ప్రధాన వార్తలు

‘బనకచర్ల’ అసాధ్యం!
సాక్షి, అమరావతి: ‘‘పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. దీనివల్ల పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడమే సాధ్యం కాదు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు (పీబీఎల్పీ)కు నీరివ్వడం అసాధ్యం’’ అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తెగేసి చెప్పింది. ఈ మేరకు పీపీఏ డైరెక్టర్ మన్నూజీ ఉపాధ్యాయ కేంద్ర జల్శక్తి శాఖకు లేఖ రాశారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తి చేశాకే పీబీఎల్పీపై ఏదైనా ఆలోచన చేయవచ్చునని స్పష్టం చేశారు. పీబీఎల్పీకి సంబంధించి డీపీఆర్ రూపకల్పనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ మే 22న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు ప్రాథమిక నివేదిక (పీఎఫ్ఆర్)ను సమర్పించారు. సీడబ్ల్యూసీ... ఈ ప్రాథమిక నివేదికపై పీపీఏ అభిప్రాయం కోరింది. దీనిని సమగ్రంగా అధ్యయనం చేసిన పీపీఏ తన అభిప్రాయాన్ని తెలిపింది. పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా... ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా గత ఏడాది ఆగస్టు 28న కేంద్రం ఆమోదించిందని, మిగిలిన పనులకు రూ.12,157.53 కోట్లకు మించి ఇచ్చేది లేదని తేల్చిచెప్పిందని పేర్కొంది. దీని ప్రకారమే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని లేఖలో వివరించింది. పీబీఎల్పీ... పోలవరంలో భాగం కాదని, ఈ నేపథ్యంలో పోలవరం నుంచి అదనంగా నీటి తరలింపుపై కేంద్రం సమగ్రంగా అధ్యయనం చేయాలని పీపీఏ పేర్కొంది. అందుబాటులో ఉన్న జలాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. పీబీఎల్పీలో తాడిపూడి ఎత్తిపోతల కాలువను ఉపయోగించుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోందనికానీ, పోలవరం పూర్తయ్యాక ఈ ఎత్తిపోతల ఆయకట్టు కూడా పోలవరంలో భాగం అవుతుందని తెలిపింది. పోలవరం కుడి కాలువ, డిస్ట్రిబ్యూటరీలపై అధ్యయనం చేయాలని సూచించింది. 1980 ఏప్రిల్ 2న అంతర్రాష్ట్ర గోదావరి జలాల ఒప్పందం ఆధారంగా పోలవరం నిర్వహణ షెడ్యూల్ను రూపొందించారని, పోలవరం నుంచి పీబీఎల్పీ ద్వారా 200 టీఎంసీలను మళ్లించే క్రమంలో నాటి షెడ్యూల్ను పునఃపరిశీలించాలని తేల్చిచెప్పింది. పోలవరం కుడి కాలువ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్)కు తరలించేలా పీబీఎల్పీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 80 లక్షల మందికి తాగు, 7.41 లక్షల ఎకరాలకు సాగు నీరు, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 22.58 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు... పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీలను సరఫరా చేస్తామని చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు రూ.81,900 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది.కేవలం కమీషన్ల కోసమే బాబు సర్కారు బనకచర్ల రాగం...!రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే చేపడుతున్నట్లు స్పష్టం అవుతోందని సాగునీటి రంగ నిపుణులు, విమర్శకులు పేర్కొంటున్నారు. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.45 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించారని చెబుతున్నారు. అంతేగాక సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93 శాతం ఉంటుందని వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కారు హడావుడి చేస్తోందని విమర్శిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచర్ల చేపట్టడమా? అని నిలదీస్తున్నారు. నీళ్లు రాని సంగతి తెలుస్తున్నా.. ఎర్త్ వర్క్ చేసి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడతో పోలవరం–బనకచర్ల చేపట్టారని ఆరోపిస్తున్నారు.జనవరిలోనే ‘సాక్షి’ కథనం.. అక్షర సత్యంపీబీఎల్పీకి ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు చంద్రబాబు ప్రభుత్వం జనవరి 24న ప్రతిపాదనలు పంపింది. అప్పుడే ‘‘పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?’’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపింది. ఇప్పుడు పీపీఏ డైరెక్టర్ మన్నూజీ ఉపాధ్యాయ కూడా ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని నిరూపించేలా కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ రాయడం గమనార్హం.జీవనాడికి ఉరేసి ఊపిరి తీయడం వల్లే..పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్వేను 2021 జూన్ 11 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ, గతేడాది ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనిని ఆ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, టీడీపీకి చెందిన రామ్మోహన్నాయుడు వ్యతిరేకించలేదు. అంటే... పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్న మాట. పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేందన్నది కూడా స్పష్టమవుతోంది. పోలవరం కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఈ స్థాయిలో 115.4 టీఎంసీలనే నిల్వ చేయొచ్చు. కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకు నీటిని తరలించవచ్చు. 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 42 మీటర్ల ఎత్తు నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా బనకచర్లకు గోదావరి జలాలను తరలించడం ఎలా సాధ్యమన్నది రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి. పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి, జీవనాడికి ఉరేసి ఊపిరి తీయడం వల్లే పీబీఎల్పీకి శాపంగా మారిందని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జనవరి 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. పీబీఎల్పీకే కాదు... పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీళ్లందించడమూ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు పీబీఎల్పీని రాయలసీమకు గోదావరి జలాలు అందించాలన్న చిత్తశుద్ధితో కాదు.. కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని పీపీఏ లేఖతో బట్టబయలైంది.

బనకచర్ల వద్దు.. తెలంగాణ సర్కారు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండాలో గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో రాసిన ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలన్నింటినీ సీఎస్ ప్రస్తావించారు. బనకచర్లే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డితో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ సింగిల్ (ఏకైక) ఎజెండాగా బనకచర్లపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. తెలంగాణ చేసిన పలు ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చాలని కోరింది. కృష్ణా బేసిన్లోని తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ పథకం కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపు వంటి అంశాలను చేర్చాలని విజ్ఞప్తి చేసింంది. తాజాగా ఇప్పుడు కూడా ఈ అంశాలపైనే చర్చించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది.. బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలపడాన్ని సీఎస్ గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నింటినీ ఉల్లంఘిస్తూ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనేలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ కూడా ఈ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు ఇవే.. ⇒ పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా, అంగీకారం తీసుకోకుండా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రాలకు ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాజెక్టుల నిర్వహణలో సైతం మార్పులు చోటుచేసుకుంటాయి. ఏకపక్షంగా 200 టీఎంసీలను తరలించాలని చేసిన ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్లో మార్పులు జరగడంతో పాటు తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది. ⇒ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అనుమతుల జారీకి సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి క్లియరెన్స్లు అవసరం కాగా, బనకచర్ల ప్రాజెక్టుకు ఇవేమీ లేవు. ⇒ ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టులో కీలకమైన సమాచార లోపాలున్నాయి. నీటి లభ్యత, సాంకేతిక సమాచారం లోపించింది. ⇒ పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఏర్పడే ముంపుపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారు? ⇒ ఈ ప్రాజెక్టు తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాలను హరిస్తుంది. ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలపై దుష్ప్రభావం చూపుతుంది. అన్ని ప్రక్రియలూ పూర్తైన తర్వాతే చర్చించాలి ⇒ చట్టబద్ధంగా రావాల్సిన అన్ని అనుమతులు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలు పూర్తైన తర్వాతే ఈ ప్రాజెక్టుపై అయినా, ఏ సమావేశంలోనైనా చర్చ జరగాలి. ఆ తర్వాతే ప్రాజెక్టును ఆమోదించాలి. ⇒ బనకచర్ల ద్వారా తరలించనున్న 200 టీఎంసీల గురించి పోలవరం ప్రాజెక్టు డీపీఆర్లో ప్రస్తావన లేదు. నీటి లభ్యత, అంతర్రాష్ట్ర ప్రభావాలపై సమగ్ర అధ్యయనంతో పాటు ట్రిబ్యునల్ తీర్పులను నికచ్చిగా అమలు చేస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. ⇒ బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980 ఏప్రిల్ 2న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు తీరులో మార్పులు చోటుచేసుకుంటాయని గోదావరి బోర్డు అభ్యంతరం తెలిపింది. ఎలాంటి మార్పులకైనా పరీవాహకంలోని అన్ని రాష్ట్రాల నుంచి తప్పనిసరిగా రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి జలాల బట్వాడా విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపింది. 80 టీఎంసీలకు మించి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ⇒ గోదావరి ట్రిబ్యునల్ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాల కోటాలను పూర్తిగా వాడుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మించిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించిన 200 టీఎంసీల లభ్యతపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ⇒ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిన విషయాన్ని సైతం లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని కోరిందని తెలిపింది. చర్చకు పెడితే బాయ్కాట్! కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి వారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లపై చర్చకు ఒప్పుకునేది లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బనకచర్లను ఎజెండాలో పెట్టి చర్చ ప్రారంభిస్తే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేస్తారని తెలుస్తోంది. కాగా, వీలును బట్టి సీఎం బుధవారం రాత్రికి, లేదా గురువారం నగరానికి వస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

ఇకనైనా చైనా మారేనా?
గల్వాన్ లోయలో భారత, చైనాల మధ్య ఘర్షణలు జరిగిన అయిదేళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ఇతర దేశాల విదేశాంగమంత్రులతోపాటు కలవటమేకాక, చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో ముందు రోజు భేటీ అయ్యారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఇరుగుపొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందునా చైనా వంటి దేశం పొరుగున వుంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకూ వుందన్న అంశంలో మాత్రమే కాదు... పాకిస్తాన్తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవటం చైనాకు అలవాటైంది. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా మోకాలడ్డుతోంది. ఇలాంటి సమస్యలెన్ని వున్నా సామర స్య వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవటమే విజ్ఞత. అందుకే అయిదేళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటుచేసుకోవటం హర్షించదగ్గది. నిరుడు అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కలుసుకున్నారు. ఉభయ దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అటు తర్వాత మధ్య మధ్యలో చైనా వ్యవహార శైలివల్ల ఇబ్బందులేర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలూ ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. సరిహద్దుల్లోని డెమ్చోక్,డెస్పాంగ్ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలూ నిరుడు అక్టోబర్లో నిర్ణయించ టంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. కానీ మొన్న ఏప్రిల్లో హఠాత్తుగా విద్యుత్ వాహనాల తయారీలో, ఏఐ సహా అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధ కమవుతాయి. ఈ సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్య పడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరుచుకోవాల్సిన అవసరం వున్నదని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ అన్నట్టు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై వున్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో రెండూ అతి పెద్ద మార్కెట్లు. కానీ వృథా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత రెండు దేశాలనూ ఆవరిస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎస్సీఓ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనాలో జరగబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. కనుక ఈలోగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచు కోవటానికి కృషి చేయాల్సి వుంది. కశ్మీర్లోని పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడిచేయటం, అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’తో మన దేశం గట్టిగా జవాబీయటం వంటి పరిణామాల్లో చైనా, పాకిస్తాన్ వైపే నిలబడింది. ఇక దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించటాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించటానికి వీల్లేదు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతేమీ లేదని బంగ్లాదేశ్ చెప్పినా, పాకిస్తాన్ మాత్రం భవిష్యత్తు త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది. ఇదిగాక అమెరికాలో ట్రంప్ ఆగమనం తర్వాత ఆ దేశం బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా అస్పష్టంగా వుంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మనతో కలిసి కూటమి కట్టిన అమెరికా, దానిపై కూడా తన వైఖరేమిటని చెప్పటం లేదు. తన మనసులోని మాట చెప్పకుండా ఈ మధ్య జపాన్, ఆస్ట్రేలియాలతో జరిపిన సమావేశంలో తైవాన్ విషయంలో చైనా దూకుడు నిర్ణయం తీసుకుంటే మీ చర్యలెలావుంటాయంటూ ట్రంప్ ఆరా తీశారు. అమెరికా ఏం చేస్తుందో, ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియకుండా హామీ ఇవ్వటానికి రెండు దేశాలూ నిరాకరించాయి. ఆస్ట్రేలియా అయితే నేరుగానే అది తన సమస్య కాదన్నట్టు మాట్లాడింది. కనుక స్వీయ ప్రయోజనాల రీత్యా చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు.అయితే మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్సీఓలో మంగళవారం మాట్లాడిన జైశంకర్ నిర్మొహమాటంగానే మన వైఖరేమిటో చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులతో పోరాడాల్సి వుంటుందని ఆయన ప్రకటించారు. పెహల్గాం దాడి జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రని చెప్పటంతోపాటు ఎస్సీఓ తన ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్కు మద్దతీయటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతేతప్ప పాక్ తప్పులన్నిటినీ భుజాన మోసుకెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు తెస్తుందని చైనా గుర్తించాలి.

ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.షష్ఠి రా.8.25 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.6.12 వరకు, తదుపరి ఉత్తరాభద్ర తె.5.01 వరకు (తెల్లవారితే గురువారం), వర్జ్యం: ప.3.20 నుండి 4.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: రా.12.25 నుండి 1.56 వరకు, కర్కాటక సంక్రమణం; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.34. మేషం..... నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాల ప్రారంభం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం..వృషభం... కొత్త పరిచయాలు. శుభవార్తా శ్రవణం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పనుల్లో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఊహించని పరిణామాలు.మిధునం.... బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు..కర్కాటకం... పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆస్తి వివాదాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.సింహం... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం..కన్య.... ప్రముఖులతో చర్చలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ముఖ్య నిర్ణయాలు. పనులలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. దైవదర్శనాలు.తుల..... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు.వృశ్చికం... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్ధికంగా ఇబ్బందులు. బంధువులతో వివాదాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.ధనుస్సు... ఆసక్తికరమైన సమాచారం. భూసంబంధిత వివాదాలు పరిష్కారం. చాకచక్యంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు.మకరం... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధు,మిత్రులతో విరోధాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు.కుంభం.... ప్రముఖుల నుంచి కీలక సందేశం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం.మీనం.... ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అనారోగ్యం. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.

పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు
సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్ శ్రీనివాస్ హత్య వరకు వ్యవహారం దారి తీసేది కాదు’ అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు దంపతులు విస్పష్టంగా వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వారిద్దరినీ చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు అక్కడి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం పవన్ కల్యాణ్కు ముందే తెలుసని వారు కుండబద్ధలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.గొడవ చేయొద్దు.. సర్దుబాటు చేస్తానన్నారు‘టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మా బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్దొద్దు.. టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్తో మాట్లాడతాను. విషయాన్ని సర్దుబాటు చేస్తాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ప్రభుత్వానికి, రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్తో ఏం మాట్లాడారో మాకు తెలీదు. కానీ ఎమ్మెల్యే సుధీర్ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కల్యాణ్ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది.పూర్తి వివరాలు తెలుసుకునేందుకే శ్రీనివాస్ను పిలిపించాం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్ మెయిలింగ్ కొనసాగిస్తునే ఉన్నారు. దాంతో శ్రీనివాస్ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో రూ.20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక రూ.10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు.పవన్ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదువ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ను కట్టడి చేసి ఉండే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్.. మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం.. దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు. దాంతో డ్రైవర్ శ్రీనివాస్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పరిస్థితి చేయిదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్ మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్చార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే.. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు.

బ్రిక్స్... ట్రంప్... కాగితం పులి కథ!
బ్రెజిల్లోని రియో డి జనేరో నగరంలో ఈ నెల 6–7 తేదీలలో జరిగిన ‘బ్రిక్స్’ 17వ శిఖరాగ్ర సమావేశాలను ఒకవైపు, దానిపై మొదటినుంచే కత్తులు దూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను మరొకవైపు గమనించగా కాగితం పులి కథ గుర్తుకు వస్తుంది. బ్రిక్స్... తన సభ్య దేశాల అభివృద్ధికి, పరస్పర సహకారానికి ఏర్పడినటువంటిది. 2009లో స్థాపించినప్పటి నుంచి గత 16 సంవత్సరాలలో అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చింది తప్ప, అమెరికాకు గానీ, మరొకరికిగానీ వ్యతిరేకంగా ఎప్పుడు ఏ చర్యలూ తీసుకోలేదు. అయినప్పటికీ, అమెరికా అధ్యక్షులందరికి భిన్నమైన రీతిలో ట్రంప్ మాత్రం బ్రిక్స్ను తమకు వ్యతిరేకమైన కూటమి అంటున్నారు. అధికారానికి వచ్చిన కొత్తలో బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇపుడు బ్రెజిల్ సమావేశాలకు ముందు రోజున 10 శాతం అన్నారు. బ్రిక్స్లో చేర రాదంటూ ప్రపంచ దేశాలను కొన్ని నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఈసారి సమావేశాలు ముగిసే నాటికి, ట్రంప్ను అమెరికా సన్నిహిత దేశాలు సహా ఎవరూ ఖాతరు చేయనట్లు స్పష్టమైంది. జనాభా... జీడీపీ... 40 శాతం వాటా!2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలలో బ్రిక్గా మొదలైన సంస్థ, దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారటం తెలిసిందే. ట్రంప్ హెచ్చరికలు చేసిన మరునాడే ఇండోనేషియా పూర్తి సభ్య దేశంగా చేరింది. ఇపుడు బ్రెజిల్లో బేలారూస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, నైజీరియా, మలేషియా, థాయ్లాండ్, వియత్నాం,ఉగాండా, ఉబ్జెకిస్తాన్ భాగస్వామ్య దేశాలుగా కొత్తగా చేరాయి. బ్రెజిల్ సమావేశాల కన్న ముందు మాసాలలో ఈజిప్టు, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ పార్ట్నర్ దేశాలయ్యాయి. ఈ జాబితాను విశ్లేషించినట్లయితే నాలుగు విషయాలు దృష్టికి వస్తాయి. ఒకటి, సంఖ్య రీత్యా ఇపుడవి మొత్తం 21 దేశాలు. రెండు, అమెరికా, యూరప్తో కూడిన పాశ్చాత్య ప్రపంచానికి బయటగల ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలన్నింటికి అందులో ప్రాతినిధ్యం ఉంది. మూడు, వాటిలో అనేకం ఆర్థికంగా శక్తిమంతమై నవి. నాలుగు, బహుశా అంతకన్న విశేషంగా పలు దేశాలకు అమెరి కాకు అనుకూలమైనవనే పేరున్నది. అటువంటి పేరే గల ఆసియన్ కూటమి దేశాలు కూడా బ్రిక్స్కు తోడుకావటం మరొక విశేషం.తాజా విస్తరణ తర్వాత బ్రిక్స్ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 41 శాతానికి చేరింది. వీటి జీడీపీ ప్రపంచ జీడీపీలో 40 శాతం అయింది. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జి–7కు మించిపోయిన లెక్కలు. బ్రిక్స్ నెలకొల్పిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డిబి) రుణ సహాయాలతో 40 బిలియన్ డాలర్ల విలువ గల 120 అభివృద్ధి పథకాలను వర్ధమాన దేశాలలో అమలుపరుస్తున్నారు. అమెరికా చెప్పు చేతలలో గల ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ తరహా షరతులుగానీ, ఆయా దేశాల ఆర్థిక విధా నాలలో జోక్యం గానీ బ్రిక్స్ బ్యాంక్ నుంచి ఉండవు.అమెరికాకు ఎందుకు కలవరం?అమెరికా తన డాలర్ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రపంచ దేశాల కరెన్సీ విలువలను, మార్కెట్లను, బ్యాంక్ చెల్లింపులను, రిజర్వ్లను నియంత్రిస్తున్నందున, తమకు సరిపడని దేశాల డాలర్ అకౌంట్లను స్తంభింపజేస్తున్నందున, డాలర్ మారకం నుంచి విముక్తి అవసరమని బ్రిక్స్ దేశాలు కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా నిరుడు అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన 16వ సమావేశాలలో ఇందుకు మరింత కదలిక వచ్చింది. ఆ ప్రకారం బ్రిక్స్ దేశాలు డాలర్తో సంబంధాలను ఒకే సారి పూర్తిగా తెంచుకోవటంగాక, తమ మధ్య వాణిజ్యానికి పరస్పర చెల్లింపులు డాలర్లో గాక వీలైనంత మేర తమ సొంత కరెన్సీలలో జరుపుకోవాలనీ, ఆ స్థాయిని క్రమంగా పెంచుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. ఈ పని బ్రిక్స్ దేశాల మధ్యనే గాక, ఇతర దేశాలతోనూ జరిగేందుకు ప్రయత్నించాలని భావించాయి. అనగా డాలర్ పాత్రను, ఆధిపత్యాన్ని తగ్గించటమన్నమాట!నిజానికి స్థానిక కరెన్సీలలో చెల్లింపుల పద్ధతి స్వల్ప స్థాయిలో గతంలోనూ ఉండేది. కానీ బ్రిక్స్ నిర్ణయాలతో అది గణనీయంగా పెరిగి ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 30 శాతానికి మించినట్లు అంచనా. బ్రెజిల్ విస్తరణతో ఈ ధోరణి పెరిగినట్లయితే, త్వరలో 50 శాతానికి చేరే అవకాశం ఉంది. బ్రిక్స్ అంటే అమెరికా అధ్యక్షుడు ఎందుకింత కలవరపడుతున్నారో, దీన్ని బట్టి తేలికగా అర్థం చేసు కోవచ్చు. ప్రపంచంపై అమెరికా సామ్రాజ్యవాదపు ఆధిపత్యం వెంటనే అంతం కాక పోయినా క్రమంగా బలహీనపడుతుంది. మారిన పరిస్థితులలో ఒకప్పటివలె బ్రిక్స్ వంటి దేశాలపై ప్రత్యక్ష యుద్ధాలు చేయలేరు గనుక, టారిఫ్ల హెచ్చింపు, ఇతర వాణిజ్య ఆంక్షల రూపంలో ఆర్థిక యుద్ధాలు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి, అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతరుల నుంచి వస్తున్న పోటీలను తట్టుకునేందుకు ఆయన స్వపర భేదాలు లేకుండా అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్ల యుద్ధం ఆరంభించారు. అయితే, బ్రిక్స్తో వైరం భిన్నమైనది. ఆ సంస్థ వర్ధమాన దేశాల కోసం భిన్న మైన, దీర్ఘకాలిక, ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించే అజెండాతో పని చేస్తున్నది. ఆర్థికంగానే కాదు. అభివృద్ధి నమూనా దృష్ట్యా కూడా. వాణిజ్యంలో ‘స్వేచ్ఛ’ కోసం...మరొక కీలకమైన అంశం స్వేచ్ఛా వాణిజ్యం. ఈ భావనను ముందుకు తెచ్చి డబ్ల్యూటీవోను నెలకొల్పిన అమెరికా కూటమి, దానిని తమ ప్రయోజనాలకు అనుకూలమైనంత కాలం ఉపయోగించుకుని, ఇటీవల ఇతర దేశాలు కూడా లాభపడుతుండటంతో ఆ నియమాలను భంగపరచజూస్తున్నది. స్వేచ్ఛా వాణిజ్యం యథా తథంగా కొనసాగటమే గాక, ఆ సంస్థలో వర్ధమాన దేశాల గొంతుకలు వినవస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నది బ్రిక్స్ వాదనలలోని ముఖ్యాంశాలలో ఒకటి. ఆ పని జరిగితే వర్ధమాన దేశాల వనరులకు, ఉత్పత్తులకు తగిన ధరలు లభిస్తాయి. ధనిక రాజ్యాలు ఇతరులను ఒత్తిడి చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేయటం, తమ ఉత్పత్తులను మాత్రం అధిక ధరలకు విక్రయించటం వంటి పరిస్థితి పోతుంది. మరొక స్థాయిలో బ్రిక్స్ దేశాలు అమెరికా ఏకధ్రువ ప్రపంచం ఆమోదయోగ్యం కాదనీ, బహుళ ధ్రువ ప్రపంచం తమ లక్ష్యమనీ స్పష్టంగానే చెప్తున్నాయి. బ్రిక్స్ గురించి యూరోపియన్ దేశాలు ఇంతవరకైతే వ్యతిరేకంగా మాట్లాడలేదుగానీ, అమెరికా వైపు చూస్తు న్నాయి. కజాన్, రియో డి జనేరో సమావేశాల దరిమిలా ట్రంప్పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల తక్షణ ప్రభావాల గురించి కూడా కొంత చెప్పు కోవాలి. ఇండియాను టారిఫ్లతో లొంగదీసి ఒప్పందాలు చేసుకో జూడగా, దానిపై ఒకవైపు చర్చలు సాగిస్తూనే, తాము కూడా 25 శాతం ఎదురు సుంకాలు విధించగలమని భారత ప్రభుత్వం డబ్ల్యూటీవోలో స్పష్టం చేసింది. తామూ అదే పని చేయగలమని బ్రెజిల్, వియత్నాం, ‘ఆసియాన్’, దక్షిణాఫ్రికా మొదలైనవి హెచ్చరించాయి. చైనా, రష్యా సరేసరి. టారిఫ్లు ప్రకటించినపుడు ట్రంప్ మాట్లాడుతూ 90 రోజులలో 90 ఒప్పందాలు చేసుకోగలమని,అందరూ క్యూలు కడుతున్నారని ఆట్టహాసంగా అన్నారు. 90 రోజులు గడిచేసరికి జరిగినవి ఇంగ్లండ్, వియత్నాంలలో మాత్రమే. కెనడా, యూరప్ సైతం ధిక్కార స్వరంలోనే ఉన్నాయి. ఈ పరిణా మాల మధ్య బ్రిక్స్ను ఢీకొంటున్న ట్రంప్, కాగితం పులిగా మిగలటం తప్ప గత్యంతరం కనిపించదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు

మాస్కోను కొట్టగలవా?
వాషింగ్టన్: దీటైన అస్త్రశస్త్రాలు అందిస్తే మాస్కోను కొట్టగలవా? రష్యాపై భీకరంగా దాడిచేయగలవా? అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూటి ప్రశ్న వేశారు. జూలై నాలుగో తేదీన జెలెన్స్కీకి ఫోన్చేసిన మాట్లాడిన సందర్భంగా ట్రంప్, వొలదిమిర్ జెలెన్స్కీల మధ్య జరిగిన సంభాషణ తాలూకు విశేషాలను తాజాగా అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై క్షిపణుల వర్షం కురిపిస్తూ తీవ్ర నష్టం చేకూరుస్తున్న రష్యాకు సైతం అదే స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కల్గించాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది.ఇరునేతల సంభాషణ వివరాలను కొన్ని అత్యున్నత వర్గాలు వెల్లడించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘‘ చూడు వొలదిమిర్.. నువ్వు రష్యా రాజధాని మాస్కో నగరంపై క్షిపణులతో దాడి చేయగలవా?’’ అని ట్రంప్ ప్రశ్నించగా.. ‘‘ తప్పకుండా. మీరు సరైన మిస్సైళ్లు ఇస్తే దాడి చేసి చూపిస్తా’’ అని జెలెన్స్కీ హామీ ఇచ్చారు. ‘‘ మీకు కావాల్సిన సుదీర్ఘ శ్రేణి క్షిపణులను అందిస్తాం. రష్యాలోని సెయింట్పీటర్స్బర్గ్ను ధ్వంసంచేయగలరా?’’ అని ట్రంప్ ప్రశ్నించగా.. ‘‘ ఆ స్థాయిలో దాడికి సరిపడా ఆయుధాలు సమకూరిస్తే తప్పకుండా దాడిచేస్తాం’’ అని జెలెన్స్కీ మాటిచ్చారు. ‘‘ దాడుల్లో రక్తమోడుతూ ఉక్రెయిన్వాసులు పడుతున్న బాధను రష్యన్లు అనుభవించాలి. మీ దాడులతో వాళ్లకూ నొప్పి తెలిసిరావాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్తో సయోధ్య కుదుర్చుకోవాలని, లేదంటే 50 రోజుల్లోపు సుంకాల సుత్తితో మోదుతానని రష్యాను ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంభాషణల అంశం తెరమీదకు రావడం గమనార్హం. శాంతి ఒప్పందం చేసుకోండని ఎంతమొత్తుకున్నా రష్యా వినిపించుకోవట్లేదని, సహనం నశించి ట్రంప్ ఇలా జెలెన్స్కీని దాడులు చేయగలవా? అని ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే సంభాషణల వార్తపై అటూ శ్వేతసౌధంగానీ, ఇటు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయంగానీ స్పందించలేదు.నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో కలిసి శ్వేతసౌధంలో ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ పుతిన్ అంత సులభంగా లొంగే మనిషి కాడు. మన నేతలనే మభ్యపెట్టాడు. క్లింటన్ మొదలు జార్జ్ బుష్, ఒబామా, బైడెన్దాకా అమెరికా అధ్యక్షులను తన మాటలతో మభ్యపెట్టాడు. నేను వాళ్లలాగా ఫూల్ను కాబోను. బిలియన్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్కు సరఫరా చేస్తా. నాటో సభ్యదేశాలు ఆర్డర్ ఇచ్చిన 17 గగనతల రక్షణ వ్యవస్థ మిస్సైల్ లాంఛర్లన్నీ ఉక్రెయిన్కు పంపిస్తాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కూటమి సర్కారు అప్పులు.. రూ.1,86,112 కోట్లు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించకపోగా ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల ఎడా పెడా అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఏడాదిలోనే ఇంత భారీగా అప్పులు చేయలేదు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. తాజాగా మంగళవారం రూ.3,600 కోట్లు అప్పు చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన.. చేయాలని నిర్ణయించిన అప్పులు ఏకంగా రూ.1,86,112 కోట్లకు చేరాయి. ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు తప్ప సూపర్ సిక్స్ హామీల అమలు ద్వారా ప్రజలికిచ్చేందేమీ లేదు. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ రాష్ట్రప్రభుత్వానికి 6.88 శాతం వడ్డీకి రూ.3,600 కోట్ల రుణం సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,23,702 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.31,410 కోట్లు అప్పు చేస్తోంది. ఇందులో ఇప్పటికే చాలా వరకు అప్పులు చేయగా, ఇటీవల కేబినెట్ సమావేశంలో 2013 కంపెనీల చట్టం కింద ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా మరో రూ.10,000 కోట్లు అప్పు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇంకో రూ.1,000 కోట్లు అప్పు చేయడానికి ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకుని, జీవో కూడా జారీ చేశారు. సంపద సృష్టి దేవుడికే ఎరుక!రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసినా, సూపర్ సిక్స్లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తి చేశారు. సంపద సృష్టించడం దేవుడెరుగు.. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. ఏడాది పాలనలో ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం చేసిందంటే భారీగా అప్పులు చేయడం తప్ప ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ఏపీఎండీకి చెందిన 436 మైనర్ లీజుల విలువ రూ.1,91,000 కోట్లుగా చూపించి, తద్వారా ప్రైవేట్ బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9,000 కోట్లు అప్పు చేసింది. ఇందు కోసం బాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తులకు ఖజానాను తాకట్టు కూడా పెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా, ఎల్లో మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం లేదు. మంగళవారం మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతోంది.

రెండు రోజులముందుగానే...'క్రికెట్... రైట్ రైట్'...
లాస్ ఏంజెలిస్: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది పలు క్రీడాంశాల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు ముందే ఆరంభమయ్యే క్రీడాంశాల సంఖ్య పెరగగా... విశ్వక్రీడల చివర్లో నిర్వహించే అథ్లెటిక్స్ను ఈ సారి ముందే జరపనున్నారు. మొత్తం 351 మెడల్ ఈవెంట్స్ జరగనున్న ఈ విశ్వక్రీడల షెడ్యూల్లోని కొన్ని విశేషాలు... » 2028 జూలై 14న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుక జరగనుండగా... అంతకు రెండు రోజుల ముందే పలు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 1932, 1984 ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలిచిన లాస్ ఏంజెలిస్లోని విఖ్యాత ఎల్ఏ మెమోరియల్ కొలోజియంతోపాటు ఇంగ్లెవుడ్లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు ఎల్ఏ మెమోరియల్ కొలోజియం వేదికగా నిలుస్తుంది. » బాస్కెట్బాల్, క్రికెట్, హాకీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్, వాటర్ పోలో వంటి ఈవెంట్లలో పోటీలు ముందే మొదలవనున్నాయి. » 1920 ఒలింపిక్స్ తర్వాత... విశ్వక్రీడల ప్రారంభ వేడుకకు ముందు ఇన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలు కావడం ఇదే తొలిసారి. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్ పోటీలు మాత్రమే ముందు ప్రారంభించారు. » ప్రధాన క్రీడా వేదిక లాస్ ఏంజెలిస్కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనాలో క్రికెట్ పోటీలు జరగనుండగా... జూలై 12న ప్రారంభం కానున్న ఈ పోటీలు 29న ముగియనున్నాయి. జూలై 20, 29న మెడల్ మ్యాచ్లు నిర్వహిస్తారు. » టి20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీలో... పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొననున్నాయి. 1900 ఒలింపిక్స్లో చివరిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ప్రవేశ పెట్టారు. » అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) క్రికెట్తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రాస్, స్క్వాష్ వంటి పలు క్రీడాంశాలను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది. » ఆరంభ వేడుక తదుపరి రోజు అంటే జూలై 15న ట్రయాథ్లాన్లో తొలి మెడల్ ఈవెంట్ జరగనుంది. » ఒలింపిక్స్లో స్విమ్మింగ్ పోటీలు ముగిసిన తర్వాత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం పరిపాటి కాగా... ఈసారి మొదట అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి చివరి వారంలో స్విమ్మింగ్ ఈవెంట్లు జరపనున్నారు. » 2028 జూలై 30న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు నిర్వహించనుండగా... చివరగా స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి.

టెస్లా కారు వచ్చేసింది..
ముంబై: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. అలాగే, మధ్య స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ ’వై’ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఈ షోరూంను ప్రారంభించారు. టెస్లా భారత్లోనే పరిశోధనలు, తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లు, సర్వీస్, చార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఏపీఏసీ (ఏషియా పసిఫిక్) రీజియన్ చీఫ్ ఇసాబెల్ ఫాన్ తెలిపారు. ముంబై, ఢిల్లీలో 4 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జర్మన్ కార్లతో పోటీ.. దేశీ మార్కెట్లో మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి జర్మన్ ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లతో టెస్లా మోడల్ వై పోటీపడనుంది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల కార్ల ధర రూ. 30 లక్షల లోపే ఉంటోంది. దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్ ప్రస్తుతం కార్ల దిగుమతులపై 70–100 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. వీటిని తగ్గించాలని కోరుతున్న టెస్లా, దేశంలో ముందుగా తమ కార్లను అమ్ముకునేందుకు, సర్విస్ చేసేందుకు అనుమతిస్తే, అమ్మకాలను బట్టి తయారీ చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తామంటూ టెస్లా చెబుతోంది. కానీ, ఏ ఒక్క కంపెనీకో ప్రయోజనం చేకూర్చేలా విధానాలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామనే హామీ ఇచ్చే కంపెనీలు 15 శాతం సుంకానికే ఏటా 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది.రెండు వేరియంట్లు..మోడల్ వై రెండు వేరియంట్స్లో లభిస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజిని (మైలేజీ) ఇచ్చే రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ బేస్ ధర రూ. 59.89 లక్షలుగా ఉంటుంది. 622 కి.మీ. రేంజినిచ్చే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలుగా ఉంటుంది. 2025 మూడో త్రైమాసికం లేదా నాలుగో త్రైమాసికం నుుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.దీన్ని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా చైనాలోని తమ ప్లాంటు నుంచి టెస్లా దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయిస్తుంది. ముందుగా ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్లో డెలివరీలు, రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. టెస్లా డిజైన్ స్టూడియో ద్వారా వాహనం లోపల, వెలుపల, అలాగే ఫీచర్లను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చని పేర్కొంది. భారత్లో టెస్లా వాహనాలకు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్, ఎకో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు బీమా కవరేజీని అందిస్తాయి.ధరలు ఇలా.. (కంపెనీ వెబ్సైట్ ప్రకారం..) ⇒ మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 59.89 లక్షలు (ముంబై ఎక్స్–షోరూం), ఆన్రోడ్ ధర రూ. 61,07,190.⇒ మోడల్ వై లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 67.89 లక్షలు (ముంబై ఎక్స్–షోరూం), ఆన్రోడ్ ధర రూ. 69,15,190.⇒ బుకింగ్ అమౌంట్ రూ. 22,220గా (నాన్–రిఫండబుల్) ఉంటుంది. తుది ధ్రువీకరణ కోసం ఏడు రోజుల్లోగా మరో రూ. 3 లక్షలు చెల్లించాలి. ⇒ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) ఆప్షన్ కోసం అదనంగా రూ. 6 లక్షలు.⇒ అమెరికాలో నగదు రూపంలో చెల్లిస్తే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 37,490 డాలర్లుగా (సుమారు రూ. 32.24 లక్షలు) ఉంది.ప్రత్యేకతలు.. ⇒ గంటకు 0 – 100 కి.మీ. వేగం 5.6 సెకన్లలో⇒ వెనుక కూర్చునే వారి కోసం ఎనిమిది అంగుళాల స్క్రీన్, 9 స్పీకర్లు⇒ టాప్ స్పీడ్ గంటకు 201 కి.మీ.⇒ ఫాస్ట్ చార్జర్లతో 15 నిమిషాల్లో 267 కి.మీ. చార్జింగ్⇒ వెలుపల ఎనిమిది కెమెరాలు⇒ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్⇒ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్⇒ రెండు వేరియంట్లు, ఆరు రంగుల్లో లభ్యం ⇒ వైర్లెస్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, వైర్లెస్ చార్జర్
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
మూడు ముళ్లకెందుకులే తొందర!
‘హంద్రీృనీవా’లో మహాపాతకం
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
సెంటు భూమి కూడా ఇవ్వం
'శుభ్ర'కదబ్ర..!
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
పంటల బీమా..రైతులు దూరం..దూరం
కూటమి సర్కారు అప్పులు.. రూ.1,86,112 కోట్లు
గ్రేట్ ఫ్లాటెనింగ్...ఇప్పుడు ట్రెండింగ్
ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
లారెన్స్ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'
పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించేసరికి..
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
విమానాలే కూలుతున్నాయ్! ఆఫ్ట్రాల్ గోడ కూలితే ఇంత రాద్ధాంతం ఏంటని అంటున్నాడ్సార్!!
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఓడినా గర్వంగా ఉంది.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్
సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు
ఇప్పుడు మీరు అర్జంటుగా బంగ్గాదేశ్, నేపాల్ మయన్మార్ భాషలు నేర్చు కోవాల్సిందేనా సార్!
జీతాల పెంపుపై టీసీఎస్ సీఎఫ్వో కీలక ప్రకటన
మహమ్మారి వస్తుంది.. అగ్ని ప్రమాదాలు ఎక్కువే: స్వర్ణలత భవిష్యవాణి
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
ప్రేమించుకున్న అన్నాచెల్లెళ్లు.. గ్రామానికే అరిష్టమని..!
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
మూడు ముళ్లకెందుకులే తొందర!
‘హంద్రీృనీవా’లో మహాపాతకం
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
సెంటు భూమి కూడా ఇవ్వం
'శుభ్ర'కదబ్ర..!
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
పంటల బీమా..రైతులు దూరం..దూరం
కూటమి సర్కారు అప్పులు.. రూ.1,86,112 కోట్లు
గ్రేట్ ఫ్లాటెనింగ్...ఇప్పుడు ట్రెండింగ్
ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
లారెన్స్ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు'
పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించేసరికి..
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
విమానాలే కూలుతున్నాయ్! ఆఫ్ట్రాల్ గోడ కూలితే ఇంత రాద్ధాంతం ఏంటని అంటున్నాడ్సార్!!
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఓడినా గర్వంగా ఉంది.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్
సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు
ఇప్పుడు మీరు అర్జంటుగా బంగ్గాదేశ్, నేపాల్ మయన్మార్ భాషలు నేర్చు కోవాల్సిందేనా సార్!
జీతాల పెంపుపై టీసీఎస్ సీఎఫ్వో కీలక ప్రకటన
మహమ్మారి వస్తుంది.. అగ్ని ప్రమాదాలు ఎక్కువే: స్వర్ణలత భవిష్యవాణి
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
ప్రేమించుకున్న అన్నాచెల్లెళ్లు.. గ్రామానికే అరిష్టమని..!
సినిమా

నటిపై దారుణ ట్రోల్స్.. మహిళలంటే ఎందుకంత ద్వేషం.. ఉర్ఫీ జావెద్ ఆగ్రహం!
బిగ్బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ది ట్రైటర్స్ టైటిల్ గెలిచిన ముద్దుగుమ్మ నెటిజన్స్ ట్రోల్స్పై తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటివీ నా జీవితంలో చాలా చూశానని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఒక మహిళ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలానీతో ప్రేమలో ఉన్నట్లు నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఈ జంటపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.ఈ ప్రేమజంటను చూసి ట్రోల్స్ చేయడంపై నటి ఉర్ఫీ జావెద్ మండిపడింది. ఎల్లి అవ్రామ్ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేసినందుకు ఉర్ఫీ జావేద్ విమర్శించింది. ఈ రోజుల్లో స్త్రీలపై విద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది చూస్తుంటే మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోందని చెప్పింది. కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్దేశించి కామెంట్స్ చేయడమేంటని ఉర్ఫీ ప్రశ్నించింది. ఇక్కడ మహిళలను విలన్గా చూపించడానికి, ద్వేషించడానికే ఎక్కువ ఇష్టపడతారని.. అదే వారు ఉన్నతంగా భావిస్తారని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా.. జూలై 12న, ఆశిశ్, ఎల్లీ ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆశిష్ ఎల్లీని తన చేతుల్లోకి ఎత్తుకుని కనిపించారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఫైనల్లీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి వయస్సును ఉద్దేశిస్తూ ట్రోల్స్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.యూట్యూబ్లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.మరోవైపు ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.

ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
జెనీలియా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె కోసమే సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, హ్యాపీ, రెడీ, ఢీ చిత్రాలు సూపర్ హిట్గా నిలవడంలో జెనీలియా(Genelia) కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం.. హాసిని పాత్రలో జెనీలియా కనబర్చిన నటననే. ఇప్పటికీ జెనీలియా అనగానే అందరికి హాసిని పాత్రే గుర్తొస్తుంది. ఆ ఒక్క సినిమాతో జెనీలియా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, రామ్ పోతినేని..ఇలా అప్పటి యంగ్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతుంది ఈ అల్లరి బ్యూటీ. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘జూనియర్’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారితో కలిసి నటించినప్పుడు ఇంత గొప్ప స్టార్స్ అవుతారని ఊహించలేదని చెబుతోంది. ఇప్పుడు వాళ్లను స్టార్ హీరోలుగా చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.‘ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్లను చూసి.. ‘వీళ్లతోనేనా నేను నటించాను’ అనుకున్నా. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అని ఎప్పుడు చెబుతుంటాను. నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పాలి. మూడు పేజీల డైలాగుని కూడా సింగిల్ టేక్లో చెబుతుంటాడు. రామ్ చరణ్ అమెజింగ్. అతనితో కలిసి ఆరెంజ్ సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్లో ఆయన ఫెర్పార్మెన్స్ బాగుంది. ఇక అల్లు అర్జున్.. చాలా ఎనర్జిటిక్ పర్సన్. హ్యాపీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చాలా హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు వీరందరిని పాన్ ఇండియా స్టార్స్గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని జెనీలియా చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల మరణించిన కోటా శ్రీనివాస్రావు గురించి మాట్లాడుతూ.. ‘ఆయన గొప్ప నటుడు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఎలా నటించాలో చెప్పేవారు. ఆయనతో కలిసి రెడీ కూడా చేశాను. ఆయన మరణవార్త వినగానే దిగ్బ్రాంతికి గురయ్యాను. అంతగొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం’ అని జెనీలియా చెప్పింది.

లెజెంజరీ నటి సరోజా దేవి చివరి కోరిక అదే.. నెరవేర్చిన కుటుంబ సభ్యులు
వెండితెరపై దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అలనాటి నటి బి. సరోజా దేవి (87) అనారోగ్యంతో మరణించారు. వృద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని మల్లేశ్వరంలో తన స్వగృహంలో సోమవారం ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో సినీ ప్రపంచం ఆమెకు ఘనంగా నివాళులర్పించింది. ఆమె నటించిన సినిమాలు, పాత్రలను గుర్తు చేసుకున్నారు.అయితే ఆమె చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నేరవేర్చారు. ఆమె కోరిక మేరకు కళ్లను దానం చేశారు. ఆమె కోరుకున్న విధంగా నారాయణ నేత్రాలయకు అందజేశారు. గతంలో నారాయణ నేత్రాలయను సందర్శించినప్పుడు కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారని ఐ బ్యాంక్ అధికారి డాక్టర్ రాజ్కుమార్ తెలిపారు. ఆమె నేత్రదానానికి నమోదు చేసుకుని దాదాపు ఐదేళ్లు పూర్తయిందని వెల్లడించారు.అంత్యక్రియలుసరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.తెలుగులో పాతిక వరకూ...తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు.

ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా చేశా.. కానీ ఒక్కరోజు ముందే..!
ప్రముఖ బిగ్బాస్ బ్యూటీ, బుల్లితెర నటి సంభావన సేత్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. 2016లో అవినాశ్ ద్వివేదిని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. గతేడాది ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చగా.. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటనను వివరించింది.గతేడాది డిసెంబర్లో జరిగిన తనకు గర్భస్రావమైందని సంభావన సేత్ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో అంతా బాగానే ఉందని వైద్యుడు మాకు హామీ ఇస్తూనే ఉన్నాడని తెలిపింది. కానీ ఆ తర్వాత గర్భంలో తన బిడ్డ హృదయ స్పందన 15 రోజుల ముందే ఆగిపోయిందని తాను గుర్తించానని వెల్లడించింది. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా నిర్వహించామని సంభావన పేర్కొంది. ఈ సంతోషకర విషయాన్ని చెప్పేందుకు ఒక రోజు ముందే తనకు బ్లీడింగ్ మొదలైందని షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.అయితే దాదాపు 15 రోజుల ముందే అనారోగ్యంతో ఉన్నానని వైద్యుడికి సమాచారం ఇచ్చా.. కానీ నాకు ఆర్థరైటిస్ సమస్య అని తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్థరైటిస్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్లగా అలాంటిదేం లేదని చెప్పారు.. ఇది గర్భస్రావానికి సంకేతమని డాక్టర్ అన్నారు. కానీ మేము సంప్రదించిన డాక్టర్ మాత్రం ఎలాంటి టెస్టులు చేయకుండా అంతా నార్మల్గానే ఉందని చెప్పారని గుర్తు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తనకు గర్భస్రావం అయిందని తెలుసొచ్చిందని సంభావన వివరించింది. అంతేకాకుండా మీకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ తనదే తప్పు అన్నట్లుగా మాట్లాడిందని తన బాధను వ్యక్తం చేసింది
న్యూస్ పాడ్కాస్ట్

70 ఏళ్ల కిందట కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, కేసీఆర్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చర్చిద్దామా?. బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెడ్డిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడ్ లారీ బోల్తా ఆరుగురు కూలీలు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్లో జనాన్ని కబళిస్తున్న కల్తీ మద్యం... ఒక్క ఏడాదిలోనే 5 వేల 280 కోట్ల రూపాయలు దోచేసిన టీడీపీ లిక్కర్ సిండికేట్

ఏపీ ముఖ్యమంత్రిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

రైతుకు గడ్డు కాలం.. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు... చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

చిత్తూరు జిల్లాలో మామిడి రైతన్న చిత్తు చిత్తు... ఆశలు చిదిమేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. నేడు రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరో 2వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల పిడుగు

ఆంధ్రప్రదేశ్లో పోలీసుల రెడ్బుక్ అరాచకాలకు హైకోర్టు రెడ్సిగ్నల్

మా భూములిచ్చే ప్రసక్తే లేదు... ఏపీ రాజధాని భూ సమీకరణ సభల్లో ఎమ్మెల్యే, అ«ధికారులను తరిమికొట్టిన రైతులు
క్రీడలు

బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో విజయం ఆఖరికి ఇంగ్లండ్ను వరించింది. ఇంగ్లండ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ది కీలక పాత్ర. స్టోక్సీ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి బ్యాటింగ్లో 77 పరుగులు చేసిన స్టోక్స్.. బౌలింగ్లో 5 కీలక వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం(టెస్టు క్రికెట్)లో నాలుగు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్గా స్టోక్స్ నిలిచాడు.ఈ మ్యాచ్ ముందు వరకు స్టోక్స్.. జో రూట్ (ఇంగ్లండ్), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా)లతో కలిసి చెరో మూడేసి అవార్డులతో సంయుక్తంగా ఉన్నాడు. తాజా మ్యాచ్తో ఈ దిగ్గజ త్రయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ అధిగమించాడు.స్టోక్స్ తొలిసారిగా 2015లో లార్డ్స్ మైదానంలో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2017,2019లో ఈ అవార్డు అతడికి వరించింది. మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ఐకానిక్ గ్రౌండ్లో ప్లేయర్గా ఆఫ్ది మ్యాచ్గా స్టోక్స్ నిలిచాడు.ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుందిఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి లైమ్ డాసన్ వచ్చాడు. భారత్ కూడా తమ తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: భారత్ ఓటమికి కారణమదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గవాస్కర్

రాహుల్ ద్రవిడ్ కొడుకుకు బిగ్ షాక్..
బెంగళూరు వేదికగా మంగళవారం మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 టోర్నీ-2025 వేలం జరిగింది. ఈ వేలంలో - మైసూర్ వారియర్స్, హుబ్లి టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, గుల్బర్గా మిస్టిక్స్ మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తమ కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి.ఈ వేలంలో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్పై కాసుల వర్షం కురిసింది. అతడిని హుబ్లి టైగర్స్ రికార్డు స్థాయిలో రూ.13.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పడిక్కల్ నిలిచాడు. అదేవిధంగా హుబ్లి టైగర్స్ అభినవ్ మనోహర్ను సైతం రూ. 12.20 లక్షలకు సొంతం చేసుకుంది. హుబ్లి ఫ్రాంచైజీ వీరిద్దరిపైనే దాదాపు సగంపైగా మొత్తాన్ని ఖర్చుచేసింది. టీమిండియా వెటరన్, కేకేఆర్ ఆటగాడు మనీష్ పాండేను రూ. 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ దక్కించుకుంది.సమిత్ ద్రవిడ్కు బిగ్ షాక్..కాగా మహారాజా టీ20 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అమ్ముడుపోలేదు. రూ. 50 వేలు కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. సమిత్ ద్రవిడ్ గత ఎడిషన్లో మైసూరు వారియర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.అయితే అంచనాలకు తగ్గటు జూనియర్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. గత సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన సమిత్.. 11.71 సగటుతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం వేలంలో అమ్ముడు పోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ మెగా టోర్నీ బెంగళూరులోని ఐకానిక్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆగస్టు 11 నుంచి 27 వరకు జరగనుంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ టోర్నీని ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు.ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈవెంట్లో కరుణ్ నాయర్, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.

బ్రిటన్ కింగ్ను కలిసిన టీమిండియా.. వీడియో వైరల్
ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషల, మహిళల జట్ల ప్లేయర్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIను కలిశారు. మంగళవారం లండన్లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ను శుబ్మన్ గిల్ సారథ్యంలోని మెన్స్ టీమ్, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఉమెన్స్ టీమ్, హెడ్ కోచ్లు గౌతం గంభీర్, ముజుందార్లు సందర్శించారు.ఈ క్రమంలో హృదయపూర్వకంగా స్వాగతం పలికిన చార్లెస్ III.. కాసేపు వారితో ముచ్చటించారు. ప్రతీ ఒక్కరితో కరచాలనం చేస్తూ నవ్వుతూ పలకరించారు. అందరితో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్లేయర్లు, కోచింగ్ స్టాప్తో పాటు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం కింగ్ను కలిశారు. చాలా సంతోషంగా ఉంది: గిల్ఇక బ్రిటన్ కింగ్ను కలవడంపై భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. "కింగ్ చార్లెస్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మమ్మల్ని ఎంతో అప్యాయతగా పలకరించారు. మేము చాలా విషయాలు ఆయనతో సంభాషించాము. లార్డ్స్ టెస్టులో సిరాజ్ ఔటైన తీరు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.మాకు ఈ మ్యాచ్లో ఆదృష్టం కలిసిరాలేదని ఆయనకు చెప్పాను" అని గిల్ పేర్కొన్నాడు. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు పోరాడనప్పటికి టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.#WATCH | The United Kingdom: King Charles III met the Indian Men's Cricket team at St. James's Palace in London. pic.twitter.com/SjZU0DL6o1— ANI (@ANI) July 15, 2025

భారత్ ఓటమికి కారణమదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గవాస్కర్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతకలపడింది. రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు. ఇక గిల్ సేన ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. లక్ష్య చేధనలో బ్యాటర్లు భాగస్వామ్యాలను నెలకొల్పకపోవడం వల్ల భారత్ ఓటమి పాలైందని ఆయన తెలిపారు."భారత రెండో ఇన్నింగ్స్లో కనీసం ఒక్కటైన 60 నుంచి 70 పరుగుల భాగస్వామ్యం నమోదైంటే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ భారత బ్యాటర్లు అలా చేయడంలో విఫలమయ్యారు. స్పిన్నర్లు జో రూట్, షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా దూకుడుగా ఆడలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ఆ సమయంలో అతడు ఆడిన తీరు సరైనదే. ఎందుకుంటే బయట మరో వికెట్ లేదు. జడేజా పోరాటానికి పూర్తి మార్క్లు ఇవ్వాల్సిందేనని" అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నారు. కాగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం తమ ఓటమికి కారణం ఇదే చెప్పుకొచ్చాడు. ఒక 50 పరుగుల భాగస్వామ్యం వచ్చి వున్నా తాము గెలిచే వాళ్లమని గిల్ అన్నాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి లైమ్ డాసన్ వచ్చాడు. భారత్ కూడా తమ తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: భారత్తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
బిజినెస్

మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్)లో పని చేసేందుకు మెటా కళ్లు చెదిరిపోయే ప్యాకేజీలను ప్రకటిస్తోంది. యాపిల్, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైండ్, ఆంత్రోపిక్..వంటి ప్రముఖ సంస్థలకు చెందిన ప్రపంచంలోని టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులను ఆకర్షించడమే లక్ష్యంగా రూ.800 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల పరిహార ప్యాకేజీలను అందిస్తోంది.ఇటీవల మెటాలో చేరిన యాపిల్కు చెందిన రుమింగ్ పాంగ్కు రూ.1,600 కోట్లు (సుమారు 200 మిలియన్ డాలర్లు) పరిహార ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మెటా మాజీ ఓపెన్ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సాల్కు రూ.800 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఆఫర్ చేసినట్లు తెలిసింది. కంపెనీ ‘ఓ-సిరీస్’ మోడళ్లను సృష్టించడంలో బన్సాల్ ప్రముఖ పాత్ర పోషించారు. మెటా ఈ ప్యాకేజీలను ధ్రువీకరించనప్పటికీ వేతనం, పరిహార బోనస్లు, స్టాక్ గ్రాంట్లు కలిపి కొన్ని కంపెనీల సీఈఓలు సంపాదించే వేతనంతో సమానంగా, అంతకుమించి ఉన్నాయని తెలుస్తుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలుగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు ఎంత ప్యాకేజీ చెల్లించేందుకైనా వెనుకాడడం లేదని సమాచారం.

పీఎస్యూ టెల్కోలకు లైన్ క్లియర్
పీఎస్యూ టెలికం దిగ్గజాలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐలకు మద్దతుగా అత్యున్నత కమిటీ మార్గదర్శకాలకు తెరతీసింది. దీంతో వేలం లేకుండానే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలకు మిగులు భూమి, భవనాలను బదిలీ చేసేందుకు వీలు చిక్కనుంది. గత నెలలో సమావేశమైన సెక్రటరీల కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.టెలికం పీఎస్యూ సంస్థల ఆస్తులను సొంతం చేసుకోవాలనుకునే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు సంబంధిత అనుమతులతోపాటు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ను దాఖలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా క్లెయిమ్ను రిజిస్టర్ చేసుకునేందుకు ఆస్తుల సంకేత విలువలో 2 శాతం సొమ్మును డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఆయా ఆస్తుల మానిటైజేషన్కు సంబంధిత వెబ్సైట్లో నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల్లోగా వీటిని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇదీ చదవండి: విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తొలి ప్రాధాన్యతా హక్కును వినియోగించుకునే వీలుంటుంది. అయితే నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల తదుపరి ఇతర ప్రయివేట్ రంగ కంపెనీలకు ఆస్తులను విక్రయించే వెసులుబాటును బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐ పొందుతాయి.

విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్
ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ మార్కెట్లలోకి అడుగు పెట్టే ప్రణాళికల్లో ఉంది. 2024–25 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కంపెనీ చైర్మన్ పవన్ ముంజాల్ ఈ విషయాలు తెలిపారు.హీరో ఫర్ స్టార్టప్స్ తదితర సొంత వేదికల ద్వారా కొత్త తరం ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కొత్త ఉత్పత్తులు, సేవలపై పరిశోధనలు సాగించేందుకు, వాటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాసియా నుంచి లాటిన్ అమెరికా వరకు అంతర్జాతీయ మార్కెట్లలో 2024–25లో 43 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు ముంజాల్ వివరించారు. రిటైల్లో వ్యూహాత్మక విస్తరణతో ఎలక్ట్రిక్ స్కూటర్ విడా అమ్మకాలు 200 శాతం పెరిగాయని చెప్పారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలుఇక లిస్టెడ్ కంపెనీ ఏథర్ ఎనర్జీతో భాగస్వామ్యం కట్టడమనేది దేశీయంగా ఈవీ చార్జింగ్ నెట్వర్క్ను, ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. అటు అమెరికన్ సంస్థ జీరో మోటర్సైకిల్స్తో భాగస్వామ్యం ద్వారా సరికొత్త ప్రీమియం మోటర్సైకిల్ వస్తోందని చెప్పారు. యూలర్ మోటర్స్లో రూ.510 కోట్ల పెట్టుబడి పెట్టడమనేది అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ సెగ్మెంట్లో తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలు
దేశవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ లావాదేవీలను డిజిటల్ చెల్లింపులు సులభతరం చేశాయి. వాడకం పెరిగే కొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారుల్లో అవగాహన కూడా పెరగాల్సి ఉంది. సురక్షితమైన చెల్లింపు విధానాలను పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇవి వినియోగదారులకు డిజిటల్ భద్రతను అందిస్తాయి. డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 5 జాగ్రత్తలను సూచిస్తోంది.లావాదేవీ ముందే సరిచూసుకోవడం..ఏదైనా డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయాలి. మీరు ఎవరికైతే డబ్బు పంపిస్తున్నారో వారి పేరే స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి. దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు. తొందరపడి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి.ఆథరైజ్డ్ యాప్లు, వెబ్సైట్లే వాడేలా..ఎప్పుడూ అధికారిక యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. తెలియని వారు, లేదా మరేదైనా వెబ్సైట్లో సూచించిన విధంగా లింకుల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి లావాదేవీలు చేయవద్దు.గోప్యంగా ఓటీపీయూపీఐ పిన్ లేదా మెయిల్, ఫోన్కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్), లేదా బ్యాంక్ వివరాలు అత్యంత గోప్యమైనవని గమనించాలి. ఈ వివరాలు బ్యాంకువారు కూడా అడగరని గుర్తించాలి. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేదా పోలీసులం, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారం అని ఎవరైనా ఆయా వివరాలు అడిగితే స్కామర్లని వెంటనే తెలుసుకుని ఫిర్యాదు చేయాల్సి.హడావిడి పేమెంట్లు వద్దు..వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే కంగారుపడకండి. కాస్త సమయం తీసుకోండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.ఇదీ చదవండి: లక్షల మందిని ఊచకోత కోసి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?పేమెంట్ అలర్ట్లను ఆన్ చేసుకోవడం..మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ను సంప్రదించండి.
ఫ్యామిలీ

సోషల్ ట్రెండ్స్..! జంతుప్రేమికులు ఇష్టపడేలా..
మొన్న గిబ్లీ ఆర్ట్.. నిన్న బేబీ పాడ్కాస్ట్.. నేడు ‘యానిమల్ వ్లాగ్’, అవెంజర్స్, హల్క్ విడియోస్.. ఇలా సోషల్ మీడియాలో రోజుకో వింత ట్రెండ్ అవుతోంది.. సామాజిక మాధ్యమాల్లో ఏఐ హవా కొనసాగుతుంది. ఒక్కో నెల ఒక్కో ఏఐ స్పెషల్స్తో నెటిజన్లు సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏఐ ట్రెండింగ్ యుగం కొనసాగుతోంది. ఐదు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్తో సోషల్మీడియా హోరెత్తింది. ఎటుచూసినా గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో నెటిజన్లు, ప్రజలు సందడి చేశారు. రెండు నెలల క్రితం బేబీ పాడ్కాస్ట్, బేబీ ఏఐ వీడియోలు వైరల్ అయ్యాయి. నేడు యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ నెటిజన్లను అలరిస్తున్నాయి. ఏఐతో ట్రావెలర్స్, ఫ్రెండ్స్ ట్రావెలింగ్తో చేసే వ్లాగ్ వీడియోస్ మంకీ, చింపాజీలు చేసేలా చేసి నెటిజన్లను నవ్విస్తున్నారు. సోషల్ మీడియాలోని ఇన్స్టా, ఫేస్బుక్లతో పాటు అన్ని యాప్లలో యానిమల్ వ్లాగ్, అవెంజర్, హల్క్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అవెంజర్, హల్క్ తెలంగాణకు వస్తే, ఒక అవ్వ చేతి మనవడిగా సరదా సరదా సంభాషణల వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఛాట్జీపీటీ యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ చేస్తున్నారు. ఇక జంతుప్రేమికులైతే ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు. మరికొందరు ముందడుగేసి యానిమల్ వ్లాగ్గా మార్చేస్తున్నారు. (చదవండి: చిట్టి చేతుల్లో స్క్రీన్.. అంతటా అదే సీన్..)

బ్రహ్మజెముడు ప్లాస్టిక్! నెలరోజుల్లోనే మట్టిలో!
ఎడారి మొక్క బ్రహ్మజెముడు (కాక్టస్) రసంతో పర్యావరణ హితమైన ప్లాస్టిక్ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని మెక్సికన్ మహిళా ప్రొఫెసర్ సాండ్రా పాస్కో ఓర్టిజ్ అభివృద్ధి చేశారు. ఒక ప్రయివేటు యూనివర్సిటీలో ఆమె కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ పనితీరులో అచ్చం పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ను పోలి ఉంటుంది. సాధారణ ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్లు, ప్లాస్టిక్ కవర్లు వెయ్యి ఏళ్లకు గాని భూమిలో కలిసిపోవు. కానీ, బ్రహ్మజెముడు ప్లాస్టిక్ నెల రోజుల్లోనే విచ్ఛిన్నమై మట్టిలో కలిసిపోతుంది. పర్యావరణ కాలుష్యంతో పాటు మైక్రోప్లాస్టిక్ కణాలు మన దేహాలను సైతం కలుషితం చేస్తున్న ఈ తరుణంలో వెలువడిన ఈ ఆవిష్కరణ ఒక విప్లవాత్మక పురోగతిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. డాక్టర్ సాండ్రా పాస్కో ఓర్టిజ్ చాలా మంది అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. బ్రహ్మజెముడు రసం నుంచి తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పూర్తిగా బయోడిగ్రేడబుల్. విషపూరితమైనది కాదు. తినదగినంత సురక్షితం! కఠినమైన ఎడారి పరిస్థితుల్లో తక్కువ వనరులతో పెరుగుతున్న బ్రహ్మజెముడు, సాధారణ నోపాల్ కాక్టస్ (ప్రిక్లీ పియర్)ను ఉపయోగించి, ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజింగ్, తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే వినూత్న ప్లాస్టిక్ను అభివృద్ధి చేశారు.ఇదీ చదవండి: Moon-Rice వ్యోమగాముల కోసం.. మూన్రైస్..భూమ్మీదా ఉపయోగమే బ్రహ్మజెముడు రసంలోని సహజ చక్కెరలు, పెక్టిన్, సేంద్రియ ఆమ్లాల ఆధారంగా ఈ ప్లాస్టిక్ తయారవుతుంది. ప్రయోగశాలలో ఉత్పత్తి ప్రక్రియకు దాదాపు 10 రోజులు పడుతుంది. ఈ పురోగతి ఆహార ప్యాకేజింగ్, షాపింగ్ బ్యాగులు, లెక్కలేనన్ని ఇతర సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీని సమూలంగా మార్చగలదు. వర్షాధార వ్యవసాయదారుల ఆదాయం పెంపొందించేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడు తుందని నిపుణులు చెబుతున్నారు.చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!

Amblyopia: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!
కొన్ని సందర్భాల్లో రెండు కళ్లలో... ఏదో ఓ కన్ను పనిచేయడానికి కాస్త బద్ధకిస్తుంటుంది. ఈ సమస్య అందరిలోనూ వచ్చే అవకాశమున్నా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. అయితే... తమకు ఉన్న రెండు కళ్లలో ఒకటి... తన పక్కదానంత బాగా పనిచేయడం లేదన్న విషయం వారికి తెలిసే అవకాశం సాధారణంగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా కనిపించే కంటి నుంచే ప్రతిబింబాలను గ్రహించి, అస్పష్టంగా కనిపించే ప్రతిబింబాలను మెదడు నిరాకరిస్తుంది. అంటే ఈ రెండు కళ్లలో ఒకటి ప్రతిబింబాన్ని ప్రసారం చేయడంలో కాస్త బద్ధకంగా పనిచేస్తుందన్నమాట. ఇలా బద్ధకంగా పనిచేసే కన్ను పనితీరు క్రమంగా తగ్గి΄ోతూ... ఒక దశలో పూర్తిగా పనిచేయకుండా ΄ోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యనే వాడుక భాషలో ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. సాధారణంగా ఆంబ్లోపియా సమస్య ఉన్నప్పుడు... కొద్దిగానైనా చూపు ఉన్నంత కాలం... తమ కళ్లలో ఒకదానికి సమస్య ఉందన్న విషయమే బాధితులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. ఈలోపే జరగాల్సిన అనర్థాలు జరిగే అవకాశముంది. అందుకే ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా)పై అవగాహన అవసరం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఓ కేస్ స్టడీశిరీష (పేరు మార్చాం) అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి రెండు కళ్లలో ఒక కన్నులోంచే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండో కన్ను మంచి ప్రతిబింబాన్ని పంపడంలో కాస్త బద్ధకిస్తోంది. ఇలా కంటిన్యువస్గా జరిగే సమయంలో ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా పంపే కంటి తాలూకు ప్రతిబింబాన్నే మెదడు తీసుకుంటోంది. సరిగ్గా కనిపించని కంటి నుంచి వచ్చే ఆ సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరాకరిస్తూ పోవడంతో కొంతకాలానికి ఆ కంటికి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈలోపు ఏదో ఇతర పరీక్ష కోసం వెళ్లిన సమయంలో డాక్టర్లకు ఒక కన్ను బద్ధకిస్తోన్న విషయం తెలిసివచ్చింది. దాంతో డాక్టర్లు అతి కష్టమ్మీద ఆ రెండో కంటి చూపునూ కాపాడగలిగారు. అసలు ‘లేజీ ఐ’ పై అవగాహన రావాలంటే ముందుగా... చూడడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియడం చాలా ప్రధానం. మనం ఏదైనా దృశ్యాన్ని లేదా వస్తువును చూడాలంటే... తొలుత ఆ వస్తువుపై కాంతి పడి, మళ్లీ అదే కాంతి మన కంటిని చేరాలి. అప్పుడది తొలుత నల్లగుడ్డు అయిన కార్నియా నుంచి, తర్వాత పారదర్శకమైన మన లెన్స్ నుంచీ ప్రసరించి... రెటీనా అనే తెరపై ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని తలకిందులుగా పడేలా చేస్తుంది. ‘ఆప్టిక్ నర్వ్’ అనే కీలకమైన నాడి ద్వారా రెటీనాపైనున్న ప్రతిబింబం సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో ఆ వస్తువు కనిపించడం వల్ల మనకు దృష్టిజ్ఞానం కలుగుతుంది. ఏమిటీ ‘లేజీ ఐ’?మనకు కలిగే దృష్టి జ్ఞానాన్ని ‘బైనాక్యులర్ విజన్’ అంటారు. అంటే... మన రెండు కళ్లలోని దృశ్యాలూ తమ తమ రెటీనాలపై కలిసి (ఇంటిగ్రేట్ అయి) ఆ రెండూ ఒకే దృశ్యంగా / వస్తువుగా కనిపిస్తాయి. అంటే ‘బై’ అంటే రెండు... ‘ఆక్యులార్’ అంటే ‘కళ్లు’... ఈ రెండు కళ్లూ కలిసి ఒకే దృశ్యాన్ని చూపడమే ‘బైనాక్యులార్ విజన్’! ఏదైనా కారణాలతో ఒకవేళ ఒకరి రెండు కళ్లలో... ఒకదానికి ఏదైనా కొంత లోపం ఉంటే... అలాంటప్పుడు ఒక కంటిలోని ప్రతిబింబం చాలా స్పష్టంగానూ, లోపమున్న కంటిలోని ప్రతిబింబం కొంత అస్పష్టంగా... ఇలా తన రెండు రెటీనాలపై ప్రతిబింబాలను చూపుతుంది. అయితే రెండు కళ్లతో చూసేప్పుడు బైనాక్యులర్ విజన్ కారణంగా ఆ లోపం తెలియక΄ోవచ్చు. ఒక్కో కంటితో విడివిడిగా, పరీక్షగా చూసినప్పుడు మాత్రమే అది తెలిసిరావచ్చు.ఇలాంటి సందర్భాల్లో స్పష్టమైన ప్రతిబింబాన్నే మెదడు స్వీకరిస్తుంది. అస్పష్టమైన దాన్ని క్రమంగా నిరాకరిస్తూపోతుంది. ఇలా అస్పష్టమైన ప్రతిబింబాన్ని నిరాకరించడాన్ని ‘సప్రెషన్’ అంటారు. ఒక కంట్లో ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడుతున్నప్పుడూ, ఆ సమాచారాన్ని మెదడు క్రమంగా నిరాకరిస్తూపోతూ ఉండే మెడికల్ కండిషన్ను ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. లేజీ ఐ / ఆంబ్లోపియా సమస్య ఉన్నవారిలో తొలుత ఎలాంటి లోపమూ కనిపించదు. చిన్నపిల్లల్లోనైతే వాళ్ల కన్ను అభివృద్ధి / వికాసం కూడా మామూలుగానే జరుగుతాయి. వైద్యపరీక్షల్లోనూ కంటి గురించి ఎలాంటి లోపమూ తెలియదు. కాని కొన్నిసార్లు ఏదో ఒక కంట్లోగానీ లేదా ఒక్కోసారి రెండు కళ్లల్లోనూ చూపు మందగిస్తుంది. ‘లేజీ ఐ’ కండిషన్ వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. పైకి అంతా బాగానే ఉండటంతో ఈ కండిషన్ను తొలిదశల్లో గుర్తుపట్టడమూ కష్టమే.ఆంబ్లోపియా విస్తృతి : మన దేశంలోని చిన్నారుల్లో దీని విస్తృతి దాదాపు రెండు శాతం. అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరిలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి ఇంకా ఎక్కువ. అంటే దాదాపు 4 శాతం. ఆంబ్లోపియా రకాలు అన్ ఐసోమెట్రోపిక్ ఆంబ్లోపియా : ఒక కంట్లో ఉన్న దృష్టిలో΄ానికీ (రిఫ్రాక్టివ్ ఎర్రర్కూ), మరో కంటికీ తేడా ఉండటం. ఈ సమస్య ఉన్న వాళ్లలో చాలా ఎక్కువమందిలో ఈ సమస్యే ఉంటుంది. ఐసోమెట్రిక్ ఆంబ్లోపియా : రెండు కళ్లలోనూ ఎక్కువ దృష్టిలోపం (రిఫ్రాక్టివ్ ఎర్రర్) ఉండటం. (ఉదా + 6.0 ; +6.0) మెరిడోనల్ ఆంబ్లోపియా: కళ్లలో సిలెండ్రికల్ పవర్ ‘2.0’ కంటే ఎక్కువ ఉండటం. స్టెడిస్మస్ ఆంబ్లోపియా : మెల్లకన్ను కారణంగా వచ్చే ఆంబ్లోపియా ఇది. డిప్రొవేషనల్ ఆంబ్లోపియా : పుట్టుకతోనే కంట్లో శుక్లం ఉండటం, కార్నియా సమస్య, రెటీనా సమస్య, కనురెప్ప వాలిపోవడం వంటి సమస్యలున్నప్పుడు, కాంతి కిరణాలు రెటీనాకు సరిగా చేరకపోవడం ఈ తరహా ఆంబ్లోపియా వస్తుంది.ఎంత త్వరగా చికిత్స జరిగితే... అంత మేలైన ఫలితాలుఆంబ్లోపియాను ఎంత త్వరగా గుర్తించి, ఎంత చిన్న వయసులో చికిత్స చేయిస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆ పసివయసులో తమ చూపులో లోపం ఉందన్న విషయాన్ని పిల్లలు గ్రహించలేకపోవడం, అలాగే చిన్నారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఒకపట్టాన గుర్తించలేరు. అయితే చిన్నతనంలోనే అంటే... రెండు నుంచి ఎనిమిది ఏళ్లలోపు గుర్తించి, చికిత్స చేయిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు చికిత్స చేయించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫలితాలు చిన్నప్పటితో పోలిస్తే కాస్త నిదానంగా కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కూడా ‘విజన్ థెరపీ’ ద్వారా కొంతవరకు ఫలితాలను రాబట్టవచ్చు. ఏ కారణంతో ఆంబ్లోపియా వచ్చిందో దానికి చికిత్స చేయడం : అంటే ఉదాహరణకు దృష్టిలోపాల వల్ల సమస్య వచ్చినట్లయితే దానికి సరిపడిన అద్దాలను ఇవ్వడం. ఉదాహరణకు ప్లస్ పవర్, మైనస్ పవర్, సిలెండ్రికల్ పవర్. మెల్లకన్ను కారణంగా ఆంబ్లోపియా వస్తే మెల్లకన్ను కరెక్షన్ చికిత్సతో దాన్ని సరిచేయడం. డిప్రెవేషన్ ఆంబ్లోపియా జబ్బులకు... అంటే శుక్లం, కార్నియా, రెటీనా, వాలిపోయే కనురెప్పలు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం ద్వారా లోపాల్ని తొలగించవచ్చు. ఉదాహరణకు... పుట్టుకతోనే శుక్లం (కాటకార్ట్) కారణంగా ఆంబ్లోపియా వస్తే... శస్త్రచికిత్స ద్వారా తొలుత పారదర్శకత కోల్పోయిన శుక్లాన్ని తొలగించాలి. ఆ స్థానంలో ఇంట్రా ఆక్యులార్ లెన్స్ను అమర్చాలి. శుక్లం కేవలం ఒకే కంట్లోనే ఉంటే– బిడ్డ పుట్టిన వెంటనే ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఒకవేళ శుక్లాలు రెండు కళ్లలోనూ ఉంటే ఆపరేషన్కు కొన్ని మాసాల వ్యవధి తీసుకోవచ్చు. కాని శస్త్రచికిత్స మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే చూపు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆపరేషన్ తర్వాత కూడా పిల్లలకు డాక్టర్లు సూచించిన ప్రకారం... క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఇలా ఆ చిన్నారికి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. మూడేళ్లలోపు పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. కొందరిలో పుట్టగానే మెల్లకన్ను ఉండవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు మెల్లకన్ను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తారు. పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని మరికొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండూ సరికాదు. పిల్లల్లో మెల్లకన్నును గమనించగానే వెంటనే పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. మెల్లకంటి సమస్యకూ ఎంతత్వరగా చికిత్స చేయిస్తే... అంత మంచిది. కంటి రెప్ప వాలిపోవడం వల్ల ఆంబ్లోపియా వస్తే... ఆ రెప్ప పైకెత్తి నిలిపి ఉంచేలా ఓ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీన్నే ‘టోసిస్ కరెక్షన్’ సర్జరీ అంటారు. ఈ ఆపరేషన్ తర్వాత కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. కొందరిలో కంటికి అద్దాలు అవసరమవుతాయి. ఇలాంటివారు అద్దాలు వాడుతూనే ఆంబ్లోపియాకూ చికిత్స చేయించాలి.అంబ్లోపియాకు కారణాలు(ఆంబ్లోజెనెసిస్)విజువల్ డిప్రవేషన్ : చూపు విషయంలో ఒక కంటిలో ఉన్నంత స్పష్టత మరోదానిలో లేకపోవడం. లైట్ డిప్రవేషన్ : కంటిలోని కొన్ని దోషాల కారణంగా (కాటరాక్ట్ వంటి వాటివల్ల) రెటీనాకు తగినంత కాంతి చేరకపోవడం. అబ్–నార్మల్ బైనాక్యులార్ విజన్ : అంటే రెండు కళ్లూ సమంగా ఒకే వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం... ఈ అంశాలు ఉన్నవారిలో ఆంబ్లోపియా క్రమంగా వృద్ధిచెందుతుంది.అక్లూజన్ థెరపీఈ చికిత్స ప్రక్రియలో నార్మల్గా ఉన్న కంటిని పూర్తిగా మూసివేసి, చూపు మందగించిన కంటి తాలూకు దృష్టి మెరుగుపడేలా స్టిమ్యులేట్ చేస్తారు. నార్మల్గా ఉన్న కంటిని ఎన్నాళ్లు మూసి ఉంచి... ఈ స్టిమ్యూలేషన్ చికిత్స చేయాల్సి ఉంటుందన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వల్ల 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.పీనలైజేషన్అట్రోపిన్ చుక్కల మందులు లేదా బలమైన లెన్స్లను బాగా కనిపించే కంటికి వాడతారు. అప్పుడు బలహీనంగా ఉన్న కన్ను స్టిమ్యులేట్ అవుతుంది. దాంతో అది చూడటానికి ప్రయత్నించడాన్ని మొదలు పెడుతుంది. కన్నును మూసివేసి ఉంచి చేసే చికిత్స అయిన ‘అక్లూజన్ థెరపీ’లోలా కాకుండా, కన్ను తెరచే ఉంచి చేసే చికిత్స ఇది.విజన్ థెరపీపైన పేర్కొన్న అక్లూజన్ పద్ధతిలో చికిత్స చేస్తూ... కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా బలహీనమైన కంటిని చురుగ్గా మారేలా చేస్తారు. దీని వల్ల మెదడు కూడా తిరిగి ప్రతిబింబాన్ని గ్రహించేలా, పక్క కన్ను ప్రతిబింబంతో పోల్చుకుని... మళ్లీ చూపు, బైనాక్యులర్ విజన్ పొందేలా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రక్రియకు దాదాపుగా 100 నుంచి 200 గంటల పాటు చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు / నిర్ధారణనిజానికి చాలా మంది తమకు లోపం ఉన్నట్లు గుర్తించలేరు / చెప్పలేరు. ∙ఒక కంటిలో చూపు తగ్గడంక్రౌడింగ్ ఫినామినా: అంటే... అనేక అక్షరాలు ఉన్నప్పుడు ఏదో ఒక అక్షరాన్ని మాత్రమే చూడగలగటం. ఒక్క అక్షరాన్ని మాత్రమే చదవడగలగడం. న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ : దీనితో పరీక్షించినప్పుడు మామూలు కంటి చూపు ఉన్నవారికిస్పష్టంగా కనిపించదు. కానీ ‘ఆంబ్లోపియా’ ఉన్నవారు దీనిలోంచి చూసినప్పుడు... వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిలో మెల్లకన్ను ఉండటం, అలాగే రంగులు చూసే సామర్థ్యం తక్కువగా ఉండటం. కంటి డాక్టర్లు పైన పేర్కొన్న లక్షణాలను బట్టి ‘ఆంబ్లోపియా’ను నిర్ధారణ చేస్తారు. నివారణమూడు నుంచి ఐదేళ్ల వయసులోని పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. లోపాలుండి శస్త్రచికిత్స అవసరమైన వారికి వీలైనంత త్వరగా చేయించాలి. ఆక్లూజన్ థెరపీ ద్వారా చూపు తిరిగి వచ్చాక కూడా ‘మెయింటెనెన్స్ థెరపీ’ అంటూ రోజూ రెండు గంటల పాటు అక్లూజన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ∙తరచూ కంటి డాక్టర్ను సంప్రదిస్తూ ఉండాలి.ఫ్యూజనల్, స్టీరియాప్టిక్ ఎక్సర్సైజెస్లేజీ ఐ తన చురుకుదనాన్ని పొందేలా చేసిన చికిత్స ప్రక్రియల తర్వాత ఆ రెండు కళ్లూ ఒకేలాంటి మంచి ప్రతిబింబాన్నే మెదడుకు ఇచ్చేలా చేసేందుకు కొన్ని వ్యాయాయాలు చేయిస్తారు. ఇందులో ఫ్యూజనల్ ఎక్సర్సైజ్లో రెండు కళ్లూ తాము ప్రతిబింబించే దృశ్యాన్ని మెదడు ఒకేలా గ్రహించేలా చేస్తారు. ఇక స్టీరియాప్టిక్ ఎక్సర్సైజ్లో ఈ రెండు కళ్లూ డెప్త్ / 3 డీ ఇమేజ్ సాధించేలా చేయడానికి చేయిస్తారు. ఈ రెండు ఎక్సర్సైజ్లు చేయిస్తేనే భవిష్యత్తులో లేజీ ఐ లో చూపు తగ్గకుండా ఉంటుంది. లేదంటే మళ్లీ వెనక్కువెళ్లే అవకాశాలు ఉంటాయి.ఫార్మకోథెరపీలీవోడోపావంటి మందుల ద్వారా కంటి నరాలు బాగా పనిచేసేలా చేస్తారు. భవిష్యత్తు చికిత్స ప్రక్రియల్లో జీన్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త చికిత్స ప్రక్రియలు అందివచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల అడల్ట్ ఆంబ్లోపియాకు కూడా మరిన్ని అధునాతన చికిత్సలను అందుబాటు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ)

వ్యోమగాముల కోసం.. మూన్రైస్..భూమ్మీదా ఉపయోగమే
ఏ గ్రహంపైనైనా అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పెరిగే అద్భుతమైన ‘అతి మరుగుజ్జు (సూపర్ డ్వార్ఫ్)’ వంగడం సిద్ధమైంది. రోదసీలోగానీ.. చంద్రుడు, అంగారకుడి మీదగానీ.. భూమిపైన ప్రత్యేక వాతావరణంలోనూ.. ఎడారుల్లో, ఇంట్లో కూడా ఇక వరి ధాన్యం పండించుకోవచ్చు. ఇటలీ అంతరిక్ష సంస్థ (ఐఎస్ఎ), మరో మూడు ఇటాలియన్ విశ్వవిద్యాలయాలతో కలిసి ఈ అద్భుత వరి వంగడాన్ని రూపొందించింది. చంద్రుడిపై మనుషుల దీర్ఘకాల మనుగడకు అవసరమైన విలక్షణ వరి వంగడాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో ‘మూన్ రైస్’ పేరిట చేపట్టిన పరిశోధనా ప్రాజెక్టు విజయవంతమైంది.2–3 అడుగులు ఎత్తు పెరిగే పొట్టి (డ్వార్ఫ్) వరి వంగడాలు మాత్రమే మనకు తెలుసు. అయితే, ఈ సరికొత్త రకం కేవలం 4 అంగుళాల (10 సెంటీమీటర్లు) ఎత్తు మాత్రమే పెరుగుతుంది. అదీకాకుండా, అధిక మాంసకృత్తులు గల ధాన్యాన్ని దిగుబడినిస్తుందట. అంతరిక్ష యాత్రల్లో పాల్గొనే వ్యోమగాములు ముందుగా వండి ప్యాక్ చేసిన ఆహారంపైనే ప్రస్తుతం ఆధారపడుతున్నారు. తాజా పదార్థాలు వారి ఆహారంలో ఉండే అవకాశం లేదు. సుదీర్ఘ కాలం అంతరిక్ష యాత్రలో గడిపే వ్యోమగాముల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందటం లేదు. భూగోళానికి మరింత ఎక్కువ దూరంలో రోదసీలో పరిశోధనలు చేపట్టాలంటే విటమిన్లు, పీచుపదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని అక్కడే పండించాలి. మూన్ రైస్ పరిశోధనా ప్రాజెక్టు ఈ లక్ష్యంతోనే ప్రారంభమైంది. ఐఎస్ఏ మొక్కల జీవశాస్త్రవేత్త మార్తా డెల్ బియాంకో ఈ పరిశోధన వివరాలను ప్రకటించారు. బెల్జియంలో సుప్రసిద్ధ ‘సొసైటీ ఫర్ ఎక్స్పరిమెంటల్ బయాలజీ’ వార్షిక సమావేశంలో ఇటీవల ఆమె ప్రసంగించారు.భూమ్మీద రైతులకూ ఉపయోగమేమూన్ రైస్ ప్రాజెక్టు పరిశోధనలు అంతరిక్ష సేద్యానికి పనికొచ్చే విషయాలకు మించిన ప్రయోజనాలను అందిస్తోంది. ఇది భూమిపై ఉండే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ‘అత్యంత సమస్యాత్మక అంతరిక్షంలో పెరగటానికి రూపొందుతున్న ఈ అతి మరుగుజ్జు వంగడం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధ్రువాలకు దగ్గరి ప్రాంతాల్లో లేదా ఎడారుల్లో లేదా తక్కువ స్థలం ఉండే ఇళ్లలో కూడా నియంత్రిత వాతావరణంలో సాగుకు కూడా ఉపయోగపడుతుంది’ అని డెల్ బియాంకో తెలిపారు. వరి మొక్కలు అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణకు ఎలా స్పందిస్తాయనే అంశంపై కూడా శాస్త్రవేత్తల బృందం పరిశోధిస్తోంది.4 ఏళ్ల 9 నెలల పరిశోధనవరి జన్యుశాస్త్రంలో పట్టున్న మిలన్ విశ్వవిద్యాలయం, పంట శరీర ధర్మశాస్త్రంలో ప్రత్యేక కృషిచేస్తున్న రోమ్ విశ్వవిద్యాలయం, అంతరిక్ష పంటలపై పరిశోధనలో ఆరితేరిన నేపుల్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలసి ఇటలీ అంతరిక్ష సంస్థ పరిశోధనలు చేస్తోంది. ‘నాలుగేళ్ల 9 నెలల క్రితం ప్రారంభించిన పరిశోధనల్లో చాలా పురోగతి ఉంది. మిలన్ విశ్వవిద్యాలయంలో కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఉత్పరివర్తన చెందిన వరి రకాలపై పరిశోధనలు కొలిక్కివచ్చాయి. ఇది గొప్ప ప్రారంభ విజయం. పంట ఎదుగుదల, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మొక్కల నిర్మాణాన్ని మార్చగల జన్యువులను రోమ్ విశ్వవిద్యాలయం గుర్తించి మార్పులు చేసింది. ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అంతరిక్షంలో మాంసాన్ని పెంచలేం. అందుకని ప్రొటీన్ అధికంగా ఉండేలా ఈ వంగడాన్ని అభివృద్ధి చేస్తున్నాం’ అన్నారు డెల్ బియాంకో.తాజా ఆహారం.. మానసిక ఆరోగ్యం!తాజా ఆహారం శరీర పోషణకు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అంతరిక్షానికి తీసుకెళ్లిన ముందే వండిన ఆహారం కొంత కాలం బాగా నే ఉంటుంది. దీర్ఘకాలం దానిపై ఆధారపడటం సాధ్యం కాదు. అందువల్ల అక్కడే వ్యోమగాముల కళ్ల ముందు పెరిగే పంట వంగడాలను రూపొందించటం ద్వారా వారికి తాజా ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగే తప్పుల వల్ల ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టానికి కూడా దారితీయొచ్చు.హార్మోన్ మార్పుతో..‘మన దగ్గర ఇప్పటికి ఉన్న పొట్టి వంగడాలు అంతరిక్ష వ్యవసాయానికి ఉపయోగపడటం లేదు. ఇంకా తక్కువ ఎత్తు పెరిగే రకం కావాలి. వరి మొక్కలో ఎత్తును ప్రభావితం చేసే గిబ్బరెల్లిన్ అనే హార్మోన్లో మార్పు చేశాం. కానీ, అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తటం కూడా ఒక సవాలు. అక్కడ పెరిగే పంట మరీ తక్కువ ఎత్తు ఉండటం ఒక్కటే చాలదు.. మంచి ఉత్పాదకతను కూడా ఇవ్వగలగాలి. ఇలాంటి వంగడాన్ని తయారుచేయటం అనేక సవాళ్లతో కూడినది’ – మార్తా డెల్ బియాంకో, ఐఎస్ఏ మొక్కల జీవశాస్త్రవేత్తసాక్షి, స్పెషల్ డెస్క్
ఫొటోలు


స్విట్జర్లాండ్ టూర్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్


డల్లాస్ కన్సర్ట్లో దిల్రాజు దంపతులు సందడి (ఫొటోలు)


సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)


మూడేళ్ల తర్వాత వచ్చేస్తున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)


కిరణ్ అబ్బవరం బర్త్డే.. లైఫ్లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)


600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)


గాజాలో చిన్నారుల ఆకలి కేకలు (ఫోటోలు)


తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)


సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)


నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)
అంతర్జాతీయం

ట్రంప్-పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా?
డొనాల్డ్ ట్రంప్.. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన ఆధిపత్యాన్ని ప్రతీ చోట చూపించాలనే అనుకుంటున్నారు. ప్రపంచ దేశాల ముందు తాము అగ్రరాజ్యాధినేతలమనే ‘కటింగ్’ కాస్త ఎక్కువగానే ఉంది. తమది అగ్రరాజ్యం.. తాను అగ్రజున్ని అనే ఫీలింగ్ ఆయనలో ఎక్కువగా ఉంది.తాను ఏది చెబితే అది శాసనం అన్న చందంగా తయారైంది ట్రంప్ పరిస్థితి. ఈ క్రమంలోనే తనకు ఆప్తులు, అత్యంత సన్నిహితులు అనే వారిని కూడా వదులుకుంటున్నారు. ఇటీవల తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎలాన్ మస్క్తో వైరం తెచ్చుకున్నారు. ‘బిగ్ బ్యూటీఫుల్’ బిల్ విషయంలో మస్క్ నో చెప్పారని ట్రంప్ విరుచుకుపడ్డారు. మస్క్ను బహిరంగంగానే చెడామడా తిట్టిపోశారు. మస్క్ దక్షిణాఫ్రికా( మస్క్ జన్మస్థలం) వెళ్లిపోవాలనుకుంటున్నారా? అనే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దానిలో భాగంగానే మస్క్ నుంచి ‘కొత్త పార్టీ’ అంటూ ఓ ప్రకటన కూడా వెలువడింది. ఫలితంగా మస్క్తో ట్రంప్ సంబంధాలు దాదాపు తెగిపోయాయనే చెప్పొచ్చు.ఆ తర్వాత పుతిన్తో కూడా ట్రంప్కు మంచి సాన్నిహిత్యమే ఉంది. దీనిలో భాగంగానే ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని క్షణాల్లో ఆపేస్తానని ప్రకటించేశారు ట్రంప్. తాను ఆఫీస్లో కూర్చొనే 24 గంటల్లో ఇరుదేశాల యుద్ధాన్ని ముగిస్తానని చెప్పిన ట్రంప్.. ఆపై ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్ స్కీతో చర్చలు కూడా జరిపారు. స్వయంగా జెలెన్ స్కీని వైట్హౌస్కు పిలిపించి మరీ చర్చించారు ట్రంప్. ఇక్కడ ట్రంప్ వ్యవహారాలి శైలిపై వైట్హౌస్ వేదికగానే మీడియా ముందే జెలెన్ స్కీ రెచ్చిపోయి మాట్లాడారు. ఇక్కడే ట్రంప్ పరువు సగం పోయింది. ‘యుద్ధం ఆపాలనుకుంటే రష్యాకు ముందు చెప్పండి.. వార్ ప్రారంభించిది పుతిన్’ అంటూ జెలెన్ స్కీ ఘాటుగా స్పందించారు. ఇలా అమెరికా అధ్యక్షుడి ముందు మరొక దేశాధినేత ఇంత ఘాటుగా మాట్లాడటంతో జెలెన్ స్కీ హీరో అయిపోయాడు. ఇక్కడ ట్రంప్ పాత్రకు అసలు అర్థం లేకుండా పోయింది. పుతిన్తో కటీఫ్..?ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని పుతిన్ సీరియస్గా పట్టించుకోవడం లేదు. ట్రంప్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఓకే అంటున్న పుతిన్.. అపై గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. ట్రంప్ మధ్యవర్తిత్వం తర్వాత ఉక్రెయిన్-రష్యాల యుద్ధం మరింత ఉగ్రరూపం దాచ్చిందనే చెప్పాలి. దాంతో పుతిన్తో ట్రంప్ బ్రొమాన్స్ ముగిసిపోయినట్లే కనబడుతోంది. వందల కొద్దీ డ్రోన్స్, మిసెల్స్తో ఉక్రెయిన్పై దాడికి దిగుతున్నారు పుతిన్. దాంతో ట్రంప్లో అసహనం ఎక్కువైపోతోంది. ‘పుతిన్ అంతే.. మారడు.. చంపుతూనే ఉంటాడు’ అనే వ్యాఖ్య కూడా చేశారు ట్రంప్. ఈ క్రమంలోనే పుతిన్పై నోరు పారేసకున్నారు. వాషింగ్టన్ మీడియా వేదికగా పుతిన్పై రెచ్చిపోయి మాట్లాడారు. పుతిన్ మంచి వ్యక్తి అనుకున్నా.. కానీ ఇప్పుడు అర్థం పర్థం లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ ట్రంప్ ధ్వజమెత్తారు. ఉక్రెయిన్కు ‘యుద్ధ సాయం’ హామీరష్యాతో సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా ఉంటామని కొన్ని రోజుల క్రితం ట్రంప్ పేర్కొన్నారు. తమ రక్షణ వ్యవస్థలోని ప్రధాన వనరులను అవసరమైతే కీవ్కు పంపిస్తామనే హామీ కూడా ఇచ్చారు. ఇదంతా పుతిన్పై తీవ్ర కోపం లోలోలన రగిలిపోతున్న ట్రంప్ చెప్పిన మాటలు. అంటే పరోక్షంగా రష్యాపై తాము యుద్ధానికి దిగుతామనే హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇది పుతిన్తో ట్రంప్కు చెడిపోయిందనడానికి మరింత బలం చేకూర్చింది.ట్రంప్ యూ టర్న్..ఉక్రెయిన్కు యుద్ధం విషయంలో అండగా ఉంటామని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా ‘జీరో డాలర్లు’ ఖర్చు చేస్తుందని, అందుకు అయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్(ఈయూ) మోయాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని, ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇది ఉక్రెయిన్కు పిడుగులాంటి భారం. రష్యాతో యుద్ధంలో అమెరికాపైనే ఎక్కువ ఆధారపడుతున్న ఉక్రెయిన్.. ట్రంప్ యూ టర్న్తో ఒక్కసారిగా కంగుతింది. ఇక్కడ ఆయుధాల్ని అమ్ముకోవడమే తమ పని అనే విషయం ట్రంప్ వైఖరితో మరోసారి వెల్లడైంది. ఇక్కడ ఉక్రెయిన్కు యుద్ధం విషయంలో ట్రంప్ యూ టర్న్ తీసుకోకుండా ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్ దేశాలపైకి నెట్టారు. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమయ్యే ఆర్థిక భారాన్ని మోస్తే తాను ఆయుధాల్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ట్రంప్ వైఖరిపై ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా చేయని పుతిన్.. ఏం జరుగుతుందో చూద్దాం అనే ధోరణితోనే ఉన్నారు.

చిక్కుల్లో షేక్ హసీనా కూతురు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు డాక్టర్ సైమా వాజెద్(Saima Wazed) చిక్కుల్లో పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్-ఈస్ట్ ఏషియా ప్రాంతానికి(SEARO) ఆమె రీజియనల్ డైరెక్టర్గా కొనసాగుతున్న సంగతి తెతలిసిందే. అయితే సొంత దేశంలో అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడంతో.. డబ్ల్యూహెచ్వో ఆమెను నిరవధిక సెలవులపై పంపింది.ఇప్పటికే భారత్లో ఆశ్రయం పొందిన షేక్ హసీనాపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలు అభియోగాలను నమోదు చేసింది. అయితే తాజాగా ఆమె తనయ సైమా వాజెద్పైనా అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆమెను సెలవులపై పంపించిన డబ్ల్యూహెచ్వో.. సైమా స్థానంలో డాక్టర్ కాథరినా బూమీ ఇన్ఛార్జిగా కొనసాగుతారని వెల్లడించింది. అయితే ఆమె సెలవుల వ్యవహారంపై ప్రశ్న ఎదురుకాగా.. అదనంగా స్పందించేందుకు డబ్ల్యూహెచ్వో నిరాకరించింది. డబ్ల్యూహెచ్వో నిర్ణయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిసిన ఓ అధికారి.. ఆమెను శాశ్వతంగా తప్పించాలని ఐక్యరాజ్య సమితి విభాగానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూహెచ్వో రీజీయనల్ ఆఫీస్ న్యూఢిల్లీలోనే ఉంది. కాథరినా జులై 15వ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. సైమా వాజెద్పై అధికార దుర్వినియోగం, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులను బంగ్లాదేశ్ యాంటీ కరప్షన్ కమిషన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.1972 డిసెంబర్ 9న డా. ఎం.ఎ. వాజేద్ మియా (న్యూక్లియర్ సైంటిస్ట్), షేక్ హసీనా దంపతులకు సైమా వాజెద్ జన్మించారు. ఫ్లోరిడా(అమెరికా) బ్యారీ యూనివర్సిటీలో ఆమె సైకాలజీలో డిగ్రీ, పీజీ చేశారు. ఆర్గనైజేషనల్ లీడర్షిప్లో డాక్టరల్ చేశారు. స్కూల్ సైకాలజీలో స్పెషలిస్ట్ అయిన ఆమె.. ఆటిజం, మానసిక ఆరోగ్యంపై ఆమె చేసిన ప్రచారాలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులకు దారితీశాయి. డబ్ల్యూహెచ్వో ఆమె నేతృత్వంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఆమె భర్త ఖండకర్ మస్రూర్ హుస్సేన్ మితు. ఈయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ జంటకు నలుగురు పిల్లలు. అయితే వీళ్లు విడిపోయారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. అధికారికంగా ఇద్దరిలో ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: టారిఫ్ వార్లో వెనక్కి తగ్గిన ఈయూ?

పగలంతా తేనె పలుకులు, రాత్రైతే..
ఉక్రెయిన్ సంక్షోభంలో.. పుతిన్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పుల్స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్-జెలెన్స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్-పుతిన్లు తరచూ ఈ అంశంపై ఫోన్లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆంక్షలు?రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్హామర్’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్ బిజినెస్ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

రయ్.. రయ్.. విమానంతో పోటీపడే రైలు.. గంటకు 600 కిలోమీటర్లు..
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైలు నెట్వర్క్పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన చైనా.. తాజాగా విమానంతో పోటీపడే రైలును తయారు చేసింది. ఈ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్లు అని తెలుస్తోంది. తాజాగా 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్లో మాగ్లెవ్ రైలును చైనా ప్రదర్శించింది. దీంతో, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.చైనా విజయవంతంగా మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీతో సరికొత్త హైస్పీడ్ రైలును ఆవిష్కరించింది. విమానంతో పోటీ పడే రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్లో మాగ్లెవ్ రైలును చైనా ప్రదర్శించింది. ఇది కేవలం 7 సెకన్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక, ఇది అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉన్న 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 5.30 గంటల సమయం పడుతోంది.Ever wondered what 600 km/h feels like on the ground? 🚄Hop on the world’s fastest train and get ready for an insane, mind-blowing ride.This isn't sci-fi — it’s happening in China! 🇨🇳💨#FastestTrain #ChinaSpeed #Maglev #NextLevelTravel #FutureIsNow #HighSpeedRail #600kmh… pic.twitter.com/1Eq4Flm6U1— Chengdu China (@Chengdu_China) July 14, 2025కాగా, డోంఘు లాబొరేటరీలోని ఇంజనీర్లు 2025 చివరి నాటికి తమ హై-స్పీడ్ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి ఏఐ గైడెడ్ సస్పెన్షన్ వ్యవస్థలు.. ఖచ్చితమైన విద్యుదయస్కాంత నియంత్రణకు తోడ్పడనున్నట్టు అధికారులు తెలిపారు. హైస్పీడ్ సమయంలో ఇవి ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయన్నారు.ఇదిలా ఉండగా.. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీతో ఈ రైలు అధిక వేగంతో దూసుకెళ్లగలదు. ఈ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించుకొని.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపడానికి సాయపడుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుతుందని బీజింగ్ అధికారులు వెల్లడించారు. ఈ రైలు బరువు 1.1 టన్నులుగా ఉండనుంది. ఇక, ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర సృష్టించనుంది. ఈ ఏడాది జూన్లో చైనా ఇంజినీర్లు దీన్ని పరీక్షించారు. తాజాగా ప్రదర్శించారు. దీంతో, అందరి దృష్టి ఈ రైలు పడింది. 🇨🇳🚄China is redefining the world’s high-speed rail development.The 600km/h driverless high-speed maglev train debuts! pic.twitter.com/1VghGaC1DQ— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) July 12, 2025
జాతీయం

“నేను నిన్ను విడిచి ఉండలేను.. నేను నీ దగ్గరకు వస్తున్నాను’
ధర్మపురి సమీపంలో తన భర్త మరణ బాధను తట్టుకోలేక ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని కడ్తూర్ సమీపంలోని తలనాథం గ్రామానికి చెందిన తీతు కుమారుడు దీపమలై (26) ఇంజనీర్. పుట్టిరెట్టిపట్టికి చెందిన గీత (21) ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు. వారు పాఠశాల రోజుల నుంచి స్నేహితులు, చివరికి ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం వారి ఇద్దరి తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. వ్యతిరేకత కారణంగా, వారు ఒక సంవత్సరం క్రితం వారి ఇళ్ల నుంచి బయటకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం తర్వాత కొన్ని నెలలుగా దీపమలై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. తాను చనిపోతానని భావించి, తన ప్రేమ భార్య నుంచి విడిపోయి, ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జీవించమని చెప్పాడు. దీని కారణంగా గీత రెండు నెలల క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంతలో ఆరోగ్యం క్షీణించిన దీపమలై గత 29వ తేదీన మరణించాడు. తన భర్త మరణం తర్వాత గీత మానసిక వేదనకు గురైంది. ఈ పరిస్థితిలో గీత ఇన్ స్ట్రాగామ్లో “నేను నిన్ను విడిచి ఉండలేను. నేను నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేసి, ఇంట్లోని ఎలుకల మందు తాగి మరణించింది. కడత్తూర్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీని తరువాత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు దీపమలై మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశానికి సమీపంలోనే అతని గీత మృతదేహాన్ని కూడా ఖననం చేశారు.

నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు.

భర్తను కడతేర్చి.. ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి..
గౌహతి: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలను అంతమొందిస్తున్న భార్యలకు సంబంధించిన ఉదంతాలు విరివిగా వినిపిస్తున్నాయి. తాజాగా అసోంలోని గౌహతిలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చివరకు భర్త హత్యకు దారితీసింది.గౌహతి పోలీసులు భర్తను హత్యచేసిన భార్యను అదుపులోకి తీసుకున్న దరిమిలా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. నిందితురాలు రహిమా ఖాతున్(38), ఆమె భర్త సబియాల్ రెహమాన్ (40)తో తరచూ గొడవ పడేదని పోలీసులు తెలిపారు. సబియాల్ రెహమాన్ స్క్రాప్ డీలర్గా పనిచేస్తున్నాడు. జూన్ 26న అతను తన పని ముగించుకుని, పాండు ప్రాంతంలో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చాడు.పోలీసులు ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం.. ఆ సమయంలో తన భర్త మద్యం మత్తులో ఉన్నాడని, ఆ సమయంలో తలెత్తిన ఇంటి గొడవ దాడులకు దిగేవరకూ కొనసాగిందని రహీమా చెప్పింది. ఈ నేపధ్యంలోనే భర్త హతమయ్యాడని పేర్కొంది. కాగా భర్త మృతదేహాన్ని ఆమె ఇంటి ఆవరణలో ఐదు అడుగుల లోతున గొయ్యి తవ్వి, దానిలో పూడ్చిపెట్టిందని సమాచారం. ఆ జంటకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా రెహమాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో పొరుగింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల విచారణలో నిందితురాలు తొలుత తన భర్త పని కోసం కేరళకు వెళ్లాడని తెలిపింది. తరువాత మాటమార్చి, అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపింది. రెహమాన్ సోదరుడు జూలై 12న జలుక్బరి పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. మర్నాడు పోలీసులు రహిమా ఖాతున్ను విచారించగా తమ దంపతుల గొడవల్లో భర్త మరణించాడని చెప్పింది. ఆ తర్వాత తాను భర్త మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టానని పోలీసులకు చెప్పింది.ఫోరెన్సిక్ నిపుణులు, మేజిస్ట్రేట్తో కూడిన పోలీసు బృందం వారి ఇంటి ఆవరణలోని గొయ్యిలో నుంచి కుళ్లిపోయిన మృతదేహ అవశేషాలను వెలికి తీసింది. రహీమా ఒక్కర్తే ఈ హత్య చేసి ఉండకపోవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక మహిళ స్వయంగా ఇంత పెద్ద గొయ్యిని తవ్వే అవకాశం లేదని, ఇతరుల ప్రమేయం ఉండవచ్చని, ఈ దిశగా దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు.

వారి ఆదేశాలతోనే ఉగ్రదాడి.. ‘పహల్గామ్’పై సంచలన నివేదిక
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్కు చెందిన రాజకీయ నేతలు, సైనిక అధికారుల ఆదేశాల మేరకే జరిగిందని, ఇది పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)చేసిన కుట్ర అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఉగ్రదాడి అనంతరం మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది.పహల్గామ్ దాడికి విదేశీ ఉగ్రవాదులను మాత్రమే మోహరించాలని, పూర్తి గోప్యతను పాటించాలని, కశ్మీరీ ఉగ్రవాదులను తీసుకోవద్దని ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ .. లష్కర్ కమాండర్ సాజిద్ జట్కు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చిందని భద్రతా వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా జమ్ముకశ్మీర్ ఉంటున్న విదేశీ ఉగ్రవాదుల ప్రమేయంతో ఈ దాడులకు పాల్పడాలని కూడా వారు సూచించారని సమాచారం. స్థానిక ఉగ్రవాదులు ఈ ఘటనలో పాల్గొనలేదని ఒక సీనియర్ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు ప్రాక్సీ గ్రూప్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. దాడి చేసిన ఇద్దరూ పాకిస్తాన్ జాతీయులుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో ఇద్దరు స్థానికులను అరెస్ట్ చేశారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ ఈ ఉగ్ర దాడికి ప్రతిస్పందించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బాంబు దాడులు చేసి, వందమంది ఉగ్రవాదులను అంతమొందించింది.
ఎన్ఆర్ఐ

దుబాయ్లో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న దుబాయ్లోని కరామా పార్క్లో ఘనంగా నిర్వహించారు. యుఏఈ వైయస్సార్సీపీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి, ప్రేం, యండ్రా సేను, షేక్ అబ్దుల్లా కీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పణతో కార్యక్రమాన్నిప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మహానేత సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కార్మికులకు అన్నదానం చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ సేవా తత్వాన్ని గౌరవంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ సామాజిక న్యాయం, సంక్షేమాన్ని సమన్వయం చేసిన అజరామర నాయకుడని కొనియాడారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చిన నాయకుని సేవలను సేవా కార్యక్రమాల ద్వారా గుర్తుచేసుకోవడం గర్వకారణమని అన్నారు.ప్రధాన, గౌరవ అతిథులు డాక్టర్ ఖాజా అబ్దుల్ ముత్తలిబ్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & ప్రైవేట్ అడ్వైజర్ — H.H. శైఖా సలామా తహ్మూన్ అల్ నాహ్యాన్ కార్యాలయం – యుఏఇ), నజీరుద్దీన్ మహమ్మద్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, Spread Kindness) హాజరయ్యారు. పి. రావు, అబ్దుల్ ఫహీమ్, షోయబ్, అబ్దుల్ రఫీక్, షామ్, ఘానీ, సిరాజ్, షేక్ సమీర్, రవి, పిల్లి రవి, కె. ప్రసాద్, జో బాబు, కిషోర్, బాబ్జీ, ప్రభాకర్, చిట్టి బాబు, నరేశ్, మహిళా సభ్యులు.. శాంతి, రాణి, ప్రభావతి, చిన్ని, విజయ, మేరీ, రాజేశ్వరి, సునీత, వనిత, కమల, భారతీ తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ వైఎస్సార్ సేవా విలువలు, ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న సంకల్పంతో.. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.వైఎస్సార్ వల్లే ఎదిగా..డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లబ్ధి పొంది దుబాయ్లో స్థిరపడిన షేక్ సమీర్ ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ''ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే నేను ఇంజినీరింగ్ చదవగలిగాను. ఈ విద్యార్హత ఆధారంగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమినీ, డెలాయిట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశాను. ఆరోగ్యం, టెక్నాలజీని కలిపే వినూత్న ఆలోచనతో ఏఐ ఆర్కిటెక్ట్, Fit Techies LLC అనే సంస్థను స్థాపించి నడుపుతున్నాను. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఫిట్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి బోధిస్తున్నా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నా జీవితాన్ని మార్చింది. నేను విద్యార్థి నుంచి మార్గదర్శకుడిగా మారిన ప్రయాణానికి ఇది మూలకారణం” అన్నారు సమీర్.

ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబరాలు
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది తరలి వచ్చారు.....వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషి చేశారు.అంతే కాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు. ఈ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, శ్రీలీల తో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు...థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు సంబరాలకు వచ్చిన వారిని ఉర్రుతలూగించారు...తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేల నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి...నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి... హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నాట్స్ కమిటీ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ......ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలుతెలియజేశారు...ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదం ప్రారంభమైన ఈ సంభరాల్లో 20 వేల మందికి పైగా హాజరయ్యారు...నాట్స్ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు..సంబరాలే కాక సామాజిక బాద్యత గా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్ లీడర్ షిప్ అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.. అనేక సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలు సైతం విజయవంతంగా నిర్వహించారు..

శ్రీ సాంస్కృతిక కళాసారథి 5వ వార్షికోత్సవం, గురుపూర్ణిమ శుభాకాంక్షలు
గురుపూర్ణిమ నాడు ప్రారంభమైన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఈ రోజు తన 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. గత ఐదేళ్లయేటట తాము చేపట్టిన ప్రతి అడుగులో, మీరు అందించిన ఆదరణ, ఆశీర్వాదాలు, ప్రోత్సాహం తమకు బలాన్నిచ్చాయని పేర్కొంది. ‘‘ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి, మాకు తోడుగా నిలిచిన సభ్యులకు,మార్గనిర్దేశం చేసిన మేధావులకు, మన ఆహ్వానాన్ని స్వీకరించి అలంకరించిన అతిథులకు, తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులకు, స్పందించిన ప్రేక్షకులకు, సమయానుకూలంగా విరాళాలు అందించిన దాతలకు, ఆశీర్వచనాలు, అభినందనలు తెలియజేసిన మిత్రులకు, మా కార్యనిర్వాహక వర్గం తరఫున శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.’’అని ప్రకటనలో వెల్లడించింది. ఎనలేని సంపదలాంటి ఈ సహకారం ఇక ముందు కూడా కొనసాగాలని అభిలషించింది.అదే శక్తితో, భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చింది. అలాగే ఇప్పటివరకూ మా సంస్థ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాల సంగ్రహాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చింది.

8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా
టంపా: ఫ్లోరిడా: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గణపతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమెరికా తెలుగు సంబరాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నందుకు నాట్స్ సంబరాల కమిటీని ఆయన అభినందించారు. అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణలో నాట్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పటివరకు మూడు సార్లు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలు పంచుకున్నానన్నారు.హంసవింశతి పుస్తకం ఆవిష్కరణ18వ శతాబ్ధంలో ప్రముఖ తెలుగు కవి అయ్యలరాజు నారాయణ రచించిన హంసవింశతి కావ్యాన్ని తనికెళ్ల భరణి నేటి తరం కోసం ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సంబరాల వేదికపై నందమూరి బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఎందరో కవులు తమ రచనల్లో ప్రతిబింబించారని బాలకృష్ణ అన్నారు. భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని అందించేందుకు నేటి తరం వారు తెలుగులో మాట్లాడాలని, తెలుగు రచనలను పిల్లలకు పరిచయం చేయాలన్నారు.పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అమూల్యమైన ఆభరణాలని ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి అన్నారు.. తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భరణి పేర్కొన్నారు. తెలుగులో ఎన్సైక్లోపీడియా లాంటి పుస్తకం హంసవింశతి అని తెలిపారు.. దీనిని ప్రతి తెలుగువాడు చదవితే మన చరిత్రలో మనకు తెలియని సరికొత్త విషయాలు తెలుస్తాయని భరణి అన్నారు. 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు.

గండికోటలో దారుణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడి.. హత్య చేశాడు. బాలికను బైక్పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్.. గండికోటలోని ధాన్యాగారం వద్ద దారుణానికి ఒడిగట్టాడు. బాలికను వివస్త్రగా విడిచిపెట్టి వెళ్లాడు.బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు లోకేష్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.

ముందే చెబుతున్నా, న్యాయం జరగకపోతే..!
హృదయవిదారకమైన ఒడిషా బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హెచ్వోడీ లైంగిక వేధింపుల పర్వాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు చేసిన కాపీ.. అందులో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. బాలాసోర్ బీఈడీ విద్యార్థిని బలవన్మరణం కేసులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. నిప్పంటించుకునే పది రోజుల ముందు.. 22 ఏళ్ల బాధిత విద్యార్థిని సీఐసీసీ(college's internal complaints committee)కి ఫిర్యాదు చేసింది. అందులో సీనియర్ ఫ్యాకల్టీ నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూనే.. చర్యలు తీసుకోకుంటే గనుక ప్రాణం తీసుకుంటానని హెచ్చరించింది కూడా. జులై 1వ తేదీన ఆమె రాసిన లేఖలో ఇలా.. గత కొన్ని నెలలగా బీఈడీ డిపార్ట్మెంట్ హెచవోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహూ నన్ను వేధిస్తున్నారు. తక్కువ మార్కుల వేస్తానని, నన్ను ఫెయిల్ చేస్తానని.. నా గురించి నా కుటుంబంతో లేనిపోనివి చెబుతానని బెదిరిస్తూ వస్తున్నారు. అన్నింటికి మించి తన కోరికెలు తీర్చమంటూ వేధిస్తున్నారు. మనశ్శాంతి కరువై మానసికంగా ఇబ్బంది పడుతున్నా. నా ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. నేను బలవన్మరణానికి పాల్పడతాను. నా చావుకు హెచ్వోడీ, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని లేఖ రాసిందామె. జూన్ 30వ తేదీన ఫకీర్ మోహన్ కాలేజీ ప్రిన్సిపల్ దీలీప్ ఘోష్ దృష్టికి ఆమె విషయాన్ని తీసుకెళ్లింది. ఆ మరుసటిరోజు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదును సమర్పించింది. అంతటితో ఆగకుండా.. పది రోజులపాటు ఆ ఫిర్యాదు కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి చర్యలు తీసుకోవాలంటూ సీఎం, విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను ట్యాగ్చేసి మరీ కోరింది. అయినా ఫలితం లేకపోయింది. జులై 12వ తేదీన.. ఆమె కాలేజీలోని ప్రిన్సిపల్ గది ఆవరణలో నిప్పటించుకుంది. 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెను రక్షించడానికి వెళ్లిన మరో విద్యార్థిని కూడా 70 శాతం గాయాలపాలై చికిత్స పొందుతోంది. ప్రధాన బాధితురాలిని బాలాసోర్ జిల్లా ఆస్పత్రిలో.. ఆపై భువనేశ్వర్లో ఎయిమ్స్కు ఆమెను తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాధితురాలు కన్నుమూసింది. ఈ కేసుకు సంబంధించిన బీఈడీ హెచ్వోడీ సమీర్ కుమార్ సాహూ, కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్లను కాలేజీ యాజమానయం తొలగించగా.. ఆపై పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఉదయం బాలాసోర్లోని బాధితురాలి స్వగ్రామం పలాసియాకు మృతదేహాన్ని తరలించారు. ఊరు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. ఆమె మృతదేహాంతో కాసేపు రోడ్డుపై ఆందోళనకు దిగింది.ఈ ఘటనపై సీఎం మోహన్ చరణ్ మజ్హీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారాయన. మరోవైపు.. స్వరాష్ట్రం ఒడిశా పర్యటనలో ఉన్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సోమవారం సాయంత్రం AIIMSకి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆపై కాసేపటికే ఆమె కన్నుమూయడం గమనార్హం.ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదు.. బీజేపీ వ్యవస్థ చేసిన హత్య అని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న రాహుల్.. బాధిత విద్యార్థిని ధైర్యంగా తన గొంతుక వినిపించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: నేనేం చావడానికి ఇక్కడికి రాలేదు!

అద్దె కారుతో భర్తను లేపేసిన భార్య..!
మోటకొండూర్: మోటకొండూర్ మండలం కాటేపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి బైక్ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మృతుడిని అతడి భార్య, బావమర్ది కలిసి హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36), తన స్నేహితుడు మద్దికుంట వీరబాబు ఆదివారం అర్ధరాత్రి భువనగిరి మండలం రాయిగిరి నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా.. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుండి వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ను కారు కొద్దిదూరం లాకెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చున్న వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్వామి మృతదేహాన్ని, గాయపడిన వీరబాబును స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరబాబును మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా సోమావరం ఉదయం మృతుడు స్వామి బాబాయి ఐలయ్య ఈ ప్రమాదంపై పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోటకొండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇది రోడ్డు ప్రమాదం కాదని.. వివాహేతర సంబంధం కారణంగానే స్వామిని అతడి భార్య స్వాతి, స్వాతి సోదరుడు మహేష్ కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. మృతుడు స్వామికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు.
వీడియోలు


Driver Rayudu Case: కాళహస్తి జనసేన ఇన్ ఛార్జ్ వినుత కోట ఇంట్లో బొజ్జల కోవర్ట్ ఆపరేషన్


పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు


భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన


ఉప్పల హరికను పరామర్శించిన YSRCP నేతలు


శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి


YS Jagan Tweet: శభాష్ శుభాంశు..


Perni Kittu: మహానటి అని పేరు పెడతావా.. సిగ్గుందా.. నువ్వు మనిషిగా పుట్టుంటే..


ముగ్గుర్ని కన్నోళ్లే దేశభక్తులు బాబు అపరిపక్వ రాజకీయం


ఉప్పాల హారికను పరామర్శించిన YSRCP నేతలు


Palnadu: కొడుకుని తగలబెట్టిన తండ్రి