెట్ పరీక్ష ఫలితాలు గురువారం వెలువడగా జిల్లా విద్యార్థులు ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఇంజినీరింగ్ చదివి తల్లిదండ్రుల కష్టం తీరుస్తామని చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని.. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లెకు చెందిన సురేష్రెడ్డి కుమార్తె పల్లెటి రాజశ్రీ ఏపీ ఈసెట్లో ఐదో ర్యాంకు సాధించారు. ఈమె తండ్రి పులివెందుల మెడికల్ కళాశాలలో ఆరోగ్యమిత్రగా పనిచేస్తుండగా, తల్లి అంగన్వాడీ టీచర్గా ఉంది. రాజశ్రీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పలివెందులలో చదివారు. పులివెందుల లయోలా కళాశాలలో పాలిటెక్నిక్ సీఎస్సీ పూర్తి చేశారు. ఈసెట్ రాసి ఐదో ర్యాంకు సాధించారు. మంరి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యమని విద్యార్థిని తెలిపారు. రైతు కుమారుడు చదువులో మెరిసె.. ఖాజీపేట కొటంగురువారిపల్లెకు చెందిన మారుతి శ్రీనివాసులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన సతీమణి నాగలక్ష్మికళ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు తరుణ్ ఏపీ ఈసెట్లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన తరుణ్ కష్టపడి చదివాడు. తిరుపతి ఎస్వీ కాలేజీలో డీఫార్మసీ పూర్తి చేశారు. ఏపీ ఈసెట్లో ఆరో ర్యాంకు సాధించారు. కొలువు సాధించమే లక్ష్యం అని చెబుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించా.. తమ తల్లితండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన గణేష్ కష్టపడి చదివి ఏపీ ఈసెట్లో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. వేంపల్లి మండలం ముత్తకూరు గ్రామానికి చెందిన గంగరాజు, గంగాభవానీలు వ్యవసాయం చేస్తూ కుమారుడిని చదివించారు. గణేష్ పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్పూర్తి చేశాడు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని చదివి ఏపీ ఈసెట్ రాశారు. ఆరో ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మంచి కొలువు సాధించి తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చాలన్నదే తన లక్ష్యమన్నారు. బేల్థారి కుమారుడు ర్యాంకు సాధించాడు జమ్మలమడుగు మండలం పెద్దగండ్లూరుకు చెందిన చెన్నారెడ్డి బేల్దారి పని చేస్తున్నారు. తల్లి శివపార్వతి గృహిణి. వీరి కుమారుడు గువ్వల జయచంద్రారెడ్డి రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్న జయచంద్రారెడ్డి వారి కష్టాలు గుర్తించాడు. కష్టపడి చదివి ఏసీ ఈసెట్లో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించాడు. కొలువు సాధించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తానని చెప్పారు. ఏపీ ఈసెట్లో విద్యార్థుల ప్రతిభ -
కన్నుల పండువగా కల్యాణోత్సవం
జమ్మలమడుగు : నారాపుర వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం స్వామి సర్వభూపాల అలంకారంలో పల్లకిపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చెక్కభజన చేస్తూ స్వామికి స్వాగతం పలికారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై భూదేవి, శ్రీదేవి సమేతంగా నారాపుర స్వామిని కొలువు దీర్చి వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పోలీసుల అదుపులో ఇద్దరు ఆప్ఘన్లు కడప అర్బన్ : ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ పార్కు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఆప్ఘనిస్తాన్ దేశానికి చెందిన అసదుల్లా, ఓవాస్ అని గుర్తించారు. భారతదేశానికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతోంది. నంద్యాలలో కొంతకాలం ఉన్నారు. రెండు నెలల కిందట కడపకు వచ్చారు. ఈ క్రమంలోనే కడపలో ఐస్క్రీమ్ పార్లర్లో పనిచేస్తూ అక్రమంగా తలదాచుకుంటున్నారు. పోలీసులు ఎంబీసీకి రిపోర్టు పంపనున్నారు. తర్వాత వారి దేశానికి తరలించనున్నట్లు సమాచారం. వాహనం బోల్తా.. ఒకరి మృతి తాడిపత్రి : మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగుప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ హుస్సేన్ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్ గాయపడ్డారు. ఘటనపై రూరల్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కోడి కత్తితో అన్న, వదినపై దాడి నిమ్మనపల్లె : అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత కక్షలు కత్తులతో దాడి చేసుకునే వరకూ దారి తీశాయి. మాటామాటా పెరిగి క్షణికావేశంలో కోడి కత్తితో సొంత తమ్ముడే.. అన్నా, వదినలపై దాడికి దిగారు. తీవ్రగాయాలతో వారు ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ పంచాయితీ యానాది కాలనీకి చెందిన ఎర్రప్ప(30), శ్యామల(24) నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ దుర్గంవారిపల్లె వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎర్రప్పకు గత కొద్ది రోజులుగా తమ్ముడు హనుమంతుతో వ్యక్తిగత వివాదాలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఎర్రప్ప తన భార్య శ్యామలతో కలిసి సొంత పనులపై బండ్లపై గ్రామానికి వచ్చారు. తిరిగి రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో దుర్గంవారిపల్లె పొలం వద్దకు వెళ్తున్నారు. తన అన్న వచ్చిన విషయం తెలుసుకున్న ఎర్రప్ప తమ్ముడు హనుమంతు, తన స్నేహితుడు అశోక్, మరో వ్యక్తితో కలిసి అడ్డగించి కోడి కత్తులతో అన్నా, వదినలపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లైంగిక వేధింపులపై కేసు నమోదు
కొండాపురం : మండలంలోని పొట్టిపాడు గ్రామానికి చెందిన సింగంశెట్టి సూర్యనారాయణ అలియాజ్ పెద్దసూరి లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. పొట్టిపాడు గ్రామానికి చెందిన సింగంశెట్టి సూర్యనారాయణ స్థానిక మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధిస్తున్నారు. ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు వెళ్లి సూర్యనారాయణను మందలించాడు. దీంతో అతడు, ఆయన బంధువు తాను, తన భర్తపై దాడికి యత్నించారని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చంటి హత్య కేసులో నిందితుల అరెస్టు చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం కోమటిపేటకు చెందిన కందుల చంటి హత్య కేసులో నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, చక్రాయపేట ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులైన రెడ్డివారిపల్లె మాలపల్లెకు చెందిన దాసరి వెంకటరమణకుమార్ అలియాస్ రమణకుమార్, జల్ది దర్శనమ్మ, రెడ్డివారిపల్లెకు చెందిన సురభి ఈశ్వరయ్యలను బాలతిమమయ్యగారిపల్లె క్రాస్ వద్ద అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు పంపినట్లు వారు తెలిపారు ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్ రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా ఏపీజీఈఏ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) అధ్యక్షుడిగా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డాక్టర్ లక్ష్మీప్రసాద్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికకు కడప జిల్లా అధ్యక్షుడు రఘురాంనాయుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు బుధవారం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి అధికారకంగా శుక్రవారం వెలువడ్డాయి. -
పార్టీ అధ్యక్షుడిని కలిస్తే.. రాజీనామా చేస్తారా !
మైదుకూరు : మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలవడంతో.. మనస్థాపంతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర చెప్పడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూమైదుకూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా ప్రకటనపై ఆయన స్పందిస్తూ సొంత పార్టీ అధ్యక్షున్ని కలవడం నేరం కాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ చంద్ర వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, తన వద్దకు, కార్యాలయానికి రాలేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీలోకి వెళ్దామని చెబుతున్నారని కౌన్సిలర్లు కొందరు తన దృష్టికి తెచ్చినట్టు పేర్కొన్నారు. రెండు నెలల కిందట మున్సిపల్ చైర్మన్పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలియడంతో కౌన్సిలర్లు ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డిని కలిసి విషయం తెలిపారన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని ఎంపీతోపాటు, తానూ కౌన్సిలర్లకు చెప్పామన్నారు. కౌన్సిలర్ల కోరిక మేరకు తాను మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసినట్లు రఘురామిరెడ్డి వివరించారు. మూడు నెలలుగా అడుగుతున్నా జగన్ వద్దకు తనను తీసుకెళ్లలేదని చైర్మన్ చెప్పడం అవాస్తవమని అన్నారు. ప్రొటోకాల్ ప్రకారం చైర్మన్ నేరుగా కలవవచ్చని పేర్కొన్నారు. టీడీపీ అవిశ్వాసం పెట్టాలనుకున్నప్పుడే మున్సిపల్ చైర్మన్కు వైఎస్.జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ బీఫారం ఇచ్చి కౌన్సిలర్లను గెలిపించిందని, వారు పార్టీకే విధేయులని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహబూబ్షరీఫ్, భరత్కుమార్రెడ్డి, వెంకటసుబ్బన్న, పిల్లి నాగయ్య, ఏసీకే.వెంకటరమణ, కో ఆప్షన్ సభ్యులు ఎంఆర్ఎఫ్.సుబ్బయ్య, ట్రాక్టర్ గౌస్, వార్డు ఇన్చార్జులు జిలాన్, భూమిరెడ్డి సుబ్బరాయుడు, ఖాదర్, కేపీ.లింగన్న, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. అవిశ్వాసం అన్నప్పుడే వైఎస్ జగన్, అవినాష్రెడ్డి గుర్తుకొచ్చారా? మున్సిపల్ చైర్మన్పై మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆగ్రహం -
8వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల విడుదల
కడప ఎడ్యుకేషన్ : 8వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.విశ్వనాథకుమార్ శుక్రవారం విడుదల చేశారు. 66 శాతం బాలురు, 34 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఫైన్ ఆర్ట్స్, ప్లానింగ్ విభాగాల్లో 84 శాతం విద్యార్థులు ప్రథమ, 16 శాతం మంది ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. తక్కువ సమయంలో ఫలితాల విడుదలకు కృషి చేసిన సిబ్బందిని వీసీ అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఫణీంద్రరెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణాధికారి ఉదయప్రకాష్రెడ్డి, నారపరెడ్డి, వి.శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న లారీ
అట్లూరు : మండలంలోని కడప–బద్వేల్ రహదారిపై కలివికోడి పరిశోధనా కేంద్రం సమీపంలో ఓ లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల మేరకు.. గురువారం రాత్రి కడప వైపు నుంచి వెళ్తున్న లారీ అట్లూరు పోలీస్ స్టేషన్ సమీపం లోని కలివికోడి పరిశోధనా కేంద్రం వద్దకు చేరగానే.. అదుపు తప్పి రోడ్డుకు ఆవల ఉన్న వేప చెట్టును డీకొంది. రాత్రి సమయంలో వాహనాలు రాకపోవడంతో డ్రైవర్కు పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో లారీ నడిపినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు బద్వేలు అర్బన్ : నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు బద్వేల్ వాసులకు తీవ్రగాయాలయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని వల్లెరవారిపల్లెకు చెందిన సుధీర్, బ్రాహ్మణ వీధికి చెందిన మహేష్ పిపి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. శుక్రవారం ఓ పని నిమిత్తం తమ స్కూటీలో నెల్లూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా కదిరినాయుడుపల్లె సమీపంలోని వంతెన వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కడప రిమ్స్కు తరలించారు. కోర్టు సముదాయంలో భద్రతపై సెక్యూరిటీ ఆడిట్ కడప అర్బన్ : కడప నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలో భద్రతా చర్యలపై స్టేట్ ఇంటెలిజెన్స్, పోలీస్, అగ్నిమాపక అధికారులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. భవన సముదాయంలో ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సీసీ కెమేరాలు, ఫైర్ సేఫ్టీ, ఇతర చర్యల నిమిత్తం కోర్టు ఆవరణంతా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ వై.సాయిరాం, స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ సీఐ సుదర్శన్రెడ్డి, కడప డీఎస్పీ పి.వెంకటేశ్వర్లు, ఎస్.వినయ్కుమార్రెడ్డి, ఆర్.పురుషోత్తం రాజు, బసివిరెడ్డి, జీవన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏ ఆధారాలతో వారిని అరెస్ట్ చేశారు?: రాచమల్లు
సాక్షి, కడప: కూటమి ప్రభుత్వం చేసే అరెస్ట్లు కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మద్యం పాలసీతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు సంబంధమే లేదన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశారన్నారు.ఏ సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్ చేశారో ప్రభుత్వం చెప్పగలదా? అంటూ రాచమల్లు శివప్రసాద్రెడ్డి నిలదీశారు. ‘‘సత్యప్రసాద్ అనే చిన్న ఉద్యోగిని బెదిరించారు. అతని బెదిరించి వారికి కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్లు ధైర్యంగా పనిచేయగలుగుతున్నారా?. ఐఏఎస్, ఐపీఎస్లు జైళ్లకు పోవాల్సిందేనా?’’ అంటూ రాచమల్లు దుయ్యబట్టారు.‘‘కొన్ని బ్రాండ్లే అమ్మారు.. అన్ని బ్రాండ్లు అమ్మలేదని ఆరోపణ.. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎవరిని జైలుకు పంపాలని ఉద్దేశంతో అక్రమ అరెస్ట్లు చేస్తున్నారు?. రూ.3,200 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో ఆధారాలతో చెప్పగలరా?. చంద్రబాబు మద్యం పాలసీ అత్త నీతులు చెప్పినట్లుంది. ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా?’’ అంటూ రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రశ్నించారు. -
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : కడప మేయర్ పదవి నుంచి తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తొలగింపు ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్కు పనులు కేటాయించాలని మునిసిపల్ కమిషనర్ను సురేబాబు ఒత్తిడి చేశారా? అని ప్రశ్నించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.అంతకు ముందు సురేష్బాబు తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సురేష్ బాబు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారని, పూర్తిస్థాయి వివరణ నిమిత్తం గడువు కోరారని కోర్టుకు నివేదించారు. అయితే ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండానే అధికారులు మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ పిటిషనర్ కుటుంబ సభ్యులకు చెందినది కాదని వివరించారు. మునిసిపల్ కమిషనర్ నిబంధనల మేరకే నేరుగా ఆ కంపెనీకి పనులు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, సురేష్బాబు అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పిటిషనర్కు నోటీసులిచ్చి వివరణ తీసుకున్న తరువాతనే మేయర్ పదవి నుంచి తొలగించారని కోర్టుకు తెలిపారు.న్యాయమూర్తి స్పందిస్తూ మేయర్ తమ కుటుంబ కంపెనీకి పనులు కేటాయించాలని మునిపిసల్ కమిషనర్పై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాల సమర్పణకు గడువునివ్వాలని న్యాయవాది ప్రణతి కోరారు. సురేష్బాబు తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వచ్చేందుకు రెండు వారాలు పడుతుందని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణకు గడువిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కార్మిక, రైతు, వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్.నాగసుబ్బారెడ్డి, మనోహర్ తెలిపారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించి వాటిని వ్యవసాయ కార్మికులు, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను బలహీన పర్చడం, అమ్మడం మానుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి పొందుతున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్పై ప్రభుత్వం ఆర్థిక దాడికి పాల్పడుతోందని, అన్ని రకాల రుసుము, పెనాల్టీలు, ట్యాక్స్ టోల్ చార్జీలు పెంచి నడ్డి విరుస్తోందన్నారు. అగ్రిగ్రేటర్స్ పేరుతో స్వదేశీ, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అనుమతిస్తోందని, వాహన ఫిట్నెస్, రెన్యువల్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించిందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసి పనికి తగిన వేతనం ఇవ్వాలన్నారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి కార్మికులు పోరాడి సాధించిన హక్కులను హరించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, కెసీ.బాదుల్లా, దస్తగిరిరెడ్డి, అన్వేష్, సుభాషిణి, లక్ష్మీదేవి, పి.సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
కూలీ కొడుకుకు ద్వితీయ ర్యాంకు
కూలి పనులు చేసుకుంటున్న చిన్నపుల్లయ్య కుమారుడు ఏపీ ఈసెట్లో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించాడు. రాజుపాలెం మండలం కూలూరు గ్రామానికి చెందిన మెట్టు చిన్నపుల్లయ్య, ఏసమ్మల కుమారుడు మొట్టు దివాకర్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఆ తరువాత డిప్లమా ఈఈఈని తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్తి చేశాడు. ఏపీ ఈసెట్ ఈఈఈ విభాగంలో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించాడు. కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసి తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తానని మొట్టు దివాకర్ తెలిపారు. -
ఏపీఈసెట్ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్ : అనంతపురం జవహరలాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసిన ఏపీఈసెట్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటి ర్యాంకుల పంట పండించారు. డిప్లమా హాల్టర్స్, బీఎస్సీ(మ్యాథమాటిక్స్) డిగ్రీ హాల్డర్స్ ఏపీ ఈసెట్లో అర్హత సాధించి లాటరల్ ఎంట్రీ ద్వారా ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్ లేదా ఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు. ఈ నెల 6న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు గురువారం వెలువడ్డాయి. రాజుపాలెం మండలం కుటూరు గ్రామానికి చెందిన మెట్టా దివాకర్ రెండో ర్యాంకు, తొండూరు మండలం గుండ్లమడుగుకు చెందిన పల్టెటి రాజశ్రీ ఐదో ర్యాంకు, ఖాజీపేట మండలం సుంకేసులకు చెందిన తరుణ్ ఆరో ర్యాంకు, వేంపల్లి మండలం ముత్తకూరుకు చెందిన వద్దరపు గణేష్ ఆరో ర్యాంకు, జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన గువ్వల జయచంద్రారెడ్డి పదో ర్యాంకు సాధించి భళా అనిపించారు. సత్తా చాటిన మిషన్ డ్రైవర్ కొడుకు తల్లితండ్రుల కష్టాలను తీర్చాలని కష్టపడి చదివి ర్యాంకు సాధించాడు బాలమహేష్. వేముల మండలం మబ్బుచింతపల్లె గ్రామానికి చెందిన గుజ్జల మారుతి యురేనియం ప్యాక్టరీలో ఓ మిషన్ డ్రైవర్గా పనిచేస్తుండగా తల్లి గంగాదేవి గృహిణి. తల్లితండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన వారి కుమారుడు దేవి కుమారుడు గుజ్జల బాల మహేష్ కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు పులివెందులలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన మహేష్ డిప్లమో మైనింగ్ కోర్సు పులివెందుల లయోలా కళాశాలలో పూర్తి చేశారు. తాజాగా ఏపీ ఈసెట్లో 111 మార్కులతో రాష్ట్ర స్థాయిలో పస్ట్ ర్యాంకు సాధించారు. పలువురు అతడిని అభినందించారు.జిల్లాలో పలువురికీ ర్యాంకుల పంట -
పెళ్లయిన నాలుగు నెలలకే యువతి ఆత్మహత్య
పులివెందుల రూరల్ : కంటికి రెప్పలా కాపాడుకుని.. అప్పులు చేసి తమ బిడ్డకు వివాహం చేశారు. అయితే అత్తింటివారు వరకట్నం తేవాలంటూ వేధించడంతో వివాహమైన నాలుగు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని నగరిగుట్ట సమీపంలోని మసీదు వద్ద నవ వధువుఉ హర్షియా(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరిగుట్టకు చెందిన కరీముల్లా, జైబున్నీషాల కుమార్తె హర్షియాను అదే ప్రాంతానికి చెందిన ఫకృద్ధీన్కు వచ్చి 2025 జనవరిలో వివాహం జరిపించారు. ఆనందంగా అత్తింటికి చేరిన హర్షియాకు నిత్యం వేధింపులు మొదలయ్యాయి. కట్నం డబ్బులు తేవాలంటూ భర్త ఫకృద్ధీన్ వేధిస్తుండేవాడు. మానసికంగా కుంగిపోయిన నవ వధువు గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ చాంద్బాషా సంఘటన స్థలానికి చేరుకుని హర్షియా ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. వరకట్న వేధింపులు, డబ్బు సమస్యలతోనే హర్షియా ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కక్ష సాధింపులతో రాక్షసానందం
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలో రాక్షస పాలన, రెడ్బుక్ ర్యాజ్యాంగం నడుస్తోందని.. అభివృద్ధి లేకపోగా, ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వైఎస్సార్ సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతలు కక్ష సాధింపులో మాత్రం ముందుంటూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. నిరాధార కేసుల కారణంగా వాళ్లు పెడుతున్న కేసులేవీ కోర్టుల్లో నిలబడడం లేదన్నారు. కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరులో వెళ్తున్నారన్నారు. అసలు కార్పొరేషన్ యాక్ట్ లేదని, జీహెచ్ఎంసీ యాక్ట్ అమలుచేయడం విడ్డూరంగా ఉందన్నారు. మేయర్ కుమారుడి సంస్థను కమిషనర్ రిజిస్టర్ చేశారని, అభ్యంతరమైతే అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆరోపణల్లో ఏదైనా అవినీతి చూపించలేదని, కుర్చీల కోసం ఇదంతా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేకు చాలా కంపెనీలున్నాయని, మరి వాళ్లు కాంట్రాక్టులు చేయవచ్చా...? అని ప్రశ్నించారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి నేరుగా ఫిర్యాదు చేశారని చెబుతున్నారని, ఇందులో రాజకీయం గాక ఇంకేముందని ప్రశ్నించారు. కడప నగరానికి పైసా నిధులు తీసుకురాలేకపోగా, కక్ష సాధింపులకు దిగడం సరికాదన్నారు. కార్పొరేషన్ సమావేశ వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోవడం చట్టమన్నారు. ఆమెకు కుర్చీ వేయలేదని మేయర్ ఇంటిపై చెత్త వేయిస్తారా? తప్పుడు ఫిర్యాదు చేస్తారా? అని నిలదీశారు. అవిశ్వాసం పెట్టి మేయర్ను దించాలని ప్రయత్నం చేశారని, అది వీలు కాకపోవడంతో ఈ రకంగా కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. మేయర్పై చిన్న విషయాన్ని చూపి అనర్హత అనడం దారుణమని రవీంద్రనాథ్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు పులి సునీల్కుమార్, బసవరాజు, జయచంద్రారెడ్డి, వెంకట రమణ, కంచుపాటి బాబు, కరీముల్లా, శ్రీరంజన్రెడ్డి, త్యాగరాజు, మోతుకూరు సుబ్బరాయుడు, రెడ్డిప్రసాద్, కార్పొరేటర్లు షఫీ, కె.బాబు, రామలక్ష్మణ్రెడ్డి, మల్లికార్జున, అలీ అక్బర్, గౌస్బాష, షంషీర్, మగ్బూల్బాష, సమ్మెట వాణి, జిలానీ, లక్ష్మయ్య, వీరారెడ్డి, ఊటుకూరు శ్రీను, కో ఆప్షన్ మెంబర్ జహీర్, బండి ప్రసాద్, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అభివృద్ధి లేదు.. హామీల అమలు లేదు జీహెచ్ఎంసీ యాక్టు చూపించి మేయర్ చర్యలేమిటి? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
15 మందికి జైలు శిక్ష
బద్వేలు అర్బన్ : డ్రంకెన్ డ్రైవ్, మట్కా, కేసుల్లో పట్టుబడిన 15 మందికి బద్వేల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముకేష్కుమార్ గురువారం జైలుశిక్ష విధించారు. బద్వేల్ అర్బన్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఒకరికి ఏడు రోజులు, మరొకరికి 10 రోజుల జైలుశిక్ష, గ్యాంబ్లింగ్, మట్కా కేసుల్లో పట్టుబడిన 13 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై నిరంతరం తనిఖీలు, మట్కా, గ్యాంబ్లింగ్పై దాడులు కొనసాగుతాయన్నారు. చంటి హత్యపై డీఎస్పీ ఆరా చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం కోమటిపేటకు చెందిన చంటి హత్యపై డీఎస్పీ మురళీ నాయక్ శుక్రవారం ఆరా తీశారు. దేవరగుట్టపల్లె సమీపంలో దుండగులు చంటిపై దాడి చేసి పడేసి వెళ్లిన విషయం తెలిసిందే. హత్య జరిగిన స్థలాన్ని ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్యతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. హత్యకు గల కారణాలు, కారకులను గుర్తించి కేసు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. మృతదేహం లభ్యం కలసపాడు : మండల కేంద్రమైన కలసపాడు ఆర్సీఎం చర్చి వెనుక భాగాన తెలుగుగంగ కాల్వలో గుర్తు తెలియని మృతదేహం గురువారం లభ్యమైంది. అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ తిమోతిలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 60–65 సంవత్సరాల మధ్య ఉంటుందని, వారం రోజుల కిందట మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మోహినీ అలంకారంలో వేంకటేశ్వరుడు జమ్మలమడుగు : నారాపురస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరుడు భక్తులకు మోహినీ అలంకారంలో గురువారం దర్శనమిచ్చారు. గురువారం ఉదయం వేదపండితులు స్వామికి ప్రత్యేక పూజలు జరిపి మోహినీ రూపంలో అలంకరించారు. అనంతరం స్వామిని వాహనంపై కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కీర్తనలు పాడుతూ, కోలాటం ఆడుతూ స్వామికి ఘన స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వేంకటేశ్వరుడి కల్యాణం జరుపనున్నారు. -
లారీ డ్రైవర్ బీభత్సం
వల్లూరు : మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ ద్విచక్ర వాహనం, ప్రైవేటు బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న బంకు, దాని పక్కనే వున్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఐదుగురు గాయాలపాలవగా.. బంకుతోబాటు మూడు ద్విచక్ర వాహనాలు, బస్సు దెబ్బతిన్నాయి. వివరాల్లోకెలితే.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిరుమలపురానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ అబ్దుల్ అహమ్మద్ గురువారం గుజరా సామగ్రితో తాడిపత్రికి వెళ్తున్నారు. మద్యం మత్తులో కడప –తాడిపత్రి ప్రధాన రహదారిలో పాపాఘ్ని నగర్(కట్ట) బస్టాపు వద్ద లారీతో వేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని, దానికి ముందు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సును డీకొట్టాడు. అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న బంకును, దాని పక్కనే పార్కు చేసి వున్న రెండు ద్వి చక్రవాహనాలపై ఎక్కించాడు. చివరకు అదుపు తప్పి పక్కనే వున్న చెట్టును ఢీకొట్టాడు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు యాడు. స్థానికులు అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఎస్ఐ పెద్ద ఓబన్న తన సిబ్బందితో వచ్చి జేసీబీ సహాయంతో లారీని కదిలించి రెండున్నర గంటల పాటు శ్రమించి డ్రైవర్ను బయటకు తీశారు. చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ● లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులతో బాటు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మితిమీరి మద్యం తాగి నడపడమే కారణంగా తెలుస్తోంది. మద్యం మత్తులో బస్సును ఢీకొట్టి.. ఐదుగురికి గాయాలు. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ -
మహిళలపై కూటమి నాయకుల దాడి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో మహిళలపై కూటమి నాయకులు గురువారం రాత్రి స్థానిక విచక్షణా రహితంగా దాడి చేశారు. తుమ్మల జయమ్మ, సంధ్య, తుమ్మల స్పందన, మత్తయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. భాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో స్థల వివాదం ఉండడంతో పలు వివాదాలలో పాత్ర వహించిన రాపూర్ రమేష్, వినేష్, నితేష్, మరి కొందరు మహిళలపై దాడి చేసి బెదిరించారు. తాము పోలీస్స్టేషన్కు వచ్చినప్పటికీ పోలీసులు తమతో మాట్లాడకుండానే రేపు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకొంటామని చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ హేమసుందర్ రావు మాట్లాడుతూ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించాక తగిన విధంగా చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. -
అరుదైన శస్త్ర చికిత్స
కడప అర్బన్ : గర్భాశయంలో కణితి తొలగించి అరుదైన శస్త్ర చికిత్స చేశారని గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీసుశీల తెలిపారు. కడప నగరంలోని దర్బార్బీ(46) కడుపునొప్పి, ఉబ్బరంతో శనివారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(రిమ్స్)లో చేరిందని, పరీక్షలు జరిపాక సర్వైకల్ ఫైబ్రాయిడ్గా నిర్ధారించారన్నారు. డాక్టర్ అమానుల్లా మూడు గంటల పాటు శ్రమించి ఎనిమిది కిలోల బరువున్న గర్భాశయ ముఖద్వారం కణితి తొలగించారని తెలిపారు. ఇప్పుడు మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ అమానుల్లాతోపాటు డాక్టర్ రబ్బానీబేగం, డాక్టర్ మాధవి, అనస్తీషియా విభాగం వైద్యులు డాక్టర్ సునీల్ చిరువెళ్ల, డాక్టర్ బాలాజీ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, యూరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ శ్రీదీప్, వైద్య సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. -
కల తీరకుండానే.. కానరాని లోకాలకు
కలసపాడు : కష్టపడి చదివించిన తండ్రి.. తాను కన్న కలలు కుమారుడు నెరవేరుస్తాడని ఆందనపడ్డాడు. తొమ్మిది నెలల కిందట ఓ యువతికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించిన తండ్రి ఇక తన కుమారుడికి ఏ లోటు లేదనుకున్నాడు. ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. ఉన్నపాటుగా తన కుమారుడు రైలు కింద పడి మృతి చెందాడని సమాచారం రావడంతో గుండెలు బాదుకుంటూ బెంగళూరుకు వెళ్లాడు. బెంగళూరులో రైలు కింద పడి శివానందరెడ్డి గురువారం మృతిచెందాడు. బంధువులు, స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని మహానందిపల్లె గ్రామానికి చెందిన బిజివేముల పుల్లారెడ్డికి ఒక్కగానొక్క కుమారుడు శివానందరెడ్డి(25). ఇతడి తల్లి 15 ఏళ్ల కిందట మృతి చెందింది. అప్పటి నుంచి తన కుమారుడి భారం మోస్తూ కష్టపడి చదివించాడు తండ్రి పుల్లారెడ్డి. తొమ్మిది నెలల కిందట పోరుమామిళ్ళ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహంజరిపించాడు. తండ్రి కలలు నెరవేర్చాలనే ఉద్దేశంతో శివానందరెడ్డి బెంగుళూరులో ఓ కంపెనీలో స్టాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరాడు. శుక్రవారం ఉదయం బెంగళూరులో రైలు కింద పడి తన ఒక్కగానొక్క కుమారుడు శివానందరెడ్డి మృతిచెందాడని తండ్రి పుల్లారెడ్డికి సమాచారం అందింది. దీంతో గుండెలు బాదుకుంటూ కుమారుడి కోసం బెంగళూరుకు బయలుదేరాడు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైలు కింద పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య -
పనులు అడ్డుకుంటున్న ‘వరద’: వైస్ చైర్మన్ శారద
తన స్వగ్రామమైన రామాపురం గ్రామంలో తాగునీరు, స్మశానానికి అవసరమైన రహదారి ఏర్పాటుకు సంబంధించి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో తాను ప్రతిపాదించిన పనులకు అంచనాలు వేయనీయకుండా ఎమ్మె ల్యే వరదరాజులరెడ్డి అడ్డుకుంటున్నారని జెడ్పీ వైస్ చైర్మన్ జేష్ఠాది శారద ఆరోపించారు. రాజకీయ కక్షతో పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. ఒక దళిత మహిళ ప్రతిపాదించిన పనులను అడ్డుకోవడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. అధికారులు ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గకుండా అంచనాలు తయారు చేయించి సమర్పించాలని కోరారు. -
రైతులను ఆదుకోండి: నరేన్
రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ఉత్పత్తులకు ఎంఎస్పీ చెల్లించడం లేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకపోవడం విచారకరమన్నారు. అరటి, బొప్పాయి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్ బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన రైతుల జాబితాలో ఇప్పటివరకు 2.10 లక్షల మందిని వెరిఫై చేశామని, ఇంకా మిగిలిన కొంతమందిని వెరిఫై చేసి పంపుతామన్నారు. -
సోలార్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
పెద్దముడియం మండలంలో ఓ ప్రైవేటు సోలార్ కంపెనీ పాల్పడుతున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాల ని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు చెప్పకుండానే వారి పట్టా భూముల్లో దౌర్జన్యంగా గుంతలు తవ్వి ఫిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇందుకు అభ్యంతరం చెప్పిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గత ఖరీఫ్, రబీలో పంటలు నష్టపోయిన రైతులందరికీ పెట్టుబడి సాయం ఇంతవరకు అందలేదన్నా రు. అన్నదాత సుఖీభవ కింద తక్షణమే సాయం అందించి ఆదుకోవాలన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి విత్తనాలు సకాలంలో సరఫరా చేయాలని కోరారు. తన స్వగ్రామమైన గుండ్లకుంటలోని జెడ్పీ హైస్కూలు పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. చెరువుల్లో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్లు గుంతలు తవ్వడం వల్లే ఈతకు వెళ్లిన పిల్లలు చనిపోతున్నారని వాపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల్లో 30 అడుగుల లోతు గుంతలు తవ్వేస్తున్నారని, వీటిని అరికట్టాలన్నారు. -
ఎట్టకేలకు.. ఒక హాల్టింగ్
రాజంపేట: రాష్ట్రంలో వైష్టవ క్షేత్రంగా వెలుగొందుతోంది ఒంటిమిట్ట(ఏకశిలానగరం) కోదండ రామాలయం. ఇక్కడ ఉన్న స్టేషన్లో ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వలేదు..ఇటీవల చర్లపల్లె–తిరుపతి (07017– 07018) నంబరు గల స్పెషల్ట్రైన్కు ఎట్టకేలకు హాల్టింగ్ ఇచ్చారు. ఒకరకంగా హాల్టింగ్లో కదలిక మొదలైందని చెప్పుకోవచ్చు. ● రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ముందు ఒంటిమిట్టలో దూరప్రాంతరైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. అలాగే ‘సాక్షి’లో రామయ్య దరిచేరేదేలా అనే శీర్షికతో అనేక మార్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఒంటిమిట్టలో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వరనే నానుడి తుడిచిపెట్టుకుపోయింది. ● తిరుపతి–చర్లపల్లె మధ్య నడిచే స్పెషల్ట్రైన్కు హాల్టింగ్ ఇవ్వడంతో తెలంగాణా ప్రాంతం , కర్నూలు జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చేందుకు వీలు కలిగింది. శనివారం తిరుపతిలో 4.40 సాయంత్రం 4.40కి బయలుదేరి ఒంటిమిట్టకు 7.05 గంటలకు చేరుకుంటుంది. మరుసటిరోజు ఉదయం 7.10కి చర్లపల్లెకు చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 9.45కు చర్లపల్లెలో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7.50కి ఒంటిమిట్ట, 10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. రెగ్యులర్ ట్రైన్స్ హాల్టింగ్ సౌకర్యం కల్పించాలి ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ మీదుగా నడిచే రెగ్యులర్ ట్రైన్స్కు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, రాయలసీమ, ఎంజీఆర్ చైన్నె ఎక్స్ప్రెస్, విశాఖ–కడప ఎక్స్ప్రెస్, హరిప్రియ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఇది వరకే ఎంపీ మిథున్రెడ్డి రైల్వేమంత్రిత్వశాఖను తన లేఖ ద్వారా కోరారు. అయితే స్పెషల్ట్రైన్కు హాల్టింగ్ ఇచ్చారంటే..ఇక రెగ్యులర్ ట్రైన్స్కూడా హాల్టింగ్ ఇచ్చే అంశాన్ని రైల్వేపరిశీలనలో ఉన్నట్లు కనిపిస్తోంది. రెగ్యులర్ ట్రైన్స్ హాల్టింగ్ ప్రభుత్వం, టీటీడీ నుంచి కూడా రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఫలించిన ఎంపీ మిథున్రెడ్డి కృషి వారానికి ఒకసారి చెర్లపల్లె–తిరుపతి స్పెషల్ట్రైన్ ఒంటిమిట్టలో హాల్టింగ్ సౌకర్యం -
అడ్మిషన్ల గడువు పొడిగింపు
కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లు గడువును మే 19 వరకు పొడిగించినట్లు మను కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విలయత్ అలీ బేగ్ తెలిపారు. పదో తరగతి అర్హత (రెగ్యులర్ లేక ఓపెన్ )తో ఉర్దూ మీడియం లేకపోతే ఉర్దూ సబ్జెక్ట్ చదువుకొని ఉండాలని తెలిపారు. రెండో సంవత్సరం పాలిటెక్నిక్ అడ్మిషన్ పొందాలంటే రెండేళ్ల ఐటీఐ లేకపోతే ఇంటర్మీడియట్ చదివి ఉండాలని తెలిపారు. ఇందులో ప్రవేశానికి జూన్ 13వ తేదీ మద్యాహ్నం రాత పరీక్ష కడప క్యాంపస్లో ఉంటుందని చెప్పారు. పరీక్షా ఆధారంగా ర్యాంకు ద్వారా సీట్ భర్తీ చేస్తామన్నారు. వివరాలకు https:// manu ucoe.in/RegularAdmissionలో తగు సమాచారం తెలిసుకోవచ్చని ఇన్చార్జు ప్రిన్సి పాల్ తెలిపారు. వివరాలకు కళాశాల అడ్మిషన్ కన్వీనర్ ఎం.సికందర్ హుస్సేన్ (93980 83058) ను సంప్రదించాలని సూచించారు. బీఈడీ కళాశాల సీజ్ ప్రొద్దుటూరు: స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలోని మలయాళ స్వామి బీఈడీ కళాశాలకు సంబంధించిన 13 గదులను ఆశ్రమ నిర్వహణ అధి కారి రామచంద్రాచార్యులు గురువారం పోలీసుల సహకారంతో సీజ్ చేశారు. 2019 నుంచి మలయాళ స్వామి బీఈడీ కళాశాలకు సంబంధించి అద్దె చెల్లించడం లేదు. పలు మార్లు అధికారులు నోటీసులు జారీ చేసి కళాశాల నిర్వాహకులు పట్టించుకోలేదు. ఇప్పటికే శ్రీకృష్ణ గీతాశ్రమంలో జరుగుతున్న అవకతవకలపై పలు మార్లు సాక్షిలో కథనాలు ప్రచురించడం జరిగింది. బుధవారం ఈఓ నివేదికను ‘‘తొక్కి పెట్టింది ఎవరు’’అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. పీజీ ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆచార్య పద్మ మాట్లాడుతూ ఏప్రిల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు త్వరితగతిన విడుదలకు కృషిచేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు మాట్లాడుతూ ఎంఏ తెలుగు, హిస్టరీ, పీఎస్ అండ్ పీఏ, ఎకనామిక్స్, ఉర్దూ ఎంకాం కోర్సులలో విద్యార్థులు వంద శాతం ఫలితాలను సొంతం చేసుకున్నారని వివరించారు. ఫిజిక్స్ 90 శాతం, జువాలజి 96.97 శాతం, బయోటెక్నాలజి 97.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సీఈ వివరించారు. పరీక్షల నిర్వహణ సహాయ అధికారులు డాక్టర్ కె. శ్రీనివాసరావు, కామర్స్ సహ ఆచార్యులు డాక్టర్ జి.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీ ఏమైంది చినబాబూ!
సాక్షి ప్రతినిధి, కడప: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లుగా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వ్యవహారశైలి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మాట ఇవ్వడం ఆపై మరుగునపర్చడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో నారా లోకేష్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలపై మంత్రి నారా లోకేష్ వ్యవహరించిన తీరు అలాగే ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూల్చివేతలంటే ఎక్కడ తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందోనని హడావుడి చేసి.. అక్కడంతా తానే సొంత డబ్బులతో చేసేస్తానని చెప్పిన లోకేశ్...ఓ చిన్న కట్టడం కట్టి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు ఆ క్షేత్రంలో సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ● కాశినాయన క్షేత్రంలో సత్రాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేసేందుకు అటవీ శాఖ నడుంకట్టింది. నిర్దాక్షిణ్యంగా అక్కడి నిర్మాణాలను కూల్చివేసింది. అప్పటికే అటవీ అనుమతుల కోసం కేంద్రానికి సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసినా అనుమతులు రాలేదు. ప్రభుత్వం మారడంతో చంద్రబాబు సర్కార్ అక్కడ కూల్చివేతల పర్వం చేపట్టింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూల్చివేతలపై అన్ని వర్గాల వారు నిరసన గళం విప్పారు. తమ ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని భయపడ్డ నారా లోకేశ్ హడావుడి చేశారు. ఏకంగా తన పీఏను పంపించి కూల్చివేసిన నిర్మాణాలను దగ్గరుండి కట్టించి రావాలని పురమాయించారు. ఆమేరకు ప్రచార మాద్యమాలల్లో కూడా ప్రకటించారు. సొంత డబ్బులతో కూల్చివేసిన నిర్మాణాలు పునః నిర్మిస్తామని ప్రకటించారు. ఆపై పీఏ ద్వారా కాశినాయన క్షేత్రంలో ఓ 5 లక్షల రూపాయలతో స్వల్ప నిర్మాణాలు చేపట్టి వెళ్లిపోయాడు. కాగా అక్కడి వాస్తవ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. అటవీ అనుమతులపై హంగామాతో సరి కాశినాయన క్షేత్రం అటవీ ప్రాంతంలో ఉంది. దానిని డీ నోటిఫై చేసి క్షేత్రానికి 13 హెక్టార్లు స్థలాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. రాష్ట్రంలో అధికార మార్పిడి రాగానే కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఇక్కడ అసలు సమస్య అటవీ అనుమతులు తీసుకురావడం. కాగా మంత్రి నారా లోకేశ్ మాత్రం ప్రభుత్వానికి నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు రూ.5లక్షలు ఖర్చు చేసి, అంతా చల్లారిన తర్వాత అక్కడి నుంచి చల్లగా జారుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అటవీ అనుమతుల విషయంలో మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. అప్పట్లో టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు పోటీ పడి మరీ పర్యటనలు చేసి అటవీ అనుమతు లు తీసుకొస్తాం అంటూ హామీలు ఇచ్చి వెళ్లా రు. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయారని పలువురు వాపోతున్నారు. ఆర్టీసీ సర్వీసు మూన్నాళ్ల ముచ్చటే... కాశినాయన క్షేత్రంఅటవీ అనుమతులపై చేతులెత్తేసిన నారా లోకేష్ రూ.5లక్షలతో కూల్చివేత చేపట్టిన వాటికి మాత్రమే పునః నిర్మాణం ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేందుకు కూటమి నేతల హంగామా ఆపై అటవీ అనుమతుల గురించి విస్మరించిన వైనం మంత్రి నారా లోకేశ్ కల్పించుకుని కాశినాయిన క్షేత్రానికి ఆర్టీసీ బస్సు వేయించాడని గొప్పలు చెప్పుకున్నారు. కాశినాయన క్షేత్రంపై చిత్తశుద్ధితో ఉన్నారని భక్తులను సైతం భ్రమింపజేశారు. కాగా కూటమి సర్కార్ చర్యలన్నీ ప్రచారయావతో చేసినవిగా అతి స్పల్ప కాలంలోనే తేటతెల్లమైంది. మార్చి9న కూల్చివేతలు ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగడంతో నష్ట నివారణ చర్యలల్లో నిమగ్నమై నటించి వెళ్లారు. చివరికి ఆర్టీసీ సర్వీసు కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. కావాల్సిన అటవీ అనుమతులు తీసుకురావడంలో మాత్రం టీడీపీ, బీజేపీ నేతలు మాట దాటేసి రాజకీయ పబ్బం గడుపుకుని వెళ్లిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఏపీలో జీహెచ్ఎంసీ యాక్ట్?.. కూటమిలో కుర్చీ కోసం కుమ్ములాట’
సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో అభివృద్ధి లేదు.. కానీ కక్ష సాధింపులో మాత్రం ముందుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పుకొచ్చారు. కుర్చీల కోసం కుమ్ములాట నడుస్తోందన్నారు.వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో అభివృద్ధి లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగా రాక్షసానందం పొందుతున్నారు. వాళ్ళు పెడుతున్న కేసులు ఏవీ కోర్టుల్లో నిలబడటం లేదు. కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరులో వెళ్తున్నారు. అసలు యాక్ట్ లేదు.. మనం జీహెచ్ఎంసీ యాక్టు అమలు చేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి అసలు యాక్ట్ లేనే లేదు. జీహెచ్ఎంసీ యాక్టు చూపించి మా మేయర్పై చర్యలు తీసుకోవడం విడ్డూరం. మేయర్ కుమారుడి సంస్థకు కమిషనర్ రిజిస్టర్ చేస్తారు.. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు?ఆరోపణల్లో ఏదైనా అవినీతి చూపించలేదు. కుర్చీల కోసం కుమ్ములాట కోసం ఇదంతా జరుగుతోంది. వాళ్ళ పత్రికలే కుర్చీల కోసమే ఇదంతా జరుగుతుందని రాసింది. ఎమ్మెల్యేలకు చాలా కంపెనీలు ఉన్నాయి.. మరి వాళ్ళు కాంట్రాక్టులు చేయవచ్చా?. మేయర్ తన వివరణలో తన దృష్టికి రాలేదని వివరణ కూడా ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై మాకు గౌరవం ఉంది.. న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి నేరుగా ఫిర్యాదు చేసారట.. దీనిలో ఇక రాజకీయం లేక ఏముంది?. నగరానికి ఆమె ఒక్క పైసా నిధులు తీసుకురాక పోగా కక్ష సాధింపులకు దిగడం సరికాదు.వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోవాలి.. అది చట్టం. నీకు కుర్చీ వేయలేదని కక్ష సాధింపు అంటే ఎలా?. దీనికి మేయర్ ఇంటిపై చెత్త వేయిస్తారా?. తప్పుడు ఫిర్యాదులు చేస్తారా?. ఈ ప్రభుత్వం రాగానే అవిశ్వాసం పెట్టీ దించాలని ప్రయత్నం చేశారు. అది వీలు కాకపోవడంతో ఈ రకంగా కక్ష సాధింపునకు దిగుతున్నారు. చిన్న విషయాన్ని చూపి అనర్హత అనడం దారుణం’ అంటూ మండిపడ్డారు. -
ఉపాధి హామీ అక్రమాలపై విచారణ జరపాలి
కడప సెవెన్రోడ్స్/పులివెందుల : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. బుధవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి ఈ మేరకు ఆయన లేఖ రాశారు. జిల్లాలో లేని వారికి, అధికార పార్టీ నాయకులకు చెందిన అనుచరులకు ఫేక్ జాబ్కార్డులు జారీ చేస్తున్నారని ఆరోపించారు. అర్హత కలిగిన కూలీలను విస్మరిస్తున్నారని తెలిపారు. అటెండెన్స్ రికార్డుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. ఒకే ఫొటోలను మస్టర్లో ఇతర పేర్లతో పొందుపరుస్తున్నారని తెలిపారు. పనులు చేపట్టకపోయినప్పటికీ వేతనాలు విడుదల చేస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా తరచూ ఇలాంటి పేమెంట్లను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. కువైట్ వంటి ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను కూడా మస్టర్ రోల్స్లో చూపుతున్నారని పేర్కొన్నారు. సామాజిక తనిఖీ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైందని, ఇలాంటి అవకతవకలను వెలికి తీయడంలో విఫలమైందన్నారు. చక్రాయపేట మండలం కుప్పం పంచాయతీ పరిధిలో ఉపాధి పనుల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ఫేక్ ఎంట్రీస్, ఒకే విధమైన ఫొటోలు, తప్పుడు మస్టర్లు వంటివి నిత్యకృత్యమయ్యాయన్నారు. ఉపాధి హామీ మస్టర్ రోల్స్, జాబ్కార్డు రికార్డులు, వేతన పంపిణీ అంశాల్లో గత మూడేళ్లుగా చోటుచేసుకున్న అక్రమాలపై తక్షణమే జిల్లా స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. ఉపాధి పనుల అవకతవకలకు కారణమైన పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయాలని కోరారు. స్వతంత్ర విచారణ కమిటీని నియమించి థర్డ్ పార్టీ అబ్జర్వర్లను కూడా అందులో నియమించాలన్నారు. ప్రస్తుతం పూర్తయిన, జరుగుతూ ఉన్న పనులపై రీ ఆడిట్ నిర్వహించాలన్నారు. సోషల్ ఆడిట్ టీములను పునరుద్ధరించాలన్నారు. సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించి ఉపాధి హామి పనుల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.కలెక్టర్కు ఎంపీ అవినాష్రెడ్డి లేఖ -
హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష
కడప అర్బన్ : కడప నగరం ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఏడురోడ్ల సమీపంలో జనతా మెడికల్ స్టోర్ వద్ద నివాసముంటున్న సులోచనపై అతని సోదరుడు, సిద్దవటం మండలం మంగనవాండ్లపల్లికి చెందిన కారుమంచి సురేష్ అలియాస్ హరిప్రసాద్ నాయుడు 2020 ఫిబ్రవరి 2వ తేదీన మటన్కొట్టే కత్తితో తలపై, భుజంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలు సులోచనకు ఆమె భర్త రాఘవరెడ్డి చికిత్స చేయించారు. కేవలం తన అవసరాలకు డబ్బులు ఇవ్వలేదని సోదరుడు ఈ చర్యకు పాల్పడినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ బి.మధుసూదన్రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఈ సంఘటనపై నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.70 వేలు జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సివిల్ జడ్జి జి.జి ఆసిఫా సుల్తానా తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.శ్రీనివాసులు తమ వాదనలను వినిపించారు. ఈ కేసు వివరాలను ప్రస్తుత సీఐ బి. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. తగిన సాక్ష్యాధారాలతో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ అభినందించారు. -
ఏపీఆర్జేసీ, పాలిసెట్ ఫలితాల్లో విశ్వం విజయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీఆర్జేసీ, పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 25న నిర్వహించిన ఏపీఆర్జేసీ పరీక్షా ఫలితాల్లో వై.దేదీప్య రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, కె.మునిరూపేష్ 7వ ర్యాంకు, జె.అంజలి 9వ ర్యాంకు, మనీషా 10వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు రేవంత్, అబ్దుల్ ఖాదర్, యోగి, సమత, భవ్యశ్రీ గీతిక, రోషన్, ట్వింకిల్, సంతోష్, భువన, కార్తికేయ తదితరులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే పాలిసెట్ ఫలితాల్లో ఎం.కావ్య 120 మార్కులకు 117 మార్కులు సాధించి బాలికల విభాగంలో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. అలాగే కిమ్యశ్రీ 116, కె.నిత్యశ్రీ 114, అబ్దుల్ ఖాదర్ 113, సుజినిరెడ్డి, చాతుర్య, రాజకుమారీలు 112, ఎన్.రోషన్ 111, చేతన్రెడ్డి 110, జస్మిత 109 మార్కులతో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, కరస్పాండెంట్ తులసీ విశ్వనాథరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
పంచాయతీ కార్మికులకు అడ్వాన్సుగా రూ.10.30 లక్షలు
వేంపల్లె : వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు తన సొంత నిధులను అడ్వాన్సుగా రూ.10.30లక్షలను అందజేశారు. పంచాయతీ ఈఓ సెలవుపై వెళ్లడంతో గత ఐదు నెలలుగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో వేంపల్లె గ్రామ పంచాయతీకి ఇన్చార్జిగా ఉన్న పులివెందుల డీఎల్పీఓ రమాదేవి సర్పంచ్ ఇచ్చిన రూ.10.30 లక్షలలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 103 మందికి అందజేశారు. దీంతో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. గత పది రోజుల క్రితం విధుల్లోకి చేరిన ఈఓ రామసుబ్బారెడ్డి తన సొంత పనుల కోసం సెలవుపై వెళ్లారు. అయితే ఆయన ఈనెల 26వ తేదీన విధుల్లోకి వస్తారని డీఎల్పీఓ తెలిపారు. ఈఓ విధుల్లోకి వచ్చిన అనంతరం సర్పంచ్కు రూ.10.30లక్షలను చెల్లిస్తామని తెలిపారు. -
‘మహానాడు’లో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చర్యలు
కడప అర్బన్ : మహానాడు సందర్భంగా ఈనెల 27, 28, 29 తేదీలలో పటిష్ట బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పలు అంశాలపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మహానాడుకు పలువురు వీవీఐపీలు, వీఐపీలు, పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పోలీస్ అధికారులకు కేటాయించిన విధులను అప్రమత్తంగా ఉంటూ నిర్వర్తించాలన్నారు. ఇతర శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, ఏ.ఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర రావు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, ఎస్.బి ఇన్స్పెక్టర్ ఆర్.పురుషోత్తం రాజు, జిల్లాలోని సీఐలు పాల్గొన్నారు.భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ దిశానిర్దేశం -
అల్లదిగో.. వేంకటేశ్వరుడు!
జమ్మలమడుగు : విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే శ్రీ నారాపురస్వామి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామి భక్తులకు ఉదయం కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం హనుమంత వాహనంపై దర్శనం ఇచ్చారు. స్వామి వారికి పల్లకీలో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లకీ వెంట భక్తులు కోలాటం ఆడుతూ, అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ కదిలారు. దేవదేవు డుఇంటి ముందుకు కల్పవృక్ష వాహనంపై రావడంతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.ఆలయాల్లో హుండీల చోరీకలసపాడు : మండలంలోని పాత రామాపురం, ఈ. రామాపురం గ్రామాలలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి, శివాలయం, దేవాలయంలో గుడి తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్న నగదు దొంగిలించారు. గుడి పూజారి రాళ్లపల్లె ప్రభు కలసపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాసులు, కలసపాడు ఎస్ఐ తిమోతి సంఘటన స్థలాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.ఘాట్ రోడ్డులో కారు దగ్ధంముద్దనూరు : ముద్దనూరు – జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగాయి. కొండాపురం నుంచి జమ్మలమడుగు వైపు ప్రయాణిస్తున్న కారు ఘాట్ రోడ్డులో సగం దూరం వెళ్లే సరికి బ్యానెట్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేశాడు. బ్యానెట్ తెరచిన తర్వాత మంటలు వ్యాపించడంతో అతను కారుకు దూరంగా పరిగెత్తాడు. దీంతో కారులో తీవ్రంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.టిప్పర్ ఢీకొని ట్రాక్టర్ బోల్తాచింతకొమ్మదిన్నె : వరి గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక వైపున టిప్పర్ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చింతకొమ్మదిన్నె మండలం ఆజాద్ నగర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో వరిగడ్డి కట్టలు చెల్లాచెదురయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. -
ఎమ్మెల్యేను ఎంతో గౌరవించాం
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక కడప ఎమ్మెల్యే మాధవీకి కార్పొరేటర్లంతా ఘనంగా స్వాగతం పలికి ఎంతో గౌరవించారు. కానీ ఆమె మమ్మల్ని చులకన భావంతో చూసింది. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోకుండా మేయర్ ఇంటిపై చెత్త వేయించింది. ఎక్స్ అఫిషియో సభ్యులకు నిబంధనల ప్రకారం ఎక్కడ కుర్చీ వేయాలో అక్కడే వేశారు. దాన్ని ఎమ్మెల్యే అవమానంగా భావించి ఇలా రాద్దాంతం చేయడం దారుణం. – రామలక్ష్మణ్రెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ ఎమ్మెల్యేకు కుర్చీ మాత్రమే కావాలి ఎమ్మెల్యే మాధవికి మేయర్తో సమానంగా కుర్చీ మాత్రమే కావాలి. ప్రజా సమస్యలు అక్కర్లేదు. కార్పొరేటర్లను టీడీపీ లో చేర్చుకునేందుకు వారి హోటళ్లపై దాడులు చేయించింది. వాటర్ప్లాంట్లను కూల్చి వేయించేందుకు ప్రయత్నించింది. ఇవన్నీ సఫలం కాకపోవడంతో చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టు కుని మేయర్పై అనర్హత వేటు వేయించారు. కార్పొరేషన్లో ఎమ్మెల్యేకు ఎక్కడా అవమానం జరగలేదు. ఆమైకె ఆమె అవమానం జరిగినట్లు ఊహించుకుని కక్ష సాధిస్తోంది. న్యాయస్థానంలో పోరాటం చేసి అదే స్థానంలో కూర్చొబెడతాం. – ఐస్క్రీమ్ రవి, 23వ డివిజన్ ఇన్ఛార్జి అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ మేయర్పై ప్రభుత్వం అనర్హత వేటు వేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ. ఇలా చిన్నచిన్న విషయాలను అడ్డు పెట్టుకుని పదవి నుంచి తొలగించడం అప్రజాస్వామికం. అధికారం చాన్నాళ్లు ఉండదన్న సత్యాన్ని టీడీపీ నాయకులు గ్రహించాలి. – త్యాగరాజు, 26వ డివిజన్ ఇన్చార్జి -
ప్రొద్దుటూరు ఆస్పత్రిలో గుర్తు తెలియని మృతదేహాలు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఇరువురు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను భద్రపరిచారు. సుబ్బరాయుడు (60) అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఈ నెల 12న జిల్లా ఆస్పత్రిలోని ఎంఎం–2 వార్డులో చేరాడు. మంగళవారం మృతి చెందాడు. ఐపీ రిజిష్టర్లో అతని పేరు మినహా ఊరు పేరు, సెల్ నంబర్ లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అలాగే బ్రహ్మయ్య (70) అనే వ్యక్తి ఈ నెల 11న అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ 12న అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు. మృతుల బంధువులు తమను సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వరాలు తెలిపారు. -
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. కార్పొరేషన్లో సీటు వేయలేదనే అక్కసుతో కుతంత్రాలకు తెరలేపింది. నిస్సిగ్గుగా రోత ఫిరాయింపు రాజకీయాలు చేసింది. అయినా తాము అనుకున్న లక్ష్యం నెరవేరదని తెలుసుకుని దొంగదెబ్బ తీసింది. ఎలాంటి అవినీతి రుజువుకాకున్నా మేయ
● సురేష్బాబుపై కక్షగట్టిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ● అధికారుల తప్పిదాన్ని బూచిగా చూపెట్టి ప్రభుత్వం ద్వారా చర్యలు ● కార్పొరేషన్లో రూ.36లక్షల కాంట్రాక్టు పనులు చేశారని అనర్హత వేటు సాక్షి ప్రతినిధి, కడప : కడప మేయర్ సురేష్బాబుపై దొంగదెబ్బ కొట్టారు. కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వర్థిని కనస్ట్రక్షన్స్ సంస్థ రూ.36 లక్షలు కాంట్రాక్టు పనులు చేశారని బూచిగా చూపెట్టి అనర్హత వేటు వేశారు. ఆమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెంబర్ 446 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి అక్కసుతో దొంగ దెబ్బతీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేమని అంచనాకు వచ్చిన తర్వాత, ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకున్నారు. అధికారం అడ్డుపెట్టుకొని అనర్హత వేటు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. కడప కార్పొరేషన్లో లేని ప్రొటోకాల్ కావాలని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టుబట్టారు. సాధ్యపడకపోవడంతో కడప మేయర్ సీటుపై కన్నేశారు. ఎలాగైనా కై వసం చేసుకోవాలనే అంచనాకు వచ్చారు. సామ బేధ దండోపాయాలను ప్రయోగించినా 8మంది కార్పొరేటర్లు మాత్రమే మొగ్గు చూపారు. అవిశ్వాసంతో దింపలేమని స్పష్టమైంది. లొసుగులు, లోటుపాట్లుపై దృష్టి పెట్టారు. మేయర్ సురేష్బాబు తనయుడు అమరేష్ కాంట్రాక్టు సంస్థను రిజిస్ట్రర్ చేసుకున్న విషయాన్ని పసిగట్టారు. కాంట్రాక్టు అనుభవం కోసం చేసిన పనులను బూచిగా చూపెట్టారు. ముందుగా కార్పొరేషన్ను అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ లు చేశారు. విజిలెన్సు ఎన్ఫోర్స్మెంటుకు ఫిర్యాదు చేశారు. పనుల్లో ఎలాంటి అవినీతి లేదని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు ధ్రువీకరించింది. మున్సిపల్ యాక్టుపై దృష్టి సారించారు. అధికారంలో ఉన్న మేయర్ కుటుంబ సభ్యులు కార్పొరేషన్లో పనులు చేపట్టరాదనే ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ద్వారా చర్యలు చేపట్టారు. అధికారులపై చర్యలేవీ.... ఆగమేఘాలపై మేయర్ సురేష్బాబుపై చర్యలు తీసుకున్న ప్రభుత్వ పెద్దలు కారకులైనా అధికారులను విస్మరించారు. మేయర్ మాత్రమే టార్గెట్గా వ్యవహరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మేయర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న కాంట్రాక్టు సంస్థ కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటే అభ్యంతరం చెప్పాల్సింది ఎవరు? చట్టం తెలిసిన అధికారులే కదా? మున్సిపల్ నిబంధనలు ప్రకారం కార్పొరేషన్లో పనులు చేయరాదంటూ అభ్యంతరం చెప్పాలి కదా? ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. అప్పటి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కన్పిస్తోందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. పైగా కార్పొరేషన్ పరిధిలో రూ.10లక్షల లోపు పనులు అధికారుల కనుసన్నుల్లోనే చేపట్టనున్నారు, స్టాండింగ్ కమిటీ దృష్టికి కూడా రావు. రూ. 50లక్షల పైబడిన పనులు మాత్రమే జనరల్ బాడీకి చేరనున్నాయి. మరోవైపు రూ.36లక్షల కాంట్రాక్టు పనుల్లో ఎలాంటి అవినీతి లేదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు నివేదికలు ఇచ్చాయి. అయినా ఇలా అనర్హత వేటు వేయడం రాజకీయంగా దొంగదెబ్బ కొట్టడమేనని పలువురు వెల్లడిస్తున్నారు. ఆగమేఘాలపై చర్యలు... ప్రభుత్వం మేయర్పై అనర్హత వేటు వేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు మొదటి నుంచి స్పష్టమౌతోంది. మేయర్గా సురేష్బాబుకు నోటీసు అందకముందే టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రెస్మీట్ పెట్టి నోటీసులు మీడియాకు చూపె ట్టడం తెలిసిందే. పైగా మంగళవారం సాయంత్రం మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్బాబును విచారించారు. మేయర్ తన వివరణ ఇచ్చిన 24గంటలు కూడా గడవకమునుపే అనర్హత వేటు ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. సీఎంఓ డైరెక్షన్లో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా సర్కార్ అడుగులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేశారు. 51శాతం స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు ప్రాతినిథ్యం వహించాలని సంకల్పించారు. క్షేత్రస్థాయిలో అమలు పర్చారు. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లుతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు అదే బీసీ, ఎస్సీలను లక్ష్యం చేసుకొని దొడ్డిదారిన దెబ్బకొడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వైజాగ్, గుంటూరు మేయర్, తిరుపతి డిప్యూటీ మేయర్, మాచర్ల మున్సిపల్ చైర్మన్ స్థానాలను కై వసం చేసుకున్న తీరును వారు వివరిస్తుండడం విశేషం. బీసీ నేతపై కక్షసాధింపు చర్యలు బీసీ నేత కడప మేయర్ సురేష్బాబును తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టింది. తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ ద్వారా కాంట్రాక్టులు పొందారని ఆరోపణలతో మేయర్ పదవినుంచి తొలగిస్తూ జీఓ జారీ చేయడం అన్యాయం. ఈచర్య పూర్తిగా రాజకీయ కక్షసాధింపే. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అణచివేత ధోరణిని అవలంబిస్తోంది. అందులోనూ ముఖ్యంగా బీసీ నేతలపై చర్యలు చేపట్టడం విడ్డూరంగా ఉంది. – డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ -
చేవ లేక...చేతగాక..!
ప్రభుత్వ నిర్ణయంపై కార్పొరేటర్ల ఆగ్రహం కడప కార్పొరేషన్ : అవిశ్వాసం పెట్టే చేవలేక...చేతగాక చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని మేయర్ సురేష్బాబుపై ప్రభుత్వం దొడ్డిదారిన అనర్హత వేటు వేసిందని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో స్థానిక సంస్థల్లో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను గద్దెదించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడుతున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే... మేయర్ ఎన్నిక సమయంలోనే ఇవన్నీ చూడాలి మేయర్ను ఎన్నుకునే సమయంలోనే వారికి కాంట్రాక్టులు ఉన్నాయా? వారి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఉన్నాయా? అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మేయర్ ఎన్నిక పూర్తయి 2023లో వర్దిని కన్స్ట్రక్షన్ సంస్థ పుట్టింది. వర్దిని కన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ను అధికారులు రద్దు చేసి ఉండాలి. బీసీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వారిని పదవుల నుంచి తప్పిస్తోంది. – బసవరాజు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజాస్వామ్యం ఖూనీ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. కడప నగర పాలక సంస్థలో 50 స్థానాలకుగాను 49 మంది వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ను ఏమి చేసుకోలేక ఎనిమిది మంది కార్పొరేటర్లను అన్ని విధాలుగా భయపెట్టి, మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుమారుడు చేసిన కాంట్రాక్టు పనుల్లో అవినీతి జరిగిందని విజిలెన్స్ విచారణలో చెప్పలేదు. – మల్లికార్జున, 10వ డివిజన్ కార్పొరేటర్ -
కోళ్ల వేస్టు.. కొల్లగొట్టు !
సాక్షి టాస్క్ఫోర్స్ : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా అధికారముండగానే నాలుగు రూపాయలు పోగు చేసుకోవడానికి అధికార పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. ఇసుక దందాల్లో మునిగితేలుతున్నారు.. స్థలాల ఆక్రమణల్లో చక్రాలు తిప్పుతున్నారు... చివరికి కోళ్ల వేస్టేజీని వదలట్లేదు. అవును.. కోళ్ల వ్యర్థాలను తీసుకెళ్లే కాంట్రాక్టర్తో నెలకు రూ.2.10 లక్షలు చెల్లించేలా ఓ ప్రజాప్రతినిధి పీఏ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో దాదాపు 200 చికెన్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సుమారు 50 పెద్ద చికెన్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజు పెద్ద ఎత్తున కోళ్ల పేగులు, తలకాయలు లాంటి వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. తొలగించిన వ్యర్థాలను చేపల చెరువుల్లో ఆహారంగా వినియోగిస్తున్నారు. చాలా ఏళ్లుగా మైలవరం, జమ్మలమడుగు ప్రాంతాల్లో చేపల చెరువులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్ రోజు వీటిని చికెన్ సెంటర్ల నుంచి సేకరించి తీసుకెళ్లడం, చేపలకు ఆహారంగా వేయడం జరుగుతోంది. మినీ లారీని ఏర్పాటు చేసి 12 డ్రమ్ముల్లో రోజు ఉదయాన్నే చికెన్ సెంటర్ల నుంచి వ్యర్థాలను తరలిస్తున్నారు. కోళ్ల వ్యర్థాలు పేరుకుపోతే తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్న కారణంతో వ్యాపారులు ఉచితంగా ఇవ్వడం, కాంట్రాక్టర్ తీసుకెళ్లడం ఆనవాయితీగా జరుగుతుండేది. మహిళా నేత పోటీ నంద్యాలకు చెందిన అధికార పార్టీ మహిళా నేత ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, రుద్రవరం తదితర ప్రాంతాల్లో చేపల చెరువులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నంద్యాలతోపాటు ప్యాపిలి, డోన్, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లోని చికెన్ సెంటర్ల నుంచి కోళ్ల వ్యర్థాలను సేకరిస్తున్నారు. తాజాగా ఆ మహిళా నేత కన్ను వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరుపై పడింది. పట్టణంలో ఎక్కువ మొత్తంలో కోళ్ల వ్యర్థాలు వస్తున్నాయని తెలుసుకుని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్ద ఇటీవల పంచాయితీ నిర్వహించినట్లు సమాచారం. మీరు రెకమెండ్ చేస్తే రోజు ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు కోళ్లవ్యర్థాలను తీసుకెళుతానని ఆమె తన పరిధిలో పలుకుబడిని ఉపయోగించారు. ప్రజాప్రతినిధి ప్రముఖ చికెన్ సెంటర్ల నిర్వాహకుల ద్వారా విషయం తెలుసుకున్నారు. నంద్యాల నుంచి వచ్చి కోళ్ల వ్యర్థాలను తీసుకెళ్లడం కష్టమని, గంటగంటకు వ్యర్థాలు పేరుకుపోతే దుర్వాసనతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని వ్యాపారులు ప్రజాప్రతినిధికి చెప్పినట్లు తెలిసింది. వ్యాపారుల ఇష్ట ప్రకారమే తప్ప ఇందులో తమ ప్రమేయం ఏమి ఉండదని ప్రజాప్రతినిధి ఆమెకు తెలిపారు. జమ్మలమడుగు ప్రాంతం దగ్గర కావడంతో పాత కాంట్రాక్టర్ తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుందని వ్యాపారులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. యథావిధిగా పాత కాంట్రాక్టర్ రోజు ఈ వ్యర్థాలను తీసుకెళుతున్నారు. కాగా సందట్లో సడేమియా అన్న చందంగా ప్రజాప్రతినిధికి అనధికారిక పీఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ ద్వారా నెలకు రూ.2.10 లక్షలు చెల్లించేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్కడా అధికారులు, పోలీసులు పట్టుకోకుండా మేనేజ్ చేస్తానని సదరు పీఏ హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ అంగీకరించారు. ఇందులో రూ.1.80లక్షలు పీఏకు, రూ.30వేలు పోలీసులకు ప్రతి నెల ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధి స్పందించి కోళ్ల వ్యర్థాలకు సంబంధించిన అంశాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తే ప్రతినెలా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చికెన్ వ్యర్థాల తరలింపులోనూ కమీషన్ల కక్కుర్తి.. నెలకు రూ.2.10 లక్షలు చెల్లించి తీసుకెళుతున్న కాంట్రాక్టర్ -
ఏటీఎం చోరీకి యత్నం
ముద్దనూరు : స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న ఏ1 బ్యాంకు ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో దుండగులు ఏటీఎంలోకి చొరబడి ఏటీఎం బాక్స్ను పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లేదుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఏటీఎంలో నగదు ఉంచే బాక్స్ను వారు తెరవలేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం బృందం వచ్చి వివరాలు సేకరించారు.వివాహిత ఆత్మహత్య రాజంపేట : రాజంపేట పట్టణ శివారులోని రామ్నగర్కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలి చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త మద్యానికి బానిసై నరసమ్మతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోమటివానిచెరువులో వృద్ధురాలి మృతిమదనపల్లె రూరల్ : మదనపల్లె పట్టణంలోని కోమటివానిచెరువులో వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. పట్టణంలోని రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన రత్నాకర్ ఆచారి భార్య డి.లక్ష్మీదేవమ్మ(80) గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోలేక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటి నుంచి కనిపించకుండా పోయిన లక్ష్మీదేవమ్మ సాయంత్రం 5 గంటల సమయంలో కోమటివానిచెరువులో శవమై తేలింది. -
ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కడప డిపో ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్టీసీ అధికారుల తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప డిపో మేనేజర్, టీఐ3 ఇరువురు కడప డిపో ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కార్మికుల ఆమోదయోగ్యమైన కోర్కెలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కడప డిపో కార్యదర్శి శ్రీనివాసులు, రీజియన్ సంయుక్త కార్యదర్శి కేఎస్ దాస్, కోశాధికారి టీఎం బాషా, వైస్ ప్రెసిడెంట్ పీఎస్ ఖాన్, కేఎంఎస్ రావు, రామయ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం అనర్థాలపై అవగాహన ముఖ్యం
కడప సెవెన్రోడ్స్ : మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధ్వర్యంలో కేర్ (కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్)పై ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆల్కహాల్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కేర్ కమిటీ ఏర్పాటైందన్నారు. ప్రతి మద్యపాన వినియోగదారునికి వాటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలను తెలియజేసే విధంగా మద్యం షాపుల్లో కరపత్రాలు అందజేయాలని అధికారులకు సూచించారు. మద్యపాన వినియోగంపై అవగాహన సదస్సులు, చర్చా గోష్టులు, మాబ్లు, ప్రదర్శనలు, మద్యపానం లేని జీవిత ప్రయోజనాలను తెలిపే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మైనర్లకు మద్యం విక్రయిస్తే మద్యం షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల కళాశాలలో ఆల్కహాల్ వ్యతిరేక అవగాహన తరగతులు నిర్వహించాలన్నారు. ఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలలో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మద్యపాన వినియోగం వల్ల కలిగే అనారోగ్య, సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాలను వివరించాలని అన్నారు. మందు తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు, కేర్ కమిటీ సభ్యులు సూచించిన సలహాలు తీసుకొని మద్యపాన వినియోగంపై గట్టి చర్యలు చేపడతామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్. రవికుమార్, డీఈఓ షంషుద్దీన్, జిల్లా విద్యా ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, జిల్లా కో–ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ హిమాదేవి, సూపర్డెంట్ ఆఫ్ సైక్రియాటిస్ట్ డా.వెంకట రాముడు,జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జమున తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ -
కుటుంబ ‘సమ్మె’తంగా..
కడప రూరల్: వైఎస్సార్ కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)ల సమ్మె కొనసాగుతోంది. ఏపీ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు కె.గిఫ్టీ షీలా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మె బుధవారం 17వ రోజుకు చేరింది. 90 శాతానికి పైగా సీహెచ్ఓలు దాదాపుగా ఉద్యోగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జీతం వస్తే గాని జీవనం గడవని పరిస్థితి. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు ఇంత వరకు ప్రభుత్వం ఒక నెల వేతనాలు మంజూరు చేయలేదు. కడప కలెక్టరేట్ వద్ద జరిగే కార్యక్రమాలకు చాలా మంది సీహెచ్ఓలు మండు టెండలను సైతం లెక్క చేయకుండా తమ పిల్లలతో వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తే తమ పిల్లలకు, కుటుంబానికి భద్రత ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శిబిరంలో ఉన్న చిన్నారులు, అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తున్నారు.యువకుడి దారుణ హత్యచక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం కోమటిపేటకు చెందిన కందుల చంటి (31) అనే యువకుడు దారుణ ఽహత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులతో పాటు పోలీసులు పేర్కొంటున్నారు. గ్రామస్తులు, చక్రాయపేట పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు చంటి కట్టెలు కొట్టడంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్గా వెళ్లేవాడు. ఇతను సురభి గ్రామం రెడ్డివారిపల్లె సమీపంలోని హరిజనవాడకు చెందిన ఓ వితంతుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ అంతకు ముందు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేది. దీంతో సదరు వ్యక్తి చంటిపై కక్ష పెంచుకొని మరి కొందరి సహకారంతో కాపు కాచి దేవరగుట్టపల్లె సమీపంలో మంగళవారం రాత్రి రాళ్లతో దాడిచేసి ట్రాక్టరుతో తొక్కించి పరారయ్యాడు. చంటి గాయాలతో ఉన్న విషయం తెలుసుకొని కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి కడప రిమ్స్కు తరలించారు. అదే రోజు రాత్రి అతను మృతి చెందాడు. మృతుడి భార్య కందుల ఉమ తన భర్త హత్యకు దర్శనమ్మతో పాటు మరి కొందరు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. కాగా మృతుడికి భార్యతో పాటు నాలుగేళ్ల లోపు ఉన్న ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషకుడు చనిపోవడంతో భార్యా పిల్లలు అనాథలయ్యారని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
కడప అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజకు ప్రణాళిక ఖరారైంది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఈ ఖరీప్ సీజన్కు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్కు కింద జిల్లాలో 1,28.084 హెక్లార్లలో వివిధ పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి రైతన్నలకు ఏ మేరకు విత్తనాలు అవసరమో ప్రణాళికలను పంపి విత్తనాలను తెప్పించి రైతులకు సబ్సిడీ కింద అందించనుంది. అలా సబ్సిడీతో ఇచ్చే విత్తనాల కేటాయింపులో ఈసారి కూటమి ప్రభుత్వం కోత పెట్టింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేటాయింపుల్లో కోత.. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా రైతులకు సబ్సిడీ కింద 12252 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు కేటాయించింది. అలాంటిది ఈ ఏడాది ఖరీఫ్కు వైఎస్సార్జిల్లా రైతులకు 11432 క్వింటాల్లు రాయితీ విత్తనాలు అవసరమవుతాయని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులోనూ కూటమి ఫ్రభుత్వం కోత వేసి విత్తనాలను కేటాయించింది. జూన్ నుంచి ప్రారంభంకానున్న ఖరీప్–2025కు సంబంధించి జిల్లాకు మెత్తంగా 11432 క్వింటాళ్ల విత్తనాలు అవసరంకాగా అందులో 8591.55 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. ఖరీఫ్కు కేటాయించిన ఎరువుల వివరాలు ఇలా.. ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాకు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి నెలల వారీగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ మోత్తానికి 73,582 మెట్రిక్ టన్నుల ఎరువులను అవసరంగా వ్యవసాయ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలను సమర్పించారు. ఎరువులకు సంబంధించి ఖరీఫ్ సీజన్కుగాను 32000 మెట్రిక్ టన్నుల యూరియా, 10000 మెట్రిక్ టన్నుల డీఏపీ, 5000 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 5000 మెట్రిక్ టన్నుల సింగల్ సూపర్ పాస్పెట్, 40,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను అవసరంగా గుర్తించి నివేదికలను ప్రభుత్వానికి నివేదించారు. ఖరీఫ్లో సాగయ్యే ప్రధాన పంటల వివరాలు ఇలా.. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రధాన పంటలైన వరి 30,804 హెక్టార్లలో, మిల్లేట్స్ 34,472, మినుము 3806, కంది 5761, మిరప 1679, పసుపు 2229, ఉల్లి 5203, టమాట 1329, వేరుశనగ 5976, పొద్దుతిరుగుడు 1142 హెక్టార్లలో సాగుకానున్నాయి. జిల్లాకు విత్తనాలు, ఎరువులు కేటాయింపు 3253 క్వింటాళ్లు వేరుశనగ క్కాయలు 1537 క్వింటాళ్లు జీలుగలు, 2982 క్వింటాళ్లు జనుములు 92000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా ప్రతిపాదనలు ఈ ఏడాది ఖరీఫ్లో 1,28,084 హెక్టార్లో పంటల సాగు ఖరారు -
‘ఫేక్ కార్డులు సృష్టించి అక్రమంగా నిధులు కాజేస్తున్నారు’
వైఎస్సార్ జిల్లా: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర మంత్రికి, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, చేయని పనులకు కూడా బిల్లులు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న వారిని సైతం మస్టర్లలో చూపుతున్నారని, ఫేక్ కార్డులు సృష్టించి అక్రమంగా నిధులు కాజేస్తున్నారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉపాది హామీ ఉద్దేశమే దెబ్బ తింటోందని అవినాష్ రెడ్డి తెలిపారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారణ చేపట్టాలన్నారు. నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతూ అసలు లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు. పేద వాడికి చట్ట ప్రకారం అందాల్సిన ఉపాధికి గండి కొడుతున్నారని, ఈ అంశంపై వెంటనే కల్పించుకుని అక్రమాలను నిగ్గుతేల్చాలన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. -
కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
వైఎస్ఆర్ జిల్లా,సాక్షి: కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ కార్పొరేషన్లో కాంట్రాక్టులు చేసిందంటూ అభియోగాలు మోపింది ప్రభుత్వం. అయితే, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయలేదనే అక్కసుతో సురేష్ బాబును తొలగింపునకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం కార్పోరేషన్లో కాంట్రాక్టులనే అభియోగం మోపి సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది. కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీసీ నేతలు మండిపడుతున్నారు. నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చెరువులో మునిగి ఐదుగురు పిల్లలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో ఈతకు వెళ్ళి ఐదుగురు చిన్నారులు మృతిచెందడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కోరారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. వేసవి సెలవులు కావటంతో ఈత కొట్టాలని భావించి ఐదుగురు పిల్లలు చెరువులోకి దిగారు. ఈ క్రమంలో చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) నీటిలో మునిగిపోయి మృతిచెందారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు.పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం మల్లేపల్లె చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావటంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. గ్రామంలోని చెరువులో ఈత కొట్టాలని భావించిన భవాని పిల్లలు చరణ్, పార్థు, మరో చెల్లెలు సావిత్రి కుమారుడు హర్ష, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్ యాదవ్ కుమారుడు తరుణ్ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్ గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు. పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
ముత్యపు పందిరిపై నారాపుర స్వామి
జమ్మలమడుగు : ముత్యపు పందిరి వాహనంపై నారాపుర వెంకటేశ్వరస్వామి దర్శనం ఇచ్చారు. మంగళవారం ఉదయం భూదేవి, శ్రీదేవి సమేతంగా ముత్యపు పందిరిపై స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. భక్తుల కోలాటం, గోవింద నామ స్మరణ, అన్నమాచార్యకీర్తల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. సాయంత్రం సింహ వాహనంపై స్వామి వారు పట్టణంలో ఊరేగి తిరిగి నారాపుర స్వామి ఆలయానికి చేరుకున్నారు. దేవదేవుడు సతీసమేతంగా పురవీధుల గుండా పల్లకిలో వెళుతుండగా భక్తులు హారతులు ఇవ్వడంతో పాటు పూజలు నిర్వహించారు. తూకాల్లో మోసాలకు పాల్పడవద్దుకడప వైఎస్ఆర్ సర్కిల్ : వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడ్డ వద్దని జిల్లా లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ మెట్రాలజీ డే సందర్భంగా మంగళవారం నగరంలోని తూనికలు, కొలతల శాఖ కార్యాలయంలో రైస్, ఆయిల్ మిల్లర్స్, మండీ మర్చంట్ అసోసియేషన్ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోదారులే వ్యాపారానికి శ్రీరామ రక్ష అన్నారు. అందువల్ల తూకాల్లో నాణ్యత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. బాలిక ఆత్మహత్యకడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలో బాలిక సోమవారం రాత్రి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చిన్న చౌక్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ సల్మా (14) తండ్రి గత ఏడాది చనిపోవడంతో బాలిక ఇంటి వద్దనే ఉంటోంది. సెల్ ఫోన్లో ఇన్స్ట్రాగామ్ ఎక్కువ చూస్తుండడంతో బాలిక తల్లి మందలించినట్లు తెలిపారు. దీంతో బాలిక తీవ్ర మనస్తాపం చెంది ఎవరూ లేనప్పుడు ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వరదాయపల్లెలో చోరీమైదుకూరు : మైదుకూరు మండలం వరదాయపల్లెలో ఓ ఇంటిలో చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన చిన్రెడ్డి ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తి ఇంటిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆదినారాయణ రెడ్డి భార్య లక్ష్మీదేవి బంధువుల ఇంటికి ఖాజీపేటకు వెళ్లారు. బీరువాలో ఉంచిన సుమారు ఆరు తులాల బంగారు వస్తువులను చోరీ చేసినట్టు తెలుస్తోంది. మైదుకూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు కూడా చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వేలి ముద్రలను సేకరించారు. -
లారీ బోల్తాపడి డ్రైవర్కు గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని అంబకపల్లె రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం మట్టిని తరలిస్తున్న లారీ బోల్తా పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుంచి మట్టిని తరలిస్తూ ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న లారీ పులివెందుల రింగ్ రోడ్డు సమీపంలోని అంబకపల్లి రోడ్డు వద్దకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం డ్రైవర్ను కడప రోడ్డులో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి 110 జీఓ అమలు చేయాలి
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని అన్ని ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఉద్యోగులకు 110 జీఓను అమలు చేయాలని కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్హుసేన్ కోరారు. మంగళవారం ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తాను కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులు కలిసి 110 జీఓను అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో 2018 నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి జీఓ 110 అమలు చేయకపోవడం వలన జీతాలు తక్కువగా వస్తున్నాయన్నారు. 110 జీఓను అమలు చేసి 2018 నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీలకు సర్వీసు కలపాలన్నారు. అలాగే సర్వీసు ఆధారంగా రావాల్సిన రూ.40వేలు జీతాలను ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు జూన్ 11, 12, 13 తేదీల్లో ఆయా ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
పలు కేసుల్లో నిందితులకు రిమాండ్
కాశినాయన : మండలంలో గ్యాంబ్లింగ్, డ్రంక్అండ్డ్రైవ్ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో హాజరు పరచగా ఒక రోజు జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. ఎవరైనా గ్రామాల్లో గ్యాంబ్లింగ్, అక్రమ మద్యం అమ్ముతున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. రెండు బైకులు ఢీ మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలోని మున్సిపాలిటీ పరిధి గడ్డంవారిపల్లె సమీపంలో మంగళవారం రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరుకు చెందిన ఎస్పీ సుబ్రహ్మణ్యం బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉదయం విధులకు మోటార్ బైక్పై బయల్దేరాడు. బద్వేలు సమీపంలోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ బైక్పై మైదుకూరుకు వస్తున్నాడు. వీరు ఇరువురి బైకులు గడ్డంవారిపల్లె వద్ద ఢీకొన్నాయి. సంఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో ఇద్దరిని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యంను మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి కర్నూలుకు తీసుకెళ్లారు. రైలు కింద పడి వృద్ధుడి మృతి కడప కోటిరెడ్డిసర్కిల్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు రైలు కిందపడి మృతి చెందినట్లు రేణిగుంట ఎస్ఐ తెలిపారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడుకు చెందిన ఏనుగ బాలమ్మగారి చెన్నారెడ్డి మంగళవారం ఉదయం 6.30–7.00 గంటల ప్రాంతంలో రైలు కిందపడి మృతి చెందాడన్నారు. మృతుడికి దాదాపు 69 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఆర్మీ ఉద్యోగి అదృశ్యంకలసపాడు : మండలంలోని ముద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బైరెడ్డి నాగార్జునరెడ్డి అనే ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైనట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు. ఆయన వివరాల మేరకు నాగార్జునరెడ్డి సెలవుపై ఇంటికి వచ్చాడు. ఏప్రిల్ 1వ తేదీన విధులకు వెళుతున్నానని ఇంటి వద్ద చెప్పి వెళ్లాడు. కానీ తాను పనిచేస్తున్న ఉత్తరాఖండ్ రెజిమెంటల్కు వెళ్లలేదని, ఇంటికి కూడా రాలేదని అతని తండ్రి మంగళవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నాగార్జునరెడ్డి ఆచూకీ ఎవరికై నా తెలిస్తే 9121100632 నంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఎర్రచందనం దుంగలు స్వాధీనంసిద్దవటం : మండలంలోని ఎస్. రాజంపేట గ్రామ సమీప పొలాల్లో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండగా సోమవారం రాత్రి టాస్క్ఫోర్స్, సిద్దవటం అటవీశాఖ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్. రాజంపేట గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తిరుపతి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. ఆర్టీసీ కార్మికుల ధర్నా రాయచోటి టౌన్ : నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. జిల్లా పరిధిలోని ఐదు డిపోలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. ఇరువురికి గాయాలు -
వైభవంగా రెడ్డెమ్మతల్లి పునః ప్రతిష్ట అంకురార్పణ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన ప్రదాయిని శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో అమ్మవారి పునఃప్రతిష్ట అంకురార్పణ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇటీవల అమ్మవారి ఆలయాన్ని రూ. 2.50 కోట్లతో పునర్ నిర్మించారు. ఇందులో భాగంగా అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన మంగళవారం అమ్మవారి ఆలయంలో అంకురార్పణ ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్ట కార్యక్రమ దాతలు బొమ్మిశెట్టి రెడ్డి పరంజ్యోతి, మోడెం వీరాంజినేయప్రసాద్, సర్పంచ్ ప్రేమకుమారి,ఆలయ ఈఓ మంజుల పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో బీసీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ అన్నారు. మంగళవారం వైస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు బసవరాజు, సుబ్బారాయుడు లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మాజీమంత్రి, బీసీ సామాజిక వర్గానికి చెందిన విడదల రజని పట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బానాయుడు దురుసుగా ప్రవర్తించడాన్ని వైస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రౌడీలా వ్యవహరించిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ నాయకుడు సింధే రవిచంద్రరావు పాల్గొన్నారు. -
ఈఓ నివేదికను తొక్కిపెట్టింది ఎవరు?
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని కోట్లరూపాయలు విలువైన ఆస్తులు గల శ్రీకృష్ణ గీతాశ్రమం నిర్వహణపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా చర్యలు తీసుకునే వారు కరువయ్యారు. పట్టణానికి చెందిన నామా ఎరుకలయ్య 1946లో లోక కల్యాణార్థం ఆశ్రమాన్ని నెలకొల్పారు. సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య, భోజన సదుపాయం, వసతి ఏర్పాటు చేయడం, గో సంరక్షణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం, భగవద్గీతను ప్రచారం చేయడం ఆయన ప్రధాన ఆశయాలు. అనంతరం 1982 జనవరి 1న ఆశ్రమానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించి ఆయన ఫౌండర్ ట్రస్టీగా ఉండేవారు. 1989లో ఈ ఆశ్రమాన్ని చిత్తూరు జిల్లా ఏర్పేడులోని శ్రీవ్యాసాశ్రమంలో చేర్చారు. ఆశ్రమ నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో పలు ఆరోపణలు రావడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీవ్యాసాశ్రమం దత్తత నుండి తప్పించి ప్రత్యేకంగా ఈఓను నియమించారు. 2017 జూన్ 19వ తేదీ నుండి ఈఓ ద్వారానే ఆశ్రమం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఆశ్రమ నిర్వహణకు సంబంఽధించి కమిషనర్ ఆదేశాల మేరకు గతంలో ఈఓగా పనిచేసిన శంకర్బాలాజీ ఒక నివేదికను తయారు చేసి పంపారు. కోర్టును ఆశ్రయించిన వారికే లీజుకు.. గీతాశ్రమం ప్రాంగణంలోని శారద జూనియర్ కాలేజీకి సంబంధించి మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో 2021 ఆగస్టు 12న ఈ భవనాలకు అధికారులు వేలం పాట నిర్వహించారు. ఈ బహిరంగ వేలంలో కళాశాల యాజమాన్యం ప్రతినిధులు ఎవరిని పాట పాడనివ్వకుండా, వారు పాల్గొనకుండా వాయిదా వేయించారు. తమ కళాశాలకే ఈ భవనం 11 ఏళ్లపాటు లీజుకు కావాలని లేఖ సమర్పించారు. గతంలో కేవలం రూ.16,500 మాత్రమే కళాశాల యాజమాన్యం అద్దె చెల్లిస్తుండగా దీనిని 33 శాతం పెంచి రూ.21,945 ప్రకారం అద్దె చెల్లించాలని కమిషనర్ ఆదేశించారు. పలు మార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోగా ఏ ప్రకారం అద్దె చెల్లిస్తారో చెప్పలేదని ఈఓ నివేదికలో పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన ప్రొద్దుటూరులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు రూ.5.50 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.2.45 మాత్రమే చెల్లిస్తున్నట్లు నివేదికలో తెలిపారు. ముందుగా కళాశాల యాజమాన్యానికి, దేవాదాయశాఖకు ఎలాంటి కోర్టు కేసులు లేకపోగా.. కళాశాల కరస్పాండెంట్ ఎం.సురేష్బాబు పలు ఆరోపణలు చేస్తూ హైకోర్టులో రెండు కేసులు వేశారు. ఈ కేసులను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఆశ్రమంలోని బీఈడీ కళాశాల, డైట్ కళాశాలలను ఏర్పాటు చేసి గతంలో దేవాదాయశాఖ వారికి అప్పగించారు. కాగా 2020లో గంగాధరానందగిరి స్వామి మరణానంతరం అక్రమంగా ఈ భవనాలను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో కోర్టులో కేసు వేశారు. శారద జూనియర్ కళాశాల కరస్పాండెంట్ నిర్వాకం వలన ప్రతి నెల సుమారు రూ.30వేలు ఆశ్రమానికి నష్టం వాటిల్లుతోందనే విషయాన్ని ఈఓ ఉన్నతాధికారులకు తెలిపారు. ఇది ఇలా ఉండగానే ప్రస్తుత అధికారులు గీతాశ్రమంపై కోర్టులో కేసు వేసిన ఎం.సురేష్బాబుకు ఈ ఏడాది ఫిబ్రవరి 8న బహిరంగ వేలం నిర్వహించినట్లుగా ప్రకటించి భవనాలను అద్దెకు ఇచ్చారు. వాస్తవానికి ఆశ్రమంపై కోర్టుకు వెళ్లిన వ్యక్తికి తిరిగి ఎలా బహిరంగ వేలం ద్వారా ఎలా అద్దెకు ఇస్తారన్న విషయంపై విచారణ చేపట్టాల్సి ఉంది. గతంలో అధికారులు తొలగించిన కార్యాలయ సిబ్బంది జనార్దన్ను ప్రస్తుతం తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాకుండా ఆయనకు ఏకంగా పాత బకాయిలను కూడా చెల్లించడం వెనుక మర్మం ఏమిటో తెలియడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఈఓ రామచంద్రాచార్యులు ఈనెలాఖరున పదవీ విరమణ చెందనున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గత ఈఓ సమర్పించిన నివేదికను పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలను తెలుసుకుని ప్రభుత్వానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గీతాశ్రమంపై కోర్టుకు వెళ్లిన వారికే భవనాలు లీజుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు -
మహానాడుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
కడప అర్బన్ : కడప నగర శివార్లలో చింతకొమ్మదిన్నె పరిధిలో ఈనెల 27, 28, 29 తేదీలలో జరగనున్న ’మహానాడు’ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు వీఐపీలు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్.ఎస్.జి ఎస్.పి ఆరిఫ్ హఫీజ్, ఎస్.ఎస్.జి డైరెక్టర్ నచికేత్ విశ్వనాథ్, ఎస్.ఎస్.జి ఎస్.పి జి.హెచ్ భద్రయ్యలతో కలిసి జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్కు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, ఏ.ఆర్. డీఎస్పీ కె.శ్రీనివాస రావు , ఎస్బీ ఇన్స్పెక్టర్లు దారెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.పురుషోత్తం రాజు, జిల్లాలోని సీఐలు పాల్గొన్నారు. -
గుండెపోటుతో గుర్తు తెలియని ప్రయాణికుడి మృతి
చింతకొమ్మదిన్నె : కడప నుంచి రాయచోటికి ఆర్టీసీ బస్సులో మంగళవారం ప్రయాణిస్తూ గుర్తు తెలియని ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడని చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. కడపలో ఆర్టీసీ బస్సు ఎక్కి రాయచోటికి టిక్కెట్ తీసుకొని బస్సులో వెళ్తుండగా, చింతకొమ్మదిన్నె మండలంలోని మూలవంక గ్రామం వద్దకు రాగానే ప్రయాణికునికి గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు 108లో తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన ప్రయాణికుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ప్రొద్దుటూరు క్రైం : స్థానిక శ్రీరాంనగర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సుబ్బ య్య ఆర్ఎంపీ క్లినిక్ను మంగళవారం వైద్యాధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శివప్రసాద్రెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. చిన్న పిల్లలకు వైద్యం అందించడంతో పాటు రెండు బెడ్లను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. దీంతో ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శివప్రసాద్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆలీం, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.మానవత్వం చాటుకున్న ఏఎస్ఐచాపాడు : స్థానిక పోలీసు స్టేషన్లో ఏఎస్ఐ గా పని చేస్తున్న అహమ్మద్ బాషా మానవత్వం చాటుకున్నారు. మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని నాగులపల్లె సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం మధ్యాహ్నం బైకు స్కిడ్ అయి శివ అనే వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. డ్యూటీ ముగించుకుని ప్రొద్దుటూరుకు వెళుతున్న ఏఎస్ఐ స్పృహ తప్పి పడిపోయిన శివకు సపర్యలు చేసి ఆటోలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి ప్రొద్దుటూరు పట్టణం పెన్నానగర్కు చెందిన వాడిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆదుకున్న ఏఎస్ఐను పలువురు అభినందించారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ శివారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కడప డిపో కార్యదర్శి సగినాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉద్యోగులు ఛలో డీపీటీఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్ఎం కార్యాలయం ఎదుట ఉద్యోగులు, కార్మికులు బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినదించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ వైద్య సేవలకు సంబంధించి ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొత్త బస్సులు కొనుగోలు, సిబ్బంది నియామకం, ఎలక్ట్రికల్ బస్సులు ఏపీఎస్ ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించేలా సత్వర చర్యలు చేపట్టాలని, అవసరమైతే సమ్మెలోకి వెళ్లేందుకై నా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భద్రావతమ్మ, కడప రీజినల్ కార్యదర్శి సుధాకర్, రీజినల్ ప్రెసిడెంట్ నాగముని, అసిస్టెంట్ సెక్రటరీలు సుబ్బారావు, నాగరాజుతోపాటు అన్ని డిపోల అధ్యక్ష కార్యదర్శులు, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు, సీసీఎస్ డెలిగేట్లు, భారీ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
అవయవదానంతో అందరికీ ఆదర్శం
చిన్నమండెం : చిన్నమండెం మండలం చాకిబండ గ్రామం అంపాబత్తునివారిపల్లెకు చెందిన మద్దిరాల కంచంరెడ్డి, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు మద్దిరాల కొండారెడ్డి(21) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతని అవయవాలు దానం చేసి మరికొందరి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. స్థానికుల కథనం మేరకు.. మద్దిరాల కొండారెడ్డి బెంగళూరులో సివిల్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. వైద్యుల సూచనల మేరకు కొండారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసి మరికొందరి ప్రాణాలను నిలబెట్టే దిశగా ఆలోచించారు. కొండారెడ్డికి సంబంధించిన గుండె, లివర్, కిడ్నీలు తదితర అవయవాలు దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కన్నవారి కలలు కల్లలైనా.. కుమారుడి చదువు కోసం తల్లిదండ్రులు కంచంరెడ్డి, కోటేశ్వరమ్మలు ఎన్నో ఏళ్లుగా కష్టపడి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు. కూలి డబ్బులతోనే కుమారుని, కుమార్తెను చదివించుకున్నారు. కుమారుడు కొండారెడ్డి సివిల్ ఇంజనీర్గా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడనే సంతోషం ఆ కుటుంబానికి చాలా రోజులు నిలబడలేదు. విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం ఉన్న ఒక్క కుమారుడిని పోగొట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు చాకిబండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతటి విషాదంలో కూడా వారు తమ కుమారుడి అవయవాలు దానం చేసి మరి కొందరి ప్రాణాలను కాపాడటం ఎంతో గర్వంగా ఉందని చెప్పడం అందరినీ కదిలించింది. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి బ్రెయిన్డెడ్ తర్వాత పలు అవయవాలు దానం -
రేపు విద్యాభవన్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
కడప ఎడ్యుకేషన్ : ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించి విద్యారంగ విచ్ఛిన్నానికి పూనుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 15న విజయవాడ విద్యా భవన్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ తెలిపారు. మంగళవారం కడప యూటీఎఫ్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఇప్పటి వరకు జీఓ 117 రద్దు చేయకుండా పాఠశాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని చెబుతున్నారన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చి వారి ద్వారా భర్తీ చేయాలన్నారు. బదిలీల వ్యవస్థలో తీసుకు వస్తున్న మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
మరో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ పలకరించనుంది. దాంతోపాటే విద్యా సంవత్సరం తలుపు తట్టనుంది. ఇటు సాగు ఖర్చుల కోసం అన్నదాతలు.. అటు విద్యాసామగ్రి కోసం తల్లులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. కూటమి ప్రభుత్వం కాడి దించేస్తోంది. అన్నదాత సుఖీభవ ఊసు లేక.. తల్లికి వందనంపై స
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెల్లించిన రైతు భరోసా, పీఎం కిసాన్ నిధుల వివరాలు ఇలా.. సంవత్సరం రైతుల విడుదలైన సంఖ్య నిధులు (కోట్లలో)2019–20 206708 279.93 2020–21 208747 280.06 2021–22 199344 269.11 2022–23 202598 235.68 2023–24 210481 126.25 ● అన్నదాత సుఖీభవ పథకానికి మోక్షం లభించేనా? ● తల్లికి వందనం పథకం అందరికీ వర్తింపుపై అనేక అనుమానాలు ● సాగు సాయం కోసం రైతుల ఎదురుచూపులు ● ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. నేటికీ పెన్షన్లు మినహా సూపర్ సిక్స్ హామీలు అమలుకాని పరిస్థితి నెలకొంది. అటు అన్నదాత సుఖీభవ సాయం అందక రైతులు.. తల్లికి వందనం రాక విద్యార్థుల తల్లులు ఆందోళన చెందుతున్నారు. పథకాలకు సంబంధించిన నిధుల విడుదల అదిగో ఇదిగో అంటూనే ఏడాదిపాటు కాలయాపన చేసింది కూటమి ప్రభుత్వం. మరి ఈ ఏడాదైనా పథకాలు సక్రమంగా అమలవుతాయా లేక మళ్లీ కాలయాపనేనా అని పలువురు లబ్ధిదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలు వస్తాయనుకున్న ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి. మరో 20 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతన్నలు సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయమిది. మరి ఈసారైన ప్రభుత్వం కరుణిస్తే రైతులకు పెట్టబడి ఖర్చులు కలిసొస్తాయి. లేకుంటే మళ్లీ అప్పులకు అడుగలేయక తప్పదని పలువురు రైతన్నలు అంటున్నారు. మరి ప్రభుత్వం కరుణిస్తుందా లేక కాలయాపనతో సరిపెడతుందా అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఏడాది నుంచి అన్నదాతలకు తప్పని కష్టాలు... గత ఏడాది నుంచి అన్నదాతలకు కష్టాలు తప్పలేదు. అటు అనావృష్టి, ఇటు అతివృష్టి కారణంగా ఈ ఏడాది రైతులు పూర్థిస్తాయిలో దెబ్బతిని పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు ఆందోళన చెందారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పథకాలను అమలు చేసినా లబ్థిదారులకు చేయూతగా ఉండేది. అటువైపు నుంచి సహకారం అందకపోడంతో అన్నదాతలు నిండామునగాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా పండిన అరకొర పంట దిగుబడులకు కూడా గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంస్పందించి ఈ ఏడాదైనా పథకాలను అమలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడిసాయం.. రైతులు పంటలసాగు కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలోనే పెట్టుబడి సాయం(వైఎస్సార్ రైతు భరోసా) అందించి అన్నదాతలకు అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా ఈ మొత్తన్ని అందించింది. పీఎం కిసాన్ సాయం కింద రూ. 6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 7500 మొత్తం కలిపి ఏడాదికి రూ. 13500 రైతు ఖాతాలకు జమ చేసేది. ఇలా వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసాన్ కింద ఐదేళ్లపాటు రూ. 1191.03 కోట్లను అన్నదాతలకు అందించి అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రాష్ట్రవాట కింద రూ. 14 వేలు అందిస్తామని ప్రకటించింది. కానీ ఏడాది ముగిసినా ఆమాటే లేదు. పైసా విదిల్చలేదు. అమ్మ ఒడి పథకంతో.. గత ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. నాలుగేళ్లలో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుగానే క్యాలెండర్ను ప్రకటించి తల్లుల ఖాతాలకు నగదును జమచేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 1,80,203 మంది తల్లులకు నగదు అందించింది. గతంలో కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేసింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అందరికి అమ్మ ఒడి అన్ని చెప్పారు. మరి ఇది అమలు జరుగుతుందా లేక ఎదురు చూపులేనా అన్ని పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద చెల్లించిన నిధులు వివరాలు...సంవత్సరం తల్లుల జమచేసిన సంఖ్య మొత్తం కోట్లలో 2019–20 2,55,587 383.38 (51 మండలాలు) 2022–21 2,68,076 402.11 (51 మండలాలు) 2021–22 1,87,742 281.61 (36 మండలాలు) 2022–23 1,80,203 270.30 (36 మండలాలు) మొత్తం 8,91,608 1337.40 -
కె.కె.కొట్టాల గ్రామస్తులకు న్యాయం చేయండి
● టెయిలింగ్ పాండ్తో పంటలు పండక నష్టపోతున్నారు ● కలెక్టర్ను విన్నవించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వేముల : యురేనియం బాధిత గ్రామమైన కె.కె.కొట్టాల గ్రామస్తులకు న్యాయం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు విజ్ఞప్తి చేశారు. మండలంలోని కె.కె.కొట్టాల గ్రామస్తులు మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసి టెయిలింగ్ పాండ్తో పడుతున్న ఇబ్బందులను, సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బాధిత రైతులను వెంట బెట్టుకుని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన టెయిలింగ్ పాండ్తో కె.కె.కొట్టాల గ్రామస్తులు నష్టపోతున్న తీరును, గ్రామస్తుల ఇబ్బందు లను ఇబ్బందులను కలెక్టర్కు వివరించారు. ఇప్పటికే టెయిలింగ్ యురేనియం వ్యర్థాలతో నిండిపోయిందని, కాలుష్యం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని విన్నవించారు. టెయిలింగ్ పాండ్ నిండిపోవడంతో టెయిలింగ్ పాండ్ ఎత్తు పెంచే పనులు చేస్తున్నారని, టెయిలింగ్ పాండ్ ఎత్తు పెంచితే గ్రామస్తులు ఇంకా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు. ఇప్పటికే గ్రామస్తులు తమ సమస్యలను పరిష్కరించేంతవరకు టెయిలింగ్ పాండ్ పనులు చేపట్టవద్దని పనులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాల టెయిలింగ్ పాండ్తో నష్టపోతున్న కె.కె.కొట్టాల గ్రామాన్ని యూసీఐఎల్ తీసుకుని పునరావాసం, ఉద్యోగాలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ శ్రీధర్ టెయిలింగ్ పాండ్తో నష్టపోతున్న కె.కె.కొట్టాల గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు బాధిత రైతులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు. మున్సిపల్ విభాగ బలోపేతానికి కృషి చేయాలికడప కార్పొరేషన్ : జిల్లాలో వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్కు వచ్చిన ఎంపీని వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి వై. శ్రీరంజన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి రావడానికి కృషి చేసినందుకు కృతజ్ఙతలు తెలుపుతూ సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, తద్వారా పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, ఐస్క్రీం రవి, రెడ్డి ప్రసాద్, వెంకటేష్ పాల్గొన్నారు. -
ప్రశ్నించే గొంతును నొక్కేద్దామనుకోవడం పొరపాటు
సాక్షి ప్రతినిధి, కడప: ‘నియంతృత్వ పాలన ఈ దేశంలో ఎప్పుడూ మనుగడ సాగించలేదు. విపరీత జనాకర్షణ కలిగిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కారు. ప్రజలు ఎమర్జెన్సీని తిరస్కరిస్తూ ఆమెకు, ఆమె పార్టీకి గుణపాఠం చెప్పారు’ అని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నియంతృత్వ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో గనులు ధారాదత్తం రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించిన వారినంతా అణిచివేయాలనే దృక్పథంతో ఉన్నారు. ఎమర్జెన్సీని పెట్టిన ఇందిరాగాంధీ ప్రజాగ్రహానికి గురయ్యారన్న విషయం వారికి తెలియంది కాదు. చరిత్ర ఎన్నిమార్లు గుణపాఠాలు నేర్పినా పాలకులు ఆ పంథా వీడడం లేదు. రాష్ట్రంలో గనులు, భూములను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమకు కావాల్సిన వాళ్లకు ధారాదత్తం చేస్తోంది. ఓబుళాపురం ఇనుప ఖనిజ గనుల్లో అధికారులు ఎంతమందికి శిక్ష పడిందో గమనించి కూడా గనులను అస్మదీయులకు ధారాదత్తం చేస్తున్నారు.ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం కన్పించడం లేదు...ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగించాల్సిన ప్రభుత్వమే వ్యవస్థను బలహీన పరుస్తోంది. తద్వారా రాబోయే ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు ఇస్తోంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. వివిధ వర్గాల ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి గొంతుకగా నిలుస్తూ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆ పత్రికా ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు, పోలీసుల దురుసు ప్రవర్తన, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమైన విషయం. ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించడంపై ప్రజల పక్షంగా ‘సాక్షి’ నిలుస్తోంది. ఇలాంటివి మనస్సులో ఉంచుకొని మానసికంగా దెబ్బకొట్టే చర్యలకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను తొక్కిపెట్టారు. మరోవైపు పత్రికల గొంతు నొక్కే చర్యలకు సిద్ధమయ్యారు. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసే పరిస్థితులకు ప్రభుత్వమే దిగడం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.రూ.9వేల కోట్లు అప్పు కోసం.. ప్రభుత్వానికి రూ.9 వేల కోట్ల అప్పు కోసం దాదాపు రూ.రెండు లక్షల కోట్ల విలువైన 436 రకాల ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు సిద్ధపడటం దురదృష్టకరం. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఆ గనుల తవ్వకాలు చేపడితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చవచ్చు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా, చేయకపోయినా వారికున్న స్వేచ్ఛను హరించకుండా ఉంటే అదే పదివేలనిపిస్తోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాటి పరిస్థితిని పాలకులు మరిపిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానాలు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందలించినప్పటికీ అప్రజాస్వామిక దాడులు ఆగడం లేదు. ఇది ఏమాత్రం సహేతుకం కాదు.నోటీసులు ఇవ్వకుండా సోదాలు సరికాదునోటీసులు ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటి మీదకు వెళ్లి సోదాలు చేయడం సరికాదు. చట్టం పద్ధతులు, నిబంధనలు పాటించకుండా ఎడిటర్ ఇంట్లో తనిఖీలు చేయడాన్ని జర్నలిస్టులు అంతా ఖండిస్తున్నారు. మా నోరు నొక్కడానికే పోలీసులు ఇలా చేస్తున్నారని అంటున్నారు. తప్పు చేస్తే నోటీసులిచ్చి పిలిచి అడగాలి కానీ.. నోటీసులివ్వకుండా ముందుగానే సోదాలు చేయొద్దని కోర్టులు కూడా చెబుతున్నాయి. అయినా వీటిని పోలీసులు పాటించడం లేదు. మీడియా, సోషల్ మీడియాలో పొగిడితే ఓకే... విమర్శిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. – తెలకపల్లి రవి, సీనియర్ సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
వాట్సాప్ బాట్ ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు
కడప కల్చరల్ : వాట్సాప్ బాట్ ద్వారా ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లింపు సౌకర్యం మే 9 నుంచి అందుబాటులోకి వచ్చిందని కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్సీ రవికుమార్ తెలిపారు. ఇప్పటిదాకా ఎల్ఐసీ కస్టమర్ పోర్టల్పై 2 కోట్ల 20 లక్షల మంది తమ పాలసీలను నమోదు చేసుకున్నారని, ప్రతిరోజు మూడు లక్షల మంది ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ వాట్సప్ బాట్ సౌకర్యం అదనంగా అందుబాటులోకి రావడంతో పాలసీదారులు ఎల్ఐసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదన్నారు. పాలసీలపై ప్రీమియంలు చెల్లించవచ్చన్నారు. 8976862090 వాట్సాప్ నంబరుకి ఏజీ అని మెసేజ్ చేస్తే, మన పాలసీలపై చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆ తర్వాత వాట్సాప్ బాట్ నుంచే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయవచ్చన్నారు. ఇదే కాకుండా ఎల్ఐసీకి సంబంధిన మరో 14 సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వాట్సాప్ బాట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన పాలసీదారులను కోరారు. -
నందబాలుని ఆనంద విహారం
ముగిసిన దేవునికడప తెప్పోత్సవాలు కడప కల్చరల్ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ తెప్పోత్సవాలలో భాగంగా మూడవరోజు సోమవారం ముగింపు సందర్భంగా స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరించారు. ఆలయ అర్చకులు తొలుత ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు తిరుమంజన అభిషేకం నిర్వహించి అలంకారం చేశారు. అనంతరం పల్లకీపై స్వామికి సమీప వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి అలంకరించి పూజలు చేసి తెప్పపై కొలువుదీర్చారు. మూడుమార్లు వేద పండితుల మంత్రోచ్ఛాటనలు, రెండుసార్లు మంగళ వాయిద్యాల సుస్వరాలు, మరో రెండుసార్లు అన్నమాచార్య కీర్తనల మధ్య తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు బృందం పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
తడబడితే తప్పదు మూల్యం
కడప ఎడ్యుకేషన్ : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదేదో లేనిదేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొన్ని విద్యా సంస్థలు సీబీఎస్ఈ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులుంటేనే పాఠశాలలను నిర్వహించాలి. వీటిపై ఆరా తీయండి.. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవడం తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరపున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థుఽలను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు కచ్చితంగా విచారించి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి. ముందస్తు అడ్మిషన్లతో తస్మాత్ జాగ్రత్త ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోకండి పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి రిజిస్ట్రేషన్, గుర్తింపుపై ఆరా తీయండి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని పరిశీలించాకే అడ్మిషన్ తీసుకోవాలి -
అధికారులు చెప్పిన ఫీజులు చెల్లించలేం
ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు అధికారులు చెప్పిన ఫీజులను చెల్లించలేం. సెమిస్టర్–2 ఎగ్జామ్స్ పూర్తయి త్వరలో రిజల్ట్స్ వస్తాయి. మేము క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలకు ఎంపికై నందున త్వరలోనే సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను కోరాం. కానీ ట్రిపుల్ ఐటీ అధికారులు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని అంటున్నారు. సర్టిఫికెట్లు లేనిదే ఉద్యోగాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగాలకు వెళ్లే అవకాశం ఉండదు. – యండ్లూరు ఇందు (ట్రిపుల్ ఐటీ విద్యార్థిని), సత్యసాయి జిల్లా, కదిరి -
బాలికల భవితకు బాటలు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘కిశోర వికాసం’పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా అనారోగ్య సమస్యలు, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కిశోరి బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా, ఇతర శాఖలను సమన్వయం చేసుకుని సామాజిక అంశాలతోపాటు విద్య, వైద్యం, నైపుణ్యం, క్రీడలు, చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. మే 2 నుంచి జూన్ 10వ తేది వరకు ఈ కార్యక్రమాలు రూపొందించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, డీఆర్డీఏ, వీఆర్వో, ఎంపీహెచ్డబ్ల్యూఓ తదితర బృందాలతో గ్రామాల్లో కిశోర వికాసం, బాలికలకు ఆహారం, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆత్మరక్షణ, బాల్య వివాహాలకు దూరంగా ఉండడం తదితర విషయాలను వివరిస్తున్నారు. గ్రామ స్థాయిలో కమిటీలు కిశోరి వికాసం కోసం గ్రామ, వార్డు స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శి కన్వీనర్గా, ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త, బహుళార్దక సాధక ఆరోగ్యకార్యకర్త, గుర్తింపు పొందిన కార్యకర్త, సచివాలయ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఈ కమిటీ కౌమార బాలికల వివరాలను సేకరించి బృందాలుగా ఏర్పాటు చేసి వారితో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఏర్పాట్లలో మహిళా సంరక్షణ కార్యదర్శి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నలుగురు సభ్యులు కార్యక్రమానికి సహకరించడం, ఒకవేళ మహిళా సంరక్షణ కార్యదర్శి లేనిచోట అంగన్వాడీ కార్యకర్తలే పర్యవేక్షిస్తారు. పంచాయతీ కార్యదర్శి, స్థానిక పాఠశాల హెచ్ఎం, ఏఎన్ఎంలు కూడా అవసరమైతే సహకరిస్తారు. జిల్లాలోని 13 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 2389 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతున్నారు. కౌమర బాలికల గ్రూపులు ఇందులో 14–18 ఏళ్లలోపు ఉన్న బాలికలు, అలాగే బడి మానివేసిన 11–14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారిని గ్రూపులుగా విభజిస్తారు. వారికి ఎంపిక చేసిన అంశాలపై ఆయా ప్రాంతాల్లో బాలికలకు అనువైన సమయంలో గంటపాటు శిక్షణ ఇస్తారు. ప్రధానంగా బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించి వారు ఆయా అంశాల్లో సమర్థవంతంగా ఉండేలా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఆత్మస్థైర్యం పెంపొందించడానికి.. కిశోరి వికాసం ద్వారా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. వేసవి సెలవులు కిశోరి బాలికలకు ఉపయోగపడేలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా సామాజిక అంశాలపై చైతన్యవంతులను చేస్తున్నాం. – శోభారాణి, సీడీపీఓ, కడప అవగాహన కల్పిస్తున్నాం బాలికలకు ఎదురయ్యే సమస్యలపై కిశోరి వికాసం ద్వారా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. నిర్ణీత ప్రణాళికతో వారికి అవగాహన కల్పించి అన్ని అంశాల్లో సమర్థవంతంగా ఉండేలా కృషి చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నాం. – శ్రీలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్, కడప జిల్లా అంతటా కిశోర వికాస శిబిరాలు ఆరోగ్య పరిరక్షణ, సామాజిక అంశాలు, చట్టాలపై అవగాహన వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక -
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభా భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) లో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ● తాను పీఎం విశ్వకర్మ పథకం కింద చెప్పులు కుట్టడంలో శిక్షణ పొందానని, ట్రైనింగ్ ముగిశాక రూ. లక్ష రుణం మంజూరు చేస్తారంటూ అధికారులు చెప్పారని మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామానికి చెందిన ఓరుగంటి పెద్దులయ్య అన్నారు. అధికారుల సూచన మేరకు తాను జమ్మలమడుగు ఏపీజీబీ అకౌంటులో రూ. 6 వేలు జమ చేశానన్నారు. అందులో మూడు వేలు రూపా యలు కట్ చేశారని తెలిపారు. రుణం గురించి అడగ్గా, పైనుంచి లిస్టు రాలేదని, ఆర్డర్ లేదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పైగా ఫీల్డ్ అఽధికారులు రఘుపతి, దీప హేళనగా మాట్లాడుతున్నారని తెలిపారు. ● చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన కె. వెంకటలక్షుమ్మ తన ఇంటి ముందు ిసీసీ రోడ్డువేయాలని, అలాగే తన పొలం వద్ద విద్యుత్స్తంభం,ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలని కోరారు. ● కడప మండలం, మామిళ్లపల్లికి చెందిన ఉరవకొండ ప్రమీల రాణి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలులో అడ్మిషన్ సీట్ కోసం విన్నవించారు. ● కడప గాంధీనగర్ కు చెందిన ఎం. గంగాదేవి పులివెందుల టౌన్ లోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ను నైట్ షెల్టర్ గా నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జడ్పి సీఈవో ఓబులమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, ఎస్డీసీలు శ్రీనివాసులు, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
అధికారులు మాట మారుస్తున్నారు
2019లో నేను ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో చేరాను. చేరేటప్పుడు పీయూసీ–1కు రూ.36వేల చొప్పున రెండేళ్లకు రూ.72వేలు, ఇంజనీరింగ్ నాలుగేళ్లకు రూ.4వేల చొప్పున రూ.1.60లక్షలు చెల్లిస్తే చాలు అని చెప్పారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారులు మాట మారుస్తున్నారు. దీనిపై ఫైనలియర్ విద్యార్థులందరం ధర్నా కూడా చేయడం జరిగింది. ఆర్జీయూకేటీ రిజిష్ట్రార్ అమరేంద్ర కుమార్ విద్యార్థులకు సర్ది చెప్పి త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఎంత ఫీజు కట్టాల్సింది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటివరకు అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు. – వైష్ణవి (ఈఈఈ విద్యార్థిని), అనంతపురం జిల్లా, సింగనమల గ్రామం -
ప్రభుత్వం ఏకపక్ష ధోరణి విడనాడాలి
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు అన్నారు. పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుతం చేపడుతున్న పాఠశాలల పునః వ్యవస్థీకరణ, బదిలీల, పదోన్నతుల ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కడపలోని డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీఓను రద్దుచేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తామని పదేపదే హామీలు గుప్పించిన పాలకులు, జీఓను బేషరతుగా రద్దు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 15వ తేదీన విజయవాడలోని విద్యా భవన్ను ముట్టడిస్తామని వ హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, జాస్ అహ్మద్, మురళీకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు క్రిష్ణారెడ్డి, రూతు ఆరోగ్య మేరి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంవీఐలను విచారించిన ఆర్టీఓ
ప్రొద్దుటూరు క్రైం : విద్యాసంస్థల బస్సుల ఎఫ్సీల విషయమై ప్రొద్దుటూరు ఆర్టీఓ మురళీధర్ ఎంవీఐలను విచారించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ విషయమై ఆదివారం సాక్షిలో ‘ఏటీఎస్ వస్తోంది.. ఎఫ్సీ చేయించుకోండి’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆర్టీఓ సోమవారం నలుగురు ఎంవీఐలను తన చాంబర్కు పిలుపించుకొని విచారణ చేశారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని కార్యాలయానికి వచ్చే స్కూల్ వాహనానికి నిబంధనలకు లోబడి అన్నీ సక్రమంగా ఉంటేనే ఎఫ్సీ చేస్తున్నామని ఎంవీఐలు ఆర్టీఓకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే అదనపు వసూళ్లపై కూడా ఆర్టీఓ వారిని ప్రశ్నించారు. ఎఫ్సీలకు డబ్బు తీసుకుంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆగని అదనపు వసూళ్లు.. ప్రొద్దుటూరు ఆర్టీఓ కార్యాలయంలో చేసిన ఎఫ్సీలకు అదనపు వసూళ్లు మాత్రం ఆగలే దు. ఎఫ్సీ చేయించుకున్న విద్యాసంస్థల బ స్సులు, ఇతర వాహనదారులు దళారుల నుంచి దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఎప్పటి లా గే సోమవారం కూడా ఎఫ్సీ చేసిన పలు వా హనాల యాజమాన్యాలకు ‘వసూల్ రాజా’ ఫోన్లు చేసి డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. కొందరు ఏజెంట్ల ద్వారా కూడా ‘వసూలు రాజా’కు డబ్బులు చేరినట్లు సమాచారం. వ్యక్తి అదృశ్యం కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధి లో విజయదుర్గా కాలనీకి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు తాలూకా ఎస్ఐ తాహిర్ హుస్సేన్ తెలిపారు. రవికుమార్ (39) గత నెల 3వతేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమో దు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్రంలో అసమర్థ పాలన
పులివెందుల : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలన సాగిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. సోమవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికలప్పుడు ప్రజలకు అనేక అబద్దపు హామిలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ హామీలను నెరవేర్చడంలో లేదని ధ్వజమెత్తారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. మా ఉద్యోగాలు కాపాడారు.. స్థానిక ఐజీ కార్ల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది సోమవారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విధులకు రావద్దని చెప్పగా.. వారు గతంలో ఎంపీ దృష్టికి తీసుకురాగా ఆయన పార్టీ తరపున ఉద్యోగాల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా వారు ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదు.. సోమవారం ప్రజాదర్బార్లో ఎంపీని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కలిశారు. ఫైనలియర్ అయిపోయినా తమకు ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదని, దీంతో క్యాంపస్ అధికారులు పూర్తిస్థాయి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీనికి ఎంపీ స్పందిస్తూ ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, ఇప్పటికే పార్టీ తరపున విద్యార్థుల కోసం ఆందోళనలు చేశామని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. వైఎస్ అభిషేక్రెడ్డి స్మారక క్రికెట్ టోర్నీ ప్రారంభం సోమవారం పట్టణంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో దివంగత నాయకుడు వైఎస్ అభిషేక్రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ అవినాష్రెడ్డి మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ అభినవ్రెడ్డిలతోపాటు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ వైఎస్ అభిషేక్రెడ్డి చిత్ర పటానికి ఎంపీ పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ నాయకులు వేల్పుల రాముల, వరప్రసాద్, శశికాంత్రెడ్డి, కోడి రమణ, కిశోర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
బస్టాండ్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న వేలూరు పోలీసులు
మైదుకూరు : ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్లో ఒక్కసారిగా అక్కడున్న ఓ నిందితుడిని తమిళనాడులోని వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది చూసిన ప్రయాణికులు కొద్ది సేపు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. బస్టాండ్లో ఉన్న వ్యక్తిని సాధారణ పౌరుల దుస్తుల్లో ఉన్న కొంత మంది ఒక్క సారిగా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లడం కలకలం రేపింది. అతన్ని వాహనంలో ఎక్కిస్తున్న సమయంలో ప్రయాణికులు వాహనాన్ని చుట్టుముట్టారు. పలువురు వీడియో, ఫొటోలు తీయకుండా ప్రయత్నించారు. అయితే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వారు ఫొటోలు తీయకుండా అడ్డుకున్నారు. తర్వాత తాము వేలూరు పోలీసులమని పలు కేసుల్లో ఈ వ్యక్తి నిందితుడిగా ఉన్నాడని, ఇతని కోసం నెల రోజులుగా గాలిస్తూ ఇప్పుడు పట్టుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయొద్దని అన్నారు. -
రూ.3.20 లక్షలు చెల్లించమంటున్నారు
ఇంజనీరింగ్ ఫైనలియర్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ట్రిపుల్ ఐటీ అధికారులను కోరగా.. రూ.3.20 లక్షలు చెల్లించమంటున్నారు. మాది వ్యవసాయ కుటుంబం.తల్లిదండ్రులు రమేష్, హైమావతి వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పోను మిగిలిన బకాయిలు చెల్లిస్తేనే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ట్రిపుల్ ఐటీకి చెల్లిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారు. – ధరణి (ఈసీఈ ఇంజనీరింగ్ ఫైనలియర్) చిత్తూరు జిల్లా, పుట్లూరు -
పీజీఆర్ఎస్కు 149 ఫిర్యాదులు
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. మొత్తం 149 పిటిషన్లు అందా యని పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.సి డి.ఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పి.ఎస్ డి.ఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి ప్రధాన అర్చకులు మూల విరాట్లకు అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగు రంగుల పూలతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, స్థానికులతో పాటు కన్నడ భక్తులు పాల్గొన్నారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఘనంగా నల్లగంగమ్మ తిరునాల సంబేపల్లె : మండల కేంద్రంలోని శ్రీ దేవరరాయ నల్లగంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మొలకలపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని వేపాకులతో శుద్ధిచేసి పచ్చని తోరణాలు, వివిధరకాల పుస్పాలతో అంకరించారు. ప్రతి ఏడాది మొలకల పౌర్ణమి రోజున అమ్మవారి తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుంచి అమ్మవారికి హోమాలు అర్చనలు చేశారు. 24 గంటలు మెరుగైన విద్యుత్ – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి: ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా గ్రామాలలో 24 గంటలు మెరుగైన విద్యుత్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర రవాణా,యువజన క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి, జిల్లా కలెక్టర్ శ్రీధర్తో కలిసి ఆర్డీఎస్ స్కీమ్పై ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా త్రీఫేస్ కనెక్షన్ ఇచ్చి 24 గంటలు మెరుగైన విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వివరించారు.జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్ స్కీమ్ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. -
కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగం కుదేలైంది. పేదలకు వైద్య సేవలు అందించే కీలకమైన ఒక్కో విభాగం విచ్ఛిన్నమవుతూ వస్తోంది. తాజాగా పల్లెవాసుల ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన సీహెచ్ఓలు సమ్మె బాట పట్టడంతో పల్లె వైద్యం పడకేసింది. ఫలితంగా ‘విలేజ్ హెల్త్ క్లినిక్’ సంక
కడప రూరల్: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్య రంగం ఎంతో కీలకమైంది. ఇప్పుడు ఈ రంగానికి చెదలు పట్టింది. ఫలితంగా వైద్య రంగానికి సంబంధించిన అన్ని సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో గ్రామీణుల వైద్యానికి సంబంధించి కీలకంగా ఉన్న ‘విలేజ్ హెల్త్ క్లినిక్’ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ● నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ కింద 2019 నుంచి ఎంఎల్పీహెచ్ల (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్) బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులతో నియామకాలను చేపట్టారు. ప్రస్తుతం వీరిని సీహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లుగా పిలుస్తున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్సీ)ల పరిధిలో విధులను చేపడుతూ, స్థానికులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ● కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ వైద్యానికి గ్రహణం పట్టింది. సీహెచ్ఓలు తమ సమస్యలను పరిష్కరించాలని పాలకులకు విన్నవించారు. ఫలితం లేకపోవడంతో ఏప్రిల్ 28వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. సమ్మె బాట పట్టి రెండు వారాలు దాటినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని సీహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘సీహెచ్ఓ’ల పరిస్థితి దయనీయం అద్దె భవనాల్లో కొనసాగుతున్న క్లినిక్లకు ప్రభుత్వం పది నెలలుగా బాడుగలు..కరెంట్ బిల్లులను చెల్లించలేదు. ఒక క్లినిక్కు ఒక నెలకు రూ 1000 నుంచి రూ. 4 వేల వరకు బాడుగ, కరెంట్ బిల్లు రూ 300 నుంచి రూ.450 వరకు ఉంటుంది. ఈ బిల్లులను సీహెచ్ఓలే చెల్లించడం గమనార్హం. అలాగే ప్రభుత్వం సమ్మెలో ఉన్న సీహెచ్ఓలపై బెదిరింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సమ్మెలో ఉన్న సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు మే నెలలో వేయలేదు. ఒకరికి ఒక నెల వేతనం రూ.25 వేల వరకు వస్తుంది. సమ్మెలో పాల్గొనని సిబ్బందికి దాదాపు 8–10 మందికి మాత్రమే 25 రోజులకు గాను రూ. 21 వేలు వేశారు. మిగతా వారికి ఒక్క పైసా కూడా జమ చేయకపోవడం గమనార్హం. ‘సీహెచ్ఓ’లకు నిబంధనల సంకెళ్లుఒక సీహెచ్ఓకు వేతనంతో సంబంధం లేకుండా సర్వీసు అంశాలకు సంబంధించి ఒక నెలకు ఇన్సెంటివ్ కింద రూ 15 వేలు అందుతుంది. ఈ ఇన్సెంటివ్ 9 నెలలుగా అందలేదు, తాజాగా ప్రభుత్వం 6 నెలల ఇన్సెంటివ్ను అందజేస్తామని ప్రకటించింది. ఆ ఇన్సెంటివ్ను ఎప్పుడు జమ చేసేది చెప్పలేదు. సీహెచ్ఓలు సమ్మెలో ఉండగా చెల్లిస్తారా..లేక సమ్మె విరమించిన తరువాత చెల్లిస్తారా అనే అంశంను తేల్చలేదు. ప్రభుత్వం 8వ తేదీన ఒక సర్కులర్ జారీ చేసింది. సీహెచ్ఓలు స్థ్ధానికంగా ఉండాలి. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్సీ (అటెండెన్స్) వేయాలి. అలా చేయకపోతే ఇన్సెంటివ్లో రూ.5 వేలు కట్ చేస్తామని తెలపడం పట్ల సీహెచ్ఓలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ.15 వేలు ఇన్సెంటివ్ అనేది సర్వీసుకు సంబంధించిన అంశం. తమ సమస్యలను పరిష్కరించకపోగా ఈ కొత్త నిబంధనలు ఏమిటని సీహెచ్ఓలు ప్రశ్నిస్తున్నారు, సమ్మెలో ‘సీహెచ్ఓ’లు..అందని వేతనం ఇప్పటికే 9 నెలలుగా అందని ఇన్సెంటివ్ సంక్షోభంలో ‘విలేజ్ హెల్త్ క్లినిక్’లు -
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దగ్ధం
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన ఒక ట్రాక్టర్, రెండు చెత్త సేకరణ ట్రై సైకిళ్లు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఆదివారం మధ్యాహ్నం దగ్ధమయ్యా యి. చెత్త సేకరణకు వినియోగిస్తున్న ట్రాక్టర్ ఇటీవల మరమ్మతులకు గురికావడంతో పక్కన పెట్టామని, అందులోని డీజిల్ ఎండ వేడిమికి మంటలు చెలరేగాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామమోహన్రెడ్డి తెలిపారు. ట్రాక్టర్ టైర్లు, టాప్తోపాటు రెండు ట్రై సైకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. రూ.1.80లక్షలు ఆస్తి నష్టం కలిగినట్లు పేర్కొన్నారు.ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతిజమ్మలమడుగు రూరల్ : మండల పరిధిలోని పి. బొమ్మేపల్లి గ్రామంలో ఇంటి ముందు పేడ నీళ్లు చల్లే విషయంలో శనివారం జరిగిన చిన్నపాటి గొడవలో గాయపడిన రామ చౌడప్ప (35) ఆదివారం మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో బంధువులు ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడముతో కర్నూలుకు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి హైదరాబాదుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆదివారం కర్నూలు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో రామ చౌడప్ప మృతి చెందినట్లు సీఐ ఎస్. లింగప్ప తెలిపారు. మృతుడు బేల్దార్ పనులు చేసుకొని జీవించేవాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.వ్యక్తి అదృశ్యంకలసపాడు : మండలంలోని మామిళ్లపల్లె గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి గత నెల 25వ తేదీ నుంచి కనిపించడం లేదని ఎస్ఐ తిమోతి తెలిపారు. 25వ తేదీ తన ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదన్నారు. సదరు వ్యక్తి ఆచూకీ ఎవరికై నా తెలిసిన వెంటనే 9121100632 నంబరుకు సమాచారం అందించాలన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.అక్రమ రేషన్ బియ్యం పట్టివేతకడప అర్బన్ : కడప నగరంలోని ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గుర్రాలగడ్డ ప్రాంతంలో ఆదివారం ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న మోచంపేటకు చెందిన సాదిక్వలీని ఎస్ఐ అమర్నాథ్రెడ్డి తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 880 కిలోల రేషన్బియ్యం స్వాధీనం చేసుకున్నారు. -
లాహిరి..లాహిరి..లాహిరిలో..
పగలంతా భక్తుల మొరలు విని వారి సమస్యలను తీర్చి శ్రమించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుడు సాయంత్రం వాతావరణం చల్లబడ్డాక అలా అలా తెప్పపై జలవిహారం చేస్తూ సేద తీరాడు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలో భాగంగా రెండవరోజు ఆదివారం పుష్కరిణిలో తెప్పపై స్వామి, అమ్మవార్లు ఐదుమార్లు విహరించారు. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేర్చారు. అక్కడి అలంకార మండపంలో విశేష అభిషేకాలు, అలంకారం చేసి, మంగళ హారతులు ఇచ్చి పుష్కరిణిలో సిద్ధంగా ఉంచిన తెప్పపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు త్రివిక్రమ్, కృష్ణమోహన్ బృందం, ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పర్యవేక్షణలో మంగళ హారతులు ఇచ్చి తెప్పను జల విహారం చేయించారు. భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఈ మనోహరమైన దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. భక్తుల గోవిందనామ స్మరణలతో పుష్కరిణి పరిసరాలు మార్మోగాయి. ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. –కడప కల్చరల్ -
కమణీయం.. శ్రీ నారసింహుడి కల్యాణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆదివారం శ్రీ నృసింహస్వామి జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లి వేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి రాభిషేకం చేశారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లి వేడుక నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ఎదుట యజ్ఞహోమాలు జరిపారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోపాల బట్టార్, కృష్ణరాజ బట్టార్, అనిల్స్వామి, గోకుల్స్వామి పాల్గొన్నారు. ఘనంగా తరిగొండ వెంగమాంబ, నృసింహ జయంతి మండలంలోని తరిగొండలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 255వ జయంతి, నృసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రియ భక్తురాలైన ప్రముఖ రచయిత్రి వెంగమాంబ జన్మస్థలం తరిగొండ గ్రామం. ఇక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలోనే వెంగమాంబ ఆలయం ఉంది. వెంగమాంబ, నరసింహస్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం 6 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కావించారు. వేదపండింతుల మంత్రోచ్ఛారణల మధ్య మహా స్నపనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగమాంబ ఆలయాన్ని రంగు రంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో పురవీధుల గుండా స్వామివార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల చేత మాతృశ్రీ వెంగమాంబ సంకీర్తన గోష్టిగానం, హరికథా కాలక్షేప కార్యక్రమాలు నిర్వహించారు. వెంగమాంబ, నృసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. గుర్రంకొండలో.. మండల కేంద్రమైన గుర్రంకొండలో నృసింహస్వామి జయంతి వేడుకలు రెండేళ్ల తరువాత ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక చరిత్రాత్మక గుర్రంకొండ కోట పైభాగంలో ఉన్న శ్రీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలను జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు కిరణ్కుమార్శర్మ పాల్గొన్నారు. -
మిల్లర్ మీదపడి రోడ్డు నిర్మాణ కూలి మృతి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గోపిరెడ్డిపల్లెకు సమీపంలో నెల్లూరు– బళ్లారి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఆదివారం మిల్లర్ మీద పడి ఎండీ వసీం (23) అనే కూలి మృతి చెందాడు. గోపిరెడ్డిల్లెకు సమీపంలోని శివపురం రహదారి వద్ద కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఆదివారం పనుల్లో భాగంగా మిల్లర్ నుంచి కాంక్రీట్ వేస్తున్న సమయంలో మిల్లర్ ఒరిగి పక్కనే ఉన్న వసీంపై పడింది. మిల్లర్ కింద పడిన ఆ యువకుడు నుజ్జు నుజ్జుగా మారి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీహార్లోని భాగల్పూర్ జిల్లాకు చెందిన వాడిగా తెలుస్తోంది. ఆష్రాఫ్, ఫైజర్ అనే వారు ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. మైదుకూరు అర్బన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయ సంఘాల సూచనలను పరిగణనలోనికి తీసుకోవాలి..
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీఓ 117 రద్దు మార్గదర్శకాల విడుదలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా విద్యా శాఖాధికారులు ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం వల్ల ప్రభుత్వ విద్యారంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి గ్రామంలో 1 నుండి 5 తరగతులతో ప్రాథమిక పాఠశాలలను తప్పనిసరిగా కొనసాగించాలి. 1 నుండి 10 తరగతుల విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలకు అన్ని రకాల సబ్జెక్టు టీచర్లను నియమించాలి. ఉన్నత పాఠశాలలలో 45 మంది విద్యార్థులు దాటితే రెండవ సెక్షన్ , 80 మంది దాటితే మూడవ సెక్షన్ను ఏర్పాటు చేయాలి. – ఆదిరెడ్డి శ్యాసుందర్రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా
పుల్లంపేట : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పుల్లంపేట అడ్డగా మారింది. పుల్లంపేట మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా పది గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకొని రాత్రికి రాత్రే మొక్కలు నాటుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులకు రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నా యని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. పుల్లంపేట మండలంలోని కొమ్మనవారిపల్లి, దళవాయిపల్లి, రెడ్డిపల్లి, అనంతంపల్లి, రంగంపల్లి, బావికాడపల్లి, అనంతసముద్రం, వత్తలూరు, దేవసముద్రం, దొండ్లోపల్లి, గారాలమడుగు, తదితర గ్రామాలలో కూటమి ఫ్రభుత్వం అధికారం చేపట్టాక వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. గత ప్రభుత్వంలో ఎనిమిదవ విడత భూ పంపిణీలో భాగంగా పేదలకు పంంచాల్సిన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. కొమ్మనవారిపల్లి సర్వే నంబరు. 846లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మామిడి చెట్ల పెంపకం సాగిస్తున్నారు. అలాగే కొమ్మనవారిపల్లికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు -
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి
● డీఆర్వో విశ్వేశ్వర నాయుడు కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం సభాభవన్ లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి (మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్) వైబ్సెట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. డయల్ యువర్ కలెక్టర్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. మద్యం దుకాణానికి దరఖాస్తుల ఆహ్వానం కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలోని జమ్మలమడుగు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పెద్దముడియం మండలంలో గీత కులాలకు చెందిన మద్యం దుకాణానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా సూపరింటెండెంట్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రీడ్ విధానంలో ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుందని, 17న కొత్త కలెక్టరేట్లో డ్రా తీస్తామన్నారు. -
మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని గౌతమీ నగర్కు చెందిన సయ్యద్ సాబ్ వలి(30) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం స్థానికంగా పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అదుపుతప్పి మిద్దె పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి..
అధిక సంఖ్యలో ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్–2 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి అదనంగా పోస్టులను కేటాయించాలి. ప్రభుత్వం రూపొందించిన విధానాల వల్ల విద్యా రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. – రెడ్డెప్పరెడ్డి, వైఎస్సార్టీఎఫ్, అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులకు 48 పరీక్షా కేంద్రాల్లో, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 26 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. 17,408 మంది విద్యార్థులు... జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 17,408 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 12,378 మంది జనరల్, 692 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఇక సెకండియర్ సంబంధించి 3899 మంది జనరల్, 439 మంది ఒకేషనల్ పరీక్షలను రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ రాసే వారి సంఖ్య అధికంగా ఉండటంతో జనరల్ 12,378 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణ కోసం 48 మంది డిపార్టుమెంట్, 48 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 26 మంది డిపార్టుమెంట్ అధికారులు, 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. వీరితోపాటు ప్లయింగ్, సిట్టింగ్ స్వ్కాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకోగా వాటిని ఆయా పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షించనున్నారు. రెండు సెషన్లలో... ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనున్నాయి. ఏర్పాట్లను సిద్ధం చేసిన ఇంటర్ విద్యాశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా పరీక్షలు రాయనున్న 17408 మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం నేటి నుంచి ప్రారంభం కానున్న సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాం. విద్యార్థులంతా నిర్ణీత సమయానికంటే ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. – బండి వెంకటసుబ్బయ్య, ఆర్ఐవో,ఇంటర్ విద్య