నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం

May 17 2025 7:01 AM | Updated on May 17 2025 7:01 AM

నేడు

నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం

ఉరవకొండ/రూరల్‌: పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరథోత్సవం వైభవంగా జరగనుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. దీంతో ఆలయ ఈఓ సాకే రమేష్‌ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఉచిత భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి పెన్నహోబిలం ఆలయానికి ప్రత్యేకంగా 42 ఆర్టీసీ సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ హంపయ్య తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఉరవకొండ అర్బన్‌ సీఐ మహానంది తెలిపారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో సీఐ, ఎస్‌లతో పాటు స్పెషల్‌పార్టీ పోలీసులు అందుబాటులో ఉంటారు.

వేలాదిగా తరలిరానున్న భక్తులు

ఏర్పాట్లు పూర్తిచేసిన

ఆలయ అధికారులు

నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం 1
1/1

నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement