'చిరంజీవి' సినిమా.. టికెట్ ధరల పెంపునకు అనుమతి | Mana Shankara Varaprasad Garu Movie Tickets Price Hike In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

'మన శంకర వరప్రసాద్‌ గారు' టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌

Jan 9 2026 7:57 PM | Updated on Jan 9 2026 8:05 PM

Mana Shankara Varaprasad Garu Movie Tickets Price Hike In Andhra Pradesh

మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌ నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’  చిత్రానికి టికెట్‌ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ముందు రోజు వేసే స్పెషల్‌ ప్రీమియర్‌ టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయని తెలిపింది.

ఆపై తొలి పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.

మనశంకర్‌ వరప్రసాద్‌ విషయానికొస్తే.. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. దీంతో మూవీపై బజ్‌ క్రియేట్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement