Sri Sathya Sai
-
మహిళను బలిగొన్న కరెంట్ షాక్
మడకశిరరూరల్: దిగువ అచ్చంపల్లికి చెందిన మహిళ పుష్పావతి (36) బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి ఆవరణలో సింగిల్ పేజ్ మోటార్ ఆన్ చేసి సంపు వద్ద నీటిని పట్టుకోవడానికి వెళ్లే సమయంలో పుష్పావతి కరెంట్ షాక్కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మడకశిర ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్షితకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు అమరాపురం: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో హలుకూరు సమీపంలోని కేజీబీవీ విద్యార్థిని అక్షిత 600కు 586 మార్కులతో రాష్ట్రంలోనే కేజీబీవీల్లో రెండో స్థానంలో నిలిచి ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విద్యార్థినికి అవార్డును అందజేసినట్లు ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. మారుమూలన, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చదువుకున్న విద్యార్థినికి అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల మంత్రి ప్రశంసల జల్లు కురిపించారని పేర్కొన్నారు. ఈమె తల్లిదండ్రులు చిత్తయ్య, ఎర్రక్కలు కుందుర్పి మండలం నిజవల్లి గ్రామానికి చెందిన వారన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా కేజీబీవీ టీచర్లు, సిబ్బంది అక్షితను అభినందించారు. అదనపు కట్నం వేధింపుౖలపె కేసు హిందూపురం: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త సయ్యద్ అతావుల్లాపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల క్రితం హస్నాబాద్లో నివాసముంటున్న సానియాతో అతావుల్లాకు వివాహమైంది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు వరకట్నం తదితర కానుకలను అందజేశారు. అయినా ఇంకా అదనపు కట్నం కావాలని అతావుల్లా వేధిస్తుండటంతో భరించలేకపోయిన భార్య వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసునమోదు చేసి, అతావుల్లాను అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలా.. వీధిరౌడీలా? అనంతపురం కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లాపరిషత్ కార్యాలయంలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు విమర్శించారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను తొలగించాలంటూ అధికారులపై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యమని అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి అనంతపురము సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి నియమితులయ్యారు. నంద్యాల జిల్లా ఎస్ఆర్ బీసీ ప్రాజెక్ట్ సర్కిల్ –1 ఎస్ఈగా పని చేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత నెలాఖరులో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఉద్యోగ విరమణ పొందారు. అయినప్పటికీ ఎస్ఈ నియామకం జరగక పోవడంతో ఈ నెల 13న ‘ప్రగతి తప్పిన హెచ్చెల్సీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడటంతో ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జ్ (ఎఫ్ఏసీ) ఎస్ఈగా పురార్థనరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం
అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమ జిల్లాలకు కల్పతరువు లాంటి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి అండగా ఉంటున్న ఆర్డీటీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా.. దానిపై వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్, సమన్వయకర్తలు రీజినల్ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్ మినహా ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి, లైనింగ్ పనులను మొదలు పెట్టారన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పుదోవ పట్టించేందుకు ఇప్పటి వరకు 20 రకాల అంశాలను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు సీఎం చంద్రబాబు తెర లేపారన్నారు. అందులో ఏ ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారన్నారు. డైవర్షన్ కోసమే.. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం మద్యం స్కాంను తెరపైకి తెచ్చిందని మిథున్రెడ్డి మండిపడ్డారు. దీనికి సంబంధించి రూపాయి కూడా సీజ్ చేయలేదన్నారు. రేషన్ షాపులను రద్దు చేస్తామంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. సమావేశంలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి, సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, వై.వెంకటరామిరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్ అహ్మద్, మాజీ మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం ఎంపీ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుదాం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ మునిసిపాలిటీ, సర్పంచ్ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువుందని, ఆ లోపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుద్దామన్నారు. ఆర్డీటీకి అండగా ఉందామన్నారు. ప్రజానీకానికి ఆర్డీటీ అందిస్తున్న సేవలను ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పుడు ఆ సంస్థ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలన్నారు. సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తూ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. వీటిపై అందరూ కలసికట్టుగా పోరాడుదామన్నారు. అనంతరం సమన్వయకర్తలు మాట్లాడారు. -
ప్రాణం తీసిన అతివేగం
గుత్తి రూరల్: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో పెళ్లిబృందం కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికుమారుడితో సహా ఆరుగురుగాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రిలోని గాజులపాలెంకు చెందిన రాజేష్ వివాహం వజ్రకరూరులో గురువారం జరగనుంది. బుధవారం పెళ్లి కుమారుడు రాజేష్ బంధువులతో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. గుత్తి మండలం జక్కలచెరువు శివారు మలుపులో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన ఇన్నోవా కారును రాజస్థాన్ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన కారు డ్రైవర్ జబ్బార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కుమారుడు రాజేష్తో పాటు బంధువులు ఉమాదేవి, సరోజ, ఎన్.శ్రీనివాసులు, నారాయణమ్మ, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉమాదేవి, నారాయణమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి పంపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించి, కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో అటెండర్ దుర్మరణం గుంతకల్లు: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ కార్యాలయ అటెండర్ షేక్ మహబూబ్బాషా (25) దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోమినాబాద్కు చెందిన ఖాజా, మున్నీ దంపతుల కుమారుడు మహబూబ్బాషా ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ పని చేస్తున్నారు. ఇటీవలే డిప్యుటేషన్పై వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా బదిలీ అయ్యారు. రోజూ డ్యూటీకి ద్విచక్రవాహనంపై వెళ్లి వచ్చేవారు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో గుంతకల్లుకు బయల్దేరిన మహబుబ్బాషా మార్గమధ్యం కమలపాడు వద్ద వేగంగా వస్తున్న జీటీ ఆటో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో బోల్తా పడుటంతో గుంతకల్లులోని హౌసింగ్ బోర్డుకు చెందిన అబ్దుల్ రజాక్, అతని కూమరుడు రోషన్ గాయపడ్డారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమూన్ ఆస్పత్రికి వెళ్లి అటెండర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
భూసేకరణపై రైతుల నిరసనాగ్రహం
హిందూపురం: పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం ఏడాదిలో మూడు పంటలు పండే పొలాలను సేకరించేందుకు సిద్ధం కాగా రైతులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం హిందూపురం మండలం మలుగూరు, చలివెందుల, రాచేపల్లి, మీనకుంటపల్లి, కొండూరు గ్రామాల్లో భూములు సేకరించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే ఇటీవల కొందరు అధికారులు రైతులకు సమాచారం కూడా ఇవ్వకుండా సర్వేకు సిద్ధమయ్యారు. తమ జీవనాధారమైన భూములు తీసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను నిరసిస్తూ ఆయా గ్రామాల నుంచి వందలాది మంది రైతులు బుధవారం హిందూపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదురుగా బైఠాయించి లోనికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు మాట్లాడారు. చంద్రబాబూ.. వ్యవసాయం నుంచి మమ్మల్ని దూరం చేయకు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతే... దేశానికి వెన్నముక అంటారని, అలాంటి రైతుల పొలాలను లాక్కోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను లాక్కుంటే వ్యవసాయమే జీవనాధారంగా బతికే వందలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి తలెత్తుతుందన్నారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు ఈ భూములు లేకపోతే రోడ్డున పడతామన్నారు. సమాచారం ఇవ్వకుండా సర్వే ఎందుకు మలుగూరు రెవెన్యూ పొలాల్లో రైతులకు తెలియకుండానే భూ సర్వే చేయించడమేమిటి రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. రైతులు గంటల తరబడి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే కార్యాలయంలోనికి వెళ్లారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్ కల్పించుకుని తనకు పూర్తి విషయం తెలియదని, అయితే అనుమతి లేకుండా ఎవరి భూములూ సేకరించబోమని తెలిపారు. భూసేకరణ ఏదైనా ఉంటే తప్పక తెలిజేస్తామంటూ రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తహసీల్దార్ చిలమత్తూరు ఆఫీసుకు వెళ్లారని, ఆయన వచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తారని సమాధానం చెప్పారు. అయితే రైతులు దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో సర్వే నిర్వహించేందుకు తహసీల్దార్ రాగా, తామే కార్యాలయానికి వస్తామని, అప్పుడే సమాచారం ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పుడు ఆయనే కార్యాలయంలో లేకుండా వెళ్లిపోవడం చూస్తే ఏదో జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదని లేదన్నారు. తహసీల్దార్ ఏమైనా చెప్పాలనుకుంటే ఆయనే, తమ గ్రామానికి రావాలని చెప్పారు. అనంతరం తమ భూములు సేకరించవద్దని డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందించి వెనుదిరిగారు. రైతుల నిరసనకు రైతు సంఘ నాయకులు, వివిధ పార్టీ నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, సిద్దారెడ్డి, ఓడీడీఆర్ శ్రీనివాసులు, చైతన్య గంగిరెడ్డి, సోమకుమార్, రవీంద్రరెడ్డి, పెద్దన్న, వెంకటరెడ్డి, అంజన్రెడ్డి, బీఎస్పీ శ్రీరాములు పాల్గొన్నారు. హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి మూడు గ్రామాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన రైతులు తమకు తెలియకుండానే భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యవసాయం నుంచి తమను దూరం చేయకండని వేడుకోలుభూ సేకరణను అడ్డుకున్న రైతులు లేపాక్షి: మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణను రైతులు బుధవారం అడ్డుకున్నారు. భూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను వెనక్కు పంపారు. అనంతరం తమ జీవనాధారమైన భూములను సేకరించవద్దని తహసీల్దార్ సౌజన్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. -
వారంతా నిరక్షరాస్యులు. అయితేనేం తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. వారు ప్రయోజకులై ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కొలువులు సంపాదించి ఉన్నత స్థితికి చేరుకున్నారు. అక్షరమే హరిపురం గ్రామానికి వరంగా మారింది.
హరిపురం గ్రామ ముఖ చిత్రం అమడగూరు: అదో కుగ్రామం. అక్కడ నివసిస్తున్న వారంతా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వారే. గతంలో ఒకే కుటుంబంలా ఉన్నవారు.. నేడు వంద కుటుంబాల వరకు విస్తరించారు. ఇందులో 90 ఇళ్లకు చెందినవారు గొర్రెలు మేపుకొంటూ జీవనం సాగిస్తుంటారు. అమడగూరు మండలంలో పుట్టగోసులపల్లిగా పిలిచే ఊరు కాల క్రమేణా హరిపురంగా రూపాంతరం చెందింది. అన్ని కుటుంబాల్లోనూ తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా తమ పిల్లలను కష్టపడి చదివించారు. ఇప్పుడు ఆ గ్రామంలో 15 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. మరో 35 మంది ప్రైవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, మేనేజర్లుగా, సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలో ఉన్న యువతీ యువకులంతా ఉద్యోగాల కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇంటికో ఉద్యోగమే లక్ష్యం గ్రామంలో 40 మంది యువకులతో పాటు 33 మంది యువతులు ఉండగా.. వారంతా డిగ్రీలు, పీజీలు పూర్తి చేశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విద్యావంతులుగా ఉన్న వారంతా తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలనే తపనతో అందరూ నూతన గృహాలను నిర్మించుకోవడంతో పాటు చందాల ద్వారా రూ.75 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. జేకే పల్లి పంచాయతీలో మారుమూల గ్రామంగా ఉన్న హరిపురానికి గ్రామస్తులంతా కలసికట్టుగా ఉంటూ కందుకూరిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న పొగాకుతోపు నుంచి తనకంటిపల్లి మీదుగా తారు రోడ్డు వేయించుకున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో గ్రామంలోని ఇంటికో ఉద్యోగం ఉందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు చర్చించు కొంటున్నారు. వంద కుటుంబాల్లో 90 మంది గొర్రెల కాపరులే నిరక్షరాస్యులైనా.. పిల్లలను చదివించుకున్నారు 50 మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కొలువులు -
లేపాక్షిలో జిల్లా స్థాయి యోగా దినోత్సవం
● కలెక్టర్ టీఎస్ చేతన్ లేపాక్షి: జిల్లా స్థాయి యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన లేపాక్షిలో యోగా దినోత్సవ ఏర్పాట్ల కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్బంగా నంది విగ్రహం, జఠాయువు, వీరభద్రస్వామి దేవాలయ ఆవరణ, ఆర్టీసీ బస్టాండు, నవోదయ విద్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం నవోదయ విద్యాలయలో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి నెలరోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గురువారం నుంచి తహసీల్దార్, ప్రిన్సిపాల్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయలో యోగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ చేతన్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. యోగా జీవితంలో భాగం కావాలి పుట్టపర్తి టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించే ‘యోగా మంత్’ కార్యక్రమాన్ని కలెక్టర్ చేతన్ బుధవారం స్థానిక సాయి ఆరామంలో ప్రారంభించి యోగాసనాలు వేశారు. ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం. అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
తాడిమర్రి: నిడిగల్లు గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. పోలీసుల కథనం మేరకు... ధర్మవరానికి చెందిన షబ్బీర్ బుధవారం ఉదయం కారులో ఎరువులు వేసుకుని దాడితోటలో ఓ రైతుకు అందించి తిరిగి ధర్మవరం వెళుతున్నాడు. నిడిగల్లు సమీపంలోని చింతతోపు వద్దకు రాగానే కారు అదపుతప్పి సోలార్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగ్గానే బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్కు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలి గుంతకల్లు: ఉగ్రవాదాన్ని అంతమొందించేందకు ప్రభుత్వం కృషి చేయాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా కోరారు. బుధవారం గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలో యాంటీ టెర్రిరిజంపై ఉద్యోగులతో డీఆర్ఎం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత పిచ్చితో ఉగ్రవాదులు చేసే దుశ్చర్యలకు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, ఆర్పీఎఫ్లు తదితరులు పాల్గొన్నారు. బాలికపై అత్యాచారయత్నం హిందూపురం: ఆరుబయట ఆడుకుంటున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు విన్న స్థానికులు గమనించి అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలిలా ఉన్నాయి. హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ బాలిక ఆడుకుంటోంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి తినుబండారాల ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, బంధువులు గమనించి పరుగున వచ్చారు. వారిని చూసి ఆ వ్యక్తి బయటకు పరుగులు తీసినా.. వెంటాడి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసిన అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
21 మండలాల్లో వర్షం
ప్రశాంతి నిలయం: ముందస్తు ‘నైరుతి’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ 21 మండలాల పరిధిలో 306.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా గోరంట్ల మండలంలో 48.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా రొద్దం మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక నల్లచెరువు మండలంలో 45.2 మి.మీ, ఓబులదేవర చెరువు 44.2, కనగానపల్లి, ఎన్పీకుంట 24.2, సోమందేపల్లి 21.4, అమడగూరు 16.4, పెనుకొండ 14.0, కొత్తచెరువు 12.8, పుట్టపర్తి 10.6, గాండ్లపెంట 9.6, బత్తలపల్లి 8.2, తలుపుల 4.2, కదిరి 4.0, తనకల్లు 3.6, ధర్మవరం, బుక్కపట్నం మండలాల్లో 3.4 మి.మీ, రామగిరి 3.2, చిలమత్తూరు 2.8, చెన్నేకొత్తపల్లి మండలంలో 1.6 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. -
ఉమ్మడి జిల్లాలో చెరువులను పూర్వస్థితికి తేవాలి
అనంతపురం అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 507 చెరువులను పూర్వస్థితికి తేవాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణకు కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఐ అండ్ ఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, ప్రభుత్వ నిధులతో శ్రీ సత్యసాయి జిల్లాలో 411 చెరువులు, అనంతపురం జిల్లాలో 96 చెరువులను పూర్వస్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. చెరువులను గుర్తించి పనులకు సంబంధించి ప్రతిపాదనలను రాష్ట్ర కమిటీకి పంపించాలన్నారు. ఇప్పటికే 29 చెరువులను గుర్తించారని, మిగిలిన చెరువులను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండమేరు పైభాగాన, మరువ వంక, నడిమి వంక పైభాగన ఉన్న చెరువులను కూడా బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, డ్వామా పీడీ సలీంబాషా, భూగర్భ జల శాఖ డీడీ తిప్పేస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, కేంద్ర భూగర్భజల బోర్డు అధికారి స్వరూప్ కళ్యాణ్, కేంద్రీయ జలసంఘం ఏడీ సీహెచ్ సంజీవ్, మైనర్ ఇరిగేషన్ ఈఈ రాము, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం -
మెగా సప్లిమెంటరీ ఫలితాలొచ్చేశాయ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ (ఇయర్లీ వైజ్) ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్లో చూడాలని సూచించారు. గతేడాది అక్టోబర్లో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, పీఆర్వో ప్రొఫెసర్ కే.రాంగోపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు పాల్గొన్నారు. -
అద్దె బస్సులపై ఆరా
● ఆర్టీసీ అధికారులు కళ్లు మూసుకున్నారా! ● ఏటా ఎంత నష్టమొచ్చిందో లెక్కలు తేల్చండి ● అద్దెబస్సుల టోల్ రాయితీ లెక్కగట్టే పనిలో విజి‘లెన్స్’ ● 2,788 అద్దెబస్సుల జాబితాను పరిశీలిస్తున్న అధికారులు ● నెలవారీ సమీక్షలో ఆరా తీసిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అనంతపురం క్రైం: ఆర్టీసీలో అద్దె బస్సుల టోల్ చెల్లింపు రాయితీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుధవారం విజయవాడ బస్ భవన్లో నిర్వహించిన నెలవారీ సమీక్షలో అనంతపురం రీజియన్లో అద్దె బస్సుల టోల్ రాయితీ వ్యవహారం హాట్ టాపిక్గా నిలిచింది. సమీక్షకు హాజరైన అనంతపురం రీజియన్ సిబ్బంది, అధికారులు, యూనియన్ నేతల ద్వారా అంత్యంత విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... మంగళవారం ‘ఆర్టీసీలో అధికారులే టో(తో)లు తీశారు..’అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. రాష్ట్ర వ్యాఫ్తంగా అద్దె బస్సుల జాబితాను పరిశీలించాలని సూచించారు. డిపోల వారిగా అద్దె బస్సులు, వాటి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ టెండరు నిర్వహణలో ప్రతి అంశాన్నీ పరిశీలించాల్సిన ఈడీ, ఆర్ఎం క్యాడర్ అధికారుల తప్పిదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అనంతపురం ఆర్టీసీ రీజియన్లో ఆరు నెలల క్రితమే ఈ విషయం బయటకు పొక్కినా సదరు అధికారులు ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేషన్కు రోజువారీ వస్తున్న నష్టాన్ని పూడ్చాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక్క అనంతపురం రీజియన్లోనే సుమారు రూ.5 కోట్లు నష్టపోయినట్లు తేలితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నష్టం ఏమేరకు ఉంటుందో తక్షణం ఆరా తీయాలని సూచించినట్లు తెలిసింది. అద్దె బస్సుల యజమానులకు నోటీసుల జారీ రాష్ట్ర వ్యాఫ్తంగా నాలుగు జోన్ల పరిధిలో 2,788 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజువారీ ఎన్ని సింగిల్స్ తిరుగుతున్నాయి. ఎన్ని టోల్ గేట్లను దాటుకుని పోతున్నాయన్న దానిపై వివరాలు సేకరించాలని అకౌంట్స్ విభాగాలకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. తక్షణం అద్దె బస్సులు స్థానిక జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటే సదరు బస్సు యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏదేమైనా ఇంత పెద్ద నష్టానికి కారకులైన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక సర్దుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. టోల్ రాయితీ నష్టంపై విజి‘లెన్స్’ అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సుల టోల్ రాయితీ పొందలేక పోవడానికి ప్రధాన కారణం లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు డిపోల వారీగా అద్దె బస్సుల వివరాలను సేకరించింది. ఈ మేరకు నివేదికను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపింది. కాగా ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలను ఇంకా సేకరిస్తున్నామని ఆర్టీసీ విజిలెన్స్ సీఐ విజయ్కుమార్ తెలిపారు. -
ఫొటోల కోసం పాకులాడటమేంటి?
అనంతపురం కార్పొరేషన్: అభివృద్ధి మరచి ఫొటోల కోసం పాకులాడటం ఏంటని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చర్యలను ఆయన ఖండిస్తూ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటివాటిపై పాలకులు నోరు మొదపకుండా దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై చర్చ జరిపిన పాపాన పోలేదన్నారు. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధి చాంబర్లోకి వెళ్లి హంగామా చేయడమే కాకుండా జెడ్పీ సీఈఓపై దబాయించడమేంటన్నారు. -
అనంత జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేశారు. జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగారు. వైఎస్ జగన్ ఫొటో తీసేయాలంటూ రాద్ధాంతం చేశారు. ఉద్యోగం తీసేయిస్తామంటూ జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదు: వెన్నపూస రవీంద్రారెడ్డిఅనంతపురంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారన్నారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?. చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ... సూపర్ సిక్స్ హామీల అమలులో ఎందుకు చూపలేదు?. జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదని వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. -
నీట మునిగి వ్యక్తి మృతి
లేపాక్షి: మండలంలోని చోళసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగానిపల్లికి చెందిన శివప్ప(56) నీట మునిగి మృతిచెందాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న నీటి కుంట వద్దకు బహిర్భూమి కోసం వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి కుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. శివప్పకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.‘బెట్టింగ్’ అప్పులు తీర్చలేక యువకుడి పరారీబత్తలపల్లి: ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ యువకుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇల్లు విడిచి పారిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామానికి చెందిన చింతపంటి చెన్నారెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి ఆన్లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో బెట్టింగ్కు పెట్టుబడుల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఈ అప్పులకు వడ్డీల భారం పెరగడంతో తీర్చలేక ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. బంధువులు, సన్నిహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి చెన్నారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.విద్యుదాఘాతంతో గేదె మృతిచెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం గేదె మృతి చెందింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ఓబుగారి సుబ్బిరెడ్డి పాడి పెంపకంతో కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పచ్చగడి పెరగడంతో మేత కోసం రెండు గేదెలను గ్రామ నడిబొడ్డులో ఉన్న బయలు ప్రాంతానికి వదిలాడు. గేదెలు పచ్చగడ్డిని మేస్తూ ఉండగా అందులో ఒక గేదె సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభానికి ఏర్పాటు చేసిన స్టే వైర్ను తాకింది. స్టేవైర్కు విద్యుత్ ప్రసరించడంతో గేదె షాక్తో అక్కడి కక్కడే మృతి చెందింది. ఘటనలో రూ.80 వేలు నష్టపోయినట్ల బాధితుడు వాపోయాడు.వ్యక్తిపై కేసు నమోదుగార్లదిన్నె: ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కల్లూరుకు చెందిన మహబూబ్బాషా సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టాడన్నారు. దీనిపై ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
శ్రీగంధం అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారు మంగళవారం శ్రీగంధం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేకువ జామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీగంధం అలంకరణలో తీర్చిదిద్ది భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ యాగశాలలో సుందరకాండ, మన్యుసూక్త వేద పారాయణం, శ్రీరామ ఆంజనేయ మూలమంత్ర అనుష్టానాల అనంతరం మన్యుసూక్త హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మండపంలో కొలువుదీర్చి సింధూరంతో లక్షార్చన చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. -
దీక్షిత్.. కొట్టాడు ఐఎఫ్ఎస్
అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు. మధ్య తరగతి కుటుంబం.. పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా... దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు. ఇంట్లో ఉంటూ చదువుకుని.. ఢిల్లీలో తీసుకున్న కోచింగ్తో దీక్షిత్కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో ...ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు. కష్టాన్ని మరిపించిన ఫలితం.. యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు. మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యాడు. యూపీఎస్సీ పరీక్షలో సత్తా చాటిన అమరాపురం యువకుడు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 30వ ర్యాంకు కై వసం అమ్మానాన్నకు అంకితం ఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్ -
‘సూపర్’ సేవలు మెరుగు పడాలి
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడాలని సంబంధిత వైద్యాధికారులకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం సూచించారు. మంగళవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. రోగులకందుతున్న సేవలు, రోజూ ఎన్ని శస్త్రచిక్సితలు చేస్తున్నారు, తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వారిలో నమ్మకం కల్గించేలా చూడాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేసి త్వరలో అందుబాటులో తీసుకురావాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల వైద్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రధానంగా సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం బోధనాస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. పరికరాలు, ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా చూడాలని కోరారు. డీఎంఈ నరసింహం -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
ప్రశాంతి నిలయం: ‘‘పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలంతా రోగాలకు దూరంగా ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలి. ఎంపీడీఓలంతా ఈ కార్యక్రమాలు పర్యవేక్షించాలి. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించలేది లేదు. కఠిన చర్యలకూ వెనుకాడబోం’’ అంటూ కలెక్టర్ చేతన్ ఎంపీడీఓలను హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు. మండల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నిర్వహిస్తున్నామన్నారు. జూన్ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ‘నీరు–మీరు’ అనే థీమ్తో నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలు, బహిరంగ ప్రదేశాల్లోని నీటి సేకరణ నిర్మాణాలను శుభ్రపరచడంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నీటి సేకరణను ఉపయోగించుకోవడానికి ఈ మూడు వారాల ప్రణాళికలు రూపొందించాలన్నారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ నిర్మాణాలు, భూగర్భ జల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ 100 శాతం జరగాలన్నారు. లేపాక్షి, హిందూపురం, రొళ్ల, అగళి, నల్లమాడ, తనకల్లు, కొత్తచెరువు మండలాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడ తాగునీటి పైప్లైన్ లీకేజీ కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా చెత్త సేకరణ, రవాణాకు ఉపయోగించే పరికరాలు నిరుపయోగంగా ఉండకూడదన్నారు. సమావేశంలో డీపీఓ సమత, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లికార్జునప్ప, గ్రామ/వార్డు సచివాలయాల నోడ్ అధికారి సుధాకర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి పడేలా పథకాలు అమలు చేయాలి.. సంక్షేమ పథకాలు ప్రజలు సంతృప్తి పడేలా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ మెరుగుదలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయాలన్నారు. అన్న క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ పర్యవేక్షించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ‘దీపం’ పథకం కింద గ్యాస్ డెలివరీకి అదనపు మొత్తాన్ని వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలను హెచ్చరించిన కలెక్టర్ టీఎస్ చేతన్ స్వచ్ఛతా కార్యక్రమాలతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశం -
అధినేతతో రామగిరి ఎంపీటీసీల భేటీ
రామగిరి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన రామగిరి మండల ఎంపీటీసీ సభ్యులు మంగళవారం కలిశారు. రామగిరి ఎంపీపీ స్థానాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత సాగిస్తున్న కుట్రను భగ్నం చేస్తూ ఎన్నికకు ఎంపీటీసీలందరూ గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామగిరి మండలంలో నెలకొన్న పరిస్థితులను వారు వైఎస్ జగన్కు వివరించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎంపీటీసీ సభ్యులు సుజాతమ్మ, భారతి, వెంకటలక్ష్మమ్మ, ఆదిలక్ష్మి, బాలకొండయ్య, సాయిలీల, వైఎస్సార్సీపీ నాయకులు జయచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, శంకరయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
ముగిసిన పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. శ్రీవారి ఉత్సవమూర్తులను భారీ ఊరేగింపుతో ఆమిద్యాల గ్రామానికి తరలించారు. ఉదయం ఆలయంలో స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మీనృసింహుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకీలో ఆమిద్యాలకు తరలించారు. ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబుళేసుడి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడ కొలువుదీర్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకేరమేష్ బాబు, అర్చకులు పాల్గొన్నారు. హుండీ కానుకల లెక్కింపు.. పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీ కానుకలు మంగళవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి పాండురంగారెడ్డి, దేవదాయ శాఖ పర్యవేక్షణ అదికారులు వన్నూరుస్వామి, కె.రాణి, ఆలయ ఈఓ సాకే రమేష్బాబు ఆధ్వర్యంలో కానుకలు లెక్కించారు. 13 రోజులకు గాను కానుకల రూపంలో రూ.15.85 లక్షలు, అన్నదానం హుండీ ద్వారా రూ.8,212 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లుకు చెందిన హనుమాన్ సేవా సమితి, ఉరవకొండ షిర్డీ సాయి ఆలయం, అనంతపురం ఫస్ట్రోడ్డు శివాలయం సేవా సమితి వారు పాల్గొన్నారు. -
‘పల్లె’వించిన కక్ష రాజకీయం
సాక్షి, పుట్టపర్తి: ఆయనో విద్యాధికుడు...కొన్నేళ్ల పాటు పిల్లలకు పాఠాలు చెప్పారు. కానీ రాజకీయంలోకి దిగాక కొత్త పాఠం నేర్చుకున్నారు. ప్రశ్నిస్తే బెదిరించడం... ఎదురొస్తే దాడులు చేయించడం ద్వారా తనకు ఎదురేలేకుండా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కూటమిలోని జనసేన, బీజేపీ నేతలను టార్గెట్ చేశారు. ‘ఇది కూటమి ప్రభుత్వం... మేమంతా ఒక్కటే’ అంటూ ఆయా పార్టీల నేతలు ఊరూరా చెప్పుకుంటూ తిరుగుతుండగా... పుట్టపర్తిలో మాత్రం ‘పల్లె’ మిత్రపక్షాల నేతలను టార్గెట్ చేశారు. అధికారం అడ్డు పెట్టుకుని.. పోలీసులతో రాజకీయం చేస్తూ కేసులు, అరెస్టులు అంటూ బీజేపీ, జనసేత నేతలను నిత్యం వేధిస్తున్నారు. తమ ప్రభుత్వంలో తమపైనే దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. బీజేపీ నేతలపై కక్ష సాధింపు.. పెనుకొండ సమీపంలోని ‘కియా’ కార్ల పరిశ్రమ వద్ద గతంలో తన అనుచరులు, స్నేహితులను కలుపుకుని వందల ఎకరాల భూమి కొన్నారు. ఆ తర్వాత విలువ ఆధారంగా పంపకాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వాటాల్లో తేడా కారణంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అడ్డం తిరిగినట్లు ఆరోపణలున్నాయి. కొందరు అల్లరిమూకలను రెచ్చగొట్టి.. పదే పదే రోడ్లు ధ్వంసం చేయించడం.. బీజేపీ నేత ఆదినారాయణయాదవ్పై కేసు నమోదు చేయించడం పనిగా పెట్టుకున్నాడు. సుమారు రూ.80 కోట్లు విలువ చేసే భూమిని పల్లె రఘునాథరెడ్డి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆదియాదవ్ ఆరోపిస్తున్నారు. గత ఆర్నెల్లుగా ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. జనసేన నేతను చితకబాదించి.. అమడగూరు మండలానికి చెందిన జనసేన నాయకుడు పసుపులేటి రమేష్పై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కక్షగట్టారు. ‘పల్లె’ అవినీతికి సంబంధించిన సమాచారం మొత్తం తన వద్ద ఉందని రమేష్ చెప్పడంతో.. పల్లె భయపడిపోయినట్లు సమాచారం. అవన్నీ ఎక్కడ దాచారో చెప్పేవరకు చితకబాదాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై గతంలో పల్లె రఘునాథరెడ్డి చేసిన వ్యాఖ్యలను పసుపులేటి రమేష్ ఖండించినందుకే ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అక్కడి నుంచి రమేష్పై కక్ష సాధింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే షరతులతో కూడిన బెయిల్పై బయటికి వచ్చిన రమేష్ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అరెస్టు చూపలేదు. దీంతో అతని తండ్రి ‘నా కొడుకు ఆచూకీ తెలపండి స్వామీ, నా కొడుకు ఏమైపోయాడో అని అన్నహారాలు మాని ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆవేదన చెందుతూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాత్రికేయులకూ బెదిరింపులు.. తన అవినీతి బాగోతాలన్నీ పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చిన పాత్రికేయులపైనా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొందరు అల్లరి మూకలతో భౌతికదాడి చేయించేందుకు కూడా వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ పత్రికా ప్రతినిధిపై కక్ష గట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ‘పల్లె’ కనుసన్నల్లోనే పోలీసులు.. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అయినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె రఘునాథరెడ్డి ఆదేశాలతోనే పోలీసు వ్యవస్థ నడుస్తోందనే విమర్శలున్నాయి. ఎలాంటి హోదా లేకున్నా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పోలీసులతో సెల్యూట్ చేయించుకుంటున్నారు. ఎలాంటి కేసయినా సరే తనకు చెప్పిన తర్వాతే నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తనమాట వినని ఓ ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేయించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పుట్టపర్తిలో బీజేపీ, జనసేన నేతలను టార్గెట్ చేసిన ‘పల్లె’ ఎదురొస్తే తాట తీయిస్తానంటూ బెదిరింపులు ఇప్పటికే బీజేపీ నేత ఆదియాదవ్కు ఇబ్బందులు తాజాగా జనసేన నేత పసుపులేటి రమేశ్ అరెస్టు మాజీ మంత్రి దెబ్బకు అల్లాడిపోతున్న కూటమి నేతలు -
కేబుల్ దొంగల అరెస్టు
పావగడ: తిరుమణి సోలార్ పార్క్కు చెందిన వళ్లూరు గ్రామం అవధా సోలార్ ప్లాంట్లో కేబుల్ అపహరించిన దొంగలు పోలీసులకు చిక్కారు. రూరల్ సీఐ గిరీశ్ వివరాల మేరకు.. జనవరి 20న రాత్రి అవధా సోలార్ కంపెనీ సోలార్ ప్యానల్కు ఏర్పాటు చేసిన సుమారు రూ .2 లక్షల విలువ చేసే సుమారు 2,500 మీటర్ల డీసీ కేబుల్ వైరు చోరీకి గురైందన్నారు. దొంగతనానికి పాల్పడ్డ పావగడ పట్టణంలోని ఆఫ్ బండ ప్రాంతానికి చెందిన చోరులు మల్లేష్ అలియాస్ మల్లికార్జున, బాబు అలియాస్ బాబురావ్, మంజ అలియాస్ అణ్ణప్పలను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి డీసీ కేబుల్తో దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నాగరాజును త్వరలో పట్టుకుంటామన్నారు. -
‘సూర్యఘర్’తో విద్యుత్ బిల్లు ఆదా
పుట్టపర్తి టౌన్: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటిపై కప్పుపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లులు ఆదా అవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సాయిఆరామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం సోలార్ విద్యుత్ స్టాల్స్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లు కరెంట్ ఆదా అవుతుందన్నారు. ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకొని విద్యుత్పొదుపుతో పాటు బిల్లులు కూడా తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యుత్ శాఖ డీఈలు శివరాములు, మోసస్పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
టీబీ డ్యాంకు 6,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి 6,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండి నీటి నిల్వ 9 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ భాగం ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద డ్యాంలోకి వచ్చి చేరుతోంది. మంగళవారం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,587.07 అడుగులకు నీటి మట్టం చేరింది. అవుట్ఫ్లో 2,139 క్యూసెక్కులుగా నమోదైంది. టీచర్ల బదిలీలకు వేళాయె ● నేటి నుంచి హెచ్ఎంల బదిలీలు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్యాల స్కూళ్లల్లో మొత్తం 14,784 మంది హెచ్ఎంలు, టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 375 మంది ప్రధానోపాధ్యాయులు, 329 మంది పీఎస్హెచ్ఎంలు, 6,850 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7,230 మంది ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులున్నారు. ముందుగా బుధవారం నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు తెలిపారు. హెచ్ఎం పోస్టులు 178 ఖాలీలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్తో పాటు మునిసిపాలిటీ యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్–2 హెచ్ఎంలు ఈనెల 31 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తయ్యే వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థన బదిలీ కోరుకునేవారు (ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్లో రెండేళ్లు పూర్తయిండాలి) కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశంఅనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరుకావాలని సీఈఓ రామచంద్రారెడ్డి మంగళవారం సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు హాజరవుతారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలతో రావాలన్నారు. సమావేశానికి గైర్హాజరయ్యే అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. -
డ్రైప్రూట్స్ అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని రెండో రోజు డ్రైప్రూట్స్తో అలంకరించారు. సోమవారం వేకువజామునే ఆలయంలో మూలవిరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మంటపంలో కొలువుదీర్చి తమలపాకులతో లక్షార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. సజావుగా సప్లమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలి రోజు తెలుగు పరీక్ష సజావుగా జరిగినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు 1,554 మంది పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా 1,135 మంది హాజరయ్యారన్నారు. నకిలీ అక్రిడిటేషన్ వ్యవహారంలో వ్యక్తి అరెస్ట్ అనంతపురం: జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిటేషన్లు సృష్టించిన వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ప్రజాబలం పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే చందులాల్నాయక్, మన్నల దేవరాజు ఇద్దరూ కలిసి నకిలీ అక్రిడిటేషన్లు సిద్ధం చేసుకుని వాటిపై జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అసలు అక్రిడిటేషన్ కార్డుగా చలామణి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్బడుతున్నట్లుగా తెలుసుకున్న డీఐపీఆర్ఓ గురుస్వామిశెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు. సోమవారం మన్నల దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న చందులాల్నాయక్ కోసం గాలిస్తున్నారు. -
ఉన్నతాధికారులు వేధిస్తున్నారు
పుట్టపర్తి టౌన్: పైస్థాయి ఉద్యోగుల వేధింపులు తాళలేకపోతున్నానంటూ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కన్నీటి పర్యంతమైంది. వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ సోమవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ రత్నను కలసి విన్నవించుకుంది. వివరాలు... లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన ప్రభావతి హిందూపురంలోని ఆర్టీసీ డిపోలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో అదే డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు డి.వి.నారాయణ, భరత్కుమార్రెడ్డి, జీవీ రమణ తరచూ ఆమెను లైగింక వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. వారి కోరిక తీర్చకపోవడంతో ఉద్యోగ పరంగా ఇబ్బందులు పెట్టసాగారు. ఈ విషయంపై గతంలో హిందూపురం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. విచారణ పేరుతో కాలయాపన చేసిన పోలీసులు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల ఒత్తిళ్లకు తలొగ్గి కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. చివరకు వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తనను కాపాడాలంటూ బాధితురాలు సోమవారం ఎస్పీని కలసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే హిందూపురం డీఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి.. బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సీఐ సురేస్ పాల్గొన్నారు. న్యాయం చేయాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగి వేడుకోలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీకి వినతి -
అన్నదాతలకు వ్యథ
వ్యవసాయం భారం తలుపుల: వ్యవసాయ రంగాన్ని రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తున్నది. సేద్యంలో రైతులపై పెట్టుబడుల భారం పెరిగిపోతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా పొలం పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలన్న నీతి అయోగ్ ఆలోచన ఎనిమిదేండ్లు అవుతున్నా నేటికీ ఆచరణకు నోచుకోలేక పోతోంది. దీంతో కూలీల కొరత కారణంగా పంటల సాగు వ్యయం పెరిగి.. వ్యవసాయం భారమవుతోంది. కూలీల కొరత తీవ్రం.. కూలీలు ఎక్కువగా ఉపాధి పనులకు పోతుండడంతో వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి చేయలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 2,69,152 హెక్టార్లలో సాగు భూమి ఉండగా... వేరుశనగ, వరి, మొక్కజొన్న, మిరప,బొప్పాయి, కర్బూజా, టమాటా తదితర పంటలు సాగుచేస్తున్నారు. సాధారణగా ఖరీఫ్ సీజన్లో వరి సాగుకు ఎకరాకు రూ.25 వేలు ఖర్చు అవుతుంది. అలాగే మొక్కజొన్న, మిరప, వేరుశనగ తదితర పంటలకూ అంతే మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని రైతులు అంటున్నారు. వ్యవసాయ పనులకు వచ్చే వారికి భోజనంతో పాటు రోజుకి ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తామన్నా.. కూలీలు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం పనుల వైపే కూలీలు మొగ్గు చూపుతుండడంతో వ్యవసాయ పనులకు కొరత ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల కొరత తీరడంతో పాటు రైతులకు ఆర్థిక ప్రయోజనాలూ చేకూరుతాయని మేధావులు అంటున్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని రైతులూ కోరుతున్నారు. జిల్లా సమాచారం... జిల్లాలో సాగుభూముల విస్తీర్ణం : 2,69,152 హెక్టార్లు ప్రధానంగా సాగు చేసే పంటలు : వేరుశనగ, వరి, మామిడి, ఉలవ, టమాట తదితర పంటలు ఉపాధి కూలీల సంఖ్య : 55,857 -
వైభవంగా వసంతోత్సవం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వసంతోత్సవం నిర్వహించారు. శ్రీవారు పదోరోజు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, వసంతోత్సవం, కంకణ విసర్జన, చక్రస్నానం, మహా మంగళహారతి తదితర పూజలు చేశారు. ఉదయం ఆలయం వద్ద నుంచి లక్ష్మీబజారు వరకు వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం సాయంత్రం మయూర వాహనంపై దేవేరులతో శ్రీవారిని ప్రత్యేక రథంపై ఆశీనులు చేసి పురవీధుల్లో ఊరేగించారు. విశ్వ హిందూ పరిషత్, రజక సంఘం, హరిజన, మాల, హట్కారి కెత్తర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మయూర వాహన సేవ కొనసాగింది. చివరి రోజు మంగళవారం సప్తప్రాకారోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. -
కోల్డ్స్టోరేజ్లో కుళ్లిన బ్యాడిగ మిర్చి
కూడేరు: కర్ణాటక రాష్ట్రం బ్యాడిగికి చెందిన కోల్డ్స్టోరేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో రైతు మల్లికార్జున నష్టపోయాడు. ఇప్పేరుకు చెందిన రైతు మల్లికార్జున సోమవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఎకరాల్లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి బ్యాడిగ మిర్చి సాగు చేశానన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఏప్రిల్ నెలలో బ్యాడిగిలో కోల్డ్ స్టోరేజ్లో 60 క్వింటాళ్ల మిర్చిని నిల్వ ఉంచానన్నాడు. క్వింటా రూ.15 వేలు వరకు ధర ఉండడంతో రెండు రోజులు క్రితం కోల్డ్ స్టోరేజ్కు వెళ్లి విక్రయించేందుకు వెళ్తే నిల్వ ఉంచిన మిర్చి కుళ్లిపోయిందన్నారు. సరుకు నాణ్యతగా లేకపోవడంతో క్వింటా రూ.4 వేలుతో వ్యాపారులు అడుగుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.9 లక్షలు వరకు వచ్చేదని, కోల్డ్స్టోరేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోయానని రైతు వాపోయాడు. -
కోర్టు తీర్పును అమలు చేయండి
● మత్స్యకార సహకార సంఘం సభ్యుల వినతి పుట్టపర్తి అర్బన్: కోర్టు తీర్పును అమలు చేసి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఎస్పీని వెంగళమ్మచెరువు మత్స్యకార సహకార సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు కోర్టు తీర్పు నకళ్లను సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వేర్వేరుగా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్నను కలసి అందజేసి, మాట్లాడారు. సంఘంలో మొత్తం 41 మంది సభ్యులు ఉండగా తమ గ్రామానికి చెందిన చెరువులో చేపలు పట్టనీయకుండా టీడీపీకి చెందిన సభ్యులు అడ్డుకున్నారని, దీంతో కేవలం 25 మంది మాత్రమే చేపలను పడుతూ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఏడాది కాలంగా మత్స్యకార సహకార సంఘం అధికారులకు, పుట్టపర్తి రూరల్ పోలీసులకు విన్నవించినా తమకు న్యాయం జరగలేదన్నారు. వదిలిన చేపలను పట్టుకోనీయకుండా అడ్డుకోవడంతో మిగిలిన 16 మంది సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో చేపలు పట్టేందుకు హక్కు కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికై నా స్పందించి తమకు చేపలు పట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాల ప్రహరీ కూల్చివేత గోరంట్ల: స్థానిక ఆస్పత్రిలో సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీని టీడీపీ మద్దతుదారులు శివప్ప, బాలచందర్ ఆదివారం జేసీబీలను ఏర్పాటు చేసి కూల్చివేశారు. పాఠశాల ఎదుట శివప్ప, బాలచందర్ పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో తమ సొంత స్థలంలో ప్రహరీ నిర్మించారంటూ దాదాపు 50 మీటర్లకు పైగా గోడను నేలమట్టంచేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తహసీల్దార్ మారుతీ ప్రసాద్ను వివరణ కోరగా... పట్టా స్థలంలో కొంత మేర ఆక్రమించి పాఠశాల ప్రహరీ నిర్మించారని, దీనిని తొలగించాలని ఇటీవల కలెక్టర్కు గ్రీవెన్స్లో బాలచందర్ ఫిర్యాదు చేశారన్నారు. సర్వే చేసిన తర్వాత పాఠశాల హద్దు మేరకు నూతనంగా ప్రహరీ నిర్మించిన తర్వాత పాత గోడను తొలగించి ఇస్తామని ఫిర్యాదుదారుకు తెలిపామన్నారు. ఈ లోపు శివప్ప, బాలచందర్ ఏకంగా 50 మీటర్ల ప్రహరీని తొలగించారని, దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువకుడి బలవన్మరణం గోరంట్ల: మండలంలోని బూచేపల్లికి చెందిన చరణ్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం సొంతూరిలోనే వివాహం చేసుకున్న చరణ్... కుటుంబకలహాలతో విసుగు చెంది ఆదివారం రాత్రి పొద్దుయిన తర్వాత గ్రామంలోని నీటి ట్యాంక్ సమీపంలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, చరణ్ గతంలో వలంటీర్గా బూచేపల్లి గ్రామంలో పనిచేశారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రైలు కిందపడి వృద్ధురాలు.. హిందూపురం: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆంజినమ్మ(69) సోమవారం సాయంత్రం ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు రైల్వే ఎస్ఐ సజ్జప్ప తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ లభ్యం ధర్మవరం అర్బన్: స్థానిక లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలోని కురుబ కల్యాణమంటపం వెనుక ఉన్న పట్టాలపై ఆదివారం రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడిని ధర్మవరంలోని సిద్దయ్యగుట్టకు చెందిన శ్రీనివాసులు (63)గా గుర్తించినట్లు జీఆర్పీ హెచ్సీ ఎర్రిస్వామి సోమవారం వెల్లడించారు. బార్బర్ వృత్తితో జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా తరచూ అనారోగ్యం వెన్నాడుతుండడంతో జీవితంపై విరక్తితో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయిందన్నారు. మృతుడి భార్య అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో చోటు పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి పార్టీ అనుబంధ విభాగాల్లో చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రెటరీగా కదిరి నియోజకవర్గానికి చెందిన పూల ప్రవీణ్కుమార్రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ సెక్రెటరీగా హిందూపురం నియోజక వర్గానికి చెందిన అక్కంపల్లి నాగేంద్రకుమార్ను నియమించారు. పాఠశాలపై కూలిన చెట్టు సోమందేపల్లి: మండలంలోని వెలిదడకల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలపై చెట్టు కూలింది. ఆదివారం రాత్రి భారీ వర్షంతో పాటు గాలులు బలంగా వీచడంతో చెట్టు ఒక్కసారిగా విరిగిపడింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు పడడంతో పాఠశాల భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
ముందస్తు మురిపెమేనా?
పుట్టపర్తి అర్బన్: ముందస్తు ‘నైరుతి’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా చెరువుల్లో నీరు చేరింది. అయితే ఇప్పటికే ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులను వర్షాలు ఊరిస్తుండగా...సాగుకు ముందుకు సాగలేకపోతున్నారు. కీలకమైన సమయంలో వరుణుడు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటన్న సందిగ్ధంలో మునిగిపోయారు. గత ఏడాదీ మురిపించి... ఆపై ముంచేసి జూన్ సాధారణ జిల్లా వర్షపాతం 66 మి.మీ కాగా, గత ఏడాది ఏకంగా 100 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో విత్తనాలు వేశారు. అయితే ఆ తర్వాత దాదాపు 52 రోజులు చుక్కవర్షం లేదు. దీంతో విత్తనం మొలకెత్తలేదు. రైతులు అప్పులు చేసిన పెట్టిన పెట్టుబడులు నేలపాలయ్యాయి. తాజా వర్షాలు ఊరిస్తున్నా... ఖరీఫ్లో పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు మంచి అదనుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సారి ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాస్తవానికి మే నెలలో జిల్లా సాధారణ వర్షపాతం 42.2 మి.మీ వర్షపాతం కాగా, ఇప్పటివరకూ 94 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షసూచన చెబుతున్నారు. అలాగే కీలకమైన నైరుతీ రుతుపవనాలు ఈ సారి ముందస్తుగానే అంటే ఈనెల 27న కేరళను తాకుతాయని వారం కిందటే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. అలాగే రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఉన్నందు ఇంకా ముందుగానే అంటే 24న కేరళను తాకవచ్చని తాజాగా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ నెలాఖరుకు జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. తాజా వర్షాలతో రైతులు సాగుకు సిద్ధంగా ఉన్నా...గత ఏడాది పరిస్థితి గుర్తు తెచ్చుకుని సందిగ్ధంలో పడిపోయారు. ఇక ఈ వర్షాలకే విత్తు వేసేందుకు కొందరు రైతులు ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం నేటికీ విత్తన పంపిణీపై దృష్టి సారించలేదు. పోనీ మార్కెట్లో విత్తనం కొని వేద్దామంటే ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటని రైతుల మనసులను తొలుస్తోంది. 29 మండలాల పరిధిలో వర్షం.. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిలాల్లోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా గుడిబండల మండలంలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. తనకల్లు 50.6, నల్లచెరువు 45.4, తలుపుల 28.2, నల్లమాడ 19.8, మడకశిర 19.6, రొళ్ల 18.2, అమడగూరు 17.6, అమరాపురం 15.6, ముదిగుబ్బ 14.6, అగళి 14.4, గాండ్లపెంట 13, గోరంట్ల 12.2, రొద్దం 10.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లోనూ 10.6 మి.మీ నుంచి 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. రానున్న రెండు రోజులూ ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఇప్పటికే అధికారులు జిల్లాలో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు వర్షాలు సందిగ్ధంలో పడిన రైతులు అదనులో వరుణుడు ముఖం చాటేస్తాడేమోనని ఆందోళన నేటికీ విత్తన పంపిణీ చేపట్టని కూటమి సర్కార్ -
పోలీసుల అత్యుత్సాహం..
సాక్షి, పుట్టపర్తి/గాండ్లపెంట/కదిరి టౌన్: అధికార మదంతో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేశారు. మండల పరిషత్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి తమ పార్టీ తరఫున ఒక్క ఎంపీటీసీ ఉన్నప్పటికీ బరిలో నిలిచి.. ప్రత్యర్థి పార్టీలోని సభ్యులను బెదిరించి ఓట్లు వేయించుకుని పీఠం కైవసం చేసుకున్నారు. ప్రలోభాలు, డబ్బులు, పదవులు ఆఫర్ చేసి.. వినకుంటే బెదిరించి తమ వైపు తిరిగేలా చేశారు. అక్రమ కేసులు, దాడుల భయం చూపి పార్టీ ఫిరాయించేలా చేసి.. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులను దక్కించుకున్నారు. అధికార మదంతో అధికారులను అడ్డు పెట్టుకుని మెజారిటీ లేకున్నా.. గెలిచినట్లు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి పరోక్షంగా.. ప్రత్యక్షంగా సహకరిస్తూ వంతపాడారు. రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ గూండాలు మీడియా ప్రతినిధులను సైతం అడ్డుకుని వెనక్కుపంపారు. పైగా.. నిబంధనలను తుంగలో తొక్కి పోలీసులు రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లడం విమర్శలకు దారి తీస్తోంది. ఒక్క సీటుతో చక్రం.. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలుండగా, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఆరు స్థానాలు దక్కించుకోగా, టీడీపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ నాయకులు ఎంపీపీ పీఠంపై కన్నేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు. దీంతో ముగ్గురు టీడీపీ కండువా కప్పుకున్నారు. సోమవారం జరిగిన ఎన్నికను ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు (వైఎస్సార్ సీపీ) బహిష్కరించారు. మిగతా నలుగురు ఎంపీటీసీలు హాజరయ్యారు. టీడీపీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎంపీటీసీ సభ్యుడు (సోమయాజులపల్లి) జయరామిరెడ్డి ఎంపీపీగా సోమశేఖరరెడ్డి పేరును ప్రతిపాదించగా, మలమీదపల్లి ఎంపీటీసీ సభ్యురాలు భారతి బలపరిచారు. దీంతో ఎంపీపీగా సోమశేఖరరెడ్డి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కాగా, ఎంపీపీ పదవి ఆఫర్ చేసి ముగ్గురు ఎంపీటీసీలను లాక్కున్న టీడీపీ నేతలు...అందులో కేవలం ఒకరికి మాత్రమే పదవి కట్టబెట్టి.. మిగతా ఇద్దరికీ మొండిచెయ్యి చూపారు. ఫిరాయింపు ఓట్లతో మున్సిపాలిటీ కై వసం.. కదిరి మున్సిపాలిటీలో 36 వార్డులుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 30 స్థానాల్లో విజయఢంకా మోగించింది. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకోగా, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో చైర్మన్గా నజీమున్నీసా, వైస్ చైర్మన్లుగా కొమ్ముగంగాదేవి, రాజశేఖర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరగానే టీడీపీ నాయకులు మున్సిపల్ పీఠంపై కన్నేశారు. కేవలం ఐదుగురు సభ్యులతో చైర్మన్ గిరీ కోసం నిసిగ్గురాజకీయానికి తెరతీశారు. బరితెగించి...భయపెట్టి పలువురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకుని పచ్చకండువా వేశారు. అవిశ్వాస తీర్మానం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లను దించేశారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించగా... మున్సిపల్ చైర్పర్సన్గా టీడీపీకి చెందిన దిల్షా దున్నీషా, వైస్ చైర్మన్లుగా 21వార్డు కౌన్సిలర్ సేగు సుధారాణి, 19 వార్డు కౌన్సిలర్ మద్దేపల్లి రాజశేఖర ఆచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో ఆర్డీఓ వీవీఎస్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఈ అప్రజాస్వామ్య ఎన్నికను నిరసిస్తూ వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు బహిష్కరించారు. రామగిరిలో అభ్యర్థి లేకున్నా.. రామగిరి మండలంలో మొత్తం 10 స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. అందులో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఎంపీపీగా పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకున్నా.. ప్రలోభాలతో పదవి దక్కించుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత భావించారు. అయితే కోరం లేక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక సోమవారం మళ్లీ నిర్వహించారు. రిజర్వేషన్ ప్రకారం ఎంపీపీ స్థానం మహిళకు కేటాయించడం... టీడీపీ తరఫున మహిళలెవరూ విజయం సాధించకపోవడంతో టీడీపీ డైలమాలో పడింది. వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీటీసీలను భయపెట్టి, పదవులు, డబ్బులు ఆఫర్ చేసి ఎంపీపీ సీటు కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు ఏ ఒక్కరూ ఎన్నికకు రాలేదు. దీంతో అభ్యర్థి లేరని.. ఎన్నికను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు అధికారి సంజీవయ్య ప్రకటించారు. రామగిరి వైస్ సర్పంచ్పై రౌడీషీటర్ దాడి.. ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో రామగిరికి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ బోయ రామాంజినేయులపై రౌడీషీటర్ శివకుమార్ తన అనుచరులతో కలసి సోమవారం దాడి చేశాడు. టీ తాగేందుకని ఓ హోటల్కు వెళ్లగా సమీపంలో ఉన్న 30 మంది టీడీపీ శ్రేణులు ఒక్క సారిగా శివకుమార్ ఆధ్వర్యంలో రామంజినేయులును చుట్టముట్టారు. ‘‘ఇక్కడ నీకేం పని’’ అని ప్రశ్నిస్తూ పిడిగుద్దుల వర్షం కురిపించారు. అయినా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక జరిగే సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారు. ఎంపీటీసీ సభ్యులతోపాటు ఎన్నికల అధికారులు, మీడియా సిబ్బందికి మాత్రమే హాలులోకి అనుమతి ఉంది. పోలీసులు సైతం ఎన్నిక గది బయటే విధులు నిర్వర్తించాలి. అయితే ఎన్నికల నియమావళిని అధికారులు తుంగలోతొక్కి ఏకంగా ఎన్నిక జరిగే గదిలోకి ప్రవేశించి వీడియోలు తీయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాక వివాదాస్పద రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పదే పదే పోలీసులకు సలహాలు, సూచనలిస్తూ హడావుడి చేయడం గమనార్హం. అయినా ఎన్నికల అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. గాండ్లపెంట ఎంపీపీ గజ్జల సోమశేఖరరెడ్డి కదిరి మున్సిపల్ చైర్పర్సన్ దిల్షాదున్నీషా మండల పరిషత్ ఎన్నికల్లో నిబంధనలకు తూట్లు బలం లేకున్నా గాండ్లపెంట ఎంపీపీ టీడీపీ కై వసం కదిరి మున్సిపాలిటీలోనూ ఫిరాయింపు రాజకీయం సీట్లు లేకున్నా.. బెదిరింపులతో పదవులు దక్కించుకున్న టీడీపీ రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసుల అత్యుత్సాహం మహిళా అభ్యర్థి లేకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా -
జంట హత్యల కేసులో ఆరుగురి అరెస్టు
రాప్తాడు: రైతు దంపతుల హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాప్తాడు పీఎస్లో సోమవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు వెల్లడించారు. ఈ నెల 17న రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేటకొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. భూ వివాదమే కారణం.. గంగలకుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 78–3లో 6.20 ఎకరాల భూమిని ఎకరాకు రూ.56.50 లక్షల చొప్పున కొనుగోలు చేసేలా రాప్తాడుకు చెందిన నీరుగంటి పుల్లమ్మ, అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరుకు చెందిన నాగలక్ష్మమ్మ, బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన వెంకటలక్ష్మికి రూ.79 లక్షలు చెల్లించి రాప్తాడుకు చెందిన పామల్ల ధనుంజయ, పామల్ల కొండప్ప, పామల్ల ఇంద్రశేఖర్, గోనిపట్ల శీన, పామల్ల పండయ్య, గొల్లపల్లి జగదీష్, లక్ష్మీనారాయణ, నంద కుమార్, బుల్లే నగేష్ 2024 సెప్టెంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. హతుడు చిగిచెర్ల నారాయణ రెడ్డి తండ్రి చిగిచెర్ల నారాయణరెడ్డి నుంచి 1997లో ఎకరా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.93 వేలతో కొనుగోలు అగ్రిమెంట్ను పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మమ్మ రాయించుకున్నారు. అయితే చిగిచెర్ల నారాయణరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించకుండా ఉండడంతో ముగ్గురు మహిళలు కోర్టులో దావా వేశారు. 2012లో కోర్టులో ముగ్గురు మహిళల పక్షాన డిక్రీ చేస్తూ వాళ్ల పేరుపై కోర్టు రిజిస్ట్రేషన్ చేయిం చింది. అనంతరం ఇదే భూమిని చిగిచెర్ల నారాయణ రెడ్డి తన బావ ఓబిరెడ్డి ద్వారా అతని భార్య నారాయణమ్మకు చెందుతుందని కోర్టులో దావా వేయించాడు. ఈ వివాదంపై 2022లో ముగ్గురు మహిళలకు భూమి చెందుతుందని కోర్టు తీర్పు వెలువరించగా.. దీన్ని సవాల్ చేస్తూ నారాయణ రెడ్డి అదే ఏడాది ఫ్యామిలీ కోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. ప్రస్తుతం ఆ భూమిలో నారాయణరెడ్డి దానిమ్మ చెట్లు సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో భూమిని తమ పేరుపై మ్యుటేషన్ చేయాలని ముగ్గురు మహిళలు ఈ ఏడాది హైకోర్టులో పిల్ వేయగా.. సరైన నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్డీఓకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివాదం కొలిక్కి రాకనే.... వివాదం కొలిక్కి రాకనే ముగ్గురు మహిళల నుంచి భూమిని కొనుగోలు చేసిన వారు నెల రోజుల క్రితం మళ్లీ సదరు మహిళలకు రూ.1.01 కోట్లు చెల్లించారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఓ సిఫారసుల మేరకు సదరు భూమిని ఆన్లైన్లో నారాయణరెడ్డి పేరు తొలగించి ముగ్గురు మహిళల పేరు ఎక్కించాలని గత నెల 29న డీఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ నారాయణరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే డీఆర్ఓ ఆదేశాల మేరకు గత నెల 14న నీరుగంటి పుల్లమ్మ పేరును రాప్తాడు తహసీల్దార్ ఆన్లైన్లో ఎక్కించారు. 16న పామల్ల ధనుంజయ, పామల్ల కొండప్ప, గోనిపట్ల శీన, పామల్ల పండయ్య, హనుమంతరెడ్డి, బాల నరసింహరెడ్డి, నిరంజన్రెడ్డి, పుల్లమ్మ, నాగలక్ష్మమ్మ, దండు నరేంద్ర, గొల్లపల్లి జగదీష్, గంగలకుంట లక్ష్మీనారాయణ, బుల్లె నగేష్ సదరు పొలం దగ్గరికి వెళ్లి నారాయణరెడ్డి, ఆయన భార్య ముత్యాలమ్మను భూమిలోకి కాలు పెడితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ నెల 17న ఉదయం 9.30 గంటలకు జేసీబీతో పొలంలో దానిమ్మ చెట్లను తొలగిస్తుండగా నారాయణరెడ్డి, ముత్యాలమ్మ, వారి కుమారుడు ప్రదీప్కుమార్ రెడ్డి, బావమరిది ప్రతాప్రెడ్డి, శంకర్రెడ్డి, వెంగల్రెడ్డి తదితరులు అక్కడకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న వేటకొడవళ్లు, కట్టెలతో ముత్యాలమ్మ, నారాయణరెడ్డిపై విచక్షణారహితంగా దాడికి తెగబడడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రతాప్రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారం గంగలకుంట క్రాస్ వద్ద పామల్ల ధనుంజయ, ఇంద్రశేఖర్, నిరంజన్రెడ్డి, దండు నరేంద్ర, బుడగ లక్ష్మీనారాయణ, కందుకూరుకు చెందిన దయ్యం హనుమంతరెడ్డిని అరెస్ట్ చేశారు. వివరాలు వెల్లడించిన రూరల్ డీఎస్పీ వెంకటేశులు -
ఎద్దుల పోటీలు ప్రారంభం
ముదిగుబ్బ: మండల పరిధిలోని నాగారెడ్డిపల్లిలో శనివారం శ్రీరాముల ఉత్సవాల్లో భాగంగా ఎద్దుల పోటీలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. కాసేపు అక్కడే ఉండి పోటీలను తిలకించారు. ఆ తర్వాత ముదిగుబ్బ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక స్వాలంభన కోసం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముదిగుబ్బ మండలానికి 500 కుట్టు మిషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. హైపర్ టెన్షన్తో జాగ్రత్త పుట్టపర్తి అర్బన్: హైపర్ టెన్షన్తో ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం వరల్డ్ హైపర్ టెన్షన్ డేని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడులు, నిద్రలేమి, జంక్ ఫుడ్, జన్యుపరమైన కారణాలతో జీవన విధానంలో మార్పులు వచ్చాయన్నారు. హైబీపీతో ఒక్కోసారి రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉందన్నారు. వైద్యారోగ్యశాఖ 2023లో నిర్వహించిన సర్వేలో జిల్లాలో 64,471 మంది బీపీ బారిన పడినట్లు తేలిందన్నారు. అదే 2024లో స్క్రీనింగ్ చేయగా 1.05 లక్షల మంది ఉన్నట్లు నిర్ధారించారన్నారు. నిద్రలేమి, అధిక ఉప్పు, శారీరక శ్రమ లేకున్నా, ఊబకాయ సమస్యలతో బీపీ వస్తోందన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. యర్రగుంటపల్లిలో చోరీ నల్లచెరువు: మండల పరిధిలోని యర్రగుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితుల వివరాలమేరకు.. యర్రగుంటపల్లికి చెందిన వెంకట మల్లయ్య దంపతులు శుక్రవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి నిద్రపోయేందుకు ఇంటిపైకి వెళ్లారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా ఇంట్లోని బీరువాను సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లి పగలగొట్టి అందులోని రూ.1. 30 లక్షల నగదు, తులం బంగారు అపహరించారు. ఉదయం ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ మక్బూల్ బాషా పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దవడుగూరు: మండల పరిధిలోని రావులుడికి గ్రామంలో రైతు శివశంకర్రెడ్డి (56) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. శివశంకర్రెడ్డి ఉదయాన్నే రైతులు పుల్లారెడ్డి, ప్రతాప్రెడ్డి లతో కలిసి తోట వద్దకు వెళ్లారు. మృతుడు తన పొలం వద్దకు వెళ్లాడు. నీటి తొట్టెలో నీళ్లు లేకపోవడంతో మోటర్ వద్దకు వెళ్లాడు. కరెంటు లేకపోవడంతో సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఫీజు కట్ అయి ఉండటంతో ఫీజు వేసేందుకు యత్నించగా విద్యుదాఘాతంతో అక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జమెదారు అన్వర్బాషా తెలిపారు. -
జిల్లాలో ఐదు పారిశ్రామిక హబ్లు
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ఐదు పారిశ్రామిక హబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ‘జిల్లాలో పరిశ్రమల స్థాపన... భూసేకరణ’ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు 35 వేల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీలైనంత త్వరగా భూసేకరణ జరపాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 5 బ్లాక్లను గుర్తించాలని, ఆయా మండలాల్లో ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో వాటిని త్వరితగతిన ఏపీఐఐసీకి అప్పగించాలన్నారు. హిందూపురం–లేపాక్షి, చిలమత్తూరు–గోరంట్ల పారిశ్రామిక హబ్లతో పాటు మడకశిర హబ్, పెనుకొండ–కియా హబ్, పుట్టపర్తి హబ్లు అబివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారి నుంచి 2 కిలోమీటర్లు దూరంలో పంటలు సాగుచేయని 10 నుంచి 15 వేల ఎకరాల డీ పట్టా భూములున్నాయని, వాటిని గుర్తించి పరిశ్రమల స్థాపనకు భూసేకరించాలన్నారు. రామగిరి, కనగానపల్లి మండలాల్లో సోలార్ పార్కుల కోసం భుమిని గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్కుమార్, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. పరిశుభ్రత జీవితంలో భాగం కావాలికొత్తచెరువు: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కలెక్టర్ చేతన్ సూచించారు. శనివారం కొత్తచెరువులో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. బస్టాండులో చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీట్ ద హీట్’ పేరుతో నెల రోజుల పాటు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం -
కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్టులు
● మాజీ మంత్రి శంకర నారాయణ సాక్షి, పుట్టపర్తి: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ ఒక ప్రకటనలో విమర్శించారు. అక్రమ మద్యం కేసులో సాక్ష్యాలు లేకున్న తప్పుడు వాంగ్మూలాలను అడ్డు పెట్టుకొని విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్లను వేధిస్తున్నారన్నారు. వైఎస్సార్సీసీ హయాంలో మద్యం కల్తీ జరిగితే, నేడు కూటమి ప్రభుత్వం అవే డిస్టిలరీల నుంచి మద్యం ఎందుకు కోనుగోలు చేస్తోందో చెప్పాలన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే రిటైర్డ్ అధికారులు, సీనియర్ సిటిజన్లను వేధిస్తోందన్నారు. ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకొని సస్పెన్షన్ వేటు కూడా వేశారన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే అక్రమ అరెస్ట్లు చేస్తున్నారన్నారు. -
టీడీపీ కార్యకర్త దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం నరసనాయనికుంట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బి.ముత్యాలప్పపై ఆయన బంధువు, టీడీపీ కార్యకర్త తిరుపాలు కట్టెతో దాడి చేయడంతో కాలు విరిగింది. బాధితుడు సర్వజన ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. ఈనెల 13న జరిగిన దాడి ఘటనకు సంబంధించి బాధితుడు ముత్యాలప్ప, ఆయన కుటుంబ సభ్యుల వివరాల మేరకు... ముత్యాలప్పకు ఇద్దరు సోదరులున్నారు. వీరి ముగ్గురికి కలిపి 12 ఎకరాల భూమి ఉంది. ఎవరికి వారు భాగపరిష్కారాలు చేసుకున్నారు. పెద్దవాడు అయిన ముత్యాలప్ప తన భాగానికి వచ్చిన ఆస్తిని విక్రయానికి పెట్టాడు. ఇటీవల ముత్యాలప్ప సోదరుడి అల్లుడు, టీడీపీ కార్యకర్త తిరుపాలు కలగజేసుకుని మధ్యవర్తిగా ఉంటూ కొనుగోలుదారుడిని పిలిపించాడు. ముత్యాలప్ప చెప్పిన ధరకంటే చాలా తక్కువకు అడగడంతో అమ్మేందుకు ముత్యాలప్ప, ఆయన కుమారులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి తిరుపాలు కోపంతో రగలిపోతున్నాడు. ఈనెల 13న రాత్రి 7 గంటల సమయంలో ముత్యాలప్ప కుమారుడు, ఆయన తమ్ముడి కుమారుడు కలిసి భూమి అమ్మకం విషయమై మాట్లాడుకుంటుండగా... అక్కడికి వచ్చిన తిరుపాలు కట్టెతో దాడి చేశాడు. ఈ దాడిలో ముత్యాలప్ప కుడి కాలు విరిగి తీవ్రగాయమైంది. 108 సకాలంలో రాకపోవడంతో అందుబాటులో ఉన్న ఆటోను పిలవగా... వెళ్లకూడదంటూ ఆటో డ్రైవర్ను తిరుపాలు బెదిరించాడు. అప్పటికే సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆటోలో పంపేలా చర్యలు తీసుకున్నారు. సర్వజన ఆస్పత్రిలో ముత్యాలప్ప చికిత్స పొందుతున్నాడు. దాడి ఘటనపై రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. -
కిచెన్, రూఫ్ గార్డెన్తో లాభాలు
పుట్టపర్తి అర్బన్: స్వంతంగా తయారు చేసుకునే కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్తో ఎన్నో లాభాలు ఉన్నాయని జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఎనుములపల్లిలో కిచెన్ గార్డెలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, పండ్ల మొక్కలు వేసుకోవడంతో ఇంటికి సరిపడా కూరగాయలు పండ్లు అందుబాటులో ఉంటాయన్నారు. దీంతో మార్కెట్ ధరలు సాధారణ స్థితికి వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెలను తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యాన అధికారి నవీన్కుమార్, సహాయకులు వేమారెడ్డి , రామాంజనేయులు, రామకృష్ణ తదితరులు ఉన్నారు. ‘కియా’లో సినిమా షూటింగ్ పెనుకొండ రూరల్: వరుణ్ తేజ్ హీరోగా నూతనంగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్లోని పలు సన్నివేశాలను కియా పరిశ్రమలోని ఆవరణలో శనివారం చిత్రీకరించారు. పరిశ్రమలోనే మరో రెండు రోజుల పాటు సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
తిరంగా.. మదినిండా
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి భావం ఉప్పొంగింది. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదం మార్మోగింది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం చేసిన సైనికులకు మద్దతుగా శనివారం పుట్టపర్తిలో నిర్వహించిన తిరంగా యాత్ర ఆధ్యంతం దేశభక్తిని చాటింది. కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరంగా యాత్ర ర్యాలీ పట్టణంలో హనుమాన్ కూడలి నుంచి విద్యాగిరి ఆర్చ్ వరకూ సాగింది. ర్యాలీలో పాల్గొన్న యువత, విద్యార్థులు, పట్టణ ప్రజలు ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’, ‘మరళీనాయక్ అమర్ రహే’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏక తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. మనమంతా సురక్షితంగా ఉండేందుకు ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు అందరం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో మన సైనికుల పోరాటం మరువలేనిదన్నారు. దేశ భద్రత విషయంలో భారత్ రాజీ పడబోదన్న సందేశాన్ని మన సైనికులు ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. సైనికులకు మనమంతా నిలుద్దామని పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో ఘనంగా తిరంగా ర్యాలీ సైనికులకు అండగా నిలుద్దామని కలెక్టర్, ఎస్పీ పిలుపు -
ఈదురు గాలులతో భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్/తాడిమర్రి: ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే పలకిరించిన వరుణుడు ముందస్తుగా మురిపిస్తున్నాడు. శనివారం రాత్రి కూడా జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జిల్లా కేంద్రం పుట్టపర్తిలో భారీ వర్షం కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. ఇక శుక్రవారం రాత్రి జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా సోమందేపల్లి మండలంలో 29.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక పెనుకొండ మండలంలో 26 మి.మీ, బత్తలపల్లి 24.4, ముదిగుబ్బ 22.4, సీకే పల్లి 16.6, తాడిమర్రి 6.2, గాండ్లపెంట 2, ఎన్పీ కుంట 1.6, ధర్మవరం 1.2, పరిగి మండలంలో ఒక మి.మీ చొప్పున వర్షం కురిసింది. రాగల రెండు రోజులూ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తాడిమర్రి మండలంలో కురిసిన వర్షానికి గుడ్డంపల్లి గ్రామంలో కోడిమూర్తి ఓబుళపతికి చెందిన అరటితోటలో తీవ్రంగా దెబ్బతినింది. కాపునకు వచ్చిన 4,000 అరటిచెట్లు నేలకు ఒరిగాయి. దీంతో రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సోమందేపల్లిలో 29.2 మి.మీ వర్షపాతం నమోదు తాడిమర్రిలో నేలకొరిగిన అరటిచెట్లు -
మంత్రి సవిత వల్లే ‘ప్రీకాట్’ మూత
పరిగి: నాలుగు దశాబ్దాలకుపైగా వేలాది మంది కార్మికులు, కూలీలకు ఉపాధి కల్పించిన కొడిగెనహళ్లి ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లు మూత పడటానికి మంత్రి సవిత వైఖరే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆరోపించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీల రాయితీ ఇవ్వకపోవడంతో మిల్లు పడింది. ప్రభుత్వ వైఖరిని, మంత్రి సవిత నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ శనివారం ఉషశ్రీచరణ్ ప్రీకాట్ మిల్లు గేటు వద్ద కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లతో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ, నూతన పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పిన కూటమి పార్టీల నేతలు ఇప్పుడు ఉన్న కంపెనీలను మూసివేస్తూ ఉపాధిని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా సవిత బాధ్యతలను స్వీకరించిన తరువాత నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ స్థాపనకు కృషి చేయాలేదన్నారు. వేలాది కుటుంబాలను పోషించిన మిల్లు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లు వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ అండగా నిలిచిందని ఉషశ్రీచరణ్ తెలిపారు. అలాంటి మిల్లుకు కూటమి ప్రభుత్వం విద్యుత్ రాయితీ ఇవ్వకపోవడంతో యాజమాన్యం మూసివేసిందన్నారు. దీంతో మిల్లు కార్మికుల కుటుంబాలు నేడు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇందుకు కూటమి సర్కార్ వైఖరితో పాటు మంత్రి సవిత చేతకాని తనమే కారణమన్నారు. ఇప్పటికై నా మంత్రి సవిత ప్రత్యేక చొరవ చూపి ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లును తెరిపించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల, కర్షకుల ఉసురు ఊరికేపోదని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున మిల్లు కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఉసురు కూటమి పెద్దలకు తగులుతుంది మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మిల్లు గేటు ఎదుట కార్మికులు, పార్టీ నేతలతో కలిసి ఆందోళన -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
● ఆర్పీఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ ఠాగూర్ ధర్మవరం అర్బన్: రైల్వే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్పీఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ ఠాగూర్ తెలిపారు. శనివారం ఆమె స్థానిక రైల్వేస్టేషన్లోని ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆర్పీఎఫ్ పరిధిలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పూర్తి చేసిన కేసుల వివరాలను ఆర్పీఎఫ్ సీఐ నాగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్పీఎఫ్ మహిళా సిబ్బందికి ఏర్పాటు చేసిన భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఆర్పీఎఫ్ విభాగంలో పనిచేసే మహిళలకు మరింత భద్రతను కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గుంతకల్లు డివిజన్ కమిషనర్ మురళీకృష్ణ, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ అనిల్కుమార్సింగ్, రేణిగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాల్రెడ్డి, ఆర్పీఎఫ్ ఎస్ఐ రోహిత్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. కోర్టు రికార్డులు సక్రమంగా భద్రపర్చాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు హిందూపురం: వివిధ కేసులకు సంబంధించి కోర్టు రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు సూచించారు. కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఇటీవలే పాత న్యాయస్థాన సముదాయంలోని కోర్టులను పశుసంవర్ధక కార్యాలయ భవనంలోకి మార్పు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా జడ్జి భీమారావు, అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజతో కలిసి నూతన కోర్టు భవన సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంలోనే జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటాన్ని చూసి జిల్లా జడ్జి విస్మయం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణలో అశ్రద్ధ పనికిరాదన్నారు. అనంతరం అదనపు జిల్లా జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి పలు న్యాయస్థానాలు, న్యాయమూర్తుల గదులను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితా లక్ష్మిహారిక, ప్రత్యేక మెజిస్ట్రేట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. భయపెట్టి.. పోలీసులతో బెదిరించి ● పింఛన్ కోసం లంచంలో మరో ట్విస్ట్ ● మహిళను బెదిరించి మరో వీడియో చేయించిన వైనం చిలమత్తూరు: పింఛన్ మంజూరు కోసం ఓ మహిళ నుంచి ఏకంగా రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన ఘటన వైరల్ కావడంతో టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. వీడియోలో మాట్లాడిన మహిళను టీడీపీ నేతలు భయపెట్టడంతో పాటు పోలీసులతోనే బెదిరించి మరో వీడియో రూపొందించి సోషల్ మీడియాలో ఉంచారు. తీవ్ర చర్చనీయాంశమైన సాక్షి కథనం.. పింఛన్ కోసం లంచం అడిగారని, అంత డబ్బు తనవద్ద లేక చెవిదుద్దులు తాకట్టు పెట్టేందుకు వచ్చానంటూ హిందూపురం 12 వార్డుకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్కాగా, దీనిపై శనివారం ‘సాక్షి’లో ‘పింఛన్ కోసం లంచం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కూటమి పాలనకు అద్దం పడుతున్న ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు రంగంలోకి దిగారు. మరోవైపు ఉదయం నుంచే పోలీసులు, టీడీపీ ప్రజాప్రతినిధులు సదరు మహిళను నేరుగా, ఫోన్ల ద్వారా సంప్రదించి బెదరగొట్టేశారు. ఇక రెండో పట్టణ సీఐ కూడా ఆమెను భయపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బలవంతంగా ఆమెతో మరో వీడియో చేయించారు. అందులో తనను ఎవరూ లంచం అడగలేదని చెప్పించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ నేతలు... ఇలా ఓ మహిళను భయపెట్టి తమకు అనుకూలంగా వీడియో చేయించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. -
జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
నమో నారసింహపెన్నోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.టన్ను చీనీ రూ.37 వేలు అనంతపురం మార్కెట్యార్డులో శనివారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.37 వేలు, కనిష్టంగా రూ.5 వేల ప్రకారం ధర పలికాయి. ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025● సందడిగా జేఎన్టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవం ● చాన్స్లర్ హోదాలో హాజరైన గవర్నర్ జస్టిస్ నజీర్ ● డాక్టర్ చావా సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం ● విద్యార్థులకు బంగారు పతకాల బహూకరణ అనంతపురం: జేఎన్టీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి చాన్స్లర్ హోదాలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ చావా సత్యనారాయణ, వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు, ముఖ్య అతిథి, కాన్పూర్ ఐఐటీ ఎమిరటర్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఆర్. మాధవ్, పాలకమండలి సభ్యులు, డీన్లు వేదికపై ఆశీనులయ్యారు. చాన్స్లర్ హోదాలో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతమూ విద్యార్థులు చప్పట్లతో హోరెత్తించారు. ప్రసంగం ప్రారంభంలో ‘జేఎన్టీయూ విద్యార్థులు బంగారు బిడ్డలు’ అంటూ గవర్నర్ అనడం ఆకట్టుకుంది. డాక్టర్ చావా సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం ద్వారా వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సందడే.. సందడి స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని పీజీ, పీహెచ్డీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. మొత్తం 41 బంగారు పతకాలు ఇవ్వగా, 27 బంగారు పతకాలు అమ్మాయిలే సాధించడం గమనార్హం. ఈ సందర్భంగా విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘బంగారు’ క్షణాలను సెల్ఫీలు తీసుకుని పదిలపరచుకున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులతో వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. పతకాలు పొందిన బిడ్డలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. దక్షిణాదిలోనే ఘనత.. జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వర్సిటీ సాధించిన ప్రగతిని వివరించారు. ఏకంగా 90 వేల మంది వర్సిటీ విద్యార్థులు నైపుణ్య కోర్సులను పూర్తి చేశారని, దక్షిణ భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి వర్సిటీగా జేఎన్టీయూ ఖ్యాతి దక్కించుకుందన్నారు. ‘ద టైమ్స్ ఇండియా వరల్డ్ ర్యాంకింగ్’లో 801–1,000 ర్యాంకు దక్కించుకుందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో మైనర్ డిగ్రీని ప్రవేశపెట్టామని,అపార్ అనుసంధానంతో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ను ఏర్పాటు చేశామన్నారు. రూ.22 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. గేట్– 2024లో జాతీయ స్థాయిలో 25 ర్యాంకులు వచ్చాయని, జాతీయ స్థాయిలో పి. హేమంత్ రెడ్డి ఏడో ర్యాంకు,కే. జ్ఞానేశ్వర రెడ్డి 144వ ర్యాంకు సాధించి వర్సిటీ కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. మొత్తం 33 పేటెంట్లు, 354 జర్నల్స్, 72 పుస్తకాలు, 1,500 పేపర్లు పబ్లిష్ చేసినట్లు పేర్కొన్నారు. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’లో వర్సిటీ భాగస్వామి కావడం గర్వకారణమన్నారు. గవర్నర్ ప్రశఽంస.. స్నాతకోత్సవ నిర్వహణపై గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణతో ఉన్నారంటూ ప్రశంసలు గుప్పించారు. ఇంతటి చక్కటి వాతావరణంలో సాగిన కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ చూడలేదంటూ కితాబిచ్చారు. విజయవంతం.. స్నాతకోత్సవం నిర్దేశించిన సమయానికి ప్రారంభమైంది. ఎలాంటి చిన్న తప్పిదం లేకుండా విజయవంతంగా ముగిసింది. బంగారు పతకాలు దక్కించుకున్న విద్యార్థులతో గవర్నర్ సరదాగా ముచ్చటించారు. ఆరు పతకాలు దక్కించుకున్న విద్యార్థి నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డిని ఉద్దే శించి.. బంగారు పతకాలు చాలా బరువుగా ఉన్నాయంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. న్యూస్రీల్లక్ష్యం వైపు దృష్టి నిలిపారు. ఆత్మవిశ్వాసం, కృషితో ‘బంగారు’ కలను నెరవేర్చుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా పతకాలనందుకుని కేరింతలు కొట్టారు. తల్లిదండ్రులకు సంతోషం పంచారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అతిథుల స్ఫూర్తివంతమైన మాటలను విని ఉప్పొంగారు. రాయలసీమకే తలమానికంగా నిలిచిన అనంతపురం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ 14వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. ‘బంగారు’ కొండలు వీరే.. -
వీడియో వైరల్.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో దారుణం
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ కూటమి పాలనలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పింఛన్ కావాలంటే అన్ని అర్హతలున్నా చేయి తడపందే పనికాని దుస్థితి. సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వివరాలివీ..హిందూపురం మోడల్ కాలనీకి చెందిన ఓ మహిళ తన చెవి దుద్దులు తాకట్టు పెట్టేందుకు ఓ బంగారం దుకాణానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ‘ఏమంత కష్టం వచ్చిందమ్మా’ అని అడిగితే పింఛన్ కోసం రూ.10 వేలు డబ్బులడిగారని, తాను అంత ఇవ్వలేనని చెప్పి రూ.6 వేలకు ఒప్పించుకున్నానని మహిళ బదులిచ్చింది.ఈ డబ్బు కూడా తనవద్ద లేక చెవికమ్మలు తాకట్టు పెడుతున్నానని చెప్పింది. లంచం ఎవరడిగారని దుకాణం యజమాని ప్రశ్నించగా.. ‘మోడల్ కాలనీ సచివాలయంలో డబ్బు అడిగారు. ఇవ్వకపోతే పింఛన్ రాదని చెప్పారు.. అందుకే సామీ కమ్మలు తాకట్టుపెడుతన్నా’.. అంటూ ఆ మహిళ నిట్టూర్చింది.ఈ సంభాషణంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్చేయడంతో ఈ అంశం వైరల్గా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ఉండకపోవడం, నియోజకవర్గంపై పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నేతలు, కొందరు అధికారులు పేదలను పీల్చి పిప్పిచేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఎటువంటి లంచాలు లేకుండానే అప్పట్లో నేరుగా ఇంటివద్దే సేవలు అందేవని.. ఇప్పుడు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. -
●తాగునీటి కోసం ఆందోళన
రొళ్ల మండలంలోని రత్నగిరి పంచాయతీ ఉజ్జినీపురం గ్రామంలో మహిళలు నీటి కోసం ఆందోళనకు దిగారు. గ్రామంలో వాటర్ వర్క్స్ బోరుబావికి అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. వారం రోజులు గడుస్తున్నా ట్రాన్స్ఫార్మర్ బిగించి సమస్యను పరిష్కరించలేదు. దీంతో నీటి సరఫరా నిలిచిపోగా శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రెండో రోజుల్లోగా నీటి సమస్య పరిష్కరించకపోతే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. – రొళ్ల: -
తప్పుల్లేని ఓటరు జాబితానే లక్ష్యం
ప్రశాంతి నిలయం: ‘తప్పుల్లేని ఓటరు జాబితాను తయారు చేయడమే లక్ష్యం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని డీఆర్ఓ విజయసారథి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తప్పులు లేని ఓటరు జాబితా, పోలింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఓటరు నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. డీఆర్ఓ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లెయిమ్లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, వివరాలు సేకరించి సన్నద్ధంగా ఉంటే ప్రక్రియను సులువుగా పూర్తిచేయొచ్చన్నారు. వైఎస్సార్సీపీ తరఫున రవినాయక్, టీడీపీ తరఫున ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ ప్రతినిధి అబ్దుల్ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ కార్డుపై లేపాక్షి నంది లేపాక్షి: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేపాక్షి విశిష్టత ప్రపంచానికి తెలియజేయడానికి నంది చిత్రం కలిగిన పోస్టుకార్డు ఎంతో దోహపడతుందని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక లేపాక్షిలోని చేతన కన్వెన్స్న్ హాల్లో నంది చిత్రంతో కూడిన శాశ్వత తపాలా ముద్రను, వీరభద్రస్వామి దేవస్థానంపై ప్రత్యేక కార్డులను ఆయన విడుదల చేశారు. ముందుగా ఇటీవల ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీనాయక్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్మినెంట్ పిక్టోరియల్ కాన్సిలేషన్ ద్వారా కార్డులు విడుదల చేయడం సంతోషంగా ఉదన్నారు. ఇది లేపాక్షికి ప్రత్యేకమైన రోజన్నారు. లేపాక్షి పోస్ట్ ఆఫీసు నుంచి ఏ ఉత్తరం వచ్చినా ఈ కాన్సిలేషన్ ద్వారా ఆ ఉత్తరం వెళ్లడం జరుగుతుందన్నారు. దేశం మొత్తానికి ఈ కార్డులను పంపించవచ్చన్నారు. నంది విగ్రహం, కల్యాణ మంటపం, వినాయక విగ్రహం, ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, సీతమ్మ పాదం, వేలాడే స్తంభం చిత్రాల కార్డులను విడుదల చేశారు. ఈ కార్డులను శుభకార్యాలకు, స్నేహితులు, ఇతరులకు బహమతి ఇవ్వచ్చన్నారు. ఈ కార్డులు స్థానిక పోస్టు ఆఫీసులో అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం లేపాక్షి విశిష్టతను తెలిపేలా కవి సడ్లపల్లి చిదంబరరెడ్డి రాసిన పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు రీజినల్ పోస్టుమాస్టర్ జనరల్ వెన్నం ఉపేంద్ర, పోస్టల్ సూపరింటెండెంట్ విజయకుమార్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం
ఉరవకొండ/రూరల్: పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరథోత్సవం వైభవంగా జరగనుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. దీంతో ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఉచిత భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి పెన్నహోబిలం ఆలయానికి ప్రత్యేకంగా 42 ఆర్టీసీ సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ హంపయ్య తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది తెలిపారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో సీఐ, ఎస్లతో పాటు స్పెషల్పార్టీ పోలీసులు అందుబాటులో ఉంటారు. వేలాదిగా తరలిరానున్న భక్తులు ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు -
బదిలీ నిబంధనల్లో అసంబద్ధాలను తొలగించాలి
ధర్మవరం అర్బన్: ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో నెలకొన్న అసంబద్ధాలను తొలగించాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సాయికృప జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్జీటీలకు సెమీ మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లకు బదులు ఎల్ఎఫ్ఎల్ పదోన్నతుల ద్వారా ఎస్జీటీలను నియమించాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల స్థాయిని దిగజార్చకుండా వారిని యూపీ, ఉన్నత పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. 2023లో రేషనలైజేషన్ అయి ప్రమోషన్ పొందిన వారికి, 2025లో రేషనలైజేషన్ అవుతున్న వారికి బదిలీల్లో అన్యాయం జరగకుండా చూడాలన్నారు. స్టడీ లీవ్లో ఉన్న వారి పోస్టులను వేకెంట్ చూపరాదన్నారు. అంతర్ జిల్లా బదిలీలు కూడా వెంటనే చేపట్టాలన్నారు. మూడేళ్ల లోపు రిటైర్మెంట్ ఉన్నవాళ్లను బదిలీ నుంచి మినహాయించాలన్నారు. కౌన్సిలింగ్కు ముందే హైస్కూల్ ప్లస్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. రాష్ట్రమంతటా ఒకేసారి ఆఫ్లైన్లో ఓఎంఆర్ ద్వారా డీఎస్సీని నిర్వహించాలన్నారు. అనంతరం డీఎస్సీ మోడల్ ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు సి.రామకృష్ణారెడ్డి, విజయ్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, చెన్నారెడ్డి, నారాయణస్వామి, సౌదామిని, శివారెడ్డి, సంజీవ్, శ్రీరామ్నాయక్, చిదంబరరెడ్డి, బాలకృష్ణ, రామయ్య, రమణ, ఓబిరెడ్డి, చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, రామ్మోహన్రెడ్డి, సాలెహ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య -
చాలా సంతోషంగా ఉంది
మాది వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల. నాన్న బ్రహ్మానందారెడ్డి, అమ్మ మంజుల. నాన్న కడప స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. బీటెక్లో టాపర్గా నిలవడం అందులోనూ ఆరు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం టాపర్ (ఒక గోల్డ్మెడల్), ఎండోమెంట్ గోల్డ్మెడల్ ఫర్ బెస్ట్ అకడమిక్ ఫర్ఫార్మెన్స్ అమాంగ్ బాయ్స్ (ఒక గోల్డ్మెడల్), చల్లా సుబ్బారాయుడు ఎండోమెంట్ గోల్డ్మెడల్, ప్రొఫెసర్ వి. పాండురంగడు గోల్డ్మెడల్ (థర్మోడైనమిక్స్ సబ్జెక్టులో టాపర్), 1992 బ్యాచ్ స్పాన్సర్డ్ గోల్డ్మెడల్ , చుండుపల్లి వెంకట్రాయలు.. సరోజమ్మ గోల్డ్మెడల్ ఇలా మొత్తం ఆరు గోల్డ్మెడల్స్ దక్కాయి. అంతేకాక కోర్సు పూర్తికాగానే ఎల్అండ్టీ కంపెనీలో ట్రైనీ ఇంజినీర్గా ఎంపికయ్యాను. – నంద్యాల పూజిత్ కుమార్రెడ్డి -
యువ పరిశోధకుడిగా ప్రారంభమైన ‘చావా’ ప్రస్థానం
ప్రతి స్నాతకోత్సవానికి విశిష్ట వ్యక్తులను గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జేఎన్టీయూ(ఏ) ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో 14వ స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్ను వర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావాకు అందజేయనున్నారు. ర్యాన్బ్యాక్సీలో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ చావా విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్సిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎదిగారు. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005) (హైదరాబాద్)తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి దిశాదర్శకులయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ను 2021లో సాక్షి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఘనంగా సత్కరించింది. 18 సంవత్సరాల క్రితం ఏర్పాటైన లారస్ ల్యాబ్స్ కంపెనీలో ఇప్పటి వరకూ 150 కొత్త మందులు కనిపెట్టారు. 150 పేటెంట్లు దక్కాయి. రెస్పెక్ట్.. రివార్డు..రీటైయిన్ అనే మూడు ప్రాధాన్యత అంశాలుగా ల్యాబ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. -
కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) మరో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను దేశానికి అందించిన జేఎన్టీయూ(ఏ)14వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరగనుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మ
అనంతపురం: విశ్వఖ్యాతిగాంచిన జేఎన్టీయూ (ఏ) విశ్వవిద్యాలయం ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించింది. ఏర్పడిన అనతి కాలంలోనే బీటెక్, బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, ఎంటెక్, ఎం–ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. అలాగే పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్లు అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 68 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు, 43 ఫార్మసీ కళాశాలలు, 24 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఏటా 1.30 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్ , పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో గణనీయమైన ర్యాంకు దక్కించుకుని అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. చేయూత అ‘పూర్వ’ం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వర్సిటీ పురోగతికి చేయూతనందించారు. రూ.8 కోట్ల వ్యయంతో 100 గదులతో కూడిన హాస్టల్ను పూర్వ విద్యార్థుల పేరుతో ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్నూ ఏర్పాటు చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ జేఎన్టీయూ క్యాంపస్ కళాశాలలో 2024–25లో బీటెక్ పూర్తి చేసిన మొత్తం 226 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చాటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. వీరిలో 10 మందికి ఏడాదికి రూ.11 లక్షల వేతనంతో కూడిన కొలువులు దక్కడం విశేషం. జేఎన్టీయూ బంగారాలు: జేఎన్టీయూ అనంతపురం వర్సిటీ పరిధిలో 18 మందికి, జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల పరిధిలో ఏడుగురికి మొత్తం 49 బంగారు పతకాలు, ఎంటెక్లో ఒకరు, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో ఐదుగురి బంగారు పతకాలు దక్కాయి. వీరిలో జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల మెకానికల్ విభాగానికి చెందిన నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డి ఏకంగా ఆరు బంగారు పతకాలు దక్కించుకుని వర్సిటీ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కాన్పూర్లోని ఐఐటీలో ఎమిరటర్స్ ప్రొఫెసర్ ఎం.ఆర్.మాధవ్ హాజరుకానున్నారు. అలాగే జేఎన్టీయూ (ఏ) పాలకమండలి సభ్యులు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. ముఖ్య అతిథిగా హాజరవుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపన్యాసం చేయనున్నారు. లైవ్స్ట్రీమ్ ద్వారా స్నాతకోత్సవాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అగ్రగామిగా తీర్చిదిద్దాలి అన్ని రంగాల్లో జేఎన్టీయూ (ఏ)అగ్రగామిగా తీర్చిదిద్దాలని వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. శుక్రవారం ఆయన జేఎన్టీయూలోని పాలకభవనంలో స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికలో సమూలంగా మార్పు చేశామన్నారు. గౌరవ డాక్టరేట్ను డాక్టర్ చావా సత్యనారాయణకు అందజేయడం గర్వంగా ఉందన్నారు. స్నాతకోత్సవ సందర్భంగా డిగ్రీలు అందుకునే విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. నేడు జేఎన్టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవం చాన్సలర్ హోదాలో ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ 40,109 మంది విద్యార్థులకు డిగ్రీలు, 167 మందికి పీహెచ్డీల ప్రదానం -
ఏపీఆర్ఎస్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు షైనింగ్ స్టార్–2025 అవార్డులకు ఎంపికయ్యారు. 2024–25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలో నిర్వహించిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన ప్రభుత్వ పాఠశాలల్లోని టాప్ ర్యాంకర్లను ఎంపిక చేసి, షైనింగ్ స్టార్ అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. ఈ క్రమంలో ఏపీఆర్ఎస్కు చెందిన డి.అఫ్రీద్, ఎస్.అహమ్మద్ హుస్సేన్, కె.లక్ష్మీనరసింహారెడ్డి, వై.విశ్వకిరణ్, కె.అశోక్కు అవార్డులు దక్కాయి. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం ప్రిన్సిపాల్ ఎన్వీ మురళీధర్బాబుతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. లైనింగ్ పనులు త్వరగా పూర్తి చేయండితనకల్లు: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మండలంలోని కొక్కంటిక్రాస్ వద్ద జరుగుతున్న లైనింగ్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లైనింగ్ పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అనంతరం ఇంతవరకు ఎన్ని కిలోమీటర్ల పనులు చేశారని, ఏఏ యంత్రాలను పనులకు కోసం వినియోగిస్తున్నారని ఆరా తీశారు. యువకుడి దుర్మరణం పుట్టపర్తి అర్బన్: మండలంలోని వెంకటగారిపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన సాయినాథ్ (26) సీసీ కెమెరాల మరమ్మతు పనితో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి ప్రయాణమైన సాయినాథ్... వెంకటగారిపల్లి సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వామనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సంప్లో పడి వృద్ధురాలి మృతి పుట్టపర్తి అర్బన్: ప్రమాదవశాత్తు నీటి సంప్లో పడి ఓ వృద్ధురాలు మృతిచెందింది. వివరాలు.. పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామానికి చెందిన ఫకృద్దీన్ ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్య ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో భార్య చక్కీరమ్మ (70)తో కలిసి ప్రశాంతిగ్రామంలోని జానకీరాం కాలనీలో స్ధిరపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సంప్లోని నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన చక్కీరమ్మ అదుపు తప్పి అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగి ఊపిరి ఆడక మృతిచెందారు. ఘటనపై పుట్టపర్తి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. పలు మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని గుడిబండ మండలంలో అత్యధికంగా 35.2 మి.మీటర్లు, రొళ్ల 21.2, గాండ్లపెంట 20, మడకశిర 6, అగళి మండలంలో 5.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
● డీఎస్పీ విజయ్కుమార్ పుట్టపర్తి టౌన్: సమష్టి కృషితో జిల్లాను డ్రగ్స్ రహితంగా మారుద్దామంటూ పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక సాయిఆరామం వేదికగా ఈగల్ యాంటీ టాస్క్ఫోర్ప్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయికి అలవాటు పడి చాలా మంది తమ జీవితాలను నాశనంచేసుకుంటున్నారన్నారు. అలాంటి వారు తమ కుటుంబాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం తదితర వివరాలు గురించి తెలిస్తే టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐలు సునీత, సురేష్, ఈగల్ యాంటీ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎస్ఐ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నిజాయితీ చాటుకున్న విద్యార్థులు అగళి: నడిరోడ్డుపై తమకు దొరికిన సంచిలో ఉన్న నగదును పోలీసుల ద్వారా సంబంధీకుడికి అప్పగించి, విద్యార్థులు తమ నిజాయితీని చాటుకున్నారు. వివరాలు.. అగళి మండలం ఆలూడి గ్రామానికి చెందిన నరసింహ, మలుర... స్థానిక ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఇంటర్ పరీక్షలు రాసి తిరుగు ప్రయాణమయ్యారు. కర్ణాటక బ్యాంక్ వద్దకు చేరుకోగానే నడిరోడ్డుపై ఓ బ్యాగ్ కనిపించడంతో తీసుకుని పరిశీలించారు. అందులో పెద్ద మొత్తంలో నగదు ఉండడంతో నేరుగా పోలీస్స్టేషన్కు చేరుకుని ఆ బ్యాగ్ను అందజేసి, విషయాన్ని వివరించారు. బ్యాగ్లో ఉన్న బ్యాంక్ పాస్ పుస్తకాన్ని పరిశీలించిన పోలీసులు ఆ నగదు గ్యార గుండానపల్లి చెందిన శివన్నది గుర్తించి, పీఎస్కు రప్పించుకుని ఆరా తీశారు. గ్రామంలోని మహాత్మా గాంధీ మహిళ సంఘానికి చెందిన డబ్బును అగళిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో కట్టేందుకు తీసుకువచ్చినంట్లు వివరించాడు. అయితే నగదు ఉన్న బ్యాగ్ను పొగొట్టుకోవడంతో దిక్కు తోచలేదని, అందులో రూ.49,310 నగదు ఉండాలని తెలిపాడు. దీంతో లెక్కించిన పోలీసులు ఆ మొత్తం అందులో ఉండడంతో విద్యార్థుల చేతుల మీదుగా ఆయనకు అందజేయించారు. నిజాయితీ చాటుకున్న విద్యార్థులను ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు. వాహనం బోల్తా.. ఒకరి మృతి తాడిపత్రి: మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ హుస్సేన్ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్ గాయపడ్డారు. ఘటనపై రూరల్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆటో బోల్తాపడిన ఘటనలో మరొకరు.. పామిడి: మండలంలోని రామరాజుపల్లి సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన నాగేంద్ర తన సొంత ఆటోలో కుటుంబసభ్యులతో కలసి పెన్నహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వెళ్లాడు. శుక్రవారం ఆలయం వద్ద పూజలు ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు... పామిడి మండలం రామరాజుపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో నాగేంద్ర కుమార్తె శైలజ (15) అక్కడికక్కడే మృతి చెందింది. నాగేంద్ర, సుదర్శన్, మోక్షిత, రాధమ్మకు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఈ–కేవైసీ పూర్తయ్యేదెన్నడో ?
ప్రశాంతి నిలయం: రేషన్కార్డులో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులందరూ ఈ–కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. గత ఐదు నెలలుగా ఈ–కేవైసీ పూర్తి చేసే ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతోంది. రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు ఇచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గడువును కూడా జూన్ 30 వరకూ పొడిగించారు. అయితే జిల్లాలో ఇప్పటికీ 99,872 మంది లబ్ధిదారులు ఇంకా ఈ– కేవైసీ చేయించుకోలేదు. వందశాతం కష్టమే.. జిల్లాలో 5,66,971 రేషన్ కార్డులు ఉండగా 16,89,531 మంది సభ్యులుగా ఉన్నారు. వీరందరితో ఈ–కేవైసీ పూర్తి చేయాలని పౌరసరఫరాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికీ 99,872 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేయలేదు. గడువులోపు ఈ–కేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ సరుకులు అందించబోమని ప్రభుత్వం చెబుతోంది. వలస వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడంతో ఇబ్బంది వస్తోంది. గడువులోపు పూర్తిచేయకపోతే వారంతా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో వంద శాతం ఈ–కేవైసీ పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతోనే .. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీర్ వ్యవస్థ చురుగ్గా పనిచేసేది. క్షేత్రస్థాయిలో ఏపనైనా సకాలంలో వలంటీర్లు పూర్తి చేసే వారు. అయితే ఇప్పడు కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం క్షేత్రస్థాయిలో సర్వేలు సహా ఏ ఇతర పనులు కూడా సక్రమంగా జరగడం లేదన్న విమర్శలున్నాయి. వలంటీర్లు లేకపోవడంతో ఈ–కేవైసీని రేషన్ డీలర్లకు అప్పగించారు. వారు పూర్తిస్థాయిలో దృష్టిసారించకపోవడంతో ఈ–కేవైసీ పూర్తిచేయని వారి సంఖ్య అధికంగా ఉందంటున్నారు. నేటికీ వివరాలు నమోదు చేయని 99,872 మంది లబ్ధిదారులు జూన్ 30 వరకూ గడువు గడువులోగా పూర్తి చేస్తాం రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేసేందుకు జూన్ 30 వరకూ గడువు ఉంది. క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్ల ద్వారా గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. లబ్ధిదారులు కూడా ఈ–కేవైసీ పూర్తి చేయించుకునేందుకు సహకరించాలి. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రాంతానికి వచ్చి ఈ–కేవైసీ చేయించుకోవాలి. – వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి -
హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలి
హిందూపురం: హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులక పెంచితేనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని జలసాధన సమితి సభ్యులు అన్నారు. ‘సాగునీటి సమస్యలు – పరిష్కార మార్గాలు’ అంశంపై స్థానిక పెన్షనర్స్ భవన్లో శుక్రవారం సదస్సు జరిగింది. జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సమితి నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. అత్యంత అల్ప వర్షపాతంలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు హంద్రీ–నీవా వరదాయినిగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. జీడిపల్లి నుంచి దిగువకు కాలువ వెడల్పు చేయకుండానే లైనింగ్ పనులు ప్రారంభించడం వల్ల నీటి సామర్థ్యాన్ని పెంచే యోచనకు కూటమి ప్రభుత్వం సమాధి కట్టినట్లుగా తెలుస్తోందన్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ జీఓ జారీ చేశారని, పనులకు సంబంధించి రూ.6182 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ ప్రభుత్వ జారీ చేసిన జీఓను రద్దు చేయడమే కాక, 3,850 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి పరిమితం చేయడం వెనుక అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో పక్కనే ఉన్న కృష్ణానది జలాలను కాదని, రూ.80వేల కోట్లు ఖర్చుతో పోలవరం నుంచి గోదావరి జలాలను 465 కి.మీ. దూరంలో ఉన్న బనకచర్లకు తరలించి అక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తానని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారని ప్రశ్నించారు. పోలవరం నుంచి గోదావరి జలాల మళ్లింపు ఆలోచనను విరమించుకుని మల్యాల నుంచి జీడిపల్లి వరకు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు జీడిపల్లి నుంచి దిగువకు 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం, మడకశిర బ్రాంచ్ కెనాల్ 1,500 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా కాలువలు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 3.45లక్షల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందించాలన్నారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.50వేల కోట్లు కేటాయించి రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మృతనదిగా మారబోతున్న పెన్నాను బతికించుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. కృష్ణానదిపై సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలనే డిమాండ్తో ఈ నెల 31న సంగమేశ్వరం వద్ద జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని రైతులు, మేధావులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జలసాధన సమితి నాయకులు నవీన్, జమీల్, ఆదినారాయణ, అమానుల్లా, జయరామరెడ్డి, హనుమంతరెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకులు రాజశేఖరరెడ్డి, లెక్చరర్ గంగిరెడ్డి, తూమకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం నాయకుడు రవికుమార్, పీడీఎస్యూ బాబావలి, ఏఐటీయూసీ వినోద్, చలివెందుల లక్ష్మీనారాయణరెడ్డి, తిప్పేస్వామి, పలువురు ఉపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాలువ లైనింగ్ పనులతో భవిష్యత్తుకు సమాధి 31న కృష్ణానది సంగమేశ్వరం వద్ద బహిరంగ సభ విజయవంతం చేయండి -
వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం.. రూ.25 లక్షల చెక్కు అందజేత
శ్రీసత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈనెల 8న పాకిస్తాన్తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు. కాగా, మూడు రోజల క్రితం (13వ తేదీన) మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. -
పెళ్లి పేరుతో.. టోకరా
సాక్షి, పుట్టపర్తి : గతంలో పెళ్లంటే... పెద్దలు కూర్చుని బంధువర్గాల్లో ఈడు, జోడు చూసి సంబంధం కుదుర్చేవారు. ఎక్కువగా బంధువర్గాల్లోని అమ్మయిలతోనే వివాహం జరిపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. ఫలితంగా 30 ఏళ్లు దాటి.. 40 ఏళ్లకు సమీపిస్తున్నా.. పెళ్లి సంబంధాలు వెతుకుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. దీంతో ‘పెళ్లి కాని ప్రసాద్’ లను లక్ష్యంగా చేసుకుని కొందరు యువతులు, మ్యారేజీ బ్యూరో నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో బంగారు నగలు, నగదు చేజిక్కించుకుని ఉడాయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆస్తి రాయించుకుని అడ్డం తిరుగుతున్నారు. వయసు మీరితే మోసపోయినట్లే.. అప్పట్లో అబ్బాయిలకు 21, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే వివాహం జరిపించే వాళ్లు. అయితే ప్రస్తుతం ఉద్యోగాల వేటలో పడి 30 ఏళ్లు దాటినా పెళ్లి సంబంధాలు చూడటానికి యువకులు మొగ్గు చూపటం లేదు. ఆ తర్వాత ఏదో ఉద్యోగం లభించాక పెళ్లి సంబంధాలకు వెళ్తే...అమ్మాయిల కోర్కెల చిట్టా చూసి ఖిన్నులవుతున్నారు. రూ.లక్షల్లో జీతంతో పాటు అత్తమాత బాదరబందీ ఉండకూడదంటూ షరతులు పెడుతున్నారు. దీంతో యువకులు నచ్చిన భాగస్వామి కోసం మ్యారేజీ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. ఇదే అదునుగా మధ్యవర్తులు ఇతర ప్రాంతాల అమ్మాయిలను ఒప్పించి.. ఒకట్రెండు నెలలు కాలయాపన చేసి.. ఆలోపు డబ్బులు, ఆస్తులు లాగేసుకుని పరారవుతున్నారు. కొన్ని సామాజిక వర్గాల్లో మరీ కష్టం.. కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉంది. మండలానికి నాలుగైదు కుటుంబాలు ఉండే కులాల్లోని యువకులకు పెళ్లి పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ఆస్తి తక్కువగా ఉండే అగ్రవర్ణ యువకులదీ ఇదే పరిస్థితి. ఫలితంగా యువకులు... ఎవరైతే ఏంటి..పెళ్లయితే చాలు అనే పరిస్థితికి వచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లి సామాజికవర్గం ఏదైనా సరే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లిచేసుకుని వస్తున్నారు. అయితే రెండు, మూడు నెలల్లోనే సదరు యువతులు టోకరా వేసి బంగారం, నగదుతో ఉడాయిస్తున్నారు. ⇒ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచుపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మ్యారేజీ బ్యూరో ద్వారా భీమవరానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. సంబంధం కుదిర్చిన ఇద్దరు వ్యక్తులకు రూ.4 లక్షలు చెల్లించాడు. అయితే వివాహం తర్వాత సదరు యువతిని రైలులో భీమవరానికి తీసుకువెళ్లగా.. రైల్వే స్టేషన్ నుంచే ఆమె ఉడాయించింది. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. పెళ్లి చేసిన మధ్యవర్తుల నంబర్లూ పనిచేయలేదు. దీంతో బాధితుడు తిరిగివచ్చి.. హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన 2024 అక్టోబరులో వెలుగు చూసింది.⇒ నాలుగు నెలల క్రితం ధర్మవరానికి చెందిన ఓ యువతిని పుట్టపర్తిలో పని చేసే ఓ ఉద్యోగి పెళ్లి చూపులు చూశాడు. ఆ వెంటనే సదరు యువతి బంధువులు పెళ్లిపత్రికలు ప్రింట్ చేయించారు. తాను పెళ్లికి అంగీకారం తెలపకుండానే పత్రికలు ఎలా ప్రింట్ చేయించారని అడగ్గా... తనను మోసం చేశాడని రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని సదరు యువతి నాలుగు నెలల క్రితం నానా రభస చేసింది. దీంతో ఆ ఉద్యోగి అప్పటి నుంచి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. -
ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు
హిందూపురం: స్థానిక ఇందిరమ్మ కాలనీ సమీపంలోని జాతీయ రహదారిలో గురువారం ఉదయం ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. అధిక లోడు కారణంగా వేగంగా వెళుతున్న సమయంలో కుదుపులకు బోల్తాపడడంతో ట్రాలీపై ఉన్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో గాయపడిన వారిలో కిష్టప్పకు కాళ్లకు బలమైన గాయలు కావడంతో చికిత్సలు అందిస్తున్నారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దాడి కేసులో ఐదుగురికి జరిమానా రొద్దం: వ్యక్తిపై దాడి చేసిన ఐదుగురికి జరిమానా విధిస్తూ పెనుకొండ ప్రిన్సిపుల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బొజ్జప్ప గురువారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఎస్ఐ నరేంద్ర గురువారం వెల్లడించారు. రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన కురుబ అంజినరెడ్డి కుమార్తెను 2014లో రామగిరి మండలం కనివాండ్లపల్లి గ్రామానికి చెందిన కురుబ శివశంకర్ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్యను పలకరించేందుకు తరచూ రాచూరుకు శివకుమార్ వచ్చివెళ్లేవాడు. ఓ రోజు తన అత్త సుశీలమ్మతో ఇంటి బయట మాట్లాడుతున్న శివశంకర్పై రాచూరు గ్రామానికి చెందిన గొల్ల ధనుంజయ, రవి, సుధాకర్, పరంధామ, బోయ శ్రీరాములు దాడి చేసి గాయపరిచారు. ఘటనకు సంబంధించి 2015లో అప్పటి ఎస్ఐ దస్తగిరి కేసు నమోదు చేసి, ఛార్జీషీట్ను కోర్టులో దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున జరిమానా, జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్యామల వాదనలు వినిపించారు. -
మధుర ఫలం.. విషతుల్యం
హిందూపురం: మామిడికి ఇప్పుడిప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఇంత కాలం ఎండల తీవ్రత కారణంగా మామిడిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భయపడుతూ వచ్చారు. వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో మార్కెట్లో మామిడి కొనుగోలు దారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో వ్యాపారులు సహజ సిద్ధంగా కాకుండా ప్రమాదకర కాల్షియం కార్బైడ్తో మాగిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దిగుబడి సైతం మోస్తారుగానే ఈ ఏడాది మామిడి దిగుబడులు ఓ మోస్తరుగా ఉన్నాయని ఉద్యాన శాఖ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ ప్రభావం కారణంగా ఎగుమతులపై ప్రభావం పడింది. దీంతో స్థానికంగానే మార్కెట్లో మామిడి విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఎండలు తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ఇంత కాలం మామిడి కొనుగోలు చేసేందుకు పలువురు వెనుకంజ వేస్తూ వచ్చారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్లో మామిడికి డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో డిమాండ్కు అనుగుణంగా మామిడిని అందుబాటులో ఉంచేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కడం మొదలు పెట్టారు. పెనుగాలులు, వర్షాలకు నేలరాలిన కాయలను తక్కువ ధరకే వ్యాపారులు కొనుగోలు చేసి త్వరగా పక్వానికి వచ్చేలా విషపూరిత కాల్షియం కార్బైడ్ను విచ్ఛలవిడిగా వినియోగిస్తున్నట్లుగా సమాచారం. వీటిని తిన్న వృద్ధులు, చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రమాదకర రసాయనంతో మామిడిని మాగబెడుతున్న వ్యాపారులు వర్షాలు కురిసిన నేపథ్యంలో మామిడి కొనుగోలుకు ఎగబడుతున్న ప్రజలు కొనుగోలు సమయంలో నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు నాణ్యతను గుర్తించండి ఇలా.. సహజ సిద్ధంగా మాగిన మామిడి మొత్తం ఒకే రంగులో ఉండదు. పండిన వాసనతో కోసినప్పుడు లోపలి భాగం మొత్తం ఒకే రకమైన పక్వత కనిపిస్తుంది. ప్రమాదకర రసాయనంతో మాగేసిన పండ్లు మొత్తం ఒకే రంగులో ఉంటాయి. కోసినప్పుడు లోపలి భాగం చుట్టూ కొద్ది పక్వత కలిగి, మిగిలిన భాగం అపరిపక్వంగా ఉంటాయి. ఇథిలీన్ వాయివుతో చాంబర్లో మాగిన పండ్లు ఆరోగ్యానికి మంచిది. ఇవి సహజ పరిపక్వతకు దగ్గరగా ఉంటాయి. మామిడిని కొళాయి నుంచి వదిలే నీటిలో మూడు నిమిషాలు ఉంచి శుభ్రం చేసిన తర్వాత తొక్కను తీసి తినాలి. నాణ్యత ఉన్న వాటినే కొనుగోలు చేయండి మామిడిని సహజ సిద్ధంగా పండించాలి. రసాయనాలతో మాగించిన పండ్ల తొక్క ముడతలు లేకుండా గట్టిగా ఉంటుంది. ఇలాంటి పండ్లు ప్రమాదకరం. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15 నుంచి 20 నిముషాలు ఉంచి తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. – మహేష్, ఉద్యానాధికారి, హిందూపురం -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
హిందూపూరం టౌన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నట్లు డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్ తెలిపారు. స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ విభాగం, ఫార్మసీ, డయాలసిస్ యూనిట్తో పాటు నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న మార్చురీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో వైద్యులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వైద్యులకు అవసరమైన పరికరాలు, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కావాల్సిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ యూనిట్లో ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులు గమనించి అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల్లో ఏసీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 5 నెలల్లో అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో పలు రకాల వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మరో ఐదు నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తద్వారా మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించవచ్చునన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించినట్లు పేర్కొన్నారు. చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందించడంతో పాటు వార్డుల్లో ఇన్పేషంట్ సేవలు మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆస్పత్రిలో అందించే ప్రతి చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద నమోదు చేయాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. వైద్యుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. అలాగే నెల రోజుల్లోపు ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఫార్మసీలో అన్ని మందులను అందుబాటులోకి తీసుకు వచ్చామని, ముఖ్యంగా గుండె నొప్పితో బాధపడేవారు ఆసుపత్రిలో స్టేమీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునిక మార్చురీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సీఎస్ఆర్ ఫండ్స్ కింద ఆస్పత్రికి అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, నియామకాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింగన్న, ఎమ్మెల్యే పీఏ వీరయ్య, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్ -
ప్రమాదంలో వ్యక్తి మృతి
అమరాపురం: మండలంలోని ఉదుగూరు – కాచికుంట గ్రామాల మధ్య చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిబండ మండలం గుడ్డదహళ్లి గ్రామానికి చెందిన నవీన్కుమార్ (43) అమరాపురం మండలం కెంకెర గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. గురువారం వ్యక్తిగత పనిపై అమరాపురం గ్రామానికి వెళ్లిన ఆయన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై కెంకర గ్రామానికి బయలుదేరాడు. ఉదుగూరు – కాచికుంట గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా.. ద్విచక్ర వాహనం అదుపు తప్పి మోరీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలుఅనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన ఉమ్మడి జిల్లాలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు నక్కారామారావు ఎడ్యుకేషనల్, కల్చరల్ ట్రస్ట్ బోర్డు, యాదవ సంఘం, యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు జి.నాగభూషణం, జి.శ్రీనివాసులు, బి.రామకృష్ణ, ఎం.శ్రీరాములు, ఉమాశంకర్, హేమంత్, లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతిలో 400పైబడి మార్కులు, ఇంటర్లో 700పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. జూన్ 1న పురస్కారాలు అందజేయనున్నారు. మరింత సమాచారానికి 83094 75846, 94922 87710లో సంప్రదించవచ్చు. వీరజవాన్ కుటుంబ సభ్యులకు పరామర్శ గోరంట్ల: వీరజవాన్ మురళీనాయక్ కుటుంబసభ్యులను ప్రముఖ నటుడు శివారెడ్డి పరామర్శించారు. గురువారం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీనాయక్ తల్లి జ్యోతిబాయిని పరామర్శించారు. మురళీనాయక్ త్యాగం మరువలేనిదని కొనియాడారు. అనంతరం ప్రముఖ ఆర్టిస్ట్ వాసు గీచిన మురళీనాయక్ చిత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట స్థానిక సర్పంచ్ వాసునాయక్ ఉన్నారు. కారు దగ్ధం ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. వెనిల్ అనే వ్యక్తితో కలసి మరో వ్యక్తి అనంతపురం నుంచి కారులో ధర్మవరానికి బయలుదేరాడు. చిగిచెర్ల సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి పొగలు రాసాగాయి. గమనించిన వారు కారు ఆపి కిందకు దిగారు. అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ‘కియా’కు సమ్మె నోటీసు పెనుకొండ రూరల్: దేశ వ్యాప్తంగా ఈ నెల 20 తేదీన చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. కియా కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనేలా కియా పరిశ్రమకు నోటీసులు అతికించారు. నాయకులు మాట్లాడుతు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్లుగా బిల్లు తీసుకొచ్చిందన్నారు. కార్మికుల కష్టాన్ని పెట్టుబడి దారులకు దోచిపెట్టేందుకే లేబర్ కోడ్లును తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయి కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. సమ్మె విజయవంతానికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హరి, బాబావలి, సాంబ శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
ఉరవకొండ రూరల్: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. జిల్లా నలమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ప్రధాన అర్చకుడు ద్వారకనాథచార్యులు, ఈఓ సాకే రమేష్బాబు అధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తులకు కల్యాణం జరిపించారు. అంతకు ముందు దేవేరులతో కలసి గరుడ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనిమిచ్చారు. -
ప్రాజెక్ట్ల స్థాపనకు భూములు సిద్ధం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూసేకరణకు అనువైన భూములు జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ చేతన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంధన ప్రాజెక్ట్ల భూసేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. చేతన్ మాట్లాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో 4 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమై భూమి సేకరించాల్సి ఉందన్నారు. సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వ భూమి లభ్యత ఎంత ఉందో వివరాలు సేకరించాలన్నారు. పట్టా ఉన్న రైతులు తమ భూమిని లీజుకు ఇస్తే ఎకరానికి ఏడాదికి రూ.31 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. లీజుకు అంగీకరించే రైతుల భూముల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 20లోపు భూముల జాబితాలు సిద్ధం చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించాలని చెప్పారు. 22న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిగుబ్బ, తలుపుల, రొద్దం, గుడిబండ, కనగానపల్లి, చిలమత్తూరు, హిందూపురం, అగళి, రామగిరి, మండలాల్లో భూసేకరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్, కదిరి, ధర్మవరం, పెనుకొండ ఆర్డీఓలు శర్మ, మహేష్, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
జిల్లాలో విస్తారంగా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారు జామున 24 మండలాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కనగానపల్లి మండలంలో 75.2 మి.మీటర్లు, ధర్మవరం 71.6, బుక్కపట్నం 46, తాడిమర్రి 41.2, బత్తలపల్లి 36.2, పుట్టపర్తి 33.2, చిలమత్తూరు 33.2, కొత్తచెరువు 27.6, గాండ్లపెంట 24.4, కదిరి 21.2, అమడగూరు మండలంలో 20.8 మి.మీటర్ల వర్షం కురిసింది. అలాగే ఓడీచెరువు మండలంలో 16.4, సీకేపల్లి 16.2, ముదిగుబ్బ 12.6, రామగిరి 11.8, తలుపుల 9.4, నల్లచెరువు 7.2, గోరంట్ల 5.4, తనకల్లు 4.8, నల్లమాడ 4.2, సోమందేపల్లి 3.8, పెనుకొండ 2.8, ఎన్పీ కుంట 2.4, రొద్దం మండలంలో 2 మి.మీటర్ల వర్షం కురిసింది. వర్షం రాకతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముంగారు సేద్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. -
ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన 9 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ప్రజా కోర్టులో శిక్ష పడడం ఖాయం. పార్టీ విప్ ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడం అన్యాయం. కూటమి నేతలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలో గెలవాలి. అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకోవడం చేతగాని తనం. కూటమి నేతలు రెడ్బుక్ రాజ్యాంగంతో రెచ్చిపోతున్నారు. వారి అరాచకాలే వారి పతనానికి కారణమవుతాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది. ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. కూటమి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా అవి తాత్కాలికమే. భవిష్యత్ వైఎస్సార్సీపీదే. – ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మడకశిర -
సాగుకు సర్కార్ సాయం కరువు
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ముందస్తు వర్షాలు మురిపిస్తున్నాయి. ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. సాగుకు అవసరమైన విత్తన వేరుశనగను ప్రభుత్వం సకాలంలో అందిస్తే రైతులకు ఎంతో ఉపయోగం. గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముందుచూపుతో మే 20 నుంచే విత్తనకాయల పంపిణీకి రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడంతో పాటు అదే నెలలో విత్తనకాయలు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం రైతులను సందిగ్ధంలోకి నెడుతోంది. బోరు బావులున్న రైతులు ఇప్పటికే పొలాలను సిద్ధం చేసుకున్నా నాణ్యమైన విత్తన కాయలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో లేని విత్తనం సాధారణంగా ప్రతి ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వేరుశనగ, కంది, ఉలవలు, అలసంద, పెసర, మినుములు వంటి విత్తనాలను సరఫరా చేస్తుంది. జిల్లాలో ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తారు. ఈ రబీలో సాగు చేసిన వేరుశనగ కాయలను అధిక ధరలకు వెచ్చించి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తరలించేశారు. దీంతో ముందస్తు వర్షాలు కురిసినా వేరుశనగ సాగు చేయడానికి అవసరమైన విత్తనం అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సాయం అందేనా? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క సంక్షేమ పథకమూ అమలు కాలేదు. దీంతో రైతుల వద్ద చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేసే నాటికి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ (రైతు భరోసా) పథకం కింద ఒకే దఫాలో రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సాగుకు రైతుల సన్నద్ధం సబ్సిడీ విత్తనకాయల కోసం ఎదురుచూపు సకాలంలో పంపిణీ చేయాలని వేడుకోలు ప్రభుత్వానికి చేరిన నివేదిక జిల్లాలో ఖరీఫ్–2025లో 2,69,152 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్క వేరుశనగ పంట 1,51,824 హెక్టార్లు, కంది 28,925 హెక్టార్లు, మొక్క జొన్న 17,949 హెక్టార్లు, తదితర పంటలు అధికంగా సాగు చేయవచ్చని భావిస్తున్నారు. ఇందుకు తగినట్టుగా వేరుశనగ విత్తన కాయలు 75,895 క్వింటాళ్లు, కంది 1,275 క్వింటాళ్లు, పప్పుశనగ 796 క్వింటాళ్లు, ఉలవలు 300 క్వింటాళ్లు, పెసర, అలసంద వంద క్వింటాళ్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి విత్తన కేటాయింపులు, ధర ఖరారు, పంపిణీ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో విత్తనకాయలు అందిస్తే సరి.. లేకుంటే బహిరంగ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ధరలతో విత్తనాలు కొని పంటలు సాగు చేయడం కష్టమవుతుందని రైతులు అంటున్నారు. సబ్సిడీ విత్తన పంపిణీపై త్వరగా స్పందించాలని కోరుతున్నారు. -
21న జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య గురువారం తెలిపారు. ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని జిల్లా పరిషత్ సమావేశ ప్రధాన మందిరంలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తారని, గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలకు సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యే సమావేశానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పారా లీగల్ వలంటీర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం హిందూపురం: చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పారా లీగల్ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ తెలిపారు. హిందూపురం ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, హిజ్రాలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కల్గి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హిందూపురం జిల్లా అదనపు జడ్జి న్యాయ సముదాయంలో ఉన్న లోక్ అదాలత్ విభాగంలో అందజేయాలని తెలియజేశారు. పాలిసెట్లో 94.03 శాతం ఉత్తీర్ణత ధర్మవరం అర్బన్: జిల్లాలో పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్–2025లో జిల్లా వ్యాప్తంగా 94.03 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2,704 మంది బాలురు, 1,989 మంది బాలికలు మొత్తం 4,693 మంది పరీక్షలు రాశారన్నారు. వారిలో 2,510 మంది బాలురు, 1,903 మంది బాలికలు మొత్తం 4413 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలురు 92.83 శాతం, బాలికలు 95.68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 94.03 శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమన్నారు. నేడు లేపాక్షి నంది పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ లేపాక్షి: భారత తపాలాశాఖ హిందూపురం డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక చేతన కన్వెన్షన్హాల్లో లేపాక్షి ఆలయ నమూనాతో పోస్టు కార్డు విడుదల చేయనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ యూ.విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరభద్రస్వామి దేవస్థానంపై ప్రత్యేకంగా రూపొందించిన పిక్చర్ పోస్టుకార్డుతో పాటు లేపాక్షి నంది నమునాతో పర్మనెంట్ పిక్టోరియల్ కాన్సిలేషన్ (పోస్టల్ మార్క్/స్టాంప్)ను ఆవిష్కరించన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ కె.ప్రకాష్తో పాటు రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ వనం ఉపేంద్ర ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. -
శ్రీసత్యసాయి జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ!
