‘మహానాడు’లో ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

‘మహానాడు’లో ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా చర్యలు

May 15 2025 12:22 AM | Updated on May 15 2025 12:22 AM

‘మహాన

‘మహానాడు’లో ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా చర్యలు

కడప అర్బన్‌ : మహానాడు సందర్భంగా ఈనెల 27, 28, 29 తేదీలలో పటిష్ట బందోబస్తుతో పాటు, ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌ కుమార్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కడపలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పలు అంశాలపై పోలీస్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మహానాడుకు పలువురు వీవీఐపీలు, వీఐపీలు, పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పరంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పోలీస్‌ అధికారులకు కేటాయించిన విధులను అప్రమత్తంగా ఉంటూ నిర్వర్తించాలన్నారు. ఇతర శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్‌.పి (అడ్మిన్‌) కె.ప్రకాష్‌ బాబు, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌, కడప డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, ఏ.ఆర్‌ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర రావు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌ కరీం, ఎస్‌.బి ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.పురుషోత్తం రాజు, జిల్లాలోని సీఐలు పాల్గొన్నారు.

భద్రతా ఏర్పాట్లపై పోలీస్‌ అధికారులకు

జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌ కుమార్‌ దిశానిర్దేశం

‘మహానాడు’లో ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా చర్యలు1
1/1

‘మహానాడు’లో ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement