పీఎస్‌యూ టెల్కోలకు లైన్‌ క్లియర్‌ | India greenlit policy transfer of surplus land and buildings held by telecom PSUs | Sakshi
Sakshi News home page

పీఎస్‌యూ టెల్కోలకు లైన్‌ క్లియర్‌

Jul 15 2025 3:12 PM | Updated on Jul 15 2025 4:02 PM

India greenlit policy transfer of surplus land and buildings held by telecom PSUs

పీఎస్‌యూ టెలికం దిగ్గజాలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఐటీఐలకు మద్దతుగా అత్యున్నత కమిటీ మార్గదర్శకాలకు తెరతీసింది. దీంతో వేలం లేకుండానే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలకు మిగులు భూమి, భవనాలను బదిలీ చేసేందుకు వీలు చిక్కనుంది. గత నెలలో సమావేశమైన సెక్రటరీల కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.

టెలికం పీఎస్‌యూ సంస్థల ఆస్తులను సొంతం చేసుకోవాలనుకునే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు సంబంధిత అనుమతులతోపాటు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ను దాఖలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా క్లెయిమ్‌ను రిజిస్టర్‌ చేసుకునేందుకు ఆస్తుల సంకేత విలువలో 2 శాతం సొమ్మును డిపాజిట్‌ చేయవలసి ఉంటుంది. ఆయా ఆస్తుల మానిటైజేషన్‌కు సంబంధిత వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ వెలువడిన 90 రోజుల్లోగా వీటిని పూర్తి చేయవలసి ఉంటుంది. 

ఇదీ చదవండి: విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్‌ 

కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తొలి ప్రాధాన్యతా హక్కును వినియోగించుకునే వీలుంటుంది. అయితే నోటిఫికేషన్‌ వెలువడిన 90 రోజుల తదుపరి ఇతర ప్రయివేట్‌ రంగ కంపెనీలకు ఆస్తులను విక్రయించే వెసులుబాటును బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఐటీఐ పొందుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement