breaking news
Mancherial
-
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన అభివృద్ధి పనుల హామీలు నెరవేర్చానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. సోమవారం ఆయన స్థానిక ఐబీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రూ.255కోట్లతో కరకట్ట పనులు ప్రారంభించామని తెలిపారు. దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 74.40 కోట్లు విడుదలయ్యాయని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రిలో భవిష్యత్లో పడకలు పెంచుకునేలా నిర్మిస్తున్నామని అన్నారు. కాలేజీరోడ్డులో 350 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనులు జరుగుతుండగా, పాత ఆసుపత్రిని కూల్చి 100 పడకలతో నూతన ఆసుపత్రి నిర్మాణం చేపడుతామని తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతిపక్ష నాయకులు నడిపెల్లి దివాకర్రావు, రఘునాథ్ వెరబెల్లిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీల్ చైర్లో పర్యటన ప్రేమ్సాగర్రావు దాదాపుగా గత నాలుగు నెలలుగా అనారోగ్యంగా ఉండి చికిత్స పొందారు. ఈ నెల 22న మంచిర్యాలకు వచ్చిన ఆయన కాలు కింద పెట్టలేని పరిస్థితుల్లో వీల్చైర్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆర్టీఏ కార్యాలయానికి.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): వేంపల్లిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి(ఆర్టీఏ) ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు విచ్చేశారు. ఇటీవల కొనుగోలు చేసిన నూతన టోయోట వెల్ఫైర్ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా, 0001 నంబరును ముందస్తుగా రూ.50 వేల ఫీజుతో బుకింగ్ చేసుకుని దక్కించుకున్నారు. దాదాపు రూ.కోటిన్నర విలువైన ఈ వాహనం ఇక్కడి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కావడం కూడా ఒక విశేషమే. -
కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి
కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణానికి నిధుల మంజూరుతోపాటు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ మట్టిపోసి వదిలేశాడు. సీసీ రోడ్డు వేయకుండా కాలయాపన చేస్తున్నాడు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలి. – సాయికుటీర్ కాలనీ వాసులు, 7వ వార్డు, క్యాతనపల్లి మున్సిపాలిటీపన్ను కట్టలేదంటున్నారు.. గత ఏడాదికి సంబంధించిన ఇంటి పన్ను రూ. 4,810 మున్సిపాల్టీలో చెల్లించాను. ఈ ఏడాది పన్ను చెల్లించడానికి వెళ్తే గత ఏడాది పెండింగ్లో ఉందని, కట్టలేదని అంటున్నారు. రశీదు చూపించినా, కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. బిల్లు పరిశీలించి న్యాయం చేయాలి. – కే.మోహన్రెడ్డి, సున్నంబట్టివాడ, మంచిర్యాల -
● దరఖాస్తులు ఎక్కువ.. మంజూరు తక్కువ ● ఉమ్మడి జిల్లాలో డీడీఎన్ పథకంలో 21 ఆలయాలు.. ● మంచిర్యాల జిల్లాలో ఒక్క గుడికే చోటు
మంచిర్యాలఅర్బన్: ఆదాయం తక్కువగా ఉన్న ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్య పూజలు కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ధూప దీప నైవేద్యం(డీడీఎన్) పథకంలో ఉమ్మడి జిల్లాకు శఠగోపం పెట్టింది. వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా ఆలయాల ఎంపిక మాత్రం రెండు పదులకు పరిమితం కావడం నిరాశకు గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఒకే ఆలయానికి చోటు దక్కడంపై పెదవి విరుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు, కుమురంభీం ఆసిఫాబాద్లో రెండు, నిర్మల్ జిల్లాలో 13 ఆలయాలు మంజూరయ్యాయి. ఆలయాలకు దక్కని చోటు డీడీఎన్ పథకం కింద ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 726 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ అనంతరం 146 ఆలయాలు ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో 21 ఆలయాలు మాత్రమే ఈ పథకం కింద మంజూరయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే ఉమ్మడి జిల్లాకు మొండి చేయి చూపినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల పైరవీలు, ఒత్తిడితో ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆశించిన మేర ఆలయాలకు చోటు దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనలు ఇలా.. ఈ పథకం కింద ఆలయాలు ఎంపిక కావాలంటే దేవాదాయ శాఖలో నమోదై నిత్య పూజలు నిర్వహిస్తుండాలి. జాతర సందర్భాల్లో తెరిచే ఆలయాలకు పథకం వర్తించదు. ఆలయానికి ఆదాయం వచ్చే ఎలాంటి భూములు ఉండకూడదు. ఆలయంలో ఒక అర్చకుడికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాలకు వర్తించదు. రాష్ట్రంలో 2007లో తీసుకొచ్చిన ఈ పథకం కింద ఒక్కో గుడికి రూ.2,500 చెల్లించేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచారు. పూజ సామగ్రికి రూ.4వేలు, అర్చకుడికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. దరఖాస్తుల వడపోత అనంతరం ప్రత్యేక కమిటీ వందల సంఖ్యలో ఎంపిక చేసి నివేదించినా మంజూరు మూడు పదులకై నా చేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరిన్ని ఆలయాలకు మంజూరు అవకాశం కల్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.మంజూరైన ఆలయాలు ఇవే..శ్రీరామ సత్యనారాయణస్వామి ఆలయం(దంతన్పల్లి), నల్లపోచమ్మ ఆలయం(ఖా నాపూర్), దత్తాత్రేయ స్వామి ఆలయం(బా దన్కుర్తి), శివపంచాయతన అభయాంజనే య స్వామి ఆలయం(మాసాయిపేట్), అభయాంజనేయస్వామి ఆలయం(ఆదిలాబాద్ టౌన్), వీర హనుమన్ టెంపుల్(కోలిపూర్ ఆదిలాబాద్టౌన్), హనుమాన్ టెంపుల్(జందాపూర్, ఆదిలాబాద్), అడెల్లి పోచమ్మ ఆలయం(సారంగాపూర్), హనుమాన్ టెంపుల్(వాడి భైంసా), వేంకటేశ్వరస్వామి ఆలయం(సోఫీనగర్, నిర్మల్ టౌన్), జగదాంబ సేవాలాల్ ఆలయం(పారపెల్లి తండా, లక్ష్మ ణచాంద), కోదండరామాలయం(కౌట్ల–కే, నిర్మల్), ఆంజనేయస్వామి ఆలయం(నర్సాపూర్–జీ), మార్కండేయ స్వామి ఆలయం(దిలావర్పూర్), పెద్దమ్మ ఆలయం(గోపాల్పేట్, సారంగపూర్), భక్తాంజనేయ స్వామి టెంపుల్(బీబ్రా, దహెగాం), శివాలయం(అయనం, దహెగాం), పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం(తలమడుగు), కోదండ రామాలయం(మాదారం టౌన్షిప్, మంచిర్యాల)కు మంజూరు చేశారు.జిల్లా దరఖాస్తులు ఎంపిక చేసినవి మంజూరు ఆదిలాబాద్ 219 34 05కుమురంభీం 102 18 02మంచిర్యాల 110 34 01నిర్మల్ 295 60 13మొత్తం 726 146 21 -
విద్యుత్ తీగలు మార్చాలి
తీగల్పహాడ్లోని సర్వేనంబరు 15లో ఉన్న మా వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయి. తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. మార్చాలని పలుమార్లు విద్యుత్శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా పని చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి సవరించాలి. – సిలువేరి మధుకర్, తీగల్పహడ్, నస్పూర్ ప్లాట్లు.. పరిహారం ఇవ్వలేదు..ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన చందనపూర్ గ్రామస్తులకు పునరావాసం కింద 280 ప్లాట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 230 పాట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా 50 ప్లాట్లు ఇవ్వలేదు. పరిహారం కింద రూ.3.75లక్షల ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు ప్లాట్లు, పరిహారం ఇవ్వలేదు. ఏళ్ల తరబడిగా తిరుగుతున్నాం. – చందనపూర్ భూ నిర్వాసితులు -
చంద్రవెల్లిలో పులి సంచారం
బెల్లంపల్లిరూరల్: మండలంలోని చంద్రవెల్లి, చర్లపల్లి గ్రామాల అటవీ ప్రాంతంలో సోమవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామీణులు పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ సిబ్బందితో అటవీ ప్రాంతంలో పర్యటించి చంద్రవెల్లి–చర్లపల్లి గ్రామాల శివారు అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించారు. చంద్రవెల్లి, చర్లపల్లి, బుధాకలాన్, గురిజాల, చాకేపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెల్లవారు జామున, రాత్రి పూట అటవీ ప్రాంతం వైపు రాకపోకలు సాగించవద్దని ఎఫ్ఆర్వో సూచించారు. రైతులు పొలాలకు వెళ్లే క్రమంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సంక్రాంతికి ‘గూడెం ఎత్తిపోతల’ నీరు
దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని కడెం ఆయకట్టు పరిధిలో డీ–30 నుంచి 42వరకు ప్రతియేటా సాగునీరందిస్తున్నారు. ఈసారి యాసంగి సీజన్ సాగుకు సంబంధించి సంక్రాంతి పండుగ నుంచి నీటి విడుదలకు అధికారులు చర్యలు చేపట్టారు. 2021, 2022లో గోదావరి వరద నీటిలో కంట్రోల్ప్యానల్ గది మునిగిపోవడం, కొంత సామగ్రి పాడవడం తెలిసిందే. ఆ సమయంలో మరమ్మతులు చేయించారు. కంట్రోల్ ప్యానల్ వరద నీటిలో మునిగి పోకుండా ఉండేందుకు ఎత్తయిన ప్రదేశంలో రూ.1.59కోట్లతో కొత్తగా గది నిర్మించారు. ప్రస్తుత గదిలోని సామగ్రిని అందులోకి మారుస్తున్నారు. శరవేగంగా సాగుతున్న పనులన్నీ సంక్రాంతి వరకు పూర్తి చేసి నీటి విడుదలకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. పనులు పూర్తవగానే ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ఆదేశాల మేరకు నీటి విడుదల తేదీని ప్రకటిస్తామని ఇరిగేషన్ డీఈ దశరథ్ తెలిపారు. -
● బల్దియాల్లో అమలుకు నోచుకోని వైనం ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ● విరివిగా నిషేధిత కవర్ల వినియోగం ● గతంలో తనిఖీలు, జరిమానాలు ● చెత్తలో వేయడంతో పర్యావరణానికి ముప్పు
‘ప్లాస్టిక్’పై నిషేధమేది..!మంచిర్యాలటౌన్: ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాలన్న జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సూచనను అన్ని మున్సిపాల్టీల్లో అమల్లోకి తెచ్చినా అమలు గగనంగా మారింది. గత ఏడాది ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై బల్దియాల్లో అధికారులు తనిఖీలు చేపట్టడం, జరిమానాలు విధించడం వల్ల కొంతవరకు వినియోగం తగ్గింది. గత కొంతకాలంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ప్లాస్టిక్ నిషేధంపై అధికారుల పర్యవేక్షణ లోపించి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోజు రో జుకు వినియోగం పెరిగిపోయి నగరంలోని వీధులు, చెత్తకుప్పల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు దర్శనమి స్తున్నాయి. పశువులు ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువా త పడుతుండగా, పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ కవర్లు కారకమవుతున్నాయి. కనీస తనిఖీలు చేపట్టకపోవడం, జరిమానాలు విధించకపోవడం వల్ల వినియోగం పెరిగిపోతోంది. ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారుల సమావేశాలు నిర్వహించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలూ చేయడం లేదు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం చూకపోవడంతోనూ జిల్లాలో వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. చర్యలేవి..? కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ను పూర్తిగా నిషేధించారు. 120మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి, ఒకసారి వాడినవి ఉన్నా, నిల్వ ఉంచినా, విక్రయించినా, ఉపయోగించినా పర్యావరణ పరిరక్షణ చట్టం(1986) ప్రకారం సీడీఎంఏ హైదరాబాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సామగ్రి జప్తు, రూ.5వేల నుంచి రూ.10వేల వరకు జరిమానా, లైసెన్స్ రద్దుతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. నిషేధం అమలుకు ముందు నుంచే వ్యాపారులు, ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వారికి నిషేధంపై మున్సిపల్ అధికారులు వివరించి ప్రజల్లోనూ మార్పు తెచ్చేందుకు చేతి సంచితోనే కూరగాయల మార్కెట్కు రావాలని, ప్లాస్టిక్ నిషేధం ఉందని, ఎవరూ వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ కనిపించినా వెంటనే మున్సిపల్ సిబ్బంది సీజ్ చేశారు. ఇది ఏడాది క్రితం వరకే చేసి ఆ తర్వాత అధికారులు ప్లాస్టిక్ కవర్లపై పట్టించుకోవడమే మానేశారు. దీంతో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించిన ప్రజలు తిరిగి ప్రారంభించారు. బట్ట సంచులను వాడిన వారి చేతుల్లో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. నిరంతర తనిఖీలు చేపట్టకపోవడంతో బట్ట సంచుల స్థానంలో తిరిగి ప్లాస్టిక్ కవర్లు అందుబాటులోకి వచ్చి వినియోగం విరివిగా మారింది. చెత్తకుప్పల్లో.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో వేసే చెత్తకుప్పల్లో అధిక భాగం ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, క్యాతన్పల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో ప్రతీరోజు దాదాపుగా 150 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడితే అందులో నాలుగోవంతు ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇళ్లల్లో నుంచి వెలువడే చెత్తలో తడి, పొడి చెత్తను ప్లాస్టిక్ కవర్లలోనే వేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్నారు. దుకాణాల్లోనూ ప్లాస్టిక్ కవర్లు చెత్తలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లలో వేస్తున్న చెత్తను కాలనీల్లోని చెత్త వేసే ప్రాంతాల్లో పడేయడంతో, ఏ కాలనీలో చూసినా చెత్తతోపాటు ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో నిత్యం దాదాపు 95 వేలకు పైగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని అంచనా. పశువులు రోడ్డు పక్కన ఉండే చెత్త, అందులోని ప్లాస్టిక్ కవర్లను తింటూ జీర్ణం చేసుకోలేక, అందులోని రసాయనాలు శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడుతున్నాయి. -
జాతర సమీపిస్తున్నా.. జాప్యమే!
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర జనవరి 18న మెస్రం వంశీయుల మహా పూజతో ప్రారంభం కానుంది. మరో 20 రోజులు మాత్రమే ఉంది. అయితే జాతర నిర్వహణ, ఏర్పాట్లపై నిర్వహించాల్సిన అధికారుల సమన్వయ సమావేశం జాడ కానరావడం లేదు. మరోవైపు మెస్రం వంశీయులు ఈ నెల 23న ప్రారంభించిన ప్రచార రథం నేటితో ముగియనుంది. 30వ తేదీన గంగాజలయాత్ర కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జాతర పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మెస్రం వంశీయులు కోరుతున్నారు. భక్తులకు దారి కష్టాలు తప్పవా.. మండలంలోని ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు మూడు కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు నిధులు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే రోడ్డుకు ఇరువైపులా చెట్ల తొలగింపు మాత్రమే చేస్తామని, విస్తరణ పనులు జాతర తరువాత నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లతో తరలివస్తారు. అయితే హర్కపూర్ చౌక్ నుంచి కేస్లాపూర్ వరకు ఉన్న మట్టి రోడ్డుతో పాటు కేస్లాపూర్ నుంచి దస్నాపూర్ గ్రామం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. ఏటా భక్తులకు ఈ మార్గంలో ఇక్కట్లు తప్పడం లేదు. సమస్యను గతేడాది కలెక్టర్ రాజర్షిషా దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికీ అవే గుంతల రోడ్లు దర్శనిమిస్తుండడం గమనార్హం. అలానే కేస్లాపూర్కు అనుబంధంగా ఉన్న మెండపల్లి రోడ్డుతో పాటు మల్లాపూర్, ధర్మసాగర్ బైపాస్ రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. ప్రారంభం కాని ఏర్పాట్లు పుష్యమాస అమావాస్య పురష్కరించుకుని జనవరి 18న మెస్రం వంశీయుల మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మెస్రం వంశీయులతో పాటు భక్తులు భారీగా తరలివస్తారు. జాతరకు మూడు వారాలే సమయం ఉంది. ఏర్పాట్లపై ఆయా శాఖలతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించాల్సిన ఉన్నతాధికారులు ఇంకా దృష్టి సారించకపోవడం గమనార్హం. -
సాఫ్ట్బాల్ పోటీల విజేత మహబూబ్నగర్
మందమర్రిరూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మోడల్ స్కూల్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో మహబూబ్నగర్ విజేతగా నిలిచింది. నిజామాబాద్, మహబూబ్నగర్ జట్లు ఫైనల్కు చేరుకోగా 3–2 స్కోర్ తేడాతో మహబూబ్నగర్ గెలుపొందగా నిజామాబాద్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా వరంగల్ టీం 9–8స్కోర్ తేడాతో వరంగల్ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు ఒలింపిక్ జిల్లా కార్యదర్శి రఘునాథ్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈవో అంజయ్య బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సారా తస్నీమ్, కోచ్లు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
చైనా మాంజా విక్రయిస్తే కఠినచర్యలు
తాండూర్: చైనా మాంజా విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని అటవీశాఖ డెప్యూటీ రేంజ్ అధికా రి తిరుపతి హెచ్చరించారు. ఆదివారం మండ ల కేంద్రంలోని గాలిపటాల దుకాణా లను అ టవీశాఖ అధికారులు తనిఖీ చేశారు. చైనా మాంజా వినియోగంతో మనుషులు, పక్షులకు ప్రాణాపాయం పొంచి ఉందని హెచ్చరించా రు. సెక్షన్ అధికారి సువర్ణ, బీట్ అధికారి భా స్కర్ ఉన్నారు. అలాగే, చైనా మాంజా విక్రయించడం చట్టరీత్య నేరమని తాండూర్ ఎస్సై కిరణ్కుమార్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
రేపు జీజీహెచ్ఎస్తో‘సాక్షి’ ఫోన్ ఇన్
మంచిర్యాలటౌన్: ప్రస్తుతం చలితీవ్రత పెరిగినందున వృద్ధులు, మహిళలు, పిల్లలు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్తో మంగళవారం ‘సాక్షి ఫోన్ ఇన్’ నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్నవారు సూపరింటెండెంట్తో నేరుగా ఫోన్లో మాట్లాడి పరిష్కారం పొందవచ్చు.సమయం : మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్ నంబర్ : 99491 53168 -
క్యాన్సర్పై సమరం!
మంచిర్యాలటౌన్: క్యాన్సర్పై సమరానికి వైద్యశాఖ చర్యలు చేపట్టింది. 14 ఏళ్లున్న బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు ఎక్కువగా గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్కు గురవుతుంటారు. కొందరు ఇదే క్యాన్సర్తో మృతి చెందిన ఘటనలున్నాయి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యసిబ్బందికి ఈ నెల 12న అవగాహన కల్పించింది. ప్రభుత్వం వచ్చే నెలలోనే వ్యాక్సిన్ వేసేందుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 14 ఏళ్లున్న బాలికలు ఎంతమంది జిల్లాలో ఉన్నారనే వివరాలు సేకరిస్తోంది. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం 13–19 ఏళ్లున్న కౌమారదశ బాలికలు 25,628 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 14ఏళ్లు నిండిన ప్రతీ బాలికకు వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వనుండగా, వచ్చే నెలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది. కొనసాగుతున్న బాలికల గుర్తింపు జిల్లాలో 14ఏళ్లున్న బాలికలు ఎంతమంది ఉన్నారనే దానిపై విద్యాశాఖతో పాటు జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ద్వారా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు వివరాలు సేకరించారు. ప్రస్తుతం 14ఏళ్లున్న వారు 8,084 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ ఇంకా గుర్తింపు కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ప్రస్తుతం 14–15 ఏళ్లున్న బాలికలకు ముందుగా హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం మిగతావారికి వ్యాక్సిన్ను విడతల వారీగా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్తో పాటు వారికి క్యాన్సర్ ఏవిధంగా సోకుతుంది.. దాని కోసం వ్యాక్సిన్ వేస్తే ఎలా పనిచేస్తుందో వివరించనున్నారు. ఎక్కువ మందిలో సర్వైకల్ క్యాన్సర్ ఆడవారికి వచ్చే క్యాన్సర్లలో ఎక్కువగా రొమ్ము, సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించి సరైన అవగాహన లేకనే వ్యాధికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కిశోర బాలికల్లో హార్మోన్ల మార్పులు జరుగుతున్న సమయంలోనే ఇన్ఫెక్షన్లు వచ్చి క్యాన్సర్గా మారేందుకు అవకాశముందని గుర్తించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మూత్ర విసర్జన అనంతరం శుభ్రత పాటించక పోవడంతో వచ్చే అవకాశముంది. క్యాన్సర్ వచ్చిందని గుర్తించడంలోనూ జరుగుతున్న జాప్యంతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చదువుకునే బాలికలకే కాకుండా, చదువుకు దూరంగా ఉన్నవారినీ గుర్తించి వ్యాక్సిన్ వేయాలని, అప్పుడే సర్వైకల్ క్యాన్సర్ పూర్తిగా రాకుండా నిరోధించేందుకు అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. -
ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య
నేరడిగొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కౌలు రై తు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కు ప్టి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోటసంటి రాజేశ్వర్(42) అనే కౌలు రైతు కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి వచ్చాడు. ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంట దిగుబడి త గ్గింది. కుటుంబ అవసరాలతో పాటు సాగుకు దాదాపు రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. ఎలా తీర్చాలో అని తరచూ మదనపడేవాడు. మనస్తాపానికి గురైన ఆయన శనివారం రాత్రి తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన భార్య లోనికి వెళ్లి చూడగా భర్త వేలాడుతూ కనిపించాడు. వెంటనే 108 కు సమాచారం అందించగా, అక్కడి చేరుకున్న సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘స్వాతంత్య్రోద్యమంలో కాంగ్రెస్ కృషి అమోఘం’
చెన్నూర్: స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్ కృషి అమోఘమని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాఽథ్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గాంధీ చౌక్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. ఉపాధిహామీ లాంటి మహత్తర పథకాలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని పేర్కొన్నారు. నాయకులు కుర్మ రాజమల్లగౌడ్, చెన్న నారాయణ, హిమవంతరెడ్డి, సాధనబోయిన కృష్ణ, బషీరొద్దిన్, పాతర్ల నాగరాజు, తుమ్మ రమేశ్, ఇబ్రహీం, అన్వర్, హజు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి పునాది వేసింది కాంగ్రెస్సే.. రామకృష్ణాపూర్: స్వాతంత్య్రం వచ్చాకజవహర్లాల్ నేతృత్వంలో దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసింది కాంగ్రెస్సేనని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ‘బీ’ జోన్లో రాజీవ్గాందీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజ ల కోసం పోరాడే ఏకై క పార్టీ కాంగ్రెస్ అని తెలిపా రు. రాబోయే స్థానిక సంస్థలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావటానికి ప్రతీ కార్యకర్త చిత్తశుద్ధితో కృషి చే యాలని కోరారు. పార్టీ పట్టణాధ్యక్షుడు పల్లెరాజు, వొడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య, జంగం కళ, ఢీకొండ శ్యాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చిర్రకుంటకు చెందిన శ్రీశ్రేష్ట
మందమర్రిరూరల్: మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన శెట్టి మాధవి–సత్యనారాయణ కుమార్తె శ్రీశ్రేష్ట కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన సామూహిక కూచిపూడి నాట్య పోటీలో శ్రీశ్రేష్ట పాల్గొని రికార్డు సాధించింది. సుమారు 7వేల మంది చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సభ్యులు చిన్నారికి బహుమతితో పాటు సర్టిఫికెట్ అందించారు. పట్టణంలోని గ్రేస్ లిటిల్ హార్ట్స్ హైస్కూల్లో ఏడోతరగతి చదువుతున్న చిన్నారి మూడేళ్లుగా శ్రీసాయి నాట్య కళానిలయంలో కూచిపూడి నృత్యం నేర్చుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్న చిన్నారిని స్కూల్ కరస్పాండెంట్ శ్యాంకుమార్, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు. -
సత్ఫలితాలిస్తున్న రోడ్ సేఫ్టీ క్లబ్
కై లాస్నగర్(బేల): జిల్లాలో రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం తగ్గించాలనే లక్ష్యంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలోచనతో ప్రారంభించిన రోడ్ సేఫ్టీ క్లబ్ మంచి ఫలితాలను ఇస్తోంది. బేల మండలం సిర్సన్న గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులు సకాలంలో స్పందించి ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలను కాపాడారు. బేల మండలం డోప్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదిలాబాద్లో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సిర్సన్న గ్రామ సమీపంలో అడవి పంది అడ్డుగా రావడంతో ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న రోడ్ సేఫ్టీ క్లబ్ సిర్సన్న గ్రామ యువత వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా పోలీసుల ద్వారా అందజేసిన ఫస్ట్ఎయిడ్ కిట్ వినియోగించి బాధితుడికి ప్రఽథమ చికిత్స అందించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఎల్.ప్రవీణ్ ఘటన స్థలానికి చేరుకుని 108లో బాధితుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ బాధితుడికి గాయాలు కావడంతో, ముందుగా శిక్షణ పొందిన రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన ప్రథమ చికిత్స అందించడం విశేషం. ప్రస్తుతం బాధితుడికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఘటనపై స్పందించిన ఎస్పీ రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యుల సేవాభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. -
గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
సారంగపూర్: రెండు రోజుల క్రితం స్వర్ణ ప్రాజెక్టులో గల్లంతైన బాలుని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని లింగాపూర్కు చెందిన గెడెం కార్తీక్ (16) స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్వాటర్లో గల్లంతైన విషయం తెలిసిందే. తన కుమారుడు రెండు రోజులుగా కనిపించడం లేదని బాలుని తండ్రి అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కార్తీక్తో కలిసి తిరిగిన పంద్రం గంగాప్రసాద్, మరో బాలుడిని విచారించగా సదరు యువకుడు ప్రమాదవశాత్తు స్వర్ణ ప్రాజెక్టులో పడిపోయాడని తెలిపారు. గజ ఈతగాళ్లతో ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు పంద్రం గంగాప్రసాద్, మరో బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెల్లడించారు. ఈ నెల 25న మృతుని మేనబావ అయిన గంగాప్రసాద్ మరో బాలుడితో కలిసి కార్తీక్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని లింగాపూర్ తండావైపు వెళ్లి మద్యం సేవించారు. తిరిగి వస్తుండగా లింగాపూర్ సమీపంలో గల వంతెన వద్ద ఆగారు. ఈ క్రమంలో కార్తీక్కు ఈత రాదని చెప్పినా వినిపించుకోకుండా నీటిలోకి తోసివేశారు. దీంతో ఊపిరాడక మృతి చెందాడని ఎస్సై తెలిపారు. గంగాప్రసాద్ను కోర్టులో, మరో మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
‘కడెం’కు సందర్శకుల తాకిడి
కడెం: కడెం ప్రాజెక్ట్ వద్ద ఆదివారం సందర్శకుల సందడి కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రాజెక్ట్ అందాలను తిలకించి బోటులో విహరించారు. ముగిసిన ఎన్ఎస్ఎస్ అడ్వంచర్ క్యాంప్బాసర: అటల్ బిహారీ వాజపేయి మౌంటెనీరింగ్, అల్లాయిడ్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్లోని పోంగ్డామ్లో ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ అడ్వంచర్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. శిబిరంలో బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు ప్రవళిక, బి.వీరమల్లేశ్వర్, కే.సాయిరాహుల్, ఎన్.శివాంశ, ఎమ్.స్వాతి, ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.శ్రవణ్కుమార్ పాల్గొన్నారు. శిబిరం ముగించుకుని వచ్చిన విద్యార్థి బృందానికి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ ఆదివారం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ టి.రాకేష్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. కేకే ఓసీని సందర్శించిన డైరెక్టర్ మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే ఓసీని సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు ఆదివారం ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ఓసీలోని పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు తగిన సూచనలు చేశారు. పాలచెట్టు ఏరియాలోని సోలార్ విద్యుత్ ప్లాంట్ ఆవరణలో ఇటీవల ఏర్పాటు చేసిన బ్యాటరీ స్టోరేజ్ సిస్టంను పరిశీలించారు. ఆయన వెంట కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, మేనేజర్ రామరాజు తదితరులున్నారు. -
అ‘పూర్వ’ం.. అద్వితీయం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల బీసీ హాస్టల్ పూర్వ విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో ఆత్మీయ స మ్మేళనం నిర్వహించుకున్నారు. 45ఏళ్ల క్రితం హాస్టల్లో కలిసి చదువుకున్న వారంతా వివిధ జిల్లాల్లో స్థిరపడ్డప్పటికీ అంతా కలిసి ఒక్కచోట కలుసుకున్నారు. హాస్టల్లో కలిసి చదువుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పలువురు స్నేహితులు ఇప్పటికే మృతి చెందగా వారికి సంతాపం తెలిపారు. నాటి హాస్టల్ వార్డెన్ హెంలానాయక్ను సన్మానించారు. ఇకనుంచి ఏటా సమ్మేళనం నిర్వహించుకుంటామని తెలిపారు. ప్రోగ్రాం కన్వీనర్ జుర్రు రమేశ్, జుర్రు నగేశ్ను సన్మానించారు. అలాగే 1999–2000లో శ్రీసరస్వతీ శిశు మందిర్ (మిలీనియం)లో పదో తరగతి చదువుకున్న పూర్వవిద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఫంక్షన్హాల్లో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నవారంతా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. నాటి అధ్యాపకులు నేలమడుగు శంకరయ్య, కట్ట వెంకటరెడ్డి, నేలమడుగు శ్రీధర్, రావుల రామన్న, మిట్ట పల్లి దేవేందర్రెడ్డి, కృష్ణగోపాల్ను సన్మానించారు. పూర్వ విద్యార్థులు సురేశ్, నడిమెట్ల రవికిరణ్, పెద్దపల్లి రవికాంత్, వడ్నాల రాజు, గాజుల గోపాలకృష్ణ, బద్దెనపల్లి శ్రీనివాస్, గజ్జల శివశంకరాచారి, నగునూరి మహేశ్, వెలుమల సతీశ్ పాల్గొన్నారు. -
విత్తనం.. కీలకం
చెన్నూర్రూరల్: ఖరీఫ్ ముగిసి యాసంగి సీజన్ మొదలైన క్రమంలో రైతులు సాగులో తగిన మెళకువలు పాటించాలి. విత్తనాలు, భూసారం, సాగునీరు, ఎరువుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాగులో ప్రథమంగా విత్తన ఎంపికే చాలా కీలకం. సాగు ప్రారంభం నుంచే వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. యాసంగి సాగుపై చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ చేసిన సూచనలు.. సీలు, ధ్రువీకరణ తప్పనిసరి.. బోరుబావులు, నీటి సౌకర్యమున్న రైతులు ప్రస్తు తం రబీలో వరి నార్లు పోసుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరిగా సీలు, సంబంధిత అధికారుల ధ్రువీకరణ లేని విత్తన బస్తాలు కొనవద్దు. ఎలాంటి ధ్రువీకరణ లేని విత్తన బస్తాలు అమ్మితే దుకాణాదారులపై వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేదంటే సమాచారమైనా ఇవ్వాలి. అనుమతులు లేని విక్రయదారుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయవద్దు. విక్రయదారుని మాటలకు మోసపోవద్దు. విత్తనాలను ఎంచుకునే సమయంలో అవి మన ప్రాంతానికి అనువైనవా.. లేదా తెలుసుకోవాలి. చీడ, పీడలను తట్టుకునే విత్తనాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వారి సూచన మేరకు సాగు ప్రక్రియ చేపడితే మంచి ఫలితాలుంటాయి. విత్తనశుద్ధి తప్పనిసరి విత్తనాలను 5శాతం ఉప్పు ద్రావణంలో వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉంచితే తాలు గింజలు నీటిపై తేలుతాయి. నీటిపై తేలి ఉన్న వాటిని తీసివేసి మునిగి ఉన్న మంచి విత్తనాలను రెండు, మూడుసార్లు మంచి నీటిలో కడిగి నీడలో ఆరబెట్టాలి. విత్తనాలు బాగా మొలకెత్తే శక్తిని కలిగి ఉండాలి. అంటే 80 వరకు గింజలు మొలకెత్తాలి. విత్తనశుద్ధికి తగు మోతాదులో మాత్రమే మందు విని యోగించాలి. మందు మోతాదు పెరిగితే మొలక శాతం దెబ్బతింటుంది. మరీ తక్కువైనప్పుడు మందు అసలు పని చేయదు. విత్తనాన్ని 8–10 శాతం ఆరనిచ్చి విత్తనశుద్ధి చేయాలి. ఎక్కువ పదును ఉంటే మందులు విత్తనాన్ని పాడు చేస్తాయి. విత్తనశుద్ధి చేసేటప్పుడు విత్తనం పైపొర దెబ్బ తినకుండా జా గ్రత్త వహించాలి. రసాయనాలు కలిపిన విత్తనాల ను జాగ్రత్తగా భద్రపరచాలి. నారు పోసుకునే ముందు మడులను బాగా కలియదున్ని గత పంటల వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. నీటి వసతి ఉంటేనే రబీలో వరి సాగు చేయడం మంచిది. లేదంటే ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం ఉత్తమం. -
బల్దియా ఎన్నికలకు కసరత్తు
చెన్నూర్: రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చే సింది. దీంతో అధికారులు ఎన్నికల సామగ్రి సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని సిద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. యంత్రాంగం సన్నద్ధం చెన్నూర్ మున్సిపాలిటీకి 2019 జనాభా ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 2026 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పెరిగిన కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. 2019లో చెన్నూర్ మున్సిపాలిటీ జనాభా 23,579 ఉండగా 17,601 మంది ఓటర్లున్నారు. ఓటరు జాబితా ప్రకారం మున్సిపాలిటీని 18 వార్డులుగా విభజించి ఎన్నికలు నిర్వహించారు. గత పాలకవర్గ పదవీ కాలం 2024 జనవరిలో ముగిసింది. పాత పాలకవర్గం పదవీ కాలం ముగిసి ఏడాది కావడంతో 2026లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ఎస్పీఎం కాంట్రాక్టు కార్మికుడు మృతి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణం కాపువాడలోని శ్రీపంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్పీఎం కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడకు చెందిన షేక్బాబా(50)కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సలీం ఉన్నారు. కుమార్తెలకు వివాహం కావడంతో కుమారుడితో కలిసి కాగజ్నగర్ పట్టణం కాపువాడలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. రెండేళ్లుగా ఎస్పీఎం కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా శ్రీపంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో వెనుక వైపు నుంచి షేక్ అక్బర్ బైక్తో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. షేక్ బాబాకు తీవ్రగాయాలై రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందాడు. షేక్ అక్బర్కు సైతం తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలాన్ని పట్టణ ఎస్సై సుధాకర్ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అభివృద్ధికి కృషి చేస్తాం
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామమైన పెగడపల్లిని అభివృద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి తెలిపారు. ఆదివారం స్థాని క సర్పంచ్ రామగిరి రాముతో పాటు గ్రామపెద్దల నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎస్టీపీపీలో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు శివాలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, ఆర్వో ప్లాంట్ మరమ్మతులు, చెరువు కట్టపై ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద బస్టాప్, శ్మశానవాటిక వద్ద నీటి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. డీజీఎం సివిల్ అజాజుల్లాఖాన్, స్థానిక నాయకులున్నారు. -
మిల్లర్లో పడి తెగిన కూలీ చేయి
జన్నారం: ఇంటి స్లాబ్ నిర్మాణ పనికి వెళ్లిన ఓ కూలీ చేయి ప్రమాదవశాత్తు మిల్లర్లో పడి తెగిన ఘటన మండలంలోని కామన్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామన్పల్లి గొండుగూడకు చెందిన కు మరం మహేశ్ ఆదివా రం గ్రామంలో ఇంటి స్లాబ్ వేయడానికి మేసీ్త్ర కింద కూలీ పనికి వెళ్లా డు. కంకర, ఇసుక వేసే క్రమంలో ప్రమాదవశాత్తు అతడి చేయి మిల్లర్లో పడి మణికట్టు వరకు తెగిపోయింది. వెంటనే 108కు సమాచా రం ఇవ్వడంతో ఈఎంటీ రమేశ్, పైలట్ రఫీక్ అక్కడికి చేరుకుని మహేశ్కు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్స్లో లక్సెట్టిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
భీమిని ఠాణా తనిఖీ
భీమిని: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. వర్టికల్ వారీగా సిబ్బంది పనితీ రు తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మ ర్యాదగా వ్యవహరిస్తూ కేసులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. పోలీస్స్టేషన్ పరిధి లోని ప్రతీ గ్రామాన్ని సందర్శించాలని, గ్రామాల్లోని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి ముందస్తు సమాచారం సేకరించి నేరాలు జరగకుండా చూడాలని తెలిపారు. ‘100 డయల్’కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. తాండూర్ సీఐ దేవయ్య, సిబ్బంది ఉన్నారు. -
‘స్వర్ణ’లో బాలుడి గల్లంతు?
సారంగపూర్: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గెడెం కార్తీక్(16) శుక్రవారం నుంచి కనిపించడం లేదు. ఆచూకీ కోసం పోలీసులు స్వర్ణ ప్రాజెక్టులో గజ ఈతగాళ్లు శనివారం తెల్లవారుజాము నుంచి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కార్తీక్ స్వర్ణ గ్రామంలోని ఓవ్యక్తి వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా పనికి వెళ్లడం లేదు. శుక్రవారం మిత్రులతో కలిసి స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్వాటర్ వైపు నిర్మల్–మహారాష్ట్ర ప్రధాన రహదారిపై గల వంతెన సమీపంలో తిరిగాడు. రాత్రి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం గాలించినా దొరకకపోవడంతో తండ్రి గెడెం అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడితో కలిసి తిరిగిన మిత్రులను విచారణ చేశారు. కార్తీక్ స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్వాటర్లో పడిపోయాడని తెలుపడంతో స్థానిక మత్స్యకారుల సహకారంతో ప్రాజెక్టులో గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యంకాకపోవడంతో సోన్ మండలం గాంధీనగర్కు చెందిన గజ ఈతగాళ్లను రప్పించి చీకటి పడేవరకు గాలింపు చేపట్టారు. అయినా శనివారం ఆచూకీ లభించలేదు. -
అనుమతి లేకుండా హాస్టల్ బయటకు విద్యార్థులు
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని బీసీ సమీకృత హాస్టల్ నుంచి అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్లి రెండుగంటల తర్వాత తిరిగి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతిగృహంలో చదివే ఎనిమిదిమంది విద్యార్థులు శుక్రవా రం రాత్రి 8గంటల సమయంలో సినిమా చూసేందుకు వాచ్మెన్కు చెప్పకుండా గోడదూకి వెళ్లిపోయారు. విద్యార్థులు కనబడకుండా పోయిన విషయాన్ని డ్యూటీ వాచ్మెన్ వార్డెన్కు సమాచారం అందించగా అతిడిని వెంటనే అలర్ట్ చేసి ఎక్కడున్నారో తెలుసుకోవాలంటూ పురామయించారు. విద్యార్థుల కోసం వెతుకుతున్న క్రమంలోనే సిని మా థియేటర్కు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరికి తెలిసిన వ్యక్తి కనిపించగా అతడు వెంటనే దాదాపు 9గంటల ప్రాంతంలో తిరిగి హాస్టల్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు అధికా రులకు ఫిర్యాదు చేయటంతో శనివారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి హాస్టల్లో తల్లిదండ్రుల సమక్షంలో విచారణ చేపట్టగా తామే అనుమతి లేకుండా గోడదూకి బయటకు వెళ్లినట్లు విద్యార్థులు అంగీకరించారు. ఖాళీలతో పర్యవేక్షణ ఎలా? స్థానిక బీసీ సమీకృత వసతిగృహంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన 185 మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతిగృహ పర్యవేక్షణకు ముగ్గు రు వార్డెన్లు, ముగ్గురు వాచ్మెన్లు, ఆరుగురు ఉద్యోగులు (వంట మనుషులు) పనిచేయాల్సి ఉండగా.. ఒక్కరే రెగ్యులర్ ఎస్టీ వంట ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో వసతిగృహ పర్యవేక్షకుడు (బీసీ వార్డెన్) ఇటీవలే విద్యార్థులకు చాలీచాలని భోజనం పెట్టడం.. అధికారుల విచారణలో నిర్ధారణ కావటంతో సరరెండర్ చేశారు. ఎస్టీ వార్డెన్ను జ న్నారానికి డిప్యుటేషన్ ఇచ్చారు. దీంతో ఎస్సీ వార్డెన్ మాత్రమే అన్నీ తానై నెట్టుకొస్తున్నారు. ముగ్గురు వాచ్మెన్లలో ఎస్టీ వాచ్మెన్ను సిర్పూర్ ఎస్టీ హాస్టల్కు వార్డెన్గా డిప్యుటేషన్ చేశారు. హాస్టల్ పర్యవేక్షణపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితం కావటంతో సిర్పూర్కు డిప్యుటేషన్పై వెళ్లిన ఎస్టీ వాచ్మెన్ను తిరిగి బీసీ సమీకృత వసతిగృహానికి కేటాయించారు. ఇంతలోనే విద్యార్థులు బయటకు గోడదూకి పారిపోవటం చర్చనీయాంశంగా మారింది. బీసీ వసతిగృహ వార్డెన్తో పాటు డిప్యుటేషన్పై వెళ్లిన ఎస్టీ వార్డెన్ను వెంటనే తిరిగి వసతిగృహానికి కేటాయిస్తే పర్యవేక్షణ మెరుగుకానుంది. పూర్తిస్థాయి వార్డెన్లను నియమించాలి సాయికుంట బీసీ సమీకృత హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్లు, వాచెమన్ పోస్టులతో పాటు వంట ఉద్యోగుల పోస్టుల భర్తీ చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి భాగ్యవతికి వినతిపత్రం అందజేశారు. వసతిగృహంలో వార్డెన్లు, సిబ్బంది కొరతతో పర్యవేక్షణ కొరవడుతోందని తెలిపారు. జన్నారానికి డిప్యుటేషన్పై వెళ్లిన రెగ్యులర్ ఎస్టీ వార్డెన్ను తిరిగి ఇదే హాస్టల్కు కేటాయించాలని కోరారు. పూర్తిస్థాయిలో వార్డెన్లు, వాచ్మెన్, వంట కార్మికులను వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి సన్నీగౌడ్, యూఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
వార్షిక లక్ష్యం సాధించాలి
జైపూర్: ఐకే–ఓసీపీలో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత 15లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను తప్పనిసరిగా సాఽధించాలని సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు సూ చించారు. జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీ ప్రాజెక్టును శనివారం డైరెక్టర్ వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు అధికారులు ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకెళ్లాలని తెలిపారు. ఉపరితల గనులకు కావాల్సిన యంత్రాలు, సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. వరాహా వోబీ కాంట్రాక్టు కంపెనీ ప్రతినెలా వోబీ 20.185లక్షల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. ఇందుకు కావాల్సిన అన్నింటినీ సమకూర్చుకుని రక్షణ నియమాలను పాటిస్తూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను రక్షణతో సాధించాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందుకువెళ్లాలని తెలిపారు. ఇందుకు ప్రతీ ఉ ద్యోగి కృషి చేయాలని సూచించారు. ఐకే–ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, గని మేనేజర్లు నా గన్న, శంకర్, రక్షణాధికారి లక్కకుల మహేశ్, వరా హా కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. లక్ష సాధనకు కృషి చేయాలి -
కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా
మంచిర్యాలఅగ్రికల్చర్: పెండింగ్లో ఉన్న లెప్రసీ, ఎండీఏ డబ్బులు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ వ ర్కర్ల సీఐటీయూ అనుబంధ యూనియన్ ఆ ధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్కు వి నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల నాయకురాలు సమ్మక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.18 వేల వేతనం, రూ.50 లక్షల ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులకు రూ.50 వేలు చెల్లిస్తామని, ఏఎన్సీ, పీఎన్సీ లక్ష్యాలను రద్దు చేస్తామని హామీలు ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పారితోషికం పేరి ట తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ శ్రమదోపిడీకి గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంజేశా రు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేశారు. ఆశ వర్కర్లు విజయలక్ష్మి, నా గుబాయ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ యూరియా పాట్లు
వానాకాలం పంటలకు అవసరమైన యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొరత కారణంగా అదనుకు పంటలకు యూరియా వేయలేకపోయారు. దీంతో దిగుడిపై ప్రభావం చూపింది. తాజాగా యాసంగిలో మొక్కజొన్న సాగుచేసిన రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. పంటలకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా(కె) గ్రామంలో రైతులు శనివారం నిరసన తెలిపారు. గ్రామానికి 450 యూరియా బస్తాలు రాగా, రెట్టింపు సంఖ్యలో రైతులు పంపిణీ కేంద్రానికి వచ్చారు. చెప్పులను వరుసలో ఉంచి గంటల తరబడి నిరీక్షించారు. ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున 225 మంది రైతులకు మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. ఓటీపీ విధానం ద్వారా కాకుండా వేలిముద్ర విధానం ద్వారా ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థులు, రైతులు పట్టణాల్లో ఉండడంతో కౌలు రైతులకు సైతం యూరియా దొరకక ఇబ్బందులు ఎదురయ్యాయి. డిమాండ్కు తగినట్లుగా సరఫరా చేయాలని రైతులు అధికారులను కోరారు. – కుంటాల -
అవుట్ సోర్సింగ్ లేబర్ యూనియన్ కమిటీ ఎన్నిక
శ్రీరాంపూర్: సింగరేణి కోల్మైన్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) శ్రీరాంపూర్ ఏరియా కమిటీ సమావేశం జరిగింది. శనివారం రసూల్పల్లెలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బీ జనక్ప్రసాద్ నివాసంలో, ఆయన ఆధ్వర్యంలో ఏరియా కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏరియా అధ్యక్షుడిగా సిరిపురం రాజేశ్, ఉపాధ్యక్షులుగా ఆడెపు అశోక్, ఓదెలు, ప్రధాన కార్యదర్శిగా ఆవుల రమేశ్, సంయుక్త కార్యదర్శులుగా రాజేశ్, భాస్కర్, సహాయ కార్యదర్శులుగా రవి, రజనికుమార్, ప్రధాన ప్రచార కార్యదర్శిగా రాందేని శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా నరేశ్, అశోక్, తిరుపతి, సురేశ్, సందీప్, అశోక్, కోటేశ్, కోశాధికారిగా పున్నం కుమారస్వామిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న వారికి జనక్ ప్రసాద్ నియామక పత్రాలను అందించి యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. యూనియన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు, కలవేని శ్యాం, గరిగే స్వామి, తిరుపతిరాజు, నాయకులు చిన్నయ్య, జీవన్జోయల్, జగన్స్వామి, అవుట్ సోర్సింగ్ లేబర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీంరవి పాల్గొన్నారు. -
స్కానింగ్ వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల్లో సాంకేతిక వైద్యనిపుణులు, సిబ్బంది, స్కా నింగ్ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్, డీఎంహెచ్వో అనిత సూచించారు. జి ల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం లింగ నిర్ధారణ పరీక్షలు, పీసీపీ యాంటీ యాక్టివ్ తది తర అంశాలపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మా ట్లాడుతూ.. జిల్లాలో పీసీపీ ఎన్డీటీ యాక్ట్ ప్రకారం 53 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇందులో నాలుగు ప్రభుత్వపరంగా, 49 ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలు, సీ్త్ర వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు, సూపర్ స్పెషలిస్టుల ద్వారా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ స్కానింగ్ కేంద్రంలో స్కానింగ్ పరికరం, వైద్యుల వివరాలు నమోదై ఉండాలని, ప్రతీ కేంద్రంలో లింగ నిర్ధారణపై తీసుకుంటున్న చ ర్యల వివరాలపై ఫ్లెక్సీ, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ‘లింగ నిర్ధారణ చేయబ డదు, చెప్పబడదు’, ‘అడిగిన వారిపై, చెప్పిన వారి పై యాక్ట్ ప్రకారం చర్యలు చేపట్టబడును’ అనే వివరాలు ప్రదర్శించాలని తెలిపారు. స్కానింగ్ కేంద్రాల్లో గర్భిణులకు కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, వైద్యుల వివరాలు, ఫీజు వివరాలు గోడపై అతికించాలని సూచించారు. గర్భిణుల స్కా నింగ్ పూర్తి వివరాలను ఫార్మ్ ఆఫ్లో నమోదు చే యాలని, స్కానింగ్ చేసుకుంటున్న గర్భిణి సంత కం తీసుకోవాలని, జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణులకు స్కానింగ్ చేసిన వివరాలు డీ ఎంహెచ్వో కార్యాలయానికి అందించాలని సూచించారు. పోస్టర్లు, కరపత్రాలు, మీడియా ద్వారా వి స్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, జిల్లా పౌరసంబంధాల అధికారి కృష్ణమూర్తి, హీల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఎన్జీవో డాక్టర్ చుంచు రాజ్కిరణ్, గైనకాలజిస్ట్ నలుమాసు శ్రీదేవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, ఫిజీషియన్లు, డీపీవో ప్రశాంతి, సీహెచ్వో వెంకటేశ్వర్లు, దిశ సమన్వయకర్త రమేశ్, సుమన్, సీనియర్ అసిస్టెంట్ హారిక, డీపీహెచ్ఎన్ పద్మ, వసుమతి మార్తా, డెమో బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
వర్షాలే దెబ్బతీసినయ్
ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో రెండున్నర ఎకరాల పత్తి చేనులో ఇసుక మేటలు వేసినయ్. వ్యవసాయాధికారులు వచ్చి రాసుకపోయిండ్రు. పంటల బీమా లేదు. ప్రభుత్వ సాయం అందలేదు. పెట్టుబడి కూడా రాలేదు. మొత్తానికి వర్షాలే మమ్మల్ని దెబ్బ తీసినయ్. – అరుణ్సింగ్, నెన్నెల పెట్టుబడి పైసలూ రాలే నేను ఎనిమిదెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో వరి సాగు చేసిన. ప త్తి ఎకరానికి 10 క్వింటాళ్ల పైన దిగుబడి రావాల్సి ఉండగా ఐదు నుంచి ఆరు క్వింటాళ్లకు మించలే. ఎకరాకు 60 బస్తాల వడ్లు రావాల్సి ఉండగా 30 నుంచి 35 బస్తాలు దాటలే. కౌలు పైసలు, పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు. – తని శంకర్, కుందారం, జైపూర్ మండలం -
డైరెక్టర్కు టీబీజీకేఎస్ వినతి
శ్రీరాంపూర్: సింగరేణి డైరెక్టర్(పా) గౌతం పొట్రుకు టీబీజీకేఎస్ నేతలు వినతిప్రతం అందజేశారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి డైరెక్టర్ను కలిసి మెడికల్ బోర్డు తీరును ప్రశ్నించారు. నవంబర్లో జరిగిన మెడికల్ బోర్డులో అర్హులైన కార్మికులను మెడికల్ అన్ఫిట్ చేయకుండా ఫిట్ ఇవ్వడాన్ని ఆయన దృిష్టికి తీసుకెళ్లారు. బోర్డు తీరుపై నిరసన తెలిపారు. జబ్బు పడి, క్యాన్సర్తో బాధపడుతూ, గుండెకు స్టంట్ వేసుకుని కూడా మెడికల్ అన్ఫిట్ కాని 13 మంది కార్మికులను వెంట తీసుకునివెళ్లి డైరెక్టర్కు వారి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. జబ్బుతో ఉన్న వారిని కూడా ఫిట్ చేసి అన్యాయం చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్రావు తెలిపారు. వీరందరినీ తిరిగి మెడికల్ బోర్డుకు పిలిచి అన్ఫిట్ చేయాలని కోరారు. వారి వెంట యూనియన్ నేతలున్నారు. -
అయ్యప్ప సన్నిధిలో మంత్రి ‘అడ్లూరి’
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీఅభినవ శబరి మలై అయ్యప్ప ఆలయంలో శనివారం మహా మండల పడిపూజను వైభవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్కుమార్, తన కుమారుడు హరీశ్వర్తో హాజరయ్యారు. వారు అయ్యప్ప దీక్షతో, పడిపూజ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ వ్యవస్థాపక గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు స్వాగతం పలికారు. అనంతరం పడిపూజలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో గల పదునెట్టాంబడిపై పూజలు చేశారు. నిత్యం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి పడిపూజ పూర్తయ్యేదాకా అయ్యప్ప సన్నిధిలో గడిపారు. పూజ, భజన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అనంతరం ఆల యం వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల భిక్ష స్వీకరించారు. పడిపూజకు జిల్లాతో పాటు జగిత్యా ల, కరీంనగర్ జిల్లాల నుంచి అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. -
అటవీ ప్రాంతంలో వ్యర్థాలను ఏరివేయాలి
శ్రీరాంపూర్: సింగరేణి అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ఏరివేయాలని సింగరేణి ఫారెస్ట్ అడ్వైజర్ పరిగెన్ సూచించారు. శనివారం ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని ఓబీ డంప్యార్డు ప్రాంతాన్ని, చుట్టూ ఉన్న సింగరేణి ఫారెస్ట్ భూములను పరిశీలించారు. ఇటీవల ఈ ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతాలను సందర్శించారు. వన్యప్రాణులకు కావాల్సిన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇందుకోసం కంపెనీ తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను ఆయన అధికారులకు సూచించారు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, మంచిర్యాల ఎఫ్డీవో సర్వేశ్వర్ ఆయన వెంట ఉన్నారు. పులి కదలికలపై సింగరేణి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని, దానికి ఎలాంటి హాని కలగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని జీఎం వారికి వివరించారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, డీజీఎం (ఫారెస్ట్) హరినారాయణ, సర్వే అధికారి సంపత్, ఫారెస్ట్ అధికారి రత్నాకర్ పాల్గొన్నారు. -
ఆదర్శం.. జైపూర్ కేజీబీవీ
జైపూర్: గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు కస్తూర్భాగాంధీ విద్యాలయాలు (కేజీబీవీ) వరంగా మారా యి. నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్యతో పా టు వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం స్థాపించిన కేజీబీవీలు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా విద్యనందిస్తున్నాయి. దీంతో విద్యార్థినులు ఉత్తమ ఫలి తాలు సాధిస్తున్నారు. 2014లో ప్రారంభమైన కేజీ బీవీల్లో ప్రారంభ దశ నుంచే విద్యార్థినులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నారు. చక్కటి వాతావరణంలో ఒకేచో ట తరగతి గదులు, వసతి కల్పించడంతో విద్యార్థి నులు కేజీబీవీల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నా రు. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరిగిపోయింది. ని ర్ణీత సీట్లకు మించి కొన్ని తరగతుల్లో ప్రవేశాలుండ డం ఇందుకు నిదర్శనం. జైపూర్ మండల కేంద్రంలో ఎడ్యుకేషన్ కారిడార్గా మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఒకేచోట గురుకులం, దానికి ముందుగా ప్రభుత్వ కళాశాల, దాని పక్కనే కస్తూర్భాగాంధీ విద్యాలయం ఏర్పా టు చేశారు. దీనికి తోటు ఇప్పుడున్న భవనం ముందు తరగతి గదుల కోసం రూ.2.30కోట్లతో కొత్త భ వనం నిర్మించగా వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో జైపూర్ కస్తూర్భాగాంధీ విద్యాలయంలో ప్రవేశాలకు మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు 398మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలతో మెనూ ప్రకారం విద్యార్థినులకు ఉదయం టిఫిన్, నాణ్య మైన మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, మళ్లీ రాత్రికి భోజనం అందిస్తున్నారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు జైపూర్ కేజీబీవీలో ఇంటర్, టెన్త్లో విద్యార్థినులు మూడేళ్లుగా వరుసగా వందశాతం ఫలితాలు సా ధి స్తూ శభాష్ అనిపించకుంటున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థినులకు సులభతరంగా, అర్థయ్యేలా వి ద్యాబోధన చేస్తున్నారు. వారిలో నైపుణ్యాన్ని వెలికితీసేలా చక్కటి బోధనతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గడిచిన విద్యాసంవత్సరంలో టెన్త్లో 529 మార్కులతో కేజీబీవీ విద్యార్థిని మండల టాపర్గా నిలిచింది. ఎంపీసీ ఫస్టియర్లో ఇద్దరు విద్యార్థినులు 470మార్కులకు 462మార్కులు సాధించారు. మరో విద్యార్థిని బైపీసీలో 440మార్కులకు 426 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 1000మార్కులకు 962మార్కులు సాధించగా బైపీసీలో 1000మార్కులకు 962మార్కులు సాధించి జిల్లాలోనే జైపూర్ కస్తూర్బా విద్యాలయా నికి మంచి గుర్తింపు తీసుకువచ్చారు. -
గిన్నీస్ ప్రపంచ రికార్డు నృత్య ప్రదర్శనలో మనోళ్లు
బెల్లంపల్లి: హైదరాబాద్ గచ్చిబౌళి స్టేడియంలో శనివారం నిర్వహించిన కూచిపూడి కళావైభ వం గిన్నీస్ ప్రపంచ రికార్డు నృత్య ప్రదర్శనలో బెల్లంపల్లికి చెందిన కూచిపూడి గురువు ఎడ్ల వనిత శిష్యులు పాల్గొన్నారు. వనిత ప్రస్తుతం హైదరాబాద్లో కూచిపూడి నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఆమె వద్ద శిష్యరికం చేసిన 60 మంది బాలికలు కూచిపూడి నృత్యం చేసి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీరిలో కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన సహ స్ర, శ్రీమహనీ ఉన్నారు. ఈ గిన్నీస్ ప్రపంచ రికార్డు కార్యక్రమంలో 7,209 మంది కూచిపూ డి నృత్య కళాకారులు పాల్గొన్నారు. -
పదేళ్లు రేవంతే సీఎం
● మంత్రి జూపల్లి కృష్ణారావు ఖానాపూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి, తెలంగాణలో కె.చంద్రశేఖర్రావు రెండు దఫాలుగా సీఎంగా పనిచేశారని, ఈసారి రేవంత్రెడ్డి సైతం పదేళ్లు సీఎంగా కొనసాగుతారని మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఖానాపూర్ నియోజకవర్గ సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను సన్మానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో 20 మంది సీఎంలు 65 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని గుర్తు చేశారు. కేసీఆర్ గతంలో ఏ ప్రభుత్వం చేయనన్ని అప్పులు చేశాడని పేర్కొన్నారు. రూ.8 లక్షల కోట్లు అప్పు చేసినా గ్రామాల్లో పేదలకు ఇళ్లు కట్టించలేదని విమర్శించారు. ఏడాదికి రూ.75 వేల కోట్లు వడ్డీరూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తు, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. -
పక్కా ఇళ్లు.. పలకాబలపం
ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆదివాసీ గూడాల్లో పక్కా ఇళ్లు నిర్మిస్తామని, పలక, బలపం అందించి సకల సౌకర్యాలు కల్పిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గూడేన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎస్పీ అఖిల్ మహాజన్, మాజీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి సందర్శించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. యువకులకు వాలీబాల్ కిట్లు అందించారు. ఆధునిక ప్రపంచంతో మమేకం.. ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చే యాలని నిర్ణయించినట్లు తెలిపారు. మినీ కాశ్మీర్గా పిలువబడే ఆదిలాబాద్కు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నా, అడవి బిడ్డలకు బయటి ప్రపంచం తెలియకపోవడం బాధాకరమన్నారు. కుమ్మరి కుంట గూడెం వాసులను ప్రత్యేక బస్సుల్లో హైదరా బాద్కు తీసుకెళ్తామన్నారు. నగరంలో చారిత్రక కట్టడాలు, వారసత్వ స్థలాలు, ఆకాశహర్ామ్యలు, మెట్రో రైళ్లు, నగర జీవనశైలిని చూపిస్తామని తెలి పారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలు చూసే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అడవికి ప రిమితం కాకుండా బయటి ప్రపంచాన్ని అనుభవించాలని సూచించారు. రవాణా, భోజన, వసతి ఖ ర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. జీవన ప్రమాణాల మెరుగుదలకు.. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఆది వాసీ గూడేల్లో ఇప్పటికీ దుర్భర పరిస్థితులు ఉండ డం బాధాకరమన్నారు. దుప్పట్లు, క్రీడా సామగ్రికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. పిల్లలను బడులకు పంపి గొప్పగా చదివించాలని, తల్లిదండ్రులు కనీసం సంతకం నేర్చుకోవాలని సూ చించారు. అక్షరాస్యత సాధించి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కుమురంభీం, రాంజీ గోండు వంటి మహానుభావులకు నిజమైన నివాళి అన్నా రు. చదువుకోవడానికి పలక, బలపం, ఇతర సౌకర్యాలు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక సౌకర్యాలు, అభివృద్ధి హామీలు కూడు, గూడు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అర్హ కుటుంబాలకు పక్కా ఇళ్లు ని ర్మిస్తామని, ఏజెన్సీ గూడేల్లో ఇళ్లు, రోడ్లు, విద్యుత్, వసతి సౌకర్యాల సమస్యలను ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. జ్ఞానంతో ప్రాంత అభివృద్ధి సాధించాలనిఆకాంక్షించారు. ప్రముఖులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
252 జీవోను సవరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జర్నలిస్టుల హక్కులను కాలరాసే జీవో 252ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శనివారం ఆందోళన చేపట్టి అనంతరం కలెక్టర్ కుమార్దీపక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 23వేల అక్రిడిటేషన్ కార్డులివ్వగా, కొత్త జీవోతో 10వేలకు పైగా కా ర్డులకు కోత పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని.. ఇప్పుడు దానిని రద్దు చేసి, స్టేట్, జిల్లా, మండలస్థాయిలో మాత్రమే కార్డులివ్వాలని నిర్ణయించడం దారుణమని పేర్కొన్నారు. గతంలో డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులివ్వగా, ప్రస్తుత జీవోలో మీడియా కార్డులు జారీ చేస్తామనడం అన్యాయమని తెలిపారు. వెంటనే 252 జీవో ను సవరించి గతంలోలాగే అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు రమేశ్, శ్రీనివాస్, సిద్ధార్థ, కుమార్, అంబిలపు శ్రీనివాస్, రాజుపటేల్, అరుణ్కుమార్, ఎం.వెంకటస్వామి, ఓదెలు, పార్వతి సురేశ్, అరుణ్కుమార్, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్టీయూసీ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ను హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణి కార్మికులకు దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో భాగంగా వీటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత యూనియన్, ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అలవెన్స్లపై ఆదాయ పన్నును కంపెనీనే చెల్లించాలని, మారుపేర్ల సమస్యను తక్షణమే ప రి ష్కరించాలని కోరారు. ప్రతీనెల మెడికల్ బోర్డు ని ర్వహించి 95శాతం కేసులను అన్ఫిట్ చేయాలని వి జ్ఞప్తి చేశారు. ఆగస్టులో జరిగిన మెడికల్ బోర్డులో జ రిగిన లోపాలను సరిచేయాలని, అర్హులకు న్యా యం చేయాలని కోరారు. రీజియన్ల వారీగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశా రు. కొత్త గనులను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఇతర ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని డివిజన్ల ఉపాధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు శంకర్రావు, నాయకుడు కలవేన శ్యామ్ పాల్గొన్నారు. -
టీ–20 విజేత ఆదిలాబాద్
మంచిర్యాలటౌన్: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ–20 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను శనివారం నిర్వహించారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జట్లు ఫైనల్కు చేరగా టాస్ గెలిచిన ఆదిలాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మంచిర్యాల జిల్లా జట్టు 13.2 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి 70 పరుగుల తేడాతో ఓటమి పాలైందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జట్టు నుంచి రాజబాబు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. విజేత, రన్నర్స్కి మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్, గుడిపేట్ బెటాలియన్ కమాండెంట్ కాళిదాసు బహుమతులు అందించారు. దాడి చేసిన ఇద్దరిపై కేసుదహెగాం: మండలంలోని చౌక గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రగిరి లక్ష్మి, ఆమె భర్త రమేశ్పై శనివారం అదే గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు చంద్రగిరి శంకర్, శ్రావణ్ పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని రాడ్తో దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మెరకు కేసు నమోదుచేసిదర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు ప్రారంభం
మందమర్రిరూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మైదానంలో రాష్ట్రస్థాయి బాలికల అండర్–19 సాఫ్ట్బాల్ పోటీలు, రాష్ట్ర స్థాయి టీం మెంబర్స్ సెలక్షన్స్ శనివారం ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈవో అంజయ్యతో హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల క్రీడలపై ఎక్కువ శ్రద్ధ పెట్టిందని తెలిపారు. క్రీడల్లో సత్తాచాటిన విద్యార్థులకు భవిష్యత్లో ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. పోటీలకు సుమారు 160 మంది క్రీడాకారులు, 20మంది కోచ్లు హాజరయ్యారు. నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్, ఆదిలాబాద్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. అబ్జర్వర్ గంగాధర్, మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ పెద్దన్న, రజిని, మంచిర్యాల జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మంచిర్యాలలో చోరీ
● నాలుగు తులాల బంగారం, 10 తులాల వెండి అపహరణ మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని వికాస్నగర్లో ఈ నెల 23న రాత్రి చోరీ జరిగినట్లు సీఐ ప్రమోద్రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న వికాస్నగర్లో ని వాసముంటున్న రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇ ల్లందుల సమ్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. 25న ఉదయం ఇంటికి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో దాచి న నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మహిళను దూషించిన కేసులో ఒకరి రిమాండ్ కౌటాల: మహిళను అసభ్య పదజాలంతో దూషించడం, ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా లాగిన కేసులో కౌటాల మండలం తలోడి గ్రామానికి సిద్దల బాపుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై డి.చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన డోకె శకుంతల 18 ఏళ్ల క్రితం డబ్బా బుచ్చయ్య వద్ద నుంచి నాగేపల్లి శివారులో 30 గుంటల భూమిని కొనుగోలు చేసిందన్నారు. బుచ్చయ్య మృతి చెందడంతో ఇటీవల ఆయన భార్య లింగక్క, కోడలు డబ్బా పోశక్క భూమి తమదే అంటూ శంకుంతల భూమిలోకి అక్రమంగా ప్రవేశించి రూ.15 వేల విలువైన వరి పంటను కోసి దొంగలించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో సిద్దల బాపు డబ్బా బుచ్చయ్య కుటుంబీకులకు రెచ్చగొట్టడంతో పాటు శకుంతలను అసభ్య పదజాలంతో దూషించినట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్సై తెలిపారు. ఈ నెల 23న బాధితురాలు ఫిర్యాదు మేరకు సిద్దల బాపు, డబ్బా పోశక్క, డబ్బా లింగక్కపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాపును అరెస్ట్ చేసి సిర్పూర్ కోర్టులో హాజరుపర్చామన్నారు. న్యాయమూర్తి అజయ్కుమార్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా, ఆసిఫాబాద్ జైలుకు తరలించామన్నారు. డబ్బా పోశక్క, లింగక్కను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్సై తెలిపారు. -
యూజీ అలవెన్స్ రికవరీ నిలిపివేయాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిలో కొందరు కార్మికులకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ రికవరీ చేయడం నిలిపివేయాలని సీఐ టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ బ్రాంచ్ నాయకుడు కస్తూరి చంద్రశేఖ ర్ ఆధ్వర్యంలో శుక్రవారం గని షిఫ్ట్ ఇన్చార్జి, డిప్యూటీ మేనేజర్ సాత్విక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. గతంలో గని అవసరాల దృష్ట్యా అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న ఉద్యోగులను సర్ఫేస్లో పనులు చేయించారని తెలిపారు. నాడు కంపెనీ అవసరాల కోసం వారిని తీసుకున్నందున అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించినట్లు చెప్పారు. చాలా నెలలు గడిచినా తరువాత నేడు నాటి చెల్లించిన అండర్ గ్రౌండ్ అలవెన్స్ తిరిగి రికవరీ చేయడానికి యాజమాన్యం లెట ర్లు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీ అవసరాల కోసం కార్మికులతో పనిచేయించుకున్నాక వారి అవసరం తీరడంతో ఇచ్చిన అండర్ గ్రౌండ్ అలవెన్స్ తిరిగి వసూలు చేయడం సరికాద ని తెలిపారు. గుర్తింపు సంఘం వైఫల్యంతోనే అధి కారులు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ పిట్ సెక్రటరీ అరిగే సందీప్, నాయకులు శ్రీకాంత్, రాజయ్య, రమేశ్, ప్రతాప్, లింగమూర్తి, రవి పాల్గొన్నారు. -
ఎస్టీపీపీ ఏరియా లైజన్ ఆఫీసర్గా దేవేందర్సింగ్
జైపూర్: ఎస్టీపీపీ ఏరియా ఎస్టీ లైజన్ ఆఫీసర్గా డీ దేవేందర్సింగ్ (ఈఈ)ని నియమిస్తూ కార్పొరేట్ జీఎం (పర్సనల్) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏరియా ఈడీ సీహెచ్ చిరంజీవి నియామక పత్రాన్ని దేవేందర్సింగ్కు అందజేశారు. దేవేందర్సింగ్ మాట్లాడుతూ.. సింగరేణిలో ఎస్టీ ఉద్యోగులకు న్యా యం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పంతులు, బ్రాంచ్ అధ్యక్షుడు తిరుమల్, ఎస్వోటూ జీఎం వెంకటయ్య, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్సింగ్ తదితరులున్నారు. -
నిషేధిత మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు
ఆదిలాబాద్టౌన్: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వన్టౌన్ సీఐ సునిల్ కుమార్ అన్నారు. పట్టణంలోని వన్టౌన్ పోలీసు స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో చైనా మాంజా విక్రయాలపై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.17,800 విలువ గల 27 చరఖాల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. అశోక్ రోడ్లోని శ్రీలక్ష్మి షాప్లో రూ.15,800 విలువ గల 18 చైనా మాంజా చరఖాలు, బుర్రెవార్ వంశీకృష్ణ నుంచి రూ.1200 విలువ గల 8 చరఖాలు, గుండవేని శ్రీకాంత్ నుంచి రూ.800 విలువ చేసే ఒక చైనా మాంజా చరాఖా స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. చైనా మాంజా పట్టివేతఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: జిల్లా కేంద్రంలోని బజార్ ఏరియాలో పోలీసులు దాడి చేసి అడె పోశెట్టి అనే వ్యక్తి వద్ద రూ.4వేల విలువైన 10 రీల్స్ చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ బుద్దే రవీందర్, ఎస్సై రాజు కందూరు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేంద్ర పాల్గొన్నారు. అలాగే కాగజ్నగర్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలోని ఓ దుకాణంలో నిషేధించిన చైనా మాంజాను అక్రమంగా విక్రయిస్తుండగా అబ్దుల్ వాజీద్ ఖాన్ను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 44 రీల్స్ చైనా మాంజాను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.26,400 ఉంటుందని తెలిపారు. ఈ దాడిలో ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు విజయ్, రమేశ్, శేఖర్ పాల్గొన్నారు. పోలీసు సిబ్బందిని ఎస్పీ నితిక పంత్ అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ చైనా మాంజాతో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పిల్లలకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని, అక్రమంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రైతుల పక్షపాతి పీఎస్సార్
దండేపల్లి: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు రైతుల పక్షపాతి అని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి పేర్కొన్నారు. మండలంలోని గూడెం, గుడిరేవు, ద్వారక గ్రామాలకు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. మేదరిపేట బస్టాండ్ వద్ద శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రేంసాగర్రావు ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి మంచి ర్యాల నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా చూస్తున్నారని పేర్కొన్నా రు. పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అక్క ల వెంకటేశ్వర్లు, కంది సతీశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ముల్లె, మూట సర్దుకుని..
వేమనపల్లి: మెదటి కోడి కూయగానే ఆ ఊళ్లన్నీ నిద్రలేచాయి. ఆయా గ్రామాల గిరిజనులు ఇంటిముందు అలుకు చల్లుకున్నారు. అన్నం, కూర వండుకున్నారు. ముల్లె, మూట సర్దుకున్నారు. గొడ్డు, గోదా, కోడి పిల్లలు పైలం.. అని ఇంటి పెద్దలకు జాగ్రత్తలు చెప్పారు. మరికొందరు తలుపులు లేని గుడిసెలకు తడకలు అడ్డంపెట్టారు. అంతా కలిసి ముల్లె, మూటలతో ఇళ్ల నుంచి బయలుదేరారు. వీరి కోసమే ఇటుక బట్టీల యజమానులు పంపించిన వాహనాల్లో ముల్లె, మూటలతో ఎక్కారు. ఇవీ.. వేమనపల్లి మండలంలోని రాజారం, గొర్లపల్లి, కొత్తకాలనీ, ముల్కలపేట ఎస్టీ కాలనీల్లో శుక్రవారం ఉదయం కనిపించిన దృశ్యాలు.. సుమారు 280 కుటుంబాలు ఊర్లొదిలి వలస వెళ్లారు. పనులు లేని సమయంలో..గ్రామాల్లో పనులు లేని సమయంలో గిరిజన కుటుంబాలు మంచిర్యాల, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీల యజమానుల వద్ద డబ్బులు తెచ్చుకుంటారు. కొందరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సూరారం, మాహదేవ్పూర్ ప్రాంతాలకు పత్తి, మిర్చి ఏరేందుకు వలసవెళ్తారు. సుమారు నాలుగు నెలలు ఇటుక బట్టీలు, మిర్చితోటల్లో ఉండి పనులు చేస్తారు. వలస వెళ్లటంతో ఇప్పటికే రాజారం గ్రామం ఖాళీ అయ్యింది. వృద్ధులు మాత్రమే ఇంటి వద్ద ఉన్నారు. వలసలతో ఆయా గ్రామాలు బోసిపోయాయి. -
పొట్టకూటి కోసం వచ్చి మృత్యు ఒడికి
ఉట్నూర్రూరల్: కుటుంబ పోషణ నిమిత్తం లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఆంధ్రా నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్న లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఉట్నూర్లో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా గణపవరం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ ఆరేటి సత్యనారాయణ(47)బుధవారం పాలకొల్లు గ్రామం నుంచి లారీలో కొబ్బరికాయల లోడ్ వేసుకుని ఆదిలాబాద్కు బయల్దేరాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉట్నూర్కు చేరుకుని లారీని ప్రధాన రదారి పక్కన నిలిపాడు. లోడ్తో ఉన్న లారీ తాడు సరిచేస్తున్నా డు. ఈ క్రమంలో ఒక్కసారి గా కింద పడిపోయా డు. గమనించిన స్థానికులు సత్యానరాయణకు సీపీఆర్ చేసి ఉ ట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించా రు. లారీ నడుపుతున్నపుడు గుండెపోటు వస్తే ప్ర మాదం మరోలా ఉండేదని స్థానికులు పేర్కొన్నా రు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
ఏఐయూ పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థినులు
బాసర: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూ నివర్సిటీస్(ఏఐయూ) జాతీయస్థాయిలో ని ర్వహించే బాస్కెట్ బాల్ పోటీలకు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థినులు ఎంపికయ్యారు. ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులు జాతీయస్థాయికి అర్హత సాధించారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు బెంగళూరులోని క్రిస్ట్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే పోటీల్లో బా సర ట్రిపుల్ ఐటీ విద్యార్థినులు పాల్గొంటారు. జాతీయ పోటీలకు ఎంపికై న 11 మందితో కూడిన క్రీడాకారుల జట్టుకు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ శుక్రవారం స్పోర్ట్స్ యూని ఫాం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, ఎస్.శేఖర్, దిల్ బహార్, కాశన్న, శ్యామ్బాబు, నాగలక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్లు ఇచ్చేదెప్పుడో!
మంచిర్యాలటౌన్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ల బ్ధిదారులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. బీఆర్ఎస్ ప్ర భుత్వంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో డ బుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. లబ్ధిదారులకు అ ప్పగించేందుకు 2023 మార్చి 17న అప్పటి కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ని ర్వహించారు. డ్రాలో ఇళ్లు పొందిన లబ్ధిదారుల కు ఇప్పటివరకు వాటిని అప్పగించకుండా అధి కారులు తాత్సారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 650 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 360 నిర్మాణాలు పూర్తయ్యాయి. డ బుల్బెడ్రూం ఇళ్ల కోసం స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన 30 కుటుంబాలకు గతంలోనే 30 ఇళ్లు మంజూరు చేశారు. మిగతా 330 ఇళ్లు సిద్ధంగా ఉండగా, అందుకు సంబంధించిన అర్హులను ల క్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఇది జరిగి దా దాపు మూడేళ్లవుతున్నా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించక పోవడంతో, ఎప్పుడు ఇస్తారోనని ఏళ్ల తరబడి వారు ఎదురుచూస్తూనే ఉన్నారు. పాడవుతున్నా పంపిణీ చేయరా? డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో జాప్యం జరుగుతుండగా అవి పాడవుతున్నాయి. పలు ఇళ్ల కిటికీ ల తలుపులు విరిగిపోయాయి. ఇళ్లల్లో పగుళ్లు తే లుతున్నాయి. ఫ్లోరింగ్ దెబ్బతింది. కిటికీల ఊచలు దొంగలు ఎత్తుకెళ్లారు. మూడేళ్లుగా ఇళ్లను ప ట్టించుకోకపోవడంతో మందుబాబులు వాటిని అడ్డాలుగా మార్చుకున్నారు. గేదెలు కూడా నివా సాలుగా మార్చుకుంటున్నాయి. అసాంఘిక కా ర్యకలాపాలకు అడ్డాగా మారడంతో ప్రస్తుతం 30 ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకు ఇబ్బందిగా మారుతోంది. 330 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలంటే ముందు వాటికి మరమ్మతులు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఇళ్లకు మరమ్మతులు చేసి ఇస్తారో.. లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇళ్ల వద్ద అంతర్గత డ్రెయినేజీ, తాగునీటి పైపులైను, విద్యుత్ సరఫరా పనులు అసంపూర్తిగా మిగిలే ఉన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన జంబుగ రాధ(45)తన భర్త చిన్నపోసులు, అల్లుడు లింబాద్రితో కలిసి ఉదయం 8:15 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై గోదావరి స్నానానికి బయల్దేరారు. సోన్ మండలం కూచన్పల్లి గ్రామా శివారులో రోడ్డుపై కుక్కలు అడ్డు రావాడంతో వాటిని తప్పిచే క్రమంలో బైక్ అదుపు తప్పడంతో రాధ కిందపడింది. ఆమె తల వెనుక భాగంలో గాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది. రాధ భర్త చిన్న పోసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాపు చేస్తున్నట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు. కారు ఢీకొని సెక్యూరిటీగార్డు.. బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బెల్లంపల్లి టూటౌన్ ఏఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ప్రభుత్వ ఏరియాస్పత్రిలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కొండు సాయికుమార్ (23) బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. కాల్టెక్స్ శివారు రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎగిరి కారు బానెట్పై పడిన సాయికుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబేడ్కర్ విగ్రహానికి వినతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మహిళా రిజ ర్వేషన్లలో బీసీ మహిళలకు ఉప కోట ప్రకటించక పోవడంతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలోని అంబేడ్కర్ వి గ్రహానికి బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో అగ్రకులాల మహిళలు రెండు శాతం, బీసీ మహిళలు 30శాతం ఉన్నా ఎనిమిది మంది బీసీ మహిళలే చట్టసభకు ఎన్నిక కావడం వివక్ష కాదా? అన్ని ప్రశ్నించారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రా బోయే సార్వత్రిక ఎన్నికల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ మహిళలకు జనాభా దామాషా పద్ధతిన 30శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మ హిళా సమాజం ముందు బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. జి ల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు వెంకటయ్య, భీంసేన్, చంద్రమౌళి, రాజన్నచా రి, శ్రీనివాస్, వెంకట్, రాజయ్య పాల్గొన్నారు. -
హోరాహోరీగా టీ20 క్రికెట్ పోటీలు
మంచిర్యాలటౌన్: కాకా మెమోరియల్ టీ20 టోర్నమెంట్లో భాగంగా మంచిర్యాల నగర పరిధిలోని గుడిపేట్లో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. శుక్రవారం కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా జట్ల మధ్య మ్యాచ్లో జరిగాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయగా 19.2 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయినట్లు కోచ్ పోరండ్ల ప్రదీప్ తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జిల్లా జట్టు 15.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బ్యాట్స్మెన్ అస్ఫాన్ 49 బంతుల్లో 64 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. అనంతరం మంచిర్యాల, నిర్మల్ జిల్లా జట్లు తలపడగా, మంచిర్యాల జిల్లా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 18 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేయగా, నిర్మల్ జిల్లా జట్టు 14 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. మంచిర్యాల జిల్లా జట్టు ఫైనల్కు చేరింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను మంచిర్యాల జిల్లా జట్టుకు చెందిన ఇస్మాయిల్ పొందారు. 15 బంతుల్లో 39 పరుగులతో పాటు, బౌలింగ్లో 5 వికెట్లు తీశారు. శుక్రవారం జరిగిన క్రికెట్ మ్యాచ్ను డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి టాస్ వేసి ప్రారంభించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్మాయిల్మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అస్ఫాన్ -
అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి క ట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ.23 కోట్లతో ని ర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను రాష్ట్ర ఎకై ్సజ్, టూ రిజం, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో రాజకీయ జోక్యాలు తీసుకురావద్దని తెలిపారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. మంచిర్యాలకు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నామని తెలిపారు. రైతులు సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలన్నారు. రంగు మారిన సోయా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో మెడికల్ కళా శాల ఏర్పాటుతో పాటు పీజీ సీట్లు పెంచేందుకు చ ర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్లు వే శామని తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేంద్రం రూ. 120 కోట్లు కేటాయించిందని, రా ష్ట్ర ప్రభుత్వం రూ. 30 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించిందని పేర్కొన్నారు. రాజకీయాలు స్నేహపూర్వకంగా ఉండాలని, గతంలో పీవీ నర్సింహారావు ప్ర ధానిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్య సమితిలో జ రిగిన సమావేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వా జ్పేయిని ప్రతినిధిగా పంపారని గుర్తు చేశారు. అ యితే ప్రధానమంత్రి రామగుండంలో జరిగిన కా ర్యక్రమానికి హాజరైతే అప్పటి ముఖ్యమంత్రి హా జరు కాలేదని పేర్కొన్నారు. అలాంటి రాజకీయాలు మంచివి కాదని పేర్కొన్నారు. రైతులు సాగులో రసాయనాల వాడకం తగ్గించి సహజసిద్ధమైన వ్య వసాయం చేస్తే బాగుంటుందన్నారు. జిల్లాకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఉచి తంగా వైద్యసేవలు అందిస్తున్నామని, జిల్లాలో 8లక్షల మందికి కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు సర్వే జరుగుతుందని తెలిపారు. మార్చి వరకు పత్తి కొనుగోళ్లు చేస్తామని రైతులు అధైర్య పడొద్దని పేర్కొన్నారు. జిల్లాకు ఎంత చేసినా తక్కువే.. మంత్రి జూపల్లి కృష్ణారావు వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రిమ్స్కు అవసరమైన వైద్యపోస్టులు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు తెలిపారు. రూ.800 కోట్ల సీఎంఆర్ నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6,956 స్టాఫ్నర్సింగ్ పోస్టులు, 4,338 వైద్య పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. రిమ్స్లో ప్రతీ రోగికి నాణ్యమైన సేవలు అందించా లని వైద్యులకు సూచించారు. త్వరగా ఎయిర్పోర్టు నిర్మాణం చేపడితే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి ఒక కల్చరల్ బిల్డింగ్ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మె ల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడారు. రిమ్స్తో పాటు ఉట్నూర్, బో థ్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని, ఇచ్చోడ పీహెచ్సీని ఏరియా ఆస్పత్రిగా మార్చాలని కోరారు. జన్నారంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక జీవో తీసుకువచ్చి వైద్యులకు రూ.5లక్షల వేతనం ఇచ్చి స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రిమ్స్లో క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభంతో అత్యవసర సేవలు మెరుగుపడతాయని తెలిపా రు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, కొమురయ్య, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో హుండీ ధ్వంసం
భైంసారూరల్: నిర్మల్ జిల్లా భైంసా మండలం ఇలేగాం గ్రామంలో మహాదేవుని ఆలయంలో హుండీని గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. ఎస్సై శంకర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులకు హుండీ తాళం పగులగొట్టి కనిపించింది. వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆలయానికి చేరుకుని చూడగా హుండీలోని నగదు, ఇతరాత్ర కానుకలు కనిపించలేదు. ఆలయ కమిటీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
అప్పుల బాధతో వార్డు సభ్యుడి ఆత్మహత్య
దిలావర్పూర్: ఇంటి నిర్మా ణం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంలో ఇటీవల వార్డు సభ్యుడిగా ఎన్నికై న యువకుడు ఆ త్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడ్డాల నరేశ్(31) తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. వీడీసీలో రైటర్గా కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏడో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. సోమవారం పంచాయతీ పాలకవర్గంతో కలిసి ప్రమాణస్వీకారం చేశాడు. అయితే ఇంటి నిర్మాణం కోసం అప్పులు కావడంతో వాటిని ఎలా తీర్చాలని కొంతకాలంగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరివేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూసి బోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నరేశ్ మృతికి సర్పంచ్ రోజా, మాజీ సర్పంచులు ఇప్ప నర్సారెడ్డి, ఆడెపు తిరుమల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ నిమ్మల చిన్నయ్య సంతాపం తెలిపారు. -
ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి
జన్నారం: నేతకాని కుల సర్పంచులు గ్రామాలను ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ నేతకాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్నేత సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్పీఎన్ మైదానంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నేతకాని స ర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను నేతకాని కుల, విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన స న్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిని ప్రసాద్నేత హాజరై వారిని సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, జాడి శంకర్, జాడి గంగాధర్, రత్నం లక్ష్మణ్, జాడి వెంకట్, దుర్గం వినో ద్, అల్లూరి వినోద్, జునుగురి మల్లయ్య, సుధాకర్, నందయ్య రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సీజన్–3 ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19నుంచి ప్రారంభమైన సీజన్–3 ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు శుక్రవారం ముగిశాయి. నస్పూర్లోని ప్రాణహిత స్టేడియంలో నిర్వహించి న పోటీల్లో జిల్లాలోని 10మండలాల ఫొటో, వీడి యో గ్రాఫర్ల అసోసియేషన్లు పాల్గొన్నాయి. పోటా పోటీగా సాగిన పోటీల్లో నస్పూర్ మండల అసోసియేషన్, ఎల్ఈడీ అసోసియేషన్ జట్లు ఫైనల్కు చే రాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన నస్పూర్ జట్టు 12ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఎల్ఈడీ టీం 10.1 ఓవర్లలో 83 పరుగులు చేసి 6 వికెట్లతో విజ యం సాధించింది. కాంగ్రెస్ మంచిర్యాల పట్టణా ధ్యక్షుడు తూముల నరేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వేణు, ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి, సలహాదారు కేదార్రెడ్డి, సౌత్ ఇండియా ప్రతినిధి రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా విజేత ఎల్ఈడీ జట్టుకు ట్రోఫీ, రూ.15వేల నగ దు ప్రోత్సాహం, రన్నరప్ నస్పూర్ జట్టుకు రూ.10 వేల నగదును చెక్కు రూపంలో అందజేశారు. మ్యా న్ ఆఫ్ ద సిరీస్గా శ్రీకాంత్ నిలిచాడు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు అప్పాసు రాము, శ్వాస తిరుపతి, కోశాధికారి ముక్కెర శ్రీనివాస్, నస్పూర్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాగర్, రమణాచారి, కోశాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటి కల నెరవేరేనా?
దండేపల్లి: ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పేదోడి సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు ఇంటి నిర్మాణ ప నులకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాని కి ముందున్న ధరలు, ప్రస్తుతమున్న ఇసుక, ఇటు క, కంకర ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు లేక ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదలతో పాటు కొంత సామగ్రి అందుబాటులో లేని కారణంగా ఇళ్ల నిర్మాణాలు న త్తనడకన సాగుతున్నాయి. జిల్లాకు 10,919 ఇందిర మ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 7,655 నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. బేస్మెంట్ లెవెల్లో 5,612, గోడలు పూర్తయినవి 2,510, స్లాబ్ పూర్తయినవి 1,160, మొత్తం పూర్తయినవి 15 ఉన్నాయి. నిర్మాణ పనులు మొదలైనవి వేలాదిగా ఉండటంతో వాటికి అవసరమయ్యే ఇసుక, ఇటుక, కంకర కొ న్నిచోట్ల అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తుండగా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ఇళ్లు ఎలా నిర్మించుకునేదాని వాపోతున్నారు. పెరిగిన సామగ్రి ధరలు ఇలా.. గతంలో 40ఎంఎం కంకర 100 ఫీట్లకు రూ.1,500 ఉండగా రూ.2,500కు చేరింది. గతంలో 20ఎంఎం కంకర రూ.2,200 ఉండగా, రూ.3,500కు, గతంలో 12ఎంఎం కంకర రూ.1,200 ఉండగా, రూ.2,500, డస్ట్కు గతంలో రూ.800 ఉండగా, రూ.2వేలు తీసుకుంటున్నారు. పైగా వీటన్నింటికీ రవాణా చార్జీలు అదనం. కంకర రేట్లు చూస్తే కళ్లు తిరిగిపోతున్నాయంటున్నారు లబ్ధిదారులు. గతంలో ట్రాక్టర్ దొడ్డు ఇసుకకు రూ.1,500 నుంచి రూ.1,800 ఉండగా, ప్రస్తుతం రూ.3వేలు తీసుకుంటున్నారు. మధ్యరకం ఇసుకకు రూ.3,500 నుంచి రూ.4వేలు, ప్లాస్టరింగ్ కోసం వినియోగించే ఇసుక ట్రాక్టర్కు రూ.6 వేల వరకు తీసుకుంటున్నారు. గతంలో వెయ్యి ఇటుకలకు రూ.8వేలకు పైగా తీసుకోగా, ప్రస్తుతం రూ.11వేలకు పైగా తీసుకుంటున్నారు. గతంలో ఒక్కో సిమెంట్ ఇటుక ధర ధర రూ.18 తీసుకోగా, ప్రస్తుతం రూ.22 వరకు తీసుకుంటున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి ఖర్చులు పెరిగి పోవడంతో ఆర్థికభారంతో ఇబ్బందులు పడుతున్నారు.కంకర పక్క జిల్లాల నుంచి..జిల్లాలో కంకర క్రషర్లు లేవు. కంకర అవసరమున్నవాళ్లు జగిత్యాల, కరీంనగర్, జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. దీంతో కంకర ధరలు కూడా అమాంతం పెంచడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గోదావరిలో నీళ్లు నిల్వ ఉండటంతో ఇసుక సరిపడా దొరకడం లేదు. దొరికనా ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు నెమ్మదినెమ్మదిగా చేపడుతున్నారు. -
ఘనంగా సీపీఐ ఆవిర్భావ వేడుకలు
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సీపీఐ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు క లవేన శంకర్ మాట్లాడుతూ.. సీపీఐ ఆవిర్భవించిన నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు చేసిందని గు ర్తు చేశారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం దాకా అనేక ఉద్యమాలు నిర్మించిందని తెలిపారు. పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుని 2026 జనవరి 18న ఖమ్మంలో శతజయంతి ఉత్సవాలు భారీ ఎ త్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కమ్యూని స్టులు, కార్మికులు, రైతులు, మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, ఖలీందర్ అలీఖాన్, మిట్టపల్లి పౌలు, మిర్యాల రాజేశ్వర్రావు, పూజారి రామన్న, వనం సత్యనారాయణ, చాడా మహేందర్రెడ్డి, బియ్యాల రాజేశం, రవి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
పరిమితికి మించి.. ప్రమాదం అంచున..
పరిమితికి మించి లగేజీతో వస్తున్న ట్రావెల్స్ బస్సులు ఆదిలాబాద్–హైదరాబాద్ మధ్య నడిచే జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ప్యాసింజర్లను మాత్రమే తరలించాల్సిన ట్రావెల్స్ బస్సులు గూడ్స్ వాహనాలను మరిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లగేజీని తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల రెండు ప్రమాదాలు చోటు చేసుకోగా మరణాలూ సంభవించాయి. వీటిని రవాణాశాఖ అధికారులు కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
వేఽధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య?
బోథ్: సొనాల మండలం సూర్యనగర్ గ్రామానికి చెందిన జాదవ్ స్రవంతి (30) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతికి గ్రామానికి చెందిన జాధవ్ కృష్ణనే కారణమని బంధువులు ఆరోపిస్తూ బోథ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడైన మృతురాలి సోదరుడు రాథోడ్ నితిన్ తెలిపిన వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన స్రవంతికి సొనాల మండలంలోని సూర్యనగర్ గ్రామానికి చెందిన జాధవ్ చరణ్కుమార్తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడున్నారు. అయితే, రెండేళ్లుగా స్రవంతిపై ఆమె చిన్నమామ కుమారుడైన జాదవ్ కృష్ణ తరచూ వేధింపులకు గురిచేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని, భర్తను వదిలి రావాలని స్రవంతిని నిరంతరం వేధింపులకు గురిచేసేవాడని నితిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై మూడు నెలల క్రితం జాధవ్ కృష్ణకు నచ్చజెప్పినా అతనిలో మార్పు లేదని తెలిపారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 24న కృష్ణ ఆమెను వేధించడంతో తట్టుకోలేక స్రవంతి పురుగుల మందు తాగిందని నితిన్ పేర్కొన్నాడు. ఆ విషయాన్ని కృష్ణనే తమకు ఫోన్ ద్వారా తెలిపాడని వివరించారు. అయితే బుధవారం సాయంత్రం బంధువులు బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తన అక్క మరణానికి కారణమైన జాదవ్ కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని నితిన్ ఫిర్యాదు చేశాడు. కాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. -
భార్య మృతి.. భర్తపై కేసు
ఉట్నూర్రూరల్: భార్య మృతికి కారకుడైన భర్తపై కేసు న మోదు చేసినట్లు ఉ ట్నూర్ ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలో ని లింగోజీతండా ఎక్స్రోడ్డు గ్రామంలో నాగేందర్–గిరి వర్షతాయి (42) దంపతులు నివాసముంటున్నారు. వర్షతాయి టైలరింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. భర్త నాగేందర్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసై ఇంట్లో భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ నెల 21న రాత్రి రోజులాగే మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. దీంతో గొడవ భరించలేక జీవితంపై విరక్తి చెందిన వర్షతాయి ఇంట్లో ఉన్న ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు వర్షతాయిని ఉట్నూర్ ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆదిలాబాద్ రి మ్స్కు రెఫర్ చేశారు. అక్కడి నుంచి మహారాష్ట్ర యవత్మాల్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు ఆమె భర్త నాగేందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నడక, నవ్వులతో ఆరోగ్య జీవనం
నిర్మల్టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలో 11 సంవత్సరాలుగా ’వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్’ (వాలా) పేరుతో గుర్తింపు పొందిన సంఘం ఆకట్టుకుంటోంది. 25 ఏళ్ల యువకుల నుంచి 79 ఏళ్ల వృద్ధుల వరకుఅందరికీ శారీరక–మానసిక ఆరోగ్యాన్ని అందిస్తూ, ఒత్తిడి నుంచి ముక్తి పొందేఅవకాశం క ల్పిస్తోంది. వేదిక ద్వారా సభ్యులు ఆత్మీయ బంధాలు పెంచుకుని, కష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. రోజువారీ నడక.. ప్రతీరోజు ఉదయం నడకతో ప్రారంభమయ్యే కా ర్యక్రమాల్లో సభ్యులు వేసే జోకులు మానసిక ఒ త్తిడిని తగ్గిస్తున్నాయి. సమయం మర్చిపోయేలా చే సే ఈ కార్యక్రమాలు మంచి–చెడులు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వివిధ రంగాల నుంచి చేరిన సభ్యులు ఇక్కడ సోదరులు, బంధువులుగా మారారు. అన్ని వర్గాల ఆత్మీయత యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు అందరూ ఈ సంఘంలో చురుకుగా పాల్గొంటున్నా రు. జీవిత చరమాంకంలో కూడా ఆనందమయంగా గడపడానికి ఈ వేదిక ఎంతో దోహదపడుతోంది. 300 మంది సభ్యులతో బలపడిన ఈ సంఘం ఆరోగ్యకర జీవనానికి మార్గదర్శిగా నిలుస్తోంది. పోటీలు ప్రారంభం డిసెంబర్ 25 నుంచి జనవరి 25 వరకు సభ్యులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు నాలం శ్రీనివాస్ తెలిపారు. సీనియర్ సిటిజన్లకు లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ ఆటలు, యువకులకు వాలీబాల్, క్రికెట్, రన్నింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం పలు ఆటలు జరిగాయి. సీనియర్లు, యువకులు పోటీపడి ఉల్లాసంగా పాల్గొన్నారు. -
‘పల్టీ’కొట్టిన జీవితాలు!
కాగజ్నగర్టౌన్: వారంతా దగ్గరి బంధువులే.. మ హారాష్ట్రలోని నాగ్పూర్లో గల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో బంధువును పరామర్శించేందుకు ఒకే కారులో ఏడుగురు వెళ్లారు. మంచీచెడు తెలుసుకుని బంధువుకు ధైర్యం చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లకు బయల్దేరారు. కానీ తిరుగు ప్రయాణంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వా గులో బోల్తాపడి తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒకరు బాలిక ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కాగజ్నగర్ పట్టణంలోని కౌసర్నగర్కు చెందిన అఫ్జల్ బేగం(50), సాహెరా బేగం(40), రహెమాన్తోపాటు నిజాముద్దీన్కాలనీకి చెందిన సల్మాబేగం(40), సబ్రీం(11), నుజహత్, ముషారత్ ఏడుగురు కలిసి బుధవారం ఉదయం నాగ్పూర్లోని బంధువును పరామర్శించేందుకు కారులో మహారాష్ట్రలోని నాగ్పూర్కు బయలుదేరారు. తిరిగి వస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత రాజురా జిల్లాలోని దేవాడ, సోండ్గాం సమీపంలోని వంతెన పైనుంచి కారు ఒకసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. రాళ్లు ఎక్కువగా ఉండడంతో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు సల్మాబేగం, సబ్రీం, కౌసర్నగర్కు చెందిన అక్కాచెల్లెళ్లు అఫ్జల్ బేగం, సాహెరా బేగం అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ రహెమాన్ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నుజహత్, ముషారత్లకు తీవ్ర గాయాలు కావడంతో చంద్రాపూర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు మహారాష్ట్రలోనే పోస్టుమార్టం నిర్వహించి గురువారం రాత్రి 6 గంటలకు ప్రత్యేక అంబులెన్స్లో కాగజ్నగర్కు తీసుకువచ్చారు. మృతులంతా సమీప బంధువులే కావడంతో కాగజ్నగర్లోని బాధితుల ఇళ్ల వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, స్థానిక నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
పండుగకు రైలు కూత పెట్టేనా..!
ఆదిలాబాద్లోని రిమ్స్ వైద్యకళాశాల భవనం గోడలు బీటలు వారి ప్రమాదకరంగా మారాయి. ఇందులో పనిచేసే సిబ్బంది, వైద్యవిద్యార్థులు ఎప్పుడు కూలుతాయోనని భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ప్రమాదానికి బాటలుబీటలు..మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. ినెలరోజుల ముందే ఆంధ్ర ప్రాంతానికి దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు పదుల సంఖ్యలో ప్ర త్యేక రైళ్లు ప్రకటించారు. తెలంగాణలోని సిర్పూర్ కాగజ్నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఆది లాబాద్ వంటి ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకు చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలనే డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగ, వ్యాపార, చదువుల నిమిత్తం వెళ్లిన వారు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. పండుగ వేళ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా ఆదిలాబాద్ రీజియన్లో ఆర్టీసీ సంస్థ 230కి పైగా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అనుకున్న మేర రైళ్ల రాకపోకలు లేకపోవడంతో బస్సుల్లోనే కిక్కిరిసిన ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. రద్దీకి అనుగుణంగా రైళ్లేవి..? కాగజ్నగర్ టూ సిక్రింబాద్ వైపు మార్గంలో 4.30 గంటల (భాగ్యనగర్) తర్వాత 12.45 (ఇంటర్ సిటీ) వరకు రైలు సౌకర్యం లేకుండా పోయింది. 8.45 గంటల సమయంలో వందేభారత్ ఉన్నా అత్యవసర వేళల్లో ఉపయోగం లేకుండా పోయింది. ముందస్తు టికెట్ రిజర్వేషన్ ఉంటేనే ప్రయాణం చేసే వీలుంటుంది. చార్జీలు ఎక్కువ కావడంతో ప్రయాణికులు లహరీ బస్సులో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. బల్లార్షా నుంచి కాజీపేట ఎక్స్ప్రెస్ (17036) ఉదయం 8.50 గంటలకు కాజీపేట్కు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (17035) రాత్రి 10.50 గంటలకు బల్లార్షాకు వెళ్తోంది. కాజీపేట్ జంక్షన్లో దాదాపు 14 గంటలు ఖాళీగా ఉంటుంది. ఢిల్లీ నుంచి నాంపల్లి, హైదరాబాద్ తెలంగాణ సూపర్ ఫాస్ట్ రైలు సీటు దొరకని దుస్థితి ఉంది. ప్రస్తుతం బల్లార్షా నుంచి కాజీపేట వరకు నడుస్తున్న 17036 ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్ లేదా చర్లపల్లి వరకు పొడిగిస్తే హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులకు అదనంగా రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం 17036 బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్ప్రెస్ రైలు 17234 సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వెనకాల కేవలం గంట వ్యవధిలోనే నడుస్తుంది. 17036 రైలును బల్లార్షాలో ఉదయం 3.50కు బదులుగా 5.00గంటలకు ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయాలున్నాయి. బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్ప్రెస్ రైలును చర్లపల్లి టెర్మినల్ వరకు పొడిగించాల్సిన అవసరం ఉంది. ప్యాసింజర్ రైలు ఎక్స్ప్రెస్గా.. 57135 రైలు నాగపూర్ నుంచి కాజీపేట్ వరకు ప్యాసింజర్ రైలుగా నడిచేది. కరోనాకు ఆరు నెలల ముందు 2019లో రైలును కాజీపేట్ నుంచి బల్లార్షా వరకు కుదించారు. బల్లార్షా నుంచి నాగపూర్ మధ్య పూర్తిగా రద్దు చేశారు. కరోనా అనంతరం తిరిగి ఈ రైలును 17036 బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్ప్రెస్గా పునరుద్ధరించారు. కొన్ని స్టేషన్లలో స్టాప్లను ఎత్తివేశారు. రైలు ఉదయం 8.50 గంటలకు కాజీపేట్కు చేరుకుంటే తిరిగి రాత్రి 10.50 గంటలకు కాజీపేట్ జంక్షన్లోనే 14గంటలు ఖాళీగా ఉంది. ఇలా కాకుండా రైలును చర్లపల్లి టెర్మినల్ లేదా లింగంపల్లి వరకు పొడిగిస్తే హైదరాబాద్ వెళ్లటానికి భాగ్యనగర్ తర్వాత ఇంటర్సిటీ ముందు ఒక రైలు అందుబాటులోకి వచ్చినట్లు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కాజీపేట్ జంక్షన్ నుంచి రాత్రి 9.15 బయలుదేరే విధంగా ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ మార్గాల్లో రైళ్ల కరువు.. విజయవాడ వెళ్లే రూట్లలో నవజీవన్, జీటీ రప్తి సా గర్ మాత్రమే మంచిర్యాలలో స్టాప్లు ఉన్నాయి. ఏ పీ ఎక్స్ప్రెస్, కేరళ, హంసఫర్, పూరి –కాజీపేట్ బి కనేర్ సంఘమిత్ర రైళ్లు నిలుపుదల చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నిజాముద్దీన్ (ఢిల్లీ) వరకు నడస్తున్న 12803 –04 స్వర్ణ జయంతి బైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వరంగల్ నుంచి బల్లార్షా మధ్య ఎటువంటి స్టాప్లేకుండా వెళ్తోంది. మంచిర్యాలలో ఈ రైలుకు నిలుపుదల ఇస్తే ఉపయోగంగా ఉంటుంది. మంచిర్యాలఅర్బన్: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంచిర్యాల రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఏగ్రేడ్ స్టేషన్ మంచిర్యాలలో రూ.26.49 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మంచిర్యాల రైల్వేస్టేషన్ మీదుగా 62 వరకు రైళ్లు నడుస్తుండగా 3,900 మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు రూ. 5లక్షల పైన ఆదాయం సమకూరుతున్నట్లు తెలుస్తోంది. కాగా రైల్వేస్టేషన్లో పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్లాట్ఫాంలపై షెడ్లు, విశ్రాంతి గదులు పూర్తయ్యాయి. స్టేషన్ ముఖద్వారం డిజైన్ ఫ్లాట్ఫ్లాంలు, ఎస్కలేటర్, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్, పోలీసుల గదులు, టికెట్ కేంద్రాల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇటీవల అమృత్ భారత్స్టేషన్ పథకంలో చేపట్టిన పనులను సిక్రిందాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నేరడిగొండ: ద్విచక్ర వాహనం ఆటో ట్రాలీని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన గురువారం మండలంలోని చించోలి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలం బలన్పూర్ గ్రామానికి చెందిన ఉయికే లింగారావు (30) గురువారం ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. బోథ్ క్రాస్ రోడ్, చించోలి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ట్రాలీని కుడివైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లింగారావు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనదారుడు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఆలయ హుండీ అపహరణ
కడెం: మండలంలోని మాసాయిపేట్ ఆంజనేయస్వామి ఆలయ హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హుండీలో సుమారు రూ.2 వేల నగదు ఉందని గ్రామస్తులు తెలిపారు. ఆలయ సమీపంలో హుడీలోని నగదు తీసుకుని ఖాళీ హుండీని అక్కడే వదిలేసి వెళ్లారు. గురువారం ఉదయం గమనించిన గ్రామస్తులు.. చుట్టుపక్కల గాలించారు. ఖాళీ హుండీ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా జట్టు విజయంమంచిర్యాలటౌన్: కాకా మెమోరియల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ను మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని గుడిపేట్లో గురువారం నిర్వహించారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మంచిర్యాల జట్టు మొదట బ్యాటింగ్ చేసి 18 ఓవర్లలో 140 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయిందని కోచ్ ప్రదీప్ తెలిపారు. ఆదిలాబాద్ జట్టు 18 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ఓటమి పాలైందని, మంచిర్యాల జిల్లా జట్టు గెలుపొందిందని ప్రకటించారు. ఈ మ్యాచ్లో 35 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మంచిర్యాల జట్టు కెప్టెన్ జి.సాయికృపారెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు. -
అగ్ని ప్రమాదంలో దుకాణం దగ్ధం
ఉట్నూర్రూరల్: మండలంలోని లింగోజీ తండా ఎక్స్రోడ్డు గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కాగూడ గ్రామానికి చెందిన లక్కకుల తిరుపతి గది అద్దెకు తీసుకుని మక్కలు కాల్చుకుని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి మిగిలిన మక్కలు దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి దుకాణంలో మంటలు చెలరేగాయి. మక్కలు కాలిపోవడంతో పాటు సామగ్రి దగ్ధమైంది. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.20లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని స్థానిక ఉప సర్పంచ్ హరిచంద్ బాధితుడికి భరోసా కల్పించారు. -
ప్రత్యేక రైలు నడపాలి
రైల్వే అఽధికారులు కా జీపేట నుంచి సిర్పూర్ కా గజ్నగర్ రూట్లలో పండు గ సమయంలో ప్రత్యేక రై ళ్లు ప్రవేశపెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కాగజ్నగర్ మార్గంలో నడిచే ఇంటర్సిటీ, కాగజ్నగర్ సూపర్ఫాస్ట్, భాగ్యనగర్ రైళ్లలో అత్యధిక రద్దీ ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి దూరప్రాంతాలకు నడిచే తెలంగా ణ, దానాపూర్, దక్షిణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల్లో కాలుపెట్టని పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వైపు ప్రతిరోజు ఎక్స్ప్రెస్ రైలు నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. – ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు -
లోక కల్యాణార్థం వీహెచ్పీ పాదయాత్ర
మంచిర్యాలటౌన్: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఆధ్వర్యంలో గురువారం హిందూ ధర్మ పరిరక్షణ, లోక కల్యాణార్థం జిల్లా కేంద్రంలోని దుర్గామాత ఆలయం నుంచి రాపల్లిలోని బుగ్గగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా కార్యదర్శి వేముల రమేశ్ మాట్లాడుతూ హిందువులంతా సంఘటితం కావాల ని, కులాలు, వర్గాలు, రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని కోరారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటం చేస్తూ పాదయా త్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్వంభరస్వామి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు రాజలింగు, ఉపాధ్యక్షురాలు కనకతార, నగర కార్యదర్శి రాజేశ్, ఉపాధ్యక్షులు సంపత్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు చైతన్యకుమారి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాలలోని రాంనగర్కు చెందిన డాక్టర్ కే.చైతన్యకుమారి ఈ నెల 27, 28న ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే 62వ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో ‘భారతదేశంలో ప్రభుత్వ విధానాల రూపకల్పన–ఒక అధ్యయనం’ అనే అంశంపై ప్రసంగిస్తారు. గతంలో పలు జాతీయ స్థాయి సదస్సుల్లో ప్రసంగించిన ఆమె ఇటీవల ‘పబ్లిసిటీ పాలసీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఏ స్టడీ ఆఫ్ ఐటీడీఏ ప్రోగ్రామ్స్ ఇన్ కుమురంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్’ అనే అంశపై విస్తృతస్థాయిలో పరిశోధన చేసి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాలను భవనేశ్వర్ అంతర్జాతీయ సదస్సులో సమర్పించనున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా పని చేస్తున్న చైతన్యకుమారి అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక కావడంపై భర్త చంద్రయ్య, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందించారు. -
వాజ్పేయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: అటల్ బిహరీ వాజ్పేయి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ అటల్ బిహరీ వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను గురువారం ప్రారంభించారు. అనంతరం వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్పేయి జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని, దేశ రాజకీయ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు విలువలు నేర్పిన గొప్ప నాయకుడుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం జాజు, ఎనగందుల కృష్ణమూర్తి, దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, బి య్యాల సతీశ్రావు, రంగ శ్రీశైలం, సత్రం రమే శ్, ఆకుల అశోక్వర్ధన్, వైద్య శ్రీధర్, మెరెడి కొండ శ్రీనివాస్, బుద్దారపు రాజమౌళి, నాగుల రాజన్న, ముల్కల్ల తిరుపతిరెడ్డి, రెడ్డిమల్ల అశో క్, కిషోర్, బోయిని దేవేందర్ పాల్గొన్నారు. -
ప్రహరీని కూలగొట్టి
మూసివేతకు గురైన వర్క్షాప్, పవర్హౌస్, స్టోర్, పాత జీఎం కార్యాలయం చుట్టూరా ప్రహరీ నిర్మించారు. ఎప్పుడైతే ఆయా విభాగాలు వేరే ప్రాంతాలకు తరలించారో అప్పటి నుంచి స్క్రాప్ దొంగతనాలు జరగడం రెట్టింపయ్యాయి. కొందరి కనుసన్నల్లో ప్రహరీని పగులగొట్టి పలు చోట్ల దారి తీసి ఆ మార్గం నుంచి ఇనుప, కర్రసామగ్రి ఎత్తుకెళ్లారు. నేటికీ అదేతీరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రూ.లక్షలు విలువైన సామగ్రిని ప్రహరీ దాటించి కంపెనీ ఆస్తులు కొల్లగొడుతున్న, పాత భవనాలు పడిపోవడానికి సిద్ధమవుతున్నా అధికారులు ఉలుకు పలుకు లేకుండా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. కంపెనీ ఆస్తులను కాపాడడానికి పాటుపడాలని పలువురు కోరుతున్నారు. -
దుప్పట్లు అందించి..చలి ఇక్కట్లు తీర్చి
దండేపల్లి: చలి తీవ్రత దృష్ట్యా దండేపల్లి గ్రామానికి చెందిన పలువురు నిరుపేద వృద్ధులకు చలి ఇక్కట్లు తీర్చేందుకు దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్ గురువారం దుప్పట్లు అందించి మానవత దృక్పథాన్ని చాటుకున్నారు. చలి తీవ్రతతో వృద్ధుల ఇబ్బందులను గుర్తించి దుప్పట్లు అందించినట్లు పేర్కొన్నారు. మండలంలోని మేదరిపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు దుప్పట్లు అందించారు. లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డం రాంచందర్, కోశాధికారి రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లి కార్జున్ పాల్గొన్నారు. -
నగరంలోని ఉద్యోగులకు 17శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 17శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేలా చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును టీఎన్జీవోస్ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం ఆయనను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ సభ్యులు మాట్లాడుతూ గతంలో మంచిర్యాల, నస్పూరు మున్సిపాలిటీలుగా ఉండగా, హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను కలిపి మంచిర్యాల కార్పొరేషన్గా మార్చి జనవరి నాటికి ఏడాది పూర్తవుతుందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి 17శాతం హెచ్ఆర్ఏ వర్తించేలా చూడాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘ కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, హౌజింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ పాల్గొన్నారు. -
కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
శ్రీరాంపూర్: సీనియర్ కబడ్డీ జిల్లా జట్లను ఎంపిక చేశారు. కొద్ది రోజులుగా నస్పూర్లోని సాధన డిఫెన్స్ అకాడమీ వద్ద ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. గురువారం జట్లను ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ నెల 28 వరకు కరీంనగర్లోని అంబేడ్కర్ స్డేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్, కార్యదర్శి కార్తిక్, కార్యవర్గ సభ్యుడు రవీందర్ తెలిపారు. పురుషుల జట్టుదీపక్(వెంకట్రావుపేట), పీ.విజయ్(బూరుగుపల్లి), ఆర్.దినకర్(వెంకట్రావుపేట), ఏ.మహేశ్(వెంకట్రావుపేట), ఎం.పవన్(రాజంపేట), ఏ.సాయికృష్ణ(దొరిగారి పల్లె), ఎం.శివాజీ(నర్సింగపూర్), ఎం.సంజయ్(దుగ్గినపల్లి), ఎం.జాన్సన్(కొత్తపల్లి), ఎస్.శ్రావణ్(నరసింగాపురం), ఏ.అరవింద్(కొత్తకొమ్ముగూడెం), పీ.వెంకటేశ్(సుద్దాల), ఎండీ.అక్రం(శ్రీరాంపూర్), జే.శ్రీనాథ్(కన్నెపల్లి) ఎంపికయ్యారు. కోచ్గా బీ.రవికుమార్, మేనేజర్గా పవన్కుమార్ వ్యవహరిస్తారు. మహిళల జట్టు..ఏ.మౌనిక(చెన్నూరు), ఎన్.ఐశ్వర్య(జైపూర్), డీ.సంఘవి(నస్పూర్), ఆర్.ఆకాంక్ష(శ్రీరాంపూర్), జే.అఖిల(రామకృష్ణపూర్), సీహెచ్.రక్షిత(రామకృష్ణపూర్), ఎం.శృతి(మైలారం), ఏ.మానస(కొండాపూర్), జే.పావని(కావాలి), సీహెచ్.హారిక(పారుపల్లి), కే.తులసి(బోడుపల్లి), ఏ.ఆశ్రిత(నెన్నెల), స్పందన(జైపూర్), బీ.రాఘవర్ధిని(ఐబీ తాండూర్) ఎంపికయ్యారు. కోచ్గా వీ.సందానంద, మేనేజర్గా కిషన్ వ్యవహరిస్తారు. -
ఘనంగా క్రిస్మస్
మంచిర్యాలటౌన్: సీఎస్ఐ చర్చి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, నాయకులుచెన్నూర్రూరల్: కిష్టంపేటలోని చర్చిలో చిన్నారులులక్సెట్టిపేట: చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తున్న డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖక్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చెన్నూర్లో రాష్ట్ర మంత్రి వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్ కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బీఆర్ఎస్ నాయకులు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ తదితరులు వేర్వేరు ప్రాంతాల్లో వేడుకల్లో పాల్గొన్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు ఎన్నికలు నిర్వహించకుండా నాన్ ఆఫీషియల్ పద్ధతిలో త్రీమెన్ కమిటీలు ఎంపిక చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నేరుగా నాన్ ఆఫీషియల్ పద్ధతిలో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు మొత్తం ముగ్గురితో కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేసింది. ప్రస్తుతం ఉన్న సంఘాల పాలకవర్గం గడువు గత ఫిబ్రవరిలోనే ముగిసింది. కొన్ని చోట్ల పాలకవర్గాలను పొడగించగా.. ఆరోపణలు వచ్చిన వారిపై వేటు వేసి ప్రత్యేక అధికారులను నియమించింది. ఇటీవల పూర్తిగా రద్దు చేసి అన్ని చోట్ల ప్రత్యేక అధికారులను నియమించింది. ఈసారి ఎన్నికలు లేకుండా నేరుగా నామినేటెడ్ మాదిరి ఎంపిక చేసే అవకాశం ఉంది. జిల్లాలో 20 సహకార సంఘాలు ఉండగా.. మరో నాలుగు కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తంగా 23వేల మంది వరకు సభ్యులు ఉంటారు. ఇవేగాక ఉమ్మడి జిల్లా కేంద్రంగా పని చేస్తున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), అలాగే మార్కెటింగ్ పరిధిలో ఉన్న జిల్లా మార్కెటింగ్ సహకార సంఘ(డీసీఎంఎస్) పరిధిలోనూ చైర్మన్, సభ్యుల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ కొత్తగా జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్లు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లాకు కొత్తగా మరో నాలుగు కొత్త పీఏసీఎస్లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.పాతజీఎం కార్యాలయం ఆవరణలో శిథిల భవనంమరమ్మతులకు నోచుకోని కార్యాలయ భవనం బెల్లంపల్లి: బెల్లంపల్లిలో సింగరేణి కంపెనీకి చెందిన ఆస్తులు తీవ్ర నిరాదరణ, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో బొగ్గు గనులు మూతపడి, విభాగాలను ఇతర ప్రాంతాలకు, ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్కు తరలించిన తర్వాత కార్యకలాపాలు సద్దుమణిగాయి. శాంతిఖని గని, కంపెనీ క్వార్టర్లను మందమర్రి ఏరియాలో విలీనం చేసిన యాజమాన్యం కంపెనీ స్థిరాస్తులపై శ్రద్ధ చూపడం లేదు. సంరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. పాత జీఎం కార్యాలయం, ఏరియా ఆస్పత్రి, ఏరియా వర్క్షాప్ ప్రాంగణాల్లోని పలు విభాగాల విలువైన భవనాలు ఏళ్ల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోక ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. భవనం పైకప్పుకు రంధ్రాలు పడి అంతర్భాగం, గోడలు వానకు తడిసి, ఎండకు ఎండుతూ శిథిలమవుతున్నాయి. ఇదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలు, దర్వాజాలు, ఇనుప సామగ్రి ఎత్తుకెళ్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న స్థిరాస్తులపై నిర్లక్ష్యం వహించడం వల్ల విలువైన భవనాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సామగ్రి స్క్రాప్ దుకాణాలకు.. సింగరేణి కార్యకలాపాలు అంతిమ దశకు చేరుకు న్న రోజుల నుంచే ఇనుప సామగ్రి చోరీకి గురవ డం మొదలైంది. సింగరేణి ఎస్అండ్పీసీ, సీఐఎస్ ఎఫ్ జవాన్లు కాపలా ఉన్నా చోరీలు నిత్యకృత్యంగా మారాయి. వర్క్షాప్, పవర్హౌస్, స్టోర్ ప్రాంగణాల్లో ఉన్న రూ.లక్షలు విలువైన ఇనుప సామగ్రి దొంగల పాలయ్యాయి. అయినా అప్పటి అధికారులు కొందరు, ఎస్అండ్పీసీ సిబ్బంది ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న సామగ్రి అడపాదడపా స్క్రాప్ దుకాణాలకు చేరుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు పట్టింపు లేని ధోరణి ప్రదర్శిస్తున్నారు. -
ఇక పక్కా వాతావరణ సమాచారం
బెల్లంపల్లి: వాతావరణ పరిస్థితులను రోజువారీగా రైతులు, ప్రజలకు అందించడం కోసం బెల్లంపల్లి కేంద్రంగా ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఆవరణలో రూ.10లక్షల వ్యయంతో ఇటీవల నెలకొల్పారు. ప్రయోగాత్మకంగా వాతావరణ పరిస్థితుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేంద్రాన్ని మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో వాతావరణ కేంద్రం లేకపోవడంతో జగిత్యాలలోని జోనల్ స్థాయి వాతావరణ కేంద్రం నుంచి వారానికోసారి నమోదైన ఉష్ణోగ్రతలు, వర్షపాతం, గాలిలో తేమ శాతం వంటి వివరాలు కృషి విజ్ఞాన కేంద్రానికి పంపిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా కేవీకే శాస్త్రవేత్తలు పంటలు సాగు చేస్తున్న రైతులకు వివరించి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కోసారి వాతావరణ సమాచారం భిన్నంగా ఉంటుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా ఉండడానికి కేవీకేలో వాతావరణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రం పరిధిలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గరిష్టం 80 నుంచి 90శాతం వరకు కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం తెలుసుకునే సౌకర్యం ఏర్పడింది. జిల్లాలో వాతావరణ కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులు, ప్రజలు వాతావరణం వివరాలు మరింత వేగవంతంగా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని కేవీకే శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
జైపూర్: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మకాలనీలో రూ.25లక్షలతో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ భవన నిర్మాణానికి మంత్రి వివేక్ కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో సోలార్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. నర్సరీని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రూ.20లక్షలతో ఇందిరా మహిళా భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్ కూన భాస్కర్, ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్, నాయకులు అంబల్ల సంపత్రెడ్డి, మంతెన లక్ష్మణ్, అంబల్ల రవి, గద్దల అనిల్ పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆడబిడ్డలకు వరం చెన్నూర్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నిరుపేద ఆడబిడ్డలకు వరమని మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరికీ ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని, కమీషన్ల కోసం తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి చెన్నూర్: అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ఏసుక్రీస్తు ప్రబోధించారని మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. గురువారం స్థానిక ఐఈఎం చర్చిలో మంత్రి, కలెక్టర్ పాల్గొని కేక్ కట్ చేశారు. తహసీల్దార్ మల్లికార్జున్, ఫాస్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
నారుమడి.. జాగ్రత్తలు తీసుకుంటే సరి
లోకేశ్వరం: జిల్లాలో రైతులు వరి నార్లు పోస్తున్నారు. ఈ సమయంలో నారుమడుల విషయంలో శీతాకాలంలో తగిన జాగ్రతలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ చెబుతున్నారు. ఉదయం ఉష్ణోగ్రత తీవ్రంగా పడిపోనున్నందున నారు మడిలో నీరు మారుస్తూ యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. నారు ఆరోగ్యంగా పెరిగితే దిగుబడి అధికంగా వస్తుందని పేర్కొన్నారు. శీతాకాలంలో వరి నారు మడుల విషయంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ సూచించారు. నారు మడి తయారీ ఇలా.. రెండుగుంటల నారుమడికి రెండు క్వింటాళ్ల కోడి ఎరువు లేదా గొర్రె ఎరువు తేదా వర్మీ కంపోస్టు వేసి కలియదున్నాలి. ఈ సేంద్రియ ఎరువులను నారుమడుల్లో వాడితే చలి తీవ్రతలోనూ నారుకు పోషకాలు అంది ఎదుగుదలకు తోడ్పడుతుంది. లేదంటే రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని, రెండు కిలోల భాస్వరం, కిలో పొటాష్ వేయాలి. చలితో జింక్ లోపం తీసుకోవాల్సిన జాగ్రతలు -
భీమారం అడవుల్లో పెద్దపులి సంచారం
భీమారం: మంచిర్యాల అటవీ రేంజ్ పరిధిలో ని భీమారం అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. నెన్నెల మండలం ఆవిడం ప్రాంతం నుంచి భీమారం అడవుల్లో పులి అడుగుపెట్టింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు మంగళవారం పులి పాదముద్రలు గుర్తించారు. దాంపూర్, బూర్గుపల్లి మీదుగా భీమారం సమీపంలోని మాంతమ్మ గుడి పాంతానికి చేరుకుందని మంచిర్యాల అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ రత్నాకర్రావు తెలిపారు. మాంతమ్మ, కొత్తగూడెం పరిసరాల రైతులు ఉదయం 9 గంట ల తరువాతే పత్తి, పంట పొలాలకు వెళ్లాలని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజల ను కోరారు. పెద్దపులి పాదముద్రలను సేకరించి రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. -
బస్సును ఢీకొని బొలెరో డ్రైవర్ మృతి
రెబ్బెన: మండలంలోని దేవులగూడ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ లహరి బస్సును ఢీకొని మంగళవారం తెల్ల వారుజామున బెల్లంపల్లికి చెందిన బొలెరో డ్రైవర్ కొమరే విజయ్ (25) మృతి చెందాడు. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే కాంట్రా క్టర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న విజయ్ ప్రతీరోజు బెల్లంపల్లి నుంచి రైల్వే లోకో పైలెట్లను వాహనంలో ఎక్కించుకుని ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్లో దింపేవాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున కూడా అదే తరహాలో బెల్లంపల్లిలో లోకో పైలెట్లను బొలెరోలో ఎక్కించుకుని వస్తున్న క్రమంలో మార్గమధ్యలోని దేవులగూడ వద్ద ముందున్న లహరి బస్సును ఢీకొట్టాడు. ఆసిఫాబాద్ డిపోకు చెందిన లహరి బస్సు హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్కు వచ్చే క్రమంలో మార్గమధ్యలోని రెబ్బెన మండలం దేవులగూడ వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం మూలంగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి పోషం ఫిర్యాదు మేరకు బెజ్జూరుకు చెందిన లహరి బస్సు డ్రైవర్ ధారావత్ రామారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మంగళవారం ఉదయం రెబ్బెన సీఐ సంజయ్ దేవులగూడ వద్ద ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. -
‘గిరి’ వసతి ఆలస్యం
తాండూర్: ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే గిరిజన విద్యార్థుల కోసం సకల హంగులతో చేపట్టిన అధునాతన హాస్టల్ భవన నిర్మాణం ఆలస్యంగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వం రూ.2.70 కోట్లు మంజూరు చేయగా భవన నిర్మాణం సాగుతోంది. మండలంలోని తంగళ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో నూతన వసతిగృహ నిర్మాణ పనులు ఇటీవల చేపట్టారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి స్వేచ్ఛాయుత, ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించేలా ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ధర్తి ఆబా జన్భాగీధారి అభియాన్’ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద వసతిగృహం నిర్మిస్తోంది. తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే గిరిజన విద్యార్థులు 50మంది అందులో వసతి కల్పిస్తారు. జిల్లాలో కేవలం తాండూర్ మండలానికే హాస్టల్ మంజూరు కావడం గమనార్హం. సకల వసతులు వసతిగృహంలో రెండంతస్తులుగా నిర్మిస్తారు. కింద డైనింగ్హాల్, వంటగది, స్టోర్ రూం, వార్డెన్ కార్యాలయం, మరుగుదొడ్లు, స్నానాల గదులు, రెండు అదనపు గదులతోపాటు మరో మూడు గదులు నిర్మించనున్నారు. మొదటి అంతస్తులో విద్యార్థులు ఉండేందుకు ఎనిమిది భారీ విస్తీర్ణం గల గదులు, స్నానాల గదులు, మరుగుదొడ్లతో కలిపి మరో మూడు అదనపు గదుల నిర్మాణం చేపడతారు. విద్యార్థులకు పడకలు, ర్యాక్, కబోర్డ్స్ తదితర సకల సౌకర్యాలు కల్పిస్తారు. పనుల్లో జాప్యంహాస్టల్ భవన నిర్మాణాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ప్రారంభించారు. జూలై 29న దేశ వ్యాప్తంగా వర్చువల్గా అన్ని భవన నిర్మాణాలను అధికారికంగా చేపట్టగా.. తాండూర్లోనూ అదే రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఏడాది కాలంలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం వరకు భవనాన్ని పూర్తి చేయాల్సి ఉండగా.. పనులు ఆలస్యం కారణంగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు వసతిని అందుబాటులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అందుబాటులోకి తీసుకొస్తాం నూతనంగా గిరిజన విద్యార్థుల కోసం మంజూరైన భవనాన్ని త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. వచ్చే విద్యాసంవత్సరం వరకు భవనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు వసతి కల్పిస్తాం. – వినయ్, అసిస్టెంట్ ఇంజనీర్(సోషల్ వెల్ఫేర్) -
ఎంసీసీ వేలం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వందలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించి ఓ వెలుగు వెలిగిన ఒకప్పటి ఏసీసీ(అసోసియేటెడ్ సిమెంటు కంపెనీ లిమిటెడ్) ప్రస్తుత ఎంసీసీ(మంచిర్యాల సిమెంటు కంపెనీ) అప్పులు చెల్లించలేక ఆస్తుల వేలానికి సిద్ధమైంది. రూ.వందల కోట్ల టర్నోవర్, రూ.లక్షల్లో జీతాలు చెల్లించిన కంపెనీ.. తీసుకున్న అప్పులు కట్టలేకపోతోంది. చివరికి జనవరి 12న కంపెనీ ఆస్తులు ఈ–వేలంలో అమ్మకానికి బ్యాంకు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే పేరొందిన పరిశ్రమ చరిత్ర అంతా ఇక గతంగానే మిగిలిపోనుంది. కంపెనీ ఆస్తులకు ఎవరైనా బిడ్ దాఖలు చేసి విజయవంతమైతే త్వరలోనే కంపెనీ పరిసరాల్లో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు వెలిసే అవకాశాలు లేకపోలేదు. కంపెనీ పునరుద్ధరణ చేయలేక..1956లో ఉత్తర భారతదేశానికి చెందిన వ్యాపారులు జర్మన్ సాంకేతికతతో ఏసీసీ నెలకొల్పారు. ఉ మ్మడి జిల్లాలోని మంచిర్యాల శివారులో అపారమై న సున్నపురాయి నిల్వలు, భూమి, బొగ్గు, నీటి సౌ కర్యం, కార్మికులు, రోడ్డు, రైల్వే సౌకర్యంతో ఇక్కడే సిమెంట్ ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేశారు. 43గ్రేడ్ రకంతో రోజుకు వెయ్యి టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఈ కంపెనీ ఆధునికతకు నోచుకోకపోవడంతో క్రమంగా బలహీనపడింది. చివరకు 2006లో మంచిర్యాలకు చెందిన కొందరు వ్యాపారులు ఈ కంపెనీని కొనుగోలు చేసి ఎంసీసీగా పేరు మార్చారు. ఆ తర్వాత కొంతకాలం కంపెనీ నడిచినప్పటికీ మార్కెట్లో పోటీ తట్టుకోలేక నష్టాలు వస్తున్నాయంటూ మూసి వేశారు. 2020లోనే పూర్తి గా ఉత్పత్తి నిలిపివేశాక యంత్రాలు తుప్పు పట్టిపోయాయి. తొలినాళ్లలో 1200మంది కార్మికులకు ఉపాధి కల్పించినా చివరకు 30లోపే మిగిలారు. వారు సైతం తమ బకాయిల కోసం కొట్లాడి చివర కు లేబర్కోర్టు, ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. మరో వైపు కంపెనీ క్వార్టర్లకు తాగు, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కొత్తగా కనెక్షన్లు తీసుకున్నారు. అధికారులు ఉపయోగించే క్వార్టర్లు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అద్దెకు ఇచ్చారు. విలువైన ఆస్తులున్నా అప్పులు కట్టలే..ఇండియన్ బ్యాంకు హైదరాబాద్ శాఖలో సుమారు రూ.20కోట్ల రుణం ఉండగా అవి వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.54.04కోట్లకు చేరింది. కంపెనీకి మంచిర్యాల, కాగజ్నగర్, జన్నారం, ర్యాలీగడ్పూర్, ముల్కల్ల, వేంపల్లి పరిధిలో మొత్తం 438ఎకరాల భూమి ఉంది. ఈ భూముల ఆస్తులు వందల కోట్లలోనే ఉంటాయి. అయితే ఈ బకాయిలు కట్టడంలోనూ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉందని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు కంపెనీ పరిధిలో మొత్తం 26చోట్ల ఉన్న ఆస్తులను వచ్చే నెల 12న ఈ–యాక్షన్ వేయనున్నట్లు నోటీసులు ఇచ్చింది. కంపెనీ పేరుతో ఉన్న స్థిర ఆస్తులైన ఫ్యాక్టరీలో యంత్రాలు, పరిసరాలు, క్వార్టర్లు, భూములు ఈ వేలంలో ఉన్నాయి. మరోవైపు వేలం వేసే ఆస్తులు ఆక్రమణల నుంచి ఖాళీ చేయాలంటూ పేర్కొన్నారు. ఈ మేరకు మంచిర్యాల ప్రిన్సిపల్ సివిల్ జడ్జి నియమించిన అడ్వకేట్ కమిషనర్ ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. ముఖేశ్ గౌడ్మురళీధర్కార్మికులకు బకాయిలు చెల్లించాలి బ్యాంకులకు అప్పు ఉన్నట్లే, కంపెనీ మా కార్మికులకు వేతన బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం ట్రిబ్యునల్లో కేసు ఉంది. కేసు విచారణలో ఉండగా యాక్షన్ వేయడం చట్ట విరుద్ధం. వేలంలో ఎవరూ పాల్గొనవద్దని కోరుతున్నాం. కార్మికులకు బకాయిలు చెల్లించాకే ముందుకు వెళ్లాలని బ్యాంకు, ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. – గాజుల ముఖేశ్గౌడ్, అధ్యక్షుడు, బెల్లంకొండ మురళీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంసీసీ కార్మిక సంఘం -
క్రికెట్ జట్టు కెప్టెన్గా కల్యాణ్
భీమారం: హైదరాబాద్ డి సేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26నుంచి 28వరకు ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్లో మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన ఉస్కమల్ల కల్యాణ్ ఎంపియ్యారు. ఈమేరకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది డిసేబుల్డ్ నుంచి కెప్టెన్గా ఎంపిక చేసినట్లు కల్యాణ్ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి కెప్టెన్గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కొత్త వ్యూహాలతో క్రికెట్ ఆడి రాష్ట్రానికి పేరు సాధిస్తానని తెలిపారు. రాబోయే జోనల్, నేషనల్ పోటీల్లో హైదరాబాద్ టీంను విజయపథంలోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈమేరకు టీంకు కోచ్ చంద్రభాన్గిరి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. -
మహాపూజ ప్రచారయాత్ర ప్రారంభం
ఇంద్రవెల్లి: పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని జనవరి 18న మహాపూజతో ప్రారంభించనున్న ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. సోమవారం రాత్రి నెలవంక చూసి మొక్కుకున్న తర్వాత మంగళవారం ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ సమక్షంలో ప్రచార రథం నిర్వహణపై చర్చించారు. అనంతరం కటోడ మెస్రం హనుమంత్రావ్, పర్ధాన్ మెస్రం దాదారావ్ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఏడురోజుల పాటు మెస్రం వంశీయులున్న గ్రామాలను సందర్శించి ఈ నెల 30నుంచి నిర్వహించనున్న గంగాజల పాదయాత్రతో పాటు జనవరి 18న నిర్వహించనున్న నాగోబా మహాపూజ, జాతర నిర్వహణపై ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. మొదటిరోజు ఈ నెల 23న ముందుగా సిరికొండ మండలకేంద్రంలోని కుమ్మరి స్వామి వద్ద మహాపూజకు అవసరమయ్యే మట్టి కుండల తయారీకి ఆదేశాలిచ్చారు. అక్కడి నుంచి సిరికొండ మండలంలోని రాజన్పేట్ గ్రామానికి చేరుకుని మెస్రం వంశీయుల వద్ద బస చేశారు. ఈ నెల 24న గుడిహత్నూర్ మండలంలోని సోయంగూడ, 25న ఇంద్రవెల్లి మండలంలోని గిన్నేర, 26న ఉట్నూర్ మండలంలోని సాలేవాడ, 27న ఇంద్రవెల్లి మండలంలోని పొల్లుగూడ, 28న ఇంద్రవెల్లి మండలంలోని వడగామ్ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో 29న కేస్లాపూర్ గ్రామానికి చేరుకుని మడావి వంశం ఇంట్లో బస చేయనున్నారు. 30న ఉదయం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరుతారు. అదేరోజు ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరి సమావేశమై పవిత్ర గంగాజలం సేకరణ రూట్మ్యాప్పై చర్చిస్తారు. అనంతరం ప్రత్యేక పూజల మధ్య గంగాజల పాదయాత్రను ప్రారంభించనున్నట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. జన్నారం మండలంలోని గోదావరి హస్తిన మడుగు నుంచి సేకరించి తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని జనవరి 18న మెస్రం వంశీయుల మహాపూజతో నాగోబా జాతర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మెస్రం వంశ పెద్దలు మెస్రం చిన్నుపటేల్, మెస్రం బాధిరావ్, కటోడ హనుమంత్రావ్, మెస్రం కోసేరావ్, సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం దాదారావ్, మెస్రం తిరుపతి, మెస్రం వంశ ఉద్యోగులు మెస్రం దేవ్రావ్, మెస్రం శేఖర్బాబు, సోనేరావ్ తదితరులున్నారు. -
దేశంలోనే నంబర్ వన్గా ఎస్టీపీపీ
జైపూర్: దేశంలోనే నంబర్ వన్గా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నిలుస్తోందని, విద్యుదుత్పత్తి, నిర్వహణలో అత్యుత్తమ ప్లాంట్గా అనేక అవార్డులు అందుకోవడం సింగరేణీయులందరికీ గర్వకారణమని ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ అడ్మిన్ భవన్ కార్యాలయంలో ఈడీ చిరంజీవి జీఎంలు నర్సింహారావు, మధన్మోహన్తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో 100మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతుందని తెలిపారు. బొగ్గుతోపాటు సంస్థ నూతనంగా ఎస్టీపీపీలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు సోలార్ విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్లాంట్తో సంస్థ మరింత లాభాల్లోకి వెళ్తుందని తెలిపారు. భవిషత్ తరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి సంస్థ దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విస్తరిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ కమాండెంట్ చాంచల్ సర్కార్, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ పంతులా, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్, ఏజీఎంలు మురళీధర్, వేణుగోపాల్, శివప్రసాద్, డీజీఎం పర్సనల్ కిరణ్బాబు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉత్తమ ఉద్యోగులకు సన్మానం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న బేతి నాగరాజు (ఈఈ), ఎండీ మోబిన్ (అకౌంట్స్ ఆఫీసర్), మారెళ్ల సురేశ్ (సీనియర్ అసిస్టెంట్), ఉప్పగంటి రవితేజ (క్లర్క్)ను ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మధన్మోహన్ శాలువాలతో సన్మానించార. ప్రశంసాపత్రాలు అందించి బహుమతులతో సత్కరించారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆదిలాబాద్: ధూపదీప నైవేద్య అర్చకులకు ఉ ద్యోగ భద్రత కల్పించాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ కోరారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన అర్చక చైతన్యయాత్ర మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంగమఠంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డీడీఎన్ అర్చకులకు రూ.35వేల వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల ని కోరారు. దేవాలయాలకు సేవలందిస్తున్న అ ర్చకులను నిర్లక్ష్యం చేయడం తగదని, అర్చక కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చే యాలని డిమాండ్ చేశారు. అనంతరం అర్చకులు ర్యాలీగా దేవాదాయ ధర్మాదాయశాఖ కా ర్యాలయానికి వెళ్లి అసిస్టెంట్ కమిషనర్ నవీన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణశర్మ, కోశాధికారి హరికిషన్, రాష్ట్ర మహిళా ప్రతినిధి విశాలాక్షమ్మ, రాష్ట్ర సహ కార్యదర్శి పరిపూర్ణాచారి, ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ యోగేశ్కుమార్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు శిరీశ్శర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శర్మ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మధు, ఆదిలాబాద్ ఇన్చార్జి విజయ్కుమార్చారి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ నేషనల్ జట్టు మేనేజర్గా సుధాకర్
మంచిర్యాలటౌన్: ఈ నెల 24నుంచి 28వరకు విజయవాడలో నిర్వహించనున్న సీనియర్ నేషనల్స్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తె లంగాణ రాష్ట్ర జట్టు మేనేజ ర్గా జిల్లా బ్యాడ్మింటన్ అ సోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ను అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సె క్రటరీ పుల్లెల గోపీచంద్ నియమించారు. రాష్ట్ర జట్టు క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పాల్గొననున్నట్లు సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేశ్గౌడ్, ఉపాధ్యక్షుడు భాస్కర్ల వాసు, బండ మీనారెడ్డి, ట్రెజరర్ సత్యపాల్రెడ్డి, జాయింట్ సెక్రటరీ రమేశ్రెడ్డి అభినందించారు. -
30, 31 తేదీల్లో క్రికెట్ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోగల డిగ్రీ కళాశాలల విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 30, 31 తేదీల్లో క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ డీ సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆదిలాబాద్ జోన్ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ జట్టు జనవరి 3నుంచి 5వరకు ఖమ్మం వేదికగా నిర్వహించనున్న యూనివర్సిటీ స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. పూర్తి వివరాలకు 9959701878 నంబర్లో సంప్రదించాలని సూచించారు. బాసర ఆలయానికి భారీ ఆదాయంబాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దుకాణాసముదాయాల నిర్వహణ హక్కులకు బహిరంగ, సీల్డ్ టెండర్ వేలం ద్వారా భారీగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల పరిమితితో కూడిన దుకాణాసముదాయాల ద్వారా ఆలయానికి రూ.2,02,84,803 ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. 1నుంచి కొత్త రైల్వే టైంటేబుల్కాగజ్నగర్ టౌన్: జనవరి 1నుంచి కొత్త టైం టేబుల్ను ప్రవేశపెట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమయాలు తె లుసుకుని ప్రయాణం చేయాలని పేర్కొన్నారు. రైళ్ల సమయాల్లో సందేహాలుంటే సమీప స్టేషన్ మేనేజర్ లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్లోని ఎన్టీఈఎస్ను సంప్రదించాలని సూచించారు. -
సత్తా చాటిన పాలిటెక్నిక్ విద్యార్థులు
ఆదిలాబాద్టౌన్: డిస్ట్రిక్ట్ లెవల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ గేమ్ పోటీల్లో సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు సత్తా చాటారు. ఈనెల 20, 21 తేదీల్లో నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో నిర్మల్, ఆదిలాబాద్, ఉట్నూర్, బెల్లంపల్లి కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన బాలబాలికలు ప్రతిభ కనబర్చి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డీ నరేశ్, లెక్చరర్లు విద్యార్థులను అభినందించారు. ట్రోఫీ, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్, రామేశ్వర్రెడ్డి, నీల్కమల్, క్రాంతికుమార్, హిమవర్ష, హేమలత, కుమారస్వామి, సంగీత, సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
నెన్నెల/మందమర్రిరూరల్: యాసంగిలో సాగు చేసే పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ రైతులకు సూచించారు. మంగళవారం రైతు దినో త్సవం సందర్భంగా నెన్నెల, మందమర్రి మండల కేంద్రాల్లోని రైతువేదికల్లో ఏర్పాటు చేసిన రైతునేస్తం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్పై వివరించారు. వరి కొయ్యలను కాల్చవద్దని, భూమి సారం కోల్పోతుందని అన్నారు. ఆయిల్ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని, మన భూములు ఆయిల్ ఫా మ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలి పారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయాధికారి సృజన హార్టికల్చర్ ఆఫీసర్ అరుణ్, ఏఈఓ రాంచందర్, శాస్త్రవేత్తలు మహేష్, సాధ్వి, ఏఈవో తిరుపతి, సర్పంచ్లు పాల్గొన్నారు. -
యాసంగి పంటలకు కడెం నీరు
కడెం: యాసంగి పంటలకు కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. కడెంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆయకట్టు రైతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాల రైతులతో చర్చించారు. జనవరి మొదటి వారంలో యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
‘రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’
మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, ఇటీవల జరిగిన పంచాయ తీ ఎన్నికల్లో సర్పంచులుగా పలు స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలి పించారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో బీజేపీ బలపర్చగా గెలుపొందిన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం అశోక్, గాజుల ముఖేశ్గౌడ్, వెంకటేశ్వర్, ఎనగందుల కృష్ణమూర్తి, కోడి రమేశ్, రాచర్ల సంతోశ్, అక్కల రమేశ్, జోగుల శ్రీదేవి, వైద్య శ్రీధర్ పాల్గొన్నారు. -
లక్ష్యాలను సాధిస్తేనే అభివృద్ధి ఫలాలు
శ్రీరాంపూర్: కంపెనీ నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే సంస్థ అభివృద్ధి సాధించి ఫలాలు పొందుతామని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జీఎం కార్యాలయం వద్ద సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కంపెనీ 72మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని, సాధనకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటికి 78శాతం ఉత్పత్తి సాధించామని, మిగిలిన రోజుల్లో లోటును భర్తీ చేస్తూ లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. ఏరియాలో ఇద్దరు ఉత్తమ ఉద్యోగులు, ఇద్దరు ఉత్తమ అధికారులను జీఎం సన్మానించి బహుమతి అందజేశారు. ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు. ఇటీవల నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, కార్మికుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో క్వాలిటీ జీఎం వీరభద్రరావు, ఏరియా సేవా అధ్యక్షులు ఉమారాణి, ఏరియా ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, డీజీఎం(పర్సనల్) అనిల్కుమార్ పాల్గొన్నారు. దేశంలోని బొగ్గు గనులకు దీటుగా సింగరేణి మందమర్రిరూరల్: దేశంలోని బోగ్గు గనులకు దీటుగా సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ పోటీ పడుతోందని ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. మంగళవారం ఏరియాలోని జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సింగరేణి వేడుకల్లో ఏరియా సేవాసమితి అధ్యక్షురాలు, ఆయన సతీమణి శ్రీవాణితో కలిసి జెండా ఎగురవేశారు. అనంతరం ఏరియా ఉత్తమ అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దేవాపూర్ ఉద్దంసింగ్ గురువు ఆధ్వర్యంలో చిన్నారుల కలరీ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, డీజీఎం(పర్సనల్) అశోక్, సీనియర్ పీవో బొంగోని శంకర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూశంకరయ్య తదితరులు పాల్గొన్నారు.విద్యార్థినుల నృత్య ప్రదర్శన కలరీ ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులు -
రహదారి నిబంధనలపై అవగాహన కల్పించాలి
నస్పూర్: వచ్చే జనవరిలో రోడ్డు భద్రతా ఉత్సవా లు నిర్వహిస్తామని, రహదారి నిబంధనలపై ప్రజ లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. మంగళవారం ఆయన నస్పూర్లోని కలెక్టరేట్లో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్కలెక్టర్ మనోజ్తో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, రోడ్డు భవనాలు, ఆర్టీసీ, విద్యుత్, పంచా యతీరాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్–కరీంనగర్–చంద్రాపూర్ రహదారిపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీలునస్పూర్: ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో మంగళవారం ఆయన పోటీల వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక అందాల ఫొటోలు, వీడియో రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతులు అందిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ప్రాచుర్యం పొందని పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావడ మే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తోందని అన్నారు. ప్ర కృతి, వన్యప్రాణులు, కళా సంస్కృతి, వారసత్వం, జలాశయాలు, వంటకాలు, గ్రామీణ జీవనం, రిసార్ట్స్, ఆధ్యాత్మిక ప్రాంతాలు వంటి అంశాలపై ఫొటోలు, వీడియోలు పంపించవచ్చని సూచించారు. మొ దటి బహుమతి రూ.50 వేలు, ద్వితీయ రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు అందిస్తారని అన్నారు. ఆసక్తి గలవారు జనవరి 5లోపు ఎంట్రీలు పంపించాలని, విజేతలను సంక్రాంతి కై ట్ ఫెస్టివల్ సందర్భంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా సేవల అధికారి హనుమంతరెడ్డి, ఎస్సీ కులా ల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి
కాసిపేట: పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్రావు తెలిపారు. మంగళవారం మండలంలోని గట్రావ్పల్లి గ్రామ పంచాయతీ సాలేగూడలో బెల్లంపల్లికి చెందిన ఫార్మర్ ప్రొడ్యుసర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ఫెస్టివల్(ఆహార పండుగ)లో ఆయన మాట్లాడారు. అడవి ఆకు కూరలను పునరుద్ధరించడం, సంరక్షించడం, వాటి ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఏ ప్రతినిధి డాక్టర్ రాజశేఖర్, న్యూట్రీషన్ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష, ఎఫ్పీఓ చైర్మన్ అండ్ డైరెక్టర్లు ఎంబడి కిషన్, సర్పంచ్ ఆత్రం గంగుబాయి, మాజీ సర్పంచ్ పేంద్రం రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆవిర్భావ వేడుకలను బహిష్కరించిన ఏఐటీయూసీ
శ్రీరాంపూర్: సింగరేణి ఆవిర్భావ వేడుకలను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు బహిష్కరించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్లు, జీఎం కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన వేడుకలను నల్లబ్యాడ్జీలు ధరించి హాజరై బహిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా మాట్లాడుతూ.. కార్మికులు ఎంతో ఉత్సాహంగా పండుగలా జరుపుకొనే ఆవిర్భావ వేడుకలకు నిధులు కోత పెట్టి నామమాత్రంగా నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కార్మికుల సొమ్మును రాజకీయ నేతల జోక్యంతో దుబారా చేసే అధికారులు ఇలాంటి వేడుకలు నిర్వహించడానికి ఆంక్షలు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కార్మికుల హక్కులపై ఇది దాడి చేయడమేనని తెలిపారు. ఈ వైఖరికి నిరసనగా తాము వేడుకలు బహిష్కరించామని పేర్కొన్నారు. యూనియన్ నాయకులు మోత్కూరి కొమురయ్య, సందీప్, తౌటం మల్లేశ్, రాచర్ల రవీందర్, శ్రీకాంత్, ఆడెపు సురేశ్ పాల్గొన్నారు. -
సిరిచెల్మలో వాహనాల పట్టివేత
ఇచ్చోడ: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో దొంగిలించిన 34 ద్విచక్రవాహనాలను మండలంలోని సిరిచెల్మలో మంగళవారం మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలోగల నాందెడ్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ద్విచక్రవాహనాలను కొంతమంది ముఠాగా ఏర్పడి దొంగిలించారు. వీటిని ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ, గుండాల, కేశవపట్నం, ఎల్లమ్మగూడ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో మంగళవారం ఉదయం రెండు వాహనాల్లో ఇక్కడికి వచ్చిన మహారాష్ట్ర పోలీసులు స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇచ్చి సిరిచెల్మ కు చేరుకున్నారు. దొంగిలించిన వాహనాల పత్రాలు, ఇంజిన్, చెసిస్ నంబర్ల ఆధారంగా దాదాపుగా 34వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో దొంగిలించిన వాహనాలను తక్కువ ధరకు ఇక్కడివారికి విక్రయించినట్లు సమాచారం. పట్టుకున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు నాందెడ్ జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున వాహనాలు మండలంలో దొరకడం, ఎలాంటి పత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా స్థానిక పోలీసులకు చిక్కకుండా ఉండటం, పక్క రాష్ట్రం నుంచి పోలీసులు వచ్చి వాహనాలను స్వాధీనం చేసుకోవడం లాంటి ఘటనలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. -
లాభాల సాగు
బెల్లంపల్లి: మనస్సుంటే ఎన్నో మార్గాలుంటాయి. దీన్ని ఓ రైతు అక్షరాల నిజం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సీజన్కు అనుగుణంగా కూరగాయలు పండిస్తూ లాభాలు గడిస్తున్నాడు. వివరా లు.. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన గోపే రామ్మూర్తి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతనికి గ్రామ శివారులో పదెకరా ల వ్యవసాయ భూమి ఉంది. ఐదెకరాల్లో వరి, నా లుగెకరాల్లో పత్తి సాగు చేస్తూనే మరో ఎకరంలో బో రు ఆధారంగా పదెకరాల కూరగాయలు పండిస్తున్నాడు. టమాట, వంకాయ, బెండకాయ, కాకర, ఉల్లి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, మెంతి, అలసంద తదితర రకాల కూరగాయలు పదేళ్లుగా సాగు చేస్తున్నాడు. నాలుగు గుంటలకో రకం చొప్పున పది రకాల కూరగాయలు సాగు చేస్తున్న రామ్మూర్తి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నష్టపోయింది లేదు. సాగులో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులనూ వినియోగిస్తున్నాడు. సాగులో భర్తతో సమానంగా కష్టపడుతోంది రామ్మూర్తి భార్య మంగ. సాగునే నమ్ముకున్న ఈ రైతు దంపతులు కూతురు షాలిని, కొ డుకు సాయితేజను ఉన్నతంగా చదివిస్తున్నారు. షా లిని ఎంటెక్ చదువుతుండగా సాయితేజ డిగ్రీ చదువుతున్నాడు. అంగళ్లలో అమ్మకాలు రామ్మూర్తి దంపతులు పండించిన కూరగా యలను హోల్సేల్గా అమ్మకుండా నేరుగా సమీప అంగళ్లలో విక్రయిస్తుంటారు. వారంలో ఐదురోజులపాటు చట్టుపక్కల గ్రామాల్లో నిర్వహించే సంతల్లో వీరు పండించిన కూరగాయలు విక్రయిస్తుంటారు. ఒక్కో సంతకు ఒక్కోరోజున కూరగా యలు తీసుకువెళ్లి విక్రయాలు చేస్తుండగా.. మిగతా రెండ్రోజులు మందమర్రి మార్కెట్కు తీసుకెళ్లి అ మ్ముకుంటారు. దీంతో గిట్టుబాటు ధర లభించి వీరి సాగు లాభాల బాటలో పయనిస్తోంది. నెలకు రూ.30వేల ఆదాయం ఒకటి, రెండురకాల కూరగాయలు పండిస్తే రో జువారీగా ఆదాయం ఉండదు. రోజువారీగా అ మ్మకాలూ ఉండవు. అదే పది రకాల కూరగా యలు సాగు చేస్తే ఏరోజుకారోజు ఆదాయం వ స్తుంది. ప్రస్తుతం రామ్మూర్తి ఈ విధానాన్నే అనుసరిస్తుండటంతో రోజుకు రూ.వెయ్యికి తగ్గకుండా నె లకు రూ.30వేల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఇందులో ఖర్చులు రూ.10 వేలు పోనూ రూ.20వేల దాకా మిగులుతున్నట్లు రామ్మూర్తి తెలిపాడు. చిత్తశుద్ధితో కూరగాయలు సాగు చేసి కష్టపడాలే గాని ఏ కోశాన నష్టాలనేవి ఉండవని ధీమా వ్యక్తంజేస్తున్నాడు. ఏ రకం పంటకు ఏ సీజన్లో డిమాండ్ ఉంటుందో గుర్తెరిగి సాగు చేస్తే అసలు నష్టాలే ఉండవని రామ్మూర్తి దంపతులు చెబుతున్నారు. తోటలో వంకాయలు సేకరిస్తున్న రామ్మూర్తి -
టెంటు సాక్షిగా ప్రమాణ స్వీకారం
భీమిని/దండేపల్లి/చెన్నూర్రూరల్/భీమారం: జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో భవనాలు లేక.. మరికొన్ని శిథిలావస్థ కారణంగా పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం టెంట్ల ఏర్పాటు చేశారు. సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు టెంట్ల కింద ప్రమాణ స్వీకారం చేశారు. చెప్పులు ధరించని సర్పంచ్భీమిని: మండలంలోని బిట్టురుపల్లి సర్పంచ్ రాంటెంకి దశరథ్ గత 15ఏళ్లుగా చెప్పులు ధరించడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో డిసెంబర్ 9, 2009న విద్యార్థులు, యువకులు ఎలాంటి ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, ఎవరికీ ఎలాంటి హాని కలుగవద్దని ఇష్ట దైవానికి మొక్కి నిర్ణయం తీసుకున్నాడు. సర్పంచ్గా ఎన్నికై నా సోమవారం పాదరక్షలు ధరించకుండానే ప్రమాణ స్వీకారం చేశాడు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ కార్యాలయ ఏవో దామోదర స్వామి అన్నారు. కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొని ఏజెన్సీ పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి కల్పించాలని కొందరు, పింఛన్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని మరికొందరు అర్జీలు సమర్పించారు. దుర్గం శేఖర్పై మరో కేసుఆదిలాబాద్టౌన్: దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దుర్గం శేఖర్పై మరో కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. రిమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి స్టేషన్ నుంచి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని భాగ్యనగర్లో నివాసం ఉండే ఎర్రంవార్ విజయ్ ఇంట్లో ఆది వారం రాత్రి చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు చొరబ డ్డారు. బీరువా పగలగొట్టి నగదుతో పాటు బంగారం ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.లక్ష 80 వేల వరకు ఉంటుందని బాధితుడు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు పేర్కొన్నారు. -
గడ్డం వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి లోక్సభ సభ్యుడిగా గడ్డం వెంకటస్వామి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహనీయులు ఆచరించిన మార్గాన్ని అనుసరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, అధికారులు రౌఫ్ఖాన్, దుర్గప్రసాద్, హనుమంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి మంచిర్యాలఅగ్రికల్చర్: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్, ఈఆర్వోలు, ఏఆర్వోలతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ రోజుకు 10 వేల చొప్పున చేస్తూ నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బీఎల్ఓల వారీగా సమీక్ష నిర్వహించి పురోగతి లేని వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
శ్రీరాంపూర్లో ఉత్తమ ఉద్యోగులు వీరే..
శ్రీరాంపూర్: సింగరేణి డేను పురస్కరించుకుని శ్రీరాంపూర్ ఏరియాలో ఇద్దరు ఉత్తమ ఉద్యోగులు, ఇద్దరు ఉత్తమ అధికారులను యాజమాన్యం ఎంపిక చేసింది. మంగళవారం జీఎం కార్యాలయం వద్ద జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వీరిని సన్మానించనున్నారు. ఉత్తమ ఉద్యోగులుగా ఆర్కే 5 గనిలో మున్సీగా పని చేస్తున్న గునిగంటి నర్సింగరావు, ఎస్సార్పీ 3 గనిలో ఫోర్మెన్గా పని చేస్తున్న కుమ్మరి మల్లేశం, ఉత్తమ అధికారులుగా ఐకే 1ఏ గనికి చెందిన ఇంజనీర్ రాకేశ్ సత్తయ్య వంగవార్, ఎస్సార్పీ ఓసీపీకి చెందిన సీనియర్ అండర్ మేనేజర్ మేడవేని వెంకన్న ఎంపికయ్యారు. మందమర్రి ఏరియాలో.. మందమర్రిరూరల్: సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏరియాలోని ఉత్తమ అధికారులు, ఉద్యోగులను యాజమాన్యం ఎంపిక చేసింది. ఉత్తమ అధికారులుగా కేకే–ఓసీలో అండర్ మేనేజర్ మామిడి కుమారస్వామి, రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ పి.రాజ్కుమార్, ఉత్తమ ఉద్యోగులుగా కేకే– ఓసీ ఈపీ ఆపరేటర్ బుడెగ వేణుగోపాల్, కేక–5గనిలో కోల్ కట్టర్ బొల్లపల్లి శ్రీనివాస్ ఎంపికయ్యారు. వీరిని మంగళవారం ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించే వేడుకల్లో సన్మానించనున్నారు. -
సాఫ్ట్బాల్, బేస్బాల్ పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లి: స్కూల్ గేమ్స్ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆ ధ్వర్యంలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థా యి సాఫ్ట్బాల్, బేస్బాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా బాలబాలికల జట్లు జయకేతనం ఎగురవేశా యి. సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ పాఠశాల, కళాశాల క్రీడా మైదానంలో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు చొప్పున బాలబాలికల జట్లు హాజరయ్యాయి. అండర్–14లో పోటాపోటీగా తలపడ్డారు. సాఫ్ట్బాల్, బేస్బాల్ విభాగాల్లో వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో మంచిర్యాల జిల్లా బాలబాలికల జట్లు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బాలబాలికల జట్లు ద్వితీయ స్థా నాన్ని దక్కించుకున్నాయి. ముగింపు కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ సిహెచ్.హనోక్ బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంచి ర్యాల జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండి.యాకూబ్, టోర్నమెంట్ అబ్జర్వర్ బండి రవి, సీఈవో సీనియర్ ఉపాధ్యాయుడు దశరథం, వ్యాయామ ఉపాధ్యాయులు ఎండి.చాంద్పాషా, ఎస్కే రాజ్మహ్మద్, అల్లూరి వామన్, ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు. 70వ సారి యువకుడి రక్తదానం నెన్నెల: మండల కేంద్రం నెన్నెలకు చెందిన శ్రీరాంభట్ల సుశాంత్శర్మ సోమవారం 70వ సారి రక్తదా నం చేసి ప్రాణదాతగా నిలిచాడు. గోదావరిఖని ఏరి యా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో తలసే మియాతో బాధపడుతున్న రవికి ఓ నెగిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. మంచిర్యాల బ్లడ్బ్యాంకు వా రు ఫోన్ చేయగా వెళ్లి దానం చేశాడు. ఇప్పటికే 20 సార్లు రక్తకణాలు కూడా దానం చేశాడు. అ త్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్న వారు 8555 899987 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. -
బాధలోనూ.. బాధ్యతలు స్వీకరణ
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న బండారి పుష్ప, భర్త బండారి రవీందర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తై గుర్తులు కేటాయించాక అనివార్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సోమవారం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రమాణం చేసేందుకు వచ్చిన సర్పంచ్ బండారి పుష్ప ఎంతో బాధతో బాధ్యతలు స్వీకరించింది. ఆ సమయంలో ఆమెతో పాటు వచ్చిన కుటుంబీకులు, పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టడం కలిచివేసింది. సర్పంచ్గా రాణించి రవీందర్ ఆశయసాధనకు కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో బండారి రవీందర్ ఫొటోతో ఆ నలుగురు సినిమాలోని ‘నేనే గెలిచాను.. నేనే గెలిచాను.. కాదు నన్ను గెలిపించారు.. ఈ ప్రపంచాన్ని గెలిపించేది.. డ బ్బుకాదు ప్రేమే’ అంటూ రవీందర్ దంపతుల ఫొటోతో ఉన్న వీడియోలు వైరలయ్యాయి. -
తెల్లారిన కూలీల బతుకులు..!
జైపూర్: తెల్లవారితే గమ్యం చేరేవా రే.. పొట్టకూటి కోసం కట్టుకున్న వారిని.. కన్నవారిని విడిచి రాష్ట్రం దాటొచ్చిన వలస కూలీల బొలేరో వాహనంపైకి ప్రమాదం బొగ్గులారీ రూపంలో దూసుకొచ్చింది. గాఢనిర దలో ఉన్న కూలీలంతా ఒక్కసారిగా ఉల్కికిపడ్డారు. ఏం జరిగిందో నని నిద్ర నుంచి తేరుకునే సరికే ప్రమాదం జరిగిపోయింది. ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత పడగా.. మరో 16మందిని క్షతగ్రాత్రులను చేసింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి 20మంది కూలీలు ఆదివారం రాత్రి 10గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు బొలేరో వాహనంలో బయల్దేరారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలోని మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున 3.30 గంటలకు బొలేరో వాహనాన్ని శ్రీరాంపూర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న బొగ్గులారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా బొలేరో వాహనాన్ని ఢీకొట్టగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. దీంతో బొలేరో వాహనంలో ఉన్న 16మంది మహిళా కూలీలు, నలుగురు పురుషులు ఒకరిపైనొకరు పడి ఒత్తిడికి గురయ్యారు. చంద్రపూర్ జిల్లా సావ్లీ మండలం చాందిలిబుజ్ గ్రామానికి చెందిన మీనా(45)కు ఛాతిపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. ఇదే మండలంలోని దిగోరి గ్రామానికి చెందిన మందారీ లీలాబాయ్(65), బెంబిల్ గ్రామానికి చెందిన సోయం విమల్బాయ్(57)కు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా చనిపోయారు. క్షతగాత్రులు వీరే.. సాధనవికాస్ టేకం రేఖవిజయ్ గాత్రే, మమతలక్ష్మ ణ్, శకుంతలపుప్పేశ్వర్ టేకం, మేఘాకార్తీక్ శ్రీరామి, పౌర్ణిమ సురేశ్, ఆత్రం సుమన్బాయి, తొడాసే సలోనిఅర్జున్, టేకం వికాస్విశ్వనాథ్, నీలిమస్వప్నిల్, మాయ మాఘు సరిత జితేంద్ర మోర్లే, కల్పన దీపక్ గద్దె, విజయ్ సంతోశ్ బొడ్కావర్ గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అందరినీ 108వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై శ్రీధర్ తెలిపారు. వరి నాట్ల కోసం వలస ప్రతిఏటా వరి నాట్ల సీజన్లో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన మహిళా కూలీలు తెలంగాణలోని పెద్దపల్లి, కరీంగనర్ ప్రాంతాలకు వలస వస్తారు. కూలీలంతా బొలెరో వాహనంలో వస్తుండగా ఊహించని విధంగా లారీ రూపంలో మృత్యువు దూసుకు వచ్చింది. బొలెరో వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టడం కూలీల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ముగ్గురు చనిపోవడం, కూలీలు తెచ్చుకున్న వంట సామగ్రి, వస్తువులు చెల్లాచెదురు కావడం చూసి కంటతడి పెట్టారు. లేటేవార్ మీనా మృతిచెందగా ఆమె భార్త అనిల్ లేటేవార్ కూడా ఇదే వాహనంలో ఉన్నాడు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దిక్కుతోచని స్థితిలో కన్నీరుపెడుతూ సంఘటన స్థలంలో ఉన్నారు. -
‘గుండాల’ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో
ఇచ్చోడ: మండలంలోని గుండాల గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ గ్రామంలో 2018 సంవత్సరంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవల్లో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో గ్రామంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్పంచ్ షరీఫాబితో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ఎంపీడీవో నరేశ్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. నాడు పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు సర్పంచ్తానూరు: మండలంలోని తొండాల గ్రామానికి చెందిన మిరేకర్ మాధవ్ 19సవత్సరాలుగా అదే గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ, గ్రామస్తులకు సేవలందించారు. ఇటీవల గ్రామంలో ఎస్సీ రిజర్వుడ్ రావడంతో మాదవ్ సర్పంచ్గా గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి సర్పంచ్గా తెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తానన్నారు. -
పాన్ ఇండియా ప్రస్థానం!
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ బ్రిటీష్ కాలంలో పురుడుపోసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది. 1927లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, 1961లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం, 1991లో ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో బొగ్గుగనులు ఒక్కొక్కటిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో సుమారు 450 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలను భూగర్భశాఖ అధికారులు గుర్తించారు. 1889లో 59,671 టన్నుల బొగ్గు ఉత్పత్తితో కంపెనీ ప్రస్థానం మొదలైంది. జాతీయీకరణ తర్వాత సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉంది. కార్మికుల త్యాగాలతో మనుగడ.. సింగరేణి సంస్థ మనుగడకు కార్మికుల త్యాగాలే కారణమని చెబుతుంటారు. ప్రకృతికి విరుద్ధంగా ప్రాణాలకు తెగించి భూగర్భంలోకి దిగి చెమటోడ్చి పనిచేశారు. ఆ కష్టమే నేడు సంస్థ సింగరేణి స్థిరత్వానికి పునాదిగా నిలిచాయి. యాంత్రీకరణతో ప్రమాదాలు కొంతమేర తగ్గినా అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు లక్షా పైచిలుకు కార్మికులు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 40వేలకు చేరింది. పరిమిత స్థాయిలో వేడుకలు గతంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించగా, ఈసారి పరిమిత స్థాయిలో జరుపనున్నారు. నిధులను సైతం భారీగా తగ్గించారు. జీఎం కార్యాలయాల్లోనే వేడుకలు నిర్వహించనున్నారు. దీనిపై కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధులు తగ్గించినట్లుగా చెబుతున్నా.. గతం నుంచి వస్తున్న సంప్రదాయాలకు విలువ తగ్గిందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఆటుపోట్లను తట్టుకుంటూ దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. కార్మికుల చెమట చుక్కలతో నిలిచిన సంస్థ.. నేడు బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా గుర్తింపు సాధించింది. డిసెంబర్ 21న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.సింగరేణి వివరాలు కంపెనీ విస్తరణ : ఆరు జిల్లాలు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం భూగర్భ గనులు : 22 ఓపెన్ కాస్టు గనులు : 17 ఉద్యోగుల సంఖ్య: 42,000 నూతన బొగ్గుబావుల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నా పర్యావరణ నిబ ంధనలు, అటవీశాఖ అనుమతులు, పర్మిషన్లు, భూసేకరణ సవాల్గానే మారింది. దీంతో బొ గ్గు ఉత్పత్తితోపాటు ప్రత్యామ్నాయ రంగాలపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మూతపడిన భూగర్భ గనుల్లో మిగిలిపోయిన బొగ్గును ఓపెన్కాస్ట్ల ద్వారా తవ్వడంతోపాటు ఇతర రంగాల వైపు అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాల కోసం ఇతర ఖనిజాల అన్వేషణపై కూడా ఫోకస్ పెట్టింది. అలాగే పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులు పెడుతోంది. రాజస్తాన్లో 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. అదే రాష్ట్రంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం లభించింది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, నైనీ బ్లాక్ వద్ద 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్, మణుగూరులో జియో థర్మల్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం, బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. కర్ణాటకలో బంగారు గనుల కోసం ప్రణాళికలు సిద్ధమవుతుండగా.. అనుబంధంగా 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంపైనా దృష్టి సారించింది. -
● ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారుల మృతి ● ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు
మంచిర్యాలక్రైం: జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. చిన్నారుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో 15రోజుల క్రితం ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. ఈ నెల 16న ఓ నర్సింగ్హోంలో గర్భస్థ శిశువు చనిపోయాడు. పదిహేను రోజుల్లోనే జరిగిన ఈ ఘటనలకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలు ఆందోళన చేశాయి. మంచిర్యాల మహారాష్ట్రలోని చంద్రాపూర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సరిహద్దు కావడంతో వైద్యం కోసం వస్తుంటారు. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్, కరీంనగర్కు వెళ్తుంటారు. అంతదూరం వెళ్లలేని పేదలు ఇక్కడి వైద్యులను ప్రాధేయపడి చికిత్స పొందుతుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు వైద్యులు హైదరాబాద్ తరహా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల వైద్యం అంటూ బోర్డులు ఏర్పాటు చేసి మభ్య పెడుతున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉండాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు గానీ ఏవీ ఉండవు. ఇక చిన్నపిల్లల ఆస్పత్రుల వైద్యులైతే మరీ దారుణం. ఆస్పత్రికి వెళ్తే అడిగినంత డబ్బులు కట్టాల్సిందే. డబ్బులు కట్టినా ప్రాణాలకు భరోసా ఉండదు. పరిస్థితి విషమించాక వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ చేతులెత్తేసిన, ప్రాణాలు పోయిన ఘటనలు కోకొల్లలు. బాధిత కుటుంబాల ఆందోళనలూ అనేకంగా ఉన్నాయి. ఆందోళనలు.. వైద్యుల నిర్లక్ష్యమో.. పరిస్థితి విషమమో తెలియదు గానీ మధ్య తరగతి ప్రజల ప్రాణాలతో కొందరు వైద్యులు చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చిన్నారుల మృత్యువాత ఘటనలు వైద్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతిచెందారంటూ బాధితులు ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి కొన్ని సంఘాల నాయకులు తోడై ఆందోళనలు చేయడం, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అటు వైద్యులతో చర్చలు జరిపి సెటిల్మెంట్లు చేసి ఖరీదు కట్టడం పరిపాటిగా మారింది. బాధితుల ఆందోళనకు ఆసుపత్రి యాజమాన్యాలు ఎంతో కొంత ముట్టజెప్పి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. 15 రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు మృతి నిర్లక్ష్యం.. ఖరీదైన ప్రాణాలు..! -
తల్లి సర్పంచ్.. తనయుడు ఉప సర్పంచ్
లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లి గ్రామ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్గా తల్లీ కొడుకులు బాధ్యతలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పార్పెల్లి గ్రామ సర్పంచ్గా అబ్బడి పుష్ప విజయం సాధించారు. పుష్ప రెండో కుమారుడైన అబ్బడి విద్యాసాగర్ రెడ్డి వార్డు మెంబర్గా గెలుపొందారు. దీంతో సోమవారం తల్లి పుష్ప పార్పెల్లి సర్పంచ్గా, కుమారుడు విద్యాసాగర్ రెడ్డి ఉప సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం బాధ్యతలు.. మధ్యాహ్నం రాజీనామాతానూరు: మండలంలోని నంద్గాంలో ఇటీవల 3వ వార్డు మెంబర్గా గెలిచిన నాగేశ్ సోమవారం ఉదయం సర్పంచ్, వార్డుసభ్యులతో కలిసి ప్రమాణస్వీకారం చేశారు. మధ్యాహ్నం అనివార్య కారణాలతో వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో శ్రీధర్కు అందించారు. ఈ విషయమై ఎంపీడీవోను సంప్రదించగా.. వార్డు మెంబర్ పదవికి నగేశ్ రాజీనామా పత్రాన్ని అందించారని, రాజీనామా ఆమోదించే అధికారం తనకు లేదని, పై అధికారులకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
డిజిటల్ లర్నింగ్ పుస్తకం ఆవిష్కరణ
మంచిర్యాలటౌన్: డిజిటల్ లర్నింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ అనే అంశంపై విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయుడు బి.రాజమౌళి రాసిన పుస్తకాన్ని డీఈవో యాదయ్య సోమవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించేలా ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ పుస్తకాలను ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశపెట్టిందని డీఈవో తెలిపారు. పైథాన్ ప్రోగ్రాం లాంగ్వేజీని సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. డిస్ట్రిక్ట్ క్వాలిటీ కోఆర్డి నేటర్ సత్యనారాయణమూర్తి, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఐసీటీ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ కోఆర్డినేటర్ బరత్, ప్రధానోపాధ్యాయురాలు ఐ.పద్మజ, కే.విజ యలక్ష్మీ, చౌదరి, మల్లేశ్, రాజకుమార్ పాల్గొన్నారు. -
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం వద్ద కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని బోలెరో ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరం
మంచిర్యాలఅర్బన్: విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తుందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్ర మాదం పొంచి ఉందని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కా ర్యదర్శి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మంచిర్యాలలో టీఎస్యూటీఎఫ్ జిల్లా విస్తృతస్థాయి కమిటీ స మావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి నాణ్యమైన విద్యనందించకుండా ఫిజిక్స్వాల, ఖాన్ అకాడమీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవటమేంటని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో జనగామలో నిర్వహించే రాష్ట్ర విద్యాసదస్సుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి రాజావేణు, ఉపాధ్యక్షులు కిరణ్కుమార్, కార్యదర్శులు నర్సయ్య, చంద్రమౌళి, సంపత్, జైపాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటిపై ‘కోర్’ దెబ్బ!
ఆదిలాబాద్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తమ సొంతింటి కల నెరవేరబోతుందని వారు ఎంతో సంబర పడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు వారి పూరి గుడిసెలను తొలగించుకున్నారు. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేసేందుకు ఆదివాసీల సంప్రదాయ బద్ధంగా డోలు వాయిద్యాలతో అధికారులను ఆహ్వానించారు. ఇంటి నిర్మాణం కోసం పునాదులు సైతం తోడుకున్నారు. కొంత మంది లబ్ధిదారులు సిమెంట్ పిల్లర్లు వేసుకున్నారు. తీరా అధికారులు ఈ ప్రాంతాం కోర్ ఏరియా అంటూ, సిమెంట్ నిర్మాణ పనులు చేపట్టడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. గుడిసెలను తొలగించుకోవడంతో ఇప్పుడు తమకు కనీసం నివాసం ఉండేందుకు ఇళ్లు లేవని, చలికాలం కావడంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 6,043 ఇళ్లు మంజూరు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీలకు 6,043 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. చాలా చోట్ల ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలంలో 42 గ్రామాలు కోర్ ఏరియా ప్రాంతంలో ఉన్నాయని, లబ్ధిదారులు సిమెంట్తో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక వారు ఇంటి నిర్మాణాలను చేపట్టకుండా తాత్కాలికంగా ప్రస్తుతం గుడిసెలలో నివాసముంటున్నారు. 252 మందికి పైగా లబ్ధిదారులు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలంలో 12కి పైగా గ్రామాలు కోర్ ఏరియాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో సుమారు 252 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. సిమెంట్తో ఇండ్లను నిర్మించడానికి వీలు లేదని అధికారులు చెప్పడంతో వారు ఏం చేయాలో తోచక అయోమయంలో ఉన్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఉట్నూర్ మండలంలోని చెరువుగూడ గ్రామానికి చెందిన ఆత్రం కాశీరాం కుటుంబం. ఈ కుటుంబానికి పీఎం జన్మన్ పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో కుటుంబం వారి గుడిసెను తొలగించుకుని, కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ లెవల్లో పునాది వేశారు. అయితే అధికారులు సిమెంట్ ఇంటి నిర్మాణం చేపట్టవద్దని అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతం భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి కర్ర ఇంటిలో నివాసముంటున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారుల ప్రతిభ
ఆదిలాబాద్టౌన్: రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారులు ప్రతిభ కనబర్చారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్లోని రైల్వే నిలయం ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎకై ్సజ్, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆసిఫాబాద్ డీపీఈవో జ్యోతికిరణ్ బాడ్మింటన్లో ప్రథమ బహుమతి సాధించగా, చెస్, క్యారమ్ పోటీల్లో ఇచ్చోడ సీఐ జుల్ఫేఖార్ అహ్మద్ రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. వీరిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.రఘురాం అభినందించారు. వీరు బహుమతులు అందుకోవడంపై ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. -
కరెంట్ షాక్తో కౌలు రైతు మృతి
నెన్నెల: కొత్తూర్ గ్రామానికి చెందిన గుగ్లోత్ శ్రీనివాస్(35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం.. శ్రీనివాస్ పొట్యాల గ్రామ శివారులో కౌలుకు తీసుకున్న పంట పొలానికి రక్షణగా సోలార్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. సోలార్ తీగలకు తెగిన కరెంట్ మోటారు వైర్ తగలడంతో విద్యుత్ సరఫరా జరిగింది. పొలంలో ఎరువులు చల్లుతుండగా ప్రమాదవశాత్తు తీగలు తాకడంతో శ్రీనివాస్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త ఇంటికి రాకపోవడంతో భార్య లక్ష్మి పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. సమీపంలోని పశువుల కాపరులను పిలిచి మోటారుకు ఉన్న విద్యుత్ కనెక్షన్ను తొలగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు సింధు, బింధుతో పాటు కుమారుడు వరుణ్ ఉన్నారు. మృతుడి ఆధారాలు లభ్యంరెబ్బెన: మండలంలోని దేవులగూడ సమీపంలోని రైల్వేట్రాక్పై శనివారం రామగిరి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆచూకీ తెలిసినట్లు బెల్లంపల్లి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఆసిఫాబాద్ మండలంలోని బొందగూడకు చెందిన ఇట్యాల శ్రీకాంత్ (30)గా గుర్తించామన్నారు. మృతుడు గ్రామంలో చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని తల్లి సాంతారా బాయితో కలిసి జీవిస్తున్నాడన్నారు. అయితే చిన్నతనంలో శ్రీకాంత్ కుడిచేయి పైనుంచి ఎడ్లబండి వెళ్లడంతో చేయి వంకర తిరిగి వికలాంగుడిగా మారాడని పేర్కొన్నారు. ఆయన తరుచూ గోలేటి, అబ్బాపూర్ ప్రాంతాల్లో ఉండే తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేవాడన్నారు. శనివారం రెబ్బెన మండలంలోని దేవులగూడ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు గల కారణా లు ఏంటో తెలియరాలేదన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కో ణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ప్రభుత్వం ఆందోళనలు పట్టించుకోవడం లేదు
కొలాం ఆదివాసీ గిరిజనులు ఇళ్లు మంజూరైనప్పుడు సంబరపడ్డారు. గుడిసెలను తొలగించుకుని సిమెంట్తో ఇంటి నిర్మాణం చేస్తామంటే అధికారులు అడ్డుపడుతున్నారు. వారి ఆవేదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళనలు చేస్తున్నాం. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం కలెక్టర్ను కలుస్తాం. – కొడప సొనేరావ్, ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
జాతీయ యోగా, కరాటే పోటీలు
మందమర్రిరూరల్: పట్టణంలోని జాతీయ రహదారి టోల్గేట్ సమీపంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో ఇండియన్ యోగా స్కూల్, ప్రొఫెషనల్ యోగా అసోసియేషన్ (మంచిర్యాల) వారి ఆధ్వర్వంలో ఆదివారం జాతీయ యోగా, కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి యోగాభ్యాసకులతో పాటు కరాటే క్రీడాకారులు సుమారు 900 మంది పాల్గొని వారి ప్రతిభ చాటుకున్నారు. నిర్వాహకులు వెంకటేశ్, కమిటీ చైర్మన్ కొంపెల్లి రమేశ్ మాట్లాడుతూ ప్రతి రోజు గంట సమయం యోగా కోసం కేటాయిస్తే ఆరోగ్యం బాగుంటుందని, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్తో పాటు ప్రశంసాపత్రాలు అందించారు. పోటీలకు జడ్జిగా రేవెల్లి రాజలింగు వ్యవహరించగా నిర్వాహకులు రమేశ్, ప్రశాంత్గౌడ్, సుమంత్, వినోద్గౌడ్, గీతాదేవి, ఉమామహేశ్, రాజశేఖర్, రమేశ్రాజా, సీనియర్ యోగా మాస్టర్స్, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. -
టీబీపై రణం!
మంచిర్యాలటౌన్: క్షయ (టీబీ) నిర్మూలనే లక్ష్యంగా ప్రధానమంత్రి టీబీ రహిత భారత్ (పీఎం ముక్త్ భారత్ అభియాన్) కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతోంది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు కేంద్ర క్షయ నియంత్రణ విభాగం, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంయుక్తంగా జిల్లాకు రూ.23లక్షల విలువైన పోర్టబుల్ ఎక్స్రే మిషన్ను అందించాయి. జిల్లా జనాభాలో 20 శాతం 1,76,339 మందిని ఎక్స్రే మిషన్ ద్వారా పరీక్షించి ఏఐ అనుసంధానం ద్వారా రిపోర్టును రోగికి, సమీపంలోని పీహెచ్సీ వైద్యులు, వైద్య నిపుణులకు పంపిస్తున్నారు. 60ఏళ్లు పైబడిన వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, బరువు తక్కువ ఉన్నవారితో పాటు వ్యాధిగ్రస్తుల కుటుంబీకులకు ఎక్స్రే పరీక్షలు చేసేందుకు ఒక సాంకేతిక నిపుణుడు, ఒక సూపర్వైజర్ను కేటాయించారు. 2030 లోపు అంతం చేసేలా.. క్షయను పూర్తిగా నియంత్రించేందుకు కొన్నేళ్లుగా వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నా ఏటా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. నివురుగప్పిన నిప్పులా వ్యాధి విస్తరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం దానిని నిర్మూలించడమే లక్ష్యంగా ఐదేళ్లుగా కృషి చేస్తోంది. అయినా, ఏటా వ్యాధిగ్రస్తుల సంఖ్య వెయ్యికి పైగానే నమోదవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి వ్యాధిని పూర్తిగా అంతమొందించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించింది. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణైతే బాధితులకు మందులు అందజేస్తున్నారు. సరైన క్రమంలో మందులు వాడుతూ మంచి పౌష్టికాహారం తీసుకుంటే పూర్తిస్థాయిలో టీబీ నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి గుర్తింపు, చికిత్స ఇలా.. ఈ వ్యాధి మైకో బ్యాక్టీరియా ట్యూబర్క్యూలోసిస్ ద్వారా సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులకు లేదా శరీ రంలోని ఇతర భాగాలకు రెండు రకాలుగా వ్యాపిస్తుంది. 85శాతం మందికి ఊపిరితిత్తులకే సోకడం గమనార్హం. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, ఆకలి మందగించడం, బరువు త గ్గడం, చాతినొప్పి, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తె మడ వస్తే వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బాధితులకు వ్యాధి తీవ్రతను బట్టి ఆరు, ఎనిమిది నెలలు, రెండేళ్ల కోర్సు ప్రకారం మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుడు దగ్గి నా, తుమ్మినా తుంపర్లు గాలిలో కలిసి బ్యాక్టీరియా ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వ్యాధి బారిన తొందరగా పడతారు. హెచ్ఐవీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, అతిగా మద్యం సేవించేవారు, పొగతాగేవారు, గర్భిణులు, పిల్లల తల్లులు, సరైన పోషకాహారం తీసుకోని వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు త్వరగా దీని బారిన పడే ప్రమాదముంది. చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ట్యాబ్లెట్లు వేసుకునేలా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించేందుకు అధునాతన సీబీనాట్ (క్యాట్రేజ్ బేస్డ్ న్యూక్లిస్ ఆసిడ్ ఆంప్లీ క్లీన్ టెస్టు) విధానం (క్షయ నివారణ విభాగం కేంద్రం) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఉండగా, బెల్లంపల్లి సీహెచ్సీలో టునాట్ మిషన్లు అందుబాటులోకి తెచ్చారు. జిల్లా ఆస్పత్రిలో టీబీ టెస్టుల కోసం ప్రత్యేక గది కేటాయించి, సీబీనాట్తో పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. టెస్టుల కోసం ట్రూనాట్ మిషన్ కూడా ఏర్పాటు చేయగా, అనుమానితుల నుంచి శాంపిళ్లు సేకరించి వ్యాధిని నిర్ధారిస్తున్నారు. ఇందుకు గాను వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆస్పత్రికి రావాల్సిన అవసరం ఉండగా, ప్రస్తుతం కేటాయించిన పోర్టబుల్ ఎక్స్రే మిషన్తో ప్రజల వద్దకే వెళ్లి వ్యాధిని నిర్ధారించే అవకాశమేర్పడింది.జిల్లాలో గుర్తించిన టీబీ కేసులు ఇలా.. సంవత్సరం గుర్తించిన కేసులు 2020 1,138 2021 1,284 2022 1,445 2023 1,413 2024 1,282 2025 1,071 అనుమానితుల సంఖ్య 1,76,339ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలు 27,599గుర్తించిన వ్యాధిగ్రస్తులు 1,071 -
‘ఫంక్షన్ హాల్’ స్వాధీనమేనా?
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: మందమర్రి శివారు, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ చిక్కుల్లో పడింది. ఏజెన్సీ పరిధిలోని రూ.కోట్ల విలువైన 2.10గుంటల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? లేదా? అని సర్వత్రా చర్చనీయాంశమైంది. మందమర్రి శివారు ఏజెన్సీ ప్రాంతం 1/70 చట్ట పరిధిలో ఉన్నది తెలిసిందే. అయినప్పటికీ ఇక్కడ విచ్చలవిడిగా కబ్జాలు జరుగుతున్నాయి. ఏజెన్సీలో గిరిజనులకే సర్వ హక్కులుంటాయి. గిరిజనేతరులైతే చట్టం అమలులోకి రాక ముందున్న పట్టాదారుల వారసులకే బదిలీ అవుతాయి లేదా గిరిజనులకు అమ్ముకోవచ్చు. కానీ, ఏజెన్సీ చట్టాన్ని తుంగలో తొక్కి గిరిజనేతరులే రియల్ దందాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎకరాల కొద్దీ వ్యవసాయ భూముల్లోనూ ప్లాట్లు వెలిశాయి. ఇదే తీరుగా జాతీయ రహదారికి ఆనుకుని ఓ ఫంక్షన్ హాల్ నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూ ఆక్రమణ, నిర్మాణంపై 2016లో ఆదివాసీ నాయక్పోడు సేవా సంఘం అధ్యక్షుడితో పాటు మరో నలుగురు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడితోపాటు మరో తొమ్మిది మంది వేర్వేరుగా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ), ఉట్నూరుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోని నిర్మాణం చట్ట విరుద్ధమని తేలుస్తూ ఎస్డీసీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీటిపై హైకోర్టుకు వెళ్లగా కోర్టు కూడా మళ్లీ అధికారులనే పూర్తి విచారణ చేసి తేల్చాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా విచారణ సాగింది. తుదిగా ఈ నెల 16న సర్వే నంబర్ 350/2/4 పరిధిలోని 2.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ ఎస్డీసీ, మందమర్రి తహసీల్దార్కు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఆక్రమణదారులకు నోటీసులిచ్చారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రి సమీప నాయకుడే అనుభవదారుగా ఉండడంతో ఏ మేరకు అధికారులు ముందుకు సాగుతారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు పట్టాదారులు బీసీల నుంచే కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందనేది వేచి చూడాలి. -
మహాసభలను విజయవంతం చేయండి
మంచిర్యాలఅగ్రికల్చర్/జైపూర్: ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాలుగో మహాసభలను జ యప్రదం చేయాలని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జైపాల్సింగ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద, జైపూర్ మండల కేంద్రంలో మహాసభల పోస్టర్ ఆవి ష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గద్దర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. టీపీఎఫ్ మహాసభలకు అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాయకులు పోశం, నందన్, సత్యనారాయణ, శంకర్, జాడి చంద్రయ్య, పోచం, ఆనంద్, మల్లయ్య, నంబన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
● నేడు కొలువుదీరనున్న పాలకవర్గాలు ● గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ● కొత్త సర్పంచులపై గ్రామీణుల ఆశలు ● ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేనా?
బెల్లంపల్లి: జిల్లాలో కొత్తగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గాలు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లోని 306 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా ప్రజలకు ఎన్నో హామీలిచ్చి సర్పంచులుగా గెలిచినవారికి పల్లెల్లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక ఏ గ్రామంలో చూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. నేటి నుంచి పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరనుండగా సమస్యలు పరిష్కారమవుతాయని, నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చుతారని ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అధ్వానంగా రహదారులు ఆయా గ్రామాల ప్రధాన, అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. బీటీ, కంకర చెదిరి గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందులెదురవుతున్నాయి. భీమిని, వేమనపల్లి, కాసిపేట, తాండూర్, కన్నెపల్లి, నెన్నెల, కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్, మందమర్రి, దండేపల్లి, జన్నారం, హాజీపూర్, బెల్లంపల్లి తదితర మండలాల్లోని ఆయా గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పారిశుధ్యం.. అస్తవ్యస్తం పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. రో జువారీగా చెత్త సేకరించడంలేదు. మొక్కుబడిగా సి బ్బందితో అక్కడక్కడా చెత్త తొలగించినట్లు చేసి మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ దు స్థితి ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలోనూ నెలకొంది. దీంతో గ్రామీణులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పంచాయతీకో ట్రాక్టర్ ఉన్నప్పటికీ పారి శుధ్య పనులు నిర్వహించేందుకు సరిపడా సిబ్బంది లేరు. చెత్తాచెదారం రోడ్లు, వీధుల్లో రోజుల తరబడి పేరుకుపోయి జనం ఇబ్బంది పడుతున్నారు. పూడికతో నిండిన డ్రైనేజీలు మురుగునీటి పారుదల సౌకర్యం ఏళ్లు గడుస్తున్నా మెరుగుపడటం లేదు. ఏటా కాలువల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నా నాణ్యతలేమితో త్వరగా పాడైపోతున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మెజార్టీ గ్రామపంచా యతీల్లోని మురుగుకాలువలు పూడికతో నిండి దు ర్గంధం వ్యాపింపజేస్తున్నాయి. మురుగుకాలువలు దోమలకు ఆవాసంగా మారగా జనం వ్యాధుల బా రిన పడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో మురుగుకాలువలు సరిగా లేక రోడ్లపై నుంచి డ్రైనేజీ నీరు పారుతూ జనం నడవలేని స్థితికి చేరుతున్నాయి. శిథిలావస్థలో పంచాయతీ భవనాలు జిల్లాలో పలు పంచాయతీలకు నేటికీ సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో పంచాయతీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. పక్కా భవనాలున్న చా లాచోట్ల శిథిలావస్థకు చేరుకుని దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. వీటికి మరమ్మతులు చేయాల్సిన అవసరమున్నా పట్టింపు కరువైంది. పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాల్సి ఉండగా ఏళ్లు గడుస్తున్నా అలాంటి చర్యలేవీ కనిపించడంలేదు. బంజరుదొడ్లపై పట్టింపు కరువు గ్రామపంచాయతీలకు కాస్తో.. కూస్తో ఆదాయాన్ని తెచ్చి పెట్టే బంజరు దొడ్ల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారు. వీటి నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. గ్రామాల్లో విచ్చలవిడిగా రోడ్లపై సంచరించే, పొలాలకు వెళ్లి పంటచేన్లకు నష్టం కలిగించే మూగజీవాలను బంజరుదొడ్డిలో తోలే విధానం జిల్లాలో ఇంకా చాలాచోట్ల ఉంది. పశువుల యజమానుల నుంచి పన్ను వసూలు చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉండగా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగే వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. అనేక చోట్ల ఊరికి దూరంగా వీటిని ఏర్పాటు చేయగా పట్టింపు కరువైంది. క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు చాలాచోట్ల ఆకతాయిలు, మందుబాబులకు అడ్డాగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవుతున్నాయి.చాలాచోట్ల మరమ్మతుకు నోచుకోని చేతిపంపులుగ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన చేతిపంపులు అలంకారప్రాయంగా మారాయి. మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సమస్య ఏర్పడిన ప్రతీసారి గ్రామీణులు సొంతంగా మెకానిక్ కు సొంత డబ్బులు చెల్లించి రిపేర్ చేయించుకుంటున్నారు. ఇంకొన్ని పంచాయతీల్లో తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు లీకేజీలేర్పడి మరమ్మతుకు నోచుకోవడంలేదు. ఫలి తంగా గ్రామీణులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలని నూతన పాలకవర్గాలను కోరుతున్నారు.ఇచ్చిన హామీలు నెరవేరేనా?పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చారు. ప్రతీ ఒక్కరి ఇంటి పన్ను చెల్లిస్తామని, గ్రంథాలయం, జిమ్ ఏర్పాటు చేయిస్తామని, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని, పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామని, మినరల్ వాటర్ సరఫరా చేస్తామని, ఆడబిడ్డ పెళ్లికి రూ.5వేల కట్నం అందజేస్తామని, ఎవరు మృతి చెందినా బాధిత కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం చేస్తామని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేయిస్తాం అని.. ఇలా హామీల వరద పారించి సర్పంచులుగా గెలిచారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతమంది సర్పంచులు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో చూడాలి మరి. -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
మందమర్రిరూరల్: పట్టణంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగన్మోహన్రెడ్డి అభిమాన సంఘం నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జగన్మోహన్రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అ భివృద్ధి చెందిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్రెడ్డి సీఎం కావా లని ఆకాంక్షించారు. నాయకులు దుర్గం నాగేశ్, అజీమొద్దీన్, ప్రభుదేవ్, రాజ్కుమార్, కవిరాజ్, సుందర్, జావీద్పాషా, అజయ్, షారూఖ్ తదితరులు పాల్గొన్నారు. -
కడెం.. సరికొత్త రికార్డు
కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్టు. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్లోనూ పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతోంది. గత ఐదేళ్లలో డిసెంబర్లో ఈ స్థాయిలో నీటిమట్టం లేదు. ప్రస్తుతం ఎఫ్ఆర్ఎల్ (700 అడుగులు) చేరింది. సాగు నీటి ప్రణాళిక సిద్ధం కాకముందే ఆయకట్టు రైతులు యాసంగి పంటలకు సిద్ధమవుతున్నారు. రికార్డుస్థాయి నీటి మట్టం.. గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కడెం ప్రాజెక్టు రికార్డు స్థాయి నీటిమట్టం కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.9.26 కోట్లతో మరమ్మత్తులు చేయించడం, గేట్ల లీకేజీలను అరికట్టడం, అధికారులు, ఇంజినీర్ల కృషితో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం మెయింటేన్ అవుతోంది. రేపు నీటివిడుదలపై సమావేశం కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు యాసంగి సాగునీటి వి డుదలపై ఈనెల 23న, కడెం ఆయకట్టుకు రైతాంగంతో ఇరిగేషన్ అధికారులు సమావేశం నిర్వహించారు. రైతులతో చర్చించి ఆయకట్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.గత పదేళ్లలో డిసెంబర్లో కడెం నీటిమట్టం వివరాలు.. సంవత్సరం నీటిమట్టం 2016 693.750 2017 687.650 2018 682.425 2019 699.075 2020 696.450 2021 698.925 2022 695.400 2023 683.700 2024 695.175 2025 700 కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు ప్రస్తుత నీటి మట్టం 700 అడుగులు ఖరీఫ్లో సాగు విస్తీర్ణం 68,150 ఎకరాలు యాసంగిలో సాగువిస్తీర్ణం 25 వేల ఎకరాలు -
కాంగ్రెస్ నాయకుల నిరసన
రామకృష్ణాపూర్: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహా మీ పథకం నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ పేరు తొలగించినందుకు నిరసనగా రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియం వద్ద గాంధీ వి గ్రహం ఎదుట ఆదివారం కాంగ్రెస్ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలను అందించిన మహా నేత ల కుటుంబాలను బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని రఘునాథ్రెడ్డి ఆరోపించా రు. గాంధీ పేరు మార్చడం సబబుకాదని పేర్కొన్నారు. కార్యక్రజుంలో పార్టీ పట్టణాధ్యక్షుడు పల్లె రాజు, నాయకులు గాండ్ల సమ్మ య్య, వొడ్నాల శ్రీనివాస్, శ్యాంగౌడ్, అజీజ్, గోపురాజం తదితరులు పాల్గొన్నారు. -
తపాలా కార్యాలయాలకు తాళం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రం మంచిర్యాలలో పోస్టాఫీసులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో మంచిర్యాలలో హెడ్ పోస్టాఫీసుతో సహా నాలుగు పోస్టాఫీసులు ఉండేవి. గత సెప్టెంబర్లో నగరంలోని ఓవర్ బ్రిడ్జి పక్కనున్న గ్రెయిన్ మార్కెట్ ఏరియా పోస్టాఫీసును అధికారులు మూసి వేశారు. అక్కడి సిబ్బందిని ఇతర ప్రాంతాల్లోని శాఖలో సర్దుబాటు చేశారు. రైల్వేస్టేషన్ దగ్గరలోని బజార్ ఏరియా పోస్టాఫీసు భవనం శిథిలావస్థకు చేరడంతో మరమ్మతు చేస్తున్నారు. దీంతో అక్కడా తపాలా సేవలు నిలిపివేశారు. అక్కడి సిబ్బంది జన్మభూమి నగర్లోని ప్రధాన తపాలా కార్యాలయంలో పని చేస్తున్నారు. కాగా, ఏసీసీలోని పోస్టాఫీసు కూడా మూతపడింది. సరైన రక్షణ లేకపోవడంతో కార్యాలయ సామగ్రి చోరీకి గురవుతుండడంతో మూసి వేశారు. దీంతో మంచిర్యాలలో ఒకే ఒక్క హెడ్పోస్టాఫీసులోనే వినియోగదారులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. వివిధ రకాల సేవల కోసం వచ్చిన వారు చాలాసేపు వేచి చూడాల్సి వస్తోంది. రిజిష్టర్ పోస్టులు, స్పీడ్పోస్టు సేవలు, ఎలక్ట్రానిక్ మనియార్డర్ సేవలు, ప్రసాదాల పంపిణీ, టీటీడీ దేవస్థానం దర్శనం బుకింగ్లు, ఆర్డీలు, డీడీలు, కిసాన్ వికాస పత్రాలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ జారీ, సేవింగ్స్ బ్యాంకు, సీనియర్ సిటిజన్ సేవలు, పీపీఎఫ్ ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజన, ఆధార్ సేవలు అందిస్తున్నారు. నగరంలో దాదాపు 1.50లక్షల జనాభా నివాసం ఉంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. జనాభా, వినియోగదారులు పెరుగుతున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పోస్టాఫీసులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏరియాల వారీగా కొత్తగా తపాలా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సత్వర సేవలు అందుతాయని వినియోగదారులు కోరుతున్నారు. -
బల్దియాలో మళ్లీ విస్తరణ పనులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో రోడ్డు విస్తరణ పనులు మళ్లీ చేపట్టారు. శనివారం పాతబస్టాండ్ చౌరస్తా వద్ద నుంచి అంబేడ్కర్ నగర్ చౌరస్తాకు వెళ్లే మార్గంలో అడ్డుగా ఉన్న కట్టడాలను బేసీబీలతో తొలగించారు. రోడ్లకు ఇరువైపుల ఉన్న ఇళ్లు, దుకాణాల యజమానులకు నోటీసులు అందజేసినా స్పందించకపోవడంతో బందోబస్తు మధ్య గదులు, ప్రహరీ పడగొట్టించారు. కొందరు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్తో వాగ్వాదానికి దిగారు. ఆటోస్టాండ్ను తొలగించి స్థలాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని ఆటోడ్రైవర్లు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన రామ్కుమార్కు పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆటోస్టాండ్ స్థలంలోనే గ్రామీణ ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం రూ.10లక్షల అంచనాతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. బందోబస్తులో బెల్లంపల్లి వన్టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సీఐలు కే.శ్రీనివాసరావు, సిహెచ్.హనోక్, ఎన్.దేవయ్య, బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై సిహెచ్.కిరణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బుగ్గగూడం శివారులో పులి సంచారం
కాసిపేట: మండలంలోని బుగ్గగూడం, బెల్లంపల్లి మండల శివారు అటవీ ప్రాంతాల మధ్య పులి సంచరిస్తోంది. శనివారం ఉదయం అటువైపుగా వెళ్లిన కొందరు వ్యక్తులు పులి పాదముద్రలు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్నాయక్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు అడవిలో పర్యటించారు. పులి సంచరిస్తోందని పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు. సమీప గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. రేంజ్ అధికారి పూర్ణచందర్ మాట్లాడుతూ పులి ఉందని అటవీ శాఖ అధికారులు చెప్పే వరకు పుకార్లు నమ్మవద్దని బుగ్గగూడ, లంబాడితండా(డీ), కర్షలగట్టం గ్రామాల్లో డప్పు చాటింపు వేయించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలోకి మేకల కాపరులు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, రైతులు, కూలీలు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. పులి తిర్యాణి మండలం వైపు వెళ్లినప్పటికీ గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలో కదలికలు ఉన్నాయని తెలిపారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
భీమారం: గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన కొత్తపల్లి గ్రామానికి చెందిన రత్న వేణుగోపాల్రెడ్డి (43) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాలు.. భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్రెడ్డి గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై రోజూ మద్యం సేవిస్తుండగా భార్య లత హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురై మద్యం సేవించిన మత్తులో భార్యతో గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి 10.30 గంటలకు ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా శనివారం మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూర్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతిదిలావర్పూర్: మండల కేంద్రం దిలావర్పూర్ సమీపంలో నిర్మల్ –భైంసా రహదారిపై టోల్ఫ్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్యారంగుల తిమ్మయ్య(45) అనే వ్యక్తి మృతి చెందినట్లు దిలావర్పూర్ ఎస్సై రవీందర్ వెల్లడించారు. భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన తిమ్మయ్య తన ద్విచక్రవాహనంపై నిర్మల్ వెళ్తుండగా సాయంత్రం దిలావర్పూర్ సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఎన్హెచ్ఏఐ అంబులెన్స్లో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తప్రావం కాగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీ రోడ్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఆటోడ్రైవర్, బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలోని బాబానగర్కు చెందిన మెడపట్ల వెంకటేష్ తన ఆటోలో బాబానగర్లోని ప్రభుత్వ పాఠశాల టీచర్లు, మరికొందరు ప్రయాణికులతో మంచిర్యాలకు వస్తున్నాడు. మంచిర్యాల నుంచి క్వారీ వైపు వెళ్తున్న ఓ కారు రాంగ్ రూట్లో వచ్చి అతివేగంగా ఆటోను ఢీకొట్టింది. ఆటోడ్రైవర్ వెంకటేష్, ఇద్దరు ప్రభుత్వ టీచర్లకు స్వల్ప గాయలయ్యాయి. కారులో న్యాయవాది లోగో, నల్గొండ జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఐడీ కార్డు లభించడం చర్చనీయాంశమైంది. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ ప్రమోద్రావును సంప్రదించగా.. ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
సింగరేణి ఆవిర్భావ వేడుకలపై అశ్రద్ధ బాధాకరం
పాతమంచిర్యాల: సింగరేణి ఆవిర్భావ వేడుకలపై అశ్రద్ధ వహించడం బాధాకరమని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య అన్నారు. మంచిర్యాలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేడుకలకు యాజమాన్యం నిధులు కేటాయించకపోవడం, జీఎం కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించడాన్ని తప్పు పట్టారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీపై ఉన్న శ్రద్ధ సింగరేణి సంస్థపై లేకపోవడం బాధాకరమని, అధికారుల అనాలోచిత నిర్ణయాలు కార్మికుల మనోభావాలు దెబ్బ తీశాయని అన్నారు. ఈసారి కూడా వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరా రు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని, గంగయ్య, రాజేశం, పర్వతాలు పాల్గొన్నారు. -
జంగుబాయి ఉత్సవాలకు వేళాయె
జంగుబాయి గుహముస్తాబైన అమ్మవారి ప్రాంగణంతెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదాస్పద ప్రాంతం కెరమెరి మండలం ముకదంగూడ గ్రామ పంచాయతీకి చెందిన మహరాజ్గూడ అడవుల్లో జంగుబాయి దేవత కొలువైంది. నియమనిష్టలతో, భాజాభజంత్రీల నడుమ ఆదివాసీలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ నెల 22 నుంచి జనవరి 17 వరకు జంగుబాయి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహరాజ్గూడ అడవుల్లో ఉన్న బోరు నుంచి పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించడంతోపాటు హాల్, పోచమ్మ ఆలయానికి రంగులు వేశారు. 20 సోలార్ విద్యుత్ లైట్లను సైతం అమర్చనున్నారు. ఆలయ క్షేత్రం వరకు సీసీ రోడ్డు కూడా వేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గమనార్హం. ఎనిమిది గోత్రాలు ఒకే వేదికపై.. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని జంగుబాయి వారసులు వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హెర్రకుంరం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. వారంతా కాలిబాట, ఎడ్లబండ్లపై వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు పుజారులుగా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతాయి. వనక్షేత్రంలో బస చేసిన పోచమ్మతల్లికి కూడా మొక్కులు తీర్చుకుంటారు. తమ ఇళ్లకు తాళాలు పెట్టి ఎనిమిది కుటుంబాలకు చెందిన ఆదివాసీలు ఈ ఉత్సవానికి తరలివస్తారు. సుమారు వెయ్యికి పైగా ఎడ్లబండ్లు వచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నైవేద్యాలు తయారు చేసి సంప్రదాయ వాయిద్యాలతో గుహలోకి వెళ్లి అమ్మ వారిని దర్శించుకుంటారు. అక్కడున్న మైసమ్మ, పోచమ్మ, రావుడ్ దేవతల వద్దకు వెళ్లి మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి వంటలు చేసి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలు చేస్తారు. దారి మధ్యలో ఉన్న టొప్లకసకు వెళ్లి పూజలు చేస్తారు. ప్రభుత్వం గుర్తింపుతో అభివృద్ధి.. ఎనిమిదేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం జంగుబాయి ఉత్సవాలకు గుర్తింపు ఇచ్చింది. ఏటా రూ.10 లక్షలు అభివృద్ధి కోసం విడుదల చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, సత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇ తర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. చేరుకోవడం ఇలా.. జంగుబాయి పుణ్యక్షేత్రానికి కెరమెరి మండలం నుంచి ఆనార్పల్లి మీదుగా ఉమ్రి వంతెన నుంచి పరందోళి మీదుగా, లేదా పరంధోళి సమీపం నుంచి ముకదంగూడ గ్రామానికి ఆనుకుని ఉన్న కచ్చా రోడ్డు గుండా వెళ్లవచ్చు. లేదా నార్నూర్ క్రాస్రోడ్డు నుంచి కొత్తపల్లి మీదుగా, ఆదిలాబాద్ నుంచి లొకారి మీదుగా జంగుబాయి క్షేత్రానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. గుహలో కొలువు.. ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి దేవత గుహలో కొలువై ఉంది. గుహ కావడంతో భక్తులు కూర్చునే వెళ్లాల్సి ఉంటుంది. గుహలో దీపం వెలుగులో దేవత భక్తులకు దర్శనమిస్తుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆదివాసీలు విశ్వసిస్తారు. పుష్యమాసంలో కనిపించిన నెలవంక నుంచి ప్రారంభమైన జంగుబాయి జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది. ఎత్తయిన గుట్టలు.. చుట్టూ అడవుల మధ్య ఆదివాసీల కొంగుబంగారంలా విరాజిల్లుతోంది జంగుబాయి పుణ్యక్షేత్రం. లక్షలాది మంది ఆదివాసీలు ఆరాధించి పూజించే జంగుబాయి దేవతా ఉత్సవాలు ఈ నెల 22న నిర్వహించే దీపస్వరూప్తో ప్రారంభం కానున్నాయి. ప్రతీ సంవత్సరం పుష్యమాసం నుంచి నెల రోజులు పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. – కెరమెరి(ఆసిఫాబాద్) -
డీసీసీబీ ప్రత్యేకాధికారిగా ఆదిలాబాద్ కలెక్టర్ బాధ్యతలు
కై లాస్నగర్: ఉ మ్మడి ఆదిలా బాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రత్యేకాధికారిగా, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార శాఖ అధికారి బి.మోహన్, స హకార బ్యాంకు సీఈవో సూర్య ప్రకాశ్, డీజీఎంలు వెంకటస్వామి, భీమేందర్ తదితరులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసుఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ వివాహితను వేధిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన రోహిత్ హుస్సేన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు షీటీం ఇన్చార్జి బి.సుశీల తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ గృహిణి గతంలో ఓ సొసైటీలో పనిచేస్తున్న క్రమంలో సహఉద్యోగి రోహిత్ హుస్సేన్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆధారంగా చేసుకున్న నిందితుడు ఆమెను వేధిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో దాడులు చేస్తూ, డబ్బులు వసూలు చేసేవాడు. గతంలో నిందితుడు ఆమె ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి చేతులతో, కర్రతో దాడి చేశాడు. ఆమె ఆయన నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె చేతికి గాయమైంది. అంతేకాకుండా పలుమార్లు నగదు లాక్కొని పరారయ్యాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహిత ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు షీటీం ఇన్చార్జి తెలిపారు. -
ధ్యానం.. జీవనరాగం
ఆదిలాబాద్: ధ్యానం అంటే కేవలం కళ్లు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదని, ఆలోచనలు నియంత్రించుకోవడం, మనసును శాంతపరచుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడమేనని ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు. మరోవైపు పరిశోధనలు సైతం ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గడం, ఏకాగ్రత పెరగడం, నిర్ణయక సామర్థ్యం మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. నేడు ప్రపంచ ధ్యాన దినోత్సవం నేపథ్యంలో కథనం.. ఎన్నో ప్రయోజనాలు.. ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతమై ఆలోచనలపై నియంత్రణ సాధ్యమవుతుంది. ఆందోళన, కోపం, నిరాశ వంటి భావాలు క్రమంగా తగ్గుతాయి. ధ్యానం ఏకాగ్రతను పెంపొందిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత, ఆత్మవిశ్వాసం పెరగడం ధ్యానం వల్ల కలిగే మరో లాభం. ఆరోగ్యంపరంగా కూడా ధ్యానం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచడం, హృదయ ఆరోగ్యం మెరుగుపడటం, నిద్ర సమస్యలు తగ్గడం వంటి లాభాలు ధ్యానం ద్వారా సాధ్యమవుతాయి. రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా ధ్యానం సహకరిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం కదలకుండా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. మొదట్లో కొద్దిసేపు మాత్రమే ధ్యానం చేసి దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఐదు నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా పది లేదా ఇరవై నిమిషాలకు పెంచుకోవచ్చు. -
హాజీపూర్ ఉప సర్పంచ్ రాజీనామా
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దానయ్య తన ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీడీఓ సాయివెంకటరెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. ఈ నెల 11న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం వార్డు సభ్యుల అంగీకారంతో ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఏం జరిగిందో గానీ రాజీమానా చేయగా.. ఇంకా ఆమోదం కాలేదు. సోమవారం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఉప సర్పంచ్గా దానయ్య ప్రమాణ స్వీకారం చేయాలని అధికారులు అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేయకముందే రాజీనామా చేసే అవకాశం లేదని, ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లిన మీదట రాజీనామా ఆమోదించి ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఉప సర్పంచ్ అభ్యర్థి ఎన్ని క ఉంటుందని చెబుతున్నారు. ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలుకుంటాల: మండలంలోని కల్లూరు –కుంటాల రహదారిపై శనివారం సాయంత్రం ఆదర్శ పా ఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో వారికి గాయాలయ్యాయి. స్థానిక ఆ దర్శ పాఠశాల నుంచి ఓ ఆటోలో 12 మంది వి ద్యార్థులు కల్లూరు వెళ్తుండగా వెంకూర్ స మీపంలో బోల్తాపడింది. నర్సాపూర్ (జి) మండలంలోని బూర్గుపల్లి (కె) గ్రామానికి చెందిన జాదవ్ అక్షర, వైష్విక, చాక్పెల్లి గ్రామానికి చెందిన రశ్మిత, కుంటాల మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన పడకంటి స్వాతికి గా యాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో వారిని చికిత్స నిమిత్తం భైంసా, కల్లూరు తరలించారు. ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు సాయపడ్డారు. కనిపించకుండా పోయి.. శవమై తేలి బోథ్: సొనాల మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కా ర్మికుడు బత్తుల రాము(38) గ త మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. కాగా శనివారం రాత్రి సొనాల గ్రామ డంపింగ్ యార్డు వద్ద శవమై కనిపించాడు. పక్కనే ఉన్న చెట్టుకు తాడు కట్టి ఉంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఎస్సై శ్రీసాయి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిఽశీలించారు. పంచనామా నిర్వహించి మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా భార్య బత్తుల రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రశ్మిత పడకంటి స్వాతి -
భూమికోసం కొట్లాట.. ఒకరికి కత్తిపోట్లు
నార్నూర్: గాదిగూడ మండలం మేడిగూడ గ్రామంలో శనివారం భూతగాదాలలో ఒకరిపై కత్తితో దాడి జరిగింది. ఎస్సై ప్రణయ్, స్థానికుల కథనం ప్రకారం.. మేడిగూడ గ్రామానికి చెందిన రామ్ సిందే, ఆకాష్ సిందేలు వరుసకు బాబాయ్ కొడుకులు. బాబాయ్ అయిన రామ్ సిందే ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి పొలం పనికి వెళ్లాడు. గమనించిన ఆకాష్ సిందే వెనకాలే వెళ్లగా, ఇద్దరు భూమి విషయంలో గొడవపడ్డారు. గొడవ పెద్దది కాగా గ్రామానికి వచ్చిన తర్వాత కూడా మాటమాట పెరిగింది. ఆగ్రహానికి గురైన ఆకాష్ సిందే తన బాబాయ్ రామ్ సిందేపై వెనుక భాగాన రెండు చోట్ల కత్తితో పొడిచాడు. అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులపై సైతం దాడికి ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రామ్ సిందేను వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రామ్ సిందే భార్య విజయమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ తెలిపారు. -
సర్పంచ్గా ఓడినా హామీ నెరవేర్చారు..
కై లాస్నగర్(బేల): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓడినా ప్రజలకు ఇచ్చినా హామీని నెరవేర్చారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సామ రూపేష్రెడ్డి పోటీ చేశారు. తనను గెలిపిస్తే బాజీరావు మహరాజ్ ఆలయం వద్ద బోరు వేయిస్తానని హామీనిచ్చారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డి సహకారంతో ఆలయం వద్ద శనివారం బోరు వేయించారు. ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్తో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బెదుర్కర్ రవీందర్ పటేల్, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు వినోద్, మంచికంటి సాయి, ఊషన్న, సతీష్, సునిల్ పాల్గొన్నారు. కొత్తూరులో.. నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మహ్మద్ జలీల్ ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు. భీరన్న దేవుడి గుడి నిర్మాణం కోసం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు విలువ చేసే మెటీరియల్ అందజేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. -
డెంటల్ డాక్టర్ల క్రికెట్ లీగ్
నిర్మల్టౌన్: తెలంగాణ డెంటల్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం, కొండాపూర్ సమీపంలోని గ్రౌండ్లో రాష్ట్రస్థాయి డెంటల్ డాక్టర్ల క్రికెట్ లీగ్ మ్యాచ్ సీజన్ –5 నిర్వహించారు. ఈ పోటీలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఇందులో ఆ దిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ని జామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను నిర్మల్ డాక్టర్స్ అసోసియేష న్ అధ్యక్షుడు ము రళి, సీనియర్ డాక్టర్ అప్పాల చక్రధరి, రమేశ్ రెడ్డిలు ముందుగా టాస్ వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ వెంకటరమణ, డాక్టర్ అసోసియేషన్ మెంబర్స్ రామకృష్ణ, నమిత, సుభాశ్ రావు పాల్గొన్నారు. -
● ఎదురుచూస్తున్న రైతులు ● భారీ వర్షాలతో సాగుకు ముందడుగు
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ ముగిసి యాసంగి సీజన్ మొదలైంది. రైతాంగం వరికొయ్యలు తొలగించి దుక్కులు దున్ని నారుమడులు సిద్ధం చేసుకుని వరినారు పోసుకుంటోంది. నాట్లు వేసుకునేందుకునే సిద్ధమవుతోంది. ప్రభుత్వం అందించే రైతుభరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తోంది. విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ కిరాయి, కూలీల ఖర్చు ఇతరత్రా వ్యవసాయ పరికరాల అవసరాలకు పెట్టుబడి కోసం ఆసరా అవుతుందని రైతులు భావిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరింది. రికార్డు స్థాయిలో వర్షాలతో భూగర్భ జలమట్టం పెరిగింది. పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు యాసంగి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో కంటే వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. వానాకాలం పంటలు దిగుబడి వచ్చి ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుకు కొందరు సిద్ధమవుతున్నారు. రైతుభరోసా సాయం చేతికందితే సాగు పనులు ముమ్మరం కానున్నాయి. సాగును ప్రోత్సహించేందుకు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. మొదట ఎకరానికి రూ.4వేల చొప్పున అందించింది. ఆ తర్వాత రూ.5వేలకు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుభరోసా పథకం పేరు మార్చి ఎకరానికి రూ.7,500 అందిస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, రియల్ఎస్టేట్ వెంచర్లు, ప్రాజెక్టు ముంపు భూములకు రైతుబంధు అందించి అక్రమాలకు పాల్పడిందని విచారణ చేపట్టి నిలిపి వేసింది. గత వానాకాలం నుంచి రైతు భరోసా పథకం కింద రూ.6వేల చొప్పున అందిస్తోంది. 1,52,162 మంది రైతుల ఖాతాల్లో రూ.198.12కోట్ల నగదు జమ చేసింది. ప్రస్తుతం యాసంగి మొదలైంది. గత వానాకాలంలో అందిన రైతులు అర్హులైన రైతులు 1,52,162 మంది అందిన నగదు రూ. 198.12 కోట్లు -
17శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని వినతి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 17శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో జరిగే ఎన్నికలన్నింటిని ప్రభుత్వ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేస్తారని, ఉద్యోగులకు రావాల్సిన వాటిని ప్రభుత్వం పరంగా వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్ల య్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు రాంకుమార్, తిరుపతి, నరేందర్, ఆర్గనైజ్ సెక్రెటరీ శ్రావణ్ కుమార్, ప్రచార కార్యదర్శి యూసుఫ్, సంయుక్త కార్యదర్శి సునిత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ పాల్గొన్నారు. -
ఏఐ మాయ చేస్తున్నారు..!
పోస్టాఫీసు వద్ద రోడ్డుపై పులి వెళ్తున్నట్లు సృష్టించిన చిత్రంమంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 17న అర్ధరాత్రి ఓపీ వార్డు వైపు ఉన్న ల్యాబ్ వద్ద ఓ రహస్య నీడ కనిపించినట్లు, ఆస్పత్రి మెట్లుపైకి ఎక్కే దారిలో మనిషిని పోలిన ఆకారం ఉన్నట్లు వీడియో రూపొందించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రతీ రోజు ఆస్పత్రికి 400 మంది ఓపీ, 250 మంది అనారోగ్య సమస్యతో వార్డుల్లో చికిత్స పొందుతుండగా.. మరో 200 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దయ్యం ఉన్నట్లుగా ప్రచారంతో వారంతా ఆందోళన చెందారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో పని చేసే వారే వీడియో తీసి గ్రాఫిక్స్తో ఫేక్ వీడియో సృష్టించినట్లుగా అనుమానిస్తున్నారు.ఈ నెల 17న రాత్రి 11:35 గంటలకు మంచిర్యాల నగర పరిధిలోని సీసీసీ పోస్టాఫీసు వద్ద పులి సంచరిస్తోందని, కారు ముందు దూసుకెళ్తున్నట్లుగా ఓ ఫొటో ఏఐతో తయారు చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు రాలేదు. ఉదయం వేళల్లో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు విధులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అటవీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి పులి జాడ లేదని నిర్ధారించారు. ఫేక్ ఫొటో పోస్టు చేసిన వ్యక్తిని పట్టుకుని సీసీసీ పోలీసులకు అప్పగించారు. -
విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి
నిర్మల్టౌన్: విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతకాన్ని ఆవిష్కరించి, క్రీడలను ప్రారంభించారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ క్రీడలు ఉన్నాయి. ఈ క్రీడల్లో 50 మంది బాలికలు, 100 బాలురు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, పీడీలు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. కేకే–ఓసీలో ప్రమాదం.. దెబ్బతిన్న డంపర్లుమందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీలో రెండ్రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు డంపర్లు దెబ్బతిన్న విషయం ఆలస్యంగా తెలిసింది. గురువారం రెండో బదిలీలో ఓసీలోని పని స్థలంలో షావల్ ఆపరేటర్ బొగ్గు నింపుతుండగా డంపర్ వాహన చోదకుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. వరుస క్రమంలో రావాల్సిన ఓ డంపర్ వాహన చోదకుడు తొందరపడి ముందు డంపర్ లోడ్ కాకముందే తీసుకెళ్లి నిర్లక్ష్యంగా నిలిపి డ్రైవర్ సీటు నుంచి పక్కకు వచ్చినట్టు సమాచారం. డంపర్ నిలిపినప్పుడు పాటించాల్సిన దూరం, బ్రేకులు వినియోగించకపోవడంతో ఆ డంపర్ వెనుకకు కదిలి మరో డంపర్ను ఢీకొట్టగా రెండూ దెబ్బతిన్నాయి. ఉద్యోగి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మణుగూరు ఓపెన్ కాస్ట్ గనిలో ఇలాంటి సంఘటనే జరిగి ఓ ఆపరేటర్ మృతిచెందాడు. అధికారులు ఈ విషయాన్ని బయటకు తెలి యనీయకుండా, రక్షణ చర్యలు విఫలమైనా పట్టించుకోకుండా ఉన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. -
చట్ట ప్రకారం చర్యలు
పెరిగిన టెక్నాలజీ ఏఐతో ఫేక్ వీడియోలు, ఫొటోలు తయా రు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సున్నితమైన కుల, మత, ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఏఐతో తప్పుడు కంటెంట్ తయారు చేసిన వారితోపాటు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వారందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మూడేళ్ల వరకు శిక్ష పడవచ్చు. నిజనిర్ధారణ చేసుకోకుండా ఎవరూ షేర్ చేయవద్దు. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల -
భద్రత మాసోత్సవాలు విజయవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని రహదారి మాసోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించాలని అన్నారు. 31న ప్రత్యేక డ్రంక్డ్రైవ్ టెస్టులు రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ నెల సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో ప్రమాద ప్రాంతాల్లో సూచికలు, వేగనిరోధకాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. కొత్త సంవత్సరం వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31న స్పెషల్ డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. -
మాతాశిశు మరణాలు లేకుండా చూడాలి
● రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర మంచిర్యాలటౌన్/బెల్లంపల్లి: జిల్లాలో మాతాశిశు మరణాలు లేకుండా చూడాలని, ఇందుకోసం ప్ర త్యేక వైద్య నిపుణుల సేవలు అందుబాటులో ఉంచాలని, ఎస్ఎన్సీయూ ద్వారా శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖజా యింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర అన్నారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం జాయింట్ డైరెక్టర్ సుధీర, జాతీయ ఆరోగ్య మిషన్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, వైద్యులు శిల్పారెడ్డి, విక్రమ్, మనోజ్లతో కలిసి బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రి, కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, యాపల్ ఉప కేంద్రం, మంచిర్యాలలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. రోగులు, గర్భిణులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ సుధీర మాట్లాడుతూ జిల్లాలో మాతాశిశు సంరక్షణలో భాగంగా వంద శాతం గర్భిణుల నమోదు, ఐరిస్తో గుర్తింపు, ప్రసవమయ్యే ఆస్పత్రి వివరాలు తెలియజేయాలని సూచించారు. సాధారణ ప్రసవాలు చేపట్టి శస్త్రచికిత్సలు తగ్గించాలని, గర్భిణుల వివరాలు పోర్టల్లో నమోదు చేయాలని అన్నారు. గర్భిణులకు కాన్పు ఆలస్యమైతే ఆ విషయాన్ని రోగులు, హెల్ప్డెస్క్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. డీఎంహెచ్వో అనిత, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ ఆర్ఎంవోలు భీష్మ, ప్రసాద్, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు అరుణశ్రీ, సుధాకర్నాయక్, నాగవేణి, శ్రీధర్, రవి, దివ్య పాల్గొన్నారు.


