ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరు | - | Sakshi
Sakshi News home page

ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరు

May 15 2025 12:20 AM | Updated on May 15 2025 12:20 AM

ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరు

ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ కడప డిపో ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్టీసీ అధికారుల తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప డిపో మేనేజర్‌, టీఐ3 ఇరువురు కడప డిపో ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కార్మికుల ఆమోదయోగ్యమైన కోర్కెలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ కడప డిపో కార్యదర్శి శ్రీనివాసులు, రీజియన్‌ సంయుక్త కార్యదర్శి కేఎస్‌ దాస్‌, కోశాధికారి టీఎం బాషా, వైస్‌ ప్రెసిడెంట్‌ పీఎస్‌ ఖాన్‌, కేఎంఎస్‌ రావు, రామయ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement