breaking news
Mana Shankara Vara Prasad Garu Movie
-
పొంగల్ పోరులో ఏడు చిత్రాలు .. లిస్ట్ పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? టాలీవుడ్కు సంబంధించి ఇదే అతిపెద్ద సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉండే సీజన్ ఇది. అందుకే స్టార్ హీరోలలో చాలా మంది తమ సినిమా ఒకటి సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ పండక్కీ తెలుగులో మొత్తంగా ఆరేడు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వచ్చే సంక్రాంతి సీజన్పై కొన్ని సినిమాలు కర్చీఫులు వేశాయి. అయితే వాటిల్లో ఏది రిలీజ్ కానుంది? ఏ సినిమా వెనక్కి తగ్గనుంది అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..మన శంకర వర ప్రసాద్ గారురాజాసాబ్భర్త మహాశయులకు విజ్ఞప్తిఅనగనగా ఒక రాజునారీ నారీ నడుమ మురారీజననాయగన్పరాశక్తి‘రాజాసాబ్’పై క్లారిటీ వచ్చేదిఈ సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో ఉన్న సినిమాలో తొలుత రిలీజ్ డేట్ ప్రకటించిన పెద్ద సినిమా ది రాజాసాబ్(The Raja Saab). మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి..వాయిదా వేయడంతో మరోసారి కూడా ఈ సినిమా వెనక్కి తగ్గిందనే రూమర్స్ వచ్చాయి. దీంతో పలు చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే తాము తప్పుకోవడం లేదని ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా స్టార్ చేయడంతో కొన్ని సినిమాలు బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయి.రాజుగారు రావడం లేదా?సంక్రాంతి పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతూ వచ్చిన నవీన్ పొలిశెట్టి..అందరికంటే ముందుగానే తప్పుకునే అవకాశం ఉంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) వచ్చే ఏడాది జనవరి 14న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. బాక్సాఫీస్ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో నిర్మాత నాగవంశీ వెనక్కీ తగ్గాడట. అన్ని కుదిరితే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడట.ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) చిత్రం కూడా ఈ సంక్రాంతికి వచ్చేలా లేదు. డిసెంబర్లో ఆయన బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం కూడా వెనక్కి తగ్గేలా ఉంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కూడా కచ్చితంగా పొంగల్ పోరులోకి రాబోతుంది.చిరు క్లారిటీ ఇస్తే.. డేట్ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతి పండగకి పక్కా రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్లైన్ పెట్టుకొని మరి ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ని షేక్ చేసిన అనిల్ రావిపూడి.. ఈసారి చిరంజీవి మూవీతో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్పై స్పష్టత వస్తే కానీ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై క్లారిటీ రాలేదు. ఒక వేళ చిరు సినిమా వాయిదా పడితే..కచ్చితంగా చిన్న సినిమాలన్నీ బరిలోకి దిగుతాయి. అయితే ఆ అవకాశం అయితే దాదాపు లేనట్లే. వీటితో పాటు ఈ పొంగల్ పోరులో తమిళ్ నుంచి రెండు భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ఒకటి..విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్వకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు శివకార్తికేయన్-సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి పండక్కే రాబోతుంది. జవవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ పొంగల్ పోరులో ఎన్ని చిత్రాలు ఉంటాయనేది డిసెంబర్ మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మాస్ డ్యాన్స్కి రెడీ
మాస్ డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట చిరంజీవి, వెంకటేశ్. ఈ స్టార్స్ ఇద్దరితో ఓ సెలబ్రేషన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, ముఖ్య పాత్రల్లో వెంకటేశ్, క్యాథరీన్, వీటీవీ గణేశ్ నటిస్తున్నారు.ఆల్రెడీ చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్లో గత నెలాఖర్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రంలో ఓ సెలబ్రేషన్ సాంగ్ ఉందని, ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్తో పాటు నయనతార, క్యాథరీన్ కూడా డ్యాన్స్ చేస్తారని టాక్. ఈ పాటను ఈ నెలాఖరున చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. -
సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న మెగాస్టార్.. మెగాపవర్ స్టార్
ఈ ఇద్దరు తండ్రీకొడుకులు తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి తన 46 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు సాధించగా, రామ్ చరణ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా 'మీసాల పిల్ల' పాటలో చిరంజీవి డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఇక ఈ పాట పెద్ద హిట్ అవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై రీల్స్,ఫ్యాన్ ఎడిట్స్తో ఉత్సాహంగా రాణిస్తున్నారు.భీమ్స్ సంగీతం అధించిన ఈ పాట నంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగింది. అలా ఈ పాట తాజాగా 50 మిలియన్ వ్యూస్తో రికార్డు కొల్లగొట్టింది.ఇక రామ్ చరణ్ 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' పాట తాజాగా విడుదలైంది. అయితే ఈ పాట ఒక్క రోజులోనే 4 భాషల్లో కలిపి 46 మిలియన్ వ్యూస్ సాధించింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజైన గంటల వ్యవదిలోనే 30 మిలియన్ వ్యూస్తో ఆల్టైమ్ రికార్డ్గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చరణ్ డాన్స్ మూవ్స్తో అభిమానులు రీల్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ తమ సినిమా పాటలతో సోషల్ మీడియాను రఫ్ ఆడిస్తున్నారు. -
ఫైట్ చేసేద్దాం
నువ్వా... నేనా తేల్చేసుకుందాం... ఫైట్ చేసేద్దాం అనే టైపులో విలన్లకు సవాల్ విసిరి, రంగంలోకి దిగాడు శంకరవరప్రసాద్. అందర్నీ రఫ్ఫాడించడం మొదలుపెట్టాడు. చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు.ఓ కీలక పాత్రలో హీరో వెంకటేశ్, హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. చిరంజీవి, ఫైటర్స్ పాల్గొనగా ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ‘‘ఈ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విజువల్గా అద్భుతంగా ఉంటుంది. ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్గారు మూవీతో బ్లాక్బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.36 మిలియన్ల వ్యూస్(Meesaala Pilla Song) యూట్యూబ్లో టాప్లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్లో చిరు వేసే స్టెప్పులు సింపుల్గా కనిపిస్తూనే చాలా స్టైలిష్గా ఉంటాయి. లిరికల్ సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!సినిమాభీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025 చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
వెల్కమ్ వెంకీ
‘వెల్కమ్ వెంకీ... మై బ్రదర్!’ అంటూ వెంకటేశ్ని ఆప్యాయంగా సెట్స్కి ఆహ్వానించారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్లైన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్లో జాయిన్ అయ్యారు వెంకటేశ్. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించి, ఓ వీడియోను విడుదల చేసింది. ‘వెల్కమ్ వెంకీ... మై బ్రదర్...’ అంటూ చిరంజీవి ఆప్యాయంగా వెంకటేశ్ని పిలవగా, ‘చిరు సార్... మై బాస్...’ అంటూ చిరంజీవిని హత్తుకున్నారు వెంకటేశ్. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్. చిరంజీవి– వెంకటేశ్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఫ్యాన్స్కి డబుల్ ఫెస్టివల్. ఈ సినిమాలో వెంకటేశ్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఓ భారీ సెట్లో చిరంజీవి–వెంకటేశ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కాగా.. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. -
మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!
మెగాస్టార్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటిసారి వీరిద్దరి మూవీ కోసం టాలీవుడ్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారుకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ మూవీలో వెంకీమామ సైతం నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్((Chiranjeevi) ) సైతం ట్వీట్ చేశారు. వెల్కమ్ టూ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ అంటూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వెంకటేశ్ను చిరంజీవి మై బ్రదర్ అని పిలవగా.. చిరుసర్.. మై బాస్ అంటూ వెంకీ మామ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే మూవీలో నటించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025 -
మీసాల పిల్ల సాంగ్ క్రేజ్.. యూట్యూబ్లో సరికొత్త రికార్డ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ మరో బ్లాక్ బస్టర్ కోసం రెడీ అయిపోయాడు.ఇటీవలే ఈ మూవీ నుంచి మీసాల పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్లో నంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ పాట 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్ఫామ్స్లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు.కాగా.. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. There’s no stopping the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 🔥🔥🔥#MeesaalaPilla is trending #1 on YouTube with 30M+ Views, 30K+ Reels on insta, 300M+ Reel Views and 50M+ Plays across all music platforms 💥💥💥AN UNANIMOUS MUSICAL SENSATION IN INDIA ❤️🔥❤️🔥❤️🔥--… pic.twitter.com/6rqiuAUop5— Shine Screens (@Shine_Screens) October 21, 2025 -
'దీపావళి' బ్లాస్ట్.. కొత్త సినిమా పోస్టర్లు చూసేయండి (ఫోటోలు)
-
ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు చిరంజీవి సత్కారం (ఫొటోలు)
-
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'ఇక్కడ నన్ను దొబ్బెస్తున్నారండి'.. చిరంజీవి సాంగ్పై బుల్లిరాజు అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్ మరో హిట్కు రెడీ అయిపోయారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. దసరా కానుకగా సందర్భంగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.అయితే ప్రోమో రిలీజ్ తర్వాత మీసాల పిల్ల ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అలరించిన బుల్లిరాజు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి అలరించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అనిల్ రావిపూడితో బుల్లిరాజు చేసిన కామెడీ నవ్వులు తెప్పిస్తోంది. మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని అందరూ నన్ను దొబ్బేస్తున్నారండి అంటూ బుల్లి రాజు భీమ్స్ సిసిరోలియోను అడిగాడు. వెళ్లి డైరెక్ట్గా డైరెక్టర్ను అడుగు అంటూ బుల్లిరాజు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి- బుల్లిరాజు మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది.ఈ చిత్రంలోని మీసాల పిల్ల లిరికల్ వీడియో ఫుల్ సాంగ్ అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియే సంగీతమందించారు. కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు.From fans, audiences to Bulli Raju, everyone is all excited to the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 💥#MeesaalaPilla Lyrical Video on Monday, 13th October ❤️🔥— https://t.co/EHn4RGd1j5A #Bheemsceciroleo Musical 🎵#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE😎… pic.twitter.com/S2sY6uDEjy— Shine Screens (@Shine_Screens) October 10, 2025 -
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫొటోషూట్ (ఫొటోలు)
-
చిరంజీవి-అనిల్ రావిపూడి విలన్గా సరైన నటుడు!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీఎంట్రీ ఇచ్చాక ఆరు సినిమాలు చేశారు. కానీ, ఆయన రేంజ్కు తగిన విలన్ ఏ సినిమాలో కనిపించలేదని చెప్పవచ్చు. కానీ, వాల్తేరు వీరయ్యలో ప్రకాష్ రాజ్ మాత్రమే కాస్త మ్యాచ్ చేశారని చెప్పాలి. ఇప్పుడు ఆయన కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్గారు'(Mana ShankaraVaraPrasadGaru)లో విలన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇందులో చిరు డ్రిల్ మాస్టర్గా కనిపించనున్నట్లు టాలీవుడ్ టాక్.ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో విలన్ పాత్ర కూడా కాస్త బ్యాలెన్స్గా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) పేరును సెలక్ట్ చేశారని తెలుస్తోంది. దసరా చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది పవర్ఫుల్ విలన్గా మాత్రమే కాదు మంచి కామెడీ టైమింగ్తో కూడా నటించగలడు. అందుకే అతన్ని ఫైనల్ చేశారని టాక్..సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఆయన కేవలం కామెడీ జోనర్ చిత్రాలే కాదు పవర్ఫుల్ యాక్షన్ సినిమాలు కూడా తీయగలడు. అయితే, 'మన శంకర వరప్రసాద్గారు' మూవీ మాత్రం కామెడీ, ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో రానుంది. నయనతారతో పాటు వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
డబుల్ సెలబ్రేషన్స్
ఇక్కడున్న ఫొటోలో మంచి జోష్తో ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు చిరంజీవి, వెంకటేశ్. ఇంతకీ ఈ జోష్కి కారణం ఏంటంటే... స్నేహితులను కలవడానికి వెళ్లారు. ప్రతి ఏడాది ‘క్లాస్ ఆఫ్ 80స్’ అంటూ 1980స్కి చెందిన నటీనటులందరూ కలిసి, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్, ప్లేస్ ఉంటుంది. ఈసారి రీ యూనియన్కి చెన్నై వేదికైంది.ఇందు కోసమే చిరంజీవి, వెంకటేశ్ శనివారం హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్గారు’లో ఓ కీలకపాత్రలో వెంకటేశ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, వెంకటేశ్లపై కీలక సన్నివేశాలను, ఓ సెలబ్రేషన్ సాంగ్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.‘‘చిరంజీవి, వెంకటేశ్గార్లను కలిసి సెట్స్లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇటు రీ యూనియన్ సెలబ్రేషన్స్ అటు సెట్స్లో సెలబ్రేషన్ సాంగ్... ఇలా ఈ నెల చిరంజీవి, వెంకటేశ్కు డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. -
ఏయ్.. మీసాల పిల్ల.. నయన్ను ఆటపట్టించిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాది సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి.ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. తాజాగా దసరా సందర్భంగా ప్రోమోను విడుదల చేశారు. మీసాల పిల్ల పేరుతో ఈ ప్రోమోను రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో నయనతారను చిరంజీవి ఆటపట్టిస్తూ కనిపించారు. మా ఊర్లో కుర్రోళ్లు పొగరుమోతు పిల్లని క్యూట్గా… మీసాల పిల్ల అని పిలుస్తారు అంటూ ఆటపట్టించారు. ఈ హిలారియస్ కామెడీ ప్రోమో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు. -
శశిరేఖగా నయనతార.. దసరాకు మరో సర్ప్రైజ్!
మెగాస్టార్ చిరంజీవి కొణిదెల హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్యే చిరు-నయనతార కాంబినేషన్లో ఓ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఈ మూవీ నుంచి నయనతార ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. దసరాకు సర్ప్రైజ్పసుపురంగు చీరలో, కొప్పున పూలెట్టుకుని, చేతిలో ఓ గొడుగు పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది నయన్. రేపు (అక్టోబర్ 2న) దసరా కానుకగా ఓ సర్ప్రైజ్ ఉంటుందన్నారు. అంటే మూవీ నుంచి ఏదైనా గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉండొచ్చన్నమాట! ఇక ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలవుతోంది. Introducing #Nayanthara garu as ‘SASIREKHA’ in our #ManaShankaraVaraPrasadGaru 🤗✨It’s an absolute joy to have her in this beautiful role and to work with her. Tomorrow, get ready for a delightful surprise from #MSG ❤️#ChiruAnil - Sankranthi 2026 🥳 pic.twitter.com/lvS2TO8fSi— Anil Ravipudi (@AnilRavipudi) October 1, 2025 -
సంక్రాంతి పోరు.. బరిలో ‘ఆ నలుగురు’
సంక్రాంతి పండగ టాలీవుడ్కి అతి ముఖ్యమైనది. యావరేజ్ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఈ పండక్కే ఉంది. ఒక వేళ హిట్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ని షేక్ చేసేది కూడా పండగే. అందుకే సంక్రాంతికి రావాలని పలువురు స్టార్స్ ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్లో పొంగల్ పోరు గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్ని ప్రకటించాయి. మరో రెండు చిత్రాలు కూడా పండగ కోసమే రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) కూడా ఉంది. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ఈ మూవీ ట్యాగ్లైన్. ట్యాగ్లైన్ చూస్తేనే ఇది పక్కా సంక్రాంతి మూవీ అని అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు డేట్ మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab)తో జనవరి 9న వస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక మిగిలిన డేట్స్ 12, 13 మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఏదొ ఒక రోజు చిరంజీవి(Chiranjeevi) సినిమా రావాల్సింది. మరోవైపు రవితేజ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. దు జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్తో జరుగుతోన్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన చిరంజీవికి 12వ తేది తప్ప మరో ఆప్షన్ లేదు. దసరాకి ఈ సినిమా అప్డేట్ వస్తుంది. ఓ పాటను రిలీజ్ చేసే చాన్స్ ఉంది. అప్పుడైనా రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. మొత్తానికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్తో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా పొంగల్ పోరులో ఉన్నాడు. మరీ వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో? ఏ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తుందో చూడాలి. -
సందడే సందడి
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. చిరంజీవి, నయనతారలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇదే స్టూడియోలో మరో కాంప్లెక్స్లో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూట్లో భాగంగా విజయ్ సేతుపతి, టబుతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు పూరి. రెండు సినిమాల షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో షాట్ గ్యాప్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్ని కలిసి, సందడి చేసింది పూరి అండ్ టీమ్. ఇక ‘మన శంకరవర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే విజయ్ సేతుపతి– పూరి జగన్నాథ్ చిత్రం కూడా 2026 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మాస్ డ్యాన్స్?
మాస్ డ్యాన్స్ చేస్తారా? రొమాంటిక్ సాంగ్ పాడుకుంటారా? ఇంతకీ చిరంజీవి–నయనతార ఏ తరహా పాట చేయనున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఈ ఇద్దరూ పాల్గొనగా ఒక పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తోంది ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.ఇటీవల ఆరంభమైన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, ఇతర ముఖ్య తారలు పాల్గొనగా టాకీ పార్ట్ షూట్ చేశారు. నేటి నుంచి చిరంజీవి, నయనతార పాల్గొనగా హైదరాబాద్లో ఒక పాట చిత్రీకరించనున్నట్లు యూనిట్ పేర్కొంది. ‘‘భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ రూపొందించారు.చిరంజీవి–నయనతారపై చిత్రీకరించే పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు’’ అని యూనిట్ తెలియజేసింది. అయితే... ఇది మాస్ నంబరా? రొమాంటిక్ సాంగా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
‘అన్నయ్య’ రెండు..‘అబ్బాయ్’ ఒకటి.. మెగా ఫ్యాన్స్కి పండగే
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. చివరిగా వచ్చిన భోళాశంకర్ (2023) కూడా డిజాస్టర్ అయింది. దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాకు లోనయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని ‘అన్నయ్య’ నుంచి సినిమా రాకున్నా పర్లేదు..‘అబ్బాయ్’ నుంచి వస్తుంది కదా అనుకొని ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అది ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా మిగిలింది. ఇలా ఈ ఏడాది అటు చిరు..ఇటు చరణ్ తమ అభిమానులను డిసప్పాయింట్ చేశారు. కానీ వచ్చే ఏడాది మాత్రం మెగా ఫ్యాన్స్కి పండగ అనే చెప్పాలి. 2026లో చరణ్ ఒక చిత్రంతో పలకరిస్తే.. మెగాస్టార్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. పండగకి వచ్చేస్తున్నాడుమెగాస్టార్ చిరంజీవి ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయింది. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చిరు స్థాయికి తగ్గ విజయమే లేదు. అందుకే 2026వ సంవత్సరాన్ని పక్కా ప్లాన్తో సెట్ చేసుకున్నాడు. సంక్రాంతి నుంచే అభిమానులను అలరించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్కి అదిరిపోయే స్పందన వచ్చింది. చిరంజీవి నుంచి పుల్ ఫన్ మూవీ వచ్చి చాలా కాలమైంది. అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడీ కచ్చితంగా ఉండాల్సింది. ఇందులో కూడా చిరుతో కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. పండగ వేళ వస్తున్న చిత్రం... కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చేసే బాధ్యతను మెగా అభిమానులు తీసుకోవడం గ్యారెంటీ. సమ్మర్ స్పెషల్ఇక ఇదే ఏడాది చిరంజీవి నుంచి మరో సినిమా రాబోతుంది. అదే విశ్వంభర. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన సోషియో-ఫాంటసీ చిత్రమిది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. అయితే గతంలో విడుదైన టీజర్లోని వీఎఫెక్స్ సీన్లపై విమర్శలు రావడంతో రిలీజ్ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ తో అబ్బాయ్.. ఇక 2026లో మెగా ఫ్యాన్స్కి ‘అబ్బాయ్’(రామ్ చరణ్) కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. గేమ్ ఛేంజర్తో భారీ అపజయాన్ని అందుకున్న చరణ్.. ‘పెద్ది’తో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇదొక పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఇలా వచ్చే ఏడాది చిరంజీవి రెండు, చరణ్ ఒక చిత్రంలో ఫ్యాన్స్ని అలరించబోతున్నారు.