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దొడ్డిదారిన మడకశిర మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం నెగ్గిన టీడీపీ.. బలం లేకపోయినా ఛైర్మన్పై అవిశ్వాసం పెట్టింది. గతంలో మొత్తం 20 వార్డులకు 15 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించగా, కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది.కాగా, రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని కూడా అప్రజాస్వామికంగా కైవసం చేసుకున్నారు.మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్పర్సన్గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
ఆగని ‘రక్తచరిత్ర’.. ఎదురొస్తే ఎవరినీ వదలం
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ దాషీ్టకాలతో నియోజకవర్గంలోని రామగిరి మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తారో, ఏ పరిణామాలు ఎవరి ప్రాణాలు తీస్తాయో.. అని వణికిపోతున్నారు. బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం,అవసరమైతే దాడులు చేయడం రామగిరి మండలంలో టీడీపీ గూండాలకు పరిపాటిగా మారింది. ఎంపీపీ ఉప ఎన్నికకు మరోసారి నోటిఫికేషన్ విడుదల కావడంతో ‘రక్తచరిత్ర’ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చిలో జరగాల్సిన ఎంపీపీ ఉప ఎన్నికను టీడీపీ గూండాల దౌర్జన్యాలతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీటీసీ సభ్యులను బెదిరించి కిడ్నాప్నకు యత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు హతమార్చారు. పరామర్శించడానికి వచి్చన మాజీ సీఎం వైఎస్ జగన్కు పోలీసులు సరైన రక్షణ కల్పించలేదు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్సీపీ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఎంపీపీ స్థానానికి అభ్యర్థి కూడా లేని టీడీపీ వాళ్లు ఎలాంటి దారుణాలకు ఒడిగడతారోనని వైఎస్సార్సీపీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతున్నారు. బలవంతంగా టీడీపీలో చేర్చుకుని.. ఈ నెల 19వ తేదీన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి టీడీపీ కండువా వేసి పా ర్టీలో చేరినట్లు పరిటాల సునీత, శ్రీరామ్ ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వారు దు్రష్పచారం చేశారు. వారి ప్రచారాన్ని భారతి ఖండిస్తూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బుధవారం వీడియో విడుదల చేశారు. ఇంటిపై దాడి... పట్టించుకోని పోలీసులు టీడీపీలో చేరిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని ఎక్కడ దాచారో చెప్పాలంటూ కొత్తపల్లి గ్రామంలో కురుబ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన మాదాపురం శంకర్తోపాటు మరికొంతమంది రౌడీలు దాడి చేశారు. ఈ ఘటన గురించి బుధవారం ఉదయం రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసులపై నమ్మకం పోయిందని, ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఉంటే టీడీపీ గూండాలు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్యను హత్య చేసిన తరహాలోనే దారుణానికి ఒడిగడతారని కొత్తపల్లి గ్రామస్తులు భయపడుతున్నారు.ఎంపీపీ ఇస్తామన్నారు ‘టీడీపీ నేతలు నన్ను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారు. పరిటాల సునీత, శ్రీరామ్ సమక్షంలో పార్టీ కండువా వేసి ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. నాకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారు. ఆ తర్వాత మా గ్రామంలో వదిలారు. అక్కడ ఉంటే రక్షణ ఉండదని భావించి బంధువుల ఇంటికి వచ్చాను. నాకు టీడీపీలోకి వెళ్లడం ఇష్టం లేదు. పదవి కంటే పార్టీ ముఖ్యం. వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా. ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరుకాలేను. ఈ నెల 20 తర్వాత గ్రామానికి వస్తాను. – భారతి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు, పేరూరు–2ఎన్నికను బహిష్కరిస్తున్నాం ‘రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తోంది. మార్చి 27న జరగాల్సిన ఎన్నిక టీడీపీ నాయకుల దౌర్జన్యాల కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కురుబ లింగమయ్యను కోల్పోయాం. మరోసారి ఇంకొందరు కార్యకర్తలను కోల్పోలేం. అందుకే ఎన్నికకు దూరంగా ఉంటాం. రామగిరి పోలీసులపై నమ్మకం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తేనే సరైన రక్షణ కల్పించలేకపోయారు.’ – తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
అంధకారంలో 20 పల్లెలు
ముదిగుబ్బ: మండలంలోని మల్లేపల్లి సబ్స్టేషన్ పరిధిలోని 20 పల్లెల్లో అంధకారం అలుముకుంది. మూడు రోజుల క్రితం ఈదురుగాలులతో కూడిన వర్షాలకు తప్పెటవారిపల్లి సమీపంలో 33 కేవీ లైన్కు సంబంధించిన మూడు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అదే సమయంలో సబ్స్టేషన్లోనూ కొన్నిచోట్ల డ్యామేజీ జరిగింది. దీంతో మల్లేపల్లి, తప్పెటవారిపల్లి, ఒడ్డుకింద తండా, కొండగట్టుపల్లి పంచాయతీల పరిధిలోని 20 గ్రామాలకు సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ రాత్రంతా చీకట్లోనే ఇబ్బందిపడిన ప్రజలు మంగళవారం ఉదయం లైన్మెన్లను ఆరా తీశారు. ఇదిగో గంటలో కరెంట్ వస్తుంది.. మధ్యాహ్నం.. సాయంత్రం ఇలా చెప్పుకుంటూ వచ్చారు. గంటలు పోయి.. రోజులు గడుస్తున్నా ఎటువంటి పురోగతీ లేదు. మూడు రోజులైనా అధికారులు స్పందించకపోవడం, ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోకపోవడం, విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలే వేసవి. ఉక్కపోత అధికంగా ఉంది. కరెంటు లేక ఫ్యాన్లు, కూలర్లు ఆగిపోయాయి. జనం అల్లాడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటోంది. సెల్ఫోన్లు కూడా చార్జింగ్ అయిపోయాయి. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్పందించి కరెంటు సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈదురుగాలులతో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు మూడు రోజులుగా అంధకారంలోనే మగ్గుతున్న ప్రజలు విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో అధికారుల తాత్సారం -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ వనరుల లూటీ విచ్చలవిడిగా జరుగుతోంది. మట్టి, ఇసుక, గ్రావెల్ మొదలుకొని అన్నింటినీ ‘తెలుగు తమ్ముళ్లు’ దోపిడీ చేస్తున్నారు. ‘పచ్చ’ నేతల హస్తం ఉండటంతో తనిఖీలకు వెళ్లేందుకు మైనింగ్ అధికారులు జంకుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్టి, ఇసుక, గ్రావెల్ తదితర వాటిని వాణిజ్య అవసరాలకు తరలించే వాహనాల నుంచి రాయల్టీ డబ్బు వసూలు చేసేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రైవేటు సంస్థకు లీజు కట్టబెట్టేది. లీజు దక్కించుకున్న సంస్థ నెలానెలా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో కొంత మొత్తం చెల్లించేది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం లభించేది. అయితే, జిల్లాలో ప్రైవేటు సంస్థ లీజు గడువు మార్చితోనే ముగిసింది. తర్వాత ఇప్పటివరకూ ఎవ రికీ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి సహజ వనరుల అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 11 మాసాల్లోనే కొండల నేలమట్టం.. ‘కూటమి’ అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే అనంతపురం సమీప ప్రాంతాల్లో కొండలు కరిగిపోయాయి. గుట్టలు నేల మట్టమయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గుట్టలను కరిగించేశారు. రోజూ ఇక్కడి నుంచి వంద నుంచి 150 టిప్పర్ల మట్టి కర్ణాటకకు పంపిస్తున్నారు. ఇక్కడికి ఇద్దరు మైనింగ్ అధికారులు వెళ్లి వెనక్కు వచ్చారు. మహిళా అధికారులు మట్టి దొంగలను నిలువరించలేకపోయారు. ఇక.. ఆలమూరు కొండలంటే ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. పశుపక్ష్యాదులకు ఆలవాలంగా ఉండటమే కాదు రాప్తాడు, అనంతపురం ప్రాంతాలకు రక్షణ కవచంలా ఉండేవి. అలాంటి కొండలను నేలమట్టం చేశారు. చివరకు కరెంటు పోళ్లు కూడా కిందపడిపోయేలా మట్టిని తవ్వారు. స్థానిక టీడీపీ నేత ఆధ్వర్యంలో అక్రమ వ్యవహారం ఇష్టారాజ్యంగా జరుగుతోంది. కరిగిపోయిన నేమకల్లు గుట్టలు రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో జరుగుతున్న మైనింగ్.. రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా చెప్పొచ్చు. మైనింగ్ డాన్గా పేరుగాంచిన టీడీపీ నేతలిద్దరు భారీగా క్రషర్లు పెట్టి కొండలను పిండి చేస్తున్నారు. ఆరు హెక్టార్లు లీజు ఉంటే 50 ఎకరాల్లో తవ్వుతున్నారు. రూ.20 కోట్ల పెనాల్టీ వేస్తే దాన్ని మాఫీ చేయించుకునేందుకు యత్నిస్తున్నారు. ‘తాడిపత్రి’లో విచ్చలవిడిగా... తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో ఇసుక, మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. పెద్దపప్పూరు మండలంలోని సోమనపల్లి, తిమ్మనచెరువు గ్రామాల్లో విచ్చలవిడిగా మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకునేవారే లేరు. ఆత్మకూరు మండలంలో తారస్థాయికి.. ఆత్మకూరు మండలంలో ఎర్రమట్టి దందా తారస్థాయికి చేరింది. ‘తెలుగు తమ్ముళ్లు’ మట్టి దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతం మొత్తం ఇప్పటికే వెంచర్లతో నిండిపోయింది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఎలాంటి గ్రావెల్ లీజులు లేకుండానే కొండలను పిండి చేసి అక్రమంగా మట్టి రవాణా సాగిస్తున్నారు. హిందూపురంలో పట్ట పగలే దోపిడీ.. హిందూపురం పట్టణం చుట్టూ ఉన్న రూరల్ ప్రాంతాల నుంచి మట్టి యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా వినకుండా మట్టి తోలుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల అండగా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఎక్కడ చూసినా మట్టి, ఇసుక టన్నుల కొద్దీ కర్ణాటకకు వెళ్లిపోతోంది. ధర్మవరం నియోజకవర్గంలో.. ధర్మవరం నియోజకవర్గలోని చిత్రావతి నది నుంచి రోజూ వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా తోలుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ప్రధాన హైవేలోనే నిర్భయంగా టిప్పర్లు వెళుతున్నా రెవెన్యూ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ వాహనాలను పట్టుకోలేదు. టీడీపీ వాహనాలు అనగానే పోలీసులు వాటికి రాచబాట వేసి మరీ బార్డరు దాటిస్తున్నారు. సహజ వనరుల స్వాహాపర్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచ్చలవిడిగా దోపిడీ రోజూ వందలాది టిప్పర్ల ఇసుక, మట్టి కర్ణాటకకు కొండలు కరిగిపోతున్నా.. గుట్టలు నేలమట్టమవుతున్నా ఎవరికీ పట్టని వైనం -
అందరికీ ధన్యవాదాలు
గోరంట్ల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ తెలిపారు. ఆ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబీకులను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ కల్లితండా రాగా, జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి అశేష ప్రజానీకం వచ్చి జగన్మోహన్రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమ విజయానికి శక్తి వంచనలేకుండా కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.‘ఓపెన్’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి● డీఆర్ఓ విజయ సారథి ఆదేశంప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ విజయ సారథి ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మే 19 నుంచి 24వ తేదీ వరకు ఓపెన్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లా నుంచి 7,056 మంది విద్యార్థులు పరీక్ష హాజరుకానుండగా, 45 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. సమావేశంలో డీఈఓ కృష్టప్ప, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పీఠం అధికారులు పాల్గొన్నారు.ముజఫర్ అలీ కన్నుమూతకదిరి: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కదిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ముజఫర్ అలీ(62) బుధవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన... రెండేళ్లుగా భార్యతో కలిసి కర్నూలు జిల్లా ఆదోనిలో ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడే కన్నుమూశారు. ఆయన తండ్రి నిజాంవలీ కదిరి మున్సిపల్ చైర్మన్గా, రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. తండ్రి మరణానంతరం ముజఫర్ అలీ చిన్న వయసులోనే కదిరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు. ముజఫర్ అలీ మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు ఆదోనికి వెళ్లి భౌతిక కాయాన్ని కదిరికి తీసుకొచ్చి ఖననం చేశారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, అభిమానులు ముజఫర్ అలీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
మడకశిరలో ప్రజాస్వామ్యం ఖూనీ
మడకశిర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకై నా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని అప్రజాస్వామికంగా కై వసం చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఐదుగురితో అధికారం దక్కించుకోవాలని.. మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్పర్సన్గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవాలని చూస్తున్నారు. నేడు చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం.. మడకశిర మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై గురువారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ నేతలు సర్వం సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారి హోదాలో పెనుకొండ ఆర్డీఓ ఆనంద్కుమార్ హాజరు కానున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ.. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్సార్ సీపీకి చెందిన 15 మంది కౌన్సిలర్లకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విప్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, మడకశిర మున్సిపల్ కమిషనర్ రంగస్వామికి మడకశిర వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. అదే విధంగా కౌన్సిలర్లకు కూడా విప్ పత్రాలను అందజేశారు. అడ్డదారుల్లో మున్సిపాలిటీ కై వసానికి కూటమి కుట్ర వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు.. క్యాంపునకు తరలింపు నేడు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన పార్టీ హైకమాండ్ విప్ ధిక్కరిస్తే పదవులకు చేటే మడకశిరలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి అడ్డదారుల్లో మున్సిపాలిటీని కై వసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం దారుణం. మేం 15 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు విప్జారీ చేశాం. ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవులు కోల్పోవడం తథ్యం. – ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మడకశిర -
యథేచ్ఛగా ఎర్రమట్టి దోపిడీ
రాయదుర్గం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల దోపిడీకి అంతులేకుండా పోతోంది. సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టి రూ. కోట్లలో దోచేస్తున్నారు. టీడీపీ నేతల స్వార్థానికి రాయదుర్గం నియోజకవర్గంలో సహజ సిద్దంగా ఏర్పడిన కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా రాయదుర్గంలోని శనీశ్వరాలయం వెనుక ఉన్న హౌసింగ్ లే అవుట్కు ఆనుకుని కొండ ప్రాంతంలో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. అదే ప్రాంతంలో కొండ పొరంబోకు స్థలంలో భారీ విస్తీర్ణాన్ని చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ఓ టీడీపీ నాయకుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. ఎంసీఏ కళాశాల, ఇందిరమ్మ లేఅవుట్లు, గౌడ లేవుట్ సమీపంలో ఉన్న కొండల్లో నుంచి గ్రావెల్ తవ్వకాలు పెరిగిపోయాయి. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు వ్యక్తులు తమ స్థలాలను ప్లాట్లు వేసి, రోడ్లను చదును చేసేందుకు కొండల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అయ్యప్పస్వామి బంగారు విగ్రహ ప్రతిష్ట
ధర్మవరం అర్బన్: స్థానిక కేశవనగర్లో నూతనంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయం ప్రారంభోత్సవంతో పాటు మణికంఠుడి బంగారు విగ్రహన్ని బుధవారం వేదమంత్రాల నడుమ ప్రతిష్టించారు. ఆలయ వ్యవస్థాపకులు, గురుస్వామి పీజే విజయ్కుమార్, సభ్యులు బండ్లపల్లి వెంకటజయప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. సాయంత్రం అయ్యప్పస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై కొలువుదీర్చి పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. టీడీపీ నేత దౌర్జన్యం కనగానపల్లి: మండలంలోని కోనాపురం చెరువు కట్ట సమీపంలో దోభీఘాట్ వద్ద పంచాయతీ నిధులతో రజకుల కోసం ఏర్పాటు చేసిన బోరుబావిని స్థానిక టీడీపీ నేత కబ్జా చేశాడు. బోరుబావి నుంచి ప్రత్యేకంగా పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని తన పొలానికి మళ్లించుకుంటున్నాడు. దీంతో నీటి సౌకర్యం లేక రజకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ ఇదే బోరుబావి నుంచి గ్రామంలోని ఓ రైతు కొన్ని రోజుల పాటు తన పొలానికి నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో అభ్యంతరం తెలిపిన స్థానిక టీడీపీ నాయకులు తిరిగి ఆ పార్టీకి చెందిన వ్యక్తి దౌర్జన్యంగా నీరు మళ్లించుకుంటుంటే ఎందుకు మాట్లాడటం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథ్ను వివరణ కోరగా... ఇప్పటికే ఈ విషయంపై ఫిర్యాదులు అందాయని, బోరు కబ్జా చేసిన వ్యక్తికి నోటీసులు అందజేసి పైపులైన్ తొలగిస్తామని పేర్కొన్నారు. మామిడి చెట్ల నరికివేత లేపాక్షి: స్థానిక బింగిపల్లి మార్గంలో రైతు ముక్తియార్కు చెందిన మామిడి తోటలో 42 చెట్లను మంగళవారం రాత్రి దుండగులు నరికి వేశారు. బాధితుడు తెలిపిన మేరకు... తనకున్న 2.50 ఎకరాల పొలంలో మూడేళ్లుగా మామిడి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది కాపు దశకు వచ్చాయన్నారు. బుధవారం ఉదయం తోట వద్దకు చేరుకోగా 175 మామిడి చెట్లలో 42 మామిడి చెట్లను నరికి వేసినట్లుగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. రైతు ఫిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
బీపీఈడీ ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 73.77 శాతం, మూడో సెమిస్టర్లో 82.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్లో చూడవచ్చు. అలాగే బీఎస్సీ, బీకాం, బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీగా నిర్ధేశించినట్లు అనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ జి.వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఈ.రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొపెసర్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి.లోకేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.శంకర్ తదితరులు పాల్గొన్నారు.ఆటో ఢీకొని బాలుడి మృతికదిరి టౌన్: ఆటో ఢీకొన్న ఘటనలో సైకిల్పై వెళుతున్న ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరిలోని కుమ్మర వీధికి చెందిన వేమారెడ్డి కుమారుడు దినేష్కుమార్రెడ్డి (11) బుధవారం ఉదయం ట్యూషన్కు వెళ్లి తిరిగి సైకిల్పై ఇంటికి బయలుదేరాడు. స్థానిక మౌనిక థియేటర్ సర్కిల్ వద్దకు చేరుకోగానే వెనుకనే వేగంగా వస్తున్న ఆటో ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన దినేష్కుమార్రెడ్డిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపు మృతి చెందాడు. బాలుడి తాత ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.యువకుడి బలవన్మరణంమడకశిర రూరల్: మండలంలోని హరేసముద్రం గ్రామానికి చెందిన లోకేష్నాయక్ (18) ఆలియాస్ పరమేష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిలోని ఓ పశువుల షెడ్డులో పనిచేస్తున్న లోకేష్ నాయక్... ఇటీవల ఇంటికి వచ్చి తిరిగి పనికి వెళ్లలేదు. జీతం బాగా ఇస్తున్న పనిని వదిలి ఎందుకు వచ్చావంటూ తల్లి మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనైన లోకేష్నాయక్... బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గ్రంథాలయాలు... విజ్ఞాన వీచికలు
పుట్టపర్తి టౌన్: వేసవి సెలవులంటే పిల్లలకు సరదా. ఆ సెలవుల కోసమే పిల్లలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వేసవి సెలవులకు నువ్వెక్కడికి వెళ్తావంటే, నువ్వెక్కడికి వెళ్తావు? అంటూ చిన్నారుల మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత బాల్యం సెల్ఫోన్కు బందీ అయింది. దీంతో బాల్యానికి ఆప్యాయత, అనురాగం, ప్రేమ, లాలిత్యం దూరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు దూరమైన బాల్యం యొక్క మాధుర్యాన్ని రుచి చూపించేలా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రంథాలయాల్లో జూన్ 6వ తేదీ వరకు 40 రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వివిథ తరగతులకు చెందిన 2,200 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వినోదంతో పాటు బాలల సాహిత్యం, కథలు వినడం, కథలు చెప్పడం, కథలు చదివించడం, పుస్తక సమీక్ష, చిత్రలేఖనం, రంగులు వేయడం, కాగితంతో కళారూపాలు తయారు చేయడం, సంగీతం, బొమ్మల తయారీ, నటన, యోగా, చదరంగం, క్యారమ్స్, క్విజ్, జీకే, స్పోకెన్ ఇంగ్లిష్, మొదలగు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పలు పాఠశాలలకు చెందిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యం మండలాల వారీగా ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరాలు ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు -
పూర్వపు డీఈఓ ఆనందమూర్తి మృతి
అనంతపురం ఎడ్యుకేషన్: పూర్వపు జిల్లా విద్యాశాఖ విశ్రాంత అధికారి సెట్టేల ఆనందమూర్తి (74) కన్నుమూశారు. అనంతపురంలోని ఆరవిందనగర్లో ఆయన నివాసం ఉంటున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందారు. ఆనందమూర్తి సొంతూరు శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. భార్య 2008లోనే మృతి చెందారు. ముగ్గురు కుమారులు సంతానం కాగా... ఇద్దరు హిందీ పండిట్లుగా, ఒకరు పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. 1980లో జేఎల్గా ఉద్యోగంలోకి చేరిన ఆనందమూర్తి పదోన్నతి పొంది 1996 నుంచి 2004 వరకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పని చేశారు. తర్వాత 2004 నుంచి 2006 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఐటీడీఏ, ఎస్సీఈఆర్టీలో పని చేసి 2008లో రిటైర్డ్ అయ్యారు. ఆయన మృతిపై ఎంఈఎఫ్ నాయకులు బండారు శంకర్, హనుమంతరావు, రమేష్, రామన్న తదితరులు సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘సింగిల్ ఆర్డర్ల’తో సంచలనం.. ఆనందమూర్తి డీఈఓగా పనిచేసిన కాలంలో జిల్లాలో టీచర్ల బదిలీలకు సంబంధించి ‘సింగిల్ ఆర్డర్ల’ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీలతో పాటు ఆయా ఖాళీలకు డీఈఓ సింగిల్ ఆర్డర్ ఇచ్చి బదిలీలు చేశారు. ఒత్తిళ్ల కారణంగా డీఈఓ కొన్ని ఆర్డర్లు ఇస్తే వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి అప్పట్లో కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమకు అనుకూలమైన వారికి చాలా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. కొందరు డీఈఓ సంతకాలను ఫోర్జరీ చేసి ఆర్డర్లు ఇచ్చిన అంశం దుమారం రేగడంతో ఆయనను విశాఖ జిల్లా అరకు ఐటీడీఏకు బదిలీ చేశారు. చికిత్సకు స్పందించక కియా ఉద్యోగి మృతి ధర్మవరం అర్బన్: ఉద్యోగంలో పని ఒత్తిడి తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన కియా ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని పీఆర్టీ వీధికి చెందిన కావలి గౌరీప్రసాద్ (23) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా ఉన్నత చదువులు అభ్యసించలేక కియా పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. పరిశ్రమలో పని ఒత్తిడి తాళలేక చనిపోయావలని అనుకుంటున్నట్లు పలుమార్లు కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడ్డాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు నచ్చ చెప్పడంతో సర్దుకుపోతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గత మంగళవారం మధ్యాహ్నం తన అన్న ఫృథ్వీరాజ్కు ఫోన్ చేసి, తాను విషపూరిత ద్రావకం తాగినట్లు తెలిపాడు. దీంతో ఫృథ్వీరాజ్ ఇంటికి చేరుకుని అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్న గౌరీప్రసాద్ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రిలో మృతిచెందాడు. ఘటనపై సీఐ నాగేంద్రప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. కుక్కను తప్పించబోయి వ్యక్తి... మడకశిర రూరల్: రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. వివరాలు.. మడకశిరకు చెందిన అమానుల్లా (54), బాబు బుధవారం ఉదయం వ్యక్తిగత పనిపై హిందూపురానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు... మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామ సమీపంలోని త్రిమూర్తి ఫామ్హౌస్ వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పిచబోయి ద్విచక్రవాహనం అదుపు తప్పిడంతో కిందపడ్డారు. తీవ్ర గాయాలైనా అమానుల్లా, బాబును స్థానికులు వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమానూల్లాను హిందూపురంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. -
జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటా
చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. నా ఆసక్తిని గమనించి అమ్మ, నాన్న ప్రోత్సహించారు. పీఈటీ సూచనలతో సాధన చేసి ఆటలోని మెలకువలను తెలుసుకున్నా. అండర్ –14 బాలుర విభాగంలో 2024, అక్టోబర్లో హిందూపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొనే అవకాశం దక్కింది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్లో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపాను. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా – పి.లోకేష్బాబు, ఎంజీఎం పాఠశాల, హిందూపురం -
మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..!
అనంతపురం/నందవరం: అప్పటికే ఆమెకు ఒక కుమారుడు. తర్వాత రెండో కాన్పులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను దూరం చేస్తూ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పుట్టింటికి వెళ్లి వెంటనే రావాలని భర్త సూచించడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... మంత్రాలయం మండలం మాధవవరం గ్రామానికి చెందిన బోయ ఈరన్న చిన్న కుమార్తె ఉరుకుందమ్మ (24)కు 2020లో అదే జిల్లా నందవరం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు పొపయ్యతో వివాహమైంది. వీరికి మూడేళ్ల వయస్సు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగరాజు వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఉరుకుందమ్మ పుట్టింటికి వెళ్లింది. నిశ్చితార్థ వేడుక ముగిసిన తర్వాత స్వగ్రామానికి చేరుకోగానే సాయంత్రం పొపయ్య ఫోన్ చేసి తన భార్యను వెంటనే మా ఊరికి పంపాలని మామను కోరాడు. బుధవారం పిలుచకొస్తామని తెలిపినా అల్లుడు వినలేదు. దీంతో ఆదివారమే కుమార్తెను తండ్రి పిలుచుకెళ్లి భర్త వద్ద వదిలాడు. సోమవారం ఉదయం 11 గంటలకు పాపయ్య మరోసారి ఫోన్ చేసి ఉరుకుందమ్మ కనిపించడం లేదని తెలిపాడు. దీంతో కుమారుడు నాగరాజు, అల్లుళ్లు తాయన్న, రమేష్ తో కలసి నందవరం గ్రామానికి ఈరన్న చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టాడు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అనంతపురం త్రీ టౌన్ పోలీసులు ఫోన్ చేసి ఉరుకుందమ్మ రైల్వే స్టేషన్ క్వార్టర్స్ పక్కన చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు అనంతపురానికి చేరుకుని ఉరుకుందమ్మ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అల్లుడి ఒత్తిళ్లు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతి లాల్ తెలిపారు. -
అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి : ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 8న జమ్మూకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ వీరమరణం పొందిన అగి్నవీర్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు. మురళి పోరాటాన్ని దేశం గర్విస్తోందని వైఎస్ జగన్ కొనియాడారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు. మురళీనాయక్ ఇంట్లోకి వైఎస్ జగన్ రాగానే.. జవాన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై బోరున విలపించారు. జగన్ రాకతో కల్లితండా జనసంద్రంలా మారింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కల్లితండా.. కన్నీరు మున్నీరు.. నాలుగైదు రోజులుగా దిగమింగుకున్న బాధను వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో ఒక్కసారిగా భావోద్వేగంతో వ్యక్తపరిచారు. విధి నిర్వహణలో మురళీ నాయక్ త్యాగాన్ని దేశం గరి్వంచినా.. కన్నతల్లి కంట కన్నీరు మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు జాతీయ జెండాలతో తరలివచ్చారు. గోరంట్ల – పుట్టపర్తి మెయిన్ రోడ్డు నుంచి కిలోమీటరు దూరం ఉన్న కల్లితండాకు వచ్చేందుకు గంటకుపైగా సమయం పట్టింది. గత సర్కారు సంప్రదాయమే.. దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని మొదట ప్రతిపాదన తీసుకొచ్చి.. అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడంపై వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. మార్మోగిన ‘జై జవాన్’ నినాదం.. కల్లితండాలోకి వైఎస్ జగన్ ప్రవేశించినప్పటి నుంచి ‘జై జవాన్’ నినాదం మార్మోగింది. ‘భారత్ మాతాకీ జై.. మురళీ నాయక్ అమర్ రహే’ అంటూ అభిమానులు జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. మురళీనాయక్ కుటుంబాన్ని మద్దతుగా నిలిచిన వారందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళి కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి జనం రాక.. వైఎస్ జగన్ కల్లితండా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. మురళీ నాయక్కు ఘన నివాళులర్పించారు. తరలివచ్చిన నేతలు.. వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, అనంతపుర జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అత్తార్ చాంద్బాషా, నియోజకవర్గ సమన్వయకర్తలు ఈరలక్కప్ప (మడకశిర), టీఎన్ దీపిక (హిందూపురం), మక్బుల్ (కదిరి), మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, మాదినేని ఉమామహేశ్వరనాయుడు, మహాలక్ష్మి శ్రీనివాసులు, కోగటం విజయ భాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు.‘‘జగనన్నా.. వచ్చావా.. మురళీ ఎక్కడ అన్నా. నువ్వయినా మా బిడ్డ మురళీని వెంట తెస్తావనుకున్నా’’ – వైఎస్ జగన్ పరామర్శించగానే బోరున విలపిస్తూ మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి ఆక్రందన ‘‘మురళీ.. పైకి లేచి సెల్యూట్ చేయి.. నీ కోసం జగన్ సర్ వచ్చాడు. మన ఇంటికే జగన్ సర్ వచ్చాడు మురళీ. లే మురళీ.. లేచి సెల్యూట్ చేయి మురళీ’’ – వైఎస్ జగన్ను చూడగానే మురళీ నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ భావోద్వేగం‘‘మురళీ నాయక్ను అయితే తేలేను తల్లీ.. నీ బిడ్డ పోరాటం వృథా కాదు. ఎంతోమందికి రక్షణగా నిలిచి.. చిన్న వయసులోనే ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మురళీ త్యాగానికి రుణపడి ఉంటాం’’ – మురళీ నాయక్ తల్లిదండ్రులతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి‘జై జవాన్’ నినాదం మార్మోగింది. కుగ్రామం కల్లితండాలో జనసునామీ పోటెత్తింది. అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం రాగా... అభిమాన గణం వెంట నడిచి జవాన్కు అశ్రు నివాళులర్పించింది. -
మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈనెల 8న పాకిస్తాన్తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ వయసులో చిన్నవాడే అయినప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. యావత్ భారత్ గర్వపడేలా వీరోచితంగా పోరాడి.. దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన వీరుడన్నారు. మంగళవారం మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.మురళీ కుటుంబానికి రూ.25 లక్షల సాయంకల్లి తండాలో వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్ త్యాగానికి వెల కట్టలేమని చెప్పారు. దేశం కోసం పోరాడుతూ.. తన ప్రాణ త్యాగంతో మిగిలిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు రక్షణ ఇచ్చారన్నారు. యావత్ భారత్ దృష్టిని ఆకర్షించిన మురళీని మన మధ్యలోకి తేలేం కానీ.. ఆయన త్యాగానికి రుణపడి ఉంటామన్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. దేశం కోసం పోరాడుతూ.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసే సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడం పట్ల అభినందించారు.దారి పొడవునా స్వాగతంకర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి కొడికొండ చెక్పోస్టు, కోడూరు, పాల సముద్రం, గుమ్మయ్యగారిపల్లి, కల్లి తండా వరకు దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ సరిహద్దులో వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. జాతీయ జెండాలతో చిన్నారులు మార్గం మధ్యలో స్వాగతం పలికారు. వాహనంపై నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. -
జిల్లాలో భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్/చెన్నేకొత్తపల్లి: మండు వేసవిలో వరుణుడు ప్రతాపం చూపాడు. ఖరీఫ్ పంటలకు మేలు జరిగేలా ముందస్తుగా వర్షించి అందరినీ మురిపించాడు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భానుడి భగభగ మండగా, సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి ఉరములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. మంగళవారం ఉదయం వరకూ జిల్లాలోని 17 మండలాల పరిధిలో 13 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తచెరువు మండలంలో 77.6 మి.మీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక సీకేపల్లి మండలంలో 74.6 మి.మీ, బుక్కపట్నం 59.4, పుట్టపర్తి 36.2, ధర్మవరం 34.6, నల్లమాడ 24, రామగిరి 23.6, కనగానపల్లి 15.2, కదిరి 15.2, పరిగి 11.6, అగళి 10.2, తలుపుల 7.4, రొళ్ల 7.4, ముదిగుబ్బ 6.8, ఓడీ చెరువు 6.4, పెనుకొండ 2.6, బత్తలపల్లి 1.2, తాడిమర్రి మండలంలో 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చెన్నేకొత్తపల్లిలో పొంగిపొర్లిన వాగులు, వంకలు.. చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు వాన కుమ్మేయడంతో ఏకంగా 74.06 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో చెన్నేకొత్తపల్లి నుంచి వెంకటంపల్లికి వెళ్లే దారిలో ఉన్న వంక పారింది. అలాగే మేడాపురం పంచాయతీ పరిధిలోని పెద్దమొగలాయిపల్లి, చిన్నమొగలాయిపల్లి గ్రామాల వద్ద వంకలు పొంగి ప్రవహించాయి. మేడాపురం, నాగసముద్రం తదితర గ్రామాల చెరువులకు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. తాజా వర్షంతో ముంగారు సేద్యానికి రైతులు సిద్ధమవుతుండగా...మూగజీవాలకు మేతతో పాటు అటవీ ప్రాంతంలో తాగునీరు లభిస్తుందని పశువుల కాపరులు చెబుతున్నారు. కాగా, రాగల ఐదు రోజులూ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 17 మండలాల పరిధిలో 13 మి.మీ సగటు వర్షపాతం నమోదు రాగల ఐదు రోజులూ వర్ష సూచన -
జీజీహట్టిలో కొలిక్కిరాని అతిసారం
రొళ్ల: పది రోజులుగా రొళ్ల మండలం జీజీహట్టి గ్రామాన్ని వేధిస్తున్న అతిసారం మరోసారి తన ఉనికిని చాటింది. ఇప్పటికే దాదాపు 40 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇందులో అమూల్య (11) మృతి చెందింది. మరికొందరు కోలుకొంటున్నారు. తాజాగా మంగళవారం గ్రామానికి చెందిన శశికళ, చిక్కమ్మ, దొడ్డపూజారప్ప గారి మారన్న అతిసారం బారిన పడడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. ఆగమేఘాలపై గ్రామానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి, తహసీల్దార్ షెక్సావలి, ఎంపీడీఓ రామారావు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మారన్నను మధుగిరిలోని ఆస్పత్రికి, శశికళ, చిక్కమ్మను రొళ్లలోని సీహెచ్సీకి తరలించారు. అలాగే అతిసారం లక్షణాలతో బాధపడుతున్న చిక్కీరప్పను హిందూపురం, ఈరమ్మను మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓ వ్యవసాయ బోరుబావిలో నీటిని తాగడం వలనే వాంతులు, విరేచనాలతో ప్రజలు బాధపడుతున్నట్లుగా గుర్తించిన అధికారులు సదరు రైతుకు నోటీసులు జారీ చేశారు. ప్రజలెవ్వరూ ఆ నీటిని వినియోగించరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఇంటింటికీ తిరిగి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. -
యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
● మంత్రి సవిత రొద్దం: జిల్లాలోని ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేపట్టామని రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళీ శాఖ మంత్రి సవిత అన్నారు. రొద్దం మండలం బొక్సంపల్లి క్రాస్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు మంగళవారం ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్తను తయారుచేయడమే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. సొంత ఊళ్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఆ మూడు స్థానాలకు 19న ఎన్నికలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ స్థానానికి ఈ నెల 19న మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న నోటిఫికేషన్ ఇచ్చి, 19న ఎన్నిక నిర్వహించేందుకు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేస్తున్నట్లు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎన్నికల అధికారులు రాజోలి రామచంద్రారెడ్డి, జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. కాగా.. గతంలో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల స్థానాలకు మార్చి 27న ఎన్నికలు నిర్వహించారు. అయితే గాండ్లపెంట, రామగిరి ఎంపీపీ స్థానాలతో పాటు కంబదూరు వైస్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఆయా స్థానాలకు మార్చి 28న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు చర్యలు తీసుకున్నా.. రాజకీయ కారణాలతో వాయిదా పడ్డాయి. వైఎస్సార్సీపీ నేత షెడ్డుకు నిప్పు ధర్మవరం రూరల్: మండలంలోని బిల్వంపల్లికి చెందిన వైఎస్సార్సీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు హరిని ఆర్థికంగా దెబ్బ తీసేందుకు ఆయన వ్యవసాయ బావి వద్ద ఉన్న షెడ్డుకు మంగళవారం దుండగులు నిప్పు పెట్టారు. మంగళవారం వైఎస్ జగన్ కల్లితండా పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలసి ఆయన తరలివెళ్లాడు. హరి గ్రామంలో లేడని తెలుసుకున్న దుండగులు పొలంలో ఉన్న షెడ్డుకు నిప్పు పెట్టడంతో అందులో నిల్వ చేసిన వేరుశనగ బస్తాలు, డ్రిప్పు పరికరాలు, స్ప్రింక్లర్ల పైపులు, ఇతర వ్యవసాయ పనిముట్లు కాలిబూడిదయ్యాయి. సమీపంలో ఉన్న రైతులు నుంచి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ‘బదిలీల్లో ప్రాధాన్యత కల్పించాలి’ ఓడీచెరువు: ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి కాని ఉపాధ్యాయులను తప్పనిసరి బదిలీ చేయాల్సి వస్తే వారికి ఎనిమిదేళ్ల స్టేషన్ పాయింట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షర్ఫుద్దీన్, జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ డిమాండ్ చేశారు.2017, ఆగస్టులో బదిలీ పొందిన ఉపాధ్యాయులను ఎనిమిదేళ్లు పూర్తి కాకుండానే బదిలీల జాబితాలో చేర్చారన్నారు. అలాంటప్పుడు వారికి ఎనిమిదేళ్ల స్టేషన్ పాయింట్లు కేటాయించాలని కోరారు. అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. -
‘ఉద్యోగ భద్రతా సర్క్యులర్ అమలు చేయాలి’
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీలో ఉద్యోగ భద్రతా సర్క్యులర్ను వెంటనే అమలు చేయాలని ఎన్ఎంయూఏ రాష్ట్ర కార్యదర్శి ఎర్రిస్వామి, జాయింట్ సెక్రటరీ నాగరాజు డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చలో డీపీటీఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. చిన్నపాటి కారణాలతో కార్మికులపై వేధింపులకు గురి చేయడం సబబు కాదన్నారు. సిబ్బందికి చెల్లించాల్సిన పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, మహిళా సిబ్బందికి చైల్డ్కేర్ లీవ్లు మంజూరు చేయాలని, గ్యారేజ్ సిబ్బందిపై వేధింపులు మానాలని, ఆఫీస్ సిబ్బందికి సరైన కంప్యూటర్లు, ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని, సంస్థలో ఖాళీగా ఉన్న 12వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎంయూఏ జోనల్ అధ్యక్షుడు నాగశేఖర్, జిల్లా అధ్యక్షుడు ముత్యాలప్ప, శ్రీరామనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి షబ్బీర్, రీజనల్ ఉపాధ్యక్షుడు తిరుపతమ్మ, జాయింట్ సెక్రటరీ విజయమ్మ,తో పాటు ఆరు డిపోల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు
కదిరి: మరణానంతరం నేత్రదానంతో మరో ఇద్దరికి కంటి చూపునివ్వాలనే సదుద్దేశ్యంతో ఓ మహిళ తన నేత్రాలను దానం చేసింది. వివరాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న కదిరిలోని అడపాలవీధికి చెందిన పద్మావతమ్మ(75) బెంగుళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. అయితే తాను మరణించాక తన నేత్రాలను దానం చేయాలని ఆమె జీవించి ఉన్న సమయంలోనే కోరడంతో ఆ మేరకు కుటుంబసభ్యులు స్పందిస్తూ ఆమె నేత్రాలను బెంగళూరులోని శంకర్ నేత్రాలయానికి అందజేశారు. ఆమెకు భర్త వెంకటరెడ్డి (సెరికల్చర్ విశ్రాంత ఉద్యోగి), కుమారువు దేవనందన్రెడ్డి, కుమార్తె శ్రీదేవి ఉన్నారు. ఆమె అంత్యక్రియలను బుధవారం ఉదయం 9 గంటలకు కదిరిలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
దారి వెంట నీరాజనం..
చిలమత్తూరు: అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు బయలుదేరిన మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా జనం నీరాజనం పలికారు. హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఉదయమే బాగేపల్లి టోల్ప్లాజ్ వద్దకు వేలాదిగా చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ రాకకోసం నిరీక్షిస్తూ గడిపారు. వైఎస్ జగన్ కాన్వాయ్ టోల్ప్లాజా వద్దకు చేరుకోగానే ‘జై జగన్’ అంటూ నినదిస్తూ జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. తనకోసం ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన అభిమానులను చూసి వైఎస్ జగన్ కారులో నుంచే వారికి అభివాదం చేసుకుంటూ.. నేతలను పలకరిస్తూ ముందుకు సాగారు. అభిమాన తరంగం వెంట రాగా వైఎస్ జగన్ కొడికొండ చెక్పోస్ట్, కోడూరు, శెట్టిపల్లి, బూదిలి, గుమ్మయ్యగారిపల్లి క్రాస్, మీదుగా కల్లితండా చేరుకున్నారు. యువత భారీ బైక్ ర్యాలీతో కల్లితండా వరకూ జగన్ కాన్వాయ్ను అనుసరించింది.తిరుగు ప్రయాణంలోనూ అదే అభిమానం..మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించి రోడ్డుమార్గంలో బెంగళూరు బయలుదేరిన వైఎస్ జగన్కు అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. బెంగళూరు మార్గంలోని దారికి ఇరువైపులా నిలబడి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానం చూపారు. -
‘రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నాం’
శ్రీ సత్యసాయి జిల్లా: రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో భాగంగానే వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారని, మరో కార్యకర్తను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని తోపుదుర్తి పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) రామగిరి ఎంపీపి ఎన్నికపై తోపుదుర్తి మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించాయి. టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్ లోనే హింసా రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మెజారిటీ ఉన్నా రామగిరి ఎంపీపీ ఎన్నిక లను బహిష్కరిస్తున్నాం’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. -
వీర జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం: వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని.. ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
మాజీ ఎంపీ దరూర్ పుల్లయ్య కన్నుమూత
వజ్రకరూరు/ ఉరవకొండ: వజ్రకరూరు మండలం ఛాయపురం గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు దరూర్ పుల్లయ్య (93) కన్నుమూశారు. సోమవారం బళ్లారి సమీపంలోని కంప్లి వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రం నుంటి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుకు గురై ఆయన ప్రాణాలు విడిచారు. దరూర్ పుల్లయ్య 1932 జూన్ 20న ఛాయపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు భార్య సత్యవతితో పాటు కుమారుడు దరూర్ రమేష్, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. మద్రాసులోని లా కళాశాలలో దరూర్ పుల్లయ్య బీఏ, బీఎల్ పూర్తి చేశారు. ఆ తరవాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1969 నుంచి 1974 వరకు ఛాయపురం సర్పంచ్గా సేవలందించారు. ఆ తర్వాత ఉరవకొండ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 1977, 1980 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. 1976 నుంచి 1995 వరకు అనంతపురం ఏపీ లైటింగ్ ఎండీగా, కంప్లి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గానూ పనిచేశారు. నీటి పారుదల రంగంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన దరూర్ పుల్లయ్య జిల్లాలో తాగు, సాగునీటి కల్పన కోసం కృషి చేశారు. పుల్లయ్య మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్ జగన్.. అనంతరం తిరుగు పయనమయ్యారు. -
●వాస్తు దోషమని మూతేశారు!
ధర్మవరం రూరల్: స్థానిక మార్కెట్ యార్డ్ మొదటి గేటు కొంత కాలంగా మూత పడింది. మార్కెట్యార్డ్కు రెండు ప్రధాన గేట్లు ఉండగా ఇందులో పట్టణం వైపు నుంచి ప్రవేశించే మొదటి గేటును వాస్తు దోషం ఉందంటూ అధికారులు మూతేశారు. దీంతో మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ రేషన్ గోదాం, ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ గోదాంలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. ప్రస్తుతం సుదూరాన ఉన్న రెండవ గేటు ద్వారానే మార్కెట్ యార్డులోకి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సైన్స్ పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలతో అధికారులు గేటు మూసేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రశాంతి నిలయంలో ఘనంగా బుద్ధపౌర్ణమి
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో బుద్ధపౌర్ణమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్కు చెందిన జోన్–4 మయన్మార్, నేపాల్, శ్రీలంక, జోన్–5 బ్రూనై, ఇండోనేషియా, జపాన్, లావోస్, మలేషియా, సింగపూర్, తైవాన్ దేశాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్రాజు, గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలతో వేడుకలను ప్రారంభించారు. వేడుకలనుద్దేశించి బౌద్ధ ప్రముఖుడు వాస్దేవ్ కిలానీ, బౌద్ధ సన్యాసి కెంపోపెమా వోసెర్ మాట్లాడారు. -
తల్లికి వందనం.. బాబు ద్రోహం
కదిరి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడికెళ్లినా పిల్లలను చూడగానే ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం ద్వారా నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తాం’ అని గొప్పలు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పథకం అమలుకు నోచుకోలేదు. 2024–25 విద్యా సంవత్సరం కూడా ముగిసింది. కానీ నయాపైసా కూడా ఇవ్వలేదు. వచ్చే నెలలో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇలాంటి తరుణంలో ‘ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కాకుండా విడతల వారీగా ఇవ్వాలనుకుంటున్నాం’.. అని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఇది కూడా గతంలో రుణమాఫీ అంశంలో తమను మోసగించినట్లుగానే ఉందని విద్యార్థుల తల్లులు అంటున్నారు. జగన్ హయాంలో రూ.కోట్లలో లబ్ధి.. జగన్ ప్రభుత్వంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,66,398 మంది విద్యార్థులకు రూ.946.41 కోట్ల లబ్ధి చేకూరింది. నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోనే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. కదిరి నియోజకర్గంలో 27,869 మందికి రూ.156.22 కోట్లు, ధర్మవరంలో 28,656 మందికి రూ.164.60 కోట్లు, పుట్టపర్తిలో 23,483 మందికి రూ.133.32 కోట్లు, హిందూపురంలో 27,954 మందికి రూ.160.04 కోట్లు, మడకశిరలో 23,365 మందికి రూ.133.83 కోట్లు, పెనుకొండలో 25,987 మందికి రూ.147.23 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలో 9,084 మందికి రూ.51.25 కోట్లు చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ది చేకూరింది. అంతేకాక జిల్లాలో ‘జగనన్న విద్యాకానుక’ ద్వారా 1,62,699 మందికి రూ.62.21 కోట్లు, ‘జగనన్న వసతి దీవెన’ కింద 43,301 మందికి రూ. 162.38 కోట్లు, ‘జగనన్న విద్యా దీవెన’ కింద 44.082 మందికి రూ.314.91 కోట్ల లబ్ది చేకూరింది. నిధుల కేటాయింపులోనే కలవరం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ‘తల్లికి వందనం’ అని పేరు మార్చడం తప్ప చేకూర్చిన లబ్ధి అంటూ ఏదీ లేదు. 2025–26కు సంబందించి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ‘తల్లికి వందనం’ పథకానికి కేవలం రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిని చూడగానే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరిచారు. గత జగన్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు చొప్పున లబ్ధి చేకూరిస్తే ఏడాదికి జిల్లాలోని విద్యార్థులకు రూ.250 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ లెక్కన తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ పథకం లబ్ధి చేకూర్చాలంటే చంద్రబాబు సర్కార్ కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోవని తేల్చేశారు. అలా కాకుండా ఇంట్లో ఒక్కరికే పథకం లబ్ధి చేకూర్చినా ఈ నిధులు సరిపోవని అంటున్నారు. పథకం అమలుపై కమ్ముకున్న నీలి నీడలు విడతల వారీగా ఇస్తామంటున్న సీఎం చంద్రబాబు బాబు మాటలు నమ్మబోమంటున్న తల్లులు పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించే అమ్మ ఒడి పథకాన్ని కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ సాక్షిగానూ ప్రకటించారు. అయితే పథకం అమలులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ.. తాజాగా విడతల వారీగా ఇస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనపై విద్యార్థుల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు విధిస్తే ఒప్పుకోం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండానే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేయాల్సిందే. నిబంధనల పేరుతో కోతలు విధించాలని చూస్తే ఊరుకోం. – రాజేంద్రప్రసాద్ యాదవ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బకాయి కలిపి చెల్లించాలి ‘తల్లికి వందనం’ పథకం కింద గత విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన బకాయితో కలిపి ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపు మొత్తం నగదు మంజూరు చేయాలి. అది కూడా విడతల వారీగా కాకుండా అంతా ఒకేసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలి. షరతులు వర్తిస్తాయని సాకులు చెబితే ఒప్పుకోం. – బాబ్జాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
ఔను ఇది సచివాలయమే...
రామగిరి: మండలంలోని పెద్ద కొండాపురం గ్రామంలో ఉన్న సచివాలయానికి రెండు రోజుల క్రితం స్థానిక టీడీపీ నేతలు పసుపు రంగు వేసి, కార్యాలయం ఎదుట జెండా స్తంభానికి పార్టీ జెండాను ఎగురవేశారు. దీంతో వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారు ఆశ్చర్యపోతూ ప్రభుత్వ కార్యాలయాన్ని మరో చోటుకు మార్చి ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు కాబోలని వెనుదిరుగుతున్నారు. రంగు వేసిన కొత్తలో అధికారులు సైతం ఇలాగే పొరబడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయానికి వేసిన రంగును మార్చాలని పలువురు కోరుతున్నారు. -
వైభవంగా మల్లెపూల ఉత్సవం
కదిరి టౌన్: వైశాఖ శుద్ద పౌర్ణమిని పురస్కరించుకుని కదిరిలోని మద్దిలేరు ఒడ్డున ఉన్న మల్లెపూల మంటపం వద్ద సోమవారం సాయంత్రం శ్రీవారి మల్లెపూల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు మల్లెపూల మంటపం వద్దకు స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీలో చేర్చారు. అనంతరంశ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుడి ఉత్సవమూర్తులను మల్లెపూలతో ప్రత్యేక అలంకరించారు. ఉభయదారులుగా కదిరికి చెందిన మల్లెపూల నరసయ్య కుమారులు వ్యవహరించారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
‘సర్పంచ్పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి’
పెనుకొండ రూరల్: సోమందేలపల్లి మండలం నాగినాయనిచెరువు సర్పంచ్ అంజినాయక్పై ఆదివారం నల్గొండ్రాయునిపల్లి, సోమందేపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు 30 మంది మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ సోమవారం బాధితుడు అంజినాయక్తో కలసి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నర్శింగప్పకు విన్నవించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పట్టణ, మండల కన్వీనర్లు నరసింహులు, సుధాకర్రెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, మండల కన్వీనర్ గజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. వీరజవాన్ మురళీనాయక్ త్యాగం జాతి మరవదు ● వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ గోరంట్ల: వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరిచిపోదని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వెఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోమవారం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ను పరామర్శించారు. అనంతరం వీరజవాన్ మురళీనాయక్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుమూకలతో మురళీనాయక్ సాగించిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గోరంట్ల జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాంనాయక్, శింగనమల వైఎస్సార్సీపీ నాయకులు కాటమయ్య, ప్రసాద్, శివశంకరనాయక్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్కు జ్ఞానీ జైల్సింగ్ స్మారక పురస్కారం తాడిమర్రి: మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నీరుగట్టు వెంకటేష్కు మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్సింగ్ స్మారక పురస్కారం దక్కింది. గత 30 ఏళ్లుగా వివిధ దిన పత్రికల్లో విలేకరిగా ఆయన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయూ) యూనియన్ స్థాపించి ఐదు వసంతాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ స్పీకర్ షరీఫ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గోరంట్లలో అగ్ని ప్రమాదం గోరంట్ల: స్థానిక పోలీసుస్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీనివాస కాటన్ బజార్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోరంట్ల పట్టణానికి చెందిన ఇద్దరి భాగస్వామ్యంతో తమిళనాడుకు చెందిన గోకుల్ అనే వ్యక్తి శ్రీనివాస కాటన్ బిగ్ బజార్ ఏర్పాటు చేశారు. సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు రాజుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.50 లక్షల పైచిలుకు దుస్తులు, ఓ ద్విచక్ర వాహనం, ఆరు సీసీ కెమెరాలు కాలిపోయాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 26 నుంచి అగ్నివీర్ మురళీనాయక్ స్మారక క్రికెట్ టోర్నీ అనంతపురం: ఆపరేషన్ సిందూర్లో భాగంగా అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ స్మారకార్థం ఈ నెల 26 నుంచి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడా జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 80085 50464, 79893 69100, 73969 27271, 98855 31051, 94407 58953లో సంప్రదించాలని కోరారు. -
ప్రతి సమస్యకూ సంతృప్తికర పరిష్కారం చూపండి
ప్రశాంతి నిలయం: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసే వినతులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 172 వినతులు అందాయి. కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులకు వర్చువల్ విధానంలో రాష్ట్ర స్థాయి కేపీఐల శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 14న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అలాగే మండల స్థాయి అధికారులందరూ వారివారి మండల స్థాయిలో జరిగే శిక్షణకు హాజరు కావాలన్నారు. అన్ని శాఖల ప్రధాన హెచ్ఓడీలు నెలవారీ కార్యాచరణ ప్రణాళిక నివేదికలు, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జూన్ 5న జిల్లా అంతటా అన్ని ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఇందుకు ఎన్ని మొక్కలు అవసరమవుతాయో ముందస్తుగానే నివేదికలు సిద్ధం చేసి డీఎఫ్ఓకు మంగళవారం లోపు అందజేయాలన్నారు. జిల్లాలో అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్కుమార్, డీఆర్వో విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్దక శాఖ జేడీ శుభదాస్, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఏపీఎంఐసీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్కుమార్, ఎల్డీఎం రమణకుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం, డీఈఓ కృష్ణప్ప, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీసహానీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
రీసర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలి: జేసీ
ప్రశాంతి నిలయం: భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రీ సర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్ఎస్, రీ సర్వే అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో జిల్లాలోని 32 గ్రామాల్లో చేపట్టిన సర్వే పనులు ఎలా జరుగుతున్నాయో సంబంధిత ఆర్డీఓలు పరిశీలించాలన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు బృందాలుగా ఏర్పడి రీసర్వే పూర్తి చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఐకాన్ యూత్’ సదస్సుకు మదీహహిందూపురం టౌన్: ‘భవిష్యత్ భారతావని యువత ముందున్న సవాళ్లు’ అనే అంశంపై మంగళూరులోని యెన్ఫోయా విశ్వవిద్యాలయంలో వేదికగా ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే అంతర్జాతీయ సదస్సు ‘ఐకాన్ యూత్ 2025’కు హిందూపురంలోని ఎస్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎ.మదీహ ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి సోమవారం తెలిపారు. రాష్ట్రం తరఫున నలుగురు పాల్గొంటుండగా...అందులో తమ కళాశాల విద్యార్థి కూడా ఉండటం గర్వకారణమన్నారు. ‘ఆధునిక యుగంలో ప్రజారోగ్య ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించడంలో యువత పాత్ర’ అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ రూపంలో మదీహ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సెమినార్కు ఎంపికై న విద్యార్థినిని కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రంగనాయకులు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సహచర విద్యార్థులు అభినందించారు. ‘పోలీసు స్పందన’కు 70 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి అర్బన్ డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా... నేటికీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. పాఠశాలల పునర్వవ్యవస్థీకరణను పారదర్శకంగా చేపట్టాలన్నారు. బదిలీలు, పదోన్నతుల్లో అశాసీ్త్రయ విధానాలు వీడాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక పాఠశాలలో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని, అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలలో 5 తరగతులను బోధించటానికి ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్ హెచ్ఎం పోస్టు అదనంగా కేటాయించాలన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య 120 దాటితే ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించాలని, ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని కేటాయించాలని, అన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియంను కొనసాగించాలన్నారు. బదిలీ జీఓ వెంటనే విడుదల చేసి వేసవిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనంతరం శిబిరం వద్దకు వచ్చిన డీఈఓ కృష్ణప్పకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, గౌరవాధ్యక్షుడు భూతన్న, బాబు, శ్రీనివాసులు, నారాయణ, శివశంకర్, అనిల్కుమార్, మారుతి, తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో యూటీఎఫ్ నేతల డిమాండ్ -
నిబంధనలు సవరించాలి
రూ. 5,11,65,000సాక్షి, పుట్టపర్తి గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందించగలిగితే చిన్నా చితకా ఆరోగ్య సమస్యలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రులకొచ్చే రోగుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా ఆయా వైద్య కేంద్రాలు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుంది. అందువల్లే గడచిన ఐదేళ్లలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్లు అందుబాటులోకి తెచ్చి సిబ్బందిని నియమించి ఇళ్ల ముంగిళ్లలోనే సేవలందించారు. కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బందిని కొత్తకొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తోంది. పైగా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఇప్పటికే ఎంపీహెచ్ఏ (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్)లలో చాలామందిని ఉద్యోగం నుంచి తప్పించింది. మరోవైపు ముఖ్యమంత్రి ఐ కేర్ సేవలకు మంగళం పాడింది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే సీహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లపై కత్తి పెట్టింది. 9 నెలలుగా అందని ఇన్సెంటివ్.. ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో భాగంగా 2019లో ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ కింద బీఎస్సీ నర్సింగ్ అర్హతతో ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్)ల నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత వారి పోస్టును సీహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు)గా మార్చారు. ఇలా జిల్లాలో 379 మంది పనిచేస్తున్నారు. వీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి నెలకు రూ.25 వేల వేతనం, ఇన్సెంటివ్ రూపంలో మరో రూ.15 వేలు ఇస్తున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యసేవలందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం జీతం మాత్రమే చెల్లిస్తూ అదనంగా అందాల్సిన ఇన్సెంటివ్ రూ.15 వేలు ఇవ్వడంలేదు. దీంతో గత ఏప్రిల్ 28వ తేదీ నుంచి విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. అయినా పాలకులు ఇప్పటి వరకు స్పందించలేదు. రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేశ్కు కూడా సీహెచ్ఓలు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదు. సరికొత్త నిబంధనతో మెలిక.. సీహెచ్ఓలకు ఇవ్వాల్సిన రూ.15 వేలు ఇన్సెంటివ్ అనేది సర్వీసుకు సంబంధించిన అంశం. అయితే కూటమి ప్రభుత్వం ఉదయం 8 గంటలకు.. రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ (అటెండెన్స్) వేయాలనే కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. అలా చేయకపోతే ఇన్సెంటివ్లో రూ.5 వేలు కట్ చేస్తామని సర్కారు బెదిరింపులకు దిగింది. అంతేకాకుండా స్థానికంగా ఉండాలని ఆదేశించింది. అయితే జిల్లాలో ఉన్న 379 మంది సీహెచ్ఓల్లో 351 మంది మహిళలు ఉన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న కేంద్రాల్లో పనిచేసే వారు ఎక్కువే ఉన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ వేసి మండల కేంద్రాల్లోని ఇళ్లకు ఎలా చేరుకోవాలో అర్థం కావడం లేదని సీహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాడి తప్పిన వైద్యసేవలు.. పల్లెల్లో వైద్య సేవలందించే సీహెచ్ఓలు గ్రామీణులకు ఎలాంటి ఆనారోగ్య సమస్య తలెత్తినా పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం వారంతా సమ్మె బాట పట్టగా.. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు రోగులకు మాత్రలిచ్చిపంపుతున్నారు. దీంతో గ్రామీణులు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.సీహెచ్ఓలకు ప్రభుత్వం బకాయిగా ఉన్న ఇన్సెంటివ్ మొత్తం113379గ్రామీణ ప్రాంతాల్లో కీలకంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ)ను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ పనివేళలు నిర్ణయించడంతో పాటు ప్రతి నెలా ఇన్సెంటివ్ రూపంలో అందించాల్సిన రూ.15 వేలు ఎగ్గొట్టేందుకు సిద్ధమైంది. దీంతో వారంతా 15 రోజులుగా సమ్మెబాట పట్టగా పల్లెల్లో వైద్యం పడకేసింది. బకాయిలపై స్పష్టత ఇవ్వాలిపెండింగులో ఉన్న ఇన్సెంటివ్పై ఇటీవల పాలకులు స్పందించి ఆర్నెల్ల ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు.. కానీ ఎప్పటి లోపు జమ చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. పాత బకాయిలతో పాటు ప్రతి నెలా ఇన్సెంటివ్ సక్రమంగా ఇవ్వాలని కోరుతున్నాం. – కార్తీక్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, సీహెచ్ఓల సంఘం రాత్రి 8 తర్వాత ఎఫ్ఆర్ఎస్ వేయాలంటే కర్ణాటక సరిహద్దున ఉండే కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కొత్త నిబంధనలపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాం. ఎఫ్ఆర్ఎస్ లేకపోతే రూ.5 వేల కోత విధించడం సబబు కాదు. – సుమ, సీహెచ్ఓ, అమరాపురం డిమాండ్లు ఇవే.. సర్వీసు ఆరేళ్లు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేయాలి. ప్రతి నెలా రూ.15 ఇన్సెంటివ్ ఇవ్వాలి. క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి. స్థానికంగా ఉండాలనే నిబంధన అమలు చేస్తే అదనంగా మరో రూ.5 వేలు ఇవ్వాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు పరిగణించాలి. 9 నెలలుగా పెండింగులో ఉన్న ఇన్సెంటివ్పై స్పష్టత ఇవ్వాలి.‘‘మీ అర్హతకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 వేలు కూడా రాదు. కానీ ప్రభుత్వం రూ.25 వేలు ఇస్తోంది. మీరు ధర్నాలు చేసినా.. ఏఎన్ఎంలతో డ్యూటీ చేయిస్తాం. ప్రభుత్వానికి మరో రూ.500 కోట్లు మిగులుతాయి.’’ – సీహెచ్ఓలను తొలగిస్తామంటూ ఈనెల 4వ తేదీన మంత్రి సత్యకుమార్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు -
నేడు కల్లితండాకు వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకాశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు.రండి.. వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిద్దాంకార్యకర్తలకు ఉషశ్రీచరణ్ పిలుపుసోమందేపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు విచ్చేస్తున్నారని, పార్టీ శ్రేణులు తరలిరావాలని ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె జెడ్పీటీసీ సభ్యుడు అశోక్ నివాసంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఉదయం 11.30 గంటలకు వీర జవాన్ మరళీ నాయక్ నివాసానికి చేరుకుంటారని తెలిపారు. వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నియోజక వర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యర్తలు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, పట్టణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, సర్పంచ్లు అంజినాయక్, జిలాన్ఖాన్, ఎంపీటీసీ నాగప్ప, నాయకులు ఆదినారాయణరెడ్డి, జితేంద్ర రెడ్డి, రమేష్, కళ్యాణ్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసులా?
చెన్నేకొత్తపల్లి: ‘‘ టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి గత నెల 8న హెలికాప్టర్లో తమ నాయకుడు వైఎస్ జగన్ వస్తే హెలిప్యాడ్ వద్ద తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రజలు హెలికాప్టర్ వరకూ దూసుకెళ్లారు. నేనే మైక్ తీసుకుని వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాను. అయినా అభిమానులు దూసుకెళ్లడంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినింది. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమే. కానీ జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసు పెట్టారు’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ సంఘటనకు సంబంధించి సోమవారం చెన్నేకొత్తపల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. లింగమయ్యను అగ్రకులాలకు చెందిన వారు కొందరు హత్య చేసినా.. వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ హత్యలో ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, బంధువుల హస్తం ఉందని తోపుదుర్తి ఆరోపించారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవలు జరిగాయని, తర్వాత పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడిన వారితో కలిశారన్నారు. ఈ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు తప్పుదోవ పట్టించే విధంగా రకరకాలుగా ప్రసారం చేశాయన్నారు. వాస్తవాన్ని వదలి ప్రజల దృష్టిని మరల్చే విధంగా కొన్ని వ్యవహరించాయన్నారు. హెలిప్యాడ్ వద్ద ఎక్కువ జనం రావడంతో పోలీసు ఉన్నతాధికారి సూచన మేరకు తాను మైక్ ద్వారా సంయమనం పాటించాలని హెలిప్యాడ్ వద్దకు వెళ్లరాదని సూచించానన్నారు. ఇవన్నీ వదిలి నాపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయడం మాని, రక్తపాతం సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రకాష్రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు ఉన్నారు. పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటన పోలీసుల వైఫల్యమే సంబంధం లేని నాపై కేసు పెట్టారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవండి
చిలమత్తూరు: ‘‘ఏదైనా పదవి కావాలంటే ప్రజాభిమానంతో దక్కించుకోవాలి. కానీ ఇలా దిగజారి ప్రవర్తించకూడదు. మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవండి..ఇలా ఒక పార్టీపై గెలిచిన వారిని లాక్కుని వారి ద్వారా పదవులు పొందడం ఏమిటి’’ అంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. సోమవారం ఆమె హిందూపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కౌన్సిలర్లు, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలకు పదవులపై ఇంత పిచ్చి ప్రేమ దేనికని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడం మాని... ప్రజాస్వామ్యబద్ధంగా పొందిన పదవులను నిస్సిగ్గుగా దక్కించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పట్టణంలో అభివృద్ధి చూడకుండా నీచమైన పనులకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ పీఠం దక్కించుకున్నామని... ఇప్పుడు వైస్ చైర్మన్ పదవి కూడా దక్కించుకోవాలని చూస్తే తమ ప్రణాళికలు తమకు ఉంటాయన్నారు. తమ పార్టీ కౌన్సిలర్లు కొందరు ప్రలోభాలకు లొంగిపోయారని, కానీ అందరూ అలా ఉండరన్న విషయం ఇప్పటికై నా ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్తించాలన్నారు. తమ పార్టీలో నిజాయితీ పరులు ఉన్నారన్నారు. ప్రజల అండ, ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండ ఉంది కాబట్టే ఈరోజు టీడీపీ కుట్రలనుతిప్పి కొట్టామని వైస్ చైర్మన్ జబీవుల్లా భావోద్వేగంగా మాట్లాడారు. పదవులు తమకు లెక్కకాదని, కానీ టీడీపీ నేతలు తీసుకున్నట్లుగా దొడ్డిదారిలో వచ్చే పదవులు తనకొద్దన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ జబీవుల్లా, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వెంకట నాగేంద్రబాబు, షాజియా, గుడ్డం దాదు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కవితారెడ్డి, అబ్దుల్సలాం, శ్రీకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బలం లేకపోయినా వైస్ చైర్మన్పై అవిశ్వాసం ఎలా పెడతారు ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతల తీరుపై టీఎన్ దీపిక మండిపాటు -
హంసవాహనంపై దేవదేవుడు
ధర్మవరం అర్బన్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి సోమవారం హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 6 గంటలకు వసంతోత్సవం, 10 గంటలకు చక్రస్నానం చేయించారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులకు పసుపు, కుంకుమతో పాటు వివిధ రకాల రంగులతో వసంతోత్సవం జరిపించారు. ఉభయ దాతల ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై చెన్నకేశవస్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు దేవతా ఉద్వాసన నిర్వహించనున్నామని ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. -
పారని టీడీపీ పాచిక
చిలమత్తూరు: పురం వైస్ చైర్మన్ అవిశ్వాసంలో టీడీపీ పాచిక పారలేదు. తగిన బలం లేకపోయినా చైర్మన్ పీఠం లాగే, వైస్ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుందామనుకున్న టీడీపీ నేతలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ కూడా హాజరుకాకపోవడంతో ఆర్డీఓ సమావేశం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఒక్కరూ రాలేదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. సరైన బలం లేకపోయినా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకునేందుకు అవిశ్వాస తీర్మాణం పెడుతోంది. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోబాలకు గురిచేసి, అధికారంతో భయపెట్టి తమవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే హిందూపురం చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. తాజాగా వైస్ చైర్మన్గా ఉన్న జబీవుల్లాను తప్పించి ఆ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే సోమవారం ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని అధికారులతో ఏర్పాటు చేయించింది. వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి 27 మంది మద్దతు తెలపాల్సి ఉండగా..ఉదయం 11 గంటలకు సభ్యులు ఎవ్వరూ హాజరు కాకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ ఆనంద్ కుమార్ సమావేశాన్ని 12 గంటలకు వాయిదా వేశారు. ఆ సమయానికి కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరు కాకపోవడంతో మినిట్స్ నమోదు చేసిన ఆర్డీఓ విషయాన్ని కలెక్టర్కు సమాచారం అందించి వెళ్లిపోయారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన వైఎస్సార్ సీపీ.. వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమ పార్టీ సభ్యులు సమావేశానికి వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో చతికిలపడ్డ చైర్మన్ రమేష్, టీడీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయానికే పరిమితమయ్యారు. టీడీపీ కుటిల బుద్ధితో అక్రమ మార్గాలలో వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూడటంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేశారు. కాగా సమావేశం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘పురం’ వైస్ చైర్మన్ పీఠం కోసం దిగజారుడు రాజకీయం బలం లేకపోయినా అవిశ్వాసం నోటీసు ఇచ్చిన టీడీపీ నేతలు అవిశ్వాస తీర్మానానికి సభ్యులంతా గైర్హాజరు కలెక్టర్కు సమాచారం ఇచ్చి వెనుదిరిగిన ఆర్డీఓ -
వీరుడా.. సెలవిక
పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో అమరుడైన ముదావత్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. తండోపతండాలుగా జనం శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాకు తరలివచ్చి వీర జవాన్కు అశ్రు నివాళులర్మించారు. జోహార్ మురళీ నాయక్.. జై జవాన్.. భారత్ మాతాకీ జై.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు.సాక్షి, పుట్టపర్తి: కశ్మీర్లో విధి నిర్వహణలో ఉండగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మరణించిన అగ్నివీర్ ముదావత్ మురళి నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాలో మురళి నాయక్ భౌతికకాయాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. శనివారం రాత్రి భౌతికకాయం స్వగ్రామానికి చేరుకోగా.. అప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు తండోపతండాలుగా జనం తరలివచ్చి వీర జవాన్కు అశ్రు నివాళులర్పించారు.జోహార్ మురళి నాయక్.. మురళి నాయక్ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై.. జై హింద్.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు. తమ ఊరి యువకుడు దేశం కోసం ప్రాణాలర్పించడం ఓవైపు గర్వంగా ఉన్నప్పటికీ.. మరో వైపు తీవ్ర బాధతో ఉన్నామని గ్రామస్తులందరూ భావోద్వేగానికి గురయ్యారు. మురళి నాయక్ కుటుంబ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పర్యవేక్షణలో కల్లి తండాలో ఏర్పాట్లు జరిగాయి. కాగా, అగ్నివీర్ మురళి నాయక్ భౌతిక కాయం వద్ద ఘనంగా సైనిక వందనంతో నివాళులర్మించిన అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈర లక్కప్ప, దీపిక, మక్బుల్ తదితరులు మురళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్పీ వి.రత్న నేతృత్వంలో కల్లి తండాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆస్తి ఇచ్చినా.. ఆనందం లేకపాయెవీరజవాన్ మురళినాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల్లో ఇంటి నిర్మాణం, తండ్రి శ్రీరామ్ నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. తన వంతు సాయంగా మరో రూ.25 లక్షలు ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ‘ఆస్తులు ఇచ్చినా.. ఇల్లు కట్టించినా.. అనుభవించేందుకు, ఆనందించేందుకు మా బిడ్డ లేకపాయె కద సారూ.. నా బిడ్డ దేశం కోసం ప్రాణాలొదిలాడని గర్వంగా అందరూ చెబుతున్నా.. కన్నపేగు బాధ ఎవరికి తెలుసయ్యా’ అంటూ మురళినాయక్ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని విలపించారు. తామిక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి!
రాయదుర్గం: ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి నెల రోజుల ముందే విద్యార్థుల ప్రవేశాలకు టార్గెట్ విధిస్తూ.. సిబ్బందిని ఆయా పాఠశాలల యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి. పిల్లలను చేర్పిస్తేనే కొలువు ఉంటుందని, లేకపోతే ఇతర జీవనోపాధులు చూసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో తమ ఉద్యోగ భద్రత కోసం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 3,243, ప్రాథమికోన్నత 502, ఉన్నత పాఠశాలలు 1,539 ఉన్నాయి. వీటిలో 1,270కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, ఉన్నాయి. వీటన్నింటిలో 2024–25 విద్యా సంవత్సరంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు 3,57,363 మంది, 9 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 87,897 మంది ఉన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు వేసవి సెలవుల్లోనే తరగతుల వారీగా అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి. ఇందు కోసం తమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టార్గెట్లు నిర్దేశించి అడ్మిషన్లు చేయించగలిగితేనే ఉద్యోగాలు ఉంటాయని, లేకపోతే ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో రాయదుర్గంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉద్యోగాలు మానుకున్నారు. భారీగా ఫీజులు.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ నిబంధన జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ అమలు కావడం లేదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు దండుకుంటున్నారు. టెక్నో, ఈ టెక్నో, సీబీఎస్ఈ, ఐఐటీ కోచింగ్, అబాకస్, స్ఫోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్, పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపుతున్నారు. దీనికి అదనంగా యూనిఫాంలు, పుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, సాక్సులు, టై లాంటివి ఆయా పాఠశాలల్లోనే అధిక ధరకు విక్రయాలు చేపట్టారు. చాలీచాలని వేతనాలు.. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాజమాన్యాలు చాలీచాలని వేతనాలిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాథమిక స్థాయి విద్యాబోధకులకు నెలకు రూ.4,500 నుంచి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ జీఓ ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులో 59 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు కేటాయించాలి. కానీ, ఈ విధానం ఎక్కడేగాని అమలు కావడం లేదు. ఎన్నికల ప్రచారంలా ఊరూర క్యాంపెయినింగ్ టెక్నో, ఈ టెక్నో, సీబీఎస్ఈ పేరుతో విద్యార్థులకు వల చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు తడిసిమోపడవుతున్న ఫీజులుఅడ్మిషన్ల పేరుతో వేధిస్తే చర్యలు అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను , టీచర్లను వేధింపులకు గురిచేస్తే ప్రైవేటు పాఠశాలల యజమానులపై కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే అడ్మిషన్లు చేపట్టాలి. దీనికి విరుద్దంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ బడుల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసాద్బాబు, డీఈఓ, అనంతపురంచర్యలు తీసుకోవాలి అడ్మిషన్ల పేరుతో ప్రైవేటు ఉపాధ్యాయుల్ని యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వేసవి సెలవుల్లోనే అడ్మిషన్లు మొదలు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఇటీవల రాయదుర్గంలోని నారాయణ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించాం. విద్యాశాఖ అధికారులు పరిశీలించి కట్టడి చేయాలి. ముందస్తు పాఠ్య, నోట్ పుస్తకాలు, షూ, బెల్టు లాంటి విక్రయాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి. – ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి, రాయదుర్గం -
సెమీ ఫైనల్కు అనంత, కదిరి జట్లు
అనంతపురం: సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు, దివంగత చంద్రమోహన్ స్మారకార్థం నిర్వహిస్తున్న టోర్నీలో సెమీఫైనల్కు అనంతపురం రైజింగ్ స్టార్, కదిరి జట్లు చేరుకున్నాయి. తాడిపత్రి దినేష్ గ్రానైట్స్, అనంతపురం రైజింగ్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దినేష్ గ్రానైట్స్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 17.1 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంత రైజింగ్ స్టార్ జట్టు 17 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులతో విజయాన్ని కై వసం చేసుకుంది. ● కదిరి, తాడిపత్రి ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో కదిరి జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి 62 పరుగులు చేసింది. జట్టులో పి. గిరినాథరెడ్డి 45 పరుగులు , వి.భాను ప్రకాష్ 30 పరుగులు, కె.ప్రశాంత్ 39 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన తాడిపత్రి ఎలెవన్ జట్టు 131 పరుగుల వద్ద చతికిలపడింది. దీంతో అనంతపురం రైజింగ్ స్టార్, కదిరి జట్లు సెమీఫైనల్కు చేరాయి. మాజీ రంజీ ఆటగాడు షాబుద్దీన్, ఏడీసీఏ అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్రెడ్డి, సెక్రెటరీ వి. భీమలింగా రెడ్డి, వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీనియారిటీ సమస్యను పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ స్కూళ్ల టీచర్ల సీనియార్టీ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం, హిందూపురం, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీల్లో 2012 డీఎస్సీకి సంబంధించి జాయినింగ్ తేదీని ఒక్కో మునిసిపాలిటీలో ఒక్కో విధంగా నమోదు చేశారని గుర్తు చేశారు. కదిరి మునిసిపాలిటీలో 2013 జనవరి 2గా, తాడిపత్రి మునిసిపాలిటీలో 2012 డిసెంబరు 31గా, ధర్మవరం మునిసిపాలిటీలో 2013 జనవరి 10గా, రాయదుర్గం మునిసిపాలిటీలో 2013 జనవరి 5గా, హిందూపురం మునిసిపాలిటీలో 2013 జనవరి 4గా నమోదు చేశారన్నారు. ఒకే డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయినప్పటికీ జాయినింగ్ తేదీలు వేర్వేరుగా ఉండడం వలన సీనియారిటీకి, తర్వాత పొందే పదోన్నతులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. సమస్య పరిష్కారానికి వీరందరికీ కామన్ జాయినింగ్ తేదీ 2012, డిసెంబరు 31గా నమోదు చేయాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సుధాకర్ ఉన్నారు. -
పీఆర్సీని ప్రకటించాలి
ధర్మవరం అర్బన్: తక్షణమే 12వ పీఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, కె.మనోహర్ డిమాండ్ చేశారు. ధర్మవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కమిషన్ ఏర్పాటు ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు 30శాతం మద్యంతర భృతి ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. మెమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004కు ముందు నియామకమైన 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు లక్ష్మయ్య, అమర్నారాయణరెడ్డి, బిల్లే రామాంజనేయులు, సకల చంద్రశేఖర్, పెద్దకోట్ల సురేష్, కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. ఖాద్రీ ఆలయానికి పోటెత్తిన భక్తులు కదిరి టౌన్: ఓం నమో నరసింహ...అంటూ గోవింద నామస్మరణతో ఖాధ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి జన్మదినం స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. స్వామి కాపులు తలనీలాలు సమర్పించారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది. ముందుగానే ‘నైరుతి’ అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్రన్ మాన్సూన్స్) ఈ సారి ముందుగానే పలకరించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 27న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్) ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలిస్తే ఉమ్మడి జిల్లాలో జూన్ ఒకటి, రెండో తేదీల్లోనే ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. 2020లో జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న ప్రవేశించాయి. ఈ సారి మే 31న తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేయగా... తాజాగా నాలుగు రోజులు ముందుగానే మే 27నే పలకరించవచ్చని ప్రకటించడం విశేషం. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా ముందుగానే ‘నైరుతి’ పలకరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రుతుపవనాల ప్రవేశంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తాయి. ఖరీఫ్కు కీలకం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగయ్యే లక్షలాది హెక్టార్ల పంటలకు నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలే ఆధారం. జూన్–సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్లో 110.9 మి.మీ మేర వర్షపాతం నమోదు కావాలి. నాలుగు నెలల కాలంలో 30 నుంచి 40 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావొచ్చని, విస్తారంగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగు ఊపందుకుంటుందని చెబుతున్నారు. -
మురళీనాయక్ ప్రాణత్యాగం వృథా కాదు
గోరంట్ల: పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ ప్రాణత్యాగం వృఽథా కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్తో కలసి ఆదివారం గోరంట్ల మండలం కల్లితండాకు విచ్చేసిన ఆయన... మురళీనాయక్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీరజవాన్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం మురళీనాయక్ చేసిన పోరాటం లక్షలాదిమంది యువతకు స్ఫూర్తినిచ్చిందన్నారు. వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
రేపు కల్లితండాకు వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ముడావత్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ నెల 13న గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లి తండాకు చేరుకుంటారు. వీరజవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్ను పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.లేపాక్షి అభివృద్ధికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలులేపాక్షి: పర్యాటక ప్రాంతం లేపాక్షిని రూ.3కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ అధికారి పద్మరాణి, ప్రైవేటు కన్సల్టెంట్ అధికారి నిష్టాగోయల్ తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం వారు లేపాక్షిని సందర్శించారు. పర్యాటక అభివృద్ధి కోసం నంది విగ్రహం, థీమ్ పార్కు, జఠాయువు పక్షి, జఠాయువు ఘాట్, బింగిపల్లి వద్ద వున్న చింత తోపు, అక్కడున్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న లేపాక్షి ఎంపోరియం భవనాన్ని కూడా పరిశీలించారు. అనంతరం పాతూరులో పట్టు పురుగుల పెంపకం షెడ్డు, చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారితో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రూ. 3 కోట్ల నిధులతో లేపాక్షిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో జీవనోపాధులు పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బింగిపల్లి వద్దనున్న ప్రభుత్వ భూమిలో అందమైన పార్కులు అభివృద్ధి, పట్టు పురుగు పెంపకం ద్వారా ఎలాంటి అభివృద్ధి చేయవచ్చు, నిరుపయోగంగా ఉన్న ఎంపోరియం భవనంలో చేతి వృత్తులు నిర్వహించే వారికి స్టాళ్లు ఏర్పాటు చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. అనంతరం వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ ఆదినారాయణతో పాటు డీఆర్డీఏ పీడీ, టూరిజం శాఖ ఇన్చార్జ్ అధికారి నరసయ్య, ఎంపీడీఓ నరసింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి సాయిప్రసాద్, విజయ్, మారుతి, మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణ వారి వెంట ఉన్నారు. -
సింహ, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి వైభవం
ఉరవకొండ రూరల్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి వారు సింహ, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని సింహ, చంద్రప్రభ వాహనాలపై ఆసీనులను చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగించగా.. భక్తులు శ్రీవారిని దర్శించుకుని పరవశించారు. అంతకుముందు లక్ష్మీనృసింహుని జయంతి సందర్భంగా పుష్పాలతో మూలవిరాట్ను అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి, ఈఓ సాకే రమేష్బాబు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. నేడు పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. -
ప్రముఖుల నివాళి..
గోరంట్ల: పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ భౌతికకాయాన్ని మిలటరీ, ప్రభుత్వ అధికారులు శనివారం రాత్రి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో మిలటరీ వాహనంలో కల్లితండాకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు మురళీనాయక్ భౌతికకాయాన్ని ప్రజల సందర్భనార్థం ఉంచారు. వేలాదిమంది ప్రజలు, బంధుమిత్రులు, గ్రామస్తులతో పాటు అధికారులు, రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కల్లితండాకు చేరుకుని మురళీనాయక్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సవిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ బీకే పార్థసారథి, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాయదుర్గం ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్, ఎంఎస్ రాజు, కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తదితరులు మురళీనాయక్ భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, పార్టీ మడకశిర, హిందూపురం, కదిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్తో పాటు అత్తార్ చాంద్బాషా, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వీరజవాన్కు నివాళులర్పించారు. జవాన్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్నాయక్ను పరామర్శించారు.కన్నపేగు కన్నీటి వేదన చూసి.. పుట్టిన తండా నుంచి మంచు కొండల శిఖరాల వరకు గుండె తడి చేసుకుంది. సైనిక దుస్తుల్లో కన్నీళ్లను కనిపించకుండా చివరి వీడ్కోలు పలికిన సహచరులను చూస్తూ.. భరతజాతి యావత్తూ సెల్యూట్ చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో మెదులుతుండగా.. మన వీరుడి భౌతికకాయం చూసి యావత్ గూడెం గుండె తరుక్కుపోయింది. దేశాన్ని భద్రంగా గుండెల్లో దాచుకున్న వీరుడా.. ధీరుడా.. కోట్లాది హృదయాల్లో కొలువైన ఓ అమరుడా.. మన దేశం కోసం మళ్లీ ఎప్పుడు జన్మిస్తావ్.. అంటూ కల్లితండాతో పాటు యావత్ భారత్ ప్రార్థిస్తోంది. సాక్షి, పుట్టపర్తి: కల్లితండా శోకసంద్రంగా మారింది. అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియలతో యావత్ భారతావని కల్లి తండా వైపు చూసింది. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 9న పాకిస్తాన్ ముష్కరుల తూటాలకు కశ్మీర్లో అశువులు బాసిన ముడావత్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం స్వగ్రామం కల్లితండాలో జరిగాయి. 11 గంటల తర్వాత ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరిని పలకరించినా భావోద్వేగానికి గురయ్యారు. మురళితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. దేశం కోసం తండావాసి పోరాటం చేశాడనే గర్వం ఓ వైపు ఉన్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోయాడనే బాధ ఆగడం లేదని ప్రతి ఒక్కరి మాటలోనూ కనిపించింది. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతికకాయం చూసేందుకు ఆదివారం ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దారులన్నీ కల్లితండా వైపు సాగాయి. మురళీనాయక్తో పరిచయం లేకున్నా.. యుద్ధవీరుడు.. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ను కడసారి చూసేందుకు వచ్చినట్లు చాలామంది చెప్పారు. కల్లితండా నుంచి కశ్మీర్ వరకు.. మురళీనాయక్ జన్మించింది ఓ మారుమూల గ్రామం. గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది. జ్యోతిబాయి, శ్రీరామ్నాయక్ దంపతులు మురళి జన్మించిన తర్వాత సోమందేపల్లిలోని బంధువుల ఇంట వదిలి.. దంపతులిద్దరూ పొట్టచేత పట్టుకుని ముంబయి వలస వెళ్లారు. ఈ క్రమంలో మురళీనాయక్ సోమందేపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతపురంలో కళాశాల విద్య అభ్యసించి.. 2022లో.. 851 లైట్ రెజిమెంట్లో చేరాడు. తొలుత అసోంలో పని చేసి ఆ తర్వాత కశ్మీర్కు బదిలీ అయ్యాడు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఇరు దేశాల మధ్య సరిహద్దున (ఎల్ఓసీ – లైన్ ఆఫ్ కంట్రోల్) జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందాడు. మువ్వన్నెల జెండా రెపరెపలు.. పాకిస్తాన్ ముష్కరులతో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మురళీనాయక్ స్వగ్రామం కల్లితండాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మురళి భౌతికకాయం చూసేందుకు వచ్చిన వాళ్లలో చాలామంది జాతీయ జెండా చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై.. జోహార్ మురళీనాయక్.. మురళీనాయక్ అమర్ రహే.. జై హింద్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఖబడ్దార్.. ఖబడ్దార్.. పాకిస్తాన్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..? కల్లి తండాలోని మురళీనాయక్ ఇంటి నుంచి సొంత పొలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు దారి పొడవునా జనాలు సెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా? నీ పుట్టుక ఎవరికీ తెలియదు.. కానీ నీ మరణం యావత్ భారతావనికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తివి బిడ్డా నువ్వు’ అంటూ గ్రామంలోని పలువురు చేయి పైకెత్తి నినదించారు. గోరంట్ల, గుమ్మయ్యగారిపల్లి, పుట్లగుండ్లపల్లి నుంచి కల్లి తండా వరకు జవాన్కు అశ్రు నివాళి తెలుపుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. వీరజవాన్ మురళీనాయక్కు అంతిమ వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు భౌతికకాయం సందర్శించేందుకు తరలివచ్చిన ప్రజలు మార్మోగిన జయహో భారత్.. జైహింద్.. మురళి అమర్రహే నినాదాలు ‘యావత్ దేశం మా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముసలి వయసులో మాకు అండగా ఉండాల్సిన మా కొడుకు.. ఎప్పుడొస్తాడు.. మాకు ఈ వయసులో దిక్కు ఎవరు సారూ.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఆస్తులు, అంతస్తులు ఎవరి కోసం?’ – మురళినాయక్ తండ్రి శ్రీరామ్నాయక్ ‘ఎంతమంది వచ్చినా.. ఎంత డబ్బులు ఇచ్చినా.. మా కొడుకును తెచ్చి ఇవ్వలేరు కదయ్యా. ఒక్కగానొక్క సంతానం. దేశం కోసం ప్రాణాలు వదిలాడు. దేశం మొత్తం గర్వపడుతున్నా.. మా ఇంట మాత్రం ఆనందం ఇక ఉండదు. ఎవరిని చూసి ఆనందపడాలయ్యా’ – మురళినాయక్ తల్లి జ్యోతిబాయి ‘ఈరోజు బార్డర్లో డ్యూటీ వేశారు. ఉదయం నా నుంచి కమ్యూనికేషన్ వస్తే నేను పునర్జన్మ ఎత్తినట్లే. ఏదైనా జరిగితే మా తల్లిదండ్రులను బాగా చూసుకో’ – స్నేహితుడు వినోద్తో చివరిరోజున మురళీనాయక్ మాటలు ‘జోహార్ మురళి నాయక్. నీ ధైర్యం ఈ నేలకు గర్వ కారణం. నీ త్యాగం ఈ జాతి గుండెల్లో శాశ్వతం. నీ మరణం వృథా కాదు.’ – బెంగళూరు నుంచి అంత్యక్రియలకు వచ్చిన కాలేజీ స్నేహితుడు ఎస్.మహేందర్ -
టీడీపీ నేతల దౌర్జన్యకాండ
హిందూపురం టౌన్: లేపాక్షి మండలం కోడిపల్లిలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండతో చెలరేగిపోతున్నారని, తరచూ దాడులు చేయడమే కాక అక్రమంగా కేసులు బనాయిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని రజియాభాను, బాబాఫకృద్దీన్ దంపతులు ఆరోపించారు. ఆదివారం హిందూపురంలోని ప్రెస్క్లబ్లో కుమారుడు జబీవుల్లాతో కలిసి దంపతులు విలేకరులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమ కుటుంబంపై ఎంపీటీసీ గంగాధర్, టీడీపీ నాయకులు నాగరాజు, ఆనంద్రెడ్డి, గోపీ తదితరులు కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నారన్నారు. నెల క్రితం నాగేపల్లివద్ద ఉన్న అనధికారిక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తమ గ్రామానికి చెందిన సుభాష్, శ్రీకాంత్ అనే వ్యక్తులు ఘర్షణపడ్డారన్నారు. దీన్ని గమనించి తమ రెండవ కుమారుడు దాదా ఖలందర్ ఇద్దరికీ నచ్చచెప్పి గొడవ నివారించాడన్నారు. ఇది టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారని, సుభాష్తో తన కుమారుడు దాదాఖలందర్పై పోలీసులకు ఫిర్యాదు చేయించారన్నారు. పోలీసులు విచారణ చేపట్టకుండా ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరులో ఉన్న తన కుమారుడిని అరెస్టు చేసి, తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలకు గురి చేశారని ఫొటోలతో సహా చూపించి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబ సభ్యులు కానీ, కుమారుడు దాదాఖలందర్ కానీ తప్పు చేసి ఉంటే ఏ శిక్షకై నా సిద్ధమని చెప్పారు. టీడీపీ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. అక్రమ కేసుతో కుమారుడిని జైలుకు పంపారు తమకు రక్షణ కల్పించాలని కోడిపల్లికి చెందిన కుటుంబం వేడుకోలు -
తాగుడులో తగ్గేదేలా..
మందుబాబులు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. నిరంతరాయంగా మందు దొరుకుతోంది. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కోరుకున్న బ్రాండ్ చేతికి చేరుతోంది. ప్రశాంతంగా తాగడానికి.. దోస్తులతో కలిసి విందు చేసుకోవడానికి వైన్షాపుల వద్ద సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మందు తాగుతూ ముక్క తింటూ ‘స్వర్గం’లో తేలియాడుతున్నారు. కూటమి పాలనలో మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలు దూసుకుపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు ‘మద్యం పురం’గా మారిందన్న విమర్శలున్నాయి. విచ్చలవిడి మద్యం కారణంగా గ్రామాల్లో ఇప్పటికే గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ మద్యం వినియోగం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మద్యపానం, బెల్టుషాపులు, పర్మిట్ రూములపై ఉక్కుపాదం మోపడంతో మద్యం నియంత్రణలో ఉండేది. కూటమి సర్కారు రాగానే ఎమ్మెల్యేల చేతుల్లోనే మద్యం షాపులు ఉండటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం నడుస్తోంది. తెల్లవార్లూ మద్యం అమ్ముతున్నా అడిగే నాథుడే లేరు. ‘సంపద సృష్టిస్తా.. అది పేదలకే పంచుతా’ అని పదే పదే చెప్పే చంద్రబాబు..ఇక్కడ మద్యం ద్వారా పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఊపందుకున్న మద్యం విక్రయాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయనేందుకు ఈ లెక్కలే ఉదాహరణ. రెండు జిల్లాల్లో గడిచిన 7 నెలల 25 రోజుల్లో రూ.1,000 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మారు. ఊరూరా బెల్టుషాపులు, అర్బన్ ప్రాంతాల్లో పర్మిట్ రూములతో మూడు పువ్వులు ఆరుకాయలుగా మద్యం వ్యాపారం జరుగుతోంది. అర్బన్లోనే ఎక్కువ.. తాజా గణాంకాలను చూస్తే పట్టణాల్లో మద్యం వినియోగం మరింత ఎక్కువైంది. కొత్తగా మద్యం వినియోగదారులు పెరుగుతున్నారు. అనంతపురం జిల్లాలో రూ.646 కోట్ల విలువైన మద్యం వినియోగం కాగా.. అనంతపురం నగరంలోనే రూ.215 కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది. తాడిపత్రిలో రూ.84 కోట్లు, గుత్తిలో రూ.63 కోట్లు, గుంతకల్లులో రూ. 61 కోట్ల మద్యం వినియోగమైంది. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంలో రూ.86 కోట్లు, హిందూపురంలో రూ.57 కోట్లు, పెనుకొండలో రూ.61 కోట్లు, కదిరిలో రూ.54 కోట్ల విలువైన మద్యం వినియోగమైంది. ఊరూరా బెల్టుషాపుల కారణంగా మద్యం విచ్చలవిడిగా తాగుతున్నట్టు వెల్లడైంది. మద్యం వినియోగం (లీటర్లలో) బీరు వినియోగం (లీటర్లలో)మద్యం, బీరు వినియోగం విలువరోజుకు మద్యం కోసం చేస్తున్న వ్యయంఅనంతపురం జిల్లాలో మద్యం వ్యయంశ్రీసత్యసాయి జిల్లాలో మద్యం వ్యయం 8 నెలల్లో రూ.1,000 కోట్ల వ్యయం ఇదీ ఉమ్మడి జిల్లాలో మద్యం వినియోగం రూ.215 కోట్లతో అనంతపురం అగ్రస్థానం రూ.84 కోట్లతో రెండో స్థానంలో తాడిపత్రి -
నేడు ఖాద్రీశుని జయంత్యుత్సవం
కదిరి టౌన్: స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి (స్వాతి నక్షత్రం) ఆదివారం శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడి ఒక ప్రకటనలో తెలిపారు. మూలవిరాట్కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై స్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిబత్తలపల్లి: ఆటో ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బ మండలం ఇందుకూరుకు చెందిన బిల్లే సూర్యనారాయణ (52) కుటుంబంతో పాటు ఆదే గ్రామానికి చెందిన తిరుపాల్ ఆటోలో ఇరు కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఉదయం ధర్మవరం చెన్నకేశవస్వామి రథోత్సవానికి వెళ్లారు. అక్కడ తేరు ముగించుకుని గిద్దలూరు అక్కమ్మ జాతరకు వెళ్లాలని ఆటోలో బయల్దేరారు. బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డు శివాలయం వద్దకు రాగానే మలుపులో వేగం అదుపుకాక ఆటో బోల్తాపడింది. కింద పడిన సూర్యనారాయణపై ఆటో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి కాసేపటి తర్వాత మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చాగల్లు రిజర్వాయర్లో వ్యక్తి గల్లంతు
శింగనమల: ఉల్లికల్లు సమీపంలోని చాగలు రిజర్వాయర్ బ్యాక్ వాటర్లోకి దిగిన ఉల్లికల్లు శ్రీరాములు(48) గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఉల్లికల్లుకు చెందిన శ్రీరామలుకు భార్య, కుమారుడు ఉన్నారు. శ్రీరాములు శనివారం మద్యం తాగి చాగల్లు రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికులు చూసి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చేసరికి అతడు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ విజయకుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రెస్క్యూ టీంను పిలిపించి సాయంత్రం వరకు నీటిలో వెతికించినా శ్రీరాములు జాడ కనిపించలేదు. -
దేశ రక్షణకు ముస్లింలంతా సిద్ధం
హిందూపురం టౌన్: ‘ఆపరేషన్ సిందూర్’కు బాసటగా భారతదేశ రక్షణకు ముస్లింలంతా ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నామని ముస్లిం ఐక్య వేదిక నాయకులు ప్రకటించారు. శనివారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన ‘ఆపరేషన్ సిందూర్’కు సంఘీభావంగా గోరంట్ల మండలం కళ్లీతండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన నేపథ్యంలో సంతాప సభ నిర్వహించారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తానీ తీవ్రవాదుల అమానుష మారణ కాండను ప్రపంచం అసహ్యించుకుంటోందన్నారు. మహమ్మద్ ప్రవక్త యుద్ధ నీతులలో బాటసారులు, వృద్ధులు, పసిపిల్లలు, మహిళలు, చెట్లు, నీటి ఊటలపై దాడి చేయకూడదని సందేశాన్నిస్తే.. పాకిస్తానీ దుర్మార్గులు నిరాయుధులైన టూరిస్టులపై దాడి చేసి మానవత్వాన్ని మంటగలపారన్నారు. మౌలానా అబ్దుల్ మాలిక్, మౌలానా ఉస్మాన్ ఘని తదితరులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు, జాతీయ సమైక్యత, దేశ సుస్థిరత, దేశ అభివృద్ధి కోసం దేశంలోని ముస్లిం సమాజం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ దేశం వైపే ఉంటుందని, ఎలాంటి త్యాగాలకు నైనా ముస్లిం సామాజిక వర్గం సిద్ధమని అన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి సద్భావన సర్కిల్లో జవాన్ మురళీనాయక్ చిత్ర పటానికి అశ్రునివాళి అర్పించారు. కార్యక్రమంలో జామియా మసీదు సభ్యులు బాబా, హ్యూమనిజం అజంతుల్లా ఖాన్, 313 ముజీబ్, హజ్ కమిటీ సభ్యుడు డైమండ్ బాబా, మౌలానా సాజిద్, ఎస్డీపీఐ జిల్లా నాయకులు అంజాద్, ముజ్జు, మైనారిటీ నాయకులు అమానుల్లా పాల్గొన్నారు. -
వీరుడా... విజయోస్తు!
● దేశం కోసం యుద్ధ భూమికి.. కనగానపల్లి: దేశం కోసం ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని యుద్ధభూమికి సాగనంపారు. కుర్లపల్లి తండాకు చెందిన రేఖేనాయక్ బిహార్ సమీపంలోని దేశ సరిహద్దులో ఎస్ఎస్బీ జవాన్గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం 15 రోజులు సెలవులు పెట్టి ఈ మధ్యనే స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలోనే భారత్– పాకిస్తాన్ యుద్ధం రావటంతో సెలవులు రద్దు చేసుకొని విధుల్లో చేరాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో శనివారం ఆ యువకుడు తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకొని యుద్ధ భూమికి బయలుదేరాడు. తల్లిదండ్రులు భీమ్లా నాయక్, నాగలక్ష్మి మాట్లాడుతూ దేశం కోసం కన్నప్రేమను కూడా కాదనుకొని తమ బిడ్డను యుద్ధానికి పంపుతున్నామన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం మా బిడ్డ యుద్ధ భూమికి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇసుకతిన్నెలు పడి రైతు మృతి ఓడీచెరువు : ఇసుకతిన్నెలు పడి రైతు మృతి చెందాడు. దిగువపల్లికి చెందిన జెరిపిటి లక్ష్మీనారాయణ (65) అనే రైతు ఇసుక కోసం శనివారం గ్రామ శివారులోని ఏటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఇసుక తవ్వుతుండగా ఉన్నపళంగా తిన్నెలు విరిగిపడటంతో లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆయన్ని ద్విచక్రవాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే లక్ష్మీనారాయణ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
ఊరూరా ఉద్విఘ్నం
దేశరక్షణలో నేలకొరిగి భరతమాత నుదుటి తిలకమై నిలిచిన వీర జవాన్ మురళీనాయక్కు అనంత ప్రజానీకం అశ్రునివాళి అర్పించింది. బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి కల్లితండా వరకూ వెంటసాగి జోహార్ అగ్నివీరుడా అంటూ నినదించింది. ●వీరసైనికుడు మురళీ నాయక్కు ఘన నివాళి ●స్వగ్రామం చేరుకున్న వీర జవాన్ భౌతికకాయం ●బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు తరలింపు ●దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ ఘన నివాళులు ●ఊరూరా వందేమాతరం ఆలపించిన ప్రజలు ●రోడ్డుకు ఇరువైపులా నిలబడి సైనికుడికి సెల్యూట్ చేసిన వైనం ●నేడు కల్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ●తరలిరానున్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు గోరంట్ల: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్మూకశ్మీర్లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన కల్లితండాకు చెందిన జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వందేమాతరం పాడుతూ మురళీనాయక్కు ఘన నివాళులర్పించారు. ఘొల్లుమన్న కల్లితండా సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది. ‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటిగంట మధ్యలో అధికార లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
వెరిటాస్ సైనిక్ స్కూల్కు ప్రభుత్వ అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా ఇటు విద్యార్థుల ఉన్నతికి, అటు దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమ విద్యను అందస్తూ వస్తున్నామన్నారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటివన్నీ సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. వెరిటాస్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తామన్నారు. విద్యా సంస్థలో ప్లస్–1 (ఇంటర్మీడియెట్)తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్రెడ్డి, బి.సందీప్రెడ్డి పాల్గొన్నారు. దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యం వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి -
వీర జవాన్ కుటుంబానికి అండగా ఉంటాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం కార్పొరేషన్: యుద్ధ భూమిలో శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతూ మురళీ నాయక్ మృత్యుఒడికి చేరడం బాధాకరమన్నారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరువదని చెప్పారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి
తాడిపత్రి: మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన తాడిపత్రి రూరల్ పరిధిలోని జగనన్న కాలనీలో జరిగింది. సీఐ శివ గంగాధర రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణం నంద్యాల రోడ్డుకు చెందిన జయ చంద్రారెడ్డి (45) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం జగనన్న కాలనీలోని ఓ ఇంటి ముందు మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్న జయచంద్రారెడ్డిని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వైఎస్సార్ కృషితోనే హంద్రీ–నీవా పూర్తి
ఉరవకొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితోనే హంద్రీ–నీవా మొదటి దశ పనులు 90 శాతం పూర్తి చేసి జీడిపల్లి వరకు నీటిని తీసుకురాగలిగారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని స్వగృహంలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ఛాయాపురం వద్ద సీఎం చంద్రబాబు ప్రజావేదిక సాక్షిగా హంద్రీ–నీవాకు సంబంధించి అసత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా పనులు చేపట్టారన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ నీటి సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయించారన్నారు. దీనికి సంబందించి టెండర్లు కుడా పూర్తి చేశారని, పనులు ప్రారంభించే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. హంద్రీ–నీవాకు 60 నుంచి 70 టీఎంసీలు రావాలంటే కాలువను క్రమం తప్పకుండా వెడల్పు చేయాల్సి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో వెడల్పు చేస్తాం, రెండో దశ పనుల్లో కాలువకు లైనింగ్ చేస్తామంటే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాయలసీమకు సమృద్ధిగా కృష్ణాజలాలు అందాలంటే మొదటి ఫేజ్లో 10వేల క్యూసెక్కులతో కాలువను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడతలో లైనింగ్ పనులు చేపట్టే బదులు ఆ నిధులతో కాలువ వెడల్పు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాపై అపారమైన ప్రేమే ఉంటే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఎయిమ్స్ను మంగళగిరికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. దీంతో పాటు కర్నూలుకు మంజూరైన లా యూనివర్సిటీని ఇతర ప్రాంతానికి తరలించి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. సాంకేతికతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చే మీరు మరీ అమరావతి రాజధాని కోసం వేలాది కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఛాయాపురంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గ్రామంలో భూములు కౌలుకు ఇస్తే ఎకరాకు రూ.60 వేలు ఇస్తారని చెబుతున్నారని, ఆ గ్రామస్థులతో మాట్లాడి అక్కడి భూములన్నీ కౌలుకు ఇప్పిస్తా ఎకరాకు రూ.60వేలు కచ్చితంగా ఇప్పిస్తారా అంటూ సవాల్ విసిరారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ములేక అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ము లేదు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజం -
అంగరంగ వైభవం.. లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. 11రోజులపాటు సాగే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనది బ్రహ్మ రథోత్సవం. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలు గజ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ తేరుబజారుకు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి కొలువుదీరారు. ఉదయం 7 గంటలకు మడుగుతేరు(రథోత్సవం)కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అనంతరం రథానికి పూజలు చేసి మడుగుతేరు లాగారు. ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేలాది మంది భక్తులు రథం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవం మొదలైంది. తేరుబజార్ నుంచి అంజుమన్ సర్కిల్ వరకు అశేష భక్తజన సందోహం నడుమ రథం ముందుకు కదిలింది. భక్తులు గోవింద నామస్మరణతో పురవీధులు ప్రతిధ్వనించాయి. సాయంత్రం 6గంటలకు ధూళోత్సవం నిర్వహించారు. గోవింద నామస్మరణతో పులకించిన ధర్మవరం అశేష భక్తజన సందోహం నడుమ కదిలిన బ్రహ్మరథంపటిష్ట పోలీసు బందోబస్తు రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో డీఎస్పీ హేమంత్కుమార్, వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, టూటౌన్ సీఐ రెడ్డప్ప, శివరాముడు, శ్యామరావు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జేబుదొంగలున్నారు అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అల్లరి మూకలను చెదరగొడుతూ ఉత్సవం ప్రశాంతంగా సాగేలా చూశారు. -
ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం
● కూటమి సర్కారు తీరుతో అభద్రతలో ఉద్యోగులు ● ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరమైన సమస్యలు అటుంచి ఆర్థికేతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. దీంతో ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా పీఆర్సీ కమిషన్ నియమించలేదన్నారు. దీంతో ఉద్యోగులకే నష్టమని, పీఆర్సీ బకాయిలు పెండింగ్లో పెడతారన్నారు. 2024 జనవరి, జూన్, 2025 జనవరికి సంబంధించి మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల దాటితో మరో డీఓ వచ్చి కలుస్తుందని, ఇప్పటికీ ఒక్క డీఏ కూడా ప్రకటించలేదన్నారు. ఆక్రమణల తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తహసీల్దార్లు బలవుతున్నారన్నారు. 2014లో గుంటూరులో ఆక్రమణల తొలగింపు క్రమంలో అప్పటి తహసీల్దారు తాతారావుపై కోర్టు చర్యలు తీసుకుందని, డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయనకు తహసీల్దారుగా డిమోషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం, అధికారుల ఆదేశాల మేరకు ఆయన పనిచేశారని, అలాంటప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. పైవారు చెప్పిన పనిచేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, ఒక నిర్ణయంపై అధికారులు లిఖితపూర్వంగా ఆదేశాలిస్తేనే అమలు చేయాలని తహసీల్దార్లకు చెబుతున్నామన్నారు. తహసీల్దారు కార్యాలయాల నిర్వహణకు, ప్రోటోకాల్కు రూ. లక్షలు ఖర్చు అవుతున్నా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. కోర్టు కేసులకు లీగల్ చార్జీలు ఇవ్వడం లేదన్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో తెల్లకాగితాలు కూడా సొంత డబ్బుతో కొనాల్సి వస్తోందన్నారు. విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోందని, ఉన్నతాధికారులు తమ నిర్ణయాలను కిందిస్థాయి అధికారులపై రుద్దుతున్నారన్నారు. రెవెన్యూలోని అన్ని కేడర్లలో పనిచేసే వారికి శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్రావు, కార్యదర్శి సోమశేఖర్, మహిళ విభాగం చైర్పర్సన్ సురేఖరావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప పాల్గొన్నారు. -
దైవదర్శనానికి వెళ్తూ..పరలోకాలకు
బత్తలపల్లి/కళ్యాణదుర్గం రూరల్: కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దైవదర్శనం కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బత్తలపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల రామ్మోహన్ తన కుటుంబంతో పాటు స్నేహితుడు రాజశేఖర్రెడ్డి (45) కుటుంబ సభ్యులు, ముక్తాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్రెడ్డి (25) మొత్తం పదిమంది కళ్యాణదుర్గం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో బయల్దేరారు. బత్తలపల్లి సమీపంలోని వై జంక్షన్ వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న రామ్మోహన్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు బోల్తా పడింది. రామ్మోహన్, అతని భార్య మాధవి, కుమార్తెలు సాన్విక, జత్విక, కౌటిల్ కుమార్, రాజశేఖర్రెడ్డి, అతని భార్య దీపిక, కుమారుడు యస్విత్రెడ్డి (7), కుమార్తె వీరాధ్యతో పాటు స్నేహితుడు ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్రెడ్డి, యస్విత్రెడ్డి మృతి చెందారు. ప్రశాంత్ కుమార్రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రమేష్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సానుభూతి తెలిపారు. -
తపన సాహిత్య వేదిక పురస్కార విజేతల ప్రకటన
హిందూపురం: తపన సాహిత్య వేదిక సేవా పురస్కార విజేతలను ప్రకటించారు. శనివారం హిందూపురంలో తపన సాహిత్య వేదిక సమావేశం జరిగింది. వేదిక నిర్వాహకుడు ప్రముఖ రచయిత సడ్లపల్లి చిదంబరరెడ్డి మాట్లాడుతూ కథా పురస్కారం కోసం 2024వ ఏడాదిలో అచ్చయిన కథా సంపుటాలను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల తెలుగు రచయితలు 50కి పైగా కథా సంపుటాలను పంపించారన్నారు. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు బాలాజీ రాసిన ‘ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు’ పుస్తకం రూ.10వేల నగదు పురస్కారానికి ఎంపికై ందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా స్వర్ణకిలారి రాసిన నల్లబంగారం అనే కథల సంపుటికి రూ.5 వేల ప్రోత్సాహక నగదు పురస్కారానికి ఎంపికై ందన్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, పార్వతీ పురం గండేట గౌరునాయుడు, హైదరాబాద్ డాక్టర్ దేవేంద్రలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఎయిడ్స్పై విస్తృత పరిశోధనలు చేసి ప్రజావైద్యుడుగా పేరుపొందిన కాకినాడ డాక్టర్ యనమదల మురళీకృష్ణకు సేవా పురస్కరాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక రచయితలు సిద్దగిరి శ్రీనివాస్, ఆంధ్రరత్న గంగాధర్, డాక్టర్ అశ్వత్థ నారాయణ, యువకవి గంగాధర్, విశ్రాంత ప్రిన్సిపాల్ గంగిరెడ్ది, ఎన్.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
పుట్టపర్తి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి (డీఐఓ) సయ్యద్మౌల తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, స్క్వాడ్ మెంబర్లతో సమావేశం నిర్వహించారు. 19వ తేదీ వరకూ రోజూ ఉదయం 9 గంటలకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటలకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొత్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రెండు ఫ్లయింగ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కమిటీ మెంబర్లుగా రామరాజు, చెన్నకేశవప్రసాద్, శ్రీనివాసులను నియమించామన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు.9 రకాల పాఠశాల విధానానికి వ్యతిరేకంపుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 9 రకాల పాఠశాల విధానానికి ఏపీటీఎఫ్ వ్యతిరేకమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్కుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. శనివారం పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. 9 రకాల పాఠశాల విధానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లోనూ 1 నుంచి 5 వ తరగతి వరకు కొనసాగించాలన్నారు. జీఓ 117ను రద్దు చేస్తామని చెప్పి ఇంత వరకూ రద్దు చేయకుండా రకరకాల సమీక్షలు చేస్తూ విద్యాశాఖతో ఆడుకుంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నత పాఠశాలను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా ఇంత వరకూ పీఆర్సీ కమిటీని నియమించలేదన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు మాధవ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలు, సబ్ కమిటీ మెంబర్లు నారాయణ, నాగరాజు, సుధాకరరెడ్డి, రఫీ, మండల ప్రధాన కార్యదర్శులు సాయిశివ, వెంకటనాయుడు, హరిప్రసాద్, వెంకటరమణనాయక్, ఈశ్వరప్ప, సేవేనాయక్, చంద్రమౌళి, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.బాలుడిని మింగిన స్విమ్మింగ్పూల్ధర్మవరం అర్బన్: ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్పూల్లోకి దిగిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పోతరాయి గ్రామానికి చెందిన సంజీవనాయుడు, శారద దంపతుల కుమారుడు నందీశ్వర్నాయుడు (9) ధర్మవరంలో తేరు ఉందని గీతానగర్లో ఉంటున్న బాబాయి కృష్ణ ఇంటికి రెండురోజుల క్రితం వచ్చాడు. తేరు చూసిన తర్వాత శనివారం మధ్యాహ్నం జీవానంద పాఠశాల సమీపంలోని రేగాటిపల్లి రోడ్డులోనున్న స్విమ్మింగ్ పూల్కు ఈత కోసం బాబాయితోపాటు నందీశ్వర్నాయుడు వెళ్లాడు. నీటిలో ఆడుకుంటున్న నందీశ్వర్నాయుడు ఉన్నట్టుండి పక్కనే ఉన్న లోతైన ప్రదేశంలోకి దిగి నీట మునిగాడు. స్థానికులు గమనించి వెంటనే బాలుడిని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నందీశ్వర్నాయుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
వీర జవాన్కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
శ్రీసత్యసాయి జిల్లా: జమ్మూకశ్మీర్లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాలో అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలను ఆర్మీ అధికారులు నిర్వహించారు.కాగా, జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వం దేమాతరం పాడుతూ మురళీనాయక్కు ఘన నివాళులర్పించారు.సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది.‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇవాళ(ఆదివారం) అధికార లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించారు. -
రూటు మార్చిన కేటుగాళ్లు
ఈనెల 8న సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఆశాబీ అనే మహిళ హంగామా చేసింది. బేకరీ, హోటల్, చికెన్ పకోడా దుకాణాల దారుల నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్ చేయగా...ఆశాబీ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సాక్షి, పుట్టపర్తి : ప్రభుత్వ అధికారుల పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్ కాల్స్ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. మోసపోయామని బాధితులు తెలుసుకునేలోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. అనంతరం మొబైల్స్ స్విచాఫ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో సత్యసాయి జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. పెరిగిన సైబర్ నేరాలు హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. అమాయక ప్రజలను టార్గెట్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమూహంగా ఏర్పడి.. కొత్త కొత్త మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేసి మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్ లోన్ అప్రూవల్ అయిందని.. ట్యాక్స్ ఆన్లైన్లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి.. రెండు నెలల క్రితం నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లలో దుండగులు చొరబడ్డారు. తమ వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని ఆయా దుకాణదారులను భయపెట్టి భారీగా వసూళ్లు చేశారు. ఓ దుకాణదారుడికి వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో అతను ఫుడ్ సేఫ్టీలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పాడు. దీంతో ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. అధికారులపైనే ఆరోపణలు కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాటవేశారు.అప్రమత్తత అవసరంసైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ద్వారా వచ్చే ఓటీపీలను తెలియని వ్యక్తులు అడిగితే షేర్ చేయరాదు. పన్ను వసూళ్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్కు స్పందించాల్సిన అవసరం లేదు. అధికారులపై ఎలాంటి అనుమానం వచ్చినా.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రజల సహకారంతోనే సైబర్ నేరాల కట్టడి సాధ్యం. – వి.రత్న, జిల్లా ఎస్పీ -
వీర సైనికా.. మా గుండెల్లోనే ఉంటావిక
గోరంట్ల: జమ్మూ కాశ్మీర్లో పాక్తో పోరాటంలో మరణించిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయం శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఆయన స్వగ్రామమైన కల్లి తండాకు చేరుకుంది. నాయక్ భౌతికకాయం శనివారం కాశ్మీరు నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్పోర్టులో సైనిక అధికారులు, సిబ్బంది ఘన నివాళులరి్పంచారు. రాష్ట్ర మంత్రి సవిత ప్రభుత్వం తరఫున నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఆర్మీ కాన్వాయ్లో రోడ్డు మార్గాన స్వగ్రామానికి తీసుకొచ్చారు.దారి పొడవునా వేలాదిగా ప్రజలు తరలివచ్చి అమర వీరుడికి జోహార్లు అరి్పంచారు. దీంతో 44వ నంబరు జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. కర్ణాటకలోని బాగేపల్లి, చిక్కబళ్లాపురం, బాగేపల్లి టోల్ప్లాజా తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు వేలాదిగా జాతీయ రహదారిపైకి చేరుకుని వీరజవాన్కు ఘన నివాళులరి్పంచారు. వందేమాతరం, జై జవాన్ నినాదాలు మిన్నంటాయి. భారీ జనం రావడంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి చాలా సమయం పట్టింది. కర్ణాటక సరిహద్దు దాటి జిల్లాలోకి ప్రవేశించగానే.. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు వద్ద జవాన్ భౌతికకాయం ఉన్న వాహనంపైకి పూలవర్షం కురిపించారు. మురళి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జనం కంటతడి పెట్టారు. కోడూరు థామస్ మన్రో తోపు, గుమ్మయ్యగారిపల్లి క్రాస్ మీదుగా స్వగ్రామం కల్లి తండాకు భౌతిక కాయం చేరుకుంది. స్వగ్రామంలో ఉద్వేగభరిత వాతావరణం మురళీ నాయక్ భౌతిక కాయం చేరుకోవడంతో స్వగ్రామం కల్లితండాలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సహా అక్కడ ఉన్న ప్రజలు జవాన్ భౌతికకాయానికి కన్నీటితో స్వాగతం పలికారు. వీరజవాన్కు నివాళులరి్పంచడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, అధికారులు, నాయకులు భారీగా ఇంటి వద్దకు చేరుకున్నారు. మురళి అమర్ రహే అంటూ నినదించారు. వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. నేడు అంత్యక్రియలు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
యంత్రం తగిలి వృద్ధుడి మృతి
గాండ్లపెంట: మండలంలోని జీనులకుంట గ్రామంలో అజాక్స్ యంత్రం తగిలి వి.వేమన్న గౌడ్ (75) మృతిచెందాడు. ఆయనకు భార్య చిట్టెమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. వివరాలు.. జీనులకుంటలోని ప్రాథమిక పాఠశాల వద్ద సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అజాక్స్ యంత్రంలో కంకర, సిమెంట్ వేసి కలుపుతుండగా వెనుక వైపున ఉన్న వేమన్న ఎడమకాలుకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స అందేలోపు మృతి చెందాడు. మృతుని కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చేపల వేటకు వెళ్లి.. లింగాల: కదిరి మండలం చెలంకూరుపల్లికి చెందిన బెల్లం హైదర్వలి (58) వైఎస్సార్ జిల్లా లింగాల మండలం కామసముద్రం గ్రామంలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయన శుక్రవారం కామసముద్రం గ్రామ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో చెరువు గట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు నీటిలోకి పడిన హైదర్వలికి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. కుమారుడు బాబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. బైక్పై నుంచి జారి పడి.. అగళి: ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం మధూడి గ్రామానికి చెందిన సిద్ధగంగమ్మ (48)కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భర్త తిప్పేస్వామితో పాటు కుమారుడు మంజునాథ్ మృతి చెందారు. కుమార్తె కాంచనకు పెళ్లి చేయడంతో ఆమె బెంగళూరులో స్థిరపడి ఓ గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తోంది. గ్రామంలోనే సిద్ధగంగమ్మ వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం నరసంబూధి గ్రామంలో తోటలో పూలు విడిపించేందుకు వెళ్లిన ఆమె పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలో పిల్లి అడ్డుగా రావడంతో వాహనం అదుపు తిప్ప కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను కర్ణాటకలోని శిరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై అగళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా నరసింహమూర్తి హిందూపురం టౌన్: ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా హిందూపురానికి చెందిన నరసింహమూర్తి ఎన్నికయ్యారు. శుక్రవారం పుట్టపర్తిలో జరిగిన సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు సాగిస్తామని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేంద్ర కదిరి అర్బన్: ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేంద్ర ఎన్నికయ్యారు.తన నియామకానికి సహకరించిన ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు. తాగునీటి సమస్య తీర్చాలంటూ మహిళల ధర్నా గుడిబండ: మండల పరిధిలోని రాళ్లపల్లి హరిజన కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య తీర్చాలంటూ గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. లో ఓల్జేజ్ సమస్య కారణంగా రోజూ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.సమస్య పరిష్కారానికి అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. డీఎస్సీకి ఆన్లైన్ శిక్షణ లేపాక్షి: త్వరలో జరిగే డీఎస్సీకి సంబంధించి అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాఽధికారిత అధికారి నిర్మలాజ్యోతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్లో అర్హత సాధించిన బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరికి చెందిన జిల్లా వాసులు మాత్రమే అర్హులు. టెట్ మార్కుల పత్రం, నెటివిటీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, రెండు ఫొటోలు జతపరిచిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 93921 41545లో సంప్రదించవచ్చు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
● ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు చిలమత్తూరు: ప్రజాస్వామ్యంలో పత్రికలది కీలక భూమికని, ఎన్నో కష్టాలకోర్చి ప్రజా సమస్యలపై పోరాడే పాత్రికేయరంగంపై కక్ష సాధింపు చర్యలు ఒక విధంగా ప్రజాస్వామ్యానికి పెనుముప్పగా భావించాల్సి వస్తుందని ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు అన్నారు. పాత్రికేయులు, ఎడిటర్లపై దాడులు, కేసులు అప్రజాస్వామికమన్నారు. ఇది దేశ భవిష్యత్కు ప్రమాదకరమన్నారు. ఎలాంటి వారెంట్ లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసుల తీరును ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన తరుణంలో ఇలాంటి చర్యలకు దిగడం సిగ్గుచేటన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు ● వాహనాల స్పెషల్ డ్రైవ్లో ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సీ రత్న హెచ్చరించారు. గురువారం రాత్రి 10గంటల సమయంలో ఎస్పీ స్వయంగా ధర్మవరం – కోడూరు ప్రధాన రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి. ఇతర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణ, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, పెండింగ్ చలానాలు, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సురేష్, ఎస్ఐ లింగన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంధన సహాయకుల జీవితాలతో ఆడుకోవద్దు
ధర్మవరం రూరల్: రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు నియమితులైన ఇంధన సహాయకుల జీవితాలు కూటమి ప్రభుత్వ తీరుతో ఆగమ్యగోచరంగా మారాయని ఆంఽధ్రప్రదేశ్ వార్డు, గ్రామ సచివాలయాల ఎనర్జీ ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లగమ్మి రాజు మండిపడ్డారు. శుక్రవారం ఆ సంఘం జిల్లా నాయకులతో కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయాల్లోని అన్ని శాఖలకు సంబంఽధించి మార్పులు చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు నిర్ధిష్టమైన చానల్ కల్పిస్తూ ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. విధి నిర్వహణలో భాగంగా గడిచిన 5 ఏళ్లలో 140 మంది ఇంధన సహాయకులు మృత్యువాత పడ్డారన్నారు. 250 మంది తీవ్రంగా గాయపడిన సంఘటనలూ ఉన్నాయన్నారు. ఇంధన సహాయకుల కుటుంబాలు రోడ్డున పడుతున్నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. ఇంధన సహాయకులకు న్యాయం చేకూరకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లికార్జునరెడ్డి, సుధీర్, పవన్, రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కూటమి ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లాకు విచ్చేసిన ఆయన శుక్రవారం స్థానిక రెవెన్యూ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయకపోవడం, డీఏ ప్రకటించకపోవడం, డీఏ, పీఆర్సీ ఆరియర్లపై స్పష్టత లేకపోవడం, మధ్యంతర భృతి ఊసేత్తకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఫలితం మరో విధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజేష, జిల్లా చైర్మన్ దివాకర్రావు, ప్రధాన కార్యదర్శి పీఎస్ఖాన్, మహిళ విభాగం జిల్లా చైర్మన్ సురేఖరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణజ్యోతి, జిల్లా నాయకులు, శ్రీసత్యసాయి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు -
స్కీమ్లో స్కాం లేకపోతే ఉలుకెందుకు?
పెనుకొండ రూరల్: కుటు శిక్షణ స్కీమ్లో స్కామ్ లేకపోతే ఉలుకెందుకని మంత్రి సవితను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి సవితకు లేదన్నారు. శుక్రవారం ఉధయం నాగళూరులో కాఫీ విత్ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుట్టు శిక్షణ మొత్తం ప్రక్రియ ఓ పెద్ద స్కామ్ అన్నారు. ఇందులో స్కాం జరగకపోతే మహిళలకు కుట్టు మిషన్ కిట్టు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. రోజూ ఎనిమిది గంటల శిక్షణ అంటూ నాలుగు గంటలకే ఎందుకు కుదించారన్నారు. శిక్షణా కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. మంత్రి సవిత సవాల్ను తాము స్వీకరిస్తున్నామని, దమ్ముంటే బీసీ సంక్షేమ శాఖ మాజీ మంత్రి మాలగుండ్ల శంకరన్న సమక్షంలోనే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. వేధిక, టైం నిర్ధారణ మంత్రి సవితనే చెప్పాలన్నారు. బీసీ సాధికారిత ప్రభుత్వంగా చెప్పుకునే మంత్రి ఎన్నికల వాగ్ధానాలలో భాగంగా బీసీలకు ఇచ్చిన 50 ఏళ్లకే పింఛన్ ఏమైందో చెప్పాలన్నారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం ఊసే లేదన్నారు. అర్హత కలిగిన ప్రతి బీసీ మహిళకు రూ.18వేల అందించి, జీవనోపాధులు మెరుగు పరిచిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్కే సొంతమన్నారు. అక్రమంగా మైనింగ్, క్రషర్లు నడుపుతూ వ్యాపారులను పెనుకొండలోకి రాకుండా అడ్డుకున్న నీచ చరిత్ర మంత్రి సవితదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పట్టణ, మండల కన్వీనర్లు సుధాకర్ రెడ్డి, నరసింహులు, మాజీ కన్వీనర్లు బాబు, శ్రీకాంతరెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, వైశాలి జయశంకరరెడ్డి, కొండలరాయుడు, గోపాలరెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. సవాల్ను స్వీకరిస్తున్నాం దమ్ముంటే బహిరంగ చర్చకు రండి వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి సవితకు లేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ -
బస్సు బోల్తా –15 మందికి గాయాలు
గోరంట్ల: మండలంలోని మిషన్తండా సమీపంలో జాతీయ రహాదారిపై శుక్రవారం రాత్రి కియా అనుబంధ పరిశ్రమ హూయంగ్కు చెందిన బస్సు బోల్తాపడింది. ఘటనలో 15 మంది కార్మికులు గాయపడ్డారు. కార్మికులందరూ ఓడిసీ మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. క్షతగాత్రులను 108 వాహనంలో హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పుట్టపర్తి టౌన్: స్థానిక సత్యసాయి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం లభించింది. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం శుక్రవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టపర్తికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సవిత, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎమ్ఎస్రాజు, కందికుంట ప్రసాద్, సత్యసాయి ట్రస్టు ప్రతినిధి చలం, కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డీఓ సువర్ణ స్వాగతం పలికారు. అనంతరం సీఎం ప్రత్యేక హెలీక్యాఫ్టర్లో ఉరవకొండకు బయలుదేరి వెళ్లారు. దళిత రైతుల పురోగతికి సాంకేతిక పరిజ్ఞానం అనంతపురం: జిల్లాలోని దళిత రైతుల పురోగతికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్ట్ నిర్వహణను జేఎన్టీయూ(ఏ) దక్కించుకుంది. డిపార్ట్మెంటల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూఢిల్లీకి చెందిన సీడ్ (సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్) విభాగం ద్వారా అమలవుతున్న ఎస్సీ (షెడ్యూల్ కాస్ట్) హబ్ కింద రూ.47,62,047 నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్ను జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్, ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ ఎస్. చంద్రమోహన్రెడ్డి, కెమికల్ విభాగం ప్రొఫెసర్ బి.దిలీప్కుమార్, ఎలక్ట్రికల్ విభాగం డాక్టర్ జి. మమత నిర్వహించనున్నారు. మూడేళ్ల గడువున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వేరుశనగ ద్వారా నూనె, స్నాక్స్, టమాట ద్వారా సాస్, డ్రై టమాట వంటి విలువ జోడింపు ఉత్పత్తుల తయారీకి శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే రైతులకు మార్కెట్ లింకేజీలు, నిల్వ సౌకర్యాలు, ఉత్పత్తుల బ్రాండింగ్ వంటి అంశాలపై మద్దతునివ్వనున్నారు. ప్రత్యేకంగా దళిత రైతులకు నైపుణ్య శిక్షణా శిబిరాలు, వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు, మార్కెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా పరిశోధక బృందాన్ని శుక్రవారం జేఎన్టీయూ వీసీ హెచ్.సుదర్శనరావు అభినందించారు. -
జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు
ఉరవకొండ/ వజ్రకరూరు: ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూసిన జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నిరాశపరిచింది. శుక్రవారం వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనతో పాటు ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సంపదను సృష్టించి జిల్లాను అభివృద్ధి చేస్తానని, ఇంట్లో ఎక్కువమంది పిల్లలను కని జనాభా పెంచేలా చూడాలని చెప్పడం తప్ప హామీల అమలుపై సీఎం తన ప్రసంగంలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. తల్లికి వందనం పథకం త్వరలోనే అమలు చేస్తామని, అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం వాటా ఇచ్చిన రోజే రాష్ట్రం తరఫున నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడు అమలు చేస్తారని కొందరు మహిళలు అడిగితే.. సీఎం సమాధానం ఇవ్వలేదు. మరికొన్ని ముఖ్యమైన సూపర్ సిక్స్, తదితర పథకాల గురించి మాట్లాడకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఉదయం 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా చేరుకున్నారు. ప్రజావేదికలోకి పోలీసులు ఉదయం 9 గంటలకే ప్రజలను అనుమతించడంతో ఎండ తీవ్రతకు కూర్చోలేక అవస్థలు పడ్డారు. సభకు వచ్చిన వారికి సరిపడు తాగునీరు అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. నిర్వాసితులకు పరిహారం మంజూరు చేస్తాం జీడిపల్లి భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని, 34, 36 ప్యాకేజీ పనులు పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి, కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తామన్నారు. మెగా డ్రిప్ ఇరిగేషన్ కింద 40వేల ఎకరాలకు జీడిపల్లి ద్వారా నీరు అందించి పథకాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఉరవకొండకు టెక్స్టైల్ పార్కు, రామసాగరం వంతెన మంజూరు చేస్తామన్నారు. జీడిపల్లి, బీటీపీ పనులకు కూడా ప్రాధ్యానత ఇచ్చి పూర్తి చేస్తామన్నారు. ఛాయాపురంలో కూడా సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల నిర్మాణాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ్శర్మ, ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన అడ్డుకునేందుకు యత్నం వజ్రకరూరు మండలం ఛాయాపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జీఓ 77ను రద్దు చేయకుండా జిల్లాలోకి అడుగుపెట్టనీయబోమని ఏబీవీపీ నాయకులు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో వజ్రకరూరు సమీపంలో సీఎం డౌన్ డౌన్, జీఓ 77ను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తు సీఎం సభ వద్దకు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చిన్నహోతురు వద్ద అరెస్టు చేసి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఖిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 77ను రద్దు చేసి ప్రతి విద్యార్థికీ స్కాలర్షిప్ అందిస్తామని హమీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ రద్దు చేయకుండా మోసం చేశారన్నారు. ప్రతి విద్యార్థికీ ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సుధీర్, నిఖిల్, తేజ, భూతరాజు తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ అమలుపై స్పష్టత ఇవ్వని సీఎం చంద్రబాబు -
మురళీనాయక్ పోరాటం చిరస్మరణీయం
● కలెక్టరేట్లో ఘన నివాళులర్పించిన జిల్లా యంత్రాంగం ప్రశాంతి నిలయం: భారత్– పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశ యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ టీఎస్ చేతన్ కీర్తించారు. శుక్రవారం కలెక్టరేట్లో వీరజవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొన్న మురళీనాయక్ శత్రువులను తుదముట్టించి వీరమరణం పొందారన్నారు. ఆయన అత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ పేరు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమకు యూవత్ దేశం గర్విస్తోందన్నారు. అనంతరం మురళీనాయక్ ఆత్మకు శాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయ సారథి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీరుడికి మరణం లేదు: ఎస్పీపుట్టపర్తి టౌన్/గోరంట్ల: వీరుడికి మరణం లేదని, దేశ రక్షణలో అసువులు బాసిన మురళీనాయక్ కూడా అమరుడని ఎస్పీ రత్న కీర్తించారు. దేశ కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ యావత్ దేశానికి గర్వకారణమన్నారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని కల్లితండాకు చేరుకొని మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జోతిబాయిలను పరామర్శించారు. సిబ్బందితో కలిసి మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. -
13న కల్లితండాకు వైఎస్ జగన్
● వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం రొద్దం: దేశ రక్షణలో అసువులు బాసిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అఽధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న కల్లితండాకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె మండల పరిధిలోని కంబాలపల్లిలో పర్యటించారు. అంతకుముందు కల్లితండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన కల్లితండా వాసి మురళీ నాయక్ కుటుంబీకులను ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారన్నారు. వీర జవాన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు స్వయంగా వస్తున్నట్లు వెల్లడించారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ అనంతపురం కార్పొరేషన్: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ వీరమరణం పొందారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మాతృభూమి కోసం మురళీనాయక్ ప్రాణత్యాగం చేశారన్నారు. చిన్న వయసులోనే మృతి చెందడం చాలా బాధగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రధానంగా మురళీనాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ●దేశ సేవలో అమరుడైన మురళీ నాయక్ ●కన్నీటిసంద్రమైన స్వగ్రామం కల్లితండా ●అతని జ్ఞాపకాలు తలచుకుని రోదిస్తున్న స్నేహితులు ●ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్ పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్ అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన.. ఉగ్రమూకలకు బదులు చెప్పావ్ దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్ శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్ మాతృభూమి కోసం చివరి నెత్తురుబొట్టునూ చిందించావ్ సలాం సైనిక.. నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం ఆ పా(పి)కిస్తాన్ గాళ్లకు మరణశాసనం రాస్తాం యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై ప్రేమని చాటిచెబుతాం జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం సలాం సైనిక... సలాం గోరంట్ల: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ వీరమరణం గురించి తెలియగానే తండావాసులంతా మురళీనాయక్ స్వగృహానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్లను ఓదార్చారు. మురళీనాయక్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి మెండుగా ఉన్న మురళీ నాయక్...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు. దేశభక్తి ఎక్కువ మురళీ నాయక్ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు. – చాంప్లానాయక్, కల్లితండా నమ్మలేకపోతున్నాం మురళీనాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం. – గోవింద నాయక్, కల్లితండా సలాం సైనిక సోమందేపల్లిలో విద్యాభ్యాసం -
రూటు మార్చిన కేటుగాళ్లు
● ఈనెల 8న తనకల్లు మండలం కొక్కంటి క్రాస్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఆశాబీ అనే మహిళ హంగామా చేసింది. బేకరీ, హోటల్, చికెన్ పకోడా దుకాణాల దారుల నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్ చేయగా...ఆశాబీ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.● రెండు నెలల క్రితం పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద పేరుతో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తోన్న డాక్టర్కు ఫోన్ కాల్ వచ్చింది. పన్ను బకాయిలు చాలా ఉందని, ఈ రోజు లోపు ఎంతోకొంత అందజేస్తే.. మాఫీ అయ్యే అవకాశం ఉందని నమ్మబలికి ఫోన్ పే నంబరు కూడా చెప్పారు. అయితే డాక్టర్ తెలివిగా వ్యవహరించి.. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఆ ఫోన్ నంబరు స్విచాఫ్ వచ్చింది.● ఆరు నెలల క్రితం నల్లమాడ మెయిన్ రోడ్డులోని ఓ బేకరీలోకి వెళ్లిన అగంతకుడు.. తాను ఫుడ్ సేఫ్టీ అధికారినంటూ హడావుడి చేశాడు. బేకరీపై ఫిర్యాదులు వస్తున్నాయంటూ దబాయించాడు. రూ.10 వేలు ఇస్తే తనిఖీలు చేయకుండా వెళ్తామని చెప్పాడు. వ్యాపారి బతిమాలడంతో రూ.5 వేలు తీసుకుని ఉడాయించాడు. ఆ తర్వాత అతడు నకిలీ అధికారి అని తేలడంతో బేకరీ నిర్వాహకులు లబోదిబోమన్నారు.సాక్షి, పుట్టపర్తి ప్రభుత్వ అధికారుల పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్ కాల్స్ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. తాము మోసపోయామని బాధితులు తెలుసుకునేలోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. అనంతరం మొబైల్స్ స్విచాఫ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. పెరిగిన సైబర్ నేరాలు జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. అమాయక ప్రజలను టార్గెట్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. పల్లె ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమూహంగా ఏర్పడి.. కొత్త కొత్త మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేసి మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్ లోన్ అప్రూవల్ అయిందని.. ట్యాక్స్ ఆన్లైన్లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి.. రెండు నెలల క్రితం నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లలో దుండగులు చొరబడ్డారు. తమ వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని ఆయా దుకాణదారులను భయపెట్టి భారీగా వసూళ్లు చేశారు. ఓ దుకాణదారుడికి వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో అతను ఫుడ్ సేఫ్టీలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పాడు. దీంతో ఆగంతకులు తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వారందరూ నకిలీ అధికారులని తెలిసింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అధికారులపైనే ఆరోపణలు కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాటవేశారు. నకిలీ అధికారుల ఆచూకీ తెలిపితే.. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, ఆదాయ పన్ను, కరెంట్ బిల్లు వసూలు, బ్యాంకుల్లో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల్లో ఆఫర్లు తదితర పేర్లతోనే ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అధికారుల పేరుతో డబ్బు వసూలు జిల్లాలో నకిలీ అధికారుల హల్చల్ పన్నుల పేరిట ఆన్లైన్లో దందా ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో చిల్లర రాబడుతున్న వైనం -
ముగిసిన గ్రూప్–1 మెయిన్స్
● రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ ● 594 మంది అభ్యర్థులకు 381 మంది హాజరు అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 3న ప్రారంభమైన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఏడు రోజుల పాటు జరిగిన పరీక్షల్లో అభ్యర్థుల హాజరు 64.28 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ బాలాజీ పీజీ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. పీవీకేకే కళాశాలలో 234 మంది, శ్రీ బాలాజీ కళాశాలలో 360 మంది..మొత్తం 594 మంది అభ్యర్థులకు గాను 381 మంది హాజరయ్యారు. పరీక్షల తీరును కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ పరిశీలించారు. పరీక్షలకు లైజన్ అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జునుడు వ్యవహరించారు. ‘పరివాహన్’లోనే ట్రాలీల రిజిస్ట్రేషన్ అనంతపురం సెంట్రల్: ట్రాక్టర్ ట్రాలీల రిజిస్ట్రేషన్లు ఇక నుంచి ‘పరివాహన్’ వైబ్సైట్లోనే జరుగుతాయని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) ఎం.వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ–ప్రగతి సైట్లో రిజిస్ట్రేషన్లు జరిగేవని, కొద్దిరోజులుగా ఇందులో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రవాణాశాఖలో ప్రతి సేవా ఆన్లైన్లోకి వెళ్లిపోయిందన్నారు. ఈ విషయాన్ని ట్రాలీల తయారీ డీలర్లు గమనించి ట్రేడ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా...
పాకిస్తాన్తో జరుగుతున్న పోరులో అమరుడైన ఆర్మీ జవాన్ మురళీనాయక్ను తలచుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా బోరున విలపిస్తోంది. అతని స్వగ్రామం కల్లితండా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. జమ్మూకశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ మురళీనాయక్ వీరమరణం పొందిన వార్త శుక్రవారం ఉదయం 9 గంటలకు తెలియగానే ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులతోపాటు కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులు మురళీనాయక్తో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కల్లితండాకు వెళ్లి మురళీనాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు.కల్లితండా.. కన్నీటి సంద్రం అమరుడైన బిడ్డను తలచుకుని కన్నీరుమున్నీరైన తండావాసులు గోరంట్ల: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ వీరమరణం గురించి తెలియగానే తండావాసులంతా మురళీనాయక్ స్వగృహానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్లను ఓదార్చారు. మురళీనాయక్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి మెండుగా ఉన్న మురళీ నాయక్...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు. సలాం సైనికసైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్ పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్ అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన..ఉగ్రమూకలకు బదులు చెప్పావ్ దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్ శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్ మాతృభూమి కోసం చివరి నెత్తురుబోట్టునూ చిందించావ్ సలాం సైనిక.. నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం ఆ పా(పి)కిస్తాన్ గాళ్లకు మరణశాసనం రాస్తాం యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై ప్రేమని చాటిచెబుతాం జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం సలాం సైనిక... సలాం సోమందేపల్లిలో విద్యాభ్యాసం సోమందేపల్లి: వీర మరణం పొందిన మురళీ నాయక్ పదో తరగతి వరకు సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లగా.. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. 2016–17 టెన్త్ బ్యాచ్కు చెందిన మురళీ నాయక్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. మురళీ నాయక్ మృతి విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జునతో పాటు అతని మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమతో గడిపిన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ మురళీనాయక్ రాణించేవాడన్నారు. తమ తండా యువకుడు దేశం కోసం ప్రాణాలరి్పంచడం గర్వంగా ఉందని నాగినాయనిచెరువు తండా సర్పంచ్ అంజినాయక్, గ్రామస్తులు చెబుతున్నారు. నమ్మలేకపోతున్నాం మురళీనాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం. – గోవింద నాయక్, కల్లితండాదేశభక్తి ఎక్కువ మురళీ నాయక్ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు. – చాంప్లానాయక్, కల్లితండాసైన్యంలో ఒక్కరోజున్నా చాలు నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా. బోర్డర్లో పనిచేయడం నా కల. ఒక్కరోజు పనిచేసినా చాలు. దేశం కోసం చావనైనా చస్తా. నా శవంపై భారత జెండా కప్పాలి. – స్నేహితులు, సన్నిహితులతో మురళీనాయక్ చెప్పిన మాటలివీ..దేశభక్తి ఎక్కువగా ఉండేది మురళి నాయక్ నాకు మంచి మిత్రుడు. చాలా దేశభక్తి ఉండేది. పోలీసు లేదా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని తపన ఉండేది. వీర మరణం పొందడం గర్వకారణంగా ఉంది. మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధ కల్గిస్తోంది. – చిరంజీవి, సోమందేపల్లిక్రమశిక్షణతో చదివేవాడు మురళీ నాయక్ పదో తరగతి వరకూ మా పాఠశాలలో చదివాడు. చాలా క్రమశిక్షణతో చదువుకునే వాడు. ఎటువంటి వివాదాలు లేని విద్యారి్ధ, దేశ భక్తి కూడా ఎక్కువగా ఉండేది. మా పాఠశాలలో చదివి దేశం కోసం ప్రాణాలు అరి్పంచడం గర్వంగా ఉంది. – మల్లికార్జున, కరస్పాండెంట్ , విజ్ఞాన్ స్కూల్, సోమందేపల్లి -
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు.