breaking news
Funday
-
జాలరి చిన్నయ్య..!
కుంతలదేశాన్ని రత్నాకరుడు పాలించేవాడు. అతని కూతురు ప్రభావతి. ఒకసారి ప్రభావతి తన ఇష్టసఖులతో చెరువు గట్టున ఉన్న చెట్టుకు తాడుతో ఊయలలు వేసుకుని ఊగుతుండగా, పట్టు జారి నీళ్లలో పడిపోయింది. ఇష్టసఖులు ‘కాపాడండి... కాపాడండి’ అని గట్టిగా కేకలు వేశారు. అటుపక్కగా పడవలో ఉన్న జాలరి చిన్నయ్యకు ఆ కేకలు వినిపించాయి. వెంటనే అతడు నీటిలోకి దూకాడు. ఈదుతూ వెళ్లి, మునిగిపోతున్న ప్రభావతిని కాపాడి, ఒడ్డుకు చేర్చి తాగిన నీటిని కక్కించాడు. ‘కొన్ని క్షణాలు ఆలస్యం అయితే ఆమె ప్రాణానికే హాని కలిగేది’ అన్నాడు చిన్నయ్య. ఇష్టసఖులు ఆతనికి కృతజ్ఞతలు చెప్పారు.యువరాణితో పాటు అందరూ రథంలో కోటకు చేరారు. విషయం తెలిసిన మహారాజు ఇక మీదట నీటి ప్రాంతం వైపు వెళ్లవద్దని యువరాణిని మందలించాడు. మహారాణి ప్రభావతి మెడలో వజ్రాలహారం కనబడలేదు అని గుర్తించింది. మంత్రితో చెప్పి ఆ జాలరిని పిలిపించమన్నాడు రాజు. చిన్నయ్య వచ్చాడు. ‘యువరాణిని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. కాని, ఆమె మెడలో వజ్రాలహారం మాయమైంది. ఇందుకు నీ సమాధానం!’ అన్నాడు రాజు.‘మహారాజా! అరుపులు విని యువరాణిని కాపాడాను. ఆ హారం గురించి నాకేమీ తెలియదు!’ అన్నాడు చిన్నయ్య. ‘ఆ హారం దొరికే వరకు ఇతణ్ణి చెరసాలలో బంధించండి’ అని ఆదేశించాడు రాజు. విషయం తెలిసిన చిన్నయ్య తల్లిదండ్రులు లచ్చి,పెద్దయ్య వచ్చి, మహారాజును ఎంతగా వేడుకున్నా ఫలితం లేకపోయింది. ‘మహారాజా! ఆ జాలరి లేకపోతే ఆ సమయంలో యువరాణిని ఎవరు కాపాడేవారు’ అన్నాడు న్యాయాధికారి. ‘యువరాణిగారి జాతకంలో ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడిన వాడితోనే వివాహం జరుగుతుంది అని ఉంది మహారాజా!’ అన్నాడు మంత్రి. ఇద్దరి మాటలూ విన్న రాజు మౌనంగా తన ప్రత్యేక మందిరానికి వెళ్లిపోయాడు. ఇంటికి విచారంగా వచ్చిన పెద్దయ్య, లచ్చి ‘మనవాడు రెండు, మూడుసార్లు బంగారు రంగు చేప గురించి చెప్పాడు. వలలో పడ్డా విడిచి పెట్టానని’ అన్నాడు పెద్దయ్య. ‘అవును మావా! రేపు మనం కూడా పడవ వేసుకుని ఆ చెరువులోకి వెళదాము’ అంది లచ్చి.మరుసటి రోజు పడవలో చెరువుకు వెళ్లి వల వేశారు కాని, బంగారు రంగు చేప పడలేదు. అలా రెండు మూడు రోజులు వెళ్ళాక ఒక రోజు చిన్నయ్య పడవను గుర్తు పట్టిన ఆ బంగారు చేప వలలో పడింది.‘చినయ్య లేడా... మీరు ఎవరు?’ అని అంది ఆ చేప. ‘మేము చిన్నయ్య అమ్మా అయ్యలం’ అని జరిగింది చెప్పారు. ‘నేను నీటిలో దొరికిన చాలా వస్తువులను నీటి అడుగున ఒక స్థలంలో దాచాను. ఈ మద్యనే ఒక వజ్రాల హారం దొరికింది. రేపు రాజుగారిని ఇదే చోటుకు తీసుకు రండి. ఇక నన్ను వదలండి, ఊపిరి ఆడడం లేదు’ అంది ఆ బంగారు రంగు చేప. ‘అలాగే’ అని నీటిలో వదిలేశారు లచ్చి, పెద్దయ్యలు. మరుసటి రోజు లచ్చి,పెద్దయ్యలు కోటకు వెళ్లి చేప విషయం చెప్పారు. రాజు, మంత్రి వారితో కలసి పడవలో ఆ చెరువుకు వెళ్లి చేప చెప్పిన ప్రదేశం వద్ద ఆగారు. కాసేపటికి ఆ బంగారు చేప వచ్చి వారిని చూసి ‘ఇప్పుడే వస్తాను’ అని మళ్లీ నీటిలోకి వెళ్లి, నోటితో ఒక్కొక్క నగ తెచ్చి వారికి ఇచ్చింది. వాటిలో ఎన్నో నగలతో పాటు ప్రభావతి వజ్రాలహారం కూడా ఉంది. ‘ఇందులో మా రాజవంశానికి చెందిన వారు పోగొట్టుకున్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. నీకు కృతజ్ఞతలు’ అన్నాడు రాజు.‘నీటిలో దొరికిన వీటిని మా పిల్లల కోసం దాచాను’ చెప్పింది బంగారు చేప. మంత్రి కూడా చేపను మెచ్చుకున్నాడు.‘రాజా! ఇక చిన్నయ్యను వదిలేయండి. నేను ఉంటాను’ అని నీటిలోకి వెళ్లిపోయింది ఆ చేప. ‘కోటకు చేరుకోగానే మీ అబ్బాయిని విడుదల చేస్తాము’ అన్నాడు రాజు, చిన్నయ్య తల్లిదండ్రులతో.‘అలాగే మారాజా!’ అన్నారు వారు. మహారాజుతో మంత్రి, న్యాయాధికారి సమావేశమయ్యారు. ‘చూశారా మహారాజా... అమాయకుడు అయిన జాలరి చిన్నయ్యను చెరలో పెట్టించారు. పోయిన వజ్రాల హారంతో ఎప్పుడో పోయిన విలువైన బంగారు వస్తువులు అతని వల్లనే కదా దొరికాయి. అతని వలలో పడ్డ ఆ బంగారు చేపను మన కోటకు తెచ్చి అమ్ముకొని ఉంటే ఆ ధనం కొన్ని నెలలు వారి కుటుంబ పోషణకు వచ్చేది. చిన్నయ్య దయగల వాడు కనుకనే నీటిలో వదిలేశాడు’ అన్నాడు న్యాయాధికారి. ‘అవును మహారాజా! అతను జాలరి అయితే కావచ్చు. అతనిని గురుకులంలో చేర్పించి, అన్ని విద్యలూ నేర్పించి ప్రయోజకుడు అయ్యాక యువరాణిని ఇచ్చి వివాహం జరిపించడం ఉత్తమమైన పని’ అన్నాడు మంత్రి. ‘అవును మీరు అన్నట్లు ప్రాణాలు కాపాడినవాడు ఉత్తముడు’ అన్నాడు రాజు. తరువాత చిన్నయ్యను గురుకులంలో చేర్పించి, అతడు సకల విద్యలూ పూర్తి చేశాక యువరాణితో వివాహం జరిపించాడు రాజు. చిన్నయ్యతో పాటు అతని తల్లిదండ్రులు, గూడెం ప్రజలు రాజుగారి సంస్కారాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. జాలరి చిన్నయ్య..! -
విష్ణుదత్తుడికి దత్తాత్రేయుడి దర్శనం
సహ్యాద్రి ప్రాంతంలో మాతాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో విష్ణుదత్తుడనే విప్రుడు ఉండేవాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయన భార్య పేరు సుశీల. పేరుకు తగినట్లే భర్తకు అనుగుణంగా నడుచుకునేది. విష్ణుదత్తుడు నిత్యనైమిత్తిక కర్మలను క్రమం తప్పక ఆచరించేవాడు. అతడి ఇంటి ఆవరణలో రావిచెట్టు ఉండేది. ఆ రావిచెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటుండేవాడు.విష్ణుదత్తుడు ప్రతిరోజూ నిత్యకర్మలను పూర్తి చేసుకున్న తర్వాత భోజనానికి ముందు రావిచెట్టు కింద భూతబలి సమర్పిస్తుండేవాడు. అలా సమర్పించిన ఆహారాన్ని రావిచెట్టు మీదనున్న బ్రహ్మరాక్షసుడు కాకిరూపంలో వచ్చి ఆరగించేవాడు. ఆ ప్రసాదాన్ని రోజుల తరబడి ఆరగిస్తుండటంతో బ్రహ్మరాక్షసుడిలో తామస ప్రవృత్తి నశించింది. ఒకరోజు ఆ రాక్షసుడికి ఒక సద్బుద్ధి పుట్టింది. తనకు చాలా రోజులుగా తిండిపెడుతున్న విష్ణుదత్తుడికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే, బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడి ఎదుట సౌమ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ‘విప్రవర్యా! రోజూ నువ్వుపెడుతున్న అన్నం తింటున్నాను. నీకు ఏదైనా మేలు చేయాలని అనిపించింది. నేను ఏదైనా చేయగల సమర్థుడిని. ఏమాత్రం సంకోచించక నీకు నేను చేయగల ప్రత్యుపకారం ఏమిటో చెప్పు. తప్పక చేస్తాను’ అన్నాడు.విష్ణుదత్తుడు తన భార్యతో చర్చించి, ‘రాక్షసోత్తమా! మాకు తీరని కోరిక ఒకటి ఉంది. దత్తస్వామి ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినడమే గాని, ఏనాడూ వారి దర్శనభాగ్యం మాకు కలగలేదు. వారిని ఒకసారి చూపించు, చాలు’ అని చెప్పాడు.‘చాలా మంచి కోరిక. కాని, ఒక షరతు. దత్తస్వామిని అల్లంత దూరం నుంచి చూపించే ప్రయత్నం మూడుసార్లు చేస్తాను. ఆయన చిత్ర విచిత్ర రూపాలలో తిరుగుతూ ఉంటాడు. గుర్తించి ఆయనను పట్టుకోగలిగితే నీ అదృష్టం’ అన్నాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు సరేనన్నాడు.ఒకరోజు విష్ణుదత్తుడు ఏదో పనిలో ఉండగా, బ్రహ్మరాక్షసుడు హఠాత్తుగా వచ్చాడు. ‘దత్తస్వామి ఇక్కడకు దగ్గరలోనే తిరుగుతున్నాడు. వెంటనే నాతో రా’ అని పిలిచాడు. విష్ణుదత్తుడు హుటాహుటిన అతడి వెంట బయలుదేరాడు. బ్రహ్మరాక్షసుడినే అనుసరిస్తూ ఒక వీథిలోకి చేరుకున్నాడు. ఆ వీథిలో మద్య మంసాదులు విక్రయిస్తున్న అంగళ్లు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తి తప్పతాగి, పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. రాక్షసుడు ఆ వ్యక్తిని చూపించి, ‘అతడే దత్తస్వామి. వెళ్లి దర్శించు’ అని విష్ణుదత్తుడికి చెప్పి వెళ్లిపోయాడు. కళ్ల ముందు ఉన్న ఉన్మాదిని దత్తస్వామి అని నమ్మలేకపోయాడు విష్ణుదత్తుడు. రాక్షసుడు తనను ఆటపట్టించడానికి అలా చెప్పి ఉంటాడని భావించి, అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.రాక్షసుడు మళ్లీ విష్ణుదత్తుడికి కనిపించి, ‘విప్రోత్తమా! ఏమి మందమతివయ్యా! నీకు ముందే చెప్పాను కదా, దత్తస్వామి చిత్రవిచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని. మరచినట్లున్నావు. అందుకే గుర్తించలేక వెనుదిరిగావు. పోనీలే, ఈసారి మళ్లీ చూపిస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.కొన్నాళ్లకు రాక్షసుడు మళ్లీ వచ్చాడు. ‘విష్ణుదత్తా! రా రా! దత్తస్వామి ఇక్కడకు దగ్గరలోనే తిరుగుతున్నాడు’ అని పిలిచాడు. విష్ణుదత్తుడు అతడితో పాటే వెళ్లాడు. ఈసారి రాక్షసుడు శ్మశానానికి దారితీశాడు. శ్మశానంలో దుమ్ముకొట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతడి చేతిలో కపాలం ఉంది. చుట్టూ నాలుగు కుక్కలు ఉన్నాయి. ‘అతడే దత్తస్వామి’ చెప్పాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు అతడి వద్దకు చేరుకోబోయాడు. అతడు కస్సుమంటూ చేతికందిన కట్టెతో విష్ణుదత్తుడిని కొట్టాడు. విష్ణుదత్తుడు భయంతో గజగజలాడుతూ వెనుదిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీశాడు. రాక్షసుడు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉన్నాడు. ‘వెర్రిబాపడు ఈసారి కూడా అవకాశాన్ని పాడుచేసుకున్నాడు’ అనుకుని విచారించాడు.ఇంకొన్నాళ్లకు రాక్షసుడు మళ్లీ వచ్చాడు. ‘విష్ణుదత్తా! నీకు ముందే చెప్పాను. మూడుసార్లు దత్తస్వామిని దూరం నుంచి చూపిస్తానని. ఇదే చివరిసారి. దత్తస్వామి దగ్గర్లోనే ఉన్నాడు. వెంటనే నాతో రా’ అన్నాడు. విష్ణుదత్తుడు రాక్షసుడి వెంట బయలుదేరాడు. ఈసారి ఏం జరిగినా, దత్తస్వామి పాదాలను వదలకూడదని ముందే నిశ్చయించుకున్నాడు.రాక్షసుడు ఈసారి ఊరవతలి వెలివాడకు దారితీశాడు.కొంతదూరంలో ఒక వికృతాకారుడు కనిపించాడు. అతడు ఒక గాడిద కళేబరం నుంచి మాంసం ముద్దలను పెకలించి, వాటిని కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు విందుగా పెడుతున్నాడు. ‘విష్ణుదత్తా! అతడే దత్తస్వామి. వెళ్లి అతడి పాదాలను ఆశ్రయించు’ అని చెప్పి బ్రహ్మరాక్షసుడు వెళ్లిపోయాడు.కాకులూ గద్దలకూ, కుక్కలూ నక్కలకూ గాడిద మాంసం పంచుతున్న వికృత స్వరూపుణ్ణి చూడగానే విష్ణుదత్తుడికి ఒళ్లు జలదరించింది. ఏదైతే అదే జరుగుతుంది అనుకుని, విష్ణుదత్తుడు ధైర్యం కూడదీసుకున్నాడు. నేరుగా వికృతాకారుడి వద్దకు చేరుకుని, అతడి పాదాలు పట్టుకున్నాడు. ‘ఓరీ మూఢుడా! నా కాళ్లు పట్టుకుంటావేమిరా?’ అంటూ గద్దించాడు ఆ వికృతాకారుడు.విష్ణుదత్తుడు పాదాలను మరింత గట్టిగా పట్టుకున్నాడు. వికృతాకారుడు విష్ణుదత్తుడి వీపు మీద మాంసం ముద్దలతో బాదాడు. ఎంత బాదుతున్నా, విష్ణుదత్తుడు చలించలేదు. తన పట్టువీడలేదు. కాసేపటికి వికృతాకారంలో ఉన్న దత్తస్వామి ప్రసన్నుడయ్యాడు. ‘విష్ణుదత్తా! ఈ వికృతాకారుడితో నీకు పనేమిటయ్యా? నాకోసం మూడుసార్లు వచ్చావు’ అని సౌమ్యంగా అడిగాడు.ఆయన అలా అడగడంతోనే విష్ణుదత్తుడి వీపుమీద మాంసం ముద్దల బరువు ఎవరో తీసేసినట్లుగా మాయమైంది. అతడి కాళ్లు, చేతులు పులకరించాయి. నెమ్మదిగా కళ్లు తెరిచి, తల పైకెత్తి చూశాడు.కళ్లెదుట పీతాంబరాలతో దత్తాత్రేయస్వామి దర్శనమిచ్చాడు. విష్ణుదత్తుడు పులకాంకితుడయ్యాడు.∙సాంఖ్యాయన -
చమన్ కే ఫూల్
హైదరాబాద్లో విమానం దిగిన కిషోర్ అక్కడ నుండి రాజమండ్రిలో తన కోసం వచ్చిన కోటయ్యతో కారులో బయలుదేరాడు. సుమారు ఒక గంటలో ఊరికి చేరుకున్నారు.భూదేవి ఆకుపచ్చటి చీర కట్టుకున్నట్లుగా ఉన్న ఆ పచ్చటి పొలాలు, ఎత్తయిన ఆ కొబ్బరిచెట్లు, అందమైన ఆడపిల్లలా వంపులు తిరిగిన ఆ గోదావరిపాయ– మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్లుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరిచెట్లు.. మధ్యమధ్యలో అరటిచెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, పచ్చని పొలాలకు పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూలమొక్కలూ, పళ్ళచెట్లూ.. ఎంత బావుందో ఇక్కడ అనుకున్నాడు కిషోర్.తాత చిన్నారావు ఒకప్పుడు మోతుబరి రైతు. బోలెడు ఎకరాల పొలాలు, కొబ్బరితోటలు, చక్కటి ఫలసాయం వచ్చేది. క్రమేపి ఆస్తులు తరిగిపోయాయి. పైగా భాగాలూ పంచుకోవడంతో చిన్నచిన్న ముక్కలయిపోయాయి.ఆ ఉన్నదాన్నే జాగ్రత్తగా పెట్టుకుని కొంతదాంట్లోనే ఈ పూల నర్సరీ పెట్టాడు. అలా ఆ చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల్లో చాలామంది ఈ పూల నర్సరీలు పెంపొందించారు. అంతేకాదు, అన్నిచోట్లా అందమైన పూలమొక్కలు హొయలొలుకుతూ క్రమపద్ధతిలో కొలువుదీరిన దృశ్యాలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. కేవలం హృదయాన్ని తాకే సోయగాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వందలకోట్ల రూపాయల వ్యాపారం, వేలమందికి ఉపాధిని కల్పిస్తున్నాయవి. మాటల్లో కోటయ్య చెప్పాడు.ఈప్రాంతం టూరిస్టులను బాగా ఆకర్షించడంతో దేశం నలుమూలల నుండి పూల నర్సరీల సందర్శనకు బాగా వస్తున్నారు. ఇక సినిమా షూటింగులు కూడా బాగానే జరుగుతున్నాయని కూడా చెప్పాడు.‘‘ఏడాదికో సారైనా రావాలిరా కిషోర్. బంధాలను నెమరేసుకోవాలి. బంధుత్వాల్ని పలకరించుకోవాలి. జ్ఞాపకాలను తడిమి చూసుకోవాలిరా.’’ అని తాత ఫోనులో అంటుంటే ఆ మాటలు అప్పుడు చాదస్తం అనిపించినా, ఇప్పుడు ఎంతో నిజం ఉందనిపించింది. ప్రతివారు పలకరించే వారే మా చిన్నారావు మనవడివా అంటూ ఆప్యాయంగా దగ్గరగా వచ్చి చూసేవారే! ఇంత ఆత్మీయత అసలు ఊహించనేలేదు. క్షణం తీరికలేని జీవితం... తాత పోయినప్పుడు కూడా రాలేకపోయేంత బిజీలో ఉన్నాడు. ఒక్కోసారి మార్పు అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అలా కిషోర్లో అంతర్మథనం మొదలయింది. దానికితోడు మూడునెలల క్రితం తాతయ్య స్నేహితుడు వ్రాసిన ఉత్తరం కూడా తోడయ్యింది. అదే కిషోర్ ఈ పల్లెటూరుకు రావడానికి కారణం.‘‘ఇది మన ఊరి చెరువు. ఒకప్పుడు అది మంచినీళ్ళ చెరువు కూడా. అయితే, ఈమధ్య మన ఊరికి నది కాలవ నుంచి పైపుల ద్వారా నీళ్ళు వస్తున్నాయని తెలిసింది. నాకు గుర్తుంది చిన్నప్పుడు ఈ చెరువు గట్టున ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం. ఈత కొట్టడానికి మటుకు పెద్దవాళ్లు వద్దనేవారు. చెరువంతా తామరాకులు, పువ్వులతో నిండి ఉండేది. అప్పుడప్పుడు బాతులు కూడా కనపడేవి’’ అన్న కిషోర్ మాటలకు కోటయ్య,‘‘అవును బాబు ఇప్పుడు ఈ చెరువు ప్రభుత్వ పథకం కింద ఉంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు’’ బదులిచ్చాడు,కొంచెం దూరం నడిచాక కోదండ రామాలయం వచ్చింది. పెద్ద గోపురంతో ఠీవిగా నిలబడి ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి ఇక్కడ పెద్ద కళ్యాణం జరుగుతుంది.‘‘ఏమి కోటయ్యా! అప్పట్లోలానే కళ్యాణం జరుగుతోంది కదా! తొమ్మిది రోజులు చేస్తున్నారా?’’ అతను సమాధానం చెప్పే లోపల అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు కిషోర్.ఊరిని తలచుకుంటేనే ఎన్ని జ్ఞాపకాలు! ఏ పండుగ వచ్చినా, ఏదో ఒక హరికథ, తోలుబొమ్మలాటల నాటకం ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా వినాయకచవితి తొమ్మిది రోజులు; అలాగే, శ్రీరామనవమికి పందిళ్ళు వేసి స్టేజికి కట్టిన రంగుల దీపాలతో భలే బావుండేది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అలా ఒక్కోసారి పిల్లల గ్యాంగ్ అందరూ హరికథలు, బుర్రకథలు ఆ వయసులో అర్థం తెలియకపోయినా, పోయి కూర్చునేవాళ్ళు. మధ్యమధ్యలో దాసుగారు చెప్పే పిట్టకథలు భలే బాగుండేవి.ఆయన గజ్జెలు కట్టుకుని డాన్స్ చేస్తూ, చేతిలో చిడతలు వాయిస్తూ ఏ కథనైనా తన్మయత్వంతో చెబుతుంటే కళ్ళప్పగించి చూస్తుండేవాడు.ప్రోగ్రాం జరుగుతుండగా నిద్ర వస్తే, అక్కడే పడుకుండిపోడం ఇంకా గుర్తుంది.ఆ తరువాత అమ్మా, నాన్నా వాళ్ళు వచ్చి నిద్రలేపి తీసుకు వెళ్ళేవారు. ఊరి జనమే కాకుండా, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చేవారు. పిల్లలు, యువతులు, యువకులు, పెద్దవాళ్ళతో ఊరంతా కళకళలాడుతూ ఓఉత్సవంలా గడిచేవి రోజులు. అప్పటికే ఇలాంటి కళలు తగ్గిపోయాయి. వాటి స్థానాన్ని టీవీ అందునా, ఓటీటీలతో ఇంట్లోనే వినోదం వచ్చేసినా, ఇంకా ఊర్లో తాతలాంటి వాళ్ళు ఉండబట్టి అవన్నీ అప్పుడప్పుడు నడుస్తున్నాయి. తలచుకుంటేనే ఎంత బావుందో తన్మయత్వంతో మురిసిపోయాడు. తమ ఊర్లో ప్రతి ఇల్లు, వసంతకన్యలా మెరిసిపోతోంది. సంపెంగలు, చేమంతులు, పేరు తెలియని ఎన్నో రంగురంగుల పూలు, ఊదాపూలు, ఎఱ<టిపూలు, పచ్చటిపూలు, తెల్లటిపూలు, మరువం, దవనం సువాసనలు వెదజల్లుతున్నాయి. మొత్తానికి అన్నీ కలిపి ఒక కదంబవనంలా ఉన్నాయి. ఇళ్లన్నీ చక్కగా అందంగా రంగవల్లులు తీర్చిదిద్ది ఉన్నాయి. అంతేకాదు, ప్రతి ఇంటి ముందు ఉన్న ఏదో ఓ పెద్దచెట్టుకి ఒక ఉయ్యాల కూడా ఉంది. ‘‘కిషోర్ బాబు! ఇక్కడ అందరూ ఒకరితో ఒకరు సామరస్యంగా జీవిస్తున్నారు. అలాగే జీవనోపాధి కోసం సాధారణ వ్యవసాయ పనులతో పాటు ఈ నర్సరీ నిర్వహణ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మన ఊరు ఒక ఆదర్శవంతమైన íపిక్నిక్స్పాట్గా మారింది. ప్రజలు మార్పు కోరుతున్నారు. అందుకే, ఎవరి ఊరిని వాళ్ళు బాగు చేసుకోవాలి అన్న మీ తాతయ్య మాటలు విని నడుంకట్టుకున్నారు మన ఊరివాళ్ళు’’ అంటూ చెప్పుకుపోతున్నాడు కోటయ్య. కిషోర్కి కళ్ళముందు అతని మాటలు ఏవేవో దృశ్యాలుగా కదిలిపోతున్నాయి. పొలం గట్టున ఉన్న పెద్దచెట్టు దగ్గర నించొని ఉన్న సూరిబాబుని ఒక పెద్దపాము కాటేయటం, బాధతో లుంగలు చుట్టుకు పోవడం ఒకేసారి జరిగింది. అది చూసిన చిన్నారావు వెంటనే పరుగులు పెట్టుకుంటూ దగ్గరగా వెళ్ళాడు. అప్పటికే అతను కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. బాధతో ఆర్తనాదాలు చేస్తుంటే, పరుగులు పెట్టుకుంటూ వచ్చి, ‘ఎంతపని జరిగిందిరా కొడకా ఇప్పుడే కదా నీకు చెప్పి ఒంటేలు పోసుకోవడానికి వెళ్ళాను. అంతలోకే ఇలా పాము వచ్చి కాటేసిందా’ అని వలవల ఏడ్చాడట!ఏదో జరిగిందని పక్క పొలాలలో పని చేసుకుంటున్న వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. అందరూ కలిసి అతన్ని మోసుకుంటూ, ఊర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకొని బయల్దేరారు. కాని, లాభం లేకపోయింది. అప్పటికే సూరిబాబు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.చిన్నారావు దంపతులు కొడుకుని తలచుకుని కుమిలిపోతున్నారు. సూరిబాబు భార్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కొన్ని రోజులకి సూరిబాబు భార్య కొడుకుని తీసుకుని పుట్టింటికి చేరుకుంది.ఆమె వెళ్ళిన కొన్నిరోజులకి సూరిబాబు తల్లి, కొడుకు మీద బెంగతో కన్నుమూసింది.పుట్టింటికి వెళ్ళిన సూరిబాబు భార్య, అత్తగారు కూడా పోవడంతో ఇక ఈ ఊరి మొహం చూడలేదు. అప్పుడప్పుడు చిన్నారావు ప్రేమని చంపుకోలేక వెళ్లి మనవడిని చూసి వచ్చేవాడు.సూరిబాబు భార్య చాలా కష్టపడి కిషోర్ని పెంచి పెద్దచేసింది. పైచదువులు చదివించింది. ఆ తరువాత అనుకోని అదృష్టం కిషోర్ని అమెరికా వెళ్ళేలా చేసింది. అయితే, విధి ఇంకోలా ఆడుకుంది. కొడుకు అభివృద్ధిని చూడకుండానే కరోనా మహమ్మారితో కన్నుమూసింది. అతను అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు.∙∙ కొడుకు పోయాడు, భార్య పోయింది, ఉన్న ఒక్క మనవడు దూరమయిపోయాడు. అప్పటి నుంచి చిన్నారావులో ఒక మార్పు వచ్చింది. జీవితం భగవంతుడు ఇచ్చింది. చేతనయినంత వరకు పొరుగువాడికి సాయపడాలి అనుకున్నాడు. ఏడుస్తూ చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. తమ ఇంట్లో విషాదం ఎవరికీ కలగకూడదు అని నమ్మాడు. అందుకే తనకున్న పొలాన్ని జాగ్రత్తగా సాగు చేసుకుంటూ, ఊర్లో అందరినీ ఒక్కచోట చేర్చి, ‘‘చూశారుగా, మా ఇంట్లోజరిగింది. దేన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. కష్టాలు పడనివాళ్ళు ఎవరూ ఉండరు’’ అని మా అందరిలో ఉత్సాహం నింపాడు.ఊరిలోని ప్రతిఇంటినీ చక్కగా ఒక పూలతోటగా మార్చారు. ఎంతోమంది సలహాలు తీసుకుని, కొంతమందిని జట్టుగా తయారయి పనులు చేసునేవారు. క్రమక్రమంగా ఊరికి పేరు రాసాగింది. మొదటగా సినిమా షూటింగులు జరగసాగాయి. ఆ తరువాత మన ఊరిలోనే ఉండే జానపద కళాకారులతో వచ్చిన వాళ్ళకి వినోదం కలిగించడం లాంటివి మొదలుపెట్టారు. సందర్భాన్ని బట్టి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేయసాగారు. కిషోర్బాబు! మీ తాత అందర్నీ ఇందులో కలిపేశాడు. ఆయనకి తన ఒక్కడి పేరు చెప్పడం ఇష్టం ఉండదు. ఇదిగో ఇదే మీ ఇల్లు’’ అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. పూల సౌరభాన్ని మించిన జ్ఞాపకపు పరిమళం పిల్లతెమ్మెరలా కమ్మేసింది. ‘‘ఇదిగో ఇదే మీ తాతగారి ఫొటో’’ అంటూ పెద్ద పూలదండతో ఉన్న చిన్నారావు ఫొటోని చూపించాడు. అది చూస్తూ ఆలోచనలలోకి జారుకున్నాడు. హఠాత్తుగా ఒకరోజున కోటయ్య ఆస్తి డాక్యూమెంట్స్ పంపినప్పుడు ఈ పల్లెటూరులో ఆస్తి నాకెందుకు అమ్మేద్దామని వచ్చాడు, అతని రాకలోని ఆంతర్యం పసిగట్టాడు కోటయ్య.తను కూర్చున్న ఉయ్యాలబల్ల మీద డాక్యుమెంట్స్ కవర్ పెట్టి, ‘‘కోటయ్యగారు! ఇవాళ భోజనం ఏర్పాట్లు ఎక్కడ’’ అని అడిగాడు. ఆ మాటకి ‘‘ఇక్కడే బాబు! అన్నీ సిద్ధంగా ఉన్నాయి’’ అన్నాడు.అతను ఏదో అడగాలని అనుకుంటున్నాడు. అడగలేకపోతున్నాడు. అది చూసి కూడా గమనించనట్లున్నాడు కిషోర్.ఇంతలో అతని ఫోన్ మోగింది. ‘‘హలో.. అవునండీ. ఓహ్ సారీ ఆ ప్రాపర్టీని నేను అమ్మబోవటంలేదు, ఆ డీల్ చెయ్యబోవటంలేదు. ఆపేశాను’’ అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్లో మాట్లాడుతున్న అతన్ని కోటయ్య, అతని భార్య ఇద్దరూ ఆదుర్దాగా చూస్తున్నారు. ‘‘ హే గీతూ మన పొలాలు అమ్మటంలేదు. అదే ఈ నర్సరీ, పూలతోటలు, కోటయ్యగారు చూసుకుంటారు. వివరంగా నేను అక్కడికి వచ్చి చెబుతాను.ఇంకో ఇంట్రెస్టింగ్ సంగతి, మన నెక్స్›్ట విజిట్ నేను అన్నట్లు స్విస్, ఆమ్స్టర్డామ్ మటుకు కాదు, అచ్చమైన మన ఊరికి. చూస్తే వదలవు మన ఊరు ఇప్పుడు ఓ పెద్ద పూలవనంలా ఉంది.అంతేకాదు, పూల నర్సరీల యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఎకోటూరిజం డెవలప్ చెయ్యాలనే ప్రతిపాదనను అందరూ ఇష్టపడుతున్నారు.అలా కొన్ని పూల నర్సరీలను కలుపుతూ సైక్లింగ్తో పాటు నడక, ఈ రెండింటికీ ఒక మార్గం అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కూడా ఉందట! సో, అప్పుడు ఇంకా ఈ నర్సరీల అందాలను చూసేందుకు మరింతమంది రావడానికి ఉంటుందట! పర్వాలేదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నీకు బాగా నచ్చుతుంది’’ అంటూ భార్యతో మాట్లాడుతున్న మాటలు ఆ దంపతులు విన్నారు.వాళ్ళ అనుమానం పటాపంచలయింది. కృతజ్ఞతతో కిషోర్వైపు అభిమానంగా చూశారు. -
అపహరణ్తో అన్నీ మారిపోయే!
హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారం వివిధ ప్రాంతాల నుంచి సాగిన చైల్డ్ ట్రాఫికింగ్ను బయటపెట్టింది. నిరుపేద తల్లిదండ్రుల నుంచి చిన్నారులను కొన్నివేల రూపాయలకు కొనుగోలు చేసి, సరోగసీ పేరుతో వారిని రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంది డాక్టర్ నమ్రత గ్యాంగ్. ఈ కారణంగా ఓ వర్గం, ప్రాంతం, రాష్ట్రానికి చెందిన పసిమొగ్గలు మరో చోటుకు తరలివెళ్లిపోయారు. కొన్నేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా సాగిన చైల్డ్ కిడ్నాపింగ్స్లోనూ ఇలాంటి ఆసక్తికర కోణం ఉంది. అప్పట్లో అపహరణకు గురైన వారి పేరు, వర్గం, భాష.. అన్నీ మారిపోయాయి. సంతోష్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎంబీ హట్స్కు చెందిన నాలుగున్నరేళ్ల బాలుడు మహ్మద్ షరీఫ్ మిస్సింగ్కు సంబంధించి 2011 మార్చి 4న అతడి తల్లి రెహానా బేగం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పట్లో పాతబస్తీలో చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పోలీసులు ఈ కేసుల ఛేదన కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. షరీఫ్ కేసు దర్యాప్తులో భాగంగా స్థానికులను విచారించిన ఈ స్పెషల్ టీమ్కు మాదన్నపేట ప్రాంతంలో నివసించే రేష్మా సుల్తానా కదలికలు తెలిశాయి. బాలుడి కిడ్నాప్కు నాలుగు రోజుల ముందు నుంచి ఆమె ఎంబీ హట్స్ ప్రాంతంలో సంచరించిందని, చిన్నారులకు బిస్కట్లు, చాక్లెట్లు ఇస్తూ మచ్చిక చేసుకుందని వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడంతో కీలక విషయాలు బయటపడ్డాయి. కరీంనగర్ నుంచి వచ్చి మాదన్నపేటలో స్థిరపడిన మహబూబ్ ఖాన్ భార్యే ఈ సుల్తానా. వీరిద్దరితో పాటు కమలా అలియాస్ పర్వీన్, నిజామాబాద్కు చెందిన డి.మల్లయ్య యాదవ్, డబీర్పుర వాసి సజీద్, మాదన్నపేటకే చెందిన షరీఫ్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చిన్నారులను కిడ్నాప్ చేసి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో విక్రయించడం మొదలెట్టారు. సంతానలేమితో బాధపడుతున్న భార్యాభర్తలను మల్లయ్య సంప్రదించేవాడు. అక్కడ వారి నుంచి ‘ఆర్డర్’ తీసుకున్న తరవాత ఆ విషయాన్ని నగరంలో ఉన్న ముఠా సభ్యులకు చెప్పేవాడు. సుల్తానా, పర్వీన్, సజీద్, షరీఫ్లు పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారులను గుర్తించారు. వారికి చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి అదును చూసుకుని కిడ్నాప్ చేశారు. వీరిని సజీద్ తన ఆటోలో వేములవాడలోని రుద్రంగికి తీసుకువెళ్లి డి.మల్లయ్య యాదవ్కు రూ.35 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేవాడు. అతడు వీళ్లని సంతానలేమితో ఉన్న దంపతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించేవాడు. ఈ గ్యాంగ్ను అరెస్టు చేసిన పోలీసులు తొమ్మిదిమంది చిన్నారులను రెస్క్యూ చేశారు. అప్పుడే ఓ ఆసక్తికర, కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాపింగ్ గ్యాంగ్ ఎక్కువగా పాతబస్తీలోని ఓ వర్గం బాలలను ఎత్తుకుపోయి జిల్లాల్లో ఉన్న మరో వర్గం దంపతులకు విక్రయించేది. ఫలితంగా వారి పేర్లు, భాష, ఆచార వ్యవహారాలన్నీ పూర్తిగా మారిపోయాయి. 2008లో మాదన్నపేట సలార్నగర్ నుంచి కిడ్నాప్ అయిన మహ్మద్ ఫర్దీన్ ఖాన్ దాదాపు మూడేళ్ల తరవాత ప్రశాంత్గా తన తండ్రి సర్వర్ ఖాన్ వద్దకు వచ్చాడు. అలాగే సంతోష్నగర్ పరిధి నుంచి 2009లో అపహరణకు గురైన మహ్మద్ మజీద్, షేక్ నవీద్లు... వినయ్, రాహుల్గా వారి ఇళ్లకు తిరిగి వచ్చారు. 2011 మార్చి 4న అపహరణకు గురైన షరీఫ్ మాత్రం ఏమార్పు లేకుండా అతడిలానే తన ఇంటికి చేరాడు. ఇలా వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన కథగా మారాయి. ఆ తొమ్మిదిమంది చిన్నారులు పుట్టింది ఎక్కడైనా, చాలాకాలం పాటు పెరిగింది మాత్రం ‘కొన్న తల్లిదండ్రుల’ దగ్గరే. ఈ నేపథ్యంలోనే తమ మాతృభాషను సైతం వాళ్లు మరచిపోయి, తమను పెంచుకుంటున్న వారి భాషనే అలవాటు చేసుకున్నారు. వినయ్గా తిరిగి వచ్చిన మజీద్, రాహుల్గా మారిన నవీద్ ఉర్దూ, హిందీ భాషలను పూర్తిగా మర్చిపోయి ‘తెలుగుబిడ్డ’లుగా ఇళ్లకు చేరారు. ఇలా రెస్క్యూ అయిన తొమ్మిదిమందీ హైదరాబాద్ వచ్చిన వెంటనే అసలు తల్లిదండ్రుల వద్దకు రాలేకపోయారు. తొలుత పోలీసులు ఆ బాలలను న్యాయస్థానం ద్వారా స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఆపై వీరిని కన్న తల్లిదండ్రులు రెండు నెలల తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తామే కన్నవారమని నిరూపించుకుని, తమ బిడ్డల్ని తమతో తీసుకువెళ్లారు. అప్పటి వరకు ఈ చిన్నారులకు స్టేట్ హోమ్ ఇల్లు అయింది.అప్పట్లో ఇలా అపహరణలకు గురైన బాలల్లో ఎక్కువమంది పుట్టింది నిరు పేద కుటుంబాల్లో. వీరిలో చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల్ని చదివించే స్తోమత కూడా లేదు. అయితే కిడ్నాపర్ల కారణంగా ఆర్థికంగా కాస్త స్థిరపడినవారి చెంతకు చేరి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి స్కూళ్లల్లో చేరారు. పోలీసులు రెస్క్యూ చేయడంతో మళ్లీ అసలు తల్లిదండ్రుల వద్దకు చేరి, అప్పటి వరకు ఉన్న సౌకర్యాలు, అలవాట్లు, కట్టుబాట్లను పూర్తిగా మరచిపోవాల్సి వచ్చింది. ఒక రకంగా చూస్తే ఈ ఎపిసోడ్లో చిన్నారులు కోల్పోయిందే ఎక్కువ. పిల్లలపై మమకారంతో వీరిని ఖరీదు చేసిన చాలామంది దంపతులు కేసులను ఎదుర్కొన్నారు. -
జగమంత కుటుంబం ఏకాకి జీవితం
ప్రపంచ జనాభా ఎనిమిదివందల కోట్లు దాటేసింది. ఎటు చూసినా మనుషులతో కిటకిటలాడే ప్రదేశాలే! అయినా ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడుతున్న ఏకాకుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. జగమంత కుటుంబంలో ఏకాకులు తమదైన చీకటిలోకంలో కృంగి కృశించిపోతున్నారు. భరించరాని ఒంటరితనం వల్ల మానసిక, శారీరక సమస్యలకు లోనవుతూ అర్ధాంతరంగా రాలిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒంటరితనాన్ని ‘ప్రపంచవ్యాప్త మహమ్మారి’గా (గ్లోబల్ ఎపిడమిక్) గుర్తించిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ప్రపంచ జనాభా ఎనిమిదివందల కోట్లు దాటేసింది. ఎటు చూసినా మనుషులతో కిటకిటలాడే ప్రదేశాలే! అయినా ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడుతున్న ఏకాకుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.జగమంత కుటుంబంలో ఏకాకులు తమదైన చీకటిలోకంలో కృంగి కృశించిపోతున్నారు. భరించరాని ఒంటరితనం వల్ల మానసిక, శారీరక సమస్యలకు లోనవుతూ అర్ధాంతరంగా రాలిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒంటరితనాన్ని ‘ప్రపంచవ్యాప్త మహమ్మారి’గా (గ్లోబల్ ఎపిడమిక్) గుర్తించిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.‘కోవిడ్–19’ అనుభవాలను చూసిన జనాలకు మహమ్మారి తీవ్రత ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. అలాగని ఒంటరితనం అంటువ్యాధి కాదు. అయినా, దీనిని డబ్ల్యూహెచ్ఓ మహమ్మారిగా గుర్తించిందంటే, దానికి కారణమేమిటి? ఒంటరితనం మహమ్మారి స్థాయిలో ప్రాణాలను కబళిస్తోందా? అనే అనుమానాలు చాలామందిలో తలెత్తుతాయి. ఒకసారి గణాంకాలను పరిశీలిస్తే, ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఒంటరితనం మోగిస్తున్న ప్రమాదఘంటికల గణాంకాలు ఇవి:ఒంటరితనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8.71 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య ఏటా మలేరియా వల్ల సంభవించే మరణాల కంటే ఎక్కువ. పరిస్థితి ఈ స్థాయిలో ఉండటం వల్లనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒంటరితనం మరణాలను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా గుర్తించింది. ఒంటరితనం సమస్య అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, పేద దేశాల్లోను ఎక్కువగా ఉంది. మన భారతదేశంలో ఒంటరితనం సమస్య ప్రమాదకరమైన స్థాయిలోనే ఉంది. ‘కోవిడ్–19’ తర్వాత ఒంటరితనం సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం రకరకాల స్థాయుల్లో ఒంటరితనంతో బాధపడేవారిలో పిల్లలు కూడా ఉంటుండటం ఆందోళనకర అంశం.మన దేశంలో ఒంటరితనం సమస్య గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లోని యువతలో 17.3 శాతం మంది తీవ్రస్థాయి ఒంటరితనంతో బాధపడుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 9.5 శాతంగా ఉంది. మన దేశంలో 45 ఏళ్లు పైబడిన వారు ప్రధానంగా మూడు కారణాల వల్ల ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఈ అంశంపై జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ వెల్లడించిన గణాంకాలు ఇవివిస్తరిస్తున్న ఒంటరితనంఒంటరితనం సమస్య చాప కింద నీరులా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అవివాహితులు, భాగస్వామికి దూరం కావడం వల్ల ఏకాకులుగా మిగిలిన వారిలో 39 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతుంటే, వివాహితులలో సైతం 22 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతుండటం ఆందోళనకర పరిణామం. ఒంటరితనం సమస్య అకాల మరణాలకు దారితీస్తోందని, అందువల్ల దీనిని మహమ్మారిగానే గుర్తించాల్సి ఉంటుందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్మూర్తి తన పరిశోధన వివరాలను వెల్లడించారు. ఆయన వాదనతో ఏకీభవించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒంటరితనాన్ని మహమ్మారిగా గుర్తించింది. ఒంటరితనం ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావం రోజుకు ఏకంగా పదిహేను సిగరెట్లు తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలకు సమానంగా ఉంటుందని డాక్టర్ వివేక్మూర్తి చెబుతున్నారు. ఈ లెక్కన ఒంటరితనంతో బాధపడేవారి బతుకులు పొగ తాగకున్నా, పొగ చూరిపోతున్నట్లు అర్థమవుతోంది. జీవితంలో బరువు బాధ్యతలతో కుంగిపోతున్న పెద్దలే కాదు, చదువు సంధ్యలు ఇంకా పూర్తికాని కుర్రకారు కూడా ఒంటరితనం సమస్యతో బాధపడుతున్నట్లు వివిధ అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల ఒంటరితనంతో బాధపడేవారు సర్వసాధారణమే అయినా, ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ఒంటరితనంతో బాధపడేవారి సంఖ్య కూడా పెరుగుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడేవారు ఏ తరంలో ఎందరెందరు ఉన్నారంటే...ఈ జబ్బుల ముప్పు ఎక్కువఒంటరితనంతో బాధపడే వారికి పలు శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనం వల్ల తలెత్తే సమస్యల్లో గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం, అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తి క్షీణత, జ్ఞాపకశక్తి క్షీణత కలిగించే డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు ప్రధానమైనవి. తరచుగా ఈ సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవే కాకుండా, ఒంటరితనం వల్ల దిగులు, కుంగుబాటు, ఆందోళన, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, ఆత్మహత్య ధోరణులు, స్వీయహాని ధోరణులు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానసిక ఒత్తిడి స్థాయిలో పెరుగుదల వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇలాంటి శారీరక, మానసిక సమస్యల వల్ల ఒంటరితనం బాధితుల్లో అకాల మరణాల ముప్పు 26 శాతం వరకు పెరుగుతోందని డాక్టర్ వివేక్మూర్తి చెబుతున్నారు.ఒంటరితనం కారణంగా స్థూలకాయం, థైరాయిడ్ సమస్యలు, ఉబ్బసం, బైపోలార్ డిజార్డర్, కొన్ని రకాల ఆటిజం వంటి ఇతర శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని ఒక తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన టులేన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, చైనాలోని గువాంగ్ఝో యూనివర్సిటీకి చెందిన బ్రెయిన్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఒంటరితనంతో బాధపడే పలువురు రోగులపై క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. ఒంటరితనం వల్ల 26 రకాల దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వీటిలో కొన్ని ప్రాణాంతక వ్యాధులు కూడా ఉంటాయని వారు తేల్చారు.ప్రమాదకరమైన ప్రొటీన్ల పెరుగుదలఒంటరితనంతో బాధపడేవారిలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన ప్రొటీన్లు అధిక స్థాయిలో ఉన్నట్లు ఇటీవలి వైద్య పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రొటీన్ల వల్ల ఒత్తిడి పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం సహా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అంతర్గతమైన వాపులకు, గుండె, మెదడు వంటి కీలక అవయవాల పనితీరులోని అవరోధాలకు ఈ ప్రొటీన్లే ప్రధాన కారణమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ చున్ షెన్ చెబుతున్నారు. ఒంటరితనంతో బాధపడేవారిలో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే దాదాపు రెండువందల ప్రొటీన్లు అధిక స్థాయిలో ఉన్నట్లు తమ పరీక్షల్లో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.బయటపడాలంటే ఏం చేయాలి?ఒంటరితనానికి సంబంధించి పైన చెప్పిన లక్షణాలతో బాధపడుతున్నట్లయితే, ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఎంత త్వరగా ప్రయత్నిస్తే అంత మంచిది. అందుకోసం ఏం చేయాలంటే...ఇతరులతో సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ముభావంగా ఉంటూ ఎవరైనా పలకరిస్తే, ముక్తసరిగా బదులివ్వడంతో సరిపెట్టుకోకుండా, సానుకూలంగా మాట్లాడండి.ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఒంటరిగానే ఉంటున్నట్లు అనిపిస్తే, స్వచ్ఛంద సేవాసంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకోండి. మీకు నచ్చిన హాబీలకు సంబంధించిన సంస్థల్లో చేరండి. దీనివల్ల క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఒంటరిననే భావన తగ్గుతుంది.ఉదయంవేళ ఆరుబయట నడక సాగించడం, వ్యాయామం చేయడం, ఆటలాడటం వంటివి చేయండి. ఉదయం వేళ సూర్యకాంతిలో గడిపినట్లయితే, మెదడులో ఎండార్ఫిన్, సెరటోనిన్ల స్థాయి పెరిగి, ఉత్సాహంగా అనిపిస్తుంది.ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుంటే వెంటనే వైద్యులను లేదా మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు అవసరమైతే మందులు వాడాల్సి ఉంటుంది. మీ పరిస్థితిని సన్నిహితులకు చెప్పండి.కొన్ని వాస్తవాలుఒంటరితనం ప్రపంచవ్యాప్త సమస్యగా మారడంతో పలు సంస్థలు ఒంటరితనాన్ని రూపుమాపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బ్రిటన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘క్యాంపెయిన్ టు ఎండ్ లోన్లీనెస్’ 2011 నుంచి ఒంటరితనంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఒంటరితనం సమస్యపై శాస్త్ర పరిశోధనలకు, సామాజిక సేవలకు సహాయం అందిస్తోంది. ‘క్యాంపెయిన్ టు ఎండ్ లోన్లీనెస్’ పరిశోధనల ప్రకారం ఒంటరితనాన్ని గురించి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు కొన్ని:కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎందరితో సంబంధాలు ఉన్నా, కొందరు ఒంటరితనంతో బాధపడుతుంటారు. కుటుంబ బాంధవ్యాలు, స్నేహ సంబంధాల పరిమాణానికి, ఒంటరితనానికి ఎలాంటి సంబంధం లేదు. ఒంటరితనం ఒక మానసిక స్థితి.ఒంటరితనం వేర్వేరు స్థాయుల్లో ఉంటుంది. అస్తిత్వ, భావోద్వేగ, సామాజిక స్థాయుల్లో చాలామంది ఒంటరితనంతో బాధపడుతుంటారు.ఈ స్థాయుల్లో ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లుగా భావించడం, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎందరున్నా తమను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరనుకుని బాధపడటం, స్వార్థం తప్ప సామాజిక సంబంధాలలో మరేమీ లేదనుకుని, సమాజానికి వీలైనంత దూరంగా ఉండటం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.చిన్నవయసులోనే ఒంటరితనం బారినపడిన వారు ఏకాగ్రత లోపం కారణంగా చదువుల్లోను, కెరీర్లోను వెనుకబడిపోతారు.ఒంటరితనం సమస్య కేవలం ఆ సమస్యతో బాధపడేవారికి మాత్రమే పరిమితం కాదు. ఈ సమస్య ప్రపంచ ఆర్థిక పురోగతికి అవరోధంగా నిలుస్తూ, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది.ఒంటరితనంతో బాధపడే ఉద్యోగుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతుంది. ఫలితంగా వారు పనిచేసే సంస్థలకు, ప్రభుత్వాలకు ఆర్థికభారం ఎదురవుతుంది.బ్రిటన్లో ఒంటరితనంతో బాధపడేవారి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఎదురయ్యే వార్షిక తలసరి వ్యయం 9900 పౌండ్లు (రూ.11.50 లక్షలు) వరకు ఉంటుందని ‘క్యాంపెయిన్ టు ఎండ్ లోన్లీనెస్’ అంచనా. ప్రపంచస్థాయిలో ఈ వ్యయం ఎంత ఉంటుందనే దానిపై కచ్చితమైన లెక్కలేవీ అందుబాటులో లేవు.మహమ్మారిగా పరిణమించిన ఒంటరితనం కేవలం ప్రజారోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసే సమస్య. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సమస్యపై మరింతగా దృష్టి సారించి, నివారణ చర్యలు చేపడితే తప్ప సమగ్ర సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పురోగతిని సాధించడం సాధ్యం కాదు.దీర్ఘకాలిక ఒంటరితనం లక్షణాలుఎక్కువకాలం ఒంటరితనంతో బాధపడుతున్నట్లయితే, మిగిలిన దీర్ఘకాలిక వ్యాధుల మాదిరిగానే ఒంటరితనాన్ని కూడా దీర్ఘకాలిక వ్యాధిగానే పరిగణించాలని పలువురు మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం దీర్ఘకాలిక ఒంటరితనం లక్షణాలు ఇవికుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతమంది ఉన్నా, వారితో దగ్గర కాలేకపోవడం. వారికి దగ్గరగా ఉన్నా, వారితో పొడి పొడిగా మాట్లాడటమే తప్ప భావోద్వేగాలను పంచుకోలేకపోవడం. వారితో గాఢమైన బంధాన్ని అనుభూతి చెందకపోవడం.స్నేహితులు చాలామంది ఉన్నా, వారిలో ఎవరూ దగ్గరి స్నేహితులు లేకపోవడం. స్నేహంగా ఉంటున్నవారిని దగ్గరగా భావించలేకపోవడం. ఎందరు స్నేహితులు ఉన్నా, వారిలో కనీసం ఒక్కరైనా మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని లోలోన బాధపడుతుండటం.పని ప్రదేశంలో చుట్టూ ఎందరున్నా, ఎవరికీ పట్టని ఏకాకిలా బాధపడుతుండటం. చేసే పని మీద పూర్తిస్థాయి ఏకాగ్రత చూపలేకపోవడం.ఆత్మన్యూనతకు లోనవడం, ఆరోగ్య పరిస్థితిపై లేనిపోని అనుమానాలతో భయపడటం, తరచుగా ప్రతికూల ఆలోచనలతో సతమతం కావడం.కుటుంబంలోని శుభకార్యాలు, స్నేహితులతో పార్టీలు వంటి వేడుకల్లో పాల్గొనాల్సి వస్తే, బాగా అలసిపోయినట్లగా, ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఇబ్బందిపడటం.వేడుకల్లో పాల్గొనేటప్పుడు చుట్టూ జనాలు ఆనందోత్సాహాలతో ఉన్నా, నిర్లిప్తంగా ఎవరికీ పట్టనట్లుగా ఒక మూలన కూర్చుండిపోవడం.పని ప్రదేశంలో చుట్టూ ఎందరున్నా, ఎవరికీ పట్టని ఏకాకిలా బాధపడుతుండటం. చేసే పని మీద పూర్తిస్థాయి ఏకాగ్రత చూపలేకపోవడం. -
మీ జీన్స్లోనే లేదా!
అన్నీ వేదాలలోనే ఉన్నాయన్నట్లు, మొత్తం మన ఆరోగ్య చరిత్రంతా మన జీన్స్లోనే ఉంటుంది. అయితే జీన్స్లో లేకుండా, బయటెక్కడి నుంచో వచ్చి శరీరంలోకి చొర బడి, ఆరోగ్యాన్ని ‘డిస్టర్బ్’ చేసే శక్తుల మాటేమిటి? అది తెలుసుకోవటానికే గత ఇరవై ఏళ్లుగా వైద్య పరిశోధకులు చెట్టూ, పుట్టా గాలిస్తున్నారు. కొండా కోనా ఎక్కి దిగుతున్నారు. పంచభూతాలపై పరిశీలనలు జరుపుతున్నారు. ఏమైనా తేలిందా మరి? త్వరలోనే తేలబోతోందని డాక్టర్ కల్పన బాలకృష్ణన్ అంటున్నారు. చెన్నైలోని ‘శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ డీన్ కల్పన.. ఈ పరిశోధనల్లో భారతదేశం చురుగ్గా ఉందని కూడా చెబుతున్నారు!లోపల జన్యువులు.. బయట అన్యశక్తులు‘‘మా డీఎన్ఏలోనే లేదు..’’ అని ధీమాగా అంటుండే వాళ్లలో సైతం గుండె జబ్బులు కనిపిస్తుంటాయి! కారణమేంటి? ‘‘మా బ్లడ్లోనే లేదు...’’ అని కులాసాగా కబుర్లు చెబుతుండే వాళ్లలో హఠాత్తుగా షుగర్ బయట పడుతుంటుంది! కారణమేంటి? ఈ వైరుధ్యాలను తెలుసుకోవటానికే ‘ఎక్స్పోజోమిక్స్’ రంగంలో నేడు అవిశ్రాంత కృషి జరుగుతోంది. జన్యుశాస్త్రాన్ని ‘జెనోమిక్స్’ అన్నట్లే, బయటి నుండి ప్రభావం చూపే అంశాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఎక్స్పోజోమిక్స్’ అంటున్నారు! మానవ ఆరోగ్యం అన్నది కేవలం వారి లోపలి జన్యువులపైనే ఆధారపడి ఉండదని; బయట పీల్చే గాలి, తాగే నీరు, ఉండే పరిసరాలు, ఉష్ణోగ్రతలు... ఇవన్నీ చూపే ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుందని ఎక్స్పోజోమిక్స్ నిపుణులు ఏనాడో నిర్ధారించుకున్నారు. దాంతో ఈ రంగంలో పరిశోధనలు ముమ్మరం అయి, నేటికీ కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వీటిపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించింది.భారత్... సహజ ప్రయోగశాలజన్యు నిపుణులను ‘జెనిటిసిస్ట్’లు అన్నట్లు, ఎక్స్పోజోమిక్స్ నిపుణులకు ప్రత్యేకమైన పేరు లేదు. ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు, బయాలజిస్టులు, కెమిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, టాక్సికాలజిస్టులు, డేటా సైంటిస్టులు, స్టాటిస్టీషియన్లు, కంప్యూటేషన్ బయాలజిస్టులు అంతా కలిసి ఒక చెయ్యేస్తేనే ‘ఎక్స్పోజోమిక్స్’ అధ్యయనం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో భారత్ వడివడిగా అడుగులు వేస్తోందని, ఎక్స్పోజోమిక్స్పై త్వరలోనే ఒక స్పష్టతను సాధించనుందని చెబుతున్నారు ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) కొలాబరేటింగ్ సెంటర్ ఫర్ ఆక్యుపేషనల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్’ డైరెక్టర్ కూడా అయిన కల్పన బాలకృష్ణన్. ఇటీవలే ఆమె ఎక్స్పోజోమిక్స్పై వాషింగ్టన్ డీసీలోని జా¯Œ ్స హాప్కి¯Œ ్స విశ్వవిద్యాలయం నిర్వహించిన ఫోరమ్లో పాల్గొని వచ్చారు. ఎక్స్పోజోమిక్స్ సైన్స్ పరిశోధనలకు భారత్ ‘సహజ ప్రయోగశాల‘గా మారబోతోందని ఆమె అన్నారు. జినోమ్ సాఫ్ట్... ఎక్స్పోజోమ్ ఫాస్ట్‘ఎక్స్పోజోమిక్స్’ అనే మాట ‘ఎక్స్పోజోమ్’ అనే పదం నుండి పుట్టింది. 2005లో డాక్టర్ క్రిస్టోఫర్ వైల్డ్ ఈ పదాన్ని సృష్టించారు. గర్భస్థ శిశువు మొదలు, జీవిత చరమాంకం వరకు మనుషులపై ఉండే పర్యావరణ ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఎక్స్పోజోమిక్స్. వారసత్వంగా, స్థిరంగా ఉండే జీనోమ్లా కాకుండా ఎక్స్పోజోమ్ క్రియాశీలకంగా ఉండి, నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. మనిషి ఆరోగ్య అంశాలతో ఇది లోతుగా ముడిపడి ఉంటుంది. జన్యువులు, జన్యు గ్రహణశీలత మాత్రమే మనుషుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు అభివృద్ధి చెందుతాయో చెప్పలేవు. కొందరిలో గుండె జబ్బులు లేదా మధుమేహానికి సంబంధించిన జన్యుపరమైన చిహ్నాలు లేకుండానే, వారు వాటి బారిన పడవచ్చు. దీని వెనుక ఉన్న కారణాలను ‘ఎక్స్పోజోమ్’ అధ్యయనం వివరిస్తుంది. మ్యాపింగ్ అత్యంత కీలకంమానవ జీనోమ్ ప్రాజెక్ట్ ఒక దశాబ్దం వ్యవధిలోనే జన్యు శాస్త్రాన్ని అభివృద్ధి పరచినప్పటికీ, హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు, అంతఃస్రావ గ్రంథులకు చెందిన ఎండోక్రైన్ రుగ్మతలు, మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోటానికి ఒక్క జన్యుశాస్త్రం మాత్రమే సరిపోదు. రసాయన, భౌతిక, జీవ సంబంధ, సామాజిక మనోరుగ్మతలు; జీవనశైలి లేదా జీవన పరిస్థితులతో ఆ రుగ్మతల పరస్పర చర్యల ప్రభావాలను తెలుసుకోటానికి వినూత్నమైన ఉపకరణాలతో పాటుగా ఎక్స్పోజోమ్స్ మ్యాపింగ్ అత్యంత కీలకం. (ఉనికిని గుర్తించి దృశ్యమానం చేసే పటాలను సృష్టించే ప్రక్రియే మ్యాపింగ్). గాలి, నీరు, నేల, ఆహారాలలో వేలాది రసాయన సమ్మేళనాలను ఏకకాలంలో పరీక్షించగల హై రిజల్యూషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ (హెచ్.ఆర్.ఎం.ఎస్.)తో ఇది సాధ్యం అవుతుంది. అయితే, ‘‘మనం ఆశించే ఎ, బి, సి ల కోసం మాత్రమే చూడకుండా, ఉంటాయో ఉండవో తెలియని డి, ఇ, ఎఫ్ లను, ఆ తర్వాతి వాటిని కూడా కనుగొనడానికి ‘లక్ష్య రహిత’ విశ్లేషణ చేయాలి. లేకపోతే, మనకు తెలియని వాటి గురించి మనం ఎప్పటికీ తెలుసుకోలేం’’ అంటారు కల్పన. విశ్లేషణలన్నీ కలిస్తేనే సంపూర్ణం, సఫలంజీవసంబంధమైన ప్రతిస్పందనల విశ్లేషణకు నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్.జి.ఎస్.); జీవక్రియలు, ప్రొటీన్లు, జన్యుశాస్త్ర అధ్యయనాలు సహా, వాటన్నిటికీ ఉపకరించే సాఫ్ట్వేర్ సమాహారం ఎక్స్పోజోమిక్స్లో ముఖ్యమైనవి. ఇవి మన దేహంలోని అంతర్గత వ్యవస్థలు బాహ్య ప్రభావాలకు (ఎక్స్పోజర్లకు) ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. రక్తం, మూత్రం, ఇతర కణజాలాల నుండి తీసుకున్న నమూనాలు వీటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తాయి. అయితే, ఎక్స్పోజోమిక్స్ పరిశోధన ప్రయోగశాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అదిప్పుడు వాయు కాలుష్యం, పట్టణ ఉష్ణ దీవులు, వృక్ష విస్తీర్ణం, భూ వినియోగ మార్పుల వంటి భౌతిక ప్రభావాల అధ్యయనం కోసం ఉపగ్రహం ద్వారా సేకరించిన డేటా వంటి వాటిని కూడా కలుపుకుని పోవాలి. అప్పుడే పరిశోధకుల ప్రయత్నాలు సంపూర్ణం, సఫలం అవుతాయి.లోతైన అభ్యాసం.. ఏఐ సహకారం పర్యావరణ సవాళ్లు ఉన్న భారతదేశం వంటి దేశాలలో ఎక్స్పోజోమిక్స్ అధ్యయనం ఎంతో కష్టమైనది. సామాజిక ఆర్థిక స్థితిగతులు కూడా ఆ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా ఎక్స్పోజోమిక్స్ డేటాలోని సంక్లిష్టతను అర్థం చేసుకోటానికి దానిని మ్యాపింగ్ చేసే ప్రాథమిక గణాంక పద్ధతులకు మించి లోతైన అభ్యాసం, ఏఐ ఆధారిత జీవనశైలి నమూనాల గుర్తింపు అవసరం. ఈ గణన సాధనాలు చాలా కీలకమైనవి. పర్యావరణ నమూనాలు, జీవసంబంధమైన ప్రతిస్పందనలు, జనాభాకు సంబంధించిన భారీ, అంచెలవారీ డేటా కేటగిరీలను అవగాహన చేసుకోవడానికి ఆ నమూనాలు అవసరం. ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల ఎక్స్పోజోమ్ సంస్థలు తీసుకున్న నమూనాలు అక్కడి కాలుష్యం, భౌగోళిక వైవిధ్యాల మధ్య... మధుమేహం, హృద్రోగాల వంటి వ్యాధుల ప్రమాదాలను విజయవంతంగా అంచనా వేస్తున్నాయి. సవాళ్లలోనే అధ్యయన అవకాశాలుభారతదేశంలో ఎక్స్పోజోమిక్స్ అధ్యయనాలకు అవకాశాలు ఇక్కడి ప్రజారోగ్య సవాళ్లలోనే ఉన్నాయి. పారిశుధ్యలోపం, పరిశుభ్రమైన నీరు లేకపోవడం ఆ సవాళ్లలో ప్రధానమైనవి. అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్, వాయు కాలుష్యం, సామాజిక మనోరుగ్మతల ఒత్తిడి వంటివి కూడా వీటిలో ఉన్నాయి. పైగా భారతదేశం ఒంటరి శాస్త్రీయ విధానాలపై ఆధారపడుతోంది. ‘‘నిజానికి ఎక్స్పోజోమిక్స్లో ప్రపంచంతో కలిసి పనిచేయటానికి భారతదేశం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది..’’ అని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పర్యావరణ ఆరోగ్యం, ప్రాదేశిక శాస్త్రాల అసోసియేట్ ప్రొఫెసర్ రిమా హాబ్రే అన్నట్లు కల్పన తెలిపారు. ఇటీవల అహ్మదాబాద్ జరిగిన ఐ.సి.ఎం.ఆర్–ఎన్.ఐ.ఓ.హెచ్ సమావేశంలో వీరిద్దరూ భారత్లో జరుగుతున్న ఎక్స్పోజోమిక్స్ అధ్యయనాలపై చర్చించారు. గ్రహణం ఆన్ డిమాండ్! సూర్యగ్రహణం కావాలా? ఆర్డర్ పెడితే వస్తుంది! నిజం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ‘ప్రోబా 3’ అనే డబుల్ స్పేస్క్రాఫ్ట్ మిష¯Œ ద్వారా ఒక కృత్రిమ సూర్యగ్రహణం సృష్టించింది. తాజాగా ఆ మొదటి కృత్రిమ గ్రహణం ఫోటోలు కూడా విడుదల చేసింది. ఇది ఆకాశంలో ఒక అద్భుత ప్రదర్శన. రెండు ఉపగ్రహాల్లో ఒకటి ‘ఆక్యుల్టర్ స్పేస్క్రాఫ్ట్’ సూర్యుడిని కప్పేసుంటే, మరొకటి ‘కరోనాగ్రాఫ్ స్పేస్క్రాఫ్ట్’ సూర్యుడిని పరిశీలిస్తుంది. వీటి మధ్యలో కచ్చితంగా 150 మీటర్ల దూరం. అంతే కాదు, ఇక ‘గ్రహణం కేవలం కొన్ని నిమిషాలే’ అన్నది పాత కథ! సెకన్లపాటు వచ్చే సహజ గ్రహణాల మధ్య ఇది ఏకంగా 6 గంటల పాటు కొనసాగింది. అంతేకాదు, ప్రతి 19.6 గంటలకోసారి ఒక కొత్త సూర్యగ్రహణాన్ని సృష్టించవచ్చు. పూర్తిగా మనుషుల చేతుల్లోనే అంతా ఉంటుంది. ఇక గ్రహణం కోసం ఆకాశం కేసి వేచి చూడాల్సిన రోజులు పోయాయి. మనకిష్టమైనప్పుడు గ్రహణాలను షెడ్యూల్ చేసుకోవచ్చు! శాస్త్రవేత్తలు దీనిని ‘ప్రపంచంలోనే ఇది, తొలి ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లైయింగ్ మిషన్’గా ప్రకటించారు. అయితే, ఇది మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో సూర్యుని మరిన్ని రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.· -
రహస్య నగరాలు
ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. వీటిలో చారిత్రక ప్రాశస్త్యం గల నగరాలు కొన్ని; ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఇంకొన్ని; పర్యాటక ఆకర్షణలు గల నగరాలు మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి నగరాల గురించి చాలామందికి తెలుసు. వీటికి భిన్నంగా ప్రపంచంలో అక్కడక్కడా రహస్య నగరాలు కూడా ఉన్నాయి. వీటి గురించి బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. ప్రపంచ పటాల్లో కూడా ఈ నగరాలు కనిపించవు. అలాంటి కొన్ని రహస్య నగరాల గురించి, ఆ నగరాల్లో జరిగే కార్యకలాపాల గురించి తెలుసుకుందాం.సిటీ 40ఇది రష్యాలో ఉంది. సోవియట్ ప్రభుత్వం 1946లో అణ్వాయుధాల తయారీ కోసం ఏర్పాటు చేసిన రహస్య నగరాల్లో ఇదొకటి. ఈ నగరంలో దాదాపు లక్షమందికి పైగా జనాభా ఉండేవారు. ఇక్కడకు ఇతరుల రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు ఉండేవి. రష్యాలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోని పౌరుల కంటే ఈ రహస్య నగరంలోని పౌరులకు నిత్యావసరాల సరఫరా మొదలుకొని రకరకాల సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉండేవి. చుట్టూ ఎత్తయిన ఇనుప కంచెల మధ్యనున్న ఈ నగరంలో ఇప్పటికీ ‘అణు’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇదివరకు ఇక్కడ కొన్ని అణు ప్రమాదాలు జరిగినా, వాటి వివరాలు బయటి ప్రపంచానికి తెలియకుండా నాటి సోవియట్ ప్రభుత్వం కప్పిపుచ్చింది. చెర్నోబిల్ దుస్సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాతే ‘సిటీ 40’లో కూడా అణు ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసింది. వాతావరణంలో అణు ధర్మాకత నిండి ఉన్న ఈ నగరంలో ఇప్పటికీ జనాలు నివసిస్తున్నారు. కార్మికులు పనులు సాగిస్తూనే ఉన్నారు. ఈ నగరం మ్యాపుల్లో కనిపించదు. అంతేకాదు, ఇక్కడి పౌరుల వివరాలు కూడా ప్రభుత్వ రికార్డుల్లో కనిపించవు.ఇది రష్యాలో ఉంది. ఇప్పటి తరానికి చెందిన రష్యన్లలో చాలామందికి ఈ నగరం ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. ఎందుకంటే, ఈ నగరాన్ని రష్యా మ్యాపుల నుంచి 1947లోనే తొలగించారు. ఇదివరకు దీనిని ‘అర్జామాస్–16’ అనే పేరుతో పిలిచేవారు. సోవియట్ హయాంలో ఇక్కడ అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాక, దీనిని మ్యాపుల నుంచి తొలగించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన అణ్వాయుధ తయారీ కేంద్రం ఇప్పటికీ పనిచేస్తోంది. ఈ నగరాన్ని మ్యాపుల నుంచి తొలగించిన విషయాన్ని రష్యా ప్రభుత్వం 1994లో తొలిసారిగా అంగీకరించింది. ఈ నగరంలో పద్దెనిమిదో శతాబ్ది నాటి చర్చి ఉంది. సెయింట్ సెరాఫియన్ ఈ చర్చిలో ప్రార్థనలు జరిపేవారు. ప్రేమ, కరుణ, మానవత్వం వంటి అంశాలపై తన బోధలు వినిపించేవారు. ఆయన బోధలకు భిన్నంగా ఇక్కడ భీకర హింసకు దారితీసే అణ్వాయుధాల తయారీ కొనసాగుతుండటమే విచిత్రం.బర్లింగ్టన్ బంకర్ఇది ఇంగ్లండ్లో ఉంది. నిజానికి ఇది నగరం కాదు. కేవలం ఒక సువిశాల భూగర్భ స్థావరం మాత్రమే! అయితే, ఇందులో అభివృద్ధి చెందిన నగరాల్లో ఉండే సమస్త సౌకర్యాలూ ఉన్నాయి. కర్మకాలి ఎప్పుడైనా అణు యుద్ధం తటస్థిస్తే, ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి భద్రత కల్పించడానికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఈ భూగర్భ నగరాన్ని 1950లలో నిర్మించింది. బ్రిటిష్ రాచకుటుంబ సభ్యులు సహా ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉండే నాలుగువేల మంది ఇందులో సురక్షితంగా ఆశ్రయం పొందడానికి అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. ఈ స్థావరాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించి, దశాబ్దాలు గడిచినా దీనిని వినియోగించుకునే అవసరం ఏర్పడలేదు. అవసరం లేని ఈ నిర్మాణానికి ఏటేటా నిర్వహణ వ్యయం పెరుగుతూ రావడంతో ప్రభుత్వం 2016లో దీనిని కారుచౌకగా కేవలం 1.5 మిలియన్ పౌండ్లకు (రూ.17.42 కోట్లు) అమ్మకానికి పెట్టింది. అయినా ఇప్పటి వరకు దీనిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం దీనిని అమ్మకానికి పెట్టేంత వరకు జనాలకు దీని గురించి తెలియదు.ఓక్రిడ్జ్ఇది అమెరికాలో ఉంది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో అమెరికా, దాని మిత్ర దేశాలు యుద్ధాన్ని వీలైనంత త్వరగా పరిసమాప్తం చేయడానికి అణుబాంబు ప్రయోగించడం ఒక్కటే మార్గమని తలచాయి. అణుబాంబు తయారీ కోసం రహస్య స్థావరం, ఆ స్థావరానికి తగిన ఏర్పాట్లు కావలసి వచ్చాయి. అందువల్ల అమెరికా ప్రభుత్వం టెనసీ రాష్ట్రంలోని నాక్స్విల్కు పడమరన నలభై కిలోమీటర్ల దూరంలో అరవైవేల ఎకరాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి, 1943లో ఈ రహస్య నగరాన్ని నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో సైనికులు, శాస్త్రవేత్తలు, కార్మికులు పనిచేసేవారు. ఈ రహస్య పట్టణాన్ని అమెరికా తన మ్యాపుల్లో చూపలేదు. ఇక్కడ పనిచేసే కార్మికులకు తాము చేసే పని తప్ప, ఇక్కడ జరిగే కార్యకలాపాలేవీ తెలిసేవి కావు. కొంతకాలం పనిచేశాక ఓక్రిడ్జ్లోని శాస్త్రవేత్తలు అణుబాంబు తయారీకి కీలకమైన శుద్ధి చేసిన యురేనియంను తయారు చేయగలిగారు. ఇక్కడ రెండు యురేనియం శుద్ధి కర్మాగారాలు, ఒక ప్లూటోనియం శుద్ధి కర్మాగారం పనిచేసేవి. దీని గురించి సాధారణ పౌరులకు వివరాలేవీ తెలియవు.క్యాంప్ సెంచరీఇది గ్రీన్లాండ్లో ఉంది. బయటి నుంచి చూస్తే, ఇది మంచుకొండల్లో ఏర్పడిన గుహలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది సువిశాల భూగర్భ నగరానికి ప్రవేశమార్గం. గ్రీన్లండ్ భూభాగంలో అమెరికా ఏర్పరచుకున్న రహస్య సైనిక స్థావరం ఇది. సోవియట్ కాలంలో రష్యా–అమెరికాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో అమెరికా దీనిని నిర్మించింది. భూగర్భంలో నాలుగువేల కిలోమీటర్ల పొడవున సొరంగ రహదారులతో సైనిక అవసరాలకు కావలసిన శాస్త్ర సాంకేతిక పరిశోధనల కోసం అమెరికా భారీ వ్యయంతో ఈ భూగర్భ నగరాన్ని నిర్మించుకుంది. ‘ప్రాజెక్ట్ ఐస్ వర్మ’ పేరుతో ఇక్కడ సైనిక పరిశోధనలు సాగించింది. ఈ నగరంలో శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, ఇతర సిబ్బంది, వారి కుటుంబాలు నివసించడానికి కావలసిన సకల సౌకర్యాలూ ఉన్నాయి. వారి కోసం ఒక సినిమా థియేటర్, ఒక ప్రార్థన మందిరం కూడా ఉండటం విశేషం.వన్స్డార్ఫ్ఇది జర్మనీలో ఉంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ రహస్య నగరాన్ని జర్మన్ రాజ్యం 1871లో నిర్మించింది. అప్పట్లో ఇక్కడ ముస్లిం ఖైదీలను బంధించేవారు. వారి కోసం ఇక్కడ మసీదు కూడా నిర్మించారు. ఇదే జర్మనీలోని తొలి మసీదు. నాజీల ప్రాబల్యం పెరిగాక, 1935 నుంచి రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలో ఇది నాజీల ప్రధాన రహస్య స్థావరంగా ఉండేది. తర్వాత సోవియట్ రెడ్ ఆర్మీ వశమైంది. అప్పట్లో సోవియట్ సైనికులు వారి కుటుంబాలతో ఇక్కడ నివసించేవారు. దాదాపు 75 వేల జనాభా ఉండే ఈ నగరం ‘లిటిల్ మాస్కో’గా, ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరుమోసింది. అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో రష్యన్ బలగాలు ఇక్కడి నుంచి రహస్య కార్యకలాపాలు సాగించేవి. ఇప్పుడు ఈ నగరం శిథిలావస్థకు చేరుకుంది. నగరం నడిబొడ్డున సోవియట్ బలగాలు నెలకొల్పిన లెనిన్ విగ్రహం మాత్రం ఆనాటి కార్యకలాపాలకు సాక్షీభూతంగా నిలిచి ఉంది. -
లీప్ ఇయర్ పత్రిక
ప్రపంచంలో రకరకాల పత్రికలు ఉన్నాయి. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు సర్వసాధారణంగా అందరికీ తెలిసివే! అక్కడక్కడా ద్వైమాసిక పత్రికలు, త్రైమాసిక పత్రికలు కూడా ఉన్నాయి. అరుదుగా ఏడాదికి రెండుసార్లు మాత్రమే ప్రచురితమయ్యే అర్ధవార్షిక పత్రికలు, ఏడాదికి ఒకే సంచికను వెలువరించే వార్షిక పత్రికలు కూడా ఉంటాయి. ఫ్రాన్స్ నుంచి వెలువడే ‘లా బూజీ డి సాపోర్’ అనే ఈ పత్రిక మాత్రం అలాంటిలాంటి పత్రిక కాదు. ప్రపంచంలోని పత్రికలన్నింటిదీ ఒకదారి అయితే, ఈ పత్రికది మరోదారి. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ పత్రిక క్రమం తప్పకుండా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ప్రచురితమవుతుంది. అది కూడా ఠంచనుగా ప్రతి లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీన ఇది విడుదలవుతుంది. లీపు సంవత్సరం వచ్చిందంటే చాలు, దీనికోసం పెద్దసంఖ్యలో పాఠకులు ఎదురుచూస్తూ ఉంటారు.అలా మొదలైంది...హాస్య, వ్యంగ్య కథనాలను ప్రధానంగా ప్రచురించే ఈ పత్రిక 1980లో మొదలైంది. ఇప్పటి వరకు ఈ పత్రిక వెలువరించినవి పన్నెండు సంచికలు మాత్రమే! పెద్దగా వ్యాపార ప్రణాళికలు, ఘనమైన లక్ష్యాలు వంటివేవీ లేకుండానే ఈ పత్రిక ఇద్దరు మిత్రుల చిలిపి ఆలోచన ఫలితంగా పుట్టుకొచ్చింది. జాక్వెస్ డి బుయిసన్, క్రిస్టియన్ బెయిలీ అనే మిత్రులు కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నపుడు ‘లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి కదా, ప్రతిసారీ ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకొస్తే భలేగా ఉంటుంది కదా!’ అని అనుకున్నారు. జాక్వెస్ పాలిటెక్నీషియన్, క్రిస్టియన్ ఔత్సాహిక ప్రెస్ టెక్నీషియన్– అంతేకాకుండా, పాతపత్రికల సేకర్త కూడా! ఇద్దరూ కలసి ఎలాగైనా, ఫిబ్రవరి 29న విడుదలయ్యేలా పత్రిక ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. పత్రికకు ఏ పేరు పెడదామని ఆలోచించారు. పంతొమ్మిదో శతాబ్ది చివరిరోజుల నాటి కార్టూన్ క్యారెక్టర్ ‘సాపర్ కామెంబర్’ గుర్తొచ్చింది. ఆ కార్టూన్ పాత్ర ఫిబ్రవరి 29న వస్తుంది. నాలుగేళ్లకు ఒకసారి పుట్టినరోజు జరుపుకొనే ఆ పాత్ర బోలెడంత హాస్యం సృష్టిస్తుంది. అందుకే, ఆ పాత్ర గుర్తొచ్చేలాంటి పేరు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ‘లా బూజీ డి సాపోర్’ (సాపర్స్ క్యాండిల్) అనే పేరు పెట్టారు. తొలి సంచికను 1980 ఫిబ్రవరి 29న ఇరవై పేజీలతో టాబ్లాయిడ్ సైజులో విడుదల చేశారు. మార్కెట్లోకి విడుదలైన కాపీలు హాట్కేకుల్లా అమ్ముడైపోయాయి. అప్పటి నుంచి ఈ పత్రిక ప్రతి లీపు సంవత్సరంలోను ఫిబ్రవరి 29న ఠంచనుగా మార్కెట్లోకి తన సంచికను విడుదల చేస్తోంది. ప్రస్తుతం జీన్ డి లిండీ ఈ పత్రికకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగుతున్నారు. హాస్యరస ప్రధానంప్రధానంగా ఇది హాస్యరస ప్రధానమైన పత్రిక. ఎక్కువగా హాస్య, వ్యంగ్య కథనాలను ప్రచురిస్తుంది. అయినా, దీనిపైన రాజకీయ విమర్శలు లేకపోలేదు. జాతీయ అతివాదానికి ఈ పత్రిక మద్దతుగా కథనాలను ప్రచురిస్తోందని కొన్ని ఫ్రెంచ్ పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే, తమది పూర్తిగా రాజకీయాలకు అతీతమైన పత్రిక అని ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ చెప్పుకుంటారు. ఈ పత్రిక ప్రతులు ఫ్రాన్స్లోనే కాకుండా బెల్జియం, స్విట్జర్లండ్, లగ్జెంబర్గ్, కెనడా దేశాల్లో కూడా అమ్ముడవుతాయి. చివరిగా 2024లో విడుదలైన ఈ పత్రిక ప్రతులు రెండు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. ‘మేం ప్రచురించే ప్రతి సంచికలోనూ గడచిన నాలుగేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలను సింహావలోకనం చేస్తాం. అలాగని మాది రాజకీయ పత్రిక కాదు. రాజకీయాలకు అతీతంగా మేం పత్రికను నడుపుతున్నాం. బ్రెగ్జిట్ మొదలుకొని పర్యావరణ మార్పుల వరకు రకరకాల సమస్యలను మా పత్రికలో చర్చిస్తుంటాం. కథనాలు హాస్యస్ఫోరకంగా, వ్యంగ్యంగా ఉంటే పాఠకులను త్వరగా ఆకట్టుకోగలవని మా ఉద్దేశం. నవ్వు ఆరోగ్య లక్షణం. పాఠకులను నవ్వించాలనేదే మా లక్ష్యం’ అంటారు ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు జీన్ డి లిండీ. ఈ పత్రిక 2024 సంచిక ధర 4.90 యూరోలు. మిగిలిన పత్రికల్లాగానే ఈ పత్రికను కూడా మార్కెట్లోకి విడుదలైనప్పుడు కొనుక్కోవచ్చు. ఎప్పటి సంచికను అప్పుడు కాకుండా, ఒకేసారి చందా కట్టాలనుకుంటే, 100 యూరోలు చందా కట్టినట్లయితే, వందేళ్ల పాటు– అంటే, పాతిక సంచికలు అందుతాయి. ప్రపంచ పత్రికా రంగంలో ఈ ఫ్రెంచ్ పత్రికది ఒక విలక్షణమైన కథ. -
మంత్ర తంత్రశాస్త్రాల మహిమ
బృహస్పతి నుంచి లౌకిక శాస్త్రాల ఘనతను సోదాహరణంగా తెలుసుకున్నాడు ఇంద్రుడు. మోక్షసాధనకు బ్రహ్మవిద్య ఉండగా, మరి మంత్ర తంత్రశాస్త్రాలు ఎందుకు ఉన్నాయి? వాటి వల్ల ప్రయోజనం ఏముంది? అనే సందేహం కలిగింది అతడికి. అదే సందేహాన్ని దేవగురువు వద్ద బయటపెట్టాడు.‘ఆచార్యా! మోక్షసాధనకు బ్రహ్మవిద్య ఒక్కటి సరిపోతుంది కదా? మరి అలాంటప్పుడు మంత్ర తంత్రశాస్త్రాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? వాటి వల్ల సాధించే ప్రయోజనం ఏముంటుంది? ఈ మంత్ర తంత్ర విద్యలు క్షుద్రప్రయోజనాల కోసం దుర్వినియోగానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ కదా? వీటి వెనుకనున్న మర్మమేమిటి?’ బృహస్పతిని అడిగాడు ఇంద్రుడు. ‘శచీపతీ! మంత్ర తంత్రశాస్త్రాల ప్రయోజనం ఏమిటనేగా నీ సందేహం? నీకు బాగా అర్థం కావడానికి ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను’ అంటూ బృహస్పతి ఆ కథను ఇలా చెప్పసాగాడు.‘పూర్వం విశాలనగరంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల శాస్త్రకోవిదుడు, తత్త్వజ్ఞుడు. అంతేకాదు, బహిరంతరేంద్రియ నిగ్రహం గలవాడు, ధర్మపరాయణుడు. వైదిక కర్మలను తు.చ. తప్పక పాటించేవాడు. గృహస్థాశ్రమ జీవనం సాగిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. కొన్నాళ్లకు వేదశర్మకు ఒక కొడుకు కలిగాడు. అతడికి సుశీలుడు అని నామకరణం చేశాడు. సుశీలుడి పురాకృత పాపకర్మల ఫలితంగా పుట్టినప్పటి నుంచి ఆ బాలుడిని ఏడుగురు బ్రహ్మరాక్షసులు ఆవహించారు. ఆ ఏడుగురు బ్రహ్మరాక్షసులు పరస్పరం కలహించుకుంటూ, ఒకరినొకరు వధించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు చేసేవారు. వారి ప్రభావానికి సుశీలుడు విలవిలలాడుతూ రోదించేవాడు. ఒక్కోసారి రాక్షసుల ప్రభావంతో అతడికి ఉన్మాదం ప్రకోపించి, ఊరకే నవ్వుతూ నృత్యం చేసేవాడు. ఒక్కోసారి అకస్మాత్తుగా మూర్ఛపోయేవాడు. ఎదుగుతున్న కొద్ది సుశీలుడి చేష్టలు కొంత వింతగాను, మరింత విపరీతంగాను ఉండేవి. ఒక్కోసారి అతడు తినడం మొదలుపెడితే, ఇది తినదగినది, ఇది తినదగినది కాదు అనే విచక్షణ లేకుండా అమితంగా తినేవాడు. ఒక్కోసారి రోజుల తరబడి పస్తులుండేవాడు. కొడుకు తీరు చూస్తూ, వేదశర్మ దంపతులు ఆవేదన చెందేవారు. తన కొడుకును ఏ దయ్యాలో భూతాలో పట్టుకుని ఉంటాయని భావించిన వేదశర్మ, వాటిని వదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హోమాలు, నోములు, తీర్థయాత్రలు వంటివి ఎన్ని చేసినా, ప్రయోజనం లేకపోయింది. ఇంట్లో కొడుకు వల్ల తీరని ఇబ్బంది ఉన్నా, వేదశర్మ ఎన్నడూ తన గార్హస్థ్య ధర్మాన్ని మానుకోలేదు. ప్రతిరోజూ అతిథిపూజ చేసిన తర్వాతే తాను భుజించేవాడు.ఒకనాడు వేదశర్మ వైశ్వదేవం ముగించుకుని, అతిథి ఎవరైనా రాకపోతారా అని గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలోగా ఇంటి ముందుకు ఒక భిక్షువు వచ్చాడు. ఒళ్లంతా మట్టికొట్టుకుని ఉన్నాడు. చీలికలైన దుస్తులతో, దుర్గంధమయంగా ఉన్నాడు. అతడి శరీరం మీద ఈగలు ముసురుతూ ఉన్నాయి. ‘అభ్యాగతః స్వయం విష్ణుః’ అనే ఆర్యోక్తి ప్రకారం వేదశర్మ అతడిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఇంటి లోపలికి తీసుకుపోయి, భోజనం పెట్టించాడు. అతిథి భోజనం తర్వాత వేదశర్మ తాను కూడా ప్రసాదం స్వీకరించి వచ్చి, భిక్షువుకు వింజామర వీచసాగాడు. ఈ అతిథి సాక్షాత్తు దత్తాత్రేయుడే కావచ్చు అనే ఆలోచన వేదశర్మ మనసులో మెదిలింది. దత్తాత్రేయుడు ఈ నగరంలోనే సంచరిస్తూ, ఇళ్లకు వెళ్లి భిక్ష స్వీకరిస్తున్నట్లు కొద్దిరోజుల కిందటే విన్నాడతను. ఈయనే గనుక దత్తాత్రేయుడు అయినట్లయితే తన జన్మ ధన్యమైనట్లేనని భావించాడు. అంతలోనే ఆ భిక్షువు లేచి, ‘ఇక బయలుదేరుతాను’ అంటూ బయటకు నడిచాడు. వేదశర్మ అతడి వెంటపడ్డాడు. భిక్షువు పొమ్మంటున్నా వినిపించుకోకుండా, అతడినే అనుసరించసాగాడు. వేదశర్మ ఎంత చెప్పినా వినకుండా తన వెంటే వస్తుండటంతో విసుగెత్తిన భిక్షువు అతడి మీదకు చేతికందిన రాయి, కట్టె వంటివి విసరసాగాడు. వాటి దెబ్బలకు నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా, వేదశర్మ అతడి వెంటే ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్లాక దారిలో ఒక గాడిద కళేబరం కనిపించింది. భిక్షువు ఆ గాడిద శరీరం నుంచి ఇంత మాంసం ముద్దను పెకలించి, ‘ఇంద తిను’ అని వేదశర్మ చేతుల్లో పెట్టాడు. వేదశర్మ దానిని ప్రసాదంలా భక్తిగా దోసిట్లో పట్టుకుని, అతడి వెంట నడవసాగాడు. వేదశర్మను చేరువకు రానిచ్చి, భిక్షువు అతడిని కాలితో చాచిపెట్టి తన్నాడు. వేదశర్మ ఆ తాపును తట్టుకుని నిలబడ్డాడు. ఈలోగా భిక్షువు పరుగులాంటి నడకతో ముందుకు సాగి, ఒక కొండ గుహలోకి దూరాడు. వేదశర్మ కూడా ఆ కొండ గుహలోకి వెళ్లాడు.‘ఏమయ్యా నువ్వు! తిట్టినా కొట్టినా వదలకుండా నా వెంటపడ్డావు?’ అడిగాడు భిక్షువు.వేదశర్మ భోరున విలపిస్తూ అతడి పాదాలపై పడ్డాడు. తన కొడుకు దురవస్థను చెప్పి, అతడి దుఃఖాన్ని తొలగించమని అభ్యర్థించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. ఏడు మంత్రాలను బీజాక్షర సహితంగా వేదశర్మకు ఉపదేశించాడు.‘నీ కొడుకును ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. వారిని ఒక్కొక్కరినే వదలగొట్టాలి. రోజుకొక మంత్రాన్ని జపించు. మంత్రోదకాన్ని నీ బిడ్డ మీద చిలకరించు. అలాగని, ఒకేసారి ఏడుగురు రాక్షసులను వదలగొట్టడం ఏ మంత్రానికీ సాధ్యం కాదు. అందుకని ఆ బ్రహ్మరాక్షసులను ఒకరి తర్వాత ఒకరుగా మాత్రమే వదలగొట్టాలి. ఏడుగురు బ్రహ్మరాక్షసులూ వారం రోజుల్లోనే నీ బిడ్డను విడిచి వెళ్లిపోతారు. ఆ తర్వాత నీ బిడ్డ నీ అంతటి కర్మిష్ఠి అవుతాడు’ అని చెప్పాడు.వేదశర్మ భిక్షువుకు పదే పదే నమస్కారాలు చేస్తూ, అక్కడి నుంచి ఇంటిముఖం పట్టాడు.ఇందాక గాడిద కళేబరం పడి ఉన్న చోట ఒక రక్తచందన వృక్షం ఉంది. తన చేతిలో భిక్షువు పెట్టిన మాంసం ముద్ద రక్తచందన పుష్పమైంది.ఇంటికి వెళ్లిన బ్రాహ్మణుడు భిక్షువు చెప్పిన ప్రకారమే రోజుకొక మంత్రాన్ని జపించి, ఏడుగురు రాక్షసులను ఒక్కొక్కరినే తన బిడ్డ నుంచి వెళ్లగొట్టాడు. ఆ తర్వాత సుశీలుడు సాధారణ స్థితికి వచ్చాడు.విన్నావు కదా దేవేంద్రా! మంత్ర తంత్రశాస్త్రాలు కేవలం క్షుద్రప్రయోజనాలకే కాదు, పరంపరాగతంగా అవి ముక్తిసాధనాలు కూడా కాగలవు’ అని ముగించాడు బృహస్పతి.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: ముట్టుకోకు
‘‘చదవేస్తే ఉన్న మతి పోయిందట! పిచ్చి అనుమానాలతో పిల్లల బుర్రలు పాడు చేస్తే ఇలానే ఉంటుంది మరి! నా కొడుకు కష్టమంతా బూడిదలో పోసేశావ్, నీ అతితెలివి తగలెయ్యా! బ‘‘మా అత్తగారు ఆ రోజు నా మనసులో గుచ్చిన ఆ ముల్లు ఇంకా పచ్చిగానే ఉంది.‘‘అసలు మగ పిల్లాడిని పెంచే విధానం ఇదేనా! మగపిల్లాడంటే పులిబిడ్డలా ఉండాలి, పిరిగ్గొడ్డులా కాదు.’’ గుచ్చిన ముల్లునే ఇంకా లోనికి దించుతూ అటూ ఇటూ తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకప్పుడు.మారుతున్న కాలంతో పాటూ వంకర్లు పోతున్న మనుషుల మెదళ్ళ గురించి, ఆ వంకర్లలో నుంచి పుట్టే వికృత కృత్యాల గురించి ఆవిడకి వివరించి చెప్పే ధైర్యం నాకు లేదు, అర్థం చేసుకునే పెద్ద మనసు ఆవిడకి లేదు. నాలాంటి పిరికి కోడళ్ళం ఉన్నాం ఈ రోజుల్లో కూడా! భయభక్తులతో నేనూ, ఆధిపత్యంతో అత్తగారూ, కెరీర్లో పడుతూ లేస్తూ మా ఆయన. నిస్సారంగా సాగిస్తున్న మా జీవితాల్లోకి ఆ సంఘటన ఓతుఫానులా వచ్చి వెళ్ళినా, అది వదిలి వెళ్ళిన గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు. పదేళ్ళు కష్టపడ్డా దక్కని ఫలితం ఒక్క విందు దౌత్యం ద్వారా దక్కుతుందంటే వెనుకాడుతామా? ఉదయం నాలుగున్నరకే లేచి రెండు రకాల టిఫిన్లూ, వాటికి రెండు చట్నీలూ, సాంబారూ; మధ్యాహ్నం లంచ్ కోసం కొర్రమీను పులుసు, టైగర్ రొయ్యల వేపుడు, నాటు కోడి ఇగురు, మటన్ బిర్యానీ; వాటికి తోడు శాకపాకాలు కూడా ఉండాలిగా అన్నట్టు ఆలూ ఫ్రై, టమాటా పప్పు, రసం, అప్పడాలూ, పెరుగూ; ఇవన్నీ చాలవన్నట్టు చక్కెర పొంగలి, అరటిపండూ, ఐస్ క్రీమూ– బడా గెస్ట్ కోసం భారీ మెనూ సిద్ధం చేసుకొని,వంట పూర్తిచేసి, మొహాన కాసిన్ని నీళ్ళు జల్లుకొని, ముస్తాబై నవ్వు సింగారించుకొని కూర్చున్నా.మా ఆయన, తనకు దక్కబోతున్న పది కోట్ల కాంట్రాక్టు గురించి; దాన్ని ప్రసాదించబోయే మంత్రిగారి బామ్మర్ది గురించి వేచి చూస్తూ, ఇంటి గేటు దగ్గరే పచార్లు కొడుతూ ఉన్నారు. మంత్రిగారి బామ్మరిదే మా బడా గెస్టు. పదేళ్లుగా చిన్నచిన్న సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ బండి లాక్కొస్తున్న మా ఆయనగారికి దొరక్క దొరక్క ఎదురుపడ్డ పది కోట్ల రోడ్డు కాంట్రాక్టుని విందు దౌత్యం ద్వారా దక్కించుకోవాలని ఆయన ఉబలాటం. అన్నీ పోనూ ఓ పది శాతమైనా మిగిలితే చాలు, జీవితంలో ఓ మెట్టెక్కినట్టే! ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజనాల సమయం వరకూ పెద్ద పెద్దోళ్లతో మంతనాలన్నీ మా ఇంట్లోనే! వారి కోసమే ఈ భారీ మెనూ. కాంట్రాక్టులంటే కమిషన్లూ, పర్సెంటేజీల అధికారిక పొట్లాల పంపిణీ ఉండనే ఉంటుంది కాని, మనీ పర్సుని తృప్తిపరిస్తే అది ఖాళీ అయ్యేవరకే గుర్తుంటుంది, మనిషి అహాన్ని తృప్తిపరిస్తే మనిషి ఉన్నంతవరకూ గుర్తుపెట్టుకుంటాడు. అతిథి మర్యాదలకున్న పవర్ అలాంటిది. పైగా ఆ వచ్చేవాడు పెళ్లీ పెటాకులు లేని బెమ్మచారిట! ఇంటికి పిలిచి భోజనాలు పెడితే తెగ పొంగిపోతాడట! ఆ వీక్నెస్ పట్టేశారు మావారు.గంట సేపు వెయిటింగ్ తర్వాత పెద్ద పడవ లాంటి కారులో దిగాడు మంత్రిగారి బామ్మర్ది. మాసిన తెలుపు నలుపుల గడ్డం, లోపలకెళ్లిన సీసాల కొద్దీ మద్యాన్ని మోయలేక ఊరిపోయి వేలాడుతున్నట్టున్న పొట్ట, మెడలో కట్లపాములాంటి బంగారపు గొలుసు, చేతికి బ్రేస్లెట్, బొటనవేళ్ళు తప్ప మిగతా ఎనిమిది వేళ్లకు ఎనిమిది ఉంగరాలు ధరించిన ఆ భారీ ఆకారం ఊగుతూ మా ఇంట్లో చొరబడింది, సాదర స్వాగతాలతో!మా సోఫా సెట్లో కుర్చీలు ఈయనకు సరిపోతాయా అన్న అనుమానం గుండెను గుంజేసింది కాసేపు. ఇంతాచేసి ఇలాంటి చోట అభాసు పాలైపోతే ఎలా! పర్లేదు, కుదురుకొని సర్దుకున్నాడు. ఈ మంత్రుల తమ్ముళ్ళు, బామ్మరుదులు ఏదో ఇలానే ఉండాలని రూల్ పెట్టుకుంటారో ఏంటో! అచ్చం సినిమాల్లో చూపించినట్టు ఉన్నాడు. టిఫిన్లకు కూర్చున్నారు. పక్కనే నిలబడి అతి వినయం ప్రదర్శిస్తూ వడ్డిస్తున్నాను. ఆ పక్కగా ఆడుకుంటున్న మా ఐదేళ్ల చింటూగాడు పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. అతడు ముచ్చటగా చూసి నవ్వేడు. గంభీరమైన ఆ ముఖానికి నవ్వు కూడా వచ్చా! అనిపించింది. టిఫిన్లు పూర్తయి భారీ ఆకారాన్ని మళ్ళీ సోఫాకి తరలించి ప్రాజెక్టుకి సంబంధించిన ఫైలు ఏదో తెమ్మని ఆయన్ని లోపలికి పంపేడు.‘‘టిఫిన్ తర్వాత నాకు జ్యూస్ అలవాటు... తీసుకొస్తారా?’’ ఆర్డరు వేసి నన్ను వంటగదిలోకి పరిగెత్తించాడు. అతడు చింటూగాడిని ఎత్తుకొని బుగ్గలు నిమరడం నేను కిచెన్లోకి వెళ్తుండగా నా కంటబడ్డ ఆఖరి దృశ్యం. అంతే!ఓ రెండు నిమిషాల తర్వాత..‘‘బ్యాడ్ అంకుల్! బ్యాడ్ టచ్!! బ్యాడ్ అంకుల్! బ్యాడ్ టచ్!’’ చింటూగాడి అరుపులకు గుండె జలదరించినట్టైంది. పరిగెత్తుకొని హాల్లోకి వచ్చి చూశాను. చింటూని విదిలించి కింద పడేసి, కోపంగా చూస్తూ ఇంటి బయటకు తన భారీ కాయాన్ని జరజరా లాక్కుంటూ పోతున్నాడు.మా ఆయన బెడ్రూమ్లోంచి బయటకొచ్చి ఫైలు పట్టుకొని నిలబడి హతాశుడై చూస్తున్నాడు. బయటకు పోతున్న అతడి వెంట ‘‘సార్సార్! సారీ సార్...!’’ అంటూ పరిగెత్తాడు. అతడి కారు మా ఆయన్ని పట్టించుకోలేదు.చింటూని దగ్గరకు తీసుకొని హత్తుకొని కూర్చున్నాను. ‘‘అసలేమైంది చింటూ?’’ అనునయిస్తూ అడిగాను.‘‘ఏమైందేంటే?? వాడిని ఎత్తుకొని కాస్త ముద్దు చేశాడాయన, అంతే! నేనిక్కడే ఉన్నానుగా!’’ గయ్యిమంది మా అత్తగారు.‘ఊరికే వాడు బ్యాడ్ టచ్ అని ఎందుకు అరుస్తాడు? వాడికి బ్యాడ్ టచ్ అంటే ఏమిటో వివరించి చెప్పానుగా ఎప్పుడో! అంటే వచ్చిన వెధవ ఏమైనా అఘాయిత్యం!’ తల్చుకుంటేనే వెన్నులో వణుకొచ్చేసింది. వివరంగా చింటూని అడగాలనుకున్నా. ఆవిడ ముందు నా గొంతు పెగలలేదు.‘పక్కగదిలో కూర్చొని సాయికోటి రాసుకుంటున్న ఈవిడ హాల్లోకి ఎపుడు చూసిందని, వాడికి వత్తాసు పలుకుతోంది!?’ నా బుర్రకేమీ తోచలేదు.‘‘మొత్తం నాశనం అయిపోయింది. ఛా!!’’ ఇంట్లోకి వస్తూనే చేతిలో ఫైలుని విసిరికొట్టాడు మా ఆయన.కాయితాలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పిచ్చెక్కినట్టు అరవటం మొదలుపెట్టాడు.పిల్లోడికి ఏమైందో అనే ఆదుర్దా కూడా లేకుండా కాంట్రాక్ట్ పోయిందనే బాధపడటం నాకు ఆశ్చర్యమే కాదు, అసహ్యం కూడా వేసింది. ముడిపడ్డ నా నొసటిని, మా వారివైపు చీదరింపుతో కూడిన నా చూపుని కూడా భరించలేకపోయింది మా అత్తగారు.‘‘చదవేస్తే ఉన్న మతి పోయిందట! పిచ్చి అనుమానాలతో పిల్లల బుర్రలు పాడుచేస్తే ఇలానే ఉంటుంది మరి! నా కొడుకు కష్టమంతా బూడిదలో పోసేశావ్, నీ అతితెలివి తగలెయ్యా! అసలు మగ పిల్లాడిని పెంచే విధానం ఇదేనా? అయినా చింటూ ఏమైనా ఆడపిల్లా? మగపిల్లాడంటే పులిబిడ్డలా ఉండాలి. పిరిగ్గొడ్డులా కాదు’’ అత్తగారు విరుచుకుపడింది. నా ఒళ్ళో ఉన్నవాడిని రెక్కపట్టుకు లాక్కుపోయి బెడ్రూం తలుపేసుకు కూర్చుంది.నా బుర్ర గిర్రున తిరిగింది. అసలక్కడ ఏం జరుగుతోందో నాకేం అంతుబట్టలేదు. ఇలాంటి పరిస్థితిలో ఓ తండ్రి, నానమ్మ ప్రవర్తించాల్సిన తీరు కచ్చితంగా ఇది కాదు. ఒక్కసారిగా అగాథంలోకి కూరుకుపోయిన భావనేదో కమ్మేసింది.మా ఆయనగారు బిక్కుబిక్కుమంటూ అతడికి ఫోన్ చేసి తిరిగి రప్పించే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నాడు. అతడు ఫోన్ ఎత్తినట్టు లేడు. ఎవరెవరికో ఫోన్లు చేసి, కాంట్రాక్టు చేజారిపోకుండా చూసేందుకు దేబిరిస్తున్నాడు. అత్తగారు మూసిన తలుపింకా తెరవలేదు. లోపల చింటూ ఎలా ఉన్నాడో! తలుపు తట్టే ధైర్యం నాకు లేదు. నా బేలతనానికి నాకే సిగ్గేసింది.డబ్బు కోసం కన్న కూతుర్ల శీలాన్ని తాకట్టు పెట్టే తల్లిదండ్రులు ఉంటారని చాలా చోట్ల చదివి ఉన్నాను.ఇప్పుడు ఇంచుమించు అలాంటి వాళ్ళనే చూస్తున్నాను అనిపించేసింది. ఓహ్! మగపిల్లలకి శీలం లాంటిదేదీ ఉండదు కదూ! మరిప్పుడు తాకట్టు పెట్టినదాన్నేమంటారో!నా తడి కళ్ళు నిస్సహాయంగా తలుపుకేసి చూస్తుండిపోయాయి. అర్హతకు తగ్గ అవకాశాలు, విజయాలు దక్కకపోతే మనిషి మరీ ఇంత దిగజారిపోతాడా? కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరికో ఫోన్లు చేసి దేబిరిస్తున్న మా ఆయన మొహం చూడాలంటే కంపరం మొదలయింది. మూడు గంటలు గడిచాయి. ఆయన ప్రయత్నాలేవీ ఫలించినట్టు లేవు. అసలైనోడే అలిగి వెళిపోతే కొసరు పెద్దమనుషులు కూడా మొహం చాటేశారు. కాంట్రాక్టు గాలిలో కలిసినట్టే. సమయం గడుస్తున్న కొద్దీ రక్తపోటు పెరిగి ఆయన మొహం వికృతంగా కొంకర్లుపోతోంది. ఇంకాసేపైతే కిందపడి గిలగిలా కొట్టుకునేవాడే. గేటు బయట కారు శబ్దం విని దిగ్గున లేచాడు. పరిగెత్తుకు వెళ్ళి అతడి చేతులు పిసుకుతూ సారీలు చెప్పుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు .వాడి మొహంలో ఇందాకటి గాంభీర్యం ఇప్పుడు లేదు, పాలిపోయింది. పీడోఫిల్ ... చిన్నపిల్లలపై కామవాంఛలను పెంచుకునే వెధవలను అలానే పిలుస్తారట! ఎక్కడో చదివిన గుర్తు. వీడు అందుకే పెళ్లి పెటాకులు లేకుండా ఆంబోతులా తిరుగుతున్నాడనమాట!వాడ్ని చూస్తూనే నా నరాలు పొంగాయి. చికెనూ మటనూ కోసిన కత్తితోనే వాడి పీక కోసేయాలన్నంత కసి.‘‘బాగా ఆలస్యం అయిపోయింది. సార్గారు వచ్చేశారు కదా, భోజనం వడ్డించు’’ ఆయనగారి ఆర్డరు!కారు శబ్దం వింటూనే బెడ్రూమ్ తలుపు తెరుచుకుంటూ బయటకొచ్చింది మా అత్తగారు. వస్తూనే వంగి వంగి దండాలెట్టేసింది. చింటూ లోపల పడుకున్నట్టున్నాడు. ఏ చప్పుడూ లేదు.‘‘ఏంటి చూస్తున్నావ్ వడ్డించూ!!’’ అత్తగారి హుకుం జారీ అయింది. నాలోని దద్దమ్మ కోడలు తలవంచేసింది. వచ్చినోడు ఎంత వెధవ అయినా, ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టినా, వాణ్ని చూస్తేనే మన ఒంట్లో రక్తం సలసలా కాగుతున్నా, మర్యాదలకు మాత్రం లోటు రానివ్వకూడదు. దద్దమ్మ కోడళ్ళ రూల్బుక్లో మొదటి రూల్ ఇదే కావొచ్చు!మటను బొమికల్లో మజ్జను కూడా జుర్రుకుంటూ మెక్కుతున్న ఆ కుక్కను చూస్తే ఒళ్ళంతా కంపరమేసింది. పక్కనే జీ హుజూర్ ! అంటూ నిల్చున్న మా వాళ్ళను చూస్తే అంతకంటే జుగుప్సగా ఉంది.‘‘మీరు చదువుకున్నవారిలా ఉన్నారే!’’ నాకేసే చూస్తూ అడిగాడు ఆ కుక్క.వాడికి జవాబిచ్చే స్థితిలో నేను లేను. చాలాసేపటి నుంచి పంటి బిగువున అదిమిపట్టిన కోపం, కట్టలు తెంచుకోవడం నాకిష్టం లేదు. దద్దమ్మల రూల్ పుస్తకంలో ఇది మరో రూల్.‘ఆ! ఏదో చదివిందిలెండి. ఈకాలం ఆడపిల్లల చదువులు ఉద్యోగాలకి చాలవు ఇల్లు చక్కబెట్టడానికి పనికిరావూ..’’ వెకిలి కామెంటు విసిరింది అత్తగారు.అతడు పట్టించుకోలేదు. ‘‘ఏమ్మా! బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి చెప్పడం తెలిసింది సరే, మరి ఆ తర్వాత పిల్లాడిని జరిగిన విషయం గురించి వాకబు చేశావా తల్లీ?’’ గతుక్కుమన్నాను. అతడు ఎగతాళి చేస్తున్నాడో, సవాలు చేస్తున్నాడో అర్థం కాలేదు. బెడ్రూమ్ వైపు అత్తగారి వైపు మార్చి మార్చి చూశాను. ‘‘పోవే! పోయి వాణ్ని తీసుకురా! ’’ అన్నట్టు కళ్ళతోనే సైగ చేసిందావిడ.పరిగెత్తుకు లోపలికి వెళ్ళాను. చింటూని గుండెలకి హత్తుకుని, బుజ్జగిస్తూ ఆరా తీశాను. నాలుగు గంటల మానసిక క్షోభ తర్వాత గుండెలపై నుండి టన్ను బరువు దించినట్టైంది. వాడి చేయి పట్టుకుని మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చాను. చింటూ కళ్ళలో బెరుకు, భయం లాంటివేవీ నాకు కనపడలేదు. అతడిని చూసి, ‘‘నీ జట్టు పీస్! బ్యాడ్ అంకుల్.’’ అన్నాడు.మా ఆయన గొంతు తడారిపోవడం తెలుస్తూనే ఉంది. గుటకలు మింగుతూనే ఉన్నాడు.‘‘తప్పు! అలా అనకూడదు చింటూ!’’ చింటూ చెయ్యి పట్టుకులాగి చిన్నగా కుదుపుతూ గయ్యిమన్నాడు మా ఆయన.‘‘ఈ అంకుల్ నాతో ఫైటింగ్ చేస్తూ నా సీటుపైన గిచ్చేశాడు.‘‘ బుంగ మూతి పెట్టి చెప్పాడు బుజ్జాయి చింటూ.మా ఆయనగారూ, అత్తగారూ తెచ్చి పెట్టుకున్న నవ్వుతో బిగ్గరగా నవ్వేసి, ‘‘తప్పు నాన్నా! అంకుల్ సరదాగా చేశారు. బ్యాడ్ అంకుల్ అనకూడదు’’ అని, చింటూతో బలవంతంగా ‘సారీ’ కూడా చెప్పించేశారు.చింటూ చెప్పిన విషయం నమ్మాలనే అనిపించింది. ఊహించినట్లుగా ఏ ఘోరమూ జరగలేదని తెలిశాక, తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.‘‘పూర్తిగా తెలుసుకోకుండా ఈ విషయం బయటకెళ్తే నా పరువేం కానూ?’’ నవ్వుతూనే చురక వేశాడు అతడు.‘‘ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేశావా?’’ అన్నట్టు కింద నుంచి పైవరకు కొరకొరా చూసింది అత్తగారు.అతడ్ని అనవసరంగా అనుమానించినందుకూ, అడ్డమైన పుస్తకాలూ చదివేసి, అనవసర భయాలతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటూ పిల్లల మనసులు పాడు చేసినందుకు నాలో నేనే కుచించుకుపోయేలా చేసిన చూపు అది.‘‘చక్కెర పొంగలి చాలా బాగుంది. మా అమ్మ గుర్తొచ్చింది’’ చేతి వేళ్ళను చప్పరిస్తూ చెప్పేడతడు.జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకుండా ఎంత బాగా మాట్లాడుతున్నాడో అన్నట్టు మొహాలు పెట్టి మురిసిపోయారు మావాళ్లిద్దరూ. అతడి మంచితనపు ప్రదర్శన పెరిగే కొద్దీ నా వైపు కొరకొర చూపులు ఎక్కువయ్యాయి.‘‘మా అమ్మ మీ కంటే వంట బాగా చేసేది. కాని, మీకున్న తెలివితేటలు ఆవిడకు ఉండి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది.’’ అతడి మాట అర్థంకాక మొహాలు చూసుకున్నాం. ‘‘బ్యాడ్ టచ్ అంటే ఏంటో నాకు చిన్నప్పుడే తెలుసు. మా అమ్మ చెప్పలేదు. మా మావయ్య తెలియజెప్పాడు, చేతలతో. నేను జరిగినది చెప్పినా అమ్మ నమ్మలేదు. ఆమెది సొంత తమ్ముడిపై ప్రేమో, లేక అసలు అలాంటి వెధవ బుద్ధుల గురించి తెలియనితనమో! అమ్మ కూడా నన్ను నమ్మటం లేదనే వేదన, ఆమె నమ్మకపోయేసరికి ఇంకా ఎక్కువైన మావయ్య వేధింపులు... ఆ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. కలల్లో కూడా వెంటాడే భయం... బాల్యమంతా ఆ భయంతోనే గడిచిపోయింది. సరిగ్గా చదువు వంటబట్టలేదు. కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే భయం. పెళ్లి చేసుకోవాలంటే భయం. కొన్నిసార్లు నా మనసు ఇంకా పిల్లాడి లాగానే ఉండిపోయిందని అనిపిస్తూ ఉంటుంది. అల్లకల్లోలంగా ఉండే మనసుని శాంతింపజేయడానికి తాగుడు అలవాటు చేసుకున్నా, ఫలితం లేదు. సైకాలజిస్టుల చుట్టూ తిరిగా... మొత్తానికి ఆ కూపంలోంచి బయట పడేసరికి నలభైఏడేళ్ళు దాటిపోయాయి. ఇప్పడూ ఓ కుటుంబం కావాలనిపిస్తుంది కాని, ఇలాగే అలవాటైపోయింది. అందుకే ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే కాదనకుండా వాలిపోతా! పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఏదో తెలియని ఆనందం. కాని, చింటూ అలా అరిచే సరికి నా గతం మొత్తం కెలికినట్టయింది. ఏమీ అనుకోకండి సారీ! చింటూ సారీ నాన్నా! ఈసారి బాగా ఫైట్ చేద్దాం నో చీటింగ్. అమ్మా! మా అమ్మ కూడా మీలాగా ఉండి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు’’ అంతటి భారీ మనిషి కంటి నుండి కన్నీరు మాత్రం అతి తేలికగా జారిపోయింది.అలాంటి వ్యక్తి నుంచి అలాంటి మాటలు వినేసరికి అంతా నిశ్చేష్టులయిపోయారు. చిరునవ్వుతో అతడికి వీడ్కోలు పలికేశాము. మా అత్తగారు చింటూ తల నిమిరి నా వైపే చూస్తూ నిలబడిపోయింది.అంతకు ముందున్న కరకు చూపు కాదది. మా ఆయన దగ్గరుండి కారు డోర్ మూసి మరీ ఆయన్ని సాగనంపి, లోపలికొచ్చి మురిపెంగా ప్రాజెక్టు ఫైలుని చూసుకొని నవ్వుకుంటున్నాడు. నేను కూడా హాయిగా ఊపిరి తీసుకున్నాను. కాని, గుండెలో ఏదో గుచ్చుతున్నట్టు, గుండె గోడకి ఏదో బీటలు పడ్డట్టు అనిపించింది. గట్టిగా ఊపిరి తీసుకున్నాను. బీటలు పడాల్సింది బద్దలవ్వాల్సింది నా గుండె కాదు, నా దద్దమ్మతనం. అర్థమైంది నాకు. -
అడవుల కోసం అలుపెరుగని పోరాటం
‘ఈ భూమికి, అమెజాన్ వర్షారణ్యాలు ఊపిరితిత్తుల వంటివి. అవి నాశనం అవ్వడం మొదలైతే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’ అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. నిజానికి అమెజాన్ వర్షారణ్యాలు ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, అడవుల నరికివేత, అక్రమ గనుల తవ్వకాలు, వ్యవసాయ విస్తరణ, పట్టణీకరణ వంటి ఎన్నో కారణాలతో ఈ అటవీ ప్రాంతాలు వేగంగా అంతరించిపోతూ వస్తున్నాయి. దీని ఫలితంగా వాతావరణ మార్పులు, జీవజాతులు అంతరించిపోవడం వంటి తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ఆదిమవాసీ బృందం– ఈ వర్షారణ్యాల సంరక్షణ కోసం బ్రిటన్ లో పర్యటించారు. ఈ బృందంలో ‘ఆషానింకా’ జాతి ప్రతినిధి ఒకోషో, అలెగ్జాండ్రినా పియాకోతో పాటు ‘గువారానీ’ అనే మరో ఆదిమజాతి ప్రతినిధి ‘జులియానా కెరెక్సు మిరిమ్’ ప్రత్యేకంగా నిలిచారు. ఈ పర్యటనలో అషానింకా, గువారానీ కమ్యూనిటీల ప్రతినిధులు– బ్రిటన్ కి చెందిన వుడ్లాండ్ ట్రస్ట్ సిబ్బందిని కలిశారు. యునైటెడ్ కింగ్డమ్లోని డెవాన్ లో డార్ట్ వ్యాలీలోని అరుదైన అటవీ ప్రాంత పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి, వుడ్లాండ్ ట్రస్ట్కి మద్దతు పలికారు. ఆదిమ బృందంతో వుడ్లాండ్ సిబ్బంది కలిసి డార్ట్ వ్యాలీలోని బక్లండ్ వుడ్లోని 247 ఎకరాల పునరుద్ధరణకు 28 లక్షల పౌండ్లు (రూ.32.19 కోట్లు) అవసరమనే విజ్ఞప్తిని గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే ఆదిమవాసులు– తమ అమెజాన్ వర్షారణ్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను, రాబోయే ప్రమాదాలను ప్రపంచానికి వినిపించే ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఈ బృందం–బ్రిటన్ లోని పర్యావరణ సంస్థల ప్రతినిధులు ఎందరినో కలిశారు. వర్షారణ్యాల సంరక్షణకు అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందులో భాగంగా పలువురు పర్యావరణ అధికారులతో పాటు ఎందరో శాస్త్రవేత్తలను కూడా కలుసుకుని అమెజాన్ అడవుల పునరుద్ధరణ జరగకుంటే రాబోయే సమస్య తీవ్రతను చర్చించారు. అమెజాన్ ఆదిమ బృందం చేపట్టిన ఈ ఖండాంతర పర్యటన యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. వర్షారణ్యాలను రక్షించాలన్న ఆశే, తమ ప్రధాన ఉద్దేశమని వారు వెల్లడించారు. వర్షారణ్యాలు నాశనం కావడంతో ఏర్పడుతున్న పలు సమస్యల గురించి ఈ బృందం హెచ్చరించింది. అషానింకాకు చెందిన నాయకురాలు అలెగ్జాండ్రినా పియాకో మాట్లాడుతూ– ‘భూమిని, అడవులను పునరుద్ధరించడం అనేది ప్రకృతితో ప్రజల సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు జరగాలి’ అని నొక్కి చెప్పారు. ఆ లోతైన సంబంధం లేకుంటే, ఏ పర్యావరణ ఉద్యమం కూడా విజయవంతం కాదని ఆమె హెచ్చరించారు.వుడ్లాండ్ ట్రస్ట్కి సంబంధించిన రెయిన్ ఫారెస్ట్ రికవరీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సామ్ మానింగ్ ఈ ఆదిమవాసులు బ్రిటన్ను సందర్శించి తనను కలిసిన రోజు గురించి చెబుతూ, ‘ఒక అటవీ సంరక్షణాధికారిగా, ఈ రోజు నా జీవితంలో అత్యంత భావోద్వేగంతో కూడిన రోజులలో ఒకటి. గువారానీ, అషానింకాల జ్ఞానం నన్ను చాలా కదిలించింది. వారితో చర్చ చాలా స్ఫూర్తిదాయకమైనది’ అని తెలిపారు.‘అమెజాన్ అడవులు ప్రమాదంలో పడటం అంటే ప్రపంచం ప్రమాదంలో పడటమే! ప్రకృతిని పునరుద్ధరించడం అంత సులభం కాదు. ఇది తొలి అడుగు, అలాగే మేలి అడుగు. ఇది సమష్టి పోరాటం. అందుకే ప్రపంచదేశాల మద్దతుని కోరుతున్నాం’ అని ఈ ఆదిమ బృందం ప్రపంచానికి పిలుపునిచ్చింది.ఈ పర్యటన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, వర్షారణ్యాల పునరుద్ధరణకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ పర్యటనలు, చర్చలు, చర్యలు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పటికే ఈ అమెజాన్ స్థానికులు, నాయకులు వర్షారణ్యాల సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో, అంతర్జాతీయ వేదికల్లో తమ వాదనను వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే! -
ఈ వారం కథ: పరదేశి
ఎప్పుడూ అతని గదిలో నుండి నాకు ‘ఆజారే...’ అంటూ లత మధురగానం వినిపిస్తూ ఉంటుంది. ‘మధుమతి’ చిత్రంలోని పాటలన్నీ అదేపనిగా వస్తూ ఉంటాయి. అతనికా పాటలు అంత ఇష్టమైతే కావచ్చు కాని, ఎప్పుడూ అవే పాటలు వింటూ ఉండటం నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మరో పాట విని ఎరుగను. అతని దగ్గర వున్నది అదొక్కటే క్యాసెట్ కాబోలు!ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోతాడు హడావుడిగా.మళ్ళా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వస్తాడు. ‘మధుమతి’ పాటలు వినిపించాయంటే, అతను వచ్చినట్లే!సుమారు ఓ అరగంట వరకూ ఆ చిత్రంలోని పాటలు వినిపిస్తుంటాయి. అవి వినడం నాకూ అలవాటయిపోయింది.ఓ రోజు ఉదయం అతను వెళ్లే టైమ్కి నేను మా గుమ్మంలో నిలబడ్డాను. సైకిల్ మీద వెళుతున్నాడు. ఇరవై ఐదేళ్లు వుంటాయేమో?బక్కపలచగా, తెల్లగా వున్నాడు. ఊరు చివర ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడట!మా ఇంటి పక్క పోర్షన్లో రిటైర్డ్ మాస్టారు వుంటారు. అందులో ఒక గది ఆ అబ్బాయికి అద్దెకు ఇచ్చారు. అది మా వంటింటికి, పెరటి ఖాళీ స్థలానికి దగ్గరగా ఉంటుంది. మధ్యలో ప్రహరీ గోడ ఉన్నప్పటికీ అతని గది కిటికీలు కనిపిస్తూ ఉంటాయి.ఇంటర్లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతుండేదాన్ని. రోజంతా ఇంట్లో ఉండటం బోర్గా ఫీల్ అవుతున్న సమయంలో ఆ ఎదురింటి అబ్బాయిని గమనిస్తూ వుండటం నిజానికి మంచి కాలక్షేపం !మా ఇంట్లో నాన్నగారు రిటైర్ అయి మూడేళ్లు కావస్తోంది. అన్నయ్య పేపర్ మిల్స్లో పని చేస్తాడు. అక్క పెళ్లికి రెడీగా ఉంది.కాస్త నల్లగా, సన్నగా ఉండటం వల్లనేమో? అక్కని చూడటానికి వచ్చిన వాళ్ళు ఓకే అనడం లేదు. రెండో పిల్ల అయితే సరే అన్నారు ఒకరు. ‘పెద్ద అమ్మాయికి కాకుండా రెండో అమ్మాయికి చెయ్యం’ అని ఇంట్లోవాళ్లు గట్టిగా చెప్పడమే కాకుండా, అప్పటి నుంచి పెళ్లి చూపులకు ఎవరైనా వస్తే, నన్ను కనబడనీయకుండా దాచేసేవాళ్ళు.ఆ విధంగా ఒకరోజు సాయంకాలం నేను మా డాబా మెట్ల మీద కూర్చోవలసి వచ్చింది. చీకటి కూడా పడింది. పెళ్లి చూపుల కార్యక్రమం ఇంకా అయినట్లు లేదు. ఒక్కర్తినే ఏమీ తోచక అలా ఆలోచిస్తూ కూర్చున్నాను.ఇంతలో పక్కింటి రూమ్లో లైటు వెలిగింది.అతను తొందరగా వచ్చినట్లు వున్నాడు. కిటికీ తలుపు తెరిచాడు.టేప్ రికార్డర్ ఆన్ చేశాడు.‘ఆజారే పరదేశీ...’ లత తీయని గొంతు వినిపిస్తోంది.చీకటిలో డాబా మీద ఉన్న నేను అతనికి కనబడే అవకాశం లేదు. అతను మాత్రం కాస్తంత మాసిన బనీను, లుంగీతో స్పష్టంగా కనిపిస్తున్నాడు.గది మూల కిరోసిన్ స్టవ్ వెలిగించాడు. ఓ గిన్నెలో బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాడు. ఇంకోపక్క ఓ పళ్ళెంలో ఉల్లిపాయలు, పచ్చిమిరప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాడు. కోడిగుడ్డు కూడా ఆ పక్కనే కనిపిస్తోంది.ఆమ్లెట్ వేసుకుంటాడేమో?‘రమణీ... రమణీ’ అమ్మ కేక వినిపించింది.‘ఆ... వస్తున్నా’ అంటూ మెట్లు దిగుతుంటే, అతను కిటికీలోంచి నన్ను చూశాడు. చీకటిలో నా ఆకారం అతను గుర్తించినట్లే ఉంది. ఉదయం తొమ్మిది గంటలకు రూమ్ తాళం వేసి, సైకిల్ తీస్తూ గుమ్మంలో నిలుచున్న నన్ను తలెత్తి చూశాడు.అతను ఈ నాలుగు మాసాలలో నన్ను చూడటం అదే మొదటిసారి.అప్పటి నుంచి రోజూ ఉదయం అదే టైమ్కి ఒకరినొకరు చూసుకోవడం ఒక దినచర్యలా మారింది.నేను రోజూ ఉదయం గుమ్మంలో నిలబడటం ఇంట్లో ఎవైనా గమనిస్తారేమో అనే భయం లేకపోలేదు.ఒకసారి అమ్మ అంది ‘మన కులమే అయితే ఆ అబ్బాయిని రమణికి అడిగితే?’నాన్న అన్నారు ‘పెద్దమ్మాయికి పెళ్లి అయ్యాక కనుక్కుందాం’పుస్తకం చదువుకుంటూ ఆ మాటలు విన్న నాకు ఏదోలా అయ్యింది.కాని, మొన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఏ కబురూ చేయలేదు.ఆరోజు సాయంకాలం నాలుగు గంటలకే ఆ అబ్బాయి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది.నేను కిటికీలోంచి చూస్తున్నాను.అరగంట తరువాత బ్యాగ్ పట్టుకుని రూమ్ తాళాలు వేసి, మాస్టారు గారింటికి వెళ్లి ‘మా ఊరు వెళుతున్నాను. చెల్లి పెళ్లి. వారం తరువాత వస్తాను’ అంటూ చెప్పడం వినిపించింది. అతను బయలుదేరి మా ఇల్లు దాటే సరికి, గబుక్కున గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను.నన్ను చూసి చిన్న నవ్వు నవ్వాడు.అదే మొదటిసారి అతను నన్ను చూసి నవ్వడం.నేనూ గబుక్కున నవ్వేసి చేయి ఊపాను.అతను ఊరు వెళ్ళాక, మూసివున్న గది తలుపులు చూస్తుంటే నాలో ఏదో అదోలాంటి దిగులులా అనిపిస్తోంది.ఈలోగా అన్నయ్యకు ఓ సంబంధం వచ్చింది.అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి పినతండ్రి కొడుకు అక్కను చేసుకోవడానికి ఇష్టపడటంతో, కట్నకానుకల సమస్య పెద్దగా లేకపోవడంతో ఒకేసారి రెండు పెళ్లిళ్లు కుదిరిపోయాయి.వచ్ఛే నెలలో ముహూర్తాలు నిర్ణయించారు.నాలో ఏదో తెలియని ఉత్సాహం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ అతని కోసం అదేపనిగా ఎదురు చూసేలా చేస్తోంది.పది రోజులు గడిచాయి.ఆరోజు ఉదయం అతని గది కిటికీ తలుపులు తెరిచి ఉండటంతో పాటు, లత తీయని గానం అతని రాకనుతెలియజేసింది.అతను మాస్టారు ఇంటికి వెళ్లి, తరువాత మా ఇంటికి వచ్చాడు. అతని చేతిలో స్వీట్ల కవరు ఉంది.నాన్నగారు ‘రా బాబూ ...కూర్చో’ అన్నారు.‘చెల్లి పెళ్లి...’ అంటూ స్వీట్లు అందించాడు.‘రమణీ...’కర్టెన్ వెనుక నిలబడిన నేను వెంటనే ‘నాన్నగారూ’ అంటూ వచ్చాను.‘మంచినీళ్లు తీసుకురామ్మా’ అన్నారు స్వీట్ల కవరు నా చేతికిస్తూ.నేను లోనికి వెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చాను.అతను నా వైపు చూడకుండానే, చేతి వేళ్ళు తగలకుండా గ్లాసు అందుకున్నాడు.నాన్నగారు ‘మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ప్రస్తుతం చేస్తున్న జాబ్ ఏమిటి? గోత్రం ఏమిటి? శాఖ ఏమిటి?’ వివరాలు అడుగుతున్నారు.అతడు మా కులం కాదని అప్పుడే తెలిసింది.నేను అక్కడి నుంచి వచ్చేశాను. మా ఇంట్లో పెళ్ళి హడావుడి మొదలయ్యింది. అంత హడావుడిలో కూడా ఉదయం చిరునవ్వుతో విష్ చేసుకోవడం, రాత్రి చేతి సైగతో గుడ్ నైట్ చెప్పుకోవడం ఎవరూ గమనించకుండా జరిగిపోతూనే వుంది. ఇద్దరికీ మొదటిసారి మాట్లాడుకునే అవకాశం అన్నయ్య, అక్క పెళ్లిలో వచ్చింది.చేతిలో గిఫ్ట్ ప్యాకెట్తో కల్యాణ మండపం దగ్గర నిలబడ్డాడు. నేను చిరునవ్వుతో పలకరించాను. నాన్నగారు అంత హడావుడిలో కూడా అతడిని గమనించి ‘రా...బాబూ’ అని పిలిచి, గిఫ్ట్ అందుకుని ‘భోజనం చేసి వెళ్ళు బాబూ’ అంటూ నా వైపు చూశారు.‘రండి’ అంటూ అతడిని భోజనాల దగ్గరికి తీసుకెళ్ళాను.మేము ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అదే మొదటిసారి.‘మీకు మధుమతి పాటలంటే అంత ఇష్టమా?’‘అవును... మా అమ్మ ఎప్పుడూ వినే పాటలవి. ఇప్పుడు అమ్మ లేదు. నాకు ఆ పాటలు మాత్రం అమ్మ గుర్తుగా మిగిలిపోయాయి’నాకెంతో కుతూహలం కలిగింది. కాని, అక్కడ అంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు మరి .అతని కళ్ళల్లో లీలగా తడి...పెళ్లి హడావుడి అయిన వారం రోజులకు ఒక రోజు తెగించి చిన్న కాగితం మీద ‘సంగీతం కళాశాల దగ్గర ఈ ఆదివారం కలుద్దాం’ అని రాసి, ఖాళీ అగ్గిపెట్టెలో పెట్టి అతని గది కిటికీలో పడేశాను.నిజంగా నా దైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది.ఇంటి దగ్గర మాట్లాడుకునే అవకాశమే లేదు.నేను సాయంకాలం నాలుగు గంటలకు కళాశాల గేటు దగ్గర నిలబడ్డాను. ఆదివారం కావడం వలన అక్కడ ఎవరూ లేరు. లోపల ఎవరో ఒకరిద్దరు కనిపిస్తున్నారు.ఇంతలో సైకిల్ మీద వస్తూ అతను... నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతను కూడా కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నాడు.సైకిల్ స్టాండ్ వేసి నిలబడ్డాడు.ఎవరో ఒకాయన మమ్మల్ని కుతూహలంగా చూస్తూ ఆ దారంట వెళ్ళాడు.‘ఇంటి దగ్గర ాట్లాడటం కుదరదు’ అన్నాను.‘ఇక్కడ ఇలా రోడ్ పక్కన... నాకెందుకో బాగులేదు’ అన్నాడతను.‘అవును’ అన్నాను.జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు.నా మొహంలోకి చూశాడు. సాయంకాలపు నీరెండ.ఇద్దరి కళ్ళూ కలిసి మళ్లీ విడిపోయాయి. దస్తూరి బావుంది.ఒకే వాక్యం. ఈ శనివారం లక్మీ థియేటర్లో మార్నింగ్ షో.ఇంట్లో ఎవరూ చూడకుండా ఆ కాగితాన్ని ఎన్నిసార్లు చదివానో!శనివారం వచ్చింది. సినిమా హాలులో కలిశాం. మాకోసమే అన్నట్లు హాలు ఖాళీగా ఉంది. ‘శంకరాభరణం’ సినిమా విడుదల అయిన రెండోరోజో... మూడో రోజో!ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం కుదిరిన రోజది. నెమ్మదిగా మాట్లాడుకున్నాం. ఆ చిత్రంలోని పాటలు మమ్మల్ని మౌనంగా ఉండేలా చేశాయి. స్నేహపూర్వకంగా ఒకరి చేయి ఒకరు తాకిన రోజు. మేము మరిచిపోలేని రోజు కూడా!రోజూ ఎవరూ చూడకుండా పరస్పరం విష్ చేసుకోవడం, రాత్రి గుడ్ నైట్ చెప్పుకోవడం మామూలుగానే గడిచిపోతోంది.అతను బిజీ అయిపోయాడు. తొందరగా వెళ్లడం, లేటుగా రావడం, ఆదివారాలు కూడా హడావుడిగా వెళ్లిపోవడం...నేను మా వదినగారి బుల్లి టేప్ రికార్డర్లో ‘శంకరాభరణం’ పాటలు వినడం... అలా మూడు నెలలు గడిచిపోయాయి.ఓరోజు అతను కిటికీలో నుండి అగ్గిపెట్టె చూపించి, సందులో పడేశాడు.‘రేపు ఉదయం కలుద్దాం. మార్నింగ్ షో’ అని రాసి ఉంది.అదే హాలు. అదే సినిమా. నూరవరోజుకి దగ్గరగా ఉండటంతో జనాలు కాస్తంత పలచగానే వున్నారు.హాలులో మాకు మాట్లాడుకోవడానికి వీలుగా ఉన్న సీట్లలో కూర్చున్నాం.‘నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది’ చెప్పాడు.‘కంగ్రాట్స్’ అన్నాను.‘ఢిల్లీ వెళ్లిపోతున్నాను’నాకు అర్థమైపోయింది. ఇక మేము విడిపోయే రోజు వచ్చేసింది.అతను నా చేతికి చిన్న వాచ్ ఇచ్చాడు.‘గుర్తుగా’ అన్నాడు.చాలాసేపు ఏం మాట్లాడుకోవాలో తెలియలేదు. తరువాత చాలా మాట్లాడుకున్నాం కాని, అంత వివరించడానికి ఏమీ లేదు.సినిమా ఆఖరి సన్నివేశం పూర్తి కాకుండానే వెళ్లిపోవడానికి లేచాం. నా చేయి అందుకుని ముద్దుపెట్టుకున్నాడు. బయటికి నడిచాం.అతను రూమ్ ఖాళీ చేసే రోజు వచ్చింది.ఆ రాత్రి వెళ్లిపోతున్నాడు.గుడ్ బై చెప్పే సమయం...నేను ఓ ప్యాకెట్ అతనికి చూపించి కిటికీ లోంచి పడేశాను. అందులో ‘శంకరాభరణం’ కేసెట్ ఉంది. అతను ఇచ్చిన వాచీ నా చేతికి గుర్తుగా కనిపిస్తోంది.‘ఈ వాచీ ఎక్కడిది?’ అని ఇంట్లో అడిగితే నా స్నేహితురాలు ఇంటర్ పాస్ అయ్యానని గిఫ్ట్గా ఇచ్చిందని చెప్పడానికి ఒక అబద్ధం రెడీగా ఉంచుకున్నాను.‘మధుమతి’ పాటలు నాకిప్పుడు వినబడవు. -
లౌకిక శాస్త్రాలూ మోక్షదాయకాలే!
ఒకానొకప్పుడు దేవగురువు బృహస్పతి శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం, దండనీతి శాస్త్రం, కామశాస్త్రం వంటి లౌకిక శాస్త్రాలను సమగ్రంగా రచించాడు. యోగ్యులు, బుద్ధిమంతులు అయిన శిష్యులకు ఆ శాస్త్రాలను నేర్పించడం ప్రారంభించాడు. దేవగురువును దర్శించుకుందామని ఒకనాడు ఇంద్రుడు ఆయన ఆశ్రమానికి వచ్చాడు. శిష్యులకు ఆయన లౌకిక శాస్త్రాలను నేర్పిస్తుండటం గమనించి ఆశ్చర్యపోయాడు. గురువుకు పాదాభివందనం చేసి, ఆయన చూపిన ఆసనంపై కూర్చున్నాడు. పాఠం పూర్తయి, శిష్యులంతా వెళ్లిపోయే వరకు ఓపికగా ఉండి, ‘గురువర్యా! మీరేమీ అనుకోనంటే, నాదొక సందేహం. తత్త్వబాహ్యాలైన ఈ శాస్త్రాలను మీరు ఎందుకు రచించారు? మానవులను మరింతగా విషయవాంఛలలో ముంచడానికి తప్ప ఇవెందుకు పనికొస్తాయి? గురువర్యా! తమరేమి ఆశించి ఈ శాస్త్రాలను శిష్యులకు బోధిస్తున్నారో గాని, నాకిది సముచితంగా తోచడం లేదు. ఇందులో ఇంకేమైనా పరమార్థం ఉంటే, అది నేను తెలుసుకోదగినదే అయితే దయచేసి వివరించండి’ అన్నాడు ఇంద్రుడు.ఇంద్రుడి ప్రశ్నలోని ఆందోళనను గుర్తించాడు బృహస్పతి.చిన్నగా నవ్వుతూ, ‘ఇంద్రా! ఇందులోని తత్త్వరహస్యం ఏమిటనేదే కదా నీ సందేహం? చెబుతాను, విను’ అంటూ బృహస్పతి ఇలా చెప్పసాగాడు.‘నేను రచించి, శిష్యులకు బోధిస్తున్న ఈ శాస్త్రాలన్నీ తత్త్వరహస్యాలే, తత్త్వబోధలే! పారంపర్యంగా ఇవి తత్త్వప్రాప్తికి కావలసిన చిత్తశుద్ధిని కలిగిస్తాయి. నీ సందేహం తొలగిపోవడానికి నీకు సోదాహరణంగా చెబుతాను, శ్రద్ధగా విను. అంతా నీకే అవగతమవుతుంది. కాంపిల్య నగరంలో విధిజ్ఞుడు అనే శిల్పశాస్త్ర పండితుడు ఉండేవాడు. అతడు శిల్పశాస్త్రంలోనే కాకుండా వాస్తు, జ్యోతిష శాస్త్రాలలో విశేష ప్రతిభాసంపన్నుడు. చాలా నీతిమంతుడు. ఆ నగరంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అతడినే పిలిచేవారు. ఆ విధంగా అతడు విశేషంగా ధనం సంపాదించాడు. అతడిని ఆశ్రయించుకుని చాలామంది ఉపాధి పొందేవారు. వారికి శాస్త్రపరిజ్ఞానం లేదు. వారు విధిజ్ఞుడితో ఉంటూ అతడు చెప్పిన పనులు చేస్తూ, అతడు ఇచ్చే వేతనాలతో బతుకుతూ ఉండేవాళ్లు. తన విద్యతో పుష్కలంగా ధనం సంపాదించిన విధిజ్ఞుడు విరివిగా దానధర్మాలు చేసేవాడు. నగరంలో దేవతాపూజలను ఘనంగా జరిపించేవాడు. అలా నగరంలోని ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకు అందరికీ ఇష్టుడయ్యాడు. అతడి పేరు ప్రఖ్యాతులు క్రమంగా పొరుగు రాజ్యాలకు పాకాయి. ఇతర దేశాల రాజులు కూడా విధిజ్ఞుడిని పిలిపించుకుని, అతడి సలహా సూచనలతో భవనాలు, తటాకాలు, దేవాలయాలు నిర్మింపజేసుకుని, అతడికి ఘనంగా పారితోషికం, కానుకలు ఇచ్చి పంపుతుండేవారు. ఆ ధనంతో విధిజ్ఞుడు మరింతగా దాన ధర్మాలు చేసేవాడు. శిల్ప వాస్తు జ్యోతిష శాస్త్రాలలో విశేష ఖ్యాతి పొందిన విధిజ్ఞుడు కొంతకాలానికి ఆయువుతీరి మరణించాడు. చేసిన పుణ్యకర్మల ఫలితంగా అతడు స్వర్గానికి చేరుకుని, అక్కడ సుఖాలను అనుభవించి, కొన్నాళ్లకు మళ్లీ జన్మించాడు.ఈసారి అతడు కాంపిల్య రాజవంశంలో జన్మించి, యుక్తవయసు వచ్చాక పట్టాభిషిక్తుడై రాజయ్యాడు. రాజుగా అతడు ప్రజారంజకమైన పాలన సాగించేవాడు. సాధు సజ్జనులను ఆదరించేవాడు. రాజ్యంలో అనేక దేవాలయాలను, వాపీ కూప తటాకాదులను నిర్మించి, రాజ్యం నిత్యం సుభిక్షంగా ఉండేలా చూసుకునేవాడు. అసంఖ్యాకంగా యజ్ఞ యాగాదులను నిర్వహించి, విప్రులకు విశేషంగా గోదానాలు, భూదానాలు చేసేవాడు. సుదీర్ఘకాలం రాజుగా పాలించి, పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత కొన్నాళ్లకు తనువు చాలించాడు. రాజ జన్మలో చేసిన పుణకర్మల ఫలితంగా మళ్లీ స్వర్గానికి చేరుకుని, చాలాకాలం సుఖభోగాలను అనుభవించాడు. పుణ్యఫలం అంతరించాక కొన్నాళ్లకు మళ్లీ భూలోకంలో జన్మించాడు.ఈసారి అతడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రుల ఆలనపాలనలో బాల్యం హాయిగా గడిపాడు. ఉపనయనం తర్వాత బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి, గురుకులంలో చేరాడు. గురువుకు శుశ్రూష చేస్తూ, వేద వేదాంగాలను, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుకులవాసం ముగించి, ఇంటికి చేరుకున్నాడు. యోగ్యురాలైన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమం స్వీకరించాడు. గృహస్థాశ్రమంలో నిత్య నైమిత్తిక కార్యాలను నియమం తప్పక నెరవేరుస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. గొప్పగొప్ప వ్రతాలు, పూజలు చేసి, యోగిగా మారి వానప్రస్థం స్వీకరించాడు. వానప్రస్థంలో ఫల కందమూలాదులనే ఆహారంగా స్వీకరిస్తూ, రోజులో అధిక కాలం తపోనిష్ఠలోనే గడిపేవాడు. క్రమంగా సాధనలో పరిపక్వత సాధించి, చివరకు భవబంధాలను విడిచిపెట్టి, సన్యాసాశ్రమం స్వీకరించాడు. సన్యాసాశ్రమంలో కఠోర సాధన సాగిస్తూ, ఆత్మసాక్షాత్కారం పొంది, జీవన్ముక్తుడై, చివరకు విదేహ కైవల్యం సాధించాడు.ఇంద్రా! విన్నావు కదా! శిల్ప, వాస్తు, జ్యోతిష శాస్త్రాలు విధిజ్ఞుడికి వేర్వేరు జన్మలలో క్రమంగా ఉన్నతి పొందడానికి, చివరకు ముక్తిని పొందడానికి దోహదపడ్డాయి. లౌకిక శాస్త్రాలు మానవులను మాయలో ముంచేస్తాయని భయపడటం నిర్హేతుకం. లౌకిక శాస్త్రాలు మానవుల ఐహిక సుఖాలకే కాదు, ఆముష్మిక ఔన్నత్యానికి కూడా ఉపయోగపడతాయి. శచీపతీ! ఈ లౌకిక శాస్త్రాలన్నీ కలకండ ముక్కల్లాంటివి. తత్త్వోపదేశమనే కషాయాన్ని సులువుగా గ్రోలడానికి అవి ఉపకరిస్తాయి. లౌకిక శాస్త్రాల సహాయం లేకుండా, సామాన్యులు తత్త్వాన్ని సులువుగా గ్రహించలేరు. అయినా, కైవల్యమే ఏ జీవికైనా అంతిమ లక్ష్యం, అదే అంతిమ గమ్యం’ అని చెప్పాడు బృహస్పతి.∙సాంఖ్యాయన -
ఆ దొంగ.. రూటే వేరు!
రకరకాల కారణాలతో దొంగలుగా మారినవారిని చూస్తూనే ఉంటాం కాని, శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాద్ పోలీసులను పరుగులు పెట్టించిన ఆ దొంగ కథే వేరు! ఆఫీసు బాయ్గా జీవితం ప్రారంభించి, కారు నడపడం నేర్చుకుని, డ్రైవర్గా మారాడు. తన యజమాని మతిమరపు కారణంగా దొంగగా మారాడు. పన్నెండేళ్ల వ్యవధిలో పదమూడుసార్లు జైలుకు వెళ్లిన ఈ చోరాగ్రేసరుడి కథలో అనేక మలుపులు ఉన్నాయి. అయితే, 2012 తర్వాత అతడి పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు.ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సేపన్నపేటకు చెందిన అప్పలనాయుడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. విధిలేని పరిస్థితుల్లో విజయవాడలో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న తన బావ పంచన చేరాడు. బావ తనకు పని నేర్పించి, బతుకుతెరువు చూపిస్తాడని భావించాడు. అయితే, ఆ బావ అప్పలనాయుడిని నిత్యం వే«ధించేవాడు. వేధింపులు తట్టుకోలేక అప్పలనాయుడు హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. కృష్ణానగర్లోని ఓ చిన్నగదిలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. తొలినాళ్లల్లో కొన్ని ప్రైవేట్ ఆఫీసుల్లో బాయ్గా పని చేశాడు. ఆ జీవితం నచ్చకపోవడంతో కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అనేక ప్రయత్నాల తర్వాత 1998లో ఒక సినీ నిర్మాత వద్ద డ్రైవర్గా చేరాడు. తన యజమాని దయ తలిస్తే తన జీవితమే మారిపోతుందని భావించాడు. ఆ నిర్మాత కారణంగా నిజంగానే అతడి జీవితం మరోలా మారిపోయింది. ఆ నిర్మాతకు ఉన్న మతిమరపే అప్పలనాయుడిని నేరగాడిగా మార్చింది. ఆ నిర్మాత తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో పెళ్లి పనుల కోసం కొన్ని రోజుల పాటు తన కారుతో పాటు డ్రైవర్ను స్నేహితుడికి ఇచ్చి పంపారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ నిర్మాతకు ఉన్న మతిమరపు రోగం అప్పలనాయుడిని ఇబ్బందుల పాలు చేసింది. పెళ్లి పనుల కోసం కారుతో సహా అప్పలనాయుడు వెళ్లిన రెండు రోజులకు ఆ విషయాన్ని నిర్మాత మర్చిపోయారు. తన కారు తీసుకుని డ్రైవర్ పారిపోయాడని భావించారు. వెనుకా ముందూ ఆలోచించకుండా అప్పలనాయుడిపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పలనాయుడిపై పోలీసులు కారు చోరీ కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు సినీ నిర్మాత కావడంతో ముమ్మరంగా గాలించిన పోలీసులు– అప్పలనాయుడిని అదుపులోకి తీసుకుని, కారు స్వాధీనం చేసుకున్నారు. అతడు జరిగినది చెబుతున్నా పట్టించుకోకుండా, అరెస్టు చేసి జైలుకు పంపారు. కారును కోర్టు ద్వారా యజమానికి అప్పగించారు. అలా తొలిసారిగా చేయని నేరానికి జైలుకు వెళ్లిన అప్పలనాయుడు అక్కడి సహచరుల నుంచి నేర్చుకున్న మెలకువలతో నిజంగానే దొంగగా మారాడు. జైలు నుంచి 1999లో బయటకు వచ్చాక దొంగతనాలు మొదలుపెట్టాడు. హైదరాబాద్తో పాటు తిరుపతిలోనూ పంజా విసిరి అనేకసార్లు అరెస్టయ్యాడు. సాధారణంగా దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడుతుంటారు. అయితే, అప్పలనాయుడు పంథా పూర్తి భిన్నంగా ఉండేది. మనుషులున్న ఇంట్లోనే తెల్లవారుజామన చోరీలు చేసేవాడు. అప్పట్లో కృష్ణానగర్లో నివాసముండే ఇతగాడు పొద్దున్నే భరత్నగర్ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కి, ఫలక్నుమా వరకు ప్రయాణించేవాడు. ఈ మార్గంలో రైల్వే ట్రాక్లకు సమీపంలో కనిపించిన ఇళ్లల్లో అనువైన దాన్ని టార్గెట్గా ఎంచుకునే వాడు. అదే రోజు రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్లి, అది పూర్తయ్యాక కాసేపు కాలక్షేపం చేసేవాడు. తెల్లవారుజామున ఎంచుకున్న ఇళ్లపై విరుచుకు పడేవాడు. కిటికీలు సరిగ్గా మూసి ఉండని ఇళ్లల్లోకి కిటికీ ద్వారానే వెళ్లి, పని పూర్తి చేసుకునేవాడు. అలాగే, సినిమా హాలు నుంచి బయటకు వచ్చేటప్పుడు తనకు నచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఫాలో చేసేవాడు. యజమాని ఇంటికి చేరుకునే వరకు వెంబడించి, అతడు ముందు పార్క్ చేసి వెళ్లిపోతే, ఆ వాహనాన్ని తస్కరించేవాడు. అప్పలనాయుడు ఒకసారి కూకట్పల్లిలో అనుమానాస్పదంగా సంచరిస్తూ స్థానికులకు చిక్కాడు. అతడిని వాళ్లు పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లారు. అప్పటికి అతడికి నేరచరిత్ర లేకపోవడంతో అరెస్టు చేయని పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు. ఆ మరుసటి రోజు దీపావళి కావడంతో పండుగకు ఇంటికి వెళ్లివస్తానని కోరినా, పోలీసులు వదిలిపెట్టలేదు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తన సెల్ఫోన్లో చాటింగ్లో మునిగిపోవడం చూసి, అప్పలనాయుడు పోలీసుస్టేషన్ నుంచి పరారయ్యాడు. అక్కడ నుంచి అమీర్పేట వరకు వచ్చి అదే పోలీసుస్టేషన్ ల్యాండ్ ఫోన్కు కాల్ చేశాడు. పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్నది తానే అని, దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. తిరిగి వచ్చాక లొంగిపోతానని చెప్పాడు. ఇన్స్పెక్టర్ అతడి మాటలు నమ్మలేదు. అప్పలనాయుడు మాత్రం దీపావళి ముగిసిన రెండు రోజులకు మళ్లీ కూకట్పల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఆవు–పులి కథ మాదిరిగా చెప్పినట్లే వచ్చి తన ముందు నిల్చున్న అప్పలనాయుడిని చూసిన ఆ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయారు. ఎంతో ఇంప్రెస్ అయి, ‘దొంగతనాలు చేయడం కాకుండా నీకు ఏ పని వచ్చు?’ అంటూ అడిగారు. డ్రైవింగ్ వచ్చని చెప్పడంతో పోలీసుస్టేషన్లోనే డ్రైవర్గా పెట్టుకున్నారు. కొన్నాళ్లు ఆయనే జీతం ఇచ్చి, పోలీసు వాహనం అప్పగించి పంపేవాళ్లు. కాలక్రమంలో ఆ అధికారి పదవీ విరమణ చేయడం, తర్వాత వచ్చిన వాళ్లు పట్టించుకోకపోవడంతో అప్పలనాయుడు మళ్లీ చోరీలు కొనసాగించాడు. పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ 2012 వరకు 13 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిపై నమోదైన కేసుల్లో దాదాపు అన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. 2011 ఆగస్టు 8న పోలీసులు అప్పలనాయుడిని అరెస్టు చేసినప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్పట్లో ఇతగాడు విలేకరులను ఉద్దేశించి ‘కిలో బంగారం చోరీ చేసే వరకు పోలీసులకు దొరక్కుండా ఉండాలని అనుకున్నా. ఆ తర్వాత ప్రెస్మీట్ పెట్టి మరీ దొంగతనాలు మానేయాలని భావించా. కానీ కుదర్లేదు’ అంటూ నిట్టూర్చాడు. కొన్నాళ్లుగా అప్పలనాయుడి పేరు పోలీసు రికార్డుల్లో ఎక్కలేదు. -
మగవాళ్లలో మీరు ఏ టైపు?
వేమన చెప్పినట్లు, ‘పురుషులందు పుణ్య పురుషులు వేరు’ కావచ్చు. అయితే ఆ పుణ్య పురుషులు కూడా – ఈ భూమి మీద ఉండే మొత్తం 6 వర్గాల పురుషులలో ఏదో ఒక వర్గం కిందికి రావలసిందేనని స్విట్జర్లండ్లోని ఐడీఆర్ ల్యాబ్స్ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన వర్గీకరణను బట్టి తెలుస్తోంది. యావత్ పురుషజాతిని వారు ఒక ‘షడ్భుజిలో’ సర్దేశారు. ఆల్ఫా, సిగ్మా, బ్రావో, ఒమేగా, డెల్టా, గామా అనే ఆరు రకాలుగా పురుషులను విభజించారు. మీరు ఏ కేటగిరీలోకి వస్తారో చూసుకోండి అని అంటూ చిన్న పరీక్షను కూడా రూపొందించారు.1 ఆల్ఫా మేల్ఇంటర్నెట్ సంస్కృతి వచ్చాక పురుషుల వ్యక్తిత్వాలను, వారి స్వరూపాలను ఒక ఆధిక్య శ్రేణి సోపానంగా అమర్చి; పురాణ పుంగవుల అన్వయింపుతో కేటగిరీలుగా విభజించి చూపడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే ఐడీఆర్ ల్యాబ్స్ యావత్ పురుష లోకాన్ని ఆరు రకాలుగా విభజించింది. అందులో ఎవరు ఏ విభజన కిందికి వస్తారో తెలుసుకునేందుకు ‘పురుష సామాజిక సోపాన క్రమ పరీక్ష’ను రూపొందించింది. అందులో 31 ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానంగా ‘యెస్’ లేదా ‘నో’ అని ఐదు పాయింట్ల స్కేల్లో స్పందించమని ఆ పరీక్షా పత్రంలో ఉంటుంది. ఉదా: ఎన్ని అప్పులున్నా నేను ఆందోళ చెందను/ నా కింద ఉన్న పనివారి నుండి నేను పనిని పిండుకుంటాను/ నేను అంత తేలిగ్గా భయపడను/ ... ఇలాంటి స్టేట్మెంట్లు ఉంటాయి. చివర మీకు వచ్చిన స్కోర్ ఆధారంగా మీరు ఏ కేటగిరీ పురుషులో తెలుస్తుంది.ఆల్ఫా మగవారిని పురుష సామాజిక సోపానక్రమంలో పైభాగాన ఉండేవారిగా వర్ణించారు. ఆల్ఫా పురుషులు ఆకర్షణీయమైనవారు. త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సవాళ్లను స్వీకరించటానికి ఇష్టపడతారు. మహిళల మనసు దోచుకుంటారు. తక్కిన కేటగిరీలలోని పురుషులంతా ఆల్ఫా పురుషులను అనుసరించాలని కోరుకుంటారు. సినిమాలు, టీవీలలో ఆల్ఫా మగవారిని తరచుగా ఇతరులపై ఆధిపత్యం చలాయించే వారిగా, ఎవరికి ఏం చేయాలో చెప్పటంలో ఆనందం పొందేవారిగా చిత్రీకరించినప్పటికీ వాస్తవానికి అలా ఉండరని ఐడీఆర్ ల్యాబ్స్ నిపుణులు అంటున్నారు. నిజానికి ఆల్ఫా మగవాడిగా ఉండటం అంటే మాటలు కాదు, ఆటలూ కాదు. సోపానక్రమంలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి; ఇతరులు తమ మార్గదర్శకత్వం కోసం, దిశానిర్దేశం కోసం చూస్తున్నప్పుడు ఆల్ఫాలు అపారమైన బాధ్యతలు, భారాలతో పోరాడవలసి ఉంటుంది. మరోవైపు ఆల్ఫాలు నాయకుడిగా తమ స్థానానికి మద్దతు ఇచ్చే వారి పట్ల చాలా స్నేహపూర్వకంగా, ఉదారంగా ఉంటారు.2 సిగ్మా మేల్ పురుష సామాజిక సోపానక్రమంలో అసలు వీళ్లు ఉండనే ఉండరు. వీరు పిరికి వాళ్లు. సమాజ నియమాలకు జడుస్తారు. సొంత మార్గాన్ని అనుసరిస్తారు. ఆల్ఫాలు, బ్రావోలు వీళ్లను పట్టించుకోరు. అయితే, మహిళల విషయంలో సిగ్మాలు విజయవంతం అవుతారు. స్త్రీలు తరచుగా సిగ్మాల స్వీయ–నిర్ణయ తత్త్వాన్ని, నిర్లిప్తతను ఆకర్షణీయంగా భావిస్తారు. కాబట్టి సిగ్మాలు మహిళలకు దగ్గరవుతారు. ఆశ్చర్యకరంగా, సిగ్మాలను ఇంటర్నెట్ సంస్కృతి శృంగార పురుషులుగా పరిగణిస్తుంది. ఒక సిగ్మా విజయవంతం అయినప్పుడు, అతని జీవనశైలి ఆదర్శనీయం, ఆకర్షణీయం అవుతుంది.3 బ్రావో మేల్ బ్రావో మగవారు ‘లెఫ్టినెంట్లు’. అగ్రస్థానానికి దగ్గరగా ఉంటారు. ఇంచుమించు ఆల్ఫా మగవారిలా ఉంటారు. విశ్వసనీయ సలహాదారులుగా వ్యవహరిస్తారు. ఆల్ఫాకు నమ్మకమైన సిబ్బందిగా ఉంటారు. మహిళలు వారిని ఇష్టపడతారు. ఆల్ఫా భరించాల్సిన తీవ్రమైన బాధ్యతల భారాలను తప్పించుకుంటూ, ఆల్ఫా ర్యాంకు సదుపాయాలను అనుభవిస్తారు. ఆల్ఫాల మాదిరిగా తమ స్థానం కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉండదు కనుక బ్రావోలు ప్రజలతో కొంచెం స్నేహపూర్వకంగా ఉండగలరు.4 ఒమేగా మేల్ పురుష సామాజిక సోపానక్రమంలో దిగువ నుంచి ఒక మెట్టు పైన ఒమేగా పురుషుడు ఉంటాడు. ఆల్ఫా పురుషుడికి ఒమేగా మేల్ పూర్తి వ్యతిరేకం. తరచు వీరు సామాజిక బహిష్కృతులుగా కనిపిస్తారు. సామాజిక నైపుణ్యాలు ఉండవు. అంతర్ముఖులుగా ఉంటారు, ఆత్మవిశ్వాసం ఉండదు. కొంతమంది వీరిని మేధావులు అనుకుంటారు. మరికొంతమంది పనికిమాలిన వాళ్లు అని భావిస్తారు. ఒంటరితనానికి భయపడి ఇతరులకు అతుక్కుపోతారు. వీళ్లనసలు స్త్రీలు చూడను కూడా చూడరు.5 డెల్టా మేల్ డెల్టా మగవారిని పురుష సామాజిక సోపానక్రమంలో ‘కార్మికులు’గా వర్గీకరించారు ఐడీఆర్ల్యాబ్స్ నిపుణులు. వీరు సాధారణ వ్యక్తులు. ఆధిపత్యం కోసం పోరాడరు. ‘పనిని పూర్తి చేశాం’ అని గర్వంగా చెప్పుకుంటారు. నిజాయితీగా, సూటిగా ఉంటారు. ఇతరులలో నిజాయితీని, మర్యాదను ఆశిస్తారు కాబట్టి డెల్టాలు కొన్నిసార్లు మోసానికి, దగాకు గురవుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ప్రేయసి డెల్టాలను ఇష్టపడటం వల్ల కాకుండా సహాయాల కోసం సహవాసం చేస్తారు. వీరి ఔదార్యాన్ని వారు ఉపయోగించుకుంటారు.6 గామా మేల్ గామా మగవారు పురుష సామాజిక సోపానక్రమంలో ‘మేధావులు’. ఈ రకం పురుషులు పుస్తక జ్ఞానం కలిగి ఉంటారు, కాని ఆధిపత్యాన్ని నెలకొల్పటానికి అవసరమైన సామాజిక నైపుణ్యాలు, డబ్బు ఉండవు. వారి చూపులు ఆకర్షణీయంగా ఉండవు. వారిలో మానసిక దృఢత్వం కనిపించదు. తెలివి వారి బలం కాబట్టి, గామాలు తరచుగా జీవితంలోని మేధాపరమైన విషయాల గురించి మాట్లాడతారు. గామాలకు, మేధాపరంగా తక్కువ స్థాయి వారు పైకి ఎదగడం అన్యాయంగా కనిపిస్తుంది. చాలామంది గామా మగవారు తమను తాము రహస్య చక్రవర్తులుగా భావించుకుంటారు. కాని, దేనికీ బాధ్యత వహించరు. ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటారు. ఆ నిరాశే వారిని మహిళలకు దూరం చేస్తుంది. -
చినుకు చినుకుల జీవధార
ప్రకృతి సహజ పరిణామమైన రుతుచక్ర భ్రమణంలో ఏటా వర్షర్తువు వస్తుంది. వర్షాకాలం ఏటా రావడం తథ్యమే అయినా, వాన రాకడలో తరచుగా ముందు వెనుకలు జరుగుతుంటాయి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అని మనకో సామెత ఉంది. ఎప్పుడు కురుస్తాయో తెలియని వాన రాక కోసం ఒక్కో ఏడాది రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కో ఏడాది వానలు పుష్కలంగా కురుస్తుంటాయి. ఒక్కో చోట అనావృష్టి కరవు కాటకాలను సృష్టిస్తుంది. ఒక్కో చోట అతివృష్టి వరదలతో ముంచెత్తి పెనునష్టాన్ని కలిగిస్తుంది. వానలు తెచ్చిపెట్టే కష్టనష్టాలు ఎలా ఉన్నా, వానలు లేనిదే మనుగడ సాగించడం అసాధ్యం. ఈ భూమ్మీద మనుషులతో పాటు పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు వంటి సమస్త జీవులు బతకాలంటే, వానలు కురవాల్సిందే!వానలే లేకుంటే మనం నివసించే ఈ భూమి కూడా మిగిలిన గ్రహాల మాదిరిగా జీవరహిత గోళంగానే మిగిలి ఉండేది. వానల వల్లనే భూమి మీద జీవజాలం ఏర్పడింది. వానల వల్లనే భూమి మీద నాగరికతలు ఏర్పడ్డాయి. తొలినాటి మానవులకు వాన ఒక ప్రకృతి అద్భుతం. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, చిటపట చినుకులతో మొదలై, క్రమంగా పుంజుకుని జడివానగా మారే దృశ్యం ఇప్పటికీ ఒక అద్భుతమే! నాగరికతలు ఏర్పడిన కాలం నుంచి వివిధ సంస్కృతులలో వర్షారాధన ఉండేది. వానాకాలంలో ప్రత్యేకంగా జరుపుకొనే పండుగలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు వర్షవర్ణన కనిపిస్తుంది. వైదిక సాహిత్యంలోని ‘పర్జన్యసూక్తం’, ‘వరుణస్తుతి’ వంటివే కాకుండా, లౌకిక సాహిత్యంలోనూ కవులు మేఘవర్ణన, వర్షవర్ణన చేశారు.‘ఆనందదో వర్షతు మేఘ వృందఃఆనందదా జలధరా స్సంతతం భవంతుఆనందదోవుణ ఏష సదాస్తుమహ్యంఆనందినీ రోషధయో భవంతు’అని ‘వరుణస్తుతి’ వర్షానందాన్ని స్తుతించింది.‘విరిసెను మేఘ పరంపరమెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్పరచెను ఝంఝానిలములుకురిసెను వర్షము కుంభగుంభితరీతిన్’అంటూ మబ్బులతో మొదలై కుంభవృష్టిగా మారే వర్షదృశ్యాన్ని ఆవిష్కరించారు గుంటూరు శేషేంద్రశర్మ.నాగరికతలతో పాటు సంగీత సాహిత్యాది కళలను కూడా ప్రభావితం చేసిన ప్రకృతి పరిణామం వాన. వానలు లేనిచోట జీవం ఉండదు. జీవానికి తావులేని చోట మనుగడ ఉండదు. మనుగడ లేని చోట ఇక నాగరికతలెక్కడ? సంగీత సాహిత్యాది కళావైభవాలెక్కడ? భూమ్మీద వానలు కురిసే తావులతో పాటు అక్కడక్కడా చినుకు కురవని ఎడారులు కూడా ఉన్నాయి.ఇప్పటి ఎడారులు ఒకనాడు పచ్చని నేలలేనని, ప్రకృతి మార్పుల ఫలితంగానే అవి ఎడారులుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేదని; ఒకప్పుడు అక్కడ జలకళతో అలరారే సరోవరాలు, నదులు ఉండేవని; వాటి ఒడ్డున పచ్చని సవన్నా గడ్డిభూములు ఉండేవని; ఆ గడ్డిభూముల్లో అనేక జంతువులు జీవించేవని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. వేలాది సంవత్సరాల పరిణామంలో భూకక్ష్యలో వచ్చిన మార్పుల వల్ల సహారా ప్రాంతంలో వానలు కురవడం ఆగిపోయి, పూర్తిగా ఎడారిగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో సహారా ఎడారిలో అక్కడక్కడా తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తోంది. ‘ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్’ ఉత్తర దిశవైపు కదిలినప్పుడు సహారా ఎడారిలో అక్కడక్కడా నాలుగు చినుకులు కురుస్తున్నాయి. ఆ చినుకుల వల్లనే ఈ ఎడారిలో తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వర్షారాధన సంస్కృతిప్రాచీన నాగరికతలు విలసిల్లిన ప్రతిచోట వర్షారాధన సంస్కృతి ఉంది. అన్ని నాగరికతలలోనూ వర్షాలకు అధిదేవతలు ఉన్నారు. భారత ఉపఖండంలో వైదికార్యులు ఇంద్రుడిని, వరుణుడిని వర్షాధిదేవతలుగా కొలిచేవారు. మన పురాణాల్లో ఇంద్ర వరుణుల ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకు ప్రజలు వర్షాల కోసం జూస్ అనే వర్షాధిదేవుడిని, హైయడీస్ అనే అప్సరసలను ఆరాధించేవారు. వర్షాల కోసం ప్రాచీన రోమన్లు దేవతలకు రాజైన జూపిటర్ను, సముద్రాధిదేవత అయిన నెప్ట్యూన్ను పూజించేవారు. ప్రాచీన ఈజిప్షియన్ ప్రజలు టెఫ్నట్ అనే వర్షదేవతను ఆరాధించేవారు. సుమేరియన్ నాగరికతలోని ప్రజలు ఇష్కుర్ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు.ఇష్కుర్కు ‘అదాద్’ అనే మరోపేరు కూడా ఉన్నట్లు అకాడియన్ పురాణాల కథనం. మధ్య అమెరికాలోని మాయన్ నాగరికత ప్రజలు చాక్ అనే వర్షాధిదేవుడిని పూజించేవారు. ఉత్తర అమెరికాలో మూలవాసులైన నవాజో ప్రజలు టొనీనిలీ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. దక్షిణ అమెరికాలో పురాతన మూయిస్కా మతస్థులు వర్షాల కోసం చిబ్చాకూమ్ అనే దేవుడిని పూజించేవారు. ప్రాచీన చైనీస్ ప్రజలు యుషి అనే వానదేవుడిని పూజించేవారు. జపాన్లోని షింటో మతస్థులు కురాఒకామి అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. ఆస్ట్రేలియాలోని మూలవాసులు వాంజినా అనే వర్షాధిదేవతను పూజించేవారు. వానల కోసం దేవుళ్లను, దేవతలను పూజించడం, వారి ప్రీతి కోసం రకరకాల నైవేద్యాలు సమర్పించడం, పండుగలు జరుపుకోవడం పురాతన కాలం నుంచే ఉంది. చాలాచోట్ల ఇప్పటికీ వానల కోసం ప్రత్యేకంగా పూజలు జరపడం, వేడుకలు జరపడం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయి.మన వానాకాలం పండుగలుమన దేశంలో వానాకాలంలో వచ్చే పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకొంటే, మరికొన్నింటిని వేర్వేరు ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రజలు జరుపుకొంటారు. వానాకాలంలో వచ్చే జగన్నాథ రథయాత్ర, కృష్ణాష్టమి, వినాయకచవితి పండుగలను దాదాపు దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. అలాగే, తెలంగాణలో బోనాల పండుగ, కేరళలో ఓనం పండుగ, తమిళనాడులో ఆదిపెరుక్కు తదితర పండుగలు జరుపుకొంటారు. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీజ్, లద్దాఖ్లో హెమిస్ సెచు, మేఘాలయలో భేడియేంఖ్లామ్, గోవాలో సావో జొవావో వంటి పండుగలను జరుపుకొంటారు. ఇవేకాకుండా, దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి పూజలు జరుపుతారు.అత్యధిక వర్షపాతంప్రపంచంలో కొన్నిచోట్ల దాదాపు ప్రతి ఏడాది అధిక వర్షాలు కురుస్తుంటాయి. ఇంకొన్ని చోట్ల అరుదుగా అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. మేఘాలయలోని మౌసిన్రామ్ గ్రామంలో 11,872 మిల్లీ మీటర్ల వార్షిక వర్షపాతం నమోదవడంతో ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఒకే సంవత్సరంలో అత్యధిక వర్షపాతం రికార్డు కూడా మౌసిన్రామ్ గ్రామానికే దక్కడం విశేషం. ఈ గ్రామంలో 1985 సంవత్సరంలో ఏకంగా 26,471 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఫ్రెంచ్ ప్రభుత్వం అధీనంలోని రీయూనియన్ దీవిలోని ఫోక్ ఫోక్ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అత్య«ధిక వర్షపాతం నమోదైంది. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్కు తూర్పున ఉన్న రీయూనియన్ దీవిలో సముద్రమట్టానికి 2,990 మీటర్ల ఎత్తులో ఉండే ఫోక్ ఫోక్ ప్రాంతంలో 1966 జనవరి 7–8 తేదీల నడుమ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 1870 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.వానాకాలం వెతలుసెగలు రేపే వేసవి తర్వాత వచ్చే వర్షాలు కొంత హర్షాన్ని తెచ్చినా, తెరిపిలేని వానలు వరుసగా వెతలను కూడా మోసుకొస్తాయి. మన దేశంలోని పరిస్థితులనే చూసుకుంటే, వానలు కురిస్తే చాలు నగరాలు, పట్టణాల్లోని రహదారులన్నీ జలమయంగా మారుతాయి. మురుగునీటి ప్రవాహంతో నిండిన రోడ్లపై వాహనాల రాకపోకలకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడతాయి. ఒక్కోసారి రోజుల తరబడి ముసురు విడిచిపెట్టని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు రోజువారీ కూలీలు ఉపాధి దొరకక ఇబ్బంది పడతారు. జలమయమైన రోడ్ల మీదుగా రాకపోకలు సాగించడానికి ఉద్యోగులు, విద్యార్థులు నానా ఇక్కట్లు పడతారు. అధిక వర్షాలు కురిసినప్పుడు నదుల్లో వరద పోటెత్తి, నదీ తీరాలలో ఉండేవారికి ప్రాణనష్టం, ఆస్తినష్టం వంటి తీవ్రనష్టాలు వాటిల్లుతాయి.వానాకాలంలో వీథులు, ఇళ్ల పరిసరాలన్నీ బురదమయంగా మారడంతో రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. పలుచోట్ల చిట్లిన మంచినీటి పైపులైన్లలోకి మురుగునీరు ప్రవేశించడంతో నీరు కలుషితమై, కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు పెరుగుతాయి. మురుగునీరు నిలిచిపోవడంతో ఈ కాలంలో దోమల బెడద పెరిగి, వాటి వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు సోకుతాయి. వాతావరణంలో తేమకు తోడు కాలుష్యం పెరగడం వల్ల జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు ఎక్కువవుతాయి. వానాకాలంలో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి.చాలా చోట్ల వీ«థుల్లోనే తినుబండారాలు అమ్మే దుకాణాలు, టీ షాపులు ఉంటాయి. వానాకాలంలో వీటి చుట్టూ మురుగునీరు, బురద చేరి ఉంటుంది. ఈగలు, దోమలు ముసురుతూ ఉంటాయి. పరిసరాలు అంత దారుణంగా ఉన్నా, ఉపాధి కోసం ఆ చిరువ్యాపారులు వ్యాపారాలు సాగిస్తుంటారు. అలాంటి చోట్ల తినుబండారాలు తినేవారికి వానాకాలంలో జీర్ణకోశ సమస్యలు, పరిసరాల శుభ్రత లోపించడం వల్ల రకరకాల అంటువ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువవుతాయి.వర్షాలు అతిగా కురిస్తే రైతులకు పంటనష్టం తప్పదు. పొలాల్లో నీరు నిలిచిపోయి, నాట్లు వేసే సమయంలో అతిగా వర్షాలు కురిస్తే, సజావుగా పెరగాల్సిన మొక్కలు కుళ్లిపోతాయి. పంట చేతికి వచ్చే సమయంలో అతిగా వర్షాలు వస్తే, రైతులకు శ్రమ దండగై, పంటనష్టం జరుగుతుంది.వానాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంటుంది. దీనివల్ల జనాల రోజువారీ పనులు దెబ్బతింటాయి. వ్యాపార లావాదేవీలకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. గాలి వానల ధాటికి ఒక్కోసారి స్తంభాల నుంచి విద్యుత్ తీగలు నేల మీదకు పడి ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.చినుకు కురవని నేలప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఆఫ్రికాలో ఉంది. మన దేశంలో థార్ ఎడారి ఉంది. ఈ ఎడారులు ఇసుక మేటలతో పొడి పొడిగా ఉంటాయి. వీటిలో అరుదుగా కనిపించే ఒయాసిస్సుల్లో మాత్రమే కాస్త నీటిజాడ కనిపిస్తుంది. ఇలాంటి ఎడారుల్లో కూడా అతి అరుదుగా కొద్దిపాటి చినుకులు కురుస్తుంటాయి. అయితే, ఈ భూమ్మీద చినుకు కురవని నేల ఏదైనా ఉందా అంటే, అది చిలీలోని అటకామా ఎడారి మాత్రమే! అటకామా ఎడారిలోని పలు ప్రదేశాల్లో చరిత్రలో ఏనాడూ చినుకు కురిసిన దాఖలాల్లేవు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశంగా రికార్డులకెక్కింది.వర్షాధార దేశాలుభూమధ్య రేఖకు ఉత్తర, దక్షిణ దిశలలోని కర్కాటక, మకర రేఖల నడుమనున్న చాలా దేశాలకు, వాటికి కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు వర్షాలే ఆధారం. భారత్, చైనా సహా అత్యధిక జనాభా కలిగిన పలు దేశాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏటా వర్షాకాలం వస్తుంది. అలాగని, ప్రతి ఏడాది ఒకేలా వర్షాలు కురుస్తాయనే భరోసా ఉండదు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఈ దేశాలు చక్కని పంట దిగుబడులతో కళకళలాడతాయి. తగినంత వానలు కురవనప్పుడు కరవు కాటకాలతో అల్లాడిపోతాయి. వానలు మితిమీరి కురిసినప్పుడు వరదలు ముంచెత్తి, పంటనష్టమే కాకుండా, ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని కూడా చవిచూస్తాయి. వరదలు ముంచెత్తకుండా పలుచోట్ల ఆనకట్టలు కడుతున్నా, అనావృష్టిని ఎదుర్కోవడానికి వీలుగా నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు కడుతున్నా ఈ ప్రాంతాలకు తరచుగా అతివృష్టి, అనావృష్టి బాధలు తప్పడం లేదు.భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాలలో ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఏటా రుతుపవనాలు వస్తాయి. రుతుపవనాల రాకతో ఈ ప్రాంతాల్లో వానాకాలం మొదలవుతుంది. పశ్చిమ, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోను; ఉత్తర అమెరికా, ఆసియా దేశాలతో పాటు యూరోప్ దేశాలలో ఏటా జూన్ నెలాఖరులోగా వానాకాలం మొదలవుతుంది. దక్షిణార్ధగోళంలోని ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలలో సెప్టెంబర్ నుంచి వానాకాలం మొదలవుతుంది. వానాకాలంలోనే సముద్రంలో అల్పపీడనాలు, తుఫానులు వంటివి ఏర్పడుతుంటాయి. తుఫానుల వంటి ప్రకృతి విపత్తుల వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కోసారి అపారనష్టం వాటిల్లుతూ ఉంటుంది. వర్షాధార దేశాలకు తఫాను ముప్పు వెన్నంటే ఉన్నా, వర్షాలు లేకుండా ఈ దేశాలు మనుగడ సాగించలేవు. ఇటీవలి కాలంలో పెరిగిన వాతావరణ కాలుష్యం, అడవుల నరికివేత వంటి చర్యల వల్ల అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తరచుగా తలెత్తుతున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటేనే సకాల వర్షాలు సజావుగా కురుస్తాయి. మానవాళికి హర్షాతిరేకాన్ని తీసుకొస్తాయి.వానాకాలం జాగ్రత్తలువానాకాలంలో పుష్కలంగా వానలు కురవడం వల్ల నదులు, జలాశయాలు నీటితో నిండుతాయి. అయితే, వానాకాలంలో నీటితోనే జాగ్రత్తగా ఉండాలి. వానల ఉద్ధృతి వల్ల చెరువులు, బావుల్లో మురికి నీరు పైకి తేలుతుంది. చిట్లిన మంచినీటి పైపులైన్ల ద్వారా మురుగునీరు తాగునీటిలోకి చేరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వానాకాలంలో నీటిని బాగా వడగట్టి, కాచి, చల్లార్చి తాగడం మంచిది. వానాకాలంలో నీటి పట్ల జాగ్రత్తలు తీసుకునేటట్లయితే చాలా వ్యాధుల నుంచి ముప్పు తప్పించుకోవచ్చు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వానాకాలంలో వాతావరణ కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వంటి ఇబ్బందులను తప్పించుకోవడం కష్టం. కాలంలో మార్పుల వల్ల వచ్చే ఇలాంటి సామాన్యమైన ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్–సి వంటి పోషకాలు ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి.వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలంలో వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడమే మంచిది. పరిశుభ్రమైన ఆహారం, ఇంట్లో వండుకున్న పదార్థాలు మాత్రమే తినడం అలవాటు చేసుకుంటే, వానాకాలంలో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో ఆరుబయట విక్రయించే తినుబండారాలను తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.వాన కురిసే సూచన ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా గొడుగు లేదా రెయిన్కోటు వెంట తీసుకువెళ్లడం క్షేమం. నీరు నిండిన రోడ్లపై నడవడానికి అనువైన వాటర్ప్రూఫ్ చెప్పులు ధరించడం మంచిది. అనుకోకుండా తోవలో ఎక్కడైనా వానలో తడిస్తే, ఇంటికి రాగానే తడిబట్టలను విడిచి పొడి దుస్తులను ధరించడం మంచిది. తడిసిన దుస్తులతో ఎక్కువసేపు ఉన్నట్లయితే, చర్మంపై ఫంగస్ పెరిగి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.తోవలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాన మొదలైతే, విద్యుత్ స్తంభాలు, వేలాడుతూ కనిపించే విద్యుత్ తీగలు లేని సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకోవడం మంచిది. వాన కురిసేటప్పుడు విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదాలను నివారించుకోవచ్చు. వానలో చెట్ల కింద తలదాచుకోవడం కూడా మంచిది కాదు. గాలి తీవ్రత ఎక్కువైతే భారీ కొమ్మలు విరిగి మీదపడే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. -
ఈ సండే స్పెషల్గా వెరైటీ స్వీట్స్ ట్రై చేయండిలా..!
ఇటలీ క్రిస్పిల్లే రైస్ రోల్స్కావలసినవి: బియ్యం– 250 గ్రాములు (కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి), చిక్కటి పాలు– 400 మి.లీ., నీళ్లు– 100 మి.లీ., ఉప్పు– చిటికెడు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార పొడి– 70 గ్రాములుపైనే, మైదాపిండి– 135 గ్రాములు, తాజా యీస్ట్– 15 గ్రాములు, (2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలలో కలిపి క్రీమ్లా చేసుకోవాలి), దాల్చిన చెక్క పొడి– కొద్దిగా, నారింజ తొక్కల తురుము– కొద్దిగా (నిమ్మ తొక్కలు కూడా తీసుకోవచ్చు) తేనె లేదా పంచదార పాకం– కొద్దిగా, నూనె– సరిపడాతయారీ: ముందుగా పాలు, నీళ్లు ఒక పాత్రలో వేసుకుని, చిన్న మంట మీద ఎసరు పెట్టినట్లుగా పెట్టుకోవాలి. పాలు పొంగుతున్న సమయంలో బియ్యం వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం పలుకుగా ఉంటే ఇంకొన్ని పాలు పోసుకుని ఉడికించుకోవాలి. అన్నం పూర్తి అయిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఒక బౌల్లోకి తీసుకుని, వెనీలా ఎక్స్ట్రాక్ట్, 70 గ్రాముల పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, యీస్ట్, మైదా పిండి, నారింజ తొక్క లేదా నిమ్మ తొక్క తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా రోల్స్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఒక బౌల్లో వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తేనె లేదా పంచదార పాకం వేసుకుని పైన పంచదార పొడి జల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. నారింజ ముక్కలతో వీటిని తింటే భలే రుచిగా ఉంటాయి.ఛెన్నా గొజ్జాకావలసినవి: చిక్కటి పాలు– ఒక లీటరు, నిమ్మరసం– 2 టేబుల్ స్పూన్లు (వెనిగర్ కూడా వాడుకోవచ్చు), కూలింగ్ వాటర్– సరిపడా, రవ్వ– ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి– ఒక టేబుల్ స్పూన్, ఏలకుల పొడి– అర టీస్పూన్, నెయ్యి– వేయించడానికి సరిపడా, పంచదార, నీళ్లు– ఒక కప్పు చొప్పునతయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి, మధ్యస్థ మంటపై మరిగిస్తూ, పాలు పొంగకుండా చూసుకోవాలి. మరిగిన తర్వాత ఒక నిమిషం పాటు చల్లారనిచ్చి, ఇప్పుడు నిమ్మరసం లేదా వెనిగర్ను కొద్దికొద్దిగా పోస్తూ, పాలు విరిగే వరకు నెమ్మదిగా కలపాలి. పాలు పూర్తిగా విరిగిపోయాక, విరిగిన పనీర్ను ఒక బౌల్లోకి తీసుకుని చల్లటి నీటిలో వేసి దానిలో కాసేపు కడిగి, పలుచటి క్లాత్లోకి తీసుకోవాలి. నీరు మొత్తం పిండేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నీరు పిండేటప్పుడు కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి.అనంతరం ఆ పనీర్ని సుమారు 5 లేదా 7 నిమిషాలు చేత్తో పిసికి మరింత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో రవ్వ, మైదా పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అది అప్పుడు చపాతీ పిండిలా మెత్తగా అవుతుంది. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని, చిన్న మంట మీద, నేతిలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు మరో స్టవ్ మీద పంచదార, నీళ్లు పోసుకుని, ఏలకుల పొడి వేసుకుని, లేత పాకం రాగానే కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు అందులో నేతిలో వేగిన ముక్కలను వేయించి పాకంలో నానబెట్టాక సర్వ్ చేసుకోవచ్చు.చాక్లెట్ పీనట్ బార్స్ కావలసినవి: ఓట్స్ పౌడర్– ఒక కప్పుపైనే (ఓట్స్ని దోరగా వేయించి పౌడర్లా చేసుకోవాలి), బాదం పౌడర్– ఒక కప్పు, పీనట్ బటర్– 2 కప్పులు, మేపుల్ సిరప్– 80 ఎమ్ఎల్, డార్క్ చాక్లెట్ ముక్కలు– ఒక కప్పు తయారీ: ముందుగా ఓట్స్ పౌడర్లో బాదం పౌడర్, పీనట్ బటర్, మేపుల్ సిరప్ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముద్ద కాగానే బేకింగ్ ట్రేలో నింపుకుని సమాంతరంగా ఒత్తుకోవాలి. ఈలోపు చాక్లెట్ ముక్కల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కరిగించుకుని, ఆ సిరప్ను బేకింగ్ ట్రేలో ఉన్న పీనట్ మిశ్రమంపై, సమానంగా పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టుకుని నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!) -
వజ్రాలు వదిలేసింది!
ఆరేళ్లయింది అవుంగ్షీ ఢిల్లీని వదిలేసి. ఇప్పుడు ఆమె మణిపూర్లోని తన స్వగ్రామంలో తల్లిదండ్రులకు తోడుగా ఉంటోంది. అసలు వాళ్ల కోసమే ఆమె వజ్రంలాంటి తన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చింది. వస్తూ వస్తూ సిమ్లా నుంచి ఆపిల్ మొక్కల్ని తెచ్చుకుంది. అవి రెండో ఏడాదే కిలోల కొద్దీ తియ్యటి ఆపిల్ పండ్లను ఇచ్చాయి. తొలి కాపును అమ్మానాన్నకు నైవేద్యంగా పెట్టింది. స్నేహితులు, బంధువులకు ప్రసాదంలా పంచింది. మిగతా పండ్లను అమ్మింది. మరికొన్ని చెట్టుకు సిద్ధంగా ఉన్నాయి. ‘‘ఆరేళ్ల క్రితం ల్యాబ్లో మేము వజ్రాలను తయారు చేసేవాళ్లం. ఆనాటి ఉద్యోగ సంతృప్తిని మించిన సంతృప్తి ఏటా చేతికొస్తున్న ఈ ఆపిల్ పంటను చూస్తే కలుగుతోంది’’ అంటోంది అవుంగ్షీ.తొలి పంట వచ్చినప్పుడు చూడాలి అవుంగ్షీ కళ్లలోని వజ్రాల మెరుపుల్ని! ‘పండంటి బిడ్డ’ అంటుంటాం కదా.. ఆమెకు అవి బిడ్డంటి పండ్లు. విరగ గాసిన ఆపిల్ పండ్లు! ఆమెను చూసి ఉఖ్రూల్లోని పాయ్ గ్రామం ఆపిల్ని పండించడానికి ఉత్సాహపడింది. అక్కడి భూమిలకది ఏ మాత్రం పరిచయం లేని పంట. అయితే ఎర్రగా, జ్యూసీగా, తియ్యగా ఉన్న ఆ ఆపిల్ పండ్లను చూసి స్థానికులు తాము కూడా ఆపిల్స్ను పండించడానికి ఆసక్తి కనబరిచారు. దాంతో పోయ్ ప్రాంతానికి ఆవుంగ్షీ ఆపిల్ పండ్ల సాగుకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. 2019 ఏప్రిల్లో ఆమె హిమాచల్ప్రదేశ్ నుంచి 55 ఆపిల్ మొక్కల్ని తెచ్చి నాటితే వాటిలో 52 బతికాయి. మొదటి ఏడంతా కాపు లేదు. రెండో ఏడాది జూన్ రెండో వారానికల్లా ఆకులు కనిపించనంతగా పండ్లొచ్చేశాయి! పోయ్ గ్రామం ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది. మరీ చల్లగా ఉండని అక్కడి పొడి వాతావరణానికి అనువైన భూమిలో పెరిగే ఆపిల్ మొక్కల్ని ఆవుంగ్షీ ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి.. హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లోని శిక్షణ కేంద్రంలో ఆపిల్ సాగులో మెలకువలు నేర్పించడం వరకు అన్నిటా ఆమె స్నేహితురాలు సోసో షైజానే ఆమెకు సహాయంగా ఉంది. షైజా.. నేషనల్ విమెన్ కమిషన్లో సభ్యురాలు. ‘‘ఊరెళ్లి ఏం చేస్తావు?!’’‘‘ఊరెళ్లిపోతున్నాను. అమ్మానాన్నకు ఇంటి దగ్గర తోడుగా ఉండాలి’’ అని అవుంగ్షీ చెప్పినప్పుడు.. షైజా మొదట ఆమెను అడిగిన మాట.. ‘‘ఉద్యోగం మానేసి, ఊరెళ్లి ఏం చేస్తావు?’’ అని. ‘‘ఏమీ అనుకోలేదు’’ అంది అవుంగ్షీ. ఏమీ అనుకోకుండా ఉద్యోగం మానేయడం అంటే అంతకన్నా పొరపాటు లేదు. పైగా అవుంగ్షీ ఆ సమయంలో ఢిల్లీలోని గోర్డెన్–మ్యాక్స్ అనే సింగపూర్ వజ్రాల కంపెనీలో డైమండ్ ల్యాబ్ మేనేజర్గా ఉంది! అయితే తల్లిదండ్రుల కోసం ఆ వజ్రంలాంటి ఉద్యోగాన్ని వదలేయాలని నిర్ణయించుకుంది. ‘‘సరే వదిలేయ్, అయితే మీ మణిపూర్లో ఆపిల్స్ పండించడం ఎలా ఉంటుందో ఆలోంచించు’’ అని షైజా సలహా ఇచ్చింది. అలా ఢిల్లీ–హిమాచల్ప్రదేశ్–మణిపూర్ల మీదుగా అవుంగ్షీ ఆపిల్ పంట ఆలోచన సాగింది. ఆనాటి ఆ ఆలోచన ఈనాటి వరకూ ఏటా విరగ్గాస్తూనే ఉంది.పంట రాగానే పంపకం!పెరుగుతున్న దిగుబడితో ఏటికేడాదీ మరిన్ని ఆపిల్ మొక్కల్ని తెచ్చి భారీ ఎత్తున ఆపిల్ తోటను పెంచుతోంది అవుంగ్షీ. ఆమె తండ్రి వరి రైతు. మొదట – కూతురు ఆపిల్స్ పండిస్తాను అనగానే ఆయనేమీ మాట్లాడలేదు. తల్లి మాత్రం కూతురి వైపు నిలబడింది. ఆమె మద్దతు ఇవ్వడానికి తగిన కారణమే ఉంది. అవుంగ్షీ పెంచుతున్న ఆపిల్ రకం ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలోనే కాపుకు వచ్చేస్తుంది. ఉఖ్రూల్ శీతోష్ణ స్థితుల్లో చక్కగా ఎదుగుతుంది. పైగా పూర్తి ఆర్గానిక్. మార్కెట్లో మంచి ధర ఉంది. కిలో ఆపిల్స్ రూ.250 వరకు ధర పలుకుతాయి. ఏటా పంట రాగానే స్నేహితులకు, పరిచయస్తులకు, బంధువులకు ఇచ్చినన్ని ఇచ్చి మిగతా వాటిని అమ్మేస్తుంది అవుంగ్షీ. ఇంకా కొన్ని అమ్మకానికి ఉంటాయి. వాటిని ఉచితంగా గ్రామస్థులకు పంచిపెడుతుంది. చెట్లపై ఇంకా డెబ్భై నుంచి ఎనభై కిలోల ఆపిల్స్ కోతకు వస్తూనే ఉంటాయి. ఈ లెక్కలన్నీ క్రమేణా అవుంగ్షీ తండ్రిలో నమ్మకం కలిగించి ఆయన ప్రోత్సాహం కూడా ఆమెకు లభించింది. ఇప్పుడు తన ఆపిల్ పండ్ల తోటను చూడ్డానికి వస్తున్న పోయ్, చుట్టు పక్కల గ్రామాల అమ్మాయిలు, గృహిణులు ఆపిల్ సాగుపై ఆసక్తి చూపడంతో వారిని కూడా అవుంగ్షీ ప్రోత్సహిస్తోంది. తను ఏ విధంగానైతే హిమాచల్ ప్రదేశ్ వెళ్లి శిక్షణ తీసుకుని వస్తూ వస్తూ కొన్ని ఆపిల్ మొక్కల్ని కొని తెచ్చుకుందో వాళ్లకూ అదే దారిని చూపిస్తోంది. ఈ ఆరేళ్లతో తనకు ఎదురైన కష్టనష్టాల గురించి కూడా ఆమె వారికి చెబుతోంది. ‘‘కష్టనష్టాలంటే ఏం లేదు. మొక్కల్ని పశువులు తినకుండా కాపాడుకోవాలి. పండ్లు వచ్చాక దొంగలు పడకుండా కాపు కాయాలి’’ అని తియ్యగా నవ్వుతుంది అవుంగ్షీ. ఏమైనా వజ్రాల ఉద్యోగాన్ని మించినదవుతుందా ఆపిల్ పండ్ల పెంపకం?! ‘‘కాకపోవచ్చు. అక్కడికి మించిన ఉద్యోగ సంతృప్తి.. ఈ పంట సాగులో ఉంది’’ అంటుంది ఈ యువ కృషీవలురాలు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఈ వారం కథ: రాణి
గాలికి ప్రాణం పోయినట్లు, చెట్లన్నీ ఉరేసుకున్నట్లు, చడీ చప్పుడు లేదు. ఒక్కటే ఉక్కబోత! ఏం చెప్పాలా? ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తూ ఉక్కబోతలో నిద్రపట్టక మేడ మీదకి వచ్చేశాను.పెచ్చులూడిపోయిన గచ్చు ఎండకు సలసల కాగి అర్ధరాత్రి అయినా చల్లారలేదు. కాని, శరీరానికి ఇవేమీ పట్టినట్లు లేదు. చెమటకు తడిసి ముద్దయిపోయిన బనియన్ తీసి, జాజిమల్లి తీగ మీద వేస్తుంటే తీగ చాటున దాక్కున్న చంద్రుడు మేఘాలతో దోబూచులాడుతున్నట్లు, వచ్చీరానట్లున్న వెన్నెల చీకటితో సరసమాడుతున్నట్లు అనిపించింది.మా అమ్మకు ఆడపిల్లలు లేకపోయినా అన్ని రకాల పూలమొక్కలు పెంచేది. కొంచెం తీరుబడి దొరికితే చాలు మొక్కలన్నింటికీ నీళ్ళు పోసి ముస్తాబు చేసేది. కాని, రోజూ పూలు కోసుకోవడానికి వచ్చే పిల్లలు, ‘‘నేను ముందంటే నేను ముందని; ఈ పువ్వు నాదంటే ఆ పువ్వు నాదని, ఇల్లు పీకి పందిరేసేవారు. ఎప్పుడైనా కోపమొచ్చి, ‘‘ఎందుకమ్మా ఇవన్నీ!’’ అని అంటే,‘‘మీ నాన్నగారిని ఈ పువ్వుల్లో , పిల్లల నవ్వుల్లో చూసుకుంటున్నాను రా!’’ అనేది పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ. అప్పటి నుంచి మొక్కలకి నీళ్ళు పోయడం మొదలుపెట్టాను నేను కూడా!మా నాన్నగారికి ప్రకృతన్నా, ప్రశాంతతన్నా చాలా ఇష్టం. అప్పట్లో అందరూ వద్దన్నా, ఊరికి దూరంగా ఈ కొండ అంచున ఇల్లు కట్టారు. చాలాకాలం మా ఇరుగు పొరుగుగా ముళ్ళ కంచెలే ఉండేవి. కాని, తరువాత దగ్గరలో పరిశ్రమలు రావడం వలన కార్మికులు ఒక్కొక్కరుగా వచ్చి స్థిరపడ సాగారు. ఒకట్రెండు ఇళ్లు ఉండే గ్రామం నేడు నిండుకుండలా తొణికిసలాడుతోంది. అలా పెరిగిన జనాభా అవసరాల కోసం ఈ ఊర్లో అధికార్లు ఓ చిన్న పోస్టాఫీసు కూడా పెట్టారు. అలా మా నాన్నగారు చాలా కాలం తపాలా శాఖలో బ్రాంచ్ పోస్టుమాస్టర్గా పనిచేసి, ఒక రోజు ప్రమోషన్ తీసుకుని దేవుడి దగ్గరకి బదిలీమీద వెళ్ళిపోయారు, కనీసం మాటైనా చెప్పకుండా!నేను ఇలా అటు ఇటు తిరగడానికి కారణం లేకపోలేదు. ఆమె పేరు రాణి. మనుషుల మధ్యలో దేవతలా, రాజ్యాన్ని కోల్పోయి అజ్ఞాతంలో ఉన్న రాకుమారిలా ఉంటుంది.నేను ఎంసీఏ చేసి ‘క్యాట్’ పరీక్షకు సిద్ధమవుతున్న రోజులవి. విదేశాల్లో స్థిరపడాలని, మేఘాల్లో తిరగాలని ఆకాశానికి నిచ్చెన వేస్తున్న వయస్సు అది. నాన్న లేని నన్ను అమ్మ ఏ లోటు రాకుండా పెంచింది.మా వీధి బోసిపోయింది రెండు రోజుల నుంచి. ఎప్పుడూ గలగలమని నవ్వుతూ తుళ్ళుతూ మా ఇంటి పక్కన ఉండే రాణి రెండు రోజుల నుంచి బయట కనిపించలేదు. భోజనం చేస్తుంటే అమ్మ అంది ‘‘రాణి ఒక్క మార్కులో పరీక్ష తప్పిందంటరా! ఆ ఒక్క మార్కు వేస్తే వాడి సొమ్మేం పోయేదో’’ అంటూ ఆడగని సమాచారం ఇచ్చి, ‘‘ఓసారెళ్ళి చూసి రారా!’’ అని ముక్తాయింపు ఇచ్చింది.అమ్మ చెప్పిందని పక్కింటికెళితే, అమ్మ పాడిన పాటే పాడుతోంది రాణి. ‘‘ఒక్క మార్కులోనే పోయిందమ్మమ్మా! నేను చాలా బాగా రాశాను. నా మార్కులు ఎవరికో వేసేశారు’’ అని అమాయకంగా అంటుంటే, నిజంగానే ఒకరి మార్కులు ఇంకొకరికి వేసేస్తారేమో! అనిపించింది ఆ ఏడుపు చూసి. ఇంతలోనే మా అమ్మ వచ్చి, ‘‘మీరేమీ బాధపడకండి బామ్మగారు. ఒక్క మార్కులో పోయిందంటే మీ మనవరాలు తెలివైనదే అయ్యి ఉంటుంది. మా అబ్బాయి ట్యూషన్ చెబుతాడులే!’’ అని భరోసా ఇచ్చేసింది. ఆ భరోసా నా జీవిత కాలానికి సరిపడే పాఠాలు నేర్పింది. ఏ బాధ్యత లేని నాకు ఇప్పుడు రాణి ఒక బాధ్యతై కూర్చుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పరీక్ష పాస్ కాకపోతే ‘‘నాకు లెక్కలు బాగా వచ్చు’’ అనే పేరు మొత్తం ఎగిరిపోతుంది. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను. మా అమ్మ ఇచ్చిన మాట కోసం, ముఖ్యంగా నా పరువు కోసం నెల రోజుల నుంచి రాణికి లెక్కలు చెబుతూనే ఉన్నాను.‘‘నా ఓపిక అయిపోయింది బాబూ! నా మనవరాలు పరీక్ష గట్టెక్కితే అంతే చాలు’’ అంటూ రాణి వాళ్ళ అమ్మమ్మ సుప్రభాతం మొదలుపెట్టేది ప్రతిరోజూ. నాకు వినీ వినీ విసుగొచ్చేసింది. రాణి ఈ పరీక్ష పాసైతే ఇక పైచదువులు వాళ్ళ మావయ్యే పట్నంలో చదివించుకుంటాడట! ఆవిడ సుప్రభాత సారాంశం ఇది. నా ప్రిపరేషన్ పక్కనపెట్టి, ఎన్నో మోడల్ పేపర్స్ తయారు చేసి, రాణితో చేయించేవాడిని. రాణికి కూడా ఓపిక ఎక్కువ. ఆలస్యమైనా ప్రతీ లెక్క చేసి చూపించే ఇంటికి వెళ్ళేది.‘‘సప్లిమెంటరీ ఫీజు కట్టేశాను సార్!’’ అంది ఒకరోజు. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోయింది కాని, రాణి ఎప్పటిలా ప్రశాంత వదనంతో సుభిక్షంగా ఉన్న రాజ్యానికి రాణిలా కనిపించేది. రాణి ఆలోచనలు, మాటలు వింటే తత్త్వం చక్కగా బోధ పడుతుంది. జీవితం పట్ల అవగాహన, భవిష్యత్తు పట్ల ఆమె ఆలోచనలు ఆమెపై లోలోన గౌరవం పెంచేవి. ఈరోజు ఉదయం రాణి చాలా కొత్తగా కనబడింది. ఎప్పుడు చలాకీగా ఉండే రాణి ఈ రోజు సిగ్గుపడుతూ, ‘‘మీకో విషయం చెప్పాలని ఉంది సర్’’ అంది. మహారాణే వచ్చి వరం ఇస్తానంటే ఎవరూ కాదంటారు!‘‘సరే, చెప్పు అయితే’’ అన్నాను. ‘‘సాయంత్రం చెబుతాను సర్’’ అంది.ఎందుకో తెలియకుండానే నాలో రాణి పట్ల ఆరాధన భావం ఏర్పడింది. ఆమె నడవడికను చూస్తే ఆమెను ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో! నాలో ఆతృత అనే ఒక భావన ఇంతలా పనిచేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎక్కడికీ వెళ్లాలి అనిపించలేదు. రాణిలాంటి అమ్మాయి ఎక్కడో కాని ఉండదు. ఎప్పుడోగాని పుట్టదు. జీవితంపై స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంది. క్యాట్ ప్రిపరేషన్కి ఫుల్స్టాప్ పెట్టి జీవితంలో స్థిరపడాలని మొదటిసారి అనిపించింది. చదువే లోకంగా ఉన్న నాకు ఉద్యోగం సాధించడం ఎప్పుడూ కష్టమనిపించలేదు. మొదటిసారి అందంగా కనిపించాలనిపించింది.రాణి కోసం ఎదురు చూస్తున్నాను. రోజు ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. రాణి రాలేదు కాని, రాణి చెలికత్తె వచ్చింది. నాలుగు మడతలు పెట్టి ఉన్న ఒక కాగితాన్ని నా చేతిలో పెట్టి, అంతలోనే మాయమైపోయింది. చదవడానికి చేతులు వణుకుతున్నా ఊహించిందే ఉంటుందనే నమ్మకంతో చదవడం మొదలు పెట్టాను, మెట్ల పైన కూర్చుని. ఏం చెప్పబోతోందా అనే కుతూహలం నరనరాన్ని పట్టి ఊపేస్తోంది.‘‘సార్ నమస్కారం!ఒక్క రూపాయి ఆశించకుండా మీ సొంత సమయాన్ని నా కోసం వెచ్చించి, ఇచ్చిన మాట కోసం మీ లక్ష్యాన్ని కూడా పక్కనపెట్టి, నా భవిష్యత్తు కోసం ఇంతలా కష్టపడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు అపార గౌరవం కలుగుతోంది. మీరు నన్ను ఒక విషయంలో క్షమించాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మమ్మే నాకు సర్వస్వం. అమ్మమ్మను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అందరూ అనుకున్నట్లు నాకు లెక్కలు రాకో, చదువు మీద ఆసక్తి లేకనో నేను ఫెయిల్ కాలేదు. నేను పాస్ అయితే అమ్మమ్మ నన్ను మావయ్య దగ్గరికి పంపేస్తుంది. మా అమ్మా, నాన్న పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన దగ్గర నుండి నేనే సర్వస్వం అనుకుని పెంచింది. నేను పట్నం పోతే చదువు, ఆపై పెళ్లి అంతే కదా సర్! ఆడపిల్ల బరువు ఎంతకాలం ఉంచుకుంటారు ఎవరైనా! నేను వెళ్ళిపోతే నేనే ప్రాణం అనుకుని బ్రతికే అమ్మమ్మ పరిస్థితి ఏమిటి సార్? ఏ తోడు లేకుండా ఒంటరిగా తన చివరి రోజులు గడపాల్సిందేనా? అందుకే కావాలనే ఫెయిల్ అయ్యాను.అమ్మమ్మ కన్నా నా భవిష్యత్తు, ర్యాంకు గొప్పగా అనిపించలేదు. మీరు చెప్పే పాఠాలు రానట్లు నటించినందుకు ఏమీ అనుకోకండి. మీరు చాలా మంచి ఉపాధ్యాయులు అవుతారు. ఎలాగైనా మీరే మా అమ్మమ్మను ఒప్పించి, మావయ్య దగ్గరికి పంపే ప్రయత్నాన్ని మాన్పించండి. మీరు ఒప్పిస్తే ఈసారి పాస్ అయ్యి, దగ్గర్లోని కాలేజీలో చేరుతాను. అమ్మమ్మతోనే ఉంటాను ప్లీజ్.ఇట్లురాణి ’’నా నడినెత్తికెక్కిన మత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. జీవితాన్ని కాచి వడబోసిన దానిలా ఉత్తరం రాసింది. అక్షరాలు మనస్సుకు గుచ్చుకున్నాయి. నేను వేసుకున్న కొత్తబట్టలు చూసి నాకే సిగ్గేసింది. తను నిజంగా రాణే అయ్యుంటే తన రాజ్యంలో ప్రజలకు అసలు కష్టాలు తెలియనిచ్చేదా అనిపించింది, తన మాటలు వింటే. నా ఊహలకి తాళం వేసి వాళ్ళ అమ్మమ్మకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ మేడ మీద అటూ ఇటూ తిరుగుతున్నాను. నిద్రకొచ్చిన చంద్రుడు మేఘాల్లో జోగుతున్నాడు. నేనేదో రాణికి లెక్కలు నేర్పుతున్నాను అనుకున్నాను కాని, తనే నాకు జీవిత విలువలు నేర్పింది.నా స్వార్థం కోసం నా అందమైన భవిష్యత్తులో నేను తప్ప ఏ తోడులేని అమ్మ స్థానం ఏమిటో ఆలోచించలేదు. బంధాలకు రాణి ఇచ్చే విలువ, నలుగురి అభ్యున్నతి కోసం పాటుపడాలని అప్పుడప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు గీతోపదేశంలా చెవిలో గింగుర్లు తిరుగుతున్నాయి. రాణి తల్లిదండ్రులు ఉద్యమంలో చనిపోయారంటే మొదట్లో నమ్మబుద్ధి కాలేదు. కాని, ఇప్పుడు అర్థం అయ్యింది. అసలు ఈ అభ్యుదయ భావాలన్నీ ఆమెకు తల్లిదండ్రుల నుండే వచ్చాయని!అమ్మ నా కోసం ఇంకా మెలకువగానే ఉంది. ఆలోచనలలో పడి అమ్మ గురించి పట్టించుకోలేదు. అమ్మ చదువుకోపోయినా చదువు విలువ తెలిసిన వ్యక్తి. నాన్నగారు పోయిన తరువాత బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఉద్యోగం ఇస్తానంటే, ‘‘ఛీ! నాకొద్దు’’ అన్నాను. నాన్న ఆ చిన్న జీతంతో అమ్మను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను బాగా చదివించారు. అంతకు మించి నా పేరడిగితే, నా పేరుకన్నా బ్రాంచ్ పోస్టుమాస్టర్గారి అబ్బాయిని అని గర్వంగా చెప్పుకునేలా బ్రతికారు. ఒక కొడుకుగా అంతకంటే అదృష్టం ఏముంటుంది? మా నాన్నగారు ఈ ఉద్యోగం చేయి, ఆ ఉద్యోగం చేయి అని ఎప్పుడూ చెప్పలేదు. నలుగురికీ సేవ చేయి అని మాత్రం చెప్పారు, తాను చేసి చూపించారు కూడా. అర్ధరాత్రయినా, అపరాత్రయినా, ఎవ్వరికీ ‘ఈరోజు కుదరదు, రేపు రండి’ అని చెప్పలేదు. ఆయన గొప్పతనం మనసులో మెదలగానే ఆయన బతికుంటే కాళ్ళకు దణ్ణం పెట్టాలనిపించింది.అమ్మ ఎప్పుడూ నేను పడుకున్న తరువాతే పడుకుంటుంది. నాకన్నా ముందే లేచి, అన్నీ సర్దిపెడుతుంది.వేగంగా మెట్లు దిగి అమ్మని అడిగా, ‘‘అమ్మా! నీకు ఏమిష్టం?’’ అని. నిద్ర కళ్ళతోనే చెప్పింది, ‘‘నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి కన్నా, అది చాలు నాకు ఇంకేం అక్కర్లేదు’’ అని.దుఃఖం పొంగుకొచ్చింది మనసులో. ఏ తల్లి అయినా కోరుకునేది అదే కదా! రాణి చేసింది కూడా అదే. వాళ్ళ అమ్మమ్మకి తోడుగా వుండటం కంటే పట్టణాల్లో చదువులు గొప్ప కాదనుకుంది.ఎప్పటికైనా రాణి రాణే కదా!నాన్న చూపిన బాటలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఉద్యోగానికి అప్లై చేయడానికి బయలదేరాను, అమ్మ కళ్ళల్లో సంతోషం చూస్తూ... -
ప్రహ్లాద అజగర సంవాదం
ప్రహ్లాదుడు ఒకసారి భూలోక సంచారం చేయాలనుకున్నాడు. సాధు సజ్జనులతో కలసి బయలుదేరాడు. భూలోకంలో సంచరిస్తూ, సహ్యాద్రి ప్రాంతానికి చేరుకున్నాడు. కావేరీ నదిలో స్నానసంధ్యాదులు పూర్తి చేసుకుని, ప్రహ్లాదుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, సాధు సజ్జన బృందంతో ముందుకు నడవ సాగాడు. తోవలో నేల మీద దుమ్ము, ధూళిలో పడుకుని ఉన్న ఒక మహర్షిని అల్లంత దూరం నుంచి చూశాడు. ఆ మహర్షిలో ఎలాంటి చలనం లేదు. ప్రహ్లాదుడిని అనుసరించి వస్తున్నవారు కూడా ఆయనను గమనించారు.‘ఎవరీ మహర్షి? ఎందుకిలా నేల మీద పడుకుని ఉన్నారు? దగ్గరలో ఆశ్రమమేదైనా ఉందా? ఇలా దుమ్ము, ధూళిలో నిశ్చలంగా పరుండి ఉండటం ఏమైనా వ్రత నియమమా?’ అని వారిలో వారు రకరకాలుగా తర్జనభర్జనలు పడ్డారు.మహర్షి సంగతేమిటో స్వయంగా తెలుసుకుందామని ప్రహ్లాదుడు ఆయనను సమీపించాడు. నెమ్మదిగా ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. పాదాలకు శిరసును ఆన్చి నమస్కరించి, ఆ పాదాలను తన ఒడిలోకి తీసుకుని, నెమ్మదిగా ఒత్తుతూ, ‘మహానుభావా!’ అని సంకోచిస్తూనే పలకరించాడు.ఆ మహర్షి నెమ్మదిగా కళ్లు తెరిచి, ‘ఏమిటి?’ అన్నట్లు ప్రహ్లాదుని వంక చూశాడు.‘మహానుభావా! తమరు ఎందుకిలా నేల మీద పడి ఉన్నారు? శరీరమంతా దుమ్ము, ధూళితో నిండి ఉందంటే, మీరు చాలాకాలంగా ఇలాగే ఉన్నట్లు అర్థమవుతోంది. ఇది ఏమైనా వ్రత నియమమా? లోకంలో ప్రయత్నం లేకుంటే, మనిషికి ధనం లభించదు. ధనం లేకుంటే, సుఖభోగాలు లభించవు. మానవ సహజమైన సుఖాలను త్యజించి, మీరిలా నేల మీద పడుకుని ఉన్నా, మీలో తేజస్సు ప్రకాశిస్తూనే ఉంది. ఇదంతా వింతగా ఉంది. మీ వింత పద్ధతికి కారణం ఏమిటో చెప్పండి’ అని అడిగాడు ప్రహ్లాదుడు.‘నాయనా ప్రహ్లాదా! ఇదంతా తెలియకనే అడుగుతున్నావా? నీవు సాక్షాత్తు శ్రీహరినే మెప్పించిన భక్తాగ్రేసరుడివి. ప్రవృత్తి నివృత్తి ఫలాలను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగిన తత్త్వవేత్తలలో అగ్రగణ్యుడివి. అలాంటి నువ్వు నన్నిలా అడగటం ఆశ్చర్యంగా ఉంది. అయినా అడిగావు గనుక చెబుతాను, విను. దీనివల్ల నీకూ నాకూ ఆత్మశుద్ధి కలుగుతుంది’ అని ఆ మహర్షి తన కథను చెప్పనారంభించాడు.‘కర్మలు ఆచరిస్తూ; వాటి వల్ల కలిగే జన్మల ఫలితాలను చూస్తూ; ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాను. ఇదివరకటి జన్మలో నేను కొండచిలువను. ఇప్పుడు మానవజన్మ ఎత్తాను. మానవజన్మ స్వర్గమోక్షాలకు ప్రవేశద్వారం. మానవజన్మలోనూ దుష్కర్మలను ఆచరిస్తే జంతుజన్మ లభిస్తుంది. పాప పుణ్యాలు రెండూ చేస్తే, మళ్లీ మానవజన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవడానికి, సుఖాలను పొందడానికి మనుషులు ఏవేవో కర్మలు చేస్తూనే ఉంటారు. వాటి వల్ల లభించే అనుకూల, ప్రతికూల ఫలితాలను అనుభవిస్తూనే ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దనుకున్నవాడు కర్మలను ఆచరించవలసిన పని ఏముంది? సుఖం ఆత్మస్వరూపం. భోగాలు అశాశ్వతాలు. ఈ జ్ఞానం కలిగిన తర్వాత నేను కర్మలను ఇంకా ఎందుకు ఆచరించాలి? అందువల్లనే నిశ్చేష్టుడినై, నిష్ప్రయత్నుడినై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ కర్మల ఫలాలను అనుభవిస్తూ ఇక్కడ పరుండి ఉన్నాను.ప్రహ్లాదా! ధనం వల్ల సుఖం దొరుకుతుందని అన్నావు కదా! ధనం వల్ల దుఃఖమే తప్ప సుఖం లేదు. ధనాన్ని రాజ, చోర, శత్రు, మిత్ర, పుత్ర, కళత్రాదులు అపహరించుకుపోతారనే భయం మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ధనవంతులు నిశ్చింతగా నిద్రించలేరు. అందువల్ల ధనం మీద, ధనం వల్ల కలిగే భోగాల మీద మమకారాన్ని విడిచిపెట్టడం ఉత్తమం.ఈ సృష్టిలో నాకు తేనెటీగ, అజగరం గురువులు. తేనెటీగలు ఎంతో శ్రమించి, తాము కట్టుకున్న పట్టులో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి, పొగపెట్టి తేనెటీగలను చంపి, పారదోలి ఆ తేనెను దోచుకుపోతాడు. అలాగే మానవులు ధనం కూడబెడతారు. చివరకు దాని వల్లనే నశిస్తారు. అందువల్ల తేనెటీగల నుంచి నేను వైరాగ్యాన్ని నేర్చుకున్నాను. నా ఇంకో గురువు అజగరం– అంటే, కొండచిలువ. అది మహాసర్పం. అది అందుబాటులో ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తర్వాత కదలదు, మెదలదు. తనకై తాను సొంత ప్రయత్నమంటూ చేయదు. తిండి దొరకకుంటే, ఎన్నాళ్లయినా పస్తులుంటూ ముడుచుకుని పడుకుంటుంది. అజగరాన్ని చూసి నేను సంతుష్టిని నేర్చుకున్నాను. నాకు సుఖం లేదు, దుఃఖం లేదు. ఎవరినీ ఏదీ అడగను. ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటాను. పట్టువస్త్రాలు ధరించినా, చిరిగిన గుడ్డపీలికలు ధరించినా నాకు తేడా ఉండదు. హంసతూలికా తల్పాలపై శయనించినా, ఇలా మట్టిలో శయనించినా నాకు ఒకేలా ఉంటుంది. సగుణమైనా, నిర్గుణమైనా నాకు ఒకటే! అధికమైనా అల్పమైనా ఒకటే! నాది సర్వసమదృష్టి. దీనివల్ల సుఖదుఃఖ భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలిగాను. చిత్తవృత్తిని మనసులో, మనసును అహంలో, అహాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను. స్వానుభవంలో ఆత్మస్థితిలో ఏకనిష్ఠలో ఉంటున్నాను.ప్రహ్లాదా! నువ్వు యోగ్యుడివి. ఇది చాలామందికి లోకవిరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికజ్ఞానివైన నువ్వు అర్థం చేసుకోగలవు. అందుకే ఇదంతా నీకు చెప్పాను’ అని అజగరవ్రతంలో ఉన్న మహర్షి ముగించాడు.ప్రహ్లాదుడు అమితానందంతో ఆయనను సేవించి, పూజించి ఆయన ఆశీస్సులు పొందాడు. అజగర మహర్షి నుంచి తెలుసుకున్న ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆత్మతృప్తి పొంది, ఆయన నుంచి వీడ్కోలు తీసుకుని, తన బృందంతో కలసి యాత్ర కొనసాగించేందుకు బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
చల్లని థ్రిల్లింత.. తియ్యని తుళ్లింత
నోట్లో వేసుకోగానే జివ్వుమనిపించే ఐస్క్రీమ్ జిహ్వకు ఒక చల్లని చలువ వేడుక ఆబాల గోపాలానికీ నోరూరించే ఐస్క్రీమ్ తరతరాలకు తియ్యని రుచుల కానుక ప్రపంచవ్యాప్తంగా ఐస్క్రీమ్ ఒక భావోద్వేగం తియ్యని చల్లని ఐస్క్రీమ్ ఒక మధురోత్సాహం! స్కూల్ విడిచిపెట్టగానే ముందు సందులోనూ..సెలవలొచ్చి ఇంట్లో ఉంటే, వీధి చివరి సందులోనూ..ప్రత్యేకమైన ఒక బెల్ మోగుతుంటుంది. అది వినగానే పిల్లలకు ఆకలి మొదలైపోతుంది! అది అట్టాంటి ఇట్టాంటి ఆకలి కాదు,కేవలం ఐస్క్రీమ్ ఆకలి! ఆరు నూరైనా ఐస్క్రీమ్ తింటేనే తీరుతుంది! ఇక ఆ బెల్ ఏ బండిదో చెప్పుకోనక్కర్లేదు కదూ! నిజానికి ఆ శబ్దం– పెద్దలను కూడా బాల్యానికి నెడుతుంది! సందర్భమేమీ లేకపోయినా, ఉన్నపళంగా కుటుంబంలో తియ్యని వేడుకను సృష్టించగలుగుతుంది! అదే ఐస్క్రీమ్కి ఉన్న క్రేజ్!‘పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి’ అంటారు పెద్దలు. అయితే నోరూరించే తియ్యదనం, నాలుకపై చిందులేసే చల్లదనం ఊహల్లో మెదలగానే, అన్ని జిహ్వలు కోరేది ఒక్కటే– ఐస్క్రీమ్! అది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒక మధురానుభూతి!శీతల పానీయాల నుంచి హిమక్రీములకు సాగిన ఐస్క్రీమ్ చరిత్ర– ఐస్క్రీమ్ తిన్నంత తియ్యగా ఉంటుంది. నిజానికి ఐస్క్రీమ్, సరిగ్గా ఎప్పుడు మొదలైంది? ఎవరు కనిపెట్టారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోయినా, క్రీ.పూ. 4 వేల సంవత్సరాల కాలంలోనే మనిషి చల్లని రుచులను ఆస్వాదించడం మొదలుపెట్టాడట! ‘టర్కీ–సిరియా–ఇరాక్ దేశాల గుండా ప్రవహించే టైగ్రిస్, యూఫ్రటిస్ నదుల పరివాహక ప్రాంతమైన మెసపొటేమియాను ‘ప్రపంచ నాగరికతకు పుట్టినిల్లు’గా గుర్తిస్తారు! అందులో భాగమైన దక్షిణ ఇరాక్లోని యూఫ్రటిస్ నది సమీపంలో ఎల్లవేళలా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ జీవనం సాగించిన, క్రీ.పూ. ఐదో శతాబ్దం నాటికి పర్షియన్లు తమ నివాసాలను చల్లబరచుకోవడానికి, రాత్రి వేళల్లో సహజంగా ఏర్పడిన మంచును భూగర్భంలో నిల్వ చేసుకుని, వాడుకునేవారు. కాలక్రమేణా ‘యఖ్చాల్’ అనే హిమగృహాలను ఏర్పాటు చేసుకునేవారు. సాంకేతికాభివృద్ధి పెరిగి, రిఫ్రిజిరేటర్స్ వాడుకలోకి వచ్చాక ఐస్క్రీమ్ చరిత్ర చల్లని మలుపు తిరిగింది.క్రీ.పూ. ఐదో శతాబ్దంలో గ్రీకు రాజధాని ఏథెన్స్ ్సలో వైన్స్ ను చల్లబరచడానికి మంచును విక్రయించేవారట! మరోవైపు ఒకటో శతాబ్దానికి చెందిన రోమన్స్ చక్రవర్తి నీరో– తేనెతో కూడిన చల్లని పానీయాలను ఆస్వాదించేవాడు. చైనాలో టాంగ్ రాజవంశీకుల కాలంలో కర్పూరం కలిపిన గేదె పాలతో తియ్యటి పానీయాలు చేసుకుని, చల్లగా తాగేవారట! అలాగే పర్షియన్స్ వంటకమైన ‘ఫాలూదా’ శతాబ్దాల నాటిదని చరిత్ర చెబుతుంది. ఎందరో ఇష్టపడి ఆస్వాదించే చల్లచల్లని ‘షర్బత్’కి ఏళ్లనాటి అరబిక్ మూలాలున్నాయి. తర్వాత తర్వాత చల్లగా తాగే తీపి పదార్థాలను గడ్డ కట్టించి ఐస్క్రీమ్లా ఆస్వాదించడం మొదలైంది. ఈ క్రమంలోనే భారత్లో మొఘల్ చక్రవర్తులు ‘కుల్ఫీ’ని ఇష్టంగా తినేవారట. ఇది పాల మీగడను గడ్డకట్టించి, తయారు చేసే ఒక రకమైన ఐస్క్రీమ్!పాప్సికిల్ – ఓ అనుకోని రుచిపాప్సికిల్ (పుల్ల ఐస్) చరిత్ర చాలా ఆసక్తికరంగా, అనుకోని రీతిలో మొదలైంది. ఫ్రాంక్ ఎపర్సన్స్ అనే పదకొండేళ్ల కుర్రాడు, దీనిని 1905లో తొలిసారి కనుగొన్నాడు. శీతకాలంలో ఒక రాత్రి– ఫ్రాంక్ తన పెరట్లో సోడా పౌడర్, నీళ్లు కలిపిన గ్లాసును, ఆ నీళ్లను కలపడానికి వాడే ఒక పుల్లతో సహా ఆరుబయట అలాగే వదిలేశాడు. తెల్లవారేసరికి, గ్లాసులోని మిశ్రమం రంగులో గడ్డకట్టి, పుల్లతో సహా చేతిలోకొచ్చిందట. దానిని కాస్త రుచి చూస్తే అదిరిపోయిందట! దానికి ‘ఎప్సికిల్’ అని పేరుపెట్టాడు ఫ్రాంక్. ఆ రుచిని వెంటనే తన స్నేహితులకు, పక్కింటి పిల్లలకు పరిచయం చేశాడు. వాళ్లు కూడా ఇష్టంగా తిన్నారు.1922లో కాలిఫోర్నియా, ఆక్లండ్లో జరిగిన ఒక డ్యాన్స్ ్స పార్టీలో పాల్గొన్నవారందరికీ ‘ఫ్రాంక్ ఎపర్సన్స్ ’ తాను తయారు చేసిన పాప్సికిల్ రుచిని తొలిసారి పరిచయం చేశాడు. వారంతా ఆ రుచిని ఎంతో ఇష్టపడ్డారు. ఆ క్రేజ్తోనే ఆ మరుసటి ఏడాది దానిపై పేటెంట్ పొందాడు ఫ్రాంక్. ఆ రోజుల్లో, పాప్సికిల్ను ఎక్కువగా స్ట్రాబెర్రీ, నారింజ, చెర్రీ వంటి పండ్ల రుచులలో తయారు చేసుకునేవారు. కాలక్రమేణా ఈ పుల్ల ఐస్ చిన్ననాటి జ్ఞాపకాలకు, వేసవి వినోదానికి గుర్తుగా మారింది.హిమక్రీములు విశేషాలువాతావరణం వేడెక్కుతున్నప్పుడు, ఎక్కువగా ఐస్క్రీమ్ తినడం సహజమే! శతాబ్దాలుగా అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని పంచుతున్న ఈ తియ్యని, చల్లని పదార్థం కేవలం రుచికే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలకూ బెస్టేనట. ఒకటి లేదా రెండు హెల్దీ ఐస్క్రీమ్ స్కూప్లను తింటే తప్పేమీ లేదట. ప్రమాదమేమీ కాదట!ఇంటర్నేషనల్ డైరీ ఫుడ్స్ అసోసియేషన్స్ ప్రకారం, సగటు అమెరికన్స్ సంవత్సరానికి 20 పౌండ్ల ఐస్ క్రీమ్ను తింటాడట. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందట!పాల పదార్థాలతో చేసిన ఐస్క్రీమ్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఐస్క్రీమ్ కొనుగోలు చేసేటప్పుడు ‘ప్రోబయోటిక్ ఐస్క్రీమ్’ లేదా ‘లైవ్ అండ్ యాక్టివ్ కల్చర్స్’ వంటి లేబుల్ ఉందో లేదో చూసి కొనుగోలు చేయడం మంచిది.ఐస్క్రీమ్తో రికార్డ్స్!ఐస్క్రీమ్ అంటే ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. అయితే, కొందరు ఐస్క్రీమ్ను కేవలం తినడమే కాకుండా, దానితో ప్రపంచ రికార్డులను సైతం సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైన ఐస్క్రీమ్ అద్భుతాలను చూద్దాం!నిమిషంలో చప్పరించేవాడుఐస్ ఎక్కువగా తిన్నా, వేగంగా తిన్నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. తలలోంచి తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాంటిది ఐజాక్ హార్డింగ్ డేవిస్ అనే వ్యక్తి 2017 జూలై 16న కేవలం ఒక నిమిషంలో 806 గ్రాముల ఐస్క్రీమ్ను లాగించేసి, వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.నోరూరించే అతిపెద్ద స్కూప్సాధారణంగా ఐస్క్రీమ్ లవర్స్కి పెద్ద స్కూప్ చూస్తే భలే సంబరంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ‘కెంప్స్’ అనే సంస్థ, 2014 జూన్ 28న తన శత వార్షికోత్సవ వేడుకల్లో అతిపెద్ద స్కూప్ని ప్రదర్శించింది. ‘విస్కాన్సిన్స్ లోని సెడార్బర్గ్ స్ట్రాబెర్రీ ఫెస్టివల్’లో 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 6 అడుగుల 2 అంగుళాల వెడల్పుతో భారీ స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్ స్కూప్ను తయారుచేసి, రికార్డు సృష్టించింది.ఎత్తైన కోన్ ఐస్క్రీమ్ఎంతపెద్ద కోన్ ఐస్క్రీమ్ అయినా అరచేతి సైజుకి మించదు. అలాంటిది 10 అడుగుల 1.26 అంగుళాల ఎత్తైన కోన్ ఐస్క్రీమ్ని సృష్టించారు నార్వేకు చెందిన హెనిగ్ ఓల్సెన్, ట్రోండ్ ఎల్. వాయిన్ అనే ఇద్దరు స్నేహితులు 2015 జూలై 26న ఈ భారీ కోన్ ఐస్క్రీమ్ను సృష్టించి రికార్డ్ సాధించారు.ఒక కోన్స్ పై అత్యధిక స్కూప్లుఒక ఐస్క్రీమ్ కోన్స్ పై సాధ్యమైనన్ని ఎక్కువ స్కూప్లను పేర్చడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటలీకి చెందిన దిమిత్రి పాన్చెరా సాధించిన రికార్డ్ను మాత్రం ఎవ్వరూ కొట్టలేరనిపిస్తుంది. ఎందుకంటే, గతంలో తాను సృష్టించిన రికార్డ్ని తానే బద్దలుకొట్టాడు. అతడు 2018, నవంబర్ 17న ఒకే కోనుపై 125 స్కూపులను నిలిపి రికార్డ్ సృష్టించాడు. అయితే గతంలో 121 స్కూపులను నిలిపి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాడు.పొడవాటి తియ్యని వేడుక2011 జూలై 23న యూకేలోని పోర్ట్ స్టీవర్ట్లో ‘మోరెల్లి ఐస్క్రీమ్ షాప్’ ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించింది. ఆ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా 2,728 మందిని ఒక చోటికి చేర్చి; ప్రతి ఒక్కరికీ ఐస్క్రీమ్ కప్స్ ఇచ్చి, ఒకరికి ఒకరు తినిపించుకోమని చెప్పింది. అలా 2,728 మందీ పొడవాటి మానవహారంలా నిలబడి, ఒకరికొకరు ఐస్క్రీమ్ తినిపించుకోవడంతో అది ప్రపంచ రికార్డ్గా నిలిచింది.ఐస్క్రీమ్ కోన్లా మారిన మనుషులుచైనాలో నెస్లే లిమిటెడ్ ఐస్క్రీమ్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వినూత్న రికార్డ్ సృష్టించింది. 2019, డిసెంబర్ 18న రెండు వేరువేరు రంగుల దుస్తులు ధరించిన 478 మందికి జనం ఒక భారీ ఐస్క్రీమ్ కోన్స్ ను రూపొందించారు. ఇది గిన్నిస్ రికార్డ్ సృష్టించింది.ఐస్క్రీమ్ కాన్వాయ్ సాధారణంగా ఐస్క్రీమ్ బండి వేసే హారన్ కూడా మనసులో ప్రత్యేకమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. బాల్యంలోని రుచులన్నింటినీ గుర్తు చేస్తుంది. అందుకే యూకేలో 2018 అక్టోబర్ 16న ‘ది ఐస్క్రీమ్ వ్యాన్ డ్రీమ్ టీమ్’ అనే బృందం 84 ఐస్క్రీమ్ ట్రక్కులు, వ్యాన్లతో ఒకేసారి భారీ ఊరేగింపు చేసి, అద్భుతమైన ప్రపంచ రికార్డును సృష్టించింది.ఐస్క్రీమ్ శతాబ్దాల పాటు ఒక ప్రత్యేకమైన, ఖరీదైన విలాసవంతమైన ఆహారంగా ఉండేది. చౌకైన రిఫ్రిజిరేటర్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేంత వరకు ఐస్క్రీమ్ లగ్జరీ రుచే! సాంకేతికత అందుబాటులోకి వచ్చాకే ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఐస్క్రీమ్ను రుచి చూడగలుగుతున్నారు.మరో అమెరికన్ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఐస్క్రీమ్ మీద ప్రేమతో జూలై నెలను ఐస్క్రీమ్ నెలగా ప్రకటించాడు. జూలై మూడో ఆదివారాన్ని ‘ఐస్క్రీమ్ డే’గా ప్రకటించాడు.ఐస్క్రీమ్ను అత్యధికంగా తినే దేశాలలో యునైటెడ్ స్టేట్స్ రెండో స్థానంలో ఉంది. తొలిస్థానం న్యూజీలండ్దట. అక్కడ సంవత్సరానికి సగటున ప్రతి వ్యక్తి సుమారు 20 నుంచి 22 కేజీల ఐస్క్రీమ్ను తింటున్నారట.ఐస్క్రీమ్లో కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్లతో పాటు విటమిన్స్ ఎ, డి, బి12 వంటివి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఒత్తిడి, ఆందోళన, విచారం ఉన్నప్పుడు చాలామంది ఐస్క్రీమ్ వైపు మొగ్గు చూపుతారట. ఐస్క్రీమ్ డోపమైన్, సెరోటోనిన్స్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. వీటిని ‘ఫీల్–గుడ్’ హార్మోన్లు అంటారు. అందుకే అప్పుడప్పుడు ఈ తియ్యని, చల్లని ట్రీట్ను ఆస్వాదించి, మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు.మూడు నుంచి నాలుగు కేజీల ఐస్క్రీమ్ ఉత్పత్తికి, సుమారు 10 నుంచి 12 లీటర్ల పాలు అవసరమవుతాయి.థామస్ జెఫర్సన్స్ – అమెరికా అధ్యక్షుడు కావడానికి కొన్నేళ్ల ముందు ఫ్రాన్స్్సలో అమెరికా రాయబారిగా పనిచేసేవాడు. అక్కడ ఆయన వెనీలా ఐస్క్రీమ్ తొలిసారి రుచి చూసి మైమరచిపోయాడు. ఆ వెంటనే ఆ రెసిపీ తయారీ విధానాన్ని నోట్ చేసుకుని మరీ, అమెరికా వంటకాల్లో భాగం చేసేశాడు. ఇక ఆ తర్వాత తన విందు భోజనాల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక కప్పు ఐస్క్రీమ్ ఉండేలా చూసుకునేవాడు.థామస్ జెఫర్సన్స్ అప్పటికే పరిచయం చేసిన ఆ ఐస్క్రీమ్ రుచి కోసం అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్స్ తపించిపోయేవాడట! ఆయన అధికారంలోకి రాగానే, వైట్హౌస్లో ఐస్క్రీమ్ తయారీ పరికరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్నాడు.ఐస్క్రీమ్పైన చాక్లెట్ సిరప్ వేస్తే చాలామందికి నచ్చుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ సిరప్.. ఐస్క్రీమ్ రుచిని మరింత పెంచుతుంది.ఐస్క్రీమ్ రుచిని పరీక్షించే నిపుణులు బంగారు చెంచాలను ఉపయోగిస్తారు. దీనికి కారణం, ఇతర లోహాలతో తయారు చేసిన చెంచాలు ఐస్క్రీమ్ రుచిని సూక్ష్మంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఐస్క్రీమ్ అసలు రుచిని ఏమాత్రం మిస్ కాకుండా ఉండటానికే బంగారు చెంచాలను ఉపయోగిస్తారు.బరాక్ ఒబామాఅమెరికా అధ్యక్షుడిగా మారడానికి ముందు, బరాక్ ఒబామా హవాయిలోని హోనోలులులో ఉన్న ఒక బాస్కిన్–రాబిన్స్ ్స ఐస్క్రీమ్ పార్లర్లో పనిచేశారు. ఈ ఉద్యోగం తనకు బాధ్యతలను నేర్పిందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.జూలియా రాబర్ట్స్ప్రముఖ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా ఒకప్పుడు ఐస్క్రీమ్ స్కూప్ చేస్తూ పనిచేశారట. ‘మిస్టిక్ పిజ్జా’ చిత్రంలో ఆమె పాత్ర ప్రస్తావనతో పాటు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా!జూలియా లూయీ–డ్రైఫన్‘కమేడియన్స్ ్స ఇన్ కార్స్ గెట్టింగ్ కాఫీ’ అనే కార్యక్రమంలో ప్రముఖ నటి జూలియా లూయీ–డ్రైఫస్ తన ఐస్క్రీమ్ పార్లర్ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె స్వెన్స్ సెన్స్ ్స అనే ఐస్క్రీమ్ పార్లర్లో పనిచేసినట్లు వెల్లడించారు. ఆమె ఎమ్మీ అవార్డు గ్రహీతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.బాబీ ఫ్లే – ప్రసిద్ధ అమెరికన్ షెఫ్, టీవీ పర్సనాలిటీ అయిన బాబీ ఫ్లే కూడా యువకుడిగా ఉన్నప్పుడు ఐస్క్రీమ్ స్కూపర్గా పనిచేశారు. హిమక్రీముల క్రేజు‘ఐస్క్రీమ్ రుచుల కోసం మనుషులే కాదు, యమలోకం నుంచి యముడైనా కదిలి రావాల్సిందే’ అన్నట్లు నటించారు ‘యమలీల’ చిత్రంలోని కైకాల సత్యనారాయణ. ఆ సినిమాలో ఆయన ‘హిమక్రీములున్నాయా నాయనా?’ అంటూ ఐస్క్రీముల కోసం తపించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం 1994లో విడుదలైంది. ఈ ఒక్క సన్నివేశంతో ఆనాడు ఐస్క్రీమ్ పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ను స్పష్టంగా తెలియజేస్తుంది. నిజానికి, హిమక్రీములంటే జనాల్లో నేటికీ అదే మోజుంది, అదే క్రేజుంది!ఐస్క్రీమ్ గురించి విన్నా, చూసినా, చదివినా వెంటనే తినాలనిపించే అనుభూతి కలగడం సహజం! చల్లని తియ్యని రుచులను కోరుకునే వారు ఇంట్లోనే ఐస్క్రీమ్ తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లోనే సులభంగా ఐస్క్రీమ్స్ చేసుకునే మేకర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి! మరోవైపు బయట అమ్ముడయ్యే కొన్నిరకాల ఐస్క్రీములు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు! ఇక ఇంట్లో ఐస్క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు పంచదార, ఐస్క్రీమ్ ఎసెన్స్ వంటివి ఆరోగ్యానికి అనర్థం అనుకుంటే, వాటిని కలపకుండా కూడా ఐస్క్రీమ్ చేసుకోవచ్చు. తియ్యటి పండ్లతోనో, కమ్మటి కూరగాయలతోనో మెత్తటి గుజ్జు చేసుకుని, దానిలో తేనెనో, ఖర్జూరాలో, బెల్లం తురుమో జోడించి డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఇంటిల్లిపాది చల్లని వేడుక చేసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు ఇష్టంగా తినని పిల్లలతో ఇలా కూడా తినిపించొచ్చు. అయినా తియ్యని, చల్లని ఐస్క్రీమ్ రుచిని కాదనేవారు ఎవరుంటారు?ఐస్క్రీమ్ పార్లర్లలో పనిచేసిన ప్రముఖులుఉన్నతమైన స్థానాలకు వెళ్లిన చాలామంది జీవితాల్లో ఆర్థిక కష్టాలు చాలానే ఉంటాయి. తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి చిన్నా చితకా పనులతో కాలం వెళ్లదీసిన ప్రముఖులు ఎందరో ఉంటారు. కొందరు ప్రముఖులు తమ కెరీర్ ప్రారంభంలో ఐస్క్రీమ్ పార్లర్లలో పనిచేశారు. వారిలో కొందరి ప్రముఖుల వివరాలు చూద్దాం. -
పూజారి – మేక!
వైశాలి రాజ్యంలోని కందవరం గ్రామంలో ఒక పూజారి ఉండేవాడు. అతని పేరు సుధాకరుడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్లి స్నానమాచరించి, ఊరిలో ఉన్న గుడిలో పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ ఊరిలోనే శరభయ్య అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను సమీపంలోని అడవిలో ఉండే పక్షులను, జంతువులను వేటాడి; వాటిని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. పూజారి ప్రతిరోజూ నదీ స్నానం అనంతరం సమీప అడవిలో ఉన్న వివిధ రకాల పూలను సేకరించి పూజకు తీసుకువెళుతూ ఉండేవాడు. ఒకరోజు నదికి వెళుతుండగా, ఎక్కడి నుంచో ఒక మేక పూజారి దగ్గరకు వచ్చి, అతనిని అనుసరించ సాగింది. ఎన్నిసార్లు దాన్ని అదిలించినా, అది వెళ్లిపోకుండా అతనినే అనుసరించింది. చేసేదిలేక దానిని కూడా తనతో పాటు తీసుకు వెళ్ళాడు ఆ పూజరి. ఆ రోజు మొదలు ప్రతిరోజూ పూజారి దగ్గరే ఉంటూ, పూజారితో పాటు నదీ స్నానానికి వచ్చి, పూజారి స్నానం చేస్తుండగా ఆ పరిసరాల్లో ఉన్న ఆహారాన్ని తిని, తిరిగి పూజారితోపాటు గుడికి వెళ్ళేది. ఇలా కొంతకాలం గడిచింది.ఒకరోజు ఎప్పటి మాదిరిగానే పూజారిని అనుసరించి మేక నది వైపు బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత మేక వస్తున్న అలికిడి లేకపోవడంతో పూజారి వెనుతిరిగి చూశాడు. మేక కనిపించలేదు! కంగారుగా నాలుగు వైపులా వెతికాడు. చివరకు ఒక మూల చెట్టుకి కట్టేసి కనపడింది. వెంటనే వెళ్లి, దాని కట్లు విప్పదీశాడు. మేకని తీసుకుని వెళుతుండగా, ‘ఓ పూజారిగారు! ఆగండి... ఆగండి... ఏంటిది? దాన్ని తీసుకుపోతున్నారు? ఆ మేక నాది’ అన్నాడు శరభయ్య. ‘ఏంటి, ఈ మేక నీదా? ఇది ఎప్పటి నుంచో నాతో పాటు ఉంటోంది. ప్రతిరోజూ నా వెంబడి నది స్నానానికి వస్తోంది. ఈరోజు కూడా అలానే వస్తుంటే, దాన్ని పట్టి బంధించిందే కాకుండా, నీది అంటావా?’ అని పూజారి అన్నాడు.‘లేదు లేదు... అది నాది’ అని దగ్గరకు రాబోతున్న శరభయ్యను తప్పించుకుని మేకను భుజాన వేసుకుని, ఆగకుండా వెళ్ళిపోయాడు పూజారి.వెంటనే శరభయ్య రాజుగారి దగ్గరికి వెళ్లి పూజారి మీద ఫిర్యాదు చేశాడు. రాజుగారి భటులు పూజారి వద్దకు వచ్చి ‘నీ మీద అభియోగం వచ్చింది. నీ దగ్గర ఉన్న మేక నీది కాదని శరభయ్య ఫిర్యాదు చేశాడు. మేకతో సహా రావాలని రాజుగారి ఆజ్ఞ!’ అన్నారు.అలాగేనంటూ పూజారి మేకతో సహా రాజుగారి ఆస్థానానికి చేరుకున్నాడు. ‘ప్రణామాలు మహారాజా! పిలిపించారట’ అనగానే, మంత్రి కలగజేసుకొని ‘శరభయ్య తన మేకను తీసుకున్నావని నీ మీద అభియోగం మోపాడు. దీనికి నీ సమాధానం?’ అన్నాడు.‘మహారాజా! ఆ మేక నిజానికి నాది కూడా కాదు! ఒక రోజు నదీస్నానం చేసి, పూజ కోసం అడవిలో పూలు కోయడానికి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చింది. నేను ఎంత ప్రయత్నించినా వెళ్లకుండా, అప్పటి నుంచి నా వద్దే ఉంటోంది. అంతేగాని, ఈ శరభయ్య చెప్పినట్లు అది అతనిది కూడా కాదు’ చెప్పాడు ఆ పూజారి. ‘నువ్వు చెప్పిన దానికి ఏమైనా సాక్ష్యం ఉందా?’ అడిగాడు మంత్రి. ‘లేదు మహారాజా!’ అన్నాడు పూజారి.‘మరైతే నీదే అని సాక్ష్యం లేనప్పుడు మరెలా?’ అన్నాడు మంత్రి. ‘ఒక పని చేయండి మహారాజా! ఈ మేక కళ్లకు గంతలు కట్టండి. ఒకవైపు నన్ను, మరొకవైపు శరభయ్యను ఉంచండి. తన యజమాని ఎవరో వాసన పసిగట్టి గుర్తించే గుణం పెంపుడు జంతువులకు ఉంటుంది అప్పుడు అది వారి వద్దకు వెళుతుంది’ అన్నాడు పూజారి. ‘నువ్వు చెప్పినది సబబుగానే ఉంది’ అని మంత్రి, ‘వెంటనే మేక కళ్ళకు నల్లని గుడ్డతో గంతలు కట్టండి’ అని భటులను ఆదేశించాడు.వారు మేక కళ్లకు గంతలు కట్టారు. మొదట శరభయ్య వద్దకు, ఆ తర్వాత పూజారి వద్దకు మేకను తీసుకువెళ్లారు. శరభయ్య వద్దకు తీసుకెళ్లినప్పుడు ఏ స్పందన లేని మేక, పూజారి వద్దకు తీసుకు వెళ్ళగానే తన ముక్కుతో వాసన పిలుస్తూ, నాలుకతో పూజారి కాలిని నాకసాగింది. తర్వాత దానిని ఒక భటుని వద్దకు కూడా తీసుకువెళ్లారు. అప్పుడు కూడా అది ఏమీ చేయకుండా, అలాగే నిలబడింది. ఏ రకమైన స్పందన చూపలేదు.వెంటనే మహారాజు ‘ఆ మేక పూజారిదే’ అని తీర్పునిచ్చాడు. ‘శరభయ్యను బంధించండి’ అని భటులను ఆదేశించాడు. అతడు చేసిన తప్పును మన్నించి, అతడిని విడిచిపెట్టండి మహారాజా!’ అని పూజారి వేడుకున్నాడు.‘చూశావా, శరభయ్యా! నువ్వు పూజారి మీద అభియోగం మోపినా, నీ మీద కోపం లేకుండా, నిన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇప్పటి నుంచైనా జంతువుల వేట మానుకుని, ఏదైనా పని చేసి బతుకు’ అని శరభయ్యను దండించకుండా వదిలేశాడు మహారాజు. పూజారిని అభినందిస్తూ, ఘనంగా సన్మానం చేశాడు. అప్పటి నుంచి శరభయ్య జంతువుల వేటను మాని, వ్యవసాయం చేస్తూ జీవించసాగాడు. -
ఈ ఉత్సవం.. ఉత్కంఠభరితం!
ప్రపంచ సాహస ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే వేడుకల్లో శాన్ ఫర్మిన్ ఫెస్టివల్ ముందు వరసలోనే ఉంటుంది. ఇది ప్రతి ఏడాది స్పెయిన్ లోని పాంప్లోనాలో జూలై 6 నుంచి 14 వరకు జరుగుతుంది. ఈ ఉత్సవంలో బుల్ రన్ (ఎన్సియెర్రో) ప్రధానంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ వేడుకలో ఎద్దులను వీధుల్లోకి వదిలి, వందలాది మంది ప్రజలు వాటి వెంట పరిగెడతారు.ఇది అత్యంత ఉత్కంఠభరితమైన పోటీ. ఉదయం 8 గంటలకు బలమైన ఎద్దులను వదులుతారు. వేలాది మంది ధైర్యవంతులు వాటి ముందు పరిగెడతారు. ఈ పరుగు అత్యంత ప్రమాదభరితమైనది. ప్రతి సంవత్సరం గాయాల పాలైనవారు చాలామంది ఉంటారు, కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంది. అయినప్పటికీ, ఈ అనుభూతిని పొందాలని చాలామంది కోరుకుంటారు.ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు, ‘చుపింజో’ అనే ఒక రాకెట్ పేల్చడంతో పాంప్లోనా నగరం మొత్తం ఉత్సాహంతో నిండిపోతుంది. ఆ తర్వాత వారం రోజుల పాటు సంగీత కచేరీలు, సాంప్రదాయ నృత్యాలు, ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు, మతపరమైన ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలో అంతా తెలుపు ఎరుపు రంగు దుస్తులనే ధరిస్తారు. దాంతో వీధులన్నీ ఎరుపు, తెలుపు రంగుల్లో మెరుస్తాయి. మరోవైపు ‘జిగాంటెస్ జెయింట్స్’ అని పిలవబడే పెద్దపెద్ద బొమ్మలు రాజులు, రాణులు, చారిత్రక వ్యక్తుల రూపంతో నెమ్మదిగా నడుస్తూ ఊరేగింపులో పాల్గొంటాయి. వీటిని చూడటానికి పిల్లలు, పెద్దలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. -
ట్రిపుల్ సెంచరీ మామిడి చెట్టు
చెట్టు ఒక్కటే కానీ, అందులోని ఒక్కో పండు ఒక్కోరకం సినిమాలా కనిపిస్తుంది. ఒకటి రొమా¯Œ ్స, మరొకటి యాక్షన్, ఇంకొకటి కామెడీ! మొత్తం 300 కథలు, 300 రుచులు, 300 క్యారెక్టర్లతో మల్టీప్లెక్స్ను తలపిస్తుంది ఈ మామిడి చెట్టు. ఆ మల్టీప్లెక్స్ క్రియేటర్, డైరెక్టర్, ఓనర్... ‘మామిడి మాస్టర్’ కలీముల్లా ఖాన్ !మలీహాబాద్లో అతన్ని అందరూ ‘మ్యాంగో మేన్’ అంటారు. వయసు 82. వయసులో వృద్ధుడే అయినా, మామిడి మీద ఆయన ప్రేమలో మాత్రం నిత్యయవ్వనం తొణికిసలాడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, తోటపని చేస్తాడు. ఆ తర్వాత అలసిపోయి, నిద్రపోతాడు. ఆ నిద్రలో వచ్చే కలల్లో కూడా తన 120 ఏళ్ల మామిడి చెట్టుతోనే కాలక్షేపం చేస్తాడు. చెప్పుకోడానికి చెట్టు ఒకటే కాని, ఆ చెట్టుకే తాను వేసిన అంటు కొమ్మలకు మూడు వందల రకాల మామిళ్లు కాస్తున్నాయి. ఒక్క చెట్టులోనే ఇన్ని రకాలా? అని చూసినవారు నోరెళ్లబెడుతుంటారు. కరీముల్లాకు మాత్రం ఆ చెట్టు పండ్లు కన్నబిడ్డల్లాంటివి. అందుకే, వాటికి పేర్లు కూడా పెడతాడు. ఒక రకం మామిడికి ‘ఐశ్వర్యా’ అని పేరు పెట్టాడు – బాలీవుడ్ నటి గుర్తుందా? ఆమె పేరునే ఒక మామిడి రకానికి పెట్టాడు. (సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు)ఎందుకంటే ఆ పండు చూసినా, తిన్నా, తీయదనం చూసినా, ప్రేమలో పడేలా ఉంటుందట! ఒక కిలోకు మించిన బరువు, చర్మం మీద ముదురు ఎరుపు రంగుతో ఉంటుంది. ఇంకొకటి ‘సచిన్ మామిడి’– అది తింటే స్టేడియంలో సెంచరీ కొట్టినట్టే! పొట్టిగా ఉన్నా చాలా రుచిగా ఉంటుంది. ‘మోదీ మామిడి’ కూడా ఉంది– ఇది బాగా బలంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వాసనలతో ఉంటుందని. ఇంకో మామిడికి ‘అనార్కలి’ అని పేరు పెట్టాడు. ఇలా మొత్తం మామిడి రకాలకు పేర్లు పెట్టాడు. తాజాగా ‘రాజ్నాథ్ మామిడి’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరుతో కొత్త రకం మామిడి పండింది. ఇతని కృషికి మెచ్చి ప్రభుత్వం 2008లో పద్మశ్రీ ఇచ్చింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా కలీముల్లా ఖాన్కు నాలుగు వందలకు పైగా అవార్డులు ఉద్యాన విభాగంలో వచ్చాయి. అసలు రహస్యం!ఇదంతా అతని గ్రాఫ్టింగ్ టెక్నిక్ వలనే సాధ్యం అయింది. అంటే, మామిడి చెట్టులో ఒక కొమ్మను చెక్కి, దానిలో మరో రకానికి చెందిన మామిడి కొమ్మను అంటుకట్టి, టేప్ పెడతాడు, అది చెట్టులో కలిసి ఎదిగేలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ కొమ్మ కలిసిపోయిన తర్వాత, రెండేళ్లలో కొత్త మామిడి రకం జన్మిస్తుంది. ఇదంతా తన తాత తనకు నేర్పాడట! పద్దెనెమిదేళ్ల వయసులో కలీముల్లా అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాడు. అప్పటి నుంచి గత ఆరు దశాబ్దాలుగా వివిధ రకాల కొమ్మలను అంటు కడుతూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. రసాయనాలు చల్లి పండ్లు పండించకుండా, చెట్టుతో మాట్లాడుతూ, ప్రేమగా పెంచుతున్నాడు. అందుకే ఆ చెట్టు కూడా వివిధ రకాల మామిళ్లతో తిరిగి, ప్రేమను అందిస్తోంది. ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ప్రస్తుతం ఆ చెట్టు తొమ్మిది మీటర్ల ఎత్తులో నిలబడి, చల్లని నీడను ఇస్తోంది. చెట్టు ఆకులు కూడా ఒక్కో చోట ఒక్కో రంగులో కనిపిస్తాయి. ఒకచోట ముదురాకుపచ్చ, ఇంకోచోట మెరిసే పసుపు ఆకులు, మరోచోట ముదురు ఊదా ఆకులు– ఇలా కేవలం ఆకులు మాత్రమే కాదు, ఈ చెట్టు పండ్లు వెదజల్లే పరిమళాలు కూడా వేర్వేరు. చివరగా కరీముల్లా మాటల్లో – ‘మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కాని, ఈ మామిళ్లు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. వాటి వాసనలో, రుచిలో, పేర్లల్లో ఎన్నో కథలు దాగున్నాయి. అచ్చం మన వేలిముద్రల్లాగానే ఒక్కో మామిడి ఒక్కో రకం’. పనిలో పనిగా మీరు చెప్పండి – మీకిష్టమైన మామిడి ఏది? ‘ఐశ్వర్యా’ తినాలనిపిస్తుందా? లేక ‘సచిన్’ను రుచి చూస్తారా? -
లిటిల్ ఫైర్ఫైటర్!
ఉదయం లేవగానే చాలామంది పిల్లల్లో గేమ్ మోడ్ ఆన్ అవుతుంది. బకెట్లో వేడి నీళ్లు సిద్ధం అయ్యేలోపే ‘పబ్జీ’లో స్క్వాడ్ రెడీ చేసేసుకుంటారు. లంచ్బాక్స్ చేతికి వచ్చే సమయానికి ‘ఫోర్ట్నైట్’లో నాలుగు ఫైటింగ్ స్టంట్స్ చేసేసి ఉంటారు. ఇలా చాలామంది ఇళ్లల్లో స్క్రీన్ బ్రైట్నెస్తో గది మెరిసిపోతుంటే, వర్జీనియాలో ఉండే రోమిర్ అనే పన్నెండేళ్ల అబ్బాయి ఇంట్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి. గేమ్లో పొగలు వస్తే అలర్ట్ మోడ్కి వెళ్లిన ట్లు, అచ్చం అలాగే, రియల్ లైఫ్లోనూ ఆపదలో చిక్కుకున్నవారిని కాపాడే మోడ్ను రోమిర్ యాక్టివేట్ చేశాడు. చేతిలో గన్ లేకపోయినా, అసలైన ధైర్యం, మెదడులో మెగాబైట్ల బుద్ధి ఉపయోగించి, వెంటనే ఫైర్స్టేషన్ కు ఫోన్ చేశాడు. ‘ఎవరో వస్తారు, ఏదో చేస్తారు’ అని హీరో అనుకోడు కదా! అందుకే, సోఫాలో నిద్రపోతున్న ఇద్దరు పిల్లలను, ఒక్క చేతిలో ఒకరిని, ఇంకొక చేతిలో ఇంకొకరిని ఎత్తుకొని, జెట్ స్పీడ్తో డోర్ దాటి బయటకు తెచ్చి, సురక్షిత ప్రాంతంలో ఉంచాడు. తర్వాత మళ్లీ లోపలికి వెళ్లి, మోకాళ్ల నొప్పులతో నడవలేని నాన్నమ్మను నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. ఫోన్ చేసిన నాలుగు నిమిషాల్లో అసలైన ఫైర్ఫైటర్లు వచ్చారు. కాని, అప్పటికే రోమిర్ రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాడు. అప్పుడు వాళ్లు చూసింది కాలిపోయిన ఇల్లు మాత్రమే కాదు, నల్లటి పొగలో మెరిసిపోతున్న చిన్న హీరోని కూడా. అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఒకటే మాట చెప్పింది ‘నీ టాలెంట్ మా ఫైర్ఫోర్స్లో చాలా అవసరం. నీకు పద్దెనిమిదేళ్లు వచ్చిన వెంటనే ఫైర్ఫైటర్ జాబ్ నీదే!’ అని. ఇలా రోమిర్ ఆడిన అసలైన అడ్వెంచర్ గేమ్– అతని జీవితాన్ని సెట్ చేయడమే కాదు, దీంతో అతడి స్కోర్ బోర్డ్లో ‘రోమిర్ – ది రియల్ లైఫ్ ఫైర్ ఫైటర్!’ అనే టైటిల్ కూడా జతపడింది. -
....ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి
∙నా వయసు ఇరవైఐదు సంవత్సరాలు. నాకు తరచు మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కారణం ఏమిటి? పరిష్కార మార్గాలు చెప్పండి. – కీర్తి, అనంతపురం. మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర వ్యవస్థలోకి బాక్టీరియా ప్రవేశించడం వల్ల కలిగే సమస్య. సాధారణంగా ఈ బాక్టీరియా బయట నుంచి యూరినరీ బ్లాడర్లోకి ప్రవేశిస్తే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు మరింత తీవ్రమవుతూ మూత్రనాళం మొత్తం పైకి, కిడ్నీల వరకు చేరుతుంది. దీనివలన మూత్రం పోతున్నప్పుడు మంటగా అనిపించడం, తరచుగా మూత్రం రావడం, నొప్పి ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ నీరు తాగటం, బయట తినే ఆహారం, శరీర శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వంటి వాటి వల్ల ఈ సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.రోజుకు కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. మసాలా, కారం ఎక్కువుండే ఆహార పదార్థాలు, చల్లని పానీయాలు, టీ, కాఫీ లాంటివి తగ్గించాలి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతాయి. జననేంద్రియ భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. సెంటు ఉన్న సబ్బులు, పరిమళభరిత పదార్థాలు వాడకూడదు. భర్తతో ఇంటర్కోర్స్ జరిగిన వెంటనే శుభ్రత పాటించాలి. మలవిసర్జన తర్వాత ముందువైపు నుంచి వెనుకవైపు వైపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. వెనుక నుంచి ముందుకు శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా బ్లాడర్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాటన్ అండర్వేర్ ధరించాలి. ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. స్నానం చేసిన తరువాత కూడా ఆ భాగాన్ని బాగా పొడిగా ఉంచుకోవాలి. కొంతమంది క్రమం తప్పకుండా వచ్చే ఇన్ఫెక్షన్లకు సహజమైన చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, తాజా పండ్ల రసాలు, బార్లీ నీరు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు రోజూ తీసుకోవచ్చు. ఇవి మూత్రనాళం శుభ్రంగా ఉండేలా చేస్తాయి. తరచు పొత్తి కడుపులో నొప్పిగా అనిపించటం, మూత్రంలో ముదురు రంగు, రక్తం కనిపించడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. జ్వరమొచ్చినా, నడుము నొప్పి ఉన్నా ఆలస్యం చేయకూడదు. మొదటి దశలోనే పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే సమస్య తిరిగి రాదు. అవసరమైతే మూత్రపరీక్షలో బాక్టీరియా ఏ రకమైనదో చూసి, దానికి సరిపడే మందులు మాత్రమే వాడాలి. ఇతర వైద్యం అవసరం లేకుండా, ఒత్తిడి తగ్గించి, శరీర శుభ్రతను పాటించడం ద్వారా చాలా వరకు నియంత్రించ వచ్చు. రాగానే తలనొప్పి నాకు గత రెండేళ్లుగా ప్రతి నెలా పీరియడ్ రాగానే తీవ్రమైన తలనొప్పి వస్తోంది. ఇది మైగ్రేన్∙ అంటున్నారు. ఇది ఎందుకు వస్తోంది? దానికి ఏమైనా పరిష్కారం ఉందా?– శారద, తిరుపతి. మీకు వస్తున్న తలనొప్పి సాధ్యమైనంత వరకు హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మైగ్రేన్ కావచ్చు. పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో తగ్గిపోతుంది. దాని ప్రభావంతో తలనొప్పి ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇది నాలుగు రోజుల ముందే మొదలై, పీరియడ్ మొదటి రెండు రోజుల వరకూ ఎక్కువగా ఉంటుంది. దీనిని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటారు. ఇది ఓ పద్ధతిలో వచ్చే తలనొప్పి కాబట్టి, మీరు ఒక డైరీ రాసుకోవాలి – ఎప్పుడు వస్తోంది, ఎంతసేపు ఉంటుంది, ఏమి తిన్నాక లేదా ఏ పరిస్థితుల్లో వస్తోంది అన్నదాన్ని గమనించాలి. ఆ వివరాలతో డాక్టర్ సరైన మందులు సూచిస్తారు. కొంతమంది మైగ్రేన్ రాకముందే కొన్ని రోజుల పాటు నాప్రోక్సెన్, ఐబుప్రొఫెన్ లాంటి నొప్పి నివారణ మాత్రలు వాడతారు. ఇవి శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భధారణ ఉన్నవారు అయితే, కొన్ని మందులు వాడకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భసంచయానికి అనుకూలంగా ఉండే ప్రొజెస్టెరాన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ సమయాల్లో మైగ్రేన్ ఎక్కువగా ఉంటే, ఆ రోజుల్లో తీసుకోవాల్సిన మందులు ప్రత్యేకంగా సూచిస్తారు. కొంతమందికి ఈస్ట్రోజన్ తక్కువ స్థాయిలో ఉండటం వల్లే ఇది వస్తుంది కాబట్టి, తగిన ఈస్ట్రోజన్ ప్యాచ్లు లేదా ఇతర మార్గాల్లో ఇచ్చే చికిత్సలు ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో ఏ మాత్రలు తీసుకోవాలో, ఏవి తీసుకోవద్దో వైద్యులే నిర్ణయిస్తారు. మైగ్రే తో పాటు వాంతులు, వికారం వంటి సమస్యలు ఉంటే, అటువంటి లక్షణాల కోసం ప్రత్యేక మందులు ఇస్తారు. తిండి మానేయకూడదు, ఆకలితో ఉండకూడదు. ప్రతిరోజూ ఒకే సమయంలో తినడం, నీరు ఎక్కువగా తాగడం, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడం అవసరం. ఒక నెలలో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మైగ్రేన్ వస్తున్నట్లయితే, రోజూ తీసుకునే ప్రివెంటివ్ మందులు అవసరమవుతాయి. ఈ మందుల్ని మొదటి మూడు నెలల పాటు వాడిన తరువాత, దాని ప్రభావాన్ని డాక్టర్ అంచనా వేస్తారు. దాని ఆధారంగా మందులు వాడాలి. -
ఎంసెట్ను ఎత్తిచూపాడు!
జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘నీట్’ అమలులోకి వచ్చే వరకు రాష్ట్రంలో మెడికల్ సీట్లు ‘ఎంసెట్’ ర్యాంకుల ఆధారంగానే భర్తీ అయ్యేవి. కొన్నేళ్లు సాగిన ఈ పరీక్షల ప్రశ్నపత్రాల్లోనూ సిరీస్లు ఉండేవి. మాల్ ప్రాక్టీస్ను నిరోధించడానికి ఉద్దేశించిన ఈ విధానంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. వీటిని విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, అధికారులు, నిపుణులు గుర్తించలేకపోయారు. అయితే 2010 ఎంసెట్ సందర్భంలో పోలీసులకు చిక్కిన హైటెక్ మాస్ కాపీయింగ్ గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించిన ఇంద్రసేన్ రెడ్డి విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించడంతో ‘ఎంసెట్’ పేపర్ల కూర్పులో మార్పులు జరిగాయి. ఆ ఏడాది హైదరాబాద్, కడపల్లో ఈ నిందితులు అరెస్టు అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తికి చెందిన గంగాధర్రెడ్డి, కడప వాసి గురివిరెడ్డి సూత్రధారులుగా ఏర్పడిన గ్యాంగ్ 2010 నాటి ఎంసెట్లో మెడిసిన్ అభ్యర్థుల హైటెక్ మాల్ ప్రాక్టీస్కు తెరలేపింది. హైదరాబాద్తో పాటు చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన ఇంద్రసేనారెడ్డి, కర్నూలు వాసి నాగూర్ బాషా, అనంతపురం వాసి లోకేశ్వర్రెడ్డి, సుబ్బారెడ్డిలతో ఆయా ప్రాంతాల్లో వ్యవహారాలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో వ్యవహారాల కోసం నెల్లూరుకు చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ జన భాస్కర్, చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన హరిప్రసాద్రెడ్డిలను ఏర్పాటు చేశారు. ఈ ముఠా హైటెక్ పద్ధతిలో ఎంసెట్ పేపర్లు లీక్ చేసి, విద్యార్థులతో పరీక్షలు రాయించాలని పథకం వేసింది. దీని కోసం బ్లూటూత్, ఇయర్ఫోన్స్ సిద్ధం చేసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి, మాల్ప్రాక్టీస్ ద్వారా పరీక్షలు రాయించి పాస్ చేయించాలని కుట్ర పన్నింది. దీనికోసం కొన్ని మెడికల్ కాలేజీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. మెడిసిన్ విభాగం ఎంసెట్ పేపర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉండేవి. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉండటంతో ఈ ముఠా ఒక్కో విభాగానికి సంబంధించి కొందరు నిపుణులను రంగంలోకి దింపింది. పరీక్ష ప్రారంభానికి పది నిమిషాల ముందే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసి, ఆ వెంటనే ఆయా అవి నిపుణులకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిపుణులు అన్ని సిరీస్లకు సంబంధించిన జవాబులను ఫోను ద్వారా ముఠాలో కీలక వ్యక్తులకు పది నిమిషాల్లో చెప్పేలా ఏర్పాట్లు చేసుకుంది. తమకు డబ్బు చెల్లించి, మాల్ప్రాక్టీస్ ద్వారా ఉత్తీర్ణులవ్వాలని ఆశించి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అందించడానికి ఈ ముఠా అత్యాధునిక ఇయర్ఫోన్లు, బ్లూటూత్స్ ఖరీదు చేసింది. చెవిలో ఇమిడిపోయే అతి చిన్న ఇయర్ఫోన్లకు తోడు బ్లూటూత్లను పెట్టుకోవడానికి బనియన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఫుల్హ్యాండ్స్ బనీన్లలో కుడి, ఎడమ చేతుల్లో భుజానికి దగ్గరగా బ్లూటూత్ సరిపడా చిన్న జేబులు కుట్టించారు. వీటికి సంబంధించిన సెల్ఫోన్లను సైలెంట్ మోడ్లో విద్యార్థులు అండర్వేర్స్లో పెట్టుకునేలా ఏర్పాటు చేశారు. సదరు విద్యార్థి పరీక్షకు వెళ్లే ముందే బ్లూటూత్ ఆన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పరీక్ష హాలులోకి ప్రవేశించిన విద్యార్థి మాట్లాడాల్సిన అవసరం లేకుండానే పని నడిచేలా ప్లాన్ చేశారు. సదరు విద్యార్థి పరీక్ష పేపర్ తీసుకునే సమయం అయిన వెంటనే ఈ ముఠాకు చెందిన వ్యక్తులు ఫోను ద్వారా విద్యార్థిని సంప్రదిస్తారు. ఆపై వరుస పెట్టి అన్ని సిరీస్లు ఏ...బీ...సీ...డీ... అంటూ చదువుతారు. బ్లూటూత్కు అనుసంధానమైన ఇయర్ఫోన్ ద్వారా ఇవి వినే విద్యార్థి తనకు వచ్చిన సిరీస్ చదివిన వెంటనే చిన్నగా దగ్గి సిగ్నల్ ఇస్తాడు. ఇక ఆ సిరీస్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులను వరుసపెట్టి బ్లూటూత్ ద్వారా ముఠా సభ్యులు చెప్పి పరీక్ష రాయించాలని పథకం వేశారు. 2010 మే నెలలో హైదరాబాద్ సహా ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసిన అధికారులు ఈ హైటెక్ గ్యాంగ్ గుట్టురట్టు చేసి, నాటి పరీక్షలో మాల్ ప్రాక్టీస్ను అరికట్టారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులైన గురివిరెడ్డి, ఇంద్రసేన్లను కడప పోలీసులు అదే ఏడాది జూన్ 5న అరెస్టు చేశారు. అక్కడి కేసులో ఇంద్రసేన్కు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ష్యూరిటీలు లేకపోడంతో విడుదల జాప్యమైంది. ఇది తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు పీటీ వారంట్పై ఇక్కడకు తీసుకువచ్చారు. కడప జిల్లాకు చెందిన ఇంద్రసేన్ అప్పట్లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేవాడు. 2004–05ల్లో ఇంద్రసేన్, గురివిరెడ్డి ఇద్దరూ నెల్లూరులో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. ఆ సందర్భంలో వీరికి పరిచయమైంది. ఇంద్రసేన్ చదువుకుంటూనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేవాడు. దీంతో అప్పుడప్పుడు గురివిరెడ్డి నుంచి ఆర్థిక సహాయం పొందేవాడు. షేర్లలో నష్టపోయిన గురివిరెడ్డి తన ఆర్థిక ఇబ్బందులను ఇంద్రసేన్తో చెప్పడంతో ఇద్దరూ కలిసి 2009 నుంచి ఎంసెట్ హైటెక్ మాల్ప్రాక్టీస్కు పథకం వేశారు. ఎగ్జామినేషన్ హాల్లో మాల్ప్రాక్టీస్ జరగకూడదన్న ఉద్దేశంతో నిర్వాహకులు క్వశ్చన్ పేపర్ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు సిరీస్లలో అందించేవారు. అయితే, క్లాస్రూమ్లో మాల్ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే ఓ చిన్న లాజిక్ను ఇంద్రసేన్ గుర్తించాడు. ‘ఏ’ సిరీస్లో 1వ ప్రశ్న ‘బి’ సిరీస్లో 31, ‘సి’ సిరీస్లో 21, ‘డి’ సిరీస్లో 11గా... అలాగే ‘ఏ’ సిరీస్లో రెండోది ‘బి’లో 32, ‘సి’లో 22, ‘డి’లో 12గా వస్తుంటుందని గమనించాడు. ఎంసెట్ ర్యాంక్ కోసం ఏడుసార్లు ప్రయత్నించిన నేపథ్యంలోనే తనకు ఈ విషయం తెలిసిందని ఇంద్రసేన్ పోలీసుల ఎదుట బయటపెట్టాడు. అనేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో పాటు కనీసం మూడుసార్లు ఎంసెట్ రాసిన ప్రతి అభ్యర్థికీ ఈ సంగతి తెలుస్తుందనని, దీన్ని అనేక మంది అనువుగా మార్చుకుంటున్నారని వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత నుంచి వివిధ సిరీస్ల ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల సీక్వెన్స్ మార్చే విధానం అమలులోకి వచ్చింది.∙ -
శివాంజనేయ యుద్ధం
పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు రాముడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. యాగాశ్వానికి పరిరక్షకులుగా భరత శత్రుఘ్న సుగ్రవ ఆంజనేయులను నియమించాడు.యాగాశ్వాన్ని పట్టుకున్న చాలామంది రాజులతో యుద్ధాలు జరిగాయి. హనుమంతుడి ప్రతాపం వల్ల యుద్ధాలలో ఎక్కువ ప్రయాస లేకుండానే రాజులు ఓటమిని అంగీకరించారు. చేసేది లేక యాగాశ్వాన్ని భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులకు అప్పగించారు. యాగాశ్వంతో పాటు అలా ముందుకు సాగుతుండగా, చక్రాంక నగరంలో రాజసుబాహుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అతడితో కూడా యుద్ధం జరిగింది. అతడు హనుమంతుడి ఎదుటకు వచ్చి, బాణాలు ప్రయోగించాడు. చిర్రెత్తిన ఆంజనేయుడు పైకెగసి, కాలితో అతడి ఛాతీ మీద కొట్టాడు. ఆ దెబ్బకు రాజసుబాహుడు మూర్ఛిల్లాడు. మూర్ఛావస్థలలో అతడికి శ్రీరాముడు దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తున్న శ్రీరాముని రూపం అతడి మనోనేత్రానికి కనిపించింది. కొద్దిసేపటికి అతడు మూర్ఛ నుంచి తేరుకుని స్పృహలోకి వచ్చాడు. ‘హనుమంతుడి పాదస్పర్శ మహిమతో భగవంతుడైన శ్రీరాముడిని దర్శించుకోగలిగాను. నా అపరాధానికి మన్నించండి’ అంటూ యాగాశ్వాన్ని అప్పగించి, భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులను వినయంగా సాగనంపాడు.యాగాశ్వాన్ని తీసుకుని వారు ముందుకు సాగారు. దారిలో దేవపురం వచ్చింది. దేవపురం రాజు వీరమణి శివభక్తుడు. శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటే, ‘స్వామీ! నా రాజ్యంపై ఎవరైనా దాడికి వచ్చినట్లయితే, నన్ను రక్షించు’ అని కోరుకున్నాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అప్పటి నుంచి వీరమణి తనను తాను అపరాజితుడినని అనుకోసాగాడు. తన రాజధాని నగరంలోకి ప్రవేశించిన యాగాశ్వాన్ని వీరమణి పట్టుకున్నాడు. దానిని తన అశ్వశాలలో బంధించాడు.‘ఇది రాముడి యాగాశ్వం. మర్యాదగా విడిచిపెట్టు, మేం ముందుకు సాగాలి’ అని భరత శత్రుఘ్నులు హెచ్చరించారు. వీరమణి పట్టించుకోలేదు. ‘నువ్వు మొండికేస్తే, యుద్ధంలో బుద్ధి చెప్పక తప్పదు’ తుది హెచ్చరికగా పలికాడు సుగ్రీవుడు.‘యుద్ధానికి నేను సిద్ధమే! నేను పట్టుకున్న అశ్వాన్ని మీరెలా తీసుకుపోతారో చూస్తాను’ అంటూ వీరమణి సేనలను సమాయత్తం చేసి, యుద్ధానికి సిద్ధమయ్యాడు.యుద్ధం హోరాహోరీగా జరిగింది.ఒకవైపు భరత శత్రుఘ్నులు శరపరంపరను కురిపిస్తుంటే, మరోవైపు సుగ్రీవుడు, హనుమంతుడు సేనా సమూహంలోకి చొరబడి విజృంభించారు. వారి నలుగురి ధాటికి వేలాదిగా ఉన్న వీరమణి సైన్యం కకావికలమైంది. వీరమణి పరమశివుడిని తలచుకున్నాడు. అతడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు స్వయంగా త్రిశూలం ధరించి, రణరంగంలోకి వచ్చి వీరవిహారం ప్రారంభించాడు.పరమశివుడి ధాటికి భరత శత్రుఘ్నులు, సుగ్రీవుడు మూర్ఛితులయ్యారు.హనుమంతుడు శివుడిని ఎదిరించి, యుద్ధం చేయడం ప్రారంభించాడు.కొంతసేపు యుద్ధం తర్వాత ‘మహాశివా! నేను రామబంటును. సేవాధర్మంగా రామకార్యం కోసం యుద్ధం చేస్తున్నాను. నువ్వెందుకు రామకార్యాన్ని అడ్డుకుంటూ యుద్ధం చేస్తున్నావు?’ అడిగాడు హనుమంతుడు.‘హనుమా! నువ్వు నీ స్వామి కోసం యుద్ధం చేస్తున్నావు. నేను నా భక్తుడి కోసం యుద్ధం చేస్తున్నాను’ చెప్పాడు శివుడు.ఇద్దరికీ నడుమ మరికొంత పోరు సాగింది. హనుమంతుడు తన గదతో శివుడి రథాన్ని కూల్చేశాడు. శివుడు నేల మీద పడ్డాడు. ‘హనుమా! నువ్వు మహావీరుడివి. యుద్ధంలో నా దెబ్బలను తట్టుకుంటూనే నా రథాన్ని కూల్చేశావు. నీ పరాక్రమానికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో!’ అని అడిగాడు.‘నేను ద్రోణపర్వతానికి వెళ్లి, సంజీవని మూలిక తీసుకొస్తాను. అంతవరకు యుద్ధంలో మూర్ఛిల్లిన భరత శత్రుఘ్న సుగ్రీవులకు, మిగిలిన సైనికులకు ఏ ఆపదా రాకుండా రక్షణగా ఉంటానని వరమివ్వు, అది చాలు’ అన్నాడు హనుమంతుడు.‘తథాస్తు’ అన్నాడు శివుడు.హనుమ రివ్వున ఎగిరి ఆకాశమార్గాన ద్రోణ పర్వతానికి వెళ్లాడు. పర్వతం మీద ఎంత వెదికినా సంజీవని మూలిక జాడ కనుక్కోలేకపోయాడు. చివరకు పర్వతాన్నే పెకలించుకుపోవాలని నిశ్చయించుకుని, పర్వతాన్ని పెకలించసాగాడు.ఆకాశమార్గాన బృహస్పతి సహా దేవతలతో సంచరిస్తున్న దేవేంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి చకితుడయ్యాడు. హనుమంతుడి మీదకు వజ్రాయుధం ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు.అయితే, బృహస్పతి అతడిని వారించాడు. ‘హనుమంతుడు రామభక్తుడు. అతడితో ఖ్యంగానే సమస్యను పరిష్కరించుకుందాం’ అని చెప్పి, ద్రోణాచలానికి దారితీశాడు. ఇంద్రాది దేవతలు అతణ్ణి అనుసరించారు.‘పర్వతాన్ని ఎందుకు పెళ్లగిస్తున్నావు?’ అని హనుమను అడిగాడు బృహస్పతి.‘ఇందులో సంజీవని మూలిక ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాను. అందుకే పర్వతం మొత్తాన్ని తీసుకుపోవాలని అనుకుంటున్నాను’ బదులిచ్చాడు హనుమ.‘నీకు కావలసినది మూలికే కదా, నేను గుర్తించగలను. వెదికి ఇస్తాను’ అంటూ బృహస్పతి అతడికి సంజీవని మూలికను తెచ్చి ఇచ్చాడు.హనుమంతుడు సంతోషంగా మూలిక తీసుకుని, దేవపురం చేరుకున్నాడు. మూర్ఛితులైన భరత శత్రుఘ్న సుగ్రీవులు సహా సైనికులను మూలిక సాయంతో స్పృహలోకి రప్పించాడు. జరిగినదంతా చూసి, వీరమణి యాగాశ్వాన్ని మర్యాదగా అప్పగించాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: రచయిత వీలునామా!
కొన్ని మరణాలు భరించలేని దుఃఖాన్ని మోస్తాయి. మరికొన్ని పూరించలేని లోటుని మిగులుస్తాయి.ఇంకొన్ని మరణాలు బతికిస్తాయి. బతుకునిస్తాయి. ‘‘నాపేరు యామిని.. సార్కి అసిస్టెంట్ని..’’ ఎదురుగా కూర్చొంటూ అందామె. ఆమె తెచ్చిన కాఫీ– టీపాయ్ మీద పొగలు కక్కుతోంది.‘‘ కాఫీ తీసుకోండి..’’ నవ్వుతూ అంది. మేకప్ మాత్రమే కాదు, శారీరక భాష కూడా ఆమె నడివయసు స్త్రీ అని చెప్పకనే చెబుతోంది. ఖరీదైన ఫర్నిచర్, అధునాతన డిజైనింగ్తో వెయిటింగ్ రూమ్ అదిరిపోతోంది.రచయితగా కళాధర్ సంపాదన బాగానే ఉన్నట్టుంది. చూపు సారించినంత మేర ఇల్లంతా రిచ్గా కనిపిస్తోంది.ఎదురుగా విశాలంగా ఉన్న షెల్ఫ్లో వందలాదిగా ఎన్నో పుస్తకాలు. సాహితీ టీవీ సినీ దిగ్గజాలతో దిగిన ఫొటోలు, అవార్డుల మెమెంటోలు, సన్మానపత్రాల ఫొటోషీల్డులు ఎన్నో వరుసగా కొలువుదీరి ఉన్నాయి. కాఫీ తాగడం పూర్తిచేసి కప్పు కింద పెట్టాను.‘‘సారీ సర్.. లేటయ్యింది’’ వస్తూనే కళాధర్ పలకరిస్తూ, ప్రేమగా నన్ను హత్తుకున్నాడు. కుశలప్రశ్నల వర్షం కురిపించేడు. తడిసి ముద్దవుతూనే అన్నిటికీ జవాబిచ్చాను.‘‘సినిమా ఫీల్డ్కు వచ్చి ఎన్నాళ్లైంది సర్ ?’’ అడిగాను కుతూహలంగా.‘‘ముప్ఫైయేళ్లు దాటింది. అంతకుముందు మా ఊళ్లో ఉండేటప్పుడు నేనూ, మీబావగారు కలిసి తిరిగేవాళ్ళం. కథలు రాసేవాళ్ళం. నాటకాలు వేసేవాళ్ళం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. పొట్టకూటి కోసం’’...‘‘ఇక్కడెలా అవకాశాలు వచ్చేయి?’’‘‘మొదట్లో పత్రికలకు సీరియళ్లు, కథలూ రాసేవాణ్ణి. మెల్లగా సినిమావాళ్లతో పరిచయాలు చేసుకున్నాను. ఎన్నో సినిమాలకు కథలు అందించాను. కొంతమందికి ఘోస్ట్ రైటర్ గా పనిచేశాను.’’‘‘రచయితగా మీరు సాధించిందేంటి..?’’‘‘నాలుగు రాళ్లు వెనకేసుకోవడం... అంతకు మించి ఏం లేదు. నీతులూ సూక్తులూ చైతన్యాలూ మన వల్ల కాదు. బతుకు దెరువు కోసం నా రచనల్ని అమ్ముకుంటున్నాను. ఒకప్పుడు సినిమాలకు, ఇప్పుడు టీవీ సీరియళ్లకు...’’ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడతను. ఎంతో ముచ్చటేసింది.‘‘ఆల్ ది బెస్ట్ సర్. ఇక నేనొచ్చిన పని మీకు తెలుసు కదా?’’‘‘తెలుసు సర్. శేఖరం రాత్రే ఫోన్ చేశాడు. నా మిత్రునికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిందంటే నాకు మాత్రం ఆనందం కాదా! తప్పకుండా వస్తాను. ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చూస్తాను. సరేనా..?’’ఇచ్చిన ఆహ్వాన పత్రికను తనఫైల్లో భద్రంగా దాచుకున్నాడతను. లంచ్ కానిచ్చి తిరుగు ప్రయాణానికి తయారయ్యాను. ఇద్దరూ స్టేషన్కు కార్లో దిగబెట్టారు. అతను నా పక్క బ్యాక్ సీట్లో కూర్చుంటే, కారు డ్రైవింగ్ చేసింది యామిని. స్టేషన్ చేరుకునే సరికి ప్లాట్ఫామ్పై ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అనౌన్స్మెంట్ వినిపిస్తోంది.‘‘చివరగా ఒకే ఒక్క ప్రశ్న... అడగొచ్చా?’’ బెర్త్పై కూర్చొంటూ అడిగాను.‘‘అడగండి.. పర్వాలేదు’’‘‘మీరెందుకు పెళ్లి చేసుకోలేదు?’’‘‘సరైన అమ్మాయి దొరక్క...’’ బిగ్గరగా నవ్వేడతను. యామిని కిసుక్కున నవ్వింది.అతని విచిత్ర సమాధానానికి నేనేమీ ఫీలవ్వలేదు. పైగా అతని వ్యక్తిగత జీవితంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఆరా తీయాలనిపించింది. ఇంటికొచ్చాక బావగారిని అడిగాను. అతను కూడా వెంటనే చెప్పడానికి ఇష్టపడలేదు. గట్టిగా పట్టుబడితేనే తప్ప.‘‘నాకు తెలిసినప్పటి నుంచి వాడిదో పెక్యూలియర్ మెంటాలిటీ. బాగా డబ్బు సంపాదించాలని, దర్జాగా బతకాలని కలలు కనేవాడు. ఇంటర్ నుంచి మా ఇద్దరికీ పరిచయం. సైకిల్పై కాలేజీకి వచ్చేవాడు. ఒంటరిగా ఏదో రాసుకుంటూనో, ఎక్కడో చదువుకుంటూనో కనిపించేవాడు. కాలేజీ మ్యాగజైన్లో మా ఇద్దరి కవితలు పడ్డాక మరింత సన్నిహితమయ్యాము. పుస్తకాల గురించి, సినిమాల గురించి చర్చించేవాళ్ళం. డిగ్రీ పూర్తయ్యాక ఇద్దరమూ కలిసి మా పేర్లలోని సగాలతో కలిపి ‘చంద్రకళ’ అనే పేరుతో కథలు రాసేవాళ్ళం. తొంబైల్లో జంటరచయితలుగా మాకో ప్రత్యేక గుర్తింపు కూడా ఉండేది. మా కుటుంబానికి కూడా బాగా దగ్గరయ్యాడు. అలాంటి వాడు ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో తెలీదు. వాడి సొంతవూరు వెళ్లి విచారిస్తే, కొన్ని చేదు నిజాలు తెలిశాయి. వాడి కన్నతల్లి చిన్నతనంలోనే చనిపోయిందని కొందరు, కాదు... లేచిపోయిందని మరికొందరు... సవతితల్లితో చాలా బాధలు పడ్డాడని మరికొందరు... చాలా బాధనిపించాయి.. ఐదేళ్ల తర్వాత వాడి నుంచి ఉత్తరం వచ్చింది హైదరాబాదులో క్షేమంగా వున్నానని, ఓ పత్రికాఫీసులో పనిచేస్తున్నానని... చదివి సంతోషమనిపించింది. ఆ తర్వాత శిక్షణ పూర్తయి నేను టీచర్ గా స్థిరపడ్డాను. నాపెళ్ళికీ, చెల్లి పెళ్ళికీ పిలిచాను. ఆనందంగా పాల్గొన్నాడు. ఇప్పుడు నువ్వడిగిన ప్రశ్ననే చాలాసార్లు వాడిని అడిగాను. పెళ్లి నా ఒంటికి పడదని నవ్వుతూ సమాధానం దాటవేసేవాడు. వాడిపై బోలెడు పుకార్లు... నేనవేవీ పట్టించుకోవడం మానేశాను. ఎవరెవరితోనో తిరిగి, ప్రస్తుతం ఎవరో ఒకామెతో సహజీవనం చేస్తున్నాడని విన్నాను. ఇన్ని అవలక్షణాలు ఉన్నా, మనిషిగా మాత్రం మంచివాడు. సవతితల్లి కూతురి పెళ్లిని తనే ఘనంగా చేశాడు. మా నాన్నగారి గుండె చికిత్సకు అయిన ఖర్చునంతా తనే పెట్టాడు. డబ్బు తిరిగి చెల్లించబోతే ఎంతమాత్రం ఒప్పుకోలేదు. సినీ రచయితగా వాడి రచనల్లోని విలువలూ, ఆలోచనా దృక్పథమూ నాకు నచ్చవు. అయినాసరే, అవెప్పుడూ మా స్నేహానికి అడ్డు రాలేదు’’ ముగించారు బావగారు. అతనేంటో మరింత అర్థమవడం ఆరంభమైంది.‘‘సభకు నమస్కారం... నా పేరు కళాధర్. నేనొక టీవీ, సినీ రచయితనని మీ అందరికీ తెలిసే ఉంటుంది. తన ‘అగ్నిశిఖ’ కథాసంపుటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న నా మిత్రుడు చంద్రశేఖరానికి ముందుగా అభినందనలు. మేమిద్దరం ప్రాణస్నేహితులమని చెప్పడం కంటే శేఖరం స్నేహితుడినని చెప్పుకోవడమే నాకు గర్వకారణం. శేఖరం ఒకగొప్ప రచయిత. అంతకు మించి స్నేహశీలి. స్వతహాగా నేను బిడియస్తుణ్ణి. ఎవరితోనూ కలిసేవాడిని కాదు. ఒంటరి నా ఆలోచనలను సరిచేసి, కుటుంబ ఆప్యాయతలను, అనుబంధాలను అందించిన ఆత్మీయవ్యక్తి శేఖరం. రచయితగా రచనల్లోని మెలకువలు నేర్పిన మార్గదర్శి. ఈరోజు నేనిలా నిలబడ్డానికి కారణం వాడిచ్చిన ప్రోత్సాహమే! అందించిన స్నేహహస్తమే! రచన చేయడం గొప్ప కాదు, ఒక సామాజిక బాధ్యతతో, సైద్ధాంతిక నిబద్ధతతో ఒక కొత్త తరాన్ని తయారు చేసి నడిపించగలగడం మహత్కార్యం, సాహిత్యసేవ. దాన్ని శేఖరం మాత్రమే చేతల్లో చూపించాడు. నిజంగా వాడొక అగ్నిశిఖ. వాడి రచనల్ని తడిమి చూసేంత సత్తా ఏ విమర్శకుడికీ లేదు. వాడి రచనలు కళ్ళు చెమర్చే జీవితపు విలువలు, స్ఫూర్తినిచ్ఛే మానవీయ స్పందనలు. డబ్బు కోసమో, పేరు కోసమో, కాలక్షేపం కోసమో రాయడు. అందుకే వాడి రచనలంటే గౌరవం. వాడంటే భయం. ఇది మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. చివరగా శేఖరానికి ఇలాంటి అవార్డులెన్నో రావాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటూ, సెలవు తీసుకుంటున్నాను’’కళాధర్ ప్రసంగం ముగిసింది. ఆడిటోరియం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. బావగారిని గట్టిగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడతను.ఆ తర్వాత వక్తలెందరో ప్రసంగించారు. రాష్ట్ర మంత్రివర్యుల చేతుల మీదుగా బావగారికి ఘనసత్కారం జరిగింది. అభిమానులు, మిత్రులు పోటాపోటీగా శాలువాలు కప్పేరు. పనిలో పనిగా కళాధర్ని కూడా సన్మానించారు. అన్నట్టుగానే నిర్వహణ అంతా తన భుజాలపైనే వేసుకుని, కళాధర్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాడు.ఆ రోజు నుంచి బావగారి కీర్తిప్రతిష్ఠలు అమాంతం పెరిగిపోయాయి. మిగిలిన ఎన్నో సంస్థల అవార్డులు, సత్కారాలు వరుసగా వరించాయి. సందర్శకుల తాకిడి ఎక్కువైపోయింది. పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిలాషులు. ఔత్సాహిక రచయితలు... ఎందరెందరో... ఎక్కడెక్కడి నుంచో... ఇంటికి వచ్చేవారు. విషయ సేకరణ చేయడమో, రచనా నైపుణ్యాల గురించి అడిగి తెలుసుకోవడమో చేసేవారు. చర్చలు, సమావేశాలు రోజురోజుకీ ముమ్మరమయ్యాయి. దూరాభార కార్యక్రమాలకు రాకపోకలు ఎక్కువయ్యాయి. వృద్ధాప్యంలో ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదనీ అక్కా... కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అవి ఆయన చెవికెక్కలేదు.అలా ఒకరోజు ఎక్కడో సాహిత్య సమావేశం జరుగుతోంది. బావగారు ముఖ్యఅతిథి. ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. సభావేదికపైనే గుండెనొప్పంటూ కుప్పకూలిపోయారు. నిర్వాహకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. రెండు రోజుల చికిత్స అనంతరం బావగారి ప్రాణం పోయింది.సాహిత్య లోకానికే కాదు, మా కుటుంబాలకు కూడా పెద్ద దిక్కు లేకుండా పోయింది. కళాధర్ వేదన గట్టుతెగిన వాగైంది. అందరి హృదయాలూ దుఃఖంతో బరువెక్కాయి. సంతాపసందేశాలూ, చానళ్లలో స్క్రోలింగ్ వార్తలూ హోరెత్తాయి. ఆప్తులందరి సమక్షంలో బావగారి భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. దశదినకర్మలు పూర్తయ్యాయి. వేడుక ముగిసిన వేదికలా బావగారిల్లు మిగిలిపోయింది.కొన్నేళ్ళకు మరో చేదు వార్త కమ్ముకుంది. కళాధర్ కూడా కాలధర్మం చేశాడనే వార్త! నిద్దట్లోనే గుండె ఆగిపోయిందట! హృదయం బాధా తప్తమైంది. మరు నిమిషం హైదరాబాద్ రాత్రి బస్సెక్కెశాను. నేను వెళ్లేసరికి శవాన్ని ఉంచేందుకు ఫ్రీజర్ను సిద్ధం చేస్తున్నారు. సినీ టీవీ రంగాల ప్రముఖులెందరో విచార వదనాలతో ఒక్కరొక్కరూ వస్తున్నారు. కొయ్యబారిన దుఃఖంలా యామిని ఉంది. కళాధర్ వ్యక్తిగత లాయర్ అప్పుడొచ్చాడు వీలునామా పట్టుకొని... చదివి వినిపించాడు. అంతా నివ్వెరపోయారు.హిందూ మతాచారాల పట్ల తనకు నమ్మకం లేదని, మరణానంతరం తన పార్థివదేహాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి అప్పగించాలని.., తను ఉంటున్న ఇల్లు, బ్యాంక్ అకౌంట్లో నగదు మొత్తం యామినికి చెందుతుందని.. మిగిలిన యావదాస్తి సమంగా నగరంలోని అన్ని అనాథ శరణాలయాలకు చెందుతుందని దాని సారాంశం.కళాధర్ గొప్ప మనసును అక్కడ చేరిన గొంతులు వేనోళ్ళ పొగిడాయి. జోహారు నినాదాలు పెద్ద ఎత్తున చేశాయి. ఈ వార్త క్రమేపి వార్తా చానళ్ల వరకూ పాకింది.‘గొప్ప మానవతావాది.. సినీ రచయిత కళాధర్కు జోహార్’ అంటూ ఒక రోజంతా లైవ్ కవరేజీ ప్రసారం చేశారు. ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర మంత్రివర్యులు కూడా హాజరై నివాళులర్పించారు. భౌతిక దేహాన్ని అంతిమ దర్శనం చేసుకుని, యామిని దగ్గరికి వచ్చాను. నిస్తేజంగా చూసిందామె.‘‘బాధపడకండి... అంతా మంచే జరుగుతుంది...’’ అన్నాను.‘‘పర్వాలేదు సర్... విల్లు వివరాలన్నీ తెలుసు... ఆయన ఆకాంక్షలను గౌరవిస్తాను’’ అందామె క్లుప్తంగా...ప్రతిఏటా మిత్రులిద్దరి వర్ధంతులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. సాహిత్య మార్గదర్శిగా అతని అనుచరులు చంద్రశేఖర్ని స్మరిస్తూ, అతని సాహిత్యాన్ని సమగ్రంగా చర్చించుకుంటూ ఎక్కడో ఒకచోట... అయితే తండ్రిలా తమని పోషిస్తూ, విద్యాబుద్ధులు చెప్పిస్తున్న కళాధర్ను దేవుడిలా కొలుస్తూ, ధ్యానమందిరాల్లో పూజలు చేస్తూ ఎందరో అభాగ్యులు అనాథ శరణాలయాల్లో మరో చోట...∙పాలకొల్లు రామలింగస్వామి -
రెక్కలున్నా.. లెక్క తేలక... పదేళ్లుగా ఉన్నచోటే!
2015 ఆగస్టు 7 రాత్రి 7 గం.లకు ‘మెక్డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగింది. నిజానికి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో టేకాఫ్ అయిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళ్లాలి. అయితే దారి మధ్యలో విమానంలోని ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ విమానాన్ని అత్యవసరంగా రాయ్పుర్ (ఛత్తీస్గఢ్)లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో దింపేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా ప్రత్యేక విమానంలో మస్కట్ చేరుకున్నారు. అయితే రాయ్పుర్లో ఆ రోజు ల్యాండ్ అయిన ఆ ‘డగ్లస్ 83’ మాత్రం నేటికీ తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు! రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పదేళ్లుగా ఇప్పటికీ అక్కడే అంగుళం అయినా కదలకుండా ఉండిపోయింది!పార్కింగ్కి రూ.4 కోట్ల బకాయిపదేళ్లుగా ఆ డగ్లస్ 83 విమానం నిలిపి ఉన్న స్థలం ‘ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (ఏఏఐ) కిందికి వస్తుంది. అక్కడ పార్క్ చేసినందుకు ‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ ఇప్పటికి రూ. 4 కోట్లకు పైగా బకాయి పడింది. ఇమ్మంటే ఇవ్వదు, విమానాన్ని తీసుకుపోమ్మంటే పోదు. చూసి, చూసి, ఐదేళ్లు ఓపిక పట్టిన ఏఏఐ 2021 జనవరి 18న అధికారికంగా లేఖ రాసింది. ఆ లేఖ కూడా పని చేయలేదు. విమానం లాగే ఎక్కడి విజ్ఞప్తులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడిక బంగ్లాదేశ్లో ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం కావటంతో ఏఏఐ కూడా చూసీ చూడనట్లు పోవలసి వస్తోంది. కొనేవాళ్ల కోసం ఎదురుచూపులు!రాయ్పుర్, స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే 11 పార్కింగ్ బేస్లు. (మొదట ఎనిమిదే ఉండేవి). వాటిల్లో ఒక బేస్లో డగ్లస్ ఎం.డి.83 ఉండిపోయింది. దానిని డంప్ యార్డ్కు పంపటానికి లేదు, అలా పడి ఉంటుందిలే అని సర్దుకుపోయే వీలూ లేదు. రెండు మూడు మరమ్మత్తుల చేస్తే చాలు, పైకి ఎగిరే విమానమే అది. అయితే బంగ్లాదేశ్ ఆ పని కూడా చేయటం లేదు! ‘‘కొనేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి..’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్ అంటోంది. విసిగి వేసారిన రాయ్పుర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్.డి. శర్మ, న్యాయపరంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికేందుకు ఉన్న మార్గాల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ వస్తే చాలుఅసలు డగ్లస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్పుర్ రాలేదు! ఆ వచ్చిన వాళ్లు మాత్రం చెడిపోయిన ఇంజిన్ను తీసి, దాని స్థానంలో కొత్తది బిగించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా.. ‘ఎగిరేందుకు ఫిట్గా ఉంది’ అన్న సర్టిఫికెట్ రావాలి. అది రావటం లేదు, ఇది ఎగరటం లేదు. మనవాళ్లు ఇప్పటికి లెటర్లు, ఈమెయిళ్లు, కలిపి దాదాపు 100 వరకు పంపారు. నెలనెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ‘‘ఇదిగో, ఫిట్నెస్ సర్టిఫికెట్ రాగానే విమానాన్ని తీసుకెళతాం’’ అని గత పదేళ్లుగా ఒకటే సమాధానం. రాయ్పుర్ ఎయిర్పోర్టుకూ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడి నుండి రోజూ 30 విమానాలు టేకాఫ్ అవుతాయి. 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఉదయం 8–10 గం. మధ్య, సాయంత్రం 4–6 గం. మధ్య మొత్తం నాలుగు గంటల పాటు పదకొండు పార్కింగ్ బేస్లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లస్ 83 కారణంగా ఆ బేస్లో ఉంచవలసిన వాటిని వేరే బేస్కు తరలించాల్సి వస్తోంది. ... ఇక వాళ్ల కష్టాలు..!‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ నష్టాల్లో కూరుకుపోయి, 2016లోనే కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆ సంస్థ నుండి ఇంతవరకు ఒక్క విమానం కూడా టేకాఫ్ అవలేదు. అక్కడి నుంచి ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అక్కడ అవి కార్గో ఫ్లయిట్స్ కదలికలకు అడ్డుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో – రాయ్పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక, ‘‘మీరే ఎవరైనా కస్టమర్ను వెతికి పట్టుకుని, డగ్లస్ 83ని వచ్చింతకు అమ్మేసి, మీ బకాయిలను మినహాయించుకుని, మిగిలిన డబ్బును మాకు పంపండి’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్.. మన ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ·అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?‘మెక్డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ విమానం బంగ్లాదేశ్లో టేకాఫ్ అయింది. వారణాసి–రాయ్పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఒక ఇంజిన్ పాడైపోయింది! లోపల 176 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని ఫైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. విమానంలోని ఫ్లయిట్ ఇంజినీర్ ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్కి అనుమతి ఇవ్వండి’ అని సంకేతం పంపారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సంకేతం కోల్కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి చేరలేదు. కోల్కతా చెబితేనే రాయ్పుర్ చేస్తుంది. ఏమైతే అది అయిందని విమానాన్ని రాయ్పుర్లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నారు. అయితే అత్యవసరంగానే అయినా ఒక విమానాన్ని ల్యాండ్ చేయించే అధికారం రాయ్పుర్ ఎయిర్ పోర్ట్కు లేదు. కోల్కతా నుంచి ఆదేశాలు రావాలి. అయితే దురదృష్టంతో పాటుగా అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలట్ ఇచ్చిన సంకేతాన్ని ముంబై నుండి కోల్కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్కతా ఎయిర్పోర్ట్కు అందించారు. కోల్కతా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రాయ్పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండింగ్కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాయ్పుర్ ఎయిర్పోర్ట్లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్టు లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్లోఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం భద్రంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకపోవటంతో 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి ఆగస్టు 8 రాత్రి 10.27 గం.లకు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది. -
ఏఐ డాక్టర్లా? మజాకా?
డాక్టర్ ఏఐ– ఇదొక కొత్త స్టెతస్కోప్ ఇదొక రోబో సర్జన్ ఇదొక డయాగ్నస్టిక్ ల్యాబ్ ఇది రోగుల పాలిటి వరం వైద్యరంగం చేతిలోని శరంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి దూసుకొచ్చేస్తున్నట్లే, వైద్యరంగంలోకి కూడా శరవేగంగా దూసుకొస్తోంది. ఏఐ మాయాజాలం వైద్యరంగంలో పెనుమార్పులను తీసుకొస్తోంది. మన దేశంలోని ఆస్పత్రులు కూడా ఇటీవలి కాలంలో ఏఐని విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. వైద్యరంగంలో డాక్టర్ ఏఐ ఇప్పటికే తీసుకొచ్చి మార్పులను, భవిష్యత్తులో తీసుకురానున్న మార్పులను ఒకసారి తెలుసుకుందాం.‘కరోనా’కాలంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్యరంగం అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడే పరిస్థితులు ఉంటే, చాలా చోట్ల ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బంది లేని పరిస్థితి. మహమ్మారి వ్యాధులు విజృంభించినప్పుడు మాత్రమే కాదు; సీజనల్ వ్యాధులు ఇబ్బడి ముబ్బడిగా వ్యాపించేటప్పుడు; అనుకోని విపత్తులు తలెత్తేటప్పుడు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. రోగుల తాకిడికి తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. ఇలాంటి విపత్కర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడంలో ఏఐ బాగా సహాయపడగలదని నిపుణులు చెబుతున్నారు. వైద్యులపై పనిభారం తగ్గించడానికి, వారి పనిని మరింత సులభతరం చేయడానికి ఏఐ వరప్రసాదం లాంటిదని వారు అంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల మొదలుకొని, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు వివిధ దేశాల్లోని ఆస్పత్రులు ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆస్పత్రిప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రి ఇటీవల చైనాలో ప్రారంభమైంది. చింగ్హ్వా యూనివర్సిటీ ఈ పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రిని అభివృద్ధి చేసింది. ‘ఏజెంట్ హాస్పిటల్’ పేరిట ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో ఇతర సాధారణ ఆస్పత్రుల్లో మాదిరిగా మనుషులు ఉండరు. ఇదంతా ఒక మాయాలోకంలా ఉంటుంది. ఇందులో పనిచేసే సిబ్బంది అంతా పద్నాలుగు మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులు మాత్రమే! ఈ ఏఐ ఆస్పత్రిలో పేషెంట్లను చేర్చుకునే వార్డులు కూడా కనిపించవు. ఈ ఆస్పత్రిలోని ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు ‘వర్చువల్’గానే రోగులకు సేవలు అందిస్తూ ఉంటారు. రోజుకు దాదాపు మూడువేల మందికి ఈ ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు రోగ నిర్ధారణ మొదలుకొని, రకరకాల చికిత్సలను అందిస్తూ ఉంటారు. ఈ ఏఐ డాక్టర్లు ఆషామాషీ చాట్బోట్లు కాదు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ (యూఎస్ఎంఎల్ఈ) పరీక్షల్లో 93.06 శాతం మార్కులు సాధించిన ఘనత సొంతం చేసుకున్న ఘనవైద్యులుగా గుర్తింపు పొందాయి. అంతేకాదు, కొన్ని రంగాల్లో అనుభవజ్ఞులైన మానవ వైద్యులను మించిన ఫలితాలను సాధించిన ఘనత కూడా ఈ ఏఐ వైద్యులు సాధించడం విశేషం.తొలి రిమోట్ ఏఐ సర్జరీచైనా శాస్త్రవేత్తలు ఏఐ డాక్టర్ల రూపకల్పనలోనే కాదు, ప్రపంచంలోనే తొలి రిమోట్ ఏఐ సర్జరీని ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన ఐ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ వైద్య శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా రిమోట్ ఏఐ సర్జరీని నిర్వహించారు. ఏఐ సాయంతో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు సాధారణంగా చేసే శస్త్రచికిత్స కంటే ముప్పయిశాతం తక్కువ సమయం పట్టింది. అంతేకాదు, రోగికి పెట్టే కోతలో మిల్లీమీటరులో పదోవంతు కూడా తేడా లేనంత కచ్చితత్వంతో ఈ శస్త్రచికిత్స జరగడం అద్భుతమనే చెప్పుకోవాలి. ఫుడాన్ వర్సిటీ ఈఎన్టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వు చున్పింగ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి గొంతులో ఏర్పడిన కణితిని ‘ట్రాన్స్ ఓరల్ సర్జికల్ రోబో సిస్టమ్’ ద్వారా ఏఐ సాయంతో తొలగించారు. షాంఘైలో ఉన్న వైద్యనిపుణుల సూచనలకు అనుగుణంగా, అక్కడకు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని చెంగ్డూ ఆస్పత్రిలోని ఏఐ సర్జికల్ రోబోలు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాయి. ‘బోర్న్ ’ గ్రూప్లోని సింఫనీ రోబోటిక్స్ కంపెనీ ఈ ఏఐ సర్జికల్ రోబోలను తయారు చేసింది. షాంఘైలోని వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన రిమోట్ ఏఐ సర్జరీ వల్ల శస్త్రచికిత్స ఖర్చు ఇరవై శాతం మేరకు, సమయం ముప్పయి శాతం మేరకు తగ్గినట్లు ‘బోర్న్’ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో లి యావో తెలిపారు. ‘బోర్న్’ గ్రూప్ రూపొందించిన ఏఐ సర్జికల్ రోబోలకు కావలసిన 1760 విడిభాగాలను చైనాలోని 165 కంపెనీల నుంచి సమకూర్చుకున్నట్లు లి యావో చెప్పారు. ఏఐ సర్జికల్ రోబోలను అభివృద్ధి చేయడానికి, వాటి వినియోగాన్ని మరింతగా విస్తరించడానికి తమ సంస్థ అమెరికా, జపాన్, జర్మనీలకు చెందిన కంపెనీలు, వైద్య పరిశోధక సంస్థలకు సహకరిస్తోందని వెల్లడించారు.ఏఐ మాయాదర్పణంవైద్యరంగంలో వ్యాధుల నియంత్రణ, చికిత్స పద్ధతులు ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరో ఎత్తు. వ్యాధుల చికిత్సకు వ్యాధి నిర్ధారణే కీలకం. ఎంత ఆధునిక వ్యాధి నిర్ధారణ పద్ధతులైనా, కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రావడానికి ఒకటి రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు సమయం పడుతుంది. అయితే, ఏఐ రాకతో వ్యాధి నిర్ధారణ శరవేగం పుంజుకుంటోంది. వ్యాధి నిర్ధారణలో ఏఐ తీసుకొచ్చిన వేగానికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ మాయాదర్పణమే తాజా ఉదాహరణ. మామూలుగా అద్దం ముందు నిలుచున్నట్లుగానే ఈ మాయాదర్పణం ముందు నిలుచుంటే చాలు, ఉన్నపళాన మీ ఆరోగ్య వివరాలను క్షణాల్లో చెప్పేస్తుంది. ఈ మాయాదర్పణం డయాబెటిస్, బీపీ వంటి సర్వసాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు పార్కిన్సన్స్, డెమెన్షియా, గుండెజబ్బులు, శ్వాస సమస్యలు, నాడీ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ వంటి జటిలమైన వ్యాధులను కూడా ఇట్టే గుర్తించగలదు. స్మార్ట్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా దీని ముందు నిలబడి ముప్పయి సెకన్ల సెల్ఫీ వీడియో తీసుకుంటే చాలు, ఇది శరీరాన్ని ఆపాదమస్తకం త్రీడీ స్కానింగ్ చేసేస్తుంది. అంతేకాదు, క్షణాల్లోనే ఈ మాయాదర్పణం ముప్పయి రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి వివరాలను అత్యంత కచ్చితత్వంతో చెబుతుంది. అమెరికన్ హెల్త్టెక్ స్టార్టప్ కంపెనీ ‘విదింగ్స్’ దీనిని ‘ఒమీనా’ పేరిట రూపొందించింది. ఈ ఏడాది లాస్వేగాస్లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2025లో ప్రదర్శించిన దీని పనితీరు నిపుణుల ప్రశంసలు పొందింది. ‘ఒమీనా’ మాయాదర్పణం కేవలం ఆరోగ్య వివరాలను తెరపై చూపించి, అంతటితోనే సరిపెట్టుకోదు. ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా పనిచేస్తుంది. తెరపై కనిపించే ఆరోగ్య వివరాలను చూసుకున్న తర్వాత వినియోగదారులు అడిగే సందేహాలన్నింటికీ సమాధానాలను ఓపికగా చెబుతుంది. గుర్తించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి, తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు కూడా చేస్తుంది. వ్యాధి నిర్ధారణ రంగంలో ‘ఒమీనా’ ఏఐ సంచలనానికి నాంది పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.మన ఆస్పత్రుల్లోనూ ఏఐమన దేశంలోని ప్రముఖ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక సంస్థలైన గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటివి భారత్లోని ఆస్పత్రులకు ఏఐ సాంకేతికతను అందించడానికి ముందుకొస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్కేర్, మణిపాల్ హాస్పిటల్స్, అరవింద్ ఐ హాస్పిటల్స్, ఏజే హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ హాస్పిటల్, నారాయణ హెల్త్, క్లౌడ్నైన్ హాస్పిటల్స్, కావేరీ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్స్ వంటివి ఇప్పటికే ఏఐ సాంకేతికతను రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, శస్త్రచికిత్సలలో కచ్చితత్వం తదితర అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. పలు ఔషధ తయారీ సంస్థలు, పరిశోధక సంస్థలు ఔషధాల రూపకల్పన కోసం కూడా ఏఐని వినియోగించుకుంటున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులే కాకుండా, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘భారత్నెట్’ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో సుమారు రూ.8500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ‘నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంకల్పించుకుంది. ఈ ఆరోగ్య గుర్తింపు కార్డులకు పౌరుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారం అంతా అనుసంధానమై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకం అమలులోకి వచ్చినట్లయితే, ఏఐ సాంకేతికత గ్రామీణ ఆస్పత్రులకు కూడా అందుబాటులోకి వస్తుంది.ఆరోగ్యరంగంలో విస్తరిస్తున్న ఏఐప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోను ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ గడచిన ఐదేళ్లుగా బాగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 2022 నాటికి 11 బిలియన్ డాలర్లుగా (రూ.94,112 కోట్లు) నమోదైంది. ఇది 2025 నాటికి 35.71 బిలియన్ డాలర్లకు (రూ.3.04 లక్షల కోట్లు) చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో 2022 నాటికి ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 0.13 బిలియన్ డాలర్లు (రూ.1112 కోట్లు) ఉంటే, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలువ 1.6 బిలయన్ డాలర్లకు (రూ.13,689 కోట్లు) చేరుకోగలదని ‘ఫోర్బ్స్’ పత్రిక అంచనా. భారత్ ఆరోగ్య రంగంలో ఏఐ మార్కెట్ 40.6 శాతం మేరకు వార్షిక వృద్ధి నమోదు చేసుకోగలదని కూడా ‘ఫోర్బ్స్’ పత్రిక తన అంచనాను ప్రకటించింది. భారత్ ఆరోగ్యరంగంలో ఏఐ విస్తరణ దిశగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. టాటా గ్రూప్కు చెందిన ‘టాటా ఎల్క్సి’ ఏఐతో పనిచేసే మెడికల్ ఇమేజింగ్ పరికరాల తయారీ కోసం పనిచేస్తోంది. మన దేశానికి చెందిన డిజిటల్ హెల్త్కేర్ స్టార్టప్ సంస్థ ‘ప్రాక్టో’ తన టెలిమెడిసిన్ సేవల కోసం బహుభాషా సామర్థ్యం కలిగిన ఏఐ సాంకేతికతను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ‘సిగ్టపుల్’ రక్త నమూనాలను దూరం నుంచే విశ్లేషించి, వ్యాధుల వివరాలను వెల్లడించగలిగే ‘డిజిటల్ పాథాలజీ ప్లాట్ఫామ్’ను ప్రారంభించింది. ఇది స్పెషలిస్టులు, హీమాటాలజిస్టుల అవసరం లేకుండానే ఏ ప్రాంతంలో ఉన్న రోగులకైనా రక్తపరీక్షల వివరాలను అందించగలదు.ఏఐ తెచ్చిన మార్పులుఆరోగ్యరంగంలో ఏఐ ఇప్పటికే చాలా మార్పులు తెచ్చింది. అయితే, ఈ మార్పుల ఫలితాలు ప్రపంచం అంతటా ఇంకా పూర్తిగా విస్తరించలేదు. మరో ఐదేళ్లలో ఆరోగ్యరంగంలో ఏఐ మరింతగా విస్తరించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య వైద్యసేవలలో ఏఐ ఇప్పటి వరకు తెచ్చిన కొన్ని మార్పులు ఇవి:ఏఐ వల్ల వ్యాధినిర్ధారణ సులభతరంగా మారింది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే వంటి వాటిని ఏఐ శరవేగంగా విశ్లేషించి రోగ నిర్ధారణ చేయగలుగుతోంది. ఈ పరీక్షలను విశ్లేషించడంలో మానవ తప్పిదాలకు కొంత ఆస్కారం ఉండేది. ఏఐ వినియోగంతో ఎలాంటి తప్పిదాలకు తావులేని పరిస్థితి ఏర్పడింది.ఏఐ సహాయంతో పలు దేశాల్లోని ఆస్పత్రులు విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించగలుగుతున్నాయి. ఏఐ వినియోగం వల్ల శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం పెరగడమే కాకుండా, శస్త్రచికిత్సకు పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గుతుండటం విశేషం.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందిçంచే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.మానసిక సమస్యలతో బాధపడేవారికి చికిత్సను అందించడంలోను, మానసిక సమస్యల లక్షణాలను ముందుగానే గుర్తించడంలోను ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.ఔషధ తయారీ సంస్థలు, ఔషధ పరిశోధనలు నిర్వహించే సంస్థలు ఔషధాల ఆవిష్కరణకు, కొత్త ఔషధాల రూపకల్పనకు కూడా ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి.పలు దేశాల్లోని ఆస్పత్రులు ఏఐ సాంకేతికతను వ్యాధి నిర్ధారణకు విరివిగా వాడుకుంటున్నాయి. వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షల విశ్లేషణతో పాటు, ఎక్స్రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈసీజీ, టూడీ ఎకో తదితర నివేదికలను నిమిషాల్లోనే విశ్లేషించి, భవిష్యత్తులో రానున్న వ్యాధులను గుర్తించడానికి కూడా ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందించే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.ఏఐ డాక్టర్లా? మజాకా?‘ఏజెంట్ హాస్పిటల్’లోని ఏఐ డాక్టర్లన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో శిక్షణ పొంది; వైద్య శాస్త్ర విషయాలను, వ్యాధి నిర్ధారణ పద్ధతులను ఆకళింపు చేసుకుని; రోగుల పరిస్థితికి తగినట్లుగా స్పందించడంలో మానవ వైద్యుల కంటే మిన్నగా రూపొందినవి. వైద్యరంగంలోని వివిధ అంశాలపై కూలంకషమైన పరిజ్ఞానం పొందడానికి సాధారణంగా ఏళ్లతరబడి కృషి అవసరమవుతుంది. ఈ ఏఐ డాక్టర్లు మాత్రం కొద్దివారాల్లోనే అంతటి పరిజ్ఞానాన్ని పొందడం విశేషం. సాధారణమైన జలుబు దగ్గు మొదలుకొని అత్యంత సంక్లిష్టమైన జన్యువ్యాధులకు, ఆటోఇమ్యూన్ వ్యాధులకు సైతం ఈ ఏఐ డాక్టర్లు సమర్థంగా చికిత్సలు అందిస్తుండటం విశేషం. నవజాత శిశువుల నుంచి వయోవృద్ధుల వరకు రకరకాల వయసుల్లోని రోగులకు తగిన రీతిలో ఊరటను అందిస్తూ, తగిన చికిత్సతో ఏఐ డాక్టర్లు రోగ నిదానం చేయడమే కాకుండా, రకరకాల మానసిక సమస్యలతో బాధపడే రోగులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన కలిగిస్తుండటం మరింత విశేషం. ఏఐ డాక్టర్లు ఔట్ పేషెంట్లకు వర్చువల్ రియాలిటీ ద్వారా సత్వర సేవలను అందిస్తున్నాయి. -
మాసిడోనియా జిలేబీ, మొఘలాయ్ పరోటా ట్రై చేయండిలా..!
కోల్కతా మొఘలాయ్ పరోటాకావలసినవి: మైదా పిండి– 2 కప్పులు, ఉప్పు– అర టీస్పూన్, నీళ్ళు– తగినన్ని, గుడ్లు– 4 , ఉల్లిపాయ– 1 (మీడియం సైజు, చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 3 (చిన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్– 1 టీస్పూన్, కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు– తగినంత, చిల్లి ఫ్లేక్స్, మిరియాల పొడి, గరం మసాలా– అర టీస్పూన్ చొప్పున, కీమా– అర కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తరువాత, కొద్దికొద్దిగా నీళ్ళు కలుపుతూ, చపాతీ పిండి కంటే కొంచెం మృదువుగా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దకు నూనె రాసి, ఒక తడి క్లాత్తో కప్పి కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు పక్కన ఉంచాలి. ఇలా చేయడంతో పిండి బాగా నాని, పరోటాలు సాఫ్ట్గా వస్తాయి. ఈలోపు ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకుని, వేడి కాగానే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, చిల్లి ఫ్లేక్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, మైదా పిండి జల్లుకుంటూ, దీర్ఘచతురస్రాకారంగా, బాగా పలుచటి చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పరోటాలో, నాలుగు టేబుల్ స్పూన్ల కీమా–మసాలా మిశ్రమాన్ని నింపుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని, చివర్లు చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి పరోటాను అలానే చేసుకుని, పాన్ లో కొద్దికొద్దిగా నూనె పోసుకుని, ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.తూలుంబా మాసిడోనియా జిలేబీకావలసినవి: పంచదార– 3 కప్పులు, ఏలకుల పొడి– అర టీ స్పూన్నిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్, నీళ్లు, నూనె– సరిపడామైదాపిండి– 2 కప్పులు, బేకింగ్ పౌడర్– ఒక టీస్పూన్, గుడ్లు– 6తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పులు నీళ్లు, అర కప్పు నూనె వేసుకుని, బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ చిన్న మంట మీద పెట్టి, మరుగుతున్న మిశ్రమంలో కొద్దికొద్దిగా మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. ముద్దలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. తర్వాత గుడ్లు కొట్టి అందులో వేసుకుని బాగా గిలకొట్టినట్లుగా, క్రీమ్లా మారేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కవర సాయంతో, కేక్స్పైన డిజైన్స్ వాడే కోన్స్లా చేసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె కాచి, దానిలో ఈ కోన్స్ తో గట్టిగా నొక్కి, ముక్కలుగా కత్తెరతో కట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈలోపు పంచదార, సరిపడా నీళ్లు, ఏలకుల పొడి, నిమ్మరసం వేసుకుని లేత పాకం పట్టుకుని.. ఆ పాకంలో వేగిన ముక్కలను వేసుకుని నాననిచ్చి సర్వ్ చేసుకోవాలి.పనీర్ బర్ఫీకావలసినవి: పనీర్ తురుము– ఒక కప్పుమిల్క్ క్రీమ్– పావు కప్పు, పంచదార పొడి– రుచికి సరిపడాఏలకుల పొడి– చిటికెడు, నెయ్యి– 4 లేదా 5 టేబుల్ స్పూన్లుపిస్తా, కుంకుమపువ్వు– కొద్దికొద్దిగా (గార్నిష్ కోసం, సన్నగా తరిగినవి)తయారీ: ముందుగా నాన్–స్టిక్ పాన్లో నెయ్యి వేసుకుని, వేడి చేసుకోవాలి. అనంతరం దానిలో పనీర్ తురుము, మిల్క్ క్రీమ్, ఏలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉంచి, ఆ మిశ్రమంలో పంచదార పొడి వేసుకుని, సుమారు 5 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం దగ్గరపడగానే చిన్న చిన్న పేపర్ కప్స్లో నింపుకుని చేత్తో ఒత్తుకుని నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవాలి. (చదవండి: అప్పుడు ఆశ్చర్యపరిచాయి..ఇప్పుడు అలవాటుగా మారింది..! విదేశీ మహిళ ప్రశంసల జల్లు) -
కాల్గరీ.. హోరాహోరీ..
పండుగల్లో జరుపుకొనే సంబరాలకు సాహస విన్యాసాలు కూడా తోడైతే, ఆ మజానే వేరుంటుంది. కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్కు చెందిన కాల్గరీ నగరంలో జరిగే ‘కాల్గరీ స్టాంపీడ్ ఫెస్టివల్’ అలాంటిదే! ఇది కెనడియన్ పశ్చిమ సంస్కృతికి ప్రతీక. ప్రతి ఘట్టంలోనూ ఉద్వేగం, ప్రతి క్షణమూ ఆశ్చర్యం ఈ వేడుక ప్రత్యేకత! హార్స్ రైడింగ్లు, బుల్ ఫైటింగ్లతో ఈ సంబరాలు హోరెత్తిపోతాయి. ఈ పండుగను ‘ప్రపంచంలోనే గొప్ప ఔట్డోర్ షో’ అని పిలుస్తారు. ఈ పండుగను జూలై మొదటి శుక్రవారం నుంచి ప్రారంభించి, పదిరోజుల పాటు నిర్వహిస్తారు. ఈసారి జూలై 4న మొదలైన ఈ వేడుక జూలై 13వ తేదీ వరకు జరగనుంది. కెనడా చరిత్రను కళ్ళకు కట్టే ‘చక్–వ్యాగన్’ రేసులను ‘హాఫ్–మైల్ ఆఫ్ హెల్’ అని పిలుస్తారంటే అర్థం చేసుకోవచ్చు, ఆ పోటీల్లో ఎంతటి ఉత్కంఠ ఉంటుందో! ‘ఇవి కేవలం ఆటలు కాదు, నైపుణ్యానికి, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనాలు’ అంటారు స్థానికులు. ఈ పదిరోజులు రాత్రిపూట కల్గరీ నగరం విద్యుద్దీపాల ధగధగలతో మెరిసిపోతుంది. అలాగే అంతర్జాతీయ కళాకారుల సంగీత కచేరీలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. ఇక్కడ పాశ్చాత్య సంగీతానికి చిందులు వేస్తూ అలుపు లేకుండా ఆనందించవచ్చు. స్థానిక కళలు, రుచికరమైన ఆహార పదార్థాలు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అద్భుతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన పోటీలు, స్నేహపూర్వక వాతావరణం కలగలిసిన కాల్గరీ స్టాంపీడ్, జీవితంలో ఒక్కసారైనా చూడదగిన అద్భుతమైన పండుగ! -
జంభాసుర సంహారం
పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మ కోసం తపస్సు చేసి, అనేక దివ్యవరాలు పొందాడు. అంతటితో సంతృప్తి చెందక శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుతో శివుడిని మెప్పించి, వరాలుగా అనేక దివ్యాయుధాలను పొందాడు. ఇన్ని వరాలు పొందిన తాను త్రిలోకాధిపత్యం సాధించాలని తలచాడు. తలచినదే తడవుగా పెద్దసంఖ్యలో రాక్షస సైన్యాన్ని సమకూర్చుకుని; స్వర్గ, మర్త్య, పాతాళ లోకాల మీదకు దండయాత్రకు బయలుదేరాడు.మర్త్య పాతాళ లోకాలు జంభాసురుడికి తేలికగానే వశమైపోయాయి. స్వర్గంపై దండెత్తిన జంభాసురుడి రాక్షస సైన్యానికి, దేవ సైన్యానికి భీకర యుద్ధం జరిగింది. జంభాసురుడి ధాటికి తట్టుకోలేక దేవతలు చివరకు ఓటమిని అంగీకరించి, స్వర్గాన్ని విడిచిపెట్టి పారిపోయారు. స్వర్గం నుంచి పారిపోయిన దేవతలు భూలోకంలోని ఒక పర్వతారణ్య ప్రాంతానికి చేరుకున్నారు. అది వాలఖిల్యాది మహర్షుల తపోభూమి. దేవగురువు బృహస్పతి కూడా అక్కడకు చేరుకున్నాడు. బృహస్పతి ఆధ్వర్యంలో దేవతలంతా మహర్షుల వద్దకు వెళ్లి, వారికి తమ గోడు చెప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీమహావిష్ణువును ఆశ్రయించడం తప్ప వేరే దిక్కులేదని వాలఖిల్యాది మహర్షులు దేవతలకు చెప్పారు. శ్రీమహావిష్ణువు భూలోకంలో దత్తాత్రేయుడిగా అవతరించి, సహ్యాద్రి ప్రాంతంలో విహరిస్తున్నాడని తెలిపారు. అతడు మదవతీ మద్యలోలుడిగా, నింద్యాచారుడిగా కనిపిస్తాడని; అతడిని సేవిస్తూ కనిపించే మదవతి సాక్షాత్తు లక్ష్మీదేవి అని, అతడిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టమని, గత్యంతరం లేదు కనుక అతడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించక తప్పదని మహర్షులు చెప్పారు.మహర్షుల మాటలతో ఇంద్రాది దేవతలు బృహస్పతిని ముందు నిలిపి, సహ్యాద్రి ప్రాంతానికి వెళ్లారు. కొంత వెదుకులాట తర్వాత దత్తాశ్రమాన్ని కనుగొన్నారు. ఆశ్రమం లోపల ఉన్న గది మధ్యభాగంలో విశాలమైన తల్పంపై మానినుల ఒడిలో విశ్రాంతిగా సేదదీరుతూ, ఒక భామిని ముందుగా తాను రుచి చూసి, చషకంలో నింపి అందిస్తున్న రకరకాల మధువులను అదేపనిగా తాగుతూ దత్తాత్రేయుడు కనిపించాడు. ఆశ్రమంలోని దృశ్యానికి దేవతలందరూ చకితులయ్యారు. వారు ఒకరికొకరు సైగలు చేస్తూ ఆశ్రమంలో ఎవరికి వారే సర్దుకున్నారు. దత్తాత్రేయుడికి, ఆయన ఆశ్రమ వాసులకు సేవలు చేయడం మొదలుపెట్టారు. ఇంద్రుడు స్వయంగా దత్తాత్రేయుడికి ఆంతరంగిక సేవకుడయ్యాడు. కొన్నాళ్లు గడిచాక దత్తాత్రేయుడు తనకు ఆంతరంగికంగా మెలగుతూ, అన్ని సేవలూ చేస్తున్న ఇంద్రుడిని పిలిచి, ‘ఎవరు మీరంతా? ఆశ్రమంలోకి వచ్చి, ఏమీ అడగకుండా మా అందరికీ ఎందుకు సేవలు చేస్తున్నారు?’ అని అడిగాడు. దత్తాత్రేయుడు అన్నిరోజుల తర్వాత నోరుతెరిచి ప్రశ్నలు అడగటంతో ఇంద్రుడు అతడి పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. తర్వాత లేచి, వినయంగా వంగి నిలబడి, ‘దత్తయోగీంద్రా! ఏమీ తెలియనట్లు నువ్విలా అడగడం విడ్డూరంగా ఉంది. నేను ఇంద్రుడిని. నాతో వచ్చిన మిగిలిన వారంతా దేవతలు. జంభాసురుడు దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకోవడంతో దిక్కుతోచక ఇక్కడకు వచ్చాం. నీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాం’ అని బదులిచ్చాడు ఇంద్రుడు.‘ఏమిటీ? నువ్వు దేవేంద్రుడివా? వీరంతా దేవతలా? అష్టదిక్పాలకులతో సేవలు పొందే నీ సేవలు నేను పొందడమా? అపచారం.. అపచారం. నేను నీ సేవలు పొందడం గాని, మా ఆశ్రమవాసులు దేవతల సేవలు పొందడం గాని తగనిపని. ఈ క్షణం నుంచి మీరందరూ మీ సేవలను విరమించుకోండి. మీకే మేమంతా సేవలు చేసి, తరిస్తాం. ఇక జంభాసురుడు ఆక్రమించుకున్న స్వర్గాన్ని తిరిగి నువ్వు పొందడానికి సహకరించమంటావా? తప్పకుండా! నేను ఆచారభ్రష్టుడినైన మామూలు తపస్విని. మా ఆశ్రమవాసులను చూశావు కదా, మేమెంతటి వీరులమో నీకు అర్థమయ్యే ఉంటుంది. రణరంగానికి రాలేము గాని, శిబిరాల్లో ఉంటూ, క్షతగాత్రులకు సేవలు చేయడం ద్వారా సహకరించగలం’ అని పలికాడు దత్తాత్రేయుడు.‘దత్తయోగీంద్రా! కాపాడవలసిన నాథుడే మాతో పరాచికాలడటం తగునా? నువ్వు అనుగ్రహించకుంటే, సేవలు చేసుకుంటూ ఇదే ఆశ్రమంలో ఉండిపోతాం’ అన్నాడు ఇంద్రుడు.‘దేవేంద్రా! అపార్థం చేసుకున్నావు. నా దినచర్య కళ్లారా చూశావుగా, ఇంద్రియాలనే జయించలేని నేను ఇంద్రుడికి సహకరించడమా, విడ్డూరం! మీకు ఏ సేవలు అందించాలో ఆజ్ఞాపించండి. తప్పకుండా ఆ సేవలు అందిస్తాం’ అన్నాడు దత్తాత్రేయుడు.‘స్వామీ! నీ పరీక్షలను తట్టుకోలేం. నువ్వు జగన్నాథుడివైన శ్రీమన్నారాయణుడివని నాకు తెలుసు. నీకు అనుదినం చషకంతో మధువును అందించే భామిని సాక్షాత్తు లక్ష్మీదేవి అని కూడా తెలుసు. నీ ఆశ్రమ బృందం, మధుసేవ, మానినీ వినోదం అంతా మాయ అని తెలుసు. మా అపరాధాలకు ఇదే విరుగుడు’ అంటూ ఇంద్రుడు దత్తాత్రేయుడి పాదాల వద్ద మోకరిల్లి, పాదాలను పట్టుకున్నాడు.దత్తాత్రేయుడు పకపక నవ్వి, ‘నీ స్వర్గాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. జంభాది రాక్షసులను నాకు కనిపించేలా చేయి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను’ అని అభయమిచ్చి పంపాడు.దత్తత్రేయుడి ఆశీస్సులతో ఇంద్రుడు దేవతలతో బయలుదేరి, జంభాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. దేవతలకు, రాక్షసులకు భీకర సంగ్రామం జరిగింది. యుద్ధంలో దేవతలు పారిపోతున్నట్లు నటించి, రాక్షసులను దత్తాశ్రమం వరకు తీసుకొచ్చారు. ఆశ్రమంలో సౌందర్యరాశిలా కనిపించిన లక్ష్మీదేవిని చూసి, రాక్షసుల మతులు పోయాయి. వారు ఆమెను తమ నాయకుడైన జంభాసురుడికి సమర్పిస్తే, సంతోషిస్తాడని తలచారు. తమ మాయతో బంగారు పల్లకిని సృష్టించి, అందులో కూర్చోమని లక్ష్మీదేవిని గద్దించారు. ఆమె దత్తాత్రేయుని వైపు చూసింది. కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. ఆమె నెమ్మదిగా వచ్చి, పల్లకిలో కూర్చుంది. అంతటి సౌందర్యరాశి కూర్చున్న పల్లకిని భుజాల మీద మోయడం కంటే తల మీద మోయడం బాగుంటుందనుకుని, రాక్షసులు ఆమె కూర్చున్న పల్లకిని నెత్తికెత్తుకుని మోసుకుపోయారు.అప్పుడు దత్తాత్రేయుడు, ‘దేవతలారా! మీ కోరిక నెరవేరింది. లక్ష్మీదేవి వారి నెత్తికెక్కింది. అంటే, వారికి సర్వనాశనం తప్పదు’ అన్నాడు. ఆ మాటలతో దేవతలు రెట్టించిన ఉత్సాహంతో చేతికందిన ఆయుధాలను పట్టుకుని, రాక్షసుల వెంట పడ్డారు. అప్పటి వరకు విజృంభించిన రాక్షసులు ఒక్కసారిగా నీరసించి, యుద్ధరంగంలో పిట్టల్లా రాలిపోయారు. చివరకు జంభాసురుడు ఇంద్రుడి వజ్రాయుధానికి బలయ్యాడు. స్వర్గం తిరిగి దేవతల వశమైంది.∙సాంఖ్యాయన -
అప్పుడు ఎస్కేప్... ఇప్పటికీ వాంటెడ్!
2023 జనవరి 7న ఒకేరోజు హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన ఐదు పోలీసుస్టేషన్ల పరిధిలో పంకజ్ అలియాస్ పింకు నేతృత్వంలోని గ్యాంగ్ విరుచుకుపడింది. కేవలం రెండున్నర గంటల వ్యవధిలో ఏడు చైన్ స్నాచింగ్స్ చేసిన ఈ ముఠా 20 తులాలకు పైగా బంగారం కాజేసింది. వీళ్లను పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్లకు (ఎస్వోటీ) చెందిన 14 ప్రత్యేక బృందాలు ఐదు రాష్ట్రాల్లో గాలించినా, పాత్రధారి తప్ప సూత్రధారి చిక్కలేదు. 2016లోనూ ఇదే పంథాలో పంజా విసిరిన ఈ ముఠా నాయకుడు అప్పట్లో ‘చిక్కడం–పారిపోవడం’తో ఇప్పటికీ వాంటెడ్గానే ఉన్నాడు.ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఉన్న 12 గ్రామాలకు చెందిన కొందరు దేశవ్యాప్తంగా స్నాచింగ్స్ చేయడాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. పోలీసు పరిభాషలో వీటిని బవారియా గ్యాంగ్స్గా పిలుస్తారు. ఆ జిల్లాలోని బడా కాన్పూర్ గ్రామానికి చెందిన మన్ప్రీత్ అలియాస్ మంగళ్ నేతృత్వంలో పనిచేసే ముఠాలో పింకుతో పాటు రాజీవ్, గోవింద్ సభ్యులుగా ఉండేవారు. 2016 ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చిన మంగళ్ గ్యాంగ్ శాస్త్రీపురంలో డెన్ ఏర్పాటు చేసుకుంది. సైబరాబాద్ పరిధిలో సీరియల్ స్నాచింగ్స్ చేసింది. ఆ ముఠాలో సభ్యుడిగా ఉన్న గోవింద్ను రాజేంద్రనగర్ పోలీసులు అదే ఏడాది మార్చిలో అరెస్టు చేశారు. అప్పటికి పరారీలోనే ఉన్న మంగళ్ షామ్లీ జిల్లాలోని అహ్మద్గఢ్, బడా కాన్పూర్ కాలా, నయాబస్ గ్రామాలకు చెందిన సోను కుమార్, రాజీవ్ కోహ్లీ, పింకులతో మరో ముఠా కట్టాడు. ఈ గ్యాంగ్ 2016 మార్చి రెండో వారంలో హైదరాబాద్ వచ్చింది. వస్తూ వస్తూ ఢిల్లీ నుంచి రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రైలులో పార్సిల్ ద్వారా తీసుకువచ్చింది. వీళ్లు పీర్జాదిగూడ ఆదర్శ్నగర్ కాలనీలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు. 2016 మార్చి 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని సైదాబాద్, చందానగర్, కేపీహెచ్బీ కాలనీ, మీర్పేట్ తదితర ఠాణాల పరిధిలో పన్నెండు స్నాచింగ్స్ చేశారు. వీటితో పాటు మరో రెండు చోట్ల స్నాచింగ్కు విఫలయత్నాలు చేశారు. అప్పట్లో ఈ ఉదంతాలు సంచలనం సృష్టించడంతో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 2016లో రెండో దఫా జరిగిన సీరియల్ స్నాచింగ్స్ను సీరియస్గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా వేటాడి వారం రోజుల్లోనే పింకును పట్టుకున్నారు. అతడిని అదుపులో ఉంచుకుని మిగిలిన వారి కోసం గాలిస్తుండగా, అదను చూసుకుని పారిపోయాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు అనేక ప్రాంతాల్లో గాలించారు. రాజస్థాన్లో నయాబస్ గ్రామంలో అతడి ఆచూకీ కనిపెట్టి, మరోసారి పట్టుకున్నారు. ఈ ప్రయత్నాల్లో అతడికి గాయం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులే అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. దీన్నీ పింకు తనకు అనువుగా మార్చుకున్నాడు. ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ తీసుకురావాలని పోలీసులు భావించారు. ఈ విషయం అక్కడి న్యాయస్థానం వరకు వెళ్లడంతో చికిత్స పూర్తయ్యే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. దీంతో పింకు కోసం ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడే ఉంచిన అధికారులు కొన్ని రోజులు అతడిపై కన్నేసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. గాయాల నుంచి కోలుకున్న పింకు ఆ విషయం బయటపడనీయకుండా క్షతగాత్రుడిగానే నటిస్తూ వచ్చాడు. ఒకరోజు హాస్పిటల్ వద్ద కాపలాగా ఉన్న పోలీసు కళ్లుగప్పి పారిపోయాడు. దీంతో అవాక్కైన అధికారులు ఇక్కడ నుంచి అదనపు సిబ్బందిని పంపారు. వాళ్ల కృషి ఫలితంగా ఒక స్నాచర్ చిక్కగా, పింకు సహా ముగ్గురు పరారీలోనే ఉండిపోయారు. కొన్నాళ్లకు పింకు విషయాన్ని పోలీసులు మరచిపోయారు. ఇలాంటి అదను కోసమే వేచి ఉన్న అతడు 2023లో మరోసారి పంజా విసిరాడు. మరో ముగ్గురితో ముఠా కట్టి ఆ ఏడాది జనవరి 8న బెంగళూరులో నేరాలు చేసి, మరుసటి రోజు హైదరాబాద్ వచ్చాడు. నాంపల్లిలో ద్విచక్ర వాహనాన్ని తస్కరించిన ఈ ముఠా, ఉప్పల్లో మొదలెట్టి రామ్గోపాల్పేట వరకు వరుసపెట్టి ఏడు చైన్ స్నాచింగ్స్ చేసింది. ఈ నేరాలు చేయడానికి పింకు సహా నలుగురు హైదరాబాద్ రాగా, ఇద్దరు కాచిగూడ రైల్వేస్టేషన్లోనే వేచి ఉన్నారు. స్నాచింగ్స్ చేయడానికి వాడిన వాహనాన్ని పింకు, మరో నిందితుడు రామ్గోపాల్పేటలో వదిలేసి కాచిగూడ వచ్చి మిగిలిన ఇద్దరితో కలిసి పారిపోయారు. బవారియా గ్యాంగ్ 2016–23 మధ్య హైదరాబాద్పై మూడుసార్లు పంజా విసిరింది. 2016 ఫిబ్రవరిలో మంగళ్ నేతృత్వంలో పింకు సహా నలుగురు వచ్చి స్నాచింగ్స్ చేయగా, గోవింద్ ఒక్కడే చిక్కాడు. అదే ఏడాది మార్చిలో మంగళ్ లీడర్గా పింకుతో పాటు మరో ఇద్దరితో కలిసి వచ్చి నేరాలు చేశారు. ఆ కేసుల్లో కేవలం సోను మాత్రమే చిక్కాడు. 2023 జనవరిలో పింకు నేతృత్వంలో మంగళ్ (ఇతడు మరో మంగళ్), లక్ష్మణ్, సెహ్వాగ్ వచ్చి రాచకొండ, హైదరాబాద్ల్లో ఏడు స్నాచింగ్స్ సహా తొమ్మిది నేరాలు చేశారు. ఈసారి మంగళ్ మాత్రమే చిక్కగా, పింకు సహా ముగ్గురు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. చోరీ సొత్తు సైతం వారి వద్దే ఉండిపోవడంతో రికవరీ కాలేదు. ఈ స్నాచర్ల కోసం పోలీసులు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో గాలించారు. టాస్క్ఫోర్స్, ఎస్వోటీ బృందాలు ఉత్తరప్రదేశ్లోని షామ్లీ, బవారియాలలో గాలించినా, పింకు మాత్రం చిక్కలేదు. -
ఈ వారం కథ: నీడకు పట్టిన చీడ
ముంబై–బెంగళూరు నేషనల్ హైవేలో ఓ కారులో వేగాన్ని సూచించే ముల్లు నూటయాభై కిలోమీటర్లకు అటూ ఇటూగా ఊగిసలాడుతున్నది. డ్రైవరు మినహా కారులోని మిగతా అందరూ కడుపులోని సల్ల కదలకుండా జోగుతున్నారు. ప్రయాణం మొదలైన మూడుగంటల తర్వాత రోడ్డు పక్క చెట్లు అడ్డొచ్చినప్పుడల్లా ఉదయపు సూర్యుడి వెలుగు కారు లోపలికి పడీపడక దోబూచులాడుతున్నది. ఎప్పుడు మేలుకున్నాడో వెనకున్న కొడుకు ‘‘ఏంటి నాన్నా, చెట్లన్నీ వెనక్కి పోతున్నాయి’’ అంటూ ఊహించని ప్రశ్న వేశాడు. డ్రైవరు పక్కన కూర్చున్న నేను మెలకువగా ఉన్నా, ఏడేండ్లు కూడా నిండని వాడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. పక్కనే కూర్చున్న వాళ్ళమ్మ కూడా మౌనాన్నే ఆశ్రయించింది. నేను పుట్టిన ఊరు పుట్టపర్తి చేరేవరకు కొడుకు ప్రశ్న తిరగదోడుతూనే ఉన్నాడు. ముంబై నుంచి ఎప్పుడు ఊరొచ్చినా విమానంలోనే వచ్చి వెళ్ళే వాళ్ళం. అందుకే మా కొడుక్కు రైలు ప్రయాణానుభవం లేదు. వాడి స్కూలు కూడా ఇంటికి అందుబాటులో ఉండడంతో బస్సు ప్రయాణం కూడా అందనిదే! అందుకే చెట్లెందుకు వెనక్కి పోతున్నాయో అనే ప్రశ్న వాడి బుర్రలోకి వచ్చిందనుకుంటా.నేనిప్పుడు ముంబైలోని హోమీబాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ సైంటిస్టుగా ఉద్యోగం చేస్తున్నానంటే మా గురువు రాఘవేంద్రరావు సారు పుణ్యమే! నేనెప్పుడు మా ఊరు పుట్టపర్తి వచ్చినా,హైస్కూల్లో నాకు భౌతికశాస్త్రం పాఠం చెప్పిన ఆ సారు ‘దర్శనం’ చేసుకోకుండా వెళ్ళిన సందర్భమే లేదు. దర్శనం అని ఎందుకన్నానంటే ఆయన నాకు కేవలం గురువే కాదు దైవం కూడా!చాలాసార్లు నా భార్య ‘‘ఎందుకు ఆ సారు అంటే అంత ఇష్టం? ఆ ఒక్క సారు పాఠం చెబితేనే నువ్వు ఇంతటి సైంటిస్టయ్యావా? ఎప్పుడో పదో తరగతిలో పాఠాలు చెప్పిన సారును గుర్తు పెట్టుకుని వాళ్ళింటికి వెళ్తావు, పాద నమస్కారం చేస్తావు, ఆయన ఎంత వారిస్తున్నా బట్టలు కొనిస్తావు. అయినా ఆ తర్వాత నీ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ గురువులకు ఎందుకు ఇంతటి గౌరవం ఇవ్వవు? ఆ సారు మాత్రమే ఎలా ముఖ్యుడయ్యాడు?’’ అంటూ ప్రశ్నించేది. నేను నవ్వేసేవాడిని. కార్లో ‘‘ఇప్పుడు ఖాళీగా ఉన్నావుగా ఆ సారు గురించి చెప్పవూ’’ అంటూ నా కూతురు స్వర్ణమ్మ గోల మొదలెట్టింది. భార్య, కొడుకు కూడా చెప్పాల్సిందే అన్నారు.‘‘ఆరున్నొక్కటి ఎనిమిది/సారంబుగ నేడు నైదు సద్గుణ మూడున్/ ధీరత రెండును తొమ్మిది/శ్రీరాముని కిత్తు నాల్గు సీతాఫలముల్’’–‘‘ఈ పద్యంలో దాగిన విషయం చెప్పిన వారికి సోమవారం బహుమతి లభిస్తుంది’’ మా పాఠశాలకు బదిలీ మీద వచ్చిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు సాయంత్రపు గంట మోగగానే, ఈ పద్యం బోర్డుపై రాసి, మేమంతా పద్యం నోటుపుస్తకంలో రాసుకున్న తర్వాతనే తాను తరగతి గది నుంచి బయటకు వెళుతూ పైమాట చెప్పాడు. అసలే చివరి పీరియడ్, ఆపై శనివారం. ఒక్కరోజు సెలవు కోసం ఆరురోజులుగా వేచి చూస్తున్న వాళ్ళం. పద్యం బుర్రలకెక్కలేదు. పైగా ‘‘సెలవురోజు కొత్తయివారితో ఇదెక్కడి గొడవ’’ ఒకరికొకరు అనుకున్నాం.సోమవారం పాఠశాలకు వెళ్ళాం. మొదటి పీరియడ్ భౌతికశాస్త్రం సారొచ్చారు. అటెండ¯Œ ్స తీసుకోగానే పాఠం మొదలెట్టారు. క్లాస్ ముగుస్తుందనగా, ‘‘మొన్న బోర్డుపై రాసిన పద్యంలో దాగిన విషయం ఎంతమంది తెలుసుకున్నారో చేతులెత్తండి’’ అన్నారు.ఒక్కరూ సారు వైపు చూడలేదు. ఒకరిద్దరు సారు వైపు చూసినా తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. చేతులెత్తలేదు. ‘‘బహుమతి నాకే మిగిలింది’’ అన్నాడు సార్.‘‘నిన్నటి పద్యంలో విషయం ఇది’’ అన్నాడు. అందరమూ బోర్డు వైపు చూశాం.బోర్డుపై అటు మూడు, ఇటు మూడు గడులు వేసి పద్యంలో అంకెలు ఒకో గదిలో ఒకటి వేశాడు. పైనుంచి కిందకి, కింది నుంచి పైకి, మూలలకి కూడమన్నాడు. ఎటు చూసినా పదిహేనే వచ్చింది. పిల్లలందరమూ ‘భలే’ అన్నట్టు చూశాం. ఈయప్ప భౌతికశాస్త్రం పాఠం చెప్పకుండా తెలుగు, లెక్కలు చెబుతున్నాడేమిటా అనుకున్నాం.బయటకు వెళుతూ పిల్లల భుజాలపై చేతులు వేసి ‘‘పద్యంలో దాగున్న విషయం ఎందుకు కనుక్కోలేదు’’ అన్నారు సారు. ‘‘మేం పద్యం కంఠస్థం చేసుకొస్తిమి సార్’’ అంటూ క్లాసులో అందరమూ ఆయన్ను కూడా తోసుకుంటూ తరగతి బయటపడ్డాం.‘‘నేను అడిగింది మీకు అర్థం కాలేదేమోలే’’ మనసులో అనుకున్నట్లు పైకే అనేశాడు సార్.మరుసటి శనివారం పీరియడ్ ముగింపు సమయంలో మరో పద్యం బోర్డుపై వ్రాశాడు.‘‘అన్నాతి గూడ హరుడవు/ అన్నాతిని గూడకున్న అసుర గురుడవు/ అన్నా తిరుమలరాయా!/ కన్నొక్కటి లేదు గాని కంతుడ గావే’’పిల్లల వైపు తిరిగి ‘‘ఈ పద్యంలోని విషయం చెప్పాలి. బహుమతి విషయం మరచిపోవద్దు’’ అన్నాడు.మరుసటి సోమవారం తిరిగి అదే పరిస్థితి. పద్యం అందరమూ కంఠస్థం చేసుకుపోయిన సంగతి చెప్పాం. సార్ మొహంలో చికాకు కనిపించింది. ‘‘తిరుమలరాయడనే తుళువ రాజవంశస్థుడికి మశూచి సోకి ఒక కన్ను పోయింది. ఎలా ఉన్నా, రాజకుటుంబంలోని వ్యక్తిని పొగడక తప్పదు. ఆ పొగడడం ఎలా అని ఆలోచించి, ‘తిరుమల రాయుడు తన భార్యతో కలిసి జంటగా ఉన్నపుడు మూడుకన్నులు కలిగిన శివుడి వంటి వాడవు, భార్యతో లేనపుడు ఒకే కన్ను కలిగిన అసురగురువైన శుక్రాచార్యుడంతంటి వాడవు. అసలు నీకో కన్ను లేదు గానీ, ఉంటే మన్మథుడంతటి అందగాడివి కదా! అని పొగిడాడని పద్య విశేషం’’ అన్నాడు.మరో పది వారాలు సారు నుంచి అలాంటివే సమస్యలు, విద్యార్థుల నుంచి కొంచెం ఇంచుమించు అదే రకం జవాబులు, లేదా ప్రశ్నకు అతకని జవాబులు. ఆ తరగతి చివరి శనివారం ‘‘సదువెందుకు సంకనాకనా పదిలముగా పదియావులు మేపుకున్న పాలిచ్చును, జున్నిచ్చును, పెరుగిచ్చును, మజ్జిగిచ్చును, గంధరమిచ్చును, పేడిచ్చును, పైగా పిడకలిచ్చును’’ అంటూ రాసి ‘‘సోమవారానికి ఈ వాక్యంలో అర్థం తెలుసుకుని రండి. ఈసారి బహుమతి ఉండదు’’ కఠినంగా అన్నాడు. తరగతి గదిలోని విద్యార్థులు మనసులో చిర్రుబుర్రులాడుకున్నారు, నాకైతే సారును తన్నాలన్నంత కోపమొచ్చింది.ఇంటికెళ్ళి అమ్మతో స్కూల్ మారతానని మొండికేశాను, అమ్మ చాలా చెప్పింది. ‘‘ఇంత దగ్గర మరో స్కూలు లేదు. వేరే స్కూలు అంటే బస్సులో పోవాలి’’ అంటూ ఎంత చెప్పినా నేను వినలేదు. ఆ రాత్రి నేను అన్నం తినలేదు. ఇంతలో మా మోడల్ పరీక్ష లొచ్చాయి. మా ముందు చదివిన వారినుంచి తెలుసుకున్న దాని ప్రకారం, మా పాఠశాలలో మోడల్ పరీక్షలు రాయడం, మంచి మార్కులు తెచ్చుకోవడం సులభం. ఎవరికి వారు పుస్తకాలు తెచ్చుకోవచ్చు. ఒకరికొకరు కాపీలు అందించుకోవచ్చు. పొట్టి జవాబులన్నీ సారోల్లే బోర్డుపై రాసేవారు. మా మోడల్ పరీక్షల నాటికి కాపీలు తెచ్చుకోనీలేదు. కనీసం కాపీలు అందించేవాళ్లు లేరు, బోర్డుపై పొట్టి జవాబులు రాసేవాళ్ళు లేరు. అందరూ తెలుసుకున్న విషయమేమంటే, ప్రిన్సిపల్ గారు కూతురి పెళ్లని మూడు నెలలు సెలవుపై వెళ్లారు. భౌతికశాస్త్రం సారు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ అయ్యారు.‘‘పది ఫైనల్ పరీక్షల్లో కూడా కాపీలు అనుమతించబడవు’’ అంటూ స్కూల్లో ప్రకటించారు. ‘‘ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్’’ అంటూ రెండు రోజులు అరిచాము. మాకు గొంతు నొప్పి మాత్రం మిగిలింది. ఇక లాభం లేదని, సారును మార్చమని డీఈవోకు లేఖ తయారు చేసుకొస్తానని మా తరగతి విధ్యార్థులకు చెప్పాను. అందరిలో ఉత్సాహం కనపడింది. నేను రాసుకొచ్చిన లేఖలో ఆ సారు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని రాశాను. ఆ ఉత్తరంపై ఇద్దరు ఆడపిల్లలు మినహా అందరూ సంతకం చేశాం. ఆ ఇద్దరి సంతకం కూడా నేనే గెలికాను. మొదటి సంతకం నాదే. సంతకం చేస్తూ గర్వంగా అనిపించింది.భౌతికశాస్త్రం సారుతో మా సమస్య తీరి పోతుందనుకున్నాం. నేను రాయడంలో తప్పో, నా రాత డీఈవోకు అర్థం కాలేదో భౌతికశాస్త్రం సారుకు ట్రాన్స్ఫర్ కాలేదు. నిరుత్సాహపడ్డాం.ఫైనల్ పరీక్షలు విద్యార్థులపై కక్ష కట్టినట్లు చాలా కఠినంగా జరిగాయి. నెలరోజుల్లో రిజల్టు వచ్చింది. ముప్పై మంది విద్యార్థుల్లో ఇద్దరే పాసయ్యారు. ఒకరు భౌతికశాస్త్రం సార్ కూతురు, రెండవవారు వారి పక్కింటి అమ్మాయి. డీఈవోకు ఉత్తరం రాసినపుడు సంతకం పెట్టకుండా వ్యతిరేకించింది వాళ్ళిద్దరే! భౌతికశాస్త్రం సారే ఆ ఇద్దరినీ మంచి మార్కులతో పాస్ చేయించుకొని ఉంటాడని తరగతిలో ఫెయిల్ అయిన వాళ్లందరమూ అనుకున్నాం.రిజల్ట్స్ వచ్చిన రోజు ‘‘నన్ను స్కూలు మార్పించమంటే మార్పించలా’’ అంటూ మా అమ్మను తిట్టాను. ‘‘బస్ చార్జీలకు కక్కుర్తిపడి పక్క ఊర్లో స్కూలుకు పోనీకుండా నేను ఫెయిల్ కావడానికి నువ్వే కారణం’’ అన్నాను. అన్నం తినకుండా అలిగి పడుకున్నాను. అన్నం తినకపోతే బతిమాలే అమ్మ ఆ రోజు బతిమాలలేదు.రాత్రి తొమ్మిది గంటలకు మా నాన్న వచ్చారు. తను అన్నం తినకుండానే నన్ను లేపాడు. కోపం కొద్ది చెంపలు పగలుగొట్టాడు. నా కన్నీళ్ళకు ఆయన కరిగిపోలేదు. నాన్న కొడుతుంటే అమ్మ అడ్డం రాలేదు. ఇంకా కొడతాడేమోనని భయపడడంతో నిక్కరు తడిసి పోయింది. ‘‘నేను తినొచ్చే లోపల స్నానం చేసిరా’’ అన్నాడు. ఏమీ మాట్లాడకుండా స్నానానికి వెళ్లిపోయాను.నేను తిరిగొచ్చే సరికి నాన్న కోపంగా లేడు, సాధారణంగా ఉన్నాడు. నాలో భయం కూడా తగ్గింది. ‘‘భౌతికశాస్త్రం సారుతో నీకు గొడవెందుకు?’’ సార్ ఇచ్చే ప్రశ్నలు, రాసే పద్యాలు, చివరగా రాసిన ఆవు–పేడ వివరాలు కూడా ఏడుస్తూనే చెప్పాను.‘‘పబ్లిక్ పరీక్షల్లో సారు కాపీలు కొట్టనీయలేదని చెప్పడం మరిచావు.’’ అసలు విషయం తెలిసిపోయినందుకు నేనేమీ జంక లేదు. ఎలాగూ ఇంకో వాయి దెబ్బలు తప్పవు, ఇక భయపడి లాభమేమిటి అనుకున్నాను. ‘‘ఇప్పుడు పడుకో పో, రేపు మాట్లాడుకుందాం.’’ నాకు రెండో వాయి పడాల్సిన దెబ్బలు మిగిలిపోయినట్లుగా అనుకుని మొండిగా పడక మీదికి చేరాను. ఒకవైపు నాన్న కొట్టిన దెబ్బల నొప్పి, మరోవైపు నా పట్ల మా అమ్మానాన్నల నిర్లక్ష్యం నన్ను రాత్రంతా నిద్రకు దూరం చేశాయి. ఏదేదో కలవరించానని అమ్మే ఉదయం చెప్పింది.నాన్న ఇంట్లో లేడు. అమ్మ రాత్రి ఉన్నంత ముభావంగా లేదు. ఉదయపు కార్యక్రమాలు ముగించుకు రాగానే సద్దన్నం పెట్టింది. తినడం ముగియగానే వీధిలోకెళ్లాను. నాలాంటి బాధితులను ఒకరిద్దరిని పలకరించాను.వాళ్ళు తిన్నవి నాకంటే పెద్ద తన్నులే. గంట తరువాత ఇంటికొచ్చాను.‘‘నాన్నకు మడి కాడికి అన్నం తీసుకుపో, నీకు కూడా అన్నం అక్కడికే పెట్టాను’’ అంది అమ్మ.‘‘అప్పుడే ఎందుకు? మధ్యాహ్నం కదా అన్నం తీసుకుపోయేది.’’ నా మనసులో, మాటలో ఏదో అసంతృప్తి.‘‘మీ నాన్న రాత్రి తినకుండానే పడుకున్నార్రా’’ అంటూ అన్నం గంప తలపైకెత్తింది. నేను ఆలోచనలో పడ్డాను. నన్ను కొట్టినందుకు బాధపడి ఉంటాడా? అందుకే అన్నం తినకుండా పడుకుని ఉంటాడా? నాకు జవాబు తోచలేదు.నాన్న నన్ను చూసి అన్నపుగంప గెనెంపై దించి కయ్యలోకి రమ్మన్నాడు, వెళ్ళాను. నాన్న మడక మేడి పట్టుకోమని చెప్పి ములుకోల చేతికిచ్చాడు. నాలుగు నిముషాలు నాతో దున్నించాడు. మడక అడ్డదిడ్డంగా పోతున్నపుడు, మేడి నా చేతిలోంచి జారిపోతున్నపుడు నాన్న నా వెనకే వస్తూ సాయం చేశాడు.అయినా మడక ఎక్కడా కుదురుగా పోలేదు. ఎలాగోలా నాన్న దున్నుతూ ఉన్న కొండ్ర దున్నేశాను. ‘‘ఇప్పుడు కొండ్ర వేయి’’ అంటూ, మేడి నా చేతికి వదిలేశాడు. నాన్న కొండ్ర వేసినప్పుడు చాలాసార్లు చూశాను. సరళరేఖలా నేరుగా దున్నడమే కదా! అనుకుని కొండ్ర వేశాను. పాము పోయినట్టు వంపు సొంపులుగా సాలు వచ్చింది. అది సరిపోదన్నట్లు, కొండ్ర మొదట్లో బారన్నర వెడల్పుతో మొదలు పెట్టింది కొండ్ర పూర్తయ్యేసరికి రెండు బార్ల వెడల్పయింది. కొండ్ర మొదట వెడల్పును, చివరి వెడల్పును కళ్ళతోనే కొలిచి సిగ్గుపడ్డాను.అప్పుడు నాన్న కాడి నుంచి ఎద్దుల పలుపులు విప్పి గెనెంపైకి తోలాడు.ఇద్దరమూ గెనం మీద కానుగ చెట్టు కింద కూర్చున్నాం.తినడానికి ఇద్దరికీ ఒకే ప్లేట్ పెట్టినట్లుంది. ఆ ప్లేటులోని కలిపి నాన్న నా చేతిలో ముద్దలు పెట్టాడు. నేను కడుపు నిండా తిన్న తరువాత గాని నాన్న ముద్ద నోట్లో పెట్టుకోలేదు. నన్నింతగా ప్రేమించే నాన్న రాత్రి అంతగా ఎలా కొట్టాడు. ఆలోచిస్తున్నాను. ఇంతలో నాన్న తినడం ముగించాడు.‘‘నీ భౌతికశాస్త్రం సారును గత ఆర్నెల్లుగా నెలకోసారైనా కలిసే వాడిని. తరగతి గదిలో నువ్వు చేయలేని పనులు, తరగతి గది బయట నువ్వు చేస్తున్న పనులు, నువ్వు నీ తోటి విద్యార్థులతో కలిసి డీఈవోకు ఉత్తరం రాయడం అన్నీ చెప్పాడు. నేనే వెళ్ళి సారును బదిలీ చేయవద్దని డీఈవోను బతిమాలుకున్నాను. నీ సిగ్గుమాలిన పనులు తెలుసుకున్న నేను నిన్ను కొట్టి దార్లోకి తెస్తానన్నాను, సారు ఒప్పుకోలేదు. అంటు కట్టాల్సిన సమయంలోనే కట్టాలి ముందు కట్టడం వల్ల ప్రయోజనం లేదన్నాడు. అందుకే పరీక్షా ఫలితాలు వచ్చేవరకు ఆగాను.’’ నాన్న చాలా అనునయంగా మాట్లాడాడు.‘‘కాపీలు కొట్టనియ్యలేదని మీ సారును నేరుగా తిట్టావు’’ అన్నాడు.ఎక్కడో తిడితే నాన్నకెలా తెలిసిందా? అని తలొంచుకున్నాను.‘‘నీ వయసులో తెలుసుకోవాల్సిన విషయమేమంటే, చదువు వృక్షమైతే దాని స్థాయిని అంచనా వేసేందుకు ఆధారపడేవే పరీక్షలనే నీడలు, అనేకసార్లు ఆ పరీక్షలనే నీడలకు చీడ పడుతుంది. పరీక్షల సమయంలో కాపీలు అందజేసే తల్లిదండ్రులు, కాపీలు అందజేసే టీచర్లు, పొట్టి జవాబులు బోర్డుపై రాసే టీచర్లు, రావలసిన మార్కులకంటే ఎక్కువ మార్కులు వేయించే ఉపాధ్యాయులు విద్యార్థుల నాశనం కోరేవాళ్ళే తప్ప వారి మంచి కోరేవాళ్ళు కాదు. వాళ్ళతో పాటు స్కూల్లో తక్కువ శాతం పాస్ కావడానికిఅధ్యాపకులను, అధికారులను దూషించిన రాజకీయ నాయకులు కూడా విద్యార్థుల నాశనం కోరే వాళ్ళేనని తెలుసుకో. అంతగాక, చదువుకున్న సబ్జెక్టు పూర్తిగా అర్థం చేసుకుని, తక్కువ మార్కులు తెచ్చుకున్నా సరే, ఆ విద్యార్థే జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించగలడని గుర్తుంచుకో’’ అప్పటికి నాన్న మోరల్ పాఠం చెప్పడం ఆపాడు. కాని, నాకు జవాబు తెలియని రెండు కొత్త ప్రశ్నలు వేశాడు.‘‘ఇప్పుడు చెప్పు, నువ్వు కొండ్ర సరళరేఖలా వేసి ఉండాలి కదా? ఎందుకు సరళ రేఖలా రాలేదు?’’‘‘అదే అర్థం కాలేదు నాన్నా. నేను ఆ ఎదురుగా గెనుం వైపుండే వెంపల చెట్టుకు దారం పట్టినట్లు నేరుగా మడక సాలు తోలితే సరళరేఖలా కొండ్ర వస్తుందనుకున్నాను, ఎందుకో రాలేదు.’’‘‘రెండో ప్రశ్న, కాలం మొదలై ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పుడు ముగుస్తుంది?’’ కొండ్ర సరిగ్గా రాలేదని నేను సిగ్గు పడుతుంటే ఈసారి నాన్న నా తల తిరిగే ఈ ప్రశ్న వేశాడు. బిక్క మొహం వేశాను.‘‘ఏమో నాకెట్ల తెలుస్తుంది?’’ అన్నాను.‘‘అదే పుస్తకంలో చదువుకు, విజ్ఞానానికి తేడా. సాయంత్రం మీ భౌతికశాస్త్రం సార్ దగ్గరికి వెళ్ళి ఈ రెండు ప్రశ్నలకు జవాబు అడుగు. వారు సమాధానం చెబుతారు. అప్పుడే నీకు సార్ తిట్టుకు అర్థం తెలుస్తుంది’’ అన్నాడు.ఏ తిట్టు గురించా అని ఆలోచిస్తున్నాను. అంతలో నాన్నే చెప్పాడు.‘‘సదువెందుకు సంకనాకనా, పదిలముగా పది యావుల మేపుకున్న...’’ అనేదే అన్నాడు.సంకోచంగా నాన్న వైపు చూశాను. ‘‘సారు ఏమనడులే వెళ్ళు’’ అన్నాడు.సార్ దగ్గరికి వెళ్లడానికి నాకే సిగ్గుగా ఉంది, తప్పదని వెళ్ళాను.‘‘రారా శీనయ్య, బాగున్నావా?’’ అన్నాడు సారు, మా ఇంట్లో జరిగింది, మా పొలంలో జరిగింది ఏమీ తెలియనట్లు, సారు కళ్ళతో కుర్చీ చూపించాడు కూర్చోమని. రెండోసారి నోటితో చెప్పాడు. సారుకు కాస్త దూరంగా నేలపై కూర్చున్నాను.‘‘సార్ మా నాన్న రెండు ప్రశ్నలకు జవాబు తెలుసుకుని రమ్మన్నాడు, అందుకే వచ్చాను’’ అన్నాను. రెండు ప్రశ్నలు చెప్పాను. సార్ జవాబు చెప్పలేదు. వాళ్ళ కూతురు, నా సహాధ్యాయి అయిన శారదను నీళ్ళు తీసుకు రమ్మన్నాడు. ఆమె ఇచ్చిన నీళ్ళు తాగాను.‘‘శీనయ్య ప్రశ్నలు మళ్ళీ చెప్పు’’ అన్నాడు. మళ్ళీ అడిగాను.‘‘మన స్కూల్ నుంచి నేరుగా ఎంత దూరం వరకు రోడ్డు చూడగలవు?’’ అంటూ నన్ను ప్రశ్నించారు సారు. ఒక కిలోమీటరు దూరంలో మలుపు వస్తుందని గుర్తెరిగి, ‘‘ఒక కిలోమీటర్ చూడగలం సార్’’ అన్నాను.‘‘మరి స్కూల్ వద్ద నుంచి చూస్తే ఎంత వెడల్పు కనబడుతుందో అంతే వెడల్పు కిలోమీటరు దూరంలో కూడా అనిపిస్తుందా?’’‘‘స్కూల్ వద్ద మూడు బార్ల వెడల్పు అనిపిస్తుంది సార్, ఆ కిలోమీటరు దూరంలో బారెడు వెడల్పు మాత్రమే స్కూల్ నుంచి చూస్తే అనిపిస్తుంది సార్’’ అంటూ జవాబిచ్చాను.‘‘అంటే రోడ్డు వెడల్పు ఒకటే, మన దృష్టిలో తేడా ఉంది కదా! రోడ్డంతా ఒకే వెడల్పు ఉన్నట్లు కొలవడం చదువు. దృష్టిలో తేడాతో వెడల్పు ఎలా తగ్గిందో తెలుసుకోవడం విజ్ఞానం’’ చెప్పారు సారు. శారద అక్కడే నిల్చుని ఉంది. సార్ నా అవివేకాన్ని తెలుపుతూ ఉంటే విని, ఆ అమ్మాయి సంతోషిస్తున్నదేమోననే అనుమానమొచ్చింది. అయినా చేయగలిగిందేముంది? సిగ్గుతో అలాగే కూర్చున్నాను.‘‘ఇక నీ రెండవ ప్రశ్న. కాలం మొదలై ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పుడు ముగుస్తుంది?’’ నా ప్రశ్న నాకే అప్పజెప్పాడు. ‘జవాబు తెలుసా’ అన్నట్లు కూతురి వైపు చూశాడు సారు.‘‘తెలియదు నాన్నగారు’’ అంది. తన మాటతో నన్ను అవమానించడానికే శారద అక్కడ ఉందని అనుకోలేకపోయాను. నా సిగ్గు కొంత తగ్గింది.‘‘ఇప్పుడు క్రీ.శ.2025 కదా! కాలం ఈ 2025 ఏళ్ళ క్రితం మొదలు కాలేదు. రోమన్ సామ్రాజ్యం నాలుగువేల ఏండ్ల నాటిది కదా! అప్పుడూ కాలం మొదలు కాలేదు. మూడు వందల మిలియన్ల సంవత్సరాల ముందు డైనోసార్లున్నాయి కాబట్టి అప్పుడూ కాలం మొదలు కాలేదు. హిందూ పురాణాల్లో చెప్పినట్లు నాలుగు యుగాల ముందూ కాలం మొదలు కాలేదు.’’ సారు జవాబు చెప్తుండగానే యుగాలు ఏవేవి నాన్నా అంటూ అడిగింది శారద. సార్ జవాబు చెప్పాడు.‘‘పోనీ కాలం ఎప్పుడు అంతమవుతుందో చెప్పు’’ అన్నాడు తన కూతుర్ని చూసి.ఆ అమ్మాయి తనకు తెలీదన్నట్లు బిక్కమొహం పెట్టింది.‘‘కాలం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడానికి స్కేలు కోసం వెతకడమే చదువు. కాలం కూడా వలయంలా ఉంటుందేమో, తుది మొదలు లేనిదేమో అని తెలుసుకోవడమే విజ్ఞానం.’’ అంటూ ముగించాడు సారు.ఏదో గొప్ప విషయం తెలుసుకున్నట్లు శారద మొహంలో వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగు నాలో ఎందుకు లేదో, సార్ నాకు చెప్పాలనుకున్నాడెమో శారదను లోపలికి వెళ్లమన్నాడు.‘‘చదువుకు, విజ్ఞానికి తేడా మీ క్లాసులో ఒకసారి చెప్పాను గుర్తుందా?’’ అన్నాడు. తల అడ్డంగా ఊపాను.‘‘సదువెందుకు సంకనాకనా పదిలముగా పది యావుల మేపుకున్న... అంటూ ఆపాడు.గుర్తొచ్చినట్లు తలూపాను.‘‘కంఠస్థం చదువుల కంటే, కాపీలు కొట్టి పాస్ కావడం కంటే, మార్కులు వేయించుకుని పాస్ కావడం కంటే, పది ఆవులు మేపుకోవడం మేలని తెలిసే చెప్పాను’’ అన్నాడు సార్.ఆ సారు చెప్పింది నాకేమి అర్థమైందో ఇప్పుడు చెప్పలేను గాని, మళ్ళీ స్కూలు మారతానని అమ్మా నాన్నలతో చెప్పలేదు. అదే స్కూల్లో, అదే భౌతికశాస్త్రం సారు వద్ద పదో తరగతి మళ్ళీ చదివి, జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో పదిహేనవ ర్యాంకు సాధించాను. ఇంటికి వెళ్ళి అమ్మానాన్నలను పలకరించి, నేరుగా సార్ దగ్గరకు వెళ్ళి పాద నమస్కారం చేశాను. రాఘవేంద్రరావు సార్ నన్ను పొత్తిళ్లలోని కన్నబిడ్డను అదుముకున్నట్టు హృదయానికి హత్తుకున్నాడు. ఏమనుకున్నారో నా భార్యా పిల్లలు కూడా నా తర్వాత వారికి పాద నమస్కారం చేశారు. మా అలికిడి విని సార్ కూతురు, భార్య అక్కడికొచ్చారు. నా భార్యకు వాళ్ళిద్దరూ ముందే తెలుసు.నా పిల్లలకు తన కూతురిని చూపిస్తూ ‘‘అక్క పేరు శారద, తన భార్యను చూపుతూ స్వర్ణమ్మ’’ అన్నారు సార్.సారు ఇంట్లోనే టిఫిన్ తిన్నాం. అప్పుడు పిల్లల వైపు చూసి ‘‘కారులో వస్తున్నపుడు నన్ను ఏదో ప్రశ్న వేస్తిరి కదా! ఇప్పుడు సారును అడగండి’’ అన్నాను. వాళ్ళకు ఆ ప్రశ్న ఏదో గుర్తున్నట్లు లేదు. చివరికి నేనే అడిగాను.మనం ముందుకెళ్తుంటే చెట్లు వెనక్కి వెళుతున్నట్లు అన్నదానికి ‘‘సాపేక్ష చలనం అనే భావన ద్వారా అర్థం తెలుసుకోవాలి’’ అంటూ సార్ సమాధానం ముగించాడు.‘‘అర్థం కాలేదు తాతా’’ అంది నా కూతురు స్వర్ణమ్మ.‘‘రైలులో సీట్లు, లగేజ్, తోటి ప్రయాణికులు మనతో పాటే స్థిరంగా ఉన్నట్లు తోస్తుంది. కానీ రైలుబోగీలు, రైలులో సీట్లు, లగేజ్, రైలుతో పాటు ముందుకు సాగుతున్నాయి. మనం రైల్లో స్థిరంగా ఉన్నట్లు అనిపించడం వలననే, భూమిపై స్థిరంగా ఉన్న చెట్లు వేగంగా వెనక్కి పోతున్నట్లు అగుపిస్తాయి. నిజానికి చెట్లు కూడా భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. ఈ పరస్పర వేగ వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే సాపేక్ష వేగం.’’ ఆ సాపేక్ష వేగంలోని తేడా వలననే చెట్లు వెనక్కి పోయినట్లపిస్తుంది. మాట ముగించి ‘‘అర్థమైందా రాఘవేంద్రా’’ అన్నాడు సారు, తన పేరును తనే పలుకుతూ.‘‘అయినా సాపేక్ష వేగం గురించి అర్థం చేసుకోవడానికి నీ వయసు చాలదురా నాన్నా. ఇప్పుడు మీరు చదివే చదువు రేపటి మీ విజ్ఞానానికి తోడ్పడాలి. చదువు, విజ్ఞానాలలో ఏది నిజమో, ఏది నీడో మున్ముందు మీకే తెలుస్తుంది’’ అని కూడా అన్నాడు.ఆ పూట మధ్యాహ్న భోజనం కూడా అక్కడే. భోంచేసేటపుడు మా దంపతులకు జీవితంలో మరచిపోరాని పాఠం చెప్పాడు సార్. ‘‘నీ బిడ్డలకు ఎన్ని మార్కులొచ్చాయని ఎప్పుడూ అడగకు, ఆలోచించకు. వాళ్ళు చదువుతున్న అంశాలను తార్కికంగా, విమర్శనాత్మకంగా, సమగ్రంగా, అవగాహనతో చదివేటట్లు మాత్రం చూడు.’’అంత పాతకాలపు రాఘవేంద్రరావు, స్వర్ణమ్మ అనే పేర్లు తనతో పోట్లాడి మరీ మా బిడ్డలకు ఎందుకు పెట్టానో నా భార్యకు అర్థమైనట్లుగా ఆమె ముఖకవళికల్లో తోచింది.నేనెందుకు సారుతోనే కొడుకు ప్రశ్నకు జవాబు చెప్పించానో పిల్లలకు అర్థమైనట్లు కూడా నాకు తోచింది. -
మేజిక్ స్టార్
ఇంద్రజాల కళను స్వయంకృషితో సాధించి, మేజిక్స్టార్గా గుర్తింపు పొందిన ప్రతిభ ఆయన సొంతం. ఆయనే భీమవరం పట్టణానికి చెందిన దంతులూరి సత్యనారాయణరాజు (బోస్). ఇంద్రజాల ప్రదర్శనలు చేయడమే కాకుండా, ఇంద్రజాల కళకు సంబంధించి పలు పుస్తకాలను కూడా రాశారు. తన ప్రదర్శనలు, పుస్తకాల ద్వారా దేశ విదేశాల్లో ‘మేజిక్ బోస్’గా ప్రసిద్ధి పొందారు. బోస్ కామర్స్లో డిగ్రీ, మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేశాక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 27 ఏళ్లు ఉద్యోగం చేసి, మేజిక్ మీద మక్కువతో 2001లో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు.తొలినాళ్లలో మేజిక్పై ఎలాంటి అవగాహన లేని బోస్, ‘మేజిక్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్’ అనే పుస్తకం చదివి, ఈ కళపై ఆకర్షితులయ్యారు. చాలామంది ఇంద్రజాలికులు గురువుల పర్యవేక్షణలో సాధన చేస్తుంటారు. బోస్ మాత్రం తనకు ప్రత్యక్ష గురువు ఎవరూ లేకపోయినా, స్వయంకృషితో, పట్టుదలతో మేజిక్ కళను సాధన చేసి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ‘మేజిక్ కళ మాత్రమే కాదు, సైన్స్ కూడా’ అంటారు బోస్. ప్రేక్షకుల ఇంద్రియాలను మభ్యపరచి, వారి తెలివితేటలను తప్పుదారి పట్టించేదే మేజిక్. ఈ కళ ఆత్మస్థైర్యాన్ని కలిగించి, ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఆలోచనాశక్తిని పెంచుతుందని కూడా ఆయన చెబుతారు.మేజిక్ స్కూల్ స్థాపనక్లోజప్ మేజిక్, కంజారింగ్ మేజిక్, స్టేజి మేజిక్, స్ట్రీట్ మేజిక్ ప్రక్రియల్లో బోస్ సిద్ధహస్తుడిగా పేరు పొందారు. ఇతరులు సులువుగా మేజిక్ నేర్చుకోడానికి అనేక పుస్తకాలు రాయడమే కాకుండా, ‘మాయాదండ’ పేరుతో ఇంద్రజాలంపై ప్రత్యేక మాసపత్రికను నడిపారు. ‘మాయాబజార్’ అనే సంస్థను నెలకొల్పి, ఆ సంస్థ ద్వారా మేజిక్ స్కూల్ను స్థాపించి, ఔత్సాహికుల అభ్యాసానికి ఉపయోగపడేలా అందులో మేజిక్ పరికరాలను అందుబాటులో ఉంచారు. సాటి మెజీషియన్లకు సేవలు అందించడానికి ‘పీపుల్స్ మేజిక్ సర్కిల్’ను ఏర్పాటు చేశారు.అసంఖ్యాకమైన అవార్డులుభీమవరం పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకుని ప్రదాన రహదారిపై మోటారు సైకిల్ నడిపి ప్రేక్షకులను విస్మయానికి గురిచేసిన బోస్– దాదాపు 38 అవార్డులందుకున్నారు. 1988లో సొసైటీ ఆఫ్ ఇండియన్స్ మెజీషియన్స్ జాతీయస్థాయి అవార్డుతో ప్రారంభమై; ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మెజీషియన్స్ అసోసియేష¯Œ గోల్డ్మెడల్, కోల్కతాలో నేతాజీ అవార్డు, గోవా భారతీయ కళారత్న అవార్డు, ఇంద్రజాల బ్రహ్మ, నేషనల్ లివింగ్ లెజండ్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు.ప్రపంచ రికార్డులుమేజిక్లో ఎన్నో పరిశోధనలు చేసిన బోస్, స్వయంగా వందకు పైగా కొత్త ట్రిక్కులు కనిపెట్టారు. మరొక వంద కొత్త మేజిక్ పరికరాలను సృష్టించారు. మేజిక్ మాయాజాలంతో ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించారు. ఆయన సాధించిన రికార్డుల్లో యూనిక్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డె¯Œ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటివి ఉన్నాయి.బిరుదులు, సత్కారాలు పీపుల్స్ మెజీషియన్, మేజిక్ స్టార్, మేజిక్ గైడ్, ఇంద్రజాల విద్యావిశారద, మేజిక్ చక్రవర్తి, మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ వంటి ఎన్నో బిరుదులతో సత్కారాలు, ప్రముఖ రాజకీయనాయకులు, సినీప్రముఖల ప్రశంసలు అందుకున్నారు.స్వదేశంలో విరివిగా ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా; సింగపూర్, మలేషియా, థాయ్లండ్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లండ్స్, ఆస్ట్రియా, వాటికన్ సిటీ, ఇటలీ తదితర దేశాల్లోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చి, అక్కడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తన మేజిక్ ప్రదర్శనల ద్వారా మూఢనమ్మకాలపై పోరాటం, బౌద్ధ ప్రచారం, జైలోని ఖైదీలకు బౌద్ధ పుస్తకాల పంపిణీ, పేద బాలలకు ఆర్ధిక సహాయం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందారు. ∙ -
మీటింగులే పెట్టని మెటాస్టార్!
∙సాక్షి, స్పెషల్ డెస్క్: చిన్న కంపెనీని నడపటమైనా పెద్ద విషయమే. అలాంటిది ఒక పెద్ద కంపెనీని నడపాలంటే? చిన్న విషయం కాదు. వేలు, లక్షల సిబ్బందిని మేనేజ్ చెయ్యాలి. మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతూ ఉండాలి. మేనేజర్ల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకోవాలి. టాప్–టు–బాటమ్ ఒక బలమైన అధికార శ్రేణి (హైరార్కీ)ని నిర్మించాలి. తన పైవాళ్లను దాటి, ఆ పైవాళ్ల దగ్గరికి వెళ్లకుండా ఉద్యోగికి పరిధులు, పరిమితులు ఉండాలి. ఇన్ని ఉంటేనే బండి పట్టాలు తప్పకుండా ఉంటుంది! అయితే... ఇవేవీ లేకుండానే ‘మెటా‘ కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్, బండిని దానంతటదే నడిచేలా చక్కగా ‘ఆటో పైలట్’ మోడ్లోకి మళ్లించారు. 1.524 ట్రిలియన్ డాలర్ల తన మెగా కంపెనీ ‘మెటా’ను– ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది..’ అన్నంత తాపీగా, స్ట్రెస్ లేకుండా – చల్ మేరా సాథీ అంటూ స్వారీ చేస్తున్నారు! ఒక్క మనిషి.. వందల బిలియన్లుప్రపంచంలోని టాప్ 10 టెక్నాలజీ కంపెనీలలో ‘మెటా’ ఒకటి. తాజా నివేదిక ప్రకారం 2025 మే మొదటి వారం నాటికి ఈ కంపెనీలో 76,834 మంది ఫుల్ టైమ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, గురుగావ్, న్యూఢిల్లీ, ముంబై నగరాలతో పాటు, ప్రపంచ దేశాలలోని అనేక ప్రాంతాలలో అసంఖ్యాకంగా మెటా ఆఫీసులు, డేటా సెంటర్లు ఉన్నాయి. 2024లో మెటా మొత్తం వార్షిక ఆదాయం 164.5 బిలియన్ డాలర్లు. మొత్తం ఆస్తులు 276 బిలియన్ డాలర్లు.మహావృక్షంలో తనూ ఒక కొమ్మే!ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమంది ఉద్యోగ పక్షులకు ఆశ్రయం ఇస్తూ, సమృద్ధిగా ఆదాయ ఫలాలను కాస్తున్న ఈ మహావృక్షంలో సీఈవో జుకర్బర్గ్ సీటెక్కడో కనిపెట్టటం కష్టం! ‘ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై..’ అన్నట్లుగానే ఆయన తన మెటా కంపెనీలో కలిసిపోయి ఉంటారు. కంపెనీని నడపటంలో ఆయన వ్యవహార శైలి భిన్నమైనది. ఒక కంపెనీకి ఉండవలసిన పద్ధతులు, నిబద్ధతలు అన్నీ ఉంటాయి కాని, వాటి ఆధారంగా మాత్రమే జుకర్బర్గ్ కంపెనీని నడపరని ‘స్ట్రయిప్’ కంపెనీ కో ఫౌండర్ జాన్ కాలిసన్తో ఇటీవల జుకర్బర్గ్ జరిపిన చిట్చాట్లో వెల్లడైంది.కోర్ ఆర్మీతోనే మాటా మంతీమీటింగులు ఉంటాయి. అస్తమానం ఉండవు. టీమ్ లీడర్లు ఉంటారు. అదే పనిగా సీఈవోను కలవరు. రిపోర్టులు తయారవుతుంటాయి. ఆ ఫైల్స్ని పట్టుకుని డైరెక్టర్లు సీఈవో కోసం వేచి చూస్తూ కూర్చోరు. జుకర్బర్గ్ కూడా ఎవరితోనూ రోజువారీ వన్–ఆన్–వన్ మీటింగ్ (ఇద్దరి మధ్య మాత్రమే జరిగే సమావేశం)లో కూర్చోరు. ‘కోర్ ఆర్మీ’ని మాత్రం ఒక పక్కన ఉంచుకుంటారు. మేనేజ్మెంట్లోని సీనియర్ లీడర్లు 25 నుంచి 30 మంది అందులో ఉంటారు. అత్యవసరం అయినప్పుడు మాత్రమే జుకర్బర్గ్ వారితో సమావేశం అవుతారు. మొత్తం మీద ఎవరి పని వారికి ఉంటుంది. గాడి తప్పకుండా ప్రతి పనీ నడుస్తుంటుంది. కంపెనీ కోసం... ఖాళీ సమయంజుకర్బర్గ్ ప్రతి రోజూ తన కోసం కొంత ఖాళీ సమయాన్ని ఏర్పరచుకుని ఉంటారు. ఆ సమయంలో తన పని గురించి ఆలోచిస్తుంటారు. పని చేస్తుంటారు. సమస్యలకు పరిష్కారాలను వెదుకుతుంటారు. తన ఉద్యోగులకు కూడా తన సమయంలో కొంత ఇస్తుంటారు. అందుకు ఫలానా సమయం అంటూ ఉండదు కానీ, కచ్చితంగా ఖాళీ అయితే ఉంటుంది. ఉద్యోగులు వచ్చి ఆయన్ని కలిసినప్పుడు ఆ ఖాళీ సమయాన్ని వారికి ఇస్తారు. లేదా, తనే ఒక టీమ్ను కలవాలనుకున్నప్పుడు ఆ ఖాళీని ఆ టీమ్ కోసం వినియోగిస్తారు. ఆ విధంగా ఉద్యోగులు ఆయన్ని కలవటం కంటే , ఉద్యోగులను ఆయన కలవటమే ఎక్కువగా ఉంటుంది. ఏ రిపోర్టూ జుకర్బర్గ్కు వెళ్లదుమెటా భారీ నెట్వర్క్లో జుకర్బర్గ్ చిన్న మీటగా మాత్రమే ఉండాలని కోరుకుంటారు. పై స్థాయిలోని వారికి ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. చర్చలు, సమావేశాలన్నవి ‘కోర్ ఆర్మీ’ గ్రూపు మధ్యలోనే ఉంటాయి. ప్రోడక్ట్ ఆపరేషన్స్ కూడా వేటికవే జరిగిపోతుంటాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యాడ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్చువల్ రియాలిటీ... ఇలా దాదాపు 15 ఆపరేషన్లకు అధిపతులు ఉంటారు. వాళ్లెవరూ నేరుగా జుకర్బర్గ్కి నివేదికలు అందించరు. బదులుగా చీఫ్ ప్రొడక్టివ్ ఆఫీసర్ క్రిస్ కాక్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేవియర్ ఒలివన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్కు వాటిని సమర్పిస్తారు. ఉద్యోగుల తర్వాతే టీమ్ లీడర్లు!జుకర్బర్గ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తారు. ప్రయోగాలకు ప్రేరణ ఇస్తారు. నిరంతరం నేర్చుకుంటూ ఉండే స్వేచ్ఛను కల్పిస్తారు. ఉద్యోగులే ఆయన కంపెనీ ఆస్తిపాస్తులు. కంపెనీ పట్ల ఉద్యోగులకు అంకిత భావం కలిగేందుకు అవసరమైన సానుకూలనమైన పని వాతావరణాన్ని కల్పిస్తారు. తమ టీమ్ లీడర్ల వ్యవహార శైలిపై ఉద్యోగుల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఏం చేయాలో చెబుతారు. ఎలా చేయాలో చెబుతారు. ఎప్పటిలోపు చేయాలో చెబుతారు. స్పష్టమైన, సాధ్యమయ్యే టార్గెట్లతో ఉద్యోగుల ద్వారా తన లక్ష్యాన్ని సాధిస్తారు. · -
క్షమాపణే శాంతి మంత్రం
ఎన్నో రక్తపు మరకలకు, ఎందరో ఆర్తనాదాలకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే హీనగుణాలే కారణమని ప్రాచీన పురాణాలే కాదు, ఆధునిక చరిత్ర కూడా చెబుతోంది. నేటికీ లోకంలో జరుగుతున్న అనేకానేక అకృత్యాలకు మూలకారణం ఈ అరిషడ్వర్గాలే! మరి, లోకాన్నే అతలాకుతలం చేసే ఈ అరిషడ్వర్గాల మెడలు వంచే గొప్ప సుగుణం ఏదైనా ఉందా అంటే, అది ‘క్షమా గుణమే’ అంటాయి అన్ని మతాలూ! ఎన్నో సందర్భాలు ఆ విషయాన్ని రుజువు చేశాయి కూడా! నిజానికి దేన్నైనా మన్నించగలిగేంత నిబ్బరం; దేన్నైనా తట్టుకోగలిగేంత సహనం; దేన్నైనా త్యజించేంత త్యాగశీలత– ఇవి మనిషికి ఊరికే వస్తాయా? క్షమ వల్ల వచ్చే మనశ్శాంతిని మనసారా నమ్మినప్పుడు, మానవత్వాన్ని ఆత్మవిలీనం చేసుకోగలినప్పుడు, స్వార్థాతీతంగా స్వచ్ఛమైన భావాలు ఉద్భవించినప్పుడు మాత్రమే వస్తాయి!గడ్డి లేని చోట ఎంత పెద్ద నిప్పు కణిక పడినా, కాసేపటికే బూడిదైనట్లు.. కోపం, ద్వేషం, ప్రతీకారం లేని మనిషి ముందుకు, ఎంతటి చెడ్డవాడు వచ్చినా గెలవలేడు అంటుంది శాస్త్రం. అందుకే ‘మనసు నిండా క్షమను నింపుకోవడం ఉత్తమం’ అంటాడు మహాభారతంలో విదురుడు. సోదరులైన పాండురాజు సంతానానికి, ధృతరాష్ట్రుడి సంతానానికీ ఎన్నోమార్లు సయోధ్య కుదర్చాలని విఫలయత్నం చేసిన ధర్మజ్ఞుడు అతడు! మరి క్షమించడం అంత తేలికా? జీవితాలను ఛిద్రం చేసిన వారిని, బంధాలను దూరం చేసిన వారిని, జీవితానికి సరిపడా దుఃఖాన్ని మిగిల్చిన వారిని నిజంగానే క్షమించగలమా? అసలు క్షమాగుణం గురించి చరిత్రేం చెప్పింది? మతమేమంటోంది? శాంతి, కరుణ, జాలి, దయ, సానుభూతి, త్యాగం, సహనం లాంటి ఉదాత్త గుణాలు కలిగిన ఉన్నతమైన మనుషులకే అసాధ్యమనిపించే క్షమాగుణం... నిత్యం ప్రతికూల ఆలోచనలతో లోలోపలే రగిలిపోయే దుర్జనులను ఎలా మార్చగలుగుతుంది?చరిత్రను తవ్వాలంటే మొదటిగా దక్షిణాఫ్రికా నుంచే మొదలుపెట్టాలి. అక్కడ జరిగినవన్నీ మనసులను మెలిపెట్టే ఉదంతాలే! అక్కడ శ్వేతజాతీయుల పాలనలో కొనసాగిన జాతి వివక్షకు లక్షలాది మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. 1948లో నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్కడి నల్లజాతీయులు అన్ని హక్కులనూ కోల్పోయారు. శ్వేతజాతీయుల దురహంకారానికీ, అమానుష చర్యలకూ ఎన్నో బతుకులు తెల్లారిపోయాయి. ఈ భయంకరమైన చీకటి కాలం నెల్సన్ మండేలా పోరాటంతో అంతమైంది. నాటి ఆకృత్యాలకు ఆయన కూడా బాధితుడే! ఏకంగా ఆయన 27 ఏళ్ల జీవితం జైల్లోనే గడిచింది. 1964 నుంచి 1990 వరకూ బందీగానే ఉన్న ఆయన బయటకి వచ్చిన తర్వాత ప్రతీకారంతో రగిలిపోలేదు. క్షమాపణ, సయోధ్య అనే అసాధారణ మార్గాలను ఎంచుకున్నారు. ప్రజాస్వామ్యం మొదలై, అధ్యక్షుడు అయిన తర్వాత ఆ దార్శనికతతోనే ‘ట్రూత్ అండ్ రీకాన్సిలియేషన్ కమిషన్’ (టీఆర్సీ) ఏర్పాటు చేశారు. జాతి వివక్ష కాలంలో జరిగిన అన్యాయాలన్నీ అప్పుడే ప్రపంచానికి తెలిశాయి. ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం నల్లజాతీయులను బాధించిన నేరస్థులను శిక్షించడం కాదు, నాటి కాలంలో జరిగిన అమానుష చర్యలను వెలికి తీయడం. అందుకే బాధితులు, నేరస్థుల మధ్య క్షమాభిక్షతో సయోధ్యను తీసుకురావడం ప్రపంచాన్నే కదిలించింది. ఎంతోమంది శ్వేతజాతి అధికారులు నల్లజాతి బాధితుల ముందే తమ నేరాలను అంగీకరించారు. అయితే ఆ ఉదంతాల్లో హృదయం ద్రవించే యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని స్వయంగా.. టీఆర్సీ చైర్మన్ ఆర్చ్బిషప్ డెస్మండ్ టుటు తన ‘నో ఫ్యూచర్ వితౌట్ ఫర్గివ్నెస్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన రాసిన ఓ గాథ ఎందరినో కంటతడిపెట్టించింది.టీఆర్సీ చైర్మన్ టుటు చెప్పిన గాథట్రూత్ అండ్ రీకాన్సిలియేషన్ కమిషన్ (టీఆర్సీ) చైర్మన్ ఆర్చ్బిషప్ డెస్మండ్ టుటు ముందు ‘వ్యాన్ డెర్ బ్రూక్’ అనే శ్వేతజాతి అధికారి తాను చేసిన నేరాలను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, చాలా నిర్లిప్తంగా అంగీకరించాడు. అప్పుడు, ‘బిట్రిస్ నాండ్రంగా’ అనే 70 ఏళ్ల నల్లజాతి వృద్ధురాలు అక్కడే కూర్చుని అతడి మాటలను స్పష్టంగా వింటోంది. బ్రూక్ చంపేసింది ఆమె కన్నకొడుకును, భర్తనే!బిట్రిస్ కొడుకును బ్రూక్ ఒక వాహనంలో బంధించి, అతని చేతులు, కాళ్లు కట్టి, ఒక నదిలోకి విసిరివేసి చంపేశాడు. కొన్ని నెలల తర్వాత బిట్రిస్ భర్తను లాక్కెళ్లి బంధించాడు. బిట్రిస్ తన భర్త కోసం ఎన్నో రోజులు వెతికింది. ఒకరోజు బ్రూక్ ‘నీ భర్తను చూపిస్తాన’ని బిట్రిస్ని తీసుకెళ్లి, ఆమె కళ్లముందే ఆమె భర్తకు నిప్పు అంటించి చంపేశాడు. కోర్టులో బ్రూక్ అహంభావాన్ని చూస్తున్న బిట్రిస్ కోపంతోనో, ద్వేషంతోనో ఊగిపోతుందని బ్రూక్స్ మాటలు విన్నవారంతా భావించారు. బ్రూక్ నేరాంగీకార ప్రకటన ముగిసిన తర్వాత బిట్రిస్ మాత్రం బ్రూక్నే కాదు, యావత్ ప్రపంచాన్నే కదిలించేలా స్పందించింది. ‘నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే! మిస్టర్ వ్యాన్ డెర్ బ్రూక్, నా కొడుకును ఎలా చంపాడో, నా భర్తను ఎలా హత్య చేశాడో చాలా వివరంగా చెప్పాడు. అతను వాళ్ళను చిత్రహింసలు పెట్టాడు. నా కొడుకు చనిపోవడానికి ముందు ఎంతగా బాధపడ్డాడో, ఎంత భయపడ్డాడో ఊహించుకోగలను.నా భర్త శరీరం తగలబడిపోవడం నేను కళ్లారా చూశాను. కాని, నాకు ఒక విషయం కావాలి. మిస్టర్ వ్యాన్ డెర్ బ్రూక్, దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయగలరా? నా కొడుకు శరీరాన్ని నదిలో విసిరేసినప్పుడు, నన్ను అమ్మా అని పిలిచాడా? అది చెప్పండి. అప్పుడు నేను వెళ్లి ఆ నదిలో ఆ అమ్మా అనే పిలుపును వెతుక్కుంటాను. నా భర్త కాలిపోతున్నప్పుడు అతి సమీపంలో ఉన్న మీకు నన్ను పిలవడం వినిపించిందా? పోనీ అది చెప్పండి. నేను వెళ్లి ఆ ప్రదేశంలో ఆ చివరి మాటను వెతుక్కుంటాను. నాకిక మీ మీద కోపం లేదు. నాకు కావాల్సింది ఈ ఒక్క వివరమే! నేను మిమ్మల్ని క్షమిస్తాను. కాని, నేను మిమ్మల్ని క్షమించాలంటే, నేను క్షమించానన్న సంగతి మీకు అర్థం కావాలి కదా! దయచేసి వచ్చి నన్ను ఆలింగనం చేసుకోండి’ అందట ఆమె. ఆ మాటల తర్వాత కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది. వ్యాన్ డెర్ బ్రూక్ ఈ మాటలకు చలించిపోయాడు. అతను ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె పాదాల వద్ద మోకరిల్లి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. బిట్రిస్, అతన్ని క్షమించి, తల్లిలా అక్కున చేర్చుకుంది. ఈ సంఘటన క్షమాగుణంలోని అపారమైన శక్తిని, నెల్సన్ మండేలా నమ్మిన సయోధ్య ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది దక్షిణాఫ్రికా ట్రూత్ అండ్ రీకాన్సిలియేషన్ కమిషన్ విజయ గాథలలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఈ కథ ఒక్క బిట్రిస్ది మాత్రమే కాదు, ఇలా బాధితులైన ఎంతోమంది నల్లజాతీయులు– జాతివివక్ష నేరాలకు పాల్పడ్డ శ్వేతజాతీయులు ఎందరినో క్షమించారు.దశాబ్దాల పాటు జైల్లో శిక్ష అనుభవించిన నెల్సన్ మండేలా– అధ్యక్షుడు అయిన తర్వాత కూడా క్షమాగుణమే ఆయుధం అన్నారు. ‘మనసులో ప్రతీకారముంటే, విషం తాగినట్లు ఉంటుంది. అది నీ శత్రువులను చంపుతుందని ఆశిస్తావు, కాని నిన్నే చంపుతుంది. ప్రతీకార చర్యల కంటే దయతో కూడిన పనులతోనే ఈ ప్రపంచంలో ఎక్కువగా సాధించగలం. క్షమ అనేది గతంలో జరిగిన వాటిని మరచిపోవడం కాదు, భవిష్యత్తును శాంతియుతంగా కొనసాగించగలగడం. అందుకే మనం గతంలోని ద్వేషాన్ని, ఘర్షణలను అధిగమించడానికి, ఉదారమైన స్ఫూర్తితో ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. క్షమాపణ ఆత్మకు స్వేచ్ఛనిస్తుంది, అది భయాన్ని తొలగిస్తుంది. అందుకే అది అంత శక్తిమంతమైన ఆయుధం’ అని చెప్పారు.2006లో పెన్సిల్వేనియాలోని ప్రశాంతమైన అమిష్ కమ్యూనిటీ (క్రైస్తవ మత సమూహం)లో ఒక విషాదం జరిగింది. తమ పిల్లలు చదివే స్కూల్లోకి ఒక దుండగుడు తుపాకీతో చొరబడి ఐదుగురు పిల్లల ప్రాణాలను తీసేశాడు. ఆ వెంటనే అతడూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన ఎవరికైనా కోపాన్ని, ప్రతీకారాన్ని కలిగించేదే. కాని, బాధిత అమిష్ కుటుంబాలు, ఆ కమ్యునిటీ చాలా భిన్నంగా స్పందించాయి. వారి స్పందన కరుణ, క్షమాగుణం, అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే, వారు దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి సానుభూతిని, మద్దతును అందించారు. వారి తమ విలువలకు కట్టుబడి, గాయాలను మాన్పడం ద్వేషం కంటే గొప్పదని నిరూపించారు. ఏసుక్రీస్తు బోధనలను అనుసరించి, కరుణలో ఉన్న శక్తిని తమ చర్యలతోనే ప్రపంచానికి చూపారు. నాటి అమిష్ కమ్యూనిటీ స్పందన చీకటిలో వెలుగులా, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే హృదయాలకు శాంతి మార్గాన్ని చూపింది.1963లో వియత్నాంలో బౌద్ధ సన్యాసి థిచ్ కాంగ్ డక్ ఆత్మార్పణ– అక్కడి అణచివేతకు వ్యతిరేకంగా జరిగింది. అసాధారణ పోరాటానికి, అద్భుత క్షమాగుణానికి అది సాక్ష్యమని చెబుతారు. వియత్నాం ప్రభుత్వ క్రూర విధానాలకు నిరసనగా, ఆయన తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నారు. ఇది కేవలం వ్యతిరేకత కాదు, శాంతి, క్షమ పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. థిచ్ కాంగ్ డక్ నాటి దారుణమైన అణచివేతను ఖండిస్తూ, తనను తాను అర్పించుకోవడంతో పాటు కరుణతో కూడిన బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఇతరులకు హాని చేయకుండానే, అణచివేతను ధిక్కరించారు.థిచ్ కాంగ్ డక్ ఆత్మార్పణ చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. ఉన్నత ఆశయం కోసం అసాధారణ త్యాగానికి సిద్ధపడిన గొప్ప వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. మంటల్లోనూ ఆయన భంగిమలో ఉన్న ప్రశాంతత, క్షమాశక్తిని, శాంతి సందేశాన్ని మరింత బలంగా ప్రపంచానికి తెలియజేసింది.1994లో రువాండాను వణికించిన మారణహోమం, కేవలం కొన్ని నెలల్లో 8 లక్షల మందిని బలిగొంది. జాతి విద్వేషంతో దేశం ముక్కలయ్యింది. కాని, ఈ భయంకర విషాదం మధ్య, క్షమాగుణం ఆశారేఖలా వెలిగింది. గాయాలను మాన్పి, సయోధ్యను సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ద్వేషాన్ని వీడి, అవగాహనతో ముందుకు సాగడం రువాండా కోలుకోవడానికి పునాదిగా నిలిచింది. ఊహించని నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ, బాధితులు, నేరస్థులు ప్రతీకారానికి బదులుగా క్షమించుకున్నారు. ఈ చర్య అక్కడి హింసాకాండకు శాంతియుతమైన ముగింపు పలికింది. ఇందుకు ‘ఇమ్మాకులీ ఇలిబగిజా’ కథ ఓ ఉదాహరణ. 91 రోజులు బాత్రూమ్లో దాక్కుని ప్రాణాలతో బయటపడిన ఆమె, తన కుటుంబ హంతకులను క్షమించింది. ఆమెతో పాటు ఎందరో, గతాన్ని మార్చలేకపోయినా, క్షమాపణతో భవిష్యత్తును సరిదిద్దవచ్చని నిరూపించారు.2015లో చార్లెస్ట¯Œ లోని ఒక చారిత్రక చర్చిలో జరిగిన ఘోరం ప్రపంచాన్ని కదిలించింది. డిలాన్ రూఫ్ అనే శ్వేతజాతి దురహంకారి జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమంది ఆఫ్రికన్–అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం మొదట తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే, ఆ తర్వాత కనిపించిన స్థైర్యం, కరుణ ద్వేషపు చీకటిని సవాలు చేశాయి. దుండగుడి కోర్టు విచారణ సమయంలో బాధితుల కుటుంబాలు నిందితుడిని బేషరతుగా క్షమించాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో కథలు, మరెన్నో వ్య«థలు. గాయం నుంచి క్షమాపణ వరకు ఎందరో సాగించిన ప్రయాణం క్షమాశక్తిని కళ్లకు కడుతుంది. మొన్నటికి మొన్న పహల్గామ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ భార్య హిమాంశీ నార్వాల్ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె తన భర్తను కోల్పోయిన తీవ్ర దుఃఖంలో కూడా ‘ముస్లింలు, కాశ్మీరీల పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దు, శాంతిని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఆమె స్పందనపై ఎన్నో భిన్న వాదనలు వినిపించినప్పటికీ శాంతి, కరుణ, విజ్ఞత కలిగిన మనుషుల స్పందన అలానే ఉంటుందేమో అనిపిస్తుంది.ఏ మతం ఏం చెబుతోంది?బంధాలను నిలిపేటప్పుడు, మంచివాళ్లకు నచ్చజెప్పేటప్పుడు ‘క్షమయా ధరిత్రి’ అని ఉదహరిస్తారు పెద్దలు. నిజానికి అన్ని మతాలు, ఆధ్యాత్మిక మార్గాలలో క్షమాగుణమే కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ప్రతి మతమూ క్షమాపణకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. క్షమాపణ– ఈ ఒక్క పదం వెనుక అపారమైన మానసిక శక్తి, ఆధ్యాత్మిక ముక్తి దాగి ఉన్నాయి. ఇది కేవలం ఇతరులను క్షమించడం మాత్రమే కాదు, మనసును శుభ్రపరచుకోవడానికి, అంతర్గత శాంతిని పొందడానికీ ఒక ఉన్నతమైన మార్గం. ప్రతి మతమూ ఈ క్షమాగుణాన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం.హిందూ మతంహిందూ ధర్మంలో క్షమాగుణాన్ని గొప్ప సుగుణంగా పరిగణిస్తారు.వేదాలు, ఉపనిషత్తులు: ఇవి క్షమను కేవలం ఒక నైతిక నియమంగా కాకుండా, అహింస, సత్యం, అస్తేయం (దొంగిలించకపోవడం) వంటి మహత్తర ధర్మ సూత్రాలతో కలిపి ప్రస్తావిస్తాయి. అంటే ఇది ఒక జీవన విధానం అని చెబుతున్నాయి.భగవద్గీత: క్షమించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, కర్మ బంధాలు తెగిపోతాయని భగవద్గీత చెబుతుంది. భగవద్గీతలోని 13వ అధ్యాయం, 7వ శ్లోకంలో ‘అమానిత్వం, అదంభత్వం, అహింస, క్షాంతిః’ (వినయం, నిగర్వం, అహింస, క్షమ) అంటూ శ్రీకృష్ణుడు జ్ఞానానికి అవసరమైన లక్షణాలను వివరిస్తాడు. ఈ లక్షణాలు మానవుడు ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని పొందడానికి అవసరం అని బోధిస్తాడు. ఇతరులు చేసిన తప్పులను, వారివల్ల వచ్చిన కష్టాలను, అన్యాయాలను సహించి, వారి పట్ల ద్వేషం లేకుండా ఉండటమే క్షమ. ఇది కేవలం బాహ్యంగా సహించడం కాదు, అంతర్గతంగా కూడా క్షమ విలువ తెలుసుకుని; ప్రశాంతంగా, స్థిరంగా ఉండటాన్ని సూచిస్తుంది.పురాణాలు, ఇతిహాసాలు: రామాయణంలో శ్రీరాముడు చూపిన క్షమ, మహాభారతంలో యుధిష్ఠిరుడి ఓర్పు క్షమాగుణానికి గొప్ప ఉదాహరణలు. భూదేవికి ‘క్షమాదేవి’ అని పేరు. భూమి అన్నింటినీ భరిస్తున్నట్లుగా, మనం కూడా ఇతరుల తప్పులను సహించాలని దీని అర్థం. క్రైస్తవ మతంక్రైస్తవ మతంలో క్షమాపణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇది ఏసుక్రీస్తు బోధనలలోని ప్రధానాంశం.బైబిల్: ఏసుక్రీస్తు తన అనుచరులకు ‘ఏడు మార్లు డెబ్భై మార్లు’ క్షమించమని బోధించాడు ఇది ఏదో లెక్క ప్రకారం కాదు, అపరిమితంగా, నిరంతరం క్షమించాలనే అర్థంలో వివరించారు.ప్రభువు ప్రార్థన: క్రైస్తవుల ప్రసిద్ధ ప్రార్థనలో ‘మేము మమ్మును అపరాధపడిన వారిని క్షమించిన ప్రకారము మమ్మును క్షమించు’ అనేది ప్రతి క్రైస్తవుడి ప్రార్థన. ‘మనం దేవుని నుంచి కరుణను, క్షమాపణను ఆశించినట్లయితే, మనం కూడా అదే కరుణను ఇతరుల పట్ల చూపాలి’ అనేది క్రైస్తవ విశ్వాసంలో ప్రేమ, దయ, సహనానికి పునాది.ఏసు సిలువే ఓ బోధన : తనను సిలువ వేస్తున్న వారిని చూసి ‘తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు; వీరిని క్షమించుము’ అని ప్రార్థించాడు జీసస్. అందుకే క్షమాగుణానికి, నిస్వార్థ ప్రేమకు మించిన ఉదాహరణ మరొకటి లేదంటారు క్రైస్తవులు.ఇస్లాం మతంఇస్లాంలో క్షమాపణ అనేది అల్లాహ్ చెప్పిన ప్రధాన గుణాలలో ఒకటి. ముస్లింలంతా ఆ గుణాన్ని అలవరచుకోవాలని చెబుతుంది.ఖురాన్: ఖురా లో అల్లాను ‘అల్–గఫూర్‘ (సంపూర్ణంగా క్షమించేవాడు), ‘అల్–అఫువ్‘ (అత్యంత ఉపశమనం కలిగించేవాడు) అని వర్ణిస్తారు. ‘ఎవరైతే కోపాన్ని అణచుకుంటారో, ప్రజలను క్షమిస్తారో, అలాంటి సత్పురుషులను అల్లాహ్ ప్రేమిస్తాడు’ అని ఖురా¯Œ లో ఉంది.హదీసులు: ‘క్షమించిన వ్యక్తికి అల్లాహ్ గౌరవాన్ని పెంచుతాడు’ అని ముహమ్మద్ ప్రవక్త తన బోధనల్లో పదే పదే నొక్కి చెప్పారు. క్షమాగుణం వల్ల అల్లాహ్ అనుగ్రహాన్ని పొందడమే కాకుండా, మనసులో శాంతి, ప్రవక్త పట్ల ప్రేమ, గౌరవాన్ని పెంపొందించుకోవచ్చని ముస్లింలు నమ్ముతారు.రంజాన్ మాసం: క్షమాపణ కోరడానికి, ఇవ్వడానికి రంజాన్ మాసం ఒక ప్రత్యేకమైన, పుణ్యమైన సమయంగా పరిగణిస్తారు.జైన మతంఆత్మశుద్ధికి క్షమాపణే కీలకం అని చెబుతుంది జైన మతం.అహింస: జైన మతం అహింసకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. ఇది కేవలం ఇతరులకు శారీరకంగా హాని చేయకపోవడం మాత్రమే కాదు, వారి పట్ల చెడు ఆలోచనలు, భావనలు కలిగి ఉండకపోవడం కూడా ముఖ్యమే అంటుంది.పర్యూషణ పర్వం: జైనులకు పర్యూషణ పర్వం అనేది క్షమాపణ కోరడానికి, ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎనిమిది రోజుల పండుగ. చివరి రోజును క్షమాపణ దినంగా జరుపుకుంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు.కర్మ సిద్ధాంతం: క్షమించకపోవడంతో కర్మ బంధాలు పెరుగుతాయని, క్షమాపణ కర్మ నిర్మూలనకు సహాయపడుతుందని జైనం బోధిస్తుంది. అదే మోక్షానికి మార్గమంటోంది.బౌద్ధమతంబౌద్ధమతంలో క్షమాపణ అనేది కరుణ, స్నేహపూర్వక ప్రేమ, సహనం వంటి భావనలతో లోతుగా ముడిపడి ఉంది.బుద్ధుని బోధనలు: బుద్ధుడు తన ధమ్మపదంలో ‘ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము, ప్రేమతోనే జయించగలం’ అని బోధించాడు. ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, వారి మంచి కోరడం అనేది క్షమకు ఆధారమని బౌద్ధమతం చెబుతోంది. ఇతరుల పట్ల ప్రేమను పెంపొందించుకుంటే క్షమ సహజంగా వస్తుందని బౌద్ధులు నమ్ముతారు.త్రిపీఠకాలు: బౌద్ధ గ్రంథాలు క్షమను కేవలం ఒక నైతిక విధిగా కాకుండా, ఆంతరంగిక శాంతికి, ఆధ్యాత్మిక విముక్తికి అవసరమైన ఒక శక్తిమంతమైన సాధనగా వివరిస్తాయి. క్షమించడం అనేది ద్వేషాన్ని అంతం చేసే ఏకైక మార్గమని, దుఃఖం నుంచి స్వేచ్ఛను పొందే మార్గమని నొక్కి చెబుతాయి.ప్రపంచంలోని ప్రధాన మతాలన్నీ క్షమాగుణాన్ని ఆధ్యాత్మిక ఉన్నతికి, అంతర్గత శాంతికి, సామాజిక సామరస్యానికి అత్యవసరం అని బలంగా నొక్కి చెబుతాయి. క్షమాపణ అనేది మనసులోని ద్వేషం, కోపం వంటి ప్రతికూల భావాలను తొలగించి, వాటి స్థానంలో ప్రేమ, కరుణ, ప్రశాంతతలను నింపుతుంది. ఇది కేవలం ఇతరులకు చేసే మేలు మాత్రమే కాదు. అన్నింటికంటే ముఖ్యంగా, మనసుకు, ఆత్మకు మనం చేసుకునే అత్యున్నతమైన మేలు!ఏది ఏమైనా, విధి ఆడే వింతనాటకంలో కాలం చేసే గాయాలను కర్మసిద్ధాంతానికి, మనుషులు చేసిన గాయాలను ప్రతీకారేచ్ఛకు ముడిపెట్టుకోవడం మనిషికి అలవాటే! ఆ గాయం చిన్నదైనా, పెద్దదైనా మనసు లోతుల్లోంచి శాంతియుతమైన విశ్లేషణ చాలా అవసరం! అందుకే పిల్లలకు అన్నింటికంటే ముఖ్యంగా క్షమాగుణం గురించి, ఆత్మశుద్ధి గురించి బోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే, తరం మారాలన్నా, గాయం మానాలన్నా, ప్రపంచం ప్రశాంతంగా ఉండాలన్నా, రేపటి తరంలో ద్వేషానికి బదులు ప్రేమ వికసించాలి! క్షమ అనే బీజం పడాలి!చివరిగా ఒక్క మాట, ఎవరి మీదైనా కోపం, ద్వేషం లాంటివి ఏర్పడినప్పుడు.. ‘తను నన్ను బాధపెట్టి ఇన్ని ఏళ్లు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు అయ్యింది’– అనే లెక్కలు తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. -
ప్లాన్ చేస్తున్నాం కానీ...
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. నా రెండు రొమ్ముల్లో గడ్డల్లాగా ఉన్నాయి. కాని, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లా¯Œ చేస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– అనిత, విజయవాడ.మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుండగా రొమ్ముల్లో గడ్డలు కనిపిస్తే, అది చిన్న సమస్య అయి ఉండొచ్చు, కాని నిర్లక్ష్యం చేయరానిది. చాలా సందర్భాల్లో ఇది ఫైబ్రో ఎడినోమా అనే సాదారణ సమస్యగా ఉంటుంది. ఇది నొప్పి లేకుండా కనిపిస్తుంది. మీ వయస్సు, కుటుంబంలో బ్రెస్ట్ కేన్సర్ చరిత్ర, బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలుంటే, తప్పకుండా బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చెక్ చేయించాలి. గడ్డల పరిమాణం, ప్రదేశం, స్వభావం ఆధారంగా దానికి బైరాడ్స్ గ్రేడింగ్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఇది తక్కువ గ్రేడింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఇది ప్రమాదకరం కాదు. అలాగే ఇది భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్కు కూడా అంత అడ్డు రాదు. కానీ బ్రెస్ట్లో ఆకస్మికంగా వాపు, రంగు మారటం, నొప్పి రావడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుని కలవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. అలాగే స్వయంగా పరిశీలించి చూసుకోవడం వలన ఏదైనా మార్పు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. అవసరమైతే డాక్టర్ ఎఫ్ఎ¯Œ ఏసీ లేదా బయాప్సీ చెయ్యమని సూచిస్తారు. ఎక్కువ మార్పులు కనిపిస్తే శస్త్రచికిత్స కూడా చేస్తారు. ఇది ప్రెగ్నెన్సీకి ఏ ప్రమాదం చేయదు. అయితే ప్రతి మార్పును గమనిస్తూ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ, డాక్టర్ సూచించిన పరీక్షలు, స్కానింగ్లను తప్పకుండా చేయించుకోవాలి.నేను ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. మా ఫ్యామిలీలో చాలామందికి థైరాయిడ్ ఉంది. అందుకే, ప్రెగ్నెన్సీలో నాకు కూడా వస్తుందేమో అనిపిస్తోంది. ఇందుకు ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– సుమలత, నూజివీడు.మీ కుటుంబంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లయితే, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఉంటే అవి శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మెదడు అభివృద్ధి, నరాల వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ అనే థైరాయిడ్ పరీక్ష చేయించాలి. ఈ సమయంలో టీఎస్హెచ్ స్థాయి 2.5 కంటే తక్కువగా ఉండాలి. అలాగే కుటుంబంలో ఇప్పటికే థైరాయిడ్ ఉన్నవారు ఉంటే, థైరాయిడ్ యాంటీబాడీ పరీక్ష కూడా చేయించాలి. ఈ పరీక్షలో యాంటీబాడీలు పాజిటివ్గా ఉంటే, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, అలాంటి సందర్భాల్లో వైద్యుని సూచనల మేరకు తక్కువ మోతాదులో థైరాక్సి¯Œ అనే మందును వాడాలి. ప్రెగ్నెన్సీ మొత్తం వ్యవధిలో టీఎస్హెచ్ స్థాయిని ప్రతి నెలా పరీక్ష చేయాలి. మూడో నెల దాటిన తర్వాత టీఎస్హెచ్ స్థాయి 3 వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువైతే, వైద్యులు మందుల మోతాదును సరిచేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు టీఎస్హెచ్ స్థాయి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అందువలన ప్రతిసారీ పరీక్షల ద్వారా స్థాయిని గమనించి, మందుల మోతాదును మార్చుకుంటూ ఉండాలి. చాలామంది గర్భవతులకు డెలివరీ తర్వాత కూడా థైరాయిడ్ యాంటీబాడీలు కొనసాగుతాయి. అందుకే డెలివరీ అనంతరం కూడా మందులను కొనసాగించే అవసరం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా శిశువు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ముఖ్యంగా శిశువు మెదడు, చురుకుదనం, శరీరాభివృద్ధి బాగా జరగాలంటే మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ స్థాయిని 2.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే, ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం చాలా అవసరం. ∙ -
తొలి అడుగుకు భరోసా ఇవ్వాలి!
ఒక చిన్నారి పుట్టినప్పటి నుంచి తల్లి, తండ్రి, ఇల్లు, బొమ్మలు, తన పడకే ప్రపంచంగా ఉంటుంది. వాటితోనే, వారితోనే బంధం, అనుబంధం అన్నీ. ఈ పరిసరాలకు దూరంగా కొత్త వ్యక్తుల మధ్యకు, కొత్త ప్రదేశంలోని వెళ్లాలంటే అగ్నిపరీక్షే! నర్సరీ ప్రవేశం అలాంటిదే! నర్సరీ అనేది చిన్న అడుగు కాదు. జీవితంలో పెద్దమార్పు. నర్సరీకి పంపడం అన్ని రోజుల్లా ఒక మామూలు రోజు కాదు, బిడ్డ జీవితం కోసం వేసే ముందడుగు. పిల్లల మనసులో ప్రేమతో కూడిన తొలి పాఠశాల అనుభవాన్ని నాటగలిగితే, వారు భవిష్యత్తులోనూ ప్రపంచాన్ని భయపడకుండా ఎదుర్కొంటారు. ఆ మేరకు పిల్లలను నర్సరీకి పంపే ముందే వారి మనసును సిద్ధం చేయాల్సిన బాద్యత తల్లిదండ్రులదే! ఈ వయసులో పిల్లలకు అమ్మ కనిపించకపోతే, నన్ను వదిలిపెట్టిందేమో అనే భయంతో బాధపడతారు. ఇది సెపరేషన్ యాంగ్జయిటీకి దారితీస్తుంది. ఈ దశలో తల్లిదండ్రుల ప్రేమ, మానసిక మద్దతు అత్యంత అవసరం. నర్సరీలోని మొక్కలను జాగ్రత్తగా కాపాడుకున్నట్లే చిన్నారులను కూడా ప్రేమగా కాపాడుకోవాలి. వారికి దూరంగా ఉన్నా, తమకే ఆపద రాదని; ప్రమాదం జరగదని నమ్మకం కలిగించాలి. కథలతో సిద్ధం చేయండినర్సరీ లేదా ప్రీస్కూల్ అనేది పిల్లలకు తెలియని ప్రదేశం. ఆ ప్రదేశం గురించి తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యే భాషలో వివరించాలి. ‘‘నీకు తెలుసా... బంటి అనే బాబు స్కూల్కు వెళ్లి అక్కడ కొత్త అక్కలతో ఆడుకుని ఆనందించాడు తెలుసా’’ అంటూ కథల రూపంలో చెప్పి పిల్లలకు స్కూల్ పట్ల ఆసక్తి కలిగించాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లల మనసులో స్కూల్ అంటే భయం కాకుండా, ఆటలాడుకునే ప్రాంతమనే ఆలోచన ఏర్పడుతుంది. ముందుగానే పరిచయం చేయాలిఒక చిన్న పిట్ట కొత్త గూటిని ఎలాగైతే ముందుగా చుట్టూ తిరిగి గమనించి వెళ్తుందో, అలాగే పిల్లలు కూడా కొత్త ప్రదేశాన్ని ముందే చూశారంటే భయం తగ్గుతుంది. అందుకే వారిని ముందుగానే స్కూల్ ప్రాంగణానికి తీసుకెళ్లి, ‘ఇదిగో, నీ ఆటబొమ్మలు ఇక్కడ ఉంటాయి. టీచర్ అక్కలతో మాట్లాడవచ్చు’ అని చెప్పండి. ఈ పరిచయం వారిలో భరోసాను నింపుతుంది. ముందే ఆశ నింపాలిబెలూన్ చేతి నుంచి విడిచే ముందు, దాన్లో గాలి నింపుతాం. అలాగే, పిల్లలను స్కూల్లో వదిలే ముందు భరోసా అనే గాలిని నింపాలి. ‘‘కాస్సేపు ఇక్కడ ఆడుకో, ఆ తర్వాత నన్ను పిలుస్తారు. నేను వస్తాను, అమ్మ వస్తుంది’’ అని భరోసా నింపండి. మీ భయాన్ని పసిగట్టేస్తారు జాగ్రత్త‘‘పిల్లాడు ఏడుస్తాడేమో!’’ అని మీరు మనసులో అనుకుంటే, అది మీ బిడ్డకు స్పష్టంగా తెలుస్తుంది. అతడి మనస్సు మీ ముఖాన్ని అద్దంగా చూస్తుంది. కాబట్టి, మీ హావభావాల్లో ఆనందం, నమ్మకం కనిపించాలి. మీ భయం బిడ్డ మనసులోని భద్రతను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక లవ్ టోకెన్ ఉండాలి పిల్లలను స్కూల్లో వదిలే సమయంలో వారి చేతిలో ఒక చిన్న బొమ్మ, అమ్మ హ్యాంకీ, లేదా ఫోటో ఉండాలి. ఈ చిన్న చిన్న వస్తువులు అనురక్తికు సంకేతాలు. వారు తల్లికి దూరంగా ఉన్నా, ప్రేమ దగ్గరగా ఉంది అని అనిపించేలా చేస్తాయి.చిన్న విడిపోవడం – పెద్ద శాంతికి ప్రారంభంపక్షి పిల్ల తమ గూటిని వదిలి ఎగిరే ముందు చిన్న చలనం అవసరం. అలాగే, పిల్లలను స్కూల్కు తీసుకెళ్ళే ముందు ఇంట్లోనే చిన్న విడిపోవడాల్ని ప్రాక్టీస్ చేయండి. మామయ్య, చిన్నమ్మ దగ్గర అరగంట వదిలి అబ్జర్వ్ చేయండి. ఇలా వదలడం ‘అమ్మ వదిలిపోదు, నాకోసం వచ్చేస్తుంది’ అనే నమ్మకాన్ని కల్పిస్తుంది. సెపరేషన్ యాంగ్జయిటీకి ఇది దివ్యౌషధం.ప్రీస్కూల్లో చిన్నారి ఆలోచనలు... పిల్లల మెదడు ఇంకా పూర్తిగా వికసించక పోవడం వల్ల ఎందుకు స్కూల్ వెళ్తున్నాం? ఎందుకు వెళ్లాలి? అనే లాజిక్ వారికి ఉండదు. అమ్మ లేదు– భయం మొదలవుతుంది.పదజాలం పరిమితం– భావాలను చెప్పలేక తంటా పడుతుంటారు.ఎక్కువ మంది పిల్లలు– నా బొమ్మ నా వద్ద లేదు అనే అసూయ మొదలవుతుంది.క్లాస్ టైమ్, ఆట టైమ్, భోజన టైమ్– అన్నీ షెడ్యూల్, కష్టంగా ఉంటుంది. -
ప్రపంచంలో అభయారణ్యాలు
ప్రపంచంలో అభయారణ్యాలు ఉండటం సహజం. అడవులలోని కొండ కోనలను, వాగు వంకలను, చెట్టు చేమలను, పక్షులు, జంతువులను పరిరక్షించడానికి అభయారణ్యాలను ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని చోట్ల అభయారణ్యాలే కాదు, భయారణ్యాలు కూడా ఉంటాయి. ఆ అరణ్యాలలోకి అడుగు పెట్టాలంటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. సాహసించి ఎవరైనా ఆ అరణ్యాలలోకి వెళ్లినా, వారికి చిత్రవిచిత్రమైన రీతిలో అంతుచిక్కని అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అలాంటి కొన్ని భయారణ్యాల గురించి, వాటి విశేషాల గురించి తెలుసుకుందాం.ఎల్ఫిన్ ఫారెస్ట్అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న కీకారణ్యం ఇది. ఈ అడవిలోకి అడుగు పెట్టడానికి పట్టపగలు కూడా జనాలు భయపెడతారు. ఈ అడవి చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అడవిలో అమెరికన్ మూలవాసుల ఆత్మలు సంచరిస్తుంటాయని, ఒక మంత్రగత్తె ఆత్మ కూడా సంచరిస్తూ ఉంటుందని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎల్ఫిన్ అడవి నడిబొడ్డున ఒక సన్నని రాతి దారి ఉంది. మెలికలుగా ఉన్న ఈ దారిలోనే ఇక్కడ మూలవాసులు అతీంద్రియ శక్తుల కోసం ఆత్మలను ఆవాహన చేసేవారని చెబుతారు. ఈ అడవిలోని లోయకు ఎగువనున్న కొండల మీద మూలవాసుల సమాధులు ఉన్నాయంటారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే చిన్నారుల పాదముద్రలు మూలవాసుల పిల్లలవి కావచ్చని భావిస్తారు. ఈ అడవిలో కొన్ని అంతుచిక్కని హత్యలు సహా పలు అంతుచిక్కని సంఘటనలు జరిగాయి. కొందరు సాహసించి ఈ అడవిలోకి వెళితే, వాళ్లకు అంతుచిక్కని అనుభవాలు ఎదురయ్యాయని చెబుతారు. రకరకాల ప్రచారాలు, భయాల కారణంగా స్థానికులెవరూ ఈ అడవిలోకి వెళ్లడానికి సాహసించరు. అందుకే, ఈ అడవి నిత్యం నిర్మానుష్యంగా ఉంటుంది.బ్లాక్ ఫారెస్ట్పగలు, రాత్రి దాదాపు ఒకేలా ఉండే ఈ అడవి జర్మనీ నైరుతి ప్రాంతంలో ఉంది. ఈ అడవి అసలు పేరు ‘ష్వార్జ్వాల్డ్’. అడవి నిండా ఎత్తయిన చెట్లు దట్టంగా పెరిగి ఉండటంతో పట్టపగటి వేళలో కూడా ఇక్కడి నేల మీద సూర్యకిరణాలు దాదాపు పడవు. అందువల్ల పగటి వేళలో కూడా ఈ అడవి చీకటిగానే ఉంటుంది. నిత్యం చీకటిగా ఉండటం వల్లనే దీనికి ‘బ్లాక్ ఫారెస్ట్’ అనే పేరు వచ్చింది. ఈ అడవిలో కొన్ని అంతుచిక్కని సంఘటనలు జరిగాయి. ఇక్కడ కొందరు అంతుచిక్కకుండా గల్లంతైపోయారు. ఈ అడవిని అల్లుకుని ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా జర్మన్ రచయితలు బ్రదర్స్ గ్రిమ్ (జాకోబ్, విల్హెల్మ్) ‘హాన్సెల్ అండ్ గ్రెటెల్’ అనే పుస్తకం రాశారు. ఇందులో ఈ అడవిలో అంతుచిక్కకుండా తప్పిపోయిన ఇద్దరు పిల్లల ఉదంతాన్ని రాశారు. ఈ అడవిలో ఇప్పటికీ కనిపించే పిల్లల పాదముద్రలు అప్పట్లో తప్పిపోయిన వారివేనని స్థానికులు నమ్ముతారు. ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యంగా కనిపించే అడవుల్లో బ్లాక్ ఫారెస్ట్ కూడా ఒకటి.డెవిల్స్ ట్రాంపింగ్ గ్రౌండ్అమెరికాలోని ఉత్తర కరోలినాలో అడవి నడిమధ్యన ఉన్న విచిత్ర ప్రదేశం ఇది. ‘బెయిర్ క్రీక్ ’ వాగు సమీపంలో ఉన్న దేవదారు వృక్షాల అడవి నడిమధ్యన ఈ వృత్తాకర ప్రదేశం ఖాళీగా కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కనీసం గడ్డిపరకలైనా మొలవని ఈ ప్రదేశం ఇప్పటికీ ఒక అంతుచిక్కని మర్మమే! దాదాపు 40 అడుగుల పరిధిలో ఉన్న ఈ ప్రదేశంలో అడవిలో సంచరించే జంతువులేవీ అడుగు పెట్టవు. దీని సమీపానికి వచ్చినా, చుట్టూ తిరిగి వెళతాయే గాని, దీని లోపల అడుగు పెట్టి, ఇటు నుంచి అటు దాటే ప్రయత్నం చేయవు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని కొందరు ఔత్సాహికులు ఇక్కడకు పెంపుడు జాగిలాలను తీసుకు వచ్చినా, ఆ జాగిలాలు దీని చుట్టూ తిరిగి, విచిత్రంగా మొరిగాయే తప్ప దీని లోపలకు అడుగు పెట్టలేదు. ఒక్కోసారి ఇక్కడ ఎవరో పారవేసినట్లుగా అంతుచిక్కని వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే, అంతుచిక్కని పాదముద్రలు కూడా కనిపిస్తుంటాయి. అందుకే, స్థానికులు దీనిని ‘దయ్యాల మైదానం’గా అభివర్ణిస్తుంటారు. రాత్రివేళ ఇక్కడ దయ్యాలు వచ్చి ఆటలాడుకుంటూ, నృత్యం చేస్తూ కాలక్షేపం చేస్తాయని కథలు కథలుగా చెప్పుకుంటారు.ఎపింగ్ ఫారెస్ట్ఇంగ్లండ్లోని అత్యంత పురాతనమైన అడవి ఇది. దాదాపు ఆరువేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దట్టమైన అడవి అతీంద్రియ శక్తులకు ఆలవాలమని స్థానికులు చెబుతుంటారు. నాలుగు శతాబ్దాల కిందట నాటి రాజులు ఈ అడవిలో వేట సాగించేవారట! నేరాలు చేసి పారిపోయేవారికి, దోపిడీ ముఠాలకు, యుద్ధం నుంచి పారిపోయిన సైనికులకు ఈ అడవి ఒకప్పుడు సురక్షిత స్థావరంగా ఉండేదని చెబుతారు. పద్దెనిమిదో శతాబ్దిలో డిక్ టర్పిన్ అనే దోపిడీ ముఠా నాయకుడు ఈ అడవిని అడ్డాగా చేసుకుని, అటవీ మార్గం గుండా వచ్చే బాటసారులను దోచుకునేవాడు. తనను ఎదిరించేవారిని నిర్దాక్షిణ్యంగా చంపేవాడు. ఇరవయ్యో శతాబ్దిలో ఈ అడవిలో కనీసం పదకొండు హత్యలు జరిగాయని చెబుతారు. అరవయ్యేళ్ల కిందటి వరకు హంతక ముఠాలు తమ చేతిలో హత్యకు గురైనవారి మృతదేహాలను ఈ అడవిలో పారవేసేవారు. అంతుచిక్కని చాలా హత్యలకు కేంద్రంగా ఉన్న ఈ అడవిలో హత్యలకు గురైనవారి ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. ఈ అడవిలోకి అడుగుపెట్టిన కొందరు తమకు అంతుచిక్కని రీతిలో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటారు. సాహసికులు, అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులు తప్ప మామూలు మనుషులెవరూ ఈ అడవి జోలికి వెళ్లరు.డౌహిల్ ఫారెస్ట్ఇది పశ్చిమ బెంగాల్లోని కుర్సియాంగ్ పట్టణానికి చేరువలో ఉంది. ఈ అడవికి సమీపంలోనే వందేళ్ల నాటి విక్టోరియా బాయ్స్ హైస్కూల్ ఉంది. దట్టంగా దేవదారు చెట్లు పెరిగిన ఈ అడవిలోనే కాకుండా, అడవికి దగ్గరగా ఉన్న స్కూల్లో కూడా అతీంద్రియ శక్తులు సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. చీకటి పడిన తర్వాత ఈ పరిసరాల్లో మానవమాత్రులు కనిపించడం చాలా అరుదు. డౌహిల్ అడవి నుంచి విక్టోరియా బాయ్స్ హైస్కూల్ వైపు వెళ్లే దారిని ‘డెత్ రోడ్’గా పిలుచుకుంటారు. ఈ దారిలో అనేక అసహజమైన సంఘటనలు జరగడమే దీనికి కారణం. చీకటి పడ్డాక ఈ దారిలో వస్తుండగా దయ్యాలను చూశామని కొందరు చెబుతుంటారు. ఈ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు వికృతమైన నవ్వులు, భయపెట్టే ధ్వనులు వినిపించినట్లు ఇంకొందరు చెబుతుంటారు. స్థానికులు చెప్పే మరో విచిత్రమైన ఉదంతమేమిటంటే, ఈ ప్రాంతంలో రాత్రివేళ తలలేని బాలుడు ఒకడు కాపలాగా తిరుగుతుంటాడని, ఎవరైనా గమనిస్తే, పరుగుతీస్తూ అడవిలోకి పారిపోయి, అదృశ్యమైపోతాడని చెబుతారు. ఆ బాలుడికి తల ఉండదని, మెడ ఉండాల్సిన చోట ఒక నిలువైన కట్టె ఉంటుందని చెబుతుంటారు. రాత్రివేళ ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టడానికి స్థానికులు ఇప్పటికీ భయపడతారు.హోయా బాచూప్రపంచంలో అతీంద్రియ శక్తులకు ఆలవాలంగా పేరుమోసిన అడవుల్లో ‘హోయా బాచూ’ ఒకటి. ఇది రుమేనియాలో ఉంది. అడ్డదిడ్డంగా మెలికలు తిరిగి దట్టంగా పెరిగిన ఇక్కడి చెట్లను పగటి వేళలో చూస్తేనే జనాలు భయపడతారు. ఇక రాత్రివేళ అయితే, ఈ అడవి పరిసరాల్లోకి అడుగు పెట్టడానికి కూడా సాహసం చేయరు. సాధారణంగా ఈ అడవి నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు ఇక్కడి అంతుచిక్కని రహస్యాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళుతుంటారు. అలా వెళ్లినవారు కూడా చాలామంది ఈ అడవిలో కొంతదూరం ప్రయాణించాక కడుపులో వికారం మొదలై వాంతులయ్యాయని, గుండెదడ మొదలైందని చెబుతుంటారు. ఈ అడవి పరిసరాల్లో కనిపించిన ‘యూఎఫ్ఓ’ను ఒక సైనికుడు 1968లో ఫొటో తీయడంతో ఇక్కడ అతీంద్రియ శక్తులపై ప్రచారం మరింత ఎక్కువైంది. ఆ ఫొటో ప్రచారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రవేత్తల బృందాలు ఈ అడవిలో పరిశోధనలు జరిపాయి. అడవి పైనుంచి యూఎఫ్ఓ సంచరించిన ప్రాంతంలో చెట్లు చచ్చిపోయాయి. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా మొలవలేదు. దీనికి శాస్త్రవేత్తలు కచ్చితమైన కారణాలను చెప్పలేకపోతున్నారు. బహుశా, యూఎఫ్ఓ రేడియేషన్ ప్రభావం కారణంగానే ఈ ప్రదేశంలో తిరిగి మొక్కలు మొలవడం లేదని చాలామంది భావిస్తున్నారు. -
గాంధీ కొండ... చూద్దామా!
∙చెన్నాప్రగడ శర్మ, విజయవాడ విజయవాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ముచ్చటగా మూడు కొండలు. ఒకటి దుర్గ కొండ, రెండోది గాంధీ కొండ, మూడోది గుణదల కొండ. మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం గాంధీ కొండ పేరిట స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన కొండ కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది.నాటి ఓర్ కొండే నేటి గాంధీ కొండవిజయవాడ తారాపేటలో 500 అడుగుల ఎత్తున గాంధీ కొండ ఉంది. కెప్టెన్ చార్లెస్ ఓర్ అనే ఇంజినీరు 1852లో కృష్ణా నదిపై తొలి ఆనకట్ట నిర్మించినప్పుడు ఈ కొండపై నుంచే నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు. అప్పట్లో దీన్ని ఓర్ కొండ అనేవారు. దీనిపై 1948లో బాపూజీ స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. విజయవాడ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఆ తర్వాత పలు జిల్లాలు, క్రమేణా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక ఊపందుకుంది. 1921లో స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీ బెజవాడ వచ్చి కొండ దిగువన నిర్వహించిన సభలో ప్రసంగించారు. అప్పటి నుంచి ఓర్ కొండ గాంధీ కొండగా పేరు పొందింది. గాంధీ స్మారక నిధి ఇక్కడ రూపొందించిన గాంధీ స్మారక చిహ్నానికి 1964 నవంబర్ 9న నాటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పునాదిరాయి వేశారు. దేశంలో ఒక కొండపై ఉన్న మొట్టమొదటి గాంధీ స్మారక చిహ్నమిది. 1967లో అప్పటి ఉప ప్రధాని మొరార్జీదేశాయ్ గాంధీ హిల్ సొసైటీని స్థాపించారు. దశాబ్దం తర్వాత ఈ సొసైటీని గాంధీహిల్ ఫౌండేషన్ పేరిట ట్రస్టుగా మార్చారు. గాంధీజీ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 1968 అక్టోబర్ 6న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 52 అడుగుల పొడవుగల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. చికుబుకు చికుబుకు రైలే...కొండపై ప్రధానంగా ఆకట్టుకునేది పిల్లల టాయ్ రైలు. 1969లో ఇండియన్ రైల్వేస్ రైలుమార్గాన్ని వేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైలును బహూకరించింది. ఇది కొండను చుట్టివస్తుంది. లోపల కూర్చొని విజయవాడ నగరాన్ని చూడవచ్చు. ఒకప్పుడు ఈ రైలు ఎక్కేందుకు జనాలు పోటీపడేవారు. ఇప్పుడు రైల్వే ట్రాక్ పాడయింది. రైలు కూడా జీర్ణావస్థకు చేరడంతో ఏడాదిన్నరగా తిప్పడం లేదు. ప్రస్తుతం ఒకవైపు కొత్త ట్రాక్ పనులు, మరోవైపు విద్యుద్దీకరణ జరుగుతోంది.నేల మీదికి నింగి...అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి సౌండ్ అండ్ లైట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 1969లో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్ ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో గాంధీజీ జీవితం, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తారు. 1971లో ప్లానెటోరియంను ప్రారంభించారు. న్యూయార్క్కు చెందిన ఫోర్డు ఫౌండేషన్ దీనికి టెలిస్కోప్ బహూకరించింది. పిల్లలు, పెద్దలు ఎవరికైనా ప్రవేశ రుసుం 40 రూపాయలు. కనీసం పదిమందికి పైగా వస్తేనే ప్రదర్శన వేస్తారు. కొండపై గ్రంథాలయం ఒకటుంది. ఇందులో మహాత్మాగాంధీ జీవితానికి సంబంధించినవి, ఆయన స్వయంగా రాసిన పుస్తకాలు దాదాపు వెయ్యి ఉంటాయి. ఇంకా పలు ఛాయాచిత్రాలు చూడవచ్చు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా పార్కులున్నాయి. దశలవారీగా అభివృద్ధి...రాష్ట్ర విభజన అనంతరం 2017లో కొత్తగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి పేరుతో రిజిస్టర్ అయింది. కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ప్రస్తుతం గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టనున్నారు. ముందుగా కొండను సుందరీకరించనున్నారు. ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఆర్చ్ని అందంగా తీర్చిదిద్దుతారు. అక్కడి నుంచి స్థూపం వరకు అప్రోచ్ రోడ్డును అభివృద్ధి చేస్తారు. పచ్చదనాన్ని మరింత పెంచుతారు. పిల్లలు ఆడుకునే ఆట ప్రదేశాల్లో కొత్త పరికరాలను అమర్చుతారు. ఇవన్నీ అక్టోబరు రెండు నాటికి పూర్తయితే గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. గాంధీ కొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతున్నామని గాంధీ స్మారక నిధి చైర్మన్ గాంధీ పి.సి. కాజా చెప్పారు.ఫొటోలు: కిశోర్ నడిపూడి సాక్షి–విజయవాడపర్యాటకానికి అండ గాంధీ కొండవిజయవాడ నగరంలో పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల్లో గాంధీ కొండ ఒకటి. టాయ్ ట్రైన్ తిరిగినప్పుడు పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఇప్పుడది మరమ్మతులకు గురైంది. మరో ఏడాదిన్నరకుగాని పట్టాలెక్కదు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 8–30 గంటల వరకు కొండను సందర్శించవచ్చు. ఎంట్రన్్స టికెట్ 10 రూపాయలు. ప్రతి మంగళవారం సెలవు. రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారానికి అతి సమీపంలో ముఖ ద్వారం ఉంటుంది. కాలినడకన వెళ్లవచ్చు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి 1.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ∙ఉప్పలూరి రవితేజ, మేనేజర్–గాంధీ హిల్ -
కొట్టలేకపోయిన వారిని కొట్టించాడు!
∙పార్ట్–2 - కేరళలో ఇటీవల ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక స్కూల్ పూర్వ విద్యార్థులు కొందరు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ బాలకృష్ణన్, అతడి స్నేహితుడు మాథ్యూ కలిసి బాబుపై (62) దాడి చేశారు. అదేమంటే, 50 ఏళ్ల క్రితం నాలుగో తరగతిలో ఉండగా బాబు తనను కొట్టాడని, బలహీనంగా ఉన్న తాను అప్పుడు కొట్టలేకపోయానని, ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నానని చెప్పాడు. ఉస్మాన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనీస్ను భరూచ్లో పట్టుకున్న పోలీసులకు ఇదే అనుభవం ఎదురైంది. డిగ్రీ వరకు చదువుకున్న అనీస్ తెలివైనవాడే అయినా, అతడికి శరీర దారుఢ్యం లేదు. దీంతో స్కూలు, కాలేజీ రోజుల్లో కొందరు స్నేహితులు, క్లాస్మేట్స్ చేతిలో దెబ్బలు తిన్నాడు. మిగతా వారిని మర్చిపోయిన అనీస్, తనను విచక్షణారహితంగా కొట్టిన ఇద్దరు క్లాస్మేట్స్ను మాత్రం గుర్తుంచుకున్నాడు. తన ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో మంచినీళ్ల విషయమై అనీస్కు గొడవ జరిగింది. దీంతో అతడు దాడి చేసినా, ఇతడు ప్రతిదాడి చేయలేకపోయాడు. ఈ విషయంతో అతడిపైనా కక్ష పెంచుకున్న అనీస్ సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అనీస్ను భరూచ్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు సహ నిందితులు, బాలుడి ఆచూకీ కోసం ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇద్దరు క్లాస్మేట్స్తో పాటు పక్కింటి యజమానిపై కక్ష తీర్చుకోవాలని భావించిన అనీస్– వారి పేర్లు, వివరాలు చెప్పి, వాళ్లతో కలిసే నేరం చేశానని, బాలుడు వారి వద్దే ఉన్నాడని చెప్పాడు.అనీస్ పథకం విషయం తెలియని పోలీసులు బాలుడిని కాపాడాలనే ఉద్దేశంతో వారిని తీసుకువచ్చి ప్రశ్నించడం, వాళ్లు తమకు ఏమీ తెలియదని చెప్పడంతో ‘ఇంటరాగేషన్’ మొదలుపెట్టారు. వీరిలో ఓ ఏఎస్సై కుమారుడు సైతం ఉండటంతో ఆ అధికారి కూడా వచ్చి ‘ఇంటరాగేషన్’లో పాల్గొన్నారు. ఇలా నలుగురిని తీసుకువచ్చి, ‘ఇంటరాగేషన్’ చేసి, వారి పూర్వాపరాలు పరిశీలించాక టాస్క్ఫోర్స్ పోలీసులకు అనుమానం వచ్చింది. అనీస్ తప్పుదోవ పట్టిస్తున్నాడని భావించారు. అప్పటి వరకు అతడిని ‘ఇంటరాగేషన్’ చేయని అధికారులు ఆపై తమ పంథాలో ముందుకు వెళ్లారు. దీంతో అసలు విషయం చెప్పిన అనీస్, ‘వాళ్లు అందరూ ఒకప్పుడు నన్ను కొట్టారు. అప్పుడు నేను తిరిగి కొట్టలేకపోయాను. ఇప్పుడు అవకాశం రావడంతో మీతో కొట్టించాను’ అని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ పరిణామంతో పోలీసుల ట్రీట్మెంట్ కూడా మారిపోవడంతో నోరు విప్పిన అనీస్... కిడ్నాప్ చేసిన గంటలోపే అనుకోని పరిస్థితుల్లో ఉస్మాన్ తమ చేతిలో హత్యకు గురయ్యాడని బయటపెట్టాడు. కిడ్నాప్ చేసిన 2009 ఏప్రిల్ 20నే బాలుడిని తీసుకుని నిందితులు మారుతీ వ్యాన్లో శంషాబాద్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో పోలీసుల నాకాబందీ నిర్వహిస్తున్నారు. దీంతో తాము వారి కంట పడకూడదని అనీస్ తదితరులు భావించారు. అప్పటికే ఉస్మాన్ గొడవ చేస్తుండటంతో చెకింగ్ పాయింట్ దాటే వరకు నోరు మూసి, వాహనం కిటికీల్లోంచి కనపడనంత కిందకు ఉంచాలని భావించారు. ఆ ప్రయత్నాలో భాగంగా వీళ్లు పొరపాటున ఉస్మాన్ ముక్కు కూడా మూసేయడంతో చనిపోయాడు. చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత బాలుడిని గమనించిన నిందితులు అతడు చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని షాద్నగర్ సమీపం వరకు తీసుకువెళ్లి, రోడ్డు పక్కన గుంతలో పడేసి, పైన చెత్తకప్పి ఎవరికి వారుగా పారిపోయారు. బాలుడు చనిపోయిన విషయం అతడి కుటుంబానికి తెలియదు కాబట్టి తమ వద్దే ఉన్నాడని చెబుతూ డబ్బు గుంజాలనే ఉద్దేశంతో ఫోన్లు చేశాడు. ఉస్మాన్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 2009 ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్రంలోను, చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ దొరికిన గుర్తుతెలియని శవాల వివరాలను ఆరా తీశారు. వాటిలో 10–15 ఏళ్ల మధ్య వయస్సు వారివి లేకపోవడంతో ఆ దిశలో దర్యాప్తు సాగలేదు. ఉబ్బిపోయిన స్థితిలో ఉన్న ఉస్మాన్ మృతదేహాన్ని 2009 ఏప్రిల్ 23న గుర్తించిన పశువుల కాపరులు షాద్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదేదో సాధారణ కేసుగా భావించిన ఆ ఠాణా అధికారులు ఓ హెడ్–కానిస్టేబుల్ను ఘటనాస్థలికి పంపారు. అక్కడకు వెళ్లిన ఆ అధికారి మృతదేహం ఉబ్బి ఉండటంతో అది 25–30 ఏళ్ల మధ్య వయస్కుడిగా భావించి అలానే రికార్డుల్లో నమోదు చేయడంతో ఆ విషయం టాస్క్ఫోర్స్ దృష్టికి రాలేదు. ఉస్మాన్కు సంబంధించి తొలుత శాలిబండ పోలీసుస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అనీస్ నుంచి ఫోన్లు వచ్చిన తర్వాత ఇది కిడ్నాప్గా మారింది. షాద్నగర్లో మృతదేహం దొరికిన వెంటనే అక్కడ పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఈ మృతదేహానికి షాద్నగర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా, ఎందరో చంపినట్లు బయటపడంతో గుర్తుతెలియని హత్యగా కేసును మార్చారు. ఇలా రెండు పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా నమోదైన ఉస్మాన్ కేసు నాలుగు రకాలుగా మారింది. షాద్నగర్ పోలీసులు ఉస్మాన్ మృతదేహంపై లభించిన చొక్కాను భద్రపరచారు. దీని ఆధారంగానే కుటుంబీకులు అది తమ కుమారుడి మృతదేహమే అని గుర్తించగలిగారు. ఈ కేసు దర్యాప్తు మొత్తం పూర్తి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు 2009 జూన్ 9న అనీస్తో పాటు అతడి సోదరులు షంషుద్దీన్ అలియాస్ అక్రం, ఖాజీ హఫీజుద్దీన్ అలియాస్ అస్లంలను అరెస్టు చేశారు. ఈ నేరం చేసిన తర్వాత అత్యంత తెలివిగా వ్యవహరించిన అనీస్ బాలుడి కుటుంబంతో కలిసే ఉన్నాడు. ఓ దశలో పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు తనకు అనేక రుగ్మతలు ఉన్నాయని, ఇంటరాగేషన్ చేయకూడదంటూ నకిలీ పత్రాలు చూపించి బయటపడ్డాడు. వెంటనే తన తండ్రి సహాయంతో కిడ్నాప్ డ్రామా ఆడి కామాటిపురాలో కేసు నమోదు చేయించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ∙ -
ఈ వారం కథ: బదిలీ
‘వద్దు నాకు ఇష్టం లేదు.’‘వెరీ స్ట్రేంజ్ అందరూ ప్రమోషన్ కోసం ఆరాటపడతారు. మీరూ?!... ఆశ్చర్యంగా ఉందే!’‘ప్రమోషన్ వరకూ ఓకే! ప్రమోషన్ వచ్చిందంటేనే పక్కన ట్రాన్స్ఫర్ ఉంటుంది. అలా వెళ్ళటం, నాకు?! అయినా ప్రైవేట్ జాబ్లో ఓ బ్రాంచ్ నుండి ఓ బ్రాంచ్కేగా ప్రమోషన్.’ ‘మీరు ఎంచుకున్న చోటుకి వేయించుకోండి. అనుకూలమైన చోటుకి వెళ్ళండి. అంతేగాని, ప్రమోషన్ ఎందుకు వద్దూ!? ఏ ఉద్యోగంలోనైనా ఈ బదిలీలు మామూలేగా! మళ్ళీ మధ్యలో బదిలీ కావాలంటే ఉండదు ఆలోచించుకోండి’శ్రేయోభిలాషులు, ఆఫీసు మేనేజర్ ఎంత నచ్చచెప్పాలని చూసినా వినలేదు సుమబాల.ప్రమోషనూ, ట్రాన్స్ఫర్ ఆగిపోయాయి.తండ్రి లేని పిల్ల, ఏ బాధా కలగకుండా చూసుకోవటమే తల్లిగా తన బాధ్యత.విదూష ఇప్పుడు ఆరో క్లాస్ చదువుతోంది.బాల ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది.తన కంటే ముందే వచ్చి, పక్కింట్లో ఆడుకుంటున్న విదూషను తీసుకువచ్చి,స్నానం చేయించి, హోమ్ వర్క్ చేయించాలి. విదూషను తీసుకురావటానికి వెళ్ళింది. అక్కడ సింధూరతో ఆడుతోంది విదూష. ఎంతగానో చక్కగా కిలకిలలాడుతూ, నవ్వుతూ, గంతులేస్తూ ఆడుతున్న విదూషను, తీసుకుని రాలేక అలాగే సింధూర వాళ్ళమ్మతో తనూ, ఆఫీస్ విషయాలూ, లోకాభిరామాయణం మాట్లాడుతూ కూర్చుంది.‘విదూ! చీకటి పడుతోంది.హోమ్ వర్క్ చేసుకోవాలి పద నాన్నా!’లేచి సింధూరకు ‘బై’ చెప్పి తల్లి వెనుకే వచ్చేసింది. ఇంటికి వచ్చాక, సుమబాల ఇంటిపనిలోనూ, విదూష హోమ్ వర్క్లోనూ బిజీ అయిపోయారు. దాదాపు గంటన్నర తర్వాత ఇద్దరూ భోజనానికి కూర్చుని, విదూషను ‘విదూ! ఏంటి విశేషాలూ!’ అడిగింది.స్కూల్ విశేషాలు చెప్పినవి తక్కువే కాని, సింధూర గురించి చెప్పిన విషయాలే ఎక్కువున్నాయ్. విదూష ఏం చెప్పినా, విని ఆమెను అంచనా వేయటం సుమబాలకు అలవాటు. సింధూరతో తను ఎలా ఆడుకుందీ, సింధూర ఎలా తినేదీ, ఎలా మాట్లాడేదీ! ఎంతో సంతోషంగా ఏకరువు పెడుతోంది. ఆ సంతోషం చూస్తూనే...సుమబాల మనసు గతంలోకి తొంగి చూస్తోంది. సవ్యసాచిదీ, తనదీ పెద్దలు అంగీకరించిన ప్రేమవివాహం. రెండేళ్ళు ఆనందంగా గడిచినాయి. తమ కలల పంట కడుపులో ఉండగానే, సవ్యసాచి తనను వదిలేసి పైలోకాలకు పోయాడు. ఆ దుఃఖంలోంచి బయటికి రావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. సవ్యసాచికి ఓ పెద్ద ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్. అన్ని రాష్ట్రాలలోనూ బ్రాంచ్లు ఉండటం వల్ల, తరచూ కంపెనీలో ఉద్యోగులు మారుతూనే ఉంటారు.సవ్యసాచి పోయాక ఆ ఉద్యోగం తనకు ఇచ్చారు. పాప కోసమైనా కన్నీళ్లు తుడుచుకుని, జాయిన్ అయింది. తల్లిదండ్రులకు వాళ్ళు ఉన్న ఊళ్ళోనే కాలక్షేపం కనుక వారిని తీసుకొని రాలేదు.పైగా తీసుకువస్తే, తన గురించి దిగులుపడుతూ, తనను రెండోపెళ్లి కోసం ఇబ్బంది పెడతారు. అందుకే! వాళ్ళని శెలవులలో కలవడమే!కాని, తోడులేని ఒంటరి ప్రయాణం, సింగిల్ పేరెంట్గా తన అవస్థలు, పాపను పెంచటంలో తను పడే పాట్లు, ఓ గ్రంథాన్ని వ్రాయవచ్చు.ఇంటా బయటా ఎన్నో సమస్యలు తట్టుకుంటూ, మధ్యలో దూరిపోయి భయపెట్టేసే అపరిచితులను దాటుకుంటూ, తప్పించుకుంటూ, బాధపెట్టే ఎన్నో అనుభవాలు.. విదూష నుండి కూడా...పాప విదూష యూకేజీలో ఉండగా, ఓ స్కూల్లో జాయిన్ చేసింది. అక్కడ విశాలాక్షి అనే పాపతో స్నేహం కుదిరింది విదూషకు. ఎంతో చనువుగా, చక్కగా ఉండేవారు. విశాలాక్షి ఇల్లూ తమ ఇంటికి రెండు ఇళ్ళ అవతలే కాబట్టి, ఎప్పుడూ విశాలాక్షితోనే ఉండేది విదూష. వాళ్ళ నాన్న ఉంటే విదూషను బండి మీద ఎక్కించుకుని తిప్పేవారు. తను ఎక్కడ తిప్పగలదు. ఆఫీసు, ఇంటిపనీ! అప్పటికే అలసట.పాపం ఏదో కాలక్షేపం చేస్తోందిలే అనుకుంది. విశాలాక్షి తింటేనే తినేది. తను పడుకుంటేనే పడుకునేది. స్కూల్ లేని సమయంలో తప్ప దాదాపు వాళ్ళింట్లోనే ఉండేది.రెండేళ్ళలో విడదీయరాని బంధం. విశాలాక్షి తండ్రికి గవర్నమెంట్ జాబ్. ట్రాన్స్ఫర్ అయింది.విశాలాక్షితో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు.ఆరోజు విదూష ఏడ్చిన ఏడుపు, తను ఇప్పటికీ మరచిపోలేదు.‘అమ్మా! విశా కావాలమ్మా!’ అంటూ కిందపడి ఏడుస్తూ ఉంటే, ఏం చేయాలి? అనుబంధాలు పెంచుకోకూడదని చెప్పటానికీ, ఆమె వినటానికి, ఎంత వయసనీ? రెండురోజులు ఆఫీసుకు సెలవు పెట్టి, అమ్మమ్మ దగ్గరకూ, షాపింగ్లకూ తిప్పాక, వారంరోజులకు కాస్త తెప్పరిల్లింది. స్కూల్కి వెడుతోంది.రెండో తరగతిలో శశికళతో విదూషకు చక్కని స్నేహం కుదిరింది. ఒకరితో ఒకరు కలిసి హోమ్ వర్క్ చేసుకోవటం; కలిసి ఐస్ క్రీమ్లకు డబ్బులు తీసుకుపోవటం; ఇద్దరూ కలిసి ఏవో గుసగుసలు, నవ్వులూ, మరే! మరే! అంటూ ఎన్నో ముచ్చట్లు, కేరింతలూ, ఆటవస్తువులూ, బిల్డింగ్ కట్టే క్లిప్స్, బొమ్మను తయారు చేయండి అనే చార్టులూ, ఆటా, పాటా, డాన్సూ, రెండేళ్లలో శశికళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది.ఇక విదూష ఏడ్చిన ఏడుపు సుమబాల మనసును పిండేసింది. గుండెను కుదిపేసింది. ఏం చెప్పి, ఎలా చెప్పి ఓదార్చాలీ? తనకైనా బుద్ధి ఉండక్కర్లా?ఒకసారి జరిగాక జాగ్రత్త పడాలిగా!ఇంత స్వచ్ఛమైన మనసు ఇన్నిసార్లు గాయపడితే? ఈ పిల్ల ఏమైపోతుంది? ఏం చేయాలి? ఎలా జాగ్రత్త పడాలి? అసలు స్నేహాలు చేయకుండా ఎలా ఉంటాం. ప్రతిసారి ఇలా భంగపడి ఏడిస్తే ఎలా?పిల్లలంతా ఇలాగే ఉంటారా? సున్నిత మనస్కులైన ఇలాంటి పిల్లలకు ప్రత్యేక శిక్షణ, చికిత్స అవసరమా? మరి అవన్నీ ఎవరు ఇస్తారు? ఎక్కడికి వెళ్ళి ఎవరినడగాలి? సుమబాలకు ఆలోచనలతో మనసు కలచివేస్తోంది. విదూషను కాపాడుకోటం ఎలా? ఎవరైనా వ్యసనాల బారిన పడకుండా తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలి? అని ఆలోచిస్తారు. తనూ!? స్నేహం చేయకుండా ఎలా కాపాడుకోవాలి? అని ఆలోచిస్తోంది.స్కూల్లో విదూష ఎవరితోనూ స్నేహం చేయకుండా, సరైన జాగ్రత్త కోసం తనే దగ్గరుండి దింపటం, స్కూల్ వదలిన వెంటనే ఎవరితోనూ మాట్లాడకుండా తీసుకొచ్చేయటం అలవాటు చేసుకుంది.నాలుగు రోజుల నుండి విదూష దిగులుగా ఉండటం గమనించింది. గుండె గుభేలుమంది.‘విదూ! ఏమయిందిరా? అలా ఉన్నావ్?’‘అమ్మా! ట్రాన్స్ఫర్ అంటే ఏంటమ్మా?’‘ట్రాన్స్ఫర్ అంటే బదిలీ! ఉద్యోగంలో ఉన్నవారిని ఓ ఊరు నుండి మరో ఊరికి, ఉద్యోగ సేవలు ఆ ఊరిలో వారికి అందించాలని పంపిస్తారు. అలాగే, చాలా బదిలీలు... డబ్బు బదిలీ, అంటే మనీ ట్రాన్స్ఫర్... అలాగే పేపర్స్... ఇంకా...’మాట పూర్తికాక ముందే ‘అసలు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఉండకూడదమ్మా! నేను పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్నై, ఈ బదిలీలు లేకుండా చేస్తానమ్మా!’ అంటూ ఏడ్చింది.సమబాలకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.‘ట్రాన్స్ఫర్ అంటే! ఇష్టమైన వాళ్ళని వదిలేసి వెళ్ళటం అని, అంతే నాకు తెలిసిందమ్మా! అసలీ బదిలీలు ఉండకూడదమ్మా! మా స్కూల్లో శాంతారాంగాడు నాలాగానే ఫస్ట్ ర్యాంకర్. ఇద్దరం కలిసి పోటీపడి చదువుతున్నాం ఫస్ట్ యూనిట్లో తను ఫస్ట్, సెకండ్ యూనిట్లో నేను.తర్వాత నేను, ఇలా చక్కగా పక్కపక్కనే కూర్చుని, కంబై¯Œ ్డ స్టడీ చేసేవాళ్ళం. కాని, వాళ్ళమ్మకి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయింది. అమ్మ ఉన్నచోటే శాంతారాం ఉండాలిగా! వెళ్ళిపోతున్నాడు. నేను ఎవరితోనూ స్నేహం చేయకూడదమ్మా!చేస్తే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారమ్మా! ఇక అంతే, ఎవరూ వద్దు నాకు’ అంటూ గదిలోకి వెళ్ళి పడుకుంది అన్నం తినకుండా...భగవంతుడా! ఇప్పుడేమి చేయటం? ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి, తెల్లవారి స్కూల్కి వెళ్ళలేకపోతే, తనూ సెలవు పెట్టాల్సి వచ్చింది. మనసులో ఇంత సున్నితత్వం ఉండటం మంచిదే కాని, మన ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలా కాదేమో!మరోసారి ఇలా జరిగితే? ఈ సంఘటనల పర్యవసానం భవిష్యత్తులో విదూష ఆలోచనలలో జరిగే మార్పుల ఫలితం ఎలా ఉంటుంది? మంచా? చెడా?సింధూరతో విదూష స్నేహమూ బలపడుతోంది.కేవలం సింధూరతో విదూష స్నేహం కోసమే ప్రమోషన్ వద్దనుకుంది. ట్రాన్స్ఫర్ వల్ల విదూషకు కొత్త వాతావరణంలో సంతోషంగానే ఉంటుందా? సింధూర, మరో విదూషలాగా ఏడ్చి మారాం చేస్తే, ఆ తల్లికి ఎంతకష్టం! ఆ చిన్న మనసుకు ఎంత గాయం! తన పిల్ల విషయంలో జరిగింది, సింధూర విషయంలో జరగకూడదు. సింధూర విదూషను చాలా ఇష్టపడుతోంది. అందుకే ప్రమోషన్, ట్రాన్స్ఫర్ వదులుకుంది. కాని, ఇద్దరినీ సున్నితంగా నొప్పి తెలీకుండా వేరు చేయాలి. ఏదో చేయాలి. ఏం చేయాలి ఆలోచిస్తోంది సుమబాల.‘విదూ! ఈరోజు సెలవు పెట్టాం కదా! మనం ఓ చోటికి వెడదామా?’‘కరుణామయీ! వికలాంగుల సంక్షేమ ఆశ్రమం’ దగ్గర బండి ఆపి, లోపలికి తీసుకువెళ్ళింది విదూషను.అక్కడ అన్ని రూములలోనూ పిల్లలు. అందరూ వికలాంగులే! మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు.భయం భయంగా చూసింది విదూష.అందరికీ తను తెచ్చిన, స్వీట్స్ పళ్ళూ ఇప్పించింది సుమబాల. అక్కడ కన్వీనర్తో మాట్లాడుతూ కూర్చుని, విదూషను పరిశీలిస్తోంది. విదూష ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు, చూస్తూ మనసులో దేన్నో నింపుకోటానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళటానికి భయపడుతోంది.వాళ్ళల్లో కొంతమంది బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా, వీళ్ళు ఇచ్చిన, పళ్ళు తింటూ, కూర్చున్న చోటునే, విరిగిపోయిన బొమ్మలను ఏదో తోచినట్లు ఆడిస్తూ, ఆడుకుంటున్నారు.కానీ! కొంతమంది శారీరక వైకల్యం కలిగిన పిల్లలు మాత్రం విదూషతో మాట్లాడటానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వాళ్ళతో బిడియంగా, కొత్తగా ఫీలవుతూ చేయి కలిపింది విదూష.సాయంత్రం వరకూ అక్కడే ఉండి, విదూషను ఇంటికి తీసుకువచ్చింది.‘విదూ! వీరికి వేరే ప్రపంచం తెలీదు.కొంతమందికి స్నేహం చేయటమూ తెలీదు. పసితనం ఓ శాపంలా బతుకుతారు. కేవలం ఎవరు అన్నం పెడతారా? బిస్కట్ ఇస్తారా! తిందామా! ఎంత దైన్యం, కదా!’‘అమ్మానాన్నలు ఉండరా అమ్మా!’‘అమ్మ గాని, నాన్న గాని ఉంటే వాళ్ళు ఇక్కడుంటారా? చెప్పు! వాళ్ళని చూశాక నువ్వు ఎంత అదృష్టవంతురాలివీ అనుకోవాలి. అయినదానికీ కానిదానికీ ఏడ్చి అమ్మను బాధ పెట్టకూడదు. స్నేహం చేయదలచుకుంటే రోజూ అక్కడికి వెడదాం. నీ స్నేహం వాళ్ళకి పంచు. ఆనందపడతారు. అంతేగాని, ఫ్రెండ్స్ వెళ్ళిపోయినప్పుడల్లా ఏడుస్తావెందుకు?దీని ద్వారా ప్రకృతి నీకేం చెప్పదలచుకుందో అది విను. అందరితోనూ స్నేహం చేయమని, కేవలం ఏం ఒక్కరితోనో కాదని సందేశం ఇస్తోందేమో! ఏడుపు మానేస్తే అది వినబడుతుంది. మామూలు మాటలతో చెబితే ఏమీ అర్థం కాదని ఇక్కడికి తీసుకువచ్చా!’‘మరి వీళ్ళంతా నాతో స్నేహం చేసి, ఎప్పటికీ ఉంటారా?’విదూష మనసులో ఎన్నో ఆలోచనలు.‘తెలుసుకో! పదిసార్లు ఇక్కడికి వచ్చావనుకో వాళ్ళే నీ ప్రియ నేస్తాలవుతారు. ఇంకొంచెం పెద్దయ్యాక వాళ్ళ కోసం నువ్వేమైనా చేయగలనేమో అనే ఆలోచన నీకే వస్తుంది.’విదూష ఆలోచనలలో శాంతారాం వెనుక పడ్డాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సుమబాల.‘కానీ రోజూ అక్కడికి వెళ్ళటం కుదరదుగా!’అంది. సాయంత్రం రిలాక్స్ అవుతున్న సమయంలో సింధూర వాళ్ళ అమ్మగారు రావటం సుమబాలకు ఆశ్చర్యం కలిగించింది.‘ఏమిటీ! విశేషాలు?’‘మీ విదూష, మా సింధూర కలిసి మా యింట్లో ఆడుకుంటున్నారు.మీతో ఓ విషయం మాట్లాడాలని వాళ్ళకి తెలీకుండా వచ్చాను’ అంది.సుమబాల గుండె మళ్ళీ గుభేలుమంది.‘మాది హోటల్ వ్యాపారమని మీకు తెలిసిన విషయమే కదా!’‘అవును... తెలుసండీ’‘ఇక్కడ బిజినెస్ సరిగా సాగట్లేదు. అందుకని హైదరాబాద్ వెళ్లి అక్కడ బిజినెస్ చేద్దామని మావారు అంటున్నారు.అయితే. ఫ్రెండ్స్ దూరమైనప్పుడల్లా విదూష, ఆమెతో పాటు మీరు తల్లడిల్లిపోవటం విన్నాను. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అయితే విదూష గురించి బాధగా ఉంది. సింధూర కొత్త ప్లేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటున్నాను. మరీ!...’సుమబాల దేనికైతే భయపడి ఆరునెలల క్రితం ట్రాన్స్ఫర్ వద్దనుకుందో, అదే తన కళ్ళముందు ప్రత్యక్షమవటం భయం కలిగించింది. కాని, మెల్లగా– ‘మీరు ఉద్యోగస్తులు కాదు! కాబట్టి, ఈ సమస్యే రాదు. నావల్ల వస్తే, సింధూర బాధపడుతుందనుకుని, ఆ బాధ మీరు పడకూడదు అనే అనుకున్నాను ఇన్నాళ్ళూ!’‘తెలుసు! మీకు చెప్పకుండా మేం వెళ్ళిపోవచ్చు. కాని, మీరు ప్రమోషన్ కూడా వదులుకున్నారు మన పిల్లల కోసం... అందుకే చెప్పటానికి వచ్చాను. ఈవిషయం సింధూరకు చెప్పలేదు చెబితే విదూషకు ఎక్కడ తెలుస్తుందో అనీ!...’‘నిజమే ఇది తెలిస్తే?’... విదూషను తలచుకుంటే ఒళ్ళు జలదరించింది.ఇప్పుడు ఆర్థిక సంవత్సరం మధ్యలో, ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇవ్వరు. ఎలా?పిల్లలను పసితనంలో ఏ ప్రభావమూ పడకుండా పెంచటం ఇంత కష్టమా? అందరి పిల్లలూ విదూషలా లేరు.ఇలా ఉన్న పిల్లలను కాపాడే తీరాలి. అప్పుడే సమాజం పట్ల సున్నితమైన అవగాహనతో మెలుగుతారు. లేదంటే ఒక కసితో... ఇక ఆలోచించలేక‘నేను చూసుకుంటాలెండి’ అని మాత్రం అనగలిగింది. ఆమె వెళ్ళిపోయింది.∙∙ ‘విదూ! నాకు బదిలీ అయింది. నీ పుట్టినరోజు సందర్భంగా నీకో సర్ర్పైజ్ గిఫ్ట్.’ ‘ఎక్కడమ్మా! ఏంటమ్మా అదీ! ప్లీజ్ చెప్పవా?’ విదూష సంతోషం చూసి, తేలికగా ఊపిరి పీల్చుకుంది.‘చూపిస్తా పద!’ఇద్దరూ కలిసి వెళ్ళారు.‘ఇదిగో! కొత్త ఇల్లు. మన కోసమే!’‘ఇక్కడ ... మన కోసం’‘వావ్! కరుణామయి వికలాంగుల సంక్షేమ ఆశ్రమం.. మొన్న ఈ ఆశ్రమానికి వచ్చాముగా! మరి ట్రాన్స్ఫర్ అన్నావ్?’‘అవును! బదిలీ! అక్కడి నుండి ఇక్కడికి ఇంటి బదిలీ! ఆలోచనల బదిలీ.ఆశయాల బదిలీ. పరిస్థితుల బదిలీ.’‘అంటే? ఏంటమ్మా? సింధూరనూ తెద్దామా?‘అలాగే! ఏ పిల్లలలోనూ లేని ఓ ప్రత్యేకత నీలో ఉంది. అది తోటివారికి ప్రేమను పంచటం. ప్రేమ పంచిన వారి పట్ల తపన పడటం. అందుకే నువ్వు ఉండాల్సిన చోటు ఇదే. నీ ప్రేమ, తపన, వీరితో స్నేహం చేసి వీరికి పంచు. ఏదో ఓరోజు నువ్వూ మదర్ థెరిస్సా అంతటి దానివవుతావో, లేదంటే... మార్గం మారుతుందో కాలం చెబుతుంది. అందుకే ఆశ్రమానికి పక్కనే ఇల్లు తీసుకున్నాను. మరి ఇది బదిలీనేగా!’ ‘అమ్మా! అదిగో! నాకిష్టమయిన బ్లూమింగ్ మైండ్స్ స్కూల్’‘అవును అందులో చేరు. నీ సాయంత్రాలూ, ఖాళీ సమయాలూ, ఆశ్రమంలో.. ఓకేనా?’‘మరి సింధూర?’‘ముందు నీకు నచ్చితే... సింధూరను తీసుకువద్దాం. సరేనా?’విదూష తలూపటం చూసి, తేలికైన మనసుతో... ఆశ్రమం వంక చూస్తూ నిట్టూర్చింది సుమబాల.కాని, రోజూ అక్కడి పిల్లలతో కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఉన్న విదూషతో పాటు తనూ పాలు పంచుకుంటూ, తనలో తనను చూసుకుంటే విదూషకు కాదు, తనకే ఒంటరితనపు దుఃఖం నుండి కొత్త జీవితానికి బదిలీనేమో! -
ఆనందో బ్రహ్మ
వరుణ మహర్షి కొడుకు భృగు మహర్షి. తండ్రి వద్ద భృగువు సకల శాస్త్రాలూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భృగువుకు బ్రహ్మజ్ఞానం సాధించాలనే కోరిక కలిగింది. ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి తనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని అడిగాడు.‘కుమారా! అన్న ప్రాణ నేత్ర శ్రోత్ర మనో వాక్కులన్నీ పరబ్రహ్మ సాధనకు మార్గాలే! వీటన్నింటిలోనూ బ్రహ్మతత్త్వం ఇమిడి ఉంది. అది దేని నుంచి ఉత్పన్నమైనదో, దేనితో పోషణ పొందుతున్నదో, చివరకు దేనిలో లయమవుతున్నదో, దానికి మూలమేమిటో తెలుసుకోవాలి. దానిని తపస్సు ద్వారా మాత్రమే సాధించాలి. అందువల్ల వెళ్లి తపస్సు చెయ్యి’ అన్నాడు.తండ్రి ఆదేశంతో భృగు మహర్షి దీక్ష తీసుకుని, ఒక నిర్జనారణ్యానికి చేరుకుని, అక్కడ నియమ నిష్ఠలతో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక ‘అన్నమే పరబ్రహ్మ స్వరూపం’ అని అతడికి స్ఫురించింది. అన్నం ద్వారానే అన్ని ప్రాణులూ ఉత్పన్నమవుతున్నాయి. అన్నం వల్లనే పోషణ పొందుతున్నాయి. అన్నం భూమి నుంచి పుడుతోంది. మరణించిన తర్వాత అన్ని ప్రాణులూ ఈ భూమిలోనే కలసిపోతున్నాయి. కాబట్టి ‘అన్నమే పరబ్రహ్మ స్వరూపం’ అని నిర్ధారణకు వచ్చాడు. వెంటనే తండ్రి వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని తెలియజేశాడు. భృగువు మాటలు విన్న వరుణ మహర్షి, ‘కుమారా! నువ్వు ఇంకా మొదటి మెట్టు మీదనే ఉన్నావు. ఇంకా సాధన చేయాలి’ అన్నాడు.భృగు మహర్షి మళ్లీ అడవులకు వెళ్లి, తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంకొంత కాలం గడిచింది. ‘ప్రాణమే బ్రహ్మ’ అని ఆయన గ్రహించాడు. లోకంలోని సమస్త జీవులు ప్రాణం వల్లనే జీవిస్తున్నాయి. ప్రాణం ఉన్నప్పుడే మనుగడ సాగిస్తున్నాయి. ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లయమైపోతున్నాయి అందుకే ప్రాణమే సర్వసృష్టికి మూలాధారమని భావించి, ఇదే సంగతిని తండ్రికి చెప్పాడు.కొడుకు మాటలకు వరుణుడు నవ్వి, ‘కుమారా! ఇదివరకటి కంటే కాస్త ముందుకు వెళ్లావు. ప్రాణం వల్లనే జీవులు మనుగడ సాగిస్తున్నా, ప్రాణమే బ్రహ్మ కాదు. బ్రహ్మజ్ఞానం నీకు పూర్తిగా అవగతం కావాలంటే, మరింత సాధన అవసరం. ఇంకా తపస్సు కొనసాగించు’ అన్నాడు.తండ్రి మాటలకు భృగుమహర్షి నిరాశ చెందకుండా, యథప్రకారం మళ్లీ అడవులకు వెళ్లి, మరింత కఠిన నియమ నిష్ఠలతో తపస్సు ప్రారంభించాడు. కొంత కాలం గడిచింది. సృష్టికి మూలం మనస్సు అని తలచాడు భృగువు.మనస్సు వల్లనే స్త్రీ పురుషులు పరస్పరం ఆకర్షితులవుతున్నారు. మనస్సు వల్లనే లోకంలోని సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. జన్మించిన తర్వాత కూడా మనోధర్మం ప్రకారం ఇంద్రియాల ద్వారానే జీవనం సాగుతోంది. మరణం తర్వాత ఇంద్రియాలకు జ్ఞానం ప్రసాదించే శక్తి పోతుంది. అవన్నీ మనస్సులోనే లీనమైపోతాయి. అందువల్ల మనస్సే బ్రహ్మ అనుకున్నాడు.తండ్రి వద్దకు వెళ్లి, తపస్సులో తాను గ్రహించినది చెప్పాడు. ‘తండ్రీ! మనస్సే బ్రహ్మ’ అని నాకు తపస్సులో స్ఫురించింది.అందువల్ల మనస్సే బ్రహ్మ అనుకుంటున్నాను’ అన్నాడు.‘కాదు. నీకు బ్రహ్మతత్త్వం పూర్తిగా అవగతం కాలేదు. మళ్లీ తపస్సు కొనసాగించు’ అన్నాడు వరుణుడు.భృగువు మళ్లీ మొక్కవోని దీక్షతో తపస్సు కొనసాగించాడు. తపస్సులో కొన్నేళ్లు గడిచిపోయాయి. ‘ఆనందమే పరబ్రహ్మ స్వరూపం’ అని స్ఫురించింది. సర్వమూ ఆనందం నుంచే జనిస్తుంది, ఆనందంలోనే లయమవుతుంది. ఆనందానికి అతీతమైనది మరేదీ లేదు.అందువల్ల ‘ఆనందో బ్రహ్మ’ అనుకున్నాడు. తండ్రి వద్దకు వెళ్లి ఇదే సంగతిని తెలియజేశాడు.భృగువు ‘ఆనందో బ్రహ్మ’ అని పలకడంతోనే వరుణ మహర్షి పరమానందభరితుడయ్యాడు.‘కుమారా! లెస్సగా గ్రహించావు. ఉత్తమోత్తమ పరమాత్మ తత్త్వం ఆనందం. అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపాలే! కాని, ఇవి ఒకదాని కన్నా మరొకటి సూక్ష్మమైనవి. వీటన్నింటినీ మించినది ఆనందం. ఈ ఆనందం క్షణికమైనది కాదు, శాశ్వతమైనది. పరబ్రహ్మోపాసన క్రమంగా జరగాలి. అంటే, ఒక్కొక్క మెట్టు పైకి వెళ్లాలి. అన్నాన్ని ఎన్నడూ నిందించరాదు. ప్రాణం, మనస్సు అన్నంపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, మానవులు తినడం కోసం జీవించరాదు, జీవించడానికి తినాలి. అన్నాన్ని నియమ ప్రకారమే స్వీకరించాలి. అన్నాన్ని పూజిస్తే, తర్వాతివన్నీ లభిస్తాయి. అందువల్ల ఆహారాన్ని వదలకుండా, ప్రాణాన్ని నిలుపుకుంటూ, మనస్సును వికసింపజేసుకుని, విజ్ఞానానుభవం ద్వారా బ్రహ్మానందం పొందాలి’ అంటూ కొడుకుకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు వరుణుడు.తండ్రి ఆదేశం ప్రకారం విడువకుండా మళ్లీ మళ్లీ కొనసాగించిన తన తపస్సు ఫలవంతమైనందుకు భృగుమహర్షి పరమానందం చెందాడు.∙సాంఖ్యాయన -
ప్రపంచ దేశాల ప్రోగ్రెస్ కార్డు
ఒక చిన్న పాఠశాల గది నుంచే ఒక దేశం మారవచ్చు ఒక నోట్బుక్ పేజీ నుంచే ఒక తరం చరిత్రను తిరగరాయవచ్చు అందుకే, ప్రపంచం మొత్తం విద్యావిధానమే అభివృద్ధికి ఆలంబన కాగలదని విశ్వసిస్తోంది.ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఒక అద్భుతమైన రేసులో ఉన్నాయి. అయితే, ఇది రన్నింగ్ రేసు కాదు, రీడింగ్ రేసు! ఈ రేసులో పరుగులు తీసేది విద్యార్థులే అయినా, ఫలితాలు మాత్రం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఇక్కడ కుల, మత, వర్ణ భేదాలకు చోటు లేదు – ఒక్కటే అవసరం: విద్యపై నిబద్ధత! దేశాలన్నీ పాఠశాల వేదికపై ఎగబడి, చదువు అనే శక్తిమంతమైన ఆయుధంతో భవిష్యత్తులో తమ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇందుకోసం, ఆ పక్కన క్యాలిక్యులేటర్ పెట్టుకుని, స్మార్ట్ బోర్డు ముందు నిలబడి, ల్యాబ్ కోట్స్ వేసుకుని ప్రభుత్వాలు తమ విద్యా వ్యవస్థలపై ఉన్న విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి.కాని, ఈ రేసులో ఎవరు ముందున్నారో, ఎవరు ఇంకా నిద్రలోనే జోగుతున్నారో తెలుసుకోవడానికి ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ సంస్థ 2025 సంవత్సరానికి విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని దేశాలు దుమ్మురేపేలా టాప్ గేర్లో దూసుకెళ్తుంటే, మరికొన్ని మాత్రం ఖాళీ బ్యాగు వేసుకుని, ఫస్ట్ పీరియడ్ మిస్ చేసుకున్నట్లుగా దిగాలుగా ఉంటున్నాయి. ఇంకా, ఇందులో ఏ దేశానికి పరీక్షల్లో ఎన్ని మార్కులొచ్చాయి? ఎవరు టాప్ స్కోర్ కొట్టారు? ఎవరు ‘పాస్’ అయ్యారు? మరెవరు ఇంకా ప్రోగ్రెస్ కార్డులో రెడ్ లై¯Œ దాటి నిలబడినవాళ్లు? వంటి విషయాలన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచ విద్యా పోటీకి ఒక స్పష్టమైన ఫలితాల బోర్డు ఇది!ప్రపంచ దేశాల విద్యా ప్రమాణాలను విశ్లేషించేటప్పుడు మూడు ప్రధాన అంశాలను ఆధారంగా తీసుకున్నారు. అవేంటంటే: 1. ప్రభుత్వ విద్యా వ్యవస్థ స్థిరత్వం, ప్రభావం2. విశ్వవిద్యాలయాల గ్లోబల్ ఆకర్షణ 3. విద్యలో ప్రపంచ స్థాయి నాణ్యతఈ మూడు విభాగాల్లో మెరుగైన ఫలితాలను సాధించిన దేశాలు ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశాల్లో ముందంజలో ఉన్నాయి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మార్పు దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఇంకా కొన్ని దేశాల్లో ప్రాథమిక విద్య కూడా అందని పరిస్థితి ఉంది. ఉదాహరణకు చాద్, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉండటంతో, అవి అభివృద్ధికి ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. 2025 సంవత్సరానికి ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ జాబితాను ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ విడుదల చేసింది. అందులో టాప్ 10 దేశాలు విద్యారంగంలో ముందు వరుసలో నిలిచాయి – అవేంటో చూద్దాం!దక్షిణ కొరియామేధాశక్తిదక్షిణ కొరియా అంటే కేవలం కే– పాప్, టెక్నాలజీ మాత్రమే కాదు, దాని అసలైన శక్తి అక్కడి విద్యా వ్యవస్థలో ఉంది. చిన్న దేశం అయినా, గణితశాస్త్రం, సాంకేతిక విద్యా ప్రమాణాల్లో ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తోంది. ఒక అధ్యయనంలో 15 ఏళ్ల విద్యార్థులలో చైనా తర్వాత అత్యధిక ఐక్యూ స్కోర్లు సాధించిన దేశం ఇదే! ఇది క్రమశిక్షణ, కుటుంబాల సహకారం, ప్రభుత్వ ప్రాధాన్యాల వలనే సాధ్యమైంది. ఇక్కడ చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, టెక్నాలజీతో మిళితమై, పిల్లల భవిష్యత్తుకు మార్గం వేస్తోంది.డెన్మార్క్ఒత్తిడిలేని బోధనవైకింగ్ల చరిత్రతో ప్రసిద్ధి చెందిన డెన్మార్క్ నేడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలలో రెండో దేశంగా నిలుస్తోంది. జనాభా అరవై లక్షలే అయినా, చదువులో దీని స్థానం గొప్పది. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన పెంపొందించడం, ఒత్తిడిలేని బోధన ఈ దేశం ప్రత్యేకతలు. ఇక్కడ చదువు అనేది పరీక్షల కోసమే కాదు, జీవిత పాఠాలను నేర్చుకునే మార్గం. ప్రభుత్వం విద్యపై సమగ్రంగా ఖర్చు చేస్తూ, సమానావకాశాలు కల్పిస్తుంది. పాఠశాలలోనే పిల్లలు చర్చా వేదికల్లో పాల్గొంటూ సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ విధానాల వలనే డెన్మార్క్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాల జాబితాలోనూ చేరింది.నెదర్లండ్స్స్వేచ్ఛగా ఆలోచించే విద్యార్థులే నెదర్లాండ్స్ లోని విద్యా విధానం కేవలం విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా రూపొందించారు. తక్కువ ఒత్తిడి, ఎక్కువ చర్చలతో పిల్లలు చదవటం ఈ దేశ ప్రత్యేకత. ఇక్కడ చదువు కేవలం పాఠశాలలోనే కాదు, సమాజంలో కూడా నేర్చుకోవాల్సిన ప్రక్రియగా ఉంటుంది. విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వ పెట్టుబడులతో నాణ్యమైన బోధన అందించడం, టెక్నాలజీని తరగతి గదికి తీసుకురావడం ఈ దేశాన్ని ముందు వరుసలో నిలిపాయి. జనాభాలో మెజారిటీ డచ్ వారే అయినా, వలసదారులకు కూడా సమానమైన విద్యా అవకాశాలు లభిస్తున్నాయి. ఇది విద్యలో సమానత్వానికి నిజమైన ఉదాహరణ.బెల్జియంఅందరికీ విద్యభిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే, చదువే అసలైన మార్గం అని బెల్జియం చెబుతుంది. అత్యుత్తమ విద్యా విధానాల్లో విశేషంగా ఎదుగుతూ, అగ్రస్థానాల్లో నిలుస్తోంది ఈ దేశం. రాజధాని బ్రసెల్స్ యూరోపియన్ యూనియ¯Œ కు కేంద్రంగా ఉండటం, దీని విద్యా ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఇక్కడి విద్యా వ్యవస్థ బహుభాషా విధానం, సమానత్వం ఆధారంగా ఉంటుంది. డచ్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో విద్య అందుతుండటంతో పిల్లలలో బహుభాషా సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, ఫ్లెమిష్, వాలున్, జర్మన్ వలసదారులు అందరూ చదువులో భాగస్వాములవడం ఇక్కడ సాధారణం. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్లోవేనియావలసదారులకూ సమాన విద్యకేవలం 20 లక్షల జనాభా ఉన్నా ఈ చిన్న దేశం వంద శాతం అక్షరాస్యతతో ఐదవ స్థానంలో ఉంది. నాణ్యమైన బోధన, ప్రభుత్వం మద్దతు, వలస వచ్చిన జనాభాకు కూడా సమానంగా విద్యను అందించడంతో ఇది సాధ్యమైంది. చదువు సమాజాన్ని ఏకీకృతం చేసే మార్గంగా ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఉదాహరణగా ఈ దేశం నిలిచింది. జపాన్క్రమశిక్షణ శక్తి పురాతన దేవాలయాలు, మౌంట్ ఫుజీ వంటి ప్రకృతి అందాలతో పాటు, జపా¯Œ విద్యా రంగంలోనూ విశేషమైన గుర్తింపు పొందింది. ఇక్కడ విద్యా వ్యవస్థ క్రమశిక్షణ, కఠిన శ్రమ, నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సులోనే పిల్లలు గణితం, శాస్త్రం, సాంకేతికతలో చురుకుగా మారతారు. ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన బోధన పద్ధతులు ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు. జపా¯Œ లో 98 శాతం జనాభా జాపనీస్ ప్రజలే. జాతి పరంగా ఏకత్వం ఉన్నా, విద్యకు విస్తృత దృక్కోణంలో ఉంది.జర్మనీఉచితంగా ఉన్నత విద్యకోటలు, ఆధునిక నగరాలతో ప్రసిద్ధి గాంచిన జర్మనీ, విద్యా రంగంలోను అగ్రగామిగా నిలుస్తోంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన రంగాల్లో ఇది ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఇక్కడ విద్యా వ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఉచిత ఉన్నత విద్యతోపాటు ప్రభుత్వ మద్దతుతో విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. విద్యార్థుల ప్రాక్టికల్ స్కిల్స్కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మతాలు, భాషలు భిన్నమైనా, చదువు విషయంలో సమానత్వం కొనసాగుతుంది.ఫిన్లండ్చదువు చల్లగా, బతుకు హాయిగా స్వచ్ఛమైన సరస్సులు గుర్తొచ్చే దేశం ఫిన్లండ్. ఇక్కడ విద్య అనేది పోటీకి సిద్ధం చేసే మార్గం కాదు, బలమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. ఒత్తిడిలేని తరగతులు, ప్రాజెక్టు ఆధారిత బోధన, విద్యార్థులే కేంద్రంగా రూపొందించిన పద్ధతులు ఫిన్లండ్ విద్యకు ప్రత్యేకత తీసుకొచ్చాయి. పరీక్షలు తక్కువ, ఆలోచన ఎక్కువ ఇక్కడి విద్యార్థుల విజయ రహస్యం. ఈ దేశం ప్రపంచ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో తొలిస్థానంలో ఉండటానికి కారణం కూడా ఇదే!నార్వే ఆలోచనా శక్తి పెంచే బోధననార్దన్ లైట్స్ వంటి ప్రకృతి అద్భుతాలకు నిలయమైన నార్వే, విద్యా ప్రమాణాల్లో ముందంజలోనే ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థ స్వేచ్ఛ, సమానత్వం, నాణ్యతతో కూడినది. విద్యార్థులలో ఆలోచనాశక్తిని పెంచేలా బోధన సాగుతుంది. ప్రభుత్వ మద్దతుతో విద్య ఉచితంగా అందుతూ, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అలాగే, నార్వే జీవన ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి. చదువుతో పాటు అక్కడ లభించే ఉన్నతమైన ఆరోగ్యసేవలు కూడా విద్యార్థుల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి.ఐర్లండ్విద్యలో వైవిధ్యంటెక్నాలజీ ఆధారిత విద్యా రంగంలో వేగంగా ఎదుగుతున్న దేశం ఐర్లండ్. రాజధాని డబ్లి¯Œ వంటి నగరాల్లో వలసదారుల పెరుగుదలతో విద్యలో వైవిధ్యం పెరిగింది. ఇక్కడ విద్యా విధానం ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ, విద్యార్థుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ దేశం, సాంకేతిక, జైవ శాస్త్ర రంగాల్లో విద్యను శక్తిగా వినియోగిస్తోంది. ఉద్యోగావకాశాలకు అనుగుణంగా ఉంటూ అనేక అంతర్జాతీయ విద్యార్థులకు ఆశ్రయంగా మారింది.ఈ జాబితా నుంచి మనం గమనించగలిగేది ఏమిటంటే అత్యుత్తమ స్థాయిలో విద్యను అందిస్తున్న దేశాలు అన్నీ ఏకకాలంలో ఆర్థికంగా, సాంకేతికంగా, సమాజపరంగా కూడా ముందున్నాయి. వీటిల్లో వంద శాతం అక్షరాస్యతతో స్లోవేనియా అత్యుత్తమ విద్యా నాణ్యతకు ఒక అద్భుత నిదర్శనం. మిగతా దేశాలలో అక్షరాస్యత శాతం గణాంకాలు అందుబాటులో లేవు గాని, విద్యా నాణ్యత అత్యుత్తమంగా ఉండడం వల్ల వాటి స్థానం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేశాలు తమ విద్యా విధానాలను సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించు కొని, విద్యార్థులకు ఒత్తిడి లేని, పరిశోధన ప్రాతిపదికన ఉన్న, ఆచరణాత్మకమైన విద్యను అందిస్తున్నాయి. ఫలితంగా ఈ దేశాల్లో ఉన్నత జీవన ప్రమాణాలు, ఉచిత లేదా తక్కువ ధరల్లో ఉన్నత విద్య అవకాశాలు, స్వేచ్ఛాయుత విద్యా వాతావరణం కనిపిస్తున్నాయి.ఇండియాఇంకా ‘వికాస దశ’లోనే! ఇండియా అంటేనే విశాలమైన సంస్కృతి, శాస్త్రవేత్తలు, ఐటీ మేధావులు గుర్తొస్తారు. కాని, ప్రపంచ విద్యా రంగపు ర్యాంకింగ్స్లో చూస్తే, మన దేశం ఇంకా ‘వికాస దశ’లోనే ఉంది. 2025 విద్యా ర్యాంకింగ్స్లో భారత్ 101వ స్థానంలో నిలవడం కొంచెం చేదుగా అనిపించినా, ఇది మన విద్యా వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది. మన పక్కనున్న దేశాల పరిస్థితి చూస్తే చిన్న దేశాలైన నేపాల్ 56, భూటాన్ 88వ స్థానాల్లో మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. పాకిస్థాన్ 136, అఫ్గానిస్తాన్ 146, బంగ్లాదేశ్ 122వ స్థానాల్లో మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలో అసలైన షాక్ ఏంటంటే, మన పొరుగునే ఉన్న చైనా మాత్రం 13వ స్థానంలో మెరిసిపోతూ ప్రపంచానికి చదువుల దారులు తెరుస్తోంది.మన వెనుకబాటుకు కారణాలుఇందుకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతుల లోపం అని చొప్పొచ్చు. అందుకే మన అక్షరాస్యత రేటు 74 శాతం దగ్గరే నిలిచిపోయింది. కాని, మార్పు మొదలైంది. నూతన విద్యా విధానం, డిజిటల్ లెర్నింగ్, గ్రామీణ విద్యపై దృష్టి, బాలికల విద్యకు ప్రాధాన్యం వంటి చర్యలు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. అయితే, టాప్ 10లోకి వెళ్లాలంటే ప్రాథమిక విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ, సమానత్వం కీలకం. ఇప్పుడు ఉన్నదంతా ప్రారంభం మాత్రమే! సరైన దిశగా నడిస్తే, భారతదేశం కూడా భవిష్యత్తులో ప్రపంచ విద్యా శిఖరాలను అధిరోహించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.పేజీ కూడా తెరవలేదుప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్ ఆపిల్’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్ సూడాన్ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్ జోన్ లో ఉన్నాయి. స్కూల్కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే!చిన్న దేశాల గొప్ప విజయాలుఒకప్పుడు ‘చిన్న దేశాలు’ అనే పేరు వింటే, మనకు గుర్తొచ్చేది వాటి పరిమిత వనరులు, అభివృద్ధి లోపం, పెద్ద దేశాల మీద ఆధారపడే పరిస్థితులు. కాని, ఇప్పుడు? అవే చిన్న దేశాలు పుస్తకాలతో పరుగు తీస్తూ, ప్రపంచ విద్యా వేదికపై సగర్వంగా నిలుస్తున్నాయి. కజక్స్తాన్, ఉజ్బెకిస్తాన్, లాట్వియా, ఇస్టోనియా, లిథువేనియా... వీటి పేర్లు చాలామందికి టూరిజం బ్రోషర్ల ద్వారా మాత్రమే తెలిసి ఉండొచ్చు కాని, ఇప్పుడు ఇవే దేశాలు విద్యలో వందశాతం అక్షరాస్యతతో టాప్ లైన్ లో నిలబడ్డాయి! చదువు విషయంలో ఇవి చిన్న దేశాలు కాదు, చదువుల మహారాజులు! నేపాల్ (71 శాతం) భూటాన్ (72 శాతం) వంటి హిమాలయాల మధ్యన ఉన్న దేశాలు కూడా అక్షరాస్యతలో అగ్రస్థానానికి చేరుతున్నాయి. 2025 నాటికి ప్రపంచం మొత్తం అక్షరాస్యత సగటు 72.91 శాతం అంటే, ఈ చిన్న దేశాల ప్రభావం ఎంత ఉంటుందో ఊహించండి! వనరులు తక్కువైనా, విజన్ పెద్దది. డబ్బు లేకపోయినా, గొప్ప సంకల్పం ఉంది. ప్రభుత్వాల నిబద్ధత, విద్యా విధానాలలో స్పష్టత, ప్రతి పాఠశాలలో బలమైన ఫౌండేషన్... ఇవే ఈ దేశాలను అగ్రస్థానాలకు చేర్చాయి.టాపర్లాంటిది! విద్యా వ్యవస్థలో టాప్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన, చదువులో టాప్ స్కోర్ వస్తుందన్న గ్యారంటీ లేదు! పేరుకు ప్రపంచంలో ఉత్తమ విద్యా సంస్థలు కలిగిన దేశాల జాబితాలో అమెరికా నంబర్ వన్. కానీ సబ్జెక్ట్ వైజ్లో చూస్తే? గణితంలో 38వ స్థానం, సై¯Œ ్సలో 24వ స్థానం – అచ్చం ‘టాపర్’ ముసుగులో ‘బోర్డర్ పాస్’ అన్నట్టు! ‘బిజినెస్ ఇన్సైడర్’ అనే సంస్థ ఇచ్చిన గణాంకాలు, బెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ లెక్కలు– ఇలా ఒక్కో సంస్థ ఒక్కో విధంగా మార్కులు వేస్తుండడంతో, ర్యాంకింగ్ ఒక పజిల్లా మారిపోయింది. ఎక్కడైనా పుస్తకాలతో కప్పేసి ‘ఉత్తమ విద్యా సంస్థ’ అన్న ట్యాగ్ పెడితే సరిపోదు. అసలైన విషయాలు చూడాలి. పిల్లలు చదువుతున్నారా? టీచర్లు బాగా బోధిస్తున్నారా? ప్రభుత్వ పెట్టుబడులు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అనే విషయాలు కూడా కీలకమే! ఇక ‘గ్లోబల్ సిటిజన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ వంటి సంస్థలు బాగానే మ్యాటర్ను పసిగట్టాయి. విద్యా వ్యవస్థ అంటే చిన్నారి స్కూల్ అడ్మిషన్ నుంచీ పెద్దల అక్షరాస్యత వరకూ మొత్తం జీవన ప్రయాణాన్ని గమనించాలి అని అంటున్నాయి. సింపుల్గా చెప్పాలంటే టాప్ ర్యాంక్ అనేది పేపర్లో ఉండే డిజైన్ మాత్రమే! అసలైన చదువు ఏమిటో, అది జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చూసే చూపు అవసరం. లేదంటే టాపర్ గుండెల్లోని ర్యాంక్ కాస్త, రిజల్ట్ వచ్చాక ‘ఒక్క మార్క్ మిస్ అయ్యింది!, లేకుంటే నేనే టాప్’ అని అంటాయి. విద్య అనేది కేవలం ఒక పాఠశాల గది వరకు మాత్రమే పరిమితమైంది కాదు. అది వ్యక్తిని మారుస్తుంది. వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది; కుటుంబం మారితే సమాజం మారుతుంది; సమాజం మారితే దేశం మారుతుంది. అందుకు విద్యే మార్గం, విజ్ఞానమే శక్తి.పేజీ కూడా తెరవలేదుప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్ ఆపిల్’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్ సూడాన్ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్ జో¯Œ లో ఉన్నాయి. స్కూల్కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే! -
అమరజీవి ఆత్మశోకం
అవి 20వ శతాబ్దం తొలి దశకాల రోజులు. జాతీయోద్యమం ఊపందుకుంటోంది. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో నిత్యం జాతీయవాదులు చర్చలు, ప్రణాళిక రచనల్లో మునిగిపోయేవారు. వారిలో అంకితభావంతో పని చేస్తున్న కొందరిని ఎంపిక చేసి ‘మీమీ ప్రదేశాలకు వెళ్లి జాతీయోద్యమం పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయండి’ అని సూచించారు గాంధీజీ. వారిలో ఒకరు పొట్టి శ్రీరాములు. మద్రాసులోని మెరీనా బీచ్లో గాంధీజీ ఉపన్యసిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని ఉన్నారు. అప్పుడు శ్రీరాములుగారిని వేదిక మీదకు ఆహ్వానించి గాంధీజీ ప్రశంసా పూర్వకంగా ‘శ్రీరాములు వంటి మరో పదకొండుమంది ఉంటే ఏడాదిలో స్వాతంత్య్రం వస్తుంది’ అన్నారు. ఆ తర్వాత కూడా శ్రీరాములుగారు గాంధీజీకి ఉత్తరాల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమం గురించి వివరిస్తూ ఉత్తరాలు రాసేవారు. శ్రీరాములు సంస్కరణలుపొట్టి శ్రీరాములు స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం(1930), క్విట్ ఇండియా ఉద్యమంతోపాటు అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మూడు దఫాలు జైలు పాలయ్యారు. దళితుల అభ్యున్నతి కోసం ప్లకార్డులు పట్టుకుని నెల్లూరు పట్టణంలో ఎర్రటి ఎండలో పాదరక్షలు లేకుండా నడిచారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం దీక్ష చేశారు. నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలోకి అనుమతించిన తరవాత దీక్ష విరమించారు. శ్రీరాములు తలపెట్టిన మరొక మహోన్నత ఘట్టమే తెలుగు వాళ్ల కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు వారికి ఎదురవుతున్న వివక్ష ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే! శ్రీరాములు గారు మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష చేపట్టారు. అమరుడి అంతియ యాత్ర‘ఆంధ్ర రాష్ట్ర సాధనకై అక్టోబర్ 19న ప్రాయోపవేశ దీక్ష పూనిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు 15 తేదీ రాత్రి 11.23 గంటలకు పరమపదించారు’ అని 1952, డిసెంబర్ 16వ తేదీన ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. పొట్టి శ్రీరాములుగారు అమరుడు కావడంతో తెలుగు ప్రజల్లో భావోద్వేగాలు పెల్లుబికాయి. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న వేలాదిమంది అభిమానులు ‘ప్రతి అరవ వాడు మరణించాలి, మాకు ఆంధ్రరాజ్యం కావాలి’ అని నినదించారు. ఆయన త్యాగానికి గౌరవం 1953, అక్టోబర్ 1న దక్కింది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలను వేరు చేసి కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956, నవంబర్ 1న ఆంధ్రరాష్ట్రానికి తెలంగాణను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ అవతరించింది. శ్రీరాములు జ్ఞాపకార్థం ఆయన పేరును ఆయన సొంత జిల్లాకు పెట్టాలని అనేక ఉద్యమాలు జరిగాయి. ఎట్టకేలకు 2008 జూన్ 4న నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసింది. ఇవన్నీ గుండెను బరువెక్కించే వాస్తవాలు. నేటి చేదు నిజాలుపొట్టి శ్రీరాములు సొంతూరు జువ్వలదిన్నె గ్రామంలో ఆయన ఇంటిని స్మారక భవనంగా మార్చారు. దానికి నిత్యం తాళం వేసి ఉంటుంది. అది కాకుండా జువ్వలదిన్నెలో సముద్ర తీరానికి వెళ్లే దారిలో ఆయన పేరు మీద పర్యాటక శాఖ మరొక స్మారక భవనాన్ని నిర్మించింది. ఆ భవనం తలుపులకు తాళాలు లేవు. నిర్వహణ లేదు. ఆ స్మారక భవనంలో జరుగుతున్న అకృత్యాలకు ఆయన ఆత్మ రోజుకొకసారి మరణిస్తోంది. స్మారక భవనానికి ఎదురుగా రోడ్డుకు అవతల మద్యం దుకాణం. మద్యం ప్రియులు ఆ దుకాణంలో మద్యం కొని స్మారక భవనంలోకి తెచ్చుకుని సేవిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. మద్యసేవనంతో పాటు పేకాట ఆడుతున్న ఆనవాళ్లు కూడా కనిస్తుంటాయి. పర్యాటక శాఖ నిర్మించిన స్మారక భవనం ప్రాంగణంలో శ్రీరాములు విగ్రహం ఉంది. తన కళ్ల ముందే జరుగుతున్న అకృత్యాలకు అమరజీవి ఆత్మ రోదిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.∙వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
2198 కిలోమీటర్ల వేట!
హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో నివసించే రియల్టర్ ఖాదర్ ఖాద్రీ కుమారుడు ఉస్మాన్ ఖాద్రీ (10) 2009లో కిడ్నాప్ అయ్యాడు. బాలుడి తండ్రికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు రూ.3 లక్షలు పౌండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్కు చెందిన అన్ని బృందాలు రంగంలోకి దిగాయి. ప్రధాన నిందితుడి కదలికలపై చిన్న ఆధారం లభించడంతో ఢిల్లీ వెళ్లిన పోలీసులు– అక్కడ నుంచి మొదలు పెట్టి గుజరాత్లోని భరూచ్ చెక్పోస్టు వరకు ఏకబిగిన 2,198 కిలోమీటర్లు వేటాడి పట్టుకున్నారు. శాలిబండకు చెందిన ఖాదర్ ఖాద్రీ, కామాటిపుర ప్రాంతానికి చెందిన ఖాజీ అనీసుద్దీన్ అలియాస్ అనీస్ భాగస్వాములుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఖాదర్ తనను మోసం చేసి నష్టాలు మిగులుస్తున్నాడని భావించిన అనీస్ అతనిపై కక్ష కట్టాడు. ఖాదర్ ఇంట్లో కూడా తిరిగే చనువు ఉన్న అనీస్ అతని కుమారుడు సయ్యద్ ఉస్మాన్ మహ్మద్ ఖాద్రీని కిడ్నాప్ చేసి, డబ్బు వసూలు చేయాలని భావించాడు. దీనికోసం తన సోదరులు ఖాజా షంషుద్దీన్ అలియాస్ అక్రం, ఖాజీ హఫీజుద్దీన్ అలియాస్ అస్లంలతో కలిసి రంగంలోకి దిగాడు. 2009 మే 20న ఖాదర్ ఇంటికి వెళ్లిన అనీస్.. ఆ సమయంలో ఖాదర్ కుటుంబం ఖాజీపురకు వెళుతోందని తెలుసుకున్నాడు. వారి కంటే ముందే ఖాజీపుర చేరుకున్న అనీస్ అక్కడ కాపు కాశాడు.ఆ ఇంటి వద్దకు చేరుకున్న ఉస్మాన్ను బైక్ రైడింగ్ పేరుతో అనీస్ బయటకు తీసుకువచ్చాడు. తన పల్సర్ వాహనంపై ఎక్కించుకుని బహదూర్పుర చేరుకున్న తర్వాత మారుతీ వ్యాన్ తీసుకురమ్మని తన సోదరుడైన అక్రమ్కు సందేశం ఇచ్చాడు. అతడు వచ్చాక ఇద్దరూ బాలుడిని వ్యానులోకి మార్చి శంషాబాద్ వైపు తీసుకువెళ్లారు. బాలుడు కనిపించట్లేదని భావించిన ఖాదర్ అదే రోజు రాత్రి శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఖాదర్కు లండన్ ఫోన్ నంబర్ కనిపించేలా ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసిన అనీస్... ఉస్మాన్ను తామే కిడ్నాప్ చేశామని, రూ.3 లక్షల మొత్తాన్ని పౌండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ నెల 22 నుంచి మొదలైన ఈ ఫోన్లు 25 వరకు కొనసాగడంతో మిస్సింగ్ నుంచి కిడ్నాప్గా ఆ కేసు మారింది. ఓపక్క ఇలా ఫోన్లు చేస్తూనే అనీస్... ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి రెండు మూడు రోజుల పాటు ఉస్మాన్ కుటుంబంతో కలిసి బాలుడి కోసం గాలిస్తున్నట్లు నటించాడు. ఆపై హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. నగరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లిన అనీస్ అక్కడ బోగస్ వివరాలతో రెండు సిమ్కార్డులు తీసుకుని ఢిల్లీ చేరుకున్నాడు. బాలుడి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ బృందం అనీస్ ఇంటిపై దాడి చేసి సోదాలు చేసింది. ఆమె సోదరి రహస్యంగా దాచి ఉంచిన ఈ సెల్ఫోన్ బయటపడింది. దీన్ని వినియోగించి ఆమె అనీస్తో సంప్రదింపులు జరుపుతోందని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అతడికి చెప్తోందని గుర్తించారు. మరికొందరిని విచారించగా, ఉస్మాన్ను మారుతీ వ్యాన్లో కిడ్నాప్ చేసినట్లు బయటపడింది. దీంతో అనీస్ బాలుడిని తీసుకుని సంచరిస్తున్నాడని భావించిన పోలీసులు అతడు వాడుతున్న సెల్ఫోన్ నంబర్ లోకేషన్ చూసి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ముగ్గు్గరు అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందం హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుంది. ఇలా వెళ్లిన అధికారులు సాధారణంగా అక్కడి ఏపీ భవన్లో బస చేసే వాళ్లు. ఈ టీమ్ను రిసీవ్ చేసుకుని, ఏపీ భవన్లో దింపడానికి వీరిలో ఓ అధికారి స్నేహితుడైన ట్రావెల్స్ యజమాని బల్బీర్ సింగ్ స్వయంగా వచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి కేవలం 14 కి.మీ. ఉన్న ఏపీ భవన్లో దింపేసి, తన దైనందిన విధుల్లో నిమగ్నం అవ్వాలని ఆయన భావించారు. ఈ టీమ్ ఏపీ భవన్కు చేరుకునే లోపే హైదరాబాద్ నుంచి మరో అప్డేట్ అందింది. అనీస్ లోకేషన్ రాజస్థాన్లోని జైపూర్ అన్నది దాని సారాంశం. దీంతో బల్బీర్ సింగ్ వాహనంలోనే టాస్క్ఫోర్స్ బృందం జైపూర్ వెళ్లింది. అనీస్ లోకేషన్ అజ్మీర్ మీదుగా అహ్మదాబాద్ చేరుకోవడంతో పోలీసులూ అనుసరించాల్సి వచ్చింది. అనీస్ లోకేషన్ సూరత్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్టాండ్ వద్ద చూపిస్తుండటంతో పోలీసులు అక్కడకు చేరుకుని కాపు కాశారు. హఠాత్తుగా బయలుదేరిన అనీస్... వడోదరా వైపు వెళ్తున్నట్లు హైదరాబాద్లో ఉన్న అధికారులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అక్కడి టీమ్కు సమాచారం ఇచ్చారు.కేవలం ఏపీ భవన్ వరకే అనుకుని వచ్చిన బల్బీర్సింగ్ సైతం బాలుడిని రక్షించాలనే ఉద్దేశంతో తన వాహనంతో సహా పోలీసులతో కలిసి ప్రయాణించాడు. అహ్మదాబాద్–వడోదరా మధ్య 81.1 కిమీ పొడవునా ఓ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. దీనికి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు ద్వారా అనీస్ ప్రయాణిస్తున్నట్లు అతడి సెల్ఫోన్ లోకేషన్ ద్వారా పోలీసులు గుర్తించారు. తాము ఎక్స్ప్రెస్ హైవే మీదుగా వెళ్తే ముందే వడోదరా చేరుకుని కాపు కాయవచ్చని, అక్కడకు మారుతీ వ్యాన్లో వచ్చే అనీస్ను పట్టుకుని బాలుడిని రెస్క్యూ చేయవచ్చని భావించారు. దాదాపు 30 కి.మీ. ప్రయాణించిన తర్వాత అనీస్ లోకేషన్ మళ్లీ అహ్మదాబాద్ వచ్చినట్లు టీమ్కు తెలిసింది. వాహనం ఈ హైవేలో ఓసారి ప్రవేశించిన తర్వాత చివరి వరకు వెళ్లి తిరిగి రావాల్సిందే తప్ప ఎక్కడా యూటర్న్స్ ఉండవు. అంత సమయం లేకపోవడంతో అధికారులు డివైడర్కు అటు–ఇటు రాళ్లు పెట్టి వాటి మీదుగా, అత్యంత ప్రమాదకర రీతిలో యూ–టర్న్ తీసుకుని వెనక్కు వచ్చారు. అనీస్ వద్ద ఉన్న ఫోన్ స్విచాఫ్ కావడంతో అక్కడే వేచి చూస్తూ ఉండాల్సి వచ్చింది.కొన్ని గంటల తర్వాత అనీస్ లోకేషన్ మళ్లీ వడోదరా వైపు హైవే మీద కదలడం మొదలుపెట్టింది. దీంతో అతడి దాంతో పాటు ఈ టీమ్ లైవ్ లోకేషన్లు ఒకేసారి చూసేలా ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. వీరి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒకరి లోకేషన్ను మరొకరు నాలుగుసార్లు క్రాస్ చేసినట్లు బయటపడింది. అయితే తమ మార్గంలో తమకు ఎక్కడా మారుతీ వ్యాన్ తారసపడకపోవడంతో అనీస్ వేరే వాహనంలో ప్రయాణిస్తున్నట్లు గ్రహించారు. దీంతో ఆ మార్గం చివరలో ఉన్న భరూచ్ టోల్ప్లాజా వద్దకు వెళ్లి కాపు కాశారు. కొద్దిసేపటికి అహ్మదాబాద్లోని నీతా ట్రావెల్స్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు రావడాన్ని గమనించి టోల్ప్లాజా సిబ్బంది సహకారంతో దాన్ని ఆపారు. అప్పటి వరకు పోలీసుల వద్ద అనీస్ ఫొటో కూడా లేదు. కేవలం గుర్తులు, లొకేషన్, వాహనం ఆధారంగానే గాలిస్తున్నారు. ఆ బస్సు లోపలకు వెళ్లిన ఒక అధికారి గుజరాత్ పోలీసుగా పరిచయం చేసుకుని, రొటీన్ చెకింగ్ మాదిరిగా ఒక్కో ప్యాసింజర్ వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు చూపాల్సిందిగా అడిగారు. ఈ అధికారి అనీస్ వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు అడగ్గా ‘మేరే పాస్ నయ్యే సాబ్’ అంటూ హైదరాబాదీ హిందీలో సమాధానం ఇచ్చాడు. దీంతో అతడే అనీస్ అని నిర్ధారించిన ఆ అధికారి ‘బహుత్ హోగయా... చల్ రే అనీస్’ అనడంతో తాను చిక్కినట్లు తెలుసుకున్న అతగాడు ‘చలో సాబ్’ అంటూ బస్సు దిగాడు. అక్కడే ఉన్న మిగిలిన ఇద్దరు టాస్క్ఫోర్స్ అధికారులు అతడిని చుట్టుముట్టి మిగిలిన నిందితులు, బాలుడి విషయం ప్రశ్నించగా..వాళ్లు హైదరాబాద్లోనే ఉన్నారని, తాను మాత్రం పోలీసుల దృష్టి మళ్లించడానికి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నానని సమాధానం ఇచ్చాడు. అనీస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భరూచ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు బయల్దేరారు. అప్పటికి మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఏకబిగిన 1197 కి.మీ. ప్రయాణించినా, బాలుడిని సురక్షితంగా రక్షించాలనే ఉద్దేశంతో విశ్రాంతి విషయం మర్చిపోయి హైదరాబాద్కు పయనయమయ్యారు. టాస్క్ఫోర్స్ బృందంలో కేవలం ఒక్కరికే డ్రైవింగ్ వచ్చి ఉండటంతో ఆ అధికారితో పాటు బల్బీర్ సింగ్ డ్రైవ్ చేసుకుంటూ మరో 1001 కిమీ ప్రయాణించి మర్నాడు హైదరాబాద్ చేరుకున్నారు. అనీస్తో పాటు పోలీసులకు ఇక్కడ వదిలి ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. బాలుడి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్. నిందితుడు అనీస్ తన చిన్నప్పటి ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసులను వాడుకున్నాడు. అదెలాగో వచ్చేవారం తరువాయి భాగంలో చదవండి.∙శ్రీరంగం కామేష్ -
జానశ్రుతి మహారాజు – రైక్వుడు
పూర్వం జానశ్రుతి అనే మహారాజు ఉండేవాడు. దానధర్మాలలో ఆయనకు సాటి వచ్చే రాజులెరూ లేరు. జానశ్రుతి ధర్మపరాయణుడు. నిత్యం పండిత గోష్ఠి నిర్వహిస్తూ సాధు సత్పురుషుల ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. పండితులను ఘనంగా సత్కరించేవాడు. తరచుగా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, విప్రులకు విరివిగా దానాలు చేస్తూ ఉండేవాడు. జానశ్రుతి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండేది.ఒకనాడు సాయంత్రం జానశ్రుతి మహారాజు తన ఏడంతస్తుల రాజసౌధం పై అంతస్తులో డాబాపై తూగుటుయ్యాలలో కూర్చుని, విశ్రమిస్తున్నాడు. అదే సమయంలో రెండు రాజహంసలు ఆకాశంలో ఎగురుతూ తమలో తాము సంభాషించుకున్న మాటలు జానశ్రుతి చెవిన పడ్డాయి. ఒక రాజహంస జానశ్రుతి దానశీలతను, ధర్మపరాయణతను పొగడసాగింది. ‘ఇదిగో! ఇదే జానశ్రుతి మహారాజు రాజధాని. భూలోకంలో ఆయనంతటి దాత, ధార్మికుడు, జ్ఞాని మరొకరు లేరు’ అంది.అంతలో మరో హంస ఆ మాటలను కొట్టి పారేస్తూ, ‘చాలు చాల్లే! నీ జానశ్రుతి మహారాజు సంగతి ఎవరికి కావాలోయ్! ముల్లోకాలలోనూ రైక్వుడికి మించిన మహానుభావుడు మరొకడు లేడు. జానశ్రుతి మహారాజు ఎన్ని దానధర్మాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, బండివాడైన రైక్వుడి పాదాలను కడగడానికి కూడా అర్హుడు కాడు’ అని పలికింది.ఆ రాజహంసలు నిజానికి దేవతలు. భూలోకంలో అసలైన ధార్మికుడు ఎవరో కనిపెట్టే ఉద్దేశంతో రాజహంసల రూపంలో ప్రపంచ సంచారానికి బయలుదేరారు.జానశ్రుతి తల పైకెత్తి ఆ హంసలను గమనించసాగాడు. అవి రెండూ వాదించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ‘రైక్వుడి ముందు జానశ్రుతి మహారాజు ఎందుకూ కొరగాడు’ అందొక హంస.జానశ్రుతి చూస్తుండగానే, అవి దూరంగా ఎగురుతూ కనిపించకుండా పోయాయి.‘రైక్వుడి ముందు ఎందుకూ కొరగాడు’ అనే మాటలు జానశ్రుతి మహారాజులో కలత రేపాయి.ఆనాటి రాత్రి జానశ్రుతికి సరిగా నిద్రపట్టలేదు.మర్నాడు వేకువనే జానశ్రుతి నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, త్వర త్వరగా సిద్ధమై సభాంగణానికి చేరుకున్నాడు. వెంటనే సారథిని పిలిపించాడు.‘సారథీ! రైక్వుడు అనే పేరు గల మహాజ్ఞాని ఎవరో ఉన్నాడట, ఆయన బండివాడట! ఆయన ఎక్కడ ఉన్నాడో వెదికి తీసుకురా! నేను ఆయన పాదపూజ చేసి, ఆయన ద్వారా బ్రహ్మజ్ఞానం పొందుతాను’ అని చెప్పాడు.రాజాజ్ఞతో సారథి రాజధాని నలువైపులా సంచరించి, గాలించాడు. మరోవైపు జానశ్రుతి ఇంకొందరు భటులను కూడా రైక్వుని వెదుకులాట కోసం పంపించాడు. వారు కూడా వెదుకులాట సాగించారు. కొన్నాళ్ల వెదుకులాట తర్వాత రాజధానికి వెలుపల చాలా దూరంలో ఒక బండి కింద గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్న వ్యక్తి ఒకరు కనిపించాడు. ఎండ వేడికి అతడి శరీరం చెమటోడుతూ ఉంది. అతడి దుస్తులు మురికిగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనూ అతడి ముఖంలో దివ్యతేజస్సు కనిపిస్తూ ఉంది.రాజభటులు అతడిని సమీపించి, ‘మహానుభావా! తమరేనా రైక్వ నామధేయులు?’ అని అడిగారు.‘ఔను! నా పేరు రైక్వుడు’ అన్నాడు.భటులు వెంటనే జానశ్రుతి మహారాజు వద్దకు వెళ్లి, రైక్వుడి తాము ఎక్కడ కనుగొన్నదీ చెప్పారు.జానశ్రుతి మహారాజు వెంటనే బళ్లు సిద్ధం చేయించి, విలువైన బంగారు హారాన్ని, ఆరువందల గోవులను తీసుకుని రైక్వుడి వద్దకు చేరుకున్నాడు.రైక్వుడికి ప్రణామం చేసి, ‘మహానుభావా! నేను జానశ్రుతి మహారాజును. నేను తెచ్చిన ఈ కానుకలను స్వీకరించి, దయతో నాకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించండి’ అని వినయంగా అభ్యర్థించాడు.రైక్వుడు ఆ కానుకల వంక ఒకసారి చూసి, వెంటనే చూపు తిప్పేసుకున్నాడు. ‘నువ్వు తగిన దాతవు కాదు. నీ కానుకలను నేను పుచ్చుకోను. వచ్చిన దారినే తిరిగి వెళ్లు’ అని కటువుగా పలికాడు.అప్పటికే బ్రహ్మజ్ఞానం పొందిన రైక్వుడు, ఇకపై సంసారయాత్ర ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్నాడు. జానశ్రుతి మహారాజు తీసుకొచ్చిన కానుకలు అతడి సంసారయాత్రకు సరిపోవు. జానశ్రుతి మహారాజు రాజధానికి తిరిగి వచ్చి, కాస్త ఆలోచించాడు. అతడికి రైక్వుడి మనోగతం కొంత అర్థమైంది.ఈసారి రకరకాల తినుబండారాలను, వెయ్యి గోవులను, విలువైన ఆభరణాలను, ఒక కన్యను కూడా తీసుకుని రైక్వుని వద్దకు పోయాడు. ‘మహానుభావా! నా కానుకలను స్వీకరించి, ఈ కన్యారత్నాన్ని వివాహమాడి గృహస్థాశ్రమం స్వీకరించండి. నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి’ అని కోరాడు.ఈసారి రైక్యుడు ప్రసన్నుడయ్యాడు. జానశ్రుతి తీసుకువచ్చిన కన్యను పరిగ్రహించి, అతడి కానుకలను స్వీకరించి, అతడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. బ్రహ్మజ్ఞానం పొందిన జానశ్రుతి రాజులలో అగ్రగణ్యుడిగా వెలుగొందాడు.∙సాంఖ్యాయన -
ఇసుకను చూసి ఉప్పందిస్తారు!
డిటెక్టివ్ ‘షెర్లాక్ హోమ్స్’ పేరు మీరు వినే ఉంటారు. బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన పాత్ర అతడు. నేర పరిశోధనలో అతడిది డేగ దృష్టి! రాలిన వెంట్రుకలు, నేలపై పడి ఉన్న సిగరెట్ పీకలు, ఆఖరికి ఆ... నుసి నుంచి కూడా అతడు నేరస్థుడి జాడల్ని, నీడల్ని కనిపెట్టగలడు. ఆ డిటెక్టివ్ హెర్లాక్ హోమ్స్ని మించిన వారే... ‘పాగీ’లు! గుజరాత్లో, మూడు ఎడారి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తుండే ఈ పాగీలు... ఇసుకలో పాదముద్రలను బట్టి చొరబాటు దారుల వివరాలను చెప్పటంలో సిద్ధహస్తులు. మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాగీలు భారత సైన్యానికి సహాయపడ్డారు.అలా చెప్పేస్తారంతే! సరిహద్దుల్లో శత్రువు కదలికల్ని పసిగట్టేందుకు భారత్ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. హైటెక్ గాడ్జెట్స్ ఉన్నాయి. సైనికులు నిరంతరం మూడంచెలుగా గస్తీ కాస్తుంటారు. చీమ చిటుక్కున్నా మన తుపాకులు మేల్కొనే శాటిలైట్ వ్యవస్థ ఉంది. ఇవేమీ అవసరం లేకుండానే ‘పాగీ’లు తమ సహజ పరిశీలనా శక్తితో ఎడారిలో ఇసుక ముద్రల్ని డీకోడ్ చేసి సైన్యానికి ఉప్పందించగలరు. పాగీల దగ్గర వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తున్న ప్రాచీన అపరాధ పరిశోధనా నైపుణ్యం తప్ప, సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అయినా, ఇసుకపై ముద్రల్ని బట్టి అటువైపు ఎవరు నడిచారు, ఎంతమంది నడిచారు అన్నది విశ్లేషించి చెప్పేయగలరు. కాలం చెల్లినట్లుగా కనిపించే ఈ పాగీలు ఒక విధంగా ఇంటెలిజెన్స్ సిబ్బందికి దీటైనవారు.పేగుల్ని లెక్కపెట్టే వేగులుఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చి చూస్తే పాగీలు ఆదిమానవుల కింద లెక్క. కానీ ఈ మానవ ‘ట్రాకింగ్ వ్యవస్థలు’ ఎడారి చొరబాట్ల వివరాల విశ్లేషణల్లో అత్యంత విశ్వసనీయమైనవి. ఉదాహరణకు : సరిహద్దును ఎవరు దాటారు అన్నదొక్కటే కాకుండా, ఎంత మంది దాటారు? వారు ఏమి మోసుకెళ్లారు? వారి లక్ష్యం ఏమిటి? అన్నవి కూడా పాగీలు అంచనా వేయగలరు. మాదకద్రవ్యాల స్మగ్లర్ల కదలికలను కనిపెట్టటం దగ్గర్నుండి, పూర్తిస్థాయి యుద్ధాల సమయంలో సైనికులకు అత్యవసర సమాచారం అందించటం వరకు ఈ సరిహద్దు సంరక్షకులు దేశం ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. 1965, 1971లో పాకిస్తా¯Œ తో జరిగిన యుద్ధాలలో భారత సైన్యం శత్రు భూభాగాలలో చొచ్చుకు వెళ్లటానికి, శత్రువుల కదలికలను గుర్తించడానికి పాగీల నుండి కీలకమైన సహాయం తీసుకుంది. తరచు యుద్ధాల గమనాన్ని నిర్ణయించటంలో కూడా పాగీల భాగస్వామ్యం ఉంటుంది. మెడలిస్టులు కూడా ఉన్నారుబనస్కాంత, కచ్, పటాన్ జిల్లాల్లో ఉండే పాగీలు ఇటీవలి భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి మళ్లీ కీలకం అయ్యారు. పారంపర్య జ్ఞానమే తప్ప, ఎలాంటి శిక్షణా ఉండని పాగీలు సాధారణ నేత్రాలకు కనిపించని ప్రమాద సూచనలను గుర్తించటంలో అత్యద్భుతమైన ప్రావీణ్యం గలవారు. బనస్కాంత జిల్లాలోని సుయిగామ్ తాలూకా, జలోయా గ్రామానికి చెందిన రేవాజీ రాథోడ్ ఇందుకొక నిదర్శనం. 1927లో జన్మించిన ఆయన 1962 ఆగస్టు 4న పాగీగా పోలీసు దళంలో చేరారు. సుయిగామ్, వావ్, ధనేరా సరిహద్దు ప్రాంతాల వెంబడి 28 ఏళ్లపాటు, రెండు యుద్ధాల సమయంలో భారత దళాలకు భూభాగాలపై మార్గ నిర్దేశం చేశారు. ఆ నైపుణ్యాలు ఆయనకు ‘సంగ్రామ్ మెడల్’ ‘వెస్ట్రన్ స్టార్’ పురస్కారాలతో సహా కీర్తి ప్రతిష్ఠల్ని, గుర్తింపును సంపాదించి పెట్టాయి. రంగంలోకి దూకేందుకు సిద్ధంగుజరాత్ సరిహద్దులో కొన్ని చోట్ల కంచె లేకపోయినప్పటికీ ఆ ప్రాంతాలు సురక్షితంగా ఉండటానికి ఒక కారణం.. పాగీల నిరంతర నిఘా. వారు కేవలం పాదముద్రలను గుర్తించడమే కాదు, వాటిని అర్థం చేసుకుంటారు కూడా. శత్రువు ఎలాంటి బూట్లు వేసుకున్నాడు, ఏ మార్కెట్లలో ఆ బూట్లు అమ్ముడవుతాయి, అలాగే – ఎంత బరువుతో వారి నడక సాగింది, ఆ వెళ్లినవారు స్త్రీలా, పురుషులా అనేది కూడా పాగీలు కనిపెడతారు. అవసరం అయిన వెంటనే భద్రతా దళాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న 5–10 మంది శిక్షణ పొందిన పాగీలు, వారికి సహాయంగా ఉండే 20 మంది యువకుల బృందం ప్రస్తుతం సైన్యానికి అందుబాటులో ఉంది. ఇరవై ఐదు మందికి ఉద్యోగాలుకొంతమంది పాగీలను అధికారికంగా సైన్యంలోకి తీసుకున్నప్పటికీ, వారి సంఖ్య తక్కువగానే ఉంది. ‘‘వారు ట్రాకర్లు మాత్రమే కాదు, అపరాధ పరిశోధకులు కూడా..’’ అని గుజరాత్ పోలీసు సరిహద్దు పరిధి ఐజీపీ చిరాగ్ కొరాడియా అంటారు. ‘‘పాదముద్రలను బట్టి వారు ఒక వ్యక్తిని గుర్తించగలరు. వారిలో ఎవరైనా బరువులు మోస్తున్నారా, వారి వద్ద జంతువులు ఉన్నాయా అని కూడా తెలుసుకోగలరు. ఇంకా అనేక ఇతర వివరాలను అందించగలరు. 2013 హోమ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి 2014లో క్లాస్ 4 పే గ్రేడ్లో 25 మంది పాగీలను శాశ్వతంగా నియమించుకున్నాం’’ అని కొరాడియా తెలిపారు. యూనిఫాం ఉండని సైనికులుపాగీలు కేవలం చారిత్రక యోధులు కారు. వారి అవసరం నేటికీ కొనసాగుతోంది. కచ్కు చెందిన 70 ఏళ్ల పాగీ తేజ్మల్జీ సోధా 2001 – 2017 మధ్య సైన్యానికి సహాయంగా పనిచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణానే కాక, అనేకానేక చొరబాట్లను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ‘‘వారు ఎంత దూరం వెళ్లినా, నేను కచ్చితంగా ట్రాక్ చేయగలను..’’ అని ఆయన అంటారు. పాగీలు ఇప్పుడు తమకు గుర్తింపును, తగిన పరిహారాన్ని, తర్వాతి తరానికి శాశ్వతకాల ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘మేము యూనిఫాం ధరించం. అయినప్పటికీ మాతృభూమిని కాపాడతాం’’ అని అంటున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మానెక్షాపాగీలలో అత్యంత పురాతన వ్యక్తులలో దివంగత రణ్ ఛోడ్ పాగి ఒకరు. ఆయన అసలు పేరు రణ్ ఛోడ్ రబారి. తన 100వ యేట వరకు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. యుద్ధాల సమయంలో భారత దళాలకు సహాయంగా ఉన్నారు. జనరల్ శామ్ మా¯ð క్షా స్వయంగా రణ్ ఛోడ్ సేవల్ని గుర్తించి 1971లో రూ. 300 వ్యక్తిగత నగదు బహుమతిని కూడా అందజేశారు. రణ్ ఛోడ్ పాగి 2013లో తన 112 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత బి.ఎస్.ఎఫ్. ఆయన గౌరవార్థం బనస్కాంత ఔట్పోస్టులలో ఒకదానికి ఆయన పేరు పెట్టింది. -
ఈ వారం కథ: బతకటానికి భయం ఎందుకు?
ప్రతిరోజూ ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరే ముందు, అద్దంలో నా మొఖం చూసుకోవటం ఎంత పరిపాటో, జేబులోని పర్సులో డబ్బులున్నాయా లేదా అని చూసుకోవటం కూడా అంతే పరిపాటి.పర్సులో కనీసం పది పచ్చ కాగితాలు లేనిదే కాలు బయట పెట్టను. పర్సులో డబ్బులుంటే నా వెంట ఓ వందమంది సైన్యం వున్నంత ధైర్యం ఉంటుంది .నాకే కాదు, ఈ దేశంలో చాలామందికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవి రెండే: ఒకటి మందు, రెండోది మనీ. మందు కొడితే మన ఎదురుగా మహారాజులున్నా బలాదూర్! అదే మనీ మన జేబుల్లో వుంటే మనమే మహారాజులం. రెండూ వుంటే ఇంక తిరుగేముంది, ఆ కిక్కే వేరు!కాని, ఏం చేస్తాం ప్రతి మధ్య తరగతి మనిషి జీవితం, నెలలో మొదటి పదిహేను రోజులు కృష్ణపక్షంలా, మిగిలిన రోజులు శుక్లపక్షంలా గడచి పోతుంది. నా జీవితం కూడా అంతకన్నా గొప్పగా ఏమీ లేదు.ఫస్టు తారీఖున చేతిలో జీతం పడగానే, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్లా అనిపిస్తాను నాకు నేను. నెల చివరకు వచ్చే సరికి చేతిలో చిల్లి గవ్వ లేక గుడి ముందు బిచ్చ గాడిలా అనిపిస్తాను. అందుకే అడుగు బయట పెట్టాలంటే భయం వేస్తోంది. జీతం వచ్చి పదిరోజులు అవుతోంది. ముందు జేబులో పర్సు మందం కూడా ఇంకా తగ్గలేదు. అందుకని ఆఫీసుకు వెళ్ళటానికి కారు బయటకు తీశాను. దారిలో బస్టాపు దగ్గర శంకరరావుగారు కనపడ్డారు. ఆయన ఎదురుగా కారు ఆపి, ‘‘రండి సార్! ఎక్కండి. ఆఫీసుకేనా?’’ పలకరిస్తూ ఆయన్ని కారులోకి ఆహ్వానించాను.కాని, అయన మాత్రం సున్నితంగా, ‘‘పర్లేదండి, సిటీ బస్సు వస్తుంది’’ అన్నాడు పొడిపొడిగా, నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ.అలా తిరస్కరించటం అది మొదటిసారి కాదు , చివరసారి కాదు. అడిగిన ప్రతిసారి అదే సమధానం.శంకరరావుగారు ఆఫీసులో నాకన్నా బాగా సీనియర్ ఆఫీసర్. నాకన్నా జీతం ఓ లక్ష దాకా ఎక్కువే! కారు కొనుక్కోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు, కాని ఎందుకో రోజు బస్సులోనే వస్తారు ఆఫీసుకి. మనిషి కూడా చాలా సాదాసీదాగా వుంటారు. పైజమా లాల్చీ, కాళ్ళకు హవాయి చెప్పులు, భుజాన ఓ చేతి సంచితో.ఆయనకు సెల్ఫోన్ కూడా లేదు. ఈ రోజుల్లో ప్రతి పనికిమాలిన వెధవ దగ్గర ఓ పదివేల సెల్ఫోన్ ఉంటోంది. ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు అని చాలాసార్లు అనుకున్నా మనసులో. అలా అని ఆఫీసు ఫోన్ కూడా ఆయన స్వంత పనులకు ఎప్పుడూ వాడినట్లు నేను చూడలేదు. ఆయన కేడర్కు ఆఫీసు వాళ్ళు కారు ఇస్తారు, కాని ఆయన ఏనాడూ ఆఫీసు కారు వాడుకోలేదు.ఇదే విషయం ఆయన్ని ఓ రోజు కదిలించి చూశాను.‘‘నా ఒక్కడికి కారు ఎందుకు? పెట్రోల్ దండగ. పైపెచ్చు మన ఆఫీసు నష్టాల్లో ఉంది’’ అనేవాళ్ళు.‘‘మరి సెల్ఫోన్ ఎందుకు వాడట్లేదు అంటే?’’‘‘సెల్ఫోన్ వాడాల్సినంత అర్జంటు పనులు మనకు ఏముంటాయి చెప్పు’’ అంటూ నవ్వారు.నిజమే! ఆయన మాటల్లో చాలా నిజం వుంది. నాకు కూడా సెల్ఫోన్తో పెద్దగా అవసరం లేదు. కాని, ఓ ఐఫోన్ కొన్నా. నిజానికి నాకొచ్చే జీతానికి ఐఫోన్ కొనటం కష్టమే, కాని ఆఫీసులో నా ఫ్రెండ్స్ కొంటుంటే నేను కొన్నా, వాళ్ళ ముందు లోకువ అవ్వటం ఇష్టం లేక.ఇదే మాట నా స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే, ‘‘ఆయనో చాదస్తపు మనిషి. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. కాలం ఎంతో విలువైనది. కాలాన్ని కొనలేము, కాని కొత్త కొత్త సాంకేతిక వస్తువులను కొని కాలాన్ని మిగుల్చుకోవచ్చు’’ అంటూ నాకు క్లాసు పీకాడు వాళ్ళలో ఒకడు.నిజమే స్నేహితులు చెప్పింది కరక్టే కాని, అంత పెద్దాయనకి కాలం విలువ తెలియకుండా వుంటుందా?‘‘చాదస్తమే కాదురా బాబు, పిసినారి కూడా! ఆయన శ్రీమతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరు. ఆవిడకి ఓ రెండు లక్షల దాకా జీతం వస్తుంది. ఆయనకి, ఆయన భార్యకి కలిపి ఎలా లేదన్నా నెలకు ఓ మూడు నాలుగు లక్షలు వస్తాయి. బస్సుల్లో వేలాడక పోతే ఓ కారు కొనుక్కోవచ్చు కదా? ఎన్నైనా చెప్పు, రోజూ బస్సులోనే వస్తాడు. అదేమంటే, ‘అందరం కార్లు కొంటే వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, సహజవనరులు కరిగి పోతాయి’ అంటూ మెట్ట వేదాంతం చెబుతాడు. బహుశా, డబ్బు మొత్తం ఏ వడ్డీకో తిప్పుతూ ఉండి ఉండాలి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారమన్నా చేస్తూ ఉండాలి’’ అంటూ ఆయన మీ అభాండాలు వేశాడు మరొకడు.‘‘జీవితం అనుభవించటం చేతకాని మనిషి. ఏమి చేస్తాం జాలి పడటం తప్ప!’’ అంటూ పెదవి విరిచారు అందరూ.నాకెందుకో వాళ్ళు అంటున్న మాటలు కరెక్టు కాదు అనిపిస్తోంది. కాని, కళ్ళెదురుగా కనబడేవి చూస్తుంటే వాళ్ళ మాటలు నిజమే అనిపిస్తోంది. వాళ్ళ మాటల్లో నిజమెంతో తెలుసుకుందామని ఒకసారి ఆయన ఇంటికెళ్లాను.∙∙ ఇల్లు చూడగానే నా స్నేహితుల మాటలే నిజమనిపించాయి. నేనే అమాయకంగా ఆయన్ని ఎక్కువ మంచిగా ఊహించుకున్నాను. ‘బయట చాల సాదాసీదాగా ఉంటాడు కాని, గురుడు చాలా పెద్ద ఇల్లు కట్టాడు’ అని అనుకున్నా మనసులో.అది ఓ రెండంతస్తుల మేడ. లిఫ్ట్ కుడా ఉంది. ఇంటి బయట ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నారు.శంకరరావుగారి గురించి అడిగాను. పైన రెండో అంతస్తు అని చెప్పగానే, లిఫ్ట్లో పైకి వెళ్లాను. బయట నుంచి కాలింగ్ బెల్ నొక్కగానే, ‘‘ఎవరూ..’’ అంటూ ఆయనే వచ్చి తలుపు తీశారు.నన్ను చూడగానే, ‘‘సురేష్, నువ్వా! ఏమిటి చెప్పా పెట్టుకుండా వచ్చావు.. రా లోపలికి’’ అంటూ లోపలికి ఆహ్వానించాడు. లోపలికి అడుగు పెడుతూ ఇల్లంతా ఒకసారి తేరిపార చూశాను. లోపల అంతా చాలా సాదాసీదాగా ఉంది. ఎటువంటి ఖరీదైన సోఫాలు, ఫర్నిచర్, షోకేసులు వంటివి కనపడలేదు. ఓ మూల మాత్రం పాతకాలం నాటి చెక్కతో చేసిన ఓ రాతబల్ల, దానికెదురుగా రెండు చెక్క కుర్చీలు ఉన్నాయి.ఆ రెండు కుర్చీలను హాలు మధ్యలోకి లాగి, ‘‘కూర్చో..’’ అంటూ ఒక దానికి నాకు చూపించారు.నేను కుర్చీలో కుర్చుంటూ ఉండగా, ఓ పెద్దావిడ బహశా శంకరంగారి శ్రీమతి అనుకుంటా మా దగ్గరకు వచ్చి, ‘‘ఏమండి కింద పేషంట్స్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చి మీకు కాఫీ ఇస్తాను’’ అంటూ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది.ఒక్క క్షణం ఆమె వైపు చూశాను. చాలా సాదాసీదాగా ఉంది మనిషి. ఒంటిమీద నలిగిపోయిన కాటన్ చీర, చేతులకి మట్టిగాజులు, మెడలో సన్నటి మంగళసూత్రం. ఓ దిగువ మధ్యతరగతి మనిషి భార్య ఎలా ఉంటుందో అలా ఉంది. ఆమె వెళ్ళిన వంకే నేను చూస్తూ ఉంటే, ‘‘ఆవిడ నా శ్రీమతి . తను డాక్టర్, కింద హాస్పిటల్ రన్ చేస్తోంది’’ అన్నారు పొడి పొడిగా.‘అంటే కింద హస్పిటల్ అన్నమాట, అయితే స్నేహితులు అన్నట్లు రెండు చేతులేమి ఖర్మ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు’ అని మనసులో అనుకుంటూ ఉండగా– ‘‘సురేష్.. మంచినీళ్ళు తాగుతావా’’ అనే పిలుపు చెవిన బడటంతో, ‘‘అబ్బే వద్దండి’’ అన్నాను, ఆలోచనల నుండి బయటకు వస్తూ. ‘‘ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పావు కాదు’’ అంటూ అడిగారు శంకరం గారు. ఏం జవాబు చెప్పాలో ముందు అర్థం కాలేదు.‘‘ఏమీ లేదు సార్! మిమ్మల్ని చూస్తుంటే ఒకోసారి నాకే అసూయ వేస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిరునవ్వుతో నడుచుకుంటూ ఓ సామాన్యుడిలా వెళుతుంటారు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. అందుకే మిమ్మల్ని, మీ ఇంటిని చూద్దామని వచ్చాను’’ అంటూ సమాధానం ఇచ్చాను‘‘చూశావుగా! ఏమనిపించింది?’’ అని అడిగారు‘నీ అంత పీనాసివాడు ఇంకొకడు లేడు’ అని అరుద్దామనిపించింది. కాని సంస్కారం అడ్డు వచ్చి, ‘‘మీరు డబ్బు ఖర్చు పెట్టరనుకుంటా’’ అన్నాను వ్యంగ్యంగా.నా అంతర్యం అర్థం అయ్యిందో ఏమో , ‘‘డబ్బు సంపాదించడం గొప్ప కాదు సురేష్, దాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకుండా సద్వినియోగం చెయ్యటం గొప్ప’’ అన్నారు శంకరంగారు.‘సద్వినియోగం అంటే వడ్డీలకు తిప్పటం, మూడంతస్తుల మేడలు కట్టటం అన్నమాట’ అని మనసులో అనుకుంటూ, ‘‘అవును సార్... మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను’’ అంటూ ఓ జీవంలేని నవ్వు నవ్వాను.‘‘ఏమి తెలుసుకున్నావు..?’’ అంటూ ప్రశ్నించారు.ఏమి జవాబు చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాను.‘‘సరే... నా వెంటరా’’ అంటూ నన్ను వెంట బెట్టుకుని కింది అంతస్తుకు తీసుకు వెళ్ళారు.అక్కడ ఓ చిన్నసైజు కార్పొరేట్ హాస్పిటల్ దర్శనం ఇచ్చింది. ఓ పదిమంది పేషంట్స్ బయట రిసెప్షన్ దగ్గర కూర్చుని ఉన్నారు.‘‘ఇది మా స్వంత హాస్పిటల్. నా శ్రీమతే వైద్యం చేస్తుంది. పగలు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తుంది. సాయంత్రం ఇక్కడ.’’వాళ్ళని దాటుకుని లోపలకి వెళ్ళాం ఇద్దరం. అక్కడ ఓ పెద్ద హాలు ఉంది. అందులో బెడ్స్ వరసగా వేసి ఉన్నాయి.వాటి మీద పేషంట్స్ పడుకుని ఉన్నారు.మమ్మల్ని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ లేచి నమస్కారం చేశారు. వాళ్ళని శంకరరావుగారు ‘‘ఎలా వున్నారు..’’ అంటూ పలకరించసాగారు.‘‘బాగున్నాను అయ్యా! మీ దయ వల్ల జబ్బు తగ్గిపోతోంది’’ అంటూ ఓ పెద్దావిడ నమస్కారం చేసింది.‘‘సురేష్! వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు. ఒక పూట భోజనానికి కూడా నోచుకోని వాళ్ళు. వీళ్లందరికీ ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తున్నాము’’ అంటూ చెప్పుకుపోతున్నారు.‘‘అవునయ్యా! మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు’’ అంటూ నమస్కారం చేశాడు మరో నడి వయస్కుడు.‘‘వైద్యమే కాదండి.. ఉచితంగా భోజన సదుపాయాలు కూడా అందిస్తున్నారు.. దేవుళ్ళు’’ అంటూ మా దగ్గరకి వచ్చాడు మరో ముసలాయన.‘‘నాదేముంది, ఆ భగవంతుడు ఇస్తున్నాడు. అదే మీకు ఖర్చు పెడుతున్నాను’’ అంటూ నవ్వేశారు.బయటకొస్తుంటే ఒక పేషంట్ ఎదురు పడ్డాడు, అతని వాలకం చూస్తుంటే డిశ్చార్జ్ అయినట్టున్నాడు.అతన్ని చూస్తూ, ‘‘డబ్బు తీసుకున్నావా? ఆరోగ్యం జాగ్రత్త. జబ్బు తగ్గే దాక అట్టే కష్టపడకు’’ అన్నారు శంకరంగారు. ‘‘అలాగే సార్..’’ అంటూ ఆయనకు నమస్కారం చేశాడు.‘‘సురేష్ కిందకి వెళ్దాం రా’’ అంటూ గ్రౌండ్ ఫ్లోరుకు దారితీశారు.అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయాను. అంతా ఒక కలలా వుంది. నేను నా స్నేహితుల మాట విని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమయ్యింది ఆ క్షణాన.‘‘ఏమిటి సురేష్ ఆగిపోయావ్ ..’’ అన్నారు నా వంక చూస్తూ.‘‘అబ్బే, ఏమీ లేదు.. వస్తున్నా సార్ ’’ అంటూ ఆయన వెనకాలే నడుస్తూ ‘‘సార్! ఉచితంగా వైద్యం చేస్తున్నారు, భోజనం కూడా పెడుతున్నారు. మళ్ళీ డబ్బులిస్తున్నారేమిటి పేషంట్లకి?’’ అనుమానంగా అడిగాను.‘‘జబ్బు నయం అయినంత మాత్రాన, పని చేసుకోవటానికి ఓపిక ఉండాలి కదా? అందుకనే ఓ నాలుగు రోజులకు సరిపడ సరుకులు, వాళ్ళ ఊరు వెళ్ళటానికి చార్జీలు ఇచ్చి పంపుతాను’’ అన్నారు నవ్వుతూ.ఆయన మాటలు విన్న నేను, ఆయన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు అర్పించాను.కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద డైనింగ్ హాలు, పక్కనే వంటశాల ఉంది. పక్కనే దానికి ఆనుకుని స్టోర్ రూము. స్టోర్ రూము నిండా సరుకులున్నాయి. డైనింగ్ హాలులో చాలామంది కూర్చొని ఉన్నారు. బహుశా భోజనం కోసం అనుకుంటా!ఆయన వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తూ, నేరుగా వంటగదిలోకి వెళ్ళి, ‘‘ఇవాళ ఏమి వండుతున్నారు..’’ అంటూ అక్కడి వంట వాళ్ళను పలకరించారు‘‘ముక్కల పులుసు, బీట్రూట్ కూర సార్’’ అన్నాడు వంటవాళ్ళలో ఒకడు.వంటగదిలో నుంచి బయటకు వచ్చి,‘‘రోగుల కూడా వచ్చిన బంధువులకు ఇక్కడ ఉదయం టిఫిన్తో సహా రెండు పూటలా భోజనం పెడతాము, ఉచితంగా’’ అన్నారు.ఆయన మాటలు వింటుంటే నా కళ్ళలో నుంచి అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చాయి. ‘ఇంత మంచిమనిషిని అనవసరంగా అపార్ధం చేసుకున్నాను’ అని నన్ను నేను నిందించుకున్నాను.నా కన్నీళ్లు చూసి, ‘‘ఏమిటి సురేష్? ఏమైయ్యింది.. ఎందుకా కన్నీళ్ళు..’’ కంగారుగా అడిగారు.‘‘మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నా సార్! నన్ను క్షమించండి’’ అంటూ ఆయన చేతులు పట్టుకున్నా.‘‘ఛఛ.. అవేం మాటలు.. ఊరుకో! నువ్వే కాదు, నా గురించి తెలియని చాలామంది నీలానే అనుకుంటారు’’ అంటూ అనునయించారు.‘‘మీరు దేవుడు సార్..’’ అన్నాను గద్గద స్వరంతో.‘‘అంత పెద్ద మాటలు వద్దు సురేష్. ఆ భగవంతుడు నాకేదో ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన దాంట్లో కొంత నలుగురికీ పంచుతున్నా అంతే!’’అన్నారు చాలా నెమ్మదిగా.‘‘అది అందరి వల్లా సాధ్యం కాదు సార్..’’ అన్నాను ఆయన కళ్ళలోకి చూస్తూ.‘‘ఎందుకు సాధ్యం కాదు? కాస్త నాది, నేను అనే స్వార్థం వీడితే అది సాధ్యం అవుతుంది. కాని, చాలామందికి బతుకు మీద భయం. రేపు ఏమవుతుందో అని లక్షలకు లక్షలు వెనకేస్తుంటారు.. పిరికివాళ్ళు’’ ‘‘అవును సార్! వాళ్ళలో నేనూ ఒకడిని’’‘‘చూడు సురేష్! నేను ఏనాడూ నా జేబులో డబ్బు లేదని బాధపడలేదు, భయపడలేదు. ఎవ్వరి ముందూచెయ్యి చాచలేదు. నేను ఈ హాస్పిటల్ ఉచితంగా నడపకుండా, ఆ డబ్బు వెనకేస్తే మరో రెండు మేడలు కట్టేవాడిని. మా ఆవిడ మెడలో మరో నాలుగు నెక్లెస్సులు వేలాడదీసేవాడిని లేదా హాయిగా నాలుగు కార్లలో తిరిగేవాడిని. కాని అదే డబ్బుతో ఓ పది మంది ప్రాణాలు నిలుపుతున్నా. ఓ పది కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నా. అదే గొప్ప తృప్తిని, గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు‘‘అవును సార్! డబ్బు విలువ అంటే ఏమిటో ఇప్పుడే నాకు అర్థం అవుతోంది’’ అన్నాను.‘‘అంతేకాదు సురేష్, మనం సుఖంగా బతకటానికి కావలసిన వస్తువులన్నీ కొంటే భౌతికమైన భద్రత దొరుకుతుందేమో కాని, మానసికంగా మాత్రం అభద్రత వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే, మనం కొన్న వస్తువులు, కార్లు, ఫోన్లు ఇవేవీ మనకు తోడు రావు. మనం సాయం చేసిన మనుషుల్లో కొంతమందైనా మన వెనక వస్తారు. వాళ్ళు మన వెనక ఉన్నారు అనేది మనకు కొండంత మానసిక ధైర్యం ఇస్తుంది’’అప్పటికి గాని నాకు అర్థం కాలేదు ఓ సెల్ఫోన్ లేకుండా, సొంత కారు లేకుండా, జేబులో పది రూపాయలు కూడా లేకుండా ధైర్యంగా ఎలా మనగలుగుతున్నారో!‘‘మరొక మాట సురేష్ , నువ్వు నిజాయితీగా ఉన్నంత కాలం నువ్వు ఎవ్వరికీ భయపడక్కరలేదు. మనం చేసే తప్పులే మనకు శత్రువులు. అవే మనల్ని వెంటాడుతూ భయపెడుతుంటాయి. చాలామంది స్తోమతకు మించి అప్పులు చేసి, ఖర్చు పెట్టి వాటిని తీర్చలేక భయపడుతుంటారు. నిజానికి మనకి ఎవ్వరూ శత్రువులు లేరు సురేష్. మనకు మనమే శత్రువులం’’ అంటూ ముగించారు‘‘నిజం సార్! మీరు మానసికంగా చాలా ధైర్యవంతులు. మీలా ఉండగలనా..?’’ అంటూ ప్రశ్నించా.‘‘ఎందుకు ఉండలేవు? నాలో ఉన్నదేమిటి, నీలో లేనిదేమిటి? ప్రయత్నించి చూడు, తప్పక ధైర్యవంతుడివి అవుతావు’’ అన్నారు నవ్వుతూ.వచ్చిన పని అయిపోవటంతో ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను.మరుసటి రోజు ఆఫీసుకు బయలుదేరే ముందు నన్ను నేను అద్దంలో చూసుకున్నా. ఎందుకో కొత్తగా అనిపించా. అలా ఎందుకు అనిపించానో నాకు అర్థమయ్యింది. అందుకే జేబులోని పర్సును మాత్రం బయటకు తియ్యలేదు. డబ్బుతో ఓ పదిమంది ప్రాణాలు నిలుపుతున్నా. ఓ పది కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నా. అదే గొప్ప తృప్తిని, గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది. -
అతి చేరువలో అమరత్వం!
అమరత్వం మానవాళి పురాకాంక్ష.. ఇంతవరకు అది ఒక అపూర్ణస్వప్నం..అమరత్వం అసాధ్యమైనదేమీ కాదు, అచిరకాలంలోనే సాధ్యమవుతుందట!అపూర్ణస్వప్నంగా మిగిలిన అమరత్వం అచిరకాలంలోనే సాధ్యమవుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రకటనలు మానవాళిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. భౌతిక శరీరంతో యథాతథంగా అమరత్వం పొందడానికి ఇంకా చాలాకాలమే పట్టవచ్చు గాని, సాంకేతిక అమరత్వం సాధించడానికి అట్టేకాలం పట్టదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరణం తర్వాత శరీరం నుంచి వేరుపడిన మానవ చేతనను కంప్యూటర్లలోకి అప్లోడ్ చేయడం ద్వారా సాంకేతిక అమరత్వం సాధించే ప్రక్రియ మరో పాతికేళ్లలోనే అందుబాటులోకి రాగలదని అంచనా వేస్తున్నారు. ఇప్పటి ప్రమాణాల ప్రకారం ఒక మనిషి వందేళ్లు బతకడమే చాలా గొప్ప. అయితే, ఇదివరకటితో పోల్చుకుంటే, ప్రపంచవ్యాప్తంగా శతాయుష్కుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. మరో పాతికేళ్లలో వైద్యరంగం సాధించే అభివృద్ధి మానవుల ఆయుఃప్రమాణాన్ని గణనీయంగా పెంచగలదని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. మనుషులు భౌతిక అమరత్వం సాధించడానికి ఇంకెంత కాలం పడుతుందో ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నా, మనుషులు శతాయుష్షును అధిగమించడం త్వరలోనే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక పురోగతి మరింత వేగం పుంజుకుంటే, మనుషులు దాదాపుగా భౌతిక అమరత్వం సాధించడం కూడా అసాధ్యమేమీ కాదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ భావన గురించి, అమరత్వ సాధన దిశగా శాస్త్ర సాంకేతిక పరిశోధకులు సాగిస్తున్న పరిశోధనలు, శాస్త్రవేత్తల అంచనాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం.నాలుగేళ్లలోనే యంత్రాలతో అనుసంధానం‘మరో నాలుగేళ్లలోనే కృత్రిమ మేధ పూర్తిగా అభివృద్ధి చెంది, మానవ మేధకు దీటుగా తయారవుతుంది. మానవులు యంత్రాలతో అనుసంధానమయ్యే కొత్త శకం ప్రారంభమవుతుంది. కంప్యూటర్లు, ఆండ్రాయిడ్ శరీరాల ద్వారా మనుషులు అమరత్వం పొందే పరిస్థితులు 2045 నాటికే సాధ్యమవుతాయి. ఈ సాంకేతికత మరింతగా అభివృద్ధి చెంది 2050 నాటికి అపర కుబేరులకు అందుబాటులోకి వస్తుంది’ అని గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రే కర్జ్వీల్ చెబుతున్నారు. ఇదివరకు ఆయన వేసిన సాంకేతిక అంచనాలు పూర్తిగా నిజయం కావడంతో మనుషుల అమరత్వంపై ఆయన తాజా అంచనాలు కూడా నిజం కాగలవని ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిశోధకుల్లో చాలామంది విశ్వసిస్తున్నారు. కంప్యూటర్లు చదరంగం చాంపియన్లను ఓడించగలవని, స్మార్ట్ఫోన్లు సామాన్యుల చేతుల్లోకి రాగలవని కర్జ్వీల్ దశాబ్దాల కిందటే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా అంచనాలపై శాస్త్ర సాంకేతిక రంగంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.పన్యాల జగన్నాథదాసుఅమరత్వం పొందాలనేది మనిషి చిరకాల స్వప్నం. ఎంతటి ధైర్యశాలి మనిషినైనా భయపెట్టేవి రెండే రెండు: అవి జరా మరణాలు. పురాణకాలం నుంచే జరా మరణాలను జయించాలనే తపన మనుషుల్లో ఉంది. ప్రాక్ పాశ్చాత్య పురాణాలలో ఇందుకు సంబంధించిన గాథలు కనిపిస్తాయి. అమరత్వం కోసమే దేవ దానవులు క్షీరసాగర మథనం చేశారు. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతాన్ని సేవించడం వల్లనే దేవతలు అమరులయ్యారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి గాథ పురాతన గ్రీకు పురాణాల్లోనూ ఉంది. ‘అంబ్రోజియా’ అనే ఆహార పదార్థాన్ని ఆరగించి, ‘నెక్టర్’ అనే అమృతంలాంటి పానీయాన్ని సేవించడం వల్లనే ఒలింపస్ పర్వతంపై నివసించే దేవతలు అమరులుగా మారారని గ్రీకు పురాణాల కథనం. ప్రపంచంలోనే ఆది పురాణమైన ‘గిల్గమేష్’లో కూడా అమరత్వ భావనకు ఉంది. ‘గిల్గమేష్’ క్రీస్తుపూర్వం 2100 సంవత్సరాల నాటిది. అంటే, అప్పటి నుంచే అమరత్వం సాధించాలనే తపన మనుషుల్లో ప్రబలంగా ఉండేదనడానికి ఇదొక నిదర్శనం.ఆ తర్వాత వచ్చిన కాల్పనిక సాహిత్యంలోనూ అమరత్వంపై అనేక కల్పనలు ఉన్నాయి. ఆంగ్లో–ఐరిష్ రచయిత జొనాథన్ స్విఫ్ట్ రాసిన ‘గలివర్స్ ట్రావెల్స్’లో ‘లుగ్నాగ్’ అనే కాల్పనిక ద్వీపరాజ్యంలో ఉండే ‘స్ట్రల్బ్రగ్స్’ అనే మనుషులు ఎంత వృద్ధులైపోయినా, మరణం లేకుండా ఉంటారు. అమరత్వం చుట్టూ ఎన్ని కల్పనలు ఉన్నా, చాలామంది దానిని ఎప్పటికీ నెరవేరని కలగానే భావిస్తూ వచ్చారు. పుట్టిన వారికి మరణం తప్పదని, అది ప్రకృతి సహజ ధర్మమని చెబుతూ వచ్చారు. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని ‘జాతస్య హి ధ్రువో మృత్యుః’ అని చెప్పింది. అయినా మనిషికి అమరత్వం మీద ఆశ చావలేదు. అమరత్వ సాధనకు ప్రయత్నాలనూ మానుకోలేదు.శాస్త్రవేత్తల ప్రయత్నాలుమరణానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. వీటిలో అతి సాధారణమైన కారణం వార్ధక్యం. ఇప్పటికీ చాలామంది వార్ధక్యాన్ని జీవితంలో ఒక సహజమైన దశగానే పరిగణిస్తున్నారు. కొందరు వైద్య శాస్త్రవేత్తలు మాత్రం వార్ధక్యాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఎలాంటి వ్యాధికైనా నివారణ మార్గాన్ని కనుగొనడమే శాస్త్రవేత్తల పని. అంతకంటే ముందుగా వ్యాధి మూలకారణాన్ని కనుగొనడం ముఖ్యం. శరీరంలోని జీవకణాలకు వయసు మళ్లకుండా నిరోధించగలిగితే, వార్ధక్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. కనీసం శరీరంలోని జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియను నెమ్మదించేలా చేయగలిగితే గణనీయంగా ఆయుర్దాయాన్ని పొడిగించడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు. జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియ నెమ్మదించేలా చేయడానికి, కుదిరితే పూర్తిగా వయసు మళ్లే ప్రక్రియను నిలిపివేయడానికి సాధ్యమయ్యే మార్గాలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇందుకు అనేక ప్రయోగాలను సాగిస్తున్నారు. బ్రిటిష్ ఫ్యూచరాలజిస్ట్ ఇయాన్ పియర్సన్, గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రే కర్జ్వీల్, బ్రిటిష్ జన్యుశాస్త్ర నిపుణుడు అబ్రీ డి గ్రే వంటి శాస్త్రవేత్తలు 2050 నాటికల్లా కంప్యూటర్లలోకి, రోబోలలోకి మెదడులోని ఆలోచనలను అప్లోడ్ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని, అప్పుడు ప్రపంచంలోని అపర కుబేరులు ఈ ప్రక్రియ ద్వారా అమరత్వాన్ని పొందగలరని అంచనా వేస్తున్నారు. మరో పాతికేళ్లలో ప్రపంచంలోని సంపన్నులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, మరణానంతరం తమ చేతనను కంప్యూటర్లలోకి లేదా రోబోల వంటి ఆండ్రాయిడ్ శరీరాల్లోకి అప్లోడ్ చేయడం ద్వారా అమరత్నాన్ని సాధించగలరని ఇయాన్ పియర్సన్ చెబుతున్నారు. మరో నాలుగేళ్లలోనే– అంటే, 2029 నాటికల్లా మానవ మేధకు దీటుగా కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతుందని అబ్రీ డి గ్రే చెబుతున్నారు. మానవ మేధకు దీటైన స్థితికి కృత్రిమ మేధ చేరుకున్నాక మనుషులకు, యంత్రాలకు మధ్య అనుసంధానం తేలికవుతుందని, ఈ ప్రక్రియ ద్వారా 2045 నాటికే మనుషులు అమరత్వం సాధించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అంతేకాదు, రానున్న పాతికేళ్లలో వైద్యరంగం కూడా శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని, 2050 నాటికి వార్ధక్యాన్ని నయం చేయగలిగే పరిస్థితులు ఏర్పడతాయని, ఫలితంగా 2050 తర్వాత మనుషులు వెయ్యేళ్లకు పైగా ఆయుర్దాయాన్ని పొందగలుగుతారని కూడా గ్రే అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అమిత సంపన్నులు 2050 నాటికల్లా తమ భౌతిక మరణం తర్వాత కూడా అమరులుగా ఉండటానికి సాంకేతికతను వినియోగించుకుంటారని, తమ చేతనను కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్ శరీరాల్లోకి అప్లోడ్ చేయడం ద్వారా అమరత్వాన్ని సాధించగలుగుతారని పియర్సన్ చెబుతున్నారు. తొలినాళ్లలో ఈ సాంకేతికత చాలా ఖరీదుగా ఉంటుందని, మరో దశాబ్దం తర్వాత ఎగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్ శరీరాల్లోకి మేధా చేతనను అప్లోడ్ చేసే సాంకేతికత 2060 నాటికల్లా కొంత తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి రాగలదని చెబుతున్నారు. ఇదేకాలంలో వైద్యరంగం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని; క్యాన్సర్, గుండెజబ్బులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులను పూర్తిగా నయం చేయగలిగే చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తాయని; జన్యు సవరణ పద్ధతులు మరింతగా అభివృద్ధి చెంది, వయసు మళ్లిన కణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించగలిగే స్థాయికి చేరుకుంటుందని పియర్సన్ చెబుతున్నారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా కృత్రిమ అవయవాల తయారీ, కృత్రిమ మేధ సహాయంతో రూపొందే చికిత్స పద్ధతులు రానున్న కొద్ది దశాబ్దాల్లోనే మనుషుల ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించగలవని ఆయన అంటున్నారు.‘మ్యూటంట్’ మానవులుమనుషులకు మానవాతీత శక్తులు ఉండటం కాల్పనిక సాహిత్యంలోను, సినిమాల్లోను మాత్రమే చూసి ఉంటాం. ఇలాంటి మానవులు త్వరలోనే మన మధ్య సంచరిస్తారని, మరో ఐదేళ్లలోగా ‘మ్యూటంట్’ మానవులు మన మధ్య తిరుగాడుతారని లండన్కు చెందిన ఫ్యూచరిస్ట్, టెక్నాలజీ ఇన్వెస్టర్ హెర్బర్ట్ సిమ్ చెబుతున్నారు. కొత్తగా రాబోయే ఈ ‘మ్యూటంట్’ మానవజాతిని ‘ఎక్స్–మెన్’గా అభివర్ణిస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనల ద్వారా రూపొందే ఈ ‘పరివర్తిత’ మానవులు లేదా ‘మ్యూటంట్’ మానవుల శక్తి సామర్థ్యాల ముందు ప్రస్తుతం ఉన్న మానవుల శక్తి సామర్థ్యాలు ఎందుకూ కొరగావని సిమ్ చెబుతున్నారు. త్వరలోనే ‘మ్యూటంట్’ మానవుల రాకతో ఇప్పటి ఆధునిక మానవులు వాడుకలో పనికిరాకుండా పోతారని ఆయన అంచనా వేస్తున్నారు. ‘మ్యూటంట్’ మానవుల రూపకల్పన కోసం చేపట్టే పరిశోధనలకు హెర్బర్ట్ సిమ్ భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. హెర్బర్ట్ సిమ్ తన స్టార్టప్ సంస్థ ‘న్యూరోచిప్ డాట్ కామ్’ ద్వారా ‘మ్యూటంట్’ మానవుల రూపకల్పన కోసం ప్రయోగాలు సాగిస్తున్నారు. మెదడులోని ఆలోచనలను చదవగల హెల్మెట్పై ఆయన ప్రయోగాలు చేపడుతున్నారు. ‘మ్యూటంట్’ మానవులు ప్రాణాంతక వ్యాధులను సైతం తట్టుకుని, సులువుగా ఐదువందల ఏళ్లు బతకగలరని సిమ్ చెబుతున్నారు.అమరత్వంపై నైతిక మీమాంసలుఅమరత్వం చేరువలోనే సాధ్యమవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ సాధన ఎలా ఉన్నా, మానవుల ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని పలువురు శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. ఈ పరిణామాలు సంభవిస్తే, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మానవులు అమరత్వం సాధించినా, కనీసం శతాబ్దాల తరబడి బతకగల స్థితికి చేరుకున్నా, ప్రపంచం మరింత జటిలంగా మారుతుందని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచ జనాభా అదుపు తప్పి పెరుగుతుందని, అప్పుడు వనరుల పంపిణీలో మరిన్ని వ్యత్యాసాలు తలెత్తి, మనుషుల మధ్య కీచులాటలు, నేరాలు పెరుగుతాయని, దేశాల మధ్య యుద్ధాలు పెచ్చరిల్లుతాయని వారు హెచ్చరిస్తున్నారు. మనుషులు అమరులైతే, జనాభా మరింతగా పెరగడం తప్ప ప్రపంచానికి ప్రయోజనం ఉండదని, పైగా పర్యావరణానికి తీరని హాని జరుగుతుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జీవితంలో మరణం ఒక సహజ పరిణామమని, మరణం ఉన్నప్పుడే మనుషులకు జీవితం విలువ అర్థమవుతుందని, మరణమే లేకుండాపోతే జీవితానికి విలువ ఉండదని, అలా ఎంతకాలం జీవించినా దండగేనని కొందరు తత్త్వవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఎవరు ఏమన్నా, ‘అమరత్వం అతి చేరువలోనే’ అని ఊరిస్తున్న శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనలను మరింత ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు.త్వరలో జరగబోయే పరిణామాలుఅమరత్వ సాధన దిశగా త్వరలోనే పలు పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఎప్పుడెప్పుడు ఏయే మార్పులు జరుగనున్నాయో చూద్దాం.. 2029ఈ ఏడాది నాటికి మానవులకు, యంత్రాలకు అనుసంధానం ఏర్పడుతుంది. మనుషులు తమ మేధా చేతనను కంప్యూటర్లలోకి లేదా ఆండ్రాయిడ్ శరీరాల్లోకి ఎక్కించగలుగుతారు. ఆ విధంగా భౌతిక మరణం తర్వాత కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతారు.2050ఈ ఏడాది నాటికి వైద్యరంగం వార్ధక్యాన్ని ఇతర వ్యాధుల మాదిరిగానే నయం చేయగలదు. జన్యు సవరణ పరిజ్ఞానం వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే స్థాయికి అభివృద్ధి చెందగలదు. అబ్రీ డి గ్రే చెబుతున్న ప్రకారం వెయ్యేళ్లు బతకగల మనుషులు ఇప్పటికే పుట్టి ఉంటారు. జీవకణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే పద్ధతులపై పరిశోధనల కోసం డి గ్రే ‘లాంజివిటీ ఎస్కేప్ వెలాసిటీ ఫౌండేషన్’ నెలకొల్పి, ఇతర శాస్త్రవేత్తలతో కలసి విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు.2030మనుషులకు, యంత్రాలకు మధ్య దాదాపుగా ఏకత్వం ఏర్పడుతుంది. మరణం వల్ల మనుషుల భౌతిక శరీరం అంతరించిపోయినా, యంత్ర శరీరాల ద్వారా మనుగడ సాగించగల సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. మనుషులకు, యంత్రాలకు మధ్య ఏకత్వం చేరువలోనే ఉందంటూ, సరిగా ఏడాది కిందట– 2024 జూన్లో రే కర్జ్వీల్ ‘ది సింగులారిటీ ఈజ్ నియరర్’ పేరుతో పుస్తకం రాశారు.2045ఈ ఏడాదిలోగా మనుషులు మరణానంతరం ‘సైబోర్గ్’లుగా మనుగడ కొనసాగించగలరు. కంప్యూటర్లలోకి అప్లోడ్ చేసిన మేధాచేతనను ఇతర అధునాతన సాంకేతికతతో రూపొందించిన యంత్ర శరీరాల్లోకి డౌన్లోడ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ యంత్ర శరీరాలు మనుషుల మాదిరిగానే పని చేస్తాయి.వార్ధక్య నివారణ సుసాధ్యంకొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా 2050 నాటికి అమరత్వ సాధన మాట ఎలా ఉన్నా, ‘సెనోలైటిక్’ ఔషధాలతో వార్ధక్య నివారణ సుసాధ్యమవుతుందని బ్రిటిష్ శాస్త్రవేత్త ఆండ్రూ స్టీల్ చెబుతున్నారు. ఈ అంశంపై ఆయన ‘ఏజ్లెస్’ అనే పుస్తకం రాశారు. ‘సెనోలైటిక్’ ఔషధాలు శరీరంలోని మృతకణాలను, జోంబీ కణాలను తొలగించి, జీవకణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వార్ధక్య లక్షణాలను వెనక్కు మళ్లించడంతో పాటు ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించడానికి ఉపయోగపడతాయి. వార్ధక్యం వల్ల మరణం సంభవించడమనేది 2050 తర్వాత చరిత్రగానే మిగిలిపోతుందని ఆండ్రూ స్టీల్ చెబుతున్నారు. -
అక్షర భ్రమణం
రశ్మిరేఖ రచయిత్రి. ఇప్పటికి వరకు నాలుగు నవలు రాశారు. మొదటిది 2013లో. నాల్గవది 2023లో. అస్సామీ భాషలో ఉండే ఆ పుస్తకాలలో ఏముందో, ఆ పుస్తకాల టైటిల్స్కు అర్థం ఏమిటో అస్సామీని చదవటం రాని వారికి తెలియకపోవచ్చు. కానీ, రశ్మిరేఖ జీవితం గురించి తెలుసుకుంటే మాత్రం ఆ పుస్తకాల్లో ఆమె ఏం రాసి ఉంటారో కొంతైనా ఊహించవచ్చు.రశ్మి వయసు 39. రోజంతా వీల్ చెయిరే ఆమెను తిప్పుతూ ఉంటుంది. ఉత్తర అస్సాంలోని సూటీ ప్రాంతంలో తను పాఠాలు చెబుతుండే ఖానగురి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు తిప్పుతుంటుంది, అస్సాంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతుండే సాహితీ సభలూ సమావేశాలకూ తిప్పుతుంటుంది. చిన్నప్పుడే చెప్పేశారు!రశ్మి ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ (ఎస్.ఎం.ఎ.) పేషెంట్. అందుకే వీల్ చెయిర్ ఆమె శరీరంలో ఒక భాగం అయిపోయింది. చిన్నప్పుడే ఆమె గురించి వైద్యులు ఆమె తల్లిదండ్రులకు చెప్పేశారు... మీ అమ్మాయికి పెద్దయ్యాక ఎస్.ఎం.ఎ. వస్తుందని, అందుకు ఆమెను మానసికంగా సిద్ధం చేయమనీ! ఆ ఎరుకతో రశ్మి తన జీవితంలో పూర్తి ‘పాజిటివిటీ’ని అలవాటు చేసుకుంది. ‘అంతా మన మంచికే’ అనే ధోరణి అది. టీచర్లు ప్రోత్సహించారుఖానగురికి కాస్త దగ్గర్లో ఉండే రశ్మి ఇల్లు, ఇంటి పరిసరాలు ఆమె చిన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉండేవి. అందమైన భావాలు రశ్మిలో అక్కడ పూతలు వేసేవి. ఆమె ఆలోచనల్లోని మార్దవాన్ని, సృజనశీలతను ఆమె తల్లిదండ్రులతో పాటు, టీచర్లూ గమనించి ఆమెను రచన వైపు ప్రోత్సహించారు. ఆ తర్వాత నెమ్మదిగా అస్సామీ దినపత్రికల్లో, వార పత్రికల్లో, మేగజీన్స్ లలో ఆమె వ్యాసాలు రావటం మొదలైంది. చివరికి అవి ఆమెను నవలా రచనకు ప్రేరేపించాయి. ఆమె రాసిన ‘మేఘే ధోక అకక్సార్ జూన్స్ ’, ‘జీబన్స్ మీనార్ సుర్’, ‘గిగోలో’, ‘మటి ఈశ్వర్’ అనే నవలలు అస్సాంలో ఆమెను ప్రముఖ రచయిత్రిని చేశాయి. పుస్తకాలు స్ఫూర్తినిచ్చాయిఇంటి వాతావరణంతో పాటు, 750 వరకు పుస్తకాలు రాసిన 72 ఏళ్ల అస్సామీ రచయిత రంజూ హజారికా కూడా రశ్మికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన పుస్తకాలను, 88వ యేట 2021లో కన్నుమూసిన అస్సామీ రచయిత హోమెన్స్ బోర్గోహెయిన్స్ రచనల్ని కూడా రశ్మి ఇష్టంగా చదివేవారు. హోమెన్స్ ను ఆమె పెదనాన్న అని పిలిచేవారు. ఆమెను ఆత్మకథ రాయమని ప్రోత్సహించింది ఆయనే. ‘‘మమోని బైద్యు (ఇందిరా గోస్వామి) పుస్తకాలు కూడా నాలో రాసే ధైర్యాన్ని నింపాయి’’ అంటారు రశ్మి. హోమెన్, బైద్యు 2011లో చనిపోయినప్పుడు ఆ విషాదం నుంచి త్వరగా తేరుకోలేకపోయారు రశ్మి. రాష్ట్రం మొత్తం మీద నలుగురే!రశ్మి గువాహటి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ్సలో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశారు. ఆ సమయంలోనే బైద్యు, హోమెన్, రంజూ హజారికా పుస్తకాలను ఎక్కువగా చదివారు. తర్వాత టీచర్గా ఉద్యోగం. ఆ తర్వాత 2020లో రశ్మి పెళ్లి. ఇప్పుడు ఎనిమిది నెలల కూతురు. ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ ఉండి, తల్లి అయిన తొలి అస్సామీ మహిళ రశ్మి. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ వ్యక్తులు నలుగురు మాత్రమే ఉన్నారు. తక్కిన ముగ్గురిలో ఒకరు రశ్మి చెల్లెలు ఛాయానిక. ఇంత పెద్ద కష్టంలోనూ మామూలు జీవితాన్ని గడుపుతున్నారు ఈ అక్కచెల్లెళ్లు. ‘‘ఆ మాటే నాకు నచ్చదు’’అయితే ఈ మాటే అనొద్దంటారు రశ్మి! ‘‘మామూలు జీవితం అంటే ఏంటి? వీల్ చెయిర్లో ఉంటే మాత్రం మామూలు జీవితం కాకుండా పోతుందా? ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అనే మాటైతే నాకు అస్సలు నచ్చదు. వికలాంగుల్ని వికలాంగులు అనకుండా ఆ సొగసైన భాష ఏమిటి.. కృత్రిమంగా!’’ అంటారు రశ్మిరేఖ. ‘‘ఎవరైనా సరే సానుభూతి చూపకూడదు. సానుభూతి కోరుకోకూడదు’’ అన్నది ఆమె భావన. ఆమె అభ్యర్థన. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
మ్యూజియంలలో బస చేస్తారా?
మ్యూజియంలు సాధారణంగా పగలు తెరుచుకుంటాయి. రాత్రి మూతబడతాయి. ఒక్కో ప్రదేశంలో ఉన్న మ్యూజియంలకు ఒక్కో నిర్దిష్ట వేళలు ఉంటాయి. వేళ ముగిశాక మ్యూజియంలలో ఎవరినీ ఉండనివ్వరు. అలాంటిది మ్యూజియంలలో బస చేయడమేంటి? అవేమైనా హోటళ్లా, లాడ్జింగులా అనుకుంటున్నారా? ప్రపంచంలో తొమ్మిది మ్యూజియంలు మాత్రం రాత్రి బస చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో, వాటి విశేషాలేమిటో తెలుసుకుందాం.స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీఈ మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. రాత్రి ఇక్కడ బస చేసేవారు ఇందులోని డేవిడ్ కోచ్ హాల్ ఆఫ్ ఫాసిల్స్లోను, దానికి దగ్గరలోనే ఉన్న సాంట్ ఓషన్ హాల్లోను థీమ్ పార్టీలు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. రాత్రంతా ఇక్కడ బస చేయాలంటే, ఒక్కొక్కరు 150 డాలర్లు (సుమారు రూ.12,900) చెల్లించాల్సి ఉంటుంది. పదిమంది లేదా అంతకు మించిన జనాలు బృందాలుగా వెళితే, ఒక్కొక్కరికి 120 డాలర్లు (సుమారు రూ.10.300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అవకాశం అన్నిరోజుల్లోనూ ఉండదు. ఈ ఏడాది జూన్ 20, 28 తేదీల్లోను; జూలై 11, 19 తేదీల్లోను; ఆగస్టు 1, 8 తేదీల్లోను మాత్రమే ఇక్కడ బస చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.మేరీలండ్ సైన్స్ సెంటర్అమెరికాలోని మేరీలండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ఉంది ఈ మ్యూజియం. ఏడాదిలో రెండుసార్లు రెండేసి రోజుల చొప్పున రాత్రివేళ బస చేసేందుకు ఈ మ్యూజియం అనుమతిస్తుంది. ఏటా మే, జూన్ నెలల్లో ‘స్టార్వార్స్’ థీమ్ నైట్ పార్టీ నిర్వహిస్తుంది. అలాగే, ‘పైజమా పార్టీ’ నిర్వహిస్తుంది. ఏటా రెండేసి రోజులు సాగే ఈ పార్టీలలో ఐదేళ్లకు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొనవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయవచ్చు. ఈ పార్టీలలో పాల్గొనే పిల్లలకు స్లైమ్, బ్లాక్ బిల్డింగ్ సహా రకరకాల హస్త కళలు, ప్లానెటేరియం షో, ఐమాక్స్ షో కూడా ఉంటాయి. ఇందులో బస చేసేవారు ఒక్కొక్కరు 71 డాలర్లు (రూ.6,104) చెల్లించాల్సి ఉంటుంది.ఇంట్రెపిడ్ మ్యూజియంఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులోని విమానవాహక నౌకలో డిన్నర్ పార్టీలు చేసుకోవడానికి, రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు వయసు గల పిల్లలు ఆస్వాదించడానికి అనువుగా ఇందులో రకరకరాల వినోద విజ్ఞాన కార్యక్రమాలను రూపొందించారు. ఫ్లాష్లైట్ గైడెడ్ టూర్లు, అపరిమితంగా రకరకాల సిమ్యులేషన్ రైడ్లు ఇందులోని ప్రత్యేక ఆకర్షణలు. బస చేసేవారికి ఇక్కడ అల్పాహారం, చిరుతిళ్లు, భోజనం అన్నీ ఉచితం. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఒక్కొక్కరు 130 డాలర్లు (రూ.11,182), బసతో పాటు పార్టీలు చేసేకునేవారు ఒక్కక్కరు 145 డాలర్లు (రూ.12,472) చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వచ్చేటట్లయితే, ఒక్కొక్కరు 99 డాలర్లు (రూ.8,515) చెల్లించాల్సి ఉంటుంది. ఫీల్డ్ మ్యూజియంఇది అమెరికాలోని షికాగో నగరంలో ఉంది. పురాతన డైనోసార్ల శిలాజాలను భద్రపరచిన ఈ మ్యూజియం రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. భూగ్రహ పరిణామానికి చెందిన అనేక ఆధారాల అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరచారు. రాత్రివేళ బస చేసే వారికి ఇక్కడ పలు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఉపన్యాసాలు, వైల్డ్లైఫ్ డిటెక్షన్ పోటీలు, థీమ్డ్ చాలెంజెస్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలతో కలసి కుటుంబాలు, పదిహేను మంది లోపు బృందాలు ఇందులో రాత్రి బస చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఇందులో వారు ఎంపిక చేసుకునే ప్యాకేజీలను బట్టి ఒక్కొక్కరు 95–200 డాలర్లు (రూ.8,171–రూ.17,203) వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బస చేసేవారికి అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మరునాటి ఉదయం మ్యూజియం సందర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం.యూఎస్ఎస్ హార్నెట్ మ్యూజియంఈ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యాలమీడాలో ఉంది. ఇది ఏటా ఒకరోజు ‘హిస్టరీ మిస్టరీ ఓవర్నైట్’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కుటుంబాలు, బృందాలు పాల్గొనవచ్చు. పదహారేళ్ల వయసు పైబడిన వారికోసం ఇందులో అర్ధరాత్రివేళ రెండో ప్రపంచయుద్ధం నాటి విమానవాహక నౌక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మ్యూజియం ప్రతినిధులు సందర్శకులకు దీని విశేషాలను వివరిస్తారు. రాత్రివేళ ఇందులో నిద్రించే అవకాశం కూడా కల్పిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అతీంద్రియ శక్తుల అన్వేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వినోదాత్మక వైజ్ఞానిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు పదిమంది వరకు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ.86 వేలు), పదిమందికి పైబడి ఇరవైమంది వరకు ఉంటే రెండువేల డాలర్లు (సుమారు రూ.1.72 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.ఓరెగాన్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని పోర్ట్లండ్ నగరంలో ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక అభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరించే రకరకాల వస్తువులను ఇందులో భద్రపరచారు. విద్యార్థులు బృందాలుగా వారి ఉపాధ్యాయులతో కలసి ఈ మ్యూజియం సందర్శించడంతో పాటు రాత్రివేళ ఇక్కడే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కో విడతలో యాభైమందికి లోపుగా వచ్చే బృందాలను మాత్రమే అనుమతిస్తారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఇందులోకి అనుమతి ఉంటుంది. మ్యూజియం సందర్శనకు వచ్చే బృందాలు తమకు అనువైన తేదీలను చెప్పి, ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. బృందంలో ముప్పయి మంది వరకు ఉంటే 3300 డాలర్లు (రూ.2.83 లక్షలు), ముప్పయి మందికి మించి ఉంటే, అదనంగా ఉండేవారు ఒక్కొక్కరికి 90 డాలర్ల (రూ.7,737) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బృందంలోని సభ్యుల సంఖ్య యాభైమందికి మించరాదనే పరిమితి ఉంది. ఇక్కడ బస చేసేవారికి అల్పాహారం, భోజనం ఉచితం. ఆరుబయట నిద్రించేవారికి టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు కూడా ఉచితంగానే అందిస్తారు.మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఉంది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకునే స్కౌట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అనుమతిస్తుంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన రకరకాల ఆవిష్కరణలను పొందుపరచిన ఈ మ్యూజియంలో బస చేయడానికి ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో అనుమతి ఉంటుంది. బస కోసం బృందాలుగా వచ్చేవారు ముందుగానే సంప్రదించి, బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముప్పయి మంది వరకు ఉండే బృందాలు 1300 డాలర్లు (రూ.1.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. బృందంలో ముప్పయిమందికి అదనంగా ఉంటే పిల్లలు ఒక్కొక్కరికి 48 డాలర్లు (రూ.4,126), పెద్దలు ఒక్కొక్కరికి 36 డాలర్లు (రూ.3,094) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ప్లిమత్ ప్యాటక్సెట్ మ్యూజియంఇది అమెరికాలోని బోస్టన్ నగరానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్లోని పదిహేడో శతాబ్దినాటి జనజీవనానికి అద్దంపట్టే వస్తువులను భద్రపరచే ఈ మ్యూజయంలో అప్పటి కాలంలో మాదిరిగానే గడపడానికి వీలుగా వసతులు ఉన్నాయి. ఇందులో రాత్రి బస చేయడానికి స్కౌట్స్కు, పాఠశాలల విద్యార్థి బృందాలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియంలో హిస్టారిక్ ప్యాటక్సెట్ హోమ్సైట్, ప్లిమత్ కాలనీ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఇరవైమందికి పైబడిన బృందాలు ఇక్కడ బస చేయవచ్చు. ఇందులోని ఒకే విభాగంలో గడపాలనుకునే బృందాల్లో కనీసం ఇరవైమంది ఉండాలి. నలభై మందికి పైగా ఉండే బృందాలకు రెండు విభాగాల్లోనూ గడిపేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో బసకు ఒక్కొక్కరు 81 డాలర్లు (రూ.6,963) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బస చేసేవారికి అల్పాహారం, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితం.నేచురల్ హిస్టరీ మ్యూజియంరాత్రి బసకు వీలు కల్పించే మ్యూజియంలు ఎక్కువసంఖ్యలో అమెరికాలో ఉంటే, ఇది యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో ఉంది. డైనోసార్ల శిలాజాలు సహా ప్రకృతి పరిణామాలకు, చరిత్రకు సంబంధించిన పలు వస్తువులను భద్రపరచిన ఈ మ్యూజియం విద్యార్థులకు రాత్రి బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియం పిల్లల కోసం ప్రత్యేకంగా ‘డైనోస్నోర్స్’ అనే ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఏడేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు వయసుగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలసి ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. రాత్రి బస చేసే విద్యార్థులకు ఈ మ్యూజియంలో పలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో బస చేయడానికి పిల్లలు ఒక్కొక్కరికి 114 డాలర్లు (రూ.9,800), పెద్దలు ఒక్కొక్కరికి 197 డాలర్లు (రూ.16,935) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ ఏడాది జూన్ 13, జూలై 4, జూలై 18, ఆగస్టు 1, ఆగస్టు 22, సెప్టెంబర్ 30 తేదీల్లో ఈ అవకాశం కల్పిస్తోంది.స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీఈ మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. రాత్రి ఇక్కడ బస చేసేవారు ఇందులోని డేవిడ్ కోచ్ హాల్ ఆఫ్ ఫాసిల్స్లోను, దానికి దగ్గరలోనే ఉన్న సాంట్ ఓషన్ హాల్లోను థీమ్ పార్టీలు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. రాత్రంతా ఇక్కడ బస చేయాలంటే, ఒక్కొక్కరు 150 డాలర్లు (సుమారు రూ.12,900) చెల్లించాల్సి ఉంటుంది. పదిమంది లేదా అంతకు మించిన జనాలు బృందాలుగా వెళితే, ఒక్కొక్కరికి 120 డాలర్లు (సుమారు రూ.10.300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అవకాశం అన్నిరోజుల్లోనూ ఉండదు. ఈ ఏడాది జూన్ 20, 28 తేదీల్లోను; జూలై 11, 19 తేదీల్లోను; ఆగస్టు 1, 8 తేదీల్లోను మాత్రమే ఇక్కడ బస చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.మేరీలండ్ సైన్స్ సెంటర్అమెరికాలోని మేరీలండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ఉంది ఈ మ్యూజియం. ఏడాదిలో రెండుసార్లు రెండేసి రోజుల చొప్పున రాత్రివేళ బస చేసేందుకు ఈ మ్యూజియం అనుమతిస్తుంది. ఏటా మే, జూన్ నెలల్లో ‘స్టార్వార్స్’ థీమ్ నైట్ పార్టీ నిర్వహిస్తుంది. అలాగే, ‘పైజమా పార్టీ’ నిర్వహిస్తుంది. ఏటా రెండేసి రోజులు సాగే ఈ పార్టీలలో ఐదేళ్లకు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొనవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయవచ్చు. ఈ పార్టీలలో పాల్గొనే పిల్లలకు స్లైమ్, బ్లాక్ బిల్డింగ్ సహా రకరకాల హస్త కళలు, ప్లానెటేరియం షో, ఐమాక్స్ షో కూడా ఉంటాయి. ఇందులో బస చేసేవారు ఒక్కొక్కరు 71 డాలర్లు (రూ.6,104) చెల్లించాల్సి ఉంటుంది.ఇంట్రెపిడ్ మ్యూజియంఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులోని విమానవాహక నౌకలో డిన్నర్ పార్టీలు చేసుకోవడానికి, రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు వయసు గల పిల్లలు ఆస్వాదించడానికి అనువుగా ఇందులో రకరకరాల వినోద విజ్ఞాన కార్యక్రమాలను రూపొందించారు. ఫ్లాష్లైట్ గైడెడ్ టూర్లు, అపరిమితంగా రకరకాల సిమ్యులేషన్ రైడ్లు ఇందులోని ప్రత్యేక ఆకర్షణలు. బస చేసేవారికి ఇక్కడ అల్పాహారం, చిరుతిళ్లు, భోజనం అన్నీ ఉచితం. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఒక్కొక్కరు 130 డాలర్లు (రూ.11,182), బసతో పాటు పార్టీలు చేసేకునేవారు ఒక్కక్కరు 145 డాలర్లు (రూ.12,472) చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వచ్చేటట్లయితే, ఒక్కొక్కరు 99 డాలర్లు (రూ.8,515) చెల్లించాల్సి ఉంటుంది. ఫీల్డ్ మ్యూజియంఇది అమెరికాలోని షికాగో నగరంలో ఉంది. పురాతన డైనోసార్ల శిలాజాలను భద్రపరచిన ఈ మ్యూజియం రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. భూగ్రహ పరిణామానికి చెందిన అనేక ఆధారాల అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరచారు. రాత్రివేళ బస చేసే వారికి ఇక్కడ పలు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఉపన్యాసాలు, వైల్డ్లైఫ్ డిటెక్షన్ పోటీలు, థీమ్డ్ చాలెంజెస్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలతో కలసి కుటుంబాలు, పదిహేను మంది లోపు బృందాలు ఇందులో రాత్రి బస చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఇందులో వారు ఎంపిక చేసుకునే ప్యాకేజీలను బట్టి ఒక్కొక్కరు 95–200 డాలర్లు (రూ.8,171–రూ.17,203) వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బస చేసేవారికి అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మరునాటి ఉదయం మ్యూజియం సందర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం.యూఎస్ఎస్ హార్నెట్ మ్యూజియంఈ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యాలమీడాలో ఉంది. ఇది ఏటా ఒకరోజు ‘హిస్టరీ మిస్టరీ ఓవర్నైట్’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కుటుంబాలు, బృందాలు పాల్గొనవచ్చు. పదహారేళ్ల వయసు పైబడిన వారికోసం ఇందులో అర్ధరాత్రివేళ రెండో ప్రపంచయుద్ధం నాటి విమానవాహక నౌక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మ్యూజియం ప్రతినిధులు సందర్శకులకు దీని విశేషాలను వివరిస్తారు. రాత్రివేళ ఇందులో నిద్రించే అవకాశం కూడా కల్పిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అతీంద్రియ శక్తుల అన్వేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వినోదాత్మక వైజ్ఞానిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు పదిమంది వరకు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ.86 వేలు), పదిమందికి పైబడి ఇరవైమంది వరకు ఉంటే రెండువేల డాలర్లు (సుమారు రూ.1.72 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.ఓరెగాన్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని పోర్ట్లండ్ నగరంలో ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక అభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరించే రకరకాల వస్తువులను ఇందులో భద్రపరచారు. విద్యార్థులు బృందాలుగా వారి ఉపాధ్యాయులతో కలసి ఈ మ్యూజియం సందర్శించడంతో పాటు రాత్రివేళ ఇక్కడే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కో విడతలో యాభైమందికి లోపుగా వచ్చే బృందాలను మాత్రమే అనుమతిస్తారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఇందులోకి అనుమతి ఉంటుంది. మ్యూజియం సందర్శనకు వచ్చే బృందాలు తమకు అనువైన తేదీలను చెప్పి, ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. బృందంలో ముప్పయి మంది వరకు ఉంటే 3300 డాలర్లు (రూ.2.83 లక్షలు), ముప్పయి మందికి మించి ఉంటే, అదనంగా ఉండేవారు ఒక్కొక్కరికి 90 డాలర్ల (రూ.7,737) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బృందంలోని సభ్యుల సంఖ్య యాభైమందికి మించరాదనే పరిమితి ఉంది. ఇక్కడ బస చేసేవారికి అల్పాహారం, భోజనం ఉచితం. ఆరుబయట నిద్రించేవారికి టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు కూడా ఉచితంగానే అందిస్తారు.మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఉంది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకునే స్కౌట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అనుమతిస్తుంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన రకరకాల ఆవిష్కరణలను పొందుపరచిన ఈ మ్యూజియంలో బస చేయడానికి ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో అనుమతి ఉంటుంది. బస కోసం బృందాలుగా వచ్చేవారు ముందుగానే సంప్రదించి, బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముప్పయి మంది వరకు ఉండే బృందాలు 1300 డాలర్లు (రూ.1.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. బృందంలో ముప్పయిమందికి అదనంగా ఉంటే పిల్లలు ఒక్కొక్కరికి 48 డాలర్లు (రూ.4,126), పెద్దలు ఒక్కొక్కరికి 36 డాలర్లు (రూ.3,094) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ప్లిమత్ ప్యాటక్సెట్ మ్యూజియంఇది అమెరికాలోని బోస్టన్ నగరానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్లోని పదిహేడో శతాబ్దినాటి జనజీవనానికి అద్దంపట్టే వస్తువులను భద్రపరచే ఈ మ్యూజయంలో అప్పటి కాలంలో మాదిరిగానే గడపడానికి వీలుగా వసతులు ఉన్నాయి. ఇందులో రాత్రి బస చేయడానికి స్కౌట్స్కు, పాఠశాలల విద్యార్థి బృందాలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియంలో హిస్టారిక్ ప్యాటక్సెట్ హోమ్సైట్, ప్లిమత్ కాలనీ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఇరవైమందికి పైబడిన బృందాలు ఇక్కడ బస చేయవచ్చు. ఇందులోని ఒకే విభాగంలో గడపాలనుకునే బృందాల్లో కనీసం ఇరవైమంది ఉండాలి. నలభై మందికి పైగా ఉండే బృందాలకు రెండు విభాగాల్లోనూ గడిపేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో బసకు ఒక్కొక్కరు 81 డాలర్లు (రూ.6,963) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బస చేసేవారికి అల్పాహారం, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితం.నేచురల్ హిస్టరీ మ్యూజియంరాత్రి బసకు వీలు కల్పించే మ్యూజియంలు ఎక్కువసంఖ్యలో అమెరికాలో ఉంటే, ఇది యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో ఉంది. డైనోసార్ల శిలాజాలు సహా ప్రకృతి పరిణామాలకు, చరిత్రకు సంబంధించిన పలు వస్తువులను భద్రపరచిన ఈ మ్యూజియం విద్యార్థులకు రాత్రి బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియం పిల్లల కోసం ప్రత్యేకంగా ‘డైనోస్నోర్స్’ అనే ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఏడేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు వయసుగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలసి ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. రాత్రి బస చేసే విద్యార్థులకు ఈ మ్యూజియంలో పలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో బస చేయడానికి పిల్లలు ఒక్కొక్కరికి 114 డాలర్లు (రూ.9,800), పెద్దలు ఒక్కొక్కరికి 197 డాలర్లు (రూ.16,935) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ ఏడాది జూన్ 13, జూలై 4, జూలై 18, ఆగస్టు 1, ఆగస్టు 22, సెప్టెంబర్ 30 తేదీల్లో ఈ అవకాశం కల్పిస్తోంది. -
ఈ వారం కథ: టైగర్
మంచం మీద అసహనంగా కదులుతున్నాడు నిమ్మయ్. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావటం లేదు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యాపారి మనసులో మెదులుతున్నాడు. ఓ పెద్ద రాజకీయ నేతను ఎదిరించి ధైర్యంగా అతను మాట్లాడటం నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంకెవరయినా ఈ విషయం చెబితే నమ్మేవాడు కాదేమో, కాని తన కళ్ల ముందు జరిగిన సంఘటనను ఎలా కాదనగలడు? ఆ నిమిషంలో తన ఆఫీసు గుర్తొచ్చింది. తను రోజూ గాడిద చాకిరీ చేసినా స్పెషల్ సెక్రటరీ తనను అవమానకరంగా ఏదో ఒక మాట అంటుంటాడు. ఆ రోజు కూడా తన మహిళా పీఏ ఎదుట తనను అతను తిడుతుంటే, ఆమె చిరునవ్వులు చిందిçస్తుండటం చూసి తలకొట్టేసినట్టయ్యింది. ‘అసలు ఆ అధికారిగాడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? వెధవ హైడ్రా మొహం వాడూనూ– ఉదయం 11 గంటలకు తాపీగా ఆఫీసుకొచ్చి కాఫీలు, టీలు, సిగరెట్లతో మధ్యాహ్నం 1 వరకూ కాలక్షేపం చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి తగలడి మళ్లీ 3 గంటలకు ఆఫీసు మొహం చూస్తాడు. సాయంత్రం 5 గంటలకు స్టెనోని పిలిచి డిక్టేషన్ మొదలుపెడతాడు. సరిగ్గా ఆ సమయానికే నిమ్మయ్ని పిలిచి ఏదో ఒక సాకుతో తిట్టటం మొదలుపెడతాడు’ ఆలోచించసాగాడు నిమ్మయ్. ఆ అధికారి ఆఫీసులో మరెవరినీ ఇలా తిట్టటం లేదన్న విషయం నిమ్మయ్ దృష్టికి వచ్చింది. ‘నువ్వెలా పరీక్ష రాసి ఈ ఉద్యోగానికి ఎంపికయ్యావో నేను కూడా పోటీ పరీక్షలు రాసి ఈ ఉద్యోగానికి వచ్చాను. నన్ను తిట్టటానికి నీకేం అధికారం ఉందని నిలదీయాలని అనిపించేది. కాని, భార్యా పిల్లలు, ఊళ్లో మంచం పట్టిన నాన్న కళ్ల ముందు మెదిలేవారు. దాంతో ఆ తిట్లన్నింటినీ మౌనంగా భరించడం అలవాటయ్యింది. కాని ఎంత చిత్రం! ఓ మామూలు కూరగాయల వ్యాపారి తనలా కాదు. నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థి కృపాసాగర్ పట్నాయక్పైన తిరగబడ్డాడు. ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయాడు తప్ప వ్యాపారిని ఏమనలేదు. బహుశా ఈ కూరగాయలతని దగ్గర ఏవో శక్తులు ఉండొచ్చు. అదేమిటో తెలుసుకుంటే తనకు కూడా ఉపయోగపడతాయన్న ఆలోచన వచ్చింది. ‘ఇప్పుడు బాగా పొద్దు పోయింది.రేప్పొద్దున వెళ్లి ఆ రహస్యం తెలుసుకోవాలి’ అనుకున్నాడు. దాంతో ప్రశాంతంగా నిద్రపట్టింది.మరుసటి రోజు దినచర్య పూర్తి చేసి, కాయగూరల బ్యాగు డిక్కీలో పెట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు నిమ్మయ్. కాలనీ మార్కెట్లో అతను కూరగాయలు అమ్ముతున్నాడు. తలచుట్టూ తువ్వాలు చుట్టుకుని ఉన్నాడు. ఎదురుగా తట్టల్లో రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఎవరి కోసమో బంగాళదుంపలు త్రాసులో తూస్తున్నాడు. పక్కకు చూడనయినా చూడకుండా, ‘అలా బెండకాయల చివర్లని విరవకండి. అలా చేస్తూపోతే సరుకు అమ్ముడుపోవటం కష్టం’ గట్టిగా అరిచి చెప్పాడు. బహుశా ఇతనికి ఒళ్లంతా కళ్లు ఉన్నాయేమో అని మనసులో అనుకుని బెండకాయల మీద నుంచి చేతులు వెనక్కి తీశాడు నిమ్మయ్. గబగబా ప్లాస్టిక్ బుట్టలో కొన్ని బెండకాయలు వేసి అతని చేతికిచ్చాడు.‘ఎంత కావాలి?’‘పావు కేజీ’ నిమ్మయ్ చెప్పాడు.అతను వాటిని తూచి బుట్ట అందించాడు. పర్సులోంచి డబ్బులు తీసి అతని చేతికందిస్తూ కాస్తంత దగ్గరగా జరిగాడు నిమ్మయ్. ‘మీ దగ్గర ఏదో మంత్రం ఉంది’ అన్నాడు నర్మగర్భంగా. ‘అలాంటిదేమీ లేదు’ తేలిగ్గా నవ్వేస్తూ చెప్పాడు ఆ వృద్ధుడు. ‘అయితే నీ ఒంటి మీద ఏదైనా ఉంగరమో, తాయెత్తో, లేకపోతే మంత్రించిన నెక్లెస్సో ఏదో ఒకటి ఉండి తీరాలి’ అన్నాడు.‘సార్! అలాంటివేవీ లేవు. ఏదో కూరగాయలు అమ్ముకునేవాడిని.’‘ఇవేం లేకపోతే కృపాసాగర్ని ఎలా ఎదిరించగలవు? ఆయన మామూలు వాడా? వందలాది అనుచరులున్న పెద్ద రాజకీయ పార్టీ నేత. అలాంటి వాడిని ఎదిరించేవంటే, నీ దగ్గర ప్రత్యేకమైనది ఏదో ఉండి ఉండాలి. లేకపోతే ఈ పాటికి నిన్ను అతను శవంగా మార్చి ఉండేవాడు’ అన్నాడు.అంతలోనే ఆఫీసు వాతావరణం గుర్తొచ్చి, ‘నేను పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. నువ్వే నన్ను కాపాడాలి’ అన్నాడు దీనంగా.దాంతో ఆ కూరగాయల వ్యాపారి రామేశ్వర్ సింగ్ చలించిపోయాడు. ‘నిన్ను చూస్తే 30, 35 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావు. నీకు నాలాంటి వృద్ధుడు ఏం సాయం చేయగలడు. నువ్వేదో కష్టాల్లో ఉన్నావన్న విషయం మాత్రం అర్థమైంది. అదేంటో చెప్పు?’ అనడిగాడు.నిమ్మయ్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆఫీసులో బాస్ వేధింపుల గురించి వివరించాడు. అంతా విన్న తర్వాత, ‘సాయంత్రం మా ఇంటికి రా! ఆ ఫ్లాట్ వెనకాల మామిడి చెట్టు పక్కనున్న ఇంట్లో ఉంటా. ఈ లోపుగా నేను నీకు ఏదైనా పరిష్కారం ఆలోచించి ఉంచుతా’ హామీ ఇచ్చాడు రామేశ్వర్. నిమ్మయ్కి ఏదో బరువు దించుకుంటున్నట్టుగా అనిపించింది. కచ్చితంగా రామేశ్వర్ ఏదో మంత్రదండం ఇస్తాడు. దానితో స్పెషల్ సెక్రటరీకి తను గుణపాఠం చెబుతాడు. ‘నీ పని నువ్వు చేసుకో’ అని ఆయన మొహం మీదనే తను అంటే ఆయన మొహం ఎలా మాడిపోతుందో ఊహిస్తే గమ్మత్తుగా అనిపించింది.నిమ్మయ్ రౌత్ మనసారా నవ్వాడు చాలారోజుల తర్వాత. బ్యాగును ఊపుకుంటూ స్కూటర్ దగ్గరకు నడిచాడు. ఆ తర్వాత ఆఫీసుకు వెళుతుంటే రోడ్డుకిరువైపులా ఉన్న ప్రపంచం అంతా కొత్తగా కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు రాగానే ఎర్రలైటు వెలిగింది. దానితో తలమీద ఉన్న హెల్మెట్ను తీసి ఆకాశం వైపు తలెత్తి చూశాడు. పక్షులు రివ్వున ఎగురుతూ కనిపించాయి. ‘రేపటి నుంచి నేను కూడా మీలాగే స్వేచ్ఛగా విహరిస్తాను. రెక్కలు లేకపోయినా’ అని మనసులో అనుకున్నాడు.సెక్రటేరియట్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. సిగ్నల్ లైటు ఎరుపు నుంచి ఆకుపచ్చకు మారి ట్రాఫిక్ కదులుతూండగా, స్పెషల్ సెక్రటరీ కారు పక్కనుంచి సాగిపోయింది. అందులో వెనక సీట్లో కూర్చున్న జీనా సాహెబ్ను చూడగానే అతనిలో ఉత్సాహం నీరుగారిపోయింది.సాయంత్రం 4 గంటలకు జీనా సాహెబ్ నుంచి పిలుపు వచ్చింది. ‘ఎలక్షన్ రోజులు దగ్గర పడుతున్నాయి. మన ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్లు ఎందరికి అందాయో వాటి వివరాలు నాకు కావాలి’ అన్నాడు. ఓ నిమిషం ఆగి మళ్లీ అన్నాడు. ‘పదిహేను రోజుల క్రితం ఈ పని పూర్తి చేయమని నీకు చెప్పాను. ఇంత వరకూ ఎందుకు పూర్తి చేయలేదు?’ నిలదీశాడు. నిమ్మయ్ మౌనంగా నిలబడ్డాడు.‘నీ మొహం చూపించటానికి ఇక్కడకు వచ్చావా?’ గట్టిగా అరిచాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్ నోరు మెదపలేదు. ‘ఎక్కడ చదువుకుని వచ్చి తగలబడ్డావ్?’నిమ్మయ్ జవాబు చెప్పలేదు. ‘నీలాంటి పనికిమాలిన వెధవలంతా ప్రభుత్వం పరువు తీస్తున్నారు. మా ఖర్మ’నిమ్మయ్లో దుఃఖం తన్నుకొచ్చింది.‘గెటవుట్’ సెక్రటరీ ఉరుము ఉరిమినట్టుగా అన్నాడు. ‘రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ వివరాలు నా ముందు ఉండాలి. అర్థం అయ్యిందా ఈడియట్..’నిమ్మయ్ కాళ్లు వణికాయి. స్పెషల్ సెక్రటరీ చాంబర్ నుంచి నిస్సత్తువగా బయటకు వచ్చాడు. తలుపు దగ్గర పీటమీద కూర్చుని కనిపించాడు ప్యూన్. అతనికి కన్నీళ్లు కనిపించకుండా వాటిని దాచుకుంటూ మెల్లగా వాష్రూంలోకి అడుగుపెట్టాడు. అద్దంలో తన ముఖం ఓడిపోయిన వ్యక్తిలా వాడిపోయి కనిపించింది. గట్టిగా రెండుసార్లు శ్వాస విడిచి వదిలాడు. సెక్రటరీ మాటలు గుర్తొచ్చాయి. నిజానికి ఆ పని అప్పగించింది తనకు కాదు. ఆ పని చేయవలసింది బలరాంబాబు. అది తెలిసి చెప్పలేని తన బలహీనతను తిట్టుకున్నాడు. నిమ్మయ్ తన సీటు దగ్గరకు వచ్చాడు. ఈవెంట్ మేనేజర్ ఎవరో తన డిపార్టుమెంట్కు వచ్చాడు.అందరికీ వడ, సమోసా, టీ సిద్ధం చేసి ఉంచాడు.తనను ఎవరో పిలిచారు. ‘వడ తీసుకోండి’ అన్నారు. ‘నాకు తినాలని లేదు’ నిమ్మయ్ బలహీనంగా చెప్పాడు. ‘అవునవును. ఇప్పుడే జీనా చాంబర్కి వెళ్లొచ్చాడు. ఆయన కడుపు నిండా పెట్టుంటాడు. ఇక మిగతావి ఏం తినగలడు’ అని ఎవరో వేళాకోళమాడితే మిగతావాళ్లంతా ఫక్కుమని నవ్వారు. ఇక అక్కడ ఉండలేక బయటకొచ్చేశాడు. ‘నీ కోసం నేను ప్రత్యేకంగా ఒకటి సిద్ధం చేశాను. నీకు కావలసినన్ని రోజులు దాన్ని ఉంచుకోవచ్చు’ అన్నాడు రామేశ్వర్ తన ఇంటికి వచ్చిన నిమ్మయ్ని చూడగానే. ‘కానీ నీ పనయిన తర్వాత మాత్రం నువ్వు దాన్ని తిరిగి ఇవ్వాలి’‘అలాగే తప్పకుండా’ అన్నాడు నిమ్మయ్.‘ఇది మా నాన్న ఆస్తి. తను నమ్ముకున్న ఆస్తి’‘నాన్నా! ఆయన ఎక్కడున్నారు?’ గబుక్కున అడిగాడు నిమ్మయ్. అంతలోనే తను ఎంత పిచ్చి ప్రశ్న వేశాడో అర్థమైంది. ఓ 70, 75 ఏళ్ల వ్యక్తి తండ్రి జీవించి ఉండే అవకాశం ఉంటుందా?’అంతలోనే అతని భార్య టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. అప్పుడు నిమ్మయ్ గది అంతా పరికించి చూశాడు. రెండు గదుల ఇల్లు. ఒక ఇంట్లో ఉన్న ఔట్ హౌస్ అది. ‘ఇంతకీ ఆ వస్తువు ఎక్కడ?’ ఎప్పుడెప్పుడు దాన్ని తీసికెళదామా అన్న ఆత్రంగా ఉంది. ‘ఒక్క నిముషం. ఆ మనిషికి కబురుపెట్టాను, ఈపాటికి వస్తూండాలి’ అన్నాడు రామేశ్వర్. ‘మీరు ఎంత ఇవ్వమన్నా అంత ఇస్తాను. నా జీవితకాలంలో మీరు చెల్లించమన్న మొత్తం చెల్లించేస్తా’. ‘అదేం అవసరం లేదు. మీ పని అయ్యాక నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. టైగర్ మంత్రంతో అది తయారయ్యింది. ఆ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు’ హెచ్చరించాడు రామేశ్వర్. ‘అయితే ఒక్క విషయం. మీరు దాన్ని దుర్వినియోగం చేస్తే అది ప్రతికూలతలకు దారి తీస్తుంది’‘టైగరా?’ ఆశ్చర్యానికి లోనయ్యాడు నిమ్మయ్.‘అవును. టైగరే!’ అంతలో ఎవరో బయట నుంచి పిలిచారు. రామేశ్వర్ బయటకు వెళ్లి ఓ పాలిథీన్ బ్యాగ్తో లోపలకు వచ్చాడు. ‘ఈ బ్యాగును ఇంటికి తీసికెళ్లు. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆఫీసుకు వెళ్లేటప్పుడు వేసుకో. మార్పు నీకే అర్థం అవుతుంది’మళ్లీ చెబుతున్నాను. ఇందులో ఓ మనిషి గాని, మంత్రంగాని, తంత్రంగాని ఏవీ లేవు. ఇదంతా నడిపేది ఓ టైగర్ మాత్రమే’ అని ఇంకోసారి చెప్పాడు. ఇంటికి వెళుతూ టైగర్.. టైగర్.. టైగర్ అని మనసులో అనుకోసాగాడు.మరుసటి రోజు ఆఫీసుకు వెళుతుండగా, దారిలో ఓ గుంపు కనపడింది. ట్రాఫిక్ పోలీసు ఎవరో సైక్లిస్టు చొక్కా కాలర్ పట్టుకుని బూతులు తిడుతున్నాడు. కొట్టటానికి సిద్ధం అవుతున్నాడు.‘దయచేసి నన్ను వదిలేయండి. రెడ్ సిగ్నల్ చూసుకోలేదు’ ఆ సైకిలు కుర్రాడు బతిమాలుతున్నాడు.‘కళ్లు పోయాయా?’ కానిస్టేబుల్ అరిచాడు.అది చూస్తూ ఊరుకోలేకపోయాడు నిమ్మయ్. ‘ఎందుకు అంత గట్టిగా అరుస్తారు. చూసుకోలేదని చెబుతున్నాడు కదా, వదిలెయ్యండి. కావాలంటే అతనికి జరిమానా వేయండి’ స్కూటర్ మీద కూర్చునే గద్దించినట్టుగా అన్నాడు.పక్కన ఉన్న నలుగురైదుగురు నిమ్మయ్కి మద్దతిచ్చారు. దాంతో కానిస్టేబుల్ ఆ కుర్రాడిని వదిలేశాడు.హఠాత్తుగా నిమ్మయ్కి ఓ విషయం అర్థమైంది. తను కోపాన్ని ప్రదర్శించగలిగాడు. తనలో మార్పు వచ్చింది. రామేశ్వర్ తనకిచ్చిన జాకెట్ను చూసుకున్నాడు. ఖాదీ, గోధుమరంగు, కింద కొంచెం ఎర్రగా ఉంది. అది రక్తమా? లేకపోతే పెయింటా? అనేది నిమ్మయ్కి అర్థం కాలేదు.అతను ఆఫీసుకు వెళ్లేసరికి 10.30 అయ్యింది. తన విభాగంలో ఉన్న సీనియర్ క్లర్క్ ప్రతిమా మొహంతి ఎవరినో గట్టిగా తిడుతోంది. ఆ వ్యక్తి ఏదో చెప్పాలని ప్రయత్నించినా ఆమె వినటం లేదు. ఆమె మొహం తను రోజు చూసే జీనా సాహెబ్లాగా ఉంది. ‘మేడమ్’ గట్టిగా పిలిచాడు నిమ్మయ్. కుర్చీని వెనక్కి లాక్కుని కూర్చుంటూ ‘మనకు జీతం ఇచ్చేది సామాన్యులకు సేవలందించటానికే తప్ప వాళ్లను తిట్టటానికి కాదు’ అన్నాడు.ఆ మాటలకు ప్రతిమా మొహంతి మొహం మాడిపోయింది. తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని కూర్చోమని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి నిమ్మయ్ వంక కృతజ్ఞతగా చూశాడు. మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు సెక్షన్ ఆఫీసరు పలకరించాడు.‘నిమ్మయ్.. కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వు వేసుకున్న జాకెట్ నీ ఒంటికి అతికినట్టు సరిపోయింది. ఎక్కడ తీసుకున్నావ్?’‘టైగర్’ అని చెప్పబోయి గబుక్కున ఊరుకున్నాడు. ‘సర్! వ్యక్తిగత విషయాలు ఆఫీసులో అవసరమా?’ అని గట్టిగా అన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నిమ్మయ్ ఇలా మాట్లాడటం అతను చూడలేదు.మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో నిమ్మయ్కి చీఫ్ సెక్రటరీ నుంచి పిలుపొచ్చింది. నిమ్మయ్ జాకెట్ను నెమ్మదిగా స్పృశించాడు. ఒక చేత్తో పాడ్, పెన్ను, రెండో చేత్తో జాకెట్ను పట్టుకుని తలుపు నెట్టుకుంటూ లోపలకు అడుగుపెట్టాడు.నిమ్మయ్ని చూడగానే స్పెషల్ సెక్రటరీ గట్టిగా కేకలు ప్రారంభించాడు. ‘పొద్దున 11 గంటలకల్లా లబ్ధిదారుల జాబితా ఇవ్వమని అడిగాను కదా? ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడ?’‘మీరు ఆ పనిని అప్పగించింది నాకు కాదు’ నిమ్మయ్ కూల్గా అన్నాడు. బలరాం నాయక్.. అతన్ని పిలిచి మాట్లాడితే మీకు సరైన సమాధానం లభిస్తుంది’‘నాకే ఎదురు సమాధానం చెబుతావా? ఈడియట్’నిమ్మయ్ అంతరంగంలో పులి నిద్ర లేచింది. ‘నాకు అదేం తెలియదు. ముందు ఆ ఫైల్ పట్టుకొచ్చి చావు’ గద్దింపుగా అన్నాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్ ఇక నిగ్రహించుకోలేకపోయాడు. స్పెషల్ సెక్రటరీ ఎదురుగా ఉన్న కుర్చీల్లో ఒకదాన్ని వెనక్కి లాక్కుని దర్జాగా కూర్చున్నాడు. ఆ తర్వాత స్వరాన్ని పెంచి స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ ‘మీరు కావాలనే నన్ను అవమానిస్తున్నారు. మీకు అలా మాట్లాడే హక్కులేదు’ అన్నాడు సూటిగా. దాంతో కోపంతో ఊగిపోయాడు స్పెషల్ సెక్రటరీ. ‘ఒక సాధారణ క్లర్క్ నన్ను సవాల్ చేస్తాడా? వీడికి బుద్ధి చెప్పాలి’ అనుకున్నాడు. ‘ఇంటికి పోయి నీ పెళ్లాం ముందు ఈ ఫోజులు కొట్టు.నా దగ్గర కాదు’ఆ మాటలకు నిమ్మయ్ లొంగలేదు సరికదా, ‘మీరు మాట్లాడేది చాలా దురుసుగా ఉంది’ అని ఓ నిముషం ఆగి, ‘నా భార్య దగ్గర ప్రదర్శించటానికి కొత్తగా నా దగ్గర ఏదీ లేదు. మీ ఇంట్లోలా నా భార్య నన్ను వదిలి వెళ్లలేదు. భగవంతుడి దయవల్ల మేం ఇద్దరం సుఖంగా జీవిస్తున్నాం’ అన్నాడు. ‘మీ విడాకుల కేసు విచారణ సందర్భంగా మీ అబ్బాయిని మీతో కలిసి జీవించాలని అడిగారు. దానికి వాడు మీ కొడుకేనని నమ్మకం ఏమిటని మీ ఆవిడ మిమ్మల్ని నిలదీశారు. అదృష్టవశాత్తు నా జీవితంలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి లేదు’ అని కూడా అన్నాడు.దీనితో జీనా సాహెబ్ హతాశుడయ్యాడు. అతనికి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది. కోపం, బాధ ఒకేసారి అతనిపై దాడిచేశాయి. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. అదీ ఆపకుండా. ఒక అంబులెన్స్ ప్రాంగణలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ ఏర్పడింది.దాంతో గది బయట నిలబడిన ప్యూన్ ఒక్క అంగలో లోపలకొచ్చాడు. నిమ్మయ్ని బయటకు పంపమని సైగ చేసి చెప్పాడు జీనా సాహెబ్. ప్యూన్ నిమ్మయ్ చేతిని పట్టుకుని వెళ్లమని మెల్లగా బతిమాలాడు. ఆ చేతుల్ని విదుల్చుకుని స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ అన్నాడు నిమ్మయ్. ‘నీలాంటి ఆఫీసర్లు ఎందుకూ కొరగారు. అందరూ తాడిచెట్లలాంటి వాళ్లు. ఇతరులకు ఫలాలు ఇవ్వరు లేదా కోరుకున్నట్టుగా చెట్టు నీడా దొరకదు’ అని, కాసేపు ఆగి, ‘ఇతరులను గౌరవించటం నేర్చుకో. అప్పుడు కూడా నీకు గౌరవం లభిస్తుంది. మన దేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. దాని ద్వారా అందే హక్కులకు సుప్రీం కోర్టు నుంచి రక్షణ లభిస్తుంది. ఆ సంగతి మరిచిపోకు’ పులిలా గర్జిస్తూ జీనా సాహెబ్ చాంబర్ నుంచి బయటపడ్డాడు నిమ్మయ్. ఎన్నో సంవత్సరాల నుంచి దిగమింగుకుంటున్న కోపం, అసహనం ఆ నిమిషంలో ఆవిరైపోయి, శరీరం బాగా తేలికగా అనిపించింది. మళ్లీ తన సీటు దగ్గరకు వెళ్లి యథావిధిగా పనిలో లీనమయ్యాడు.ఆ రోజు సాయంత్రం ఆఫీసు ముగిసే సమయానికి ఓ వార్త దావానలంలా సెక్రటేరియట్ అంతా వ్యాపించింది.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటులో పనిచేసే క్లర్క్ నిమ్మయ్ రౌత్ స్పెషల్ సెక్రటరీకి మాటకి మాట సమాధానం చెబితే ఆయన వారం రోజులు సెలవు మీద వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని అందరూ విచిత్రంగా చెప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఆఫీసు మొత్తానికి హీరో అయిపోయాడు. ప్యూన్ నుంచి ఆఫీసర్ల వరకూ అందరూ అతన్ని గౌరవించటం మొదలుపెట్టారు. ఏదయినా పని మీద వేరే డిపార్టుమెంటులోకి అడుగుపెడితే వాళ్లంతా లేచి నిలబడి స్వాగతం చెప్పటం మొదలుపెట్టారు.ఇదంతా రామేశ్వర్ అందించిన టైగర్ జాకెట్ మహిమ అని గుర్తించాడు నిమ్మయ్. వారం రోజుల తర్వాత సెలవు నుంచి తిరిగొచ్చిన స్పెషల్ సెక్రటరీ నిమ్మయ్ని పిలిపించాడు. తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు కోరటమే కాదు. బీపీ కారణంగా తను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయేవాడినని, నిమ్మయ్ ఇదంతా మరచిపోవాలని ప్రాధేయపడ్డాడు.బయట, మార్కెట్లో కూడా నిమ్మయ్కి సరికొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఊళ్లోనే పెద్ద గూండాగా, అందరినీ చందాలు ఇవ్వమని పీక్కుతినే వాడుగా పేరున్న యువ సంఘ సెక్రటరీ అతని దగ్గరకు వచ్చి వినయంగా చేతులు జోడించి, ‘ఈ ఏడాది చందాలు వసూళ్లను నిలిపివేయమని డీజీపీ చెప్పారు. దసరా సంబరాలకు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేకపోతే లేదు’ అంటూ వెళ్లిపోయాడు.నిమ్మయ్ జీవితం పూర్తిగా పరివర్తన చెందింది.ఇప్పుడతను పెద్ద నాయకుడయిపోయాడు. ఊళ్లో ఏ చిన్న పని కావాలన్నా నిమ్మయ్ని కలిస్తే చాలు అన్న అభిప్రాయం బలపడిపోయింది. కాలనీ యువకులంతా అతని ప్రభావంలో పడిపోయారు. పూజ కమిటీ అతన్ని నాయకునిగా ఎంచుకోవాలని నిర్ణయించింది. రామేశ్వర్ని కలిసి అప్పటికి మూడు నెలలు గడిచాయి. పని పూర్తి కాగానే జాకెట్ను తిరిగి ఇవ్వమని అతను చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అతనికి దాన్ని ఇచ్చేయాలనే అనిపించింది. వెంటనే కొన్ని స్వీట్లు కొని, జాకెట్ ధరించి రామేశ్వర్ ఇంటికి వెళ్లాడు. అది పౌర్ణమి రాత్రి. చందమామ వెలుగు ముందు వీధి దీపాలు వెలవెలపోతున్నాయి. వాన కురిసి వెలిసింది. భాద్రపద మాసపు గాలులు చల్లగా వీస్తున్నాయి. ‘నేనెక్కడికీ పోవటం లేదు. ఈ జాకెట్ను ఇంకో నెలా రెండు నెలలు ఉంచుకో’ రామేశ్వర్ సలహా ఇచ్చాడు. ‘ఈ జాకెట్ లేకపోయినా ధైర్యంగా ఉండగలనని నువ్వు భావించినప్పుడు దాని తిరిగి ఇవ్వు’‘నేను మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. అడగొచ్చా?’‘దానిదేం ఉంది. అడుగు. నాకు తెలిస్తే సమాధానం చెబుతాను’ ‘నిజంగా ఇది పులి జాకెట్టేనా?’‘అవును. ఎందుకంత సందేహం?’ రామేశ్వర్ నవ్వుతూ అడిగాడు. ఆ తర్వాత ‘మాది బిహార్. మా తండ్రి చనిపోయేనాటికి నాకు రెండేళ్లు’ తన కథ చెప్పటం ప్రారంభించాడు. ‘అప్పట్లో మా తండ్రి లాల్గఢ్ జమీందారు దగ్గర పని చేసేవాడు. ఆ జమీందారు అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రైతులకు అప్పులిచ్చి వాళ్లు సకాలంలో చెల్లించకపోతే వాళ్లను వేధించేవాడు. అలాగే వాళ్ల కూతుళ్లను, కోడళ్లను, భార్యలను ఇలా ఆడవాళ్లందరినీ లైంగికంగా లొంగతీసుకునేవాడు. నిమ్మయ్ చెవులు రిక్కించి వింటున్నాడు. ‘ఒకసారి ఎందుకో ఆ జమీందారుకు మా నాన్నపైన కోపం వచ్చిందట. దానితో పులికి ఆహారంగా వేయమని ఆదేశాలిచ్చాడట. రెండు రోజులపాటు పులికి ఎలాంటి ఆహారం పెట్టలేదు. ఒక పంజరంలో నుంచి మా నాన్నను, ఇంకో పంజరంలో నుంచి మేకను ఒకేసారి పులి ఉన్న ప్రదేశంలోకి వదిలారు. పులి ఇద్దరినీ తింటుందా? ఒక్క మా నాన్ననేనా అనేది ఆసక్తిగా చూశారు.అయితే అక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది.పులి మేకను ఆహారంగా చేసుకుని మా నాన్నను వదిలేసిందట. అప్పటికే చిగురుటాకులా వణికిపోతూ బిక్కచచ్చిపోయిన మా నాన్న దగ్గరకు వచ్చి మేకరక్తంతో తడిసిన తన పంజాను మా నాన్న జాకెట్కు తాకించింది. ఆ జాకెట్ మరేదో కాదు. ఇప్పుడు నువ్వు వేసుకున్నదే! ఆ తర్వాత జమీందారు మనుషులు మా నాన్నను వదిలి పెట్టారు. కాని, ఆయన ఇంటికి తిరిగి రాలేదు. అడవుల్లోకి వెళ్లిపోయి సాధువుగా మారాడని కొందరు, పిచ్చి పట్టిందని కొందరు, చనిపోయాడని మరి కొందరు చెప్పుకున్నారు గాని, ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన ధరించిన జాకెట్ మాత్రం మా ఇంటికి చేరింది. తర్వాత మేం ఆ గ్రామం విడిచి వచ్చేశాం. ఈ జాకెట్ను నాకందిస్తూ మా అమ్మ ఈ కథ అంతా నాకు చెప్పింది.‘అప్పుడు ఏమైంది?’ ఆసక్తిగా అడిగాడు నిమ్మయ్.‘నేను ఆ జాకెట్ను ధరించినప్పుడల్లా నాలోకి కొత్త శక్తి ప్రవేశించేది. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి.నీకు కూడా అనుభవం అవుతోంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు,‘అంతే కాకుండా ఈ జాకెట్కి అతీంద్రయ శక్తులు ఉన్న మాట నిజం. కానీ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా? దాన్ని నిందించావంటే దాని శక్తి హరించుకుపోతుంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా వినియోగించుకో. పనయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వు’ అని ముగించాడు రామేశ్వర్.సరికొత్త జీవనోత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చాడు నిమ్మయ్. ఆ రోజు నుంచి సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం భార్యా, పిల్లలతో గడుపుతున్నాడు. కాలనీలోనూ, ఆఫీసులోనూ అందరికీ ఇష్టుడయ్యాడు. అలా రోజులు గడుస్తున్నాయి.అంతలో మునిసిపల్ ఎన్నికల ప్రకటన విడుదలయ్యింది.ఆ రోజు ఆదివారం. ఉదయం టీ తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు నిమ్మయ్. అంతలోనే ఓ పదిమంది యువకులు కార్లు దిగి గబగబా గేటు తోసుకుని లోపలకు వచ్చారు.వాళ్లు కూర్చోవటానికి కూడా ఆ ఇంట్లో తగినన్ని కుర్చీలు లేవు. ఇంటి ప్రాంగణంలోనే పెద్ద జామచెట్టు ఉంది. దానికి చుట్టూతా చప్టా చేసి ఉంది. వాళ్లను అక్కడే కూర్చోమని చెప్పాడు. ‘నిమ్మయ్ భాయ్. మేం మీ సమయం ఎక్కువ తీసుకోం. రాజు భాయ్ ఓ విషయం చెప్పి రమ్మని మమ్మల్ని పంపారు’ బ్లూ జీన్స్, తెల్ల చొక్కా ధరించి ఉన్న వ్యక్తి మాట్లాడటం ప్రారంభించాడు. ‘వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో నువ్వే మా పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి దిగాలి. ఈ పరగణాలో నీలాంటి సమర్థుడు మరొకడు లేడు. అందుకే నిన్ను ఎంపిక చేశాం. నువ్వు కాదనుకూడదు. ఇదిగో నా కార్డు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి నిన్ను పార్టీ అధ్యక్షుని దగ్గరకు తీసికెళతాను’అతనికి ఎలా సమాధానం చెప్పాలో నిమ్మయ్కి అర్థం కాలేదు. ఆలోచనలో పడ్డాడు. తను ఓ పేద కుటుంబంలో పుట్టాడు. సాధారణమైన క్లర్క్గా జీవిస్తున్నాడు. తన నెలజీతం రూ.40వేలు కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని కోతలు పోను తన చేతికి వచ్చేది కేవలం రూ.26 వేలు మాత్రమే. గ్రామంలో తనకి భూమిలాంటి ఆస్తిపాస్తులేం లేవు. మొత్తం కుటుంబం– ఆఖరికి మంచం పట్టిన తండ్రితో సహా అందరూ తన నెలజీతంపైనే ఆధారపడి ఉన్నారు. తనలాంటి వాడికి రాజకీయాలు అవసరమా? అనిపించింది.‘నాకు ఆలోచించుకోవటానికి కొంత సమయం ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపేశాడు. ఈ రాజకీయాలు తనకు నప్పేవి కాదనిపించింది. అంతలోనే రామేశ్వర్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. జాకెట్ను కనుక దుర్భాషలాడితే శక్తులు మొత్తం నశిస్తాయి. ఇప్పటి వరకూ జరిగింది చాలు. ఈ జాకెట్ను తిరిగిచ్చే సమయం వచ్చేసింది అనుకున్నాడు. ఒంటి పైన టీషర్టు ధరించి స్కూటర్ బయటకు తీశాడు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆలోచనలన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి.రామేశ్వర్ సమావేశంలో కృపాసాగర్ పైన తిరగబడటం, ‘నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావని నిందించటం, తన రోజువారీ జీవితం హీనంగా సాగటం, తనకు రామేశ్వర్ పరిచయం కావటం, చివరకు టైగర్ జాకెట్తో తన జీవితం మొత్తం మారిపోవటం అంతా అద్భుతంగా అనిపించింది.మనసు అంతరాంతరాల్లో రామేశ్వర్ పట్ల అభిమానం, కృతజ్ఞత పెల్లుబికింది. ఓ రకంగా అతను తనకు అకస్మాత్తుగా తారసపడిన గురువుగా అనిపించాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ జాకెట్ తిరిగిచ్చే సమయం వచ్చేసింది.రామేశ్వర్ ఇంటి ముందు జనం గుంపుగా కనిపించారు. నిమ్మయ్ స్కూటర్ ఆపి అక్కడున్న వ్యక్తిని పలకరించే ప్రయత్నం చేశాడు. అతను వినిపించుకోనట్టు అక్కడి నుంచి కదిలిపోయాడు. నిమ్మయ్ స్కూటర్ను పక్కన నిలిపివేసి, హడావుడిగా రామేశ్వర్ ఇంట్లోకి పరుగుపెట్టాడు.వరండాలో రామేశ్వర్ భార్య ఏడుస్తూ కనిపించింది. ఆమె ఎదురుగా నేల మీద నిర్జీవంగా రామేశ్వర్ శరీరం. తెల్లటి దుప్పట్లో చుట్టి ఉంది. నిమ్మయ్ నిర్ఘాంతపోయాడు. మౌనంలోకి జారిపోయాడు. ‘ఇప్పుడు తను ఆ జాకెట్ను ఎవరికి అందించాలి?’ మనసులో గుంజాటన మొదలయ్యింది. ∙ఒడియా మూలం: గౌరహరి దాస్∙అనువాదం: డాక్టర్ పార్థసారథి చిరువోలు -
చిన్న కాగితంతో పెద్ద కుట్ర భగ్నం
ఎలాంటి నిఘా హెచ్చరికలు లేవు, ఎలాంటి అనుమానాస్పద ఉదంతాలు జరగలేదు; పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రయత్నించలేదు. అయినా 2004 ఆగస్టులో భారీ కుట్రను సిటీ టాస్క్ఫోర్స్ భగ్నం చేయగలిగింది. సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం పేల్చివేతతో పాటు నగరాన్ని సందర్శిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టుల హత్యకు ఉగ్రవాదులు పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. ఓ వాహనచోరుడి వద్ద యాదృచ్ఛికంగా లభించిన చిన్న కాగితం ఈ పెద్ద కుట్రను బట్టబయలు చేసింది.నగర టాస్క్ఫోర్స్ విభాగం నిత్యం అసాంఘికశక్తులపై నిఘా ఉంచి, నేరగాళ్లను పట్టుకోవడానికి పని చేస్తుంటుంది. భారీ నేరాల కోసమే కాదు, కొన్ని సందర్భాల్లో చిన్నా చితకా కేసుల కోసమూ ఈ టీమ్స్ పరుగులు పెడుతుంటాయి. 2004 ఆగస్టులో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు– అది నెలలో ఆఖరి వారం కావటంతో ఏదో ఒక ముఠా లేదా నేరగాడిని పట్టుకుని ఉన్నతాధికారులకు చూపించడానికి కసరత్తులు చేస్తున్నారు. అప్పుడే ఓ వేగు ద్వారా అందిన చిన్న సమాచారం అధికారుల్లో కోటి ఆశలు రేపింది. ఓ వాహనచోరుడి సంబంధించిన ఆ సమాచారం ఆధారంగా టీమ్ వర్కౌట్ చేయడం మొదలెట్టింది. నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్లోని హఫీజ్బాబానగర్లో మెకానిక్గా స్థిరపడిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్కు పలు వాహన చోరీలతో ప్రమేయం ఉందన్నది ఆ వేగు అందించిన సమాచారం. దీంతో టాస్క్ఫోర్స్ అతడి కోసం ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకుంది. అప్పటి వరకు తాను చేసిన వాహనచోరీలను అతడు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేయాలని టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ తతంగంలో భాగంగా చోరీ వాహనాలతో పాటు నిందితుడి వద్ద లభించిన వస్తువులను సీజ్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఖదీర్ను తనిఖీ చేసిన అధికారులు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. అన్నీ మామూలుగానే ఉన్నా, ఓ చిన్న స్లిప్లోని వివరాలు మాత్రం అనుమానాస్పదంగా కనిపించాయి. అతడి వద్ద లభించిన స్లిప్లో కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన నంబర్లు ఉండటమే పోలీసుల అనుమానానికి కారణం. దీంతో లోతుగా విచారించగా, అతడి స్నేహితుడైన ఒమర్ ఫారూఖ్ షరీఫ్ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్హౌస్లకు చెందిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ పేర్లు వెలుగులోకి రావడంతో పాటు వారిద్దరూ బండ్లగూడలోని గౌస్నగర్లో ఓ ఇంట్లో డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. తాను చోరీ చేసిన వాహనాల్లో కొన్ని వారికి ఇచ్చానని, ఆ నంబర్లు వారికి సంబంధించినవే అని అంగీకరించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో విషయం ‘పెద్దదని’ అనుమానించిన టాస్క్ఫోర్స్ బృందాలు హుటాహుటిన గౌస్నగర్లోని డెన్పై దాడి చేశాయి. అక్కడ ఫారూఖ్ చిక్కగా, అజీజ్ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్ ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్ధారించుకున్నారు. ఖదీర్, ఫారూఖ్లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. సిటీలో ఘర్షణలు రెచ్చగొట్టాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ పథకం వేసినట్లు బయటపడింది. గణేశ్ నిమజ్జనం రోజు సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం పేల్చివేతకు కుట్ర పన్నినట్లు బయటపడింది. దీనికోసం ‘లష్కరే తోయిబా’ నగరానికి చెందిన తెహరీక్ తెహఫూజ్ షరియా ఓ ఇస్లామీ (టీటీఎస్ఐ) నేత మౌలానా నసీరుద్దీన్ (2020లో చనిపోయాడు), గులాం యజ్దానీలతో (2006లో ఢిల్లీ ఎన్కౌంటర్లో హతుడయ్యాడు) పాటు మరో 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. వినాయక నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్కు చెందిన కొందరు ఇతర మతస్థులుగా వేషం వేసుకుని గణేశ్ దేవాలయంలోకి ప్రవేశించి బాంబు పెట్టాలని పథకం సిద్ధం చేసుకున్నారు. గులాం యజ్దానీ ఆదేశాల మేరకు ఈ పేలుడు హడావుడి సద్దుమణగక ముందే సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టులనూ చంపాలని భావించారు. అందుకు అవసరమైన పేలుడు పదార్ధాలు, వాహనాలు సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుస దాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కొందరు నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ కేసు తొలుత నగర నేర పరిశోధన విభాగంలో నమోదైంది. దీనికి సంబంధించి అప్పట్లో టాస్క్ఫోర్స్ విభాగం అత్యంత వివాదాస్పదమైంది. అమాయకులను కేసుల్లో ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీసిన సీఐడీ పోలీసులు అరెస్టుల్లో ఎలాంటి కుట్ర లేదని తేల్చారు. ఆపై కేసు సీఐడీకే బదిలీ అయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో తుది విచారణలో ఉంది. భవానీనగర్కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్–కానిస్టేబుల్గా పని చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి గిడ్డా అజీజ్ తృటిలో తప్పించుకున్నాడు. అప్పటికే తన వద్ద ఉన్న బోస్నియా పాస్పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్ది నకిలీ పాస్పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్గా ఉన్న అజీజ్పై 2008లో ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్కు బలవంతంగా తిప్పి పంపించారు. 2001 నాటి విధ్వంసాల కుట్ర కేసులో అజీజ్కు 2022లో పదహారేళ్ల శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు. -
ఇంద్రద్యుమ్నుడి కథ
పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. యజ్ఞయాగాలు చేశాడు. తనువు చాలించిన తర్వాత పుణ్య ప్రభావం వల్ల స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు. ఏళ్లు గడిచాక భూలోకంలో అతడి కీర్తి అంతరించింది. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడనే సంగతిని కూడా ప్రజలు మరచిపోయారు. భూలోకంలో అతడి కీర్తి అంతరించిపోవడంతో దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తిరిగి భూలోకానికి తోసేశారు. స్వర్గం నుంచి తిరిగి భూమ్మీద పడ్డ ఇంద్రద్యుమ్నుడు జరిగిన దానికి బాధపడుతూ, అడవులలో సంచరిస్తూ ఒకనాడు మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నేనెవరో మీకు తెలుసు కదా! నా పేరు ఇంద్రద్యుమ్నుడు’ అన్నాడు.మార్కండేయుడు అతడిని తేరిపార చూసి, ‘నాయనా! నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు ఎన్నడూ వినలేదు. అయినా నేను తాపసిని. రాజులతోను, వారి చరిత్రలతోను నాకు పనిలేదు’ అని బదులిచ్చాడు.‘మహర్షీ! మీకంటే ముందుగా పుట్టినవారు, సజీవులుగా ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే, వారెక్కడ ఉంటారో చెప్పండి. కనీసం వారికైనా నేను తెలుసేమో కనుక్కుంటాను’ అభ్యర్థించాడు ఇంద్రద్యుమ్నుడు.‘మంచుకొండ మీద ఒక గుడ్లగూబ ఉంది. అది నా కంటే ముందు పుట్టింది. దాని పేరు ప్రావారకర్ణుడు. దానిని అడిగి చూడు’ అన్నాడు మార్కండేయుడు.ఇంద్రద్యుమ్నుడు తనతో మార్కండేయ మహర్షిని వెంటబెట్టుకుని, మంచుకొండ వద్ద గుడ్లగూబ దగ్గరకు వెళ్లాడు. ‘ఓ ఉలూకమా! నేను ఇంద్రద్యుమ్నుడిని. నీకు నేను తెలుసునా?’ అని అడిగాడు.తెలీదని బదులిచ్చింది గుడ్లగూబ.కాస్త నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు, ‘పోనీ! నీ కన్నా ముందుగా పుట్టి సజీవులుగా ఉన్నవారు ఎవరైనా నీకు తెలుసునా?’ అని అడిగాడు.గుడ్లగూబ కాసేపు ఆలోచించి, ‘ఇక్కడకు దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో నాడీజంఘుడు అనే కొంగ ఉంది. ఆ కొంగ నాకంటే ముందు పుట్టింది’ అని చెప్పింది. ఇంద్రద్యుమ్నుడు ఈసారి మార్కండేయుడిని, గుడ్లగూబను వెంటబెట్టుకుని సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ కొంగను కలుసుకుని, ‘నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.‘నాకు తెలీదు గాని, నా కంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటోంది. దానికి తెలుసేమో’ అంది కొంగ.‘దయచేసి, ఆ తాబేలుని పిలుస్తావా? కనుక్కుంటాను’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలుకు కబురు పంపింది కొంగ.ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకు వచ్చింది. ‘కచ్ఛపరాజమా! నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.తాబేలు కాసేపు ఆలోచించి, ‘ఆ మహారాజు తెలియకపోవడమేంటి? చల్లని మహారాజు. వెయ్యి యజ్ఞాలు చేశాడు. గొప్ప దానాలు చేశాడు. ఆయన పాలన సాగినన్నాళ్లూ రాజ్యంలో నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహారాజు భూసురులకు వేలాది గోవులను దానం చేయడం వల్ల, ఆ గోవులు తొక్కుతూ సంచరించడం వల్లనే ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏమిటనుకున్నావు? ఇది ఇంద్రద్యుమ్న సరోవరం’ అని బదులిచ్చింది.‘హమ్మయ్య! నా గురించి తెలిసిన జీవి ఒకటి ఇంకా ఈ భూమ్మీద జీవించి ఉంది’ అని మనసులో సంతోషించాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలు మాటలకు ఆనందపరశుడయ్యాడు. ‘కచ్ఛపరాజమా! నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజును’ అని చెప్పి, ఆ తాబేలుకు నమస్కరించాడు.ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూమ్మీద మిగిలే ఉండటంతో దేవతలు దివ్యవిమానంలో అక్కడకు చేరుకున్నారు.‘ఇంద్రద్యుమ్నా! నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నువ్వు వెంటనే మాతో వచ్చి, స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ముక్తకంఠంతో పలికారు దేవతలు.ఇంద్రద్యుమ్నుడు వారితో పాటు దివ్యవిమానమెక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు.∙సాంఖ్యాయన -
చెంచా రాయుడు!
రోబో సినిమాలో విలన్స్ వెపన్స్ అన్నింటినీ మ్యాగ్నెట్ మోడ్లో మారి చిట్టీ లాగేసుకున్నట్లు, ఇరాన్ లోని ఓ వ్యక్తి స్పూన్ మ్యాగ్నెట్ మనిషిగా మారాడు. పేరు అబోల్ఫజ్ సాబిర్ ముఖ్తారీ. కాని, అతని పేరు కన్నా అతను చేసిన పనే పవర్ఫుల్! అతను ఏం చేశాడంటే, తన శరీరంపై ఏకంగా 96 చెంచాలను అంటించుకొని గిన్నిస్ రికార్డు సాధించాడు. అవును, తక్కువేం కాదు, అంటే రౌండ్ ఫిగర్కి ఇంకా నాలుగు మాత్రమే మిగిలిందంటే, అతని స్పూన్ ఫిక్షన్ లెవెల్ ఆ రేంజ్లో ఉంది మరి. 2021లో ముఖ్తారీ మొదటిసారి 85 చెంచాలతో రికార్డు చేశాడు. 2023లో ‘ఇదేం సరిపోదు’ అనుకున్నాడేమో 88 చెంచాలతో మళ్లీ తనదైన మార్క్ వేశాడు. ఇప్పుడేమో ‘ఇంకో స్పూన్ స్పెషల్స్ కలపాలి’ అని, నేరుగా 96 చెంచాలతో రికార్డే కాదు, నమ్మకాలకే చాలెంజ్ విసిరాడు. ‘చెంచాలు కూడా మనుషుల్ని ప్రేమించగలవా?’ అన్న ప్రశ్నకి ఔననే సమాధానాన్ని తన శరీరంతో చెప్పాడు!. ఇతని శరీరంపై చెంచాలు అతుక్కునే తీరు చూస్తే, చెంచాలకి మార్గం చూపించే గూగుల్ మ్యాప్లా ముఖ్తారీ కనిపిస్తాడు. ఈ విషయమై ముఖ్తారీ మాట్లాడుతూ, ‘నేను ఏ వస్తువునైనా నా శరీరానికి అతికించుకోగలను. ప్లాస్టిక్, గాజు, రాయి, చెక్క– ఇంకా ఎన్నో వస్తువులతో ప్రయోగాలు చేస్తున్నాను. త్వరలోనే మరో కొత్త రికార్డు చేస్తాను’ అని చెప్పాడు. -
దేవుడు ముడివేసిన బంధం
లోకం తెలియని పసితనం బుడిబుడి అడుగులతో నాన్నను అనుసరించే దృశ్యం, ఎప్పుడూ మురిపెంగానే ఉంటుంది. చూసేందుకే అంత ముచ్చటగా ఉండే ఆ బంధం, స్వయంగా తన చేతినే తాకినప్పుడు.. ఆ తండ్రి పొందే ఆనందం.. అమితం, అమరం, అనిర్వచనీయం! అలాంటి అనుభూతిని కోరే నాన్న ఎప్పుడూ ఉన్నతమైన ఆదర్శాలనే తలకెత్తుకుంటాడు. గొప్ప తండ్రిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటాడు. తనతో పాటు తన పిల్లల్ని కూడా ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తాడు. దైవత్వాన్ని నింపుకుని, వారి తలరాతలను తనే రచిస్తాడు. అందుకే ‘డాడ్ ఈజ్ గాడ్’పితా ధర్మః పితా స్వర్గః పితా హి పరమం తపఃపితరి ప్రీతిమాపన్నే ప్రీయతే సర్వదేవతాః‘తండ్రి దైవ సమానుడు, ధర్మ స్వరూపుడు. తపస్సుకు అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే అది తండ్రికి సేవ చేయడమే. తండ్రిని సంతోషపెడితే సమస్త దేవతలు సంతోషిస్తారు’ ఇది కుటుంబవ్యవస్థ మెచ్చే ధర్మం! అయితే ఎందరో తండ్రులు, తమ పిల్లల నుంచి అవేమీ ఆశించకుండా కేవలం వారి క్షేమం కోసమే అహర్నిశలు తపిస్తుంటారు. జీవితాన్ని, కాలాన్ని అంకితమిస్తూ స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమవుతున్నారు. ఒకసారి బరాక్ ఒబామా, తండ్రి గురించి స్పష్టమైన కొటేషన్ చెప్పారు. ‘మగతనం ఉంటే చాలు, ఎవరైనా బిడ్డను కనగలరు! కాని, అది వారిని తండ్రిని చేయలేదు. బిడ్డను పెంచడానికి ధైర్యంగా అడుగులు వేసేవారే నిజమైన తండ్రి’ అంటారాయన. దానిలో ఎంత అర్థముంది! నాన్న కనబడితే– గౌరవంతో తలుపు చాటున దాక్కునే అలనాటి రోజుల నుంచి నాన్న కనబడితే– గారాబంతో సరదాగా పోట్లాడుకునే ఈనాటి రోజుల వరకూ, ప్రతి జీవితంలోనూ ఆయనే హీరో! కాలం విసిరిన సవాళ్లకు జీవితాన్ని పణంగా పెట్టే ప్రతి నాన్న చేతుల్లోనూ ఓ చిట్టి చేయి దాగుంటుంది. ఆ చేయి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి, తన ఆదర్శవంతమైన కథను సగర్వంగా పరిచయం చేస్తుంది. తన కోసం, తన తండ్రి కన్న కలలన్నింటినీ గొంతెత్తి చాటుతుంది. నిజానికి ఈలోకంలో నాన్న అనే పిలుపు కోసం తపించే నాన్నలు కొందరైతే, నాన్నగా గెలిచిన నాన్నలు ఇంకొందరు. ఏదేమైనా నాన్న అనే పిలుపే ఓ ఎమోషన్. ఆ ఎమోషన్స్ కి త్యాగం తోడైతే? తెలియకుండానే గుండె తడవుతుంది. ఫాదర్స్డే సందర్భంగా అలా గెలిచి, నిలిచిన కొన్ని నిజజీవిత విజయగాథలు మీకోసం. లోకం మెచ్చిన తండ్రులుఈ అద్భుతమైన సృష్టిలో హద్దులు లేని ఆప్యాయతే అసలైన అమ్మతనం. నిస్వార్థమైన ప్రేమకు అదో మారు గుణం. అలాంటి అమ్మతనాన్ని అందించే నాన్న దొరకడం మహా వరం. ప్రేమను పంచడంలో, పిల్లల్ని పెంచడంలో తండ్రి పాత్రకు వీరంతా సజీవ నిదర్శనం!దేవుడు ముడివేసిన బంధంమధ్యప్రదేశ్, ఇండోర్లోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనాథాశ్రమం సాక్షిగా మొదలైన ఈ తండ్రీ కొడుకుల కథ చాలా ప్రత్యేకం. 2014 సెప్టెంబర్ 13 ఉదయాన్నే 27 ఏళ్ల ఆదిత్య తివారీ.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చెయ్యాలనే ఉద్దేశంతో, ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఆ చారిటీకి వెళ్లాడు. అక్కడ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఆరు నెలల అవనీశ్ను తొలిసారి చూసి, ఏమైందని ఆరా తీశాడు. ఆ బాబుకున్న ఆరోగ్య సమస్యల గురించి విని అల్లాడిపోయాడు. డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న అవనీశ్ను ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదని తెలిసి, ఆ బాబుకి తానే తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అధికారులతో చర్చించాడు. అయితే అధికారులు అందుకు అభ్యంతరం చెప్పారు. దత్తత తీసుకునే ఒంటరి పురుషుడికి 30 ఏళ్లు నిండాలనే రూల్స్ని ముందుంచారు. దాంతో ఆ రూల్స్ మార్చాలని న్యాయపోరాటం మొదలుపెట్టాడు ఆదిత్య. అవనీశ్ లాంటి స్పెషల్ చిల్డ్రన్ని దత్తత తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తూనే, అవనీశ్ దత్తత కోసం సుమారు రెండేళ్లు ఫైట్ చేశాడు. అయితే ఒక ఒంటరి పురుషుడు, ఇలాంటి వికలాంగుడైన బిడ్డను చూసుకోవడం కష్టమనే వారు ఎక్కువయ్యారు. ఆ మాటలకు ‘బిడ్డ తండ్రివైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు’ అనే హెచ్చరికలు తోడయ్యాయి. అయినా వెనక్కు తగ్గని ఆదిత్య ఈ ప్రయత్నంలో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చివరికి దత్తత తీసుకోవడంలో సింగిల్ ఫాదర్కి ఉండాల్సిన వయసును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు మార్పించగలిగాడు. అలాగే 2016 జనవరి 1న అవనీశ్కి అధికారికంగా తండ్రి అయ్యి, దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఒంటరి తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటూ బాబుకి మంచి ఆహారం, మంచి వైద్యం ఇప్పించగలిగాడు.అయితే రెండేళ్ల పోరాటక్రమంలో అర్పిత అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారేముందు అవనీశ్ తల్లిగా అర్పిత పాసైంది. వీరి పెళ్లికి పదివేల మంది నిరాశ్రయులు అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం అవనీశ్ ఆరోగ్యవంతుడిగా మారుతూ, పాఠశాలకు వెళ్తూ, చదువులో చురుకుగా ఉంటున్నాడట. ఆదిత్య తివారీ అంకితభావానికి గుర్తింపుగా, 2020లో ఆయనకు ‘వరల్డ్స్ బెస్ట్ మామీ’ అవార్డు లభించింది. తల్లి ప్రేమ ఒక లింగానికే పరిమితం కాదని, తండ్రి కూడా ఆ ప్రేమను చూపగలడని నిరూపించినందుకు అతడికి ఈ గౌరవం దక్కింది.అవనీశ్లాంటి పిల్లలున్న 10 వేల మంది తల్లిదండ్రులకు ఆదిత్య కౌన్సెలింగ్ ఇచ్చాడు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇప్పటివరకు దేశంలో 22 రాష్ట్రాల్లో పర్యటించారు. సెమినార్లు, వర్క్షాపులు అంటూ ఇలా ఎక్కడికి వెళ్ళినా అవనీశ్ను ఆదిత్య వెంటబెట్టుకునే వెళ్తాడు. ఐక్యరాజ్య సమితిలో సైతం, వైకల్యమున్న పిల్లల పెంపకం గురించి ఆదిత్య ప్రసంగించారు. జెనీవాలో జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’లో కూడా ఈ తండ్రీ కొడుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అవనీశ్కి ఇంకా కొన్ని సర్జరీలు జరగాల్సి ఉందని, అవి చేయించడానికి తగిన వయసు కోసం ఎదురు చూస్తున్నామని ఆదిత్య తెలిపారు. ఇది దేశానికే ఆదర్శవంతమైన కథ. అన్నిటినీ చిన్నబుచ్చిన ప్రేమ!ముంబైలోని ఓ చిన్న ఇంట్లో, నాలుగేళ్ల సుశాంత్ దివిగికర్ కార్లు, బ్యాట్లతో ఆడుకోకుండా, తల్లి చీర కొంగులతో, ఆమె మేకప్ సామాగ్రితో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. స్టేజ్ డ్రామాలు, నృత్యాలు ఇష్టమంటూ ఆ దిశగానే అడుగులు వేశాడు. ఇక యవ్వనంలోకి వచ్చేసరికి అమ్మాయిలపైన కాకుండా అబ్బాయిలపై ఆకర్షితుడయ్యాడు. అప్పుడే తను ఒక గే అని, తనలో స్త్రీ లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాడు. రహస్యంగా గే పార్టీలకు అటెండ్ అయ్యేవాడు. 2008లో ఒకరోజు సుశాంత్ కజిన్ కరణ్.. సుశాంత్ని ‘గే’లతో తిరగడం చూసి షాకయ్యాడు. వెంటనే సుశాంత్ తండ్రి ప్రదీప్ దివిగికర్కి చెప్పేశాడు. విషయం తెలిసిన ప్రదీప్.. సుశాంత్ని ఆరా తియ్యగా భయపడుతూనే తండ్రికి నిజం చెప్పాడు. వెంటనే ప్రదీప్ కొడుకుని హత్తుకుని.. ‘నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే.. ఈ ప్రపంచం నిన్ను ఏమైనా అననీ.. నేను మాత్రం నీకు అండగానే ఉంటాను’ అని మాటిచ్చాడు. అప్పుడు సుశాంత్కి 18 ఏళ్లు. వెంటనే ప్రదీప్.. తన కొడుకు గే అనే విషయాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పారు. తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ‘మిస్టర్ గే ఇండియా’ 2014 టైటిల్ను గెలుచుకున్నాడు. ‘మిస్టర్ గే వరల్డ్’ చరిత్రలో అత్యధిక సబ్–టైటిల్స్ గెలుచుకున్న ఏకైక ఇండియన్ తనే. అదే ఏడాది సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఉన్న మహారాష్ట్ర ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్గా వెళ్లి, ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ వచ్చినా.. ‘అదో డర్టీ గేమ్’ అని అభివర్ణించి ఆఫర్ని తిరస్కరించాడు. తర్వాత కాలంలో తండ్రి ప్రోత్సాహంతోనే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. ‘రాణీ కోహినూర్’ అనే పేరుతో ప్రస్తుతం సుశాంత్కి ఇన్స్టాగ్రామ్లో 3.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.‘బిడ్డ బిడ్డే అయినప్పుడు లింగంతో సంబంధం ఏంటీ? ఒకే బిడ్డలో కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని’ అంటుంటారు ప్రదీప్. కలలను వదులుకునేంత బాధ్యతముంబైకి చెందిన లహర్ జోషీ చిన్నప్పటి నుంచి కెరీర్ గురించి ఎన్నో కలలు కన్నాడు. 2015 నాటికి కోరుకున్నట్లే సొంతంగా బ్రాండింగ్ ఏజెన్సీని స్థాపించి, విజయవంతంగా నడపసాగాడు. అయితే ఆ సమయంలోనే అతడి భార్య రుతుమ గర్భవతి అయ్యింది. స్కానింగ్లో కవలలు అని తెలిసినప్పటి నుంచి పట్టలేని ఆనందంతో పాటు రెట్టింపు కానున్న బాధ్యతలు అతణ్ణి కుదురుగా ఉండనివ్వలేదు. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్యభర్తలిద్దరికీ పిల్లలకోసం సమయాన్ని కేటాయించడం కూడా సమస్యగానే మారింది. పిల్లల కోసం ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉండటంతో పాటు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు లహర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య రుతుమతో పోలిస్తే తన నెల సంపాదన తక్కువ ఉండటంతో, విజయవంతంగా సాగుతున్న తన బ్రాండింగ్ ఏజెన్సీని మూసివేసి, పూర్తిస్థాయిలో పిల్లల సంరక్షణకు అంకితం కావాలని ఫిక్స్ అయ్యాడు. అలా, లహర్ జోషీ ఒక ‘స్టే–ఎట్–హోమ్ డాడ్’గా మారారు.ఈ నిర్ణయం సమాజంలో మిశ్రమ స్పందనలను తెచ్చింది. కొందరు ఆయన్ని అభినందిస్తే, మరికొందరు ఆశ్చర్యంగా చూశారు. కానీ లహర్కు తన తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించింది. అది ఆయనకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.పిల్లల్ని ఇంటి వద్దే ఉండి పెంచిన అనుభవం తనను మరింత మంచి వ్యక్తిగా మార్చిందని లహర్ బలంగా నమ్ముతాడు. తొలినాళ్లలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త కష్టంగా అనిపించినా, వారి ఎదుగుదలను దగ్గరగా చూసే అనుభూతి అద్భుతమని ఆయన గర్వంగా చెబుతుంటాడు. లహర్ తన ఈ ప్రయత్నంతో దేశంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాలు చేస్తున్నారు. ఒక తండ్రి పాత్ర కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పిల్లలకు ఓ మార్గదర్శిగా, కోచ్గా ఉండటం కూడా అంటారు ఆయన. ఈరోజు, లహర్ జోషీ తన కవలలను ఎంతో ఆనందంగా పెంచుకుంటూ, సమాజానికి ఓ కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. తండ్రి ప్రేమ, సంరక్షణ పిల్లల ఎదుగుదలకు ఎంత అవసరమో వివరిస్తూ, లహర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మలా పెంచిన నాన్నగుజరాత్, అహ్మదాబాద్కి చెందిన ప్రముఖ గాయని ‘శైలీ షా’ను కదిలిస్తే ఆదర్శవంతమైన తన తండ్రి ‘రాజేష్ షా’ కథను ప్రత్యేకంగా చెబుతుంది. శైలీకి పదేళ్లు కూడా నిండకుండానే ఆమె తల్లి ఆశ మరణించింది. ఆరోజు నుంచి తన అన్న నిసర్గను, తనని కంటికి రెప్పలా పెంచి పోషించారు రాజేష్. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినలేదు. ప్రేమించి పెళ్లాడిన భార్య మరణంతోనే జీవితం శూన్యం అనుకున్న రాజేష్.. కేవలం పిల్లల కోసమే బతికారు. అయితే అతడి భార్య ఆశా తన కూతురు శైలీని సింగర్ చేయాలని ఆశపడింది. అందుకే అహర్నిశలు శ్రమించి కూతుర్ని సింగర్ని చేశారు రాజేష్. శైలీ షా కేవలం గాయని మాత్రమే కాదు. ఆమె ‘మోర్తంత్ర’ అనే బొటిక్ జ్యూలరీ బ్రాండ్తో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్రాండ్ గుజరాత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఇక నిసర్గ, ప్రింటింగ్ కేంద్రాన్ని నడపుతూ తండ్రికి అండగా ఉంటున్నాడు.‘నాన్నే మాకు జీవిత పాఠాలు నేర్పించారు, అమ్మలా పెంచారు. ఆయనే మాకు స్ఫూర్తి’ అని శైలీ గర్వంగా చెబుతుంది.నాన్న అనే పిలుపు కోసం ఏళ్ల పోరాటంయూసఫ్ ఖాన్తో కబీర్, డా.కేదార్ పడ్తేఅది 2007. యూసఫ్ ఖాన్ అనే 26 ఏళ్ల మ్యూజిక్ టీచర్.. పుణే చారిటీల చుట్టూ తిరగడం అప్పుడప్పుడే మొదలుపెట్టాడు. దుబాయ్లో ‘ద మ్యూజిక్ బాక్స్’ అనే మ్యూజిక్ స్కూల్ను నడుపుతున్న యూసఫ్.. వైవాహిక జీవితంపై ఆసక్తి లేకపోవడంతో, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే పిల్లల మీద ఉన్న ఇష్టంతో అనాథను దత్తత తీసుకోవాలని ఆశపడ్డాడు. అందుకే భారత్ వచ్చి చారిటీలకు తన విన్నపాన్ని తెలిపి, దత్తత కోరినప్పుడు.. అందుకు రూల్స్ అంగీకరించలేదు. తాను తండ్రి కావాలనే బలమైన కోరికతో సుమారు పదేళ్ల పాటు దత్తత కోసం దుబాయ్కి, ఇండియాకి తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఫలితం లేకపోవడంతో 2017 నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు. సుమారు పదకొండు సార్లు సరోగసీ విధానం ఫెయిల్ అయ్యింది. అయినా తన కలను చంపుకోవడానికి యూసఫ్ అంగీకరించలేదు. విసుగు చెందలేదు. పదే పదే ఎదురైన వైఫల్యాలు, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి ఏవీ తనని నిరాశపరచలేదు. చివరికి సరోగసీలో 12వ ప్రయత్నం ఫలించి, 2019 డిసెంబర్ 3న పనాజీలో కబీర్ అనే పండంటి మగబిడ్డను పొందాడు. గోవాకు చెందిన డా. కేదార్ పడ్తే పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ప్రస్తుతం కొడుకుతో సహా దుబాయ్లోనే ఉంటున్నాడు యూసఫ్. వీరికి సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులో లేవు. అయితే ఎన్నో కష్టాలకు ఓర్చి, ఏళ్లపోరాటం చేసి పొందిన బిడ్డను యూసఫ్ ఎలా పెంచుతాడనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతులేని అన్వేషణచైనా తూర్పు తీరంలోని షాన్స్ డాంగ్ ప్రావిన్స్కు చెందిన ‘గువో గ్యాంగ్టాంగ్’ అనే తండ్రి కథ యావత్ ప్రపంచానికీ భావోద్వేగాలను నింపింది. ఈ కథ 1997, సెప్టెంబర్ 21న మొదలైంది. ఆ రోజు ఆదివారం. స్కూల్స్ లేక పిల్లలంతా ఇంటి బయటే ఆడుకుంటున్నారు. గువో రెండో కొడుకు రెండున్నరేళ్ల జిన్స్ జెన్స్ ను ఎవరో లాక్కెళ్లారని పెద్ద కొడుకు పరుగున లోపలికి వచ్చి చెప్పాడు. అప్పటికే కిడ్నాపర్ల వీరంగం గురించి చాలాసార్లు విన్న గువో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో కడు నిరుపేదైన గువో.. కష్టపడి ఓ పాత మోటర్ సైకిల్ కొనుక్కుని, దాని వెనుక మిస్ అయిన కొడుకు ఫొటోను బ్యానర్గా కట్టుకుని, తనే స్వయంగా వెతకడం మొదలుపెట్టాడు. అదే బండి మీద చాలా దూరం వెళ్లాడు. సుమారు 24 ఏళ్ల పాటు కిడ్నాప్ అయిన కొడుకును అలా వెతుకుతూనే ఉన్నాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. తన ఆర్థిక స్తోమతను బట్టి పాత మోటర్ సైకిళ్లనే కొంటూ, మార్చుకుంటూ.. తిరగని చోటు లేదన్నంతగా తిరిగాడు. అన్నేళ్ల ప్రయాణంలో కొన్నిసార్లు తినడానికి తిండి దొరికేది కాదు. కొన్ని రాత్రులు వంతెనల కింద, రోడ్ల మీద పడుకోవాల్సి వచ్చేది. అయినా విసుగు చెందలేదు. పిచ్చివాడని కొందరు, దొంగ అయి ఉంటాడని ఇంకొందరు అనుమానించినా, అవమానించినా తగ్గలేదు. అతడి పట్టుదలను చూసిన ఎందరో చైనీయులు అతడ్ని ‘సింబల్ ఆఫ్ ది సెర్చింగ్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్’ అనే పేరుతో కీర్తించడం మొదలుపెట్టారు. అతడి ప్రయత్నం నాయకులను, అధికారులను కూడా కదిలించింది. చివరికి 2021 జూలై 11న, గువోకు చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికి అతడి వయసు 61 ఏళ్లు. ‘న్యూ డీఎన్ఏ టెక్నాలజీతో జిన్ జిన్ ను కనుగొన్నామని, అతడు హేనాన్ ప్రాన్స్లో ఒక దత్తత కుటుంబంతో నివసిస్తున్నాడు’ అని గువోతో అధికారులు చెప్పారు. అతడి 24 ఏళ్ల ఆవేదన ఒక్కసారిగా ఆనందంగా మారింది. 2021 జూలై 13న జిన్స్ జెన్ 26ఏళ్ల యువకుడి రూపంలో గువో కళ్లముందుకు వచ్చినప్పుడు అతడి కన్నీళ్లు చూసి ప్రపంచమే కంటతడి పెట్టింది. వారి కౌగిలిలో ఏళ్లనాటి నిరీక్షణ, ప్రేమ, ఆనందం అన్నీ కళ్లకు కట్టాయి. గువో కథ ‘లస్ట్ అండ్ లవ్’ అనే సినిమాగా మారి, ఎందరో మనసులను కదిలించింది.నిజానికి ఈ కథలన్నీ చూస్తుంటే ‘లియో బుస్కాగ్లియా’ అనే అమెరికా రచయిత మాటలు గుర్తు రాక మానవు. ‘అమరత్వం అనేది మనం వదిలి వెళ్లే ప్రేమలో మాత్రమే ఉంటుంది. అంతటి ప్రేమను పంచే తండ్రులకు ఎప్పటికీ చావు ఉండదు’ అన్నారు ఆయన. అలాంటి తండ్రులందరికీ పాదాభివందనం!హ్యాపీ పాదర్స్ డే! -
దీపకుని గురుసేవ
ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను పూర్వం దీపకుడు అనే బ్రహ్మచారి ఉండేవాడు. అతడు పరమ నైష్ఠికుడు. శాస్త్రాలలో చెప్పిన ‘శిశువుకు తల్లిదండ్రులు, శిష్యుడికి గురువును మించిన దైవం లేరు. వారి సేవను మించిన తీర్థ యజ్ఞాదులు లేవు. జన్మను తరింపజేసుకోవడానికి మాతాపితరుల సేవ, గురుసేవను మించిన మార్గం లేదు’ అనే సూక్తిని చదివి, గురువు కోసం అన్వేషణ ప్రారంభించాడు.ఇంటి నుంచి దీపకుడు కాలినడకన బయలుదేరాడు. దారిలో కనిపించిన వారిని తగిన గురువు కోసం వాకబు చేయసాగాడు. గోదావరి తీరంలో వేదధర్య మహర్షి వేదవేదాంగ పారంగతుడని, గురుకులం నిర్వహిస్తూ ఎందరికో విద్యాబోధన చేస్తున్నాడని చాలామంది చెప్పారు. వేదధర్యుడి ఆశ్రమం ఎక్కడ ఉన్నదో బాటసారులను కనుక్కొని తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిరోజుల ప్రయాణం తర్వాత ఆశ్రమానికి చేరుకున్నాడు. శిష్యులతో వేదం వల్లె వేయిస్తున్న వేదధర్యుడిని చూసి, నేరుగా ఆయన వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేశాడు.దీపకుడి వినయశీలతకు వేదధర్యుడు ముచ్చటపడ్డాడు. అతడిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. దీపకుడు గురుసేవ చేసుకుంటూ, విద్యాభ్యాసం కొనసాగించాడు. అనతికాలంలోనే వేద శాస్త్ర పురాణాలన్నింటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. శిష్యుడి విద్యాతేజస్సుకు వేదధర్యుడు అబ్బురపడ్డాడు. ఒకనాడు ఆయన దీపకుడిని పిలిచి, ‘కుమారా! నేను గత జన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. రెండు భయంకరమైన పాపాలకు మాత్రం ఫలితాన్ని ఇంకా అనుభవించాల్సి ఉంది. చేసిన కర్మమే చెడని పదార్థం కదా! సాక్షాత్తు విశ్వనాథుని ధామమైన పవిత్ర కాశీక్షేత్రంలో నేను ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోదలచాను.పుణ్యక్షేత్రంలో ఏ పనికైనా ఫలితం రెండింతలుగా ఉంటుంది. నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తం కోసం ఆవాహన చేయగానే నాకు భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ ఉంటుంది. వికార రూపం వస్తుంది. కొన్నాళ్లకు అంధత్వం వస్తుంది. అలాంటి పరిస్థితిలో కఠినాత్ముడినై, ఇతరుల సేవ కోసం దీనంగా ఎదురుచూస్తుంటాను. నేను ఆ దుస్థితిలో ఉన్నప్పుడు నాకు సేవ చేయగలవా?’ అని అడిగాడు.‘గురువర్యా! నేను మీ పాపాలను ఆవాహన చేసుకుని, వాటి ఫలితాన్ని అనుభవిస్తాను. దయచేసి నాకు అనుమతి ప్రసాదించండి’ అని వేడుకున్నాడు దీపకుడు.‘దీపకా! నువ్వు నీ వంశానికే కులదీపకుడవు. అయినా, ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను’ చెప్పాడు వేదధర్యుడు.గురువు ఆనతి ప్రకారం దీపకుడు ఆయనను కాశీకి తీసుకువెళ్లాడు.కాశీలోని మణికర్ణికకు ఉత్తరాన ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరుకుని, అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు.గురువు చెప్పినట్లే జరిగింది. కాశీకి చేరుకున్న కొద్దిరోజులకే వేదధర్యుడి కుష్ఠువ్యాధి సోకింది. క్రమక్రమంగా అతడి శరీరం క్షీణించసాగింది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ, వేళ్లు తెగిపోయి, వికృతాకారుడిగా మారాడు. ఇంకొన్నాళ్లకు అంధుడైపోయాడు. గురువు పరిస్థితికి దీపకుడు చాలా దుఃఖించాడు. గురువును కంటికి రెప్పలా చూసుకుంటూ, నిత్యం ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ, పరిచర్యలు చేసేవాడు. భిక్షకు వెళ్లి, దొరికిన భోజనాన్ని గురువుకు పెట్టేవాడు. ప్రతిరోజూ దీపకుడు తెచ్చిన భిక్షను తానొక్కడే తినేస్తూ, ‘ఇంత కొంచెమే తెచ్చావెందుకు?’ అంటూ దుర్భాషలాడేవాడు. గురువు కోపతాపాలను సహిస్తూనే దీపకుడు ఆయనను అంటిపెట్టుకుని ఉంటూ సేవలు చేసేవాడు.దీపకుడి అచంచల గురుభక్తికి కాశీ విశ్వనాథుడు ముగ్ధుడయ్యాడు. రోజూ మాదిరిగానే ఒకనాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడికి ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ గురుభక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘స్వామీ! నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప మరేదీ తెలియదు. మా గురువు అభీష్టమేదో కనుక్కొని చెబుతాను’ అన్నాడు. ఆశ్రమానికి వెళ్లాక గురువుకు ఈ విషయం చెప్పాడు. ‘గురుదేవా! మీకు స్వస్థత కోరుకుంటాను’ అన్నాడు.‘నాయనా! ఎవరి పాపాలకు ఫలితాన్ని వారు అనుభవిస్తేనే పోతాయి’ అని చెప్పాడు వేదధర్యుడు.మరునాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడు పరమేశ్వరుడిని ఏ వరమూ కోరుకోలేదు.పరమేశ్వరుడు దీపకుడి సంగతిని పార్వతీదేవికి, ఆ తర్వాత శ్రీమన్నారాయణుడికి, సమస్త దేవతలకు చెప్పి సంబరపడిపోయాడు.శ్రీమన్నారాయణుడు దీపకుడికి ప్రత్యక్షమై, ‘వత్సా! సాక్షాత్తు పరమేశ్వరుడినే మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యం. ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు.‘స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు, చాలు’ అని పలికాడు దీపకుడు.‘తథాస్తు’ అని అనుగ్రహించాడు శ్రీమహావిష్ణువు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: దృశ్యమాలిక
గలగలా మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీకలా ఉండే అమ్మని ఇలా చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న ఆవిడ నాకు అమ్మ మాత్రమే కాదు; స్నేహితురాలూ, గురువూ, దైవం అన్నీనూ! భర్తతోనూ, పిల్లలతోనూ, స్నేహితురాళ్ళతోనూ, మరెవ్వరితోనూ చెప్పుకోలేని విషయాలని అమ్మతో పంచుకుంటుండే నాకు ఏ ఒక్కరోజైనా అమ్మతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా వుండేది. నిన్న రాత్రి కూడా అమ్మతో దాదాపు గంటసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడాను. అలాంటిది తెల్లవారు జాముకల్లా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందన్న దుర్వార్తని వినవలసి వస్తుందని నేను కలలోనైనా ఊహించలేదు. ‘జాతస్య మరణం ధ్రువం’ అని తెలిసినా, నాకు అత్యంత ఆత్మీయురాలైన అమ్మ విషయంలో మాత్రం నేను దాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ‘చదువుకో తల్లీ నీకు సౌఖ్యమబ్బేను, ఆడుకోవమ్మా నీకు హాయి కలిగేను’ అంటూ అమ్మ చల్లని గొంతుతో పాడే జోల నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే వుంది.‘చిన్నా, చిన్నా’ అంటూ అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది. ఒకటా, రెండా– ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు. నా మదిలో అలలు అలలుగా కదులుతూ నన్ను ఒక రకమైన సుషుప్తిలోకి నెట్టేస్తున్నాయి. ‘అమ్మా, చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు’ అని చెప్పగానే, ‘ఎవరమ్మా నా చిట్టితల్లిని కొట్టిందీ, హన్నా’ అంటూ నా తరఫున వకాల్తా పుచ్చుకొని, అన్నయ్యకి రెండు అంటించి మురిపెంగా నన్ను ఎత్తుకుని ముద్దాడిన అమ్మ! ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో చివరి పరీక్షకి ముందురోజున ‘నేను ఈ సబ్జెక్టు సరిగ్గా చదవలేదు, ఫెయిలయిపోతాను’ అంటూ అమ్మ ఒళ్లో తల పెట్టుకుని భోరుమని ఏడుస్తుంటే, ‘ఊరుకో చిన్నా, ముందు కాసేపు ప్రశాంతంగా నిద్రపో’ అంటూ తన ఒళ్లో నన్ను నిద్రబుచ్చి, రెండుగంటల తర్వాత ‘చిన్నా, ఇంక మేలుకోమ్మా’ అంటూ నా చేతిలో కాఫీ పెట్టి నేను చదువుకుంటున్నంతసేపూ నాతో పాటే తనూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా, ఆ మరుసటి రోజు నన్ను వెంటబెట్టుకుని కాలేజీ వద్ద దిగబెట్టి, నేను పరీక్ష రాసి బైటకి వచ్చేదాకా కాలేజీ గేటు పక్కనే నా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ నిలుచున్న అమ్మ!సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్లో నెగ్గాక ఇంటర్వ్యూ ముందు రోజున ‘అమ్మా బోర్డులో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఏమో’ అని నేను భయపడుతుంటే, ‘ఏడాది పాటు ఒకే లక్ష్యంగా, అకుంఠిత దీక్షలా, అహర్నిశలూ చదివిన నీకు ఈ ఇంటర్వ్యూ ఒక లెక్కా? అంతా సవ్యంగానే జరుగుతుంది, ధైర్యంగా వుండమ్మా’ అంటూ నాపై నాకు నమ్మకాన్ని పెంచిన అమ్మ! ఐఏఎస్కి సెలక్టయి ట్రైనింగ్కి వెళ్ళాక ‘అమ్మా, ఇక్కడ అంతా నార్త్ ఇండియన్సే వున్నారు. వాళ్ళతో నేను కలవలేక పోతున్నాను. హాస్టల్లో భోజనం కూడా అస్సలు బావుండడం లేదు. పుల్కాలు, మసాలా కూరలూ తినలేక పోతున్నాను’ అంటూ ఫోన్లో నా కష్టాలని ఏకరువు పెట్టిన పదిహేను రోజుల్లోనే ఆవకాయ, మాగాయ జాడీలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేసి, నా ట్రైనింగ్ పూర్తయ్యేదాకా నాకు వండి పెడుతూ, నా దగ్గరే ఉండిపోయి, వచ్చీరాని హిందీలో అక్కడ అందరితో మాట్లాడుతూ వాళ్లకి మన వంటలనీ, ఆప్యాయతనీ రుచి చూపిస్తూ మెల్లిమెల్లిగా వాళ్లందరినీ నాకు ఫ్రెండ్స్ని చేసేసిన అమ్మ! ‘అమ్మా, ఎప్పుడూ నా తోడూనీడగా ఉండేదానివి. ఇలా ఉన్నట్టుండి నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? లేమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నన్ను ఒక్కసారి చిన్నా అని పిలువమ్మా’ అంటూ పెద్దగా ఏడ్చేస్తున్నాను.∙∙ ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ పిల్లలు గట్టిగా కుదుపుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.ఎదురుగా చేతిలో పుష్పగుచ్ఛం పట్టుకుని మా పిల్లలు మన్వి, తన్వి.‘ఏమిటి సిరీ, అత్తయ్యగారుగాని మళ్ళా కలలోకి వచ్చారా?’ అన్న మావారి మాటలకు అవునన్నట్టుగా తలుపాను.పిల్లలిద్దరూ కలిసి నా చేతిలో పుష్పగుచ్ఛం పెట్టి ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటుంటే వాళ్లవైపు నిరాసక్తంగా చూశాను. దాంతో పిల్లల్లోని ఉత్సాహం అంతా నీరు కారిపోవడం గమనించిన మా వారు వెంటనే ‘మీరు వెళ్లి హాల్లో ఏర్పాట్లు చేస్తుండండి. నేను అమ్మని తీసుకొస్తాను’ అని చెప్పి వాళ్ళని పంపించారు.‘అలాగే డాడీ’ అంటూ పిల్లలు హాల్లోకి వెళ్ళాక ‘ఇప్పుడు ఈ వేడుకలు ఎందుకండీ’ అంటున్న నన్ను మధ్యలోనే ఆపేసి, ‘అత్తయ్యగారు పోయి ఇంతకాలమైనా నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా సిరీ? రోజుల తరబడి నువ్విలా నిస్తేజంగా ఉంటుంటే నిన్ను చూసి పిల్లలు ఎంత బెంగ పడుతున్నారో నీకేమైనా తెలుస్తోందా అసలు?’ అన్న ఆయన మాటలకి నాలో కోపం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది.‘అదేమిటండీ, అలా మాట్లాడతారు? పోయింది ఎవరో దూరపు బంధువు కాదు, మా అమ్మ. ఆవిడతో నాకున్న అనుబంధం తెలిసీ మీరిలా...’ అంటుంటేనే నా గొంతు గద్గదమైంది.అది చూసి మా వారు తగ్గిపోయారు.‘నిన్ను బాధపెట్టాలని కాదు సిరీ. నిజమే, తల్లి లేని లోటు ఎవరూ తీర్చేది కాదు. అలాగని నీ విధుల్ని నువ్వు మర్చిపోకూడదు కదా! నీపై ఆధారపడ్డ ఒక కుటుంబం ఉంది. నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి, నాకు భార్యవి’ అన్నారు.‘మీకు చేయవలసిన వాటిలో నేను ఏ విధమైన లోటు చేశానండీ? మనసులో బాధ పొంగి పొర్లుతున్నా వేళకి అందరికీ అన్నీ అందిస్తూనే ఉన్నానుగా’ ఉక్రోషంగా అన్నాను.‘నిజమే, అన్నీ చేస్తూనే ఉన్నావు. కాని, ఇలా మొహంలో కళాకాంతులు లేకుండా, జీవితంలో సర్వం కోల్పోయినదానికి మల్లే తిరుగుతున్న నిన్ను చూసి పిల్లలు కూడా దిగాలుగా, మొహాలు వేళ్ళాడేసుకుని వుంటున్నారు. వాళ్ళల్లో హుషారు రోజురోజుకీ తగ్గిపోతుందన్న విషయం నువ్వు గమనించావా? అయినా పుట్టినరోజు పూట మన మధ్య ఇటువంటి వాదనలు వద్దుగాని, నీకోసం పిల్లలిద్దరూ కలిసి నీ పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసి నిన్ను సంతోషపెట్టాలని చూస్తున్నారు సిరీ. నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంచారు. నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారు, పద’ అంటూ హాల్లోకి తీసుకెళ్లారాయన.అక్కడ టేబుల్పైన అందంగా అలంకరించిన కేకు, క్యాండిల్స్, ఇంకా రకరకాల గిఫ్టులు.వాటిని చూసిన నా మొహం విప్పారలేదు. ఎందుకంటే, పుట్టినరోజు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే! నెలరోజుల ముందునుండే పిల్లలకి ఫోన్ చేసి, ‘పిల్లలూ, ఈసారి అమ్మ పుట్టినరోజు ఎలా చేస్తున్నారూ, అమ్మకి ఏం బహుమతులిస్తున్నారూ’ అంటూ హడావిడి చేస్తూండేది అమ్మ! ఇంక ఆరోజునైతే అందరికంటే ముందే ఫోన్ చేసి, ‘చిన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా ఆయుష్షు కూడా పోసుకుని పదికాలాల పాటు చల్లగా ఉండు చిట్టితల్లీ’ అంటూ ఆశీర్వదించేది. అలాంటి అమ్మ లేని పుట్టినరోజు పండుగా, ఒక పండుగేనా ! అమ్మ ఆశీస్సులతో మొదలయ్యే వేడుకని అమ్మ లేకుండా జరుపుకోవడం నాకేమాత్రం ఇష్టం లేకున్నా, ఆయన చెప్పినట్టుగా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో కేకు కట్ చేసి పిల్లలకీ, ఆయనకీ నా చేత్తో తినిపించాక, నిర్లిప్తంగా వంటింట్లోకి నడవబోతుంటే, ‘ఉండమ్మా, అసలైన సర్ప్రైజ్ పైనుంది, రా’ అంటూ పిల్లలిద్దరూ నా చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లారు. మాది రెండంతస్తుల మేడ. పై అంతస్తులో మేమంతా క్రికెట్ మ్యాచ్లూ, సినిమాలూ చూసే హోమ్ థియేటర్ ఉంది.అక్కడ స్విచ్ ఆన్ చేయగానే చిరునవ్వుతో కనిపించిన అమ్మని అబ్బురంగా చూస్తుండిపోయాను.‘చిన్నా, ఎలా ఉన్నావురా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నిండునూరేళ్లు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష’ అన్న అమ్మ మాటలకి నాలో ఆనందం పరవళ్ళు తొక్కింది.శివసాన్నిధ్యాన్ని చేరుకున్న అమ్మ ఇలా నా ఎదురుగా నిలుచుని ఎలా మాట్లాడగలుగుతోందో అర్థంకాక నేను తెల్ల మొహం వేస్తే, పిల్లలిద్దరూ ముసిముసిగా నవ్వుతూ, ‘ఇంకా ఉంది చూడమ్మా’ అన్నారు.దాదాపు గంట నిడివి ఉన్న ఆ త్రీడీ వీడియోలో అమ్మతో నా మధురస్మృతులని పొందుపరచిన ఎన్నో ఫొటోలు, మేమిద్దరం కలిసి వెళ్లిన టూర్లలో, ఫంక్షన్లలోని చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు, అక్కడక్కడ అమ్మ స్వయంగా తన గళంతో చెబుతున్న కబుర్లూ!అదంతా చూశాక చెప్పలేనంత ఆనందంతో నా మనసు నిండిపోయింది. ఇన్నాళ్ళుగా నా హృదయాన్ని కలచివేస్తున్న బాధంతా ఒక్కచేత్తో తీసేసినట్టుగా బుగ్గలపై నుండి జాలువారుతున్న అశ్రువులను తుడుచుకుంటూ ‘ఎప్పుడు చేశారమ్మా ఇవన్నీ?’ అని నేను అడుగుతుంటే మా వారు నా వెనక నుండి ముందుకొచ్చి, ‘దాదాపు నెలరోజుల పైనుండి పిల్లలు ఎంతో కష్టపడి ఈ వీడియోని తయారు చేశారు. ఇప్పుడొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా త్రీ డీ టెక్నాలజీ సాయంతో అత్తయ్యగారు నీ ఎదురుగా నిలబడి, నీతో మాట్లాడుతున్నట్టుగా వీడియో క్లిప్పింగులు, స్పెషల్ ఎఫెక్ట్లు జత చేసి తయారుచేశారు. ఇదంతా కూడా నిన్ను ఆనందపెట్టాలన్న తపనతో చేశారు వాళ్ళు. అలాంటిది, నువ్విలా ఏడుస్తుంటే ఎలా చెప్పు?’ అంటూ తన చేత్తో నా కన్నీళ్ళని తుడిచారు.‘ఇవి కన్నీళ్ళు కావండీ, ఆనందభాష్పాలు. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళేగా వచ్చేది’ అంటూ పిల్లలిద్దరినీ దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో పిలవడం ఆలస్యం, మొహాలు చాటంత చేసుకుని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారిద్దరూ.వాళ్ళ నుదుటిన ముద్దాడుతూ, ‘థాంక్యూ సో మచ్ బుజ్జి కన్నలూ. మీ అమ్మమ్మకి తిరిగి ప్రాణం పోసి నా కళ్ళ ముందు నిలిపారు’ అన్నాను.నా మాటలకి వాళ్ళ మొహాలు మతాబుల్లా వెలిగిపోగా ‘అక్కా, ఎన్ని రోజులయింది కదా అమ్మ మనల్ని ఇలా ‘బుజ్జికన్నలూ’ అని పిలిచి’ అన్న మన్వి మాటలకి ‘అవును తన్వీ, ఇంకా కొన్నాళ్ళయితే మనం ఆ పిలుపే మర్చిపోయేవాళ్ళమేమో’ అంది తన్వి.ఆ మాటలు వింటుంటే ‘అయ్యో, నా నిరుత్సాహంతో పిల్లలని నేను ఇంత బాధపెట్టానా’ అనిపించింది. అదే మాట మా వారితో అనగానే, ఆయన వెంటనే ‘తల్లి పోతే బాధ ఉండడం సహజమే సిరీ. అందులోనూ నువ్వు ఆవిడ గారాల కూతురివి కాబట్టి ఆ బాధ నుండి బయటపడేందుకు నీకు మరింత సమయం కావాల్సి వచ్చింది, అది నేను అర్థం చేసుకోగలను. నిజానికి, మనుషులు చనిపోవడం అంటే భౌతికంగా వాళ్ళు ఇక్కడ మనతో లేకపోవడం. అంతే! వాళ్లతో మనకున్న అనుబంధమూ, వారి జ్ఞాపకాలూ ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి, వాటికి మరణం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం వారు వదిలి వెళ్ళిన ఆ మధురస్మృతులని నెమరేసుకుంటూ మనసులో మరింత ఆనందాన్ని పోగేసుకుంటూ, వాటిని తరగని ఆస్తిగా మలచుకుని రాబోయే తరాలకి అందివ్వాలే తప్ప, వాళ్ళు మన మధ్యన లేరన్న విషయాన్ని అదేపనిగా తలుచుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు’ అన్నారు.ఆయన చెబుతున్నదాన్ని శ్రద్ధగా వింటున్న నాకు, ఆ మాటల్లో ఆ క్షణాన ఏదో అంతర్లీనమైన సందేశం వున్నట్టనిపించింది.∙∙ ఆ మరుసటి రోజున మన్వి స్కూల్కీ, ఇంకా తన్వి దాని స్నేహితురాలి ఇంటికీ వెళ్ళాక అమ్మతో కలిసి దిగిన ఫొటోలున్న ఆల్బమ్స్ అన్నింటినీ మంచంపై పరచుకుని తీరిగ్గా ఒక్కో ఫొటో తిరగేయసాగాను. ప్రతి ఫొటో వెనకా మరచిపోలేని అందమైన జ్ఞాపకాలు నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ‘ఈ స్మృతులన్నింటినీ దృశ్యమాలికలుగా నిక్షిప్తం చేస్తే కలకాలం సజీవంగా వుంటాయి కదా’ అన్న ఆలోచన తళుక్కుమనగానే వెంటనే లేచి అల్మారాలో వున్న డిజిటల్ కెమెరాని బయటకి తీశాను.ఒక్కో ఫొటోపై కెమెరాని ఫోకస్ చేస్తూ ఆ ఫొటోకు సంబంధించిన సందర్భాన్ని చక్కటి మాటల్లో నాకు తోచినట్టుగా అర్థవంతంగా వివరించడం మొదలెట్టాను. అలా చేస్తూ ఎంతసేపున్నానో తెలియదు.కాలింగ్ బెల్ మోగడంతో లేచొచ్చి తలుపు తీస్తే ఎదురుగా మన్వి !‘అప్పుడే స్కూల్ అయిపోయిందా’ అంటూ గోడగడియారం వైపు చూసి, ‘అమ్మో, సాయంత్రం నాలుగు గంటలు దాటింది. పనిలో పడి టైం చూసుకోలేదు. మీకోసం నేనింకా టిఫిన్ కూడా తయారు చేయలేదు’ అని నేను కంగారుపడుతుంటే తన్వి కూడా లిఫ్ట్ తలుపు తెరుచుకుని రావడం కనిపించింది.దాంతో ‘కాళ్ళూ చేతులూ కడుక్కురండి. ఈలోగా నేను మీకోసం స్నాక్స్ చేస్తాను’ అంటూ గబగబా వంటింట్లోకి నడిచాను.ఫ్రిజ్లో నుంచి దోసెపిండిని బయటకి తీసి, ఉల్లిపాయలూ, పచ్చి మిరపకాయలూ సన్నగా తరిగి కలిపి వాటితో వేడి వేడిగా పొంగనాలు వేసి ప్లేట్లలో సర్ది హాల్లోకి తీసుకోచ్చేటప్పటికి అక్కడ నేను పరిచిన ఫొటోలని తదేకంగా చూస్తూ కనిపించారు పిల్లలు.నా చేతుల్లో నుండి టిఫిన్ ప్లేట్లు అందుకుంటూ ‘అమ్మా, ఈ ఫొటోల్లో అమ్మమ్మ ఎంత చిన్నగా, సన్నగా వుందో! అన్నట్టు, కెమెరాతో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఫొటోలని డిజిటలైజ్ చేస్తున్నావా?’ అని అడిగిన పిల్లలకి నేనేం చేస్తున్నదీ వివరించాను.‘నువ్వు బ్యాక్ గ్రౌండ్లో ఉంటూ నీ గొంతు మాత్రమే వినిపించేకంటే, నువ్వు కూడా ఫొటో పక్కనే కనిపిస్తుంటే బాగుంటుంది కదమ్మా! ఫొటోని చూపిస్తూ నువ్వు మాట్లాడుతుంటే నేను వీడియో తీస్తాను’ అంది ఫొటోగ్రఫీ మీద మక్కువున్న నా చిన్నకూతురు మన్వి.‘మన్వి చెప్పింది బావుందమ్మా. ఎప్పటికప్పుడు ఒక వీడియో అయిపోగానే అది నాకు ఇచ్చేశావంటే నేను దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెరుగులు దిద్దుతాను’ అంది ఇంజినీరింగ్ చదువుతున్న నా పెద్ద కూతురు తన్వి. ఆ వెంటనే ‘నేను ఎలాగో నెలరోజుల తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఈ వీడియోలని చూసుకుంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్లుగా ఉంటుంది’ అని కూడా అంది.దాని మాటలకి ఆలోచనలో పడ్డాను.‘పిచ్చిపిల్ల, ఇప్పుడైతే హాస్టల్లో దూరంగా ఉంది కాబట్టి అమ్మని తన దగ్గరే చూసుకోవాలని అనుకుంటోంది, అదే ఆ తర్వాత, మా అమ్మలాగే నేనూ ఈ లోకాన్ని వీడిపోయాక? ఎప్పుడోకప్పుడు నేను కూడా వెళ్ళిపోవలసిన దాన్నేగా! ఎవరి ఆయుష్షు ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు?’నా మనసు పరిపరివిధాలు పోసాగింది.‘తన్వి మనసు చాలా సున్నితం. చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుంటుంది. నేను ఎప్పుడైనా ఆఫీసు పనిపై ఊరు వెళ్ళవలసి వస్తే నాలుగురోజుల ముందునుండే దిగులు పడుతుండేది. ఇంజనీరింగులో చేరి సంవత్సరంన్నర దాటినా ఇంకా దానికి హోం సిక్నెస్ పోలేదు. సెలవులకి ఇక్కడి వచ్చీ తిరిగి వెళ్ళిపోయే రోజున చాలా అయిష్టంగా హాస్టల్కి వెళ్తుంది. ఇంక మన్వికైతే ఇంకా చిన్నతనం పోలేదు. పసిపిల్లకి మల్లే మారాం చేస్తుంటుంది నా దగ్గరా, వాళ్ళ అక్క దగ్గరా! నేను కాస్త దిగులుగా ఉంటేనే తట్టుకోలేని ఈ పిల్లలు నేను ఏకంగా ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే, ఆ బాధని తట్టుకోగలరా? మా అమ్మని తలచుకుంటూ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా, మరి నేను వెళ్లిపోయాక నా పిల్లలూ నాలాగే నా గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో! అమ్మో, అలా అస్సలు కాకూడదు’అలా అనుకోగానే నా మదిలో చటుక్కున ఒక ఆలోచన అంకురించింది .‘నేను పోయాక, ఆ బాధ నుంచి పిల్లలు త్వరగా కోలుకునేందుకుగానూ వాళ్ళతో వర్తమానంలో నాకున్న అనుబంధం గురించే కాకుండా, భవిష్యత్తులో వాళ్లకి ఎదురయ్యే వివిధ సమస్యలకి నా అనుభవంతో నేను ఇచ్చే సలహాలనీ, సూచనలనీ నా మాటలతో వివరించే వీడియోలను చేస్తే, అవి పిల్లలకి సాంత్వనని కలిగించడమే కాకుండా ముందుముందు వాళ్లకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి.’అలా అనుకున్నాక నా మనసు కాస్త ఊరటపడింది. ∙∙ ఆ రాత్రి నా ఆలోచనని ఆయన ముందుంచుతూ ‘యాభైఏళ్లకే నేనిలా ఆలోచించడం అశుభం అంటారా? నా ఆలోచనా విధానంలో లోపం ఉందంటారా, నేను నెగటివ్గా ఆలోచిస్తున్నానంటారా?’ అని అడిగాను.‘అదేం లేదు సిరీ. జీవితం క్షణభంగురం. ఎవరికైనా సరే నుదుటిన రాసిపెట్టి ఉన్నంత కాలమే ఈ పృథ్విపై స్థానం ఉంటుంది. పోయిన వాళ్లతో కలిసి మనమూ పోలేము కాబట్టి వాళ్ళతో పంచుకున్న అనుభూతులని పదిలపరుచుకోవడమూ, అలాగే మనమూ ఎల్లకాలమూ ఇక్కడ ఉండబోమన్న అవగాహనతో మన పిల్లలతో ముడిపడి వున్న బాంధవ్యాన్ని పదిలంగా భద్రపరుచుకోవడమూ చక్కటి ఆలోచనే. కాబట్టి మనసులో ఏ శంకలూ పెట్టుకోకుండా గో ఎహెడ్. అలాగే నువ్వు కూడా ఇంక ఆఫీసుకి వెళ్ళడం మొదలెడితే కాస్త త్వరగా మనుషులలో పడతావు. నీ చదువు, ఉద్యోగం వెనకాల అత్తయ్యగారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదనీ, ఆవిడే లేకపోతే జీవితంలో నువ్వేమీ సాధించలేకపోయే దానివనీ నాతో నువ్వే చాలాసార్లు చెప్పావు. అలాంటిది ఇప్పుడు ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధతో నువ్వు నీ శక్తిసామర్థ్యాలని కుదించేసుకుని ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆవిడ ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ సెలవుని రద్దు చేసుకుని ఆఫీసులో చేరిపోయి మనుషుల్లో పడేందుకు ప్రయత్నం చేయి సిరీ’ ఆయన మాటలతో నా ఆలోచనకి బలం కలగడమే కాకుండా నా కర్తవ్యం కూడా నాకు బోధపడింది..∙∙ ఆ మరుసటి సోమవారమే ఆఫీసులో చేరిపోయాను. ఇంక అప్పటి నుంచి తీరిక సమయాల్లో అమ్మతో, పిల్లలతో ఇంకా మావారితోనూ నా అనుబంధాన్ని దృశ్యమాలికలుగా మలుస్తూ , మా అమ్మ జ్ఞాపకాలకి ప్రాణం పోస్తూ ఆవిడ ఈలోకంలో లేదన్న బాధనుంచి మెల్లిమెల్లిగా తేరుకోవడం మొదలెట్టాను. దాంతో, మావారూ హ్యాపీ, పిల్లలూ హ్యాపీ, వెరసి కుటుంబమంతా హ్యాపీ. కాలం అన్ని గాయాలనీ మాన్పుతుంది. నిజమే కాని, దానికి మనవంతు కృషి మనమూ జోడిస్తే గాయం కాస్త త్వరగా నయమవుతుంది కదూ! -
దెయ్యప్పిల్ల
పాపం మంచమ్మాయే! ‘దెయ్యప్పిల్ల’ అని పేరొచ్చేసిందంతే. అసలు పేరు జో రోత్(Girl Zoe Roth). ఆమె నాలుగేళ్ల వయసులో తండ్రి తీసిన ‘విపత్తు’ ఫొటోపై ఇరవై ఐదేళ్లుగా ఇంటర్నెట్లో ‘మీమ్స్’ వస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా పెద్ద విపత్తు సంభవించింది అనుకుందాం. ఆ విపత్తు ఫొటోను, ఈ పాప ఫొటోను జాయింట్ చేసి ఇంటర్నెట్లోకి వదిలేస్తుంటారు ‘మీమర్స్’. టైటానిక్ నౌక ఎప్పుడో వందేళ్ల క్రితం కదా మునిగిపోయింది.ఆ ఫొటోక్కూడా ఈ పాప ఫొటోను తగిలించేశారు. సరదాకే అనుకోండి. ఆ చిన్నారి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. ఇటీవలే తన చిన్నప్పటి ‘విపత్తు ఫొటో’లో తనెక్కడైతే నిలబడి ఉందో సరిగ్గా అక్కడే నిలబడి ఫొటో తీయించుకుని ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది. సీన్ని రీక్రియేట్ చేసిందన్నమాట! ఇదంతా సరే, అసలు పాతికేళ్ల క్రితం నాటి జో రోత్ ఫొటోపై సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్ ఎందుకు వస్తున్నాయి?ఓసారి 2005లోకి వెళ్దాం. ఇయర్ సరే. ప్లేస్ ఎక్కడ? అమెరికాలోని నార్త్ కరోలినా. అప్పుడు జో రోత్ వయసు 4 సంవత్సరాలు. ఆ రోజు.. వీధిలో ఏదో కాలిపోతున్నట్లు పొగలు వస్తుంటే చుట్టు పక్కల వాళ్లు ఇళ్లల్లోంచి బయటికి వచ్చారు. జో రోత్ ఇంట్లోంచి ఆమె తండ్రి డేవ్, ఆమె వచ్చారు. డేవ్ ఫొటోగ్రాఫర్. అతడి మెడలో ఎప్పుడూ కెమెరా వేలాడుతూ ఉంటుంది. ఇంట్లోంచి వాళ్లొచ్చి చూసేటప్పటికి బయట ఎవరిదో ఇల్లు కాలిపోతోంది! అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. డేవ్కు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. కెమెరాను సెట్ చేసుకుని, ‘‘తల్లీ.. ఫొటోకు పోజ్ ఇవ్వరా..’’ అన్నాడు.బ్యాక్ డ్రాప్లో కాలిపోతున్న ఇంటి మంటలు. వాటి ముందు రోత్. ఇదీ యాంగిల్. తండ్రి చెప్పినట్లే రోత్ పోజ్ ఇచ్చింది. ‘‘కొంచెం నవ్వు ముఖం పెట్టు’’ అన్నాడు! తనకేం తెలుసు. తండ్రి స్మైల్ అన్నాడు కాబట్టి స్మైల్ ఇచ్చింది. ఇల్లు కాలిపోతుంటే నవ్వుతున్నట్లుగా ఉంది జో రోజ ఆ ఫొటోలో!జో రోత్ సీన్ రీక్రియేషన్ ఫొటో ఐదు లక్షల డాలర్ల ఫొటో!ఆ ఫొటోలో రోత్ నవ్వు ‘డెవిలిష్’గా ఉంది. అంటే దెయ్యప్పిల్ల నవ్వుతున్నట్లు! రెండేళ్ల తర్వాత ఆ ఫొటోను ఏదో పోటీకి పంపుతూ ‘డిజాస్టర్ గర్ల్’ అనే పేరు పెట్టాడు డేవ్. ప్రైజ్ వచ్చింది. అలా ఆ ఫొటో ప్రపంచానికంతటికీ తెలిసింది. అప్పట్నుంచీ జో రోత్ ‘డిజాస్టర్ గర్ల్’ అయింది. ప్రపంచంలో ఎక్కడైనా ఘోరం జరిగితే ఫొటోషాప్ తెలిసిన సృజనశీలురు ఆ ఘటనకు, రోత్ చిరునవ్వు ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పెట్టేవారు.అలా ఆ ఫొటో ఇంకా పాపులర్ అయింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలితే రోత్ ఫొటో. సునామీలు వస్తే రోత్ ఫొటో. ఘోర ప్రమాదాలు జరిగితే రోత్ ఫొటో. అలా నెట్లో, వార్తాపత్రికల్లో తరచు తన చిన్ననాటి ఫొటోని చూస్తూ పెరిగింది రోత్. ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. అప్పటి చిరునవ్వులో మాత్రం మార్పులేదు. అన్నట్లు – ఐదేళ్ల క్రితం ఆ ‘విపత్తు ఫొటో’ ఒరిజినల్ ఐదు లక్షల డాలర్లకు వేలంలో అమ్ముడైంది. రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడన్నట్లు – ఆ రోజు రోత్ తండ్రి డేవ్ ఎందుకు అలా వెనుక మంటలు, ముందు కూతురి చిరునవ్వులు కలిపి ఫొటో తీసినట్లు! ఎప్పటికైనా ఆ ఫొటో భారీ ధరకు అమ్ముడుపోతుందని ముందే ఊహించాడా? లేదు లేదు. ఊరికే అతడికో సరదా ఆలోచన వచ్చింది.ఆ సరదా ఆలోచన కూడా ఎందుకొచ్చిందంటే.. పొగని చూసి హడావిడిగా బయటికి వచ్చారు తండ్రీ కూతుళ్లు.. అయితే అది అగ్ని ప్రమాదం కాదనీ, అగ్ని మాపకదళం వారే ట్రైనింగ్లో భాగంగా ఒక సెట్టింగ్ను తగలబెట్టి మంటల్ని ఆర్పుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, ఆ సంతోషంలో కూతురి ముఖంలో నవ్వుల్ని పూయించాడు డేవ్. ఆ ఫొటోని చూస్తే ఎవరికైనా వెంటనే వచ్చే ఆలోచన.. ‘‘ఏంటీ పిల్ల.. ఇల్లు తగలబడిపోతుంటే నవ్వుతూ చూస్తోంది!’’... అనే కదా. అలాంటి ఆలోచన రప్పించడం కోసమే డేవ్ అలా ఫొటో తీశాడు. అనుకోకుండా ఫొటోగ్రాఫర్గా ఆయనకు పేరు, ఫొటోలో ఉన్న చిన్నారిగా రోత్కు భారీగా డబ్బూ వచ్చాయి. -
ఓ మై డాగ్స్!
ఒక అసాధారణమైన స్నేహానికి మూడడుగుల ఎత్తు తేడా ఏమాత్రం అడ్డు రాలేకపోయింది. ఒకటి టీ కప్పు సైజులో పరిగెత్తే పిల్లోడు, ఇంకొకటి సోఫాను బెడ్డుగా వాడే బలమైన కుర్రాడు, కాని, ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం చూస్తే – ఇది శునకాల స్నేహం కాదు, నిజమైన ప్రేమపాఠం అనిపిస్తుంది. ఈ స్నేహం ఐడహోలో గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్ అధికారుల కారణంగా మొదలైంది.ప్రపంచంలోనే అతి పొడవైన శునకం రెజీకి (39.6 అంగుళాలు), అతి చిన్నదైన కుక్క పెర్ల్ను (3.59 అంగుళాలు) మొదటిసారి పరిచయం చేసినప్పుడు, ఎవరూ ఊహించని విధంగా కళ్ల ముందు ఒక డిస్నీ మ్యాజిక్ కనిపించింది. రెజీ, పెర్ల్ కలిసింది మొదటిసారే అయినా, ‘ఓయ్ బాస్, ఈ ప్రపంచంలోనే మేమే గ్రేట్ బెస్ట్ ఫ్రెండ్స్’ అని అందరిని నమ్మించేశాయి! రెజీ భారీ ఆకారం చూసి పెర్ల్ భయపడకుండా ధైర్యంగా దాని చుట్టూ తిరుగుతూ ఆటలాడుకుంటుంటే, రెజీ తన భారీ కాళ్లను నెమ్మదించి, చిట్టి స్నేహితుడితో కలిసి నడిచింది.ఈ అందమైన కలయికకు కారణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కావొచ్చు కాని, ఫలితంగా ప్రపంచం నిండా నవ్వులు పూశాయి, సోషల్ మీడియా హ్యాష్ట్యాగ్లతో నిండిపోయింది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎత్తుల్లో తేడా రావచ్చు, రకాలు భిన్నంగా ఉండొచ్చు కాని, ఒక స్నేహానికి ఇవేమీ అవసరం లేదు, ఒక మంచి మనసే చాలు అని ఈ జంట మరోసారి నిరూపించింది. -
కడలి కబుర్లు
అగాధ జలనిధి కడలి.. అది అనంత జీవరాశికి ఆలవాలం... నేలపై ఉండే జీవులకు ప్రాణవాయు ప్రదాత.. సాగరగర్భం అనేక వింతలకు నిలయం... సముద్రాలను కాపాడుకోవడం మానవాళి కర్తవ్యం.. సముద్రాలను కాపాడుకుంటేనే మనకు మనుగడ. సముద్రం ఒక వేదికైతే... అందులో చేపల నాటకం.. ఆక్టోపస్ డాన్స్.. డాల్ఫిన్ పాటలు.. ఇలా మరెన్నో కళాకారులతో నిండుతుంది. అయితే, ఆకతాయులు వేసే ప్రతి ప్లాసిక్ బాటిల్కు ఒక రంగురంగుల చేప ఊపిరి ఆగిపోతోంది. అలలు నవ్వడం మానేస్తున్నాయి. అందుకే, ప్రతి ఏటా జూన్ 8న జరుపుకునే ‘ప్రపంచ సాగర దినోత్సవం’(World Oceans Day) రోజునైనా, సముద్రం అంటే సరదా కాదు, ఒక జీవనిధిగా గుర్తించి కాపాడుకుందాం.సముద్రం అంటే ఒక పరిగెడుతున్న చేపల రాజ్యమని, అందులో నీళ్లు, చేపలు, బోట్లు తప్పే మరేం ఉంటాయ్! అని చాలామంది అనుకుంటుంటారు. కాని, సముద్రం ఎంత గొప్పది అంటే సముద్రమంత! ‘సాగరః సాగరోపమః’ అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అంటే.. సముద్రం సముద్రమంత గొప్పదని అర్థం. సముద్రాన్ని మరోదానితో పోల్చడం సాధ్యం కాదు. అంతటి మహాసముద్రం లోపల వేలాది ర హస్యాలు. భయంకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఎన్నో దాగున్నాయి. వాటిలో బయటకు తెలిసినవి కొన్నే! కాని, సముద్రంలో ఒక చిన్న వినోదం కూడా ఉంటుంది.అది ఒక చక్కని కామెడీ కథల వేదిక. అక్కడి చేపలు చేసే శబ్దాలు రేడియోలో కంటే ఎక్కువగా మాట్లాడతాయి, ఆ శబ్దాలు మనకు వినపడవంతే! ఆక్టోపస్లు ఎనిమిదేసి చేతులతో మాయాజాలం చూపిస్తాయి. జెల్లీఫిష్ సిల్లీ విన్యాసాలు చేస్తూ ఉంటుంది. ఒకపక్క తాబేలు స్లో మోషన్ డాన్స్ చేస్తుంటే మరోపక్క డాల్ఫిన్లు, తిమింగలాలు ‘ప్లాస్టిక్ తినకురా! ఓ నీలి నేస్తమా!’ అంటూ రీమిక్స్ చేస్తూ ర్యాప్ పాడుతుంటాయి. ఇక సముద్రపు స్టార్ షార్క్ని సెల్ఫీ అడిగి, దాని నవ్వు చూసిన అలలు పరుగెడుతుంటాయి.ఇలా సముద్రంలో ఎన్నో వింతలు.. విడ్డూరాలు ఉన్నాయి. అలాగే జీవం కూడా ఉంది. అందుకే, మనుషులు ఆనందంగా ఉండాలంటే సముద్రం కూడా ఆనందంగా ఉండాలి. అలా ఆనందంగా ఉండాలంటే మనం సముద్రానికి ప్లాస్టిక్ బ్యాగ్లను టోపీలుగానూ, బాటిళ్లను సీ డెకరేషన్లగానూ చేయకూడదు. సముద్రాన్ని ప్రేమించడం అంటే, మన భవిష్యత్తును మనం ప్రేమించడమే! పుడమికి ప్రాణవాయువును అందిస్తున్న సాగరునికి ప్రతి ఒక్కరూ ‘థ్యాంక్స్’ చెప్పుకునేలా.. ఈ ప్రత్యేక కథనం.. అలా మొదలైంది... ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచం నీలికడలి గురించి ఒక నిలువెత్తు నిజాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సముద్రాలు మనకు ఒక ముఖ్య జీవనాధారం అని. ఆక్సిజన్ లేకుంటే ఎంత ప్రమాదమో, సముద్రాలు లేకున్నా కూడా అంతే ప్రమాదం. ఒకరకంగా చెప్పాలంటే మనం పీల్చుకునే ఊపిరిలో సగానికి సగం సముద్రాల నుంచే వస్తుంది. ఇంతటి ముఖ్యమైన వనరును కూడా మానవులు కాలుష్యంతో నింపి నాశనం చేస్తున్నారు. అందుకే, 1992లో బ్రెజిల్లో జరిగిన ‘ఎర్త్ సమ్మిట్’లో కెనడా మొదటిసారి ‘సముద్రాలకు ఒక ప్రత్యేక దినోత్సవం కావాలి’ అని చెప్పింది. ఆ కలను 2008లో ఐక్యరాజ్యసమితి సాకారం చేసింది. ఇక అప్పటి నుంచి ఏటా జూన్ 8న ‘ప్రపంచ సాగర దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. సముద్రంలో సినిమా.. అద్భుతమైన సముద్ర ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చిన సినిమా ‘అండర్ ది సీ 3డీ’. ప్రముఖ సంస్థ ఐమాక్స్ తెరకెక్కించిన ఈ సినిమా మామూలు సినిమా కాదు. ఇదొక డాక్యుమెంటరీగా తీసుకొచ్చిన సముద్ర మాయాజాలం. ప్రముఖ డైరెక్టర్ హవర్ట్హాల్ దర్శకత్వం వహించగా, మిచెల్ హాల్ దీనికి రచన అందించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ సముద్రం లోతుల్లో తేలియాడుతూ, చుట్టూ రంగురంగుల చేపలను, నిగనిగలాడే పగడాల దిబ్బలను, నెమ్మదిగా కదిలే వివిధ సముద్రపు జీవులను చూస్తున్నట్లు ఉంటుంది.ఈ సినిమా కేవలం రంగుల బొమ్మలనే కాదు, ప్రకృతి చేసే అలజడి, వాతావరణ మార్పులు, పెరిగే ఉష్ణోగ్రతలు, మానవ తప్పిదాలు– ఇలా ఇవన్నీ సముద్రానికి చేస్తున్న ముప్పును చక్కగా చూపిస్తూనే, మనుషుల్లో ‘ఇక కొంతకాలంలో ఈ అందాలను చూసే అవకాశం లేకుండా పోతుందా?’ అనే ప్రశ్నను రేకెత్తించేలా చేస్తుంది. ఇందుకోసం ‘కర్ల్ ట్రయాంగిల్’ అనే సముద్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన సముద్ర జీవులు నివాసం ఉండే ప్రాంతం. అక్కడ చిత్రీకరణ అత్యంత ప్రమాదకరం.ఒక తప్పు జరిగినా అక్కడి జీవ వ్యవస్థ మొత్తానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే, ఈ ఇద్దరు ప్రతి ఫ్రేమ్ను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఒక పెద్ద కెమెరాను ఉపయోగించారు. దాని బరువు సుమారు ఆరువందల కిలోలు ఉంటుంది. వివిధ ప్రత్యేక అనుమతులు తీసుకొని సుమారు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేశారు. అలా ఒక అద్భుత ప్రపంచాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.సంభ్రమపరచే సాగర వాస్తవాలు⇒ సముద్రం లోపల ఏకంగా 37 ‘భారలోహాలు’ ఉన్నాయి. లిథియం, కోబాల్ట్, మాంగనీస్, టైటానియం ఇలా మరెన్నో మినరల్స్ ఉన్నాయి.⇒ సముద్రంలో ఉన్న మొత్తం ఉప్పుని ఉపయోగిస్తే, భూమిపై నేల అంతటినీ ఐదు వందల అడుగుల ఎత్తుతో కప్పేయొచ్చు.⇒ మనకి సముద్రపు లోతుల గురించి కంటే అంతరిక్షం గురించి ఎక్కువ తెలుసు. ఇంకా 90 శాతం సముద్రం మ్యాప్ కూడా గుర్తించలేదు. సముద్ర గర్భంలో ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు ఎన్నో ఉన్నాయి.⇒ సముద్రపు నీటి స్థాయి అప్పుడప్పుడు పైకి, కిందికి ఊగుతుంది. శీతాకాలం వస్తే నీరు మంచుగా మారుతుంది. అలాగే, తాపం పెరిగితే భూమి మీదకు వస్తుంది.⇒ సముద్రం భూమి మీద 71% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సముద్రాల్లోని నీటిని కలిపితే 320 మిలియన్ క్యూబిక్ మైళ్ల నీళ్లు! అంతేకాదు, సముద్రాల్లో నీళ్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. అవి ఎక్కడో వర్షంగా పడతాయి, మరెక్కడో మంచుగా మారతాయి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ⇒ సముద్రం అంటే ఉప్పు నీరు మాత్రమే ఉండదు. ఉప్పు లేని సముద్రాలు ఉన్నాయి. వాటిని ‘గ్రేట్ లేక్స్’ అంటారు. అంటే సముద్రం కాదు. కాని, ఈ సరస్సులు సముద్రాల్లో ఉంటాయి.⇒ సముద్రంలో ఏకంగా 2.2 మిలియన్ జాతుల జీవులు ఉన్నాయని అంచనా. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇప్పటి వరకు కనుక్కోగలిగాం.⇒ సముద్రపు నేల ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది! అగ్నిపర్వతాల వలన వచ్చిన మాగ్మా ఎత్తైన పర్వతాలను సృష్టిస్తుంటుంది. వీటిపై అక్కడక్కడ ఉండే ‘బ్లాక్ స్మోకర్స్’ అనే పగుళ్లు సముద్రంలో పొగను కూడా వదులుతాయి. హద్దుల్లేని భజంత్రీలుఒకప్పుడు పెళ్లి అంటే పందిరి, లైట్ల మెరుపులు, మైక్ పట్టుకుని చేసే ‘వేదపారాయణం’. కాని, ఈ స్టయిల్ పెళ్లిళ్లను ఈ కాలపు జంటలు అసలు ఒప్పుకోవడం లేదు. అన్నింటికంటే ముందు పెళ్లికి కచ్చితంగా కావాల్సింది అంతులేని తీరాలతో ఉండే ప్రేమ అని కొందరు అంటున్నారు. అంటే పెళ్లి వేదికలుగా సముద్ర తీరాలకు ఓటు వేస్తున్నారు. కాబట్టి పెళ్లి అనగానే పురోహితుడి కంటే ముందు ప్యాకేజీలో బీచ్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ది బెస్ట్ ఇవి.గోవా: గోవాలో పెళ్లంటే.. పెళ్లి కంటే ముందు పెళ్లి విందు మిన్న అన్నట్లే! శుభ ముహూర్తానికి ముందే ‘సన్సెట్ క్లిక్స్’, ‘బీచ్ బేస్డ్ బంగ్లా’ బుక్ అయిపోతాయి. వేదమంత్రాల పక్కనే డీజే ప్లే అవుతుంది. పక్కా ఎంజాయబుల్ పెళ్లికి వెళ్లాలంటే గోవాలో జరిగే పెళ్లికి పిలవకుండా వెళ్లినా తప్పులేదు.అండమాన్: జీవిత ఖైదీని అందంగా బంధించాలంటే అండమాన్లో పెళ్లి చేసుకోవాలి. వధువు వస్తే ఫ్లవర్స్ కాకుండా, టైడల్ షవర్ ఫీల్స్ వస్తాయి.కేరళ: వరుడు బోటులో వస్తే, వధువు కొబ్బరి చెట్టు కింద నిలబడి ‘నన్ను తీసుకెళ్తావ్ కదా’ అని చెప్పే ఓ చక్కని సన్నివేశంలాంటిది కేరళ పెళ్లి.గోకర్ణ: గోకర్ణలో పెళ్లంటే ఒక చిన్న పండగలాంటిది. ఓం కారంతో శుభారంభం పలికి, పెళ్లి, తర్వాత సంగీతం, చివర్లో బీచ్ ఫైర్ డాన్స్తో అలరించేదే ఈ పెళ్లి.పుదుచ్చేరి: ఫ్రెంచ్ వీధుల్లో ప్రేమగా నడుస్తూ, బీచ్ సరసన ప్రేమ పంచుకుంటే, ఫొటోల్లోనే కాదు, జీవితమే ఒక రొమాంటిక్ సినిమాలా కనిపిస్తుంది. అటువంటి సినిమాటిక్ ఫీల్ కోసం పుదుచ్చేరి బెస్ట్ ప్లేస్.డయ్యూ: తక్కువ ఖర్చుతో హైవోల్టేజ్ బీచ్ పెళ్లి కావాలంటే ఇది బెస్ట్. ఓ వైపు పోర్చుగీస్ ఇళ్లు, మరోవైపు బ్రైట్ లైట్స్తో ఉంటుంది. ఈ పెళ్లిని చూసిన తర్వాత పెళ్లికాని అబ్బాయిలు కూడా తమ పెళ్లి ఇక్కడే చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు.మహారాష్ట్ర: ఇక్కడ బీచ్ వెడ్డింగ్ అంటే పక్కనే కోటలు, వెనుక సముద్రం, ముందు మేకప్ ఫెయిల్ అయిన వధూవరులు. ఎందుకంటే, ఇక్కడ సూర్యుడు తన శక్తిని కొంచెం ఎక్కువే చూపిస్తాడు. అయినా కూడా అందంగానే ఉంటారు.లక్షద్వీప్: ఇది పెళ్లి కాదు బాస్, అడ్వెంచర్! ఇక్కడ పెళ్లి చేసుకుంటే పంచభూతాలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎందుకంటే, ఇక్కడ చాలామంది స్కూబా డైవింగ్ చేస్తూ, ‘ఐ లవ్ యూ’ చెçప్పుకుంటారు. బంధువులు ఎవరైనా రావాలంటే, ముందే స్విమ్మింగ్ తెలిసుండాలి.కాబట్టి పెళ్లి అంటే ‘పెద్దవాళ్ల దీవెనలు, బంధుమిత్రులతో విందుభోజనాలు’ అనుకునే రోజులు పోయాయి! ఇప్పుడు పెళ్లి అంటే– ‘ఐలాండ్ ప్యాకేజీ బుక్ చేసి, టెంట్లు వేసుకుని, సముద్రపు హోరుకు హార్ట్బీట్ జోడించి, ప్రేమను చాటాలి అనుకుంటున్న రోజులివి. అయితే, ఈ సముద్ర సంబరాలకు వెళ్లడానికి ముందు సన్స్క్రీన్ను రాసుకెళ్లడం మర్చిపోకండి.సముద్రంలో మిస్టరీగా మిగిలిన ప్రదేశాలు.. సముద్రాల్లో కొన్ని ప్రదేశాల గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా, అవి ఇప్పటికీ ప్రశ్నలు, సమాధానాల కంటే అర్థం కాని కథల్లానే మిగిలిపోయాయి. అలాంటి ఐదు అత్యంత రహస్యమైన సముద్ర ప్రదేశాలు ఇవే..బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో విమానాలు, నౌకలు చాలా అదృశ్యమయ్యాయి. అవన్నీ ఎక్కడికి పోయాయి? కారణం ఏమిటి? ఇంకా తెలియలేదు. ఇది సాంకేతిక సమస్యా? లేక ఏదైనా భౌతిక శక్తుల మాయాజాలమా అనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు.మారియానా ట్రెంచ్ మనం సముద్రాన్ని కేవలం ఐదు శాతమే అన్వేషించాం. కానీ అంతకంటే లోతైన ప్రదేశం కూడా ఉంది. అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ‘చాలెంజర్ డీప్’ అనే ప్రదేశం. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ఇందులో కంటికి చిక్కని లోకం ఉండవచ్చు అనే అనుమానం శాస్త్రవేత్తల్లో ఉంది. సర్గాసో సముద్రం ఈ సముద్రంలో ప్రవాహాలు కనిపించవు. కానీ అందులో తేలే సర్గాసం అనే సముద్రపు మొక్కలు, అక్కడి జీవవైవిధ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాయి. ఇది సముద్రానికి మధ్యలో ఉన్న, అతిపెద్ద సర్గాసం మొక్కల రాజ్యం లాంటిది.బాల్టిక్ సీ అనోమలీ సోనార్ స్కాన్లలో కనిపించిన ఒక నిర్మాణం చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ఏలియన్స్ నిర్మించారా లేదా సహజంగానే ఏర్పడిందా లేక మానవ నిర్మాణమా అనేది ఇప్పటికీ ఎవ్వరూ తేల్చలేకపోయారు.గ్రేట్ బ్లూ హోల్ బెలీజ్ సమీపంలో ఉన్న అతిపెద్ద సింక్ హోల్ ఇది. ఈ సముద్ర గుంత లోతుల్లో దిగుతున్న కొద్దీ నీటి ఉష్ణోగ్రత, పీడనం మారుతూ ఉంటుంది. ఇవి చూపుతున్న ప్రభావాలు శాస్త్రవేత్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇలా సముద్ర గర్భం ఒక్కొక్క చోట ఒక్కో విధంగా విశేషమైన ప్రత్యేకతతో ఉంటుంది. ఇవే కాకుండా సముద్ర గర్భం ఎన్నో రాజ్యాలను తనలో దాచుకుందని చరిత్ర చెప్తుంది.అలాంటి అతిపెద్ద నగరాల్లో శ్రీకృష్ణుడి నగరంగా చెప్పుకునే ‘ద్వారక’ ఒకటి. టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు జరుగుతున్న ప్రతిసారి ఎంతో కొంత భూమి సముద్రంలోకి దిగిపోతుంది. అలాగే కొంత భూమి సముద్రం బయటికి చొచ్చుకొని కూడా వస్తుంది. అలా మనకి ఒక ఖండమే మునిగిపోయినట్లు కూడా చరిత్ర చెప్తుంది. అందుకే, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ మనిషి పరిశోధన చేయాలంటే భయపడే అతిపెద్ద అంశం ఒక్క సముద్రం మాత్రమే!సముద్రపు వింత జీవులు...సముద్రంలోని కొన్ని నమ్మలేని, వింత జీవులు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. క్రిస్మస్ ట్రీ వర్మ్: ఈ చిన్న జంతువుల శరీరంపై ఉండే స్పైరల్ ఆకారాల ‘ప్లూమ్స్’ క్రిస్మస్ ట్రీలలా కనిపిస్తాయి! ఇవి శ్వాస తీసుకోవడానికి, ఆహారం సేకరించడానికి ఉపయోగ పడతాయి.లీఫీ సీ డ్రాగన్: ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో కనిపించే ఈ జీవి, సీ హార్స్ కుటుంబానికి చెందినది. దాని శరీరంపై ఆకుల్లా కనిపించే చేతులు ఉంటాయి. వీటిని శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఒక ఆయుధంలా ఉపయోగిస్తుంది.ఆంగ్లర్ ఫిష్: సముద్రం లోలోతుల్లో ఉండే జీవి ఈ ఆంగ్లర్ ఫిష్, దాని నోటిపైన మెరిసే గ్లో లైట్తో మామూలు చేపలను ఆకర్షించి వెంటనే చంపి, తినేస్తుంది.నార్తర్న్ స్టార్గేజర్: ఈ చేప మట్టిలో దాగి, తన కళ్లతో పైకి చూస్తూ, చిన్న చేపలు ఎప్పుడొస్తాయా అని వేచి చూసి చంపి తినేస్తుంది. ఒక్కసారిగా పైకి దూకి, శత్రువును హడలెత్తిస్తుంది.రెడ్హ్యాండ్ ఫిష్: ఈ జీవి ఈత కొట్టదు, నడుస్తుంది. రెడ్హ్యాండ్ ఫిష్ అనే ఈ చేప, టాస్మానియా సముద్ర తీరానికి ఆవల కనిపిస్తుంది. ఇది చేతుల్లా ఉండే మొప్పలతో సముద్రం అట్టడుగు నేలమీద నడుస్తూ తిరుగుతుంది.సముద్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూస్తే, ప్రకృతి మనకేదో బలమైన సంకేతాలను పంపుతున్నట్లు అనిపిస్తోంది. కాని, మనం వాటిని గమనిస్తున్నామా? సముద్రపు లోతుల్లో నివసించే కొన్ని జీవులు అకస్మాత్తుగా భూమి మీదకు రావడం మనకు సమాధానం కావాల్సిన ప్రశ్నలు. ఈ మధ్యే ఆస్ట్రేలియాలో ఒకేసారి 150 కిల్లర్ వేల్స్ చనిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఇవి చాలా తెలివైన, సమూహంగా జీవించే జలచర జీవులు. ఒక్కసారిగా ఈ స్థాయిలో వీటి మరణం సంభవించడం సాధారణ విషయం కాదు.ఇక ‘బ్లాక్ డెవిల్ ఫిష్’ గురించి చెప్పాలంటే, ఇది ఆరువేల మీటర్ల లోతుల్లో ఉండే జీవి. అలాంటి జీవి ఒడ్డుకి వచ్చి చనిపోవడం అత్యంత అరుదైన ఘటన. అలాగే ‘ఓర్ ఫిష్’ లేదా ‘డూమ్స్ డే ఫిష్’ అనే చేప కూడా, సాధారణంగా మూడు నుంచి ఐదువేల మీటర్ల లోతులో జీవిస్తుంది. ఇది భూకంపాల ముందు ఉపరితలానికి వస్తుందన్న నమ్మకాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి, ముఖ్యంగా జపాన్ లో. 2011 సునామీకి ముందు ఈ చేపలు ఎక్కువగా కనిపించాయి. ఇలా ఈ మధ్య కాలంలో సముద్రంలో అట్టడుగున ఉండే చాలా జీవులు బయటకు వస్తున్నాయి.శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, భూమి లోతుల్లో జరిగే టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు, ఈ జీవులను పైకి తేలుస్తున్నాయేమో అని భావిస్తున్నారు. అయితే, ఇలా ఒకేసారి మూడు రకాల సంఘటనలు ఓర్ ఫిష్ ఉపరితలానికి రావడం, బ్లాక్ డెవిల్ ఫిష్ మరణం, కిల్లర్ వేల్స్ గుంపుగా నశించడం అన్నీ దాదాపుగా ఒకే సమయంలో చోటు చేసుకోవడం అనేది ప్రళయానికి సంకేతం అని, ఇది ప్రకృతి మనకు ‘జాగ్రత్త పడండి,’ అని హెచ్చరిస్తున్నట్లు చాలామంది భావన. త్వరలోనే దాదాపు అన్ని మతాల పురాణాల్లో ఉండే అతిపెద్ద జలచర జీవి ‘లేవియతాన్’ కూడా నిద్ర లేచిందని కథలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే, త్వరలోనే యుగాంతం జరగక మానదనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, సముద్రాల్లో వేసే ప్లాస్టిక్ను తగ్గించడం అనేది పెద్ద మార్పు కాదు కాని, మంచి ఫలితాన్ని ఇచ్చే అతిపెద్ద విషయం. -
ఇంటర్ తర్వాత... మీ దారి కనిపెట్టాలి!
ఇంటర్మీడియట్ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్ రకరకాల సలహాలిస్తుంటారు. ‘‘ఇంజినీరింగ్ చెయ్, ఫ్యూచర్ బాగుంటుంది.’’‘‘నీట్ రాయి, ఎంబీబీఎస్ అయిపోతే జీవితం సెట్ అవుతుంది.’’‘‘బీకామ్ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు. మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.మీ మనసేం చెప్తోంది? ఇంటర్ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్ కౌన్సెలింగ్ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. కొత్త దారిలో నడవండి...ఇంటర్ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. బైపీసీ తర్వాత మెడిసిన్ తప్ప మరేం చేసినా వేస్ట్. బైపీసీ తర్వాత మెడిసిన్ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్ సై, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్ (ఎన్డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కామర్స్ అంటే సీఏ తప్ప దారిలేదుకామర్స్ స్ట్రీమ్లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్ ఇప్పుడు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. ఆర్ట్స్ తీసుకుంటే స్కోప్ ఉండదు.. ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మీడియా, కాగ్నిటివ్ సైన్స్ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. దారి చూపించే మూడు ప్రశ్నలు...ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. అది మీకు ప్యాషన్ కలిగించాలి.అది మీకు పర్పస్ నేర్పించాలి.అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్. నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్. ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్ అండ్ అవేర్నెస్ స్కిల్ అండ్ మ్యాపింగ్ + ఫ్యూచర్ విజన్= రైట్ కెరీర్. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్! -
కాలకల్పుని కథ
పూర్వం మథురా పట్టణంలో సోమశేఖరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. విశాలాక్షి అనే యువతిని వివాహమాడి గృహస్థ జీవనం గడపసాగాడు. వేదవేదాంగ పారంగతుడైన సోమశేఖరుడు ధర్మబద్ధంగా జీవిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యక్రమాలను నియమం తప్పక ఆచరిస్తూ ఉండేవాడు. నిత్యాగ్నిహోత్రుడై దేవ ముని పితృదేవతారాధన క్రమం తప్పక సాగించేవాడు. కొన్నాళ్లకు సోమశేఖరుడు, విశాలాక్షి దంపతులు పుణ్య సముపార్జన కోసం తీర్థయాత్రలు చేయాలని తలచారు. ఒక సుముహూర్తాన తీర్థయాత్రలకు బయలుదేరి, గంగా తీరానికి చేరుకున్నారు. గంగానదిలో స్నానమాచరించారు. సోమశేఖరుడు గంగానది ఒడ్డున సంధ్యావందనం చేసుకునేలోగా, విశాలాక్షి కలశంతో గంగాజలాన్ని నింపుకొని వచ్చింది. అందులో తులసిదళాలను వేసింది. సోమశేఖరుడి సంధ్యాదికాలు పూర్తి కాగానే దంపతులిద్దరూ గంగాకలశంతో కాలినడకన బయలుదేరారు.వారు అలా నడక సాగిస్తుండగా, పశ్చిమదేశం నుంచి ఎడ్లబండిపై సరుకులు నింపుకొని పోతున్న వర్తకుడు ఒకరు ఎదురయ్యాడు. కాలకల్పుడు అనే చోదకుడు ఆ బండి తోలుతున్నాడు. బండికి కట్టిన ముసలి ఎద్దు సరుకుల భారాన్ని లాగలేక లాగలేక భారంగా ముందుకు కదులుతోంది. కొద్దిసేపటికి అది బండిని మరి లాగలేక మొండికేసి ఆగిపోయింది.కదల్లేని మొండిఎద్దు తీరుకు కాలకల్పుడికి కోపం ముంచుకొచ్చి, దానిని కర్రతో బాదాడు. ముసలి ఎద్దు ఆ బాధ భరించలేక నేలమీద పడిపోయింది. బండి పక్కకు ఒరిగిపోయింది. బండి బరువు మీద నుంచి తొలగిపోవడంతో ఆ ఎద్దు విదిలించుకుని పైకిలేచి, తనను మళ్లీ కొట్టడానికి వస్తున్న కాలకల్పుడిని కసితీరా కొమ్ములతో పొడిచింది. కాలకల్పుడు ఆ పోటు భరించలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తగని బాధతో విలవిలలాడుతూ విలపించసాగాడు. సోమశేఖరుడు, విశాలాక్షి ఈ దృశ్యాన్ని చూసి విచలితులయ్యారు. కాలకల్పుడి దుస్థితికి వారు జాలిపడ్డారు. శ్రీహరిని పూజించి కలశంలో తీసుకువస్తున్న గంగాజలాన్ని సోమశేఖరుడు అతడి నోట్లో పోశాడు. అతడి శరీరంపై గంగాజలాన్ని చల్లి, తులసిదళాన్ని వేశాడు. తర్వాత సోమశేఖరుడు, విశాలాక్షి తమ దారిన తాము ముందుకు నడవసాగారు. కొంతసేపటికి కాలకల్పుడు అక్కడే ప్రాణాలు విడిచాడు.కాలకల్పుడిని విడిచిపెట్టి, సోమశేఖరుడు, విశాలాక్షి ముందుకు సాగుతుండగా, దారిలో వారికి కొందరు క్షతగాత్రులు కనిపించారు. కాళ్లు చేతులు విరిగిపోయి, నడవలేక, నెత్తురు కక్కుకుంటూ మూలుగుతూ అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నారు వారు. వారిని చూసి కలవరపడిన సోమశేఖరుడు, ‘అయ్యా! మీరంతా ఎవరు? ఎందుకిలా బాధపడుతున్నారు? ఎవరైనా మీ మీద దాడి చేశారా?’ అని ఆందోళనగా ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! మేము యమదూతలం. మాకు, విష్ణుదూతలకు పెద్ద వాదం వచ్చింది. వారిని మేము ఎదిరించలేకపోయాం. వారు మమ్మల్ని ఇలా శిక్షించారు’ అని చెప్పారు.‘విష్ణుదూతలు మిమ్మల్ని ఎందుకు దండించారు?’ ప్రశ్నించాడు సోమశేఖరుడు.‘ఒక వర్తకుడి సేవకుడు అయిన కాలకల్పుడి ప్రాణాలను కొనితెమ్మని మా ప్రభువు యమధర్మరాజు మమ్మల్ని ఆదేశించారు. జీవితాంతం అతడు చేసినవన్నీ పాపకార్యాలే! చివరిదశలో కూడా బండి లాగలేని ముసలి ఎద్దును నిర్దాక్షిణ్యంగా హింసించాడు. ఇదే సంగతిని మేము విష్ణుదూతలకు చెప్పాము. అతడి ప్రాణాలను కొనిపోతున్న మమ్మల్ని అడ్డుతొలగమన్నాం. వారు ఒప్పుకోలేదు. అందుకే వారితో వాదం జరిగి, యుద్ధంగా మారింది’ అని వివరించారు యమకింకరులు.‘విష్ణుదూతలు ఎందుకు ఒప్పుకోలేదు?’ అడిగాడు సోమశేఖరుడు.‘ఇతడు పాపాత్ముడు కాదు, మహాపుణ్యాత్ముడు. ఎద్దు కుమ్మడంతో గాయపడి, అంత్యదశలో ఉన్నప్పుడు పవిత్ర గంగాజలాన్ని తులసిదళాలతో సేవించాడు. అంతేకాదు, ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో నారాయణ నామస్మరణాన్ని ఆలకించాడు. అంతటితో ఇతడి పాపాలన్నీ నశించాయి. ఇంక ఇతడికి పాపాలు ఎక్కడ ఉన్నట్లు? అందువల్ల మీరు ఇతడిని యమపురికి తీసుకుపోవడానికి వీల్లేదు’ అని చెప్పారు.‘మా యమధర్మరాజు ఆదేశాన్ని మేము పాటించాల్సిందే! అడ్డుతప్పుకోండి అని హెచ్చరించాం. వారు వినలేదు. మాతో పోరుకు దిగారు. ఇదిగో ఫలితం! విష్ణుదూతల చేతిలో చావుదెబ్బలు తిని మేమిలా మిగిలాం’ అని గద్గదస్వరంతో చెప్పారు యమకింకరులు. పవిత్ర గంగాజల మహిమను, తులసి మహాత్మ్యాన్ని, అంత్యకాలంలో హరినామస్మరణ వల్ల దక్కే ఫలితాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలిగినందుకు సోమశేఖరుడు, విశాలాక్షి సంతోషించారు. వారు మనసులోనే శ్రీహరికి వందనాలు సమర్పించారు.గంగాతీరం వెంబడి సాగుతూ, శ్రీహరి క్షేత్రాలను సందర్శించుకుని, శాస్త్రోక్తంగా పూజాదికాలు చేస్తూ కొన్నాళ్లకు వాళ్లు తీర్థయాత్రలను ముగించుకుని, సంతోషంగా ఇంటికి చేరుకున్నారు.∙సాంఖ్యాయన -
వజ్రాలు ఉచితం
ధగధగలాడే వజ్రాల మెరుపులు కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. వజ్రాల మెరుపులే కాదు, వాటి ధరలు కూడా కళ్లు చెదిరేట్లు చేస్తాయి. వజ్రాల విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ధర చెల్లిస్తే గాని, రవ్వంత వజ్రమైనా కొనడం సాధ్యం కాదు. అలాంటిది వజ్రాలు ఉచితం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా?ప్రపంచంలో వజ్రాలు ఉచితంగా దొరికే చోటు ఒకే ఒక్కటి ఉంది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది ఇదే! ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. మర్ఫ్రీబరో గ్రామానికి చేరువలో ఉన్న ఈ వజ్రాల ఆలవాలం పేరు ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’. దాదాపు 37.5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు వజ్రాల గని. దీనిని 1972లో స్టేట్ పార్కుగా మార్చారు. అప్పటి నుంచి ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కులో 35 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. వీటిలో కొన్ని అరుదైన రకాలకు చెందినవి కూడా ఉన్నాయి.ఈ పార్కులోకి ప్రవేశించడానికి, ఇందులో టెంట్లు ఏర్పాటు చేసుకుని బస చేయడానికి మాత్రమే డబ్బు చెల్లించాలి. ఇక్కడ ఎవరైనా నేల తవ్వుకుని, వజ్రాలను ఏరుకోవచ్చు. చాలామంది సెలవురోజుల్లో ఇక్కడకు కుటుంబ సమేతంగా వచ్చి, తవ్వకాలు జరుపుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. మట్టిని, ఇసుకను జల్లెడపడుతూ గంటల తరబడి ఓపికగా వెదుకులాట సాగిస్తుంటారు. తవ్వకాల్లో ఎవరికైనా ఒక్క వజ్రం దొరికినా, వారి పంట పండినట్లే! ఈ పార్కులో గడపడానికి పెద్దలకు రోజుకు 15 డాలర్లు (రూ.1285), పన్నెండేళ్ల లోపు పిల్లలకు 7 డాలర్లు (రూ.600) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కొందరు ఇక్కడ టెంట్లు వేసుకుని రోజుల తరబడి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. పార్కు బయట టెంట్లను అద్దెకు ఇచ్చే దుకాణాలు, తవ్వకాల కోసం ఉపయోగించే పనిముట్లు, పరికరాలను అద్దెకిచ్చే దుకాణాలు కూడా ఉంటాయి. ఇంటి నుంచి పలుగు పార వంటివి తెచ్చుకోనివారు వాటికి ఈ దుకాణాల్లో అద్దెకు తీసుకోవచ్చు. ఇక్కడ వజ్రాలు దొరికినట్లయితే, వాటిని ఎలాంటి మూల్యం చెల్లించాల్సిన పనిలేదు. చక్కగా వాటిని ఉచితంగానే ఇంటికి తీసుకుపోవచ్చు.మిన్నెసోటా ప్రాంతానికి చెందిన డేవిడ్ డికుక్ అనే వ్యక్తికి ఇక్కడ అరుదైన బ్రౌన్ డైమండ్ దొరికింది. గత నెల అతడు ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తుండగా, చాక్లెట్ రంగులో «మెరుస్తున్న రాయి కనిపించింది. దానిని పరీక్షించి చూస్తే, అది 3.81 కేరట్ల బ్రౌన్ డైమండ్గా తేలింది. ఈ పార్కులో ఇప్పటి వరకు దొరికిన వజ్రాల్లో ఎక్కువ శాతం పారదర్శకమైన తెల్లవజ్రాలే అయినా, కొందరికి అరుదైన బ్రౌన్ డైమండ్స్, యెల్లో డైమండ్స్ కూడా దొరికాయి. ఈ పార్కులో వజ్రాలు మాత్రమే కాకుండా కొంత తక్కువ విలువ కలిగిన అమెథిస్ట్, జాస్పర్, ఎగేట్, క్వార్ట్జ్ వంటి రత్నాలు కూడా దొరికాయి. అర్కాన్సాస్–టెక్సస్ సరిహద్దులో ఉన్న ఈ పార్కు సెలవురోజుల్లో జనాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. -
ఈ వారం కథ: ప్రేమించేందుకు వీలులేదా?
ఆ ఉదయం ఇంకా తెల్లవారలేదు. ఫోన్లో చిన్ని పిచ్చుక పిల్ల పలకరింపు.ఆ చప్పుడుకి నిద్ర కళ్ళతో పక్కన టీపాయ్పై తడిమి, ఫోన్ అందుకుని మెసేజ్ తెరిచి చూశాడు.పచ్చటి ఆకుల మధ్య నుండి తొంగి చూస్తున్న విచ్చుకున్న మల్లెపూవు ఫోటో, ఆ కింద ‘‘మా ఇంట్లో మల్లె తీగకి పూసిన మొదటి పూవు. ఇది నీ కోసం. ఈ ఉదయం తోటలోకి రాగానే, ఆ పువ్వును చూడగానే, ఎంత ఆనందం వేసిందో. నువ్వు గుర్తొచ్చావు. నిద్రలేవగానే చూస్తావని’’ ఆమె. ఇలాంటి పిల్లపై నిద్రపాడుచేసింది అని ఎట్లా కోపం తెచ్చుకోగలడు. అతని పెదవులపై చిన్న నవ్వు.‘‘ ఒకే పూవు. మరి అక్కడ నేను లేనుగా’’‘‘సరిగ్గా చూడు. ఆ పక్కన ఓ చిన్న మల్లె మొగ్గ వుంది. ఈ పూచిన పూవు రాలిపోతుంది కదా. అప్పుడు దానికి వికసించడానికి చోటు దొరుకుతుంది’’అతనికి కొంచం దిగులనిపించింది. రెండు పూలూ ఒకేసారి పూసి, ఒకేసారి రాలిపోవచ్చు కదా అనుకున్నాడు మనసులో.‘‘ఈ మల్లె ఏ జాతిదో, ఎక్కడ నుండి వచ్చిందో తెలీదు. ఎంత పరిమళం వెదజల్లుతూ వుందో! రెండు సీతాకోక చిలుకలు వాలాయి ఆ కొమ్మపై. ఆ అదురుకో, వీచిన గాలికో, పూవు రాలిపోయింది’’ ఒక కన్నీటి చుక్క ఎమోజీ. కాసేపటికి ‘‘ఆ రాలిన పూవు చూడు, కొంచెంసేపు బుద్ధుడి ఒడిలో, ఈ మొక్కల మధ్య... దానిది కాని చోటైనా, ఎంతో అందంగా లేదూ!’’చిన్ని చిన్ని పక్షులతో అలంకరించిన వేలాడే పింగాణీ కుండీలో ఆకుల మధ్య ఆ మల్లెపూవు.అతనికి అప్పుడా పిల్ల దగ్గరికి పరుగెత్తుకెళ్ళి గుండెలకు హత్తుకోవాలని అనిపించింది.‘‘ఇవ్వాల్టి ఉదయపు చిన్ని, చిన్న ఆనందాలు ఇవి. ఇప్పటికి ఇక బై’’‘‘అప్పుడేనా’’ అన్నాడు అతను.అటుపక్క నవ్వు.‘‘నీకు ఇక ఎప్పటికీ తెల్లవారదు. నాకోసం కలలు కనడంలోనే సమయం గడిచిపోయిందని అంటావు కదూ’’మరో నవ్వు ఎమోజీతో సంభాషణ ఆగిపోయింది.అతను లేచాడు. తలుపు తెరిచి ఆకాశం కేసి చూశాడు.అది ఎప్పటిలానే వుందా? అతనికి అది గాఢనీలంలోకి మారినట్లు అనిపించింది నిన్నటి కన్నా. అక్కడ రెండు తెల్లటి మేఘాలు ఒకదాన్ని ఒకటి అందుకునేందుకు చేతులు చాస్తునట్లు. ఆ రెండు చాచిన చేతులు ఒకటి ఆమె, రెండు నేను అనిపించి సంతోషంగా కలిగింది.అతనికి తెలుసు, కాసేపు అయితే ఆ దృశ్యం మారుతుందని.అందుకని అతను ఆఖరున చూసిన ఆ మేఘాలను తన లోపల అలానే నిలుపుకుని లోనికి వెళ్ళాడు.కాఫీ తాగి, స్నానించి, టిఫిన్ తిని ప్రతిరోజు వలే అతను తనదైన పనిభారపు భేతాళుడిని భుజానికి వేసుకొని వేటకు బయలుదేరాడు.ఆమె పిల్లలకు పాఠం చెబుతూ వుంటే వైబ్రేషన్ మోడ్లో వున్నా, ఫోన్ ఒక్కసారి కదలి ఆగిపోయింది. ఆమెకి తెలుసు క్షణకాలం, రెండు రింగ్స్కే ఆగిపోయిన ఆ కాల్ ఎవరిదో. ఆ రింగ్టోన్ మిగిలినవాటి కన్నా భిన్నంగా వుంటుంది. ఆమె ఏమీ తొందర పడలేదు. అతను మళ్ళీ తాను పలకరించే దాకా మౌనంగానే ఉండగలడని ఆమెకి తెలుసు.స్టాఫ్ రూమ్లోకి వచ్చి, ఫోన్ తీసి చూసింది.నీలాకాశంలో చేతులు చాచిన చేతుల్లా అగపడే రెండు తెల్లటి మేఘాలు. ‘‘ పొగ మేఘాలు కదూ, అవి తేలి విడిపోయి, ఎటో వెళ్లిపోయేలోగా ఇలా నీకు మేఘ సందేశం’’ఆమె ఒక హృదయపు గుర్తును అతనికి పంపింది. ‘‘నువ్వు ఎందుకు గుర్తుకొస్తావో ఇలా నాకు? ఇప్పుడీ సిస్టం ముందు కూర్చుని నాకు ఎన్నడూ ఏ మాత్రం ఆసక్తి లేని పనులు చేస్తూ... ఇదంతా బతకడం కోసం కదూ?’’‘‘తప్పదు బతకాలి కాదా’’ అందామె క్లుప్తంగా.‘‘అవుననుకో, నీకూ తెలుసు కదా! ఇదంతా ఎంత నరకంగా వుంటుందో?నాకు పారిపోవాలని అనిపిస్తుంది’’‘‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా! ఏడు సముద్రాలూ ఈది, ఏడు పర్వతాలూ దాటి? నిన్ను నువ్వు కట్టేసుకున్న రాటను ఊడ బెరుక్కొని... ఎటుపోతావ్? ఎచటికి పోతావ్ ఈ రాత్రి’’ అందామె చిన్ని నవ్వుతో.‘‘అవును. వెళ్ళాలి అని వున్నా వెళ్ళలేను’’‘‘సరే, పని చేసుకోవాలి నువ్వూ నేనూ. కూలి ముట్టాలి అంటే పని చేయలి కదా!’’‘‘సరే’’ఆమె దిద్దాల్సిన పిల్లల పరీక్ష పేపర్లు ముందేసుకు కూర్చుంది. ఏమి తెలుసు అతని గురించి ఆమెకి?ఆమె గురించి అతనికి ఏమి తెలుసు?అట్లా తెలుసుకోవాలని ఇద్దరికీ ఎందుకనిపించలేదో తెలీదు?తాము ఒకరికొకరు ఏనాటి నుండో, తెలిసినట్లు ఎందుకు అనిపించిందో కూడా వాళ్ళకి తెలీదు. లేదా తమ గత కాలాలు ఏవో, అన్నీ రద్దయిపోయి, జీవితం ఆ క్షణం నుండే మొదలైనట్లుగా వుంది. అతను ఒక సంగీత కచేరీలో పరిచయం అయ్యాడు.సంగీతం మన లోలోపల, మనకే తెలియని భావోద్వేగాలను తట్టిలేపుతుంది.సమూహానికి కాస్త ఎడంగా ఒక్కతీ కూర్చుని వింటోంది. ‘‘ఆజా బాలమ్ పరదేశీ’’ అంటూ పాడుతూవుంది కౌశికీ చక్రబర్తి, భైరవిలో. రాగానికి అనుగుణంగా గాలిలో కదులుతున్న ఆమె సన్నటి పొడవాటి చేతివేళ్ళ విన్యాసాన్ని చూస్తోంది ఆమె. అందంగా, సుకుమారంగా వున్న ఆమె, మరేదో లోకంలో ఉన్నట్లు, తన చుట్టూ ఏమి జరుగుతోందో, ఎవరున్నారో, లేరో తనకేం ప్రమేయం లేనట్లు ఎంత తాదాత్మ్యతతో పాడుతున్నదో. ఆమె స్వరం ఎంత మధురంగా ఉందంటే, ఆ పాట విన్న ఆ పరదేశీ ఎవడో, ఆమె చెంత అలా వశీకరణ చెందినవాడుగా కూర్చుండి పోడూ అనుకుందామె.పాడుతున్న ఆ గాయనిని, అరమోడ్పు కళ్ళతో, తలూపుతూ వింటున్న ఆమెనీ చాలసేపటి నుండి మార్చి, మార్చి చూస్తూ వున్న అతను ‘‘మీరు కూడా పాడతారా?’’ అన్నాడు. ఆ అపరిచిత వ్యక్తి కేసి చూసి, తల అడ్డంగా ఊపి ‘‘ఇష్టం. వినడం’’ అంది.అడక్కుండానే ‘‘నాక్కూడా! కర్ణాటక సంగీతంలో కొంచెం ప్రవేశం వుంది’’ అన్నాడు.కొన్ని మాటలు కలిసి, ఇష్టాలు కలిసి కాఫీని ఆస్వాదించి, సంగీతం గురించి అతనికి తెలిసిన సంగతులు చెబుతుంటే, ఆసక్తిగా విని, అట్లా మొదలైంది వాళ్ళ పరిచయం.ఆమె పని చేసే కాలేజీకి దగ్గరలోనే అతని ఆఫీసు. ఏదో కమర్షియల్ బ్యాంకులో ఉద్యోగి. మద్రాసు నుండి డిప్యుటేషన్ మీద వచ్చాడు ఏడాది కాలానికి.ఇద్దరికీ కుదిరినప్పుడు సాయంత్రాలు కలిసి కాస్త దూరం నడిచి, ఏ కాఫీనో తాగి, ఆమెతో పాటూ ఆటో ఎక్కి, మరి కాసేపటిలో శ్రీనగర్ కాలనీలో ఆమె ఇల్లు వస్తుందనగా, కాస్త దూరంలోనే దిగి పోయేవాడు. అతనికి తెలుసు ఆమె ఎక్కడ వుంటుందో. ఆమె అతడిని ఇంటికి రమ్మని ఎన్నడూ పిలవలేదు. వెళ్ళాలని అతనూ అనుకోలేదు.యూసఫ్గూడలో వున్న నిసిట్ (ఎన్ఐఎస్ఈటీ) క్యాంపస్ గెస్ట్హౌస్లో వుండేవాడు. ఎప్పుడన్నా వీలు దొరికినప్పుడు ఆమె అతని దగ్గరకు వచ్చేది.అతని గదిలోనో, ఆరుబైట చెట్ల కిందో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళ మాటల్లో అనేక విషయాలు దొర్లినా, వ్యక్తిగతమైన సంగతులు వచ్చేవి కావు. బహుశా అలాంటి సంభాషణ మొదలవుతే అది ఎక్కడికి దారి తీస్తుంది? మనుషులు ఒంటరి జీవులు కాదనీ, అనేకానేక సంబంధాల మధ్య వాళ్ళు జీవిస్తారని వాళ్ళకు తెలుసు.జీవితంలోని ఆ పొరలను విప్పినప్పుడు ఊపిరాడక, తమ ఇద్దరికీ ఎంతో శాంతిని, నిశ్చింతను ఇస్తున్న ఇప్పటి ఈ బంధం, ఏ మురికి కాలువలోకో ప్రవహించి, అసహ్యాన్నో, అవమానాన్నో మిగిల్చి చివరకు అంతం అవుతుందన్న భయం కూడా వాళ్ళను మాట్లాడనివ్వలేదు.వాళ్ళ ఇద్దరి మధ్య కలిగిన అద్భుతము, అపురూపము అని వాళ్ళు అనుకునే ఈ పేరు లేని ప్రేమయో, బంధమో అనుకునే ఆ భావన, గాలి బుడగవలే టప్పుమని పగిలి పోతుందేమో అన్న భయం వాళ్ళకి లోలోపల వుండి వుండాలి. కొన్ని నెలల తరువాత, ఇదంతా ఎక్కడి దాకా పోతుందో అనిపించి, ఆమె అన్నది ‘‘మనం మాట్లాడుకోవాలి’’‘‘మాట్లాడి? నీ స్థితిని నువ్వూ, నా స్థితిని నేనూ మార్చగలమనే అనుకుంటున్నావా?’’ అన్నాడు అతను ఒకసారి. తాము ఇద్దరం ఎప్పటికీ ఇట్లానే వుండగలమన్న ఈ భ్రమని నమ్మినంత కాలం, ఇలా సాగినంత కాలం ఇట్లా సాగనివ్వాలనే వాళ్లకు వుంది.అతను అన్నాడు ఒకసారి ఆమె చేతి వేళ్ళతో ఆడుకుంటూ ‘‘ఆనందం అనిపించిన ప్రతిదాన్నీ మనం శాశ్వతంగా స్వంతం చేసుకోవాలి అనుకుంటాం. అది అప్పటికి కలిగించిన సంతోషం.అట్లా అది మనకి అప్పుడు మనం వున్న స్థితి, కాలం వల్ల కలిగిన ఆనందమో, హాయో! ఈ మనిషి కావాలి శాశ్వతంగా నాకు, అని ఎంతో ఇష్టపడి, ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళలోనూ, వాళ్ళతోనే, ఆ బంధంలోనే వున్నా, ఆ ఇద్దరు మనుషులలో చాలా సందర్భాలలో చెప్పరానంత డిసపాయింట్మెంట్ వుంటుంది ఎందుకో’’‘‘అవును. అది వాళ్ళు గుర్తించినా, అప్పటికే వాళ్ళ చుట్టూ అనేక కొత్త బంధాలు బిగుసుకుపోతాయి. ముఖ్యంగా పిల్లలు. అప్పుడు అది దాటడం కష్టం’’ అందామెఅతను మౌనంగా విన్నాడు.‘‘ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఇట్లా మరొక మనిషి నా హృదయానికి ఇంత దగ్గరగా వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు.’’‘‘ఆడమనిషి’’ అని సవరించి నవ్వింది.‘‘ఉహు, నాకు మనిషే. ఇద్దరు మనుషులు.అంతే’’ అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దుపెడుతూ.అతని వొడిలో పడుకున్న ఆమె లేచి కూర్చుని ‘‘ఏం? ఎందుకింత ఇష్టం? ఎందుకింత మోహం నీకూ, నాకూ మధ్య? మనం ఒక ఆడ, మగ మనుషులం. మన ఇద్దరికీ మనసులే కాదు, శరీరాలు కూడా వున్నాయి మరిచిపోకు’’ అంది ఆమె.‘‘అవును ఈ శరీరాలు కూడా ఒకరికి ఒకరు కావాలని కోరుకుంటాయి’’ అని, ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఆమె దూరంగా జరిగింది అతనికి. ‘‘ఈ దాగుడుమూతలు ఎందుకు నీకూ నాకూ మధ్య’’ అన్నాడు.‘‘భయం. నిజంగా భయం నాకు. నా మనసును, దేహాన్నంతా నీకు ఇచ్చేసి, నాకు నేను కాకుండా పోతానని భయం. నా ఉద్వేగాలను నా లోపలే దాచుకోలేనితనపు భయం. హు, ఇంకా, లోకభయం, నా కుటుంబ భయం, ఈ దాటలేని అగడ్తల మధ్య పడి, మనుషుల తీర్పుల మధ్య పడి నలిగి నువ్వూ, నేనూ చచ్చిపోతామేమోననే భయం’’ఆ తరువాత అతన్ని ఆనుకొని, అతని చేయి గట్టిగా పట్టుకుని, ఆమె ఒక్క మాటన్న మాటలాడకుండా అతనికేసి నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది.కాస్సేపటికి ‘‘నువ్వు చెప్పాలి అనుకుంటున్నదంతా చెప్పేయి ఇవ్వాళ’’ అన్నాడు అతను. ‘‘నాకే తెలీదు. ఈ ద్వైదీభావం ఏమిటో. నువ్వు కావాలి, వద్దు కూడా, నువ్వు పూర్తిగా కావాలి. అట్లా వద్దు కూడా. కొంచెం, నీ చేయి పట్టుకుని, నీ భుజం మీద తలవాల్చి, నువ్వు అట్లా నా కళ్ళ మీద ముద్దు పెట్టి ..’’అతను ఆమె తలను దగ్గరికి లాక్కొని కళ్ళ మీద ముద్దు పెట్టాడు.ఆ నీటి తడి అతడి పెదవులకు కొంచెం ఉప్పగా తాకింది.‘‘నీకు కష్టం కలిగించే, నీకు ఇష్టంలేని పని ఏమీ జరగదు మన మధ్య’’ అన్నాడు. ‘‘నేను ఇది చెప్పడం మన మధ్య ఏర్పడిన ఈ బంధపు తప్పు, ఒప్పుల గురించి, నీతో మాట్లాడటానికి కాదు, నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. బయట హాస్టల్లో వుంటారు. మా అమ్మ, నాన్న, ఒక మానసిక వైకల్యం వున్న చెల్లి ఇంట్లో’’‘‘అతను? అదే మీ ఆయన’’‘‘వున్నాడు, కానీ వుండీ లేనట్లే’’‘‘అంటే’’‘‘చాలా ఆస్తులు తగలేశాక, ఎన్నో గొడవలయ్యాక, ఆ మిగిలినవి ఏవో మా అత్తింటి వాళ్ళు పిల్లల పేర్లపై పెట్టాక, మమ్మల్ని గాలికి వదిలేసి, అతను ఎక్కడెక్కడో తిరిగి, ఆ మిగిలిన ఆస్తి కోసం నన్నూ, అతని తల్లిదండ్రులను కూడా చాలా వేధించడం మొదలు పెట్టాక, వాళ్ళు కూతురు దగ్గరికి అమెరికాకి వెళ్ళిపోయారు. నేను మా అమ్మా వాళ్ళ దగ్గరికి వచ్చేశాను.’’‘‘మరి అతను’’‘‘నేను విడాకులు అడిగాను. ఆడపిల్లలు కదా. తండ్రి లేకపోతే కష్టం అట. పెద్దవాళ్ళు వద్దన్నారు. పిల్లలు అనే పేరుతో వస్తాడు. వుంటాడు. కొన్నాళ్ళు. చాలా కోపం, అసహ్యం నాకు. నన్ను ముట్టుకునే సాహసం చేయడు. అతను నా మేనబావే. ఆస్తులు, బంధుత్వాలు అంటూ నాకు ఇష్టం లేకుండానే చేసిన పెళ్లి ఇది’’‘‘చాలా కష్టం కలిగింది కదూ!’’ అతను ఆమె తలనిమురుతూ అన్నాడు.ఆమెకి నిజంగా చాలా దుఃఖం కలిగినా అతనికేసి చూసి, ‘‘అందుకే మరింత దుఃఖాన్ని మోయలేనని అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ, నాన్న, మానసికంగా ఎదగని చెల్లి, ఆ, ఇంకా నా పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇదంతా దాటి నీ కోసం వచ్చేయాలి అనుకున్నా, నిజంగా చేయగలనా? ఇక దుఃఖం వద్దు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఒక కొత్త దుఃఖాన్ని తెచ్చేలా ఉన్నావు’’ అని నవ్వింది.‘‘నువ్వు నమ్మవేం? అట్లా చేయను. అంటే, నీకు దుఃఖం కలిగంచే పని. అలా అయితే వెళ్ళనా’’ అతడు ఆమె చేయి విడిపించుకుని లేచి నిలబడ్డాడు.ఆమె నవ్వి, అతని చేయి పట్టి లాగి కూర్చోబెట్టి ‘‘మరి నీ సంగతి ‘‘ అని అతని మొఖంకేసి చూసి, కళ్ళు తమాషాగా ఎగరేసింది.‘‘నీ అంత దుఃఖభాజిత కుటుంబ కథాచిత్రం కాదులే నాది. కొంచం ప్రేమించే చేసుకున్నాం. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం.’’‘‘కొంచం ప్రేమించుకోవడం ఏమిటి?’’‘‘మరి? అప్పుడు చాలా ఎక్కువనుకున్నాంలే. తరువాత పెళ్లి చేసుకుని కలిసి జీవించడం మొదలుపెట్టాక అది కొంచెమే అని తెలిసిందిలే’’ అని నవ్వాడు.‘‘ఊ, చెప్పు?’’‘‘బహుశా, ఈ దేశంలో పిల్లలని పుట్టించడం అంత సులువైన విషయం మరోటి లేదనుకుంటా’’‘‘అర్థం అయింది. నేను చేసిందీ అదేగా’’‘‘కలిసి ఉండటానికి ప్రయత్నం చేశాం. నా కొడుక్కి అప్పుడు ఐదేళ్ళు. తనకి ఈ ఇల్లూ, సంసారం ఇదంతా ఊపిరాడనితనంగా అనిపించడం మొదలైంది. తను ఓవర్ యాంబిషస్ అనుకున్నాను నేనప్పుడు. తను ఇంకా పైకి ఎదగాలి, ఏ ఆక్స్ఫర్డ్లోనో పైచదువులు చదవాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో వుండాలి అనుకుంది. ఇదంతా ఎందుకు వున్నదాంట్లోనే వుండచ్చు కదా అనిపించేది నాకు’’‘‘అట్లా నువ్వు అనుకోవడం ఆమెపై నీకు చాలా ప్రేమ ఉండటం వల్లా, లేక నువ్వు, నేను, నా కుటుంబం కోసమే ఆమె అనుకునే నీ స్వార్థం వల్లా’’‘‘పెళ్ళంటే బాధ్యత కదా?’’ అని ఒక్క క్షణమాగి, ‘‘స్వార్థం కూడానేమో! కొంచెం చాలా ఎక్కువ. ఇంకొంచెం ప్రయాస లేకుండానే దొరికేసే దేహసుఖం, ఇంకా నిలకడ, నిశ్చింతతో పాటూ, ఆడ, మగ ఆ ఇద్దరు మనుషుల, కట్టడి చేసే లోకం స్వార్థం కూడా ఉంటుందేమో, మనం గుర్తించం కానీ’’‘‘నిజమే’’ అంది ఆమె ‘‘మేము అప్పుడు దిల్లీలో వుండేవాళ్ళం. మా అమ్మకి తెలిసింది మా ఘర్షణ. బహుశా తను మా అబ్బాయి ‘అనిరు«ద్ కీ మా’ అని చిన్నగా నవ్వి, ‘‘నా భార్య చెప్పినట్టు వుంది. అమ్మే అనింది పట్టి ఉంచేవి బంధాలు ఎలా అవుతాయి, బందిఖానాలు అవుతాయి కానీ అని. మేము విడిపోయాం.’’‘‘మరి బాబు?’’‘‘తనకి బాబు పట్ల ప్రేమ చాలానే వున్నా, మేం మాట్లాడుకున్నాం, ఒక నిర్ణయానికి వచ్చాక స్నేహితుల్లా వుందాం అనుకున్నాం. బాబు బాధ్యత నేను తీసుకున్నాను. తను యూకే వెళ్ళింది. తను అనుకున్నట్లుగానే చదువుకుంది. మంచి పొజిషన్లో వుంది. అక్కడే స్థిరపడింది. వీలైనప్పుడు తల్లీ, కొడుకు కలుసుకుంటారు.’’‘‘మరి..’’ఆమెకి నోటిదాకా వచ్చి, అది అంత సంస్కారం కాదేమోనని ఆగిపోయింది.‘‘ఉన్నారు. ఆ తరువాత ఒకరిద్దరు స్త్రీలు నా జీవితంలో. ఏ రిలేషన్ పెళ్లి దాక వెళ్ళలేదు. దానికన్నా ముందుగానే వాళ్ళ నిందారోపణలు, పొసెసెసివ్నెస్లు, నా అపరాధ భావనల బరువులు, ఏమి చేయాలో తోచక, అంత ఎమోషనల్ బరువు మోయలేక పారిపోవడాలు... ఇంకో రిలేషనో, పెళ్ళో ఇక వద్దనుకునేలా చేశాయి నన్ను’’ అన్నాడు.ఆమెకేసి అట్లా దిగులుగా చూశాడు.‘‘ఇదిగో నువ్వు ఇట్లా వచ్చావు. ఎందుకు ఇలా వచ్చావో, వున్నావో, వుంటావో లేదో తెలియకుండా’’ అన్నాడు. ఆమె అతన్ని క్షణకాలం తదేకంగా చూసి, ‘‘ఇంతటి నిశ్చింతను, శాంతిని, నేను ఎన్నడూ ఎరుగను. ఇదంతా ఎక్కడి దాకా వెడుతుందో, ఎక్కడ ఆగిపోతుందో కూడా నాకూ తెలీదు. ఈ లోకంలో పరమ కుతూహలమైన సంగతి ఏదైనా వుందీ అంటే, ఇద్దరు మనుషులు, ఉహూ ఇద్దరు ఆడా, మగా మధ్య వున్న సంబంధం ఏవిటో తెలుసుకోవడమే అనుకుంటాను. నువ్వు నాకు కావాలి. కానీ..’’ఆమె తన మాట పూర్తి చేయకుండానే ‘‘కానీ వద్దు కూడా’’ అన్నాడు నవ్వి.అతని రెండు చేతులను తన దగ్గరికి లాక్కుని ఆ చేతులలో తన మొఖాన్ని దాచుకుని, అరచేతుల్ని ముద్దుపెట్టుకుని, ఆమె మెల్లిగా లేచి తన చేతి సంచీ తీసుకుని, వెనక్కి తిరిగి, కంటి నుండి రాలిన కన్నీటి చుక్కను తుడుచుకోకుండానే నడిచి వెళ్లి పోయింది. ఆమె మళ్ళీ రేపు కూడా, నిన్నటి మల్లెమొగ్గ, రేపు ఉదయం విరిసి పూవు అవ్వగానే, తనకు ఆ బొమ్మ పంపుతే బావుండును. ఉహు, రెండు విరిసిన మల్లెపూలు అనుకుంటూ వుంటే, ఎందుకో తనలోంచి తానంతా ఖాళీ అయిపోయినట్లు అనిపించింది అతనికి. -
బొద్దింక పాలు: మీరు ఎప్పుడూ చూడని సూపర్ఫుడ్!
ఒక పూట పాలు లేకపోతే, ఆ రోజు ఎంత కష్టంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉదయాన్నే టీ, కాఫీలు పెట్టుకోవడం దగ్గర నుంచి, రాత్రిపూట మజ్జిగ తాగే వరకు ఇంట్లో ఏదోరకంగా పాల అవసరం కనిపిస్తూనే ఉంటుంది. పెరుగు, వెన్న, నెయ్యి ఇలా ప్రతి పాల ఉత్పత్తితోనూ రోజువారీ అవసరాలు, అలవాట్లు ముడిపడే ఉంటాయి. అందుకే, కుదిరితే పాడినయినా పెంచుకుంటాం, లేదా పాలకేంద్రంలో ఖాతానైనా పెట్టుకుంటాం. ఏదేమైనా రోజుకు లీటరో అరలీటరో పాలు స్టవ్ మీద కాగాల్సిందే! ప్రతి ఇంట్లోనూ పాలకున్న డిమాండ్ అలాంటిది.నిజానికి పాలు ఒక సంపూర్ణ ఆహారం. పాలు మన శరీరానికి కావలసిన కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా పోషకాలనే అందిస్తాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు, కణజాలాల నిర్మాణానికి ప్రొటీన్ ఎంతగానో సహాయపడుతుంది. పాలలో విటమిన్–డి, విటమిన్–బి12తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పాలు తాగటంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలు ఎముకలను బలపరుస్తాయి, కండరాలను అభివృద్ధి చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని వయసుల వారికి పాలు ఒక ముఖ్యమైన పోషకం. పిల్లలు ఎదగడానికి, పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి పాలు చాలా అవసరమని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.మనిషి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి పాడిని పెంచి, పాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. అంటే దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నుంచే, పశువుల పాలతో ప్రయోజనాలను అందుకుంటున్నాం.ఏ జంతువుల పాలు.. ఏమేమి ఫలితాలు?పాలల్లో ఆవు పాలు శ్రేష్ఠమైనవి. ఇక గేదె పాలు, మేక పాలు, ఒంటె పాలు కూడా అనేక సంస్కృతులలో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ప్రత్యేక రుచి, పోషక విలువలు, ప్రత్యేక లక్షణాల కారణంగా వాటి పాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.బొద్దింక పాలుకీటకమైన ఈ బొద్దింకల నుంచి పాలను తియ్యడం చాలా అసాధారణమైన పని. పసిఫిక్ బీటిల్ బొద్దింకలు ‘బొద్దింక పాలు’ అని పిలవబడే ఒక పోషకసమృద్ధ స్ఫటికాకార పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి బొద్దింకల గర్భధారణ సమయంలో వాటి పిల్లలకు పోషణను అందించడానికి ఉపయోగపడతాయి. ఇవి అధిక ప్రొటీన్ కంటెంట్ను కలిగి ఉంటాయి. వీటిని మనుషులు వినియోగించుకోవడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాణిజ్యపరంగా బొద్దింకల పాలను ఉత్పత్తి చేయడం లేదు. దీనిని ఒక ‘సూపర్ ఫుడ్’గా మార్కెట్ చేసే ప్రయత్నాలను కొన్ని పరిశోధనా సంస్థలు సాగిస్తున్నాయి. కానీ ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక, ఆర్థిక, సామాజిక అడ్డంకులు చాలా ఉన్నాయి.ఆవు పాలుఇవి ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పాలు. ఇవి కాల్షియం, ప్రొటీన్, విటమిన్–డిలతో నిండి ఉంటాయి. ఈ పాలను నేరుగా తాగడానికి, పెరుగు, వెన్న, చీజ్ వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.గొర్రె పాలు ఇవి చాలా పోషకమైనవి, వీటిలో కొవ్వు, ప్రొటీన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. గొర్రె పాలను ఎక్కువగా చీజ్ తయారీకి వినియోగిస్తారు. ముఖ్యంగా ఫెటా, రోక్ఫోర్ట్ వంటి చీజ్లు వీటితోనే తయారు చేస్తారు.గేదె పాలుఆవు పాల కంటే ఈ పాలల్లో కొవ్వు, మినరల్స్, ప్రొటీన్లు కొంత ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, ఇటలీ వంటి దేశాలలో ఎక్కువగా దొరుకుతాయి. పెరుగు, మొజారెల్లా చీజ్, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఈ పాలనే వినియోగిస్తారు. గేదె పాలు చాలా క్రీమీగా ఉంటాయి. ఇందులో లాక్టోస్ కూడా ఎక్కువ.గాడిద పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి, కానీ వాటి పోషక విలువలు చర్మ సంరక్షణకు, ఉబ్బసం నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అందుకే వీటిని చర్మ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. శిశువులకిచ్చే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా కూడా సూచిస్తారు.మేక పాలు ఆవు పాల కంటే తేలికగా జీర్ణమవుతాయి. కొంత భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, విటమిన్–ఎ అధికంగా ఉంటాయి. మేక పాల నుంచి చీజ్, పెరుగులతో పాటు సబ్బులు కూడా తయారు చేస్తారు. ఈ మేక పాలు ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 2% వాటాను కలిగి ఉన్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో గత 20 సంవత్సరాలలో దీని ఉత్పత్తి దాదాపు 60% పెరిగింది. మేకపాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవయవాల పనితీరుకు సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.ఒంటె పాలుపశ్చిమాసియా, ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాలలో ఒంటె పాలు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన ఆహారం. ఈ పాలలో విటమిన్–సి, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒంటె పాలు తేలికగా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు ఈ పాలు మంచి ఔషధం. ఈ పాలు కొన్ని వైద్యపరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ పాలను ఐస్క్రీమ్, చీజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.గుర్రపు పాలుఖజక్స్తాన్, మంగోలియా, తూర్పు ఐరోపాలో గుర్రపు పాలను కూమిస్, అయిరాగ్ వంటి సంప్రదాయకంగా పులియబెట్టే పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పానీయాలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. గుర్రపు పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అమైనో ఆమ్లాలు, కొవ్వు శాతం ఈ పాలలో ఎక్కువగా ఉండటంతో చీజ్ తయారీకి ఇవి చక్కగా పనికొస్తాయి.మూస్ పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని స్వీడన్, రష్యా, కెనడాలో వాణిజ్యపరంగా ఉపయోగిస్తాయి. మూస్ పాలను చీజ్, పెరుగు, ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్లలో మూస్ చీజ్ ఒకటి.రెయిన్ డీర్ పాలుసైబీరియా, ఉత్తర స్కాండినేవియా వంటి చల్లని ప్రాంతాలలో నివసించే ప్రజలు రెయిన్ డీర్ పాలను వినియోగిస్తారు. ఆవు పాల కంటే వీటిలో కొవ్వు, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా శక్తిమంతమైన ఆహారం.జిరాఫీ పాలు జిరాఫీ పాలు అసాధారణమైనవి. మానవ వినియోగానికి సాధారణంగా లభ్యం కావు. వీటి పాలలో కొవ్వు, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జిరాఫీ పిల్లల వేగవంతమైన పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అయితే, జిరాఫీల నుంచి పాలు తీయడం చాలా కష్టం. అది పెద్ద సవాలుతో కూడుకున్న పని.యాక్ పాలుహిమాలయ ప్రాంతంలో ఈ యాక్ పాలు చాలా ప్రత్యేకం. ఇవి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, టిబెటన్లు, ఇతర పర్వత నివాసుల ఆహారంలో ఈ పాలను తప్పనిసరి తీసుకుంటారు. ఈ పాలు చిక్కగా, ఎక్కువ కొవ్వులతో ఉండటంతో వెన్న, చీజ్ తయారీకి అనుకూలంగా ఉంటాయి.అపోహలు నిజాలుపాలు తాగితే బరువు పెరుగుతారు!ఇది నిజం కాదు. పాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు బరువును పెంచుతాయా లేదా అనేది మీరు తీసుకునే పాల రకం (ఫుల్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్), తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్ తొలగించిన పాలను తీసుకుంటే క్యాలరీ కంటెంట్ తగ్గుతుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.పాలను ఎక్కువగా కాగబెడితే పోషకాలు తగ్గుతాయి!ఇది పూర్తిగా తప్పు. పాలను కాగబెట్టడంతో అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది, పాలు తాగడానికి సురక్షితంగా మారతాయి. పదేపదే మరిగించడంతో పోషకాలకు ఎటువంటి హాని జరగదు.పాలు ఎముకల నుంచి కాల్షియంను బయటకు తీస్తాయి!ఈ అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.పాలు తాగితే కఫం ఉత్పత్తి అవుతుంది!ఈ వాదన పూర్తిగా సరైనది కాదు. దగ్గు సమయంలో స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడంతో కఫం పెరుగుతుందని కొందరు నమ్ముతారు, కానీ పాలు తాగడానికి, కఫం ఉత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేదు.పాలు మొటిమలు రావడానికి కారణమవుతాయి!పాల వినియోగం, మొటిమల మధ్య ప్రత్యక్ష సంబంధానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుశాస్త్రం, హార్మోన్లు, మనం తీసుకునే ఆహారం వంటి ఎన్నో అంశాలు చర్మ ఆరోగ్యంలో కీలకంగా మారతాయి.తల్లిపాలు పట్టిస్తున్నప్పుడు తల్లి అనారోగ్యంతో ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదు!అనారోగ్యంతో ఉన్న తల్లి, తన పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు. తల్లికి అనారోగ్యంగా ఉంటే, ఆమె శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అవి శిశువులకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది.ముర్రుపాలు బిడ్డకు పట్టించకూడదు!ప్రసవానంతరం లేత పసుపు రంగులో వచ్చే ముర్రుపాలు బిడ్డకు చాలా ముఖ్యమైనవి. అవి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, పోషకాలను నిండి ఉంటాయి.పాలు లాభాలుపాలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అవి పోషకాల మిశ్రమం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కీలకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. మన రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదపడతాయి. పాలలో ఉండే ప్రధాన పోషకాలు, అవి మన శరీరానికి చేసే మేలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.విటమిన్–ఎఇది కంటిచూపుకు ఎంతో అవసరం. కణాల పెరుగుదలను ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.విటమిన్–డిఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. శరీరం క్యాల్షియంను సమర్థంగా గ్రహించేలా చేస్తుంది. దాంతో ఎముకలకు పటుత్వం లభిస్తుంది.విటమిన్–బి3 (నియాసిన్) మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.విటమిన్–బి5 (పాంటోథెనిక్ ఆమ్లం)శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది.విటమిన్–బి12నాడీవ్యవస్థ పనితీరుకు, డీఎన్ఏ నిర్మాణానికి ఇది అత్యవసరం.విటమిన్–ఈఇవి పాలలో తక్కువ శాతం ఉంటాయి. అయితే పాలిచ్చే జంతువులను బట్టి, అవి తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వ్యత్యాసం ఉంటుంది. మనిషి పాలలో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది.క్యాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, వాటి దారుఢ్యాన్ని కాపాడటానికి ఇది ప్రధాన పోషకం.ఫాస్ఫరస్క్యాల్షియంతో కలిసి ఎముకలు, దంతాల నిర్మాణానికి ఫాస్ఫరస్ దోహదపడుతుంది.అయోడిన్థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ కీలకమైనది, ఇది శరీర విధులను నియంత్రిస్తుంది.సెలీనియంఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, వాటికి రక్షణ కల్పిస్తుంది.జింక్రోగనిరోధక శక్తిని కాపాడటంలో జింక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గాయాలు త్వరగా మానేలా కూడా చేస్తుంది.ప్రొటీన్కండరాల పెరుగుదలకు ప్రొటీన్ అత్యవసరం. కణజాలం నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం కోలుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.కార్బోహైడ్రేట్స్పాలలోని లాక్టోస్ ఒక కీలకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.కొవ్వులుకొవ్వులు శరీరానికి శక్తినిస్తాయి. అలాగే విటమిన్లు(ఎ, డి, ఈ వంటివి), శరీరంలో ఇముడ్చుకోవడానికి ఈ కొవ్వులు ఎంతగానో తోడ్పడతాయి.నిజానికి లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. వాటికి బదులుగా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొక్కల ఆధారిత పాలు (సోయా మిల్క్, బాదం మిల్క్) వంటివి తీసుకోవచ్చు. పాలు అలవాటు ఉన్నవారు, పాలు తాగడంతో ఎలాంటి సమస్య లేనివారు ఏదో ఒక రూపంలో, తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. -
కృషి ఉంటే కావ్య అవుతారు!
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైనా నెలనెలా బంగారు గుడ్డు పెట్టే బాతులానే చూస్తారు. పైగా కావ్యా ధొబాలే–దత్ఖిలే జీతం నెలకు 76 వేలు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక సయాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు తను! చిన్న వయసులోనే అంత పెద్ద ఆసుపత్రి, అంత పెద్ద జీతం అంటే మున్ముందు సర్వీసుతో పాటు పెరిగే జీతం లక్షల్లోనే కదా ఉంటుంది! అయితే కావ్య ఈ లెక్కలేమీ వేసుకోలేదు. ఆసుపత్రి ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యవసాయ క్షేత్రం వైపు మళ్లారు!కావ్య లక్ష్యం ఏమిటి? ఏం లేదు, మనుషుల ఆరోగ్యం కాపాడటం మాత్రమే. సయాన్ ఆసుపత్రిలో ఆ పనే కదా ఆమె చేస్తున్నారు! కానీ అంతకుమించి, అసలు మనుషులకు ఆసుపత్రి అవసరమే కలుగకుండా చేసే పనిని ఆమె ఎంచుకున్నారు. ఎలాగంటే – వర్మి కంపోస్ట్తో పండించే పంటల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలుసుకున్న కావ్య ఏకంగా వర్మి కంపోస్ట్ ఉత్పత్తినే ప్రారంభించారు! అంతేకాదు, రసాయన రహిత పంటల గురించి అవగాహన కల్పించటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 200 మంది ఔత్సాహిక వర్మి కంపోస్ట్ వ్యవస్థాపకులకు శిక్షణ ఇచ్చారు. అంటే – కావ్య తన లాంటి కావ్యల్ని వందలాదిగా తయారు చేశారు. కారణం లేదు.. ప్రేరణ ఉంది ఎవరైనా ఉద్యోగం మానటానికి, ఉద్యోగం మారటానికి ఒక కారణం ఉంటుంది. కానీ కావ్య ఉద్యోగం వదలి వ్యవసాయంలోకి రావటం వెనుక ఒక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ వెనుక.. ఇతరులకు సహాయం చేయాలని చిన్నప్పట్నుంచీ ఆమెతో పాటు ఎదుగుతూ వస్తున్న తపన ఉంది. ఆ తపనే ఆమెను మొదట నర్సింగ్ కోర్సు వైపు మళ్లించింది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీలో డిప్లొమా చేశాక, ముంబైలోని ‘లోకమాన్య తిలక్ మునిసిపల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్’లో (ఇదే సయాన్ హాస్పిటల్) నర్సుగా చేరారు కావ్య. తర్వాత టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండేళ్లు పని చేశారు. 2017లో నర్సింగ్లో బీఎస్సీ పూర్తి చేశాక ఏడాది పాటు ఒక ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ పాఠాలు చెప్పారు. ఆ తర్వాత తిరిగి సయాన్ ఆసుపత్రిలో ఉద్యోగిగా చేరి స్టాఫ్ నర్స్ అయ్యారు. అలా చేరటమే ఆమె కెరీర్ను వ్యవసాయం వైపు మలుపు తిప్పింది. అన్ని మరణాలను చూశాక..!2019 నుంచి 2022 వరకు సయాన్ లో నర్సుగా ఉన్నారు కావ్య. అది కరోనా వ్యాపించిన పాడు కాలం. నర్సుగా ఆమె కొన్ని నెలల పాటు అనేక మంది తన కళ్ల ముందే కరోనాతో మరణించటాన్ని దగ్గరగా చూశారు. దాంతో ఆమె జీవిత దృక్పథమే మారిపోయింది. ‘‘నేను కూడా అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డాను. దాదాపుగా మరణశయ్యపై ఉన్నాను. కానీ నా రోగ నిరోధక శక్తి నన్ను రక్షించింది. మనం పండిస్తున్న, మనం తింటున్న రసాయనాలతో కూడిన ఆహారం వల్ల మన శరీరాలు బలహీనమౌతున్నాయని నాకు అర్థమైంది. అప్పుడే నేనొక నిర్ణయానికి వచ్చాను. రసాయనాల జాడలు లేని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను’’ అంటారు కావ్య. ఉద్యోగం వదలి వర్మి కంపోస్ట్లోకిఅయితే అందుకోసం ఉద్యోగం మానేయాలన్న కావ్య నిర్ణయాన్ని ఆసుపత్రిలో, ఇంట్లో, బంధువుల్లో ఎవరూ హర్షించలేదు. ఆమె భర్త రాజేశ్ దత్ఖిలే ఒక్కరే ఆమె వైపు నిలబడ్డారు. అలా 2022లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై నుంచి భర్త స్వగ్రామమైన పుణె దగ్గరి జున్నార్కు మారిపోయారు కావ్య. అక్కడే ఆమె వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేయటం మొదలు పెట్టారు. దాని కన్నా ముందు వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేయాలో కొన్ని నెలల పాటు వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అలా ఆసుపత్రి బెడ్ల మధ్య నుంచి వర్మి కంపోస్ట్ ‘బెడ్’ల మధ్యకు వచ్చారామె.కిలో వానపాములే పెట్టుబడి‘‘నా ప్రారంభ పెట్టుబడి సున్నా. 2022 ఆగస్టులో ఒక రైతు నుంచి కిలో వాన పాములను తీసుకుని చిన్న ‘బెడ్’తో (ఎత్తు మడి) పనిలోకి దిగాను. ఆవు పేడలో వాన పాములను జోడించాను. వాటికి ఆహారంగా ఇతర పశువుల పేడ, రాలిన చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగించాను. 2022 అక్టోబర్ నాటికి తొలి విడత వర్మి కంపోస్ట్ సిద్ధమైపోయింది’’ అని ఎంతో ఎగ్జయింట్గా చెబుతారు కావ్య. తర్వాత ‘బెడ్’ల సంఖ్య పెరిగింది, వర్మి కంపోస్ట్ ఉత్పత్తీ పెరిగింది. చివరికి అదొక వ్యాపారంగానూ మారింది.ఈ ఆర్థిక సంవత్సరానికి కావ్య టర్నోవర్ ఎంతో తెలుసా? 24 లక్షల రూపాయలు! టర్కీ, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు ‘కృషి కావ్య బ్రాండ్’ పేరుతో కావ్య వర్మి కంపోస్ట్ ఎగుమతి అవుతోంది. కావ్య దగ్గర శిక్షణ తీసుకున్న రెండు వందల మందీ మహారాష్ట్ర వ్యాప్తంగా వర్మి కంపోస్ట్ను తయారు చేస్తూ ఆరోగ్యవంతమైన ప్రకృతి వ్యవసాయానికి తోడ్పతున్నారు. తామూ ఉపాధి పొందుతున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
వేచవుల మామిడి
వేసవిలో మామిడి సందడి తెలియనిది కాదు. పండ్లలో రారాజైన మామిడి రుచికైనా, ఆరోగ్యానికైనా ముందు వరుసలోనే నిలుస్తుంది. భిన్న ఆకారాలు, విభిన్న పరిమాణాలలో పండుతున్న మామిడి పండ్లలో నాణ్యతను గుర్తించడం ఎలా.? అసలు సిసలు మామిడి రుచులను ఎన్నుకోవడం ఎలా? మ్యాంగో లవర్స్కి ఇది పెద్ద సమస్యే. అయితే, మామిడిలో నిజమైన, అసలైన రుచులను చవిచూడాలంటే జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) పొందిన మామిడి రకాల వివరాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలు తెలుసుకుందామా?లంగ్డా(ఉత్తరప్రదేశ్)వారణాసి ప్రాంతానికి చెందిన ఈ మామిడి పండు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. కొద్దిగా పులుపు, తీపితో చాలామందికి ఇది నచ్చుతుంది. పైగా ఈ కాయ, ముగ్గిన తర్వాత కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది.కుట్టియత్తూర్ (కేరళ)కేరళలోని కన్నూర్ జిల్లాలో పండించే ఈ మామిడి పండు మృదువైన, మచ్చలేని తొక్కతో ఉంటుంది. మెత్తని గుజ్జుతో తీపిగా చాలామందికి నచ్చుతుంది. ఇది సాధారణంగా చాలామంది ఇంటి పెరటిలో భాగమైంది.బంగినపల్లి – బనగానపల్లె (ఆంధ్రప్రదేశ్) ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన ఈ మామిడి పండు తీపి రుచితో పాటు తక్కువ పీచు ఉంటుంది. అంతా గుజ్జే ఉంటుంది. పైగా ఎక్కువ కాలం నిల్వ ఉండటమే దీని ప్రత్యేకత.మలిహాబాది దసేహరి (ఉత్తరప్రదేశ్)ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్ ప్రాంతంలో పండించే ఈ మామిడి రకం తియ్యటి రుచి, చక్కటి సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని సారవంతమైన నేల, వాతావరణం దీని ప్రత్యేకమైన రుచికి కారణం అవుతాయి.రతౌల్ (ఉత్తరప్రదేశ్)ఇవి ఉత్తరప్రదేశ్, బాగ్పత్ జిల్లా, రతౌల్ గ్రామంలో పండే ఒక ప్రత్యేకమైన మామిడి రకం. పాకిస్తాన్ లో కూడా ఈ రతౌల్ మామిడి సాగు చేస్తారు. అయితే భారతదేశంలో దీనిని రతౌల్ అని పిలిస్తే, పాకిస్తాన్ లో అన్వర్ రతౌల్ అని పిలుస్తారు.జర్దాలు (బిహార్) బిహార్లోని భగల్పూర్ ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు లేత పసుపు రంగులో ఉంటుంది. దీని సువాసన మరింత ఆకట్టుకుంటుంది. వీటిని ఎక్కువగా బహుమతులుగా ఇస్తుంటారు.హిమసాగర్ (పశ్చిమ బెంగాల్) పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, నాదియా జిల్లాల్లో పండించే ఈ మామిడిపండు పీచు లేని గుజ్జుతో తియ్యగా ఉంటుంది. వీటి పరిమళాన్ని చాలామంది ఇష్టపడతారు.గిర్ కేసర్ (గుజరాత్)గుజరాత్లోని గిర్నార్ కొండల ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు కుంకుమపువ్వు రంగు గుజ్జుతో, తియ్యని రుచికి ప్రసిద్ధి చెందింది. దీనిని ‘మామిడిపండ్ల రాణి’ అని పిలుస్తారు.కరి ఇషాద్ (కర్ణాటక) కర్ణాటక తీర ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు తియ్యటి గుజ్జుతో, ప్రత్యేకమైన రుచితో ప్రసిద్ధి చెందింది. దీనిని సాధారణంగా తొక్క, టెంకతో సహా మొత్తం తింటారు.అల్ఫోన్సో (మహారాష్ట్ర)‘మామిడిపండ్ల రాజు’ అని పిలువబడే అల్ఫోన్సో మ్యాంగో అద్భుతమైన రుచి, మృదువైన ఆకృతి, ఆకర్షణీయమైన సువాసనతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్గఢ్ ప్రాంతాలలో ఇది ప్రత్యేకంగా పండుతుంది.ఫజ్లీ (పశ్చిమ బెంగాల్) ఇది ఆలస్యంగా పరిపక్వం చెందే మామిడి రకం. అంటే ఇతర మామిడి పండ్లతో పోలిస్తే ఇవి సీజన్లో ఆలస్యంగా పండుతాయి. ఇవి బరువు ఎక్కువగా, పెద్ద పరిమాణంలో కాస్తాయి. వీటిని బంగ్లాదేశ్లో కూడా పండిస్తారు. వీటిని జామ్లు, పచ్చళ్ళ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.లక్ష్మణ్ భోగ్ (పశ్చిమ బెంగాల్)ఈ తియ్యటి మామిడిని పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో పండిస్తారు. వీటిని అధికంగా యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.అప్పెమిడి (కర్ణాటక)దీన్ని కర్ణాటకలో మల్నాడు ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది. ఎక్కువగా ఊరగాయలకు వినియోగిస్తారు. ఈ జాతిలో కచప్ప అప్పెమిడి, కర్నాకుండల అప్పెమిడి వంటి అనేక ఉప రకాలు ఉన్నాయి. అవన్నీ ప్రత్యేకమైన రుచిని, సువాసనను కలిగి ఉంటాయి.మరాఠ్వాడా కేసర్ (మహారాష్ట్ర)ఇవి మహారాష్ట్రలోని, మరాఠ్వాడా ప్రాంతంలో సాగు చేసే ఒక రకం మామిడి. ఈ మామిడి కుంకుమపువ్వు రంగుతో గాఢమైన రుచికి, తియ్యదనానికి ప్రసిద్ధి చెందింది. జీఐ ట్యాగ్ ఉన్న మామిడి పండ్లనే ఎన్నుకుని కొనుగోలు చేయడంతో నాణ్యమైన పండ్లు తినొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటినే ఎంచుకుని, కొనుగోలు చేయడంతో ఆయా పంటను పండించే రైతులకు మద్దతు ఇస్తున్నట్లు కూడా అవుతుంది. మరోవైపు ప్రపంచ దేశాల్లో మన దేశీయ వ్యాపారం మెరుగుపడుతుంది. -
క్రిమినల్... కిడ్నాపర్స్
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు జి.కృష్ణంరాజును 2006 సెప్టెంబర్13న దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయన పెంపుడు శునకాన్ని కూడా వారు ఎత్తుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసు అధికారుల్లో ఒకరికి వచ్చిన ‘విసిగించే కాల్’ విలువైన సమాచారం ఇచ్చింది.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్కు వచ్చి, బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్సుఖ్నగర్లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు. అది నష్టాల్నే మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలబాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి, జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్ అవతారం ఎత్తిన సురేష్, పలువురు బడా బాబుల్ని కిడ్నాప్ చేసి, భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ప్రతి నేరానికి ముందూ ఓ ముఠా కట్టే సురేష్ ఒకసారి వినియోగించిన అనుచరుడిని మరోసారి వాడడు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్భంధించేవాడు. కొందరినైతే వాహనంలోనే ఉంచుకుని, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి డబ్బు వసూలు చేసేవాడు. తిరుపతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చేయడానికి పథకం వేసిన సురేష్ 2006 ఏప్రిల్లో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చి హైదరాబాద్కు మకాం మార్చాడు. ఘరానా కిడ్నాపర్ గౌరు సురేష్ కన్ను జి.కృష్ణంరాజుపై పడింది. బి.సురేష్ కుమార్, ఎ.పరమేష్, కె.శ్రీనివాస్, కె.వెంకన్న, బి.నాగేశ్వరరావులతో ముఠా కట్టాడు. వీరిలో ఇద్దరు సస్పెన్షన్లో ఉన్న పోలీసులు. 2006 సెప్టెంబర్ 9న యూసుఫ్గూడలోని ఒక లాడ్జిలో గదులు బుక్ చేసుకున్న ఈ గ్యాంగ్ అక్కడే బస చేసింది. మూడు రోజుల పాటు జి.కృష్ణంరాజు కదలికలను నిశితంగా గమనిస్తూ, రెక్కీ చేసింది. ఈ కిడ్నాప్కు ముందు సురేష్ టవేరా వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. కిడ్నాప్ తర్వాత కృష్ణంరాజును దాచి ఉంచడానికి జగద్గిరిగుట్ట సమీపంలో ఉన్న ఎల్లమ్మ బండను ఎంచుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అక్కడ ఫామ్హౌస్ ఉండేది. ఆయన వీకెండ్స్లో కుటుంబంతో వెళ్లి అందులో గడిపేవారు. మిగిలిన రోజుల్లో కాపలాదారుడి దగ్గరే ఆ ఫామ్హౌస్ తాళాలు ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న సురేష్ రెండు రోజుల కోసం ఫామ్హౌస్ ఇస్తే రూ.లక్ష ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. తన యజమానులు వారాంతాల్లో వస్తుండటం, సురేష్ కోరింది బుధ, గురువారాలు కావడంతో ఆ కాపలాదారు అంగీకరించాడు. 2006 సెప్టెంబర్ 13, బుధవారం లాడ్జి నుంచి బయలుదేరిన సురేష్ గ్యాంగ్, వాకింగ్ కోసం బయటకు వచ్చిన కృష్ణంరాజును ఆయన పమేరియన్తో సహా కిడ్నాప్ చేసింది. టవేరా వాహనంలో వెళ్తూ మాదాపూర్ ప్రాంతంలో ఆ శునకాన్ని కారు నుంచి బయటకు విసిరేసింది. టవేరా వాహనాన్ని సురేష్ నేరుగా ఎల్లమ్మబండకు తీసుకువెళ్లాడు. అయితే ఆ రోజు అనుకోకుండా ఫామ్హౌస్ యజమాని అక్కడకు రావడంతో కాపలాదారు చేతులెత్తేశాడు. దీంతో సురేష్ తనకు షెల్టర్ ఇచ్చే ఇతర వ్యక్తులు ఎవరనేది ఆలోచించాడు. ఇలా అతడికి గుర్తుకు వచ్చిన పేరే ఇక్బాల్ (పేరు మార్చాం). ఘరానా నేరగాడైన ఇక్బాల్తో సురేష్కు చంచల్గూడ జైలులోనే పరిచయం ఏర్పడింది. నగర పోలీసులకు ఉన్న ఇన్ఫార్మర్స్లో ఇక్బాల్ కూడా ఒకడు. అతడు వంద ఫోన్లు చేస్తే అందులో 95 మద్యానికి అవసరమైన డబ్బు కోసమే అయుండేది. దీంతో పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో అతడి ఫోన్లు ఎత్తేవాళ్లు కాదు. ఒకవైపు కృష్ణంరాజు కిడ్నాప్ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు ఈ కేసుపై వరుస సమావేశాల్లో బిజీగా ఉన్నారు. సురేష్ తన వద్ద ఉన్న ఫోన్కు కేవలం అవసరమైనప్పుడు ఆన్ చేస్తుండటంతో దర్యాప్తు మరింత కష్టసాధ్యమైంది. మరోవైపు ఎల్లమ్మబండలో షెల్టర్ దొరక్కపోవడంతో సురేష్– ఇక్బాల్కు అసలు విషయం చెప్పి, రెండు రోజుల కోసం షెల్టర్ కోరాడు. ఈ విషయంపై టాస్క్ఫోర్స్లో తనకు నమ్మకస్తుడైన అధికారికి ఉప్పందించాలని భావించిన ఇక్బాల్, ఆయనకు వరుసపెట్టి ఫోన్లు చేశాడు. అయితే కృష్ణంరాజు కేసు బిజీలో ఉన్న ఆ అధికారి ఫోన్ కాల్ను కట్ చేస్తూ పోయారు.అయినా పట్టువదలని ఇక్బాల్ పదేపదే కాల్స్ చేస్తుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేయడానికి ఫోన్ లిఫ్ట్ చేశారు.‘సాబ్ సిటీ మే కోయీ కిడ్నాప్ హువా క్యా’ అని ఇక్బాల్ అడగడంతో ఆ అధికారి అప్రమత్తమయ్యారు. సురేష్కు ఆశ్రయం ఇస్తానని చెప్పాలని, ఆపై అతడి ముఠాను తమకు పట్టించాలని కోరారు. దీనికి అంగీకరించిన ఇక్బాల్– సురేష్కు ఫోన్ చేసి కూకట్పల్లి వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఇక్బాల్ను రోడ్డు పైన ఉంచిన పోలీసులు కాస్త దూరంలో కాపు కాశారు. సురేష్ టవేరాలో ఇక్బాల్ వద్దకు వచ్చి, అతడినీ ఎక్కించుకుని ఉడాయించేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఇక్బాల్ కొద్దిదూరం వెళ్లాక డ్రైవింగ్ సీటులోకి మారాడు. పాతబస్తీలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇల్లు సిద్ధంగా ఉందని చెప్తూ, వాహనాన్ని సిటీలోకి తీసుకువచ్చాడు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు నాంపల్లిలోని ఓ హోటల్ అడ్డాగా ఉండేది. అక్కడ ఏ సమయంలో అయినా కొందరు అధికారులు, సిబ్బంది ఉండేవాళ్లు. వేగులతో సమావేశాలను అక్కడే ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇక్బాల్కు ఈ విషయం తెలుసు. ఆ హోటల్ సెల్లార్ కేవలం ఓ చిన్న కారు పట్టేంత మాత్రమే ఉండేది. దీనిపై అవగాహన ఉన్న ఇక్బాల్, కారును నేరుగా సదరు హోటల్ సెల్లార్లోకి తీసుకువెళ్లిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశాడు. హుటాహుటిన సెల్లార్లోకి దూసుకువచ్చిన అధికారులు సురేష్ ముఠాను పట్టుకోవడంతో పాటు కృష్ణంరాజును రెస్క్యూ చేశారు. ఇక్బాల్ను అభినందించిన పోలీసులు రివార్డు సైతం అందించారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. -
సంతప్తకుడు పంచప్రేతాలు
పూర్వం సంతప్తకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సంసార వ్యామోహం లేనివాడై, తపోవృత్తితో జీవించేవాడు. తపోబలంతో పాపరహితుడై, అరణ్యాలలో సంచరిస్తూ ఉండేవాడు. బాహ్యచిత్తవృత్తులను నిరోధించి, ఇంద్రియాలను జయించాలనే తలపుతో అతడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అటవీమార్గంలో ప్రయాణిస్తుండగా, సంతప్తకుడు దారితప్పిపోయాడు. కాకులు దూరని కారడవిలాంటి కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అడవిలో మహావృక్ష్యాలు, నేలంతా పాకి ఉన్న లతలు, గుబురుగా వ్యాపించి ఉన్న పొదలు నిండి ఉండటంతో అతడికి దారీ తెన్నూ కానరాలేదు. అక్కడక్కడా క్రూర జంతువులు, సాధు జంతువులు, పక్షులు తప్ప ఆ కీకారణ్యంలో ఎక్కడా నరసంచారం లేదు. సంతప్తకుడికి భయం కలగలేదు గాని, దారి తోచలేదు. దైవసంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని అనుకుంటూ ముందుకు సాగాడు. ఇంతలో చీకటి పడింది. అసలే కీకారణ్యం, ఆపై చిమ్మచీకటి. కీచురాళ్ల రొద, కర్ణకఠోరంగా గుడ్లగూబల అరుపులు, అక్కడక్కడా క్రూరమృగాల గర్జనలు వినిపించసాగాయి. అయినా సంతప్తకుడు ఆగలేదు. ముందుకు నడవసాగాడు. ఇంతలో అత్యంత జుగుప్సాకరమైన దృశ్యం కనిపించడంతో, నిశ్చేష్టుడై అక్కడే నిలిచిపోయాడు.ఒక మర్రిచెట్టు వద్ద ఐదు ప్రేతాలు ఒక శవాన్ని పీక్కు తింటున్నాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. మనిషి అలికిడి వినిపించడంతో ప్రేతాలు తేరిపార చూశాయి. వాటికి సంతప్తకుడు కనిపించాడు. అతడిని చూసి, ప్రేతాలు ఆనందంగా గంతులు వేశాయి. ‘వీణ్ణి నేను తింటాను’ అంటే ‘నేను తింటాను’ అంటూ అవి అతడి వైపు పరుగుతీశాయి. అతడి కాళ్లను రెండు ప్రేతాలు, చేతులను రెండు ప్రేతాలు పట్టుకోగా, ఐదో ప్రేతం తల పట్టుకుంది. అవన్నీ అతడిని తీసుకుని ఆకాశంలోకి ఎగిరాయి. కిందనున్న శవంలో ఇంకా మాంసం ఉండటంతో, దానిని వదిలేయడం ఇష్టంలేక మళ్లీ కిందకు వచ్చి, దానిని కాళ్ల మధ్య ఇరికించుకుని, మళ్లీ పైకిలేచి ఎగరసాగాయి. ఈ పరిణామానికి సంతప్తకుడు భయభ్రాంతుడై, తనను ఆపద నుంచి గట్టెక్కించమంటూ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాడు.సంతప్తకుని ప్రార్థనకు కరిగిన మహావిష్ణువు తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన అక్కడకు చేరుకునే సరికి సంతప్తకుడు ప్రేతాల మూపులపై హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. మహావిష్ణువు సంతప్తకుడిని తీసుకుపోతున్న ప్రేతాలను అనుసరించసాగాడు. తోవలో మణిభద్రుడు అనే యక్షరాజు కనిపించాడు. విష్ణువు అతడికి కనుసైగ చేయడంతో అతడు ప్రేతాలకే భయంగొలిపే భీకరరూపం దాల్చి వాటి ఎదుట నిలిచాడు. మణిభద్రుడి భీకరాకారాన్ని చూసి ఆ ప్రేతాలు కొయ్యబారిపోయాయి. అతడు రెండు ప్రేతాలను చేతుల్లోను, రెండు ప్రేతాలను కాళ్లలోను చిక్కించుకుని, మరో ప్రేతాన్ని నోట కరచుకున్నాడు. వాటి చేతుల నుంచి సంతప్తకుడిని విడిపించాడు. పంచప్రేతాలనూ పిడిగుద్దులతో ఒళ్లు హూనం చేశాడు. ప్రేతాల వద్దనున్న శవం పట్టుకుని, అతడు మాయమైపోయాడు.మణిభద్రుడి శిక్షతో, మహావిష్ణువు దయతో ఆ పంచప్రేతాల పాపాలు నశించాయి. మానవాకృతిలో సంతప్తకుడి ముందు మోకరిల్లి, ‘బ్రాహ్మణోత్తమా! మమ్మల్ని క్షమించు. విష్ణుభక్తుడవైన నిన్ను అపహరించి, ఆరగించాలనుకున్నాం. మా పొరపాటుకు మన్నించు’ అని కోరారు.‘బాబూ! మీరెవరు? ఇదంతా మాయా? లేక నా చిత్తభ్రమా?’ అని ప్రశ్నించాడు సంతప్తకుడు.‘విపోత్తమా! మాయా కాదు, భ్రమా కాదు. మేం ప్రేతాలం. పూర్వజన్మ పాపాల ఫలితంగా ప్రేతాలుగా మారాం’ అని చెప్పారు.‘మీ పేర్లేమిటి? మీకీ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది?’ అడిగాడు సంతప్తకుడు.‘మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు’ చెప్పాయి ప్రేతాలు.పూర్వజన్మలో అమాయకుల పట్ల, సాధుజనుల పట్ల చేసిన అపచారాలను, అఘాయిత్యాలను పొల్లు పోకుండా చెప్పుకుని, పశ్చాత్తాపం వ్యక్తం చేశాయి. ప్రేత రూపాల్లో తాము పడుతున్న అగచాట్లను వివరించాయి.సంతప్తకుడు ప్రేతాల బాధలను వింటుండగా, మహావిష్ణువు అతడి ఎదుట సాక్షాత్కరించాడు.మహావిష్ణువును చూడగానే సంతప్తకుడు పులకాంకితుడయ్యాడు. వెంటనే విష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనను రకరకాలుగా స్తుతిస్తూ స్తోత్రపఠనం మొదలుపెట్టాడు. సంతప్తకుడి సన్నిధిలో ఉండటం వల్ల ప్రేతాలు కూడా విష్ణువును ప్రత్యక్షంగా చూడగలిగాయి. మహావిష్ణువు దర్శనమాత్రంతోనే ఆ ప్రేతాల జన్మాంతర పాపాలన్నీ పూర్తిగా నశించాయి.‘ప్రాణులను ఉద్ధరించేది నీవే, పాపాలను పరిహరించేదీ నీవే! పూర్వజన్మ పాపాలకు ఏళ్లతరబడి అగచాట్లు పడుతున్న ఈ ప్రేతాలకు ఉత్తమగతులను ప్రసాదించు స్వామీ’ అని ప్రార్థించాడు సంతప్తకుడు.అతడి ప్రార్థనకు మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు.గంధర్వులు, అప్సరలతో కూడిన ఆరు దివ్యవిమానాలను అక్కడకు రప్పించాడు.సంతప్తకుడిని, అతడితో పాటు పంచప్రేతాలను ఆ విమానాల్లో వైకుంఠానికి తీసుకుపోయాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: పూలమ్మి
ఒక పూల పరిమళం నన్ను ఆవహించిన వేళ– ఒక శూన్యం, నా నుంచి వీడ్కోలు తీసుకునే సమయం నేను ఊహించని సంఘటన– ఘటన. ఒక నటన, నన్ను పూలమ్మికి దగ్గర చేసింది. వేసవి సాయంకాలం, సముద్రం ఒడ్డున సేదతీరే సమయం. అలలు అప్పుడప్పుడు వచ్చి పాదాలను పలకరిస్తూ, వెనక్కి వెళ్తూ, మళ్ళీ అల్లరిగా ముందుకు వస్తూ దోబూచులాడుతున్నాయి.ప్రతిరోజు చీకటి పడగానే బీచ్కు రావడం రామకృష్ణకు ఆనవాయితీ.బీచ్తో రామకృష్ణకు, రామకృష్ణ (ఆర్కే) బీచ్కి అనుబంధం పెరిగిపోవడానికి కారణం పూ..ల...మ్మి..పెళ్లికాని రామకృష్ణకు పెళ్ళైన పూలమ్మితో పరిచయం. రామకృష్ణకి పెళ్లి కాకపోవడానికి కారణం రామకృష్ణే!అతని జీవితంలో పెళ్లి అనే పదాన్ని వివిధ రూపాల్లో చూశాడు. పెళ్లితో ఒక్కటైనా అమ్మానాన్నల గొడవలు మొదలు, స్నేహితుల కష్టాలు, స్వేచ్ఛ కోల్పోవడాలు చూశాడు.‘సరదాగా స్నేహితులతో మందు కొట్టడానికి కూడా స్వేచ్ఛలేని పెళ్లి’ అని తరచూ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు రామకృష్ణ.ఆడవాళ్ళు పెళ్లి కాకముందు, మగవాళ్ళు పెళ్లయ్యాక భర్తలుగా మారాక, అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించి అబద్ధాలు చెప్పడం, నేర్చుకోవడం మొదలు పెడతారని చెబుతాడు. ఇలాంటి చాలా కారణాలకు తోడు అతడిని ఇంప్రెస్ చేసే అమ్మాయి తారసపడలేదు. అందుకే బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని డిసైడయ్యాడు. ఆఫీస్ వదలగానే, ‘ఎక్కడికెళ్లారు? ఎప్పుడొస్తారు? ఏం చేస్తున్నారు? ఎవరితో ఉన్నారు? వాట్సాప్ వీడియో కాల్ చెయ్’..లాంటి సమస్యలు లేవు కాబట్టి, పెళ్ళైన ఫ్రెండ్స్ బుద్ధిగా, భయంగా ఆఫీస్ వదలగానే ఇంటిముఖం పడతారు కాబట్టి, తనకు అలాంటి బాదరబందీలు లేవు కాబట్టి, ఆఫీస్ వదలగానే ‘ఓ రోజు అలా జగదాంబ సెంటర్కు, మరో రోజు గుడికి, ఇంకో రోజు రామకృష్ణ బీచ్కు వెళ్తూ ఉంటాడు.అలా ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది పూలమ్మి. పరిచయం అయ్యింది అనడం కన్నా తారసపడింది అనాలేమో!సాధారణంగా రామకృష్ణకు గుడికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు కాని, ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది. నిండుగా చీర కట్టుకుని, ఒద్దికగా పూలసజ్జతో గుడికి వచ్చే అమ్మాయిలను చూస్తుంటే, ఒక మంచి పెయింటింగ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.పెందరాళే ఇంటికి వెళ్లి ఒరగబెట్టే రాచకార్యాలు లేకపోవడం వల్ల ఇలా చేస్తాడు. తన ఫ్రెండ్ తమ్ముడు శ్రీధర్ దీనికి పెట్టిన పేరు ‘టీపీ టైం’– టైం పాస్ టైం.అలా ఆ రోజు సాయిబాబా గుడికి వచ్చాడు. గుడి బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అతని దృష్టి పూలు అమ్మే అమ్మాయి మీద పడింది.గుడికి వచ్చిన అమ్మాయిల అందమంతా ఆమెలోనే కనిపించింది. వైజాగ్ అమ్మాయిల నవ్వులన్నీ ఆమె పెదవుల్లో కనిపించాయి. కాటన్ చీరలో, చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేంత అందం.అలాంటి అందం పూలమాల కట్టి అమ్ముతుంటే, ఆమె అందమే పువ్వుల్లో చేరి పరిమళాలు వెదజల్లుతుందేమో అనిపించింది.మాట్లాడుతున్న ఫోన్ను మధ్యలో కట్ చేశాడు. చేతిలోని స్మార్ట్ఫోన్ జేబులోకి వెళ్ళింది. అతని కాళ్ళు ఆమె వైపు కదిలాయి.‘రండి సర్, రండి మేడం’ అంటూ వచ్చేవారిని చిరునవ్వుతో పలకరిస్తోంది. పొడవాటి సన్నటి చేతివేళ్ళు పువ్వులను మాలగా కడుతుంటే, ఆ పువ్వులు పులకరించి పోతున్నట్లు వుంది.‘సర్ పూలు కావాలా?’ అడిగింది రామకృష్ణను చూసి.‘వద్ద’ంటూనే పర్స్లో నుంచి డబ్బులు తీశాడు.‘ఎన్ని మూరలు సర్...’ అంటూనే చేత్తో మూరలు కొలుస్తుంటే, తన మనసును కొలుస్తున్నట్టు అనిపించింది.శనివారం వేంకటేశ్వరస్వామి గుడిలో కనిపించింది. శుక్రవారం మరో గుడిలో– ఎప్పుడు కలిసినా పూలు కొంటూనే వున్నాడు.ఇంటికి వెళ్ళాక అతని మంచం పక్కనే ఆ పూలు టీపాయ్ మీద పేరుకు పోతూనే ఉన్నాయి.ఆమె మెడలో మెరిసే పసుపుతాడు, నుదుట సిందూరం, కాలివేళ్లకు మెట్టెలు, ఆమెకు పెళ్లయిందని చెప్పకనే చెబుతున్నాయి. అయినా ఆమెను చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్.ఒకరోజు నవ్వుతూ అన్నాడు. ‘నీ దగ్గర పూలు కొనడానికి రోజుకో గుడి దగ్గరికి రావలసి వస్తోంది’ అని.ఆమె ఏమాత్రం అతడిని నొప్పించకుండా ‘బీచ్లో అయితే రోజూ సాయంత్రం నుంచి చీకటి పడే వరకు ఉంటాను. మేడం కోసం పూలు కొనాలనుకుంటే అక్కడికి రండి’ అంది అదే చిరునవ్వుతో.అలా అతనికి ఆమె ద్వారా, బీచ్తో మరింత అనుబంధం పెరిగింది.సాయంత్రం ఆఫీస్ వదలగానే బీచ్కు వెళ్లడం ఆమెతో కాసేపు మాట్లాడ్డం, పూలు కొనడం.‘రోజూ మేడంకు పూలు తీసుకువెళ్తారు. మేడంను ఒకసారి తీసుకురండి సర్’ అంది కాస్త చనువు పెరిగాక.నవ్వి ఊరుకున్నాడు రామకృష్ణ. పెళ్ళైన అమ్మాయి పట్ల తాను ఏర్పరచుకున్న ఫీలింగ్ ఏమిటో అతనికే అర్థం కాలేదు.ఒకరోజు అడిగాడు, ‘నీ పేరేమిటి?’ అని ధైర్యం చేసి.‘అందరూ పూలమ్మి అంటారు. అదే నా పేరనుకోండి’ అంది ఆమె నవ్వుతూ. ఆ నవ్వు ఆమె అమ్మే పూల కన్నా ఎక్కువ పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపించింది.ఆమె దృష్టిలో అతను వివాహితుడు. అతను అలాగే నటించేశాడు. బీచ్లో జంటలను చూసినప్పుడు ఒకప్పుడు ఏమీ అనిపించేది కాదు. కాని, ఇప్పుడు కొద్దిగా ఏదో ఫీలింగ్. పూలమ్మి పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆమె జడలోని సన్నజాజులు అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేసున్నాయి.సరిగ్గా అపుడే అతని జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది.ఆ రోజు పూలమ్మి రాలేదు. ఆ రోజే కాదు మరుసటి రోజు కూడా రాలేదు. మూడవరోజు, నాలుగో రోజు...పూలమ్మితో పరిచయం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు పూలమ్మి పూలు అమ్మని రోజు లేదు. వర్షం వచ్చినా సరే, గొడుగు వేసుకుని మరీ బీచ్కు వచ్చేది.రామకృష్ణ కుదురుగా ఉండలేకపోయాడు. పూలమ్మి పూలు అమ్మే ప్రతి గుడికి వెళ్ళాడు. సాయిబాబా గుడికి, వేంకటేశ్వరస్వామి గుడికి, దుర్గ గుడికి– ఎక్కడా కనిపించలేదు. బీచ్కు రావడం లేదు.పూలమ్మికి ఏమైంది?రామకృష్ణ అన్వేషణ మొదలైంది. గుడిలో పూలు అమ్మే వాళ్ళను, బీచ్లో పూలు అమ్మే వాళ్ళను ఎంక్వయిరీ చేశాడు. ఎట్టకేలకు పూలమ్మి చిరునామా సంపాదించాడు. ఆఫీస్ వదలగానే పూలమ్మిని వెతుక్కుంటూ బయలుదేరాడు.∙∙ పూలమ్మి ఇల్లు ఊరికి చివర వుంది. పూలమ్మి ఇంటిని సమీపిస్తున్న కొద్ది రామకృష్ణలో ఉద్వేగం, పూలమ్మిని చూడబోతున్నానన్న ఉద్వేగం ఓ వైపు, ‘ఎందుకొచ్చారు?’ అని అడిగితే ఏం చెప్పాలి? కాళ్ళు పూలమ్మి ఇంటి ముందు ఆగాయి.చిన్న ఇల్లయినా పర్ణకుటీరంలా వుంది. చుట్టూ చెట్లతోనే ప్రహరీ, చిన్న చెక్క గేటు. దానికి అల్లుకున్న మల్లెతీగ. రెండువైపులా చామంతి, బంతి, గులాబీ మొక్కలు. కనకాంబరాలు ఓ పక్క, మరువం ఇంకో పక్క మల్లెతీగలు ఇంటిని అల్లుకుని...ఒక ఉద్యానవనంలోకి వచ్చినట్టు వుంది.చెక్క గేటు తీసుకుని లోపలి అడుగు పెట్టగానే మంచం మీద పడుకుని ఉన్న నాలుగేళ్ల పాప కళ్ళు తెరిచింది. పూలమ్మిని చూసినట్టే వుంది. తన అడుగుల శబ్దం విని కప్పుకున్న దుప్పటి తొలిగించి లేవబోయింది. కాళ్లు చచ్చుబడి సహకరించడం లేదు.రామకృష్ణ మనసు చివుక్కుమంది. పూలమ్మి కూతురికి ఈ కష్టమా?‘అమ్మ లేదా పాపా?’ అడిగాడు రామకృష్ణ. ఛ పాపకు ఏమైనా కొని తీసుకు రావాల్సింది. అయినా తనకు తెలిస్తే కదా, పూలమ్మికి ఓ పాప ఉందని. తానెప్పుడూ అడగలేదు. పూలమ్మి చెప్పనూ లేదు.‘అమ్మ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చింది అంకుల్’ అంటూ హాలు వైపు చూసింది.రామకృష్ణ లోపలికి అడుగుపెట్టాడు.అప్పుడే పూలమ్మి లైటు వేసింది. లైటు వెలుతురులో పూలమ్మిని అలానే చూస్తూ ఉండిపోయాడు. పూలమ్మి తన మెడలోని మంగళసూత్రం తీసి, ఎదురుగా ఉన్న దేవుని పటం ముందు పెట్టింది. మెట్టెలు తీసేసింది. నుదుట సిందూరం చెరిపేసింది. వెనుతిరిగింది.ఎదురుగా రామకృష్ణ .‘సర్ మీరా? ఇక్కడ.. నా కోసం?’‘నీ అనుమతి లేకుండా నీ ఇంటికి వచ్చాను. సారీ పూలమ్మి’ తలొంచుకుని అన్నాడు రామకృష్ణ.చిన్నగా జీవంలేని నవ్వు నవ్వింది పూలమ్మి.‘మనల్ని సృష్టించిన ఆ దేవుడు మన అనుమతి లేకుండా, మన తలరాతలు తన ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. నా తలరాత చూడటానికి వచ్చారా?’ ఆమె కంట్లో సన్నటి కన్నీటిపొర.‘కాళ్లు చచ్చుబడి పోయిన నా కూతురు, వైధవ్యాన్ని శాపంగా భరిస్తున్న నేను– ఇదీ నా కుటుంబం, తాగుబోతు భర్త, తాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరి చావుకు కారణమై, తనూ చచ్చాడు. ఆ పాపం, ఏ పాపం తెలియని నా బిడ్డను వెంటాడింది. నా బిడ్డ కాళ్ళు చచ్చుబడ్డాయి. ఆపరేషన్ చేస్తే తిరిగి నా కూతురు మామూలుగా అవుతుందని చెప్పారు. నా బిడ్డ కాళ్ళు బాగుపడడం కోసం పూలమ్మిగా కొత్త పాత్రలోకి వచ్చాను. ఒకప్పుడు ఇష్టంగా వ్యాపకంగా పెంచుకున్న చెట్లు, నాకు జీవనాధారం అయ్యాయి. గుడిలో దేవుని పాదాల చెంతకు, బీచ్లో అమ్మాయిల జడల్లో కొలువుతీరే పువ్వులు అమ్మే ఈ పూలమ్మి, నుదుట కుంకుమ లేకుండా, వైధవ్యంతో పూలు అమ్మితే అపశకునం అనుకోవచ్చు. అందుకే సుమంగళిగా నటించాను. మోసం చేయడానికి కాదు. నా బిడ్డను బతికించుకోవడానికి నటించాను. ఇంతకు మించి నా కథలో ఏ మలుపులు లేవు’ కళ్ళు తుడుచుకుని చెప్పింది పూలమ్మి.‘ఇప్పుడు ఆ నటనను నిజం చేయొచ్చుగా! నేను సూటిగా చెబుతున్నాను. నాకు పెళ్లి కాలేదు. నాకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు. నిన్ను చూశాక, ఎందుకో ఒక అందమైన భావం, నీకు పెళ్లయిందని తెలిసినా నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నీ కథ తెలిశాక, జాలితో కాదు, మరింత ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’ రామకృష్ణ మనసులో మాట చెప్పాడు.‘క్షమించండి. మీ మంచి మనసుకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఈ పొగచూరిన మనసును ఇవ్వలేను. నా బిడ్డ కాళ్లు బాగైతే, నా నటనకు స్వస్తి చెప్పి, మరో దారి చూసుకుంటాను. ఈ పూలమ్మిని మర్చిపోండి’ చెప్పింది.‘పోనీ కొన్నాళ్ళు నేను నీకు భర్తగా కాకుండా, నీ బిడ్డకు తండ్రిగా నటిస్తాను. మన బిడ్డకు, సారీ.. నీ కూతురికి కాళ్ళు వచ్చేవరకు. నీకు భర్తగా జీవించే అవకాశం లేనప్పుడు, ఇలా నటించే అవకాశాన్ని కోరడం తప్పు కాదు కదా! ఊహ తెలియకముందే నాన్న విదేశాల్లో ఉన్నాడని నమ్మించి నటించావు. ఆ నాన్నను నేనే అని చెప్పు. ఆ సంతోషంతో త్వరగా నడుస్తుంది. కొన్నాళ్ళైనా నాకు ఇష్టమైన నిన్ను నా జీవితంలోకి నటిగా ఆహ్వానించే అవకాశం ఇవ్వు’ అన్నాడు రామకృష్ణ.అప్పటికే కూతురు వాకింగ్ స్టిక్ సహాయంతో అక్కడికి వచ్చి, ‘ఎవరమ్మా.. నాన్నా.. నాన్నొచ్చాడా? ఆ చిన్నారి కళ్ళలో వెలుగు.కూతురు కళ్ళలో వెలుగు చూసి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేక పోయింది. అప్పటికే రామకృష్ణ ఆ పాపను దగ్గరకు తీసుకున్నాడు.‘భలే కనిపెట్టావ్.. ఎంతైనా నా కూతురువి కదా..’ అన్నాడు పూలమ్మి వైపు చూడకుండా.‘నేనంతే నాన్నా!’ అప్రయత్నంగా అంది. ఆ పిలుపుకు చిన్నప్పటి నుంచి దూరమైన ఆ పాప.‘మరి నీ బట్టలు తెచ్చుకోలేదు. నా కోసం ఏమీ తేలేదు. నువ్వు బోల్డు గిఫ్టులు తీసుకు వస్తావని చెప్పింది అమ్మ’ అంది అమాయకంగా.‘ఆఫీస్ పని మీద వచ్చాను. నీ కాళ్ళు బాగయ్యాక మిమ్మల్ని పెద్ద ఇంట్లోకి తీసుకు వెళతాను’ చెప్పాడు. ఆ పాప ఆ నటన నిజమేనని నమ్మి బయటకు వెళ్లి పూలతో మాట్లాడుతోంది.‘మా నాన్నొచ్చాడ’ని చెబుతూ మురిసిపోతోంది.ఆలా అతని పాత్ర నటన మొదలైంది. కానీ అతను జీవిస్తున్నాడు.అతని దినచర్య మారిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పాప కోసం బొమ్మలు తీసుకురావడం, పాపను బయటకు తీసుకు వెళ్లడం– అనివార్యంగా పూలమ్మి కూడా అతనితో పాటు వెళ్ళక తప్పడం లేదు.ఒకరోజు బీచ్కి వెళ్లారు. మొదటిసారి బీచ్కి వచ్చిన పాప అక్కడ ఉన్న పిల్లలను చూసి కేరింతలు కొట్టింది. ఇద్దరి చేతులు పట్టుకుని ఇద్దరి భుజాల మీద ఆడుకుంది. సినిమాకు తీసుకువెళ్లాడు. అమ్మ ఒడిలో కూర్చుంది. పూలమ్మి భుజం తాకుతుంటే, రామకృష్ణ మనసులో చిన్నపాటి ఉద్వేగం.పాపకు రామకృష్ణకు మధ్య బంధం పెరిగింది. అయినా తన పరిధిని మించి ఎప్పుడూ పూలమ్మి ఇంట్లోకి, ఆమె గదిలోకి అడుగు పెట్టలేదు. పాప ఎన్నోసార్లు ‘ఎందుకు నాన్న లోపలికి రావు’ అంటే ఏదో కారణం చెప్పేవాడు.పూలమ్మి రామకృష్ణ కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది.తర్వాత వంట చేసి క్యారేజీ ఇవ్వడం మొదలైంది.ఆ తర్వాత అతనికి కోసం ఎదురు చూడటం అలవాటైంది. ఒకరోజు వర్షంలో తడిసి వస్తే (అ)ప్రయత్నంగా అతని తల తుడిచింది తన చీర కొంగుతో. అతని బట్టలు ఉతికి ఆరేసింది. ఇస్త్రీ చేసింది.తాను పాప కోసం నటిస్తోందా? అతని మీద ప్రేమతో జీవిస్తోందా? అర్థం కాలేదు పూలమ్మికి.పాపకు ఆపరేషన్ అయ్యింది. కాళ్లు బాగుపడ్డాయి. లేచి నడుస్తోంది. పరుగెత్తుతోంది. ఆ రోజు పాప పుట్టినరోజు. పెద్ద కేక్ తెచ్చాడు. కొత్త బట్టలు తెచ్చాడు. పాపతో కేకు కట్ చేయించాడు. పెద్ద సందడి. అతని మనసులో చిన్న అలజడి.హడావుడి ముగిసింది. అర్ధరాత్రి కావస్తోంది. అప్పటి వరకు ఆడుకుని అలిసిపోయిన పాప నిద్రలోకి జారుకుంది. గడప లోపల పూలమ్మి. గడపకు ఇవతల రామకృష్ణ.‘నేను వెళ్తున్నాను’ చెప్పాడు రామకృష్ణ.‘రేపు కొద్దిగా పెందరాళే రావొచ్చుగా! మీకు ఇష్టమైన మినప్పప్పు మిక్సీకి వేశాను. మినప వడలు, సాంబారు, మీకిష్టమైన పల్లీ చట్నీ’ అని, ‘పోనీ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చుగా...’ ఆశగా అంది పూలమ్మి.‘వెళ్లిపోతానని అంటున్నది ఈ వూరి నుంచి. పాపకు కాళ్లు వచ్చాయి. నా జ్ఞాపకాలకు సరిపడా అనుభూతి దొరికింది. ఇంకా నటించి, ఒక నటుడిగా బతకలేక పోతున్నాను. ఎప్పుడైనా సినిమా పూర్తయితే, పాత్రను, పాత్ర నటనను వదిలి వెళ్ళిపోవలిసిందేగా! అందుకే, ఇప్పుడే ఇక సెలవని...’ రామకృష్ణ గొంతు గాద్గదికం అవుతోంది.‘పాపకు నాన్న ఆఫీస్ పనిమీద మళ్ళీ వెళ్లాడని చెప్పు. నువ్వు జాగ్రత్త పూలమ్మి’ వెనుదిరిగాడు. పూలమ్మి కళ్ళలోకి చూసి అక్కడి నుంచి వెళ్లలేక.పూలమ్మి అలాగే నిలబడి పోయింది.మొదటిసారి రామకృష్ణ తెచ్చిన చీర కట్టుకుంది.మొదటిసారి మనస్ఫూర్తిగా జడలో రామకృష్ణకు ఇష్టమైన పువ్వులు పెట్టుకుంది.మొదటిసారి నటించడం మాని జీవించింది.‘వెళ్ళండి ... ఎంతైనా మగ మహారాజులు కదా! కూతురి పుట్టినరోజు కూడా బలాదూర్ తిరగండి. ఇంట్లో భార్య ఉంది. అది తన కోసం ఎదురుచూస్తుంది అని ఆలోచించకుండా వెళ్ళండి’ పూలమ్మి ఉక్రోషంగా అంది. గొంతులో దుఃఖం తన్నుకు వస్తోంది.ఒక్కసారిగా గిరుక్కున వెనక్కి తిరిగాడు. గుమ్మం ముందు నిలబడి తాను తెచ్చిన చీర కట్టుకుని, తలలో పువ్వులు పెట్టుకుని, తన పూలమ్మి, కళ్ళనుండి నీళ్లు ఒంపుకొని... మనసు నిండా ప్రేమ నింపుకొని... రెండు చేతులు చాచి, గుమ్మానికి అడ్డు తొలగి లోపలి గది లోపలికి, తన మనసు గదిలోకి ఆహ్వానిస్తూ...నుదుట కుంకుమ చెదిరి, తలలో పూలు అలసి, ఒంటిమీద ఉన్న ఆచ్ఛాదనలు చెదిరి, దేహాలు ఒక్కటై, తెల్లవారు ఝామున వినిపించే కువకువల సుప్రభాతం వింటూ... ఒకరినొకరు చుట్టుకుని... నిన్నటి వరకు నటించిన పాత్రలకు జీవం పోసి, నటన వదిలి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.మరోసారి పూలమ్మిని చుట్టేస్తూ ‘అవును నీ పేరేమిటి పూలమ్మీ’ అడిగాడు.‘మీరు ప్రేమతో పిలిచే పేరే. పూలమ్మి...’ అతని గుండెలో ఒదిగిపోతూ చెప్పింది పూలమ్మి. -
మాయమవుతున్న 'వై' క్రోమోజోమ్
మగజాతి ఉనికికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్ క్షీణించిపోతోంది. ఈ పరిస్థితిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భూమ్మీద మగజాతి అంతరించిపోతుందా అనే భయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే అంత ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా వైద్య పరిశోధకుల్లో చర్చ జరుగుతోంది. దీనిపై విస్తృత పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ ‘వై’ వర్రీ గురించి తెలుసుకుందాం.పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. పురుషుల ఆయుర్దాయం తక్కువగా ఉండటానికి అనేక సామాజిక, శారీరక కారణాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు పురుషుల్లోనే ఎక్కువ. ఇక మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ వారికి రకరకాల ఆరోగ్య పరిస్థితుల నుంచి సహజ రక్షణ కల్పిస్తుంది. మహిళల్లోని ఇరవైమూడు జతల క్రోమోజోమ్లలోనూ రెండేసి ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి. పురుషుల్లో ఇరవైమూడో జతలో ఒక ‘ఎక్స్’, ఒక ‘వై’ క్రోమోజోమ్లు ఉంటాయి. ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ కంటే, రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్లు ఉండటం కూడా మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి కారణం అనే అభిప్రాయం కూడా ఉంది. ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాలానే ఉంటుంది. పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి గల కారణాలపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని అవాస్తవాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ క్షీణిస్తున్నట్లుగా ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ‘వై’ క్రోమోజోమ్ పురుషుల అస్తిత్వానికి కీలకమైనది. వయసు పెరిగే కొద్ది పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ తన జన్యుకణాలను కోల్పోతూ ఉంటుంది. ఈ కణాలు కోల్పోయే వేగాన్ని బట్టి వార్ధక్య లక్షణాలు కనిపిస్తాయి. వార్ధక్యంలో వచ్చే వ్యాధులు కూడా చుట్టుముడతాయి. ‘వై’ క్రోమోజోమ్ కణాల క్షీణత ఈ మేరకు మాత్రమే పరిమితమైతే ఏ ఆందోళనా అక్కర్లేదు. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి కూడా ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే, భూమ్మీద పురుషజాతి అంతరించిపోతుంది. పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే, భూమ్మీద మహిళలు మాత్రం ఎంతకాలమని మనుగడ సాగించగలరు? ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోతే, యావత్ మానవాళి కూడా భూమ్మీద అంతరించిపోతుందా? ఇలా ఈ అంశంపై అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల ఏర్పడబోయే పరిణామాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించడానికి, మానవాళి అంతరించిపోయే ముప్పును తప్పించే మార్గాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు. భూమ్మీద మానవుల మనుగడ మొదలైన నాటి నుంచి మానవజాతిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిలో భాగంగానే పురుషజాతి అస్తిత్వానికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనుషుల్లో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. వాటిలో ఒక జత లింగనిర్ధారణకు కీలకమైనది. మహిళల్లో ఈ జతలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్లు, పురుషుల్లో ఒక ‘ఎక్స్’, ఒక ‘వై’ క్రోమోజోమ్ ఉంటాయి. ‘ఎక్స్’ క్రోమోజోమ్లోని జన్యుకణాల సంఖ్యతో పోల్చుకుంటే, ‘వై’ క్రోమోజోమ్లోని జన్యుకణాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిణామంపై రకరకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాటికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకుందాం.దీనివల్లే పురుషుల్లో వంధ్యత్వం‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్లనే పురుషుల్లో వంధ్యత్వం కలుగుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా – ‘వై’ క్రోమోజోమ్లో ఉన్న జన్యు కణాల్లోని ‘అజూస్పెర్మియా ఫ్యాక్టర్’లో (ఏజెడ్ఎఫ్) ‘మైక్రో డిలీషన్స్’ రూపంలో చోటు చేసుకునే క్షీణత పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని కూడా గుర్తించారు. ‘వై’ క్రోమోజోమ్లోని ‘ఏజెడ్ఎఫ్’ కణాల క్షీణత పురుషుల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణంగా ఉంటోందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెయింట్ లూయీలోని సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్కు చెందిన వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో ‘వై’ క్రోమోజోమ్లోని జన్యుకణాల్లో పునస్సంయోగానికి అవకాశాలు తక్కువగా ఉండటం వల్లనే ఇందులోని జన్యువులు క్షీణిస్తున్నాయని వెల్లడైంది. ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల పురుషుల్లో వంధ్యత్వం మాత్రమే కాకుండా, మరిన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పలు అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. వారు చెబుతున్న ప్రకారం ‘వై’ క్రోమోజోమ్ క్షీణత వల్ల పురుషుల్లో పెరిగే ఆరోగ్య సమస్యలు ఇవీ:∙‘వై’ క్రోమోజోమ్లో ఏర్పడే ‘మొజాయిక్ లాస్’ వల్ల పురుషుల్లో గుండె కండరాలు బలహీనపడి గుండెజబ్బులు, నాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి అల్జీమర్స్ వంటి నాడీ వ్యాధులు, త్వరగా వార్ధక్య లక్షణాలు సంభవిస్తాయని ఎన్ఐహెచ్ పరిశోధనలు చెబుతున్నాయి. పురుషుల శరీరంలోని కణాలు ‘వై’ క్రోమోజోమ్ను పూర్తిగా కోల్పోయే పరిస్థితినే ‘మొజాయిక్ లాస్’ అంటారు.∙‘వై’ క్రోమోజోమ్ మొజాయిక్ లాస్ వల్ల శరీరంలోని కండరాల బిగువు సడలిపోవడం, ఎముకల పటుత్వం తగ్గిపోవడం, రోగ నిరోధక కణాలు వేగంగా నశించడం జరిగి అకాల మరణాలు సంభవించే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని ఎన్ఐహెచ్ పరిశోధకులు చెబుతున్నారు.అంతరించిపోతే జరిగేదేమిటి?‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయినట్లయితే, మానవులలో మగజాతి అంతరించిపోతుంది. ఇది వెంటనే జరిగే పరిణామం. ఫలితంగా మానవుల పునరుత్పత్తి నిలిచిపోతుంది. ‘వై’ క్రోమోజోమ్లో పురుష లక్షణాల అభివృద్ధికి కీలకమైన ‘ఎస్ఆర్వై’ (సెక్స్ రీజియన్ ఆన్ ది వై) జన్యువు ఉంటుంది. ఇది నశించినట్లయితే, మానవాళికి తీవ్రమైన అనర్థంగానే భావించవచ్చు. అయితే, జీవపరిణామంలో భాగంగా మానవజాతి పునరుత్పాదలోను, పురుషజాతి లింగనిర్ధారణలోను కొత్త మార్పులు సంభవించవచ్చని, ఇలాంటి మార్పులు కొన్ని ఇతర జంతు జాతుల్లో జరగడాన్ని ఇప్పటికే గమనించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవ పరిణామం ఒక నిదానమైన ప్రక్రియ అని, సుదీర్ఘకాలంలో లింగనిర్ధారణకు కీలకమైన కొత్త జన్యువులు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. మనుషుల జన్యువులలో ఈ స్థాయి మార్పు జరిగితే, మానవజాతి విభిన్నంగా పరిణామం చెందగలదని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అంతరించిపోయినవి అంతరించిపోగా ‘వై’ క్రోమోజోమ్లో మిగిలిన జన్యువులను కాపాడుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అంతర్జాతీయ వైద్యపరిశోధకులు చెబుతున్నారు. ‘వై’ క్రోమోజోమ్లోని జన్యువులలో జరిగే హానికరమైన ఉత్పరివర్తనలను నిరోధించి, కీలకమైన జన్యువులను కాపాడుకోవడానికి అవసరమైతే జన్యుసవరణ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ‘వై’ క్రోమోజోమ్ క్షీణత పురుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీనివల్ల కొన్నిరకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు సహా పలు వ్యాధులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ‘వై’ క్రోమోజోమ్ క్షీణతను అరికట్టడానికి, ఇందులోని మిగిలిన జన్యువులు అంతరించిపోకుండా ఉండటానికి మరిన్ని పరిశోధనలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఆ ఎలుకల్లో ఏం జరిగిందంటే?రెండు జాతులకు చెందిన ఎలుకల్లో ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయింది. దాంతోపాటే ‘ఎస్ఆర్వై’ జన్యువు కూడా అంతరించింది. అయినా వాటి పునరుత్పత్తి నిలిచిపోలేదు. ఇంకా మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. అమెరికాలోని మిసోరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షెరిల్ రోజన్ఫీల్డ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు కొద్ది సంవత్సరాల కిందట జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మనుషులు సహా సమస్త స్తన్యజీవుల్లోను మగ జీవుల లింగ నిర్ధారణకు దోహదపడేది ‘వై’ క్రోమోజోమ్లోని ‘ఎస్ఆర్వై’ జన్యువు. మగ జీవుల్లోని పునరుత్పత్తికి కీలకమైనది ‘వై’ క్రోమోజోమ్, అందులోని ‘ఎస్ఆర్వై’ జన్యువు ‘వై’ క్రోమోజోమ్ లేకుండానే, జపాన్ తీర ప్రాంతంలో కనిపించే ‘అమామీ స్పైనీ ర్యాట్’, ‘ర్యుక్యు స్పైనీ ర్యాట్’ అనే జాతులకు చెందిన ఎలుకలు మనుగడ సాగించగలుగుతున్నాయి. ఇవి యథాప్రకారం పునరుత్పత్తి కొనసాగించగలుగుతున్నాయి. వీటిలో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోయినా, లింగ నిర్ధారణకు అవసరమైన ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు జరిగాయని, వాటి ఫలితంగానే ఇవి మనుగడ సాగించగలుగుతున్నాయని ప్రొఫెసర్ షెరిల్ రోజన్ఫీల్డ్ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఎలుకల్లోని ఎక్స్ క్రోమోజోమ్లోని ‘ఎస్ఓఎక్స్9’ అనే జన్యువు పురుష లింగనిర్ధారణకు కీలకమైన ‘ఎస్ఆర్వై’ జన్యువులా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎలుక జాతుల్లో జరిగిన జన్యు ఉత్పరివర్తనల ఫలితంగా వీటిలో విలక్షణమైన లింగనిర్ధారణ వ్యవస్థ ఏర్పడినట్లు వారు కనుగొన్నారు. యూరోప్లో కనిపించే ‘మోల్వోల్’ అనే ఎలుక జాతిలోనూ ఇదే పరిస్థితిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘మోల్వోల్’ జాతి ఎలుకల్లో కూడా ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయింది. అయినా, ఇవి కూడా మనుగడ సాగించగలుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఇప్పటి వరకు తేలిన ఫలితాల ఆధారంగా ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయినంత మాత్రాన మనుషుల మనుగడకు ముప్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ‘వై’ క్రోమోజోమ్ అంతరించిపోయిన ఎలుకల్లో మాదిరిగానే మనుషుల్లోనూ ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు జరిగి విలక్షణమైన లింగనిర్ధారణ వ్యవస్థ ఏర్పడవచ్చని భావిస్తున్నారు.పాతికేళ్లుగా పరిశోధనలుమనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై దాదాపుగా పాతికేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వేర్వేరు దేశాల శాస్త్రవేత్తలు ఈ అంశంపై వేర్వేరు అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్ ప్రొఫెసర్ బ్రియాన్ సైక్స్ ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై ‘ఆడమ్స్ కర్స్: ఎ ఫ్యూచర్ వితౌట్ మెన్’ అనే పుస్తకాన్ని 2003లో ప్రచురించారు. మనుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్ జన్యువులు నశిస్తున్న తీరుపై ఆయన విస్తృత పరిశోధనలు జరిపారు. మరో ఐదువేల తరాలు గడిచే నాటికి– అంటే, ఇంకో లక్షా పాతికవేల సంవత్సరాలలోనే మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోగలదని, భవిష్యత్తులో పురుషులు లేని ప్రపంచం ఏర్పడుతుందని ఆయన తన పుస్తకంలో రాశారు. పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుండటానికి ‘వై’ క్రోమోజోమ్ క్షీణతే కారణమని ప్రొఫెసర్ బ్రియాన్ తన పుస్తకంలో వెల్లడించారు. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా నశించడం వల్ల పురుషులు అంతరించిపోయాక కూడా భూమ్మీద మనుషులు మనుగడ సాగించాలంటే, ఒకే ఒక్క మార్గం ఉంటుందని తెలిపారు. అదేమిటంటే, ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్తో మహిళల అండాలను ఫలదీకరించి, ‘ఇన్ విట్రో ఫర్టిలైజేషన్’ (ఐవీఎఫ్) పద్ధతి ద్వారా మాత్రమే మనుషుల్లో పునరుత్పత్తి సాధ్యం కాగలదని అభిప్రాయపడ్డారు. బ్రియాన్ తన పుస్తకంలో వెల్లడించిన అభిప్రాయాలపై ఇప్పటికీ విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ క్షీణతపై కూడా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, కొందరు పరిశోధకులు ‘వై’ క్రోమోజోమ్ క్షీణత గురించి అనవసరంగా అతిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా నశించినంత మాత్రాన భూమ్మీద మానవాళి మనుగడ పూర్తిగా అంతరించిపోతుందని చెప్పలేమని ఇంకొందరు పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ పూర్తిగా క్షీణించే పరిస్థితి తలెత్తితే, అందుకు ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు కూడా జరుగుతాయని, ఆ ఉత్పరివర్తనలు పునరుత్పత్తిని కొనసాగించగలవని అమెరికన్ జన్యు పరిశోధకులు జె.విల్సన్, జె.ఎం.స్టాలీ, జి.జె.వైకాఫ్ ‘నేచర్’ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ‘వై’ క్రోమోజోమ్ లేకున్నా, ఎలుక జాతులు మనుగడ సాగిస్తున్నట్లుగానే, మనుషులు కూడా మనుగడ సాగించగలరని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘వై’ క్రోమోజోమ్ క్షీణతమానవజాతి మనుగడ మొదలైనప్పుడు పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్లో 1438 జన్యుకణాలు ఉండేవి. ఇప్పుడు వాటిలోని 1383 జన్యుకణాలు అంతరించిపోయాయి. ఇప్పుడు ‘వై’ క్రోమోజోమ్లో మిగిలినవి 55 జన్యుకణాలు మాత్రమే! దాదాపు 30 కోట్ల సంవత్సరాల వ్యవధిలో ఈ క్షీణత సంభవించింది. ఈ లెక్కన సగటున ప్రతి పదిలక్షల సంవత్సరాలకు ‘వై’ క్రోమోజోమ్లోని 4.6 జన్యుకణాలు అంతరించిపోతున్నాయి. ఇదే రీతిలో ‘వై’ క్రోమోజోమ్ క్షీణత కొనసాగితే, మరో కోటి సంవత్సరాలలో పూర్తిగా అంతరించిపోతుంది. నిజానికి 16.6 కోట్ల సంవత్సరాల కిందటి వరకు ‘ఎక్స్’ క్రోమోజోమ్లోను, ‘వై’ క్రోమోజోమ్లోను జన్యువులు సరిసమానంగా ఉండేవి. పరిణామక్రమంలో ‘వై’ క్రోమోజోమ్లో జన్యువులు క్రమంగా కనుమరుగవడం మొదలైంది. ప్రస్తుతం ‘వై’ క్రోమోజోమ్లో 55 జన్యువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మానవజాతి మనుగడ మొదలైన తర్వాత గడచిన కోట్లాది సంవత్సరాలలో జరిగిన ఉత్పరివర్తనల పర్యవసానంగా ‘వై’ క్రోమోజోమ్లోని జన్యుకణాలు ప్రస్తుత స్థితికి క్షీణించాయి. -
ట్యాంక్ బండ్పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)
-
టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!
రొయ్యల పాప్కార్న్కావలసినవి: రొయ్యలు– 25 పైనే (మరీ చిన్నవి కాకుండా, నచ్చిన సైజ్ ఎంచుకోవచ్చు. తల, తోక తీసి, శుభ్రం చేసుకోవాలి)అల్లం–వెల్లుల్లి పేస్ట్– 2 టేబుల్ స్పూన్లుకారం– ఒక టీ స్పూన్ గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్+ఒక టీ స్పూన్నిమ్మరసం– ఒక చెక్కమైదా, జీలకర్ర పొడి– ఒక టేబుల్ స్పూన్ చొప్పునబ్రెడ్ పౌడర్– పావు కప్పుపైనేగుడ్డు– 2 (2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు కలుపుకుని పక్కనపెట్టుకోవాలి)ఉప్పు– తగినంతనూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా రొయ్యలు ఒక గిన్నెలో తీసుకుని, అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నిమ్మరసం వేసి, ఆ మిశ్రమం రొయ్యలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక చిన్న బౌల్లో బ్రెడ్ పౌడర్, జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కో రొయ్యను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాంగో కేక్కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టీ స్పూన్బేకింగ్ సోడా– అర టీ స్పూన్ఉప్పు– చిటికెడు గడ్డ పెరుగు– ఒక కప్పుపంచదార– ముప్పావు కప్పుపాలు, నూనె– అర కప్పు చొప్పునవెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్మామిడి పండ్లు– 2 (బాగా పండి, తియ్యగా ఉండాలి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)నీళ్లు– కొద్దిగానిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్మీగడ– అర కప్పువైట్ చాక్లెట్– 200 గ్రాములు (మార్కెట్లో దొరుకుతుంది)మ్యాంగో ఐస్క్రీమ్– పావు కప్పు పైనేతయారీ: ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని బాగా కలిపి, జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. అనంతరం అందులో నూనె, వెనీలా ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు గోధుమ మిశ్రమాన్ని, పెరుగు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి, నెయ్యి పూసిన వెడల్పాటి పాత్రలో వేసుకుని, రెండు అంగుళాల మందంలో, సమానంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని, చల్లారాక, çముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను మిక్సీలో వేసుకుని, వాటిలో నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్లా చేసుకోవాలి. ఆ జ్యూస్ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీగడను కరిగించి, దానిలో కరిగించిన వైట్ చాక్లెట్ను కలపాలి. దానిలో మామిడిపండు గుజ్జు వేసుకుని, క్రీమ్లా అయ్యే వరకూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ముక్క తీసుకుని, దానిపై పెరుగు మిశ్రమాన్ని అర అంగుళం మందంలో పూసుకుని, దానిపైన కొద్దిగా ఐస్క్రీమ్ పావు అంగుళం మందంలో పరుచుకోవాలి. మరో కేక్ ముక్కను దానిపై పెట్టుకోవాలి. ఇదే మాదిరి అన్ని ముక్కలు పెట్టుకుని.. వాటిపై మరోసారి పెరుగు మిశ్రమం, ఐస్క్రీమ్తో నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.అసోమీయా తిల్ పిఠాకావలసినవి: బియ్యం– ఒక కప్పుబెల్లం తురుము, నల్ల నువ్వులు– అర కప్పు చొప్పుననీళ్లు, నూనె, ఉప్పు– సరిపడాతయారీ: ముందుగా బియ్యాన్ని 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి, ఒక గంట పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు నల్ల నువ్వులను దోరగా వేయించి, కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ నువ్వుల మిశ్రమాన్ని బెల్లం తురుములో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యప్పిండిలో సరిపడా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా దోసెల పిండిలా కలుపుకోవాలి. ఆపై పాన్ మీద కొద్దికొద్దిగా నూనె వేడి చేసుకుని, చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. అట్టు కొద్దిగా ఉడుకుతుండగా, మధ్యలో నువ్వులు–బెల్లం మిశ్రమాన్ని ఉంచి నచ్చిన విధంగా రోల్ చేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. -
ఈ వారం కథ: రీట్వీట్
నువ్వు అలా స్క్రోల్ చేస్తున్నావు. డెడ్ లైన్ల మధ్య ఓ క్షణం. నైట్ లాంప్ వుండీ లేనట్లు వెలుగుతోంది. ప్లాస్టిక్ కంటైనర్లోని గోట్ బిర్యానీ చల్లారిపోయింది. క్యాంపస్ అంతా నిశ్శబ్దంగా వుంది, మంచు తెరలతో మూసుకుపోయినట్లు. ఎక్కడి నుంచో పోలీసు హారన్లు. నువ్వు ఏదో చెప్పాలనో, మాట్లాడాలనో అనుకోవటం లేదు. అది నీ తత్త్వం కాదు. అంత మాత్రాన నీకు హృదయం లేదని కాదు. పేదరికం నీ పెదాల్ని మూసేసింది. కానీ ఆ రోజు, నువ్వొక ఫొటో చూశావు. చిన్న పిల్ల. ఆరేడేళ్ళు వుంటాయేమో. ఆ పసిదాని మొహం సగం బూడిదలో కప్పడిపోయింది. ఆ తల్లి ఏడుపు ఆ ఫొటోలో నుంచి నీ గుండెను తాకింది. శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ మృతదేహాన్ని చూడలేక కళ్ళు వాల్చుకున్నావు. ఆ పసిదాని పేరు నీకు తెలీదు. తెలియక్కర లేదు కూడా. దుఃఖానికి వూర్లు, పేర్లు, దేశాలు, భాషలు అక్కరలేదు. ఆ రోజుకి ఇంకేమీ రాయలేకపోయావు. ఎన్ని మరణాలు? ఎన్ని దేహాలు? ఎన్ని యుద్ధాలు? ఎంత విధ్వంసం? "Being human is not a crime''ట్వీట్లో వున్నది ఆ ఒక్క వాక్యమే! ఆ వాక్యం రాసింది నువ్వు కాదు. నువ్వు దాన్ని ఎడిట్ చేయలేదు. రీట్వీట్ జస్ట్ రీట్వీట్ చేశావు. ఒక్క క్లిక్. దాహంతో వున్న వాళ్ళకు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లు. That's it. అనుకోకుండా ఆ రీట్వీట్ వైరల్ అయింది. కామెంట్లు వరదలాగా ముంచెత్తాయి.కొందరు నిన్ను ప్రశంసిస్తే, మరికొందరు "unamerican' అని విమర్శించారు. ఇమ్మిగ్రెంట్లకు అసలేం పని ఈ దేశంలో అన్నారు. వెళ్లిపొమ్మని కొందరంటే, వెళ్లగొడతామని మరికొందరన్నారు. రాడికల్ అని కొందరంటే, ట్రైటర్ అన్నారు మరికొందరు. నిజం చెప్పద్దు. ఒక్కసారి నీ రీట్వీట్, ఆ స్పందన, ఆ కామెంట్లు ఆ పాపులారిటీ నువ్వు భలే ఆనందించావు. కానీ ఆ ఆనందానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో అప్పుడు నువ్వూహించలేదు. నీ పాలిట అదే ఉరితాడవుతుందని. అదే నీకు వ్యతిరేక సాక్ష్యం అవుతుందని. ఒక్క వాక్యం. Hashtags లేవు. నినాదాలు లేవు. యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలో అనుకోకుండా నువ్వొక ప్లకార్డు పట్టుకున్నావు. డైలీ పెన్సిల్వేనియన్ పత్రిక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో నువ్వే ప్రముఖంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు మీ యూనివర్సిటీలో భారతి అంటే మరో సుబ్రహ్మణ్య భారతి. ఈ ప్రదర్శనలు, ఈ ట్వీట్లు, ఈ డిబేట్లు వీటన్నింటితో నీలోపలి కవిత్వం మళ్ళీ బయటకొచ్చింది. నీ కవితలు స్టూడెంట్స్ నోటి వెంట పద్యాలయ్యాయి.∙∙ మరోవైపు ఏం జరుగుతోందో నువ్వు ఊహించలేకపోయావు. వీటన్నింటినీ ఓ నిఘా కన్ను చూస్తోంది. నిన్నే, నిన్నే, నిన్నే. జింకలకు తెలియాలి సింహాలు ఎప్పటికైనా వేటాడి తీరతాయని. ఇమ్మిగ్రెంట్లకు తెలియాలి ఎప్పటికైనా తిరిగెళ్లిపోవాలని. నీ ఒంటి రంగు ఎప్పటికీ తెలుపు కాబోదని. నీ నిక్ నేమ్ ఎప్పటికీ ‘బ్రౌనీ’నే అని. నువ్వు హక్కులడిగితే, వాళ్ళు నీ బాధ్యతలు గుర్తుచేస్తారు. లిబర్టీ బెల్ ఉన్న ఊర్లో లిబర్టీ నేతిబీరకాయలో నెయ్యి. తెలుసుకొనవే చెల్లీ, అలా మసలుకొనవే తల్లీ!∙∙ నీకు తెలియదు నీ పేరు అట ingtonలోని ఓ అధికార కార్యాలయపు టేబుల్ మీద ఓ ఫోల్డర్ లోకి చేరుతుందని. నీకు తెలియదు నీ పేరు ‘భారతి రాఘవన్’ ఒక జాబితాలోకి అంత సులువుగా చేరిపోతుందని. నీకు తెలియదు నీ వొంటి రంగు, నీ వీసా స్టేటస్, నీ కోపం, నీ ఆలోచన ఇవి చాలు నువ్వు నేరస్థురాలివని నిర్ధారించడానికని. నీకు తెలియదు ఆ అల్గారితమే ఒక ఆయుధమవుతుందని. ఎందుకంటే, నువ్వొక ఇమ్మిగ్రెంట్వి. నీ ధర్మాగ్రహం ఓ ఎర్రజెండా. ప్రతి జెండా ఓ ప్రమాద హెచ్చరిక! ఎక్కడేం జరుగుతోందో వూహించలేని నువ్వు, చల్లారిన నీ గోట్ బిర్యానీని తినటానికి ఉపక్రమించావు. కానీ నీ కళ్ళు పదే పదే ఆ దృశ్యాన్ని చూపిస్తుంటే, తినలేక, తినకుండా పారేసే ఆర్థిక శక్తి లేక రేపటి కోసం దాచి పెట్టావు. నీ ఇవాళనీ రేపటినీ మార్చేసింది అది. కాన్ఫరెన్స్ పేపర్ అసంపూర్తిగా వదిలేసి రూమ్కి బయలుదేరావు. టైమ్ చూశావు. వచ్చే నెల అక్క పెళ్లి ఆలోచనలతో నీ మొహాన ఓ చిరునవ్వు వెలిగింది.∙∙∙INTERNAL DHS MEMO & CLASSIFIEDసబ్జెక్ట్: భారతి రాఘవన్ డేట్ ఆఫ్ బర్త్: 04/14/1997సిటిజన్షిప్: ఇండియా స్టేటస్: ఎఫ్–1 యూనివర్సిటీ: యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రెడ్ ఫ్లాగ్: యు.ఎస్. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు. సాక్ష్యం: సోషల్ మీడియా యాక్టివిటీ. రికమెండేషన్: సెక్షన 212(a)(3)(B)కింద వీసా రద్దుకేటగిరీ: సంఘ వ్యతిరేక సంస్థలకు మద్దతు నోట్: జాతీయ భద్రతా ముప్పు యాక్షన్: సాఫ్ట్ డెటెన్షన్ ప్రోటోకాల్. ∙∙ ఓ వారం తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ ద్వారం దగ్గర నీ బ్యాడ్జ్ పని చేయలేదు. కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టి వెళ్లిపోయావు. అక్క పెళ్లి కోసం ఇండియా వెళ్ళే హడావిడిలో. నీ వీసా స్టేటస్ మారిందని నీకు తెలియను కూడా తెలియదు. ఎయిర్పోర్టు రెండో సెక్యూరిటీ గార్డు కూడా నీ వైపు చూడకుండా కంప్యూటర్ వంక చూస్తున్నప్పుడు, నీకేం అర్థం కాలేదు. నీ మొహంలో భయం, ఆందోళన.‘‘మేమ్, ప్లీజ్ కొంచెం ఈ పక్కకు రండి’’ సెక్యూరిటీ గార్డు రిక్వెస్ట్గా అడిగినా, అందులో అధికారమే ధ్వనిస్తోంది. ‘‘ఏమైనా ప్రాబ్లమా సార్?’’ అతి వినయంగా అడిగిన నీ మాటలకు, ‘‘ఇది జస్ట్ రొటీన్’’ చెప్పాడతను. చాలాసార్లు అది నిజమే. కానీ ఈసారి కాదు. ∙∙ ఏజెంట్స్ ఫీల్డ్ నోట్స్: సబ్జెక్ట్ కామ్గా కనిపించింది. ఏ మత సంస్థలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. మానవహక్కులు, అకడమిక్ ఫ్రీడంలాంటి పదాలు తరచూ ప్రయోగించింది. ఆ పోస్ట్ రీట్వీట్ చేయటంలో కానీ, ఆ ప్రదర్శనలో ప్లకార్డ్ పట్టుకోవడంలో కానీ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. పదే పదే ప్రశ్నించాకా,‘‘ఎవరి పట్లనైనా మానవత్వంతో స్పందించటం నేరమా?’’ అని ఎదురు ప్రశ్నించింది. ∙∙ నీ చేతికి వేసిన సంకెళ్ళు నిన్ను చూసి చులకనగా నవ్వాయి. ఆ నిశ్శబ్దం నిన్ను భూతంలా చుట్టుముట్టి భయపెట్టింది. వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఇది చాలా అలవాటైన పనిలాగా చేసుకుంటూ వెళ్లిపోవటం నిన్ను నిలువునా కూల్చేసింది. నువ్వు మొదట్లో మామూలుగానే అడిగే ప్రయత్నం చేశావు, కానీ నీ గొంతులో కోపం, భయం, ఆందోళన అన్నీ వాళ్ళకు కనిపించాయి. వేటాడే పులికి తన నోటికి చిక్కిన జింక మొహం చూస్తే చాలు. తినక ముందే కడుపు నిండిపోతుంది. వాళ్ళ మొహాలు నీ కంటికి వేటాడే సింహాల్లాగానే కనిపించాయి. ‘‘నా మీద పెట్టిన చార్జ్ ఏమిటి?’’ ‘‘దేశ భద్రతకు ముప్పు.’’ దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్రజెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు.∙∙ ఆ రాత్రి నిన్ను వ్యాన్లో మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ కిటికీల్లేవు.కొందరు గార్డులు నీ వంక సానుభూతిగా చూశారు. కొందరు ఇది మా ఉద్యోగం అన్నట్లు కళ్ళతోనే చెప్పుకున్నారు. కొందరి కళ్ళల్లో బాగా శాస్తి జరిగిందన్న ఆనందం. నీ దవడ బిగుసుకుంది. నీ పళ్ళు గట్టిగా కరుచుకోవటం వల్లనో, మరి దేని వల్లనో నాలుకకి రక్తపు రుచి తెలిసింది. ఫోన్ కాల్ ట్రాన్ స్క్రిప్ట్: ICE మానిటర్డ్ లైన్ ‘‘చిన్నీ’’ ‘‘అమ్మా’’ వొణికిన గొంతులోంచి కన్నీళ్లు లోపలకి ఇంకిపోతున్నాయి. ‘‘మొన్న ఫ్లయిట్ ఎందుకు కాన్సిల్ చేశావ్? అంతా ఓకే కదా? నిజం చెప్పు. ఏమైనా జరిగిందా? ఏదేదో వింటున్నాం ఇక్కడ’’ భారతి సమాధానం ఇవ్వకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. ‘‘అంతా బాగానే వుంది మీరు వర్రీ కావద్దు. వీసా సమస్యలు. పేపర్లు సబ్మిట్ చేశా. బహుశా అక్క పెళ్ళికి నే రాలేకపోవచ్చు’’‘‘నీ వీసా Extensionకి ఎప్పుడనగానో అప్లై చేశావుగా ’’‘అనుమానాలు ముందు పుట్టి తర్వాత అమ్మలు పుట్టి వుంటారు. అంత తొందరగా దేన్నీ నమ్మరు.’ ‘‘ఇక్కడ పరిస్థితులు కొంచెం టెన్షన్గా వున్నాయి. నేను ఫోన్ చేయకపోతే కంగారు పడొద్దు.’’ తన మాటలు తనకే నిర్జీవంగా వినిపించాయి. ఫోన్ కాల్ టైమ్ అయిపోయింది. ∙∙ Asylum కోసం మిగతా బందీలకు వీలు కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాసి పెడుతున్నావు నువ్వు. చేయటానికి వేరే పని ఏముంది? ఆలోచనల్లో మునిగిపోవటం తప్ప. ప్రపంచానికి పెదరాయుడులాంటి అమెరికానే గెంటేస్తుంటే, ఇంకే దేశానికిAsylum అప్లికేషన్స్ పెట్టుకోగలరు ఎవరైనా? కదా!∙∙ ఆ సెంటర్లో అనేక దేశాల వాళ్ళు, భాషల వాళ్ళు. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళతో పాటు, నేరాలు ఆపాదించబడ్డ వాళ్ళు కూడా. Like Bharati.. స్పీడ్గా కారు నడిపి ఫైన్ కట్టని చిన్న నేరాల నుంచి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు: అందరికీ ఒకటే డిటెన్షన్ సెంటర్. కాపలా కాస్తున్న వారి కళ్ళకు ఎవరేమిటో తెలియదు. తెలియక్కరలేదు కూడా. గార్డులకు, డిటైనీలకు తెలిసింది నల్లటి ఊచలు మాత్రమే!ఊచలు పట్టి వుంచేది వ్యక్తులనే కానీ వ్యక్తిత్వాలను కాదు. ఆవేశాన్నే కానీ ఆలోచనలను కాదు. దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్ర జెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు. కల్పనా రెంటాల(చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
వీరవాహనుడికి వశిష్ఠుడు చెప్పిన కథ
పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు, దానశీలి, సత్యవాది. ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్లాడు. అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని, ఆయనను దర్శించుకుని, ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి, అక్కడకు వెళ్లాడు. ఆశ్రమంలో వశిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు పాదాభివందనం చేశాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనానుడు ‘మహర్షీ! యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను. అయినా నాకు నరక భయం తొలగిపోవడం లేదు. యమధర్మరాజును గాని, నరకాన్ని గాని చూడకుండా, నరకబాధలు లేకుండా మరణానంతర జీవనం గడిపే వీలుందా?’ అని అడిగాడు.‘మహారాజా! మన మునివరేణ్యులు ఎన్నో ధర్మాలను ప్రవచించినా, కర్మ మోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, పితృకార్యం, సన్యాసం– ఇవన్నీ గొప్ప ధర్మాలు. చివరిగా వృషోత్సర్గం– అంటే, ఆబోతును యథావిధిగా విడిచిపెట్టడం గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం. మరణానంతరం అపరకర్మలు జరిపేటప్పుడు పుత్రులు గాని, ఇతరులు గాని వృషోత్సర్గం చేయకపోతే, ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. అందువల్ల మహారాజా! నువ్వు కూడా ఒక ఆబోతును విడిచిపెట్టు. వృషోత్సర్గ మహిమ నీకు తెలియాలంటే, ఒక కథ చెబుతాను విను’ అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్భలను, మోదుగు ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్యపురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆయనను ఆకాశమార్గాన తీసుకుపోయి, విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు. అద్భుతమైన ఆ నగరంలో ధర్మవత్సుడికి రెండు రకాల మనుషులు కనిపించారు. కొందరు మలిన వస్త్రాలు ధరించి, దీనులై, నీరసులై ఉన్నారు. మరికొందరు ధగధగలాడే నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించి, ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి, అతడు ‘కలయా, వైష్ణవ మాయా’ అనుకున్నాడు. ఇంతలో అతణ్ణి అక్కడకు తీసుకువచ్చిన నలుగురు దివ్యపురుషులు అతడిని మహారాజు వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ వందిమాగధులు, పరిజనం, ఎదురుగా సభాసదులు కొలువుతీరి ఉన్నారు. అంతటి మహారాజు కూడా ధర్మవత్సుడిని చూడగానే, సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, అతడిని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. ‘విప్రవర్యా! మీవంటి విష్ణుభక్తుని దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది’ అంటూ నమస్కరించాడు. ఘనంగా కానుకలు సమర్పించి, సత్కరించాడు.ధర్మవత్సుడు కాస్త తేరుకుని, ‘మహారాజా! ఇది ఏ దేశం. ఇక్కడి జనాల్లో కొందరు దీనులై ఉంటే, ఇంకొందరు సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. దేవేంద్ర వైభవంతో నువ్వు విరాజిల్లుతుండటానికి కారణమేంటి? నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చారు?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! నా చరిత్రను వర్ణించి చెప్పే సామర్థ్యం నాకు లేదు. అందుకు మా మంత్రివర్యులే తగినవారు’ అని పలికాడు మహారాజు. మహారాజు మనసెరిగిన మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ‘భూసురోత్తమా! గతజన్మలో మా మహారాజు విధిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు. గోబ్రాహ్మణ సేవ చేస్తూ, నిత్యాగ్నిహోత్రుడై, అతిథి పూజ చేస్తూ, ధర్మబద్ధమైన జీవనం సాగించేవారు. ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, స్వస్థలానికి తిరిగి వస్తుండగా, తోవలో లోమశ మహర్షి దర్శనం లభించింది. వెంటనే ఆయన లోమశ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! నా యాత్రా ఫలం వెంటనే కనిపించింది. మీ దర్శన భాగ్యం లభించింది. నాదో చిన్న కోరిక! అంతర్బాహ్య స్థితులలో ఒకేలా ఉండే శుద్ధతను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞను పొందే సాధనమేదో తెలపండి’ అని కోరారు. అప్పుడు లోమశ మహర్షి, ‘వైశ్యవర్యా! సత్సాంగత్యం, సాధన, భక్తి, సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుంది. మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చేయాలి. వృషోత్సర్గం చేయనిదే పురుషార్థాలు నెరవేరవు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి, వృషోత్సర్గం చేయి’ అని ఆదేశించాడు. లోమశుని ఆదేశంతో గతజన్మలో వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కరతీర్థానికి వెళ్లి, అక్కడ వృషోత్సర్గం చేశారు. ఆ తర్వాత లోమశుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు. ఆ పుణ్యఫలం వల్ల చాలాకాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు. తిరిగి భూమ్మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారు’ అని చెప్పాడు మంత్రి. ‘ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడ సురక్షితంగా దిగవిడిచి రండి’ అని మహారాజు తన భటులను ఆదేశించాడు.ధర్మవత్సుడు ఆశ్చర్యపోయి, ‘అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? మళ్లీ ఎందుకు పంపేస్తున్నారు?’ అని అడిగాడు. ‘విప్రోత్తమా! మీ వంటి విష్ణుభక్తులను నా సన్నిధికి పిలిపించి, సత్కరించడం నాకు అలవాటు. ఇందులో మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి’ అని వినయంగా ప్రార్థించాడు మహారాజు. ధర్మవత్సుడు మహారాజును, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి, ఆయన భటులతో కలిసి ఇంటికి వెళ్లాడు.∙సాంఖ్యాయన (చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
అజ్ఞాత ప్రేమికుడు..!
ఆకాశాన్ని మేఘాలు కమ్ముకోసాగాయి. మెల్లమెల్లగా మట్టి వాసనను మోసుకొచ్చి ముక్కుపుటాలను తాకేలా చేసింది చిరుగాలి. మేఘాల నుంచి జారి నేలను ముద్దాడటానికి అన్నట్టుగా ఒక దానితో మరొకటి పోటీ పడసాగాయి వర్షపు చినుకులు. ఆ క్షణం నాకు చాలా అసహనంగా తోచింది. సాధారణంగా ధైర్యంగా ఉండే నాకు ఆ వాతావరణం బెదురుగా అనిపించింది.పూలు అమ్ముకొనే ఒక వృద్ధురాలు అదే బస్టాండ్లోకి వచ్చి ఒక చివరన కూర్చుంది. ఒక మనిషి తోడు ఉండటం మూలంగా నేను కాస్త కుదుటపడ్డాను. ఇంకాసేపటికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను నేరుగా వెళ్లి పూలు అమ్ముకునే వృద్ధురాలి పక్కన కూర్చున్నాడు. వారి సంభాషణను బట్టి, వారిద్దరూ భార్యాభర్తలు అని అర్థమైంది. ఈ వయసులో వారి అన్యోన్యతను చూసి ముచ్చటగా అనిపించి నవ్వుకున్నాను. వెంటనే అతను గుర్తొచ్చాడు. బస్టాండ్ షెల్టర్ నుంచి ఒక్కో వాన చినుకు ఒక దాని తర్వాత ఒకటి నేలను తాకసాగాయి. నా జ్ఞాపకాలు గతంలోకి పరుగులు పెట్టాయి.సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకొనే సమయంలో వాన జల్లులు పడుతున్నాయి. అప్పుడే చూశాను అతన్ని పదునైన చూపులతో కోటేరులాంటి ముక్కుతో, సన్నటి చిరునవ్వుతో ఉన్న అతని అందం నన్ను ఆకర్షించింది. చినుకులుగా రాలిన వానజల్లు జోరువానగా మారింది. ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న నన్ను నా చేయి అందుకొని పక్కనే ఉన్న చెట్టు కిందకి తీసుకుని వెళ్ళాడు అతను. నేను హతాశురాలిని అయ్యి అతన్నే చూస్తూ ఉన్నాను. వెంటనే అతను ‘క్షమించండి వర్షం ఎక్కువ అవుతుంది. మీరు ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతుంటే ఇక్కడికి తీసుకొచ్చాను’ అన్నాడు. ‘పర్వాలేదండి’ అన్నాను నేను. అరక్షణంలోనే తను తన స్నేహితులతో వానలో మాయమైపోయాడు.ఏదోలా ఇంటికి చేరుకున్న నేను అతని చిరునవ్వును గుర్తు చేసుకుంటూ ఆ రోజును ముగించేశాను.తెల్లవారుతుండగా ఇంటి ముందు బండిలో నుండి సామాను దించుతున్న శబ్దాలు వినిపిస్తుంటే, అటుగా వెళ్లి చూశాను. ఎవరో ఎదురింట్లో కొత్తగా వచ్చినట్లున్నారు అనుకొని నా పనిలో నేను మునిగిపోయాను. అలా మూడు రోజులు గడిచాయి..యథావిధిగా ఒక రోజు ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా, ఎదురింట్లోంచి అతను బయటకి వస్తూ ఎదురయ్యాడు. అతనెవరో తెలియనట్లు నా దారిన నేను వెళ్తుంటే అతనే నన్ను గుర్తుపట్టి ‘బాగున్నారా’ అని పలకరించాడు. నేను అతనెవరో తెలియనట్లు ‘ఎవరండీ మీరు?’ అని అడిగాను. దాంతో అతను ఆ రోజు వర్షంలో జరిగిన సంఘటన గుర్తు చేశాడు. ‘గుర్తొచ్చారండి’ అన్నాను నేను. ‘ఇక్కడేం చేస్తున్నారు?’ అని అడిగాను. ‘మూడు రోజుల క్రితమే మీ ఎదురింట్లోకి అద్దెకు వచ్చాను’ అని చెప్పాడు. ‘ఔనా!’ అనేసి వెంటనే తేరుకొని, ‘మా ఎదురింట్లో అంటున్నారు నేను ఇక్కడే ఉంటానని మీకెలా తెలుసు?’ అని అడిగాను. అతను తడబడుతూ, ‘అంటే.. అది.. మీరు ఈ ఇంట్లోకే వెళుతున్నారు కదా! ఇదే మీ ఇల్లు అని అనుకొని అలా చెప్పాను’ అన్నాడు. నాకెందుకో అతని వాలకం అనుమానంగా తోచింది. దాన్ని అంతటితో వదిలేసి ఇంట్లోకి వచ్చేశాను.రోజులు గడుస్తున్నాయి. అతను అప్పుడప్పుడు ఎదురు పడుతూనే ఉన్నాడు. ఒకరోజు నా పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఎవరో ఒకతను ఒకావిడ పేరు మీద అర్చన చేయిస్తూ ఉన్నాడు. అతని ముఖం కన్పించలేదు. అటు వైపు తిరిగి ఉన్నాడు. అర్చన అయిపోయి ప్రసాదం తీసుకొని అతను వెళ్ళిపోయాడు. నేను కూడా దేవునికి దండం పెట్టుకొని వెనుతిరుగుతూ ఉండగా చిరిగిన అర్చన టికెట్ నాకంట పడింది. అందులో ఉన్న పేరు చూసి షాక్ అయ్యాను.అందులో ఉన్నది నా పేరే, ‘మేఘన సుబ్రమణ్యం‘. వెంటనే పంతులుగారిని అడిగాను. అర్చన చేయించింది ఎవరని. ‘అతనెవరో నాకు తెలీదమ్మా! కాని మూడేళ్లుగా ఈ పేరుమీద ఇదేరోజున అర్చన చేయిస్తున్నాడు’ అని పంతులుగారు చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు కొంతసేపటి వరకు. కాని, ఒకటైతే అర్థమైంది. అతనెవరో నన్ను కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నాడని. మరి అతను ఎవరు? నేనెలా అతన్ని కనిపెట్టేది అని తెగ ఆలోచించసాగాను. కాని నా బుర్రకు ఏ ఆలోచనా తట్టలేదు. నా ఆలోచనలు అలా సాగుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం మా ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది నా పేరు మీద. ఏంటా అది అని తెరిచి చూస్తే అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో–‘‘సుందరి! ఇది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. ‘ఇదే ఎందుకు పెట్టుకున్నాడు?’ అని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ‘సుందరీ నేనే నువ్వంటా, చూడని నీలో నన్నంటా’. అనే దళపతి సినిమాలో పాట చాలా ఇష్టం. ఆ పాట వింటూ నేను నిన్ను నా సుందరిగా ఊహించుకుంటూ ఉంటాను. ఇంతకు నేనెవరో నీకు తెలియదు కదూ! నేను నీ అజ్ఞాత ప్రేమికుడిని. గత మూడేళ్లుగా నిన్ను చూస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ రోజులు గడుపుతూ ఉన్నాను. నిన్ను చూసిన మొదటి క్షణం ఒక తండ్రి తనకు కూతురు పుట్టింది అని తెలియగానే పడే ఆనందపు తాలుకా అనుభూతిని నాలో నేను చూశాను. ఆ అనుభూతి ఇంతకు ముందెప్పుడు నాకు కలగలేదు. అప్పుడే ఫిక్స్ అయ్యాను నువ్వే నా సుందరివని, నిన్ను ఎప్పుడు విడువలేనని. కాని, ఇక్కడే పెద్ద సమస్య వచ్చిపడింది. అదేంటంటే, నేను నీ ముందుకు రాలేనని, నేనెవరినో నీకు తెలియకుండా ఉండాలని నా తలరాత నాకు చెప్పింది. అందుకే ఈ దాగుడుమూతలాట. తెలియకుండా ఉండాలని అనుకొని ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు రాశాడని నువ్వు అనుకోవచ్చు. కాని, నాలో అంతా ఇంతా కాదు, బోలెడంత ప్రేమ ఉంది నీ మీద. ఆ ప్రేమ నా మనసులో సరిపోలేక, అందులో దాగక బయటకి వస్తా వస్తా అని మొర పెడుతోంది. అందుకే దాని మొరకు ఈరోజు విముక్తినిచ్చాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా ప్రేమ నీ చెంతకు చేరిందని...’’ఇట్లు అజ్ఞాత ప్రేమికుడు.ఎవరు ఈ అజ్ఞాత ప్రేమికుడు? ఇన్నేళ్లుగా నన్ను ఫాలో అవుతుంటే నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? అంత ప్రేమను నామీద పెంచుకొని ఎందుకు నా దగ్గరకు రాలేకపోతున్నాడు? నన్ను కలవలేకపోతున్నాడు? ఇలా నా మైండ్, నా మనను ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాయి. ఎంతకూ అర్థంకాలేదు కాని, ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యాను. ఆ అజ్ఞాత ప్రేమికుడిని ఎలాగైనా కలవాలని, తన ప్రేమను కళ్ళారా చూసి, అనుభూతి పొందాలని. అలా ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోయింది.నేను ఆ ఆజ్ఞాత ప్రేమికుడిని వెతికే పనిలో పడ్డాను. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజూ మా ఎదురింటి అబ్బాయి నాకు తారసపడుతూనే ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో. అలా మా మధ్య స్నేహం కూడా కుదిరింది. నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తునే ఉన్నాడా అబ్బాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ. అందుకేనేమో, ఇద్దరి బాధలు ఒకటై ఒకరిలో ఒకరం అమ్మనాన్నల ప్రేమను వెతుక్కుంటూ ఉన్నాం. అతని స్నేహం నా అజ్ఞాత ప్రేమికుని వెతుకులాటను మరచిపోయేలా చేసింది. కాని, మధ్య మధ్యలో అతను రాసిన లెటర్ గుర్తొచ్చేది. ఎంత వెతికినా అతను నాకు దొరకలేదు. కాని, ఎందుకో అతను నాదగ్గరే ఉన్నట్లు, నన్ను ప్రతిరోజు గమనిస్తున్నట్లు, నా చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుండేది. ఎందుకో కొన్ని రోజుల నుంచి మా ఎదురింటి అబ్బాయి నాకు కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడులే అని అనుకున్నాను. అలా రోజులు కాదు, నెలలు కూడా అయ్యాయి. అయినా ఆ అబ్బాయి ఇంకా రాలేదు. ఏమై ఉంటాడు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే సందేహం కలిగింది. కాని, ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్ళి ఉంటాడని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అలా ఒక రోజు నేను ఎప్పుడూ వెళ్ళే శివాలయానికి వెళ్ళాను చాలా రోజుల తర్వాత. పూజ పూర్తి చేసుకుని బయలుదేరుదాం అన్న సమయానికి నా పుట్టినరోజున మాట్లాడిన పంతులుగారు ఎదురుపడి, ‘ఆరోజు నువ్వు ఒక అబ్బాయిు గురించి అడిగావు కదా! ఆ అబ్బాయి తన విజిటింగ్ కార్డు గుళ్లో పడేసుకున్నాడు. అది నాకు దొరికిందమ్మా! దాన్ని చూస్తే నువ్వే నాకు జ్ఞాపకం వచ్చావు. అందుకే నీ కోసమే దాన్ని దాచి ఉంచాను’ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి నాకిచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. ఎన్నో రోజుల నుండి వెతికినా, ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో నాకు తెలిసే సమయం ఆసన్నమైందని మనసు పులకరించిపోయింది. దాన్ని తీస్కోని చూశాను. అందులో ‘సూర్య జాగర్లముడి’ అని పేరు ఉంది. ఈ పేరు నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. వెంటనే అడ్రస్ చూశాను. చూడగానే నా మైండ్ ఒక్కసారిగా పని చేయడం ఆగిపోయింది. ఎందుకంటే ఆ అడ్రస్ మా వీధిలో ఉండే ఒక ఇంటి అడ్రస్. నేను నమ్మలేకపోయాను. వెంటనే తేరుకుని పంతులుగారికి థాంక్స్ చెప్పేసి, పరుగుపరుగున ఆ ఇంటికి దారితీశాను. ఆ ఇల్లు ఉన్న అడ్రస్కు చేరుకున్నాను. తాళం వేసి ఉంది ఆ ఇంటికి. ఏం చేయాలో తోచలేదు. సమయానికి మా ఎదురింటి అబ్బాయి కూడా లేడు. నాకే ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఒక రాయి తీసుకొని తాళం పగులగొట్టాను. తలుపులు తీసుకొని గదిలోకి అడుగు పెట్టాను. అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించలేదు. వెంటనే గోడ మీద స్విచ్బోర్డు వెతికి స్విచ్ వేశాను. అంతే గోడకు ఉన్న ఫోటో చూసి హతశురాలయ్యాను. ఆ ఫోటోలో ఉన్నది మా ఎదురింటి అబ్బాయి కిరణ్. అంటే అతని పూర్తి పేరు ‘సూర్య కిరణా!’నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా ఒక కలలా తోచింది. ఇన్ని రోజులు నా దగ్గరే ఉంటూ, నాతో మాట్లాడుతూ ఎందుకు ఈ దాగుడు మూతలాడటమో నాకు అర్థం కాలేదు. నా స్నేహితుడే నా అజ్ఞాత ప్రేమికుడు అని తెలిసి, నా మనసు అతలాకుతలమైంది.కాని, ఆ సంతోషం నీటి ఆవిరిలా క్షణకాలంలో మాయమైపోబోతోందని ఆ క్షణంలో నాకు తెలియలేదు. అప్పుడే నా కంట పడింది ఒక ఉత్తరం అది తీసి చదవడం మొదలుపెట్టాను. అందులో...‘సుందరి నువ్వు వస్తావని నాకు తెలుసు. కాని, నువ్వు వచ్చే సమయానికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. అవును క్యాన్సర్తో పోరాడుతున్న రోజులవి. అప్పుడే నేను నిన్ను మొదటిసారి చూశాను. చిన్న పిల్లలాంటి నీ మనస్తత్వం నిన్ను ప్రేమించేలా చేసింది. కాని, నీకు నా ప్రేమను చెప్పుకునే పరిస్థితిలో లేను. చెప్పి నిన్ను కూడా నా ప్రేమలో పడేసి, నీకు దూరంగా వెళ్ళిపోయి, తీరని బాధని నీకు మిగల్చకూడదు అనుకున్నాను. అందుకే నీకు దూరంగా ఉంటూ, నిన్ను చూస్తూ, ప్రేమిస్తూ ఉన్న సమయంలో నువ్వే నా దగ్గరకు వచ్చావు. నన్ను చూస్తూ మైమరచిపోయిన ఆ రోజును నేను మరచిపోలేను. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్న నిన్ను గట్టుకు చేర్చాను. ఆ రోజు అనుకున్నాను నేను ఇంకా నీకు దూరంగా ఉండలేనని. అందుకే మీ ఎదురింటికి వచ్చేశాను. నీతో స్నేహం చేశాను. నిన్ను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉన్నాను. కాని, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది. అందుకే నీకు చెప్పలేక దూరంగా వెళ్ళిపోయాను. ఎంతో వేదనతో ఈ ఉత్తరం నీకోసం రాశాను– ఎప్పటికైనా నీదగ్గరికి చేరుతుందని నమ్ముతూ...ఉత్తరం నా చేయి జారిపోయింది. ఎడతెరపి లేని వానలా, ఉప్పొంగే వరదలా, ఉగ్రరూపం దాల్చిన సముద్రపు అలల్లా నా మనసు రోదించింది. నా జ్ఞాపకాలు గతం నుంచి బయటకు వచ్చాయి. నా కన్నీరు ఏ కంటికి కానరాకుండా ఇదే వాన నీటిలో కనుమరుగయ్యాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ. (చదవండి: యువ కథ: వసంత కోకిల) -
సండే ఫండే.. ఇక సందడే..
మెట్రో నగరాల్లో వీకెండ్స్ సందడికి కొదవే ఉండదు. వీకెండ్స్ అంటేనే ఇక్కడ ఒక ట్రెండ్ అన్నట్టు. అయితే గత కొంత కాలంగా ఈ ట్రెండ్ నెమ్మదించింది. వారాంతాల్లో ఫుల్ జోష్తో జరిగే ఈవెంట్లు కరోనా తర్వాత నెమ్మదించాయి. దీనికితోడు నగరంలో అధికారికంగా నిర్వహించే వీకెండ్ కార్యక్రమాలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే గతంలో కొంత కాలం పాటు నగరవాసుల్ని ఉర్రూతలూగించిన వారాంతపు వినోద కార్యక్రమం మరోసారి ‘సండే.. ఫండే’ తిరిగి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. నగరం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తున్నారు. నగర వాసులు ఎంతో ఆసక్తిగా పాల్గొనే వీకెండ్ కార్నివాల్ కార్యక్రమం మళ్లీ తిరిగి రానుంది. ప్రతి వారాంతపు రోజును ‘సండే–ఫండే’ పేరిట ఉర్రూతలూగించే విధంగా నిర్వహించారు. కరోనా తర్వాత పూర్తిగా నెమ్మదించిన ఈ పరిస్థితి. అనంతరం కొంత కాలం నిర్వహించినా.. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల వల్ల ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీకెండ్ జోష్కు మిస్ వరల్డ్ పోటీ తిరిగి ఊపిరిపోయనుంది. ఈ ఈవెంట్ మే 18న ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ విభిన్న రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో జానపద నృత్యాలు, వంటల పోటీలు వంటి మరెన్నో నగర వాసులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంపై రాష్ట్ర చరిత్ర, అభివృద్ధి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.నాటి వీకెండ్.. సూపర్ హిట్.. నగరవాసులకు వినోదం ద్వారా వారాంతపు ఆహ్లాదాన్ని పంచడానికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ‘సండే–ఫండే’కు రూపకల్పన చేశారు. దీని కోసం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకూ ట్యాంక్ బండ్ రోడ్డు మీద వాహనాలకు ప్రవేశం ఆపేసి, ఈ వినోద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ రహదారిని పలు రకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ఏర్పాట్లతో ట్యాంక్ బండ్ రోడ్ ఒక ఓపెన్ ఎంటర్టైన్ మెంట్ ప్లేస్గా అవతరించేది. ఆ సందర్భంగా మ్యూజికల్ ప్రదర్శనలు, అబ్బురపరిచే ఫైర్వర్క్స్, జానపద కళలు, ఇంద్రజాల ప్రదర్శనలు వంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహించేవారు.ప్రమోషన్ యాక్టివిటీస్.. ఆరీ్మకి చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ ప్రదర్శనలు, శిల్పారామం కళాకారుల చేతి వృత్తిదారుల ఉత్పత్తుల అమ్మకాలు, ఫుడ్ ట్రక్స్ ద్వారా వివిధ రకాల వంటకాలు.. వంటివి ఇందులో భాగమయ్యేవి. అంతే కాకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎమ్డీఏ) ద్వారా ఉచిత మొక్కల పంపిణీ కూడా జరిగేది. లేజర్ షోలు, ఫైర్ స్పోర్ట్స్ ఉండేవి. పలు ప్రైవేటు టీవీ చానెళ్లు తమ ప్రమోషన్ యాక్టివిటీస్కు కూడా అదే సందర్భాన్ని ఉపయోగించుకునేవి. దీంతో చిన్నితెర సెలబ్రిటీలు, యాంకర్స్ సైతం నగరవాసులకు కనువిందు చేసేవారు. అదే సమయంలో హుస్సేన్ సాగర్ వద్ద ఫౌంటెన్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. కోవిడ్ కారణంగా నిలిపేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత మధ్యలో ఒకసారి పునరుద్ధరించినా దీర్ఘకాలం కొనసాగలేదు. చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం ఈ ఈవెంట్ను నిర్వహించారు.రీఛార్జ్.. రీస్టార్ట్.. సండే ఫండే నాటి ఉత్సాహాన్ని మళ్లీ తీసుకురావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం నగరం కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను ఎంచుకున్నారు. నగరవాసులు మరచిపోయిన వారాంతపు సందడి సండే ఫండేకు పునరై్వభవం రావాలంటే.. అది మిస్ వరల్డ్ పోటీదారులను ఇందులో భాగం చేయడం ద్వారా సాధ్యపడుతుందని భావించి, మిస్ వరల్డ్ డైలీ షెడ్యూల్లో దీనిని కొత్తగా జేర్చారు. ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ ఈవెంట్ నిరాటంకంగా కొనసాగుతుందని వారమంతా అలసి, సొలసిన నగర జీవికి సాంత్వన పంచుతుందని ఆశిద్దాం. -
అనగనగా ఓ కేసు!
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిన్ డినైడ్’ అనేది న్యాయశాస్త్ర ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ కొన్ని కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మానవ వనరుల లేమి, మౌలిక వసతుల కొరత సహా అనేక కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్న కుషాయిగూడ పోలీసుస్టేషన్లో 2001 ఫిబ్రవరిలో నమోదైన ‘భారీ దొంగతనం’ కేసు విచారణ కోర్టులో 24 ఏళ్లు సాగింది. చివరకు 2025 ఏప్రిల్ 2న వీగిపోయింది. ఈ కేసులో పదిమంది నిందితులు ఉండగా, కోర్టు తీర్పు వెలువడే నాటికి ఐదుగురు చనిపోయారు. అది కుషాయిగూడలోని కమలనగర్ ప్రాంతం. అక్కడి శ్రీ సాయి అపార్ట్మెంట్లో ఎ.కృష్ణమూర్తి అనే వ్యాపారి ‘రూప క్లాత్ ఎంపోరియం’ పేరుతో వస్త్ర దుకాణం ఏర్పాటు చేశారు. విక్రయాల కోసం పనివాళ్లను ఏర్పాటు చేసుకోకుండా, స్వయంగా నిర్వహణ బాధ్యతలు చూసుకునే వారు. నాటి వ్యాపార వేళలు నేటికి భిన్నంగా ఉండేవి. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటలకే వస్త్ర దుకాణాలు తెరుచుకునేవి. ఎప్పటిలాగే 2001 ఫిబ్రవరి 16 ఉదయం ఆయన తన షాపు తెరిచారు. ఆ వెంటనే తన దైనందిన కార్యకలాపాల్లో ముగినిపోయారు. ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు ఉదయం 11 గంటలకే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు రావడం ప్రారంభమైంది. దీంతో ఆ రోజు తన పంట పండిందని భావిస్తూ కస్టమర్లకు స్వాగతం పలికారు. అలా వచ్చిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఎవరికి వారు తమకు కావాల్సిన వస్త్రాలను చూపించాలని కోరడంతో దుకాణం మొత్తం హడావుడి నెలకొంది. అయితే చివరకు కృష్ణమూర్తి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు.కస్టమర్లు వెళ్లిపోయాక వారికి చూపించడానికి బయటకు తీసిన వస్త్రాలన్నింటినీ కృష్ణమూర్తి సర్దుకోవడం మొదలెట్టారు. అప్పుడు స్టాకులో తేడా రావడాన్ని గమనించి, దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. షాపు తెరిచిన వెంటనే కొనుగోలుదారులుగా వచ్చిన వాళ్లల్లో ఎవరో తస్కరించినట్లు అనుమానించారు. దుకాణం మూసి బయటకు వెళ్లిన కృష్ణమూర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన నేరుగా కుషాయిగూడ పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడంటే ఏదైనా ఓ నేరం జరిగిందని ఫిర్యాదు వచ్చిన వెంటనే సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్, నిందితులు వినియోగించిన సెల్ నెంబర్, ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నెంబర్ల పైనే పోలీసుల దృష్టి పడుతోంది. సీసీ కెమెరాలు లేని, సెల్ఫోన్లు అంతగా వినియోగంలోకి రాని రోజులు కావడంతో సంప్రదాయ దర్యాప్తు విధానాలతోనే ముందుకు వెళ్లారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నగరంలోని పాత నేరగాళ్ల వివరాల ఆరా తీశారు. ఇలాంటి నేరాలు గతంలో చేసిన వాళ్లు ఎవరెవరు? ప్రస్తుతం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు వేగులకూ పని చెప్పారు. నేరం జరిగిన తీరును బట్టి వ్యవస్థీకృత నేరగాళ్ల పనిగా భావించారు. ఇలాంటి వాళ్లు పదేపదే నేరాలు చేసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలోని అన్ని వస్త్రదుకాణాల యజమానులను అప్రమత్తం చేశారు. కుషాయిగూడ పోలీసులు తీసుకున్న ఈ చర్య ఫలితాన్ని ఇచ్చింది. రూప క్లాత్ ఎంపోరియంలో చోరీ జరిగిన వారం రోజులకు మరో వస్త్ర దుకాణాన్ని టార్గెట్ చేసిన ముఠాలోని కొందరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ షాపులో బేరసారాలు చేయడం మొదలెట్టారు. వీరి వ్యవహారశైలి, వస్త్రధారణ, నేరం చేసే తీరు తదితర అంశాలపై పోలీసులు ప్రచారం చేసి ఉండటంతో ఆ దుకాణం యజమాని గుర్తించాడు. వెంటనే స్థానికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. రూప క్లాత్ ఎంపోరియంలోకి తమతో పాటు వచ్చి, నేరంలో పాలుపంచుకున్న అనుచరుల వివరాలను బయటపెట్టారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మొత్తం పది మందిని అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని లంబాడికుంట తండాకు చెందిన ఈ పదిమంది వ్యాపారి కృష్ణమూర్తి దృష్టి మరల్చి చోరీ చేసినట్లు తేల్చారు. ఆధారాలు సేకరించిన కుషాయిగూడ పోలీసులు న్యాయస్థానంలో అదే నెల 28న అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో బెయిల్ పొందిన నిందితులు జైలు నుంచి బయటకు రాగా, కొన్నాళ్లకు కేసు విచారణ ప్రారంభమైంది. అనివార్య కారణాల వల్ల 2025 ఏప్రిల్ 2 వరకు దీని విచారణ కొనసాగింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో సబ్ ఇన్స్పెక్టర్గా (ఎస్సై) ఉన్న అధికారి పదోన్నతుల తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) హోదాలో కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 2001లో నిందితుల కోసం గాలించిన పోలీసులు కొన్నాళ్లకు ఫిర్యాదుదారుడైన కృష్ణమూర్తి, ఇతర సాక్షుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయస్థానంలో వీరు చెప్పే సాక్ష్యాలు అత్యంత కీలకం. అయితే కేసు విచారణ కీలక దశకు చేరుకునే సరికి కృష్ణమూర్తి తన వ్యాపారం మానేశారు. శ్రీసాయి అపార్ట్మెంట్స్తో పాటు అప్పట్లో ఆయన నివసించిన ఇంటి వద్దకూ వెళ్లిన పోలీసులు కృష్ణమూర్తి వివరాల కోసం ఆరా తీశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, కృష్ణమూర్తితో పాటు ఇతర సాక్షుల ఆచూకీ లభించలేదు. ఈ కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడితో (ఏ–1) పాటు మూడు, నాలుగు, ఐదు, పదో నిందితులు చనిపోయారు. మిగిలిన ఐదుగురిపై తుది వరకు విచారణ సాగినా, చివరకు కేసు వీగిపోయింది. ఇన్ని మలుపులు తిరిగిన ఈ కేసులో కృష్ణమూర్తి దుకాణం నుంచి చోరీ అయినవి ఏంటో తెలుసా? ఐదు తానుల కాటన్ వస్త్రం, మూడు లంగాలు, ఒక రవిక ముక్క. కుషాయిగూడ పోలీసు రికార్డుల ప్రకారం అప్పట్లో వీటి విలువ రూ.8 వేలు. -
యువ కథ: వసంత కోకిల
భానుడు భగ భగమంటూ నిప్పులు కురిపిస్తున్న వేసవిలో ఉసురుమంటూ ‘ఏమేవ్! కాసిన్ని మంచినీళ్లు తీస్కునిరావే’ అంటూ వాలుకుర్చీలో కూలబడ్డాడు గురుమూర్తి. పంకజం భర్త కేక విని చెంబుడు నీళ్లతో పరుగున ప్రత్యక్షమైంది. నీళ్ల చెంబు అందుకుంటూ, ‘అబ్బా ఏమి ఎండలో! ఎండిన గడ్డిలాగా అయిపోతున్నాం’ అంటూ దాహం తీర్చుకుని చెంబు చేతికిచ్చాడు. ‘ఇదిగో ఒక పావుగంట అయినాక భోజనం వడ్డించు. తిని బయలుదేరాలి’ అంటూ పడకగది వైపు వెళ్ళాడు. పంకజం భోజనం వడ్డించి, భర్త కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ‘ఒసేయ్ ఇంటిదానా ఇటు రా!’ బిగ్గరగా అరిచాడు గురుమూర్తి. కంగారుగా పరుగు పెట్టింది పంకజం.‘ఏమిటి ఏమైంది?’ అంటూ ఆత్రంగా అడిగింది. కోపంతో ఊగిపోతూ, ‘ఈ ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది?’ అంటూ శివాలెత్తాడు. ఆ ఫోటో వాళ్ళ కూతురు కోకిలది. ఆ ఫోటో అందుకుంటూ, కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ‘అది బూజు దులిపేటప్పుడు ఇక్కడ పెట్టాను’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పంకజం.గురుమూర్తి భోజనం చేసి మధ్యాహ్నం బండికి పట్నం బయలుదేరాడు ఆస్తుల రిజిస్ట్రేషన్ కాగితాల కోసం.సాయంత్రం సంధ్యా దీపం పెట్టి, ఆరుబయట వరండాలో మామిడిచెట్టు అరుగుపైన కూర్చుని మల్లెపూలు అల్లుతోంది పంకజం. ఒక్కో పువ్వు తీసుకుంటూ, ఒక్కో జ్ఞాపకం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా, దూరపు చుట్టం కాంతమ్మ వచ్చింది.‘వదినా ఓ వదినా! హమ్మయ్య ఇక్కడున్నావా? ఇల్లంతా వెదికి వస్తున్నా సుమీ!’ అంది. పంకజం తేరుకొని, ‘వదినా బాగున్నావా? అందరూ క్షేమమేనా?’ అంటూ కుశల ప్రశ్నలడిగి, దాహం ఇచ్చింది. ‘అంతా బాగుంది కాని, వదినా నేను విన్నది నిజమేనా?’ అంటూ ఉండగానే, పంకజం మధ్యలో ఆపి, ‘సరే వదినా! మర్చిపోయాను గుడికి వెళ్ళాలి ఏమనుకోకు. తయారవడానికి వెళుతున్నా. తర్వాత మాట్లాడుదాం’ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ‘ఇదేం చోద్యమో’ అనుకుంటూ కాంతమ్మ వీధిలోకి నడిచింది.కాసేపయ్యాక పంకజం ‘మాట దాటేయటానికి గుడి అన్నాను కానీ ఒకసారి గుడికెళ్లి వస్తే కాస్త మనసు కుదుటపడుతుంది’ అనుకుని గుడికి బయల్దేరింది. దర్శనం అయ్యాక, గుళ్లో కూర్చుని ఒక్కసారిగా గతం గుర్తు చేసుకుంది.కట్టుబాట్లు çపరువుప్రతిష్ఠలే ప్రాణప్రదంగా జీవించే మనస్తత్వం గురుమూర్తిది. అందులోనూ ఆడపిల్లకి గురుమూర్తి తనకు తాను కొన్ని కట్టుబాట్లు పెట్టాడు. అందుకేనేమో ఆ దేవుడు ఆయనకి ఒక్కగానొక్క కూతుర్ని ఇచ్చాడు. చూడటానికి రెండు కళ్లూ చాలవన్నంత అందం అమ్మాయిది. పేరు కోకిల.ఈ కాలంలో కూడా చిన్నప్పటి నుండి పరదా వెనుక నుంచే కోకిల చదువు, సంగీతం అన్నీ. కాని, పెద్దచదువు చదివి, మంచి ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే భావాలు ఆమెవి. గురుమూర్తి చాదస్తపు కట్టుబాట్ల వల్ల తన కోరిక ఒక ఎండమావిలా అగుపించేది. ఎలాగోలా ఓపెన్లో ఇంటర్ పరీక్షలు రాసింది. కాని, అసలైన పరీక్ష తన పెళ్లి అని తనకి తెలియదు. గురుమూర్తి కోకిల కోసం పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసి తల్లి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంది కోకిల. తల్లి పంకజం ఏమీ చేయలేని నిస్సహాయురాలని గ్రహించి, నేరుగా తండ్రితోనే తాను అనుకున్నది చెప్పాలనుకుంది. ఒకరోజు వసారాలో పేపర్ చదువుతున్న గురుమూర్తి దగ్గరికి వెళ్లి, పైచదువులు చదువుకుంటానని చెప్పింది.అతను వినలేదు. కన్నీళ్లు పెట్టుకుని, బాధపడింది. అయినా కట్టుబాట్లతో కఠినంగా మారిన గురుమూర్తి హృదయం కరగలేదు. పెళ్లివారు రానే వచ్చారు అబ్బాయి వయసులో తనకన్నా పన్నెండేళ్లు పెద్దవాడు. గవర్నమెంట్ ఉద్యోగం అని గురుమూర్తి ఒప్పుకున్నాడు. కోకిలకి ఏమాత్రం చెప్పకుండా, కనీసం అబ్బాయి ఫొటో అయినా చూపకుండా పెళ్లి కుదిర్చాడు. కోకిల వేదన అరణ్యరోదనే అయింది. వారం రోజుల్లో పెళ్లి. రెండు రోజులయ్యాక పేపర్లో డిగ్రీలో ప్రవేశం గురించి వార్త చూసింది కోకిల. ఒకవైపు చదుకోవాలనే తపన. ఇంకోవైపు బలవంతపు పెళ్లి. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఆమెది. ఏదేమైనా తన జీవితం తనది అనుకుంది. తల్లి దగ్గరకి వెళ్లి డిగ్రీ చేరుతానని, తన జీవితాన్ని నిలబెట్టమని కాళ్ళపైన పడింది. తల్లి తన పుట్టింటి వారు ఇచ్చిన నగలు కోకిలకిచ్చి, నాలుగు జతల బట్టలు సంచిలో పెట్టి తనకి తెలిసినవారు పట్నంలో ఉన్నారంటూ, వాళ్ళ అడ్రస్ కాగితం ఇచ్చి బయటకి పంపించేసింది. కోకిల ఇంట్లో కనిపించకపోవటం, పెళ్లి ఆగిపోవటంతో పరువు పోయినట్లు భావించిన గురుమూర్తి, పచ్చని పెళ్లిపందిట్లో తలంటు పోసుకుని, తన బిడ్డ చనిపోయిందంటూ కోపంతో ఊగిపోయాడు.గుడిలో గంట ఖంగుమని మోగిన శబ్దంతో ఉలికిపడిన పంకజం జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి, ఇంటికి బయలుదేరింది.ఇదంతా జరిగి ఐదేళ్లు అయింది. ఈ ఐదేళ్లూ్ల కోకిల గురించిన క్షేమ సమాచారం ఏదీ లేదు.రాత్రి పొద్దుపొయే సమయానికి గురుమూర్తి అలసిపోయి వచ్చాడు. కాళ్ళు కడుక్కుని లోనికి వచ్చి, ‘పని అవలేదు. రేపు పట్నం వెళ్ళాలి. తెల్లవారి నాలుగు గంటలకి నిద్రలేపు’ అని చెబుతూ, భోజనం ముగించి నిద్రకి ఉపక్రమించాడు. పట్నం అనగానే పంకజం మనసంతా కోకిల గురించే తపన. త్వరలో తన ఆచూకీ తెలిస్తే బాగుండు అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి దండం పెట్టుకుంది.తెల్లవారి నాలుగు గంటలకి గురుమూర్తిని లేపింది పంకజం. గురుమూర్తి స్నానపానాలు ముగించుకుని, పట్నానికి బయలుదేరాడు. ఉదయం పదిన్నర గంటలకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళాడు. ‘ఇక్కడ పని జరగదు. ఎమ్మార్వో ఆఫీస్కి వెళ్ళాలి’ అని చెప్పారు. సరేనంటూ ఎమ్మార్వో ఆఫీస్కు బయలుదేరాడు.ఎమ్మార్వోగారు ఇంకా రాలేదని పక్కగదిలో వేచి ఉండమని చెప్పాడు బంట్రోతు. పక్కగదిలో కూర్చున్నాడు గురుమూర్తి. పదినిముషాల తర్వాత కాస్త సందడిగా అనిపించింది. బంట్రోతు వచ్చి, ‘ఎమ్మార్వోగారు వచ్చారు. రావాల’ని చెప్పాడు.‘ఎమ్మార్వోగారికి నమస్కారం’ అంటూ గదిలోకి వెళ్లి, తాను తెచ్చిన డాక్యుమెంట్లు చూపించబోతూ, ఎమ్మార్వోని చూసి నిర్ఘాంతపోయాడు గురుమూర్తి.‘నువ్వా?’ అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ ఎమ్మార్వో ఎవరో కాదు, కోకిల!ఏమాత్రం మారని తండ్రిని చూస్తూ మౌనంగా నిలబడింది కోకిల.గురుమూర్తి ఇంటికి చేరుకొని, బావి దగ్గర తలమీద నీళ్లు గుమ్మరించుకుని. ‘దేవుడా క్షమించు! చచ్చినవాళ్ల దగరికి వెళ్లొచ్చాను’ అంటూ దేవునికి దండం పెట్టుకున్నాడు. భర్తను చూస్తూ నిశ్చేష్టురాలై, నిలబడిపోయింది పంకజం.కాసేపయ్యాక నెమ్మదిగా గదిలోకి వెళ్లి, ‘ఏమైందండీ?’ అని భయపడుతూనే అడిగింది.ఒక్కసారిగా భర్త చూసిన చూపుకి భయపడి, గదిలోనించి బయటకు వెళ్ళింది. ఆ రాత్రి ఎలాగో గడిచింది. తెల్లారాక ఇంటి వసారా ఊడ్చి, గుమ్మం ముందు ముగ్గు పెటి,్ట మామిడిచెట్టు అరుగుపైన కూర్చుని, పంకజం ఆలోచించసాగింది ‘భర్త కోపానికి కారణం ఏమై ఉంటుందా?’ అని.‘ఒసేయ్! కాసిన్ని కాఫీ నీళ్లయినా ఇవ్వకుండా, అంతగా ఆలోచిస్తూ బయటే ఉన్నావేంటే’ అంటూ భర్త గొంతు వినేసరికి ఉరుకున లోపలికి వెళ్ళింది.గురుమూర్తి వసారాలో వాలుకుర్చీలో కూర్చుని, ఏదో ఆలోచిస్తున్నాడు.అతని మొహంలో ఏదో వెలితి ఉందని పంకజం గ్రహించలేకపోలేదు. వేడి వేడి కాఫీ భర్తకు అందించి, ఏదో చెప్తాడేమోనని అక్కడే నిలబడింది.ఇంతలో గుమ్మంలో ఏదో కారు ఆగిన శబ్దం వినిపించడంతో ఇద్దరూ అటు చూశారు. కారులోంచి నారింజ రంగు కాటన్ చీర కట్టుకుని, నిండైన రూపంతో దిగి నిలబడింది కోకిల. పంకజం తదేకంగా చూసి తన బిడ్డే అని గ్రహించి, ‘అమ్మా! కోకిలా!’ అంటూ గుమ్మంవైపు పరుగు పెట్టింది. ఇంతలో ‘ఆగు పంకజం’ అని భర్త హూంకరించడంతో అడుగు ముందుకేయలేదు. ‘ఏవండీ మన బిడ్డ ఇన్నేళ్లకు కళ్ల ముందుకు వస్తే, నా తల్లి పేగు ప్రేమని ఎందుకు ఆపుతున్నారు?’ అంటూ భోరున ఏడ్చింది భర్త వైపు తిరిగి. ‘మన బిడ్డ ఎక్కడుందే ఐదేళ్లకు ముందే అది చచ్చింది. దాన్ని అటునుంచే పొమ్మను’ అన్నాడు ఉక్రోషంగా. ఇంతలో ‘క్షమించండి. బతికి ఉన్న నా భార్యను అలా అనటానికి నేను ఒప్పుకోను’ అంటూ కోకిల పక్కగా వచ్చి నిలబడ్డాడు వసంత్. అజానుబహుడి రూపం. ‘చూడ చక్కని జంట, చూసే కనులకు పంట’ అన్నట్లు ఉన్నారు ఇద్దరూ. గురుమూర్తి కోపం ఇంకా ఎక్కువైంది. ‘ఓహో దీన్ని కట్టుకున్న దరిద్రునివా నువ్వు?’ అన్నాడు.వసంత్ లోపలికి వచ్చి, ‘చూడండి మామగారు సంప్రదాయాలు సంస్కృతి ఉండాలి. కట్టుబాట్లు ఉండాలి కాని, అవి జీవితాలను నాశనం చేసేలా ఉండకూడదు. మీ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవలసిన మీరే తనకి జీవితం లేకుండా చేయటం కరెక్ట్ అంటారా? అంతే కాదు మీరు ఎవర్ని అయితే మీ కూతురికి ఇచ్చి చేయాలనుకున్నారో అతను ఇప్పుడు లంచం తీసుకున్నందుకు ఉద్యోగం పోగొట్టుకుని, జైల్లో ఉన్నాడు. ఆనాడు కోకిల బయటకి రాకపోయి ఉంటే ఈనాడు తన జీవితం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి’ అన్నాడు వసంత్. ఆలోచనలో పడ్డ గురుమూర్తి కుర్చీలో కూర్చున్నాడు. కోకిల లోపలికి వచ్చి, ‘నాన్నా! నన్ను క్షమించండి. మీ మాట కాదని ఇంట్లోంచి వెళ్ళటం తప్పే కాని, నా జీవితం కోసం వెళ్లక తప్పలేదు’ అంది. ‘అమ్మా!. ఆ రోజు ఇంటి నుంచి బయటపడ్డాక రైలులో పట్నానికి బయలుదేరాను. తోవలో నిద్రలో ఉండగా, నువ్వు ఇచ్చిన నగలు, డబ్బు, తెలిసినవాళ్ళ అడ్రస్ చీటీ అన్నీ పోయాయి. ఏం చేయాలో దిక్కు తోచక స్టేషన్లో ఏడుస్తూ ఉంటే, ఈయన నన్ను చేరదీసి, వివరాలు తెలుసుకుని, నన్ను ఒక ఆశ్రమంలో చేర్చారు. నా చదువు, నా బాగోగులు చూసుకుంటూ, నా కాళ్ళ మీద నేను నిలబడేట్లు చేసి, ఈ రోజు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారు. నన్ను పెళ్లి చేసుకుని జీవితానికి భరోసా ఇచ్చారు. ఈయన లేకపోతే నాన్న అన్నట్లు ఏనాడో చనిపోయేదాన్ని’ అంటూ కన్నీళ్ల పర్యంతం అయింది.ఈ మాటలు గురుమూర్తిని కరిగించాయి. తన మూర్ఖత్వంతో ఇన్నాళ్లూ భార్యను, ఒక్కగానొక్క బిడ్డను ఎంత ఇబ్బంది పెట్టాడో తలచుకొని పశ్చాత్తాపపడ్డాడు. తమ బిడ్డకి అమూల్యమైన జీవితాన్ని ఇచ్చిన వసంత్ను కృతజ్ఞతగా చూస్తూ పంకజం, గురుమూర్తి కన్నీళ్లు పెట్టుకున్నారు.కోకిల వసంత్లు వాళ్లను ఓదార్చి, కోకిలకి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. వారి సంతోషానికి అవధుల్లేవు. ఇంతలో ఒక బంట్రోతు వసంత్ దగ్గరికి వచ్చి, ‘కలెక్టర్గారు! మిమ్మల్ని తీసుకెళ్ళటానికి కారు వచ్చింది’ అని చెప్పాడు. పంకజం, గురుమూర్తి ఆశ్చర్యచకితులై ‘ఏమిటి మా అల్లుడుగారు కలెక్టరే!’ అంటూ మురిసిపోయారు. ఆ రోజు నుండి వారి ఇల్లు ఆనంద నిలయమైంది. ఎన్నడూ లేనిది గురుమూర్తి, ‘పంకజాక్షీ! నన్ను క్షమించు. భర్తనని, మగవాడినని అహంకారంతో నిన్ను ఇన్నేళ్లూ చాలా కష్టపెట్టాను. ప్రేమగా ఉండాల్సింది పోయి, కట్టుబాట్ల పేరుతో ఇబ్బంది పెట్టాను’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.‘మనమధ్య ఈ క్షమాపణలు ఏవిటండీ’ అని కళ్లు తుడుకుంది పంకజం. పెళ్ళైన ఇన్నేళ్లకి భర్త తనను పూర్తి పేరుతో పిలిచినందుకు సిగ్గుపడ్తూ. ఇంతలో ‘ఏమోయ్, పంకజాక్షి! నా కూతురు, అల్లుడే నా మార్పుకి కారణం’ అని మనసారా నవ్వులు పూయించాడు గురుమూర్తి.తన కూతురు ఎడారిలో కోయిలగా మిగిలిపోతుందేమోనని భయపడ్డ పంకజం వసంత కోకిలలా మారిన కూతురిని చూసి మనసు నిండా తృప్తి చెందింది. ∙ -
Mother's Day 2025: అమ్మ మనసు తెలుసా?
‘ఏంటమ్మా నీ గోల? నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసులే?’ అనే పిల్లల ధిక్కారాలు అమ్మకు కొత్తేం కాదు. ‘పదే పదే ఫోన్ చేసి విసిగించకమ్మా.. ఆకలేస్తే నేను తింటా కదా? నువ్వు అడగాలా?’లాంటి పోట్లాటలు, ఆమెకు వింతా కాదు. అయినా మన కోసమే తపిస్తుంది. మనం బాగుండాలని భరిస్తుంది. ‘అయ్యో పాపం అమ్మ తిన్నదో లేదో?’ అని మనమెలాగో కుశలం కనుక్కోము సరికదా, ఆమె కుశలమడిగితే టైమ్ లేదన్న సాకుతోనో, బిజీగా ఉన్నామన్న వంకతోనో, నోటికొచ్చిన సమాధానాలిచ్చి బాధపెడతాం. ఇంతటి జీవితాన్నిచ్చిన అమ్మకు నిజంగానే కాసింత సమయాన్ని కేటాయించలేమా? అసలు అమ్మకు ఏం కావాలి? ఆమె మనసును ఎలా తెలుసుకోవాలి?ప్రయత్నిస్తే అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా అర్థమయ్యేది అమ్మే. నిజానికి అమ్మ మనసు తెలుసుకోవాలన్న మన ఆలోచనతోనే ఆమె ఆనందం మొదలవుతుంది. మన ఈ ప్రయత్నమే ఆమెకు, అసలు సిసలు బహుమానమవుతుంది.అమ్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆమెను మాట్లాడనిద్దాం. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో కాస్త శ్రద్ధగా విందాం. ఆమె మాటల్లోని భావాలను గ్రహించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనకు ఆమె గురించి ఇంకెన్నో విషయాలు తెలుస్తాయి.అమ్మ చేసే పనులను గమనిద్దాం. అప్పుడు ఆమె దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుందో? ఆమెకు ఏది ఇష్టమో? ఏది ఇష్టం లేదో? ఆమె దేని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుందో? ఇలా ఆమె గురించి మరింత అర్థమవుతుంది.అమ్మ మనసుని సరదాగా మధ్యమధ్యలో కదిలిద్దాం. తన జీవితంలో పొందిన ఆనందాలనో, ఆమె తన కన్నవాళ్లతో గడిపిన క్షణాలనో, ఆమె ఎదుర్కొన్న కష్టాలనో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఆమె మనసు, ఆమె దృక్పథం మనకు మరింత బోధపడతాయి.మనం తీసుకునే కొన్ని నిర్ణయాల్లో అమ్మను సలహా అడుగుదాం. అలాంటప్పుడు ఆమె ఆలోచనా విధానం మనకు ఇంకా బాగా తెలుస్తుంది. పైగా ఆ సలహా మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆమెకు మనం ఇచ్చే విలువేమిటో ఆమెకూ అర్థమవుతుంది.అమ్మకు దూరంగా ఉంటే రోజుకొక్కసారైనా ఫోన్ చేసి ప్రేమతో పలకరిద్దాం. మనస్పూర్తిగా మాట కలుపుదాం. మన మనసులో ఆమె స్థానం పదిలమేనన్న సంగతి తెలియపరుద్దాం. ఆ రోజులో మనం అందుకున్న ప్రశంసల గురించో, మనం చేసిన పనుల గురించో, వెళ్లిన ప్రదేశాల గురించో ఆమెతో పంచుకుందాం. వీలు కుదిరినప్పుడు అమ్మతో కలిసి భోజనం చేద్దాం. టీవీ చూద్దాం. షాపింగ్కో, సినిమాకో తీసుకెళ్దాం. అలా చేస్తే బంధం మరింత బలపడుతుంది. ఆమెకు మన సమయాన్ని కేటాయించడం కూడా, ఆమె ఓ బహుమతిగానే భావిస్తుంది.అమ్మకు చిన్నచిన్న పనుల్లో సాయం చేయడం అలవాటు చేసుకుందాం. అలాగే కోపంలో అరవడం, గొడవ పడటం, అభిప్రాయాలు వేరుకావటం సహజమే. కాని, దానికి ఏదో ఒక సమయంలో క్షమాపణలు చెప్పడం నేర్చుకుందాం. మన తిరస్కారానికి కారణాలను సున్నితంగా వివరిద్దాం.ఏదో ఒక సందర్భంలో అమ్మకు కృతజ్ఞతలు తెలుపుదాం. జీవితంలో ఉన్నతమైన మెట్లు ఎక్కినప్పుడో, అత్యంత ఆనందంగా ఉన్నప్పుడో అమ్మనోసారి ప్రేమగా పలకరిద్దాం. వీలైతే ఆ క్షణంలోనే ఆమెకు ఐలవ్యూ చెబుదాం. దానికంటే ఆమెకు విలువైన బహుమతి మరొకటి ఉండదు.ఏది ఏమైనా జన్మజన్మలకు తీరని రుణపాశమే అమ్మప్రేమ. ప్రాణం పోసుకోకముందే ముడిపడిన ఆ పేగు బంధానికి, ప్రాణాలేం ధారబోయక్కర్లేదు. చూపులో ప్రేమ, పిలుపులో ధీమా కనిపించేలా స్పందిస్తే చాలు, తిరుగులేని ఆమె ఆశీర్వచనాలు.. జీవితాంతం దేవదూతలై కాపాడతాయి. యముడితోనైనా పోరాడతాయి. అంతటి వాత్సల్యాన్ని పంచే అమ్మకు.. బహుమానాలేం అక్కర్లేదు. మనం ఎంత ఎదిగినా, అమ్మ ఒడిలో ఒదిగే పసిమనసుని వదులుకోకపోతే చాలు. అమ్మకు సరైన ప్రతిఫలాన్ని అందించినట్లే అవుతుంది.∙సంహిత నిమ్మన -
ఈ వారం కథ: ఏ నావదే తీరమో...
మనుషులు కలవడానికి మహాసముద్రాలు దాటాలా?మనసులు కలవడానికి మంచుపర్వతం కరగాలా?అనుకోకుండా వచ్చే వానగానో, చెమటతో తడిపే ఎండగానో, కదిలే తేరుగానో, ఎదిగే పైరుగానో, పారే ఏరుగానో, మరిగే నీరుగానో... ఏమో... ఎప్పుడో ... ఎలాగో... ఎందుకో... కలుస్తూనే ఉంటారు!‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మ వరమో..’’ ఎక్కడి నుంచో గాలిలో గంధకంలా తేలుతూ రింగ్టోన్ నా చెవుల్ని తాకింది.భారంగా కదిలాను. నాతో పాటే చేతికున్న సెలైన్ బాటిల్ కూడా గాలిలో దీపంగా కదలాడింది. తెరలు తెరలుగా వచ్చిన కడుపునొప్పి ఉపశమనం కోసం పెట్టిన సెలైన్ బాటిల్ నా వంక దిగులుగా చూస్తోంది. కారిడార్లో ఎవరో తిరుగుతున్న అలికిడి, నా పైన అదేపనిగా తిరుగుతున్న ఫ్యాను చప్పుడు! గాలికి డోర్ కర్టెన్ పైకి లేచింది. కళ్ళు తెరిచి పాట వినిపించిన వైపు చూశాను.ఎదురుగా ఉన్న గదిలో ఎవరో అమ్మాయి చేతికి సెలైన్ బాటిల్తో కనిపించింది.ఓదారుస్తూ పక్కనే ఆమె స్నేహితురాలు! కొసరి కొసరి అన్నం పెడుతుంటే విలువ తెలియకుండా పెరిగినందుకు మంచి శిక్షే పడింది.వరమో శాపమో హాస్టలు రూపంలో ‘పొమ్మనలేక పొగబెట్టి’నట్లుగా ఎదురయింది. కూర బాగుంటే అన్నంమెతుకులు లావుగా ఉంటాయి. అన్నం సన్నగా ఉంటే కూర ఉప్పూకారంతో ఉడికించినట్లుగా ఉంటుంది. బిందెలు బిందెలు నీళ్ళు కలిపి తాలింపు వేసిన చారు, ఉండీ లేనట్లుగా కనిపించే కందిపప్పుతో పసుపుగా సాంబారు! ఎప్పుడైనా ‘ఔటింగ్’ దొరికితే బజారులో దొరికే అడ్డమైన గడ్డినీ ఆబగా తిన్న కర్మానికి తెరలుతెరలుగా కడుపునొప్పి! దాని ఫలితం... ఆసుపత్రి బెడ్!‘‘ఇప్పుడెలా ఉంది?’’ అడిగింది సిస్టర్.‘పర్లేదు’ అని చెప్పి నీరసంగా ఆమె వంక చూశాను.సెలైన్ బాటిల్లో సూది గుచ్చి అందులోకి ఏదో పసుపురంగు మందు పంపించింది.నాడి పట్టుకుని చూసి ‘‘సాయంత్రానికి పంపుతారు. రెస్ట్ తీసుకో. బజారులో ఏది దొరికితే అది తినకూడదు. నోటికి రుచిగా ఉన్నవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు’’ చెప్పి వెళ్ళిపోయింది. ‘కొన్ని రోజులు హాస్టల్ తిండి తింటే తెలుస్తుంది...’ నోటి చివరిదాకా వచ్చిన మాట నీరసం వల్ల గొంతులోనే ఆగిపోయింది. పైకి అనలేకపోయాను. ఆమె వెళ్ళిన విసురుకు డోర్ కర్టెన్ పక్కకి జరిగింది. నాకు ఎదురుగా దిండు మంచానికి ఎత్తుగా జరిపి టిఫిన్ తింటున్న అమ్మాయి కనబడీ కనబడనట్లుగా కనిపించింది. అసలు తినకుండా ఉంటే ఉండగలం గానీ, సగం తిని ఉండాలంటేనే తాతముత్తాతలు దిగొస్తారు!రూముకు నాలుగు బెడ్లతో, మొత్తం ముప్పై పడకలతో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ హాస్పిటల్ అది. మరీ హడావిడిగా ఉంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు వేరువేరుగా రూములుంటాయి. నాలాగా ఎప్పుడైనాఫుడ్ పాయిజన్ అయినవాళ్ళు వస్తే ఏదో ఒక ఖాళీ రూములో ఉంచి సెలైన్ పెడ్తారు. బహుశా ఆ అమ్మాయికి కూడా నాలాగే అయిందేమో! రమేష్గాడు ఉంటే బాగుండేది. విషయం చెప్తే ఈపాటికి ఆ అమ్మాయి గురించి అన్నీ ‘ఎంక్వైరీ’ చేసి, ‘రిపోర్ట్’ ముందు పెట్టేవాడు. సరైన టైంకి వెళ్ళిపోయాడు.‘‘ఔట్...’’ పెద్దగా అరుపులు, ఆ తర్వాత చప్పట్లు వినిపించాయి. ఆడా, మగా తేడా లేదు. ఒకరి ఓటమికిఆనందిస్తూ ఇంకొకరికి గెలుపును ఆస్వాదించే రోజులు మొదలయ్యాయి. చిన్నప్పటి ఆటలన్నీ అటకెక్కిపోయాయి. చిన్నాపెద్దా అందరికీ పాతిన మూడు కర్రల మధ్య పరుగులే బలమైన వ్యాపకంగా మారిపోయాయి.ఆఖరి చుక్క దగ్గర ఆగిపోయింది సెలైన్. కడుపులోనూ, మనసులోనూ కురుస్తున్న వాన ఆగిన సంతోషం! ∙∙ చేతులు కట్టుకుని, స్లిప్పులు పట్టుకుని, బోనులో ముద్దాయిల్లా కౌంటర్ ముందు నిలబడ్డారు పిల్లలంతా.ఏడు బ్రాంచ్లతో, రెండేళ్లు ఇంటర్మీడియట్ నాలుగేళ్లు ఇంజనీరింగ్ కలిపి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుతో ఉన్న యూనివర్సిటీలో ఎత్తైన కొండను తొలిచి వలయాకారంగా ఏర్పాటుచేసిన ఫుడ్ కోర్ట్ అది.కొమ్మల మీద పక్షులు వాలినట్లుగా సాయంత్రం క్లాసులు అయిపోగానే స్టూడెంట్స్ అందరూ అక్కడ చేరతారు. ఫుడ్ కోర్ట్ చుట్టూ ఉన్న గోడ మీద కొందరు, మెట్లమీద కొందరు, చెట్లకింద కొందరూ ఉదయం నుంచీ వేడెక్కిన బుర్రల్లోకి కాస్తంత ఉల్లాసాన్ని నింపుకుంటూ ఉంటారు.ఒక కన్ను బయటి నుంచి లోపలికి వస్తున్న వాళ్లమీదా, ఇంకో కన్ను టిఫిన్ ప్లేట్లు పట్టుకుని చెట్లకింద చేరుతున్న వాళ్లవంకా నిలిపి లైనులో నుంచున్నాను నేను.గొడుగులా పరుచుకున్న బాదంచెట్టు నీడకింద ఎదురెదురుగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్న జంటలతో కాలం ఐస్క్రీములాగా కరిగిపోతోంది. గంటల్ని మంటల్లో వేసి తగలబెట్టినట్లుగా విరామం లేని కబుర్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకిప్పటికీ అర్థం కాదు. ఒక చెట్టు పెంచితేనే ఎంతోమందికి నీడనిస్తోంది. ఒక మనిషి సక్రమంగా పెరిగితే ఎంతమందికి ఆశ్రయమిస్తాడో! కాలం కత్తుల మీద కాకుండా కనికరం మీద నడిస్తే తప్ప ఇలాంటివి చూడలేమేమో? చుట్టూ చూశాను. గింజల కోసం ఎక్కడెక్కడి నుంచో ఎగిరొచ్చిన పావురాళ్ల గుంపులా కనిపించారు. ‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మ వరమో..’’ తుళ్ళిపడి ఆలోచనల్లోనుంచి బయటికి వచ్చి రింగ్టోన్ వినిపించిన వైపు చూశాను. ముదురురంగు నీలం జీన్స్ మీద తెల్లటి టాప్ వేసుకున్న అమ్మాయి లైనులో కనిపించింది... ఆసుపత్రిలో తనకి తోడుగా ఉన్న అమ్మాయితో!నీరసం ఎగిరిపోయింది. నిన్నటి కొద్దిపాటి అనారోగ్యానికి నీరసంతో తేలిపోయినట్లుగా ఉన్న కాళ్లు ఆ అమ్మాయిని చూశాక ఆనందంతో గాలిలో మరింత తేలిపోసాగాయి. నా టిఫిన్ ప్లేట్ తీసుకుని బాదం చెట్టు కిందకి చేరి తింటూ ఆ అమ్మాయినే గమనించసాగాను.టిఫిన్ తీసుకుని ఇద్దరూ ఎదురుగా ఉన్న మరో బాదం చెట్టు నీడలో కూర్చున్నారు. తింటున్న వాడిని పైకి లేచి వాళ్లకు దగ్గరగా వెళ్లి, ‘‘హాయ్... నా పేరు ఏడుకొండలు. నీ పేరు..’’ అన్నాను.‘‘అలివేలు మంగతాయారు’’ చెప్పి పకపకా నవ్వింది ఆ అమ్మాయి.‘‘అయితే కలిసి నడవడానికి ఎక్కువ సమయం లేదు’’అన్నాను నేను కూడా నవ్వుతూ. ‘‘అవునవును... చనువిస్తే చంకనెక్కడం, చావగొడితే మంచమెక్కడం బాగా అలవాటు మీకు’’ అంది అక్కడి నుంచి పైకి లేస్తూ. పక్కనున్న అమ్మాయి కూడా ఆమెను అనుసరించింది.‘‘నీ ఆరోగ్యం బాగుందా ఇప్పుడు?’’ అడిగాను.‘నీకెలా తెలుసు?’ అన్నట్లుగా నుదురు చిట్లించింది. నడకలో వేగం తగ్గి మాటలో ఆశ్చర్యం తొంగిచూసింది.‘‘నీ ఫోన్ రింగైనప్పుడు వచ్చే పాటంటే నాకు చాలా ఇష్టం. నిన్న ఆస్పత్రిలో నీ ఎదురుగా ఉన్న బెడ్ మీద నేను కూడా ఉన్నాను. అప్పుడు విన్నాను. అనుకోకుండా ఇప్పుడిలా వినిపించిన పాట ద్వారా నువ్వేనని గుర్తుపట్టాను.’’ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ, ‘‘తాయారూ.. మళ్ళీ ఎప్పుడు?’’ అన్నాను. పకపకా నవ్వుతూ అక్కడి నుంచి కదిలింది. చెమటను తుడుచుకుంటూ చెట్టు కిందకి చేరాను. ఎండలో నడుస్తున్న వాడికి గొడుగు పడుతున్నట్లుగా ఉన్న చెట్టు వంక కృతజ్ఞతగా చూశాను. ‘‘ఏరా కొండలూ! ఏమంటుందేంటి కల్పన’’ అన్నాడు పక్కన కూర్చుంటూ రమేష్. ‘‘కల్పనా? తనెవరు?’’ అన్నాను.‘‘ఇప్పటిదాకా మాట్లాడావుగా. ఆ అమ్మాయే’’‘‘కాదు కాదు... తను అలివేలు మంగతాయారు’’‘‘భలేవాడివే! తన పేరు కల్పన. ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్. దీని గురించే ఆ చందూగాడికి, పవన్గాడికీ గొడవలు మొదలయ్యాయి. కొట్టుకునేదాకా వెళ్లింది యవ్వారం. ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి రూములో కూడా డిస్కషన్ జరిగింది. గుర్తులేదా?’’ అన్నాడు.‘‘విషయం తెలుసుగానీ ఈ అమ్మాయని తెలియదు’’ అన్నాను. ‘‘ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కాలి గాని, ఇంకొకడితో మాట్లాడ్డం చూస్తే మాత్రం వాళ్లిద్దరూ ఒక్కటై వాడ్ని తన్నడానికి వెళ్ళిపోతున్నారు?’’ఆశ్చర్యం నుంచి తేరుకుని ‘‘ఇంతకీ ఆ అమ్మాయి ఇష్టమేంటో’’ అన్నాను నీళ్ళు తాగుతూ. నా వంక అదోలా చూశాడు. ‘‘అమ్మాయి ఇష్టంతో పనేముంది? ముందు చూడాలి, నచ్చాలి, మాటలు కలపాలి. ఆ తర్వాత ప్రపోజ్ చేయాలి. ఇన్స్టంట్ కాఫీలా అప్పటికప్పుడే ఫలితం తెలిసిపోవాలి. లేటయిందంటే నారదీసి ఆరేయడమే’’ అన్నాడు పెద్దగా నవ్వుతూ. నేనేమీ మాట్లాడలేదు. బట్టలిప్పుకుని విచ్చలవిడిగా తిరుగుతున్న లోకాన్ని మూకుడుతో మూయలేను. ప్రభావంలో పడి కొట్టుకుపోతూనో రాజీపడుతూనో కళ్ళు మూసుకుని బతకలేను. ‘‘ఇష్టాలైనా కష్టాలైనా మనిషిని బట్టి మారుతుంటాయిగా. నువ్వంటే నాకిష్టం కాబట్టి నువ్వు కూడా నన్నే ఇష్టపడాలని బలవంతం చేయడం అన్యాయం కదా’’ అన్నాను వాyì వైపు చూస్తూ. ‘‘లాజిక్కులు చెప్పుకోడానికి తప్ప అప్లై చేయడానికి పనికిరావురా. ఇద్దరికీ ఒకే వస్తువు నచ్చడం, దానికోసం కొట్టుకోవడం చూస్తుంటే చిన్నతనం గుర్తొస్తుంది. ‘వాడికున్నదీ నాక్కూడా కావా’లనే ఆరాటం తప్ప అసలు ఆ వస్తువుతో నీకెంత అవసరం ఉందో ఆలోచన లేదు. అరవయ్యో డెబ్భయ్యో నిండితే ఒకప్పుడు మనుషులు చచ్చేవాళ్లు. ఇప్పుడు ‘అరచేతి’లో చావును పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. మూడు ముళ్ళూ, ఏడడుగులు ఎప్పుడో గంగలో కలిసిపోయాయి. ఇప్పుడు.. ప్రేమలు లేని కాలం నడుస్తోంది. చంపడం చచ్చిపోవడం మాత్రమే తెలిసిన కాలం! వాళ్లిద్దరూ సాయంత్రం నీ రూముక్కూడా రావొచ్చు. ఇన్నేళ్లూ చక్కగా చదువుకున్నావు. వెళ్లేముందు ప్రశాంతతను పాడుచేసుకోకు’’ అన్నాడు పైకి లేస్తూ.వెళ్ళిన వాడివైపు చూస్తుంటే మనసంతా ఒకటే ఆలోచనలు. ‘పుస్తకం చదవకపోతే పాడైపోతావు’ అని చూపించే సినిమా ఒక్కటి లేదు. ‘అమ్మాయిని ప్రేమించకపోతే బతుకు వృథా’ అని చెప్పే సినిమాలు ఎక్కువయ్యాయి. హీరో ఒకమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమ గెలిచేదాకా వాళ్లిద్దర్నీ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎన్నెన్నో త్యాగాలు, మరెన్నో పోరాటాలు, రక్తపాతాలు... చివరికి ‘శుభం’ ముందు అందరూ నవ్వీ చూసినవాళ్లందర్నీ వెర్రివాళ్లని చేస్తారు! మనుషులంతా ఆ భ్రమల్లోనే బతికే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తారు.అక్కడి నుంచి రూమువైపు బయల్దేరాను. ప్రేమ పుట్టడానికి నిమిషమో అరనిమిషమో సరిపోతుంది. కానీ దాన్ని గెలుచుకోవడానికి ఎన్నో బలులు జరగాలి. ఎన్నో జీవితాలు మట్టిలో కలిసిపోవాలి!∙∙ ‘‘నీతో మాట్లాడాలి’’ అన్నానొకసారి.‘‘ఏంటి విషయం? చెప్పు’’ అంది.‘‘ఇక్కడ కాదు. అక్కడ...’’ కొండపై కనిపిస్తున్న ఫుడ్ కోర్ట్ వైపు చేయి చూపించాను.ఎకడమిక్ బ్లాక్స్, లైబ్రరీ దాటి ఫుడ్ కోర్ట్ దగ్గరకి చేరుకుని బాదంచెట్టు కింద కూర్చున్నాక ‘‘చెప్పు’’ అంది. ‘‘ఇంకో నెలలో ఇంజినీరింగ్ పూర్తవుతుంది. ఎక్కడో ఒకచోట ఏదో ఒక జాబ్ వస్తుంది. నువ్వొప్పుకుంటే పెద్దలతో మాట్లాడతాను’’ అన్నాను సూటిగా విషయంలోకి వస్తూ. ‘‘ఒప్పుకోకపోతే...’’నాకంటే సూటిగా వచ్చిందా మాట.వెంటనే సమాధానం చెప్పలేక తడబడ్డానో క్షణం.‘‘చెప్పు.. కలలు కందామా? కలిసుందామా?’’ మళ్ళీ తనే అడిగింది రెట్టిస్తూ. నా నుంచి సమాధానం లేదు.‘‘చూడు... ఇంటర్ నుంచి చందూ, ఇంజనీరింగ్ రెండో సంవత్సరం నుంచి పవన్ వెంటపడుతున్నారు. ఇప్పుడు నువ్వు! నా ఇష్టంతో పనిలేదు. మీకిష్టం అయింది కాబట్టి దాన్నే నా ఇష్టంగా మార్చుకోవాలి. పోనీ నువ్వే చెప్పు... మీ ముగ్గురిలో ఎవర్ని ఇష్టపడాలో’’ అంది.మళ్ళీ నాలో అలజడుల జలపాతాలు మొదలయ్యాయి.‘‘ఈ వయసులో మన కష్టాన్నే ఇష్టంగా మార్చుకోవాలి. మంచి భవిష్యత్తు గురించి కలలు కనాలి. అనుభవాలను ఆలోచనలను ఎదుగుదలకు సోపానాలుగా మలచుకోవాలి. అంతేగానీ అమ్మాయి బాగుందనో, పరిచయమైందనో ప్రేమిస్తున్నానని చెప్తే అది ఇద్దరి భవిష్యత్తుకూ మంచిది కాదు.చదువుకునే వయసులో ప్రేమలు, పెళ్ళిళ్ళు మంచివి కాదు. ప్రేమించుకుని అందరికంటే ముందు కొన్ని అనుభవాలను పొందాలని తహతహలాడతాం. కానీ అవే భవిష్యత్తులో పీడకలలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. రోజూ పేపర్లో ఎన్నో దారుణాలు చదువుతున్నాం. ప్రేమించకపోతే చంపేస్తారు, చెప్పినట్టు వినకపోతే చంపేస్తారు, మాట్లాడితే చంపేస్తారు, మాట్లాడకపోతే చంపేస్తారు. కొన్నాళ్ళు కలిసుండడం ఆ తర్వాత చంపేయడం! కలిసుండడానికి ఇష్టపడ్డప్పుడు, విడిపోవడానికి కూడా ఇష్టపడొచ్చు కదా! చంపడమెందుకు? ‘మీరిద్దరూ నాకు స్నేహితులు. ప్రేమించే ఉద్దేశం లేద’ని వాళ్ళతో చెప్పేయొచ్చు. దాని పర్యవసానాలు వేరుగా ఉండేవి. అందుకే.. నా చుట్టూ నేనొక గోడ కట్టుకున్నాను. నా జాగ్రత్తలో నేనుంటున్నాను. నా కారణంగా వాళ్లిద్దరూ గొడవపడుతున్నారని విన్నప్పుడల్లా ఎంతో బాధ కలుగుతుంది. వయసుతో పాటు జ్ఞానమో సంస్కారమో పెరగాలి. ఇవి రెండూ పెరగని వాళ్లని ఏమనాలో నువ్వే ఆలోచించుకో’’ చెప్పి అక్కడి నుంచి లేచింది.కొద్దిదూరం నడిచాక ఆమె ఫోన్ మోగింది.‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్త మే జన్మ వరమో..’’ పాట కూడా ఆమెతో పాటే వెళ్ళిపోయింది.మనుషులు విడిపోడానికి సునామీలు చెలరేగాలా?మనసులు దూరమవడానికి అగ్నిపర్వతాలు బద్దలవ్వాలా?గుండె సముద్రమై ఎగసినప్పుడో, పూలు వాడి నేలరాలినప్పుడో, కళ్లల్లో నదులు పొంగినప్పుడో, కలవరంతో గుండె మండినప్పుడో! ఏమో... ఎప్పుడో... ఎలాగో... విడిపోతూనే ఉంటారు! తీరం చేరే నావలు కొన్నే.. కొన్ని అలల ధాటికి చెల్లాచెదురౌతాయి! మరికొన్ని మధ్యలోనే మునిగిపోతాయి! మరికొన్ని నావలు... తీరం ఎటున్నదో తెలియక సాగుతూ...నే ఉంటాయి! -
100 ఏళ్ల చదువుల గుడి ఎయూ శతవార్షికోత్సవాలు
ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ఆవిర్భవించిన మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళాపరిషత్. తెలుగు ప్రజల కోసం ఏర్పడిన భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం ఆంధ్రవిశ్వవిద్యాలయం. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ విశ్వకళాపరిషత్ అనే పేరుతో వ్యవహరించేది మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మాత్రమే! దేశంలో మరో విశ్వవిద్యాలయానికి లేని ప్రత్యేకత ఇది. పేరుకు తగినట్లే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, రంగస్థలం, నటన వంటి కళలకు యూనివర్సిటీలో స్థానం కల్పించారు. స్వతహాగా కళా సాహిత్యాల పట్ల మక్కువ ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ పేరును ప్రతిపాదించారు. 1926లో మద్రాసు విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన రెసిడెన్షియల్ టీచింగ్– కమ్– అనుబంధ విశ్వవిద్యాలయంగా ఘనతకెక్కిన ఏయూ శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. మొదటగా విజయవాడలో 1926 ఏప్రిల్ 24న ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి పునాదిని మొట్టమొదటి వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి వేయగా, అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ గోచెన్ చాన్సలర్గా వ్యవహరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని 1930 సెప్టెంబరు 5న ఈ యూనివర్సిటీ ప్రాంగణాన్ని విశాఖపట్నానికి తరలించారు. ప్రతి ఏటా సగటున వెయ్యి నుంచి పన్నెండు వందల మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు తీసుకునే ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం 58 విభాగాలు, 18 పరిశోధన కేంద్రాల్లో 20 వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు...!ఏయూ ఏర్పాటై 2026 నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ఏయూ సిద్ధమయ్యింది. ఏడాదిపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఔట్రీచ్– ఈ మూడు విభాగాల్లో పనిచేయాలని విజన్ డాక్యుమెంట్ను ఏయూ ప్రకటించింది. శతాబ్ది ఉత్సవాల లోగోను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ లోగోను యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోని బీఎఫ్ఏ విద్యార్థి షేక్ రఫీ రూపొందించారు. ఏయూ లోగో ప్రత్యేకత!ఆంధ్రా యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసి, లోగోలోని ప్రతి చిహ్నానికి అర్థం స్ఫూరించేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతి– ఇద్దరినీ ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్త్రాలను సూచిస్తుంది. ఇక సముద్రాన్ని– విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు. ఉపనిషత్తులలోని ‘తేజస్వినావధితమస్తు’ అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని. ఈ జ్ఞాన చిహ్నం కింద అన్ని మతాలలోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు తామర రేకుల నుంచి జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి. అంతేకాకుండా, పురాతనకాలం నుంచి ఆంధ్రులలో నాగారాధన సంప్రదాయం ఉంది. ఈ లోగోను కౌతా రామమోహనశాస్త్రి రూపొందించగా, ఏయూ వ్యవస్థాపక వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఆమోదించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో...వాస్తవానికి మొట్టమొదటగా బెజవాడలోని (ఇప్పటి విజయవాడ) తాత్కాలిక భవనాల్లో ఏర్పాటైన ఏయూ 1930లో విశాఖకు తరలివచ్చింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రం ఏయూ ప్రాంగణం అంతా సైనిక స్థావరంగా మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్ 6న విశాఖ హార్బర్పై జపాన్ బాంబులు వేసింది. ఆ దాడి తర్వాత యూనివర్సిటీ భూమిని, భవనాలను తమ అవసరాలకు ఉపయోగించుకోవాలని అప్పటి బ్రిటిష్ సైన్యం నిర్ణయించుకుంది, యూనివర్సిటీని మార్చమని బలవంతం చేసింది. బాంబు దాడి జరిగిన పది రోజుల తర్వాత– అంటే 1942 ఏప్రిల్ 16న యూనివర్సిటీని తరలించడానికి సన్నాహాలు చేసుకోవడం కోసం మూసివేశారు. కెమిస్ట్రీ మినహా చాలా విభాగాలు గుంటూరుకు మారగా, కెమిస్ట్రీ విభాగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకు మారింది. భవనాలన్నింటినీ సైన్యం ఆక్రమించడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం జూన్ 1945 వరకు అంటే మూడేళ్లపాటు విశాఖపట్నం వెలుపలి నుంచే పనిచేసింది.న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్తో...!తెలుగు ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడటంతో తెలుగు ప్రజలు యూనివర్సిటీతో మానసికంగా అనుబంధం పెంచుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోని పురాతన విద్యాసంస్థలలో ఒకటి మాత్రమే కాదు, రెసిడెన్షియల్ మల్టీ–డిసిప్లినరీ యూనివర్సిటీగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలలో మొదటిది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన ఈ యూనివర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక వైస్ చాన్సలర్గా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండో వైస్ చాన్సలర్గా, తిరిగి సీఆర్ రెడ్డి, అనంతరం డాక్టర్ వీఎస్ కృష్ణు్ణడు– ఈ ముగ్గురు దార్శనికులు వేసిన పునాదులు ఆ తర్వాతి దశాబ్దాల్లో ఫలవంతమై, ఏకంగా దేశంలోనే న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ పొందిన మొట్టమొదటి ప్రభుత్వ యూనివర్సిటీగా 2024లో చరిత్రకెక్కింది. ఏయూలో 59 దేశాల విద్యార్థులు...దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు విదేశాల్లోని విద్యార్థులనూ ఏయూ ఆకర్షిస్తోంది. ఇక్కడ చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్ కోర్సుల్లో 472 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. 2019–20 సంవత్సరంలో 190 మంది ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య గత ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటుతో పాటు ప్రత్యేక మెనూను అమలు చేయడంతో ఈ సంఖ్య 1,130కి చేరుకుంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రధానంగా విశాఖలో జరిగే వివిధ రకాల సినిమా షూటింగుల కోసం అవసరమైన విదేశీయుల కోసం ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దర్శకులు వెదుక్కుంటూ వచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఇస్మార్ట్ శంకర్, శివం వంటి సినిమాల్లో ఇక్కడి విదేశీ విద్యార్థులు నటించారు. ఎందరో మహానుభావులు...ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న అనేక మంది ఎంతో గొప్ప స్థానాలకు చేరుకున్నారు. ఆచార్య సూరి భగవంతం (భౌతికశాస్త్రం), ఆచార్య జ్ఞానానంద (అణుభౌతిక శాస్త్రం), ఆచార్య సి.మహదేవన్ (జియాలజీ), ఆచార్య టీఆర్. శేషాద్రి (రసాయన శాస్త్రం), ఆచార్య బి. రామచంద్రరావు(స్పేస్ ఫిజిక్స్), ఆచార్య సి.ఆర్రావు (స్టాటస్టిక్స్), ఆచార సీవీ రామన్(భౌతికశాస్త్రం), ఆచార్య ఆర్.రంగదామరావు (మీటీయరాలజీ) వంటి అనేక మంది ప్రపంచస్థాయిలో శాస్త్రవేత్తలుగా రాణించినవారే! ఇక భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వ హిందీపరిషత్ అద్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, పెన్స్టేట్ యూనివర్సిటీ (అమెరికా) అద్యక్షురాలు నీలి బెండపూడి, జీఎంఆర్ గ్రూప్ అధినేత డాక్టర్ జి.ఎం.రావు, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తదితర ప్రముఖులు ఏయూ పూర్వవిద్యార్థులలో ఉండటం విశేషం. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు నాయకత్వం వహిస్తున్న 50 మంది వీసీలను, 10 మంది చాన్సలర్లనూ అందించిన ఘనత ఏయూ సొంతం. ఇదిలా ఉంటే, ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల్లో ఎనిమిది మంది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు, ముగ్గురు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, నలుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకరు ఉన్నారు. డిసెంబర్లో పూర్వ విద్యార్థుల సమావేశం...ఏయూ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నవారు ఉన్నారు. దేశంతో పాటు విదేశాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, కెనడా, ఆఫ్రికా, జర్మనీ, ఫ్రా¯Œ ్స, రష్యా, థాయ్లండ్, మలేషియా మొదలైన దేశాల్లో మంచి సంఖ్యలో పూర్వ విద్యార్థులు స్థిరపడి పని చేస్తున్నారు. వీరందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం యూనివర్సిటీ అభివృద్ధిలోనూ ఎంతగానో సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ సంఘం ద్వారా యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్లో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక వీసీ సీవీ రెడ్డి జయంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. ‘నాసా’ పరిశోధనల్లోనూ...ప్రారంభంలో ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ కళాశాలలు ఉమ్మడిగా ఉండేవి. ఈ ఉమ్మడి విభాగాలకు ప్రిన్సిపల్గా పనిచేసిన ఎం. వెంకటరంగయ్య ‘పద్మవిభూషణ్’ అందుకున్నారు. అయితే, 1931లో ఈ రెండు విభాగాలను వేరు చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల తొలి ప్రిన్సిపాల్గా ఆర్.రామనాథం పనిచేశారు. జయపూర్ మహారాజా విక్రమ్దేవ్ వర్మ ఏయూకు విలువైన భూములను, భారీగా నగదును విరాళంగా ఇచ్చారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులను విద్యార్థులకు అందించడంలో ఆంధ్రా యూనివర్సిటీ అగ్రగామిగా ఉంటోంది. ఏయూ మీటియరాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ, నూక్లియర్ ఫిజిక్స్ వంటి వైవిధ్యభరితమైన ప్రత్యేక శాస్త్ర విభాగాలను నిర్వహిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిన యూనివర్సిటీగా ఏయూ పేరు సంపాదించింది. ఇక వివిధ రకాల పరిశోధనల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అడ్వాన్స్డ్ అనలిటికల్ లేబొరేటరీ, ఎన్ఎంఆర్ స్పెక్టోస్కోపీలు వర్సిటీ విశిష్టతను చాటుతున్నాయి. ఇక ‘నాసా’ చేపట్టిన లూనార్ ప్రయోగాలకు ఏయూ తన వంతు సహాయాన్ని అందించింది. తూర్పు కనుమలలోని పలు రకాల రాళ్లను సేకరించి, చంద్రమండలంలోని పదార్థాలలో పోలి ఉన్నాయా లేదా అనే ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందుకు అవసరమైన సహకారాన్ని ఏయూ జియాలజీ విభాగం అందించింది. తమకు అందించిన సహకారానికి ‘నాసా’ స్వయంగా ఏయూకు కృతజ్ఞత లేఖ రాసింది. అలాగే ఏయూ ఫ్రాన్స్కు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది.మరో ఎత్తుకు వైఎస్ జగన్ హాయంలో....!నూతన పోకడలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీలో కొంగొత్త మార్పులకు గత వైఎస్సార్సీపీ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్ను ఏర్పాటు చేయడంతో పాటు పేటెంట్ల కోసం ఏకంగా నూటికిపైగా దరఖాస్తులు చేయడంలో ఏయూ మరో శిఖరానికి చేరుకుంది. పేటెంట్లకు దరఖాస్తు చేసేందుకు ప్రత్యేకంగా ఆంధ్రా యూనివర్సిటీలో మేధాసంపత్తి హక్కులను పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేధాసంపత్తి హక్కుల కేంద్రాన్ని (సీఐపీఆర్) గత ప్రభుత్వ హాయంలో అప్పటి వీసీ ప్రసాద్రెడ్డి సెప్టెంబరు 2020లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా నూటికిపైగా దరఖాస్తులను పంపారు. ఇక గత ప్రభుత్వ హాయంలో చేపట్టి, పూరైన 5 ప్రత్యేక భవనాలను సీఎం హోదాలో 2023 ఆగస్టు 1వ తేదీన వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఏయూ ఈ ప్రగతిని సాధించింది. ఆ భవనాలు ఇవే... ఏ–హబ్ (ఆంధ్రా యూనివర్సిటీ స్టార్టప్ – టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్): దీనిని రూ. 21కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల స్థలంలో కొత్తగా నిర్మించారు. ఇందులో 121 స్టార్టప్స్ తమ కార్యాలయాలను ప్రారంభించి సేవలందిస్తున్నాయి. రాష్ట్రంలో స్టార్టప్స్కు అంకురార్పణ కూడా ఇక్కడి నుంచే ఊపందుకుందని చెప్పవచ్చు.ఎలిమెంట్(ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మా ఇంక్యుబేషన్ మరియు బయోలాజికల్ మానిటరింగ్ హబ్): ఫార్మా/బయోటెక్/ జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించారు. దీని నిర్మాణానికి రూ. 44 కోట్లు ఖర్చు చేశారు.ఆల్గోరిథమ్(ఆంధ్రా యూనివర్సిటీ డిజిటల్ జోన్ –స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్): దీనిని 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 250 మంది కూర్చునేందుకు వీలు కలిగిన రెండు ఆధునిక సెమినార్ హాళ్లు, 15 స్మార్ట్ క్లాస్ రూమ్లలో 500 కంప్యూటర్లతో విద్యార్థులకు శిక్షణ, ఆన్లైన్ పరీక్షలను నిర్వహించుకునే వీలు కలిగింది. ఇందుకోసం ప్రత్యేక ఫ్లోర్ను నిర్మించారు.ఏయూ–సిబ్ (ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్): ఐఐఎం–విశాఖపట్నంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుని, రూ. 18 కోట్ల వ్యయంతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్లో ప్రత్యేకమైన బ్యాచిలర్ మరియు మాస్టర్ ప్రోగ్రామ్లను అందిస్తున్నారు.ఏయూ–అవంతి ఆక్వాకల్చర్ ఇనోవేషన్ మరియు స్కిల్ హబ్మొదటి దశలో రూ. 11 కోట్లతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్లో నైపుణ్య శిక్షణను అందించడానికి దీనిని నిర్మించారు. -
Nagaland: నిజాయితీకి చిరునామా!
నాగాలాండ్ రాజధాని ‘కోహిమా’ కదా... నాగాలాండ్లోనే, ఇండియా–మయన్మార్ సరిహద్దుల్లో కోహిమాకు పశ్చిమాన 20 కి.మీ. దూరంలో ‘ఖొనోమా’ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం ప్రత్యేకత... గ్రామంలో ఎవరూ అబద్ధాలు ఆడకపోవటం! ఎవరూ దొంగతనం చేయకపోవటం! ఎవరూ ఇళ్లకు తాళాలు వేయకపోవటం! దుకాణాల్లో వాటిని నడిపేవారెవరూ ఉండకపోవటం! ఇలాంటివన్నీ కలిపి ఖొనోమా గ్రామంలో మొత్తం 154 ప్రత్యేకతలు ఉన్నాయి. ‘కెన్యూ’ నిబంధనలు అంటారు వాటిని. ఎవరైనా కెన్యూను దాటి ప్రవర్తించారా... ఇక వాళ్ల పని దైవం చూసుకుంటుందని గ్రామస్థుల నమ్మకం. ఖొనోమా గ్రామం దేశంలోనే ‘నిజాయితీ గల గ్రామం’గా ప్రసిద్ధి చెందింది.ఖొనోమా గ్రామంలో ఉండేదంతా ‘అంగామీ’ తెగవారు. నాగాలాండ్కు చెందిన ఒక ప్రధాన సమూహం ఆ తెగ. ‘అంగామీ నాగా’లు అంటారు వారిని. ‘గోల్హో’ వారి ప్రధాన ఆహారం. బియ్యం, హిమాలయాల్లో విస్తృతంగా ఉండే చిమటి కూర కలిపి గోల్హోను తయారు చేస్తారు. అలాగే కూరగాయలు, పందిమాసం, గొడ్డు మాంసం తింటారు. వారిలో దాదాపుగా అందరూ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. 2011 లెక్కల ప్రకారం అక్కడి జనాభా సుమారుగా 2 వేలు. పురుష జనాభా కంటే, స్త్రీ జనాభా పిసరంత ఎక్కువ. గ్రామం ప్రకృతి మధ్యలో ఉంటుంది. ప్రకృతి తన కోసం కట్టుకున్న ఇంటిలా ఆ పచ్చని గ్రామంపై మంచు పరుచుకుని ఉంటుంది. మోసం అనే మాటే ఉండదు!నాగాలాండ్లో చాలావరకు గ్రామాలన్నీ ఖొనోమాలా ఉన్నప్పటికీ, ఖొనోమా ప్రజలు ‘కెన్యూ’ నియమాలకు లోబడి జీవించటం మూలాన దేశంలోనే ఈ గ్రామం నిజాయితీ గల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఖొనోమాకు ‘వారియర్ విలేజ్’ అనే పేరు కూడా ఉంది. బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన చరిత్ర వీరిది. ఖొనోమా ప్రజల్లో నిజాయితీ అనేది కేవలం నైతిక ధర్మం మాత్రమే కాదు, అది వారి సామాజిక సంప్రదాయ శక్తి కూడా. నిజాయితీ పట్ల వారి నిబద్ధతే ఆ తెగలో పేద, ధనిక అనే అసమానతలు లేకుండా చేసింది. దొంగతనం అనే మాటే ఆ గ్రామంలో వినిపించదు. దొంగతనం అనేది దేవుడి విషయంలో మనిషి చేసే నేరం అని వారు బలంగా విశ్వసిస్తారు. ఖొనోమాలోని దుకాణాల్లో వినియోగదారులు ఎవరికి కావలింది వారు తీసుకుని, డబ్బులు అక్కడ పెట్టి వెళతారు. ఆ డబ్బుల్ని తీసుకోటానికి, లెక్క చూసుకోటానికి దుకాణంలో పనిగట్టుకుని ఎవరూ ఉండరు. అంత నమ్మకం రాజ్యమేలుతూ ఉంటుంది ఖొనోమా గ్రామంలో! అంతేనా, ఎవరైనా వ్యవసాయదారులు పంటను ఇంటికి మోసుకెళుతున్నప్పుడు అలసిపోతే, వారు ఆ పంటను రోడ్డు పక్కన వదిలి, మరుసటి రోజు వచ్చి తీసుకెళతారు. అప్పటి వరకు ఆ పంట భద్రంగా రహదారి పక్కనే ఉంటుంది. ఎవరైనా తీసుకెళతారన్న భయమే ఉండదు. ‘అనిమిజం’... ఈ గ్రామ మార్గంనిజాయితీ అన్నది వాళ్ల మత విశ్వాసాల్లోనే మిళితమై ఉంది. 19వ శతాబ్దంలో క్రైస్తవ మతం ఇటువైపు వ్యాప్తి చెందటానికి ముందు నుండే ఖొనోమాలోని ఈ అంగామీలు ‘అనిమిజం’ అనే భావనను విశ్వసిస్తూ వస్తున్నారు. నేటికీ ఆ విశ్వాసం కొనసాగుతూ వస్తోంది. అనిమిజం అంటే సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు, ప్రదేశం ప్రత్యేక ఆధ్యాత్మిక సారాన్ని కలిగి ఉంటుందన్న నమ్మకం. ఈ నమ్మకం కేవలం మతపరమైనది కాదు. రోజువారీ జీవితంలో అంతర్భాగం అయిన ఆచారాలు, సంప్రదాయాలు, పర్యావరణానికి హితమైన జీవన విధానం అనిమిజానికి ఆయువు పట్టు. వీటిలోంచి అంగామీల పూర్వీకులు ఏర్పరచిన 154 నిబంధనలే కెన్యూలు. కెన్యూ అనే మాటకు నిషిద్ధం అని అర్థం. వికలాంగులను ఆదరించకపోవటం కెన్యూ. పెద్దల్ని గౌరవించకపోవటం కెన్యూ. మోసం చేయటం, అబద్ధాలాడటం, సాటి మనిషిని తృణీకరించటం వంటివన్నీ కెన్యూలే. ఖొనోమా ప్రజల భావోద్వేగాల రక్తకణాల వంటివి ఈ కెన్యూలు. అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం!దొంగిలించిన పిల్లి మాంసం తినడం కూడా ఒక కెన్యూ. అలా చేస్తే పిల్లి శాపం తగులుతుందని ఖొనోమా గ్రామస్థులు నమ్ముతారు. పెంపుడు పిల్లలను ఆహారం కోసం చంపటం వంటి సంఘటనల నుంచి ఈ కెన్యూ ఆవిర్భవించింది. లంచాలు తీసుకోవటం, మన కోసం పని చేసినవారికి సగం జీతాన్నే చెల్లించటం, అత్తమామల్ని కించపరచటం, గుమ్మడి కాయను వేలితో చూపించటం ఇవన్నీ కూడా కెన్యూలే. వీటిలో ఒక్కో రకం తప్పుకు ఒక్కో రకం ప్రతికూల ఫలితం ఉంటుందని ఖొనోమా వాసులు నమ్ముతారు. గుమ్మడి కాయను వేలితో చూపిస్తే అది కుళ్లిపోతుందని, అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం వస్తుందని, మన కోసం పని చేసినవారికి సగం జీతమే ఇస్తే, దేవుడు మనకు ఉద్దేశించిన ఆశీర్వాదాలు వారివి అవుతాయని ఖొనోమా గ్రామంలోని అంగామీలు బలంగా నమ్ముతారు. అందుకే నిజాయితీ, సత్యసంధత వారిలో లోతుగా పాతుకుపోయాయి. భారత ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితమే, 2005లో ఖొనోమాను ‘దేశంలోనే మొట్టమొదటి హరిత గ్రామం’గా ప్రకటించింది. అన్నట్లు, గ్రామంలో సమృద్ధిగా పెరిగే ఖ్వునో అనే చిన్న మొక్క పేరు మీద ఈ గ్రామానికి ఖొనోమా అనే పేరు వచ్చిందంటే ముచ్చటగా అనిపిస్తుంది. ప్రకృతికి కట్టుబడి ఉండటం అంటే ఇదే కదా!– సాక్షి, స్పెషల్ డెస్క్ -
మయూరధ్వజుడు
ధర్మరాజు అశ్వమేధయాగం చేపట్టి, యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే, వారు చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే! మయూరధ్వజుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు మయూరధ్వజుడి రాజధానికి వెళ్లారు. యాగాశ్వాన్ని విడిచిపెట్టడమో, యుద్ధానికి సిద్ధం కావడమో తేల్చుకోమన్నారు. మయూరధ్వజుడు యుద్ధానికే సిద్ధపడ్డాడు.యుద్ధం మొదలవడానికి ముందు శ్రీకృష్ణుడు ‘అర్జునా! మయూరధ్వజుడు నా భక్తాగ్రేసరుడు. అతడితో యుద్ధం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు’ అని చెప్పాడు. యుద్ధం మొదలైంది. మయూరధ్వజుడి ధాటికి అర్జునుడు నిలవలేకపోయాడు. కృష్ణుడి సాయం కోరాడు. కృష్ణుడు కూడా యుద్ధంలోకి దిగాడు. తన ఆరాధ్యదైవంతో యుద్ధం చేయడం మయూరధ్వజుడికి ఇష్టంలేదు. అలాగని రణరంగం నుంచి వెనుదిరగడం క్షాత్రధర్మం కాదు. మయూరధ్వజుడు మనసులో కృష్ణనామ జపం కొనసాగిస్తూనే, శరపరంపర కురిపించసాగాడు. అతడి బాణాల దెబ్బకు కృష్ణుడు కూడా చలించాడు. అది గమనించిన అర్జునుడు, ‘బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రాయుధంతో వాడి తల నరుకు’ అన్నాడు.‘అర్జునా! నీ గాండీవమైనా, నా సుదర్శనమైనా ఆ మహాభక్తుడి మీద పనిచేయవు’ అని పలికాడు కృష్ణుడు.‘అంతటి మహాభక్తుడా!’ ఆశ్చర్యంగా అడిగాడు అర్జునుడు. కృష్ణభక్తులలో తానే గొప్పవాడిననే గర్వం అర్జునుడిలో ఉంది. మయూరధ్వజుడి గురించి స్వయంగా కృష్ణుడే అంతలా చెబుతుండటంతో అతడు ఆశ్చర్యపోయాడు. పొద్దువాలడంతో ఆనాటికి యుద్ధం చాలించారు.మయూరధ్వజుడి భక్తి ఎంతటిదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు కృష్ణుడు. మరునాటి వేకువజామునే కృష్ణార్జునులు బ్రాహ్మణవేషాలు ధరించి, మయూరధ్వజుడి రాజప్రాసాదానికి చేరుకున్నారు.మయూరధ్వజుడు వారికి ఎదురేగి, ఆహ్వానం పలికాడు. ‘విప్రులారా! నా ఆతిథ్యం స్వీకరించి, నన్ను ఆశీర్వదించండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకు పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరేంత వరకు మేము మరొక విషయాన్ని గురించి ఆలోచించలేము’ అని చెప్పారు వారు.‘స్వామీ! మీకు వచ్చిన విపత్తేమిటి? అవసరమైతే నా ప్రాణమైనా ధారపోసి మీ విపత్తను తొలగిస్తాను’ అన్నాడు మయూరధ్వజుడు.‘రాజా! మేము అడవి దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పులి నా కుమారుణ్ణి పట్టుకుంది. అది వాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత, ‘మయూరధ్వజ మహారాజు శరీరంలోని సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే, నీ బిడ్డ బతుకుతాడు’ అని అశరీరవాణి పలికింది. అందువల్ల పుత్రభిక్ష కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను’ అన్నాడు విప్రవేషంలోని శ్రీకృష్ణుడు.‘ఆహా! నా జన్మ చరితార్థమైంది. ఒక పసిబాలుడి ప్రాణం కాపాడటానికి నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే నాకేం కావాలి! సంకోచించకుండా నా శరీరంలోని సగభాగాన్ని తీసుకువెళ్లి ఆ పులికి ఆహారంగా ఇవ్వండి’ అని పలికి, తన శరీరాన్ని రెండు సమభాగాలుగా కోయమని తన భార్యాబిడ్డలను ఆదేశించాడు.వారు కంటతడి పెట్టుకుంటూనే మయూరధ్వజుడిని రంపంతో నిలువునా తరగడం మొదలుపెట్టారు. విప్రవేషాల్లో ఉన్న కృష్ణార్జునులు నిశ్చేష్టులై, ఆ దృశ్యాన్ని తిలకించసాగారు. అలా చూస్తుండగా, ఒక వింత కనిపించింది. మయూరధ్వజుడి ఎడమకంటి నుంచి కన్నీరు కారసాగింది.అప్పుడు కృష్ణుడు ‘రాజా! ఏదైనా మనస్పూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. నువ్వలా బాధపడుతూ, కన్నీరు చిందిస్తూ నీ శరీరాన్ని నాకు ఇవ్వనక్కర్లేదు. నీకు ఇష్టంలేని పని చేయవద్దులే!’ అని తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో పలికాడు కృష్ణుడు. వెంటనే అక్కడి నుంచి వెనుదిరగబోయాడు.మయూరధ్వజుడు వెంటనే కృష్ణుడి చేతులు పట్టుకుని, ‘అయ్యా! నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నందుకు నాకు ఎలాంటి బాధలేదు. నాకు నిజంగా బాధ ఉంటే, నా రెండుకళ్లూ కన్నీరు కార్చాలి కదా! నా ఎడమ కంటి నుంచి మాత్రమే కన్నీరు వస్తోంది. నా శరీరంలోని కుడిభాగానికి దక్కిన అదృష్టం తనకు దక్కలేదని, ఒంటరిగా మిగిలిపోయిన తాను ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకుండానే ఖిలమైపోతానని ఎడమభాగం బాధపడుతుండటమే అందుకు కారణం. మీరు నిశ్చింతగా నా శరీరంలోని అర్ధభాగాన్ని తీసుకువెళ్లవచ్చు’ అని పలికాడు.కృష్ణుడు సాభిప్రాయంగా అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. తనకు గర్వభంగం కలిగించడానికే జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణ పరమాత్ముడు ఈ లీలావినోదాన్ని కల్పించాడని గ్రహించి, సిగ్గుపడ్డాడు.వెంటనే, కృష్ణార్జునులు నిజరూపాలతో మయూరధ్వజుడికి దర్శనమిచ్చారు.మయూరధ్వజుడి శరీరానికి తిరిగి పూర్వస్థితి కలిగించాడు కృష్ణుడు.ఆరాధ్యదైవం కళ్లెదుట కనిపించడంతో మయూరధ్వజుడు పారవశ్యంతో సాష్టాంగపడ్డాడు. యాగాశ్వాన్ని అర్జునుడికి అప్పగించాడు.∙సాంఖ్యాయన -
Funday Crime Story: కాఫీ+చాయ్= కొచ్చిన్!
నల్లగొండకు చెందిన సయ్యద్ సలావుద్దీన్ సలార్ ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి)లో చేరి, ఆ సంస్థ అధినేత స్థాయికి ఎదిగాడు. పదేళ్లకు పైగా పరారీలో ఉన్న సలార్, 2011 జూన్లో పోలీసులకు చిక్కాడు. దుబాయ్లో తలదాచుకున్న అతడు, కేరళ మీదుగా హైదరాబాద్ వచ్చే ప్రయత్నంలో ఉండగా, మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు దొరికిపోయాడు. ‘కాఫీ.. చాయ్.. కొచ్చిన్’ అనే కోడ్ వర్డ్ సలార్ను పట్టించింది.సలావుద్దీన్ సలార్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లి, అక్కడి ‘సిమి’ క్యాడర్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 1998 వరకు నార్తర్న్ రీజన్ కమాండర్గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ‘సిమి’ కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. ఆపై ‘సిమి’కి ఆలిండియా చీఫ్గా మారి దాదాపు రెండేళ్ల పాటు దాని వ్యవహారాలను పర్యవేక్షించాడు. సలార్ నార్తర్న్ రీజన్ కమాండర్గా ఉండగా మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలోని మహాకాల్ పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశాడనే ఆరోపణలతో అతడిపై ఆ కేసు నమోదైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం 2001లో ‘సిమి’ని నిషేధించింది. దీంతో సలార్ తన మకాంను దుబాయ్కు మార్చాడు. పదేళ్లకు పైగా దుబాయ్లో ఉంటూ సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్న సలార్ను 2009లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ దేశ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో విచారణ పూర్తి చేసి, రెండేళ్ల శిక్ష విధించారు. ఈ శిక్షాకాలం 2011లో పూర్తికావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అక్కడి నిబంధనల ప్రకారం యూఏఈ ప్రభుత్వం సలావుద్దీన్కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) ఇచ్చింది. ఈ సర్టిఫికెట్ పొందిన వ్యక్తి నిర్ణీత సమయంలోపు ఆ దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అప్రమత్తమైంది. సలార్ భారత్లో అడుగు పెట్టగానే, అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం అనేక మార్గాలు అన్వేషించిన అధికారులు చివరకు ఇండోర్కు చెందిన ఓ ఫోన్పై నిఘా ఉంచారు. ఆ వ్యక్తి గతంలో సలార్కు అనుచరుడిగా ఉండటంతో కచ్చితంగా అతడిని సంప్రదిస్తాడనే ఉద్దేశంతో మానిటరింగ్లో పెట్టింది. దేశంలోని ఏ విమానాశ్రయంతో అతడు ల్యాండ్ అవుతున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పని మొదలు పెట్టారు. సుదీర్ఘకాలం క్రమం తప్పకుండా గంటల తరబడి చేసిన ఈ మానిటరింగ్లో ఓ చిన్న పదం నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఐబీ అనుమానించినట్లే 2011 జూన్లో ఇండోర్కు చెందిన వ్యక్తిని సలార్ సంప్రదించాడు. తన మాజీ అనుచరుడైన ఆ వ్యక్తితో అనేక విషయాలు చర్చించాడు. చివరగా పదే పదే అతడు చెప్పిన మాట ‘కాఫీ, చాయ్ సే తయ్యార్ రహో’ (కాఫీ, టీతో సిద్ధంగా ఉండు) అధికారులను అలెర్ట్ చేసింది. సలావుద్దీన్ లాంటి వ్యక్తి టీ, కాఫీల కోసం కాల్ చేయడని, అందులో ఏదో మర్మం ఉందని భావించి, నిపుణులతో విశ్లేషించారు. కాఫీ, చాయ్లను ఆంగ్ల అక్షరాల్లో రాసుకుని దేశంలోని కొన్ని నగరాలు, పట్టణాల పేర్లతో సహా అనేక పదాలు సృష్టించారు. సలావుద్దీన్ వస్తున్నది దుబాయ్ నుంచి కావడంతో ఆ నగరాలు, పట్టణాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న వాటిని వేరు చేయాలని నిర్ణయించడంతో ఐబీ ప్రయత్నం ఫలించింది. కేరళలోని కొచ్చిన్ పేరు కూడా వాటిలో ఉండటంతో అదే ల్యాండింగ్ స్పాట్గా గుర్తించింది. కాఫీ, చాయ్ పదాల ఉచ్చారణతో ఏర్పడే, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం అదేనని తేల్చి, మధ్యప్రదేశ్ ఏటీఎస్ను అప్రమత్తం చేసింది. కొన్ని రోజుల పాటు దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల వివరాలపై అధికారులు కన్నేసి ఉంచారు. చివరకు 2011 జూన్ 26న సలావుద్దీన్ సలార్ దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 530లో తన దూరపు బంధువులు ఇద్దరితో కలిసి విమానం దిగి, కేరళ–మధ్యప్రదేశ్ పోలీసుల సంయుక్త బృందానికి చిక్కాడు. సలావుద్దీన్ సలార్ హైదరాబాద్లోనూ వ్యవహారాలు సాగించాడని విచారణలో తేలింది. అప్పట్లో హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్ వెళ్లిన ప్రత్యేక బృందం సలార్ను విచారించి వచ్చింది. ఈ నేపథ్యంలోనే లష్కరేతొయిబా (ఎల్ఈటీ ) మాడ్యుల్తో ఇతడికి సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. 2002 నవంబర్ 21న దిల్సుఖ్నగర్లోని సాయిబాబా దేవాలయం సమీపంలో పేలిన స్కూటర్ బాంబు ఇద్దరిని బలిగొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆజం, అజీజ్ అప్పట్లో ఎన్కౌంటర్ కాగా, మరో 8 మందిపై పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. అబ్దుల్ బారి అలియాస్ అబు హమ్జా సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ ఘాతుకంలో సలార్ ప్రమేయం ఉందని తేలడంతో రాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నుంచి అతడిపై ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ పొందారు. దీని సహాయంతో ఉజ్జయిన్ వెళ్లి, 2011 జూలై 18న సిటీకి తీసుకువచ్చి ఈ కేసులో జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ పొందిన సలార్ నగరంలోని బాబానగర్లో స్థిరపడ్డాడు. 2014 అక్టోబర్ 18న నల్లగొండకు కారులో వెళ్తున్న అతడు చిట్యాల సమీపంలోని పెదకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. -
యువ కథ: అసుర బంధనం
‘పాపా సుధా! పాపా సుధా!’ అంటూ నిద్రకళ్లతోనే పెన్నూ పుస్తకం పట్టుకుని, వంటగదిలోకొచ్చాడు చింటూ. తన తండ్రి పిలిచే పిలుపే తనకీ అలవాటు. చపాతీలు కాలుస్తున్న సుధ.. కొడుకు చింటూని చూసి.. ‘అప్పుడే లేచావా? పో బ్రష్ చేసిరా టిఫిన్స్ పెడతా’ అంది నవ్వుతూ. ‘పాపా! మరేమో మాకు రేపు శ్లోకాలు, పద్యాల పోటీ ఉంది, ఏదైనా ఒకటి రాసిస్తావా? ప్రాక్టీస్ చేస్తా!’ అన్నాడు చింటూ.చటుక్కున స్టవ్ ఆఫ్ చేసి.. ‘అవునా? ఇటురా, నాకు బాగా ఇష్టమైన ఓ శ్లోకముంది, రాసిస్తా’ అంటూ పక్కనే ఉన్న చిన్న పీట లాక్కుని కూర్చుంది సు«ధ. దగ్గరకొచ్చి తల్లిముందు మోకాళ్లపై కూర్చుని పెన్నూ పుస్తకం ఆమె చేతిలో పెట్టాడు చింటూ.దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ‘‘అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‘అంటూ పైకి చదువుతూనే, చింటూ పుస్తకంలో రాస్తోంది సుధ. ‘దీని అర్థం ఏంటమ్మా?’ అన్నాడు చింటూ క్యూట్గా. ‘ఓ అర్జునా! డాంబికం, గర్వం, మితిమీరిన అహం, కోపం, మొరటుతనం, అజ్ఞానంతో వాస్తవాన్ని గ్రహించకపోవడం.. ఇవన్నీ అసుర (రాక్షస) స్వభావంతో పుట్టినవారి లక్షణాలు’ అంది సుధ రాస్తూనే. ఈలోపు చింటూ నాయనమ్మ దుర్గమ్మ బయట నుంచి వంటగదివైపు చూస్తూ ‘రేయ్ చింటూ, మీ పెదనాన్న లేచాడా? చూడు’ అని అరిచింది. వెంటనే చింటూ, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి రుద్రాక్ష గదిలోకి మెల్లగా తొంగి చూశాడు. గుర్గుర్మనే శబ్దాన్ని విని ‘ఇంకా లేవలే’ అన్నట్లుగా చేత్తోనే సైగ చేశాడు.చింటూకి ఇద్దరు అక్కలు. చింటూ తండ్రి అంజి.. రుద్రాక్ష కంటే చాలా చిన్నవాడు. పదేళ్ల క్రితం, హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకుని, డిప్రెషన్తో ఇంటికే పరిమితమైపోయాడు. అప్పటికే ఉద్యోగం చేస్తున్న సుధ ఇంటి బాధ్యతంతా తనే తీసుకుంది. అయితే విషయం తెలుసుకున్న రుద్రాక్ష ‘నా తమ్ముడ్ని నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. నీకు నీ మొగుడు కావాలంటే ఊరికొచ్చి బుద్ధిగా కాపురం చేసుకో.. నేను మాత్రం మా తమ్ముడ్ని, పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతా’ అని సుధపై రంకెలేశాడు. ఆ రోజు నుంచి చింటూ ఫ్యామిలీ ఊరిలో రుద్రాక్ష ఇంట్లోనే ఉంటోంది. సుధ అప్పట్లోనే జాబ్ చేస్తూ తెలుగు మీద ఇష్టంతో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసింది. కనీసం ఊళ్లోని కాన్వెంట్కి వెళ్లి తెలుగు టీచర్గా చేసుకుంటానన్నా, ఆమె మాట చెల్లలేదు.పదయ్యేసరికి చింటూ చక్కగా తినేసి, శ్లోకం బట్టీపట్టే పనిలో పడ్డాడు. ఇంతలో దుర్గమ్మ మెల్లగా.. రుద్రాక్ష గదికి వెళ్లి ‘రేయ్ రుద్రా లే, పది దాటింది. చెరువుల కాడికి పోవాలేమోగా?’ అంది చిన్నగా. ‘ఊ..’ అన్నాడు రుద్రా గంభీరంగా. ఆదివారం కదా, రుద్రాక్ష బయటికి వెళ్లిపోతే, అతడికి తెలియకుండా, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్లాలనేది ఆమె తాపత్రయం. రుద్రాక్ష శివభక్తుడు. అతడికి చెప్పకుండా కొన్నేళ్ల క్రితమే బాప్టిజం తీసుకుని మేరీగా మారింది దుర్గమ్మ. ఇంటికి సమీపంలో ఆమె పేరునున్న కొంత స్థలాన్ని చర్చి కట్టడానికి దానం చేసిన విషయం బయటపడిన రోజే.. తల్లి మతం మారిన విషయం తెలుసుకున్నాడు. ఆ గొడవ తర్వాత తల్లితో మాట్లాడటం మానేశాడు.రుద్రాక్ష లేచి స్నానం చేసి వచ్చేలోపు.. అతడి భార్య శ్రీలేఖ పూజకు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. పూజ చేసి వచ్చేలోపు సుధ టిఫిన్స్ అందించింది. ఇక ఎప్పటిలానే ఆ ఆదివారం ఇంటి బయట రుద్రాక్ష బుల్లెట్ స్టార్ట్ చేయగానే, ఇంటి వెనుక నుంచి మేరీ 11 గంటల ఆరాధన కోసం అడ్డదారిలో చర్చికి పరుగుతీసింది. రుద్రాక్ష తన స్నేహితుడు రవీంద్ర ఇంటి ముందు బండి స్లోచేసి, హార¯Œ కొట్టాడు. అక్కడ మరో బుల్లెట్ స్టార్ట్ అయ్యింది. అది సేమ్ కలర్, సేమ్ మోడల్. రుద్రాక్ష ప్రతి పనిలోనూ రవీంద్రనే ఫాలో అవుతాడు. ప్రతిపనిలోనూ రవీంద్ర వెంటే నడుస్తాడు. ఇద్దరికీ కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. చేపల చెరువులు వేసి ఇంకా ఇంకా గడిస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లైనా, ఇంటి బయట పని వాళ్లైనా వాళ్లు చెప్పిన మాట వినాలి. ఇక వాళ్లు కన్నవాళ్లు, వాళ్లను కన్నవాళ్లు అంతా తమ గీత మీదే నడవాలి. వాళ్లు బయటకి వెళ్తున్నప్పుడు ఇంటి ఆడవాళ్లెవరూ బయట కనిపించకూడదు. వాళ్లు ఇంటికి వచ్చేసరికి పెద్దపెద్దగా మాటలేవీ వినిపించకూడదు. ఈ శాసనాలన్నీ రవీంద్ర చేసినవే. చాలావరకు రుద్రాక్ష ఇంట్లోనూ అమలవుతుంటాయి. కాలం మారుతుందని గుర్తించలేని ఆ పల్లెటూరిలో ఈ హిట్లర్ పాలన మొదలై పాతికేళ్లు దాటింది.పాతికేళ్ల క్రితం రుద్రాక్ష, రవీంద్రలతో పాటు వంశీధర్ అనే మరో స్నేహితుడు వీళ్లతో కలిసి తిరిగేవాడు. వంశీధర్కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మ పెంచింది. అతడి పెళ్లి తర్వాత ఆమె కూడా చనిపోయింది. రుద్రాక్ష, వంశీధర్లకు పెళ్లి అయిన మూడేళ్లకు రవీంద్ర పెళ్లి చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి ఆడవాళ్లపై చిన్నచూపున్న రవీంద్ర పెళ్లి తర్వాత భార్యను కట్టుబానిసలా చూసేవాడు. గొడవైన ప్రతిసారీ రుద్రాక్ష, వంశీధర్ల కాపురాలను చూసి నేర్చుకోమని తిట్టేది రవీంద్ర భార్య. దాంతో వీలు చిక్కిన ప్రతిసారీ స్నేహితులకు మందు, విందు ఏర్పాటు చేసి, ‘ఆడదానికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. వాళ్లని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. లేదంటే, అదే చేతకాని తనమవుతుంది. ఎవరిముందైనా మనదే పైచేయి కావాలి’ అంటూ ఇంట్లో తాను చలాయించే నియంతృత్వ ప్రతాపాన్ని స్నేహితుల ముందు గర్వంగా చెప్పుకునేవాడు. కుటుంబానికి కట్టుబడి బతికే ప్రతి వాడ్ని బకరాగా ఉదహరించేవాడు. మెల్లగా స్నేహితులిద్దరూ రవీంద్ర బాటలో నడవడం మొదలుపెట్టారు. కొన్ని నెలలకు వంశీధర్ ఉన్నట్టుండి కనిపించడం మానేశాడు. ఆరాతీస్తే పిల్లలకు బాలేదని, అత్తింటికి వెళ్లాడని అస్పష్టమైన సమాచారమందింది. కొంతకాలానికి ఊరు తిరిగొచ్చిన వంశీధర్– స్నేహితుల్ని మాత్రం కలవలేదు. ఆస్తులమ్మేసుకుని టౌన్ వెళ్లిపోతున్నాడనే వార్త విన్న రుద్రాక్ష, దారికాచి వంశీధర్ని నిలదీశాడు. ‘కొన్నిసార్లు ఎదుటివారి మూర్ఖత్వం కూడా మనలోని మంచితనాన్ని చంపేస్తుంది, అలా చచ్చి బతుకుతున్నవాణ్ణి. కారణాలడగొద్దురా. వాదించి శత్రువుని కావాలనుకోవడంలేదు’ అనేసి వెళ్లిపోయాడు వంశీధర్. ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదు.ఇంకొన్నాళ్లకు రవీంద్ర భార్య గొడవ పడటం మానేసి, అణిగిమణిగి బతకడం నేర్చుకుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డ కావాల్సిందేనని, డాక్టర్ ప్రమాదమని చెప్పినా మరో కాన్పుకి ఉంచాడు రవీంద్ర. మళ్లీ ఆడపిల్లే పుట్టింది. కానీ భార్య పురిటిలోనే చనిపోవడంతో, ఏడాదిలోపు ఆమె చెల్లెల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మరో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కొడుకు మాత్రం పుట్టలేదు. రుద్రాక్షది ప్రేమ వివాహం. ఒక కొడుకు, ఒక కూతురు. రవీంద్ర ప్రభావంలో రుద్రాక్ష భార్యను తక్కువ చేసి చూడటం మొదలుపెట్టాక.. ఆత్మాభిమానంతో శ్రీలేఖ చాలా ఏళ్లు పోరాడింది. చివరికి రుద్రాక్షలో మార్పు లేకపోవడంతో పనులన్నీ చేసిపెడుతూనే, మాట్లాడటం మానేసింది. రవీంద్ర మొదటి భార్య చనిపోయినప్పుడు.. రుద్రాక్ష చెల్లెలు ప్రియను అతడికిచ్చి చెయ్యాలని తెగ ఉబలాటపడ్డాడు రుద్రాక్ష. అప్పటికి ప్రియ చదువుకుంటోంది. సడ¯Œ గా పెళ్లి అనేసరికి, ‘నేను మా సీనియర్ని ప్రేమిస్తున్నా, అతడ్నే చేసుకుంటా’ అని తెగేసి చెప్పింది. అయినా రుద్రాక్ష వినకపోవడంతో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకుంది. దాంతో ప్రియను ఇంటి గుమ్మం తొక్కనివ్వలేదు. రుద్రాక్షకు తెలియని విషయమేంటంటే, రవీంద్రతో పెళ్లి చేస్తే ప్రియ జీవితం నాశనమయిపోతుందని భావించిన శ్రీలేఖే రహస్యంగా ఆ పెళ్లి చేసింది.‘ఆడపిల్లలకు పదోతరగతే ఎక్కువ’ అనే రవీంద్ర నలుగురు కూతుళ్ల్లకు పెళ్లి చేసి పంపేశాడు. ఆ ఇంట్లో జరిగే ప్రతి పెళ్లికి, రుద్రాక్ష ఇంట్లో రచ్చ జరిగేది. కూతురు స్వప్నను చదువు మానిపించి, పెళ్లి చెయ్యాలని రుద్రాక్ష తీవ్రంగా ప్రయత్నించేవాడు. అతడ్ని ఆపలేక, శ్రీలేఖ విదేశాల్లో ఉండే స్నేహితుల సాయంతో దొంగపెళ్లికొడుకుల్ని ఏర్పాటు చేసి, చివరిక్షణంలో సంబంధాలను చెడగొట్టే పనిలో ఉండేది. ఇక కొడుకు కౌటిల్య కెనడాలో ఉద్యోగం చేసుకుంటూ, అక్కడి పిల్లనే ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న రుద్రాక్ష ‘నేను చూసిన అమ్మాయిని చేసుకుంటేనే ఆస్తి ఇస్తా. ఇంటికి రానిస్తా’ అని బెదిరిస్తూ వచ్చాడు. దాంతో అక్కడే సహజీవనంతో కాలం గడిపేస్తున్నాడు కౌటిల్య.పాతికేళ్లుగా ఈ స్నేహితులు అహంకారంతో విర్రవీగుతుంటే, విధి మరో రాత రాసింది. ఆ ఆదివారం కాంతమ్మ కల్లుదుకాణంలో మందుకొట్టి ఇంటికి వెళ్లిన రవీంద్ర మరుసటిరోజు నుంచి బాగా నీరసించాడు. ఎప్పుడూ వచ్చే పొడి దగ్గు కాస్త ఎక్కువైంది. దాంతో రుద్రాక్ష దగ్గర్లో సిటీకి తీసుకుని వెళ్లి టెస్ట్లు చేయిస్తే, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, మూడు నెలలు కంటే ఎక్కువ బతకడని, హైదరాబాద్ తీసుకెళ్తే ఫలితం ఉండొచ్చని చెప్పారు. దాంతో హైదరాబాద్లో కాపురం ఉంటున్న పెద్దకూతురు ఇంటికి తీసుకెళ్లారు.వారానికి ఒకసారి రుద్రాక్ష బుల్లెట్ మీదే హైదరాబాద్ వెళ్లి, రవీంద్రని చూసి, ఆ రాత్రికి ఉండొచ్చేవాడు. చావుభయంతో రవీంద్ర బలం, పొగరు అన్నీ తగ్గుతూ వచ్చాయి. మధ్యమధ్యలో వెళ్లొస్తున్న రుద్రాక్షకి రవీంద్ర కూతురు, అల్లుళ్లల్లో కొత్త యాంగిల్ కనిపించసాగింది. ‘లక్షలకు లక్షలు ఆయనకే పెడితే, తర్వాతేం పంచుకోవాలి?’ అనే మాటలు కూడా రుద్రాక్ష చెవిన పడ్డాయి. రవీంద్రకు నెలలు గడవకముందే జబ్బు ముదిరింది. రోజులు దగ్గరపడ్డాయని అతడికీ అర్థమైంది. అందుకే కాబోలు రుద్రాక్ష ఇంటికి బయలుదేరుతుంటే, ‘రేయ్ రుద్రా! మళ్లీ నువ్వు వచ్చేటప్పటికి ఉంటానో లేదో ఓ రెండురోజులుండి పోరా’ అన్నాడు దీనంగా. అన్నట్లుగానే రెండు రోజులు గడవకముందే ప్రాణం పోయింది. వెంటనే రవీంద్ర నలుగురు అల్లుళ్లు ఫోన్లలో మాట్లాడుకుని, అన్ని కార్యక్రమాలు హైదరాబాద్లోనే జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికి బెంగళూరూ, నోయిడా, చెన్నైల్లో ఉంటున్న మిగిలిన అల్లుళ్లు, కూతుర్లు, వాళ్ల పిల్లలు హైదరాబాద్ వచ్చేశారు. బాడీని ఊరికి తీసుకెళ్దామని రుద్రాక్ష అడిగితే ఒప్పుకోలేదు. హైదరాబాద్ అయితే తమ ప్రయాణం ఈజీగా ఉంటుందని, ఊళ్లో అయితే వర్క్, నెట్వర్క్ కష్టమని కారణాలు చెప్పుకొచ్చారు.మరునాడు మధ్యాహ్నానికి రవీంద్ర అంతిమయాత్ర వాహనం ముందు వెళ్తుంటే, రుద్రాక్ష దాన్ని ఫాలో అవుతూ శ్మశానవాటికకు బుల్లెట్పై బయలుదేరాడు. అంతపెద్ద శ్మశానవాటికను చూడటం రుద్రాక్షకు అదే మొదటిసారి. కొన్ని నిమిషాల తేడాలోనే అంతా అక్కడికి చేరారు. తలకొరివి కార్యక్రమం పూర్తికాగానే, కాటికాపరి ‘మీరు వెళ్లొచ్చు. రేపు వస్తే, అస్థికలిస్తా’ అన్నాడు. దాంతో ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. చివరికి రుద్రాక్ష మాత్రమే మిగిలాడు. కాసేపటికి అతడూ లేచి తన బండి దగ్గరకు వెళ్లబోతూ, కాలుతున్న చితివైపు తిరిగి చూశాడు. ఆ క్షణంలో రుద్రాక్షలో ఏదో తెలియని వైరాగ్యం తొణికిసలాడింది. ‘ఏరోజుకైనా నేనూ చితిలో కాలిపోతానని తెలుసు. అయినా ఎందుకో ఏడుపొస్తోంది’ అనుకుంటూనే, ‘రేయ్ రుద్రా! మగాడు ఏడవడం ఏంట్రా?’ అన్న రవీంద్ర మాటలు గుర్తొచ్చి కన్నీళ్లను కళ్లల్లోనే ఆపేసుకున్నాడు. ఇంతలో రుద్రాక్షను దూరం నుంచి చూసిన ఓ వ్యక్తి పరుగున వచ్చి, ‘పాడె కట్టాలా సార్?’ అన్నాడు. ‘నేనింకా బతికే ఉన్నానయ్యా’ అన్నాడు రుద్రాక్ష అప్రయత్నంగా. ‘అయ్యో అదేంటి సార్! మీరు తిరిగి చూసేసరికి మాకోసం వెతుకుతున్నారనుకున్నా సార్’ అన్నాడా వ్యక్తి. ఓ వెర్రినవ్వు నవ్విన రుద్రాక్ష, ‘ఇక్కడ నువ్వేం చేస్తావ్?’ అన్నాడు. ‘నాది కర్రల దుకాణం సార్. అందుకే మీరు కస్టమరేమో అనుకున్నా’ అంటూ అవతలవైపు గుట్టలుగా పేర్చిన కర్రలను చూపించించాడు. ‘నిజమే కదా! శవం కూడా ఓ కస్టమరే’ అనిపించింది రుద్రాక్షకు. ఆ కర్రలన్నీ చూడగానే మనసులో ఎన్నో ఆలోచనలు స్ఫురించాయి. ‘ఇన్ని కర్రలున్నాయేంటీ? రోజుకి ఎన్ని శవాలొస్తాయి ఇక్కడికి?’ అన్నాడు రుద్రాక్ష. ‘ఓ నాలుగైదొస్తాయి సార్’ అన్నాడు ఆ వ్యక్తి. ‘ఈ కర్రలు ఎంతమందికి వస్తాయి?’ అన్నాడు వెంటనే రుద్రాక్ష. ‘ఓ 40 శవాలకు వస్తాయి సార్. ఇది ఇంచుమించు ఓ పదిరోజుల స్టాక్, అంతే!’ అన్నాడు ఆ వ్యక్తి, మరో కస్టమర్ రాగానే అటుగా పరుగుతీస్తూ.‘చావుకంటే ముందే కట్టె ఎదురుచూస్తుందా? రాబోయే పదిరోజుల్లో చనిపోయేవారి కట్టెలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయా? ఈ క్షణం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఆ జీవులు?’ అని పలికింది రుద్రాక్ష మనసు. ‘అంటే! ఈ పదిరోజుల తర్వాత చనిపోబోయే నలభై మంది కట్టెలు లారీలో ఇక్కడికి వస్తుంటాయి. ఆ తర్వాత పదిరోజుల కట్టెలు ఈపాటికే ఎండలో ఎండుతుంటాయి. ఆ తర్వాత కట్టెలు చెట్ల రూపంలో ఉండి ఉంటాయి. ఇదే కదా విధిరాతంటే! శవంపై పెట్టి కాల్చే ఈ కర్ర, ఏదో ఒకరోజు నీ కోసం కూడా సిద్ధమవుతోంది రుద్రాక్షా! విత్తురూపంలో ఉందో, చెట్టు రూపంలో ఉందో, ఎండుతూ ఉందో, లేదంటే లారీలో వస్తుందో? ఇలాంటి శ్మశానవాటికలు ఎన్నో కదా!’ అనే మాటలు రుద్రాక్ష చెవుల్లో ఎవరో అంటున్నట్లే మార్మోగాయి. అప్రయత్నంగా అడుగులో అడుగు వేసుకుంటూ, బుల్లెట్వైపు నడిచాడు.చీకటిపడేసరికి డైరెక్ట్గా వంశీధర్ ఇంటి ముందు ఆగింది రుద్రాక్ష బుల్లెట్. ఆ దారి వెంట రవీంద్రతో పాటు ఎన్నోసార్లు వెళ్లినా, ఏ రోజూ అక్కడ ఆగలేదు. ‘మనల్ని వదిలేసిన వాడితో మనకు మాటలేంట్రా?’ అనేవాడు రవీంద్ర. ఆ మాట గుర్తురాగానే మళ్లీ బుల్లెట్ స్టార్ట్ చేశాడు రుద్రాక్ష. అప్పటికే ‘ఎవరొచ్చారా?’ అని గుమ్మంలోకొచ్చి పరకాయించిన వంశీధర్, ‘రేయ్ రుద్రా’ అని పెద్దగా అరిచి, ఆపి, లోపలికి తీసుకెళ్లాడు. ఏళ్లనాటి దూరాన్ని మౌనం ఆక్రమిస్తుంటే, రవీంద్ర మరణవార్తను వంశీధర్ చెవిన వేశాడు రుద్రాక్ష. ‘వాడు ఎంత బతుకు బతికాడు! అంతా కలిసి ఆ చావుకు విలువ లేనట్లే చేశారు. ఒకరి కళ్లల్లో కూడా నిజమైన కన్నీళ్లు చూడలేకపోయాను’ అంటూ మనసులోదంతా వెళ్లగక్కాడు రుద్రాక్ష దుఃఖంతో. అప్పుడే అనుకోకుండా రుద్రాక్ష కళ్లు గోడమీదున్న ఓ ఫొటో మీద పడ్డాయి. ఫొటోకి దండ వేలాడుతుంటే, అయోమయంగా పైకి లేచి ‘వ..వాసవీ, పిల్లలూ?’ అని ఆగి వంశీధర్ వైపు చూశాడు. ‘ఎప్పుడో చనిపోయార్రా’ అన్నాడు వంశీధర్ దిగులుగా పైకి లేచి ఫొటోని చూస్తూ. ‘ఎలా?’ అడిగాడు రుద్రాక్ష బొంగురు గొంతుతో. ‘తను పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుందిరా’ అన్నాడు వంశీధర్. ‘ఏమంటున్నావ్రా?’ నిర్ఘాంతపోయినట్లు చూశాడు రుద్రాక్ష. ‘అవునురా! నా ప్రవర్తనే కారణం. అప్పట్లో రవీంద్ర చెప్పినట్లే ఇంట్లో ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాక మా మధ్య గొడవలు పెరిగాయి. ఒకరోజు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే వాళ్ల అమ్మానాన్న తిరిగి నా దగ్గరకు వెళ్లమని బలవంతం చేసేసరికి పిల్లలతో సహా మేడ మీద నుంచి దూకేసిందటరా. పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. వాసవి ఐదేళ్లపాటు మంచం మీదే ఉంది. ఊరిలో అంతా అమ్ముకుని ఇక్కడికి వచ్చింది తనని బతికించుకోవడానికే. తాను కోలుకుంటుందని ఆశపడ్డా. కానీ పిల్లల్ని చేతులారా చంపుకున్నానన్న పశ్చాత్తాపం తనని బతకనివ్వలేదు. నా కుటుంబాన్ని కోల్పోవడానికి కారణం నువ్వే అంటూ రవీంద్ర కాలర్ పట్టుకోవాలన్నంత కోపం వచ్చింది. కానీ ఒక్కటే ఆలోచనొచ్చింది. ఆరోజు నా వాసవి నేను చూపించే పైత్యాన్ని భరించి ఉండి ఉంటే ఈ రోజు వరకూ నేను అదే అహంతో అదే ఆధిపత్యంతో కాలర్ ఎగరేసుకుని, అదే ఊరిలో తిరిగేవాణ్ణి కదా మీలానే?’ అన్నాడు వంశీధర్. తలదించుకుని, మౌనంగా వింటూనే ఉన్నాడు రుద్రాక్ష. ‘ఈ ఒంటరితనం నాకు నేను విధించుకున్న శిక్ష. మనం చాలాసార్లు కొందరి సావాసంతో వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. నిజానికి మనిషి తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎప్పుడూ బలహీనుణ్ణే ఎన్నుకుంటాడు. ఈ ఎంపికలో ఎక్కువగా బలయ్యేది కుటుంబసభ్యులే. ఈ లోకంలో ప్రేమ, ఇష్టం, అభిమానం లోపించిన భయభక్తులన్నీ అబద్దాలే, నాటకాలే! ఎవ్వరైనా సరే, నువ్వు ఆంక్షలు పెట్టకుండా ఆపేక్షగా చూసుకుంటే, ఏపని చేసినా చెప్పి చేస్తారు. లేదంటే చెప్పకుండా, రహస్యంగా చేస్తారు. అంతేకాని ఆగిపోరు. ఆగారనుకునే భ్రమలో, ఆపాననుకున్న పొగరుతో మనం ఆగిపోతామంతే! నువ్వు అన్నావ్గా ఇందాక రవీంద్ర చనిపోతే ఎవరి కళ్లల్లోనూ నిజమైన బాధను చూడలేదని, ఎలా చూడగలవు? వాడు ఏ రోజైనా భార్యబిడ్డల అభీష్టానికి బతికాడా? అతడి చావు ఆ కుటుంబానికి ఓ విమోచనం. పంజరం వీడిన రామచిలుకల్లా వారి నవ్వులే నీకు చాలా సమాధానాలు చెబుతాయి చూస్తూ ఉండు’ అన్నాడు వంశీధర్.ఆ ఊరంతా రుద్రాక్ష నోటి నుంచి గంభీరమైన స్వరం విని చాలా నెలలు గడిచాయి. రవీంద్ర మరణం తర్వాత అతడు పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఒకరోజు రవీంద్ర ఇంటి అరుగుపైన అతడి భార్య, పిల్లలు ఫక్కున నవ్వే సన్నివేశం రుద్రాక్ష కంటపడింది. ఎవరో బలంగా లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు.. కానీ నీలోని ఈ గాంభీర్యం సావాసంతో వచ్చిందని నాకు తెలుసు’ అన్న వంశీధర్ మాటలు గుర్తొచ్చాయి.‘లేఖా! లేఖా’ ఆ పిలుపు రుద్రాక్ష నోట వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. పరుగున వచ్చింది శ్రీలేఖ. ‘మన కౌటిల్య పెళ్లి వాడిష్టపడిన అమ్మాయితోనే జరిపిద్దాం, రమ్మను, పెళ్లికి మా చెల్లి ప్రియ ఫ్యామిలీని పిలుద్దాం. అలాగే సుధని టౌన్లో ఏదో స్కూల్లో తెలుగు టీచర్గా ప్రయత్నించమను’ అన్నాడు. శ్రీలేఖ షాక్లో ఉండగానే, సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ లీనమైపోయిన చింటూని ప్రేమగా ఎత్తుకుని ముద్దాడి, బుల్లెట్ ముందు కూర్చోబెట్టుకుని టౌన్కి బయలుదేరాడు రుద్రాక్ష. అక్కడో జీసస్ ఫొటో దుర్గమ్మ కోసం ప్యాక్ చేయించి, చింటూ చేతికిచ్చి, బండి స్టార్ట్ చేశాడు. అప్పటికే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న చింటూ ధైర్యం చేసి చిన్న స్వరంతో, ‘పె..పెదనాన్నా మ..మరేమో, నువ్వంటే నాకు చాలా భయం. ఇప్పుడు నన్ను కొట్టవు కదా?’ అన్నాడు. నవ్వొచ్చింది రుద్రాక్షకి. ‘ఆ భయం పోవాలంటే నేనేం చెయ్యాలి?’ అన్నాడు రుద్రాక్ష. ‘హూ! భయంపోవాలంటేనా? హా, ఇందాక పెట్టావే ముద్దు.. అలాంటి ముద్దు రోజూ పెట్టాలి, పెడతావా? అప్పుడు బోలెడంత ప్రేమొస్తుంది’ అన్నాడు చింటూ ఎదురుగా వచ్చే గాలికి కళ్లను చిట్లిస్తూ. బండి నడుపుతూనే చింటూ తల మీద ముద్దాడాడు రుద్రాక్ష మురిసిపోతున్న చింటూని బుల్లెట్ బండి అద్దంలో చూస్తూ. -
ఈ వారం కథ: మలిసంధ్యలో..!
డల్లాస్ నగరం. రాత్రి ఏడున్నర. అప్పుడే ల్యాప్టాప్ను మూసి, కళ్ళు మూసి సేద తీరుతున్నట్లుగా వెనక్కి వాలాడు కిరణ్. ‘టిఫిన్ రెడీ’ వంటింట్లోంది సుధ కేక వినిపించింది. ‘తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ ఇవ్వు. తర్వాత టిఫిన్ తింటాను’ ఫోన్ రింగ్ అవుతుండటంతో అటువైపు చూశాడు. రామం బాబాయ్ నుంచి కాల్.‘ఈ ముసలాడికి వేరే పనేం లేదు. అందరిళ్లలో జరిగేవన్నీ కావాలి’ స్వగతంలో చిరాగ్గా అనుకున్నాడు. కాఫీ తెస్తున్న సుధకి ఆ మాటలు వినబడ్డాయి.‘ఎవరు.. ఆయనేనా?’ కాఫీ టీపాయ్ మీద పెడుతూ అడిగింది.‘తనే! ఉదయం నుంచి నాలుగు సార్లు ఫోన్ చేశాడు. నాతో మాట్లాడటానికి నిద్రను కూడా త్యాగం చేసుకుంటున్నాడు’‘మాట్లాడొచ్చు కదా. అర్జెంట్ విషయం ఉందేమో!’‘మీ అమ్మ పద్ధతి బాగోలేదు. మూర్తిగారు రోజూ మీ ఇంటికి వచ్చి వెళ్తున్నారు... వాళ్లిద్దరి గురించి ఊరంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు... ఇలా నా బుర్ర తినడానికే ఈ వరుస ఫోన్లు’ నిరాసక్తంగా కాల్ ఆన్సర్ చేశాడు.‘అబ్బాయ్ ఎలా ఉన్నావ్. కోడలు పిల్ల ఎలా ఉంది. బిజీగా ఉన్నావా?’ అటువైపు నుంచి రామం ప్రశ్నలు సంధిస్తున్నాడు. ‘అమెరికా వాళ్లతో మాట్లాడాలంటే ఇబ్బందే అనుకో. మనకీ అక్కడకీ, రాత్రీ పగలూ అంత తేడా ఉంది.’‘విషయమేంటి బాబాయ్’ అసహనంగా అడిగాడు.‘ఏమీ లేదురా. మీ అమ్మ పద్ధతి అస్సలు బాగాలేదు. నువ్వు ఒకసారి వచ్చి, ఇక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టు’‘ఏమైంది బాబాయ్?’ ఆ గొంతు కసిరినట్లుగానే ఉంది. కిరణ్ కోపం ముసలాయనకి అర్థమైంది. అయినా తన మాటలు కొనసాగించాడు.‘నీకు కొత్తగా చెప్పేదేముందిరా. వదినగారిని ఆ మూర్తి బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడు వ్యవహారం మరింత ముదిరిపోయింది. పరిచయమై మూణ్ణాళ్లు కూడా కాకుండానే, ఇద్దరూ కలిసి రోడ్లమీద తిరుగుతున్నారు. ఈ మధ్య సినిమాలకూ వెళ్తున్నారు. మొన్న రాత్రి అతను మీ ఇంటిలోనే పడుకున్నాడు కూడా.’‘గట్టిగా అడిగితే స్నేహం అంటూ సాకులు చెబుతున్నారు. అతనికి లేకపోతే, మీ అమ్మకైనా ఉండొద్దూ్ద బుద్ధి. ఊరూ, వాడా నవ్వుతున్నారు. నిన్ననే మూర్తిగారి పిల్లలు మీ ఇంటికి వచ్చారు. ఆ టయానికి ఆ పెద్దమనిషి అక్కడే ఉన్నారు. పెద్ద ఆర్గ్యుమెంట్లు, అరుపులు, కేకలు.. సర్ది చెప్పలేక చచ్చాననుకో. ఊర్లో పరువు పోతోంది.’‘నువ్వు సాధ్యమైనంత తొందరగా వచ్చి, మీ అమ్మను తీసుకుని వెళ్లిపో. ఇంటి గురించి ఆలోచించకు. ఓ పదో పరకో ఇచ్చి నేనే తీసుకుంటాను. నువ్వు మాత్రం వెంటనే బయల్దేరు. ఉంటాను మరి’ గబగబా నాలుగు మాటలూ చెప్పేసి, రామం ఫోన్ పెట్టేశాడు.‘అత్తయ్యగారిని అమెరికాకు తెచ్చి, ఇల్లు తనకు ఇచ్చేయమంటున్నారా?’ సుధ నవ్వుతూ అడిగింది. ‘ఆ గోల ఎప్పుడూ ఉండేదే. కానీ అమ్మ సంగతే అర్థం కావడం లేదు. మూర్తిగారి విషయం అడిగితే తన స్నేహితుడు అంటుంది. ఆయన పొద్దస్తమానం మనింట్లోనే ఉంటున్నారు. మొన్న రాత్రి మనింట్లోనే నిద్రపోయారట. వాళ్ళ కుటుంబం గొడవ చేసిందట! మా బాబాయే వాళ్లని రెచ్చగొట్టి ఉంటాడు. వర్క్ టెన్షన్లో కొత్తగా ఇదో తలనొప్పి. ఇక భరించలేను. ఇండియాకి వెళ్లి అమీతుమీ తేల్చుకోవాల్సిందే’ సోఫాలోంచి లేస్తూ అన్నాడు. ∙∙ గేటు తీసిన అలికిడి విని శాంత వీధి వైపు తొంగి చూసింది. కొడుకును చూడగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ, ఎదురెళ్లి చేతిలో బ్యాగ్ని అందుకుంది. ‘ఎలా ఉన్నావమ్మా’ అంటూ తల్లిని ఆప్యాయంగా హత్తుకున్నాడు, ‘బాగున్నావా బాబూ’ అంటూ హాల్లో కూర్చున్న మూర్తి పలకరించాడు. చిరునవ్వుతో తల పంకిస్తూ ‘మీరెలా ఉన్నారం’టూ అడిగాడు, సూట్కేసు కింద పెడుతూ. ‘బాగానే ఉన్నాను బాబూ, పెద్ద వయసు కదా. ఆరోగ్య సమస్యలు తప్పవు. వస్తాను శాంతగారు’ అంటూ ఆయన కుర్చీలోంచి లేచాడు.‘మూర్తిగారు సాయంత్రం ఒకసారి రండి’ఆ మాట విని, ఒక్క క్షణం కిరణ్ వైపు చూసి ‘అలాగే’ అంటూ బయటకు నడిచాడు.‘ఏంటమ్మా విశేషాలు’ భోజనానికి కూర్చుంటూ తల్లి కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. ‘ఏం లేవురా,’ ఆమె కిరణ్ వైపు చూడటానికి ఇబ్బంది పడుతోంది.చెప్పా పెట్టకుండా కొడుకు వచ్చాడంటే, ఏదో విషయం ఉందన్నమాట.‘బావున్నావా కిరణూ’ రామం హడావుడిగా ఇంట్లోకి వచ్చాడు.‘ఉదయం నుంచి నీ కోసమే చూస్తున్నాను. ఫ్లైట్ లేటయ్యిందా’శాంతకి విషయం అర్థమైంది. ఈ పెద్దమనిషి నారద పాత్రను పోషించాడన్నమాట.రామం ఆమెకు సొంత మరిది కాదు. పెద్దమామగారి కొడుకు. వ్యసనపరుడై ఆస్తులను కరిగించాడు. తన ఇంటి మీద అతని కన్ను ఉందని కూడా ఆమెకు తెలుసు. అందుకే అతనితో అంటీ ముట్టనట్లు ఉంటుంది. ‘ఎన్నాళ్లుంటావ్?’‘నాకు సెలవుల్లేవు బాబాయ్. ఎల్లుండే తిరుగు ప్రయాణం’‘ఒక రోజులోనే ఇక్కడి వ్యవహారాలన్నీ తేలిపోతాయా?’ వ్యవహారం అనే పదాన్ని నొక్కిపెడుతూ అడిగాడు రామం.కిరణ్ ఓ నవ్వు విసిరేసి ఊరుకున్నాడు. ఆ నవ్వు భావం రామానికి అర్థం కాలేదు. ‘అమ్మని నీతో తీసుకుని వెళ్లిపోతున్నట్లే కదా! ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు రెడీగా లేవు. ఎంతో కొంత ఇస్తాను. ముందు ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. తర్వాత నీకు డబ్బులు పంపిస్తాను.’ ఏదోలా ఇల్లు దక్కించుకుంటే చాలు. మిగిలిన డబ్బులు ఎలాగూ ఎగ్గొట్టేయొచ్చు. అదీ అతని ఆలోచన. ఇలాంటి విషయాల్లో రామానికి మా చెడ్డ అనుభవం ఉంది.‘బాబాయ్, సాయంత్రం మూర్తిగారి కుటుంబాన్ని రమ్మని చెప్పగలవా?’ అన్నాడు. శాంత ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. ఏదో చెప్పబోయింది.‘అమ్మా, నాకు అన్నీ తెలుసు. నువ్వేమీ మాట్లాడకు’ చేత్తో వారించాడు.‘అయితే రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేయమంటావా?’ ‘కంగారెందుకు బాబాయ్. అన్ని విషయాలూ తేల్చే వెళ్తాను కదా’ అంటూ చేయి కడుక్కుని బెడ్రూమ్లోకి వెళ్లిపోయాడు.సాయంత్రం ఆరు గంటలకి మూర్తి, ఆయన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, రామం వచ్చారు. కొడుకు, అల్లుడు బాగానే స్థిరపడ్డారు. కొడుకు దగ్గరే మూర్తి ఉంటున్నాడు. కూతురు సమీపంలో ఉన్న ఓ టౌన్లో ఉంటోంది. అందరూ హాల్లో కూర్చున్నారు. శాంత మాత్రం గదిలోనే ఉండిపోయింది.‘చెప్పండయ్యా, మీ బాధ చెప్పండి. ఇరుగు పొరుగుల సూటిపోటి మాటలు, మీకు ఎదురవుతున్న అవమానాలు అన్నీ కిరణ్కు చెప్పండి.’ రామం మొదలు పెట్టాడు.‘బాబాయ్ మీరు కాసేపు ఏమీ మాట్లాడకండి’ ఆ మాటలో గాంభీర్యాన్ని చూసి రామం కంగుతిన్నాడు.‘అది కాదబ్బాయ్’కిరణ్ సీరియస్గా చూశాడు.ఇక మాట్లాడితే తన మర్యాద దక్కదని ఆయనకి అర్థమైంది.మూర్తి కొడుకు గొంతు సవరించుకున్నాడు.‘సార్, మీ అమ్మగారు, మా నాన్న చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఆయన ఎక్కువసేపు మీ ఇంట్లోనే గడుపుతున్నారు. ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం. మనమే గట్టిగా చెప్పాలి’ అంటూ ఆగాడు.‘ఈ విషయం మీ నాన్నగారితో మాట్లాడారా?’‘ఆయన్ని అడిగాం. తన లైఫ్ తన ఇష్టం అంటున్నారు సార్’ పక్కన కూర్చున్న మూర్తి మౌనంగా వింటున్నాడు.‘అంతే కదా! ఆయన లైఫ్ ఆయన ఇష్టం. మనమెందుకు తలదూర్చడం?’కిరణ్ మాటలు అక్కడున్న వాళ్లకి ఒక్క క్షణం అర్థం కాలేదు.‘ఏమంటున్నారు మీరు?’ అన్నాడు మూర్తి కొడుకు సందిగ్ధంగా. ‘మీ నాన్న, మా అమ్మా వాళ్లకి నచ్చినట్లు ఉంటే మీకూ, నాకూ ఏంటి ప్రాబ్లమ్?’ కిరణ్ గొంతు చాలా కూల్గా ఉంది.‘ఇలా బరి తెగించి తిరిగితే, మన పరువు, ప్రతిష్ఠ ఏమైపోతాయ్’ రామం ఉండబట్టలేక అడిగాడు. ‘వ్యసనాల పాలై ఆస్తులన్నీ అమ్ముకున్నప్పుడు, కుటుంబాన్ని రోడ్డున పడేసినప్పుడు మన పరువు, ప్రతిష్ఠలేమైపోయాయ్.’ ఆ బాణం సూటిగా తనకే తగిలేసరికి రామం ముఖం మాడిపోయింది. ‘పద్దెనిమిదేళ్లు దాటిన వారిని ఈ దేశంలో మేజర్ అంటారు. వారికి నచ్చినట్లు బతికే హక్కు వాళ్లకి ఉంది. అరవయ్యేళ్లు దాటి, జీవితం ఎత్తుపల్లాలన్నీ చవి చూసిన వాళ్లకు ఆంక్షలు అవసరమా?’ మూర్తిగారి పిల్లలవైపు చూస్తూ అడిగాడు. ‘మా నాన్న పెన్షనర్ కదా. అందుకే మీ అమ్మగారికి ఆయన అవసరం ఉందేమో’ కూతురు అక్కసు వెళ్లగక్కింది.‘నేను పదేళ్ల నుంచి అమెరికాలో ఉన్నాను. మా అమ్మ బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. వాటి మీద వచ్చే వడ్డీతో ఆమె పదిమందిని పోషించగలదు.’ ‘సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కాని, కాటికి కాళ్లు జాపుకున్న వాళ్లు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం? అయినా ఇదేమీ అమెరికా కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగినవాళ్లం, ఇక్కడకు తగ్గట్లుగా బతకాలి’ మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు.‘అమెరికా అయినా, ఇండియా అయినా మానసిక, శారీరక అవసరాలు ఒక్కటే. ఆకలేస్తే అక్కడా తింటారు. బాధ వేస్తే ఏడుస్తారు. తోడు కోసం తపిస్తారు. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి మా అమ్మ చాలా కష్టపడింది. నా కడుపు నింపడానికి తను పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. మీ నాన్నగారి గురించి కూడా విన్నాను. చిన్న ఉద్యోగంతో ఆయన జీవితం ప్రారంభమైంది. మీకు మంచి భవిష్యత్తు అందించడంలోనే ఆయన శక్తి హరించుకుపోయింది. పదేళ్ల కిందట మీ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి ఆయన మరింత ఒంటరితనంతో బాధ పడుతున్నారు. రిటైరైనా కనీసం ఆయన ఓ సొంతిల్లు కూడా సంపాదించుకోలేకపోయారు. ఈ ఇద్దరూ తమ బతుకుల్లో నాలుగింట మూడొంతులు మన కోసమే బతికారు. ఇకనైనా వాళ్ల కోసం వాళ్లను బతకనీయండి’‘బతకడంలో తప్పులేదు. కాని, ఇలానా? గట్టిగా అడిగితే స్నేహం అంటున్నారు. రాత్రుళ్లు కూడా మీ ఇంట్లోనే ఉండేంత స్నేహమేంటో’ మూర్తి కోడలు పుల్లవిరుపుగా ఉంది. ‘ఆ స్నేహాన్ని నిర్వచించడం, దాని అర్థ, తాత్పర్యాలు చెప్పడం నా పని కాదు. తమది స్నేహం కాదని, అంతకుమించి అని చెబితే అంగీకరించే గొప్పతనం మీకుందా? ఆ సాన్నిహిత్యం మానసికమా, శారీరకమా అనేది కూడా అనవసరం. వాళ్లకు నచ్చినట్లు వాళ్లుంటారు. వాళ్ల జీవితాల మీద పెత్తనం చలాయించే హక్కు ఎవరికీ లేదు.’ ఇదంతా వింటున్న మూర్తి ముఖంలో ఓ రకమైన ఊరట కనిపిస్తోంది. అపరాధ భావంతో కుంగిపోయిన శాంతకి తన కొడుకు మాటలు సాంత్వననిచ్చాయి. ధైర్యంగా గదిలోంచి వెలుపలికి వచ్చి, కిరణ్ పక్కనే కూర్చుంది. ‘బాబాయ్, అమ్మ కావాలనుకుంటే ఎప్పుడైనా అమెరికా రావచ్చు. అంతవరకూ ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇది ఆవిడ ఆస్తి. నేను కూడా ఈ ఊళ్లోనే సెటిల్ అవుతాను. ఈ ఇంట్లోనే ఉంటాను’తన పప్పులు ఉడకవని రామానికి అర్థమైపోయింది. ముఖం కందగడ్డలా మారిపోయింది.మూర్తిగారి పిల్లలకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ‘మీరంతా చదువుకున్నవాళ్లు. పెద్దవాళ్లు. వ్యక్తి స్వేచ్ఛను మించినదేదీ ఈ ప్రపంచంలో లేదు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, తమకు నచ్చినట్లుగా బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సమాజమే మనుషుల జీవితాలను నిర్దేశిస్తూ ఉంటే స్వాతంత్య్రం అనే మాటకు అర్థం ఉండదు. మీ కోసం, నా కోసం మన పెద్దవాళ్లు తమ సాన్నిహిత్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.’‘రోజూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మేం అతన్ని భరించలేం’ మూర్తి గారి కొడుకు తేల్చి చెప్పాడు.‘అది పెద్ద సమస్య కాదు. మూర్తి గారు.. మీ సామాన్లు పట్టుకుని మా ఇంటికి వచ్చేయండి, మీకెలాంటి అభ్యంతరం లేకపోతేనే..’ అంటూ ఆయన వైపు చూస్తూ అన్నాడు.ఈ మాటకి అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. మూర్తి, శాంత కూడా ఈ మాటలను ఊహించలేదు. కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది, మాట్లాడటానికి ఏమీ లేనట్లుగా అందరూ కుర్చీల్లోంచి లేచారు.‘ఒక్క నిమిషం. మీరు చుట్టపు చూపుగా ఈ ఇంటికి వచ్చి పోతే పర్లేదు. కానీ ఇంటి మీద పడి ఎవరైనా గొడవ చేసినా, మా అమ్మకి ఎలాంటి ఇబ్బంది కలిగించినా చూస్తూ ఊరుకోను. బాబాయ్ నువ్వు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇకపై నాకు ఫోన్ చేయక్కర్లేదు. నా స్నేహితులు చాలామంది ఉన్నారు. అవసరమైతే వాళ్లే నాతో మాట్లాడతారు’కిరణ్ మాటల్లో దృఢత్వాన్ని చూసిన తర్వాత, ఇక మాట్లాడటానికి ఏమీ లేదని అందరికీ అర్థమైంది. అక్కణ్ణుంచి మౌనంగా నిష్క్రమించారు.‘వస్తాను బాబూ’ అంటూ మూర్తి కూడా లేచారు.‘అంకుల్, ఇక్కడ మీకు మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాయిగా ఉండొచ్చు’ భరోసా ఇస్తూ అన్నాడు.మూర్తి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు.నీళ్లు నిండిన కళ్లతో కొడుకును చూస్తూ, శాంత ఆప్యాయంగా కిరణ్ నుదుటన చుంబించింది.ఇద్దరికీ గుండెల మీద నుంచి పెద్ద భారం దిగినట్లయింది. గదిలోకి వెళ్లి విషయం భార్యకు చెప్పడానికి ఫోన్ తీశాడు.నాలుగు రోజుల కిందట తనకు, సుధకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.‘ఇండియా వెళ్తున్నారా?’‘అవును. రెండ్రోజుల్లో బయల్దేరుతాను.’‘అక్కడకు వెళ్లి ఏం తేలుస్తారు?’‘అమ్మ అతని సాహచర్యాన్ని ఇష్టపడుతోంది. ఆమె ఎడారిలాంటి జీవితంలో దొరికిన ఒయాసిస్సు మూర్తిగారు. ఆయన గురించి నాకు తెలుసు. చాలా మంచి వ్యక్తి, ఈ వయసులో ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటారు. నువ్వేమంటావ్?’ సుధ వైపు చూస్తూ అన్నాడు. ‘మీరేమంటే నేనూ అదే అంటాను’ తన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు ఆమె ముఖంలో చిరునవ్వు.తన భార్య గురించి కిరణ్కి తెలుసు. ‘అమ్మా వెళ్లొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ బ్యాగ్ అందుకున్నాడు.‘జాగ్రత్త నాయనా. వేసవి సెలవులకు రండి’ సాగనంపుతూ వెంట వస్తోంది. కారు దగ్గరకు వెళ్లి డోర్ తెరిచాడు. ఎదురుగా వస్తున్న ఆటో తన ఇంటి ముందు ఆగడాన్ని చూసి ఓ క్షణం వెయిట్ చేశాడు.ఆటోలోంచి మూర్తి రెండు బ్యాగులతో దిగాడు. ‘వెళ్లొస్తానండీ’ కిరణ్ చిరునవ్వుతో చేయి ఊపాడు. ‘హ్యాపీ జర్నీ బాబూ’ మూర్తి నవ్వుతూ చెప్పాడు.‘సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కాని, కాటికి కాళ్లు జాపుకున్న వాళ్లు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం? అయినా ఇదేమీ అమెరికా కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగినవాళ్లం, ఇక్కడకు తగ్గట్లుగా బతకాలి’ మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు. -
ఈ వారం కథ: సమయానికి తగు..
‘నేను ఆఫీసుకి వెళుతున్నా. మన పుత్రరత్నం స్టేడియం నుంచి రాగానే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రవీంద్ర వాళ్ళ ఆఫీస్ ఇంటర్వ్యూ గుర్తు చేసి పంపండి’ ఆఫీస్కు వెళుతూ భర్తతో చెప్పింది భార్గవి. అప్పుడు సమయం ఉదయం ఎనిమిదిన్నర అవుతోంది.‘సర్లే, పంపిస్తాను’ చెప్పాడు భర్త శ్యామలరావు.‘ఈరోజు ఒక్కరోజు ప్రాక్టీస్ లేకపోయినా ఏమీ కాదు అంటున్నా, త్వరగానే వస్తా అంటూ వెళ్ళాడు. ఇది రవీంద్ర రిఫరెన్స్ తో వచ్చిన అవకాశం. పోగొట్టుకుంటే నాకు నామర్దా. మరోసారి ఎవరినీ అడగలేం కూడా’ చెప్పుల్లో కాళ్ళు పెడుతూ అన్నది భార్గవి.‘నువ్వేం టెన్షన్ పడకు. నే పంపిస్తాగా వాడిని. నువ్వు ఎక్కువ అలోచిస్తావు అనవసరంగా’ చదువుతున్న పేపర్ మడిచి అన్నాడు శ్యామలరావు.‘నేనా ఎక్కువ ఆలోచించేది?’ అన్నట్లు భర్త వైపు ఒక చూపు చూసి ఇంటి గేట్ వైపు నడిచింది భార్గవి. చాలాసార్లు ఆమె కళ్లే మాట్లాడతాయి.శ్యామలరావు ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో పనిచేసి సంవత్సరం క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. వచ్చే ఏడాది భార్గవి కూడా తను చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటపడి విశ్రాంత జీవితపు సుఖాన్ని పొందబోతోంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు– మొదటి సంతానం ఆడపిల్ల ధన, ఏడేళ్ల తర్వాత పుట్టిన మగపిల్లాడు సంతోష్! ధన తొంభై దశకం మొదట్లో పుట్టడంతో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నీడ పడక ముందే బిట్స్ పిలానీలో చదువు, మంచి ఉద్యగం, తదుపరి పెళ్లి అన్నీ నల్లేరు మీది నడకగా సాగినాయి. ఇప్పుడు కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది.సంతోష్ చదువు డిగ్రీ కాలేజ్ స్థాయికి రాకుండానే ఆండ్రాయిడ్ ఫోన్ చేతికి రావడం, సోషల్ మీడియా వానమబ్బులా కమ్మేయడం జరిగిపోయాయి. అతని ఆలోచనలు, భావాలు పాతతరం మూసకొట్టుడు విద్యార్థిలాగా కాక, ప్రత్యేక మార్గం వైపు వెళ్లసాగాయి. అందుకే అతను ఇంజనీరింగ్ డిగ్రీ వైపు కాకుండా తన చదువును క్రియేటివ్ ఆర్ట్స్ వైపు సాగించాడు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, యానిమేషన్ రంగాలలో చదువును సాగిస్తూ, వ్యక్తిత్వ వికాస రంగంలోనూ, అదనంగా బ్యాడ్మింటన్ ఆటలోనూ ప్రావీణ్యం పొందసాగాడు. స్నేహితులు, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడిపే కొడుకును చూసి భార్గవి, అతని భవిష్యత్తు గురించి చింత పడసాగింది. తనయుడిలోని చురుకుతనం, స్నేహ గుణం, బాధ్యతాయుత ప్రవర్తన చూసిన శ్యామలరావు అతని గురించి దిగులు లేకపోగా గర్వపడతాడు. తనకో సుందర సౌఖ్య ప్రపంచాన్ని సంతోష్ ఏర్పరచుకోగలడని శ్యామలరావు విశ్వాసం.మరో అరగంటకి సంతోష్ ఇంటికి వచ్చాడు. వస్తూనే శ్యామలరావు భార్గవి చెప్పమన్నది అంతా ఆమె చెప్పినట్టే చెప్పాడు. చెప్పి, ‘ఈ ఇంటర్వ్యూ సంగతి ఏమవుతుందో ఏమో కానీ, అమ్మ దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది’ అన్నాడు.‘అటెండ్ అవగానే వచ్చేస్తాయా ఉద్యోగాలు? ఆమె ఇప్పించిన చా¯Œ ్సతో ఉద్యోగం తెచ్చుకోకపోతే నేనొక పనికిమాలిన వాడినని, అసమర్థుడినని ప్రూవ్ అయినట్టా? నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇది ఏర్పాటు చేసింది. నిజానికి ఆ కంపెనీ మంచిదే. వాళ్ళు తీసుకునేది అకడమిక్ రికార్డ్స్ కూడా చూసి. నేను ఆ కోవలో లేను. నాదంతా ఎక్స్ట్రా వ్యాపకాలే! అమ్మ ఇది తెలుసుకోవడం లేదు’ అన్నాడు సంతోష్. మధ్యలో ధన కల్పించుకొని ‘నువ్వు ముందు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకో, నచ్చకపోతే చెయ్యడం మానెయ్. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’ చెప్పింది.‘నువ్వు ఎప్పుడైనా నన్ను సపోర్ట్ చేశావటే! నీకూ నాకూ మధ్య ఒక జనరేషన్ తేడా ఉంది తెలుసుకొని మాట్లాడు’ అక్కని దెప్పాడు సంతోష్.‘అది నిజమే కాని, నువ్వు ఒక రోడ్ మ్యాప్ లేకుండా, నాలుగింటిలో వేళ్ళు పెడుతుంటే ఏమనుకోవాలి?’ సంతోష్ను నిలదీసింది ధన.‘ఇప్పుడు ఇంటర్వ్యూకు వెళ్ళేముందు ఈ వాదనలొద్దు’ ఇద్దరికీ అడ్డువచ్చాడు శ్యామలరావు.‘నాన్నా! అమ్మతో ఇబ్బంది ఏంటో తెలుసా? తాను పెర్ఫెక్ట్ పేరెంట్ అనిపించుకోవాలని. కాని, నాకు అన్నీ టైమ్ టేబుల్ గీసుకొని చేస్తుండే పర్ఫెక్ట్ చైల్డ్ అన్పించుకోవాలని మాత్రం లేదు. ఇది అమ్మకి అర్థం కావడం లేదు. మీ ఆలోచనలతో నేను బతకను. నా ఆలోచనలతోనే నేను బతకాలి. కష్టమైనా నష్టమైనా నేనే దానికి బాధ్యుడిని’ చేతిలోని కప్పు బద్దలు కొట్టినట్టు డైనింగ్ బల్లమీద పెడుతూ చెప్పాడు సంతోష్. చెప్పడమే కాకుండా చివాలున లేచి తన రూంలోకి వెళ్ళి తలుపు వేసేశాడు.మరో గంటకి బయటకు వచ్చి ఇంటర్వ్యూకి వెళుతున్నట్టు శ్యామలరావుకి చెప్పి వెళ్ళాడు.∙∙ అది హై టెక్ సిటీ– గచ్చిబౌలిలకు వెళ్ళే మార్గం. ఉదయం ఆఫీసులు మొదలయ్యే వేళల్లో రోడ్లన్నీ ఒకవైపు కిక్కిరిసి పోతాయి. పెరిగిన వాహన రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా కట్టే ఫ్లై–ఓవర్లలో ఒకటి ఆ మార్గంలో కూడా కడుతున్నారు. కట్టేటప్పుడు దారంతా పరుచుకుపోయిన సామాన్లతో ఆ దారిన పోయే వాహనాలకు అటు వెళ్ళడమే నరకప్రాయం. అది తప్పించుకోవడానికి అడ్డదారులు పడుతుంటారు వాహనదారులు. ఆ అడ్డదారుల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉండరు. ఆ దారులు ప్రతివాడి ఇష్టారాజ్యం. ఇంటర్వ్యూకి ఆలస్యం అవకూడదని సంతోష్ అటువంటి అడ్డదారినే ఎంచుకున్నాడు. అది మట్టి రోడ్డు దారి. ఆ దారి మధ్యలో ఒకచోట పైనుండి రైలు వెళ్ళే వంతెన ఒకటి వస్తుంది. ఆ దారంతా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రోడ్డును కలిసే వరకూ, చాలా సన్నగా, అడ్డంగా మూడు కార్లు పట్టేంత స్థలం కలిగి ఉంటుంది. ముందురోజు రాత్రి వర్షం పడడంతో అక్కడక్కడా నీటి మడుగులు ఏర్పడ్డాయి. రైలు వంతెన కొద్ది దూరంలో ఉందనగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. వంతెనకు అటూ ఇటూ వాహనాలు నిలిచి ఉన్నాయి. అక్కడకు వచ్చిన సంతోష్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఐదు నిమిషాలలో సర్దుకుంటుందిలే అని తన మోటార్ సైకిల్ ఇంజన్ ఆపాడు. చూస్తుండగానే తన వెనక చాలా బండ్లు వచ్చి చేరినయ్. ఐదు నిముషాలు గడిచినా ఎక్కడి బండ్లు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అసహనపు మానవులు కొంతమంది హారన్లు మోగిస్తున్నారు అదేపనిగా! తను ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడయ్యాడు.సంతోష్ మొబైల్ తీసి టైమ్ చూశాడు– ఇంకా ఇరవై నిముషాలే ఉంది తన ఇంటర్వ్యూకి. బండ్లు అస్తవ్యస్తంగా ఇరుక్కుండి పోయాయి. ఆ మార్గం ఎంచుకున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు.∙∙ వాహన రద్దీని అంచనా వేయకుండా అదే మార్గం ఎంచుకు వచ్చిన చంద్రకాంత్ కారు వెనక సీటులో అసహనంగా కదులుతున్నాడు ఇరుక్కుపోయిన వాహనాలను తిట్టుకుంటూ. చంద్రకాంత్ ఒక ఐటీ కంపెనీ యజమాని. అతను గచ్చిబౌలిలో ఉన్న ఒక నక్షత్ర హోటల్కి వెళ్లి అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని విమానాశ్రయం వెళ్ళాలి. ఆ వ్యక్తులు చంద్రకాంత్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందు జరిపే పరిశీలనలు చెయ్యడానికి వచ్చారు ముంబై నుంచి. వారిని విమానాశ్రయానికి సమయానికి చేర్చలేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా పావుగంటలో తను హోటల్ చేరాలి.ఒక వరుస పాటించకుండా కొన్ని కార్లు పక్క నుంచి ముందుకు వెళ్ళి అడ్డంగా ఆగిపోతూ ట్రాఫిక్ నియంత్రణను మరింత జటిలం చేస్తున్నాయి. కొంచెం సందు దొరికిన వైపు ద్విచక్ర వాహనాలు దూరిపోతున్నాయి. చంద్రకాంత్ డ్రైవర్ని ‘వేరే దారి లేదా’ అని అడిగాడు అనాలోచితంగా. అది తనక్కూడా తెలుసు వేరే దారి లేదని. డ్రైవర్ నుంచి కూడా అదే సమాధానం. చంద్రకాంత్ కారు దిగి చూశాడు. ముందు వైపు కంటే వెనకవైపు భారీగా ఆగినయ్ వాహనాలు. అంటే తను ముందుకే వెళ్ళాలి తప్ప, వెనక్కి తిరిగి అస్సలు వెళ్ళలేడు. చంద్రకాంత్ మనసులో అలజడి మొదలైంది– ఇప్పుడు ఎలా బయటపడడం అన్నదాని గురించి.ఇంతలో తన కారు వెనక నుంచి ఒక యువకుడు నోటిలో వేళ్ళు పెట్టి ఈల వేసుకుంటూ వాహనాల మధ్యగా ముందుకు నడవ సాగాడు. మధ్యలో జనాన్ని ఉద్దేశించి పెద్దగా అంటున్నాడు ‘ప్లీజ్ రండి. ట్రాఫిక్ క్లియర్ చేద్దాం! అందరం అట్లా కూర్చుని ఉంటే ఇవాళంతా ఇక్కడే ఉంటాం. మనలో కొందరు వెహికల్స్ వదిలి రండి’– అలా అంటూ చంద్రకాంత్ను దాటుతూ, అతను ‘సార్! ప్లీజ్ రండి సార్!’ అంటూ పిలిచాడు. చంద్రకాంత్ తన డ్రైవర్ని ఆ యువకుడి సహాయానికి పంపి, తను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. చూస్తుండగానే, తమ స్కూటర్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఇద్దరు యువతులు ఆ యువకుడికి సహాయంగా ఉండడానికి వచ్చారు. యువతులను చూసి మరో ముగ్గురు ముందుకొచ్చారు. అతను విజిల్ వేస్తూ వాళ్ళకి సూచనలు ఇవ్వసాగాడు. అతణ్ణి అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు ముందుగా అడ్డదిడ్డంగా ముందుకొచ్చిన ద్విచక్ర వాహనదారులకు చోటు కల్పించసాగారు. ఇంకొకళ్ళు వెళ్లి, వెనకవున్న వాళ్ళు సందు చేసుకొని ముందుకు రాకుండా ఆపసాగారు. ఆ యువకుడు తొందర పడుతున్న వాళ్ళని ఓపిక పట్టమని బతిమిలాడుతున్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రకాంత్ ముచ్చటపడి తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించసాగాడు.ద్విచక్ర వాహనాల తర్వాత దారికి అడ్డుపడుతున్న బండ్లను నియంత్రించసాగారు. అందులో భాగంగా ముందుగా గచ్చిబౌలి వైపు వెళ్లే బండ్లను వదలసాగారు. దానికి ఆ యువకుడు చెప్పిన కారణం– ఆఫీసులకు, ఎయిర్పోర్టుకు, హాస్పిటల్లకు వెళ్ళవల్సిన వాళ్లు అటే వెళ్ళాలి గనక. అందుకోసం రెండోవైపు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళని ముందుకు రాకుండా ఆపగలిగాడు అతను. అతని సమయస్ఫూర్తికి చంద్రకాంత్ సంతోషపడ్డాడు, ఎందుకంటే తను వెళ్లాల్సిన హోటల్ కూడా అటే ఉండడంతో.మరికొద్ది సేపటికి చంద్రకాంత్ కారు మెల్లగా ముందుకు సాగడానికి వీలు కలిగింది. చంద్రకాంత్ వంతెన దాటుతూ ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అతను చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపి ‘మే ఐ హావ్ యువర్ నంబర్ ప్లీజ్’ అన్నాడు. అతను చంద్రకాంత్ను అడిగి మొబైల్ తీసుకొని ముందుకు సాగుతున్న కారుతో నడుస్తూ తన వివరాలు నింపి ఇచ్చాడు. వంతెన దాటుతూనే డ్రైవర్ రావడంతో చంద్రకాంత్ తిరిగి అతనికి స్టీరింగ్ ఇచ్చి తను వెనక సీటులోకి మారాడు. చంద్రకాంత్ మనసుకు మెల్లగా ప్రశాంతత చేకూరింది. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వర్షించసాగింది.వర్షం కూడా తగ్గి వాహనాలు సాఫీగా ముందుకు సాగుతూండడంతో సంతోష్ తన మోటర్ సైకిల్ ఎక్కి టైం చూశాడు. అప్పటికే తను గంట ఆలస్యంగా ఉన్నాడు. అక్కడి నుంచి మరో పదిహేను నిముషాలు ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ చేరడానికి, ఏ సమస్యా లేకపోతే. కానీ అలా జరగలేదు, మార్గమధ్యంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ రెండూ తన సమయాన్ని మరికొంత మింగేయడం వల్ల! ఆఫీసు చేరి కనుక్కుంటే, అప్పటికే గ్రూప్ డిస్కషన్ ప్రక్రియ ముగియడంతో తనకు అవకాశం లేదని చెప్పడంతో వెనుదిరిగాడు.ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడిన చంద్రకాంత్ హోటల్కి వెళ్లి, అక్కడి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను విమానాశ్రయంలో సకాలంలో దింపేవరకు కుదుటపడలేకపోయాడు. తర్వాత తిరిగి వస్తూ మొబైల్లో ట్రాఫిక్ జామ్ సమయంలో తను తీసిన వీడియో చూడసాగాడు. ఆ యువకుడు సమయానికి ముందుకు వచ్చి రద్దీని సడలించక పోయుంటే? ఆ వ్యక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళలేకపోతే తన గురించి, తన కంపెనీ గురించి ఎంత చెడ్డ అభిప్రాయం కలిగేది? అది ఆలోచిస్తూనే చంద్రకాంత్కి పరంపరగా తప్పిపోయిన ముప్పు తాలూకు సంఘటనలు తారాడినయ్! వెంటనే చంద్రకాంత్ తను తీసిన వీడియోను, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్లలో – ‘సాంఘిక బాధ్యత! ఆపద్బాంధవుడు’ శీర్షికతో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే ఆ యువకుడి నంబర్కి ఫోన్ చేశాడు. ఫోన్ ఒక రింగ్ రాగానే కాల్ కట్ అయ్యింది. మళ్ళీ చేశాడు, ఈసారి రింగ్ వెళ్ళలేదు. బహుశా తీరుబడిగా లేడేమో అనుకుని, ‘వీలయితే తిరిగి కాల్ చెయ్యండి’ అని సందేశం పంపాడు.∙∙ సూర్యుడికి వీడ్కోలు చెప్పి చీకటి దుప్పటి కప్పుకుంటున్న సంధ్యలో, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే కూతురు ధనని అడిగింది భార్గవి ‘సంతోష్ వచ్చాడా? ఉన్నాడా?’‘మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి బయటకెళ్ళాడు. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఇంటర్వ్యూ మిస్ అయ్యానని చెప్పాడు’ చెప్పేటప్పుడు తల్లి ముఖంలో మారుతున్న రంగులు ధన దృష్టిని దాటిపోలేదు. ‘2019లో బ్రేక్ కావాలి అని పీజీ చదవడం పక్కన పెట్టాడు. తర్వాత రెండేళ్ళు కరోనా అన్నింటినీ, అందరినీ పక్కన పడేసింది, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు పక్కన పడేస్తున్నారు వీడిని’ అంటూ భార్గవి తన గదిలోకి విసురుగా వెళ్లి తలుపు వేసుకుంది.మరికాసేపట్లో బయటి నుంచి వచ్చిన శ్యామలరావు భార్గవి ఉన్న తమ గది మూసి ఉండడంతో కూతురు ధన గదిలోకి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నాడు. సంతోష్ ఇంటర్వ్యూ అటెండ్ అవలేకపోయిన సంగతి వాళ్ళ మాటల్లోని ప్రధాన అంశంగా మారింది కాసేపటికి. ‘వీడు మెయిన్ రోడ్లో వెళ్లి ఉన్నా బాగుండేది. షార్ట్ కట్ అంటూ అటుపోయి ట్రాఫిక్ జామ్ వల్ల అసలుకే మోసం తెచ్చుకున్నాడు. నేను వాడిని పల్లెత్తు మాట అననని భార్గవికి ముందే కోపం. ఇవాళ జరిగిన దానికి వాడినెలా సమర్థించగలను?’ నిట్టూర్చాడు శ్యామలరావు.‘మీరెందుకు మధ్యలో మాట్లాడడం? వాడే చెప్పుకుంటాడు అమ్మకు’ ధన తండ్రికి ఉపశమనం కలిగించే సలహా ఇచ్చింది.ఇంట్లో ఏర్పడుతున్న అసౌకర్య సందర్భాలు ఎలా, ఎంత త్వరగా ముగుస్తాయా అని శ్యామలరావు ఆలోచించసాగాడు. మొబైల్లో ఏదో సందేశం వచ్చిన శబ్దం రావడంతో తెరిచి చూశాడు శ్యామలరావు. తమ పరివారం గ్రూప్లో సంతోష్ పెట్టిన సందేశం– ‘నాకు ఉద్యోగం వచ్చిందోచ్! వివరాలు ఇంటికొచ్చాక!’ధన, భార్గవి కూడా ఆ సందేశం చూశారు. భార్గవి గదిలో నుంచి బయటకు వస్తూ,‘వీడు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ధన, శ్యామలరావు ఉన్న గదిలోకి వచ్చింది.‘విందాం వాడి నోటి నుండే’ అంది ధన.మరో పావుగంట తర్వాత చేతిలో ఐస్క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్తో ఇంటికి వచ్చిన సంతోష్ దాన్ని భార్గవి చేతికిస్తూ్త, ‘అమ్మా! నీకు ఇష్టమైన ఫ్లేవర్. నీ కోరిక తీరినందుకు’ అన్నాడు.‘ఎక్కడ ఉద్యోగం? ఏ కంపెనీ?’ అడిగింది ధన.‘అమ్మా వాళ్ళ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ కంపెనీలోనే’ సంతోష్ సమాధానం.‘ఇంటర్వ్యూ మిస్ అయ్యావుగా? ఆసక్తిగా ప్రశ్నించాడు శ్యామలరావు. భార్గవి మాత్రం పెదవి విప్పక – నేను వినడానికే ఉన్నాను – అన్నట్లు నిలబడి ఉంది.సంతోష్ చెప్పిన వివరం– నాకు మధ్యాహ్నం ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. నేను తీయలేదు. తర్వాత నేనే చేశాను. అది మీ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ సీఈవో నంబర్. ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదు అని అడిగారు. ట్రాఫిక్ జామ్ గురించీ, తర్వాత వచ్చిన వర్షం గురించి చెప్పాను. ‘దగ్గర్లో ఉన్న కాఫీ షాప్కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ చేస్తాను రాగలరా? ఇది మీకు మరో అవకాశం, మీరు ట్రాఫిక్ జామ్లో ఉండిపోయారు గనక, అందులో మీ తప్పు ఏమీ లేదని నేను నమ్మడం వలన!‘ అన్నాడు ఆయన. ఎగిరి గంతేసి సరే అన్నాను. సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ నిర్ణయించారు. నేను ఐదు నిమిషాల ముందే వెళ్లి ఒక పక్కన వేచి వున్నాను. మరో రెండు నిముషాలకి సూట్ వేసుకున్న ఒకాయన నా దగ్గరకు వచ్చి, చెయ్యి కలిపి నన్ను పేరుపెట్టి పిలుస్తూ రవీంద్ర వాళ్ళ కంపెనీ సీఈవోగా పరిచయం చేసుకున్నాడు. ఎక్కడో చూసినట్లు అంపించినా గుర్తురాక, ‘నా పేరు మీకెలా తెలుసు?’ అన్నాను ఆశ్చర్యంగా.‘మీ అప్లికేషన్లో ఉందిగా’ అంటూ కోటు జేబులోంచి నా అప్లికేషన్ తీసి చూపిస్తూ, ఒక టేబుల్ వైపు నడిచాడు. ఆయన వెనకాలే నేను వెళ్లి కూర్చున్నాను. ఆయన చెప్పాడు, ‘పొద్దున అదే ట్రాఫిక్ జామ్లో నేను కూడా ఇరుక్కుపోయా! చాలా అర్జెంట్ పనిమీద వెళుతున్నాను. ఆ రద్దీలో దేవుడు పంపినట్టు సమయానికి మీరు వచ్చి చొరవ తీసుకొని ట్రాఫిక్ను నియంత్రించి ఉండకపోతే, నా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం నేను చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉండేవాడిని. మీ సాంఘిక బాధ్యతా ప్రవృత్తి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా పేరు చంద్రకాంత్. మీ నంబర్ నా ఫోన్లో మీరే ఫీడ్ చేశారు. అప్పుడు సూట్లో లేను. అందుకేనేమో ఇప్పుడు గుర్తుపట్టలేక పోయారు. సంతోష్, మిమ్మల్ని మా కంపెనీలో సామాజిక బాధ్యతా విభాగానికి అధిపతిగా నియమిస్తున్నా! మీకు ఇష్టమైతే రేపే జాయిన్ అవ్వచ్చు. ఇంకొక మాట, నేను షూట్ చేసి పోస్ట్ చేసిన మీ ట్రాఫిక్ కంట్రోల్ ఇనీషియేటివ్ వీడియో వైరల్ అయ్యింది. వేలలో లైక్స్ వచ్చాయి. మిమ్మల్ని మా ఉద్యోగిగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది’.చెప్పడం ముగించిన సంతోష్ని శ్యామలరావు, భార్గవి, ధన ముగ్గురూ చుట్టేసి ఆ సమయాన్ని ఒక ఫొటోగా ఘనీభవించారు! -
తీరంలో తూటా.. సీటీలో బాంబు
కర్ణాటకలోని తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు అనుసరించే పద్ధతే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ల్లో విధ్వంసం సృష్టించడానికి తయారు చేసిన బాంబులకు చేపల వేటే ఆధారమైంది. ఈ కేసుల్లో ఆరుగురిలో ఐదుగురికి ఇటీవల హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే! కర్ణాటక తీరంలో చేపల వేటకు, హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్లకు మధ్య సంబంధం ఏంటి..?దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారడంతో ఐఎం సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2009లో పాకిస్తాన్ వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఎక్కడ పేలుళ్ల పాల్పడాలన్నా అవసరమైన బాంబుల తయారీకి కావలసిన అమోనియం నైట్రేట్ను అతడే సమీకరించే వాడు. పాకిస్తాన్కు మకాం మార్చాక దీన్ని సమీకరించే బాధ్యతల్ని భత్కల్లోని తన ఇంటి సమీపంలో నివసించే హోమియో డాక్టర్ అఫాఖీకి అప్పగించాడు.అఫాఖీ 2005లో పాకిస్తాన్లోని కరాచీకి చెందిన అర్సాలా అబీర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల అఫాఖీ పాకిస్తాన్కు రాకపోకలు సాగించేవాడు. అక్కడి బంధువులతో తరచు ఫోన్లో మాట్లాడేవాడు. ఈ కారణంగా తాను ఫోనులో మాట్లాడినా, పాకిస్తాన్కు వచ్చినప్పుడు కలిసినా పోలీసులు, నిఘా వర్గాలు అనుమానించరనే ఉద్దేశంతోనే అఫాఖీని రియాజ్ భత్కల్ ఎంచుకున్నాడు. 2009, 2011ల్లో పాకిస్తాన్ వెళ్లిన అఫాఖీ నేరుగా రియాజ్ను కలిసి వచ్చాడు. 2010 నుంచి పేలుడు పదార్థం సరఫరా బృందం నాయకుడిగా మారాడు.రియాజ్ భత్కల్ నుంచి కోడ్వర్డ్స్ రూపంలో ఈ–మెయిల్ ద్వారా అందే ఆదేశాల మేరకు అఫాఖీ పని చేశాడు. బాంబుల తయారీ కోసం పేలుడు పదార్థాల సమీకరణకు అనేక మార్గాలు అన్వేషించాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ (ముద్దలా ఉండే పదార్థం) ప్యాకెట్లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైరు జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెడతారు. ఈ కుండకు తక్కువ బరువు కట్టి వేటాడటానికి వాడుతున్న పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. ఇలా చేపల వేట వారికి తేలికవుతుంది. కేవలం మత్స్యకారులే కాకుండా సముద్రంలో విహారయాత్రలకు వచ్చే యువకులు కూడా సరదా కోసం మీన్ తూటాలను వాడి చేపలు పడుతుంటారు. దీనిపై నిషేధం ఉన్నా, అప్పట్లో కర్ణాటక అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం అఫాఖీకి కలిసొచ్చింది. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడటంతో నిర్మాణరంగంలో బ్లాస్టింగ్స్ కోసం వినియోగించే అమోనియం నైట్రేట్ స్లర్రీ విక్రయానికి అక్కడి వారు పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్ తూటా’లు అమ్మేశారు. ఈ లోటుపాట్లను అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు మత్స్యకారుల మార్గాన్ని ఎంచుకున్నాడు. మైనార్టీల అభివృద్ధి కోసమంటూ కర్ణాటకలో పని చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థలోనూ అఫాఖీ చురుకుగా వ్యవహరించే వాడు. ఇదే సంస్థలో సభ్యుడిగా ఉన్న స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్పై ఇతడి కన్నుపడింది. చలాకీగా ఉండే సద్దాంకు మాయమాటలతో ఎరవేసిన అఫాఖీ ‘మీన్ తూటా’ల కొనుగోలుకు వినియోగించుకున్నాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాలని చెబుతూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అఫాఖీ ఈ మీన్ తూటాలను తనతో ఏడాదికి ఒకటి రెండుసార్లే తెప్పిస్తుండటంతో సద్దాంకు అనుమానం రాలేదు. ఇలా తీసుకువచ్చిన స్లర్రీని కొన్ని రోజులు దాచి ఉంచడానికి కర్ణాటకలోని భత్కల్లో ఉన్న మదీనా కాలనీలో దారుల్ ఖాయర్ పేరుతో ఉన్న ఇంటిని అఫాఖీ వినియోగించాడు. అమోనియం నైట్రేట్ స్లర్రీ దుర్వినియోగం కాకుండా దాని ఉత్పత్తిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్ఠంగా ఆరు నెలల్లోపు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తరవాత పెద్దగా ప్రభావం చూపదు. అఫాఖీ మాడ్యుల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010 ఏప్రిల్ 17), పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లలో (2012 ఆగస్టు 1) నాటి పేలుళ్లకు సరఫరా చేసిన స్లర్రీ ఎక్స్పైరీ డేట్ దాటేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా పేలుడు తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2015 జనవరి 8న అఫాఖీతో పాటు అతడి అనుచరులను అరెస్టు చేసింది. 2024 డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరికి దోషులుగా తేల్చింది. ‘మీన్ తూటా’లు పేలింది ఇక్కడే... 2010 ఫిబ్రవరి 13: పుణేలోని జర్మన్ బేకరీలో పేలుడు. ఇక్కడ 17 మంది మృతిచెందగా 60 మంది క్షతగాత్రులయ్యారు. 2010 ఏప్రిల్ 17: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రెండు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనలో 15 మంది క్షతగాత్రులయ్యారు. 2011 జూలై 13: ముంబైలోని దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్ల వద్ద మూడు పేలుళ్ళు. ఇందులో 21 మంది చనిపోగా 131 మంది క్షతగాత్రులయ్యారు. 2012 ఆగస్టు 1: పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లో నాలుగు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 21: హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద జంట పేలుళ్ళు. వీటిలో 18 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారు. -
యువ కథ: నాన్నతో ఒక రోజు..
‘‘నాన్నా ఎలా ఉన్నావు?’’ సుందర్ తన బ్యాగుతో గుమ్మంలో అడుగుపెట్టాడు.ఇంట్లో తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్న సుబ్బారావు ఆ గొంతు విని తలెత్తి చూశాడు. ‘‘అరె సుందరం.. ఇదేనా రావడం?’’ అంటూ పేపర్ పక్కన పెట్టి లేచి బ్యాగు అందుకున్నాడు సుబ్బారావు. ‘‘శాంతా.. చూడు సుందరం వచ్చాడు’’ అని లోపలే ఉన్న శాంతకి చెప్పాడు సుబ్బారావు.‘‘నాన్నా సుందరం ఏంటి! సుందర్ అని పిలవచ్చు కదా!’’ సుందర్ చిన్నగా చిరాకు పడ్డాడు. ‘‘హహ! అలాగేరా.. సుందరం మా నాన్నగారి పేరు. అందుకే పిలిచినప్పుడల్లా నాన్నని పిలుస్తున్నట్టు అనిపిస్తుందిరా..’’ నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు. ‘‘అలాగేలే.. అలానే పిలువు నాన్నా నాకేం సమస్య లేదు!’’ అన్నాడు సుందర్.‘‘వస్తున్నానని కనీసం ఫోన్ కూడా చేయలేదు!’’ వంటగదిలోంచి వస్తూ అడిగింది శాంత. ‘‘అదేం లేదమ్మా, పాలకొల్లులో మన సురేష్గాడి పెళ్లి నిన్న. వచ్చేదాకా అస్సలు వదల్లేదు. అందుకే హుటాహుటిన రెండు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చేశాను!’’ అని చెబుతూ లోపలికి వెళ్ళి నీరసంగా కూర్చున్నాడు సుందర్.‘‘శాంతా వాడు బాగా అలిసిపోయినట్లు ఉన్నాడు. తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. నేనిప్పుడే అలా బయటికి వెళ్లి వస్తాను..’’ అంటూ గొడుగు తీసుకుని వర్షంలో బయలుదేరాడు సుబ్బారావు.సుందర్ హైదరాబాద్ లోని ‘ఇన్ఫినిటీ’ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పాలకొల్లు వదిలి వెళ్లి ఇప్పటికి ఏడేళ్ళు అయ్యింది. పండగలకో, పబ్బాలకో ఏ సంవత్సరానికో ఒకసారి వచ్చి నాలుగు రోజులు కూడా గడపకుండా హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు.‘‘ఏం బాబూ ఆ పులస ఎంతకిస్తావ్?’’ అంటూ వర్షంలో ఆ ఊరి చెరువు దగ్గర చేపలు పడుతున్న మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతున్నాడు సుబ్బారావు.‘‘ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళండి.. మీ దగ్గర డబ్బులు ఎటు పోతాయి!’’ అంటూ మంచి పులస చేపని సంచిలో వేసి ఇచ్చాడు వీరయ్య. వీరయ్య అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఇచ్చి పట్టుకొని ఇంటికి వచ్చేశాడు సుబ్బారావు.వర్షం ఓ మాదిరిగా చిన్నగా కురుస్తోంది. పట్టుకొచ్చిన చేపని శాంతకి ఇచ్చి, ‘‘ఇది వాడికి చాలా ఇష్టం మంచిగా పులుసు చెయ్ వాడికి మళ్ళీ అక్కడ దొరకదు’’ అని చెప్పి బయట వరండాలోకి వెళ్లి కూర్చున్నాడు.ఇంటికి వచ్చినా సుందర్కి తీరిక లేదు. కంపెనీ నుంచి ఏవేవో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంక లాభం లేదని ఫోన్ పక్కన పడేసి, గదిలోంచి బయటికి వచ్చాడు సుందర్. ‘‘అమ్మా! నాన్నెక్కడ? సాయంత్రం నుంచి కనబడలేదు’’ అని శాంతని అడిగాడు. ‘‘బయట వరండాలో ఉన్నాడేమో చూడు..’’ అంటూ చేపల పులుసు పెడుతూ చెప్పింది శాంత.వరండాలో తీరిగ్గా పడక్కుర్చీలో కాళ్ళు చాపి పాత పుస్తకమేదో చదువుతూ కూర్చున్నాడు సుబ్బారావు. ఆ పడక్కుర్చీ చూడగానే ఎన్నో జ్ఞాపకాలు, మధురానుభూతులు గుర్తొచ్చాయి సుందర్కి. ‘‘నాన్నా’’ అంటూసుబ్బారావు దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. సుబ్బారావు వెంటనే చేతిలో ఉన్న పుస్తకం మూసి కళ్ళజోడు తీస్తూ ‘‘కూర్చోరా’’ అని ప్రేమగా అన్నాడు.ఆ పుస్తకం తీసుకుని ‘‘ఎన్ని రోజులైంది నాన్నా ఈ పుస్తకం చూసి.. చిన్నప్పుడు బాగా చదివేవాణ్ణి. ‘బారిస్టర్ పార్వతీశం’ నిజంగానే ఉన్నాడేమో అనేంతలా కలలు కనేవాడిని!’’ అంటూ ఆప్యాయంగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చెప్పాడు సుందర్.‘‘ఈ కుర్చీకి, నాకు విడదీయలేని సంబంధం ఉంది. చిన్నప్పుడు ఇక్కడే రాత్రి అమ్మ అన్నం తినిపించాక, తాతయ్య ఈ కుర్చీలో కూర్చొని ఆ ఆకాశాన్ని, నిండు జాబిలిని చూపిస్తూ మంచి మంచి కథలు, చెప్పేవాడు. నేను, కౌసల్య, శీనుగాడు గాల్లో తేలిపోతున్నట్టుగా వినేవాళ్ళం. అప్పుడే చాలా బావుండేది నాన్నా.. పెరిగే కొద్దీ జీవితం ఇంకా భారంగా, బాధగా ఉంది.’’ అంటూ బాధగా చెప్పాడు సుందర్.ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందుకి వచ్చాయి సుబ్బారావుకి. ఇరవై ఏళ్ల ముందు జీవితం చాలా బావుండేది. సుబ్బారావు అదే ఊళ్ళో పోస్ట్మన్గా చేసేవాడు. అప్పట్లో ఉత్తరాలు, మనీ ఆర్డర్లు బాగానే వచ్చేవి. పని కూడా చాలా ఎక్కువే ఉండేది. కాలం గడిచేకొద్దీ కొద్దిరోజుల్లోనే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు అన్నీ వచ్చేశాయి. ఈ–మెయిల్ వంటివి వచ్చాక పరిస్థితి మారిపోయింది. గవర్నమెంట్ లెటర్స్ తప్ప అసలు ఇంకే ఉత్తరాలు రావడం లేదు. ఒకప్పుడు సంచి నిండా ఉత్తరాలు ఉండేవి. ఊరంతా తన పాత సైకిల్పై తిరిగి సాయంత్రంలోగా అన్నీ చేర్చేవాడు. ఉత్తరం తీసుకున్నవారి మొహంలో ఆనందం, ఉల్లాసం మనసుకి ఎంతో తృప్తినిచ్చేది. అలా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు అన్నీ ఆగిపోయాయి. ఉద్యోగం ఉంది గాని, చేయడానికి పనేలేదు. రోజంతా ఆఫీసులోనే ఖాళీగా ఉండేవాడు సుబ్బారావు. జాలేసింది, చాలా బాధేసింది. కొద్దిరోజుల్లోనే పోస్ట్మన్ ఉద్యోగానికి ఇంకా మూడేళ్లు టైమ్ ఉన్న వెంటనే రిటైర్మెంట్ తీసుకున్నాడు సుబ్బారావు.‘‘నిజంగా ఆ రోజులే చాలా బావుండేవిరా..’’ అంటూ గోడకు తగిలించిన పాత ఉత్తరాల సంచి వైపు చూసి కంటతడి పెట్టుకున్నాడు సుబ్బారావు. ‘‘అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఇరవైమందితో ఇల్లు కళకళలాడేది. వాళ్ళు చనిపోగానే ఎవరికి వాళ్ళు గొడవలతో, ఆస్తుల విభజనలో, మనస్పర్థలతో చివరికి ఇప్పుడు మీరిద్దరూ అంతే! ఊర్లో మనదే పాత మండువా ఇల్లు నాన్నా.. ఇది ఇలానే ఉండాలి ఎన్ని సంవత్సరాలైనా..’’ అంటూ బాల్య జ్ఞాపకాల్ని తలచుకున్నాడు సుందర్.‘‘అసలు ఇప్పుడు పోస్ట్మన్ గురించి కనీసం పుస్తకాల్లో అయిన చెబుతున్నారా.. కనీసం మేము అనేవాళ్ళం ఉండేవాళ్ళం అని కూడా తెలియనంతగా అభివృద్ధి చెందింది ప్రపంచం!’’ అంటూ కళ్ళజోడు తీసి కళ్లు తుడుచుకున్నాడు సుబ్బారావు. ‘‘నిజమే నాన్నా! అసలు ఆగకుండా పరుగెడుతూనే ఉంది ప్రపంచం. మన కోసమో, మన ఆనందం కోసమో కూడా ఆగకుండా పరుగులు తీస్తోంది.’’ అన్నాడు సుందర్.వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా పక్కనే ఉండి వింటూ తను కూడా ఆ పాత రోజులను తలచుకొని బాధపడింది శాంత. ‘భోజనానికి లేవండి’ అని పిలిచింది. ఆమె పిలుపుతో జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి తండ్రీ కొడుకులిద్దరూ భోజనానికి కూర్చున్నారు.ఆ రాత్రి టీవీకి, ఫోన్లకి దూరంగా ఉండి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ముగ్గురూ భోంచేశారు. ‘అదేంటో ఊరికి వచ్చిన తరువాత మన సొంత ఇంట్లో, సొంత గదిలో పట్టినంత నిద్ర ఆ అద్దెకొంపల్లో, నగరపు వాతావరణంలో అస్సలు పట్టదు. పల్లెటూర్లో పుట్టడం కూడా ఒక అదృష్టమే!’ అనుకుంటూ ఆ రాత్రి ఉన్న బాధలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు సుందర్.తెల్లవారుజామునే అలారం పెట్టే శబ్దాలతో కాకుండా కోడి కూతతో నిద్రలేచి, సిటీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుందర్. అమ్మానాన్నలను మనసారా హత్తుకొని బయటికి నడిచాడు.తెలీకుండానే సంవత్సరం గడిచిపోయింది. సుందరం ఇంటికి వచ్చి కూడా ఏడాది అయింది. ఒక సాయంత్రం వేళ సుబ్బారావు, శాంత ఇద్దరూ నిశ్శబ్దంగా వరండాలో కూర్చున్నారు. సుబ్బారావు ఆ పాత సైకిల్ని చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు.‘‘అదేంటండీ అలా చూస్తున్నారు?’’ శాంత అడిగింది.‘‘ఏం లేదు శాంతా.. ఈ సైకిల్తో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఊరంతా తిరుగుతూ ఉత్తరాలు పంచేవాణ్ణి. ఆ రోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎంత గాఢంగా ఉండేవో కదా! ఇప్పుడు అంతా యాంత్రికమైపోయింది’’ సుబ్బారావు నిట్టూర్చాడు.‘‘అవునండీ.. రోజులు మారిపోయాయి. మనుషులూ మారిపోయారు. మన సుందర్ కూడా ఎంత మారిపోయాడో!’’ శాంత బాధగా అంది.‘‘అవును శాంతా.. డబ్బు సంపాదించాలనే తపనలో మనుషులు తమ మూలాల్ని, బంధాల్నిమరచిపోతున్నారు. కాని, సుందర్కి తన తప్పు తెలిసొచ్చింది. మళ్ళీ మన దగ్గరకు వస్తాడనే నమ్మకం నాకుంది’’ సుబ్బారావు ఆశగా అన్నాడు.‘‘మీ నోట బంగారం అండీ’’ శాంత కళ్ళల్లో ఆనందం మెరిసింది.సాయంత్రం ఆరు అయింది. సుబ్బారావు, శాంత ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.అప్పుడే సుందర్ కారు ఇంటి ముందు ఆగింది. సుబ్బారావు, శాంత ఆశ్చర్యంగా చూస్తుండగానే సుందర్ కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.‘‘నాన్నా.. అమ్మా.. నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇకపై మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను. మీతోనే ఉంటాను’’ సుందర్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.సుబ్బారావు, శాంత ఆనందంతో సుందర్ని హత్తుకున్నారు. ఆ క్షణం వాళ్ళ ముగ్గురి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి వాళ్ళు ముగ్గురూ కలిసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు.మర్నాడు ఉదయం సుందర్ తన సామాన్లు సర్దుకుని తల్లిదండ్రులతో కలిసి పాలకొల్లులోనే ఉండిపోయాడు. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాడు. ఆ పాత మండువా ఇల్లు మళ్ళీ కళకళలాడింది. -
నాట్యవేదం జీవననాదం
సర్వ శాస్త్ర సంపన్నంసర్వ శిల్ప ప్రవర్తకంనాట్యాఖ్యం పంచమం వేదంసేతిహాసం కరోమ్యహమ్పంచమవేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించాడు. ఆరు లలితకళలలో నాట్యం ఒకటైనా, నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే! నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడినా, నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్నీ అలరించే అద్భుతమైన కళ.ఏప్రిల్ 29 అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.సంగీతం మాదిరిగానే నాట్యం కూడా విశ్వజనీనమైన కళ. వివిధ నాగరికతలలో ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న నాట్యకళ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనైంది. నాట్యకళ పుట్టు పూర్వోత్తరాల గురించి ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కాదు గాని, నాట్యం తొలిసారిగా శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నది మాత్రం మన భారతదేశంలోనే! దాదాపు రెండువేల ఏళ్ల కిందటే భరతముని సంస్కృతంలో ‘నాట్యశాస్త్రం’ రచించాడు. నాట్యకళకు సంబంధించి ప్రపంచంలో ఇదే తొలి శాస్త్రీయ గ్రంథం. రెండువేల ఏళ్ల కిందటే నాట్యం శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నదంటే, నాట్యం ఉనికి అంతకు చాలా ముందు నుంచే ఉండవచ్చని ఊహించవచ్చు. మన పురాణాలలో నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయమర్దనం చేసిన తాండవకృష్ణుడి లీలావినోదం మన పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాస కాలంలో బృహన్నలగా మారిన అర్జునుడు నాట్యాచార్యుడిగా విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించిన ఉదంతం మహాభారతంలో ఉంది. మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని అప్సరసలందరూ నర్తకీమణులే! నాట్యకళ ప్రాచీనతకు మన పురాణేతిహాసాలే సాక్ష్యాలు. కాలగతిలో జరిగిన అనేక పరిణామాలకు భారతదేశంలోని శాస్త్రీయనృత్యం రకరకాలుగా రూపాంతరాలు చెందింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలక్షణమైన శాస్త్రీయనృత్యంగా పరిణామం చెందింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ మన దేశంలోని ఎనిమిది రకాల నాట్యశైలులను శాస్త్రీయ నృత్యాలుగా గుర్తించింది. ఈ ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలలో అనేక మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికీ ఎందరో యువతరం కళాకారులు ఈ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చేస్తూ, నాట్యకళలో భారతదేశ ఖ్యాతిని చాటి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యరీతులు, వాటి కథా కమామిషు తెలుసుకుందాం..భరతనాట్యంభరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించిన ప్రాచీన నాట్యశైలి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. కణ్ణగి విషాదగాథపై రచించిన తమిళ పౌరాణిక గ్రంథాలు ‘సిలప్పటిగారం’లోను, ‘మణిమేగలై’లోను భరతనాట్య ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుశకం రెండోశతాబ్ది నాటిది. ఆ తర్వాతి కాలంలో దక్షిణాదిలో వెలసిన వివిధ దేవాలయాల గోడలు, స్తంభాలపై ఉన్న నాట్యభంగిమలు భరతనాట్య నృత్యభంగిమలకు నిదర్శనంగా నిలుస్తాయి. నటరాజ రూపంలోని శివుడి 108 భంగిమలనే భరతనాట్యంలో ‘కారణ’భంగిమలుగా పరిగణిస్తారు. రాచరికాలు కొనసాగిన కాలంలో వివిధ రాజ్యాలలో భరతనాట్యానికి రాజాదరణ ఉండేది. ఆనాటి కాలంలో దేవాలయ సంప్రదాయాలలో భాగంగా దేవదాసీలు భరతనాట్య పరంపరను కొనసాగించారు. బ్రిటిష్ పరిపాలన మొదలయ్యాక మన దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులకు గడ్డుకాలం మొదలైంది. ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వం దేవాలయాల్లో దేవదాసీల నాట్య ప్రదర్శనలను నిషేధించింది. ఆదరణ కరవై, దారుణమైన గడ్డు పరిస్థితులు తలెత్తినా, ఎందరో నాట్య కళాకారులు ఈ పరంపర అంతరించిపోకుండా కాపాడగలిగారు. వారి కృషి ఫలితంగానే, ఈనాడు భారతీయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగలుగుతున్నాయి. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనల నిషేధం తర్వాత ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లోనే నాట్య కళాకారులు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పట్లో రుక్మిణీదేవి అరండేల్, తంజావూరు బాలసరస్వతి వంటి కళాకారిణులు భరతనాట్యంలో అగ్రగాములుగా రాణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన శాస్త్రీయ నృత్యరీతులకు పునరుజ్జీవం మొదలైంది. ఆరితేరిన గురువుల ఆధ్వర్యంలో నాట్య శిక్షణ కేంద్రాలు ప్రారంభయ్యాయి. క్రమంగా దేశ విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా భారతీయ శాస్త్రీయ నృత్యానికి చోటు దక్కింది. చైనాకు చెందిన ఝాంగ్ జున్ 1950లలోనే భరతనాట్యాన్ని చైనాకు పరిచయం చేశారు. చైనాలో ఆమె చేసిన ప్రదర్శన అక్కడివారిని అబ్బురపరచింది. యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలమేల్ వల్లి వంటి కళాకారులు భరతనాట్యం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. నర్తకీమణులైన వైజయంతిమాల, హేమమాలిని వంటి సినీతారల వల్ల భరతనాట్యానికి జనాదరణ మరింతగా పెరిగింది. పలువురు విదేశీ విద్యార్థులు కూడా భరతనాట్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ప్రదర్శనల్లోనూ రాణిస్తున్నారు.కూచిపూడిమన తెలుగునేల మీద పుట్టిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఈ నృత్యశైలి రూపుదిద్దుకోవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికే కూచిపూడి నృత్యం ఉన్నట్లు రాగిరేకుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వైత సన్యాసి నరహరి తీర్థుల శిష్యులలో ఒకరైన సిద్ధేంద్ర యోగి పదిహేడో శతాబ్దిలో ఆధునిక కూచిపూడి నృత్యశైలికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేశారు. వైష్ణవ సంప్రదాయ ప్రభావం వల్ల కూచిపూడి నృత్యంలో కృష్ణుడి లీలావిలాసాలే ప్రధానాంశాలు. కృష్ణలీలల నృత్యాభినయం తంజావూరు ప్రాంతంలో ‘భాగవత మేళా’గా పేరుపొందింది. కూచిపూడి నృత్య కళాకారులు తెలుగునేల మీద భాగవతులుగా, తమిళనాడులో భాగవతార్లుగా పేరుపొందారు. నారాయణ తీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణిని కూచిపూడి భాగవతులు విరివిగా ప్రదర్శించేవారు. అప్పట్లో కళింగరాజ్యం మొదలుకొని తంజావూరు రాజ్యం వరకు వీరికి గొప్ప ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలో మిగిలిన నృత్యరీతుల మాదిరిగానే కూచిపూడి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయినా, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి, వెంపటి చిన వెంకటరామయ్య శాస్త్రి వంటి వారు కూచిపూడి సంప్రదాయం కొడిగట్టిపోకుండా కాపాడారు. స్వాతంత్య్రానంతరం ఇంద్రాణి రహమాన్, యామినీ కృష్ణమూర్తి, శోభా నాయుడు వంటివారు విదేశాల్లో ప్రదర్శనలు చేసి, కూచిపూడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. వారి ప్రభావంతో పలువురు విదేశీ విద్యార్థులు కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులై నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.ఒడిస్సీఒడిశాలో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి ఒడిస్సీ. కళింగ రాజ్యంలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి తొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఒడిస్సీ నృత్యశైలి ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యంగా రూపుదిద్దుకుంది. ఒడిస్సీ నృత్య ప్రస్తావన ఆనాటి జైన, బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. పూరీ, కోణార్క తదితర దేవాలయాల రాతి గోడలు, స్తంభాలపై కనిపించే నాట్య భంగిమలు ఒడిస్సీ నృత్యశైలి ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. పదిహేడో శతాబ్ది వరకు ఒడిస్సీ నృత్యానికి రాజాదరణ బాగా ఉండేది. పద్నాలుగో శతాబ్దిలో ఖుర్దా రాజు ఒడిస్సీ నృత్యంలో ‘గొటిపువొ’ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించారు. గురుకులంలో పరంపరాగతంగా నృత్యశిక్షణ పొందే బాలురను ‘గొటిపువొ’ అంటారు. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎందరో కవులు, పండితులు, నర్తకులు ఒడిస్సీ నృత్య సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘కవిచంద్ర’ కాళీచరణ్ పట్నాయక్ వంటి కవి పండితులు, కేలూచరణ్ మహాపాత్రో, పంకజ్చరణ్ దాస్, సంజుక్తా పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్ తదితరులు ఒడిస్సీ నృత్యానికి పునరుజ్జీవం కల్పించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కేందుకు దోహదపడ్డారు. కథాకళికేరళకు చెందిన శాస్త్రీయ నృత్యశైలి కథాకళి. ‘అట్టకథ’ సాహిత్య రూపంలోని నృత్యరూపకాలను కథాకళి కళాకారులు ప్రదర్శిస్తారు. ఇతర శాస్త్రీయ నృత్యరీతులతో పోల్చుకుంటే కథాకళి నర్తకుల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. ‘కుటియాట్టం’, ‘కృష్ణన్ అట్టం’ అనే ప్రాచీన సంస్కృత నాటక ప్రదర్శన ప్రక్రియల నుంచి పదహారో శతాబ్ది నాటికి కథాకళి ప్రత్యేక నృత్యశైలిగా రూపు దిద్దుకుంది. రసాభినయానికి అన్ని శాస్త్రీయ నృత్యరీతుల్లోనూ ప్రాధాన్యం ఉన్నా, ముద్రలు, భంగిమలు వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. కథాకళిలో మాత్రం నవరసాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రాంతంలోని ట్రావెన్కోర్, పాలక్కాడ్ సంస్థానాలు కథాకళి నృత్యాన్ని బాగా ఆదరించాయి. కథాకళి నృత్యంలో గురుకుల పరంపరలో శిష్యులను తయారు చేసే పద్ధతి పంతొమ్మిదో శతాబ్ది వరకు సాగింది. స్వాతంత్య్రానంతరం కథాకళి కళాకారులు ఒకవైపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కాలమండలం గోపి, కోట్టక్కల్ శివరామన్ వంటి కళాకారులు కథాకళి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు.మణిపురిఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి మణిపురి. దీనినే ‘మణిపురి రాసలీల’ అని, ‘జాగోయి రాస్’ అని కూడా అంటారు. మణిపురి నృత్యానికి మూలాలు ప్రాచీన మైతేయి నాగరికతలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మైతేయి రాజు చింగ్ థాంగ్ ఖోంబా ప్రస్తుతం ఉన్న మణిపురి నృత్యశైలికి నియమ నిబంధనలను రూపొందించారు. మణిపూర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆయన ‘రాజర్షి భాగ్యచంద్ర’గా పేరుపొందారు. మణిపురి నృత్యంలో ఎక్కువగా కృష్ణ లీలలను, భాగవత గాథలను ప్రదర్శిస్తారు. జానపద మూలాల నుంచి రూపొందిన అరుదైన శాస్త్రీయ నృత్యశైలిగా మణిపురి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం 1891లో మణిపూర్ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాక మణిపురి నృత్యానికి వైభవం సన్నగిల్లింది. అప్పట్లో ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ మణిపురి నృత్యానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఎనలేని కృషి చేశారు. రాజ్కుమార్ సింఘజిత్ సింగ్, దర్శనా ఝావేరీ, కళావతీ దేవి, బింబావతి దేవి, నిర్మలా మెహతా వంటి నర్తకులు మణిపురి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు.సాత్త్రియాఈశాన్య భారతదేశానికి చెందిన మరో శాస్త్రీయ నృత్యశైలి సాత్త్రియా. అసోంలోని సంప్రదాయ ‘అంకియా నాట’ అనే ఏకాంకిల ప్రదర్శనలో భాగంగా ‘భావన’ పేరుతో నృత్యాలను ప్రదర్శించేవారు. ‘అంకియా నాట’ ప్రక్రియను పదిహేనో శతాబ్దికి చెందిన కవి పండితుడు, సంగీతకారుడు, నర్తకుడు అయిన శంకరదేవ్ రూపొందించారు. కాలక్రమేణా ‘సత్త్ర’ అనే వైష్ణవ మఠాలలో ‘అంకియా నాట’ ఏకాంకిలను పూర్తిగాను, ఒక్కోసారి ‘భావన’ నృత్యాన్ని విడిగాను ప్రదర్శించేవారు. కొంతకాలానికి ఈ ప్రక్రియ నుంచి నృత్యం విడివడి ప్రత్యేక శైలిగా రూపొందింది. ‘సత్త్ర’లలో ప్రదర్శించడం వల్ల ఈ నృత్యశైలికి ‘సాత్త్రియా’ అనే పేరు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000 సంవత్సరంలో ‘సాత్త్రియా’ను శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. అప్పటి నుంచి సాత్త్రియా నృత్యానికి ప్రాచుర్యం మొదలైంది. శరోది సైకియా, ఇందిరా బోరా, అనితా శర్మ, అన్వేషా మహంతా తదితరులు సాత్త్రియా నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకొచ్చారు.మోహినీయాట్టంకేరళలో పుట్టిన మరో శాస్త్రీయ నృత్యశైలి మోహినీయాట్టం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పంచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు దాల్చిన మోహినీ అవతారం నుంచి మోహినీయాట్టం నృత్యానికి ఆ పేరువచ్చింది. కేరళలోనే రూపొందించిన కథాకళి అభినయ ప్రధానమైన నృత్యశైలి అయితే, మోహినీయాట్టం లాస్య ప్రధానమైనది. ఇదివరకు ఎక్కువగా మహిళలే మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించేవారు. ఇటీవలి కాలంలో పురుషులు కూడా దీనిని నేర్చుకుని, ప్రదర్శిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని పురాణగాథలకు సంబంధించిన గీతాలకు అనుగుణంగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నుంచి పద్దెనిమిదో శతాబ్ది వరకు అనేక పరిణామాలకు లోనై ఈ నృత్యం ప్రత్యేక శైలిగా ఆవిర్భవించింది. పద్దెనిమిదో శతాబ్ది నాటి నృత్యశాస్త్ర గ్రంథం ‘బలరామ భారతం’ ఈ నృత్యాన్ని ‘మోహినీ నటనం’గా అభివర్ణించింది. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానాధీశులు కథాకళితో పాటు మోహినీయాట్టం నృత్యాన్ని కూడా సమాదరించారు. స్వాతంత్య్రానంతరం మోహినీయాట్టం అంతర్జాతీయ వేదికలపైకి కూడా చేరుకుంది. సునందా నాయర్, కళామండలం కల్యాణకుట్టి అమ్మ, గోపికా వర్మ, జయప్రభా మేనన్, పల్లవి కృష్ణన్ వంటి నర్తకులు మోహినీయాట్టం నృత్యానికి దేశ దేశాల్లో ప్రాచుర్యం కల్పించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ, జానపద నృత్యరీతులు ఉన్నాయి. కాలానుగుణంగా మరెన్నో అధునాతన నృత్యశైలులు పుట్టుకొస్తున్నాయి. సంగీతంలాగానే నృత్యం కూడా సహజ భావోద్వేగాలతో ముడిపడిన కళ. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు ఆస్వాదించే కళ. నాట్యవేదం ఆబాల గోపాలానికీ జీవననాదం.కథక్ఉత్తరాదిలో ప్రజాదరణ పొందిన శాస్త్రీయనృత్య శైలి కథక్. కథక్ సహా వేర్వేరు శాస్త్రీయ నృత్యరీతులన్నిటికీ భరతుడి నాట్యశాస్త్రమే ప్రామాణిక గ్రంథం. ఉత్తరాదిలో భక్తి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో– సుమారు క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్ది కాలంలో వారణాసిలో కథక్ ప్రత్యేక నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. భక్తి ఉద్యమ ప్రభావం కారణంగా కథక్ నృత్యంలో రాధాకృష్ణుల లీలా వినోదాలు, భాగవత గాథలు ప్రధాన ప్రదర్శనాంశాలుగా కనిపిస్తాయి. తొలినాళ్లలో ఆలయాలకు పరిమితమైన కథక్ నృత్యానికి మొఘల్ కాలంలో రాజాదరణ లభించింది. కథక్ నర్తకులకు రాజ దర్బారులో నాట్య ప్రదర్శనలు చేసే అవకాశం లభించింది. భారతీయ సంప్రదాయ పద్ధతికి తోడుగా పర్షియన్ శైలిని కలుపుకొని కథక్ ఒక విలక్షణ శాస్త్రీయ నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, స్వాతంత్య్రానంతరం పునరుజ్జీవం పొందింది. బ్రిటిష్ కాలంలో నిరాదరణకు గురైన సంప్రదాయ కళలను ప్రోత్సహించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం 1956తో ఖైరాగఢ్లో ఇందిరా కళా సంగీత విశ్వ విద్యాలయం ప్రారంభిం చింది. ఇందులో కథక్ నృత్యానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కథక్ డిగ్రీ కోర్సుకు సిలబస్ను ప్రఖ్యాత నర్తకుడు పురు దధీచ్ రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎందరో కళాకారులు కథక్ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. బిర్జూ మహారాజ్, సితారా దేవి, గోపీకృష్ణ వంటి ఎందరో నర్తకుల కృషి ఫలితంగా కథక్ నృత్యం దేశ విదేశాలకు పాకింది. -
గాడిద పాల వైద్యం
అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం నుంచి ఒక గాడిద అడవిలోకి వచ్చింది. బూడిద రంగులో బలిష్ఠంగా ఉన్న గాడిదను చూసిన నక్కకు నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా గాడిద మాంసం తినాలనుకుంది. వెనుక నుంచి నెమ్మదిగా గాడిద దగ్గరికి వెళ్లి దానిపై దాడి చేయబోయింది. కాని, అది గమనించిన గాడిద తన వెనుక కాళ్లు లేపి నక్క దవడ మీద బలంగా ఎగిరి తన్నింది. నక్క కింద పడింది. గాడిద తన గట్టి పళ్లతో నక్క చెవులు కొరికింది. దాంతో నక్క ‘కుయ్యో.. మొర్రో’ అంటూ మృగరాజు దగ్గరికి పరుగు తీసింది. మృగరాజుకు గాడిదపై ఫిర్యాదు చేసింది. ‘ప్రభూ! పక్క గ్రామం నుంచి అడవిలోకి చొరబడిన గాడిద నాపై దాడి చేసింది. ఇప్పుడు మీతో పోరాడి అడవికి రాజు కావాలనుకుంటోంది’ ఆయాసంతో రొప్పుతూ చెప్పింది నక్క.మృగరాజు అప్పటి వరకు గ్రామాల్లో ఉండే గాడిద గురించి వినటమే గాని, చూడనేలేదు. మృగరాజు వెంటనే తన ఆంతరంగికుడైన ఏనుగును పంపి గాడిదను తన గుహకు తీసుకు రమ్మని చెప్పాడు. ఏనుగు పరుగునవెళ్లి గాడిదను తీసుకువచ్చింది, గాడిద భయం భయంగా గుహ బయట నిలుచుంది. గుహ లోపల మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతున్న శబ్దం విన్నది గాడిద. మృగరాజు సింహం గుహలోంచి బయటికి వచ్చాడు.గాడిద తన ముందు రెండు కాళ్ళను గాలిలోకి లేపి నమస్కరించింది. ‘ఎవరు నువ్వు!’ ప్రశ్నించాడు మృగరాజు. ‘ప్రభూ! నేను ఈ అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను. మా యజమాని నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. నేను బరువులు మోస్తూ, అతనికి సహాయం చేసే దాన్ని. పొలంలో మొలిచే కలుపు మొక్కలను తిని పంటను కాపాడేదాన్ని. నా జ్ఞాపకశక్తి, తెలివితేటలకు నా యజమాని పొంగిపోయేవాడు.అతను ఒక అనాథ. నన్ను తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. గత వారం అతను పట్నం వెళ్లి, ప్రమాదవశాత్తూ మరణించాడు. యజమాని మరణించాక నేను గ్రామంలో ఉన్నంతసేపు నాకు నా యజమానే గుర్తుకు వచ్చేవాడు. అందుకే నేను అక్కడ ఉండలేక అడవి బాట పట్టాను!’ చెప్పింది గాడిద. మృగరాజుకు గాడిద మనసు అర్థమైంది. అంతే కాదు శాకాహారి అయిన గాడిద తన ఆత్మరక్షణ కోసమే నక్కను గాయపరచిందని తెలుసుకుంది. నక్క గుణం తెలిసిన మృగరాజు దాన్ని మందలించాడు.ఇంతలో గుహ నుంచి మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతూ బయటకువచ్చింది.‘మిత్రమా! ఎన్ని పసరు మందులు వాడినా దగ్గు, ఆయాసం, జలుబు గత నెల రోజులుగా నా బిడ్డను వదలటమే లేదు’ విచారంగా అన్నాడు మృగరాజు.గాడిద చిట్టికూనను పరిశీలనగా చూసి, మృగరాజుతో, ‘ప్రభూ! ఎలాంటి దగ్గు, జలుబు, ఆయాసాన్నయినా పూర్తిగా నయం చేసే ఔషధ గుణం మా పాలలో ఉంది. మా పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.మీరు అనుమతి ఇస్తే నేను మీ బిడ్డకు వైద్యం చేస్తాను’ అంది గాడిద. మృగరాజు సంతోషంగా అంగీకరించాడు. చిట్టికూనకు గాడిద తన పాలు తాగించింది.పాలు తాగిన చిట్టి కూన నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంది. మృగరాజు గాడిదను తనతోనే ఇక్కడే ఉండిపొమ్మన్నాడు. తన యజమాని చూపిన ప్రేమను, గౌరవాన్ని మృగరాజు దగ్గర తిరిగి పొందింది గాడిద. మనం కీడు తలపెట్టినా, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుసుకుంది నక్క. -
హాలీడేస్... జాలీడేస్...
వేసవి అంటే స్కూల్ ఉండదు, టైం టేబుల్ ఉండదు, హోంవర్క్ ఉండదు. రోజంతా ఖాళీ. పిల్లలు ఉదయం లేచిన దగ్గర్నుంచీ టీవీ లేదా మొబైల్ పట్టుకుని కూర్చుంటారు. పేరెంట్స్ కూడా సెలవులే కదా అని చూసీ చూడనట్లు ఊరుకుంటారు. కాని, ఈ నెల, రెండునెలల కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వారి బోర్డమ్ను బ్రేక్ చేసి సృజనాత్మకత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మేధస్సు పెరిగే ప్రయాణంగా మార్చే అవకాశం ఉంది. అదెలాగో ఈ రోజు తెలుసుకుందాం.బోర్ టైం... క్రియేటివ్ టైం... పిల్లలు బోర్గా ఫీలయిన సమయంలో మెదడులోని ‘డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్’ అనే భాగం యాక్టివ్ అవుతుంది. ఇది క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫ్యూచర్ ప్లానింగ్కు కేంద్రం. అలా జరగాలంటే రోజుకు కనీసం రెండుగంటల సమయం ఖాళీగా ఉంచండి. ఆ సమయంలో నో స్క్రీన్. అప్పుడే పిల్లల్లో ఊహాశక్తి పుట్టుకొస్తుంది. ఈ సమయం స్క్రిప్ట్ లేని సినిమా లాంటిది. ప్రతి బిడ్డ దర్శకుడే, కథానాయకుడే. పేపర్తో బొమ్మలు చేయడం, రాళ్లతో ఆటలాడటం, పాత వస్తువులతో టెంట్ తయారుచేయడం లాంటివి చేయమని చెప్పండి. ఇలాంటి ఆటలే పిల్లల్లో ప్లానింగ్, సెల్ఫ్ కంట్రోల్, భావోద్వేగాల అదుపును పెంచుతాయి. ఇంట్లోనే ‘ప్రేరణ ప్రదేశం‘ మనలో చాలామంది పిల్లలను తక్కువ అంచనా వేస్తాం. కానీ వాళ్ళను ఒక చక్కటి పరిసరంలో ఉంచితే, వారు చూపించే అద్భుతాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అందుకోసం ఇంట్లో ఒక ‘యెస్ షెల్ఫ్’ తయారు చేయండి – అందులో క్రేయాన్లు, కాగితాలు, పాత గడియారాలు, భూతద్దం, కథల పుస్తకాలు. ఇలా ఉంచితే పిల్లలు అడగకుండా అన్వేషించడం మొదలుపెడతారు. ఓ పిల్లాడు పాత రేడియోను తెరిచి ‘‘ఇది ఎలా శబ్దం చేస్తుంది?’’ అని అడిగాడనుకోండి. అదే సైన్స్కు మొదటి అడుగు. విగోట్స్కీ చెప్పినట్టు ‘జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్’లో పిల్లలకు స్వేచ్ఛనిస్తే స్వయంగా నేర్చుకుంటారు. ఇలాంటి ఆటల వల్ల ఏకాగ్రత పెరుగుతుందని హార్వర్డ్ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఆటలు... జ్ఞానం పెంచే సాధనాలుపిల్లలకు ఏకాగ్రత లేదని అనుకోవడం తప్పుడు అభిప్రాయం. వాళ్ళకు నచ్చే విషయంలో ఆశ్చర్యకరమైన ఫోకస్ చూపిస్తారు. జిగ్సా పజిల్స్, మెమరీ గేమ్స్, లూడో, చెస్లాంటి గేమ్స్ అందుబాటులో ఉంచండి. ఇది మెదడులోని సీఈఓలాంటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ను యాక్టివేట్ చేస్తుంది. ఇది డెసిషన్ మేకింగ్, సెల్ఫ్ కంట్రోల్, ప్రొడక్టివ్ టాస్క్స్కు అవసరమైనది. వారానికి ఒకరోజు గేమ్ నైట్ డిజైన్ చేయమని పిల్లలకు అప్పగించండి. అది లాజిక్, ఎమోషన్, లీడర్షిప్ లక్షణాలను పెంచుతుంది. భావోద్వేగాలను బయటపెట్టే ప్రయోగాలుపిల్లలు ప్రతి రోజూ ఎన్నో ఎమోషన్స్ అనుభవిస్తారు. కానీ వాటిని ఎలా చెప్పాలో తెలియదు. పిల్లలు ‘నాకు బాధగా ఉంది’ అనే మాటే చెప్పలేరు. అందుకే భావప్రకటనను ఆటల ద్వారా నేర్పాలి. ఉదాహరణకు ఒక్కో భావాన్ని ఒక ప్రాణిగా గీయమని చెప్పండి. అంటే నిప్పు కళ్లతో రాక్షసుడు లాంటిది. అలాగే మూడ్ జర్నల్ రాయమనండి. అంటే, ‘నాకు ఈరోజు –––– అనిపించింది. ఎందుకంటే ––––.’ అలాగే ఒక్కో ఎమోషన్ మీద చీటీలు వేసి కథలు చెప్పడం. ఈ ప్రయత్నాలు ప్లే థెరపీలా పనిచేస్తాయి. భావాలను అర్థం చేసుకోవడం, వాటిని వ్యక్తం చేయడం వల్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది.బంధాన్ని పెంచే యాక్టివిటీస్... వారంలో ఒక సాయంత్రం వాకింగ్, ఒక ఆదివారం కుకింగ్, రోజూ బెడ్టైమ్ స్టోరీ... ఇలాంటివి పిల్లల మనసుకు మిమ్మల్ని దగ్గర చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న పనులే పిల్లల ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్లా మారతాయని డాక్టర్ జాన్ గోట్మాన్ అంటారు. ప్రేమ, అంగీకారం, జాగ్రత్త... ఇవన్నీ మీరిచ్చే కానుకల కంటే విలువైనవి. వారానికో స్కిల్ ఛాలెంజ్...వేసవి అంటే ఫ్రీడమ్నే కదా. అయితే ఆ ఫ్రీడమ్కు ఓ స్ట్రక్చర్ ఉండాలి. అందుకే ప్రతివారం ఒక స్కిల్ చాలెంజ్ ఇవ్వండి. గార్డెనింగ్, కుకింగ్, ఒరిగామి, క్రాఫ్ట్స్ కుటుంబ సభ్యుల కోసం గ్రీటింగ్ కార్డ్స్ తయారుచేయడం, రూమ్ చక్కదిద్దుకోవడం లాంటివి వారానికో చాలెంజ్ ఇవ్వండి. ఇలాంటివి చేయడం నేనీ పనులను స్వయంగా చేయగలననే నమ్మకాన్ని పెంచుతుంది. -
లెడ్ పాయిజనింగ్ అవుతోందా?
నాకిప్పుడు మూడోనెల. నేను పెయింట్, డైయింగ్ షాప్లో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. లెడ్ పాయిజనింగ్ అవుతుందని విన్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దేశీత, శ్రీకాకుళం.పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారు ఎక్కువ శాతం లెడ్ డస్ట్కి గురవుతారు. లెడ్ పెయింట్స్ని స్ట్రిప్ చేసినప్పుడు, అది పీల్చుకుంటే లెడ్ డస్ట్ ఎక్కువ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ పరిశ్రమల్లో ఉండే ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అవుతుంది. ఎక్కువ కాలం లెడ్ డస్ట్కు గురైతే, లెడ్ పార్టికల్స్ శరీరంలోకి చేరుతాయి. అందుకే, ఈ పరిశ్రమల్లో పని చేసేవారు శరీరం, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. సాధారణ వాతావరణం ద్వారా అందరికీ కొంత లెడ్ ఎక్స్పోజర్ అవుతుంది. కానీ, ఎక్కువ శాతం ఈ పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో వారికే అవుతుంది. ఈ లెడ్ శరీరంలోకి వ్యాపించి ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది.అంతేకాదు, ప్రెగ్నెన్సీలో ఈ లెడ్ పార్టికల్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి చేరి తల్లికి, బిడ్డకు ప్రమాదం చేస్తాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో రక్తపరీక్షల్లో ఈ లెడ్ లెవల్ను పరిశీలిస్తాం. క్యాల్షియం, ఐరన్, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ సీలను ఆహారంలో తక్కువ తీసుకునే వారికి ఈ లెడ్ అబ్జార్ప›్షన్ పెరుగుతుంది. అందుకే, సమతుల్యమైన ఆహారం, పోషకాహారం ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఈ లెడ్ లెవెల్స్ 5 ఎమ్సీజీ / డీఎల్ కన్నా ఎక్కువ ఉంటే అది డేంజర్ లెవెల్ అని అర్థం. లెడ్ మెటల్ ప్లాసెంటాను దాటి పిండంలోకి చేరగలదు. ఈ లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గర్భస్రావం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు, హై బీపీ వంటి సమస్యలు పెరుగుతాయి. బిడ్డ మెదడుపై కూడా ప్రభావం పడుతుందని పరిశోధనల్లో తేలింది.బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. అందుకే, డాక్టర్ను వెంటనే సంప్రదించాలి. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, రక్తంలో మీ లెడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చెస్తారు. నీటిలో కూడా లెడ్ ఎక్స్ప్లోజర్ కావచ్చు. కాబట్టి వడగట్టి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పరీక్షల్లో లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మొదట క్యాల్షియం మాత్రలు ఇస్తారు. ఒక గ్రాము డోస్ రోజూ డెలివరీ వరకు తీసుకోవాలి. చెలేషన్ థెరపీ ఇవ్వాలి. రెండు నుంచి నాలుగు వారాల తరువాత లెడ్ లెవెల్స్ను మళ్లీ చెక్ చేస్తాం. రెండో త్రైమాసికంలో సురక్షితంగా ఈ మందును అడ్జస్ట్ చేసి ఇస్తాం. భవిష్యత్తులో లెడ్ ఎక్స్పోజర్ ఎక్కువ కాకుండా డెలివరీ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.ఎలాంటి వారికి సమస్య ఎక్కువ?నా వయసు ముప్పై సంవత్సరాలు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నాము. ఎలాంటి వాళ్లకి ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి?– ప్రణతి, గుంటూరు.ప్రెగ్నెన్సీలో కొందరికి ఎక్కువ సమస్యలు కావచ్చు. మరికొందరికి తక్కువ ఉండవచ్చు. సాధారణంగా అలసట, థైరాయిడ్ సమస్యలను ఎక్కువమందిలో చూస్తాం. కానీ, కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న వారిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. బరువు ఎక్కువ ఉండటం, స్థూలకాయం, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో తల్లికి బీపీ, మధుమేహం, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బేబీకీ వెన్నెముక, మెదడు సమస్యలు పెరుగుతాయి. వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న తల్లుల్లో క్రోమోజోమ్ అసాధారణతలు ఎక్కువ ఉంటాయి. అలానే టీనేజ్ ప్రెగ్నెన్సీలో కూడా సమస్యలు ఎక్కువ. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన కండిషన్స్లో కూడా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ట్విన్స్, మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్లో ఉండవచ్చు. వారిలో షుగర్, హై బీపీ ప్రమాదం పెరుగుతుంది. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఎదుగుదల సమస్యలు, ప్లాసెంటా సమస్యలు ఉన్నా ఇప్పుడు అవి ప్రభావం చూపుతాయి. అందుకే, మూడవనెల నుంచి మంచి ఆహారం తీసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే, ప్రమాదాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా పరీక్షలు చేసి, మందులను సూచిస్తారు.ప్రెగ్నెన్సీలో బేబీకి ప్రమాదమా?నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నాను. ఇంట్లో ఉమ్మడి కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే పనిచేసే ఆఫీసులోనూ కూడా చాలా టార్గెట్స్ ఉంటాయి. ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. అది తగ్గించుకోవాలన్నా అవటం లేదు. ఈ ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో బేబీకి ఏదైనా ప్రభావం ఉంటుందా? – రూప, బెంగళూరు.ఒత్తిడి అనేది మానవ జీవితంలో సహజం. కానీ, ప్రెగ్నెన్సీ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా అనుభవించవలసిన సమయం. ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సంతోషంగా ముందుకు వెళ్లగలరు. సానుకూల వైఖరి చాలా అవసరం. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ఒత్తిడి పెంచే ఆలోచనలు అస్సలు చెయ్యకూడదు. ప్రెగ్నెన్సీలో శరీరం, మెదడులో చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల వలన కొంత అసహనం, చిరాకు ఉంటాయి. అతిగా ఒత్తిడికి గురైతే నిద్రలేమి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, హై బీపీ, నెలలు నిండకుండానే ప్రసవం, పుట్టిన బిడ్డ బరువు తక్కువ ఉండటంలాంటి సమస్యలు రావచ్చు. ఒత్తిడికి దారితీసే కారణాలను వెతికి, వాటిని ముందే పరిష్కరించుకోవాలి. కనీసం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ ఒక గంటసేపు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. బాగా నిద్రపోవాలి. -
ఈ వారం కథ: చిద్విలాసుడు
అతను చాలాకాలం తర్వాత బస్స్టాండ్ లో కనిపించాడు. నేను చూడనట్టు నటించాను. ఎక్కడ నుంచి చూశాడో నన్ను, పరుగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నాడు. ‘‘ఎంతకాలం అయ్యిందో శ్రీను! నిన్ను చూసి’’ అంటుంటే మొహంలో ఆనందం. ‘‘సంయుక్త బాగుందా? పిల్లాడు ఎలా ఉన్నాడు?’’ అంటూ నా గురించి అడుగుతున్నాడు. అదే హుషారు, అదే నవ్వు. జీవితాన్ని ఈజీగా తీసుకునే అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. మామూలుగా అయితే అది అసూయ! తప్పదురా దేవుడా! అనుకుంటూ ముఖం మీద నవ్వు పులుముకుని, ‘‘మీరు ఎలా వున్నారు?’’.. అడిగాను.ఎప్పటిలాగానే జేబులోంచి సిగరెట్టు తీసి వెలిగించి గుండెల్లోకి గట్టిగా పీల్చి గాలిలోకి పొగ వదులుతూ, ‘‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ అన్నాడు. పదిహేను ఏళ్ల క్రితం ఎలా అనేవాడో అదే మాడ్యులేష తో అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతని వ్యవహారంలో మార్పు ఏమీ లేదు. మనిషిలో కూడా పెద్దగా వచ్చిన మార్పులేదు. శరీరం మీద కాలం మిగిల్చిన ఆనవాళ్ళు తప్ప. ‘‘మీ పిల్లలు ఎలా ఉన్నారు’’.. అని అడిగే లోపున, ‘‘నీ ఫోన్ నెంబర్ ఇయ్యి శ్రీను’’ అంటూ మొబైల్లో టిక్ టిక్మని అనిపించి దాన్ని జేబులో పడేసుకుని, ‘‘నేను ఎక్కవలసిన బస్ వచ్చేసింది, ఫోన్ చేస్తాను’’ అంటూ హడావుడిగా, కదులుతున్న బస్ ఎక్కి, వెళ్ళిపోయాడు. భలే మనిషి సన్యాసి! పేరుకు తగ్గ మనిషి. బాదరబందీలు ఉన్నా పట్టనట్టు తిరిగే సర్వసంగ పరిత్యాగి. సన్యాసి అనే పేరే విచిత్రంగా అనిపించి ఒకసారి అడిగితే, ‘‘మా అమ్మకి చాలాకాలంగా పిల్లలు పుట్టలేదుట. ఒక రోజు ఒక సన్యాసి మా అరుగు మీద కూర్చున్నాడుట. అతణ్ణి చూసి జాలిపడి మా అమ్మ అన్నం పెట్టిందిట. తృప్తిగా తిని, త్వరలో నీ కడుపు పండుతుంది. ఒక పిల్లాడు పుడతాడు అని చెప్పి వెళ్లిపోయాడట. తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు సన్యాసి అని పెట్టుకుంది’’ అని చెప్తూ చిద్విలాసంగా నవ్వాడు. ప్రపంచంలో నా అంత ఆనందంగా ఉండేవాడు మరొకడు లేడు అనేలా నవ్విన ఆ నవ్వు నా మస్తిష్కంలోంచి చెరిగిపోలేదు. అంతలా నా మనస్సులో ముద్ర వేశాడు. పదిహేనేళ్ల క్రితం మొదలైన మా పరిచయం, ట్రాన్స్ఫర్ మీద ఈ వూరు వచ్చే వరకు సాగింది. బలవంతాన నా ఆలోచనల్లో చొరబడ్డ ఆ పెద్దమనిషి నన్ను గతంలోకి లాక్కెళ్లాడు.ఆ రోజు శనివారం ఆఫీసు హాఫ్ డే సెలవు. నేను వచ్చేసరికి, సంయుక్త గోడ అవతల ఉన్న ఒక కొత్త ఆమెతో మాట్లాడుతోంది. నేరుగా బాత్ రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి, కారుణ్యను ఎదురుగాకూర్చోబెట్టుకుని లెక్కలు చెప్పడం మొదలుపెట్టాను. సంయుక్త లోపలికి వస్తూ, ‘‘కాఫీ తాగారా’’ అని అడిగింది. తల ఊపాను.‘‘పక్క ఇంటికి కొత్తగా వచ్చారండి. ఆయన జిల్లా కోర్టులో పనిచేస్తారుట. ఆవిడే వచ్చి పరిచయం చేసుకుంది, ఆయన పేరు సన్యాసి, ఆమె పేరు పార్వతి. చాలా మంచామెలా ఉంది, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు అట. ఈ రోజుల్లో నలుగురంటే కష్టమే పాపం. పెద్ద అమ్మాయి వాళ్ళ పిన్ని దగ్గర ఉండి, చదువుకుంటోందట. పార్వతిగారికి పిండి వంటలు బాగా వచ్చట. మనకి ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు’’.. సంయుక్త కళ్ళల్లో ఆనందం. ఇంతలో గట్టిగా పెద్దపెద్ద అరుపులు, తిట్లు వినబడ్డాయి.ఇద్దరం బయటకు పరుగెత్తి శబ్దాలు వచ్చిన వైపు చూశాము. పక్క ఇంటి ఆవరణలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జుట్టు జుట్టు పట్టుకుని రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. ఆడపిల్ల కూడా ఎక్కడా తగ్గడం లేదు.ఆ పిల్లాడితో సమానంగా పోరాడుతోంది. ఇద్దరికీ పది పన్నెండేళ్లు ఉండొచ్చు. పక్కింటావిడ వాళ్ళను విడదీయలేక, ‘‘ఒసేయ్ కమలా! ఒరేయ్ రాము ఆగండ్రా! కొట్టుకోకండి! ఏవయ్యో! వీళ్ళను ఆపలేకపోతున్నాను, వచ్చి ఆపవయ్యా’’ అంటూ అరుస్తోంది. మేము చూస్తున్నామని ఆమె గమనించినట్టుంది. సిగ్గుపడుతూ మొహం కిందకు దింపేసుకుని మొగుడు కోసం లోపలికి వెళ్ళింది. ఆ పిల్లలిద్దరూ మట్టిలో దొర్లుతున్నారు. కాసేపు అయ్యాక, అలిసిపోయి, ఆయాసపడుతూ అక్కడే మట్టిలో వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తున్నారు. ఇంతలో నడుము మీద వేలాడుతున్న లుంగీతో, పై భాగంలో ఏ ఆచ్ఛాదనా లేకుండా, నోటిలో కాలుతున్న సిగరెట్టుతో, నలభైఐదు, ఏభై ఏళ్ల మధ్యవయస్కుడు తాయితీయిగా నడుచుకుంటూ వచ్చి, ‘‘ఏరానాన్నా! ఏమ్మా అమ్ములూ! దెబ్బలు తగిలాయా! ఎందుకు నాన్నా అల్లరి’’ అంటూ వాళ్లను ప్రేమగా మందలించి లేవదీసుకుని లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.‘‘ఛీ ఛీ ఎలా కొట్టుకున్నారో అనాగరికంగా? ఇలాంటి సంత తెచ్చి పెట్టాడు మన పక్క ఓనర్’’ అన్నాను సంయుక్తతో.నా మాట పట్టించుకోకుండా, ‘‘ఆ కూలిపోయేలా ఉన్న ఇంట్లో ఎలా ఉంటారో పాపం. పెంకులు మార్చి పదేళ్లు అవుతోంది. వానాకాలంలో ఎలాగో వీళ్ళకు?’’ అంటూ జాలి పడింది. నేను తన మాటలు పట్టించుకోకుండా.. నా కొడుకు చేసిన లెక్కలు చూస్తూ, వాడు తప్పు చేసినప్పుడల్లా, వాడిని మందలిస్తూ, శ్రద్ధగా చదవక పోతే ముందు ముందు ఎంత కష్టపడివలసి వస్తోందో మధ్య మధ్యలో వాడికి ఉపదేశిస్తున్నాను.‘‘ఎందుకండీ వాడిని మాటి మాటికి అలా భయపెడతారు?’’ అంటూ నా మాటలకు అడ్డు తగులుతోంది.‘‘నువ్వు మాటాడకు. నీకు తెలియదు. శ్రద్ధగా చదువుకోకపోతే చాలా కష్టం, చూస్తున్నావుగా బయట ఎంత కాంపిటీషనో?’’ అంటూ తనను మాట్లాడనివ్వలేదు. బాగా చదువుకుని, సరిగ్గా సెటిల్ అవ్వకపోతే, పిల్లాడి జీవితం ఏమైపోతుందోననే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎన్నో కుటుంబాలలో పిల్లలు సరిగా స్థిరపడక పోవడం వలన, పెద్దలు మనఃశాంతి కోల్పోవడం చూశాను. అందుకే తెలియని భయం, బెంగ, టెన్షన్. ఎంత ప్రయత్నం చేసినా ఆ భయాన్ని వీడలేకపోతుంటాను. అందుకే, జీవితంలో చాలా క్రమబద్ధంగా, జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు కూడా క్రమశిక్షణలో ఉండాలనే నా తాపత్రయం. ఎవరైనా అందుకు విరుద్ధంగా ఉంటే నాకు నచ్చరు. అందుకనే మా పక్క ఇంటి పిల్లలు హోరాహోరీ కొట్టుకోవడం చూసి నాకు వెగటు వచ్చింది. వాళ్ళను కనీసం తిట్టకుండా, గారంగా మాట్లాడి, ఆ ఇంటిపెద్ద తీసుకువెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. కారుణ్యను వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళకుండా ఆపమని సంయుక్తకు చెప్పాలి. లేకపోతే క్రమశిక్షణ లేకుండా వీడు కూడా వాళ్ళలా తయారవుతాడు అనే మరో అదనపు భయం నాకొచ్చి చేరింది.మర్నాడు స్కూటర్ మీద ఆఫీసుకు బయలుదేరే సమయంలో, ‘‘శ్రీనివాస్ గారూ! ఆగండడాగండి! అంటూ చేతికి గుడ్డసంచి తగిలించుకుని, జేబులో చిల్లర ఎక్కడ పడిపోతుందోనని, దాని మీద చెయ్యి నొక్కిపెట్టుకుని పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు సన్యాసి. వంటిమీద మాసిపోయిన చొక్కా, మడమలపైకి పోయిన ప్యాంటు చూసిన నాకు చిరాకు వేసింది. ‘‘శ్రీనివాస్ గారు! మేము మీ పక్క ఇంట్లో కొత్తగా దిగాం. మా ఆవిడా, మీ మిస్సెస్గారు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు’’ అంటూ అవసరం లేకపోయినా గట్టిగా నవ్వుతూ, చేతులు పైకీ క్రిందకూ ఊపుతూ, వీధిలో అందరికీ వినబడేలా గట్టిగా మాట్లాడుతూ.. తన పేరు, ఉద్యోగం, కుటుంబ విషయాలు ఏకరువు పెడుతున్నాడు. ఆఫీసుకు టైము అవుతోందని రెండుసార్లు వాచీ చూసుకున్నాను. అయినా ఆ జీవి, గమనించలేదు. తన ధోరణి తనదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా ఇబ్బందిని అరుగుమీద నిలబడ్డ పార్వతి గమనించినట్టుంది.‘‘అయ్యో! ఆయనకి ఆఫీసుకు టైము అవుతున్నట్టుందండీ’’ అని మొగుడుకి హింట్ ఇచ్చింది. అప్పుడు ఆయనగారు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ‘‘అయ్యో మీకు టైము అవుతుందనుకుంటా, మీ ఆఫీసు కూడా మా ఆఫీసు దగ్గరే! వెడుతూ మాట్లాడుకుందాం’’ అంటూ మొహమాటం లేకుండా, నా స్కూటర్ వెనకాల ఎక్కేశాడు. ఇదేం మనిషో? అనుమతి తీసుకుని ఎక్కాలన్న కనీస కర్టసీ లేదు అని మనసులో విసుక్కుంటూ వాహనం ముందుకు పోనిచ్చాను. వెనకాల కూర్చుని, ఆఫీసు వచ్చే వరకు మాట్లాడుతునే వున్నాడు. నేను వూ కొడుతూనే ఉన్నాను. అలా మొదలయింది నా మొదటి పరిచయం సన్యాసితో... తర్వాత.. మా మధ్యలో మాటలు కాస్త పెరిగాయి అనడం కన్నా, నేను అతణ్ణి వదిలించుకోలేక పోయాను అనే చెప్పాలి. ఆసక్తి లేకపోయినా, అతని వ్యవహారశైలి గమనించడం మొదలుపెట్టాను. దరిమిలా సన్యాసికి జీవితం పట్ల ఏ మాత్రం పట్టింపు లేదని అర్థం అయ్యింది. ఖాళీగా తన ఇంటి అరుగు మీద కూర్చుని, సిగరెట్టు కాలుస్తూ, నాలుగైదు సార్లు కాఫీలు తాగుతూ వీధిలో వెడుతున్నవాళ్లను పలకరిస్తూ ఉండడం చాలాసార్లు చూశాను. ఆదివారం వస్తే చాలు. ఇంటిల్లిపాదిని తీసుకుని సినిమాకి పోయేవాడు.సమాజంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలు, తగ్గిపోతున్న డబ్బు విలువ, అతనికి పట్టవా అనిపించేది.ఆర్థిక ఇబ్బందులు నాకు పెద్దగా లేనప్పటికీ,. ఎప్పుడు డబ్బు అవసరం వస్తుందో అని టెన్షన్ పడుతూనే ఉంటాను. ఆచితూచి అడుగులు వేస్తూ పొదుపుగాను, క్రమశిక్షణతో ఉండడం నా నైజం. జీవితం పట్ల బాధ్యత, భవిష్యత్తు పట్ల భయం నన్ను అలా చేసినట్టుంది. అలాంటి నాకు సన్యాసి ఒక ప్రశ్నార్థకం.పార్వతి మాటలని బట్టి, అతనికి జీతం డబ్బులు తప్ప, వేరే ఏం ఆదాయం లేదని తెలిసింది. అయినా ఈ జీవి డబ్బులు కోసం ఏనాడూ ఇబ్బంది పడుతున్నట్టు కనబడేవాడు కాదు. నన్ను ఎక్కడ అప్పు అడుగుతాడో అని భయపడుతూ ఉండేవాడిని. అందుకే అతని ఆర్థిక పరిస్థితుల గురించి అస్సలు అడిగేవాడిని కాదు.ఎప్పుడూ సంతోషంగా ఉండే అతణ్ణి చూస్తూ ఉంటే, నాలో ఎన్నో సందేహాలు రేగేవి. ఒకసారి పిచ్చి ప్రశ్న వేశానని, నాలో నేను అనుకుంటూనే, ‘‘మీ పిల్లలు ఎలా చదువుతారు సన్యాసిగారు’’ అని అడిగాను.అంతలా అల్లరి చేస్తూ, క్రమశిక్షణ లేని పిల్లలకు చదువు రాదనే నా నిశ్చితాభిప్రాయం. అతను చెప్పే లోపునే, మరో ప్రశ్న సంధించాను. ‘‘ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి! ఈ రోజుల్లో నలుగురు పిల్లలంటే మాటలా? ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? చిన్న చిన్న కుటుంబాలమైన మేమే సంసారాన్ని కష్టంగా లాగుతున్నాం. మీరు నలుగురిని ఎలా పోషిస్తున్నారా అని?’’ సందేహంగా అడిగాను. వెంటనే గట్టిగా ఒక నవ్వు నవ్వి, జేబులోంచి చార్మినార్ సిగరెట్టు తీసి నోట్లో పెట్టుకుని, అగ్గిపుల్లను పెట్టి మీద పెట్టి సర్ మని గీత గీసి చాలా స్టైల్గా సిగరెట్టు ముట్టించి, గుప్పున ఒక దమ్ము లాగి, ‘‘చూడు శ్రీను!’’ అంటూ, ఏకవచన సంబోధనలోకి దిగాడు అని నేను గమనించే లోపులోనే, ‘‘నువ్వు నా కన్నా చిన్నవాడివని చనువుగా అనేశానులే ఏమీ అనుకోకు’’ అని చెప్పడం మొదలుపెట్టాడు.‘‘మొదటి సంతానం ఆడపిల్ల పుట్టగానే, మా అమ్మ మగపిల్లాడు కావాలని గోల పెట్టింది. రెండవ వాడు సూరిగాడు పుట్టాడు..’’‘‘మరింకేం!’’ అన్నాను. ఎందుకు ఆపలేదు అనే ఉద్దేశంతో.‘‘ఆపరేషన్ నువ్వు చేయించుకో అంటే నువ్వు చేయించుకో అని పార్వతీ నేనూ దెబ్బలాడుకున్నాం.ఈలోగా ఒక శుభ ముహూర్తాన కవలలు పుట్టేశారు. ఏం చేస్తాం అంతా ఆ పరమాత్ముడి లీల’’ అని భళ్ళున నవ్వి గాలిలోకి చూశాడు. ఒళ్ళు మండిపోయింది అతని ధైర్యానికి.నాకు ఆ కుటుంబం అంటే పెద్ద ఇష్టం లేకపోయినా, సంయుక్తకు పార్వతి ఎంతో ఆసరాగా ఉండేది. నేను ఆ వూళ్ళో ఉండగానే, పెద్ద కూతురుకు సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు సన్యాసి. వీళ్ళ ఆర్థిక స్తోమతకు, పిల్ల పెళ్లి ఎలా చేస్తారో అనుకుంటూ ఉండేవాడిని. మిస్టరీగా ఆ ఆమ్మాయి పెళ్లి జరిగితే అది హిస్టరీగా మిగిలిపోతుంది.. నవ్వుకునే వాడిని. ‘‘కనీసం ఒక పూట భోజనం కూడా సరిగా పెట్టలేని వాళ్ళు, అల్లుడు వస్తే ఎలా చూస్తారో కదా’’ అని సంయుక్తతో అంటే. ‘‘వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు. ఏ సాయం చేయకపోగా, అలా వెటకారంగా మాట్లాడడం తప్పండీ పాపం’’ అని నన్ను మందలించేది. కారుణ్యని ఐఐటీ ఫౌండేష¯Œ కి కోచింగ్ ఇప్పించాలని, ఈ వూరికి ట్రాన్స్ఫర్ అప్లై చేశాను.వెంటనే వచ్చింది. మేము వూరు విడిచి వెళ్లిపోతున్న రోజున చాలా బాధ పడిపోయారు సన్యాసి దంపతులు. సన్యాసి అయితే, ‘‘శ్రీను! నువ్వు వెళ్లిపోతుంటే నా బలం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తోందయ్యా’’ అంటూ బేలగా మాట్లాడాడు. నేను పెద్దగా స్పందించలేదు. సిటీ స్కూళ్లలో పిల్లల చదువులకు ఢోకా ఉండదని, భవిష్యత్తు బావుంటుందనే ఆనందంలో నేనున్నాను. సంయుక్త మటుకు చాలా బాధగానే, ఊరు వదిలి వచ్చింది. ఇక్కడకు వచ్చాక, నేను సన్యాసిని దాదాపు మర్చిపోయాను. సంయుక్త మటుకు చాలా కాలం పార్వతితో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకునేది. కాలక్రమేణా కారుణ్య చదువులు పూర్తి అయ్యాయి, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి, రెండేళ్లకి వస్తూ ఉంటాడు.సన్యాసి కనిపించాడు అని సంయుక్తకు చెప్పలేదు. ‘‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’’ అనే సన్యాసి మాటలు నా గుండెలను కోసేస్తున్నాయి. చెవులలో ఆ మాటలే రింగుమంటున్నాయి. నలుగురు పిల్లలను కనడం అనే ఊహకే భయపడే ఈ రోజుల్లో, వాళ్ళను కని, చాలీ చాలని జీతం డబ్బులతో, అంతంత మాత్రంగా చదువుతున్న పిల్లలతో, గడుపుకు వస్తున్న సన్యాసి ఈ రోజుకీ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు? ‘మర్చిపోయాను’ అనుకున్న సన్యాసి, హఠాత్తుగా కనబడి, నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. నాకు సమాధానం దొరక్క చివరికి సంయుక్తను ఆశ్రయించాను.‘‘బాబయ్యగారు కనిపించారా? నాకు చెప్పనేలేదు. మీకు వాళ్ళంటే చిన్నచూపు ఇంకా పోలేదన్నమాట?’’ రుసరుసలాడింది.‘‘నాకు తెలియక అడుగుతాను. నెత్తి మీద అన్ని బాధ్యతలు పెట్టుకున్న మీ బాబాయి గారు, పిల్లలు పెద్ద అయినా ఇప్పటికీ ‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’ అని మాట్లాడుతున్నాడు. ఆదేమైనా గొప్పకు మాట్లాడతాడా? లేదా పిచ్చా ?’’ అన్నాను తనతో. నాకేసి చూసి ఒక నవ్వు నవ్వి, ‘‘వాళ్ళకేం బ్రహ్మాండంగానే ఉన్నారండీ’’ అంది. నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఆ రోజుల్లో వాళ్ళ బతుకేదో వాళ్ళు బతికారు పాపం. నేను కూడా పెద్ద సాయం చేసేదాన్ని కాదు. పిల్లలు అల్లరి చేస్తూ కొట్టుకుంటున్నా, వాళ్ళను ఏమీ అనకుండా, దగ్గరకు తీసుకుని, మంచి మాటలు చెప్పేవారుట బాబయ్యగారు. వాళ్ళు ఏమి అడిగినా, అప్పోసొప్పో చేసి, కొనిపెట్టేవారుట. వాళ్ళు కూడా కొంతకాలానికి బాధ్యత తెలుసుకుని, ప్రవర్తించడం మొదలు పెట్టారుట.పార్వతి పిన్నిగారు మన వీధిలో అందరికీ సాయంగా ఉండేదిగా. ఆ మంచితనం వలనే, పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని, ముందుకు వచ్చి, పెద్ద కూతుర్ని కోడలుగా చేసుకున్నారుట’’ చెప్పింది. నేను ఆ రోజున వాళ్ళను చిన్నచూపు చూస్తూ సంధించిన మాటల శరాలు నాకే తిరిగి గుచ్చుకున్నట్టుగా అనిపించి గిల గిలలాడాను. ‘‘పెద్ద కొడుకు సూరి , కిరాణా హోల్సేల్ బిజెనెస్ పెట్టి, బాగా సంపాదిస్తున్నాడుట. వాడే కమల పెళ్లి చేశాడుట. మీరు ఎప్పుడూ ఎందుకు పనికిరాడు అని తిట్టి, ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కదా! ఆ చిన్న కొడుకు రాముని,.. మనిషిగా పుట్టినా ఈ జన్మభూమికి నేను చేసింది ఏమీ లేదు! నువ్వైనా డిఫెన్సులో చేరి, దేశానికి సేవ చేయమని ప్రోత్సహించారుట బాబాయిగారు. మనం ఏం తిన్నామో, ఎలా బతికామో ఎవ్వరికీ తెలియకూడదు. మనల్ని చూసి ఎవరూ జాలి పడకూడదు. అవతలివాళ్ళ దగ్గర నుండి జాలి ఆశించకూడదు. అలా ఉంటే, దేహీ అని అందర్నీ ఆడగాలనిపించి, దానికి అలవాటు పడిపోతాం. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి’’ అని మా అమ్మ చెప్పేది అని అంటూ ఉండేవారుట. ఆయన అలా నవ్వుతూ కనబడే మనిషే కానీ, లోతైన మనిషి అండీ’’ అంది తాపీగా.‘‘నీకు వాళ్ళ విషయాలన్నీ ఎలా తెలిశాయి?’’ సందేహం ఆపుకోలేకపోయాను. ‘‘మొన్నామధ్య సోషల్ మీడియాలో రాముని చూశాను. పార్వతి పిన్నిగారి నంబర్ తీసుకున్నాను, మీకు వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా! అందుకే చెప్పలేదు’’ అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ గొణుక్కున్నాను. అనుకరించడానికి ప్రయత్నించే అబద్ధంతో నన్ను నేనే ఆత్మవంచన చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. సన్యాసి నాకు రాజర్షిలా అంతర్దర్శనం ఇచ్చాడు. ∙చాగంటి ప్రసాద్ -
యువ కథ: ముసుగు మనుషులు
మెలకువ వచ్చింది. వెంటనే మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. నా చేయి ఫోన్ కోసం వెతకడం మొదలెట్టింది. రాత్రి దిండు కింద పెట్టుకుని పడుకున్నట్టు గుర్తు. నా ప్రతిరోజూ ప్రారంభమయ్యేది, ముగిసేది ఫోన్తోనే! వెతుకుతున్న చేతికి ఫోన్ తగలగానే, ఏదో స్విచ్ వేసినట్టు నా కళ్ళు వెంటనే తెరుచుకున్నాయి.చూస్తే టైమ్ ఉదయం తొమ్మిది కావస్తోంది. ఆలస్యం అయిపోయింది. దానికి కారణం రాత్రంతా నిద్రలేదు. ఒకటే కలలు, ఏవేవో ఆలోచనలు. కాని ఒకటి మాత్రం బాగా గుర్తుంది. దేవుడు కనిపించాడు. ‘లోకంలో ఆడా మగ, పేదా ధనిక, కుల మత వర్ణ అసమానతలన్నీ తుడిచేయి దేవుడా. సమసమాజాన్ని సృష్టించు భగవాన్’ అని నేనడిగితే, ‘తథాస్తు’ అన్నాడు. అంత వరకే గుర్తుంది. అలా ఎందుకు అడిగానో తెలీదు.ఆడవాళ్ళు అవ్వడం వల్ల ఇంట్లో నా భార్య, ఆఫీసులో నా జూనియర్ శ్రీలేఖ, డబ్బున్న కుటుంబంలో పుట్టడం వల్ల నా కొలీగ్స్, పెద్ద కులంలో పుట్టడం వల్ల నా స్నేహితుడు రాజు నా కన్నా ఎక్కువ సుఖపడుతున్నారని ఈ మధ్య తెగ ఆలోచిస్తున్నాను. ఈ అసమానతలన్నింటినీ సృష్టించింది ఆ దేవుడేనని, ఆయన మీద కోపాన్ని పెంచుకున్నాను. మనస్సులో అప్పుడప్పుడు దైవ దూషణ కూడా చేశాను. ఈ కల దాని వల్లేనేమో అనిపించింది.నిద్రమత్తుని అతికష్టం మీద వదిలించుకుని, మంచం దిగి వాష్రూమ్లోకెళ్ళి, ఫ్రెష్ అయ్యి వచ్చే సరికి ముప్పావు గంట పట్టింది. ఎప్పటిలా నేను వాష్ రూమ్లో ఉండగా నా భార్య ‘లేచావా’ అంటూ తలుపు కొట్టలేదు. వంట గది నుంచి ఎలాంటి కుక్కర్ శబ్దాలూ రావట్లేదు. టీవీలో భక్తి స్తోత్రాలు వినిపించట్లేదు. పూజగదిలోనూ కనిపించలేదు తను. అప్పుడే జురాసిక్ పార్క్లో ఉండే జంతువులన్నీ కడుపులో పరుగెత్తడం మొదలెట్టాయి. వంటగదిలోకెళ్ళాను. ఓ గిన్నెలో పోహా కనిపించింది. నాకు భలే ఇష్టం. తనకు ఇష్టం లేకున్నా, నా కోసం చేసిపెడుతుంది నా భార్య. మొత్తం లాగించేశాక, మళ్ళీ నా భార్య గుర్తొచ్చింది.‘ఎక్కడికెళ్ళింది అసలు’ అనుకుంటూనే, తన ఫోన్కి డయల్ చేశాను. రింగ్ అయ్యింది కాని, లిఫ్ట్ చేయలేదు. ఆ చిరాకుతోనే బైక్ తాళాలు తీసుకుని ఆఫీసుకి బయల్దేరాను.‘బ్రేక్ఫాస్ట్ అయ్యిందా సార్’ అన్న గొంతు వినబడింది. బైక్ స్టార్ట్ చేస్తూనే ‘హా అయింది’ అంటూ ముభావంగానే తలెత్తాను. ఎదురుగా ఓ వ్యక్తి. అతని కళ్ళు, నోరు, చేతులు, కాళ్లు తప్ప ఏమీ కనిపించట్లేదు. షాక్ కొట్టినట్టయింది. కాని ఎలాంటి భయమూ కలగలేదు. నాకే ఆశ్చర్యమేసింది.తేరుకున్న నేను, రెండు విషయాల ద్వారా నేను చూస్తున్నది మా ఇంటి ఓనర్ని అని గుర్తుపట్టగలిగాను. మొదటిది ఆయన గొంతు. రెండవది తను చూపే మర్యాద. నేను చూíసీ చూడనట్టు ఉన్నా, దగ్గరకొచ్చి మరీ పలకరిస్తాడు. నా ఆశ్చర్యాన్ని పసిగట్టిన అతను ‘అరే! మీరూ నాలాగే అయిపోయారు’ అన్నాడు.‘మీలాగా’ అంటూ నా మొహాన్ని, చేతులనూ తడుముకున్నాను. ఏమీ ఉన్నట్టు అనిపించలేదు.బైక్ మిర్రర్లో చూసుకున్నాను. ఏదో చీకటి ఒళ్ళంతా కప్పేసినట్టు నా కళ్లు, నోరు, చేతులు, కాళ్లుతప్ప ఏమీ కనిపించట్లేదు. భయమేసింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.నా ఆలోచనలకు సమాధానంగా, మళ్ళీ తనే ‘ఈ రోజు ఉదయం నుంచి అందరి కళ్లు, నోరు, చేతులు, కాళ్లు తప్ప మిగతావేవీ కనిపించట్లేదు. మనం ఇంట్లో, హాస్పిటల్లో ఉంటే మాత్రమే ఇంతకు ముందులా ఒకరికొకరం కనిపిస్తున్నాం. బయటకొచ్చామా, అంతే సంగతులు! ముసుగు మనుషుల్లా అయిపోయాం అందరం. అందరూ దేవుడు ఏదో శపించాడని అనుకుంటున్నారు’ అంటూ పిచ్చివాడిలా తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.ఎక్కువ ఆలోచించే టైం లేకపోయింది. బైక్ తీసి వెంటనే ఆఫీసుకి బయల్దేరాను. మధ్యలో బైక్ మీద వస్తున్న ఓ మనిషి ఎదురయ్యాడు. బైక్కి వేలాడుతున్న పాల డబ్బాలను చూస్తే పక్కింట్లో పాలు పోసేవాడని అర్థమైంది. పక్కింటి నుంచి ఓ నల్లని శరీరం బయటకొచ్చింది. తను పక్కింటి గీత ఆంటీ అని కళ్ళను బట్టి గుర్తుపట్టగలిగాను. పట్టుకుంటే వదలదు. అందుకే తను నన్ను గుర్తుపట్టి పలకరించేలోపే బైక్ని పరుగెత్తించాను.ఎక్కడ చూసినా మనుషుల శరీరాలు కనిపించట్లేదు. అంతా మాయగా అనిపించింది. ఓసారి బైక్ ఆపి నన్ను నేను గిల్లుకున్నాను. నొప్పేసింది. అయినా జరుగుతున్నదంతా నమ్మబుద్ధి కాలేదు. నాకున్న ఒకే ఒక్క స్నేహితుడు రాజుకి ఫోన్ చేశాను. వాడూ లిఫ్ట్ చేయలేదు. ఇక చేసేదేం లేక బైక్ని ముందుకు పోనిచ్చాను.కలెక్టర్ చౌరస్తా వచ్చింది. జనాలు ఓ మూలన గుమిగూడి ఉన్నారు. ఏమై ఉంటుందా అని దగ్గరికెళ్ళాను. ఎవరో రక్తపు మడుగులో పడున్నారు. కాళ్ళకు మెట్టెలు కనిపించాయి. ఓ మహిళ అని అర్థమయింది. ఎవరూ సెల్ఫీలు తీసుకోవట్లేదు, వీడియో రికార్డింగు చేయట్లేదు. పాపం అని కొందరు బాధపడుతున్నారు. అంబులెన్స్కి ఫోన్ చేయండి అని ఇంకొందరు కేకలేస్తున్నారు. మొహాలు కనిపించుంటే మాత్రం జనాలు చనిపోతున్నా పట్టించుకోకుండా, ఒక్కొక్కరు పదులకొద్ది సెల్ఫీలు తీసుకునేవారు. అనాథలా రక్తపు మడుగులో పడున్నావిడ వీడియోలు రక రకాల కోణాలలో చిత్రించేవాళ్ళు. అంతేగాని రక్షించే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ హఠాత్ మార్పుకు కారణం అర్థంకాలేదు. అక్కడున్న ఒక్కాయన్ని అడిగితే ‘అక్కడ రక్తపు మడుగులో పడున్నది ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరి అక్క, అమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ ఎవరైనా అయ్యుండచ్చు. గుర్తుపడదామంటే శరీరం కనిపించట్లేదు. విడిచిపెట్టి పోతే అదో రిస్కు. అందుకే వాళ్ళందరూ తాపత్రయ పడేది’ అన్నాడు.దేవుడు భలే చేశాడనిపించింది. ఎప్పుడూ ‘మన వాళ్ళు.. నా వాళ్ళు’ అంటూ ఉండే మనుషుల జీవితాల్లోంచి స్వార్థాన్ని తీసేశాడు.ఇంతకుముందు నేనెవరినైనా అలా చూస్తే, చలించిపోయే వాణ్ణి. ఇప్పుడు ఇంతమంది మానవత్వం చూపిస్తుండడంతో నా అవసరం లేదనిపించి ముందుకు కదిలాను.ఆఫీసుకెళ్ళి కూర్చున్నాను. నన్ను మా బాస్ రమ్మంటున్నాడని అటెండర్ కబురంపాడు. దాంతో వెళ్ళి ఆయన ముందు కూర్చున్నాను.‘అసలు ఇలా ఎలా అయింది? మనుషుల పాపాలు ఎక్కువైపోయాయి’ అని సొల్లు మొదలెట్టాడు.ఇంతకుముందు పని చెప్పడానికే నన్ను పిలిచేవాడు. మాటలతో టైమ్పాస్ చేయడానికైతే నా జూనియర్ శ్రీలేఖని పిలిచేవాడు. ఈ వయసులో ఏం చేద్దామని తహతహో అర్థంకాదు. ఇప్పుడు ఆమె కోతి మొహం కనిపించట్లేదు. అందుకే నేను గుర్తొచ్చానేమో అనిపించింది. సమాజంలో స్త్రీ పురుష భేదాలు కూడా తొలగిపోయాయని అర్థమైంది. దేవుడి మీద ఇంకాస్త గౌరవం పెరిగింది. ఇంతలో నా ఫోన్ మోగింది. ఏదో కొత్త నంబరు. లిఫ్ట్ చేసి మాట్లాడగానే, అవతలివైపు వ్యక్తి చెప్పిన వార్త విని, అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు నిండాయి, కాళ్ళు వణకడం మొదలెట్టాయి. ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టనిపించింది.హాస్పిటల్ బెడ్ మీద నా భార్య. ఒళ్ళంతా కట్లు కట్టినట్టున్నారు. ఆమె మొహం తప్ప మరేమీ కనిపించట్లేదు. తనలో కదలిక లేదు. కళ్ళు మూసే ఉన్నాయి. పక్కకు చూశాను. మా అత్తా అమ్మా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. నేనూ ఏడవాలా? తెలీలేదు. నా బుర్ర పనిచేయట్లేదు. ‘ఏడిస్తే తను తిరిగొస్తుందా?’ అన్న ప్రశ్న అడుగుతోంది నా బుర్ర. ఆ ప్రశ్న కరక్టే కదా!ఏమో ఏం తెలియట్లేదు. సోఫాలో కూలబడిపోయాను. తెలీకుండానే కళ్ళు మూతలుపడ్డాయి.ఏదో శరీరం నన్ను తాకుతున్నట్టు అనిపించింది. ‘ఊ..ఊ’ అన్న గొంతు వినబడడం మొదలెట్టింది.బరువుగా కళ్ళు తెరిచాను. ఎదురుగా నా సంవత్సరం వయసున్న కొడుకు. నా చెల్లి చేతుల్లోంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వాణ్ణి చేతిలోకి తీసుకుని కౌగిలించుకున్నాను. ధైర్యంగా అనిపించింది. నాకంటూ మిగిలింది వాడొక్కడే ఇప్పుడు. నా కౌగిలిని విడిపించుకుని, వాడి అమ్మ వైపు ఒక్క వేలితో చూపిస్తూ ‘ఊ ..ఊ’ అంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ఈసారి నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ధారలుగా నా చెంపలను తడిపేశాయి. అది చూసి వాడు నా కన్నీటికి ఒక వేలిని తాకించి, తడి తాకగానే, ‘ఊయ్’ అన్నాడు, ‘ఏమైంది నాన్నా’ అన్నట్టు. వాడికేం చెప్పాలి? చెప్పినా ఏం అర్థమవుతుంది?.అప్పుడే వచ్చిన నా స్నేహితుడు రాజు, పక్కన కూర్చొని, ‘మనుషులు మారలేదురా. మారరు కూడా. రోడ్డు మీద శరీరం కనిపించక పోయేసరికి, వాళ్ళ వాళ్ళయ్యుంటారేమో అని హాస్పిటల్కి జాగ్రత్తగా తీసుకొచ్చారు.హాస్పిటల్ లోనికి రాగానే శరీరం మొత్తం కనిపించింది. దాంతో వాళ్ళ కులం కాదని ఒకడు, మతం కాదని ఒకడు, ఆడ అని ఇంకొకడు, నా వాళ్ళు కాదని మిగతా వాళ్ళు వదిలేసిపోయారు. డాక్టరు కూడా తెలిసిన వాళ్ళు కాదని, ప్రాణం పోతుందని తెలిసినా, డబ్బు కడితేనే ట్రీట్మెంట్ అన్నాడట! చివరికి అందరూ ఉన్నా మన దీపూ అనాథలా ప్రాణాలు విడిచింది. లేదు సమాజం చంపేసింది’ ఆవేశంగా మాట్లాడుతున్నాడు రాజు. ఇంతకు ముందు ఎప్పుడూ వాణ్ణి అలా చూడలేదు.మళ్ళీ వాడే ‘ఇంతకూ ప్రమాదం జరిగింది ఎక్కడో తెలుసా? కలెక్టర్ చౌరస్తా దగ్గర. నువ్వు అటు నుంచే పోయుంటావు. నువ్వు చూసుంటే, నువ్వే తీసుకొచ్చేవాడివి. దురదృష్టం. ఇంతకీ తను ఎక్కడికెళ్తుందో తెలుసా? ఉద్యోగానికి. కుటుంబ భారమంతా నువ్వొక్కడివే మోస్తూ బాధపడుతున్నావని, తను నీకు చెప్పకుండా ఏదో ఇంటర్వ్యూకి బయల్దేరింది. ఇంతలోనే ఇదంతా అయింది’ అన్నాడు.నా ఆలోచనలు ఆగిపోయాయి. చావు బ్రతుకుల్లో ఉన్న నా భార్యను నేనే వదిలేశానా అన్న బాధ నా గుండెను కకావికలం చేసింది. కళ్ళు మూతలు పడ్డాయి. ఎదురుగా ఓ వెలుగు కనిపించింది. ‘మానవా!’ అంది ఆ వెలుగు. నేను స్వర్గంలో ఉన్నానో, నరకంలో ఉన్నానో అర్థం కాలేదు.అప్రయత్నంగా చేతులెత్తి, ‘స్వామీ’ అన్నాను.‘చూశావుగా! నీ కోరిక ప్రకారం అన్ని వివక్షలూ పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం చేశాను. కాని, ఫలితం లేదు. మీలాగే పశు పక్ష్యాదులను కూడా పుట్టిస్తున్నాను. వాటిలో ఈ వివక్షలు లేవే! కేవలం మీలో మాత్రమే ఇవి ఉన్నాయి. అందుకే మారాల్సింది మీరూ మీ ఆలోచనలూ. నేనెన్ని చేసినా ఫలితం ఉండదు. ఇకనైనా దైవదూషణ మానేయి నాయనా! కులం, మతం, పేద, ధనిక, ఆడ, మగలాంటి అడ్డుగోడలు మీరు నిర్మించుకున్నవే! వాటికి దేవుడ్ని నిందించడమేల?’ అంటూ ఆ వెలుగు మాయమైపోయింది.ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను. ఎదురుగా నా కొడుకుని ఎత్తుకుని నిలుచుంది నా భార్య.నా కొడుకు ‘ఉయ్’ అన్నాడు. ‘నాన్న అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు’ అన్నట్టు. ‘మళ్ళీ పీడకలా?’ అంది నా భార్య.అవునన్నట్టు తలదించుకున్నాన్నేను.‘చూడు విజయ్! నేనేమీ సుఖ పడట్లేదు. నీకు ఆఫీసు పని ఎలాగో, నాకు ఇంటి పని అలాగ. చెప్పాలంటే నీకన్నా ఎక్కువే కష్టపడుతున్నాను. ఇక సమాజంలో ఉన్న వివక్షల గురించి అంటావా? మనుషులందరూ రకరకాల ముసుగులేసుకుని బతుకుతున్నారు. అవి పోయే దాకా ఈ వివక్షలు ఇలానే ఉంటాయి. అది మన చేతుల్లో లేదు. మనం మంచి పాటిస్తే అదే మిగతా వారికి ఆదర్శప్రాయం అవ్వచ్చు. అలా కొందరైనా మనల్ని చూసి మారొచ్చు. అది మాత్రమే మనం చేయగలిగింది. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? పిల్లాడిలా ప్రవరిస్తున్నావ్’ అంది నా భార్య. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.ఆ క్షణంలో నా భార్య, నాకు జ్ఞానోదయం కలిగించడానికి ప్రత్యక్షమైన దేవతలా కనిపించింది. -
పోఖరా టు మోతిహారీ
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్లలో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబుపేలుళ్ల కేసులో దోషులైన ఆరుగురిలో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారైంది. ఈ మేరకు ఎన్ఐఏ ఫాస్ట్ట్రాక్ కోర్టు 2016 డిసెంబర్19న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ ఏప్రిల్ 8న హైకోర్టు తీర్పునిచ్చింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లతో పాటు ఆరు నగరాల్లో జరిగిన విధ్వంసాలకు సూత్రధారి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది రియాజ్ భత్కల్. అతడి సోదరుడు యాసీన్ భత్కల్ ఇందులో ప్రధాన పాత్రధారి. రియాజ్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. యాసీన్ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు 2013 ఆగస్టులో పట్టుకున్నారు.కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ మగ్దూం కాలనీకి చెందిన యాసీన్ భత్కల్ అసలు పేరు మహమ్మద్ అహ్మద్ జరార్ సిద్ధిబప్ప. ఇంజినీరింగ్ చేయడానికి పుణే వెళ్లిన ఇతడు అక్కడే యునానీ వైద్యుడిగా ఉన్న తన సోదరుడు ఇక్బాల్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ప్రారంభించి, ఇండియన్ ముజాహిదీన్లో కీలకంగా మారాడు. ఉగ్రవాదంలో 2007 నుంచి క్రియాశీలంగా ఉంటూ, 2008 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండేళ్లకు కుటుంబంతో కూడా పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాడు.ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడిగా యాసీన్ భత్కల్ అనేక విధ్వంసాలకు పథకరచన చేశాడు. టిఫిన్బాక్స్, ప్రెషర్ కుక్కర్ బాంబుల తయారీ పద్ధతిని తన అనుచరులకు నేర్పాడు. అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో ఇతడి పేరు వినిపించినా, 2010 ఫిబ్రవరి 13న పుణేలోని జర్మన్ బేకరీ పేలుడుతో ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలోకి చేరాడు. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబై తదితర నగరాల్లో 2008–13 మధ్య జరిగిన విధ్వంసాలలో ఇతడి ప్రమేయం ఉండటంతో భద్రతా సంస్థలు ఇతడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.సాంకేతిక నిఘాకు చిక్కకుండా తప్పించుకుంటున్న యాసీన్ను పట్టుకోవడానికి అతడి ఫొటో కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న కొన్నేళ్ల కిందటి ఫొటోతో కొన్నాళ్ల పాటు, 2010లో పాస్పోర్ట్ కోసం రాంచీ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడంతో ఆ ఫొటోతో ఇంకొన్నాళ్లు గాలించారు. ఇతగాడు 2008–2011 మధ్య చిక్మగళూరు, మంగుళూరు, కోల్కతా, చెన్నైలలో ఐదుసార్లు తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. యాసీన్ భత్కల్ను పట్టుకోవడానికి ఢిల్లీ స్పెషల్సెల్ అధికారులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. తమ మనిషికి ఉగ్రవాదిగా మార్చి, అతడిని యాసీన్కు దగ్గర చేయడం ద్వారా పట్టుకోవడానికి నఖీ అహ్మద్ను రంగంలోకి దింపారు. 2012 జనవరిలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు నఖీ ఉగ్రవాది అనే ఆరోపణలపై అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యాసీన్ను పట్టుకునే మరో దారినీ కోల్పోయారు. ఈ ఉదంతం పెను దుమారం రేపడంతో కేంద్ర హోమ్శాఖ కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇంతలో చీకట్లో చిరుదీపంలా మాస్టర్జీ చిక్కాడు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీకి చెందిన బషర్ హసన్ అలియాస్ తల్హా అలియాస్ మాస్టర్జీని ఢిల్లీ పోలీసులు 2013లో పట్టుకున్నారు. 2007లో రియాజ్, ఇక్బాల్, యాసీన్లతో సన్నిహితంగా మెలిగిన మాస్టర్జీని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆ ముగ్గురూ కొరియర్గా వాడుకుంటున్నారని బయటపడింది. రియాజ్, ఇక్బాల్ పాకిస్తాన్కు మకాం మార్చాక యాసీన్ మాత్రమే ఇతడితో టచ్లో ఉన్నాడు. తనపై నిఘా పెరిగిపోవడంతో సెల్ఫోన్ సహా సాంకేతిక అంశాలకు దూరంగా ఉంటున్న యాసీన్ అనేక సందర్భాల్లో మాస్టర్జీని కొరియర్గా వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంలో మాస్టర్జీ చెప్పిన మాటే నేపాల్లోని పోఖరా. అత్యవసర పరిస్థితుల్లో తనను కలుసుకోవాలంటే అక్కడకు రమ్మని యాసీన్ చెప్పినట్లు మాస్టర్జీ బయటపెట్టాడు. దీంతో కేంద్ర నిఘా వర్గాలు బిహార్ సరిహద్దులోని పోఖరాపై దృష్టి పెట్టాయి. 2013 జూలై 7న బుద్ధగయలో వరుస పేలుళ్లు జరిగాయి. దీంతో భత్కల్, అతడి అనుచరులు ఈ విధ్వంసానికి పాల్పడి, సరిహద్దులు దాటి ఉంటారని అంచనా వేసిన ఐబీ ఇద్దరు బిహార్ అధికారులను రహస్యంగా పోఖరా పంపింది. అక్కడ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ఇద్దరు నిఘా అధికారులూ ముఖ్యంగా యునానీ వైద్యులు, అత్తరు వ్యాపారులపై దృష్టి పెట్టారు. కేవలం ఓ వర్గానికి చెందిన వారే ఉన్నా ఎవరూ అనుమానించనివి ఈ రెండు వృత్తులే కావడమే దానికి కారణం. ఓ యునానీ వైద్యశాలలో ఉన్న వైద్యుడు వీరి దృష్టిని ఆకర్షించడంతో అతడిపై నిఘా ఉంచారు. కొన్ని రోజులకు మరో వ్యక్తి వచ్చి యునానీ వైద్యుడితో కలిసి ఉండటంతో అప్రమత్తమయ్యారు. తమ వద్ద ఉన్న పాత ఫొటోల ఆధారంగా నిశితంగా పరిశీలించి, సదరు యునానీ వైద్యుడే తమకు కావాల్సిన యాసీన్ భత్కల్ అని, పక్కనున్నది అసదుల్లా అక్తర్ అని గుర్తించారు. ఇద్దరూ కరడుగట్టిన ఉగ్రవాదులు కావడంతో వారిని పట్టుకోవడానికి నేపాల్ పోలీసుల సహకారం కోరారు. వారు స్పందించలేదు.చివరకు నేపాల్ పోలీసులకు రూ.50 వేలు లంచం ఇచ్చి, వారి సహకారంతో యాసీన్, అసదుల్లాల్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత తాను యునానీ వైద్యుడినే అంటూ నమ్మించేందుకు ప్రయత్నించిన యాసీన్ ఎట్టకేలకు నిజం బయటపెట్టాడు. దీంతో ఆపరేషన్ యాసీన్ ముగిసిందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఇద్దరు అధికారులు నేపాల్, బిహార్ పోలీసుల సాయంతో వారిని సరిహద్దులు దాటించి 2013 ఆగస్టు 29న జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ)కు అప్పగించగా, బిహార్లోని మోతిహారీ కోర్టులో హాజరుపరచారు. ఆ తర్వాత హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాలకు తరలించి విచారించారు. -
తారకాసుర జననం
కశ్యపుడి పెద్ద భార్య దితి కొడుకులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను విష్ణువు సంహరించాడు. కొడుకుల మరణంతో దితి దుఃఖితురాలై, భర్త శరణు పొందింది. ఆమె అనుగ్రహంతో దితి మళ్లీ గర్భం దాల్చింది. దితికి పుట్టబోయే బిడ్డ వల్ల తనకు ముప్పు వాటిల్లగలదని తలచాడు ఇంద్రుడు. దితి వల్ల జరిగిన అనాచార దోషాన్ని కనిపెట్టిన ఇంద్రుడు, దితి గర్భంలోకి ప్రవేశించి, తన వజ్రాయుధంతో పిండాన్ని ఛేదించాడు. అయితే, దితి వ్రత మహిమ కారణంగా ఆ పిండం నశించలేదు. నలభైతొమ్మిది ముక్కలైన ఆ పిండం ద్వారా దితికి నలభైతొమ్మిది మంది కొడుకులు పుట్టారు. వారు మరుత్తులు అనే దేవతలై, ఇంద్రుడి స్నేహాన్ని పొందారు. దితి తన దోషాన్ని గుర్తెరిగి, మళ్లీ భర్తను సేవించి, గర్భం దాల్చింది. ఈసారి ఆమెకు వజ్రాంగుడు అనే కొడుకు పుట్టాడు. పేరుకు తగినట్లే అతడు వజ్రసదృశ శరీరుడు. అమిత బలవంతుడు. వజ్రాంగుడు అమిత శివభక్తుడు. నిత్య శివారాధన నియమం తప్పక చేసేవాడు. పెరిగి పెద్దయ్యాక అతడు ఇంద్రుడి మీదకు దండెత్తాడు. ఇంద్రుడిని, అతడి దేవ సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ఇంద్రుడిని, కొందరు దేవతలను చెరపట్టి, తల్లికి సంతోషం కలిగించాడు. వజ్రాంగుడి వల్ల దేవతలు కర్మఫలాన్ని అనుభవించారు. ఇంద్రుడు సహా ఎందరో దేవతలు వజ్రాంగుడి చెరలో చిక్కుకోవడంతో స్వర్గం కళ తప్పింది. దేవతలను వజ్రాంగుడి చెర నుంచి విడిపించాలంటూ బృందారకులు బ్రహ్మదేవుడిని కోరారు. వారి కోరికతో బ్రహ్మదేవుడు వజ్రాంగుడి వద్దకు వెళ్లాడు. సామగానంతో వజ్రాంగుడిని సంతోషపెట్టి, ఇంద్రాది దేవతలందరినీ అతడి చెర నుంచి విడిపించాడు.వజ్రాంగుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ! ‘ఓ బ్రహ్మదేవా! నాకు ఎవరి మీదా రాగద్వేషాలు లేవు. నా తల్లి ఆజ్ఞ మేరకు దేవతలను చెరపట్టాను. నాకు రాజ్యకాంక్ష లేదు. అందువల్ల స్వర్గాన్ని ఆక్రమించుకోవాలన్న ఆలోచన నాకు అసలే లేదు. నాకు చరమమైన, నిత్యసుఖదాయకమైన ఆత్మజ్ఞానాన్ని బోధించు’ అన్నాడు.అతడి మాటలకు బ్రహ్మదేవుడు సంతోషభరితుడయ్యాడు. ‘వజ్రాంగా! ఒక్క మాటలో చెబుతున్నాను, విను. జ్ఞాన వైరాగ్యాది సాత్త్విక భావనలే తత్త్వసారం’ అని బోధించాడు. అప్పటికప్పుడు వరాంగి అనే కన్యను సృష్టించి, వజ్రాంగుడికిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత తన సత్యలోకానికి వెళ్లిపోయాడు. జరిగిన దానికి కశ్యపుడు కూడా సంతోషించాడు.వజ్రాంగుడు పరమ సాత్త్వికుడై వరాంగితో సంసార యాత్ర సాగించసాగాడు. వరాంగి మాత్రం మనసులో ఎలాంటి సాత్త్విక భావాలు లేనిదై, అలవిమాలిన కోరికలతో భర్తను సేవిస్తూ ఉండేది. ఆమె సేవలకు సంతుష్టుడైన వజ్రాంగుడు, ‘నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తాను. ఏం కావాలో కోరుకో’ అని అడిగాడు.దానికామె, ‘ముల్లోకాలనూ జయించగలిగేవాడు, ఇంద్రుడిని సైతం క్షోభపెట్టగలిగేవాడు అయిన మహా పరాక్రమవంతుడైన కొడుకు కావాలి’ అని అడిగింది.వరాంగి కోరికకు వజ్రాంగుడు విచలితుడయ్యాడు. తన భార్య అసమంజసమైన కోరిక కోరిందే అని కలత చెందాడు. అయినా మాట ఇచ్చాను కదా, ఏం చేయాలనే ఆలోచనతో మీమాంసలో పడ్డాడు. ఆడిన మాట తప్పరాదనే ధర్మానికి కట్టుబడి, తనకు ఇష్టం లేకపోయినా, చివరకు భార్య కోరికను నెరవేర్చాలనే నిశ్చయించుకున్నాడు. ముల్లోకాలను జయించగలవాడు బ్రహ్మ వాక్కుతో తప్ప జన్మించడం సాధ్యం కాదని తలచి, వజ్రాంగుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ద్వారా వరం పొంది ఇంటికి తిరిగి వచ్చాడు.కొన్నాళ్లకు వరాంగి గర్భం దాల్చింది. నెలలు నిండగానే, మహాకాయుడు అయిన బాలుడు పుట్టాడు. అతడు పుట్టగానే చేసిన రోదనకు ముల్లోకాలలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. దుశ్శకునాలు ఎదురయ్యాయి. భూమిపై ఉల్కలు వర్షించాయి. చెవులు చిల్లులు పడేంత మోతతో పిడుగులు పడ్డాయి. అడవుల్లోని జంతువులు ఆందోళన చెంది, దిక్కుతోచక పరుగులు తీశాయి. నక్కలు ఊళలు పెట్టాయి. కుక్కలు నేలను తవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ, కర్ణకఠోరంగా రోదించాయి. భూమి కంపించింది. సముద్రాలు ఉద్ధృతంగా ఉప్పొంగాయి. ప్రళయ ప్రభంజనంలా పెనుగాలులు వీచాయి. పెనుగాలుల తాకిడికి మహావృక్షాలు నేలకొరిగాయి. మేఘాలు చీము నెత్తురులను వర్షించాయి. పక్షులు గూళ్లు విడిచి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. వాటిలో చాలా పక్షులు చచ్చి నేల రాలాయి. స్వర్గంలో ఇంద్రుడి సింహాసనం తూలింది. అది చూసి దేవతలంతా భయకంపితులయ్యారు. ఈ ఉత్పాతాలు సమసిపోవడానికి కొన్ని నెలలు పట్టింది.వజ్రాంగుడికి, వరాంగికి పుట్టిన బాలుడికి కశ్యప ప్రజాపతి తారకుడు అని నామకరణం చేశాడు. పెరిగి పెద్దవాడైన తారకుడు తాను బ్రహ్మ గురించి తపస్సు చేస్తానని, తపస్సుకు అనుమతించమని తల్లిని కోరాడు. ఆమె అనుమతించడంతో మధువనానికి చేరుకుని, బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొన్ని వందల సంవత్సరాలు అతడు కఠోరమైన తపస్సు సాగించాడు. తపస్సు చేస్తుండగా, అతడి తల నుంచి వెలువడిన తేజస్సు ముల్లోకాలలో మహోపద్రవాన్ని కలిగించింది. దేవతలు భయభ్రాంతులై, ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కించాలంటూ బ్రహ్మదేవుడి వద్ద మొరపెట్టుకున్నారు.చివరకు బ్రహ్మదేవుడు తారకుడికి ప్రత్యక్షమయ్యాడు. ‘నాయనా! నీ తపస్సుకు ముల్లోకాలూ కల్లోలంగా మారాయి. నీ మనోభీష్టమేదో కోరుకో, తప్పక వరమిస్తాను’ అన్నాడు బ్రహ్మదేవుడు.‘బ్రహ్మదేవా! ముల్లోకాలలోనూ నన్ను మించిన బలవంతుడు ఎవరూ ఉండకూడదు. శివునికి పుట్టిన కొడుకు ఏనాడు సేనాధిపత్యం వహించి, నాపై ఆయుధ ప్రయోగం చేస్తాడో ఆనాడు మాత్రమే నేను మరణించేలా అనుగ్రహించు’ అని కోరాడు.బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.∙సాంఖ్యాయన -
దేవుని రాజ్యం కన్నీళ్లు లేని రాజ్యం
నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను భక్తిపారవశ్యంతో జరుపుకొంటున్నారు. సమాధిని గెలిచిన క్రీస్తు ప్రభుని అపార శక్తిని తలచుకొంటూ ఆయన దివ్యనామాన్ని కీర్తిస్తున్నారు. యేసును మదిలో నిలుపుకుంటే ఇక కొరతేమీ లేదు అంటూ ఆనందిస్తున్నారు. ‘మరణమున్ జయించి లేచెన్ మన ప్రభువు నేడు. మహిమ దేహమున్ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవవరములియ్య వసుధపైని’ అంటూ పునరుత్థానుడైన క్రీస్తును కీర్తించే పాటలను పాడుతూ తరిస్తున్నారు.‘యాత్రికుని ప్రయాణము’ జాన్ బన్యన్ రచించిన ప్రసిద్ధ క్రైస్తవ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తరువాత అనేక భాషల్లోనికి అనువదితమైన పుస్తకం ఇది. ఇంగ్లండులోని బెడ్ఫోర్డ్షైర్లో జాన్ బన్యన్ నివసించేవాడు. ఆ కాలంలోని అధికారులు, మతపెద్దలు జాన్ బన్యన్ను సుమారుగా పన్నెండేళ్లు కారాగారంలో ఉంచారు. ఆ ప్రతికూల వాతావరణంలో దేవుడు అనుగ్రహించిన దర్శనం నుంచి పుట్టిన గొప్ప రచన ‘యాత్రికుని ప్రయాణము’. ఈ రచనలో ఒక వ్యక్తి తన పాపభారం నుంచి విముక్తి పొందడానికి పరమపురి వైపు చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చిత్రీకరించారు. నాశనపురం నుంచి పారిపోతున్న క్రైస్తవుణ్ణి ఒప్పించి వెనుకకు తేవడానికి పాషాణం, నవనీతం అనే ఇద్దరు మిత్రులు వెంటబడతారు. వారు చెప్పిన దానికి ఒప్పుకోవడం పోయి క్రైస్తవుడు వారినే తనతో వచ్చేయమని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. పాపభారం నుంచి విడుదల వెతుక్కుంటూ ఉన్న ఊరును కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం సాధించాలని వెళ్ళిపోతున్నావని పాషాణం ప్రశ్నిస్తాడు. దానికి క్రైస్తవుడు ఇచ్చిన సమాధానం ఇది. ‘నేను అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం సంపాదించుకొనేందుకు వెళ్తున్నాను. శ్రద్ధతో వెదికేవారికి ఆ వారసత్వం దొరుకుతుందని ఈ పుస్తకంలో రాసి ఉంది.’ప్రపంచంలో కుల మత జాతి వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా మానవులు వెతుకుతున్నవి రెండు: ఈ భూమ్మీద జీవించినంత కాలం మనశ్శాంతి, చనిపోయిన తరువాత మోక్షం. ఈ విచిత్రమైన విశ్వంలో మానవునికి సాటిౖయెన సృష్టియేదియు లేదు. దేవుడు మానవునికి అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చి ఘనపరచాడు. అయితే, మానవుడు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి, తనను సృజించిన దేవుని మీదే తిరుగుబాటు చేయగా తట్టుకో లేకపోయాడు. ప్రేమాస్వరూపి కావడంతో క్రోధంతో కాక కనికరంతో మరలా మనిషికి దగ్గరవ్వాలనే కరుణామయునిగా ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించిన మానవుణ్ణి అపరిమితంగా ప్రేమించి, ప్రాణ త్యాగాన్ని చేసి రక్షించాలన్నది పరమదేవుని కోరిక.దేవుని ప్రేమను రుచిచూసిన యోహాను అనే భక్తుడు రాసిన సువార్తలో ఓ అద్భుతమైన వాక్యం ఉంది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన్ను విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందుతారు.’ దేవుని ప్రేమను అర్థం చేసుకున్న ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాశుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా? నా జీవితం అంకితం నీకే.’ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో పురాతత్త్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఈ ప్రదేశం మొదట ఫోనీషియన్ కాలనీగా, వాణిజ్య ప్రాంతంగా స్థిరపడింది. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో హస్నోనియన్ పాలనలో బాగా విస్తరించబడింది. ఆ తదుపరి రోమన్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని దానిని స్వయం ప్రతిపత్తిగల నగరంగా ప్రకటించారు. వారి ద్వారా నియమించబడిన హేరోదు రాజు ఈ ప్రాంతాన్ని గణనీయంగా విస్తరించాడు. అతడు అక్కడ ఒక నౌకాశ్రయాన్ని నిర్మించి, ఆ పట్టణాన్ని, ఓడరేవును కైసరు అగస్టస్కు ౖకైసరియగా అంకితం చేశాడు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన్ను విశ్వసించువారు నశింపక నిత్యజీవం పొందుతారు.పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్ష నుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళులేని రాజ్యం.పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానమును అనుభవిస్తారు. దైవిక సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. సువార్తలలో పిలాతు గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. చరిత్ర కూడా ఆ విషయాలను ధ్రువీకరిస్తుంది. పిలాతు ప్రతిభ కలిగిన నాయకుడు, పాలకుడు. అతడు యూదయ ప్రాంతానికి గవర్నరుగా రోమన్ల ద్వారా నియమించబడ్డాడు. సమర్థంగా పరిపాలించడంలోను తన అధికారంతో అందరినీ అదుపులో ఉంచడంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అతడు న్యాయదృష్టి గలవాడని, ప్రజాక్షేమం ఎరిగినవాడని అంటారు. రోమన్ల టోపీల మీద ఉండే కైసరు ప్రతిమ విషయంలో యూదులకు, పిలాతుకు ఒకసారి వాదం వచ్చింది. ఎలాంటి ప్రతిమ పరిశుద్ధ పట్టణంలో కనబడకూడదని యూదులు వాదించారు. చివరకు కైసరుకు ఆ విషయాన్ని నేరుగా విన్నవించుకొని యెరూషలేములో ఉన్నంత వరకు రోమా సైనికులు వాటిని ధరించకూడదన్న తీర్పును పొందారు. మరొక సందర్భంలో యెరూషలేములో నీటి కొరతను నివారించడానికి ఓ మంచి కాలువ నిర్మిద్దామని పథకం వేశాడు. అంత పెద్ద పనికి ధనం ఎలా సమకూర్చాలి? దేవాలయం నుండి తీసుకోవాలనుకున్నాడు. యూదులు నిరాకరించారు. నీటి సరఫరా మెరుగుపడితే వాళ్ళకు కూడా ప్రయోజనం ఉన్నప్పటికీ యూదు నాయకులు ఒప్పుకోలేదు. వీధులలో ప్రదర్శనలు జరిగాయి. తిరుగుబాటు జరిగింది. అప్పుడు పిలాతు సైనికులను మారువేషాల్లో జనంలో కలిసిపోయేలా చేసి, అంతా ఆదమరచి ఉన్న సమయంలో దేవాలయ ప్రాంతంలోనే హఠాత్తుగా ఊచకోత కోయించాడు. యెరూషలేము వీధుల్లో రక్తం ఏరులై పారింది. యేసుక్రీస్తు ప్రభువుకు తీర్పు తీర్చుటకు పిలాతు వద్దకు తీసుకెళ్ళారు. ఆ దినాల్లో యూదుల పెద్దలకు ఎవ్వరికీ మరణ శిక్ష విధించే అధికారం లేదు. యేసుకు మరణశిక్ష విధించబడాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా పిలాతు ముందుకు తీసుకొచ్చారు. తనకెదురైన బాధ్యత నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. మొదటిసారి ‘మీరతనిని తీసుకొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడి’ అన్నాడు. రెండవసారి హేరోదు దగ్గరికి పంపివేయాలని చూశాడు. యేసును శిక్షించి ఆ దీన స్వరూపాన్ని యూదులకు చూపించి వాళ్ళ జాలిని సానుభూతిని రేకెత్తించి తప్పించుకోవాలనుకున్నాడు. బరబ్బను తీసుకొని వచ్చి వీరిద్దరిలో ఒకరిని ఎన్నుకోమనడం ద్వారా తప్పించుకోవాలని చూశాడు. చివరికి నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ‘ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి’ అని చెప్పాడు. యేసుక్రీస్తునకు అన్యాయపు తీర్పు తీర్చబడినది. సిలువను భుజమున మోపి యెరూషలేము వీధుల్లో ఆయన్ను నడిపించి, చివరకు కల్వరి అనే ప్రాంతానికి తీసుకొని వచ్చి, ఆయనకు సిలువ మరణాన్ని విధించారు. ప్రస్తుత దినాల్లో యెరూషలేము సందర్శించే ప్రతి ఒక్కరూ వయా డొలోరొసా అని పిలువబడే సిలువ మార్గంలో నడుస్తారు. అందులో 14 విశిష్ట ప్రాంతాలుంటాయి. మొట్టమొదటిగా చంద్రుని మీద కాలుమోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ యెరూషలేమును దర్శించినప్పుడు క్రీస్తు సిలువబాటలో నడిచాడు. ఒకచోట కూర్చొని బిగ్గరగా ఏడ్చి ఉద్వేగానికి లోనయ్యాడు. ఎందుకు అంతగా చలించిపోయారని ఎవరో అడిగితే నీల్ ఇలా సమాధానమిచ్చాడు. ‘నేను లక్షల మైళ్ళు ప్రయాణం చేసి చంద్రునిపై కాలు మోపినప్పుడు కూడా ఇంతటి ఉద్వేగానికి లోనవలేదు గాని క్రీస్తు ప్రభువు సంచరించిన ప్రాంతాలను నా పాదాలు తాకినప్పుడు కృతజ్ఞతతో నా హృదయం నిండిపోయింది.’ఆ పరమాత్ముడైన ప్రభువు అంతటి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా సిలువపై పలికిన సుమధుర స్వరాలు మానవాళి యెడల ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యతను తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవిత చివరి క్షణంలో పలికే మాటలు చాల ముఖ్యమైనవి. యేసుక్రీస్తు తన చివరి క్షణాలలో కూడా మానవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.యేసు ‘‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. గనుక వీరిని క్షమించుము’’ అని చెప్పెను (లూకా 23:34).యేసు సిలువలో పలికిన మాట క్షమాపణ గొప్పతనాన్ని తెలియచేస్తుంది. వాస్తవానికి క్రీస్తును హింసిస్తున్న వారంతా క్షమార్హతను కోల్పోయినప్పటికీ, వారిని మనసారా క్షమించడానికి ఇష్టపడ్డారు. పిల్లలను క్షమించలేని తల్లిదండ్రులు, పెద్దలను క్షమించలేని బిడ్డలు ఉన్న ఈ ప్రపంచంలో క్షమాపణ ఔన్నత్యాన్ని క్రీస్తు తెలియచేశారు. పగలను ప్రతీకారేచ్ఛలను మనసులో ఉంచుకున్నంత కాలం మనిషి సంతోషంగా ఉండలేడని వైద్యులు చెబుతున్న సత్యం. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచించే ఈ రోజుల్లో తెలిసి తెలిసి ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేస్తున్నారని తెలిసిన గొప్ప క్షమాగుణం ఆయనది. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు (లూకా 23:43)’యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలోనే మరో ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. వారు నేరస్థులు. ఒకతని పేరు గెట్సస్, మరొక వ్యక్తి పేరు డిస్మస్. వారి పాపం పండిన రోజు రానే వచ్చింది. ఆ సమయంలో మొదటివాడు తన తప్పుకు తాను పశ్చాత్తాప పడకుండా ఆయనను దూషిస్తూ ‘నీవు క్రీస్తువు గదా! నిన్ను నీవు రక్షించుకొని, నన్ను కూడా రక్షించు’మని హేళనగా మాట్లాడాడు. నేరానికి తగిన శిక్షను అనుభవిస్తున్నా పశ్చాత్తాపం అతనిలో లేదు. రెండోవాడు మాత్రం అతనిని వారించి, యేసువైపు చూచి ‘నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’మని హృదయపూర్వకంగా ప్రభువు శరణు కోరినపుడు ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు’ అని దివ్య వాగ్దానం చేశారు. పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్ష నుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళులేని రాజ్యం. ‘యేసుక్రీస్తు తన తల్లిని ఇదిగో నీ కుమారుడు అనియు, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికెను’ – (యోహాను 19:26,27). యేసుక్రీస్తు తనను నమ్ముకున్న వారిని ఏనాడూ ఒంటరిగా విడువడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంతవరకు తల్లి ఆలనా పాలనా కుమారునిగా చూసుకున్న ప్రభువు తన తర్వాత తన బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. అంతటి మరణ వేదనలో సైతం తన తల్లి గురించి ఆలోచించిన గొప్ప మనసు ఆయనది. ‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను’– (మత్తయి 27:45).ఈ మాట అరమేయిక్ భాషలో ప్రభువు మాట్లాడెను. ఆనాటి దినాలలో యూదులు హెబ్రీ భాషతో పాటుగా అరమేయిక్ భాషను వ్యవహారిక భాషగా మాట్లాడేవారు. ప్రభువు పలికిన ఈ మాటకు ‘నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి’ అని అర్థం. మానవుని పాపములను తొలగించుటకు, శిక్షను భరించుటకు ఇల వచ్చిన ప్రభువు చేతిని తండ్రి వదిలివేసే పరిస్థితి ఎందుకొచ్చింది? పరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు. అయినా ఎందుకు తండ్రి నుండి ఎడబాటు పొందాల్సి వచ్చింది? ఆయన మన పాపములను ఆయన మీద మోసుకుంటూ పాపముగా మారినందుకే కదా! పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. ‘దప్పిగొనుచున్నాను’ (యోహాను 19:28)యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవునిగా అందరికీ ఉండే అనుభవాలను అనుభవించాడు. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుత కార్యాలను చేశాడు. సంపూర్ణ దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవునిగా మారి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలని ఇష్టపడ్డాడు. జీవజలమును కానుకగా ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు దాహంలో అంత మండుటెండలో దప్పిక గొనడం ఎంత బాధాకరం! ఆ దప్పిక శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. మానవుల రక్షణ విమోచన ఆ దప్పిక. నీవు రక్షణ పొందిన రోజు మాత్రమే ఆయన దప్పిక తీరుతుంది. ‘సమాప్తమైనది’ (యోహాను 19:28).ఇది విజయానందంతో వేసే జయకేక. ఒక వ్యక్తి తాను తలపెట్టిన కార్యమునంతా ముగించి, సాధించాక వేసే కేక. మరింతకు ఆయన ఏమి సాధించారు? అంత బిగ్గరగా విజయానంద కేక వేసేంత ఏమి జరిగింది? యేసుక్రీస్తు ఈ లోకానికి అనుకోకుండానో, ఏ కారణం లేకుండానో ఆకస్మికంగా రాలేదు. ఒక పరమార్థం కలిగి తండ్రి పని నెరవేర్చుటకు ఆయన వచ్చెను. అంతవరకు ధర్మశాస్త్రమనే కాడి కింద మగ్గిపోతున్న వారిని విడిపించుటకు, దానిని నెరవేర్చుటకు వచ్చెను. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కాని, దానిని నెరవేర్చి మనుషులకున్న తెరను తొలగించాడు. ఆయనకు అప్పగించబడిన దైవచిత్తమును సిలువ మరణం ద్వారా నెరవేర్చి సంతోష కేక వేసారు. ‘తండ్రీ, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంటున్నాను’– (లూకా 23:46).ఆయన సిలువలో ఎంతో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ, మానసికంగాను, శారీరకంగాను బాధను భరిస్తూ సిలువలో సర్వజనులను ఉద్దేశించి పలికిన చివరి మాట ‘అప్పగించుకొంటున్నాను’ మనలో ఉన్న ఆత్మ మనం చనిపోయాక దేవునికి అప్పగించుకోవాలి. ఈ లోకంలో ఎలా బతికినా, చనిపోయాక దేవుడు అంగీకరించే యోగ్యమైన రీతిలో మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనిషి అంటే కేవలం పైకి కనబడే దేహం మాత్రమేకాదు, లోపల ఆత్మ కూడా ఉంది అని గ్రహించాలి. చనిపోయాక మట్టి నుండి తీయబడిన దేహం తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించిన దానము. గనుక తిరిగి ఆయనకు అప్పగించాలి.యేసు సిలువలో చనిపోయిన తరువాత అరిమతయి యోసేపు అనే ధనికుడు యూదుల న్యాయసభ సభ్యుడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహమును ఇమ్మని అడుగుతాడు. పిలాతు అంగీకారాన్ని తెలిపిన పిమ్మట యేసు దేహాన్ని సిద్ధపరచి తన సమాధిలో ఉంచాడు. ఆ సమయంలో ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము కూడా సహకరిస్తాడు. దుఃఖ వదనాలతో బహుశా ప్రతి ఒక్కరూ ఆ సాయంత్రం తమ గృహాలకు వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో యేసును అపరిమితంగా ద్వేషించిన యూదా పెద్దలకు ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తాను మరణాన్ని జయించి తిరిగి లేస్తానని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని పిలాతు దగ్గరకు వెళ్ళి సమాధిని కాపలా కాయుటకు కావలివారు కావాలని అడిగారు. వారు రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు. ఆదివారం ఉదయం కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చేసరికే యేసుక్రీస్తు మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు వచ్చేశారు. మరణపు ముల్లు విరిచివేయబడింది. మరణపు మెడలు వంచబడ్డాయి. తరతరాలుగా మనిషిని బంధించి యుంచిన మరణం నిర్వీర్యమై పోయింది. ఆ తెరువబడిన సమాధి నుండి వారికి దూత ద్వారా వచ్చిన సందేశం ఇది. ‘మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.’ ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలోని యేసుక్రీస్తు ఖాళీ సమాధికి వెళ్తే ఇవే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. క్రీస్తు పునరుత్థానం ప్రవక్తల ద్వారా ముందే ప్రవచించబడింది. తాను మరణించక మునుపు అనేకసార్లు తన పునరుత్థానం గురించి క్రీస్తు తెలియచేశాడు. పునరుత్థానుడైన క్రీస్తు తన దర్శన భాగ్యాన్ని అనేకులకు ఇచ్చాడు. ఐదువందల మందికి పైగా సజీవుడైన క్రీస్తును కన్నులారా చూశారు. ఆయన మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. ఏళ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకాలతో ఆనందించే అవకాశం కలిగింది. రోగం మీద, వ్యాధి బాధల మీద సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కలిగించింది. ఇంతవరకు మానవాళి మీద çపంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది.సమాధికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని, ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. నిరాశా నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశాకిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైపోయింది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇవి మానవ హృదయాలకు సంబంధించినది తప్ప భౌతికానుభవాలకు చెందినవి కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ ఇట్టే అవగతమవుతుంది. లోక వినాశానానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది.యేసుక్రీస్తు పునరుత్థానం వలన మానవులకు చేకూరిన ప్రయోజనాలు ఇవి. సమాధానం: యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి గదిలో ఉన్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమై ప్రభువు పలికిన వాగ్దాన వచనం ‘సమాధానం కలుగును గాక!’ పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానమును అనుభవిస్తారు. దైవిక సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. భయపడకుడి: పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా పొందుకునే మరొక వాగ్దానం ‘భయపడకుడి’. లోకమంతా ఎన్నో భయాలతో నిండినది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయం తప్పక స్వంతం అవుతుంది.నిరీక్షణ: యేసుక్రీస్తు మొదటగా లోక పాపములను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగి లేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్ర జీవితాన్ని, ఆయన యందలి విశ్వాసమును కొనసాగించువారికి నిత్యజీవమును అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై యుండని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశపడతారు కాని, ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు నిరీక్షణ ఎన్నడు అవమానమునకు, సిగ్గుకు కారణము కాదు. జర్మనీలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని, సగటు మనిషి బానిసగానే ఉన్నాడని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వల్ల రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురుతిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే!ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశా నిస్పృహలతో తన ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టమనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలువబడిరది. జర్మనీలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే నిరాశలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిట’ని ప్రశ్నించాడు. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. ‘నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా!’ లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏ విషయానికీ బెదిరిపోడు. తుది శ్వాస వరకు నా భర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే, లూథర్లో ఉన్న భయం పటాపంచలయ్యింది. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికి పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశాకిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. -
హనుమద్వ్రత మహిమ
కౌరవులతో జరిగిన మాయద్యూతంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలయ్యారు. ద్రౌపదీ సమేతంగా పాండు నందనులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అడవులలో సంచరిస్తూ నానా ఇక్కట్లు పడసాగారు. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు శిష్యసమేతంగా పాండవులనే అనుసరిస్తూ అరణ్యమార్గం పట్టాడు. అరణ్యవాస కాలంలో ధౌమ్యుడు పాండునందనులకు అనేక ధర్మశాస్త్రములు, పురాణాలను చెబుతూ ఉండేవాడు. వారి చేత సమయానుకూలంగా పూజ పురస్కారాదులు చేయిస్తూ ఉండేవాడు.కొన్నాళ్లకు పాండవులు ద్వైతవనానికి చేరుకుని, అక్కడ మకాం వేశారు. పాండవులను చూడటానికి ఒకనాడు వ్యాస మహర్షి ద్వైత వనానికి చేరుకున్నాడు. ధర్మరాజు, ఆయన నలుగురు సోదరులు, ధౌమ్యుడు, ఆయన శిష్యులు ఎదురేగి వ్యాస మహర్షిని సగౌరవంగా స్వాగతించారు. ధర్మరాజు ఆయనకు అర్ఘ్య పాద్యాలను సమర్పించి, అతిథి సత్కారాలు చేశాడు. పాండవుల యోగక్షేమాలను వ్యాసుడు పేరు పేరునా అడిగి తెలుసుకున్నాడు. ద్రౌపది పాతివ్రత్యాన్ని ప్రశంసించాడు.‘మహర్షీ! ఎన్నడూ ధర్మం తప్పని మాకు ఈ అరణ్యవాస క్లేశమెందుకు సంభవించింది? తెలిసి గాని, తెలియక గాని మా వల్ల జరిగిన అపరాధం ఏదైనా ఉందా? తెలిసీ తెలియక అపరాధం చేసిన ఫలితంగానే ఈ ఇడుములు సంభవించినట్లయితే, దానికి పరిహారమేదైనా ఉందా?’ అని ధర్మరాజు సవినయంగా వ్యాసుడిని అడిగాడు.‘నాయనా, యుధిష్ఠిరా! నీ సోదరుడు అర్జునుడు తెలిసీ తెలియనితనంతో ఒకసారి హనుమంతుడి పట్ల అపచారం చేశాడు. దాని ఫలితంగానే మీకు ఈ ఇక్కట్లన్నీ వచ్చి పడ్డాయి. రాజసూయం విజయవంతంగా చేసిన ఆనందంలో మీరంతా ఇంద్రప్రస్థంలో తులతూగుతూ ఉన్న కాలంలో ద్రౌపది హనుమద్వ్రతాన్ని చేయాలని సంకల్పించుకుంది. సంకల్పానికి చిహ్నంగా పవిత్ర తోరాన్ని ధరించింది. అర్జునుడు ఆమె చేతికి ఉన్న తోరాన్ని గమనించాడు. అదేమిటని అడిగాడు. హనుమద్వ్రతం చేసే సంకల్పంతో కట్టుకున్న పవిత్ర తోరమని ద్రౌపది చెప్పింది. ఈ వ్రతం చేయమని తనకు శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పింది. తన రథం మీదనున్న జెండాపై ఉండేవాడు ఒకరు, తన రథాన్ని తోలేవాడు ఇంకొకరు. వీరిద్దరూ తనకంటే అధికులా అనే అహంకారంతో అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న ఆ తోరాన్ని తీసేయించాడు. పూజలు వ్రతాలు దేవతలకు చేయాలి గాని, ఒక వానరానికి చేయడమా అని ఈసడించాడు. ద్రౌపది విలపిస్తూ తోరాన్ని తీసేసింది. ఫలితంగా తాను సంకల్పించిన వ్రతాన్ని ఆమె చేయలేకపోయింది. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు చేయవలసిన పవిత్ర వ్రతం అది. ద్రౌపదికి వ్రతభంగం జరిగిన కారణంగానే మీకు ఇక్కట్లు మొదలయ్యాయి. పదమూడేళ్లు మీకు ఈ కష్టాలు తప్పవు. ఆ తర్వాతనైనా సకల శుభాలు జరగాలంటే, ఈ వనవాసకాలంలోనే హనుమద్వ్రతం చేయడం మంచిది’ అని చెప్పాడు వ్యాసుడు.అక్కడే ఉన్న ద్రౌపది తనకు వ్రతభంగం కలిగిన మాట నిజమేనని చెప్పింది. అర్జునుడు తానే ఆమె చేతికి ఉన్న తోరాన్ని తీసివేయించానని పశ్చాత్తాపంతో చెప్పాడు.‘సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన వ్రతాన్ని ఇప్పటికైనా ఆచరించడమే మీకు శ్రేయస్కరం’ హితవు చెప్పాడు వ్యాసుడు.‘వ్రత విధానం ఏమిటో సెలవివ్వండి మహర్షీ!’ అని ప్రార్థించాడు ధర్మరాజు.‘మార్గశిర శుక్ల త్రయోదశి రోజున హనుమంతుడి విగ్రహాన్ని గాని, చిత్రపటాన్ని గాని ప్రతిష్ఠించి పూజించాలి. హనుమంతుడి శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపా కలశంలోకి ఆవాహన చేసి, కలశ స్థాపన చేయాలి. వ్రతానికి ఉపక్రమించే ముందు, వ్రత సంకల్పాన్ని చెప్పుకుని, వ్రతాన్ని ఆచరించేవారు పవిత్ర తోరాన్ని ధరించాలి. పుష్పాక్షతలతో వ్రతపూజ చేయాలి. హనుమంతుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. వ్రతపూజ తర్వాత హనుమత్ కథల శ్రవణం చేయాలి. ఆ తర్వాత హనుమత్ ప్రసాదాన్ని ఆరగించాలి. భక్తిశ్రద్ధలతో ఈ విధంగా పదమూడు సంవత్సరాలు హనుమంతుడిని ఆరాధిస్తే, సంపూర్ణంగా హనుమంతుడి అనుగ్రహం లభించి, ఆపదలు, గ్రహబాధలు, రోగపీడలు, శత్రుబాధలు తొలగుతాయి. సకల సంపదలు, సుఖశాంతులు దక్కుతాయి’ అని వివరించాడు వ్యాసుడు. అంతేకాకుండా, హనుమంతుడి మహిమను తెలిపే కథలను ఆయన పాండవులకు చెప్పాడు. వనవాస కాలంలో సాక్షాత్తూ శ్రీరాముడు సుగ్రీవాదులతో కలసి పంపాతీరాన హనుమత్ వ్రతాన్ని ఆచరించాడని, ఆ తర్వాత లంకపై వానర సేనతో కలసి దండెత్తి, రావణ సంహారం చేయగలిగాడని చెప్పాడు.ద్వైతవనంలో పాండవులతో కొన్నాళ్లు గడిపి వ్యాసుడు తన దారిన తాను వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు మార్గశిర మాసం వచ్చింది. వ్యాసుడు చెప్పినట్లుగానే ద్రౌపదీ సమేతంగా పాండవులు ధౌమ్యుడి ఆధ్వర్యంలో హనుమత్ వ్రతాన్ని ఆచరించారు. నియమం తప్పకుండా పదమూడేళ్లూ పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి సకల శుభాలు కలిగాయి. అర్జునుడి జెండాపై పరివేష్ఠితుడైన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తుదముట్టడంతో పాండవులకు రాజ్యం దక్కింది. ∙సాంఖ్యాయన -
యువ కథ: సింహాసనం
‘లైట్స్.. కెమెరా.. యాక్షన్!’ అన్నాడు డైరెక్టర్ బాలరాజ్ వర్మ. ట్రైన్ సెట్లో హీరోయిన్ సనుష దాస్ను చుట్టుముట్టిన రౌడీల బారి నుంచి హీరో నితీష్ కాపాడే సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. ఒకే షాట్లో తీయాల్సిన కీలకమైన సన్నివేశం కావటంతో సినిమా యూనిట్ మొత్తం చాలా ఏకాగ్రతతో ఎవరి పని వారు చేస్తున్నారు. ఇంతలో గేదెల అరుపులకు షాట్ ఫెయిల్ అయింది. ఆ షాట్ బాగా రావటం కోసం చాలా ప్రాక్టీస్ చేసిన నితీష్కు పట్టరాని కోపం వచ్చింది. అ కోపంలో నితీష్ ‘ఎవడ్రా! ఆ గేదెలను ఇక్కడికి తీసుకువచ్చింది?’ అంటూ గట్టిగా అరిచాడు.‘గేదెల దొడ్లో గేదెలు కాక గాడిదలు ఉంటాయా? అడ్డ గాడిద!’ అని అరుస్తూ కుడితి నీళ్ళు నితీష్ మొఖం మీద కొట్టి నిద్రలేపాడు నూకరాజు.‘మంచి కల పాడు చేశావ్ కదా నాన్నా! నా జీవితంలో నిద్రలో వచ్చే కలలు కూడా పూర్తి అవ్వవు. ఛీ!’ అంటూ లేచాడు నితీష్,‘ఏడిసావులే గాని గేదెలను తోలుకుపోయి, అందరికీ పాలు పోసి రా! లేట్ అయిందని నాకు మాట వస్తే నిన్ను బిందెట్టుకు కొడతా’ అన్నాడు నూకరాజు.బద్ధకంగా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు నితీష్.సైకిల్ స్టాండ్ తీసి, ప్రతి రోజులాగానే గేదెలను తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి పాలు పోశాక మేనమామ సుంకరరాజు ఇంటికి వచ్చాడు. ‘ఏరా! ఈ మధ్య కనపడటం లేదు. బొత్తిగా ఇంటికి రావటం మానేశావ్?’ అన్నాడు సుంకరరాజు. ‘అదేంలేదు.. కొత్త ఇల్లు కడుతున్నాము కదా! అక్కడే దగ్గర ఉండి చూసుకుంటున్నా మావయ్య!’ అన్నాడు నితీష్. ‘దానితో పాటు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదరా! యాక్టర్, ట్రాక్టర్ అంటూ ఖాళీగా ఎన్నాళ్లు ఉంటావ్?’ అన్నాడు సుంకరరాజు. ఆ ఉచిత సలహా విన్న నితీష్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ‘అన్నట్టు చెప్పటం మర్చిపోయా. నిన్ననే స్నేహకి ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. హైదరాబాద్లో ఉంటారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకి లక్షన్నర జీతం. రెండు నెలలలో పెళ్లి అనుకుంటున్నాము. నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి’ అన్నాడు సుంకరరాజు. ఇంతలో నితీష్ మరదలు స్నేహ ఇంటి డాబాపై నుంచుని సిగ్గు పడుతూ, సెల్ ఫోన్లో మాట్లాడటం చూశాడు నితీష్. ఆమె ఎవరితో మాట్లాడుతోందో అర్ధం చేసుకున్న నితీష్, ‘సరే మావయ్య! ఉంటాను’ అని వెనుదిరిగాడు.పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన నితీష్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. నెమ్మదిగా అద్దం ముందుకు వచ్చి నిలబడి తనని తాను ఒక నిమిషం పాటు చూసుకుంటూ ఉండిపోయాడు. నితీష్ కళ్ళు ఎర్రబడ్డాయి. కుడి చేతి పిడికిలి బిగుసుకుంది. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది ఆ ఒక్క నిమిషం. తనలో పీకల వరకు నిండిపోయిన బాధని, కోపాన్ని, నిస్సహాయతను దిగమింగుకున్నాడు. రోజూలాగే తనకు ఇష్టమైన నటులు ఎన్టీఆర్, విక్రమ్ నటించిన సినిమాలు అన్నీ అదే పనిగా చూసి, వాటినే తనదైన శైలిలో సాధన చేయటంతో ఎప్పటిలాగే సమయం తెలియకుండానే గడిచిపోయింది.సాయంత్రం సుమారు ఐదు గంటలకి స్నేహితుడు జాన్బాబుతో కలిసి వీధి చివర టీ షాపుకి వచ్చి కూర్చున్నాడు. నితీష్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చోడం గమనించిన జాన్బాబు మళ్ళీ ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. ‘ఇదిగోరా టీ..’ అని టీ గ్లాసు చేతికి అందించాడు. ఇంతలో గట్టునాని, అతని స్నేహితులు వచ్చి ఎదురు బెంచీ మీద కూర్చున్నారు. నానికి, నితీష్కు స్కూల్లో చదువుకునే రోజుల నుంచి వైరం ఉంది. అది తెలిసిన జాన్ అక్కడి నుంచి త్వరగా టీ తాగి నితీష్ను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు.కానీ నివురుగప్పిన నిప్పులా లోపల రగిలిపోతూ బయటకి ప్రశాంతంగా కనిపిస్తున్న నితీష్తో ‘ఏరా! ఆ సర్పంచ్ బావమరిది సినిమాలో వేషం ఇస్తా అని రెండు లక్షలు దొబ్బేశాడంటగా?’ అన్నాడు నాని. చేతిలోని టీ గ్లాసుని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు నితీష్. ‘అయినా నీ మొఖానికి సినిమాలు ఎందుకురా? మా ఫెర్టిలైజర్స్ కంపెనీ యాడ్కి కూడా పనికిరావు’ అన్నాడు నాని వెటకారంగా. చుట్టూ ఉన్న అందరూ నవ్వడం చూసి జాన్, నితీష్ భుజం మీద చేయి వేసి ‘పద వెళ్దాం’ అన్నాడు. నితీష్ ఇంకా ఆ టీ గ్లాస్నే చూస్తూ అలా ఉండిపోయాడు.‘అవును స్నేహ నిన్ను వదిలేసిందంటగా! మంచిపని చేసిందిరా బాబు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే అడుక్కు తినాలి’ అన్నాడు నాని. నితీష్ చేయి బిగుసుకుంది. చేతిలో ఉన్న టీ నాని మొఖం మీద కొట్టి, రెప్పపాటులో నాని చేయి వెనక్కి వంచి పక్కనే ఉన్న నారింజ మిఠాయి సీసాతో తల పగలగొట్టాడు. వెంటనే నాని స్నేహితులు నితీష్, జాన్ మీద పడి, పిడిగుద్దులు కురిపించారు. నితీష్ దొరికినవాడినిదొరికినట్టు కొడుతూ పక్కనే ఉన్న పంట కాలువలోకి తోసి జాన్తో కలిసి ఆరోజుకి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.రాత్రికి ఇంటికి చేరుకున్న నితీష్, కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న నూకరాజు, నితీష్ చేతి మీద మొఖం మీద గాయాలు చూశాడు. ‘మళ్ళీ దెబ్బలు తిన్నావా?’ అన్నాడు నూకరాజు అనుమానంగా చూస్తూ.‘లేదు ..ఈసారి వాడి బుర్ర పగలగొట్టా’ నసిగాడు నితీష్ కోపంగా.‘అబ్బో! చాలా గొప్ప పని చేశావ్. థూ.. ఏం బతుకురా నీది? ముడ్డి కిందకి పాతికేళ్లు వచ్చినా, వయసు మళ్లిన నాన్న గురించి గాని, మంచం పట్టిన అమ్మ గురించి గాని ఏరోజైనా ఆలోచించావా? అదిగో బయట దొడ్డిలో గేదెల దగ్గర పడుకుంటావు కదా! అవి కనీసం పెట్టిన తిండికి తిరిగి పాలైనా ఇస్తాయి. నీ కన్నా అవే నయం. ‘అమ్మకి ఏమయింది?’ అని చిన్నప్పటి నుంచి అడుగుతున్నావు కదరా. ఇప్పుడు విను.. నీ చిన్నప్పుడు నువ్వు బావిలో పడబోతుండగా నిన్ను కాపాడి తలకి దెబ్బ తగిలించుకుని మంచం పట్టింది. ఆరోజు నిన్ను కాపాడకపోయినా బాగుండు’ అని కోపంగా తింటున్న కంచంలో చేయి కడుక్కుని లేచి వెళ్లిపోయాడు నూకరాజు.మరుసటి రోజు ఉదయం నూకరాజు లేచి చూసేసరికి, నితీష్ ఇంట్లో ఎక్కడా కనపడలేదు. ఊరంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరికి జాన్ ఫోన్కి నితీష్ నుంచి మెసేజ్ వచ్చింది. ‘నేను హైదరాబాద్ వెళుతున్నాను. నన్ను వెతుక్కుంటూ ఎవరూ రాకండి. సినిమా హీరో అయ్యాకనే మళ్ళీ అనకాపల్లిలో అడుగు పెడతా. లేకపోతే నా శవం కూడా ఎవరికీ దొరకదని నాన్నకి చెప్పు’ అని ఉంది.నితీష్ తన సైకిల్ అమ్మేయగా వచ్చిన మూడువేల రూపాయిలు, రెండే జతల బట్టలతో మర్నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. ఫిల్మ్ నగర్ దగ్గరలో జూనియర్ ఆర్టిస్టులు ఉండే ఒక అతి చవక హాస్టల్లో దిగాడు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. నితీష్ హాజరు కాని స్టూడియో లేదు. ముట్టుకోని డైరెక్టర్ ఇంటి గేట్ లేదు. ఎంత నిరాశ ఎదురు వచ్చినా అది నితీష్ ముఖంలో కనపడలేదు. ఆరోజు అర్జున స్టూడియోస్లో డైరెక్టర్ రాజకుమార్ పూర్తిగా కొత్త నటీ నటులతో ఒక సినిమా కోసం ఆడిషన్ చేయబోతున్నాడని తెలిసింది నితీష్కి. తన వివరాలు, నటించిన వీడియోలు, ఫొటోలు పంపించాడు. ఈసారి నిరాశ ఎదురవలేదు.‘వచ్చే ఆదివారం మీరు తప్పక హాజరు కాగలరు’ అని సమాధానం వచ్చింది. ఈ అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు.చివరికి ఆడిషన్కు హాజరయ్యి రంగస్థలం మీద అడుగు పెట్టాడు. అందరూ అనుకుంటున్నట్టు డైరెక్టర్ ఆ క్యారెక్టర్కి రాసిన డైలాగులు చూసి తనదైన శైలిలో చెప్పమని అడగలేదు. ‘ఇప్పటిదాకా నీ జీవితాన్ని, కొన్ని మరచిపోలేని సంగతులని నీ శైలిలో చెప్పు’ అన్నాడు డైరెక్టర్. అలా చేయటం నితీష్కి కొత్త అయినప్పటికీ రెండు నిమిషాలు ఆగి గట్టిగా శ్వాస తీసుకుని నోరు విప్పాడు.‘నాకు ఊహ తెలిసినప్పటి నుండి నన్ను కన్న తల్లి ఎందుకు మంచం పట్టిందో నిన్నటి వరకు తెలుసుకోలేని మూర్ఖుడిని. వయసు మళ్లిన, అనారోగ్యంతో ఉన్న తండ్రిని ఆనందంగా చూసుకోకపోగా, నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుని నా వయసు ఉన్న మిగతా అబ్బాయిల్లాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, నా తరఫు నుంచి ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా, పందికొక్కులా మొత్తం గుల్ల చేస్తున్న నీచమైన కొడుకుని నేను. ప్రాణంగా ప్రేమించి తనతో ఒక జీవితాన్ని ఊహించుకున్న అమ్మాయి, డబ్బు పరపతి లేకపోతే ముఖం కూడా చూడదని గ్రహించలేకపోయిన మూర్ఖపు ప్రేమికుడిని. కాని, ఒక్కటి మాత్రం బలంగా చెప్పగలను. ఎదురుదెబ్బ ఎటువైపు నుంచి అయినా రానీ, ఎలాగైనా రానీ వాటిని వంచి ఈ సినిమా అనే సింహాసనం మీద ఎక్కి కూర్చుంటా!’ అన్నాడు నితీష్ ఉద్వేగంగా.నితీష్ ప్రదర్శన చూసి డైరెక్టర్తో సహా మిగతా సభ్యులు కూడా చలించిపోయారు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు. మరుసటి రోజు ఉదయం అసిస్టెంట్ డైరెక్టర్ బాబీ నుంచి కాల్ కోసం చూస్తూ కూర్చున్నాడు.ఏకంగా డైరెక్టర్ రాజకుమార్ నుంచే కాల్ రావటంతో నితీష్ రెట్టించిన ఉత్సాహంతో ‘హలో! సర్!’ అన్నాడు. ‘గుడ్ మార్నింగ్ నితీష్! మనం ఈ సినిమా చేస్తున్నాం.. ప్రొడ్యూసర్కి నీ బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చింది. నీ ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మేము అనుకుంటున్న విలియమ్ పాత్రకి వంద శాతం కుదురుతుంది’ అన్నాడు డైరెక్టర్ రాజకుమార్.‘కానీ సర్! నేను ఆడిషన్ ఇచ్చింది హీరో క్యారెక్టర్కి కదా సర్?’ అన్నాడు నితీష్.‘హహ.. నువ్వు స్క్రిప్ట్ చదివాక విలియమ్ క్యారెక్టరే చేస్తాను అని అడుగుతావ్’ అన్నాడు రాజకుమార్.‘సరే సర్!’ అన్నాడు నితీష్ ‘నీకు ఆకామడేషన్, కారు ప్రొడ్యూసర్గారు అరేంజ్ చేశారు. ఈవెనింగ్ షిఫ్ట్ అయిపో. నెక్స్›్టవీక్ నుంచి షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు’ అన్నాడు రాజకుమార్.‘సరే సర్! థాంక్ యు సో మచ్’ అన్నాడు నితీష్ ఆనందంగా. అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. వెంటనే నితీష్ వాళ్ళ నాన్న నూకరాజుకు ఫోన్ చేసి ‘అమ్మని తీసుకు వచ్చేయమని జాన్కి చెప్పు‘ అన్నాడు. ‘పెద్ద నటుడిని అయినప్పుడే వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోయావుగా? అది పూర్తిచేసి తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళు’ అని కాల్ కట్ చేశాడు నూకరాజు. రెండు నిమిషాలు బాధ పడినా నితీష్ మళ్ళీ తన యాక్టింగ్ సాధన కొనసాగించాడు. ఆరోజు ఏప్రిల్ 2, అర్జున స్టూడియోస్లో రెగ్యులర్ షూట్ డే1. అదే రోజు స్నేహకి మరొకరితో అనకాపల్లిలో పెళ్లి కూడా. నితీష్ తన కారు నుంచి బయటకి రాగానే డ్రైవరు గొడుగు పట్టుకున్నాడు. మరో పక్క స్నేహని పెళ్లికి ముస్తాబు చేసి బాజా భజంత్రీలతో కళ్యాణమండపం వైపు తీసుకువెళుతున్నారు.. యాక్షన్ సీన్ చిత్రీకరణలో ఉంది. నితీష్ తన వైపు తరుముతూ వస్తున్న వ్యక్తిని తన చేతిలో ఉన్న చైన్తో మెడకు కట్టి ఐదో అంతస్తు నుంచి తోసి ఉరివేసి వేలాడతీసే సీన్. మరో పక్క స్నేహ పెళ్లి పీటల మీద తల వంచి తాళి కట్టించుకుంటోంది. నితీష్ ఆ రోజు షూటింగ్లో ఎంతగా నిమగ్నం అయ్యాడంటే స్నేహ పెళ్లి రోజు కూడా మర్చిపోయేంత. సంవత్సరం గడిచింది సినిమా విడుదలై రెండు రోజులు అయింది, ఏ టీవీ చానల్ చూసినా, సోషల్ మీడియా చానల్ చూసినా నితీష్ గురించి, నితీష్ నటన గురించే చర్చ. ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా ఐదు సినిమాలలో హీరోగా నటించేందుకు సంతకం చేశాడు. స్నేహ సీమంతం జరుగుతోంది. నితీష్ తండ్రి హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంటికి వచ్చే జనాల తాకిడి ఎక్కువ అయింది. ‘బహుశా అల్లుడుగారు ఎక్కువ మందిని పిలిచి ఉంటారు’ అనుకున్నాడు సుంకరరాజు. ‘ఎవరయ్యా రెండు సింహాసనాలు తెచ్చింది? ఇది సీమంతం. పెళ్లి కాదు. ఒకటి సరిపోతుంది .రెండోది తీసుకుపొండి’ అన్నాడు. సుంకరరాజు. చూస్తూ ఉండగానే సుంకరరాజు ఇల్లు ఉండే ప్రాంతం అంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో జనసంద్రం అయిపోయింది. అప్పటికి గాని అర్థంకాలేదు వాళ్ళు అందరూ సుంకర రాజు మేనల్లుడు హీరో నితీష్ని చూడటానికి వచ్చిన జనం అని.ఇంతలో ఒక వోల్వో కారు సుంకరరాజు ఇంటి ముందు ఆగింది. సూట్ వేసుకుని కారు దిగుతున్న నితీష్ని చూసి నూకరాజు, సుంకరరాజుల నోటి వెంట మాట రాలేదు. మేనల్లుడికి ఎదురెళ్లి దగ్గర ఉండి లోపలకి తీసుకు వస్తూ ‘నువ్వు వస్తావ్ అనుకోలేదు రా! చెప్పి ఉండాల్సింది కదరా!’ అన్నాడు.‘ఇలా వస్తా అని నేనూ అనుకోలేదు మావయ్య!’ అని నవ్వుతూ వెటకారంగా అన్నాడు నితీష్. ఆ మాటలకి ఎలా స్పందించాలో తెలియని సుంకరరాజు ఒక అర నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. జనంలో నుండి ఇంటి లోపలికి వచ్చిన నితీష్ స్నేహకి ఎదురుగా రెండో సింహాసనంలో కూర్చున్నాడు. అక్షింతలు వేస్తూ రెండు లక్షల రూపాయల చెక్ అందిస్తూ ‘పుట్టబోయే బిడ్డ అవసరాలకి ఉపయోగపడతాయి’ అన్నాడు నితీష్. అక్కడ నుండి నితీష్తో కలిసి వెళ్లిపోతున్న జాన్ గేట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి ‘అల్లుడుగారికి నెలకి లక్షన్నర అంటగా జీతం. మా వాడికి నెలకి కార్ పెట్రోల్కే రెండు లక్షలైపోతోంది. పెట్రోల్ రేట్ బాగా పెరిగిపోయింది’ అని చురక అంటించాడు.‘ఆడు నా మేనల్లుడు. ఆడెప్పుడూ నాకు అల్లుడే రా! ఆడంత గొప్పోడవుతాడని, ఏదోరోజు సింహాసనం మీద కూచుంటాడని నాకు ముందే తెలుసురా జాన్ బాబు! మా స్థాయి సరిపోదనే పిల్లని ఆడికివ్వలేదు’ అన్నాడు సుంకరరాజు తెలివిగా! తన తెలివికి తనే మురిసిపోతూ. -
ఈ వారం కథ:: సుందరరామయ్య@ 70
‘తాతగారూ!’ఆ పిలుపు విన్న సుందరరామయ్యకు వొళ్లు మండి వెనక్కి తిరిగి చూశాడు!సందేహం లేదు. పిలిచింది తననే. పిల్చిన శాల్తీ చిన్న పిల్లేంకాదు, సుమారు నలభై యేళ్ల ఆవిడే. ఆ పిలుపుకు మనసు కలుక్కుమన్న సుందరరామయ్య ఆమెకేసి గుర్రుగా చూశాడు. ఆమెకి తను తాతగారా? ఆవిడగారి వయసు తన కూతురు కంటే ఎక్కువే ఉంటుంది. తీరా తిరగబడి ఆవిడ వయసడిగి దులిపేద్దామనుకునేలోగా తిరిగి ఆమే నోరువిప్పింది. ‘తాతగారూ, ఒరిజనల్స్ తీసుకోవడం మర్చిపోయారు’ అంటూ! తాటాకు మంటలాంటి సుందరరామయ్య కోపం చటుక్కున చల్లారిపోయింది. జెరాక్స్ కాపీలు మాత్రం తీసుకొని ఒరిజనల్సే మర్చిపోయి, నెట్సెంటర్ నుంచి బయటకొస్తున్న సుందర రామయ్య నాలుక కరచుకొని వెనక్కువెళ్లి ఆవిడకు‘థాంక్స్’ చెప్పి మరీ అవి తీసుకున్నాడు.తనకిష్టం లేని పదం ‘తాతగారు’. తానంత ముసిలోడిలా కనిపిస్తున్నాడా? ఆంగ్లంలో అందరికీ అన్వయించే ‘అంకుల్’ అనే పదముందిగా? తనను అంకుల్ అనో, మాస్టారూ అనో, పోనీ తెలుగులోనే పిలవాలనుకుంటే ‘బాబాయి’అనో పిలవకుండా ఈ దిక్కుమాలిన పదాన్నే ఉపయోగించాలా? మనసు కించిత్ గాయపడగా షాపు మెట్టుదిగి తను పార్క్ చేసిన స్కూటర్ దగ్గరకొచ్చాడు.çస్కూటర్ ‘సెల్ఫ్స్టార్ట్’ కాక అవస్థలు పడుతూ నిట్టూరుస్తుండగా, నెట్సెంటర్కి వెళ్తున్న ఓ బట్టతల ఆసామీ ఆగి ‘మాష్టారూ, మెయిన్ స్టాండ్ వేసి ‘కిక్’ కొట్టండి అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ స్టాండ్ వెయ్యడానికి శక్తి చాలని సుందరరామయ్య ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడి ‘అలవాటు లేదు’ అంటూ సాయం చేయ్యమన్నట్టు చూశాడు. విషయం అర్థమైన ఆ మనిషి అవలీలగా మెయిన్ స్టాండ్ వేసి, స్కూటర్ స్టార్ట్ చేసి ఇచ్చాడు. ‘«థాంక్సండి’ అంటున్న సుందరరామయ్యను ‘అండి’ అనకండి గురువుగారూ, నేను మీ స్టూడెంట్నే, గుర్తుపట్టలేదా?’ అన్నాడు నవ్వుతూ. అంతటితో ఊరుకోకుండా! ‘మాష్టారూ, మీరు కింగ్లా వుండేవారు, ఇప్పుడు బాగా లొంగిపోయారు!’ అని కామెంట్ చేసి వెళ్ళడంతో అసలే నెట్ సెంటర్ నిర్వాహకురాలి పిలుపుతో కుంగిపోతున్న సుందరరామయ్యకు పుండుమీద కారం చల్లినట్టయింది. ‘తమ వయసు లోపాలు కప్పిపుచ్చుకోడానికి కొందరు ఇలాగే విమర్శలు, ఎదురుదాడి చేస్తుంటారు. తన శిష్యుణ్ణని చెప్పుకున్న ఆ మనిషికి నెత్తిమీద నాలుగు పుంజీలు వెంట్రుకలు కూడా లేవు. తను రంగేసున్నా నిక్షేపంలాంటి జుట్టు వుంది. అది చూసి అసూయపడి తన శరీర పటుత్వం గురించి వాగి వుండొచ్చు’ అని సరిపెట్టుకొని సుందరరామయ్య స్కూటరెక్కాడు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఇల్లు చేరిన సుందరరామయ్య మనసును ఎవరికీ చెప్పుకోలేని అశాంతి, అలజడి మెలిపెడుతున్నాయి. తనకిష్టం లేని వయసు ప్రసక్తి తెచ్చిన నెట్సెంటర్ నిర్వాహకురాలి మీద, తన శిష్యుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇటీవల ఇలాంటి ‘షాకు’లు రాళ్లలా ఒకదాని వెంట ఒకటి తగులుతుంటే మనసు చితికిపోతోంది. ఒక్కొక్కటిగా ఎదురవుతున్న చేదు అనుభవాలు గుర్తొచ్చి మనసు తట్టుకోలేకపోతోంది. ఆ మధ్య పూర్వవిద్యార్థులు తారసపడితే ‘మాష్టారూ మీలో మార్పులేదు. అప్పుడెలా వుండేవారో ఇప్పుడూ అలాగే వున్నారు’ అని పొగుడుతుంటే చొక్కా బిగువయ్యేది. అలాంటిది డెబ్బైయవ ఏటలో అడుగుపెట్టిన తర్వాత వయసును దాచుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎదురయిన వాళ్లు పలకరించి మరీ మనసును కష్టపెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయాలు అడక్కుండానే– ‘íపిడుగులా వుండేవారు మాష్టారు, బాగా పాడయిపోయారు. నడకలో తేడా వచ్చింది. చేతులు వణుకుతున్నాయి. మీరు రిటైరయి ఎన్నేళ్లయింది? ఏ సంవత్సరంలో రిటైరయ్యారు? అని వివరాల్లోకి వెళుతుంటే వాళ్ల దాడి నుంచి తప్పించుకోడానికి తల ప్రాణం తోకకొస్తోంది!వారం క్రితం గుమ్మం దగ్గర నిల్చుని వుండగా ఆ దారిన వెళ్తున్న ఓ అమ్మాయి ఆగి ‘‘తాతగారూ, అబద్ధాల సత్యవతిగారి ఇల్లెక్కడ?’’ అని అడిగింది. అంతే ఆ అమ్మాయి మీద ఒంటి కాలి మీద లేచి, ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’’ అని హెచ్చరించాడు. ఆ అమ్మాయి కంగారుపడుతూ, ‘‘అబద్ధాలనేది ఆవిణ్ణి కించపరిచేది కాదండి, ఇంటిపేరు’’ అని సమర్థించుకునేలోగా, ‘‘నువ్వింకా చిన్నకూచిననుకుంటున్నావా? పెళ్లయితే ఇద్దరు పిల్లలకు తల్లయేదానివి. నీకు నేను తాతలా కనిపిస్తున్నానా?’’ అని చిర్రుబుర్రులాడుతూ గొంతు పెంచాడు. దాంతో బిత్తరపోయిన ఆ అమ్మాయి, నలుగురూ చేరి గొడవయ్యేలోగా వెటకారంగా ‘సారీ తాతగారూ’ అంటూల్లగా అక్కణ్నుంచి జారుకుంది. అక్కడ మూగిన జనం తన వింత కోపానికి ముక్కున వేలే సుకున్నారు!పై సంఘటన జరిగిన రెండ్రోజులకే మార్కెట్ నుంచి వస్తుండగా టైరు రాయి మీదకెక్కి స్కూటర్ ‘స్కిడ్’ అయి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వున్న షాపుల వాళ్లు పరుగెత్తుకొని వచ్చి స్కూటర్నీ, తనను లేవదీశారు. స్కూటర్ తగిలించిన సంచిలోని కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోతే వాటిని జాగ్రత్తగా పోగుచేసి ఎత్తారు. తను సిగ్గుపడుతూ లేచి, బట్టలకు పట్టిన దుమ్ము దులుపుకొని బండి స్టార్ట్ చెయ్యబోతే వాళ్లు వారించి మంచినీళ్లు తాగించి కూర్చోబెట్టారు. ఆ తరువాత తను వెళ్లడానికి తొందరపడుతుంటే– ‘‘పెద్దవయసు కదా మాష్టారూ, ఇక మీరు స్కూటర్ మానెయ్యాలి, మీరు వెనక కూర్చుంటే మీ యింటి దగ్గర మా వాడు దింపి వస్తాడు’’ అని వాళ్లు తన పెద్దరికాన్ని గుర్తుచేస్తూ, సానుభూతిలో సహాయం చేస్తామంటే, తనకు మాత్రం వాళ్లు తన వయసును వెక్కిరిస్తున్నట్టనిపించి ‘‘సింగినాదం! వయసుదేముంది? బండిరాయి మీదకెక్కితే ఏ వయసు వాళ్లైనా పడకతప్పదు! అని పడ్డం తన వయసువల్ల కాదని వాళ్లను మారుమాట్లాడకుండా చేసి మొండిగా బండెక్కాడు. ఇంటికెళ్లిన తరువాత తన ఘనకార్యం విని– ‘పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందనడం మీలాంటి వాళ్లను చూసే..’ అని యిల్లాలు నెత్తి వాచేలా చీవాట్లు పెట్టింది!ఆ సాయంత్రం ఒంటరిగా కూర్చొని టీవీలో వస్తున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఫోర్లు, సిక్స్లూ దంచేస్తుంటే ఆనంద పారవశ్యంతో చప్పట్లు కొడుతున్నాడు. ఆ మైకానికి అంతరాయం కలిగిస్తూ అయిదారుగురు వాకర్స్ క్లబ్ సభ్యులు కలిసికట్టుగా ఇంటికొచ్చారు. వస్తూనే ‘‘మీ ఆనందానికి విఘ్నం కలిగిస్తున్నాం’’ అంటూ నొచ్చుకుంటూనే కుర్చీల్లో సెటిలయ్యారు. కుశల ప్రశ్నల అనంతరం వాళ్లు వచ్చిన పని చెప్పారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగే క్లబ్ మీటింగ్లో ఒక ‘సీనియర్ సిటిజన్’ను సన్మానించాలని నిర్ణయించుకున్నామని, ఆ సన్మానానికి అర్హునిగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మీ పేరు ప్రతిపాదించారనీ, మీ అనుమతి, బయోడేటాల కోసం వచ్చామనీ విన్నవించారు. వాళ్ల ప్రతిపాదన విన్న తరువాత తనకు కోపం ముంచుకొచ్చింది. అయినా బయటపడకుండా తన కోపాన్ని అదిమిపెట్టి చిరునవ్వుతో వాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. ‘‘నేను మీకంత వృద్ధుడిలా కనిపిస్తున్నానా? నేను చాలామందిలా నా వయసును తగ్గించుకోవడంలేదు. కానీ డెబ్బయ్యేళ్ల వయసు కూడా ఓ వయసేనా? నా వయసున్న సినిమా హీరోలు, రాజకీయ నాయకులు ఎంతమంది లేరు? ఆ మాటకొస్తే డెబ్బయ్యేళ్ల హీరోలు మనవరాళ్ల వయసున్న కుర్ర హీరోయిన్లతో కలిసి డాన్సులు చేస్తుంటే మనమంతా చూడ్డం లేదూ? అందుచేత వయసు కొలబద్దగా అందరినీ ఒకే గాటన కట్టెయ్యకూడదు. పరీక్షల్లో అరవయ్యేళ్ల వృద్ధుడు అని రాస్తుంటారు. అది అందరికీ అన్వయిస్తుందా? నా మట్టుకు నేను కృష్ణశాస్త్రి కవితలోలా వార్ధక్యాన్ని అంగీకరించను. ‘శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు’ అని నిత్యయవ్వనాన్నే కోరుకుంటాను. ‘‘మీరు వచ్చేసరికి నేను చూస్తున్న 20–20 క్రికెట్ పడుచుతనంలాంటిది. వన్డే క్రికెట్ మధ్యవయసులాంటిది. ఇక టెస్ట్మ్యాచ్ వార్ధక్యం లాంటిది. వీటిని బట్టి నేనేమిటో మీకర్థమైంది కదా! నేను నడకలో కాని, ఆటల్లో కాని, మీకెవరికీ తీసిపోను. నా సత్తా చూడాలంటే మీరు నడక పందెం పెట్టండి. అంతేగాని, సీనియర్ సిటిజన్గా నన్ను సన్మానిస్తామనడం నా ఫిట్నెస్ను అవమానించడమే! దయచేసి మీరు చెయ్యదలచుకున్న సన్మానానికి ఇంకెవరినైనా ఎంచుకోండి. కావాలంటే మీలో ఒకడిగా నేను కూడా ఒక దండ తీసుకొనివస్తాను’’.తన వాగ్ధాటికి, ఆత్మవిశ్వాసానికి ఎదురాడలేని క్లబ్ సభ్యులు ‘«థాంక్స్’ చెప్పి వెళ్లిపోయారు. ఆ క్లబ్ సభ్యులలో ఒకరైన డా.ధన్వంతరి దగ్గరకు వారం తిరక్కుండా తను వెళ్లవలసి వచ్చి ఆయనకు అడ్డంగా దొరికి పోయాడు.‘‘రండి, రండి, దయచేయండి ఓల్డ్ యంగ్మెన్ గారూ, ఊరక రారు మహాత్ములు’’ అంటూ కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు డాక్టర్. ఆయన నవ్వుతూ ఆహ్వానించినా దాని మాటున ఎత్తి పొడుపు ధ్వనించింది.‘‘నేను పక్కింటాయనతో పందెం కాసి వంద కొబ్బరి కాయలు వొల్చాను. ఆ శ్రమకి ఒళ్లంతా పులిసిపోయింది. ఆపైన జ్వరం కూడా. ఎందుకైనా మంచిదని మీకు చూపించుకుందామని.’‘‘మాష్టారూ, మీరెంతటి ఐర¯Œ మ్యాన్ అయినా ఈ వయసులో ఇలాంటి సాహసాలు చెయ్యకూడదు’’ అంటూ చెయ్యి, బీపీ చూశాడు. ‘‘అంతా నార్మల్గానే వుంది, ఒంటి నొప్పులు తగ్గడానికి బిళ్లలు రాసిస్తాను, అవి వాడి రెస్ట్ తీసుకోండి. ఇరవైలోలా ఇప్పుడు దూకుడు పనులు చేస్తే మాత్రం వయసు వూరుకోదు’’ అంటూ మెత్తగా చురకవేసి పంపించాడు డాక్టర్. ఆ హెచ్చరిక చెవికి శూలంలా గుచ్చుకొని ఇక డాక్టరు ముఖం చూడకూడదు అనుకున్నాడు తను!‘‘ఇలా ఎంత తప్పించుకుందామనుకున్నా, తన కిష్టంలేని వయసును గుర్తుచేసే హెచ్చరికలు అడుగడుగునా ఎదురై బాధపెడుతూనే వున్నాయి. కథల్లోనూ, సినిమాల్లోనూ తాతలకూ, తండ్రులకూ పెట్టే ‘అయ్యా’తో అంతమయ్యే పేరు కూడా తన నందరూ పెద్దవాళ్లతో జమకట్టడానికి ఒక కారణమేమో! చిన్నప్పుడే తన పేరును మార్చుకుంటానంటే అది తాతగారి పేరని, మార్చడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. తన ఏకైక కుమార్తెకు పెళ్లి చేస్తే అరవయ్యేళ్లకే తాతా అని పిలిపించుకోవలసి వస్తుందని ఆ పిల్ల పెళ్లిని వీలయినంత ఆలస్యం చేశాడు. చివరకు బంధువర్గం పోరు పడలేక అమెరికా సంబంధం చేసి, వాళ్లు తరచుగా రారు, అలా తాత అనే పిలుపుకు దూరంగా వుండొచ్చు అనుకున్నాడు. ఆఖరికి స్థూలకాయం, ఎగుబట్ట వంటి తలతో ఆనందంగా ‘బామ్మగారూ’ అని పిలిపించుకొనే అర్ధాంగి సుబ్బమ్మను కూడా వెంటపెట్టుకొని తిరిగితే తన వయసు బయటపడుతుందని ఆమెను ఎక్కడకూ తీసుకెళ్లడం లేదు.ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా, అడ్డమైన వాళ్లు తన వయసు గురించి వాగి మూడ్ను పాడు చేస్తున్నారు. ఇంకా తలనెరిసిన ఇద్దరు, ముగ్గురు తను ‘యాక్టివ్’గా వుండడం చూసి ఓర్వలేక ఏడిపించడానికి తన వయసుకు అయిదారేళ్లు కలిపి ‘అలా కనిపిస్తున్నావు మరి’ అంటున్నారు. ఇలాంటి వాళ్లందరి తెగులు కుదర్చాలంటే తను గ్లామరు పెంచుకోవాలి. మరింత స్మార్ట్గా తయారయి ‘మాష్టారూ, మీకు డెబ్బయ్యేళ్లంటే ఎవరూ నమ్మరు. యాబైలలోనో, అరవైలలోనో వున్నట్లు కనిపిస్తున్నారు’ అనిపించుకోవాలి. అందుకు ముందుగా డ్రెస్ మార్చాలి అనుకొని హుటాహుటిన క్లాత్షాపుకు వెళ్లాడు. ఇటీవల చాలామంది పెద్దవాళ్లు వయసు దాచుకోడానికి టీషర్ట్లు వేసుకుంటున్నారు గనుక తాను కూడా ఆ మార్గం అనుసరించాలని ఒకేసారి అరడజను టీషర్ట్లు తీసుకున్నాడు. అక్కడ ‘జీన్స్’ చూసి వాటిమీద కూడా మోజుపడ్డాడు. కానీ మోకాళ్ల దగ్గర చిరుగులు వగైరాలున్న అవి మీకు బావుండవని ‘సేల్స్ బాయ్స్’ నిరుత్సాహపరిస్తే వాటి జోలికి వెళ్లలేదు. ఆనాటి నుంచి నిగనిగలాడే నల్లజుట్టు, డైలీ షేవ్, మోడరన్ డ్రెస్లు వగైరా మార్పులతో కనీసం పదేళ్ల వయసు తగ్గినట్టు కనిపిస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నాడు. మార్పు మహిమ వల్ల ఇంకెవరూ తన వయసు గురించి కామెంట్స్ చేయ్యకపోవడంతో బెంగ తప్పింది. కొస మెరుపు: ‘‘నన్ను కొట్టినా, తిట్టినా పడతాను కాని వయసు గురించి వంకరగా మాట్లాడితే మాత్రం సహించను’ అని తెగేసి చెప్పే సుందరరామయ్య డెబ్బై దాటి ఏడాది గడవకుండానే వాకర్ సహాయంతో నడుస్తూ ఎదురు పడిన వాళ్లు సానుభూతి చూపిస్తుంటే–‘ ఎంత రాయిలాంటి వాడయినా వయసును, వార్ధక్యాన్ని ఒప్పుకోకతప్పదు. నాకూ డెబ్బయ్యేళ్లు నిండాయి మరి!’’అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూమ్లో జారిపడితే అతనికి కాలు విరిగింది. -
న్యూ కెరీర్ ఎక్స్ప్రెస్.. సూపర్ బోగీలెన్నో..!
రొటీన్స్ కోర్సులు.. రొడ్డకొట్టుడు చదువులు..వీటితోనే భవిష్యత్తుకు భరోసా అనేది ఓ అపోహ! ఇంజినీరింగ్, మెడిసిన్స్, మేనేజ్మెంట్ కోర్సులతోనే..కెరీర్ అద్భుతంగా ఉంటుందనేది ఓ భ్రమ! మరి అవికాక, ఈ పోటీ ప్రపంచంలో బతకనేర్పే విద్యలేవీ లేవా? ఆసక్తికి, ఆదరణకు తులతూగే కోర్సులే లేవా? అంటే..కొత్తకొత్త కోర్సులు చాలానే కనిపిస్తున్నాయి. విద్యార్థులను తమవైన రంగాల్నిఎంచుకోమంటూ ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, అకాడమీలు, ప్రైవేట్ సంస్థలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాయి. దేశ విదేశాల్లో చక్కని ఉపాధి అవకాశాలనూ అందిస్తున్నాయి. అలాంటి కొన్ని అరుదైన కోర్సుల గురించే ఈ ప్రత్యేక కథనం.. ఎథికల్ హ్యాకింగ్సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎథికల్ హ్యాకింగ్కు డిమాండ్ పెరుగుతోంది. ఎథికల్ హ్యాకింగ్ కోర్సులకు నిర్దిష్టమైన అర్హతలు లేనప్పటికీ, కంప్యూటర్ నెట్వర్కింగ్పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్పై అవగాహన ఉండాలి. కొన్ని కోర్సులకు 12వ తరగతి ఉత్తీర్ణత లేదా డిగ్రీ అవసరం కావచ్చు. సైబర్ సెక్యూరిటీలో ఆసక్తి, నేర్చుకోవాలనే తపన రెండూ ముఖ్యమే. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ఇన్ఫర్మేషన్స్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ కన్సల్టెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. కోర్సును ఎంచుకునే ముందు సంస్థ గుర్తింపు, కోర్సు సిలబస్, ఫీజుల వివరాలు సరిచూసుకోవడం ఉత్తమం. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు లభిస్తాయి. యాక్టే టెక్నాలజీస్ అనే ఐటీ శిక్షణ సంస్థ ఎథికల్ హ్యాకింగ్పై మాతృభాషలోనే కోర్సులను అందిస్తోంది.పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ ఇది మానవ సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, సంఘర్షణలను తగ్గించడానికి, పరిష్కరించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, అవగాహనను అందించే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ మొదలైన అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి ప్రభుత్వ సంస్థలలో పని చేయొచ్చు. ఈ కోర్సులో జాయిన్ కావడానికి ఇంగ్లిష్పై పట్టుతో పాటు సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇస్తుంటాయి.హోరాలజీఇది కాలగమనానికీ, గడియారాల తయారీకి సంబంధించిన శాస్త్రం. ఈ కోర్సులను అందించే సంస్థలను బట్టి అర్హతలు మారతాయి. సాధారణంగా 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది. కొన్ని సంస్థలు సైన్స్ స్ట్రీమ్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మరికొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహించి, కోర్సులో జాయిన్ చేసుకుంటాయి. పలు సాంకేతిక విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలు దీనికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. ఈ రంగంలో ప్రత్యేకమైన డిగ్రీ కోర్సులు లేవు. అయితే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు హోరాలజీలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.ఎథ్నోబోటనీమానవులు, మొక్కల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. ఇది బోటనీ, ఆంత్రొపాలజీల సమ్మేళనం. ఇందులో ఔషధ విలువలు, ఆహార విలువలు, సాంకేతిక ఉపయోగాలు మొదలైన అంశాలను విశ్లేషిస్తారు. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, బోటనీ, ఫార్మసీ, ఆయుర్వేదం, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు సోషల్ సైన్సెస్, ఆంత్రొపాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నాయి.ఏనిమల్ బిహేవియర్ అండ్ సైకాలజీజంతువుల మనస్తత్వానికి, వాటి భావోద్వేగాలకు చెందిన శాస్త్రం ఇది. దీనిలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, జువాలజీ, సైకాలజీ లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు వెటర్నరీ సైన్స్ ్స, బయాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నాయి.ఫైర్ ఇంజినీరింగ్ఇది అగ్ని ప్రమాదాలను నివారించడం, వాటిని ఎదుర్కోవడం, ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించే కోర్సు. దీనిలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బి.ఈ/బీటెక్), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్.ఈ/ఎమ్టెక్) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అనుమతిస్తాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.డెయిరీ హెర్డ్ మేనేజ్మెంట్ఇది పాడి పశువుల నిర్వహణకు సంబంధించిన కోర్సు. ఇందులో పాడి పశువుల పెంపకం, పోషణ, ఆరోగ్యం, పాల ఉత్పత్తి, మార్కెటింగ్, నిర్వహణ వంటి అంశాలను నేర్పిస్తారు. డెయిరీ హెర్డ్ మేనేజ్మెంట్లో సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు వెటర్నరీ సైన్స్ ్స, యానిమల్ సైన్స్ ్స లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.ప్రాప్ మేకింగ్ ఇది సినిమా, థియేటర్, టెలివిజన్, ఈవెంట్స్, ప్రకటనలు మొదలైన వాటి కోసం ప్రత్యేకమైన వస్తువులను (ప్రాప్స్) తయారు చేయడానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కోర్సు. సినిమాల్లోను నటీనటులు రకరకాల వస్తువులను ఉపయోగిస్తుంటారు. సన్నివేశాల్లోనూ రకరకాల వస్తువులు అలంకరణలు ఉంటాయి. వీటిని సినీ పరిభాషలో సెట్ ప్రాపర్టీస్ అంటారు. వీటి తయారీ గురించిన అధ్యయనం. ప్రాప్ మేకింగ్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫైన్స్ ఆర్ట్స్, డిజైన్, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.డెత్ స్టడీస్ ఇది మరణం, మరణ ప్రక్రియ, దుఃఖం, మరణానంతర జీవితం వంటి అంశాలను అధ్యయనం చేసే ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇది మరణం గురించి శాస్త్రీయ, మానసిక, సామాజిక, తాత్త్విక కోణాలను పరిశీలిస్తుంది. ఇది సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఏ/ ఎం.ఎస్.సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, రెలిజియస్ స్టడీస్ లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు మెడికల్, నర్సింగ్, సోషల్ వర్క్ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తాయి.ట్రీ క్లైంబింగ్ఇది చెట్లు ఎక్కడం, వాటిని నిర్వహించడం, రక్షించడం వంటి నైపుణ్యాలను నేర్పించే ఒక ప్రత్యేకమైన కోర్సు. ఇది అటవీ నిర్వహణ, అర్బోరికల్చర్, వన్యప్రాణుల పరిశోధన వంటి రంగాలలో ఉపయోగపడుతుంది. ట్రీ క్లైంబింగ్ కోర్సులలో సాధారణంగా సర్టిఫికెట్, డిప్లొమా స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. కొన్ని కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత, మరికొన్ని కోర్సులకు 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని సంస్థలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతాయి. కొన్ని ప్రైవేట్ అడ్వెంచర్ స్కూల్స్, సంస్థలు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.పోలార్ లాఈ కోర్స్లో ధ్రువప్రాంతాల చట్టాల గురించిన అధ్యయనం చేయవచ్చు. పోలార్ లా అనేది ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను అధ్యయనం చేసే ఒక ప్రత్యేకమైన న్యాయ విభాగం. ఇది అంతర్జాతీయ చట్టం, పర్యావరణ చట్టం, సముద్ర చట్టం, మానవ హక్కుల చట్టం వంటి వివిధ రంగాలను కలుపుతుంది. పోలార్ లాలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎల్ఎల్ఎమ్), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, లా (ఎల్ఎల్బీ) లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. పీహెచ్డీ చేయడానికి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు సంబంధిత పని అనుభవం ఉన్న విద్యార్థులను కూడా అనుమతిస్తాయి.పారాసైకాలజీపారాసైకాలజీ అనేది మానసిక శక్తులు, అతీంద్రియ అనుభవాలు వంటి వాటిని అధ్యయనం చేసే కోర్సు. ఇందులో టెలిపతీ, క్లేర్వోయన్స్ ్స, ప్రీకాగ్నిషన్, సైకోకైనెసిస్, పునర్జన్మ వంటి అంశాలను విశ్లేషిస్తారు. పారాసైకాలజీలో సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఏ/ఎమ్ఎస్సీ), డాక్టరేట్ (పీహెచ్డీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి, సైకాలజీ, ఫిలాసఫీ, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్, బయాలజీ వంటి విభాగాల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తాయి. పీహెచ్డీ చేయడానికి, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.జెరంటాలజీ ఇది వృద్ధాప్య ప్రక్రియను, వృద్ధులను అధ్యయనం చేసే శాస్త్రం. దీనికి జీవశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి వివిధ రంగాలతో సంబంధం ఉంటుంది. వృద్ధుల జీవితాలను ఎలా మెరుగుపరచవచ్చో అధ్యయనం చేస్తుంది. కోర్సు స్థాయిని బట్టి, అర్హతలు మారుతుంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీకి దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు సాధారణంగా డిప్లొమా లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు జీవశాస్త్రం, మనస్తత్త్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.స్టాండప్ కామెడీస్టాండప్ కామెడీ అనేది ఒక ప్రత్యేకమైన కళ, దీనికి అధికారిక విద్యార్హతలు అవసరం లేదు. ఇది ఎక్కువగా ప్రాక్టీస్, అనుభవంతో నేర్చుకునే కళ. అయినప్పటికీ, కొన్ని సంస్థలు స్టాండప్ కామెడీకి సంబంధించిన కోర్సులు, వర్క్షాప్లు అందిస్తున్నాయి. స్టాండప్ కామెడీ కోర్సులకు సాధారణంగా అధికారిక విద్యార్హతలు అవసరం లేదు. కొన్ని సంస్థలు, వర్క్షాప్లు 18 సంవత్సరాలు నిండిన వారిని అనుమతిస్తాయి. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, హాస్య చతురత, స్టేజ్ ఫియర్ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఈ కోర్సుకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆన్స్ లైన్స్ వేదికలు కూడా స్టాండప్ కామెడీ కోర్సులు అందిస్తున్నాయి.పప్పెట్ ఆర్ట్ ఇది ఒక ప్రత్యేకమైన కళ, దీనికి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. ఈ కోర్స్ తోలుబొమ్మల కళపై అధ్యయనం. పప్పెట్ ఆర్ట్లో సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎఫ్ఏ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎఫ్ఏ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఫైన్స్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్, లేదా అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి.విటికల్చర్ ఇది ద్రాక్ష సాగు శాస్త్రం. ఇందులో ద్రాక్ష రకాలు, నేల, వాతావరణం, సాగు పద్ధతులు, తెగుళ్ళు, వ్యాధుల నిర్వహణ వంటి అంశాలు ఉంటాయి. విటికల్చరిస్టులు నాణ్యమైన ద్రాక్షను ఉత్పత్తి చేయడానికి ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేస్తారు. ఈనాలజీ–ఇది వైన్ తయారీ శాస్త్రం. ఇందులో ద్రాక్ష రసాలను వైన్స్ గా మార్చే ప్రక్రియ, కిణ్వన ప్రక్రియ, వైన్ నాణ్యతను అంచనా వేయడం వంటి అంశాలు ఉంటాయి. ఈనాలజిస్టులు వివిధ రకాల వైన్లను తయారు చేయడానికి, వాటి నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని సంస్థలు సైన్స్ ్స స్ట్రీమ్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. కొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయి. కొన్ని సర్టిఫికెట్ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. బ్రూవింగ్ అండ్ డిస్టిలింగ్ఆల్కహాల్ ఉత్పత్తి ప్రక్రియలు, నిర్వహణ గురించి ఈ కోర్సులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయి. బీర్, వైన్, స్పిరిట్స్, ఇతర ఆల్కహాలిక్ పానీయాల తయారీలో ఉపయోగించే సాంకేతికతలు, పదార్థాలు గురించి అవగాహన కల్పిస్తాయి. ఈ కోర్సులో చేరడానికి సైన్స్ ్స స్ట్రీమ్లో 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని సంస్థలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కూడా ప్రవేశం ఉంటుంది. కొన్ని ప్రత్యేక కోర్సులకు రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ ఉండాలి. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కొన్ని కళాశాలల్లో సీటు లభిస్తుంది.బేకింగ్ సైన్స్ ్స అండ్ టెక్నాలజీఇది ఆహార శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం కలయికతో కూడిన ఒక ప్రత్యేకమైన కోర్సు. పాకకళలో బేకింగ్ చాలా పురాతన ప్రక్రియ. ఓవెన్లలో రొట్టెలు, బిస్కట్లు, కేకులు వంటివి తయారు చేసే పద్ధతులు, ఈ ప్రక్రియలో నవీన సాంకేతికల గురించిన అధ్యయనం ఇది. ఇందులో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ (బీఎస్సీ), మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్సీ) స్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా కోర్సు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. కొన్ని వర్సిటీలు హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ వంటి అనుబంధ శాస్త్రాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న విద్యార్థులను మాస్టర్స్ డిగ్రీ కోర్సులకు అనుమతిస్తాయి. ఇంటర్నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాంపస్లలో ఈ కోర్సులు లభిస్తాయి.ఇవే కాదు, మాంటిస్సోరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్, లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ వంటి పలు కోర్స్లు ఆసక్తిగల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజెస్, ఎన్విరాన్మెంట్ సైన్స్లో కూడా కొత్త ధోరణులు మొదలయ్యాయి. ఏది ఏమైనా ప్రేరణ, ప్రక్షాళన లేనిదే ఏ ప్రయాణం విజయవంతం కాదు. భవిష్యత్తు నిర్దేశానికి అవే అసలైన వారధులు. నిజానికి ఇలాంటి ఎన్నో రంగాలు విద్యావ్యవస్థల్లో పట్టభద్రులను చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆసక్తిని బట్టి అడుగులు వేయడమే ఆలస్యం. -
Ramayanam: విరాధుడి వధ
దశరథుడు కైకకు ఇచ్చిన మాటను అమలు చేయడానికి సీతా సమేతంగా రాముడు వనవాసానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు వారికి తోడుగా బయలుదేరాడు. అయోధ్యను విడిచి సీతా రామ లక్ష్మణులు అడవుల వైపు సాగారు. అడవుల్లో అక్కడక్కడా మజిలీలు చేస్తూ, ముందుకు సాగుతూ, కొన్నాళ్లకు వారు దండకారణ్యం చేరుకున్నారు. దండకారణ్యం మానవ సంచారానికి అంత అనుకూలంగా ఉండని కీకారణ్యం. సీతా రామ లక్ష్మణులు ఆ అడవిలో ముందుకు సాగుతున్నారు. గుబురుగా పెరిగిన చెట్ల కొమ్మలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. కొనదేలిన రాళ్లు కాళ్లకు గుచ్చుకుంటున్నాయి. అడపా దడపా క్రూర మగాల గంభీర రావాలు దూరం నుంచి వినిపిస్తున్నాయి. అంతలోనే ఆకాశం మేఘావతమైంది. ఆకాశంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు మెరవసాగాయి. కష్టాన్ని తట్టుకుంటూ అప్పటి వరకు నడక సాగిస్తూ వచ్చిన సీత అలసిపోయింది.‘నాథా! దాహం వేస్తోంది. దగ్గర్లో తటాకం ఏదైనా కనిపిస్తుందేమో చూడండి’ అందామె. దగ్గరలో నీటి జాడ కానరాలేదు. సీతా రామ లక్ష్మణులు ముగ్గురూ మాట్లాడుకుంటూ ముందుకు నడక సాగించారు. కొంత దూరం నడిచాక కనుచూపు మేరలో ఒక చెరువు కనిపించింది. దగ్గరకు వెళ్లే కొద్ది, దాని చుట్టూ దట్టమైన ముళ్ల కంచెలు అడ్డుగా ఉన్న సంగతి అర్థమైంది. లక్ష్మణుడు కత్తితో ముళ్ల కంచెలను కత్తిరించి, తోవ ఏర్పాటు చేశాడు. రాముడు కొంత దూరంలో చెట్టుకు ఆనుకుని నిలబడ్డాడు. సీత కూడా భర్త పక్కనే నిలబడింది. నీటి కోసం లక్ష్మణుడు చెరువులోకి దిగబోయాడు. అదే సమయంలో భీకర ధ్వని వినిపించింది. ఆ ధ్వని క్రూరమగాల గర్జనలా లేదు. అంతకు మించిన తీవ్రతతో కర్ణభేరులు అదరగొట్టే ధ్వని అది. ఉలిక్కిపడిన లక్ష్మణుడు తన వెనుకనే ఉన్న సీతా రాములకు ఆపద ఏమైనా రాలేదు కదా అనే అనుమానంతో వెనక్కు చూశాడు. దూరాన చెట్టుకు ఆనుకుని రాముడు కనిపించాడు. తన వెనుక సీత ఉన్న వైపు రాముడు చూశాడు. అటువైపు భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. గుహలాంటి నోరు తెరిచి, వికటాట్టహాసం చేస్తూ వాడు సీతను ఒడిసి పట్టుకుని ఉన్నాడు. సీత ఎంతగా వదిలించుకుంటున్నా, ఏమాత్రం పట్టు సడలించకుండా రాముడి వైపు ముందడుగు వేశాడు. రాముడు లక్ష్మణుడి వైపు చూశాడు. ఇద్దరూ రాక్షసుడి వైపు విభ్రాంతులై చూశారు. వాడి చేతికి చిక్కిన సీత పడుతున్న యాతన చూసి రామ లక్ష్మణులు దిగ్భ్రాంతులయ్యారు.సీతను పట్టుకుని ఆ రాక్షసుడు మరింత ముందుకు వచ్చాడు.‘నా పేరు విరాధుడు’ అని వికటాట్టహాసం చేశాడు ఆ రాక్షసుడు.రామ లక్ష్మణులు బదులు పలకక వాడి వైపు తీక్షణంగా చూశారు.‘ఏం అలా చూస్తున్నారు? నా పేరు ఎప్పుడూ వినలేదా? చూడబోతే మీరు ఇదివరకు ఈ ప్రాంతానికి వచ్చిన వారిలా లేరే! పైగా మీ వేషాలు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపు నారవస్త్రాలు ధరించి, విల్లంబులు, ఆయుధాలు కూడా ధరించి ఉన్నారు. ఈమెను చూడబోతే సర్వాలంకృతగా అంతఃపుర స్త్రీలా కనిపిస్తోంది. మీరు మోసకారుల్లా ఉన్నారు. ఈ స్త్రీని ఏ అంతఃపురం నుంచి పట్టుకువచ్చారు? అంతఃపుర స్త్రీని పట్టుకొస్తే పట్టుకొచ్చారు గాని, బుద్ధి ఉన్నవారెవరైనా సుకుమారులైన స్త్రీలను అడవికి పట్టుకొస్తారా?’ అని గద్దించాడు.రామ లక్ష్మణులు బదులివ్వకపోవడంతో విరాధుడు మళ్లీ ఇలా అన్నాడు: ‘అడవి జంతువులను తిని మొహం మొత్తింది. ఇన్నాళ్లకు నరమాంసం దొరికింది. అయితే ముందు మీరెవరో చెప్పండి. మీరెవరో తెలియకుండా నేను మిమ్మల్ని తినను’ అన్నాడు. ‘అసలు నువ్వెవరివో చెప్పు. నువ్వెవరివో తెలియకుండా నిన్ను చంపము’ అన్నాడు లక్ష్మణుడు.‘మీరెవరని అడిగితే బదులివ్వకుండా, నన్నే నువ్వెవరివని అడుగున్నారే? ఒక్క పిడికిటి పోటు యమపురికి పోయే మీతో ఇంత మట్లాడటం అనవసరం’ అని రెచ్చిపోయాడు విరాధుడు.అప్పుడు రాముడు ‘మేము రామ లక్ష్మణులం. ఈమె నా పత్ని జానకి. ఈమెను ఏ అంతఃపురం నుంచి పట్టుకు రాలేదు. స్వయంవరంలో శివధనుర్భంగం చేసి పెళ్లాడాను’ అన్నాడు. అప్పుడు విరాధుడు ‘నా తండ్రి జయుడు, నా తల్లి శతహ్రద. నన్ను విరాధుడంటారు. తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వరాలు పొందాను. ఎలాంటి ఆయుధాలైనా నన్నేమీ చేయలేవు. ఈమెను ఇక్కడ విడిచిపెట్టి, మీ దారిన మీరు వెళ్లండి’ అని పలికాడు.రాముడు కుపితుడయ్యాడు. ‘ఓరీ, రాక్షసాధమా! భూమ్మీద బతకాలని ఉంటే నా సీతను వదిలి వెనక్కు వెళ్లిపో!’ అన్నాడు.‘నన్ను చంపుతానంటున్నారుగా! వ్యర్థప్రలాపాలు దేనికి? చూపించండి మీ ప్రతాపం’ అన్నాడు. అక్కడితో ఆగకుండా, తన భుజాన ఉన్న శూలాన్ని రాముడి మీదకు విసిరాడు.రాముడు నాలుగు బాణాలను వెనువెంటనే సంధించి, ఆ శూలాన్ని గాల్లోనే ముక్కలు చేశాడు. విరాధుడు రెచ్చిపోయి, సీతను అక్కడే వదిలేసి, రామ లక్ష్మణులిద్దరినీ చెరో చేత్తో ఒడిసి పట్టుకుని, అడవిలో పరుగులు తీశాడు.లక్ష్మణుడు వాడి మెడ మీదకు చేరి, ఒడిసి పట్టుకున్నాడు.‘అన్నా! వీడి చెరో భుజాన్నీ ఇద్దరం ఒకేసారి నరికేద్దాం’ అన్నాడు.ఇద్దరూ ఒకేసారి విరాధుడి రెండు భుజాలను ఒక్కసారే నరికేశారు. వాడు పెడబొబ్బలు పెడుతూ కుప్పకూలాడు. అయినా, అతడి ప్రాణం పోలేదు. ‘తపశ్శక్తితో ఈ రాక్షసుడు మరణించేలా లేడు. నేను వీడి కంఠాన్ని తొక్కి పడతాను. నువ్వు గొయ్యి తవ్వు. అందులో వీణ్ణి పూడ్చేద్దాం’ అన్నాడు రాముడు. లక్ష్మణుడు గొయ్య తవ్వుతుండగా, విరాధుడి గొంతు మీద రాముడు కాలు పెట్టాడు. వెంటనే విరాధుడి ప్రాణం పోయింది.∙సాంఖ్యాయన -
యువ కథ: మనిషి చనిపోయిన తర్వాత 7నిమిషాలు పాటు..
‘మనిషి చనిపోయే ఆఖరి నిమిషాలలో ఏడు నిమిషాలపాటు ప్రాణం వుంటుంది. ఆ సమయంలో జీవితమంతా కళ్ళముందు కనిపిస్తుంది’ అని చాలామంది అంటుంటే విన్నాను కాని, దాన్ని అనుభవించే రోజు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేకపోయాను.చుట్టూ చీకటిగా వుంది. భయమేస్తోంది. అయినా ఇక భయమెందుకులే! జరగాల్సినదంతా గత రెండు గంటల్లోనే జరిగిపోయిందిగా! పన్నెండేళ్ళ క్రితం వార్తా కార్యక్రమాల్లో నిర్భయ సంఘటన గురించి విన్నప్పుడు అందరి ముఖాల్లోనూ ఆందోళన చూశాను. ఈరోజు మనిషి తోలు కప్పుకున్న మృగాలు నన్ను వెంటాడి క్షణక్షణం హింసిస్తూ, అటువంటి స్థితిలోకే నన్నూ నెట్టేస్తుంటే జీవచ్ఛవంలా పడుండటం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఆ నరరూపరాక్షసులు నన్ను అనుభవించి, దొంగల్లాగా పారిపోయారు.పోలీసు సైరన్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు నన్ను వెతికి, ఎక్కడున్నానో కనిపెట్టేసరికి నా ఊపిరుంటుందో లేదో! అవునూ, ఇప్పుడు పోలీసులు వస్తున్నారంటే అమ్మానాన్న కూడా వస్తూ వుంటారేమోగా! ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడమే గాక ఫోన్ కూడా ఎత్తకపోవడంతో భయపడి, నాన్న తన క్లాస్మేట్ అయిన సీఐ రమణమూర్తి అంకుల్కి ఫోన్ చేసినట్టున్నారు. పాపం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో! నన్ను ఇలా చూసి వాళ్ళు తట్టుకోగలరా? అమ్మకి అసలే బాలేదు. నాన్నేమో సున్నితమైన మనిషి. జరిగినదాని గురించి కన్నా, నన్ను తలచుకుని వాళ్ళేమైపోతారోనన్న బాధే ఎక్కువగా వుంది. అలా అని, లేచి వెళ్ళి వాళ్ళకి బాధపడొద్దని చెప్పే పరిస్థితిలో లేను. కాలూ, చెయ్యీ కదపలేకపోతున్నాను. గొంతులోంచి మాట రావడం లేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇప్పటివరకూ సాఫీగా సాగిన నా జీవితం, కొన్ని గంటల క్రితం కొన్ని ఊహించని మలుపులు ఎందుకు తిరిగింది?‘అమ్మా! తలుపేసుకో, నేను వెళ్తున్నాను’‘వెళ్తున్నాను కాదే, వెళ్ళొస్తాను!’‘ఆ, అదే అదే. నువ్వు టైమ్కి మందులు వేసుకుని పడుకో, లేదంటే జ్వరం తగ్గదు. అసలే వైరల్ ఫీవర్’‘సరేరా. మర్చిపోకుండా వేసుకుంటానులేగాని, దేవుడికి దణ్ణం పెట్టుకునిరా. ఇవాళ ప్రమోషన్ వచ్చాక మొదటి రోజు. శుభంగా జరగాలని కోరుకో!’‘అబ్బా! ఇంకా దణ్ణంపెట్టుకోమనలేదేంటా అని ఆలోచిస్తున్నాను. ఉండు, నీ ఆనందం కోసం కుంకుమ కూడా పెట్టుకుని వస్తా’‘జాగ్రత్త తల్లీ! వెళ్ళాక మెసేజ్ చెయ్యి. సర్వీస్ సెంటర్ వాడు కారు ఎప్పుడిస్తాడట?’‘ఇందాక ఫోన్ చేస్తే, రేపొద్దున్నకల్లా అయిపోతుందన్నాడమ్మా. ఇవాళ ఒక్కరోజూ ఆటోలోనో, క్యాబ్లోనో వచ్చేస్తాలే’ ‘సాయంత్రం కుదిరితే త్వరగా వచ్చెయ్యమ్మా. నువ్వొచ్చే వరకు మాకు కంగారుగా వుంటుంది’‘అలాగేనమ్మా. బయలుదేరేముందు లైవ్ లొకేషన్ పెడతానులే. అయినా నాకు కరాటేలో బ్రౌన్ బెల్ట్ ఉంది కదా! నన్ను ఎవడూ ఏం చెయ్యలేడు. నువ్వు నిశ్చింతగా ఉండు. సరే, క్యాబ్ వచ్చింది. నేను వెళ్తాను. బై అమ్మా!‘ అమ్మకి ధైర్యమిచ్చాను కాని, ఈమధ్య జరుగుతున్న దారుణాలను తలచుకుంటే నాకు భయమేసింది. ఒకమ్మాయిని మానభంగం చేసినందుకు విధించిన పదేళ్ల జైలు శిక్షకుగాను ఏడేళ్లు జైల్లో ఉండి, సత్ప్రవర్తన వల్ల మూడేళ్ల ముందే విడుదలయిన వాడు ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న వార్త చూస్తుండగా ఆఫీసు వచ్చింది. మనసును కలచివేస్తున్న ఆ విషయాన్ని ఆలోచనల్లోంచి పక్కకు నెట్టేసి ఆఫీసు లోపలికి అడుగుపెట్టాను.‘అమ్మా, తిన్నావా? నాన్న ఇంటికి వచ్చారా? ఫోన్ చేస్తే ఎత్తలేదు.‘‘నాన్న గంట క్రితమే వచ్చారమ్మా. ఇందాకే తిన్నాము. ఆయన నిద్రొస్తోందని ఇందాకే నడుం వాల్చారు. నువ్వు చెప్పు. కొత్త పోస్టులో ఫస్ట్ డే ఎలా ఉంది?’’‘ఇప్పటివరకూ చాలా బావుందమ్మా. నాకు కొత్త షో ఇచ్చారు. ఈ వారం దానికి సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. పెద్ద బాధ్యత ఉంది కానీ బరువుగా అనిపించడం లేదు. ఆసక్తిగా వుంది. ఇంకో విషయం, కాలేజీలో అర్జున్ అని నా మిత్రుడుండేవాడుకదా! తను యూకే నుంచి మొన్నే వచ్చాడమ్మా. స్నేహితులందరమూ ఇవాళ కలుద్దామను కుంటున్నాము. తను రేపు వెళ్ళిపోతున్నాడు. అదీ కాక అందరినీ కలిసి చాలా రోజులయ్యింది. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏమో! అందుకని ఇవాళే వెళ్తాను. కొంచెం ఆలస్యమవ్వచ్చు. మీరు తినేసి వుండండి. నాకోసం వేచుండద్దు’– అమ్మతో మాట్లడిన ఆఖరి మాటలు. నాన్నతో అయితే ఇవాళ మాట్లాడలేదు కూడా. ఇప్పుడు మళ్ళీ మాట్లడగలనో, లేదోనని భయమేస్తోంది.కాలేజీ స్నేహితులను కలిసి, వారితో విందు ముగించుకుని ఫోన్లో ఆటో బుక్ చేశాను. ఇరవై నిమిషాలకు ఒక రైడ్ కన్ఫర్మ్ అయ్యింది. వచ్చిన ఆటో డ్రైవర్‘మేడమ్, రైడ్ క్యాన్సిల్ చేసెయ్యండి. మీకు చూపిస్తున్న కిరాయిలో ఎక్కువ శాతం యాప్ వాళ్ళకే పోతుంది. రైడ్ క్యాన్సిల్ చేసి, దానికన్నా ఒక యాభై తక్కువిస్తే మీకూ, నాకూ లాభమే.’‘క్యాన్సిల్ ఎందుకులే అన్నా. నేనే వంద రూపాయలు ఎక్కువిస్తాను’ అనుమానం వచ్చినా, ఇంకో ఆటో దొరకదేమోనన్న భయంతో, రైడ్ ట్రాక్ అవుతుందన్న ధీమాతో బండి ఎక్కేశాను. ఇంతలో ఫోన్ మోగింది.‘హాయ్ కీర్తీ! ఇప్పుడే ఆటో ఎక్కాను. ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేస్తానులే. నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు.’ ఫోన్ మాట్లడుతూ వున్నా, ఒక కన్ను డ్రైవర్ తీరు మీద, రోడ్డు మీద వేసుంచాను. వెళుతూ వున్నంతసేపూ బానే ఉన్న డ్రైవర్, ఇంటి దగ్గరకొచ్చేసరికి స్పీడు పెంచి మా ఇంటిని దాటేశాడు. ఫోన్లో యాప్ ఓపెన్ చేసి చూస్తే, ‘డెస్టినేషన్ రీచ్డ్. హౌ వస్ యువర్ రైడ్ విత్ చెన్నకేశవులు?’ (మీరు మీ గమ్యాన్ని చేరుకున్నారు. చెన్నకేశవులుతో మీ ప్రయాణం ఎలా జరిగింది?) అని చూపించింది. ప్రమాదంలో ఉన్నానని అర్థమయ్యి అప్రమత్తమయ్యాను. ఇంటికి ఫోన్ చెయ్యబోయాను. ఇంతలో అతను ఏదో స్ప్రే కొట్టాడు.కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా డ్రైవర్తో సహా ముగ్గురున్నారు– అర్ధనగ్నంగా. బ్రతిమాలాను. వేడుకున్నాను. ఒక్కరు కూడా కరగలేదు. కనికరం లేకుండా రెండు గంటల పాటు వారి పని ముగించుకుని, పోలీసు సైరన్ వినపడగానే పారిపోయారు. ఒకవేళ వీళ్ళని పోలీసులు పట్టుకున్నా, ఈ రాత్రి జరిగినది నా మనసులోనుంచి చెరిగిపోదుగా! అసలు నేను గురైన హింసని నా శరీరం తట్టుకుంటుందా? నేను బ్రతికుంటానా? అసలు ఇది అనుభవించడానికి నేనేం తప్పు చేశాను? పద్ధతిగానే బట్టలు వేసుకున్నాను కదా! ఏమిటి నేను చేసిన తప్పు? స్నేహితుల్ని అయిదేళ్ళ తరువాత కలవడమా? లేదా స్నేహితుడు ఇంట్లో దింపుతానన్నా, తనని ఇబ్బంది పెట్టడమెందుకని ఆటో ఎక్కడమా? అసలు నేను అమ్మాయిగా పుట్టడమే నా శాపమా? ఏమో. ఇప్పుడు నేను ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేను. అందుకే దీన్ని మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదూ! నాకు ఒక పేరంటూ లేదు. భారతదేశంలో రోజూ అఘాయిత్యానికి గురయ్యే తొంభైమంది అమ్మాయిల ప్రతిబింబాన్ని నేను. అందరూ పూజించే దేవిని నేను. కొందరు ఆర్పేయడానికి ప్రయత్నిస్తున్నా వెలగడానికి అనుక్షణం యత్నిస్తున్న జ్యోతిని నేను. ప్రాణం కొట్టుమిట్టాడుతున్నా, నా వాళ్ళ కోసం మృత్యువుతో పోరాడుతున్న యోధురాల్ని నేను. సుఖంగా, సురక్షితంగా ఉండే జీవితానికి నోచుకోలేని అభాగ్యురాలిని నేను. పోరాడకుండా ఒక రోజు కూడా గడవదే! నేను జీవితాంతం, అనుక్షణం, ఏ జంతువు ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని జాగ్రత్తపడుతూ ఉండాల్సిందేనా?’’‘ఇది ఈ వారం మనసులోని మాట కార్యక్రమంలోని కథ. ఇది ఎవరు పంపించారో కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంపించారు. చదివి వినిపిస్తున్న నాకే గుండె ఇలా బరువెక్కుతోంటే, తను దీనిని ఎలా అనుభవించారో ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. కానీ తను అన్నిటినీ ఎదుర్కొని మనతో ఇది పంచుకోవడమే ఒక గొప్ప విషయం. ఈ మనసులోని మాటను పంపించిన వారు ఇది వింటున్నారనుకుంటున్నాను. మీకు మా జోహార్లు. ఇంకో నిర్భయ, అభయ, దిశలు రాకుండా చేద్దామని మనందరం శప«థం చేద్దాం. అది మనందరి బాధ్యత. వచ్చే శనివారం సాయంత్రం ఆరు గంటలకు మనసులోని మాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకూ వింటూనే ఉండండి, నవోదయం ఎఫ్ఎం, ప్రతీరోజూ కొత్త ఆరంభం. నేను మీ ఆర్జే అను. ఇది మనసులోని మాట–మదిని హత్తుకుంటుంది.’ హెడ్ఫోన్స్ తీసి, బ్యాగు సర్దుకుని నా కథని చివరకి ఈ ప్రపంచానికి చెప్పానన్న సంతృప్తితో ఆఫీసు బయటకు వచ్చాను.‘లేటయ్యానా? నీ ప్రోగ్రాం వింటూ వచ్చా. చాలా బాగా మాట్లాడావు. ప్రౌడ్ ఆఫ్ యూ.’ వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ కనిపించాడు. కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన కొంత కాలానికి ఏర్పడిన మా పరిచయం ప్రేమకు దారితీసి, మూడేళ్ళ క్రితం మేము ఒకటయ్యేలా చేసింది. తన హాస్పిటల్కు, మా ఆఫీసుకు ఒక కిలోమీటరే తేడా. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు.‘లేదు. సమయానికే వచ్చావు. ఆకలేస్తోంది. ఏమయినా తిందామా?’‘సరే, పద.’ పక్కనే వున్న చాట్ బండి దగ్గరకు వెళ్ళి కచోరీ ఆర్డర్ ఇచ్చాక, నా మనసు నన్ను బలవంతంగా గతంలోకి లాక్కెళ్ళింది. అయిదేళ్ళ క్రితం, ఆ భయంకరమైన రాత్రి నాడు తను ఏదో ఎమర్జెన్సీ కేసులో ఉండడంవల్ల పక్కరోజుకుగాని విక్రమ్కి జరిగిన విషయం తెలియలేదు. నాకు తెలివి వచ్చే సరికి చేతికి ఏవో ట్యూబ్లు తగులుతూ వున్నాయి. నేనింకా బ్రతికే ఉన్నానని అర్థమయ్యింది. ఆసుపత్రిలో వున్నాననుకుంటా! ఎదురుగా అమ్మా, విక్రమ్ మాట్లడుకుంటూ వున్నారు. వాళ్ళని చూడగానే ఆనందం, బాధ వలన కన్నీరు తన్నుకొచ్చింది. నాకు మెలకువ రావడం వాళ్ళిద్దరూ ఇంకా గమనించలేదు. వున్నట్టుండి నా మనసు నా చిన్ననాటి స్నేహితురాలు శాలిని మీదకు మళ్ళింది. తను చిన్నప్పటినుంచి ఎంతో చలాకీగా వుండేది. చాలా అందంగా వుంటుంది కూడా. తన చదువు పూర్తయిన వెంటనే తన దూరపు బంధువుతో తనకి పెళ్ళి చేశారు. ఇద్దరూ మొదట్లో బాగానే వుండేవారు. కానీ ఒక సంఘటన వారిని విడదీసింది. శాలిని కాలేజీలో వున్నప్పుడు ఒకతను తనను పెళ్ళిచేసుకోమని వెంటపడేవాడు. అందుకు తను ఒప్పుకోకపోవడం అతని అహం మీద దెబ్బకొట్టింది. శాలినీకి పెళ్ళయ్యిందని తెలుసుకున్న అతడు, ఒకరోజు వచ్చి తనపై యాసిడ్ దాడి చేశాడు. తను సమయానికి మొహం మీద చెయ్యి అడ్డుపెట్టుకోవడంతో కళ్ళకు ప్రమాదం తప్పి, కేవలం నుదురు, చెయ్యిపై యాసిడ్ ప్రభావం పడింది. ఆ దుర్ఘటన తరువాత, కేవలం తన అందం మీద మోజుతో పెళ్ళి చేసుకున్న భర్త, తననుండి విడాకులు కోరాడు. అతని నిజస్వరూపం అందరికీ అప్పుడే అర్థమయ్యింది. అది శాలినీని ఎంతో మనోవేదనకు గురిచేసింది. జరిగేవన్నీ మన మంచికే అనుకునే నేను, విక్రమ్ ఎలాంటివాడో తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం అనుకున్నాను. ఇంతలో నేను కళ్ళు తెరవడం చూసి అమ్మా, విక్రమ్ నా దగ్గరకు వడివడిగా వచ్చారు. అమ్మ ఏడుస్తూ వచ్చి కౌగిలించుకుని, నాన్నకు నేను స్పృహలోకి వచ్చిన విషయం తెలిపేందుకు వెళ్ళింది. విక్రమ్ వచ్చి ఏమీ మాట్లాడకుండా చెయ్యి పట్టుకుని నా మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. తను కూడా శాలిని మాజీ భర్తలా చేస్తాడా? జీవితాంతం తోడుంటానన్నవాడు ఇప్పుడు చెయ్యి విడిచి వెళ్ళిపోతాడా? అటువంటి ఆలోచనలు నా మదిని కలవరపెడుతుండగా తన కన్నీటి చుక్కలు నా చేతి మీద పడ్డాయి. ‘అనూ, మాకు చాలా భయమేసింది. నువ్వు పద్దెనిమిది గంటలపాటు స్పృహలో లేవు. నువ్వు మొత్తానికి లేచావు. పరిస్థితులు మళ్ళీ చక్కబడతాయి. మనం దీనిని కలిసి జయిద్దాం!’ నా అరచేతిలో తన తల వాల్చి, పసిపిల్లాడిలా ఏడుస్తూ, నాకు ధైర్యాన్నిస్తున్న తనని చూస్తే ముచ్చటేసింది. మనసు కుదుటపడింది.‘ఓయ్’ అంటూ నా భుజాన్ని విక్రమ్ తాకడంతో వర్తమానంలోకి వచ్చాను.‘అసలు నేనిప్పటివరకూ మాట్లాడినవేమయినా విన్నవా? ఏమాలోచిస్తున్నావు?’‘ఏమీ లేదు. మన బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పటికయినా ఈ లోకం సురక్షితంగా మారకపోదా అని ఆలోచిస్తున్నా అంతే!’ తన భుజమ్మీద తల వాల్చాను. నన్ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఆ కౌగిలిలో భద్రతగా అనిపించింది. ‘ఆ!’– ‘ఏమైంది?’– ‘తను తంతోంది. చెయ్యి పెట్టి చూడు.’ తన చేతిని నా పొట్ట మీద ఆనించాను. ఆ చిన్ని ప్రాణాన్ని స్పృశిస్తూ గడుపుతున్న మధురక్షణాలలో అనిపించింది–‘నాట్ ఆల్ మెన్. బట్ సమ్ హౌ ఇట్స్ ఆల్వేస్ ఎ మ్యాన్’. మగాళ్ళందరూ చెడ్డవారు కాదు. కానీ అటువంటి హానికరమయిన వారెవరో, మంచివారెవరో తెలుసుకొనుట ఎటుల? నా పసిపాప పెరిగే సమయానికయినా ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే బావుండు! -
ఈ వారం కథ: ఉల్లి బంధం
‘‘లోకంలో ఎక్కువమంది అన్యోన్యత.. అంటే కమ్యునికేషన్స్ సరిగా లేక సమస్యలు తెచ్చుకుంటున్నారు’’మహానగరంలో పెద్ద దేవాలయ ప్రాంగణం. పురాణ కాలక్షేపం జరుగుతోంది. తీర్చిదిద్దినట్లున్న వరుసల్లో భక్తులంతా కూర్చొని స్వామివారి ప్రవచనం శ్రద్ధగా వింటున్నారు.‘‘సమాచార లోపం వల్లే మెజార్టీ స్త్రీ పురుషుల్లో అన్యోన్యత దెబ్బతింటోంది. ఒకరు చెప్పింది మరొకరు సాంతం వినడం లేదు. ఠపీమని సమాధానం మాత్రం ఇచ్చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ట్రాక్ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాల. నిదానం గాని, ఓ విధానం గాని ఉండట్లేదు’’భక్తజన శ్రోతలు ముసిముసిగా నవ్వుకున్నారు. కాని, ప్రియతమ్ నవ్వలేదు. అతని పక్కనే కూర్చున్న సుందరిలో కూడా స్వామివారి మాటలు నవ్వు పుట్టించలేదు. వారిద్దరూ భార్యాభర్తలు. అయినా గంభీర వదనాలతో ఉన్నారు. సుందరి.. పెళ్లయిన కొత్తలో భర్తను పేరులోనే కాకుండా అతడేం చేసినా ఇష్టసఖుడిగానే తలచేది, కొలిచేది. ప్రియతమ్.. భార్య చిలుకలు చుట్టి ఇచ్చినా, చిలుకపలుకులు పలికినా ‘గాల్లో తేలినట్టుందే’ అని సంబరపడిపోయేవాడు. మూడేళ్లు గడిచాయి. ఆ ముచ్చట్లు మాయమయ్యాయి.‘‘వాళ్ల కడుపున ఓ కాయ కాస్తే అన్నీ సర్దుకుపోతాయి’’ అని పెద్దవాళ్లు అనుకున్నదేమీ జరగలేదు. కాలం గడుస్తున్నకొద్దీ ఒకరిమీద మరొకరికి చిరాకు. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. తమ ఇంట్లోనే తాము పరాయివాళ్లలాగా గడుపుతున్నారు. అయినా సరే, ఇద్దరిలో ఏ చిన్న అవసరం ఎవరికొచ్చినా మిగతావారి మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఎవరి రాజ్యంలో వారు సామంతులు మరి.మామూలుగా అయితే వంటగది ఆడవాళ్ల రాజ్యం. ఆక్కడ ‘మగా’నుభావులకు చోటుండదు. కిచెన్స్ రూమ్ వాళ్ల ఇష్టారాజ్యం. ఇదంతా ఒకప్పటి మాట. మహిళలు ఇప్పుడు పురుషులతో పోటీపడి ఉద్యోగాలు చేస్తున్నారు.‘వంట చేయడం ఏమైనా బ్రహ్మవిద్యా? యూ ట్యూబ్ చూసి చేసేయడమే కదా. ఆ మాత్రం వంటలు మేమూ చేయగలం’ అంటూ ఎంతోమంది మగమహారాజులు నారీమణులకు తీసిపోకుండా ఇప్పుడు వంటింట్లో గరిటె తిప్పుతున్నారు.కాని, ప్రియతమ్ ఆ పని చెయ్యలేడు. తనకు స్టవ్ వెలిగించడమే సరిగా రాదు. ఎలాగోలా వెలిగించినా, బర్నర్ ఎటు తిప్పితే సిమ్మో, ఎటు తిప్పితే కాదో తనకు ఇప్పటికీ కన్స్ ఫ్యూజనే. ఒకసారి స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి. పాలు పొంగిపోతున్నాయని పొయ్యి దగ్గరకు పరిగెత్తి ఆ గాభరాలో వెంటనే స్టవ్ కట్ట లేకపోయాడు. గభాల్న పాలపాత్ర దించేసి, చేతులు కాల్చుకున్నాడు. అందుకే కప్పు టీ కావాలన్నా సుందరి చేసి ఇవ్వాల్సిందే! వంటగది సుందరికి ఇష్టారాజ్యం అయితే, ప్రియతమ్కు దుర్భేద్యమైన కోట.డబ్బుల్ని ఒకేసారి ఎక్కువగా చూస్తే సుందరికి గుండెలు ఝల్లుమంటాయి. ఆ పులకరింతలో వాటిని సరిగా లెక్కపెట్టలేకపోతుంది. ఎప్పుడైనా లెక్కపెట్టాల్సి వస్తే ఒకటి రెండు సార్లు లెక్కపెట్టినా, పది రూపాయలు ఎక్కువో తక్కువో అవుతుంది. అందుకే డబ్బు జోలికి తనెప్పుడూ స్వతంత్రంగా వెళ్లలేదు. ప్రియతమ్ను కట్టుకున్నాక సహజంగా ఉండే స్వాతంత్య్రం కూడా పోయింది. మనీపర్స్ ప్రియతమ్కు అల్లాఉద్దీన్స్ అద్భుత దీపం అయితే సుందరికది అర్థంకాని మాయల ద్వీపం.రోజులు గడిచేకొద్దీ ఏ చిన్న అవసరమైనా, ఒకర్నొకరు అడుక్కోవడం ఇద్దరికీ దుర్భరంగా తోచేది. భార్యాభర్తల మధ్య ఈ పరిస్థితేమిటి? ఎవరికైనా తెలిస్తే నవ్వుకోరా! అన్న ఆలోచన వచ్చినా ఎవరికి వారు సమర్థించుకునేవారు. అందులో తప్పున్నా దాన్ని దిద్దుకోవల్సింది తను మాత్రం కాదని ఒకరి మీద మరొకరు నెట్టుకునేవారు. ప్రియతమ్ గీసి గీసి లెక్కలేసి సుందరికి డబ్బులివ్వడం, సుందరి తెల్లారి లేచి నాన్చి నాన్చి పనులు చేయడం– ఇదీ తంతు! ఎప్పుడైనా పక్కింటివాళ్లతోనో, ఇంటికొచ్చిన అయినవాళ్లతోనో తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సివచ్చినా, వీళ్ల బండారం బయట పడిపోకుండా ముఖాన పౌడర్లు స్నోలతో పాటు లేని నవ్వులు కూడా తగిలించుకునేవారు. దేవాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతోందని, స్వామివారు చెప్పే పురాణం కన్నా ఇంటింటి రామాయణం మీద జోకులే అందరికీ కనెక్ట్ అవుతున్నాయని వీధిలో నలుగురూ అనుకోసాగారు. ఓ సాయంత్రం పక్కింటి వాళ్లు వెళ్తుంటే ప్రియతమ్, సుందరి వాళ్లతో వెళ్లాల్సి వచ్చింది. నవ్వలేనివారు స్వర్గాన ఉన్నా ఏడుపు మొగంతోనే ఉంటారన్నట్లు, కనీసం ఇంగ్లీషు సినిమాహాల్లోలా, పక్కవారితో జతకలిపైనా నవ్వకుండా ప్రియతమ్, సుందరి గంభీర వదనాలతో ఉన్నారు. ‘‘మనిషి సంఘజీవి. ఒకరితో ఒకరు కలిసుండాలి. ఇందులో అనుమానమే లేదు. అలాగని ఒకరు లేకపోతే మరొకరు బతకలేరు అని కాదు, ఒకరికొకరుగా కలసి ఉంటూనే ఎవరి వ్యక్తిత్వం వారు చాటుకోవాలి. ఎవరి అస్తిత్వం వారు నాటుకోవాలి. ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే కదా ప్రేమలు, అభిమానాలు పుడతాయి; బంధాలు బలపడతాయి. అప్పుడే కదా ఈ సమాజమే అందంగా ఉంటుంది. అందం అంటే– నేను చెప్పే అందం, మీరు చూసే అందం ఒకటి కాదు. విశ్వమానవ కళ్యాణంలోని అందాన్ని, వసుధైక కుటుంబంలోని బంధాన్ని నేను చూస్తున్నాను’’ భక్తులంతా గొప్ప ఊరటని, ప్రశాంతతను పొందిన అనుభూతితో తేలిపోయారు. అంతటి ఆనందాన్ని తట్టుకోలేని కొందరి గుండెలు ఉప్పొంగిపోగా కళ్లవెంట జలజలా ఆనందబాష్పాలు రాలాయి.స్వామివారు ఆ రోజుకి స్వస్తి చెప్పి లేవగానే భక్తజనం కూడా ఎవరిళ్లకు వారు వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు.ప్రియతమ్, సుందరి మనసులపై స్వామివారి కొన్ని మాటలు బలమైన ముద్ర వేశాయి. ‘‘..ఎవరి వ్యక్తిత్వం వారు చాటుకోవాలి. ఎవరి అస్తిత్వం వారు నాటుకోవాలి’’ ఈ మాటలు పదే పదే వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.స్వామివారి మాటల్లోని పూర్తి సారాంశాన్ని తీసుకోకుండా, తమకు కావల్సింది మాత్రమే పట్టుకొని రాత్రి పడుకున్నాక కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయారు. ఆఫీసుకు రెడీ అవుతున్న ప్రియతమ్ మనసులో పరిపరి విధాలా ఆలోచనలతో హాల్లో నిల్చున్నాడు క్యారియర్ కోసం. సుందరి ఇంతకీ రాదు, అంతకీ రాదు. అసహనం పెరిగిపోసాగింది. పోనీ ‘దీని కేరీజు ఎవడికి కావాలి బయట ఏదోటి తిందాం’ అనుకుంటే ఆ మసాలాలు, బిరియానీలు తన ఒంటికి పడవు. ఏదైనా హోమ్లీగా ఉండాలి. ఈ బలహీనతే దానికి బలమైన ఆయుధమైపోయింది. ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు.సర్దిన క్యారియర్ యథాలాపంగా అతని చేతికిచ్చి మాటామంతి లేకుండా అక్కడే నిల్చుంది. ప్రియతమ్ అడుగుతీసి బయటపెట్టాక గేటు తలుపులు వేయడానికి వెళ్లి అక్కడ అడిగింది‘‘ఖర్చులకు డబ్బులివ్వలేదేం?’’అనిఏవేవో లెక్కలు వేసుకొని, జేబులోంచి పర్సు తీసి ఒకటికి నాలుగుసార్లు లెక్కపెట్టినవే లెక్కపెట్టి సుందరికిచ్చి బండి స్టార్ట్ చేశాడు.గేటు వేసొచ్చి సోఫాలో కూర్చుంది. ‘ఇలా గానుగెద్దులా పడుంటే, చేసి పెడుతుంటే తన విలువేంటో ఆయనకు తెలీట్లేదు. స్వామివారు చెప్పినట్టు ఎవరూ ఎవరికీ తీసిపోయి లేరు. నా వ్యక్తిత్వాన్ని నేనే కాపాడుకోవాలి. బానిస బతుకు బతకడంలో అర్థం లేదు’ అని ఒకటికి పదిసార్లు అనుకుంది.చూస్తుండగానే సాయంత్రమైంది. ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగివస్తున్న ప్రియతమ్ తన వీధిలో రెండిళ్లు దాటీ దాటగానే ఠక్కున అతని స్కూటర్ ఆగిపోయింది. ఎదురుగా కొత్తగా వెలసిన టిఫిన్స్ కొట్టు ‘మీ వంటిల్లు’ కనిపించింది. ‘పేరు కూడా భలే ఉందే’ అనుకుంటూ బండి స్టాండ్ వేసి లోపలికెళ్లాడు. నేతి ఘుమఘుమలతో టిఫిన్లు కూడా అరటాకులో తింటున్న కస్టమర్లతో హోమ్లీగా కనిపించింది. సీరియల్ లైట్ల వెలుగు జిలుగుల్లో తనపాలిట కల్పతరువుగా కనిపించింది. తిన్నగా ఇంటికి పోనిచ్చి బండి పార్క్ చేసి లోపలికి వెళ్లాడు.ప్రియతమ్ వచ్చాక ముందు మంచినీళ్లు, తర్వాత టీ కప్పు అందివ్వడం సుందరి చేసే పని.ఆ వేళ అలాంటిదేమీ జరగలేదు. ప్రియతమ్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి దూరాడు. కాస్సేపటికి హాల్లోకి వచ్చిన ప్రియతమ్కు చేష్టలుడిగినదాన్లా సోఫాలో సుందరి కనిపించింది. ఆమె టీ పెట్టి తీసుకురాలేదు. అతను అడగలేదు.‘తను నోరిడిచి అడగనిది నేనెందుకు ఇవ్వాలి. ఉదయం ఆఫీసుకు వెళ్తూ ఆ రోజు ఇంటి ఖర్చులకు నేనడగకుండా డబ్బులిచ్చాడా? లేదుకదా! గేటు వరకు వెళ్లినతని వెనకే వెళ్లి అడిగితే వీధిలోనే నిలబడి ఆరవైఆరు లెక్కలేసి డబ్బులు చేతిలో పెట్టాడు. కావల్సినవి కొని అన్నీ చేసేసరికి పైసా మిగల్లేదు. ఏమిటీ అవస్థ? ఇంతోటి భాగ్యానికి తనెందుకు పులుముకొని కడుక్కోవడం’ పేపరు చూస్తూ తన ఆలోచనల్లో తనుంది.ప్రియతమ్ డ్రెసప్ అయ్యాడు. చెప్పులు వేసుకొని లుంగీతోనే వీధిలోకి వెళ్లిపోయాడు. సుందరిలో ఒక్క నిముషం ఆశ్చర్యం. అంతలోనే సర్దుకొని తన పనిలో తను పడింది.‘అదేం పేదరాసి పెద్దమ్మ అనుకుంటుందేమో! దాని పుంజు కుయ్యకపోతే కప్పుటీ ఎక్కడా దొరకదనుకుంటుందేమో! రెండడుగులు వేస్తే అద్భుతమైన దుకాణం ఉందిప్పుడు. దానికా సంగతి తెలీదేమో! ఇంతకు ముందు రెండు వీధులు దాటి రోడ్డుకు వెళ్తేకాని టీ కాఫీ ఫలహారాలు కనపడేవి కావు. అవి కూడా మనకి కావల్సినట్లు ఉండేవి కావు. అయినా అంతదూరం ఎవడెళ్తాడ్రా బాబూ అనుకుంటూ ఇంట్లోనే దేవులాడాల్సి వచ్చేది.కొత్త దుకాణం ఆ బాధలన్నీ తీర్చింది’ అనుకుంటూ ఓ టీ కొనుక్కొని ఆక్కడే కాస్సేపు గడిపి ఏ టైమ్లో ఏయే వస్తువులు ఉంటాయో తెల్సుకొని ఆనందంగా ఇంటికొచ్చాడు.‘ఏమిటీ మనిషి? ఇంటికొచ్చిన వెంటనే టీ చుక్క పడకపోతే పిచ్చెక్కిపోయేవాడు. అలాంటి చిహ్నాలేవీ లేకుండా హుషారుగా కనిపిస్తున్నాడు’ అనుకొని వంటగదిలోకి వెళ్లి తన పనిలో పడింది.భోజనాల వేళైంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ‘‘భోజనం రెడీ’’ అంది సుందరి.‘ఏమిటి! హోటల్ ముందు బోర్డు పెట్టినదాన్లా ‘భోజనం రెడీ ఏంటి. భోంచేద్దురుగాని రండి అంటే దాని సొమ్మేమైనా పోతుందా? నా సొమ్మేగా! అయినా దానికి టీ తాగే అలవాటు లేదు. అందుకే అడిగితే కాని ఇవ్వట్లేదు. కాని, తిండి తినాలిగా. అందుకే నన్నూ పిలిచిందన్నమాట. ఏదైతేనేం, వద్దని పస్తుండలేం కదా’ అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.అందని అందాల అంచుకే చేరిననూ.. విరిసిన పరువాల లోతులే చూసిననూ.. తనివి తీరలేదే’’ పాట టీవీలో వస్తోంది. విసురుగా లేచి వెళ్లి టీవి కట్టేశాడు ప్రియతమ్. భోజనం ముగించి బెడ్ రూమ్లోకి వెళ్లిపోయాడు.పనులన్నీ ముగించుకొని సుందరి కూడా వెళ్లి పడుకుంది.‘ఏవిటీ అవస్థ? ఇంతకు ముందు మొక్కుబడిౖకైనా తమ మధ్య పొడి పొడి మాటలుండేవి. ముఖాన గంటు పెట్టుకొని పడుండేవాళ్లం కాము. ప్రవచనం దగ్గరకు వెళ్లొచ్చాక ఇద్దరిలోనూ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఉన్న సంకోచాలు పోయి లేని తెగింపులు పుడుతున్నాయేంటి! ఇది ఎక్కడకి దారి తీస్తుంది? తెగని ఆలోచనలతో సుందరి ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో ఏమో!తెల్లవారింది. ఎవరి పనుల్లో వారున్నారు. ప్రియతమ్కు బెడ్ టీ అలవాటు. అలాగని నిద్రకళ్లతో, పాచిమొఖంతో తాగడు. నిద్రలేచి, వాష్రూమ్ అవసరాలు తీర్చుకొని బ్రష్ చేసి హాల్లో కూర్చొని పేపర్ చూస్తు ఉన్నవాడికి సుందరి టీ తెచ్చి ఇస్తుంది. అది లేటయితే అతనిలో అసహనం అంతకంతకు పెరుగుతుంటుంది. నిరసనను ఏదోరకంగా వ్యక్తం చేసేవాడు. అప్పటికీ ఆలస్యమైతే ‘‘లోపల ఏం వెలగబెడుతున్నావ్. టీ తెస్తున్నావా లేదా?’’అని అరిచేవాడు.ఈవేళ హాల్లోకి ప్రియతమ్ వచ్చాడు. కానీ టీ రాలేదు.‘మనిషొచ్చాడు. కానీ రంకె వేయలేదేంటి? చూద్దాం. ఏం చేస్తాడో. నిన్న సాయంత్రం పెద్ద ఫోజుగా బయటికెళ్లి పోయాడుగా’ అనుకుంటూ వంటగదిలోనే ఉంది సుందరి.ప్రియతమ్ సోఫా మీదున్న న్యూస్ పేపర్ తీశాడు. నిల్చొనే పేజీలు తిరగేస్తూ హెడ్లైన్స్ ్స ఒకసారి చూశాడు. టీ కోసం ఎదురు చూసినవాడిలా కనిపించకుండా చెప్పులు వేసుకొని లుంగీలోనే రోడ్డుకు వెళ్లిపోయాడు.సుందరి చిన్నపాటి కుదుపుకి లోనయింది. ‘ఏవిటీ మనిషి! ఉలకాయిస్తున్నాడా నన్ను? ఉలకాయించనీ. ఉలకాయించిన మొగుడ్ని ఉడతెత్తుకు పోయిందని.. ఎన్నాళ్లు ఉలకాయిస్తాడో నేనూ చూస్తాను’ అనుకుంటూ పనిలో పడింది.కాస్సేపటికి వచ్చిన ప్రియతమ్ సరాసరి వాష్రూమ్లోకి దూరిపోయాడు. మరి కాస్సేపటికి డ్రసెప్పై హాల్లోకి వచ్చాడు. సుందరి క్యారియర్ కట్టీసి అతను చూస్తుండగా టేబుల్ మీద పెట్టింది.ప్రియతమ్ పర్సులోంచి డబ్బులు చేతికొచ్చింది వచ్చినట్లు తీసి టేబుల్ మీద పెట్టాడు. అవి సరిపోతాయా చాలవా ఆన్న ఆలోచన ఆ సమయంలో అతనికి కలగలేదు.ప్రియతమ్ వెళ్లిపోయినా చాలాసేపు అలా సోఫాలో కూర్చుండిపోయిన సుందరి బలవంతంగా ఆలోచనల్ని మళ్లించడం కోసం యథాలాపంగా న్యూస్పేపర్ చేతిలోకి తీసుకొని తిరగేస్తూ చటుక్కున ఓ వార్త దగ్గర ఆగిపోయింది. ఆసక్తిగా వార్తను సాంతం చదివింది. ఆ తర్వాత తనకు స్పష్టమైన ఓ దారి, గమ్యం కనిపించినంత ఆనందంగా లేచింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన ప్రియతమ్ కంగుతిన్నాడు. ఇంటికి తాళం వేసుంది. దానికో చీటీ తగిలించి ఉంది. ‘తాళాలు పక్కింటి ఆంటీవాళ్ల దగ్గరున్నాయి’ అని రాసుంది దానిమీద. ఎప్పుడూ జరగలేదిలా. ఆశ్చర్యపోతూనే వెళ్లి తాళాలు తెచ్చి తలుపులు తెరిచాడు. హాల్లో లైటు వేయగానే టేబిల్ మీద చిన్నసైజు లెటర్ కనిపించింది. ‘‘నేనెక్కడికి వెళ్లానా అని ఆలోచించకండి. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను అడుగుతీసి అడుగెయ్యలేననే కదా మీ ధైర్యం. నేను కుక్కిన పేనులా పడుంటాననే కదా మీ నమ్మకం. నాలాంటి వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. ఆర్టీసి బస్సుల్లో మా ఇష్టం వచ్చిన చోటుకు మా ఇష్టం వచ్చినట్లు తిరిగే స్వేచ్ఛ లభించింది. నా కోసం వెతకొద్దు’’అదీ మ్యాటర్. ప్రియతమ్ లిప్తపాటు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతలోనే సర్దుకున్నాడు. ‘సరే. ఆ ముచ్చట కూడా చూద్దాం. అది లేకపోతే నాకు తిండి దొరకదా ఏంటి. ఎలా వెళ్లింది అలాగే వస్తుందిలే. రాకపోయినా వచ్చిన నష్టం లేదు హోమ్లీ హోటలుంది’ అని తనకు తాను చెప్పుకొని శుభ్రంగా ఫ్రెష్ అయి లుంగీలోనే రోడ్డు మీదకు వెళ్లాడు. కొత్త కొట్టు దగ్గరకి వెళ్లాడు. వేడి వేడిగా ఓ సమోసా తిన్నాడు. ఆనక ఓ స్పెషల్ టీ తాగాడు. అక్కడ మంత్లీ కార్డు సిస్టమ్ కూడా ఉందని తెలుసుకొని డబ్బు కట్టేశాడు. ఉదయం టీ తాగడానికి వెళ్లినప్పుడు క్యారియర్ ఇచ్చేస్తే ఆఫీసుకు బయల్దేరే సమయానికి మంచి భోజనంతో క్యారియర్ రెడీ చేస్తారంట! ‘తంతే భోజనశాలలో పడ్డాం’ అనుకుంటూ తనలో తను నవ్వుకుంటూ ఇంటికొచ్చాడు. కాస్సేపు ఇలా అలా గడిపేసి డిన్నర్ టైమ్ కాగానే మళ్లీ కొత్తకొట్టుకు వెళ్లి తృప్తిగా భోజనం చేసేసి వస్తూ వస్తూ దార్లో ఓ మిఠాయి కిళ్లీ కూడా కట్టించుకొని వేసుకొని డర్రుమని ఓ తేనుపు తీసి ఇంటికొచ్చి నడుం వాల్చీ వాల్చగానే హాయిగా నిద్రలోకి వెళ్లిపోయాడు.∙∙ ఆ రోజు ఉదయం ప్రియతమ్ ఆఫీసుకు వెళ్లగానే పేపరు చదువుతున్నది ‘ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ్టి నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. సిటీలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఎన్ని సార్లయినా వాళ్లు స్వేచ్ఛగా ప్రయాణించ వచ్చు’ అన్న వార్త చదివి ఎగిరి గంతేసింది. ఇక క్షణం కూడా నిలవలేక పోయింది. గబగబ పనులన్నీ ముగించుకొని చిన్న సంచిలో ఓ రవిక జాకెట్టు పెట్టుకొని ఇంటికి తాళం వేసి, దాని చెవి పక్కింటాంటీకి ఇచ్చి, రోడ్డు మీదకు వెళ్లీ వెళ్లగానే బస్సు. వెనకా ముందు చూడకుండా ఎక్కీసింది. అప్పుడు ఉదయం 11. భరత్నగర్ దగ్గర సుందరి ఎక్కిన బస్సు అనేక స్టాపుల్లో ఆగుతూ దిల్షుక్ నగర్ మీదుగా వెళ్తోంది. దిల్షుక్ నగర్లో సాయిబాబా మందిరం గుర్తొచ్చి ఒక్కసారి ఒళ్లు పులకరించింది. మరో ఆలోచన లేకుండా అక్కడ దిగేసింది. ఎప్పటినుంచో దాచుకున్న వందో నూటయాభయ్యో రూపాయల్ని ఎందుకైనా మంచిదని పట్టుకొంది. బాగా దాహమేసి గొంతెండిపోతుంటే ముందు ఓ సోడా తాగింది. చాలా ఆనందమేసింది. గోలీ సోడాతో దాహం తీరినందుకు కాదు, స్వతంత్రంగా ఓ సోడా కొనుక్కోగలిగినందుకు. తర్వాత బాబాను దర్శించుకుంది. ఈలోగా ఉచిత భోజన వితరణ వేళయింది. ‘ఏమి నా భాగ్యం’ అనుకుంటూ బాబా ప్రసాదం ఆరగించింది. కొద్దిసేపు మందిరమంతా కలియతిరిగి అక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్లే బస్సు ఎక్కీసింది. అక్కడ బస్సు మారి చిలుకూరు వెళ్లింది. బాలాజీని దర్శించుకొని తిరిగి మెహిదీపట్నం వచ్చింది. పెద్దపెద్ద స్తంభాల మీద వంకీలు తిరిగున్న బ్రిడ్జిని, స్తంభాల మధ్యనుంచి రాకపోకలు సాగించే బస్సులు, కార్లు, స్కూటర్లను ఎప్పుడూ చూడని అందాలను తనివితీరా సంతోషంగా చూసి తర్వాత కూకట్పల్లి వెళ్లే బస్సు ఎక్కి తాము ప్రవచనం విన్న గుడికి చేరింది. స్వామివారు ప్రవచనం ముగించినట్లున్నారు భక్తులెవరూ లేరు. తను వెళ్లి దేవుడ్ని దర్శించుకొని దేవాలయంలో ఓ మూల కూర్చొంది. కాస్సేపటికి పూజాదికాలు ముగించి మంగళహారతులిచ్చేసి గుడి తలుపులు వేసేసి వచ్చిన పూజారికి ఓ మూల కూర్చున్న సుందరి కనిపించింది. ‘‘ఎవరమ్మా నువ్వు. గుడి తలుపులు కూడా వేసేశాం. చూసుకో లేదా. నువ్వు ఇక్కడే ఉండిపోయావు’’ అన్నారు.‘‘లేదు స్వామీ. ఈ రోజు నేనిక్కడే ఉందామనుకుంటున్నాను. దూరం నుంచి వచ్చాను’’అంది సుందరి‘‘అలాగా! అయితే భక్తుల విశ్రాంతి మందిరం ఉంది. అక్కడుండమ్మా!’’ అన్నారు.అలా అక్కడ ఆశ్రయం పొందిన సుందరి తెల్లవారే లేచి, అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని, స్నానపానాలు కానిచ్చి దేవుని దర్శించుకొని బయటపడింది. ఆ రోజు కూడా తను చాలా చోట్లకు తిరిగి తిరిగి రాత్రికి మళ్లీ అక్కడికే చేరుకుంది.ప్రియతమ్కు బ్యాచిలర్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ‘టైమ్కు అన్నీ అందితే, ఈ సంసారం అనే జంఝాటమెందుకు? బ్యాచిలర్ బతుకే సో బెటర్ అయితే ఫోర్స్డ్ బ్యాచిలర్ బతుకు సోమచ్ బెటర్’ అని రోజు రోజుకీ హుషారుగా ఉన్నాడే కానీ ‘కట్టుకున్నది ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లిందో, ఏమైపోయిందో ఏమిటో’ అని ఆమె మీద ధ్యాస గాని, ఆశ గాని లేకుండా గడిపేస్తున్నాడు.ఇలా ఇద్దరూ ఒకరి నొకరు తలచుకోకుండా రెండు మూడు రోజులు గడిపేశారు. కాని, ఆ రోజు కథ అడ్డం తిరిగింది. విచిత్రంగా ఇద్దరి కొత్త జీవితం ఊహించని మలుపు తిరిగింది.ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న ప్రియతమ్ బండి ఒక్కసారి గాలి తీసినట్లు ఆగిపోయింది. కొత్తకొట్టు మూసేసి ఉంది. ఆ రోజు భోగి పండగ. సంక్రాంతికి వీధుల్లోని టీ, టిఫిన్స్ మీల్స్ దుకాణాలన్నీ బంద్ చేసి సొంతూళ్లకు వెళ్లిపోతారు. సాయంకాలాలు, పండువెన్నెలలు, పండుగలు పబ్బాలు లేకుండా అంగళ్లమీద ఆధారపడుతూ యాంత్రికంగా గడిపేవారికి ఆ మూడు రోజులు చెప్పరాని ఇబ్బందే! భోగి ముందు రోజు తను ఆఫీసులోనే ఉండిపోవల్సి వచ్చింది. తనతోపాటు మరొ నలుగురైదురుకీ అదే పరిస్థితి. పెద్దపండగకి మెజార్టీ స్టాఫ్ సెలవులు పెట్టేయడంతో మిగిలినవారిమీద వర్క్ ప్రెజర్. డబుల్ డ్యూటీలు చేస్తేగాని పెండింగ్ అంతా క్లియర్ కాలేదు. ఆ హడావిడిలో హోటళ్ల సంగతే మరిచాడు ప్రియతమ్.డీలా పడిపోయి ఇంటికొస్తున్నవాడికి సుందరి గుర్తొచ్చింది.∙∙ సాయంత్రం వరకూ ఎక్కడెక్కడికో వెళ్లి అలవాటుపడ్డ గుడికి తిరిగొస్తున్న సుందరికి షాక్ తగిలింది. ఆలయ నిర్వాహకులు గుడిలోకి ఎవరినీ రానివ్వడం లేదు. లోపల ఉన్నవారిని వెతికి వెతికి బయటకు పంపించేస్తున్నారు. కొద్ది సేపట్లో చంద్రగహణం. అందుకే ఆలయం మూసేస్తున్నారు. సంప్రోక్షణం చేశాక మళ్లీ మర్నాటి వరకు ఆలయాన్ని తెరవరు. దర్శనాలు బంద్.సాయంత్రం బస్సులో తిరిగొస్తున్నప్పుడు అందరూ అనుకుంటుంటే తెల్సింది.. ‘ఈ వేళ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్’ అని. తమ డిమాండ్లు తీర్చకపోతే సమ్మెకు దిగుతామని కార్మికులు ఎప్పుడో నోటీసు ఇచ్చారట! షరా మామూలుగా ప్రభుత్వం నాన్చి నాన్చి సంక్రాంతికి బస్సు సర్వీసులు లేకపోతే జనాగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కార్మిక నాయకులతో చర్చలు మొదలుపెట్టిందట! ఆ చర్చలు మరో గంటో ఘడియలో సక్సెస్ అయితే సమ్మె ఉండదు. చర్చలు విఫలమైతే? ఏం పర్వాలేదులే, నేను నమ్ముకున్న దేవుడి గుడి ఉందిగా అని ధీమాపడ్డ సుందరికి చెంపదెబ్బ గోడదెబ్బలాగ గుడి, బస్సుల సంగతి తెల్సి నవనాడులు కుంగిపోయాయి.అక్కడే ఓ మూల గుడి స్తంభానికి జేరబడి కూలబడిపోయిన సుందరికి ప్రియతమ్ గుర్తొచ్చాడు.అందర్నీ పంపేస్తూ సుందరి దగ్గరికి వచ్చిన స్వామివారు, ‘‘అదేంటమ్మా. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. తలుపులు వేసేస్తారు. వెళ్లిపో’’ అంటూ ఆమె కళ్లలోకి చూసి అవాక్కయ్యారు. సుందరి కళ్లల్లో నీటిపొరను చూసి విచలితులయ్యారు. ఏమైందో అడిగి అంతా తెల్సుకున్నారు. ‘‘ఇదేంటమ్మా. ఇలాగేనా కాపురాలు చెయ్యడం. నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి కదా. నీ తెలివితేటలు ఏమయ్యాయి? మీ ఆయన ఫోన్స్ నంబరు చెప్పు’’ అనేసరికి తడిగొంతుతో నంబరు చెప్పింది.కాస్సేపట్లోనే గుడిదగ్గరికొచ్చిన ప్రియతమ్ సుందరిని చూసి అలా ఉండిపోయాడు కాని, దగ్గరికి వెళ్లలేదు. సుందరి కూడా ఒకడుగు వేయబోయి ఆగిపోయింది. వీళ్లవస్థ చూసిన స్వామివారు ‘‘బాగుంది మీ వాలకం. ఇంత దూరం వచ్చినవాడివి దగ్గరకు రాలేవా? ఏమ్మా ఆయన వెనక ఏడడుగులు నడిచినదానివి ఒక్కడుగుతో ఆగిపోయావేం! మీకు మీరే గొప్ప అని ఎవరికి వారు అనుకుంటూ బంగారంలాంటి బంధాన్ని పాడుచేసుకుంటున్నారు. బంధమనేది ఉల్లిపాయ చందంలా పొరలు పొరలుగా బలపడాలి. వద్దనుకొని కట్ చేసుకుంటే కన్నీళ్లే వస్తాయి. పెట్రోల్ పడ్డ దగ్గర అగ్గిపుల్ల పడ్డట్టు కాకుండా పప్పు వొలికిన చోట నెయ్యి వొలికినట్లుగా కాపురం సాగాలి’’ అని ఇద్దరి చేతులు కలిపేసి తలుపేసేశారు.దగ్గరి కొచ్చిన సుందరి ఏదో అపరాధభావంతో తలొంచుకొని ఉండిపోయింది. ప్రియతమ్ ఆమె భుజాలపై చేయి వేసి ధైర్యం చెబుతున్నవాడిలా దగ్గరికి తీసుకున్నాడు. బండి స్టార్ట్ చేసి కనిపించిన గతుకుల్ని తప్పించుకుంటూ స్మూత్గా డ్రైవ్ చేసుకొని వెళ్తుంటే..‘‘సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదుకదా.. నీ అందచందాలింక నావె కదా’’ అన్న పాట దూరం నుంచి మైకులో వినపడుతోంది.పాట వింటూ సుందరి ప్రియతమ్ను గట్టిగా పట్టుకొని అల్లుకుపోయింది.∙ -
Rama Navami 2025: పిబరే రామరసం..
‘రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమఃరాజా సర్వస్య లోకస్య దేవానం మఘ వానివ’శ్రీరాముడి వ్యక్తిత్వం ఏమిటో తెలిపే ఈ శ్లోకాన్ని మారీచుడి నోట పలికించాడు వాల్మీకి. రాముడు అంటే మూర్తీభవించిన ధర్మం. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధుజీవనుడు. అతడి పరాక్రమానికి తిరుగు లేదు. దేవతలకు దేవేంద్రుడు ప్రభువు అయినట్లుగానే, సకల చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్ముడు శ్రీరాముడు. శ్రీమహావిష్ణువు దాల్చిన దశావతారాలలో రామావతారం పూర్ణావతారం. వేదవిహితమైన ధర్మం భౌతిక నేత్రాలకు గోచరించదు. ఆచరణీయమైన ధర్మం ఆకారం దాల్చాలనే కోరికతో శ్రీరాముడి రూపంలో భూమిపై అవతరించిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. వాల్మీకి రచించిన రామాయణం మనకు ఆదికావ్యం. ‘ఆయనం’ అంటే గమనం అని అర్థం. రాముడి గమనమే రామాయణం. భూమ్మీద నరుడిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి– ఇదీ ధర్మం అని సర్వలోకాలకు చాటిచెప్పాడు శ్రీరాముడు.రామాయణ గాథ మన దేశంలో పామరులకు కూడా తెలుసు. శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్యదైవమే కాదు, ఆదర్శదైవం కూడా! ఆసేతు హిమాచలం మన దేశంలో రామాలయాలు లేని ఊళ్లు ఉండవు. అయోధ్య నగరంలో పుట్టిన రాముడు పితృవాక్య పరిపాలన కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. రాముడు వనవాసంలో ఉండగానే, సీతాపహరణం జరిగింది. సీతను అపహరించిన రావణుడి జాడ వెదుక్కుంటూ, దండకారణ్యంలో సంచరిస్తున్న శ్రీరాముడిని హనుమంతుడు తొలిసారిగా కలుసుకున్నాడు. ఆనాటి నుంచి ఆయనకు నమ్మినబంటు అయ్యాడు. రామలక్ష్మణులను తన ప్రభువు సుగ్రీవుడి వద్దకు తీసుకుపోయి, అతడితో మైత్రి కుదిర్చాడు. సుగ్రీవాజ్ఞతో సీతను వెదకడానికి వానరవీరులు నలుదిక్కులకూ బయలుదేరారు. దక్షిణంవైపు బయలుదేరిన బృందంలో ఉన్న హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకకు చేరుకుని సీతమ్మవారి జాడ కనుగొన్నాడు. ఆమెకు కనిపించి, ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత లంకాదహనం చేసి మరీ రామదండు ప్రతాపం ఎలాంటిదో రావణుడికి రుచి చూపించాడు. లంక నుంచి తిరిగి వచ్చి, శ్రీరాముడికి సీతమ్మవారి క్షేమ సమాచారాన్ని తెలిపాడు. వానరసైన్యంతో లంకకు చేరుకున్న రాముడు చివరకు రావణుడిని వధించి, సీతను అయోధ్యకు తీసుకువచ్చి, పట్టాభిషిక్తుడయ్యాడు. స్థూలంగా ఇదీ రామాయణం. రామాయణం దేశ విదేశాల్లోని పలు భాషలలోకి అనువదితమైంది. రామాయణానికి సంబంధించి వేర్వేరు భాషలలో వేర్వేరు కథలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రామాయణాలు ఉన్నా, వాల్మీకి విరచితమైన రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. శ్రీరాముడి ధర్మనిరతికే కాదు, ఉదాత్తతకు, స్వదేశాభిమానానికి కూడా రామాయణంలో ఉదాహరణలు ఉన్నాయి. రావణ సంహారం తర్వాత లంకాపుర వైభవాన్ని తిలకించి, లక్ష్మణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎటు చూసినా స్వర్ణకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది లంకానగరం. ‘అన్నా! ఈ లంకానగరం స్వర్ణకాంతులతో ఎంత శోభాయమానంగా ఉందో కదా!’ అన్నాడు లక్ష్మణుడు. అందుకు బదులుగా శ్రీరాముడు చిరునవ్వు చిందిస్తూ–‘అపి స్వర్ణమయీం లంకామ్ లక్ష్మణ కానన రోచతేజననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని పలికాడు.అంటే, ‘లక్ష్మణా! ఈ లంకానగరం ఎంతగా బంగారు కాంతులతో ధగధగలాడుతున్నా, ఇది నాకు రుచించడం లేదు. కన్నతల్లి, పుట్టిననేల స్వర్గం కంటే గొప్పవి’ అని పలికాడు. రావణుడిని సంహరించి, యుద్ధంలో జయించినా, రాముడు లంకను స్వాధీనం చేసుకోలేదు. విభీషణుడిని లంకకు పట్టాభిషిక్తుడిని చేసి, సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చేశాడు. శ్రీరాముడి స్వదేశాభిమానానికి ఇది మచ్చు తునక. రామ రావణ యుద్ధంలో రావణుడు మరణించాక, ‘నా అన్న అయినా, ఇతడు పాపాత్ముడు. ఇటువంటి పాపాత్ముడికి అంత్యక్రియలు చేయడం కూడా పాపమే’ అని నిష్ఠురంగా పలికాడు విభీషణుడు. అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి హితవు చెప్పాడు.‘మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనంక్రియాతాం అన్య సంస్కారో మయాప్యేష యథాతవ’ అని పలికాడు. అంటే, ‘వ్యక్తులు మరణించిన తర్వాత వారితో వైరం ఉండకూడదు. ఇతడికి అంత్యక్రియలు చెయ్యి. ఇతడు నీకులాగానే నాకు కూడా గౌరవార్హుడే!’ అన్నాడు. ఇది శ్రీరాముడి ఔదార్యానికి ఉదాహరణ. శ్రీరాముడు ఇంతటి ఉదాత్తుడు, ధర్మనిరతుడు కావడం వల్లనే ప్రజలకు ఆరాధ్య దైవమయ్యాడు. శ్రీరామ నవమి వేడుకలుశ్రీరాముడు చైత్ర శుక్ల నవమి నాడు జన్మించాడు. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి చేరుకున్నాక ఇదే తిథినాడు పట్టాభిషిక్తుడయ్యాడని, సీతారాముల కల్యాణం కూడా చైత్ర శుక్ల నవమి రోజునే జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామ నవమి రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లోనూ, ఊరూరా ఏర్పాటు చేసే మంటపాల్లోను సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేసవి ప్రారంభంలో వచ్చే పండుగ కావడంతో శరీరానికి చలవ చేసే వడపప్పును, పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తెలంగాణలోని భద్రాచలంలోను, ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలోను శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకల్లో నైవేద్యంగా గోధుమరవ్వ హల్వా, పూరీలు, గోధుమపిండితో తయారు చేసే ‘పింజిరి’ అనే మిఠాయి, పాయసం, ఉడికించిన శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు. భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల గురించి తెలుగు ప్రజలకు తెలుసు. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య సహా దేశ విదేశాల్లో పలుచోట్ల విశేషమైన రామాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా పురాతనమైనవి కూడా ఉన్నాయి. అయోధ్య సహా కొన్ని అరుదైన రామాలయాల గురించి తెలుసుకుందాం.అయోధ్య బాల రామాలయంశ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో నిర్మించిన బాల రాముడి (బాలక్ రామ్) ఆలయం గత ఏడాది జనవరి 22న ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయంలో నెలకొల్పిన బాల రాముడి విగ్రహానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. అయోధ్య బాల రామాలయంలో ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. జనక్పూర్ సీతా రాముల ఆలయాలుసీతమ్మవారి జన్మస్థలమైన జనక్పూర్ నేపాల్లో ఉంది. ఇక్కడ పురాతన జానకీమాత ఆలయం ఉంది. ఇదే పట్టణంలోని కులదేవీ ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా రామాలయం ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా జనక్పూర్లోని జానకీమాత ఆలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు వారం రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. సీతారాముల విగ్రహాలకు అభిషేకాలు జరిపి, మైథిలీ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు. లక్షలాది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మైథిలీ సంస్కృతికి అద్దంపట్టేలా పలు సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఓర్ఛా రాజారామ్ ఆలయంమధ్యప్రదేశ్లోని ఓర్ఛా పట్టణంలో పురాతన రాజారామ్ ఆలయం ఉంది. ఓర్ఛా మహారాజు మధుకర్ షా జు దేవ్ పదహారో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాజప్రాసాదాన్ని తలపించేలా అడుగడుగునా రాజసం ఉట్టిపడే ఈ ఆలయంలో శ్రీరాముడు సింహాసనంపై సీతాసమేతంగా ఆసీనుడై తన పరివారంతో కొలువుదీరి భక్తులకు కనువిందు చేస్తాడు. సీతారాముల సింహాసనానికి çకుడివైపు లక్ష్మణుడు, ఎడమ వైపు సుగ్రీవుడు, కిందన ప్రార్థిస్తున్న భంగిమలో హనుమంతుడు, జాంబవంతుడు ఉంటారు. ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.నాసిక్ కాలారామ్ ఆలయంనాసికా త్రయంబకేశ్వరం శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. గోదావరి నది పుట్టిన చోటు ఇక్కడే ఉంది. ఇదే పట్టణంలో పురాతనమైన రామాలయం కూడా ఉంది. దీనిని స్థానికులు ‘కాలారామ్’ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో రాముడి విగ్రహాన్ని నల్లరాతితో మలచడం వల్ల ‘కాలారామ్’ అనే పేరు వచ్చింది. ఆలయ ప్రవేశమార్గంలో నల్లరాతితో మలచిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం రాష్ట్రకూటుల నాటిదని చరిత్రకారుల అంచనా. సుమారు ఏడో శతాబ్దినాటి ఈ ఆలయంపై దండయాత్ర జరిగినప్పుడు విగ్రహాలను ఒక బావిలో పడవేశారు. తర్వాత వాటిని బయటకు తీసి, పునఃప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణానికి పద్దెనిమిదో శతాబ్ది తొలినాళ్లలో సర్దార్ రంగారావు ఓఢేకర్ నిధులు సమకూర్చారు. శ్రీరామ నవమినాడు ఈ ఆలయంలో ఘనంగా వేడుకలు జరుగుతాయి.కుంభకోణం రామస్వామి ఆలయంతమిళనాడులోని కుంభకోణంలో పదహారో శతాబ్ది నాటి రామస్వామి ఆలయం ఉంది. తంజావూరు నాయక రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం దేశంలోని పురాతన రామాలయాల్లో ఒకటి. అచ్యుతప్ప నాయకుని హయాంలో మొదలైన దీని నిర్మాణం రఘునాథ నాయకుని కాలంలో పూర్తయింది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. జమ్ము రఘునాథ ఆలయంజమ్ము నగరంలో తావి నదీ తీరానికి ఉత్తరాన రఘునాథ స్వామి ఆలయం ఉంది. పద్దెనిమిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణంలో రఘునాథుడిగా శ్రీరాముడు కొలువైన ఆలయం ప్రధానమైనది. ఇదే ప్రాంగణంలో సూర్యభగవానుడి ఆలయం, శ్రీమహావిష్ణువు ఆలయం కూడా ఉన్నాయి. రఘునాథ స్వామి ఆలయంలో సీతా రామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు కొలువై కనిపిస్తాయి. ఏటా శ్రీరామ నవమి రోజున ఈ ఆలయంలో సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు.సైదాపూర్ రామ్కుండ్ మందిరంపాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ శివార్లలోని సైదాపూర్లో పురాతనమైన రామ్కుండ్ మందిరం ఉంది. వనవాస కాలంలో సీతా రామ లక్ష్మణులు ఇక్కడ కొంతకాలం గడిపారని చెబుతారు. పదహారో శతాబ్దిలో అంబర్ పాలకుడు మాన్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరువలో ఉన్న తటాకాన్ని ‘రామ్ కుండ్’ (రామ కుండం) అని పిలుస్తారు. ఈ తటాకానికి చేరువలోనే భక్తుల బస కోసం ధర్మసత్రాన్ని కూడా మాన్ సింగ్ కాలంలోనే నిర్మించారు. ఇస్లామాబాద్ నగరాభివృద్ధిని పర్యవేక్షించే రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (కేపిటల్ డెవలప్మెంట్ అథారిటీ) 2006లో ఈ ఆలయాన్ని పర్యాటక ఆకర్షణగా మలచేందుకు చర్యలు చేపట్టి, విగ్రహాలను తొలగించింది. అప్పటి నుంచి ఇక్కడ పూజాదికాలు నిలిచిపోయాయి. అయితే, దీనిని సందర్శించుకోవడానికి పర్యాటకులను మాత్రం అనుమతిస్తున్నారు.అమృత్సర్ రామతీరథ్ మందిరంపంజాబ్లోని అమృత్సర్ శివార్లలో రామతీరథ్ మందిరం ఉంది. ఈ ప్రదేశంలోనే సీతమ్మవారు వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందిందని, ఇక్కడే లవకుశులు జన్మించారని స్థలపురాణం చెబుతోంది. రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడే రచించాడని కూడా స్థలపురాణ కథనం. ఈ ఆలయం ప్రస్తుతం కనిపిస్తున్న రూపంలో 2016లో దీనిని పునర్నిర్మించారు. ఈ ఆలయం ఎదుట తటాకం, ఆలయ ప్రాంగణంలోని ఎనభై అడుగుల భారీ ఆంజనేయ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా సీతారామ కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది.∙ -
సరదాగా ఈ సండే చేప, చికెన్తో వెరైటీ స్నాక్స్ చేయండిలా..!
ఫిష్ చిప్స్ కావలసినవి: చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)మైదా పిండి– అర కప్పుమొక్కజొన్న పిండి– పావు కప్పుబేకింగ్ పౌడర్– కొద్దిగాబ్రెడ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్మిరియాల పొడి– అర టీ స్పూన్సోడా వాటర్– కొద్దిగాఉప్పు– తగినంతమసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి)నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. సోడా వాటర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.చికెన్తో స్పైసీ ఎగ్స్కావలసినవి: గుడ్లు– 5 లేదా 6 బోన్లెస్ చికెన్– 1 కప్పు కారం– 2 టీ స్పూన్లుపసుపు– చిటికెడుగరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే చికెన్ మసాలా– 1 టీ స్పూన్ ఉప్పు– తగినంతమిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా బోన్లెస్ చికెన్ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అనంతరం చికెన్ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..) -
Dog: ప్రేమకి, విశ్వాసానికి మారుపేరు..
కుక్క– ధర్మరాజుతో స్వర్గాన్ని, దేవదాసుతో దైన్యాన్ని సమానంగా పంచుకున్న ఈ జాతి విరోధాభాసకు చక్కటి ఉదాహరణ. కుక్కలు అరుచుకుంటాయి, అంతలోనే ఎంతకీ విడివడనంతగా కలుసుకుంటాయి. ప్రేమకి, విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి, అత్యంత నీచమైన తిట్టుగా వాడబడతాయి. వాటి గొడవలతో, అరుపులతో మిగతావాళ్లు పడే భయాన్ని పట్టించుకోనంత స్వార్థంతో ఉంటాయి. ఒక్కటీ అందిరాదని తెలిసినా, పుంజీడు పిల్లల్ని కని; తినీ తినకా, చచ్చీ చెడీ, నిస్వార్థంగా వాటిని పోషిస్తాయి.‘నా బుజ్జి బొచ్చు కుక్కపిల్ల ఏం చేచ్చోంది లా’ అంది వందన అతని వతైన తల చెరిపేస్తూ,‘ఏయ్, ఏంటిది? లే, ఇది హాలు. కిటికీలోంచి కనబడతాం’ అన్నాడు మౌళి లాప్టాప్లో పనిచేసుకుంటూ.‘ఎదురింటివాళ్ళు లేరు లేరా. అయినా ‘చౌ చౌ’ బ్రీడ్ కుక్కపిల్లలా ఇంత జుట్టేంటిరా? నీ జుట్టు నాకుండి, హాయిగా నీకు బట్టతల వస్తే, తిరుపతి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నా’ అంది వందన అతని ఒళ్ళో కూర్చుని, ఒతైన జుట్టుని వేలితో తిప్పుతూ.లాభం లేదని, లాప్టాప్ పక్కన పెట్టి, ‘అయితే తలుపేయ్, జుట్లు పీక్కుందాం’ అన్నాడతను కొంటెగా ఆమెని దగ్గరకి లాక్కుంటూ.‘నోర్మూసుకుని పని చూసుకో! ఇంత పిసరు చనువిస్తే చాలు, రెచ్చిపోతావ్. కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఏదో అప్పుడప్పుడూ ముద్దొస్తావు. అంతమాత్రాన బుద్ధిలేదూ?’ అంటూ అతని క్రాఫ్ సరిచేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది వందన.అంతలో వందనకి ఫోన్ వచ్చింది. ‘ఆ వదినా చెప్పండి, అవునా వెరీ గుడ్. ఆ.. ఇదిగో మీ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి, అలాగే, మేము రేపు ఉదయమే బయల్దేరి వస్తాం’ అంటూ భర్తకేసి తిరిగి, ‘ఏమండీ, మీ అక్క ఫోన్, మీ మేనకోడలు హడావిడి చేసిందట, మాట్లాడండి’ అంటూ ఫోన్ మౌళికి ఇచ్చింది.ఆ రాత్రి. పాలమీగడలాంటి ఆమె వంటిపై పాము కుబుసంలాంటి నైటీ మెరిసిపోతోంది. విరబోసుకున్న కురుల్లో విరిసిన మల్లెలు కారుమబ్బుల్ని చీల్చుకొచ్చిన వెలుతురు చుక్కల్లా ఉన్నాయి.‘రేపు ఊరెళ్తే ఓ మూడురోజులు మళ్ళీ పస్తే. అయినా ఇంతందంగా ఉండే నీకు ఏంగర్ ఇష్యూస్ ఏంటిరా’ అన్నాడతను ఆమెకి చేరువౌతూ.‘అక్కడకి నువ్వేదో శాంతమూర్తివైనట్టు. అయినా సత్యభామ కోపం కూడా కృష్ణుడిపై ప్రేమలో భాగమే! సహిస్తేనే సౌఖ్యం, భరిస్తేనే భోగం’ అందామె కొంటెగా.ఒక్క ప్రథమకోపం తప్పిస్తే, అతనికి ఎలా ఉంటే ఇష్టమో అలాగే ఉంటుంది వందన.అందుకే భర్తొదిలేసిన అక్కని, భార్యొదిలేసిన అన్నని, ఊళ్ళో అమ్మకొదిలేసి మరీ సిటీలో వందనకి వందనంగా ఉంటున్నాడు మౌళి.∙∙ ఆ మర్నాడు ఉదయమే కార్లో బయలుదేరి ఊరికి వెళ్లారు. పిల్లని చాప మీద కూర్చోపెట్టారు. నెమ్మదిగా పేరంటాళ్ళు రావటం మొదలుపెట్టారు.‘అక్కా అందరూ వచ్చారు కదా! ఇంకా దేనికి వెయిటింగ్?’ అడిగాడు మౌళి లోపలికి వస్తూ.‘అదే రా మీ ఆవిడ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళింది. అరగంటయింది, ఇంకా రాలేదు. తను లేకుండా మొదలుపెడితే ఏమనుకుంటుందో అని...’ అంటూ నసిగింది శ్యామల.‘వాళ్ళ వాళ్ళతో ఫోన్ మాట్లాడిందంటే ఓ పట్టాన వదలదు. ఉండక్కా, నేనెళ్ళి తీసుకొస్తా’ అంటూ మేడెక్కాడు మౌళి. అటూ ఇటూ నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వందనని కిందకి రమ్మని సైగ చేశాడు, అతన్ని ఆగమని, ఆమె ఫోన్లో మాట్లాడుతోంది. ‘హా అక్కా, వాళ్ళు పెళ్లి వైజాగ్లో చేయమంటున్నారు అంతేగా. నువ్వేం కంగారు పడకు. మీరు ఓకే అని చెప్పండి. నువ్వు, బావ, నీ కూతురు వచ్చేయండి. మొత్తం నేను చూసుకుంటా. అది నాకూ కూతురే. నేను దగ్గరుండి చేస్తా పెళ్లి. కల్యాణ మంటపం ఇప్పుడే బ్లాక్ చేస్తా’ అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో ఉత్సాహంగా మాట్లాడుతోంది వందన.ఆ సంభాషణ విని మౌళికి చిరాకేసింది. అతనికి తోడల్లుడు అంటే పడదు. నక్కు నక్కుగా ఉండి అందర్నీ వాడుకుంటాడని. దానికి తోడు పెళ్లి హడావిడి అంతా వందన నెత్తి మీదేసుకుంటే ఇంక ఆమె తనకి కనీసం ఓ రెండు మూడు నెలలు దొరకదు.ఆమె ఎంతకీ ఫోన్ ఆపకపోవటంతో ‘హే, ఆపు నీ సోది. ఎప్పుడో ఆర్నెల్ల తర్వాత పెళ్ళి. సాయంత్రానికి మన ఊరెళ్ళిపోతాం, అప్పుడు మాట్లాడుకో. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చాం కదా. అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. రా కిందకి’ అన్నాడు విసుగ్గా. ఇంట్లో తనని ‘పెళ్ళాం కూచి’ అనుకోవటం మౌళికి తెలుసు. అది తప్పని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం కూడా అతనలా మాట్లాడ్డానికి ఓ కారణం.ఆ మాటలు అవతల ఫోన్లో ఉన్న వందన అక్కకి లీలగా వినబడ్డం వల్లనేమో,‘సరే వందనా, అత్తవారింట్లో బిజీగా ఉన్నట్టున్నావు, మళ్ళీ చేస్తాలే’ అని ఫోన్ పెట్టేసింది.అప్పటికే శ్యామల కూడా మేడమీదకి రావటంతో తమ్ముడు మరదల్ని విసుక్కోవటం చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న సంతోషపు తెర వందన చూసింది. అంతే, భర్త చూపించిన విసుగు కంటే, అక్క విందన్న ఉక్రోషంతో, ఆడపడుచు ఉందన్న అవమానంతో, వందనకి కోపం నషాళానికి అంటింది.‘మా అక్క కూతురి పెళ్లంటే నా కూతురి పెళ్లిలాంటిది. శుభమా అని పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే సోది అంటావా? మాటలు మర్యాదగా రానీ’ అంది వందన విసురుగా కిందకి వెళుతూ.అతనూ తగ్గలేదు. ‘చూడూ, మనమా వాళ్ళకంటే చిన్నవాళ్ళం. వాళ్ళు ఎత్తిపెట్టుకుని మనదగ్గరకి వచ్చేస్తే, అన్నీ మనమెక్కడ చూడగలం? పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత. పైగా మీ బావకి కనీసం బండి తొక్కడం కూడా రాదు. ఎక్కడికైనా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఏం? మీ అన్నయ్య కూడా వైజాగ్లోనే ఉంటున్నాడుగా! అతనితో మాట్లాడొచ్చుగా? మీ అక్క నీకే ఎందుకు చెబుతోంది. ఆ పిల్ల వాడికీ మేనకోడలే కదా?’అన్నాడు విసురుగా. అప్పటికే ఇద్దరూ కిందకి దిగారు. శ్యామల ముందే దిగిపోయింది.‘నోర్ముయ్. వాడూ, వీడు అంటున్నావేంటి రా’ వందన ఊగిపోతోంది కోపంతో.‘ఏయ్ మర్యాదగా మాట్లాడు’ అన్నాడు మౌళి. వాళ్లిద్దరూ చుట్టూ ఎవరున్నారో ఎప్పుడో మర్చిపోయారు. ఆ క్షణం వాళ్ళు వీధికుక్కల్ని తలపించారు.‘నీకు మర్యాదిచ్చేదేంటిరా. నోటికొచ్చినట్టు మాట్లాడి సిగ్గులేకుండా రాత్రికి నా పక్కలోకే చేరతావురా కుక్కా’అంతే. మౌళి చుట్టూ చూశాడు. అప్పటికే అక్కడికి చేరిన పేరంటాళ్ళు ఉండాలన్న ఉత్సుకతకీ, ఉంటే గొడవ ఆపేస్తారేమో అనే అనుమానానికి మధ్యలో ఊగిసలాడుతున్నారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు గంటగంటకీ గడియారంలో పక్షి బైటకొచ్చినట్టు అడపాదడపా తలుపు సందుల్లోంచి ఓసారి మొహం బైటపెట్టి మళ్ళీతలుపుచాటుకి వెళ్లిపోతున్నారు. పిల్లలు ఒకప్పుడు చిత్రలహరి చూడ్డానికొచ్చినట్టు కిటికీల దగ్గరకి చేరారు. మౌళి స్పృహలోకొచ్చాడు. అమాంతం తనని లోపలికి తీసుకెళ్ళిపొమ్మని భూదేవిని వేడుకున్నాడు. భూదేవి పలక్కపోవటంతో, ఏం చెయ్యాలో తెలీని ఉక్రోషంతో వందన మీదకి వెళ్ళాడు.‘ఆగక్కడ. నా ఒంటిమీద చెయ్యి పడిందో ఇంటిల్లిపాదినీ జైల్లో తోయిస్తాను’ ఊగిపోతూ వేలు చూపిస్తోంది వందన.అంతే. ఒళ్ళో కూర్చున్న ‘చివావా’ కుక్కపిల్ల వృషణాలు కరిచినట్టు వణికిపోయాడు మౌళి.శ్యామల కారుతున్న చెమటని సైతం లెక్కచేయకుండా ఫ్యాన్ కూడా లేని కొట్టుగదిలోకి పరిగెత్తింది. అమ్మ వెనుకే ఉండి, చిమ్మిలి నలిగిందో లేదో, బెల్లం సరిపోయిందో లేదో ఆరారా రుచి చూస్తున్న విస్సుబాబు తల్లి వెనక్కి మరింతగా ఒదిగిపోయాడు.అందరికన్నా ముందు తేరుకున్నది రామలక్షే్మ! గబ గబా చెయ్యి కడుక్కుని, కోడలికి గ్లాస్తో మంచినీళ్ళిచ్చి, పక్కనే ఉన్న స్టూల్ జరిపి, ‘ముందు నువ్వు కూర్చో తల్లీ, వాడొట్టి మూర్ఖుడు, నేను మందలిస్తా’ అంది.‘చూడండి మీ కొడుకు బుద్ధి. ఏం? నేను మీ అందరితో కలివిడిగానే ఉంటున్నాను కదా. సాయంత్రం ఫోన్ చేస్తే పొద్దున్నకల్లా పరిగెత్తుకుని రాలేదా. నా వాళ్ళు అనుకోబట్టే కదా. అదే నీ కొడుక్కి మాత్రం మా వాళ్లంటే ఎరుసు. ఎప్పుడూ వాళ్ళని చులకనగానే మాట్లాడతాడు’ అంది వందన రొప్పుతూ.రామలక్ష్మి ఆమెని స్టూల్ మీద కూర్చోబెట్టి, మంచినీళ్లు తాగించి ఆమె పక్కనే కింద కూర్చుంది. మౌళిని బైటకి పొమ్మని హెచ్చరించింది. కాసేపాగి, వందన వణుకుతున్న గొంతుతో, ‘ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను. వాడితో నేను వెళ్ళను. నా దగ్గర ఒక్క రూపాయి ఉంచడు నీ కొడుకు. బస్సెక్కి వెళ్ళిపోతా, నాక్కొంచెం డబ్బివ్వండి’ అంది.‘అమ్మా, నువ్వు మంచిదానివి. ఇంటికోడలు ఇలా కంటతడి పెట్టి వెళ్ళిపోతే ఆ చంటిదానికి మంచిది కాదు. ఈ ఒక్కపూట ఉండి సాయంత్రానికి వెళ్లిపోదురు. మీరిద్దరూ విడివిడిగా వెళితే వీధిలో పరువు పోతుంది. వాణ్ణి నేను మందలిస్తాను. నిన్ను ఒక్క మాట అనకుండా ఉండే పూచీ నాది’ అంటూ వందన కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది రామలక్ష్మి.నెమ్మదిగా పేరంటం అయిందనిపించారు. మౌళి, వందన మాట్లాడుకోలేదు.అతికష్టం మీద పిల్లతో ఫోటోకి మాత్రం నించున్నారు. ఆ రోజు సాయంత్రం. మౌళి కారు స్టార్ట్ చేశాడు. రామలక్ష్మి వందన చేతిలో రెండువేలు పెట్టి, ‘అమ్మా, వాడిమాటలేం పట్టించుకోకు. నా బిడ్డలాంటిదానివి. నీకు వాడితో ఎప్పుడు చికాకు అనిపించినా ఇక్కడకు వచ్చేయ్’ అంది.వందన అతని పక్క సీట్లో కూర్చోకుండా వెనక సీట్లో కూర్చుని డోర్ బలంగా వేసింది.ఆ శబ్దానికి రామలక్ష్మి గుండెలు అదిరాయి. కారు కీచు శబ్దం చేసుకుంటూ దుమ్ము రేగ్గొట్టి వెళ్ళింది. రామలక్ష్మి వీధి అరుగుమీద కూలబడింది.రామలక్ష్మికి పదిహేనో ఏట పెళ్లయింది. పద్దెనిమిదికి ముగ్గురు పిల్లలు. భర్తని పిచ్చికుక్క కరవటంతో రేబిస్ వచ్చి ఆర్నెల్లు నరకయాతన పడి మరణించాడు. అతని ఉద్యోగం ఆమెకిచ్చారు. కుక్కపిల్లల్ని తల్లికుక్క పొదువుకుని కాపాడినట్టు పిల్లల్ని పెంచుకొచ్చింది. కూతురు శ్యామలకి చెమటెక్కువ. ‘ఓస్ అంతేనా’ అనుకునేంత కాదు.డాక్టర్కి చూపిస్తే ‘హైపర్ హైడ్రోసిస్’ అని చెప్పేంత. ‘బుల్ డాగ్’లా వాసన కొడుతోందనిపెళ్ళైన వారానికే ఓ పిల్లని కనడానికి సరిపడా ‘అనుభవం’ ఆమెకి వదిలేసి ‘పరియా’ బ్రీడ్వీధికుక్కలా పారిపోయాడు భర్త.రామలక్ష్మి రెండో సంతానం విస్సుబాబు. అమ్మ కూచి. ‘మాస్టిఫ్’ బ్రీడ్ లా ఇంట్లో ఎక్కువ స్థలం ఆక్రమించడం తప్పిస్తే అతని వల్ల రామలక్ష్మికి మరే ఉపయోగం లేదు.పెళ్లయ్యే వరకు ఉద్యోగం ఉంది అనిపించాడు. అవగానే మానేశాడు. భార్య వేరు కాపురం పెట్టమంది. ‘అమ్మని, వదిలి ఎలా వెళ్తాం?’ అన్నాడు. ఎలా వెళ్లాలో ఆమె వెళ్లి చూపించింది. అప్పుడప్పుడూ స్వప్నస్ఖలనాలతో అతనికి భార్యలేని లోటు తెలియలేదు. వీళ్ళిద్దరినీ రామలకే‡్ష్మ పోషిస్తుంది.పిల్లల చిన్నప్పుడు చిలక జోస్యం చెప్పించుకుంది రామలక్ష్మి. ‘పుంజు’లకి, ‘పెట్ట’కి కూడా పెళ్లి గండం ఉందని తెలిసింది. భయపడినట్టుగానే కూతురు, పెద్దకొడుకు పెళ్లిళ్లు పెటాకులైపోయాయి. రెండు డక్ అవుట్ల తర్వాత దిగే బాట్స్మెన్ని పెవిలియన్ నించి చూస్తున్న మేనేజర్లా రామలక్ష్మి దడదడలాడుతూ మూడోవాడైన మౌళికి పెళ్లి చేసింది. కొడుక్కి కోరికెక్కువ, కోడలికి కోపమెక్కువ. వాళ్ళు చిన్న మాట అనుకున్నా ఆమెకి కంగారెక్కువ. ఆ రోజు జరిగిన గొడవతో చిన్నప్పుడు జోస్యం చెప్పిన చిలక ఇప్పుడు ఆమె తల్లో రాబందులా తిరగసాగింది.మౌళి, వందన, వాళ్ళింటికి చేరేటప్పటికి రాత్రయింది. ఇంత తిన్నామనిపించి, బెడ్రూమ్లో ‘ఇగో’ అనే పాముని చెరోవైపు పట్టుకుని సాగదీసి వీసెలకొద్దీ విషాన్ని చిమ్మిన తర్వాత ఏ అర్ధరాత్రికో అమృతం చిలికారు.మరి అదేరాత్రి రామలక్ష్మికి ఎలా గడిచింది? ‘కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో’ అని ఆలోచించటానికి మౌళి మహాకవి కాదు.ఆ మర్నాడు వాళ్లిద్దరూ పన్నెండు రోజులుండటానికి సరిపడా బట్టలూ, గట్రా తెచ్చుకుని మళ్ళీ కార్లో ఊరొచ్చారు. బతికుండగా బువ్వెట్టకపోయినా చితిలో చక్కెర పోశాడు. ఈ పదకొండు రోజులూ పాటించవలసిన నియమాలు చెబుతూ బ్రహ్మచర్యం కూడా పాటించాలని బ్రహ్మగారు మౌళిని చాటుకి పిలిచి చెప్పారు. తలైతే ఊపాడు కానీ, అందరికీ కనబడే భూశయనం, ఏకభుక్తం వరకే పాటించగలిగాడు. మధ్యలో ఓ రోజు రాత్రి వందన అతన్ని ఓదార్చడానికి దగ్గరకి తీసుకున్నప్పుడు పాలమీగడ, పాముకుబుసం మళ్ళీ తెరమీదకొచ్చాయి. ‘చౌ చౌ’ బ్రీడు, ‘చివావా’ బ్రీడూ కలిసి ఆ రాత్రి చిత్తకార్తెని తలపించాయి. అది చూసి (?) రామలక్ష్మి అస్సలు బాధపడలేదు. పైగా వాళ్లిద్దరూ కలిసున్నందుకు ఎంతో సంతోషించడంచేత, ఆమెకి ప్రేతత్వ విముక్తి కలిగి, హాయిగా యమదూతల ఎస్కార్ట్లో వెళ్ళిపోయింది.మునిసిపాలిటీ వాళ్ళు వలతో వస్తే, వయసులో ఉన్న కుక్కలన్నీ తలో రకంగా తప్పించుకోగా, ఎటూ కదల్లేక దొరికిపోయి, ఆ కుక్కలబండిలో బిక్కు బిక్కు మంటూ, కంటనీరు కారుస్తూ, చావుకెదురు చూస్తూ, ఒంటరిగా మిగిలిపోయిన వీధి కుక్కలా గొడవ జరిగిన రోజు రాత్రంతా గడిపిన రామలక్ష్మి దుఃఖం ఎవరికి పట్టాలి? బతికుండగా నరకం చూపించి, చచ్చాక ‘పున్నామనరకం’ తప్పించే ‘కొడుకు’ విరోధాభాసకు మరో ఉదాహరణ. -
యువ కథ: ఎంత ధైర్యం నీకు?
‘‘ఎంత ధైర్యం నీకు? మా వాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నేను తలచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కొట్టిందే కాక ప్రిన్సిపాల్కు కంప్లయింట్ చేస్తావా’’ కోపంతో చంద్రిక మీద విరుచుకు పడింది శ్యామల.‘‘మేడం! నా తప్పేమీ లేదు. సిద్ధార్థ్..’’అని ఏదో చెప్పబోయింది చంద్రిక.‘‘నోర్ముయ్యి! మర్యాదగా వచ్చి వాడికి సారీ చెప్పు. కంప్లయింట్ వెనక్కి తీసుకో..’’ బెదిరిస్తూ అంది సిద్ధార్థ్ తల్లి శ్యామల.‘‘అవును మేడం, మీరు ఏమైనా చేయగలరు!. అన్యాయానికి కొమ్ము కాయగలరు, నిజాన్ని సమాధి చేయగలరు. మీ అబ్బాయి మత్తు పదార్థాలకు బానిసై పాశవికంగా ప్రవర్తించినందుకు కొట్టాను’’ ధారగా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది చంద్రిక.ఆ మాట విన్న శ్యామల నెమ్మదించింది.‘‘ఏమిటి సిద్ధార్థ్ మత్తు పదార్థాలు వాడుతున్నాడా! నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు’’ నిజాన్ని జీర్ణించుకోలేక అంది.‘‘నిజం మేడం. మీ అబ్బాయి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి? మావి పేద బతుకులు మేడం. బాగా చదువుకుంటే మా బతుకులు కాస్తయినా బాగుపడతాయని మెరిట్లో ఈ కార్పొరేట్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాను. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి’’ అంది చంద్రిక.ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు చదువు కోసం తాను పడ్డ కష్టం గుర్తుకు వచ్చింది. చంద్రిక మాటల్లోఎటువంటి తడబాటు లేదు. ధైర్యంగా ఆత్మాభిమానంతో మాట్లాడుతోంది. ఆమె మాటల్లో నిజం ఉందనిపిస్తోంది. శ్యామల మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగింది.తన కొడుకుని పది రోజులు సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ మీద ఆమెకు కోపంగా ఉంది. తన పవర్ చూపించాలని వెంటనే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసింది. వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, వాళ్ళు ఫోన్ ఎత్తక పోవడంతో విసుగొచ్చి, తానే స్వయంగా వెళ్లి ప్రిన్సిపాల్ను కలవాలనుకుంది.మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది.శ్యామల పలుకుబడి వున్న వ్యక్తి కావడంతో అటెండర్ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టాడు.‘‘ఎవరా ప్రిన్సిపాల్, మా వాడిని సస్పెండ్ చేసింది?’’ కోపంతో అడిగింది ఎదురుగా వచ్చిన అటెండర్ వైపు చూస్తూ.‘‘మేడమ్, ఆయన కొత్తగా వచ్చారు. రావడానికి ఆలస్యం అవుతుంది. మీరు కూర్చోండి మేడం. ఆయన వచ్చేస్తారు’’ అని ప్రిన్సిపాల్ రూమ్ చూపిస్తూ చెప్పాడు అటెండర్.ప్రిన్సిపాల్ రూమ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ చైర్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.తాను అంతకు ముందు వచ్చినప్పటికి, ఇçప్పటికి ఆ రూమ్లో చిన్న మార్పులు జరగడం గమనించింది. ప్రిన్సిపాల్ చైర్ వెనుకగా వున్న గోడకు వేలాడుతున్న వివేకుని సూక్తి ఆమెను ఆకర్షించింది, ‘కెరటం నా ఆదర్శం. పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు’ అన్న సూక్తి చదువుకుంది.ఇంతలో అక్కడకు వచ్చాడు ప్రిన్సిపాల్ వివేకానంద. అతన్ని చూసిన శ్యామల ఏమీ అనకుండా అతని వైపు ఉరుముతూ చూస్తూ వుంది. ఆమె గురించి అటెండర్ చెప్పడంతో తన సీట్లో కూర్చొని, ‘‘నమస్తే మేడం! మీ అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చారా?’’ అడిగాడు వివేకానంద.‘‘మాట్లాడడానికి ఏమీ లేదు. వాడిని సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ వాడిని కాలేజీకి వచ్చేలా చేయండి’’ దర్పం ప్రదర్శించింది.‘‘మేడం, అది జరగని పని. మీ వాడు చెడు వ్యసనాలకు లోనవడమే కాకుండా, అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించాడు. ఇది అతనికి వేసిన శిక్ష. అతను తన ప్రవర్తనను మార్చుకోకపోతే, అతన్ని ఈ కాలేజీ నుంచి శాశ్వతంగా తొలగించాల్సి వస్తుంది’’ స్థిరంగా చెప్పాడు వివేకానంద.ప్రిన్సిపాల్ మాటలకు ఒక్కసారిగా శ్యామలకు కోపం తలకెక్కి, ‘‘అసలు నీకెవరు ఇచ్చారు ఈ అధికారం?నేను తలచుకుంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది’’ గట్టిగా అరుస్తూ అంది శ్యామల.‘‘చూడండి మేడమ్, నేను చెప్పదలచుకున్నది చెప్పాను. మీ బెదిరింపులకు భయపడను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’’ అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు.‘ఇంత అవమానమా! ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. వీడి సంగతి తర్వాత చూస్తాను’ అని అనుకుంటూ కోపంతో అతని వైపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.ఇంటికి వెళ్ళేసరికి శ్యామల తల్లి ఇందిరమ్మ ముభావంగా కనిపించింది.‘‘అమ్మ! ఏమైంది? ఆరోగ్యం బాగాలేదు?’’ అని అడిగింది.‘‘శ్యామలా! సిద్ధు ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు.మాటల్లో తత్తరబాటు.. ఇవన్నీ చూస్తుంటే, అప్పుడు మీ అన్నయ్య మనకు దూరం అయిన రోజులు గుర్తుకు వస్తున్నాయి’’ దిగులుగా అంది ఇందిరమ్మ.ఒక్కసారి తన అన్నయ్య మత్తు పదార్థాలకు బానిసై జీవితం పోగొట్టుకొని, జీవచ్ఛవం అయి తమకు దూరమైన రోజులు గుర్తుకు వచ్చాయి. తనను తాను సముదాయించుకుంటూ,‘‘అమ్మా! భయపడకు ఈ విషయం నాకు తెలిసింది. నా అనుమానం ప్రకారం ఆ అమ్మాయి కారణంగానే సిద్ధు వాటికి బానిస అయ్యాడు అనిపిస్తోంది. భయపడకు వాడికి కౌన్సెలింగ్ ఇప్పిద్దాం’’ అని తల్లికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది.‘‘రేయ్ సిద్ధు! నీకేం తక్కువ చేశానురా? ఎందుకు ఇలాంటి వాటి జోలికి వెళ్తున్నావు?’’అని కొడుకును నిలదీసింది.‘‘అమ్మా! అది.. అది..’’ అంటూ మాటలు మారుస్తూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.శ్యామలకు కొడుకు పరిస్థితి అర్థమైంది. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి అని అనుకుంది. కొడుకును తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళింది.మొత్తం పరీక్షలు చేసిన డాక్టర్, ‘‘శ్యామలగారు! చూస్తుంటే మీ అబ్బాయికి ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉన్నట్లుంది. దీని నుంచి బయట పడటానికి అవకాశాలు ఉన్నాయి కాని, మీరు చాలా కేర్ చూపించాలి. లేదంటే మీ అబ్బాయి మీకు దక్కడు. నా ప్రయత్నం నేను చేస్తాను’’అని కౌన్సెలింగ్ ఇచ్చి. మెడిసి రాసి ఇచ్చాడు. డాక్టర్ మాటలకు శ్యామల కంగారు పడింది. ‘‘లేదు డాక్టర్, నేను చూసుకుంటాను.’’ అని డాక్టర్తో చెప్పి కొడుకుతో ఇంటికి చేరుకుంది. ప్రతి క్షణంకొడుకును కనిపెట్టుకొని ఉంది. అయినా, అతను దొంగతనంగా వాటిని తీసుకుంటూనే ఉన్నాడు. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా కొడుకులో మార్పు రాకపోవడం ఆమెలో కంగారు పెంచింది.అక్కడికి వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆ కాలేజ్ చైర్మన్ వీరభద్రం శ్యామలకు ఫోన్ చేశాడు.శ్యామలకు వీరభద్రం బాగా తెలిసిన వ్యక్తి కావడంతో తన సమస్యను ఏకరవు పెట్టింది.‘‘శ్యామలగారు! మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, నేను క్యాంపులో ఉండటం వల్ల మీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థుల మెరుగుదల కోసం తపించే వ్యక్తి. క్రమశిక్షణ వల్ల విద్యార్థులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అతన్ని అపాయింట్ చేశాం. అతను ఇంకెవరోకాదు, ఒకప్పటి ఉత్తమ గురువు అవార్డు పొందిన పరమేశంగారి అబ్బాయి’’ అని చెప్పాడు. ఒక్కసారిగా శ్యామల గొంతు తడారిపోయింది. మాటలు పెగలడం లేదు. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం పోయింది.‘‘నే.. నేను మళ్ళీ మాట్లాడతాను’’ అని ఫోన్ పెట్టేసింది.ఒక్కసారిగా తనలో ఏదో తెలియని అపరాధ భావం కలిగింది. ‘అంటే అతను గురువుగారి అబ్బాయా! ఎంత పని చేశాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గురువుగారు. అలాంటిది వాళ్ళ అబ్బాయిని అవమానించానా? ఎంత పాపం చేశాను? కొడుకు మీద ప్రేమతో ఇంత పాపానికి ఒడిగట్టానా’ అని అనుకుంటూ దిగులుతో ఒక్కసారిగా హాల్లోకి వెళ్ళి అక్కడే వున్న సోఫాలో కూర్చుండి పోయింది. ఏవేవో ఆలోచనలు ఆమెను సతమతం చేస్తున్నాయి.అప్పుడే తన భర్త వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కొడుకు మొబైల్ చూస్తూ పక్కనే ఉన్నాడు. ‘శ్రీరామ రామ రామేతి’ అని జపిస్తూ ఇందిరమ్మ దేవుని దగ్గర దీపం వెలిగించింది. శ్యామల దృష్టి ఆ దీపం వైపుకు మళ్ళింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం గమనించింది. రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత,‘గురువుగారు, నన్ను క్షమించండి. ఆస్తి, అధికార దర్పంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తించాను. కొడుకును క్రమశిక్షణలో పెంచలేకపోయాను. పిల్లలు తప్పు చేస్తే, ఆ తప్పు తల్లితండ్రులదే కదా! గురువు మాటను జవదాటిన శిష్యురాలిది తప్పే కదా! ఈ తప్పుకు నాకు శిక్ష పడాలి కదా! పడాలి కదా!’ అనుకుంటూబాధాతప్త హృదయంతో సోఫా నుంచి పైకి లేచి ఆ దీపం దగ్గరకు వెళ్ళింది.ఒక్కసారిగా తన చెయ్యిని ఆ దీపంపై పెడుతూ నిల్చుంది.అది చూసిన ఇందిరమ్మ కంగారు పడుతూ,‘‘శ్యామలా! ఏమిటి నీకు పిచ్చి పట్టిందా?’’ కూతురు చేస్తున్నది చూసి అరిచింది ఇందిరమ్మ.ఇందిరమ్మ అరుపుతో అక్కడకు చేరుకున్నారు భర్త, కొడుకు.అందరూ దగ్గరకు వచ్చి తనని వారించడానికి ప్రయత్నం చేస్తుండటం గమనించి, కోపంగా‘‘దూరంగా వెళ్ళండి. ఎవరూ దగ్గరకు రావద్దు. ఒకవేళ వచ్చారో, నా మీద ఒట్టు! కొడుకును మంచి మార్గంలో నడిపించలేని నాకు శిక్ష పడాలి. డబ్బు అహంకారంతో ఒక అమ్మాయిని తప్పుపట్టిన నాకు, గురువుగారి అబ్బాయిని అవమానించిన నాకు పడాలి శిక్ష. గురువు మాటలు మరచి దారి తప్పి ప్రవర్తించినందుకు నాకు శిక్ష పడాలి. నైతిక విలువలు నేర్పకుండా డబ్బు చూపించి కొడుకును గారాబం చేసినందుకు నాకు శిక్ష పడాలి’’ అని తన చేతిని దీపానికి మరింత దగ్గరగా పెట్టింది.అగ్ని సెగ ఆమె చేతిని తాకి నొప్పి పెట్టడం, ఆమె కళ్ళంట నీరు కారడం, ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.తల్లి మీద ఈగ వాలినా తట్టుకోలేని సిద్ధు– తనకు తాను శిక్ష వేసుకుంటున్న తల్లి బాధను చూసి తట్టుకోలేక పోయాడు.ఒక్కసారిగా వచ్చి తల్లి కాళ్ళ మీద పడుతూ, ‘‘అమ్మా! నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఈ క్షణం నుంచి నేను వాటి జోలికి వెళ్లను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు’’ అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు.కొడుకు కన్నీళ్ళు ఆమె కాళ్ళ మీద పడ్డాయి. కొడుకు నోటి నుండి ఈ మాట విన్న శ్యామల ఒక్కసారిగా కొడుకుని పైకి లేవదీసి, వాడిని గట్టిగా హత్తుకుంది.తాను ఎన్ని చెప్పినా, మాట వినని కొడుకులో ఈ విధంగా మార్పు రావడం చూసిన శ్యామల ఆశ్చర్యపోయింది. నిజం తెలిసి తనను తాను పశ్చాత్తాపంతో శిక్షించుకోవడంతో ఏ లోకంలోనో ఉన్న గురువుగారు నా కొడుక్కి బుద్ధి ప్రసాదించారేమో! అని తనలో అనుకుంటూ, గురువుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు ఆనందం ఇచ్చింది. -
సోమదత్తుడి వృత్తాంతం
యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. పూర్వం చంద్రవంశంలో సోమదత్తుడు అనే రాజు ఉండేవాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా, సుభిక్షంగా పరిపాలించేవాడు. సోమదత్తుడు సత్య ధర్మాలను పాటించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. సాధు సజ్జనులను సముచితంగా గౌరవించేవాడు. సోమదత్తుడి వైభవం నానాటికీ ద్విగుణం కాసాగింది. అతడి వైభవం శత్రువులకు కంటగింపుగా మారింది. ఎవరికి వారే అతడిపైకి యుద్ధానికి వెళితే ఎదిరించడం సాధ్యం కాదని తలచి, శత్రువులందరూ సోమదత్తుడికి వ్యతిరేకంగా జట్టుకట్టారు. అందరూ కలసి అతడిపై యుద్ధం చేసి, అతడి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని తీర్మానించుకున్నారు.శత్రువులందరూ అదను చూసుకుని, సోమదత్తుడి రాజధాని మహిష్మతీపురాన్ని నలువైపుల నుంచి ముట్టడించారు. శత్రువుల దురాక్రమణ సంగతి తెలియగానే, సోమదత్తుడు సైన్యాన్ని ఆయత్తం చేసి, యుద్ధానికి బయలుదేరాడు. వేలాది అక్షోహిణుల చతురంగ బలాల మధ్య భీకర యుద్ధం సాగింది. యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిగా గజ తురగాలు నేలకొరిగాయి. వేలాది రథాలు విరిగిపోయాయి. యుద్ధభూమి అత్యంత భయానకంగా మారింది. దేవ దానవ సంగ్రామాన్ని తలపించేట్లు ఏళ్ల తరబడి సాగిన ఆ యుద్ధంలో దురదృష్టం వెంటాడగా, సోమదత్తుడు ఓటమి పాలయ్యాడు. శత్రువులు అతడి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.రాజ్యం శత్రువశం కావడంతో సోమదత్తుడు తన భార్య దేవికతో కలసి అడవుల్లోకి చేరుకున్నాడు. అడవులలో ప్రయాణిస్తుండగా, వారికి గర్గ మహాముని ఆశ్రమం కనిపించింది.మహర్షిని ప్రార్థిస్తే, తమ కష్టాలు తీరవచ్చని భావించింది దేవిక.ఆమె ఆశ్రమం వద్దకు చేరుకుని, గర్గ మహాముని ముందు మోకరిల్లింది.‘మహర్షీ! శరణు శరణు! శత్రువుల చేతిలో ఓటమి చెంది నా పతి రాజ్యభ్రష్టుడయ్యాడు. భర్తతో కలసి నేను అడవుల పాలయ్యాను. నా పతిని మీరే రక్షించాలి’ అని ప్రార్థించింది.గర్గ మహాముని ఆశ్రమం వెలుపలకు వచ్చాడు.ఆశ్రమం వెలుపల దీనవదనంతో నిలుచున్న సోమదత్తుడు కనిపించాడు.గర్గుడు రాజ దంపతులను ఆశ్రమం లోపలికి తీసుకువెళ్లాడు.‘రాజా! ఇది గార్గ్యాశ్రమం. ఇక్కడ భయమేమీ లేదు. నీకొచ్చిన కష్టం దుస్సహమైనది. విజయ సిద్ధి కలిగించే మంత్రాన్ని నువ్వు అనుష్ఠించలేదు. అందువల్లనే నీకు ఈ దుస్థితి వాటిల్లింది. ఎలాంటి కష్టాలు వాటిల్లినా, ధైర్యం రాజ లక్షణం. ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డడమే క్షాత్రధర్మం. అందువల్ల ధైర్యంగా ఉండు. పరిస్థితులు చక్కబడతాయి’ అని సోమదత్తుడికి నచ్చజెప్పాడు గర్గ మహాముని.‘మునీశ్వరా! నా కష్టాలు గట్టెక్కే మార్గం బోధించండి. ఈ గడ్డుకాలాన్ని దాటడానికి నేను ఆచరించవలసిన వ్రతమైనా, జపించదగ్గ మంత్రమైనా సెలవీయండి. అందుకు పాటించవలసిన నియమాలను ఆదేశించండి’ అని వినయంగా అభ్యర్థించాడు సోమదత్తుడు.‘రాజా! సమస్త బాధలను తొలగించి, అఖండ విజయాలను అందించే అమోఘమైన విద్య ఒకటి ఉంది. అది పంచముఖ ఆంజనేయ విద్య. నీకు ఆ విద్యను ఉపదేశిస్తాను. శ్రద్ధగా విను’ అని పలికి, గర్గుడు ఇలా చెప్పాడు:‘వైశాఖమాస కృష్ణపక్ష దశమి రోజున గాని, ఆ తర్వాత వచ్చే అమావాస్య రోజున గాని, మాఘం మొదలుగా మొదటి ఐదు మాసాలలో వచ్చే మొదటి శనివార దినాలలో గాని, మృగశిరా నక్షత్రం వచ్చే రోజున గాని, శ్రావణ పౌర్ణమి రోజున గాని, కార్తీక శుక్ల ద్వాదశి రోజున గాని, మార్గశిర శుక్ల త్రయోదశి రోజున గాని హనుమద్వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు పవిత్ర తోరాన్ని పదమూడు ముడులతో ధరించి, వ్రతదీక్ష చేపట్టాలి. బంగారం, వెండి, రాగి వంటి లోహపు రేకుల మీద చెక్కిన హనుమద్ యంత్రం గాని, భూర్జపత్రం లేదా తాళపత్రం మీద గీసిన యంత్రం గాని, లేదా పిండిలో గీసిన యంత్రం గాని, పూర్ణకుంభం లేదా హనుమద్ప్రతిమను గాని పూజామండపంలో నెలకొల్పి ఆవాహనాది షోడశోపచార పూజ చేయాలి. వ్రతపూజ పరిసమాప్తం అయిన తర్వాత పదమూడు నేతి అప్పాలను వాయనంగా ఇవ్వాలి. గురువుకు ధనధాన్యాదులను కానుకగా ఇవ్వాలి. యథాశక్తి బ్రాహ్మణులకు అన్న సమారా«ధన చేయాలి. గొప్ప సంకల్పసిద్ధి కోరేవారు పదమూడేళ్ల పాటు ఈ హనుమద్వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించాలి. దీనివల్ల హనుమదనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ఘనవిజయాలు దక్కుతాయి.’గర్గుడు చెప్పిన హనుమద్వ్రత విధానాన్ని సోమదత్తుడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. గర్గుని ఆధ్వర్యంలోనే భార్యా సమేతుడై, హనుమద్వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. హనుమదనుగ్రహంతో ఖడ్గసిద్ధి పొందినవాడై, శత్రువులను దునుమాడి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు.రాజ్యాన్ని తిరిగి పొందిన తర్వాత సోమదత్తుడు గర్గుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. ఆయనకు ఘనంగా ధన ధాన్యాలను, గోవులను సమర్పించి, సత్కరించాడు. సాంఖ్యాయన -
ఏంటీ సుపారీ..? ఏమా కథ..?
తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు దోషులుగా తేలారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు. వారిలో అమృత తండ్రి మారుతీరావు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఏడుగురిలో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం 2025 మార్చి 10న తీర్పు ఇచ్చింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ను హత్య చేయడానికి మారుతీరావు కోటి రూపాయలు సుపారీ ఇచ్చాడు. అంటే, అతడికి హత్య చేసిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. సుపారీ అంటే వక్కలు. తాంబూలంలో ఉపయోగించే వక్కలకు, కిరాయి హత్యలకు సంబంధం ఏమిటో, నేర పరిభాషలో ‘సుపారీ’కి వేరే అర్థం ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.కిరాయి హత్యలకు ‘సుపారీ’ అనే మాట ముంబై మాఫియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారకుడు అక్కడి మహిమ్ ప్రావిన్కు రాజు భీమ్దేవ్. అక్కడి మహేమీ తెగకు అధినేత అయిన భీమ్దేవ్కు ఒక వింత ఆచారం ఉండేది. ఏదైనా కష్టమైన పనిని ఎవరికైనా అప్పగించాలంటే, ఆయన ‘సుపారీ’కి ఆహ్వానించేవాడు. మాహిమ్ కోటలో సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యంలోని యోధులను పిలిచి, వారికి విందు భోజనం పెట్టేవాడు. ఆ తర్వాత తమలపాకులు, వక్కలు ఉన్న తాంబూలం పళ్లేన్ని సభ మధ్యలో ఉంచేవాడు. ఆపై తన కోసం చేయాల్సిన పనిని చెప్పి, చేసే సత్తా ఉన్న వాళ్లు ‘సుపారీ’ తీసుకోవాలని కోరేవాడు. ఎవరైతే ముందుకు వచ్చి అక్కడ ఉన్న ఆకులు, వక్కలు తీసుకుంటారో వారికి ఆ పని అప్పగించేవాడు. ఇలా ‘సుపారీ’ పదం మహారాష్ట్రలో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టులు తీసుకోవడాన్ని కూడా సుపారీగానే పిలిచే వాళ్లు. కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు నేరుగా పని చేయకుండా, మేస్త్రీలను పెట్టి చేయించేవాళ్లు. ముంబైలో మాఫియా సామ్రాజ్యం విస్తరించాక ‘సుపారీ’ని కిరాయి హత్యలకు వినియోగించడం మొదలుపెట్టారు. మాఫియా ముఠాల ద్వారా ‘సుపారీ’ మాట దాదాపు ఆసియా మొత్తం ప్రాచుర్యం పొందింది. ప్రత్యర్థులను హత్య చేయడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఎక్కడా తెరపైకి కనిపించడు. మధ్యవర్తులపై ఆధారపడి తన పని పూర్తి చేయించుకుంటాడు. ఈ మధ్యవర్తి నేరుగా రంగంలోకి దిగి హత్యలు చేయడు. హిట్మెన్గా పిలిచే ప్రొఫెషనల్స్కు ఆ పని అప్పగిస్తాడు. ప్రణయ్ హత్య విషయాన్నే తీసుకుంటే, ఈ పని చేయడానికి మారుతీరావు అస్ఘర్ అలీకి సుపారీ ఇచ్చాడు. అతడి ద్వారానే బిహార్కు చెందిన సుభాష్కుమార్ శర్మ రంగంలోకి దిగి ప్రణయ్ను దారుణంగా నరికి చంపాడు. హత్య జరిగిన రోజు సుభాష్ మినహా మరెవ్వరూ తెరపైన కనిపించలేదు. ‘సుపారీ’ సంస్కృతిలో రేటు అనేది టార్గెట్ చేయాల్సిన వ్యక్తి ప్రొఫైల్, హత్య పథకాన్ని అమలు చేయడంలో ఉన్న కష్టనష్టాలపై ఆధారపడి ఉంటుంది. చెల్లింపులు సైతం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా జరుగుతాయి. ప్రణయ్ విషయంలో మారుతీరావు కులహంకారం వల్లే కోటి రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన హాజీ మస్తాన్ 1960ల్లోనే నాటి బొంబాయిలో (నేటి ముంబై) స్థిరపడ్డాడు. అక్కడ ఓ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా ఏలాడు. అప్పట్లో కరీం లాలా, వరదరాజన్ ముదలియార్ తదితరులు కూడా ముఠాలు నిర్వహించే వాళ్లు. తొలితరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ మహారాష్ట్రతో పాటు గుజరాత్ తీరాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సిండికేట్ నడిపాడు. బాలీవుడ్లో ఫిల్మ్ ఫైనాన్సింగ్తో పాటు రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టాడు. అతడికి ముంబైలోని మరో డాన్ యూసుఫ్ పటేల్తో స్పర్థలు ఏర్పడ్డాయి. పటేల్ను అంతం చేయాలనుకున్న హాజీ మస్తాన్ ఆ పని కోసం ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు పదివేల రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తన బాడీగార్డులు చాకచక్యంగా వ్యవహరించడంతో యూసుఫ్ పటేల్ వారి దాడి నుంచి తప్పించుకోగలిగాడు. 1969లో హాజీ మస్తాన్ ఇచ్చిన ఈ కాంట్రాక్టే దేశంలో తొలి సుపారీగా ముంబై పోలీసులు చెబుతుంటారు. ముంబై కేంద్రంగా 1997లో జరిగిన టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008లో జరిగిన మట్కా కింగ్ సురేష్ భగత్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుపారీ కిల్లింగ్స్. దావూద్ ఇబ్రహీం, బడా రాజన్, ఛోటా రాజన్లు డాన్లుగా ఎదిగాక సుపారీ సంస్కృతి పెరిగిపోయింది. క్రమంగా కిరాయి హత్యలు దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై కత్తికట్టిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఉన్న సుపారీ గ్యాంగ్స్లో కీలకమైన వ్యక్తి. 2024లో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ సహా అనేక మందిని చంపించిన ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అక్కడ నుంచే తన దందా నడిపిస్తున్నాడు. ఇతడి కనుసన్నల్లో పని చేసే దాదాపు 700 మంది షార్ప్షూటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడి ప్రధాన అనుచరుడు, సుపారీ కిల్లర్ సంపత్ నెహ్రా 2018 జూన్ 7న హరియాణా స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్త బృందం మియాపూర్ వచ్చిన అతడిని గోకుల్ ప్లాట్స్లో పట్టుకుంది. హైదరాబాద్లోని జరిగిన వ్యాపారులు రాజీవ్ సిసోడియా, రామ్ ప్రసాద్లవీ సుపారీ హత్యలే! రియల్ బూమ్ రోజుల్లో సుపారీ హత్యలతో పాటు సుపారీ కిడ్నాప్లూ జరిగాయి. -
ఆటగాళ్ల ఊరు.. ఆత్మకూరు
తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక అమ్మాయిని మహిళల ఫుట్బాల్ జట్టుకు అందించిన ఊరు అది. క్రీడలను ఎంతగానో ప్రేమించే ఆ ప్రాంతం ఎందరినో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పరిచయం చేసి, క్రీడాకారుల కర్మాగారంగా గుర్తింపు సాధించింది. ఆటగాళ్ల ఊరుగా పేరుపొందిన ఆత్మకూరుపై ఈ కథనం..తిరుమలరావు కరుకోల, సాక్షి విజయవాడ: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గంలోని ఆత్మకూరు క్రీడాకారుల కర్మాగారంగా పేరుపొందింది. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెడితే చాలు, మూడున్నర ఎకరాల మైదానంలో ఏదో ఒక మూల కొందరు విద్యార్థులు క్రీడల్లో సాధన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ ఫుట్బాల్, హాకీ, క్రికెట్తో పాటు పలు వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. ఇక్కడి స్థానికులు కూడా చాలామంది ఏదో ఒక సమయంలో మైదానానికి వస్తుంటారు. వృద్ధులు నడక కోసం వస్తుంటారు. ఉద్యోగార్థులు శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వస్తుంటారు. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2015–16 నుంచి క్రీడల్లో సత్తా చాటుకుంటోంది. ఈ పాఠశాలలో ఒక గది నిండా క్రీడా పోటీల్లో విద్యార్థులు సాధించిన జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, క్రీడా సామగ్రి కనిపిస్తాయి. ఫుట్బాల్, హాకీ, క్రికెట్, ఖోఖోతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో ఏటా ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతూ వస్తున్నారు. క్రీడల పోటీల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రతిభ చూపుతుండటం విశేషం. ఇక్కడే చదువుతున్న విష్ణు ప్రణవి, అస్మిత, శ్వేత, రియాన్షిక సాయి, కీర్తిలక్ష్మి ఫుట్బాల్లో రాణిస్తున్నారు. స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్ సహకారంతో వీరు శిక్షణలో రాటు దేరారు. నిరంతర సాధనతో ఈ ఐదుగురూ అండర్–13 జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. 2015–16 నుంచి క్రీడా పరంపరఈ పాఠశాలలో క్రీడా పరంపర 2015–16 నుంచి మొదలైంది. ఆ ఏడాది పాఠశాల నుంచి జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ముగ్గురు, క్రికెట్కు ఒకరు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్కు పదిమంది, క్రికెట్కు ఒకరు ఎంపికయ్యారు. దాంతో విద్యార్థుల్లో క్రీడోత్సాహం పెరిగి, ఖాళీ వేళల్లో మైదానం బాటపట్టారు. వారి ఆసక్తిని గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పాఠశాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ పాఠశాల నుంచి 2023–24లో ఫుట్బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ముగ్గురు, రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో ముగ్గురు, అథ్లెటిక్స్లో ముగ్గురు ఆడారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.మాస్టర్ అథ్లెట్స్లోనూ మేటిఆత్మకూరులో విద్యార్థులు, యువతే కాదు, నలభై ఏళ్ల వయసుకు పైబడినవారు సైతం మాస్టర్ అథ్లెట్స్లో సత్తా చాటుతున్నారు. ఇక్కడి నుంచి యాభయ్యేళ్లు దాటిన నలుగురు జాతీయస్థాయి అథ్లెటిక్స్కు ఎంపికయ్యారు. వీరిలో ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రోలో జగన్మోహన్ రెడ్డి ప్రథమస్థానంలో నిలిచారు. లాంగ్ జంప్లో ద్వితీయస్థానం కైవసం చేసుకున్నారు. అలాగే 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో మహమ్మద్ షఫీ మొదటి స్థానంలో నిలిచారు. వీరిద్దరూ క్రీడల కోటాలోనే కొలువులు సాధించారు. ఇక్కడి నుంచి క్రీడల కోటాలో కేంద్ర, రాష్ట్ర శాఖల్లో కొలువులు సాధించిన వారు దాదాపు ముప్పయి మంది వరకు ఉండటం విశేషం.ఫొటోలు: ముల్లా ఖాసింవలీ, ఆత్మకూరు, అనంతపురంజాతీయ ఫుట్బాల్కు ఏకైక తెలుగమ్మాయిఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మందల అనూష జాతీయ స్థాయి ఫుట్బాల్ జట్టులో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన తొలి అమ్మాయిగా ఆమె అరుదైన ఘనత సాధించింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వారికి ముగ్గురూ ఆడపిల్లలే! అనూష అందరికంటే చిన్నమ్మాయి. ఆమె అక్కలు చందన, రాజేశ్వరి కూడా ఫుట్బాల్ ఆడేవారు. వారికి పెళ్లిళ్లు కావడంతో ఆటకు దూరమయ్యారు. అనూష 2017లో జరిగిన మిక్స్డ్ జెండర్ ఫుట్బాల్ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణిగా పురస్కారాన్ని అందుకుంది. బెంగళూరులోని రూట్ క్లబ్ తరఫున 2022లోను, కెంప్ ఫుట్బాల్ క్లబ్ తరఫున 2024లోను బెంగళూరు, ముంబై, హైదరాబాద్లలో జరిగిన టోర్నీలలో పాల్గొంది. అనంతపురంలో 2024 నవంబర్లో జరిగిన జాతీయ ఫుట్బాల్ టోర్నీలో సత్తా చాటి, అండర్–20 భారత మహిళా ఫుట్బాల్ జట్టుకు ఎంపికైంది. బెంగళూరులో 2024 డిసెంబర్లో జరిగిన భారత్–మాల్దీవుల ఫుట్బాల్ మ్యాచ్లో సత్తా చాటుకుంది. -
నరనారాయణులతో ప్రహ్లాదుడి యుద్ధం
హిరణ్యకశ్యపుడి వధ తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి పట్టం కట్టాడు. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జనరంజకంగా పరిపాలన చేయసాగాడు. ప్రహ్లాదుడి పాలనలో పాతాళలోకంలో శాంతి సామరస్యాలు వర్ధిల్లసాగాయి.ఒకనాడు భృగుమహర్షి కొడుకు అయిన చ్యవన మహర్షి నర్మదానదిలో స్నానం చేయడానికి వెళ్లాడు. ఆయన స్నానం చేస్తుండగా, ఒక భీకరసర్పం ఆయనను కాటువేసి, ఆయన కాలిని చుట్టుకుంది. విష్ణుభక్తుడైన చ్యవన మహర్షి మనసులో విష్ణువును ధ్యానం చేశాడు. పాముకాటు ఆయనకు చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు. అయితే, ఆయన కాలిని చుట్టుకున్న పాము, ఆయనను పాతాళలోకానికి లాక్కుని పోయింది. చ్యవనుడిని పాతాళంలో విడిచి, పాము తన దారిన తాను పోయింది.పాతాళంలో కనిపించిన చ్యవనుడిని ప్రహ్లాదుడు చూశాడు.బహుశా, ఇంద్రుడు పంపితే వచ్చి ఉంటాడని అనుకున్నాడు.చ్యవనుడి వద్దకు వెళ్లి పలకరించాడు. ‘మహర్షీ! తమరెవరు? ఇలా దయచేశారేమిటి? దేవతలు ఎవరైనా పంపితే వచ్చారా? వారి నుంచి ఏదైనా వర్తమానం తీసుకొచ్చారా?’ అని అడిగాడు.‘ప్రహ్లాదా! అలాంటిదేమీ లేదు. నర్మదా నదిలో స్నానం చేస్తుండగా, ఒక సర్పం నన్ను తీసుకొచ్చి, ఇక్కడ పడేసి పోయింది. నేను భృగుపుత్రుడిని. నన్ను చ్యవనుడు అంటారు’ అని బదులిచ్చాడు.ప్రహ్లాదుడు చ్యవనుడికి అతిథి మర్యాదలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. చ్యవనుడు కాస్త సేదతీరాక, అతడితో ఆధ్యాత్మిక చర్చ మొదలుపెట్టాడు.‘మహర్షీ! భూలోకంలో తమరు ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించుకుని ఉంటారు కదా! వాటిలో గొప్ప పుణ్యాన్ని కలిగించే తీర్థాల గురించి చెప్పండి’ అని వినయంగా అభ్యర్థించాడు.‘నాయనా, ప్రహ్లాదా! భూలోకంలోని భరతఖండంలో నైమిశారణ్యం ఉంది. అది తాపసులకు ఆలవాలం. అక్కడ నైమిశతీర్థం ఉంది. భూలోకంలో ఇది ఉత్తమమైనది. పాతాళంలో చక్రతీర్థం, ఆకాశంలో పుష్కరతీర్థం ఉత్తమమైనవి. వీటిలో స్నానం ఆచరించిన వారికి ఇహపరాలలో సుఖసౌఖ్యాలకు లోటు ఉండదు’ అని చెప్పాడు చ్యవనుడు.కొన్నాళ్లు ప్రహ్లాదుడికి అతిథిగా ఉన్న తర్వాత చ్యవనుడు తిరిగి భూలోకానికి వెళ్లిపోయాడు.చ్యవనుడి మాటలతో ప్రభావితుడైన ప్రహ్లాదుడు ఆయన చెప్పిన తీర్థాలను సందర్శించుకోవాలని అనుకున్నాడు.ఒకనాడు సుముహూర్తం చూసుకుని, పరివారంతో సహా ప్రహ్లాదుడు తీర్థయాత్రకు బయలుదేరాడు.మొదటగా నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సరస్వతీ నదిని దర్శించుకున్నాడు. నదీస్నానం చేసి, అక్కడ పితృతర్పణాలు విడిచాడు. అక్కడ ఉన్న పురోహితులకు విరివిగా అనేక దానాలు చేశాడు.తర్వాత నైమిశారణ్యంలో సంచరిస్తూ, నైమిశ తీర్థంలో స్నానం చేశాడు. స్నానానంతరం వేటకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఇద్దరు మహర్షులు కనిపించారు. వారికి నీడ కల్పిస్తున్న చెట్టు కొమ్మలకు విల్లంబులు వేలాడుతూ కనిపించాయి. ఆ మహర్షులిద్దరూ నరనారాయణులు. ఆ చెట్టుకు వేలాడుతున్న ధనుస్సుల్లో ఒకటి: శారఙ్గం, మరొకటి: అజగవం. వాటికి తోడుగా రెండు అక్షయ తూణీరాలు. శారఙ్గం నారాయణుడి ధనుస్సు, అజగవం నరుడి ధనుస్సు.తాపసుల వద్ద ఆయుధాలను చూసి, ప్రహ్లాదుడు ఆగ్రహం చెందాడు. ‘మీరు కపట సన్యాసుల్లా ఉన్నారు. నిజంగా తపస్సు చేసుకునేవారే అయితే, మీకు ఆయుధాలెందుకు? మీరు ఆయుధాలనే నమ్ముకుంటే యుద్ధం చేయాలి. తపస్సు చేయదలచుకుంటే, ఆయుధాలను విడిచిపెట్టి తపస్సు చేసుకోవాలి’ అని నిలదీశాడు.యుద్ధానికి కవ్విస్తున్న ప్రహ్లాదుడితో పోరుకు ముందుగా నరుడు సిద్ధమయ్యాడు. తన అజగవం తీసుకుని, అతడిపైకి శర పరంపర కురిపించాడు. ప్రహ్లాదుడు కూడా వెనక్కు తగ్గకుండా యుధ్ధం చేశాడు. వందేళ్లు పోరు సాగింది. ప్రహ్లాదుడి ధాటికి నరుడు ఇబ్బంది పడుతుండటం చూసి, నారాయణుడు తన శారఙ్గాన్ని అందుకుని, యుద్ధంలోకి దిగాడు. మరో వందేళ్లు పోరు జరిగింది. ఎవరికి ఎవరూ తీసిపోలేదు. ప్రహ్లాదుడికి శక్తి సన్నగిల్లసాగింది. ఓటమి అంచుల్లోకి చేరుకున్నాడు.అంతలోనే అక్కడ శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.ప్రహ్లాదుడు విష్ణువు ముందు మోకరిల్లాడు. ‘స్వామీ! ఏ యుద్ధంలోనైనా గెలుపు నాదే! మరి ఇప్పుడేమిటి ఇలా జరిగింది?’ అని దీనంగా ప్రశ్నించాడు.‘వీరు నర నారాయణులు. నా అంశతో పుట్టినవారు. కారణజన్ములు. వీరివంటి తాపసులతో ఎన్నడూ తగవు పెట్టుకోకు’ అని హితవు పలికాడు శ్రీమహావిష్ణువు.ప్రహ్లాదుడు వారి ముందు మోకరిల్లి, క్షమాపణలు చెప్పి, తిరిగి పాతాళానికి వెళ్లిపోయాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: మసాన్ హోలీ
బ్లూసీ కేఫ్లో టీ తాగి బయటకొచ్చి నిలబడి, సిగరెట్ వెలిగించుకొని కాసేపు రోడ్డు అవతల కనిపిస్తోన్న సిటీ బస్టాపు వైపు, దాని పక్కనే ఉన్న మెట్రోస్టేషన్స్ వైపు చూస్తూ సిగరెట్ అంత్యక్రియల్లో చివరిదాకా పాల్గొని..పుట్పాత్ సందులోంచి తన యాభైఏళ్ల వయసు దాటుతోన్న పాదాలను ఆడించుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ కి చేరుకున్నాడు సత్యానంద్. ప్రయాణికుల్ని ఒరుసుకుంటూ డిసెంబర్ నెల చలికూడా రైల్వేస్టేషన్స్ లోకి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ‘మణుగూరు వెళ్లే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మూడవనెంబర్ ప్లాట్ఫామ్ మీద...’లోయర్బెర్త్ మీద కూర్చొని విండోతెరిచి సెల్ఫోన్లో టైం చూశాడు. పదకొండున్నర. మిడిల్బెర్త్ ప్రయాణికుడు ఇంకా వచ్చినట్టు లేడు. అప్పర్బెర్త్ మీద అప్పటికే దుప్పటి కప్పుకొని పడుకొన్న వ్యక్తి ఒక చెయ్యిని తలకింద పెట్టుకొని, మరోచేత్తో పట్టుకున్న సెల్ఫోన్స్ వెలుతురు ముఖం మీద పడుతుంటే రీల్స్ చూస్తూ పడీపడీ నవ్వుతున్నాడు. చెప్పులు విప్పి సీటు కిందకు నెట్టి బాసింపట్టు వేసుకుని కిటికీలోంచి బయటికి చూశాడు.ప్లాట్ఫాం మీద మనుషులు అటూ ఇటూ కదులుతున్నారు. మీరందరూ వెళ్లిపోతే నేను కాసేపు కునుకు తీస్తాను అన్నట్లు అలసిన దేహంతో కనిపిస్తోంది రైల్వేస్టేషన్స్ .రైలు కదిలింది. చివరి నిమిషంలో పరుగెత్తుకుంటూ వచ్చి రైలెక్కినట్లున్నాడు ఆయాసపడుతూ మిడిల్బెర్త్ యువకుడు. బ్యాక్ప్యాక్ సీట్లో పెట్టి, పక్కన కూర్చొని షూస్ విప్పుకుంటూ ‘నాది మిడిల్బెర్త్ అంకుల్, మీరెక్కడిదాకా?’ అని అడిగాడు. ‘భద్రాచలం’ చెప్పాడు సత్యానంద్.‘మాది వరంగల్. మీకు నిద్రొచ్చినపుడు చెప్పండి బెర్త్ మీదకు వెళ్తాను’ అన్నాడా యువకుడు.‘థాంక్యూ... ఒక అరగంట’ అని తిరిగి కిటికీలోంచి బయటికి చూశాడు సత్యానంద్, కిటికీ అవతల ఒక్కో దృశ్యం వెనక్కి జారిపోతోంది. సికింద్రాబాద్ స్టేషన్స్ పరిసరాల నుండి అనుబంధం తెంచుకుంటోంది రైలు. రివ్వున కిటికీలోంచి వీచిన చల్లగాలికి అద్దం కిటికీ కిందికి దించబోతుండగా రేపు ఉదయమెప్పుడో సికింద్రాబాద్ నుండి వారణాసి వైపు వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ పొగమంచులో తడుస్తూ కనిపించింది మసక మసగ్గా.గోదావరి నదివైపుకీ, గుడికీ వెళ్లాల్సిన ప్రయాణికులు దిగే స్టాప్లో బస్సు దిగి, ఆటో ఎక్కి గోదావరి వద్ద దిగి ఇరవైదాకా ఉన్న కరకట్ట మెట్లెక్కి అలసట తీర్చుకోడానికి కాసేపు నిలబడి ఎదురుగా మెట్లకింద కొద్ది దూరంలో లేతసూర్యకాంతిలో ఆవిరవుతున్న పొగమంచులో నింపాదిగా ప్రవహిస్తోన్న నదివైపు చూశాడు సత్యానంద్.పూజాసామాగ్రి అమ్మే షాపులు ఒక్కొక్కటీ తెరుస్తున్నారు, పితరులకు తర్పణం అర్పించడానికి వచ్చిన కొందరు పూజారులతో కలిసి మెట్లు దిగుతున్నారు.వీపుకి తగిలించిన బ్యాక్ప్యాక్ సవరించుకుని తను కూడా నదివైపు వెళ్లడానికి మెట్లు దిగసాగాడు సత్యానంద్. వెనక కొంచెం దూరంలోని మైకులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రంలోంచి ‘ఏడనున్నాడో భద్రాద్రి వాసుడు’ కీర్తన వినిపిస్తోంది. ఏడనున్నాడో... అన్న శబ్దం వినగానే సత్యానంద్కి నలభై ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు. అతని జ్ఞాపకాల్లో గతం ఇసుకలా రాలడం మొదలుపెట్టింది.నలభై ఏళ్ల క్రితం సంగతి. సత్యానంద్కి పన్నెండు ఏళ్లుంటాయి. నమ్మిన స్నేహితుడు మోహన్స్ రావు వ్యాపారంలో సత్యానంద్ తండ్రి శివరాంను మోసం చేస్తే, ఖైరతాబాద్లో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి ముప్పాతిక భాగం అప్పులు తీర్చి అద్దె ఇంట్లోకి మారారు. ఇంక ఏ వ్యాపారం జోలికి పోకుండా చిన్న ప్రైవేటు కంపెనీలో జీతానికి కుదిరాడు శివరాం. బొటాబొటి సంపాదన దానికితోడు పావుభాగం అప్పులు శివరాం ఖాళీజేబులకీ, అతని భార్య లక్ష్మీకాంతం చెవులకీ గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంట్లో దంపతులిద్దరి మధ్యా చిన్నగా గొడవలు మొదలయ్యాయి. బంధువుల సూటిపోటి మాటల దగ్గరి నుండి అద్దె ఇంటి ఓనరమ్మ కళ్లల్లో అప్పుడప్పుడూ కనిపించే చిన్నచూపు వరకూ లక్ష్మీ కాంతానికి చిరాకు తెప్పించేవి, తల్లిదండ్రుల మధ్య క్రమంగా పెరుగుతున్న గొడవ చూసి ఒకరోజు రాత్రి, ‘నేను స్కూల్ మానేసి ఏదైనా పనిలో చేరుతాను నాన్నా’ అన్నాడు ఏడవతరగతి చదువుతున్న సత్యానంద్.కళ్లవెనుక తిరిగిన నీళ్లు బయటికి రాకుండా ఆపి ‘ఒద్దు బిడ్డా, నువ్వూ చెల్లాయి బాగా చదువుకొని బంధువుల్లో మన గౌరవం నిలబెట్టాలి’ అన్నాడు శివరాం కొడుకు సన్నని మెడపై ఉన్న తలను తన గుండెవైపుకు అద్దుకుంటూ. ఒకరోజు రాత్రి దంపతులిద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.‘‘దోస్తు దోస్తు అని వాడు చెప్పిన మాటలు విని దొరికిన కాడికి అప్పులు చేసి ఒక్కటి కాకుండా రెండు వ్యాపారాల్లో చేయిపెడితివి. అందులో ఒకటి సారా కాంట్రాక్టు. నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ మోహన్స్ రావుగాడు తెలివిగా డబ్బులన్నీ వాడి ఖాతాలో వేసుకొని నీకు నష్టాలు చూపెట్టాడు. చేతకాని వాడివి చేతకానివాడిలా ఉండాల్సింది. ఇవి నా మాటలు కాదు. మా అన్నదమ్ములు, బంధువులు అంటున్న మాటలు.’’ అన్న భార్య మాటలు గట్టిగా తగిలాయి శివరాం మనసుకి. వేరే ఎవరైనా అంటే ఏమోకానీ తన భార్య తనని ‘చేతకానివాడు’ అన్న మాట అతన్ని తీవ్రంగా వేధించింది. తనూ కుటుంబాన్ని పోషించడానికేగా వ్యాపారంలోకి దిగింది. కాకపోతే మోసపోయాడు.ఏమనుకున్నాడో ఏమో తెల్లవారుఝామున ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పట్నుండీ ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ కోసం శివరాం బావమరుదులు ఎన్ని చోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎక్కడోచోట ఏడుస్తూ ఉంటాడులే అక్కా’ అని ఓదార్పు మాటలు, ‘నాకంట పడాలే కానీ’ అనే చిన్నతమ్ముడి ఆవేశపు మాటలు లక్ష్మీ కాంతం చెవుల వద్ద నెమ్మదిగా సెలవు తీసుకున్నాయి. క్రమంగా శివరాం ఆ కుటుంబానికి ఎప్పుడో కాని గుర్తు వచ్చేలా వాళ్ల మనసులో ఒక మూల చీకట్లో ఉండిపోయాడు.సత్యానంద్కి మాత్రం తండ్రి అప్పుడప్పుడూ కలలో కనిపించేవాడు. అమ్మానాన్న చెల్లాయిలతో కలిసి భద్రాచలం గోదావరిలో తుళ్లింతలు కొడుతూ బాల్యంలో తను స్నానం చేసిన దృశ్యం కలలో అతనికి ఏడాదికి రెండుసార్లయినా వచ్చేది. ముఖ్యంగా హోళీ పండుగనాడు తన తండ్రి భద్రాచలం తీసుకెళ్లేవాడు. ఏ రంగులూ వాడకుండా పసుపు కుంకుమలు రుద్దుకొని అమ్మనాన్న గోదావరి ఒడ్డున హోళీ ఆడుకునేవారు. శివరాం భార్య లక్ష్మీకాంతం కుటుంబంతో భోజనం చేసే సమయంలో ఎప్పుడో ఒకసారి భర్త గుర్తుకొచ్చి పిల్లల్తో, ‘ఆ రోజు రాత్రి నేను మీ నాన్నని... చేతకాకపోతే అని తిట్టి ఉండాల్సింది కాదు. నిజానికి అది నా మాట కూడా కాదు.బంధువుల నోట్లోంచి వినీ వినీ విసుగొచ్చి తట్టుకోలేక అన్నమాట. అయినా ఆ మాట అనకుండా ఉండాల్సింది’ అని గుడ్లనీరు కక్కుకుంటుంటే ‘ఏదో బాధ తట్టుకోలేక అంటే మాత్రం ఆయన ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోవాలా’ అని ఎదుగుతున్న కూతురు తండ్రిని కోపంగా గుర్తుచేసుకునేది.ఇంటర్ అర్హతతో సత్యానంద్కి రైల్వేలో ఉద్యోగం వచ్చాక చర్లపల్లిలో ఒక ప్లాటు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని శివరాంలేని ఇంట్లోకి గృహప్రవేశం చేసిందా కుటుంబం. మరుసటి ఏడాదే చిన్నతమ్ముడికి తన కూతురినిచ్చి పెళ్లిచేసింది లక్ష్మీ కాంతం.నదుల అద్దాల్లో తమ ముఖాల్ని చూసుకుంటూ ముందుకు కదులుతోన్న మేఘాల్లాగా సాగిపోయింది కాలం.నాలుగురోజుల క్రితం ఆదివారపు న్యూస్పేపర్లో తన తండ్రిని వ్యాపారంలో మోసం చేసిన మోహన్రావు దశదిన కర్మ ప్రకటన కనిపించింది సత్యానంద్కి. ‘పాపి చిరాయువు అంటారు. నూరేళ్లు నిండకుండానే పోయాడన్న మాట మా కాపురంలో చిచ్చుపెట్టి’ అంది ఆ వార్త విని లక్ష్మీ కాంతం. సత్యానంద్కి కళ్లముందు తండ్రి మెదిలాడు. మోహన్స్ రావు చనిపోయిన వార్త తన తండ్రికి తెలుసోలేదో, అసలింతకీ తన తండ్రి బతికే ఉన్నాడో లేదో తెలియదు.జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాడు సత్యానంద్. భద్రాచలం గోదావరి ఒడ్డున చివరిమెట్టు దిగాక కాళ్లకు ఇసుక మెత్తగా తగిలింది. నీళ్లుపాడిన పాటలో కరిగి కన్నీరైపోయిన రాళ్ల సూక్ష్మ అవశేషాల్లాంటి తీపిలేని చక్కెరచుక్కల ఇసుక రేణువులపై నడుచుకుంటూ గోదావరివైపు కదులుతుండగా మళ్లీ తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు.‘భద్రాచలం అంటే చాలా ఇష్టంరా సత్యానంద్. చిన్న ఊరు.. పెద్దగోదావరి.. ఆయనెవరో కంచర్ల గోపన్న కట్టిన గుడి. ప్రశాంతంగా అయిపోయే దర్శనం. చిన్నప్పుడు మా అయ్యశివయ్య ఎందుకోగానీ పండుగ రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లేవాడు. కాబట్టి ఎప్పుడూ మేం ఇబ్బంది పడిందిలేదు. మా అయ్యకు భద్రాచలం అంటే బాగా ఇష్టం, కానీ ఎందుకో కాశీ విశ్వేశ్వరుడి పేరు చెబితే చాలు కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. అందుకేనేమో నాకు శివరాం అని పేరు పెట్టాడు’ అని తన తండ్రి శివరాం వాళ్ల నాన్న శివయ్యను గుర్తుకు చేసుకునే సందర్భం ఎందుకో గుర్తుకొచ్చింది సత్యానంద్కి.జనసంచారం లేని చోటికి వెళ్లాడు సత్యానంద్. ఇసుకలో బ్యాగ్పెట్టి, ప్యాంటూ షర్టూ విప్పి గోదావరిలోకి అడుగుపెట్టి నీళ్లల్లో కూర్చున్నాడు.అతని గొంతువరకూ వచ్చాయి నీళ్లు. భద్రాచలం ఊరి మీది నుండి పైకి లేస్తున్నాడు సూర్యుడు. కరకట్ట మీది నుండి గోదావరివైపుకు మెట్లుదిగుతున్న భక్తుల సంఖ్య పెరిగింది. ఒక మెట్టు అంచున అప్పుడే వచ్చినట్లున్న వృద్ధ కాషాయధారి అక్కడ కూర్చోడానికి అప్పుడే మెట్టుమీద గుడ్డ పరుచుకుంటున్నాడు.‘ఒకవేళ నాన్న ఇల్లువదిలిపెట్టి వెళ్లిపోయిన ఆ రాత్రి సరాసరి భద్రాచలం వచ్చి ఉంటాడా? ఆయన ఆచూకీ కోసం ఈ ఊరికి కూడా వెళ్లి వెదకమని అమ్మ మావయ్యలకు చెప్పి ఉంటుందా? తను అప్పుడు చాలా చిన్నవాడు. తనకి గుర్తొస్తే తను చెప్పేవాడేమో! ఒకవేళ ఇక్కడికి వచ్చి తన తండ్రి నలభై సంవత్సరాల నుండీ ఇక్కడే ఉండిపోయి ఉంటాడా?’ హఠాత్తుగా కలిగిన ఈ ఆలోచనకు ఒళ్లు ఝల్లుమంది సత్యానంద్కి.‘ఒక్క రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి తన తండ్రి కనిపిస్తాడేమో చూడాలి’ అనుకున్నాడు గోదావరిలో ఒక మునకవేస్తూ.. తర్వాత రెండో మునక.. మూడో మునక వేసి ఎందుకో.. నీళ్లలోనే కొన్నిక్షణాలు అలా ఉండిపోయి.. మనసులో ఇలా అనుకున్నాడు ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’..(2025).(1995) లలితాఘాట్, వారణాసి (కాశీ) (ఫాల్గుణశుక్ల ద్వాదశి) స్నానం చేయడానికి గంగానదిలో దిగి రెండు మునకలు వేసి మూడో మునక వేయగానే నలభైఏళ్ల శివరాంకు భవిష్యత్ కాలంలోంచి వినిపించినట్లు ఏవో మాటలు వినిపించాయి నీళ్లల్లోంచి.‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ దిగ్గున నీళ్లలోంచి తలబయటికి తీశాడతను. ఈ అకస్మాత్ పరిణామానికి కొన్ని క్షణాలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తెలియకుండా నోట్లోకి వెళ్ళిన నీళ్లను బయటికి వదిలి నోటితోనే గట్టిగా గాలి పీల్చుకున్నాడు. కాలంలో ముందెక్కడో ఉన్న సుదూరతీరం నుండి పాములా నీళ్లలో పాక్కుంటూ వచ్చి చెవిదగ్గరికి రాగానే నీటిబుడగలా పేలిపోయిన శబ్దంలోంచి వచ్చినట్లుగా వినిపించాయా మాటలు . ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ .యాభైఏళ్లు దాటిన వ్యక్తి గొంతులోంచి వచ్చినట్లుగా ఉన్నాయా మాటలు. గొంతులో ఇంకా ఎండిపోని లేతదనం, సన్నని జీరను బట్టి ఆ గొంతు తన కొడుకు సత్యానంద్ది అని శివరాం పోల్చుకున్నాడు. ‘తను వాడి పన్నెండవ ఏట ఇల్లువిడిచి పెట్టి వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇరవై ఏళ్లు దాటుంటాయి. మరి యాభై ఏళ్ల వయసున్న వ్యక్తి గొంతులోంచి వచ్చిన మాటల్లా ఉన్నాయేంటి. అంటే తన కొడుక్కి యాభైఏళ్లు దాటాక మోహన్ రావు చనిపోతాడా?ఈ భవిష్యత్వాణి ఇప్పుడెందుకు వినిపించిందో? ఇల్లు విడిచిపెట్టి వచ్చిన ఈ పదేళ్లలో ఇలాంటి అనుభవం నాకెప్పుడు కలుగలేదు. ఇదంతా తన భ్రమ అయి ఉంటుందా? నీళ్లలో వినిపించిన మాటల్లోని శబ్దతీవ్రత ఇది భ్రమకాదు అన్నట్లుగా ఉంది. కాశీలో ఇలాంటి అనుభవాలు సాధారణమేనా?’ శివరాం ఆలోచనల్ని తెంచివేస్తూ అతడు స్నానంచేస్తున్న లలితాఘాట్ పక్కనున్న విశ్వనాథ మందిరం అవతలనున్న మణికర్ణికా ఘాట్నుండి ఏవో శబ్దాలు వినిపించాయి.అక్కడ ‘మసాన్స్ హోలీ’ వేడుక జరుగుతోంది. దహనక్రియలు జరిగిన వాళ్ళ చితాభస్మాన్ని చల్లుకుంటూ అఘోరాలు, బైరాగులు, సన్యాసులు, భంగు సేవిస్తూ ఢమరుకం వాయిస్తూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నృత్యం చేస్తున్నారు. శవదహనం జరిగే మణికర్ణికా ఘాట్వద్ద ప్రతిఏటా ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు జరిగే వేడుక ‘మసాన్స్ హోలీ’. మసాన్స్ అంటే శ్మశానం, శ్మశానంలో జరిగే హోలీ.కాశీలో ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం పార్వతీపరమేశ్వరుల వివాహానంతరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినాడు పార్వతిని పరమేశ్వరుడి చిరునామా అయిన కాశీలోని విశ్వనాథ మందిరానికి తీసుకొచ్చారు. ఆ వేడుకని పురస్కరించుకొని శివుడు దేవతలు, గంధర్వులతో కలసి ఉల్లాసంగా హోలీ ఆడాడు. ఆ హోలీయే రంగోభరీ ఏకాదశి. ఆ వేడుకలో పాల్గొనలేకపోయిన భూత ప్రేత పిశాచాలు శివగణాలు, అఘోరాల కోసం మరుసటి రోజైన ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు శివుడు సతీసమేతంగా మణికర్ణికాఘాట్కి వచ్చి వీరితో కలిసి భస్మ హోలీ ఆడాడు.ఆ సంప్రదాయమే కాశీలోని మణికర్ణికాఘాట్ వద్ద ఏటా కొనసాగుతోంది.గంగలో స్నానం పూర్తిచేసుకొని ఒడ్డున ఉన్న మెట్లవైపు కదులుతుండగా శివరాంకు మళ్లీ నీళ్లల్లో వినిపించిన మాటలే చెవుల్లో ప్రతిధ్వనించాయి. ‘మోహన్స్ రావు చనిపో.......’అప్రయత్నంగా మణికర్ణికాఘాట్వైపు చూశాడు. మసాన్స్ హోలీ దద్దరిల్లుతోంది అక్కడ, చితాభస్మం గాల్లోకి లేస్తోంది. సన్యాసుల, బైరాగుల, అఘోరాల నృత్యకేళి చిందులేస్తోంది.‘మోహన్స్ రావు చనిపోయిన వార్త, చితాభస్మలేపన మసాన్స్ హోలీ హేల ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? రెండు విషయాలు ఒకే రోజున జరగడంలో అంతరార్థం ఏదైనా ఉందా.. ఎవరు చెబుతారు?’ అనుకుంటూ మెట్లమీద అడుగులు వేశాడు శివరాం.‘ఎల్లుండి పౌర్ణమిరోజు రాత్రి గంగఒడ్డున కూర్చొని చంద్రున్ని చూడు’ అని వృద్ధ్ద సన్యాసిని ఒక యువ సన్యాసినితో చెబుతున్న మాటల పక్కనుండి నడిచి మెట్ల పైకి వచ్చి తల తుడుచుకొని బట్టలు మార్చుకుంటుండగా శివరాంకి తన కుటుంబం గుర్తుకొచ్చింది.‘పిల్లలేం చేస్తున్నారో? కొడుకు సత్యానంద్కి ఇరవైయేళ్లు దాటి ఉంటాయి. కూతురు ఏం చదువుతోందో? అది వాళ్లమ్మతో కలిసి నన్ను తిట్టుకునే ఉంటుంది. లక్ష్మీకాంతం.. ఎన్ని శాపనార్థాలు పెడుతుందో తనని ఇంకా..భార్య గుర్తుకురాగానే తను కాశీకి వచ్చిన కొత్తలో తనలాగే ఇల్లువిడిచి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి చేరి ఒక సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో తెలుగులో ఏదో గొణుక్కుంటూ తనకి పరిచయమైన సుందర్రావు గుర్తుకొచ్చాడు శివరాంకు. అతనిది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు. గయ్యాళి భార్య నోటికి వేగలేక ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరి ఎందుకో మనసు మార్చుకొని ఎక్కడెక్కడో తిరిగి చివరికి కాశీకి వచ్చిచేరాడు.ఆ పరిచయంతో అప్పుడప్పుడు సాయంత్రాల్లో గంగాఘాట్ల వద్ద కలుస్తూ ఉండేవాడు.‘చచ్చినా తిరిగి ఇంటికి వెళ్లను’ అనేవాడు తరచుగా తన భార్య ప్రస్తావన వచ్చినపుడు. ‘చస్తే ఇంకేం వెళ్తావులే’ అని తనంటే పెదాల్ని చెవులదాకా సాగదీసి శబ్దంలేకుండా నవ్వేవాడు. ఆ నవ్వులో అమాయకత్వానికి పుట్టిన బిడ్డలాంటి ఏదో అందం ఉండేది. ఉన్నట్లుండి ఒకరోజు సాయంత్రం హరిశ్చంద్రఘాట్ దగ్గర కనిపించి ‘రేపుదయం ఇంటికి బయలుదేరుతున్నాను’ అన్నాడు. ‘అదేంటీ చచ్చినా ఇంటికి వెళ్లనని పదేపదే చెప్పేవాడివి కదా.. హఠాత్తుగా ఏంటీ మార్పు. ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?’ అని తను అడిగితే,‘ఈ కాశీలో ఉండడం కష్టమైపోతోంది శివరాం. నా భార్యపేరు అన్నపూర్ణ. ఆ పేరు ఇక్కడ ఎవరో ఒకరి నోటినుండి రోజూ వినబడుతూనే ఉంటుంది. ‘అన్నపూర్ణ మాతాకీ జై’అంటూ. వినపడకపోయినా ఏదో ఒక బోర్డుమీద ఆ పేరు కనబడుతూనే ఉంటుంది.కాశీకి వచ్చినప్పటి నుండీ అన్నం తింటున్నప్పుడల్లా నా భార్య అన్నపూర్ణే గుర్తుకొస్తోంది. ఇక ఇక్కడ ఎక్కువరోజులు ఉండలేనని అర్థమైంది. నా పెళ్లాం గయ్యాళిదే కావొచ్చు. కానీ లౌక్యం తెలియని వెర్రిమాలోకం. అడుక్కునే బిచ్చగాడికి కూడా ఆమె వాలకం చూస్తే మోసం చేయాలనిపిస్తుంది.ఇంటికి వెళ్లి చూస్తాను. రానిచ్చిందా ఉండిపోతాను. మళ్లీ గయ్యాళి గంగమ్మ వేషం వేసిందా..’ అని గంగానది వైపు చూసి, ‘భరిస్తాను.. ఉండిపోతాను.. పాపం దానికి పిల్లలు కూడా పుట్టలేదు’ అని తన దగ్గర సెలవు తీసుకొని మెట్లెక్కి వెళ్లిపోయాడు. అతని వెనుకే మిగిలిన ఆ సాయంత్రపు నిశ్శబ్దంలో తనకి తన భార్య లక్ష్మీకాంతం గుర్తుకొచ్చింది.‘తన భార్య పేరు కూడా అన్నపూర్ణో, విశాలాక్షో అయితే సుందర్రావులా తనూ ఇంటికి బయలుదేరి వెళ్లేవాడా?’ అనుకున్నాడు ఆ నది ముందు నిల్చొని.వెంటనే ఆరోజు రాత్రి తన భార్య అన్నమాటలే మళ్లీ మెదిలాయి మనసులో.ఒకవేళ మనస్సు మార్చుకొని ఇల్లు విడిచిపెట్టివచ్చిన ఈ పదేళ్ల తర్వాత తను కూడా అతడిలా తిరిగి ఇంటికి వెళ్తే తన భార్యపిల్లలు ఇంట్లోకి రానిస్తారా? ‘ఎక్కడ చచ్చావ్ ఇంతకాలం’ అంటారా? ముఖ్యంగా తన చిన్న బావమరిది ముందు మెడపట్టుకొని బయటికి నెట్టేస్తాడు. వాడిదసలే దుడుకు స్వభావం. వాళ్ల చేతుల్లో అలాంటి అవమానం పొందేకంటే ఈ కట్టె కాశీలో కాలిపోవలసిందే’ అనుకున్నాడు ఆ రాత్రి సుందర్రావు వెళ్లిపోయిన వైపు మరోసారి చూసి.గత స్మృతుల్లోంచి బయటికొచ్చాడు శివరాం. అతనికి ఎందుకో టిఫిన్స్ చేయాలనిపించలేదు. మెట్లపైకి వెళ్లి టీ తాగి వచ్చి ఎండ పెరుగుతున్నా పట్టించుకోకుండా ఘాట్వద్దే కూర్చొని మసాన్స్ హోలీ వేడుకనే చూడసాగాడు. మధ్యాహ్నం పన్నెండవుతోంది. మణికర్ణికాఘాట్ వద్ద మసాన్స్ హోలీ ఆడుతున్న వాళ్లంతా నృత్యం చేస్తూనే ఎందుకో గంగానది వైపు చూడసాగారు.(2030)ఊరుచివరి శ్మశానం:చితిమీద ఎనభైఏళ్ల వృద్ధుడి భౌతిక కాయానికి నిప్పంటించి మేఘాలు దట్టంగా కమ్మిన ఆకాశం కింద మిగిలిన కార్యక్రమాలన్నీ చకచకా కానిచ్చేసి మృతుడి తాలూకు వాళ్లంతా ఇళ్లవైపు బయలుదేరాక భోరున వర్షం మొదలైంది.అంచుల్లో పెచ్చులూడిపోయి బాగా మసిపట్టిన సిమెంటురేకుల షెడ్డుకింద కాలుతున్న చితి మంటని కర్రతో సవరించి ఆ షెడ్డుకి కొంత దూరంలో ఉన్న మరొక షెడ్డువైపు వానలో తడుచుకుంటూనే పరుగెత్తాడు కాటికాపరి బహుశా సారాతాగి మళ్లీ వద్దామని.అంత వర్షంలోనూ చితికి కొద్దిదూరంలో ఆకాశం కింద నిలబడి వానను పట్టించుకోకుండా ఆ షెడ్డుకింద శివరాం చితివైపు చూస్తోంది లక్ష్మీకాంతం.భర్తతో గడిపిన మధురక్షణాలన్నీ ఆమె కళ్లముందు మెదిలాయి.వంటగదిలో గచ్చునేలమీద నూనెచుక్కపై తాను చూసుకోకుండా కాలువేసి జారి పడబోతుంటే కూరగాయలు కోస్తున్నవాడల్లా దిగ్గునలేచి కిందపడకుండా నడుంపట్టుకొని ఆపిన శివరాం చేతులు, పదిరోజుల దాకా తనకి జ్వరం తగ్గకపోతే సేవలు చేస్తూనే చిన్నపిల్లాడిలా ఏడ్చిన భర్త కళ్లు, ‘నీచేతుల్లో గోరింటాకు బాగా పండుతుంది లక్ష్మీ’ అని తన చేతుల్ని ముదు ్దపెట్టుకున్న ఆయన పెదాలు, ‘వెళ్లొస్తాను లక్ష్మీ’ అని బతుకుదెరువు కోసం బయలుదేరే ఆయన పాదాలు, రాత్రుల్లో తనని నిశ్చింతగా నిద్రపుచ్చిన ఆయన ఛాతీ..అన్ని దృశ్యాలూ ఆమె కళ్లముందు గిర్రున తిరిగాయి. ఆ చేతులు, కాళ్లు, ఛాతీ, పెదాలు అన్నీ ఎదురుగా చితిలో కాలిపోతున్నాయి అనిపించగానే ఆమె కళ్లలోంచి దుఃఖం కట్టలు తెంచుకుంది.ఆమె నోట్లోంచి మూడు అక్షరాల మాట ఒకటి బయటికి వెలువడబోతుండగానే చప్పున అక్కడి దృశ్యం మారింది.ఈసారి అదే చితిమీద డెబ్భైఅయిదేళ్ల లక్ష్మీకాంతం భౌతికకాయం కాలుతోంది. అదే బోరున వర్షం, అప్పటిదాకా లక్ష్మీకాంతం నిలుచున్న చోట నిల్చొని..ఇల్లు విడిచి వెళ్లిపోయిన నలభైఏళ్ల తర్వాత ఆ రోజే తిరిగివచ్చిన శివరాం.. పావుభాగం వంగిపోయిన దేహంతో భార్య చితివైపు చూస్తున్నాడు. ‘తల్లిలేని పిల్లనయ్యా.. నన్ను బాగా చూసుకుంటావు కదూ’ అని పెళ్లయిన కొత్తలో బేలకళ్లతో నవ్వుతూ తనని అడిగే భార్య శరీరం ఆకాశం కింద నేలకు పైన కాలి బూడిదవుతోంది. అతడి కళ్లలోంచి రెండు జలపాతాలు దుముకుతున్నాయి.ఉన్నచోటే కూలబడి భార్య చితివైపు చూస్తూ అతను కూడా మూడు అక్షరాల పదాన్ని గట్టిగా రోదిస్తూ పలికాడు.ఎక్కడో పిడుగుపడ్డ శబ్దానికి లక్ష్మీకాంతానికి కలచెదిరింది. మెల్లిగా కళ్లుతెరిచింది. చెంపలకు తడిగా దిండుతగిలింది. మూసి ఉన్న గది కిటికీల బయట పెద్ద చప్పుడుతో రాత్రి ఎప్పుడు మొదలైందో..వాన కురుస్తోంది. కరెంట్ పోయినా ఇన్వర్టర్ సాయంతో తక్కువ స్పీడులో ఫ్యాను తిరుగుతోంది. బెడ్లైట్ వెలుతురులో గడియారంలో మూడుగంటల ముల్లుని ముట్టుకొని ముందుకి కదిలింది సెకెన్ల ముల్లు. ఢెబ్భై అయిదేళ్ల వయస్సున్న శరీరాన్ని నెమ్మదిగాలేపి మంచం అంచున కూర్చోబెట్టి కొంగుతో కన్నీళ్లు్ల తుడుచుకుంది. వాన మరింత జోరు అందుకున్న శబ్దం వినిపిస్తోంది.ఆమెకెందుకో దగ్గరయిన వాళ్లు కాస్తా ఒకరి నుండి మరొకరు వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ దూరంగా వెళ్లిపోతున్న ప్రపంచంలోని కొందరు స్త్రీ పురుషులు ఒక్క క్షణం కళ్ల ముందు మెదిలారు.గది కిటికీలకు ఇవతల మరో వర్షం మొదలైంది. తెల్లవారు జామున ఎప్పటికో వాన వెలిసింది. లక్ష్మీకాంతానికి ఎందుకో జీవితంలో మొదటిసారి కాశీకి వెళ్ళాలనిపించింది. -
యువ కథ: కనురెప్పలే సాక్షిగా
తెల్లవారుజామున సుమారుగా ఐదున్నర గంటలు– ఇండియా పాక్ సరిహద్దు ప్రాంతం. కంచెకు ఇవతల ఇండియా, అవతల పాకిస్తాన్. అక్కడి వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంది. దట్టమైన పొగమంచు– పక్కన ఎవరున్నారో కూడా తెలుసుకోలేని విధంగా కమ్ముకుని ఉంది. సైనికులు చీమ చిటుక్కుమన్నా పసిగట్టేంత అలెర్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.కొంచెం దూరంలో ఏదో అలికిడి. మన సైనికులు ఒక్కసారిగా అప్రమత్తమై, చెవులు రిక్కించారు. రైఫిల్స్ను పొజిషన్లోకి తీసుకుని, అడుగులో అడుగు వేస్తూ, అలికిడి వచ్చిన దిశగా ముందుకు కదిలారు. వారికి అక్కడ ఎవరో ఉన్నట్టు అర్థమైంది. వారి దుస్తులు కొంతభాగం మాత్రం కనిపిస్తున్నాయి. వారి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ, సైనికులు ఆ పొగమంచులో కదలకుండా ఉండిపోయారు. ఆ దుస్తులు మరింత ముందుకు వచ్చాయి. సైనికులు ముందుకు కదిలారు. అక్కడ కనిపిస్తున్న దుస్తులను చూస్తూ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. కారణం.. వారు పాక్ నుంచి నియంత్రణరేఖ ద్వారా ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులు.సైనికుల ధాటికి నిలబడలేక, తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రయోగించే సమయం లేక ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అదే సమయంలో ఇండియా సైనికులను చూసి వెనక్కు పారిపోయిన ఒక ఉగ్రవాది ఒకచోట నక్కి ఉన్నాడు. పడిపోయిన ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో వారి కన్నుగప్పి ఆ ఉగ్రవాది నియంత్రణరేఖ దాటి ఇండియాలోకి అడుగుపెట్టి, పొగమంచులో కలిసిపోయాడు.ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ ..నగరంలోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్. విదేశీ అతిథులు.. వివిధ దేశాల అధ్యక్షులు.. ప్రఖ్యాత పరిశ్రమల అధిపతులు.. సినీతారలు.. వ్యాపార ప్రముఖులు.. ఈ హోటల్లోనే బస చేస్తుంటారు. ఆ రోజు హోటల్ చాలా సందడిగా ఉంది. ముగ్గురు విదేశీ రాయబారులు ఇండియాకు వచ్చారు. వారికి అదే హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ అర్జున్ తన టీమ్తో అక్కడికి చేరుకున్నాడు. క్షుణ్ణంగా ఆ హోటల్ పరిసర ప్రాంతాలను తన డేగచూపుతో పరిశీలిస్తున్నాడు. హోటల్ వెనుక ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వెనక్కు తిరిగాడు. అతడి మస్తిష్కంలో ఏదో తళుక్కుమని మెరిసింది. హోటల్ వెనుకభాగంలో రెండు మూడు అడుగుల దూరంలో మట్టి తవ్వినట్టుగా ఉంది. అది తెలియకుండా ఉండటానికి మట్టిని జాగ్రత్తగా కప్పేసి ఉంది. వెంటనే దూరంగా ఉన్న తన టీమ్కి సైగ చేశాడు అర్జున్. వారు తమతో పాటుగా స్నిఫర్ డాగ్ను అక్కడికి తీసుకొచ్చారు. అది ఆ ప్రాంతాన్ని వాసన చూసి, తన అరుపులతో హెచ్చరించింది.తక్షణమే అర్జున్ అతని టీమ్ రంగంలోకి దిగారు. అక్కడ పాతిపెట్టిన ఆర్డీఎక్స్ పేలుడు వస్తువులను కనిపెట్టారు. వాటిని పాతిపెట్టిన వారు హోటల్ లోపలకు చేరి ఉంటారేమో అనే ఆలోచన అర్జున్ను కలవరపరిచింది. వెంటనే హోటల్ లోపలకు పరుగు తీశాడు. అర్జున్ టీమ్ కొద్దిసేపటిలో అక్కడ పాతిపెట్టిన పేలుడు వస్తువులను పేలకుండా నిర్వీర్యం చేసేశారు. ఈలోపు అక్కడికి చేరుకున్న మరో టీమ్ వాళ్లు స్నిఫర్ డాగ్స్తో హోటల్ లోపలికి అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో... అక్కడికి చేరుకున్న ఇద్దరు ఉగ్రవాదులు ఏకే–47 తుపాకులతో కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ పడిపోయి ఉన్నారు. వాళ్ళను తొక్కుకుంటూ లోపలికి వెళ్తున్న ఉగ్రవాదులను రిసెప్షన్లో ఉన్నవాళ్లు చూడనే చూశారు. అక్కడున్న డేంజర్ అలారం మోగిస్తూ ముందుకు కదిలారు. హోటల్లో ఉన్నవారితో పాటు ముగ్గురు విదేశీ రాయబారులు కూడా ఆ డేంజర్ అలారం విన్నారు. వెంటనే తమ గది తలుపులు తెరువబోతున్న విదేశీ రాయబారుల ఎదుట ఇన్స్పెక్టర్ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతడిని చూసి వారు భయపడ్డారు. వారిని చూస్తూ అర్జున్ తన చేతి మణికట్టు మీద ఉన్న మువ్వన్నెల జెండాను చూపించాడు. అది చూసి వారు స్థిమితపడగానే, ‘ఎక్కువ సమయం లేదు. నాతో రండి’ అంటూ అక్కడి నుంచి వారిని వేగంగా పై అంతస్తుకు తీసుకెళ్లాడు. అప్పటికే కింద అంతస్తులలో తుపాకీ శబ్దాలు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.అక్కడ ఒక మూలనున్న చీకటిగది తలుపు తెరిచాడు. వారిని అందులోకి పంపించి, ‘మీరు ఇందులోంచి వెళ్తే బయటకు చేరుకుంటారు. అక్కడున్న మా వాళ్ళు మిమ్మల్ని క్షేమంగా వేరేచోటుకు చేరుస్తారు’ అని చెప్తుంటే వారు ముగ్గురు అర్జున్ని కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ లోపలకు నడిచారు. వెంటనే అర్జున్ అక్కడనుండి బయటకు వచ్చి, తన చేతిలోని రైఫిల్ను పొజిషన్లోకి తీసుకుని ముందుకు నడిచాడు. అప్పటికే ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులతో ఆ హోటల్ రణరంగంలా ఉంది. తుపాకీతో ముందుకు నడుస్తున్న అర్జున్, అక్కడి గందరగోళం చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ మెట్ల మీదుగా కిందకు పరుగుతీశాడు. చిన్నపిల్లల అరుపులు.. మహిళల ఏడుపులు.. అర్జున్కి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకొన్ని మెట్లు దిగితే కింద అంతస్తు వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్తున్న అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం అక్కడ మెట్ల కింద భాగంలో ఒక ఉగ్రవాది ఏకే–47 రైఫిల్ పట్టుకుని తనవైపు గురిపెట్టి ఉన్నాడు. వాడిని చూసిన అర్జున్ తన రెండు చేతులు పైకెత్తి, రెండు మెట్లు దిగాడు. ఇంకో మెట్టు దిగిన అర్జున్, మెరుపువేగంతో కదిలి వాడిని ఒక్క తోపు తోశాడు. వాడు అల్లంత దూరాన ఎగిరి పడ్డాడు. వాడి చేతిలోని ఏకే–47 దూరంగా ఎగిరి పడింది.అర్జున్ గాలిలోకి డైవ్ చేస్తూ ఏకే–47 అందుకున్నాడు. అది చూసిన ఉగ్రవాది అక్కడనుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క అర్జున్ రైఫిల్ పట్టుకుని తన చుట్టూ గమనించాడు. అక్కడ అప్పటికే చాలామంది చనిపోయి పడున్నారు. ఇంకొంతమంది రక్తమోడుతూ పడి ఉన్నారు. అర్జున్ తన చేతిలో ఉన్న ఏకే–47ను ఒక్కసారిగా ఆ ఉగ్రవాది వైపు గురిపెట్టాడు. క్షణాల్లో ఆ ఉగ్రవాది శరీరం జల్లెడలా మారి, కింద పడిపోయాడు. ఆ రైఫిల్ను అక్కడే పడేసి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించాలని ఆలోచిస్తూ ముందుకు రెండడుగులు వేశాడు అర్జున్. సరిగ్గా అప్పుడే.. బాంబు విస్ఫోటం.. హోటల్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి దూరంగా విసిరేయబడ్డాడు అర్జున్. కొద్దిక్షణాల తరువాత అతడి కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. ఎదురుగా దుమ్ము .. ధూళి .. నల్లటి పొగ .. వాటిని చూస్తూ పైకి లేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కాని, అతడికి కదలడానికి శక్తి చాలడం లేదు. ఇంతలో లీలగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వాటిని వినాలని చెవులు రిక్కించాడు.‘సాబ్.. నేను మీ గులాం.. నసీర్ అబ్దుల్లాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టే ఇక్కడ మొత్తం అందరినీ చంపేశాం’ చెప్తూ వికటంగా నవ్వసాగాడు.అటుపక్క నుంచి చెప్తున్నది వింటూ, ‘అలాగే సాబ్.. నేను ఇక్కడనుండి వెంటనే తప్పుకుంటాను. ఈ ఫోన్ కాలుతున్న మంటలలోకి విసిరేస్తున్నాను’ అంటూ ఫోన్ మంటలలోకి విసిరేసి, అక్కడనుండి ముందుకు నడిచాడు. ఆ వ్యక్తి ఎవరో చూడాలని ప్రయత్నిస్తున్న అర్జున్కి కదలడం చేతకాక అలాగే ఉండిపోయాడు. అతడి కళ్ళు మూతలు పడిపోయాయి.రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) ఆఫీస్..మూడంతస్తుల ఆ భవనంలో చివరి అంతస్తు.. హోమ్ మినిస్టర్ ఆ అంతస్తులోకి అడుగుపెట్టాడు. హోమ్ మినిస్టర్ రాక గురించి తెలియగానే ‘రా’ చీఫ్ అగస్త్య అక్కడికి వచ్చాడు.‘అగస్త్యా! ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ మీద దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు దాటింది. అమాయకులైన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఎవరు చేశారో మనకు తొందరగా తెలియాలి’ అన్నాడు.‘సర్ .. నాకు రెండుగంటలు టైం ఇవ్వండి’ అన్నాడు అగస్త్య. ఒకపక్క ఒక విశాలమైన గది. ఆ గది నుంచి బయటకు వచ్చిన ఒక డాక్టర్ అగస్త్యను కలిశాడు.‘సారీ అగస్త్యగారు! అతడికి ఎలాంటి మందులు పని చేయడం లేదు. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.అగస్త్య విచారిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అది చిన్న సైజు హాస్పిటల్లా ఉంది. అక్కడ ఒక మంచం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి ఆ గదిలోనే ట్రీట్మెంట్ జరగడానికి వీలుగా అన్ని పరికరాలు అమర్చారు.అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.మంచం మీదున్న ఆ వ్యక్తిని కొద్దిసేపు అలా చూస్తుండిపోయాడు. తరువాత అక్కడున్న సిస్టం ఆన్ చేశాడు. పేపర్ వెయిట్ తిప్పుతూ ఆలోచనలో మునిగిపోయాడు. అతడు పేపర్ వెయిట్ తిప్పుతూ ఉంటే సిస్టంలో స్క్రీన్ సేవర్లు మారిపోతున్నాయి. తిప్పుతున్న పేపర్ వెయిట్ కిందపడిపోతుండగా, దానిని చేతులతో పట్టుకుని పక్కన పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో సిస్టంలో స్క్రీన్ సేవర్ ఆగిపోయింది. అది ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో.కొద్దిసేపు తరువాత అక్కడనుండి వెళదామని అనుకుంటూ అగస్త్య పైకి లేచాడు. అనుకోకుండా అగస్త్య చూపు మంచం మీదున్న వ్యక్తి మీద పడింది. ఒక్కసారిగా అగస్త్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి, అగస్త్యవైపే చూస్తున్నాడు.అగస్త్య అతడిని చూస్తూ, ‘అర్జున్! బాగానే ఉన్నావా?’ అడిగాడు.అర్జున్ మాట్లాడలేకపోతున్నాడు. అతడి కళ్ళు మాత్రమే చూడగలుగుతున్నాయి.ఏదో చెప్పాలని అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడి శరీరం ఇసుమంతైనా కదలడం లేదు. ఆ బాధ అతడి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి పరిస్థితిని ఆందోళనగా చూస్తున్నాడు అగస్త్య.‘కమాన్ .. అర్జున్ కమాన్.. నువ్వు మాట్లాడగలవు. నువ్వు తలుచుకుంటే పైకి లేచి నిలబడగలవు’ అని ధైర్యవచనాలు చెప్తూ అర్జున్ని ఉత్సాహపరుస్తున్నాడు అగస్త్య.అర్జున్ పైకి లేవడం కాదు కదా, కనీసం మాట్లాడలేడని అతడికి తెలుసు.‘అర్జున్.. నువ్విప్పుడు ఏదైనా చెప్పగలిగితే మనం ఆ ఉగ్రవాదులను పట్టుకోగలం. ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ దాదాపుగా ధ్వంసమైంది. నువ్వు కాపాడిన విదేశీ రాయబారులు క్షేమంగా తిరిగి వెళ్లిపోయారు.అందుకుగాను నీకు రాష్ట్రపతి ప్రశంస లభించింది. ఇప్పుడు ఆ ఉగ్రదాడి గురించి నువ్వు చెప్పే వివరాలు మాత్రమే మన దేశాన్ని కాపాడగలుగుతాయి’ అని చెప్తూ అగస్త్య అర్జున్ వంక చూశాడు. అర్జున్ కనులనుంచి నీటిచుక్కలు రాలిపడ్డాయి. అతని పక్కన కూర్చుని అగస్త్య కన్నీటిని తుడిచాడు. సరిగ్గా అదే సమయంలో.. అర్జున్ కళ్ళు అక్కడ ఆన్ చేసి ఉన్న సిస్టం మీద పడ్డాయి. సిస్టంను చూస్తూ అతడి కళ్ళు పెద్దవయ్యాయి.అర్జున్ కళ్ళలో మార్పులను గమనిస్తున్న అగస్త్య సిస్టంలో ఏముందా అని చూశాడు. అందులో.. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్– నాడీమండలం పని చేయడం ఆగిపోయి అమియోట్రోఫిక్ లాటరల్ స్కె›్లరోసిస్ వ్యాధి వలన స్టీఫెన్ హాకింగ్ కదలలేని, మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడు. అయినా, కేవలం కనురెప్పలు కదిలించడం ద్వారా ఎన్నో పుస్తకాలను రచించాడు.అది చూడగానే అర్జున్ కళ్ళలో ఏదో చెప్పాలన్న ఆరాటం కనిపిస్తోంది. అగస్త్య ఉత్సాహంగా పైకి లేచాడు. ‘అర్జున్! నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఆ ఉగ్రవాదుల గురించి ఏదో సమాచారం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కదా’ అన్నాడు అగస్త్య. ‘ఔను’ అన్నట్టుగా కనురెప్పలు ఆడించాడు అర్జున్. ‘అర్జున్ ముందు వాళ్ళ పేర్లు తెలిస్తే చెప్పు. వాళ్ళు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో నేను కనిపెడతాను’ అన్నాడు అగస్త్య.అందుకు సమాధానంగా కనురెప్పలు కదిలించాడు అర్జున్.‘మొదలుపెడదాం’ అంటూ అగస్త్య, ‘నేను ఏబీసీడీలు చెప్తుంటాను. వాడి పేరులో మొదటి అక్షరం వచ్చినప్పుడు కనురెప్పలు కదిలించు అన్నాడు. చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్’ అన్నప్పుడు కనురెప్పలు కదిలించాడు అర్జున్. ఎన్ అనే అక్షరం రాసి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు అగస్త్య. అలా ‘నసీర్ అబ్దుల్లా’ పేరు బయటకు వచ్చింది. అర్జున్ను చూసి అగస్త్యకు కళ్ళు తడిబారాయి.పేరు మోసిన ఉగ్రవాద సంస్థకు చెందిన నసీర్ అబ్దుల్లాను, మిగిలినవారిని ‘రా’ అరెస్ట్ చేసింది.కేవలం ‘కనురెప్పలే సాక్షిగా‘ భయంకరమైన ఉగ్రవాదులను కనిపెట్టినందుకు అర్జున్కు ప్రత్యేకమైన అవార్డు ప్రకటించారు. -
రైస్ ఫూలింగ్
రైస్ పుల్లింగ్ యంత్రం దగ్గర పెట్టుకుంటే వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయంటూ రియల్టర్ వెంకట రమణ నుంచి రూ.24 లక్షలు కాజేసిన పబ్బతి వెంకటేశ్వర్లుపై హైదరాబాద్లోని పంజగుట్ట పోలీసులు ఈ నెల 1న కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఏటా రూ.కోట్లు కొల్లగొడుతున్న ఇలాంటి ముఠాలు అనేకం ఉన్నాయి. కాయిన్, చెంబు, బిందె, యంత్రం... ఇలా వివిధ వస్తువులు చూపించే ఈ చీటర్స్ అవి బియ్యాన్ని తమవైపు ఆకర్షిస్తాయని, వాటిని దగ్గర పెట్టుకుంటే దశ తిరిగిపోతుందంటూ నమ్మబలుకుతారు. వీరి వలలో పడుతున్న అమాయకులు భారీ మొత్తాలు కోల్పోతున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా రాణిపేట ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్కు కేరాఫ్ అడ్రస్గా ఉంది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన అనేక మంది రైస్ పుల్లింగ్ పాత్రలు ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా సంచరిస్తుంటారు. రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం అని అర్థం. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటిని దక్కించుకుంటే అమోఘమైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. వీళ్లు కస్టమర్లకు రైస్ పుల్లింగ్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మాత్రమే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో ఈ పాత్రలను కొనేవారికి తాము విక్రయిస్తున్న వాటిని చూసే అవకాశం కూడా ఇవ్వరు. ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమను ప్రత్యక్షంగా చూపించమని పట్టుబడితేనే చూపిస్తారు. ఈ మోసగాళ్ళు ఎన్ని చెప్పినా, కొందరు కస్టమర్లు నమ్మరు. ఇలాంటి వాళ్లు ఆయా గ్యాంగ్స్తో తమ ముందు రైస్ పుల్లింగ్ చేసి చూపించమని కోరుతూ ఉంటారు. ఇలాంటి వారిని బుట్టలో వేసుకోవడానికి నేరగాళ్ళు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తుంటారు. ఈ చీటర్స్ సాధారణ నాణెం/చెంబు/బిందె తదితరాలను ‘రైస్పుల్లర్’గా మార్చడానికి ‘వంట’ చేస్తుంటారు. బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా ఉండేలా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్ళీ బియ్యంలా కనిపించేలా చేస్తారు. ఇలా బియ్యంలా కనిపించే ఎండిన అన్నంలో ఇనుప రజను కలిసి ఉంటుంది. మోసగాళ్ళు రైస్ పుల్లర్గా చెప్తున్న పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో తయారైన బియ్యం వస్తే అవి దానికి అతుక్కుంటాయి. ఇలాంటి షోలు చేసి కస్టమర్లకు చూపించే ఈ మోసగాళ్ళు వారిని బుట్టలో వేసుకుంటుంటారు. ఇలాంటి ముఠాలలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారే ఉంటున్నారని ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన పలు కేసులు స్పష్టం చేస్తున్నాయి. తాము నష్టపోయిన మొత్తాన్ని అదే మార్గంలో మళ్లీ సంపాదించాలనో, అసలు ఈ రైస్పుల్లర్లు ఉన్నాయా? లేవా? తేల్చుకోవడం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఈ రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. అక్కడ రైస్పుల్లర్స్ను పరీక్షించినట్టు నటిస్తూ, వాటికి సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో చంద్రయాన్–3లో వినియోగించడానికి ఉపకరించే లోహమని, రూ.కోట్ల ఖరీదు ఉంటుందని సర్టిఫికెట్లలో ప్రచురిస్తుంటారు. ఇదంతా దాన్ని కొనేవాళ్ళ ఎదురుగానే∙జరుగుతుంది. ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుంది. బాధితుల్లో వ్యాపారులు, విద్యాధికులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వారూ ఉంటారు. పరువు కోసం ఆలోచించే వీళ్ళు రైస్పుల్లర్స్ కొనడానికి ప్రయత్నించి మోసపోయినా, ఆ విషయం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ కారణంగానే ఓ నేరగాడు లేదా ముఠా పది నేరాలు చేస్తే కేవలం నాలుగైదు మాత్రమే రికార్డుల్లోకి ఎక్కుతుంటాయి. ఇదే నేరగాళ్ళకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. ఓ ముఠా పోలీసులకు చిక్కినప్పుడు అనేక నేరాలు అంగీకరిస్తుంటుంది. అధికారులే స్వయంగా ఆయా బాధితులను సంప్రదించి, ఫిర్యాదు చేయాలని కోరిన సందర్భాలూ ఉంటున్నాయి. అయితే బయటపడటానికి ఇష్టపడని బాధితులే అత్యధికులు ఉంటున్నారు. కేవలం రైస్ పుల్లింగ్ పేరుతోనే కాదు, మరో పది రకాల వస్తువులు, పద్ధతుల పేర్లు చెప్పి మోసాలు చేసే ముఠాలు ఉన్నాయి. వీటి బారినపడి మోసపోయిన వాళ్లు వందలు, వేల సంఖ్యలో ఉన్నా, ఇప్పటికీ అనేక మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆశతో ఇలాంటి మోసగాళ్ల వల్లో పడి భారీగా నష్టపోతున్నారు. ఇండియన్ శాండ్ బో జాతికి చెందిన పాము తల, తోక ఒకేలా ఉంటాయి. దీన్ని రెండు తలల పాము అని, డబుల్ ఇంజన్ పేరుతో అది దగ్గర ఉంటే దశ తిరిగిపోతుందని విక్రయిస్తుంటారు. ప్రత్యేకంగా తయారైన ఓ అద్దం ఉంటుందని, దాని ముందు నుంచి ఎవరైనా వెళ్తే అవతలి వారికి వివస్త్రులుగా కనిపిస్తారని నమ్మిస్తారు. వీటితో పాటు వందేళ్లకు పైగా బతికిన త్రాచుపాము తలపై ఏర్పడే నాగమణి, రెండు వైపులా కళ్లు కలిగి ఉండే నెమలి ఈక, నల్లపసుపు, ఎర్ర కలబంద, నల్ల వావిలాకు, లిల్లీపుట్స్, ఇరీడియం తదితరాల పేర్లు చెప్పి మోసం చేసే ముఠాలు అనేకం ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా రైస్ పుల్లింగ్ కథలే నడుస్తుంటాయి. -
జత కలవాలంటే జాతకాలు కలవాల్సిందేనా!
‘ఏనాడు ఏ జంటకో రాసి ఉంటాడు విధి ఎప్పుడో’ అన్నాడు మనసుకవి ఆత్రేయ.‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని నానుడి. విధి నిర్ణయం ముందే జరిగి ఉంటుందనేది తరతరాల విశ్వాసం. ఆ నిర్ణయమే మనల్ని నడిపిస్తుందనేది నమ్మకం.అంతమాత్రాన పెళ్లిళ్ల వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోలేం. జీవితంలోని నానా పరిణామాల్లాగానే పెళ్లిళ్లు కూడా బ్రహ్మలిఖితమేనంటారు.విధి విధానాన్ని మార్చడం మానవమాత్రులకు శక్యంకాదని అందరికీ తెలుసు.విధిపై నమ్మకమెలా ఉన్నా, భవిష్యత్తును తెలుసుకోవాలనే కుతూహలం మానవ సహజం. అందుకే పెళ్లిళ్లకు ముందు వధూవరులకు జత కలిసేదీ లేనిదీ తెలుసుకోవాలనుకుంటారు. జత కట్టడానికి... జాతకాలు కలవడానికి సంబంధమేమిటో... తెలుసుకుందాం.సంప్రదాయబద్ధంగా జరిగే చాలా పెళ్లిళ్లలో పెళ్లికి ముందు వధూవరుల తల్లిదండ్రులు కట్న కానుకలు, లాంఛనాలు తదితర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లెక్కలు మాట్లాడుకుంటారు. ఇదంతా పెళ్లిచూపుల సమయంలో జరిగే వ్యవహారం. పెద్దల ద్వారానో, తెలిసిన మధ్యవర్తుల ద్వారానో పెళ్లి సంబంధం ప్రస్తావన వస్తే, పెళ్లిచూపులకు ముందే జరిగే తతంగం ఇంకొకటి ఉంది. అదే వధూవరుల జాతక పరిశీలన, నిపుణులైన జ్యోతిష సిద్ధాంతుల ద్వారా వధూవరుల జాతకాలను పరిశీలిస్తారు. వధూవరులకు జత కలవాలంటే, వారిద్దరి జాతకాలూ కలవాల్సిందేనని చాలామంది నమ్ముతారు. అందుకే, వధూవరులు ఇద్దరి జాతకాలూ సరిపోతాయని సిద్ధాంతులు నిర్ధారించిన తర్వాత మాత్రమే పెళ్లిచూపుల వరకు వెళతారు. జాతకాలలో ఏవైనా దోషాలు ఉన్నట్లు చెబితే, పెళ్లికి ముందు పరిహారాలు చేయించుకుంటారు. జాతకాలు ఏమాత్రం సరిపోవని సిద్ధాంతులు తేల్చేస్తే, పెళ్లిచూపుల వరకు వెళ్లకుండానే విరమించుకుంటారు.పెళ్లి సంబంధాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు చాలామంది మొదటగా వధూవరుల జాతకాలను పరిశీలన కోసం జ్యోతిష సిద్ధాంతులను సంప్రదిస్తారు. వారి సలహాలు, సూచనల మేరకే తర్వాతి కార్యక్రమాల కోసం సన్నాహాలు చేసుకుంటారు. పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించే సంప్రదాయం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అలాగని, ఇది కేవలం మన భారతదేశానికి మాత్రమే పరిమితమైన సంప్రదాయం కాదు, పలు ఇతర దేశాల్లోనూ ఉంది. వేర్వేరు దేశాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులు ఉన్నాయి. ఆయా దేశాల వారు తమ తమ జ్యోతిష పద్ధతుల ఆధారంగా పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి, ఆ తర్వాత పెళ్లిళ్లకు సిద్ధపడతారు. పెళ్లిళ్ల కోసం జాతకాల పరిశీలన చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.జాతకాల్లో ఏమేం పరిశీలిస్తారు?వధూవరుల జాతకాలు పరస్పరం పొంతన సరిపోయేదీ లేనిదీ నిర్ధారించేందుకు మన దేశంలోని జ్యోతిషులు ‘అష్టకూట గుణ మేళనం’ అనే పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో వధూవరుల జాతకాలలోని నాడీ కూటమి, భకూటమి, గణ కూటమి, మైత్రీ కూటమి,యోని కూటమి, తారా కూటమి, వశ్య కూటమి, వర్ణ కూటమి అనే ఎనిమిది అంశాల పొంతనను పరిశీలిస్తారు. ఈ అంశాలకు మొత్తం 36 గుణాలను కేటాయిస్తారు. వధూవరుల జాతకాలు రెండింటినీ పరిశీలించినప్పుడు ఈ ఎనిమిది అంశాల్లో కనీసం 18 గుణాలు వచ్చినట్లయితేనే, వధూవరుల జాతకాల్లో పొంతన కుదిరినట్లు చెబుతారు. వధూవరుల జాతకాల గుణమేళనంలో 18–25 గుణాలు మధ్య వచ్చినట్లయితే సామాన్యమైన పొంతనగా, 25 గుణాల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఉత్తమమైన పొంతనగా చెబుతారు. ఉత్తర భారతదేశంలో ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తారు.దక్షిణ భారతదేశంలో మరో నాలుగు అంశాలను కూడా పరిశీలిస్తారు. అవి: మహేంద్ర కూటమి, స్త్రీ దీర్ఘకూటమి, రజ్జు కూటమి, వేధ కూటమి. వధూవరుల జాతకాల పరిశీలనలో గుణ మేళనం కీలకమే అయినా, దీనితో పాటు గ్రహమైత్రి తదితర మరికొన్ని అంశాలను కూడా జ్యోతిషులు పరిశీలిస్తారు. కుజ దోషం, కాలసర్పదోషం, పితృదోషం వంటి దోషాలు ఉన్నట్లయితే, తగిన పరిహారాలను సూచిస్తారు. వివాహానికి ముందే దోష పరిహారాలు చేయించుకున్నట్లయితే, ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. అన్నీ కుదిరి, వధూవరుల ఉభయ కుటుంబాలవారు వివాహానికి నిశ్చయించుకుంటే, నిశ్చితార్థం మొదలుకొని వివాహ క్రతువు పూర్తయ్యేంత వరకు వివిధ ఘట్టాలకు తగిన ముహూర్తాలను జ్యోతిషులు నిర్ణయిస్తారు. అందుకే, పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిష సిద్ధాంతులకు దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంటుంది.శరవేగంగా జ్యోతిష వ్యాపారంఆ ధునికత పెరిగే కొద్ది జ్యోతిషంపై జనాల్లో నమ్మకం అంతకు మించి పెరుగుతూ వస్తోంది. మన దేశంలోని జ్యోతిషులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. వెబ్సైట్లు, యాప్ల ద్వారా జ్యోతిషానికి సంబంధించిన రకరకాల సేవలను అందిస్తున్నారు. కొందరు జ్యోతిషులు టీవీ చానెళ్లు, పత్రికల్లో విరివిగా ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు. ఇంకొందరు టీవీ చానెళ్లు, పత్రికల్లో రాశిఫలాలను చెప్పడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ నివేదిక ప్రకారం 2023 నాటికి మన దేశంలో జ్యోతిషుల వ్యాపారం 3.22 బిలియన్ డాలర్ల మేరకు (దాదాపు రూ.28 వేల కోట్లు) జరిగింది. ఈ వ్యాపారం 2032 నాటికి 23.87 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.07 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. మన దేశంలోని జ్యోతిష వ్యాపారం 24.93 శాతం సగటు వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్నట్లు ‘బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్స్’ చెబుతోంది. ఐటీరంగం నమోదు చేసుకుంటున్న వార్షిక వృద్ధి రేటు కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం విశేషం.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, జ్యోతిష వ్యాపారం విలువ 2024 నాటికి 14.30 బిలియన్ డాలర్లుగా (రూ.1.24 లక్షల కోట్లు) నమోదైంది. ఇది 2034 నాటికి 25.61 బిలియన్ డాలర్లకు (రూ.2.23 లక్షల కోట్లు) చేరుకోగలదని ‘మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్’ అంచనా వేస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో జ్యోతిషులకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. వధూవరుల గుణమేళన కోసం జాతకాల పరిశీలనకు మన దేశంలో జ్యోతిషులు సగటున రెండువేల నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లోని జ్యోతిషులైతే, ఈ పనికి ఐదువందల రూపాయలతో సరిపెట్టుకుంటుంటే, పెద్ద నగరాల్లోని పేరుమోసిన జ్యోతిషుల్లో కొందరు పదివేల రూపాయలకు పైబడి రుసుము వసూలు చేస్తున్నారు. వివాహ ముహూర్త నిర్ణయం, దోష పరిహార సలహాలు, పూజలు వంటి వాటికి రుసుము అదనంగా ఉంటుంది. కొందరు జ్యోతిషులు ఈ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తుంటే, చాలామంది ముఖాముఖిగా అందిస్తున్నారు.ఆసియా దేశాల్లో..భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా, పలు ఆసియా దేశాల్లోనూ జ్యోతిషంపై ప్రజలకు నమ్మకాలు ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిళ్లలో జాతకాల పరిశీలనను ఆ దేశాల్లోని ప్రజలు కూడా కీలకంగా భావిస్తారు. మయాన్మార్, చైనా, మంగోలియా, టిబెట్, తైవాన్, కంబోడియా, జపాన్ తదితర దేశాల్లోని ప్రజలు స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పురాతన చైనీస్ జ్యోతిష పద్ధతిని అనుసరిస్తారు. మన జ్యోతిషంలో పన్నెండు రాశులకు పన్నెండు చిహ్నాలు ఉన్నట్లే, చైనీస్ జ్యోతిషంలోనూ పన్నెండు చిహ్నాలు ఉంటాయి. మన దేశంలో జ్యోతిషులు చాంద్రమానాన్ని, సౌరమానాన్ని అనుసరిస్తుంటారు. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి తిథి నక్షత్రాలను లెక్కిస్తారు. చైనీస్ జ్యోతిష విధానంలో ఒక్కో సంవత్సరానికి ఒక్కో చిహ్నం ఉంటుంది. చైనీస్ నూతన సంవత్సరం రోజు నుంచి వారికి సంవత్సరం మొదలవుతుంది. చైనీస్ పద్ధతిలో ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, కోడిపుంజు, కుక్క, పంది ఒక్కో సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతి పన్నెండేళ్లకు ఇవి పునరావృతమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈ ఏడాది 2025 చైనాకు ‘పాము’ సంవత్సరం. చైనీస్ జ్యోతిషం ప్రకారం ఈ సంవత్సరం పుట్టిన వారికి ‘ఎద్దు’, ‘కోడిపుంజు’ సంవత్సరాలలో పుట్టినవారితో వివాహం అనుకూలంగా ఉంటుంది. ‘పులి’, ‘గుర్రం’, ‘పంది’ సంవత్సరాలలో పుట్టిన వారితో వివాహం వీరికి అంతగా పొసగదు.జపాన్లో ‘అస్జిక్కన్ జునిషి’ అనే సంప్రదాయ జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వీరు కూడా చైనా కేలండర్ మాదిరిగా పన్నెండు చిహ్నాలను ఉపయోగిస్తారు. పన్నెండు చిహ్నాలతో కూడిన రాశి చక్రాన్ని ‘జునిషి’ అని పిలుస్తారు. చైనా పద్ధతిలో మేక ఉంటే, జపాన్ పద్ధతిలో గొర్రెను; చైనా పద్ధతిలో పంది ఉంటే, జపాన్ పద్ధతిలో ముళ్లపందిని ఉపయోగిస్తారు. వివాహ పొంతనకు దాదాపు చైనా పద్ధతినే అనుసరిస్తారు. చైనా సంప్రదాయంలో చాంద్రమానం ఆధారంగా కేలండర్ను రూపొందించుకుంటారు. జపాన్లో గ్రెగేరియన్ కేలండర్ను ఉపయోగిస్తారు. జపాన్ సమాజంలో జ్యోతిషంపై పెద్దగా పట్టింపులు లేకున్నా, పెళ్లిళ్లకు ముందు ప్రేమజంటలు జ్యోతిషులను సంప్రదిస్తుంటారు.మయాన్మార్లో మరోరకమైన జ్యోతిష పద్ధతిని పాటిస్తారు. వారంలోని ఏడు రోజులకు ఏడు జంతువుల పేరుతో గుర్తిస్తారు. వాటి ఆధారంగా ఎవరితో ఎవరికి పెళ్లి జరిగితే అనుకూలమో నిర్ణయిస్తారు. బర్మీస్ ప్రాచీన జ్యోతిష పద్ధతి ప్రకారం ఆదివారం– గరుడపక్షి, సోమవారం– పులి, మంగళవారం– సింహం, బుధవారం– ఏనుగు, గురువారం– ఎలుక, శుక్రవారం– గినీపంది, శనివారం– డ్రాగన్గా గుర్తిస్తారు. వీటితో పాటు భారతీయ జ్యోతిషంలో మాదిరిగానే పన్నెండు రాశులను, ఇరవై ఏడు నక్షత్రాలను, నవగ్రహాలను అనుసరించి జాతక చక్రాలు వేస్తారు. అన్ని అంశాలనూ తమ శాస్త్రం ప్రకారం పరిశీలించి, వధూవరులకు జాతక పొంతన బాగున్నదీ లేనిదీ నిర్ణయిస్తారు. పెళ్లిళ్లకు ముందు జ్యోతిషులను సంప్రదించే సంప్రదాయాన్ని మయాన్మార్లో ఇప్పటికీ పాటిస్తారు.పాశ్చాత్య దేశాల్లో.. ఆ సియా దేశాలతో పోల్చుకుంటే పాశ్చాత్య దేశాల్లో జ్యోతిషాన్ని నమ్మేవారి సంఖ్య కొంత తక్కువే అయినా, ఇప్పటికీ జ్యోతిషాన్ని నమ్మేవారు లేకపోలేదు. ప్రస్తుతం లండన్ సహా పలు యూరోపియన్ నగరాల్లో రకరకాల సేవలు అందిస్తున్న జ్యోతిషులు ఉన్నారు. వెబ్సైట్లు, యాప్లు వంటి అధునాతన సాధనాల ద్వారా వీరు తమ సేవలను వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో పెద్దలు కుదిర్చే సంప్రదాయ వివాహాలు తక్కువే అయినా, పెళ్లికి ముందు చాలామంది ప్రేమికులు తమ అన్యోన్యతను గురించి ముందుగానే తెలుసుకోవడానికి జ్యోతిషులను సంప్రదిస్తుంటారు. మెసపటేమియన్ నాగరికత కాలంలో అభివృద్ధి చెందిన జ్యోతిష విధానం కాలక్రమంలో పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ విస్తరించింది. మధ్యయుగాల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచంలో జ్యోతిషుల ప్రభావం ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మత గురువుల ఆంక్షల వల్ల ఆ దేశాల్లో జ్యోతిషానికి ప్రాభవం సన్నగిల్లింది. ప్రాచీన రోమన్ శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలో రాసిన ‘టెట్రాబిబ్లోస్’ పాశ్చత్య ప్రపంచంలోని తొలి జ్యోతిష గ్రంథం. పాశ్చాత్య జ్యోతిషంలోనూ మన మాదిరిగానే పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పద్ధతిలో సౌర గమనం ప్రకారం రాశులను గణిస్తారు.కుజ, శుక్ర గ్రహాల స్థానాలు, జన్మరాశుల ఆధారంగా వధూవరుల జాతకాల పొంతనను నిర్ణయిస్తారు.ఆఫ్రికా దేశాల్లో.. ఆ ఫ్రికా దేశాల్లో స్థానిక తెగల ప్రజలు రకరకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు జ్యోతిష పద్ధతులను పాటిస్తారు. వలస పాలనల ప్రభావంతో ఆఫ్రికాలో పాశ్చాత్య జ్యోతిషానికి, భారతీయ జ్యోతిషానికి ఆదరణ పెరిగింది. అయితే, ‘అయోదెజి ఒగున్నయికె’, ‘ఇఫా’ అనేవి ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న స్థానిక సంప్రదాయ జ్యోతిష పద్ధతులు. ‘అయోదెజి ఒగున్నయికె’ అనేది ఒకరకమైన ‘భూ భవిష్యవాణి’. అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాల చలనాన్ని కాకుండా, భూమిపై నిత్యం కనిపించే నేల, కొండలు, చెట్లు చేమలు, జీవరాశులు వంటివాటిని శకునాలుగా పరిగణించి, వాటి ఆధారంగా భవిష్యవాణి చెబుతారు. ఈ పద్ధతిలో ప్రధానంగా పదహారు చిహ్నాల పట్టికను ఉపయోగిస్తారు. శిశువు పుట్టినప్పుడు కనిపించే వాటి ఆధారంగా ఈ చిహ్నాలతో జాతక చక్రాన్ని రూపొందిస్తారు. ‘ఇఫా’ జ్యోతిష పద్ధతి పశ్చిమాఫ్రికా దేశాలలో వ్యాప్తిలో ఉంది. ఈ పద్ధతిలో 256 సంప్రదాయ సంకేతాల పట్టిక ఆధారంగా, జ్యోతిషం చెబుతారు. ఇందులో నేల మీద గవ్వలు వేసినట్లుగా, నేల మీద లేదా పళ్లెంలో పరిచిన పిండిలో పోకలను వేసి, వాటి సంఖ్య ఆధారంగా పట్టికలోని సంకేతాలను గుర్తించి, జ్యోతిషం చెబుతారు. సంప్రదాయ వివాహాల్లో వధూవరుల మధ్య పొంతనను తెలుసుకునేందుకు ఆఫ్రికన్ స్థానిక తెగల ప్రజలు ఈ జ్యోతిషులను సంప్రదించి, వారి సలహాలను పాటిస్తారు. -
ఈ వారం కథ: మెలకువలో చీడకల
‘‘రీచ్ అయ్యావా?’’, టింగ్మని వాట్సప్లో భర్త. అబ్బో! కేరింగ్ మెసేజే అనుకుంటూ ‘‘హా, ఇప్పుడే ఆఫీస్ లోపలికొచ్చాను’’ అని ఆమె రిప్లై.‘‘ఒకసారి లొకేషన్ పంపు’’మెసేజ్ని ముసుగు తీస్తే బయటపడ్డ అనుమానం.‘‘యే! నమ్మట్లేదా నన్ను? అయినా దించిన ఓలా డ్రైవర్ నుండి డ్రాప్ లొకేషన్ కూడా పంపించుకున్నావ్ కదా! మళ్లీ ఏంటీ? దున్నపోతులా పడుకునే బదులు పొద్దున్నే లేచి నన్ను డ్రాప్ చెయ్యొచ్చుగా?’’ అని ఫాస్ట్గా టైప్ చేసింది కోపం బాధ కలిపి, కానీ పంపలేదు. బ్యాక్ స్పేస్ బటన్ మీద ఒత్తిడి పెంచడంతో టైప్ చేసిందంతా క్లియర్ అయింది, స్క్రీన్ మీద పడిన కన్నీటి బొట్లు తప్ప!లొకేషన్ పంపించింది.వచ్చిన మెసేజ్లోని ఆమె కోపాన్ని పసిగట్టి, ‘‘ఆఫీస్ అయిపోతే నిన్ను పికప్ చేసుకోవడానికి అడిగాన్లే’’ మెసేజ్కు అతడి సమాధానం.ఆమె నమ్మినట్టుగా ఓ థంబ్సప్ ఎమోజీ పంపింది ఏడుపు ముఖం దాచుకుంటూ. ‘‘మీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అయిపోయాయి, కాసేపు మీటింగ్ రూమ్లో కూర్చోండి’’ అనగానే ఆమె మూడ్ మారింది. సిస్టం కీబోర్డులతో కుస్తీ పడుతున్న ఎంప్లాయీస్ని గమనిస్తూ కూర్చుంది.‘‘హలో మేడమ్, వెల్కమ్ ఆన్ బోర్డ్. మై సెల్ఫ్ యామిని’’ అంటూ ఓ అమ్మాయి తన దగ్గరికి వచ్చింది షేక్ హ్యాండ్ ఇచ్చింది.‘‘హలో, ఐయామ్ మధుమతి’’‘‘తెలుసు మేడమ్‘‘‘‘అయ్యో, మేడమ్ వద్దు. కాల్ మీ మధు’’‘‘అంటే, ఇక్కడికి రాక ముందు కూడా మీరు నాకు మేడమే కదానీ’’మధుమతి వెలిగిపోయింది, కానీ ఏదో గుర్తొచ్చి ఆ బ్లష్ అంతా ఒక్కసారిగా ఫ్లష్ అయిపోయింది.‘‘కూల్ మేడమ్, మీరు లెక్చరర్గా చేసిన కాలేజ్లోనే నేను చదువుకున్నాను’’ చెప్పింది యామిని.‘‘అది అర్థమైంది. కానీ, ఈ విషయం ఆఫీసులో ఇంకెవరికైనా తెలుసా?’’ అడిగింది మధుమతి.‘‘లేదు, ఇంకా ఎవరికీ చెప్పలే’’ పూర్తి చేయకముందే,‘‘చెప్పొద్దు కూడా ప్లీజ్. సారీ నేను నిన్ను గుర్తుపట్టలేదు, ఏ ఇయర్ పాస్డ్ఔట్?’’ అడిగింది మధుమతి.‘‘2021 మేడమ్’’ చెప్పింది యామిని.‘‘నీకోటి చెప్పాలి యామిని, బట్ ప్లీజ్ కీపిట్ సీక్రెట్’’ అని కాస్త ముందుకు వంగి, ‘‘నేను ఆ కాలేజ్లో మానేసి, గ్యాప్ తీసుకుని, ఈ కంపెనీలో జూనియర్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఇన్ని రోజులు కాలేజ్లో వర్క్ చేసినట్టు ఏమీ చెప్పలేదు ఈ కంపెనీ వాళ్లకి. నో ఎక్స్పీరియ¯Œ ్స. సో నో బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్’’ అంది మధుమతి.‘‘అచ్ఛా ఓ..కే’’ దీర్ఘంగా చూస్తూ తలూపింది యామిని.‘‘మేడమ్, నాకో డౌట్. టెక్నికల్లీ మీరు చాలా సౌండ్. కాలేజ్లో స్టూడెంట్స్కి మీరంటే క్రేజ్ కూడా! మీకు ప్రమోషన్ కూడా వచ్చిందని విన్నాను. అలాంటిది మీరు రిజైన్ చేయడానికి రీజన్ మీ పెళ్లా?’, మధుమతి తాళి చూస్తూ అడిగింది యామిని.‘‘హ్మ్...నో’’,‘‘మరి?’’‘‘చెప్తాను, కానీ అది చెప్పే కంటే ముందు ఒకటి అడగాలి. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి సిటీలో బానే సెటిల్ అవుతున్నవ్ కదా ఇప్పుడు మన కాలేజ్ గురించి నీకేం అనిపిస్తుంది?’’ అడిగింది మధుమతి.మొదట బ్లాంక్ ఫేస్ పెట్టింది. ‘‘చెప్పాలంటే, ఇప్పుడనే కాదు ఎప్పుడడిగినా సేమ్ ఫీలింగ్ అలాంటి బేకార్ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యానా అని’’ అంది యామినీ.మధుమతి తన ఫోన్ తీసి ‘ఇది చదువు’ అని ఇచ్చింది,‘ఇది అన్ని గ్రూపుల్లోకి షేర్ చేయండి. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ సీట్స్. మారుతున్న కాలంతో పాటు ఇంజనీరింగ్లో కూడా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలాంటి అధునాతన కోర్సులు ఫీజ్ రీయింబర్స్మెంట్తో అందిస్తున్నాం! రాష్ట్ర రాజధానికో మరో నగరానికో వెళ్లాల్సిన పనిలేదు, కాలేజీ మన ఊరికి దగ్గర్లోనే! హాస్టల్ ఫెసిలిటీ, స్కాలర్షిప్ కూడా కలదు’యామిని మొత్తం చదివి, అర్థమయ్యీ కానట్టుగా ఫోన్ ఆమెకిచ్చేసింది.‘‘ఇంటర్ కాలేజీల్లోంచి స్టూడెంట్స్ లిస్ట్ తీసుకుని, పేరెంట్స్కి ఒక్కో లెక్చరర్ నుండి ఒక్కో నంబర్ ద్వారా ఈ మెసేజ్లు పంపేది మేమే! మన ప్రిన్సిపాల్ దగ్గరుండి మరీ ఇలాంటి పనులు మాతో చేయిస్తుంటాడు. ఇంజినీరింగ్ తర్వాత మీ 35 సంవత్సరాల కెరీర్ వాళ్లకు అనవసరం, వాళ్లకు నువ్వు ఓ 35 వేల రూపాయిల రీయింబర్స్మెంట్ ఐటమ్వి మాత్రమే! లెక్చరర్గా నాకే చాలాసార్లు అనిపించింది, అలాంటిది స్టూడెంట్స్గా మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అంది మధుమతి.‘నో నో, ఎలాగో అయిపోయి సంవత్సరాలు దాటాయి కదా మేడమ్. ఇప్పుడేం చేస్తాం. సో మీరు జాబ్ మారింది పెళ్లై కాదు కాలేజ్ వల్లేనా? అలా అయితే వేరే కాలేజీలు ఉన్నాయిగా!’ అంది యామిని.‘‘కాని, ఎక్కడికి వెళ్ళినా నా కోసమే కాలేజ్కొచ్చే స్టూడెంట్స్ ఉన్నారని నువ్వే అన్నావ్ కదా, అలాంటి విషయాలు అల్లరిగా పైకి కనబడినా లోపలి చిల్లరతనం ఏదో రోజు బయటపడుతుంది. లాస్ట్ ఇయర్, క్లాస్ రూముల్లో మందు తాగే బదులు పైన టెర్రస్ మీద తాగి పడిపోండంటూ రెండు రూములు కట్టించాడు ప్రిన్సిపాల్! అడిగితే ఏం చెప్పాడో తెలుసా? ‘చెప్తే వినే వాడు స్టూడెంటే కాదు అని సినిమా డైలాగులు కొట్టి వెళ్లిపోయారమ్మా స్టూడెంట్సు. పైగా ఏసీ ఉందనీ నా క్యాబిన్లోకి వచ్చి మందు సిట్టింగ్లు వేస్తామంటే టెర్రస్ మీద రూమ్లు కట్టించాను. మరేం చేయమంటావ్? మర్యాద కాపాడుకోవాలిగా’ అన్నాడు’’‘కాని అది మర్యాద కాదు సార్’ అని అంటే,దానికి ఆయన, ‘ఆపమ్మా తల్లీ, లెక్చర్లు స్టూడెంట్స్కివ్వు కాని, నాలాంటి ప్రిన్సిపాల్కి కాదు. ఏమైనా ఉంటే ప్రిన్సిపాల్ మీదికో కాలేజ్ మీదికో వచ్చి ఎగురుతారు గాని, స్టూడెంట్స్ వేషాలేమైనా తక్కువా! స్నానాలు చేయకుండానే, గడ్డాలు గీసుకోకుండానే కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండానే కాలేజీకి వస్తారు, రావడంతోనే అమ్మాయిలని, లేడీ స్టాఫ్ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఓ ముప్పైఐదు నలభై వయసున్న లెక్చరర్లతో ఫ్రెండ్షిప్లు చేయడం, వెనకేసుకొస్తారు కాబట్టి వాళ్లను కూడా కలుపుకొని పార్టీలు షికార్లకి తీసుకెళ్లి అటెండె మేనేజ్ చేయడం. చొక్కా పైబటన్ పెట్టుకోరు, అడిగితే ఉడుకపోస్తుంది అని మిగతా బట¯Œ ్స కూడా విప్పేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఫస్టియర్ క్లాస్ రూముల్లో కండోమ్స్ దొరకడం, బాత్రూంలో కెమెరాలు పెట్టడం, పోలీసులు వచ్చి మరీ డ్రగ్స్ దొరకబట్టే దాకా తెలీలేదు కాలేజ్ హాస్టల్లో ఎన్ని దరిద్రాలున్నాయో... ఛీ...ఛీ... ఏమైనా మారుద్దామంటే ఎన్నిసార్లని కన్నేసి ఉంచుతాం? ఎంతమంది మీదేసి ఉంచుతాం చెప్పు!కనీసం అమ్మాయిలైనా బుద్ధిగా శ్రద్ధగా ఉంటారా అంటే కనబడితే గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. గర్ల్స్ హాస్టల్ కదా నేనెలా వెళ్లి చెక్ చేస్తాను అని వార్డెన్లను చూడమంటే రూమ్స్ నిండా బీరుసీసాలే! చదివే ఓపికుండదు గాని పొద్దున్నుండి రాత్రి వరకు హెడ్సెట్లు పెట్టుకొని ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. వాడెవడినో ప్రేమించిందే గాక వాడు పెట్టమన్నాడని సిగ్గులేకుండా వెళ్లి వాళ్ల హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది...చ్చీచ్చీఛీఛీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎలాగో జాయిన్ అయిన కొద్ది రోజులకే తెలుస్తోంది కదా వాళ్ల పిల్లలు ఎలా తయారవుతున్నారో, పేరెంట్స్ వచ్చి మళ్లీ నా మీదనే పడి చస్తారు చెడగొడ్తున్నారనీ... వాళ్లేదో పద్ధతిగా పెంచారా?’మధుమతి ప్రిన్సిపాల్ మాటలు చెప్తుంటే యామినికి తన కాలేజీ రోజులు ఒక్కసారిగా కళ్లముందు కదిలాయి. ఇలాంటి రోజుల నుండి బయటపడ్డా అనే ఫీలింగ్ ఎంత రిలాక్స్డ్గా ఉందో తనకి!‘ఇవే కాదు అసలు దరిద్రాలు కాలేజీలో జరిగే యాన్యువల్ డేలు, ఫ్రెషర్–ఫేర్వెల్ పార్టీల్లో ఉంటాయి. దానికి గెస్టులుగా సినిమా హీరోలు, హీరోయిన్లు. అసలు వాళ్లే ఎందుకు? సరే ఆ ఏజ్లో సినిమా వాళ్లంటే ఓ క్రేజ్, ఓ ఇన్స్పిరేషన్ అని అనుకున్నా, అప్పటి వరకు కాలేజీ మొహం కూడా చూడని వాళ్లు ఇలాంటి ప్రోగ్రాంలకి తప్పక వస్తారు. స్టూడెంట్స్ చేసే గోలను చూసి సినిమా వాళ్లు ఇదే బాగుందని, ‘నెక్స్ట్ టైం నుండి సినిమా ప్రమోషన్ కూడా కాలేజీలోనే చేస్తే బాగుంటదని’ ఎవడో తొత్తు సలహా ఇస్తాడు. అలాంటి ప్రమోషన్కి పక్క కాలేజీ వాళ్లు కూడా ఈ కాలేజీకే వస్తారు. తాగేసి ఫ్యా అంటూ గొడవలు మొదలై, పాన్ పరాగ్ ఉమ్మిన ప్రహరీ గోడలకు రక్తంతో మెరుగులు దిద్దుతారు. సర్లే ఇదంతా ఒక్క రోజేగా అనుకుంటే ఆ హీరోను చూసి ఇంకో హీరో, అది చూసి మరో హీరో.ఇన్ని ప్రోగ్రాంల మధ్య సిలబస్ టైముకి అవదు, పైగా లైబ్రరీలో బుక్స్ సరిగ్గా ఉండవు, ఉండాల్సినంత మంది లెక్చరర్లు ఉండరు. ఖర్చుతో పని కాబట్టి ప్రిన్సిపాల్ పట్టించుకోడు. పైగా ‘అరవై ఉన్న క్లాసులో చదివేది పదిమందేగా! కనీసం కాలేజీకి సినిమా ఫంక్షన్తోనైనా పేరు వస్తుంది’ అని ఊరుకుంటాడు. వచ్చిన సినిమా వాళ్ళు ప్రమోషన్ మాటలు మాట్లాడుతారా అంటే, ‘ఏమీ చదవకుండానే నేనీ పొజిషన్లో ఉన్నాను. చదువు దేనికీ పనికిరాదు. కాలేజీ ఉన్నది కేవలం మిమ్మల్ని రోబోలుగా మార్చి పనిప్పించడానికే! ముందు ప్రపంచాన్ని చదవండి’ అని అంటుంటే ఆ వయసుకి ఆ మాటలు ఎంత వరకు అర్థమవుతాయి?ప్రపంచాన్ని ఎంత చదివినా, చదవాల్సిన టైమ్లో పుస్తకాలు చదవకపోతే స్టూడెంట్స్ ఏ ఎగ్జామైనా ఎలా పాసవుతారు? కానీ ఆ స్పీచ్లకు చప్పట్లు, విజిల్స్తో కాలేజీ దద్దరిల్లేది’’ గ్లాసులో నీళ్ళు అందుకుంటూ అంది మధుమతి.యామిని ఏమీ అనలేక, ఆ కంప్లయినింగ్ టోన్ వినలేక సఫొకేట్ అవుతోంది. మేడం లెక్చరర్గా మానేసినా, కూడా క్లాస్ పీకడం మాత్రం మానట్లేదని అనుకుంటూ,‘‘సర్లేండి మేడమ్. మనం మాత్రం ఏం చేస్తాం. కాఫీ?’’ అడిగింది‘‘ఇదంతా తప్పు కదమ్మా. అందుకే’’ ఆపేసింది నీళ్లు తాగుతూ.‘ఏం చేశారనీ’ కుతుహలంతో అడిగింది యామిని.‘‘ల్యాబ్స్, లైబ్రరీ, టాయిలెట్స్, హాస్టల్ ఎంత దారుణంగా ఉన్నాయో ఫోటోలతో సహా కలిపి యూజీసీకి కంప్లైంట్ రాశాను’’ చెప్పింది.‘‘యూజీసీకా! వాళ్ళు యాక్షన్ తీసుకోగలిగితే, ఈ పాటికి చాలా కాలేజీలు’’ యామిని ఏదో చెప్పేలోపే మధుమతి ఫోన్ రింగ్ అయ్యింది.సైలెంట్లో పెట్టి కాల్ కట్ చేసింది.‘‘అయ్యో లిఫ్ట్ చేయండి’’ అంది యామిని ‘‘ఇట్స్ ఓకే. ఇతని గురించే చెప్పాలి. కాలేజీలో నాకు ప్రమోషన్ వచ్చాక, ఇతని పెళ్లి సంబంధం కూడా వచ్చింది. బాగున్నాడు. నచ్చి పెళ్లి చేసుకున్నాను. అతను అదే టౌన్ కాబట్టి జాబ్ కంటిన్యూ చేశాను. అంతా బాగుండేది. కొత్తలో ఇబ్బందులున్నా కూడా లైఫ్లో ఎక్సైట్మెంట్ ఉండేది’’ అని ఆమె మెల్లిగా తల దించుకుంది. దుఃఖం ఆగట్లేదు, గొంతు తడబడుతోంది. వణుకుతున్న చేతులు ముఖానికి అడ్డం పెట్టుకొని వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది. యామిని అయోమయంగా, ‘‘అయ్యో మేడమ్, ఏమైంది, ప్లీజ్ ఏడ్వకండి’’ అంది దగ్గరికి తీసుకుంటూ.‘‘అలాంటి టైంలో ఒక మగ లెక్చరర్తో నాకు అఫైర్ ఉన్నట్టు నా హస్బెండ్కి పదేపదే కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేశారు, మెసేజ్లు పెట్టారు. కాలేజీలో ఏ అబ్బాయి వచ్చి నాతో మాట్లాడినా తెలీకుండా ఫొటోలు తీసి పంపేవారు’’ ఏడ్చుకుంటూ చెప్పింది మధుమతి. యామిని ఇంకా దగ్గరికి తీస్కోగానే, ‘‘నేను ఏ అఫైర్ పెట్టుకోలేదమ్మా నిజంగా. అదే నా భర్త నమ్మాడో లేదో తెలీదు. నేను ఏ తప్పు చేయలేదని నమ్మినట్టే మాట్లాడతాడు కాని, మళ్లీ డౌట్ పడతాడు. జీతాలు పెంచమని అడిగినందుకు బౌన్సర్లతో కొట్టించారని ఓ లెక్చరర్ నాతో చెప్పుకుంటే, అతనికి నాకు అఫైర్ ఉందని కాలేజీలో స్ప్రెడ్ చేశారు. విషయం తెలుసుకున్న మా నాన్న నన్ను కొట్టాడు. అమ్మ నానా మాటలంది. నా భర్త మాత్రం కనీసం ఓ మాటైనా అనలేదు కాని, నా ఫోన్ లాక్కున్నాడు. నంబర్ మార్చాడు. పాత నంబర్ బ్లాక్ చేసి, సిమ్ కాల్చేశాడు. ఇంట్లో వాళ్ల ఫోన్ నంబర్లు తప్ప ఇంకెవరి నంబర్లు నా ఫోన్లో ఉండకుండా చేశాడు. ఎవరికి కాల్ చేస్తున్నాను, ఎవరికి మెసేజ్లు పెడ్తున్నానో చూసేవాడు. ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వద్దన్నాడు. మెల్లగా జాబ్ మానేయమని ప్రెజర్ పెట్టాడు! సడన్గా జాబ్ మానేస్తే, ‘తప్పు చేసింది కాబట్టే మానేసింది’ అనుకుంటారని నేను చెప్పినా వినలేదు. సిటీకి తీసుకొచ్చాడు. ఎప్పుడన్నా కాలేజీ ప్రస్తావన తెస్తే చిరాకుపడుతూ అరిచేవాడు. అతనే సర్వస్వం అనుకున్నాక జాబ్ వదిలేయడం పెద్ద మ్యాటర్ కాదనిపించింది. మూడు నెలల తర్వాత, ఇంటి నుంచే వర్క్ చేసుకునే సౌకర్యం సాఫ్ట్వేర్లో ఉంది కాబట్టి గట్టిగా అడిగాను. ఒప్పుకున్నాడు. ఇదిగో ఇలా వచ్చి ఈ కంపెనీలో!’’ మధ్య మధ్యలో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మధుమతి.‘‘రిలాక్స్ మేడమ్. అప్పుటి నుండి ఏదేదో చెప్తున్నారు అనుకున్నాను గాని, మీకు ఇంత జరిగిందని, ఇంత బాధ దాచుకున్నారని అనుకోలేదు. షేమ్ ఆన్ దోస్ పీపుల్. అలాంటి కాలేజీలో చేయకపోవడమే బెటర్ లెండి. టైమ్ తీసుకుని మంచి ప్లేస్కే వచ్చారు. డోంట్ వర్రీ, ఈ కంపెనీ, మా టీమ్ చాలా బెటర్. ట్రస్ట్ మీ’’ అంటూ మధుమతి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ అభయమిచ్చింది యామిని.ఈ గ్యాప్లో మధుమతి ఫోన్లో భర్త నుండి మిస్డ్ కాల్స్, మెసేజ్లు.‘‘సిగ్నల్స్ లేవనీ, ఫోన్ సైలెంట్లో ఉందని చెప్పకు. వాటర్ కూడా సరిగ్గా తాగలేదని నీ స్మార్ట్ వాచ్ చెప్తోంది. ఫోన్ మర్చిపోయి బాత్రూమ్కి కూడా వెళ్లవు అని నాకు తెలుసు. నా మెసేజ్లు, కాల్స్ అన్నీ చూస్తావు కాని, కావాలనే రిప్లై ఇవ్వవని కూడా తెలుసు. నీ కోపమంతా ఇంట్లో చూపించు మధు, ప్లీజ్ నేను ఆల్రెడీ నీ ఆఫీస్ దగ్గరున్నాను. కిందికి రా ప్లీజ్’’ వాట్సాప్లో భర్త.‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయడానికి ల్యాప్టాప్, యాక్ససరీస్ ఇచ్చారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేస్తామని చెప్పారు. యామినికి ‘బై’ చెప్పి ఆఫీస్ బిల్డింగ్ కిందకి వచ్చింది మధుమతి.‘‘ఒక్కరోజు, అది కూడా రెండు మూడు గంటలు బయటికి వస్తే ఇన్ని కాల్స్ మెసేజెస్సా! ఛీ’’ అతన్ని తిడుతూనే బైక్ ఎక్కి కూర్చుందామె. వెనక నుండి ఓ రెండుసార్లు అతని హెల్మెట్ మీద కొట్టింది కూడా. అతను ఏం మాట్లాడకుండా బండి ముందుకు పోనిచ్చాడు. ‘ఎందుకంత స్పీడు, మెల్లిగా’ అంటూ ఇంకా తిడుతోంది.‘‘ఐయామ్ సారీ’’ అన్నాడతను.ఆమె కాసేపు మౌనంగా ఉంది. చౌరస్తా దాటి ఓ ఖాళీ రోడ్డు రాగానే, వెనక నుండే అతన్ని మెల్లగా కౌగిలించుకుంటూ వాలిపోయింది. అతను ఇంకాస్త స్లో అయ్యి, చిన్నగా బ్లష్ అవుతూనే సిగ్గుగా వస్తున్న నవ్వును ఆపుకున్నాడు. ‘కొత్తగా ఉందిరా అంతా, కాని, బానే ఉండేలావుంది. నేను సెట్ అవగలను అనిపిస్తోంది. నువ్వు కూడా సెట్ అవ్వొచ్చుగా! మన పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా. ప్రేమగా పిలుస్తూ దగ్గరికి తీస్కోవటం, ప్రతి సాయంత్రం బయటకెళ్తూ కబుర్లు చెప్పుకోవటం, ఇంటి పనిలో నాకు హెల్ప్ చేస్తూ..’ ఆమె చెప్తూ పోతుంటే మళ్లీ మెయిన్ రోడ్ వచ్చిందని బండాపాడు సిగ్నల్ చూసి. హెల్మెట్ తీయడు, ఎక్స్ప్రెషన్ కనబడదు.అయినా అతనంత పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదులే, కోపం తప్ప మిగతా అన్ని ఫీలింగ్స్ దాచుకుంటాడనీ ఆమె కంప్లైంట్ కూడా!ముగింపు నిజానికి అతను అంతగా ఏం దాచుకున్నాడంటే, కాలేజ్ బాత్రూంలో లేడీ లెక్చరర్ల వీడియోలు కూడా తీశారనీ, అలా ఆమె వీడియో కూడా తీసి అతనికే పంపారనీ ఆమెకి చెప్పకుండా దాచాడు!అఫైర్ అలిగేషనే తట్టకోలేని ఆమె ఈ విషయం తెలిస్తే మానానికి పోయి సూసైడ్ చేసుకుని చస్తుందేమోననే భయంతో ఆమె దగ్గరి నుండి ఫోన్తో సహా లాక్కొని, సిమ్ కాల్చి, విషయం ఆమెకి చేరకుండా చేశాడు!ఇక మనుషుల్ని నమ్మడం మానేసిన అతను కాలేజీకే కాదు, ఎక్కడకి వెళ్ళినా అక్కడి బాత్రూంకి వెళ్తుందని, ఎక్కడికీ పంపించకుండా ఆమెని కాపాడే ప్రయత్నం బయటపడకుండా దాచాడు.ఇప్పుడూ అంతే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటి బాత్రూం మాత్రమే వాడుకోవచ్చని ఈ జాబ్కి రిఫర్ చేయించి మరీ ఇప్పించాడని ఆమె దగ్గర దాచాడు.ఉపసంహారం 1సడన్గా ఇంజనీరింగ్ బుక్సో, బస్సో కనబడినా, ‘మేడమ్’ అనే పిలుపు వినబడినా ఆమెలో ఓ అలజడి! ఆ రోజంతా డల్లైపోతుంది. రాత్రవగానే ఓ దిక్కు పడుకొని దిండు తడుపుకుంటుంది. నిద్ర పట్టక భర్త వైపు తిరిగే సరికి అతను మాత్రం గాఢనిద్రలో ఉంటాడు. ఆమె దిండు ఇంకా ఎక్కువ తడుస్తుంది.ఉపసంహారం 2ఎక్కడికి వెళ్లినా ఆమెకి బాత్రూం వస్తుందేమోనని, త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో బైక్ నడుపుతుంటాడు. ఫోన్లో ఏ మెసేజ్ వచ్చినా, ఏం చూడాల్సి వస్తుందోనని భయంతో రోజు గడుపుతుంటాడు. ఇలా మెలకువలో పీడకలలా వెంటాడే అతనికి, రాత్రులు నిద్ర మాత్రలు వేసుకుంటే గాని నిద్ర పట్టదు. అతనికి నిద్రే ఓ ఉపశమనం మరి!సంహారంఏదో పోగొట్టుకున్నట్టు రోజు గడిపే ఇద్దరూ తెల్లారేసరికి మాత్రం ఒకరినొకరు హత్తుకొని నిద్రలోనే కలిసిపోయినట్టు కనబడతారు, ఒకే దుప్పటిలో. అలా ఓ రోజు లేచేసరికి మధుమతి ఇన్బాక్స్లో‘ఏఐ’ ద్వారా స్పై కెమెరాలను కనిపెట్టే మొబైల్ యాప్, ఇప్పటి వరకు తీసినవి లింక్ పెడితే వాటిని సైబర్ సెక్యురిటీతో బ్లాక్ చేయించగల యాప్ తయారు చేసే ప్రాజెక్ట్లోకి డెవలపర్గా తీసుకుంటున్నట్టు యామినికి మెయిల్ వచ్చింది. అదే ఇక నుండి ఆమెను రోజంతా యాక్టివ్గా ఉంచే మాత్ర, అతనికి రాత్రులు మాత్రలు అక్కర్లేకుండా పట్టే నిద్ర. -
సండే వెరైటీగా రొయ్యల దోసెలు, కాజు రవ్వ వడ చేసేయండిలా..!
ఈ ఆదివారం చిన్న పెద్ద అంతా ఇంట్లోనే సందడిగా ఉంటారు. ఆదివారం అంటే ఆటవిడుపులా అనిపిస్తుంది అందరికి. అమ్మపై భారం వేయకుండా..అందరూ తలో చేయి వేసి ఈ సండే ఇలా వెరైటీ వంటకాలు ట్రై చేసి మరింత ఖుషీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేయండి మరీ..!.రొయ్యల దోసెలుకావలసినవి: సోయా పాలు– 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్– 2 టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు– 2 లేదా 3 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి– అర టీ స్పూన్ పసుపు– కొద్దిగా ఉప్పు– తగినంత రొయ్యలు– 250 గ్రాములు (శుభ్రం చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుని, పక్కన పెట్టుకోవాలి) మిరియాల పొడి– పావు స్పూన్ కొత్తిమీర తురుము– కొద్దిగా కరివేపాకు– కొద్దిగా పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి) గరం మసాలా– 1 టీ స్పూన్ దోసెల పిండి– రెండు మూడు కప్పులు గుడ్లు– రెండు లేదా మూడు (అభిరుచిని బట్టి) నూనె– సరిపడాతయారీ: ముందుగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని దోరగా వేయించుకోవాలి. అనంతరం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరిటెతో తిప్పుతూ అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మరికొద్దిగా కారం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు సోయా పాలు పోసి మూత పెట్టి, చిన్న మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గరపడుతున్న సమయంలో రొయ్యలు వేసుకుని, ఒకసారి రుచి చూసి, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడిన తర్వాత ఆ కళాయి దించి పక్కన పెట్టుకుని, స్టవ్ మీద దోసెల పెనం పెట్టుకోవాలి. దానిపై దోసెలు వేసుకుని, ఒక్కో దోసెపై ఒక్కో గుడ్డు కొట్టి, అభిరుచిని బట్టి పసుపు సొనను కదిలించకుండా ఉడికించి, ఆపైన కొద్దికొద్దిగా రొయ్యల కర్రీ, కొత్తిమీర తురుము వేసుకుని, దోసెను ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. కాజు రవ్వ వడ..కావలసినవి: జీడిపప్పు– అర కప్పు రవ్వ– కప్పు అల్లం తురుము– టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి) ఉప్పు– తగినంత కరివేపాకు– 1 రెమ్మ (చిన్నచిన్నగా తుంచి వేసుకోవాలి) కుకింగ్ సోడా– అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ తరుగు– కొద్దిగా పెరుగు– అర కప్పు పైనే నూనె– డీప్ ఫ్రైౖ కి సరిపడాతయారీ: ముందుగా జీడిపప్పును పొడిపొడిగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో రవ్వ, అల్లం తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కుకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పెరుగు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ముద్దలా చేసుకోవాలి. అనంతరం చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని, వడల్లా ఒత్తుకుని, నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చట్నీలో లేదా సాస్లో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. -
యువ కథ: అమ్మ ఎప్పుడూ ఇంతే!
‘ఏంటమ్మా.. నేను ఇంకా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? నాకు తెలుçసమ్మా.. నువ్వు ఇలా చేయడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది’.. అరిచేశా కాస్త గట్టిగానే!‘అలా ఏం కాదు నాన్నా! నాకు కొంచెం బెంగగా ఉంటుంది. అందుకే ఇలా’ అమ్మ సంజాయిషీ.ఏంటో అమ్మ ఎప్పుడూ అర్థం చేసుకోదు. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు. రేపో మాపో పదో తరగతి పూర్తవుతుంది. ఏడాది దాటితే నేను కాలేజీకి వెళ్తాను. నేనూ పెద్దాడిని అయిపోయాను. అయినా అమ్మ ఇంకా నాకు ఏం తెలీదు అనుకుంటుంది. నేను స్కూలుకు వెళ్లడానికి బస్సు ఎక్కాలంటే ఇంటి నుంచి 20 నుంచి 30 అడుగులు వేస్తే సరిపోతుంది. పొద్దున్నే లేచి, కావాల్సిన బుక్స్ అన్నీ బ్యాగులో పెట్టుకుని, హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోతా. సరిగ్గా ఉదయం ఎనిమిదికల్లా స్కూలు బస్సు వచ్చేస్తుంది. ఆ లోపు నేను అన్నీ పూర్తి చేసుకుని సిద్ధమయ్యే లోపు అమ్మ నాకు కావాల్సిన క్యారేజీ కట్టే పనిలో ఉంటుంది. నన్ను పంపించాకే ఇంట్లో నాన్నకు కాఫీలు, టిఫిన్లు. హడావిడిగా అన్నీ ఒక్క చేత్తో చేసేస్తుంది. నేనేమో రెడీ అయిపోయి బ్యాగు వేసుకోగానే, చేతికి లంచ్ క్యారేజీ ఇచ్చేస్తుంది. అక్కడితో అయిపోతుందా అనుకుంటే నా వెంటే పరుగులు పెడుతూ వచ్చేస్తుంది. స్కూలు బస్సు ఎక్కి, అది కదిలే వరకు అక్కడే ఉంటుంది. నాతో పాటు బస్సులో వచ్చే మిగతా ఫ్రెండ్స్ వాళ్ల అమ్మలు కూడా వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. కాని, మా అమ్మ ఎందుకో కొంచెం ఎక్కువ హడావుడి చేసేస్తుంది. అది చూసి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అదో రకంగా చూస్తారు నా వంక, కొన్నిసార్లు నవ్వుతారు కూడా! ఇదంతా రోజూ అనుభవిస్తుంటే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. గట్టిగా అమ్మ మీద అరవాలి అనిపిస్తుంది.ఇలా ఆలోచిస్తున్న నేను బస్సు హారన్ సౌండ్తో ఒక్కసారిగా గతం నుంచి తేరుకున్నాను. దూరం నుంచి బస్సు నా వైపు వస్తోంది. అది చూడగానే నా ఆరేళ్ల కూతురు నా చేతిలో ఉన్న లంచ్ బాక్స్ పెట్టిన బ్యాగు లాక్కుని ముందుకు పరుగెత్తింది. తెలియకుండానే ‘జాగ్రత్త..’ అని నా నోటి నుంచి వచ్చిన మాట పూర్తి కాకుండానే, ‘నాకు తెలుసు డాడీ’ అంటూ పరుగులు పెట్టింది. ఆ మాట వినగానే మళ్లీ ఎక్కడో తడిమినట్లు అనిపించింది. బస్సు ఆగింది. చకచకా పిల్లలు ఎక్కేస్తున్నారు. వాళ్లతో పాటు ఎక్కిన నా కూతురు బస్సు కిటికీ పక్కన సీటులో కూర్చుని, బయటికి చేయి చూపిస్తూ ‘టాటా డాడీ’ అని నవ్వుతూ చెబుతోంది. బస్సు అటు వెళ్లగానే, నేను నా కారు పార్క్ చేసిన వైపు వెళ్లాను. కారులో కూర్చుని స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాను. దారంతా ఎందుకో ఒకటే ఆలోచనలు. ఏంటీ నేను ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నానా? ఒకప్పుడు నా ఇష్టం అనుకున్నది ఇప్పుడు ఎందుకు ఒక చిన్న భయంలా మారింది. అమ్మ నన్ను చాలా ప్రేమించింది. అందరి కన్నా ఎక్కువే ప్రేమించింది. కాని, ఆ అతి ప్రేమ నన్ను ఇబ్బంది పెట్టిందా? అంతా నాకే తెలుసు అనే స్వభావం ఏర్పడి తెలియకుండానే నేను అమ్మ మీద అరిచేవాడినా? తండ్రయ్యాక తెలిసింది.. పిల్లల మీద మనం చూపించే ఆ ప్రేమ కొన్నిసార్లు భయం వల్ల కూడా పుడుతుంది అని. వాళ్లు జాగ్రత్తగా ఉండాలనుకునే మన ఆరాటం వారిని ఇబ్బంది పెడుతుందని. ఆరేళ్లుగా నా కూతుర్ని చూస్తున్నా– స్కూలుకు వెళ్లడం మొదలెట్టాక తన పనులు తానే చేసుకుంటుంది. ఎంచక్కా రెడీ అయిపోతుంది. కానీ నాకెందుకు? తను జాగ్రత్తగా స్కూలు బస్సు ఎక్కేవరకు ఒక తెలియని బెరుకు. ఇదేనా అమ్మ కూడా నా మీద చూపించిన ప్రేమ తాలూకు జ్ఞాపకం. ఇలా ఆలోచిస్తుండగానే కారు ఇంటి ముందు ఆగింది.ముభావంగానే లోపలికి వెళ్లిన నాకు నా భార్య లలిత ఎదురొచ్చి చేతిలో కాఫీ పెట్టింది. అది అందుకుని ఏమీ మాట్లాడకుండానే, బెడ్ రూంలోకి వెళ్లిపోయా. నేను అలా వెళ్లడం చూసి ఏమీ అర్థం కానట్లు కాసేపు చూసి, వంటగదిలోకి వెళ్లిపోయింది. రూంలోకి వచ్చిన నేను, చేతిలో ఉన్న కాఫీని టేబుల్పై పెట్టేసి పైన చొక్కా తీసేసి, అలా బెడ్పై వాలిపోయా. వంటింట్లో నుంచి కమ్మటి వాసన, తాలింపు చప్పుళ్లు. నా భార్య మధ్యాహ్నానికి కావాల్సిన వంటలో నిమగ్నమైపోయింది. కాసేపు అలా కళ్లు మూతలు పడ్డాయి. కాసేపటికి ఎందుకో అమ్మ నా తల మీద చేయి పెట్టి నా జుట్టు నిమిరినట్టు అనిపించింది. చెప్పాలంటే చాలా హాయిగా, తడుముతున్న చేతుల్లో ప్రేమ అందినట్లుగా అనిపించింది. కాస్త తేరుకున్న నాకు ఒక మాట వినపడింది. ‘ఏంటి అలా ఉన్నారు? మీ ఒంట్లో బాగానే ఉందా?’ కళ్లు తెరిచిన నాకు ఎదురుగా అప్పటివరకు నా తల మీద చేయి పెట్టి నిమురుతున్న నా భార్య. తనను అలా చూస్తూనే హాల్లోకి నడిచాను. ఎదురుగా కప్బోర్డులో పెట్టిన అమ్మ ఫొటోపై నా దృష్టి పడింది. ఆ ఫొటో వంకే చూస్తూ.., ‘మనం ఊరికి వెళ్లి ఒకసారి అమ్మని కలవాలి’ అన్నా. అది విని లలిత కూడా ఆ ఫొటో వైపు చూసి చిన్నగా నవ్వింది.ఆఫీసు వెళ్లడానికి రెడీ అవుతున్న నాకు.. హాల్లో నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. లలిత ఫోన్లో మాట్లాడుతోంది. ఇంకెవరితో, మా అమ్మతోనే! మేము పాపతో కలిసి ఈ శనివారం ఊరికి వస్తున్నామని, తను చెప్పడం నాకు స్పష్టంగా వినపడుతోంది. ఆ మాట చెప్పగానే అమ్మ కూడా చాలా సంతోషపడి ఉంటుంది. ఈ ఆఫీసు పనుల్లో బిజీ అవ్వడం, మళ్లీ పాపని చూసుకోవడం వల్ల ఎప్పుడోగాని అమ్మతో మాట్లాడే సమయం దొరకట్లేదు. ఎప్పుడైనా అమ్మే నా సెల్ నంబర్కి కాల్ చేసినా ఆఫీసు పనుల్లో తలమునకలై ఉన్న నేను.. తర్వాత చేస్తాలే అమ్మా అని చెప్పడం ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఇదిగో ఇలా ఈ అత్తాకోడళ్లే ఎప్పుడూ మాట్లాడుకునేది. ఒకసారి మొదలెడితే వాళ్ల లోకంలోకి వాళ్లు వెళ్లిపోయి, పక్కన వాళ్లను పట్టించుకోనంతగా మునిగిపోతారు. అలా అనుకుంటూనే హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద నా కోసం పెట్టిన క్యారేజీ తీసుకుని, ఆఫీసుకు వెళ్లొస్తా అన్నట్లు లలిత వంక సైగ చేస్తూ వెళ్లిపోయా. గుమ్మం వరకూ వచ్చి నన్ను చూస్తూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే లలిత కూడా నావైపు చేయి ఊపింది.కారు వేగంగా వెళుతోంది. పాపతో కలిసి లలిత, నేను ఊరికి వెళ్తున్నాం. వాతావరణం చక్కగా ఉంది. ఊరికి దగ్గర్లో పడిన మాకు ఈ ప్రయాణం చాలా నచ్చింది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పంటపొలాలు, చల్లని గాలి, కమ్మటి మట్టి వాసన. నా కూతురు కారు కిటికీలో నుంచి బయటికి చూస్తూ, ‘ఇంకా ఎంత దూరం నాన్నా! నాన్నమ్మని ఎప్పుడు కలుస్తాం’ అని ఒకటే ప్రశ్నలు. ‘వచ్చేశాంలేమ్మా! దగ్గర్లోనే ఉన్నాం’ అంటూ లలిత బయటికి పెట్టిన పాప చేతిని కారు లోపలికి అంటూ నచ్చజెబుతోంది. డ్రైవింగ్ చేస్తున్న నాకు కూడా లోలోపల అదే ఆరాటం ఉన్నా బయట పడలేనేమో కదా! అమ్మని కాసేపట్లో చూస్తున్నాం అన్న ఆనందంతో నాకు కూడా చిన్న పిల్లాడినై గెంతాలని ఉంది. ఇలా అనుకుంటుండగానే కారు పొలిమేర దాటి ఊరిలోకి ప్రవేశించింది. దారిలో వెళ్తుంటే ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు. పుట్టి పెరిగిన ఊరు కదా మరి!కారు ఇంటి ముందు ఆగిందో లేదో, తలుపు తెరుచుకుని నా కూతురు ఇంట్లోకి పరిగెత్తింది. కారు ఆగిన శబ్దం విని అమ్మ కూడా బయటికి వచ్చింది. ఎదురుగా వస్తున్న మనవరాలిని అందుకోవాలని ముందుకు కదులుతూ మా వంక చూస్తోంది. ‘నాన్నమ్మా!’ అని గట్టిగా హత్తుకోగానే, అమ్మ తనని చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. వెనకే వస్తున్న మేము అది చూసి మురిసిపోతూ ఇంట్లోకి నడిచాం. ’ఎలా ఉన్నావు నాన్నా’ అని అమ్మ నా గడ్డం దగ్గర చేయి పెట్టి ఆప్యాయంగా అడుగుతూనే, లలిత వంక కూడా చూసింది. ’నువ్వు ఎలా ఉన్నావమ్మా’ అని అడుగుతూనే, తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాను. నా తలని తన ఒడిలోకి అదుముకుని ప్రేమగా నా వీపు తడుతూ, ‘ఎప్పుడు తిన్నారో ఏమో! పదండి వెళ్లి భోజనం చేద్దాం’ అంది. ‘సరే అమ్మా, తిందాంలే!’ అంటున్న నాకు మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. అమ్మతో చాలా చెప్పాలి అనిపించింది. అమ్మని చూడగానే గుండెలో భారం దిగినట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి అమ్మ చూపించే అపురూపమైన ప్రేమను ఇబ్బందిలా ఫీలయ్యే నా తెలియనితనానికి కొంచెం సిగ్గుగా అనిపించింది. సోఫాలో ఉన్న అమ్మ ఒడిలో తల పెట్టి, కింద కూర్చున్న నాకు తెలియకుండా నా కుడి చేయి తన పాదం మీదికి చేరింది. ఎన్నో చెప్పాలనుకున్నా, క్షమించమని అడగాలి అనుకున్నా కానీ ఏమీ చెప్పలేక మాటలు పెగలని నాకు ఆ ఆశీర్వాదం సరైన ప్రాయశ్చిత్తంలా అనిపించింది. కాలిని తాకిన నా చేయి వంక చూస్తూ అమ్మ కళ్లల్లో చిన్నగా తడిని చూశా. అమ్మ వెనక చేరి భుజాలపై నుండి చేతులు వేసిన నా కూతురు నాన్నమ్మ చెంపలపై ముద్దులు పెడుతోంది. -
రాజవర్ధనుడి కథ
పూర్వం దమనుడు అనే రాజుకు రాజవర్ధనుడు అనే కొడుకు ఉండేవాడు. తండ్రి తదనంతరం రాజవర్ధనుడు పట్టాభిషిక్తుడై, రాజ్యభారాన్ని చేపట్టాడు. ప్రజలకు చోరభయం, దుష్టమృగ భయం, శత్రుభయం, క్షామం, దారిద్య్రం లేకుండా రాజ్యాన్ని ధర్మమార్గంలో సుభిక్షంగా పాలించసాగాడు. పొరుగు రాజ్యాన్ని పాలించే విధూరథుడికి రాజవర్ధనుడి పాలనాదక్షత గురించి తెలిసింది. విధూరథుడికి మానిని అనే కుమార్తె ఉంది. రాజవర్ధనుడు తన కుమార్తెకు తగిన వరుడని తలచి, అతడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. మానిని ద్వారా రాజవర్ధనుడికి అనేకమంది కుమారులు కలిగారు. భార్యతో హాయిగా సంసారయాత్ర సాగిస్తూ, రాజవర్ధనుడు రాజ్యాన్ని సుభిక్షంగా, ప్రశాంతంగా పాలించసాగాడు. అలా ఏడువేల సంవత్సరాలు గడిచిపోయాయి.ఒకనాడు రాజవర్ధనుడికి భార్య మానిని స్వయంగా తలంటు పోయసాగింది. తలంటు పోస్తుండగా, ఆమె కన్నీటి బిందువులు వెచ్చగా రాజవర్ధనుడి నుదుటిపై పడ్డాయి. ఈ పరిణామానికి రాజవర్ధనుడు ఆందోళన చెందాడు. ‘మహారాణీ! ఏమైంది? ఎందుకు దుఃఖిస్తున్నావు?’ అని ప్రశ్నించాడు.‘మహారాజా! మీ తలవెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అందువల్లనే నాకు తీరని విచారంగా ఉంది’ అని ఆమె బదులిచ్చింది.‘మహారాణీ! ప్రకృతి సహజమైన పరిణామానికి విచారిస్తావెందుకు? ఏడువేల సంవత్సరాలు సుఖాలను అనుభవించాం. సద్గుణ సంపన్నులు, పాలనాదక్షులు అయిన సుపుత్రులను పొందాం. మానవులకు జరామరణాలు తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. వార్ధక్యం మరింతగా మీద పడకముందే, రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, మనం తపోవనాలకు వెళ్లిపోదాం’ అని చెప్పాడు రాజవర్ధనుడు.రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, రాజవర్ధనుడు భార్యాసమేతంగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోవాలని నిర్ణయించు కున్నట్లు తెలిసి, మంత్రి పురోహితులు విచారించారు. ఈ సంగతి తెలిసి పౌరులు మరింతగా ఆందోళన చెందారు. ‘ఇన్నాళ్లూ మనల్ని కన్నబిడ్డల్లా పరిపాలించిన రాజు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతే, ఇక బతకడం దండగ’ అనుకుని, ప్రజలు బాధపడసాగారు. రాజుకు మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగించాలని భావించిన మంత్రులు, ఇందుకు సమర్థులైన పురోహితులను తపోవనాలకు పంపారు. ఇదంతా రాజుకు తెలియకుండానే చేశారు.పురోహితులు సూర్యభగవానుడి గురించి ఘోరతపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన సూర్యుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారి కోరిక మేరకు రాజవర్ధనుడికి మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయాన్ని వరంగా ప్రసాదించాడు. వారు సంతోషంగా రాజధానికి చేరుకుని, మంత్రులకు సూర్యుడు వరమిచ్చిన సంగతి చెప్పి, ఇళ్లకు వెళ్లిపోయారు. సూర్యభగవానుడి వరప్రభావం వల్ల రాజు మరో పదివేల ఏళ్లు తమను పరిపాలించబోతున్నాడని తెలిసి ప్రజలు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఒకవైపు రాజ్యంలో ప్రజలంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు రాజవర్ధనుడు అంతఃపురంలో విచారగ్రస్తుడై కూర్చుండిపోయాడు. అతడి తీరును గమనించిన మహారాణి మానిని, ‘మహారాజా! ప్రజలంతా సంతోషంగా ఉంటే, మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు?’ అని అడిగింది. ‘మహారాణీ! మీరంతా ఉండగా, నాకొక్కడికే పదివేల ఏళ్ల ఆయుర్దాయం కలగడం మంచిది కాదు. మంత్రి పురోహితాదులు, ఆప్తులు అందరూ మరణించిన తర్వాత నేను బతికి ఉన్నా, దానివల్ల ప్రయోజనం ఏముంది?’ అన్నాడు రాజవర్ధనుడు.‘మహారాజా! మీరు చెప్పిన మాటలు సమంజసంగానే ఉన్నాయి. దీనికి తరుణోపాయం ఏమిటి?’ అని అడిగింది మానిని. ‘రేపటి వేకువనే మనం తపోవనాలకు బయలుదేరుతున్నాం’ అన్నాడు రాజవర్ధనుడు.మర్నాటి వేకువనే రాజదంపతులు తపోవనాలకు చేరుకున్నారు. రాజవర్ధనుడు సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాత్మా! నాకొక్కడికే పదివేల సంవత్సరాల ఆయుర్దాయం ఇవ్వడం న్యాయమేనా? నా భార్యా పుత్రులకు, మంత్రి పురోహితులకు, నా రాజ్య పౌరులకు కూడా అంతే ఆయుర్దాయాన్ని అనుగ్రహించు’ అని వరం కోరుకున్నాడు రాజవర్ధనుడు.సూర్యభగవానుడు అతడి ప్రజానురాగానికి సంతోషించి, ‘తథాస్తు’ అని అనుగ్రహించాడు.రాజవర్ధనుడు భార్యాసమేతంగా తిరిగి రాజధానిలోకి అడుగుపెట్టాడు.పురజనులను సమావేశపరచి, సూర్యభగవానుడు అనుగ్రహించిన వరం గురించి చెప్పాడు. ప్రజలందరూ రాజవర్ధనుడికి జయజయధ్వానాలు పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు.∙సాంఖ్యాయన -
ఆటోనే ఆధారమైంది!
హైదరాబాద్లోని హిమాయత్నగర్లో కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు దాదాపు రూ.40 కోట్ల సొత్తు, నగదు దోచుకుపోయారు. ఒక ఆటో ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. సంఘటన జరిగిన ఇరవై గంటల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకుని, సొత్తు రికవరీ చేశారు. రోహిత్ కేడియా తన ఉమ్మడి కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కుటుంబ సంస్థ కేడియా ఆయిల్స్ కంపెనీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవైమంది పని చేస్తున్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలోని తమ ఇంటి ప్రాంగణంలోనే పనివారి కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు.రోహిత్ ఇంట్లో బిహార్లోని బీరుల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పనిచేసి, ఏడాది కిందట మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయమైంది. దుబాయ్లో డెస్టిన్షన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల్లో సహాయంగా ఉండటానికి సుశీల్ను రోహిత్ 15 రోజుల కిందట పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి సుశీల్తో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. సుశీల్, బసంతి మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ కుటుంబం మొత్తం ఫిబ్రవరి రెండో వారంలో దుబాయ్ వెళ్లారు. దీన్ని అదనుగా భావించిన సుశీల్ ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను పిలిపించాడు. ఫిబ్రవరి 10న వచ్చిన మోల్హు అదే రోజు అర్ధరాత్రి దాటాక సుశీల్తో కలిసి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించాడు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాభరణాలు, 1.4 కేజీల ఇతర బంగారు ఆభరణాలు, రూ.19.63 లక్షల నగదు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి తస్కరించారు. ఈ సొత్తుతో పాటు బసంతిని తీసుకుని ఉడాయించారు. ఫిబ్రవరి 11న ఉదయం రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని మిగిలిన పనివాళ్లు గుర్తించి దుబాయ్లో ఉన్న యజమానికి చెప్పారు. ఈ కేసు ఛేదించడానికి నారాయణగూడ పోలీసులు, ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రోహిత్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నా, మానిటర్ లేదు. రోహిత్ కుటుంబ సభ్యులు తమ సెల్ఫోన్లలోనే ఈ దృశ్యాలు చూస్తుంటారు. సెల్ఫోన్లో రికార్డయిన అనుమానితుల వీడియోలు తమకు పంపాలని పోలీసులు రోహిత్ను కోరారు. వీటిని పంపిన రోహిత్, ఆ ముగ్గురిలో ఇద్దరిని సుశీల్, బసంతిగా గుర్తించాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ నేరం జరిగితే, ఉదయం 9 గంటలకు ఫిర్యాదు వచ్చింది. ఏమాత్రం ఆలస్యమైనా నిందితులు చిక్కరని భావించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోహిత్ ఇంటి సమీపంలో రహదారిపై ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ను పోలీసులు పరిశీలించి, నిందితులు చోరీ చేసిన ఇంటి నుంచి తెలుగు అకాడమీ వరకు నడుచుకుంటూ వెళ్లి, ఆటో ఎక్కినట్లు గుర్తించారు. అయితే ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించకపోవడంతో వాహనం వెళ్లిన దిశను ఆధారంగా చేసుకున్నారు. నిందితులతో ఉన్న ఆటో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ కమిషనరేట్, ట్రాఫిక్ కమిషనరేట్ మీదుగా ప్రయాణించినట్లు గుర్తించారు. సుశీల్ బిహార్కు, బసంతి పశ్చిమ బెంగాల్కు చెందిన వారని రోహిత్ ద్వారా తెలుసుకున్న పోలీసులు– నిందితులు ఆ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోటుకు వెళ్లి ఉంటారని అంచనా వేశారు. అంత సొత్తుతో విమానం ఎక్కే అవకాశం ఉండదని, నాంపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లి ఉంటారని భావించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఫ్లాట్ఫామ్స్పై ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్ను పరిశీలించి, ఆ ముగ్గురూ ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కారని, అది ఉదయం 6.45 గంటలకు బయలుదేరిందని గుర్తించారు. వెంటనే ఈస్ట్జోన్ డీసీపీ బి.బాలస్వామి రైల్వే పోలీసులను అప్రమత్తం చేసి, నిందితుల ఫొటోలు పంపారు. అధికారులు తెలంగాణ ఎక్స్ప్రెస్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులకు జనరల్ బోగీలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఈ ముగ్గురూ తారసపడ్డారు. వీరిని పట్టుకుని, రైల్వే పోలీసులు సొత్తు రికవరీ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో నాగపూర్ రైల్వేస్టేషన్కు చేరుకున్న హైదరాబాద్ పోలీసులకు వీరిని అప్పగించారు. మరోవైపు, రోహిత్ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులు సుశీల్తో పాటు మోల్హు వేలిముద్రలను సేకరించారు. వీటిని తమ డేటాబేస్లో సెర్చ్ చేయగా, 2023 జనవరి 31న దోమలగూడలో జరిగిన స్నేహలతాదేవి హత్యకు సంబంధించిన కీలక ఆధారం దొరికింది. అప్పట్లో ఆమెకు కేర్ టేకర్గా పని చేసిన బిహారీ మహేష్కుమార్ ముఖియా, మోల్హు ముఖియాతో కలిసి ఆ వృద్ధురాలిని చంపి, రూ.కోటి విలువైన సొత్తుతో ఉడాయించాడు. గత ఏడాది అక్టోబర్లో మహేష్ చిక్కినా, మోల్హు పరారీలోనే ఉన్నాడు. కేడియా ఇంట్లో దొరికిన వేలిముద్రల ఆధారంగా నాటి కేసులోనూ మోల్హు నిందితుడని గుర్తించారు. దీంతో ఇతడిని తొలుత నారాయణగూడ, ఆపై దోమలగూడ కేసుల్లో అరెస్టు చేశారు. నిందితులు చిక్కడం ఆలస్యం కావడంతో స్నేహలతాదేవిని చంపి ఎత్తుకుపోయిన సొత్తులో కనీసం ఒక్క రూపాయి కూడా రివకరీ కాలేదు. ∙శ్రీరంగం కామేష్ -
గర్భస్రావం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నైట్ షిఫ్ట్స్లో చేస్తాను. ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అని విన్నాను. అలా కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, చిత్తూరు. వయసు పెరిగేకొద్దీ జెనెటిక్ కారణాలు, హార్మోన్లలో మార్పుల వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నిరోధించడం కష్టం. అందువల్ల, ముందుగానే ప్లాన్ చేసుకోవటం, సరైన సమయానికి పరీక్షలు చేయించుకోవటం చెయ్యాలి. ప్రీకాన్సెప్షన్ కౌన్సెలింగ్ అంటే ప్లానింగ్కు ముందు ఒకసారి భార్యభర్తలిద్దరూ గైనకాలజిన్ట్ దగ్గర తీసుకోవాలి. డాక్టర్ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రివెంట్ చేసే సమస్యలను గుర్తించి, వివరిస్తారు. రొటీన్ థైరాయిడ్, సుగర్, బీపీలను పరీక్షిస్తారు. కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్ వాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ముందుగా వేయించుకుంటే ప్రెగ్నెన్సీలో గర్భస్రావం కాకుండా ఉంటుంది. రుబెల్లా, చికెన్ పాక్స్ లాంటివి.. ఇమ్యూనిటీ లేకపోతే వాక్సిన్స్ ఇస్తాం. ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీకేదైనా మెడికల్ రిస్క్స్ ఉండి, ఇతర మందులు వాడుతుంటే వాటిని మార్చి, సురక్షితమైన మందులను రాసి ఇస్తాం. ఉబ్బసం, అధిక బరువు ఉంటే కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా సూచిస్తాం. నైట్ షిఫ్ట్స్ వలన ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏ సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మీరు చెకప్స్కు వచ్చినప్పుడు బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి, తగిన డైట్ సూచిస్తాం. కొంతమందికి గర్భసంచిలో పొర లేదా గడ్డలు ఉంటాయి. వాటిని స్కాన్స్లో కనిపెడతాం. ఏదైనా సమస్య ఉండి, ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలిగేటట్లయితే, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల తర్వాత చిన్న సర్జరీ ద్వారా ముందే కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ముందు నుంచి తీసుకుంటే బేబీ మెదడు, వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. రక్తం పలుచబడే వ్యాధులు ఉన్నట్లు కనిపెడితే, ముందుగా కొన్ని మందులతో చికిత్స చేసి మొదటి వారాల్లోనే గర్భస్రావం కాకుండా చేయచ్చు. అందుకే, ముందుగానే చెకప్స్కు వెళ్తే, థైరాయిడ్ లాంటివి గుర్తించి, తగిన మందులు ఇస్తారు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు గర్భస్రావం రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా శిశువు ఎదుగుదల సమస్యతో ఆకస్మికంగా గర్భస్రావం కావచ్చు. అది మళ్లీ రిపీట్ కాకపోవచ్చు. పూర్తి హిస్టరీ, కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా గర్భస్రావాన్ని నివారించవచ్చు.రావడం లేదునాకు కాన్పు అయి మూడు రోజులు అవుతుంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ రావటం లేదు. బయట పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలి?– రమాదేవి, ఉరవకొండ. కొన్నిసార్లు కాన్పు సమయంలో తీసుకునే ఒత్తిడి కారణంగా శిశువులకు లాచింగ్ అంటే బ్రెస్ట్, ఐరోలాను నోటిలో పెట్టుకొని సక్ చెయ్యటంలో కొంచెం బలహీనపడతారు. మూడు నుంచి పదిహేను రోజుల్లో వాళ్లకి అలవాటు అవుతుంది. కాని, ఈ సమయంలో బేబీ బరువు తగ్గటం, సుగర్, ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచటం చాలా అవసరం. పీడియాట్రీషియన్ సలహా పాటించడం మంచిది. సాధారణంగా సహజ ప్రసవం లేదా సిజేరియన్ కాన్పు జరిగిన అరగంటలోపు బేబీకి, తల్లితో బ్రెస్ట్ సకింగ్ కచ్చితంగా చేయించాలి. దీనితో తల్లికి, బిడ్డకు బంధం ఏర్పడుతుంది. బ్రెస్ట్లోని ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ సిమ్యులేట్ అవుతాయి. భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్ బాగా వృద్ధి చెందుతుంది. కాని, ముందు కేవలం నీళ్లలాంటి కొలోస్ట్రమ్ మాత్రమే వస్తుంది. అప్పుడే పుట్టిన బేబీకి ఈ కొలోస్ట్రమ్ సరిపోతుంది. సరైన పాలు మూడు నుంచి ఆరు రోజులకు గాని రావు. ఒకవేళ బేబీ లాచింగ్ చెయ్యకపోతే చేతితో లేదా బ్రెస్ట్ పంప్తో ఈ కొలోస్ట్రమ్ బేబీకి ఇవ్వటానికి ప్రయత్నించాలి. సరైన రొమ్ముపాలు ఇవ్వడం అనేది చాలాసార్లు నెమ్మదిగానే జరుగుతుంది. తల్లి చాలా పాజిటివ్గా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. బేబీ పుట్టిన మొదటి 24 గంటల్లో మూడు నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫీడ్ తీసుకుంటారు. తర్వాతి రోజు నుంచి రోజులో ఎనిమిది సార్లు దాకా ఫీడ్ తీసుకుంటారు. ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ పది నుంచి నలభై నిమిషాలు సక్ చేయించాలి. దీని వలన బ్రెస్ట్ స్టిమ్యులేట్ అయి, పాల ఉత్పత్తి మొదలవుతుంది. ఒకవేళ బేబీ సక్ చెయ్యకపోతే ఇదే రిథమ్తో బ్రెస్ట్ పంప్తో చెయ్యండి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బేబీకి చాలా అవసరం. ఎప్పుడూ తల్లి పక్కనే బిడ్డను పడుకోబెట్టుకోవాలి. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నిద్రలో ఉన్నా లేపి, సకింగ్ చేయించాలి. మూడు గంటల కన్నా ఎక్కువ సేపు ఫీడ్ లేకుండా ఉండకూడదు. ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అయినా ఇదే పద్ధతి ఫాలో కావాలి. బేబీ ఎన్నిసార్లు యూరిన్, మోషన్ చేస్తుంది అనేది గమనించాలి. తక్కువ యూరిన్ పాస్ చేస్తున్నా, డల్గా ఉన్నా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్స్ప్రెస్డ్ ఫీడ్స్ లేదా బ్రెస్ట్ పంప్ వాడటం వలన బ్రెస్ట్ మిల్క్ తగ్గదు. ఎలక్ట్రానిక్ పంప్ వాడవచ్చు. ఒకసారి బేబీకి లాచింగ్ అలవాటు అయిన తరువాత ఎక్స్ప్రెస్డ్ ఫీడ్ ఇవ్వటం ఆపేయాలి. తల్లి పాజిటివ్గా ఉండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తరచు ఇస్తూ, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు బ్రెస్ట్ సకింగ్ చేయిస్తే ఫీడ్ సరిపోవట్లేదనే సమస్య ఉండదు. లాక్టేషన్ కౌన్సెలర్ సహాయంతో వివిధ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ కూడా నేర్చుకోవచ్చు. -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Actress) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్టైమ్కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్టైమ్తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్డెల్ టెస్ట్లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్లకు ఎక్కువ రన్టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్గా విభజిస్తే థియేట్రికల్కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్కిట్ టెస్ట్నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్కిట్ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళిపురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
నూటొక్క దేవళాల శిల్పగిరి
∙సాహెబ్ జాన్, ఆలూరు రూరల్ఒకనాటి శిల్పగిరి గ్రామమే నేటి చిప్పగిరి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామంలో ఆనాటి కాలంలో నూటొక్క దేవాలయాలు ఉండేవి. నూటొక్క బావులు ఉండేవి. పురాతన ఆలయాలకు, చారిత్రక శిల్పకళా వైభవానికి నిలయంగా ఉండటంతో ఈ గ్రామానికి శిల్పగిరి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు చిప్పగిరిగా మారింది. ఆనాటి ఆలయాల్లో దాదాపు తొంభై శాతం కనుమరుగైపోగా, పది శాతం ఆలయాలు మాత్రమే ఇప్పటికి మిగిలి ఉన్నాయి.మిగిలి ఉన్న వాటిలో ఐదో శతాబ్ది నాటి దిగంబర జైన ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.ఇక్కడి ఆలయాల్లో భోగేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా వేసవిలో చిప్పగిరి గ్రామంలో పర్యాటకుల హడావుడి కనిపిస్తుంటుంది. ఇక్కడి పురాతన ఆలయాలను, చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.రాయల వంశానికి చెందిన గుండప్ప దేవర పదకొండో శతాబ్దంలో శిల్పగిరిని రాజధానిగా చేసుకుని, పరిపాలన సాగించాడు. ఆయన హయాంలోనే ఇక్కడ చెన్నకేశవ స్వామివారి ఆలయంతో పాటు మరో వంద ఆలయాలను నిర్మించారు. తాగునీటి కోసం నూటొక్క బావులు తవ్వించారు. గుండప్ప దేవర తదనంతరం రామరాయలు, బుక్కరాయలు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ భోగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా యాభై అడుగుల ఏకశిలా స్తంభాలతో రంగ మండపాన్ని నిర్మించారు. దీనినే ‘సభా సింహాసన కట్ట’ అంటారు.రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతంలో మరికొన్ని బావులను కూడా తవ్వించారు. తర్వాతి కాలంలో ఇక్కడ నీటి ఎద్దడి బాగా పెరిగింది. బావులలో నీరు ఇంకిపోయింది. గ్రామస్థులు చిప్పలతో నీళ్లు తోడుకునేవారు. అందువల్ల ప్రజలు చిప్పగిరిగా గ్రామానికి నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పాలన కొనసాగించలేక రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. పల్లవుల జైనాలయంపల్లవ రాజులు ఐదో శతాబ్ది కాలంలో ఇక్కడ జైన ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో దేశ పర్యటనకు బయలుదేరిన పల్లవ రాజులు మార్గమధ్యంలో ఈ గ్రామ పరిసరాల్లో విడిచి చేసి, కొంతకాలం గడిపారు. అప్పట్లోనే వారు ఈ గ్రామ శివార్లలో ఉన్న కొండపై కోటను నిర్మించుకున్నారు. అక్కడే ఏకశిలతో దిగంబర జైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలక్రమంలో కోట దెబ్బతినగా, కోట గోడలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.విజయదాసుల కట్టకర్ణాటకకు చెందిన విజయదాసులు పద్నాలుగో శతాబ్దిలో మాన్వి జిల్లాలో తుంగభద్ర తీరాన ఉన్న చిలకలపర్వి గ్రామంలో జన్మించారు. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసుకు శిష్యుడు విజయదాసులు. ఆయన ధ్యాన గానాలలో నిమగ్నమై, దేశమంతటా సంచరించేవాడు. ఒకసారి ఆయన చిప్పగిరిలోని పురాతన బావిలో దైవచింతనలో ఉండగా, బావిలో ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది. ఆయన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, రెండేళ్ల తర్వాత పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ నెలలో పదకొండు రోజుల పాటు విజయదాసుల కట్టలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి పురోహితులు ఈ ఆరాధనోత్సవాలకు తరలి వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు జరుపుతారు. వీటిని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. -
ఫ్యాషన్ మోజా? ఉందిగా శ్రీజా!
శ్రీజాకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్కి వెళ్లే వయసులోనే పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజీన్స్లో పనిచేసింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్గా పాపులర్ అయిన మిథిలా పాల్కర్, మసాబా గుప్తా వంటి ప్రముఖులను కలసి స్టయిలింగ్ నేర్చుకుంది. ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె డిజైన్స్, స్టయిలింగ్ ఎంతోమంది పెళ్లికూతుర్లకు నచ్చింది. స్పెషల్ అకేషన్ ఏదైనా స్టయిలిస్ట్గా శ్రీజా ఉండాల్సిందే అనిపించుకుంది.కొన్ని నెలల్లోనే బొటిక్తో పాటు ‘డ్రేపింగ్ డ్రీమ్స్’ అనే వెడ్డింగ్ ఫ్యాషన్ సర్వీసెస్ను స్టార్ చేసింది. వివాహాది శుభకార్యాలకు పెళ్లికూతుర్లకు, అతిథులకు డ్రెస్ డిజైనింగ్, స్టయిలింగ్ చేస్తూ వెడ్డింగ్ స్పెషలిస్ట్గా పాపులర్ అయింది. దేశీ బ్రైడల్ దుస్తులకు పర్ఫెక్ట్ బ్రాండ్గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. మిథిలా పాల్కర్, శ్రియా పిల్గొంకర్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, నిహారిక కొణిదెల, శ్రద్ధా శ్రీకాంత్, సయీ మంజ్రేకర్, హన్సిక, ఆలియా భట్ లాంటి వాళ్లెందరికో శ్రీజా స్టయిలిస్ట్గా పనిచేసింది.⇒ జెట్ స్పీడ్తో పరుగెట్టే ఫ్యాషన్తో పాటే.. తాను పరుగెడుతూ, పడిపోతూ, తిరిగి లేస్తూ.. బ్రైడల్ స్పెషలిస్ట్ట్ అనిపించుకుంది డిజైనర్, స్టయిలిస్ట్ శ్రీజా రాజ్గోపాల్. ఫ్యాషన్లపై మోజుగల సెలబ్రిటీలు ఆమె డిజైన్లకు ఫిదా అవుతున్నారు. తన ప్రతిభతో ఫ్యాషన్లో మ్యాజిక్ చేసిన ఆమె గురించిన కొన్ని విషయాలు..⇒ పెళ్లిలో పెళ్లికూతురు గిల్టు నగలు ధరించకూడదని చాలామంది నమ్ముతుంటారు. వారి నమ్మకాన్ని గౌరవిస్తూ, ఉన్నవాటితోనే పెళ్లికూతుర్లను అందంగా చూపించా. అదే నా కెరీర్ గ్రోత్కు ఫ్లస్ అయింది. – శ్రీజా రాజ్గోపాల్ -
ఇంతటితో ఈ ప్రసారాలు..?!
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ మొదలైంది. హ్యారీ ఎస్.ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిస్టు దేశాల దురుద్దేశాలను బట్టబయలు చేసేందుకు ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రారంభమైంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ రెండు అమెరికన్ రేడియో నెట్వర్క్లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘డబ్బు దండగ’ అనే ఒకే ఒక కారణంతో మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది దశాబ్దాల పాటు ఖండాంతర శ్రోతల్ని జాగృతం చేసిన ప్రసారాలు ఆగిపోవటం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో అభిమానుల మనసు మోగబోవటమే!అమెరికా దగ్గర సొంత రేడియో లేని టైమ్లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర రాబర్ట్ షేర్వుడ్ ఉన్నాడు. షేర్వుడ్ నాటక రచయిత. రూజ్వెల్ట్కు స్పీచ్ రైటర్. ‘‘మన చేతిలో కనుక ఒక రేడియో ఉంటే, ప్రపంచం మన మాట వింటుంది. మాటకు ఆలోచనను అంటించి సరిహద్దులను దాటిస్తే శతఘ్నిలా దూసుకెళ్లి దుర్బుద్ధి దేశాల తప్పుడు సమాచారాలను తుదముట్టిస్తుంది..’’ అన్నాడు షేర్వుడ్ ఓరోజు, రూజ్వెల్ట్తో!షేర్వుడ్ ఆ మాట అనే నాటికే నెదర్లాండ్స్ దగ్గర రేడియో ఉంది. సోవియెట్ యూనియన్ దగ్గర రేడియో ఉంది. ఇటలీ, బ్రిటన్ల దగ్గరా రేడియోలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఉన్నాయి. లేనిది ఒక్క అమెరికా దగ్గరే! ‘‘మనకూ ఒక రేడియో ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్...’’ అని 1939లో రాబర్ట్ షేర్వుడ్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్తో అనటానికి ముందు 1938లో, 1937లో కూడా అమెరికాకు ఒక అధికారిక రేడియో అవసరం అనే ప్రతిపాదనలు యు.ఎస్. ప్రతినిధుల సభ నుంచి వచ్చాయి. అయితే రేడియో ఏర్పాటుకు రూజ్వెల్ట్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. షేర్వుడ్ చెప్పాక కూడా, రెండేళ్ల సమయం తీసుకుని 1941 మధ్యలో యు.ఎస్. ఫారిన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎఫ్.ఐ.ఎస్.)ను నెలకొల్పి, షేర్వుడ్ను తొలి డైరెక్టర్ని చేశారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన రెండు నెలల లోపే ఎఫ్.ఐ.ఎస్. ఆధ్వర్యంలో అమెరికా అధికారిక రేడియో ప్రసారాలు తొలిసారి జర్మన్ భాషలో ఐరోపా లక్ష్యంగా మొదలయ్యాయి. అనౌన్సర్ విలియమ్ హర్లాన్ హేల్ మాట్లాడుతూ, ‘‘ఇక నుంచి రోజూ మేము అమెరికా గురించి, యుద్ధం గురించి మీతో మాట్లాడతాం. వార్తలు మాకు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ మీకు నిజమే చెబుతాము...’’ అని అన్నారు. అలా 83 ఏళ్ల క్రితం 1942 ఫిబ్రవరి 1న వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా మొదలైందే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రేడియో నెట్వర్క్. దీనినే అమెరికా ఇప్పుడు మూసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేడియో ఫ్రీ యూరప్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కట్టేయబోతున్న రెండో రేడియో.. ‘రేడియో ఫ్రీ యూరప్ / రేడియో లిబర్టీ’. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ అమెరికా అధికారిక రేడియో నెట్ వర్క్– రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నియంత్రణలోకి వచ్చిన జర్మనీలోని మ్యూనిక్లో – 1950 జూలై 4న చెకోస్లోవియాకు వార్తలను ప్రసారం చేయటంతో మొదలైంది. కమ్యూనిస్టు దేశాలలోని మీడియా నిష్పాక్షికంగా ఉండదని భావించిన అమెరికా.. తూర్పు ఐరోపా, సోవియట్ యూనియన్ ప్రజలకు రాజకీయ వాస్తవాలను అందించే ఉద్దేశంతో ఈ రేడియో నెట్వర్క్ను ప్రారంభించింది.సోవియెట్ ఆధిపత్య దేశాలలోని కోట్లమంది శ్రోతల్ని 15 భాషల్లో తన ప్రసారాలతో అలరించింది. అయితే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు ఆ ప్రసారాలు చేరకుండా నిరోధించటానికి ప్రయత్నించాయి. అంతేకాదు, ఆర్.ఎఫ్.ఇ. సిబ్బంది కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆర్.ఎఫ్.ఇ. కార్యాలయంపై ఒకసారి బాంబు దాడి కూడా జరిగింది. ఒక్క ఆంగ్లంలో మాత్రం ప్రసారాలు ఇవ్వని (ఇవ్వటం అనవసరం అనుకుని) ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రస్తుతం 30 స్థానిక భాషలలో 20కి పైగా ఐరోపా దేశాలకు ఆలకింపుగా ఉంది. 75 ఏళ్లుగా నిరవధికంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ కూడా ‘ఇంత ఖర్చా!’ అనే ఆశ్చర్యంతో సమాప్తం కానుంది. వేలమంది సిబ్బంది, వందల రేడియో స్టేషన్లతో నడుస్తున్న ఈ రెండు ఆడియో మీడియా హౌస్ల నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు కనీసం 100 కోట్ల డాలర్లకు పైమాటేనని అంచనా వేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తక్షణం వీటిని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడికి సిఫారసు చేసే ఉద్దేశంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ‘డోజ్’ చీఫ్ ఎవరో తెలుసు కదా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్. -
పెళ్లెప్పుడంటే...?
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్గా అదే ఆమె మొదటి సినిమా.⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్ను తిరస్కరించింది.⇒ బన్తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది. -
యాప్రే.. యాప్!
అరచేతిలో స్మార్ట్ఫోన్– స్మార్ట్ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.మనం వాడే స్మార్ట్ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్లోను, మొబైల్లో యాప్స్పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్లో ‘పబ్జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.అంతర్జాతీయంగా యాప్స్ తీరుప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్డౌన్ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి. మన దేశంలో ఇలా..పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్గా నిలిచాయి. యాప్స్లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి. ‘గేమ్’చేంజర్స్బిలియన్ డాలర్ క్లబ్లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్లో లాస్ట్ వార్, వైట్ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్తోపాటు నాన్ –గేమ్స్లో వీటీవీ ఈ క్లబ్లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్స్టైల్, టేబుల్టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్లో సబ్వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్లో భారత్లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది. సోషల్ మీడియా దూకుడుసోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.చాట్ జీపీటీ మూడంకెల వృద్ధిఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏఐ చాట్బాట్స్ హవాగత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.నాన్ –గేమ్స్ ఆదాయంఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024⇒ ప్రపంచ జనాలు మొబైల్లో వెచ్చించిన సమయం⇒ ప్రపంచ జనాలు యాప్స్తో గడిపిన సగటు సమయం 500 గంటలు⇒ ఒక్కొక్కరు మొబైల్తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు⇒ నిద్రలేవగానే మొబైల్తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు⇒యాప్స్ డౌన్లోడ్స్ 13,600 కోట్లు⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్లోడ్స్ 2.58 లక్షలు⇒మొత్తం డౌన్లోడ్స్లో భారత్ వాటా 17.91 శాతం -
అల్లుడు యముడు!
అజిత్కుమార్ లండన్లో ఫార్మసిస్ట్. అతడి భార్య, ఆమె కుటుంబసభ్యులు హైదరాబాద్లో ఉంటారు. అతడు లండన్లో ఉంటూనే, హైదరాబాద్లో ఉంటున్న భార్య కుటుంబసభ్యులపై 2023లో విషప్రయోగం చేశాడు. విషప్రయోగానికి అతడి అత్త మరణించింది. అత్తవారి కుటుంబంలోని మరో ఐదుగురు అస్వస్థులయ్యారు. ఈ సంఘటనపై మియాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజిత్పై ఇక్కడి కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో ఇటీవల లండన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్ తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.మియాపూర్ గోకుల్ప్లాట్స్కు చెందిన హనుమంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీషకు 2018 జూన్ 23న అజిత్కుమార్తో పెళ్లి జరిగింది. భార్యాభర్తలు లండన్లో స్థిరపడ్డారు. వారికి ఒక కూతురు పుట్టింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త వేధింపులపై శిరీష లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ లండన్లోనే వేర్వేరుగా ఉంటూ, అక్కడి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో అజిత్ తన భార్యపైన, ఆమె కుటుంబసభ్యులపై కక్ష పెంచుకున్నాడు. వారందరినీ అంతంచేయాలని నిశ్చయించుకుని, 2023 ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చి వెళ్లాడు. తన వద్ద పనిచేసే వినోద్కుమార్కు ఈ పనిని పర్యవేక్షించే బాధ్యత అప్పగించి, మేలో అతడిని హైదరాబాద్ పంపాడు. అతడి ద్వారా నగరానికి చెందిన భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లతో పాటు తన స్నేహితులను రంగంలోకి దించాడు.అత్తింటివారు ఉండే ఫ్లాట్స్ వాచ్మెన్ కొడుకు రమేష్కు డబ్బు ముట్టజెప్పి, అతడి ద్వారా అత్తింటివారి కదలికలను తెలుసుకోసాగాడు. శిరీష సోదరుడు పూర్ణేందర్కు 2023 జూన్లో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి కోసం శిరీష తన కూతురితో పాటు వచ్చింది. రమేష్ ద్వారా అజిత్ ఈ సంగతి తెలుసుకుని, అత్తింటివారిని అంతం చేయడానికి ఇదే అదనుగా భావించాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా, విషపు ఇంజెక్షన్లతో వారిని చంపాలనుకున్నాడు. శిరీష వాళ్ల పైఫ్లాట్లో ఉండే పూర్ణచందర్ను తనవైపు తిప్పుకున్న అజిత్, అతడి సాయంతో ఈ పథకాన్ని అమలు చేయాలనుకున్నాడు. భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి, జూన్ 25న తన అత్తవారింటికి పంపాడు. ఈ పథకం పారకపోవడంతో పథకాన్ని మార్చుకున్నాడు. ఫార్మసిస్టుగా తన పరిజ్ఞానంతో స్లోపాయిజనింగ్ చేయాలని భావించాడు.అజిత్ సోదరి నగరంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తన స్కూలు అవసరాల కోసం కొన్న ఆర్సెనిక్ను ఆమె ద్వారానే భవానీశంకర్ తదితరులకు అందేలా చేశాడు. అజిత్ సలహాపై ఈ ముగ్గురూ డెలివరీ బాయ్స్ అవతారమెత్తారు. ఆర్సెనిక్ కలిపిన పసుపు, కారం, మసాలా పొడులను శిరీష ఇంట్లోని వారికి అందించారు. పెళ్లి హడావుడిలో ఉన్న వాళ్లు వాటిని తీసుకుని, వంటల్లో వినియోగించారు. ఆ వంటకాలు తిన్న శిరీష, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అతడి భార్య సహా ఆరుగురు అస్వస్థులై, ఆస్పత్రి పాలయ్యారు. వారిలో శిరీష తల్లి ఉమామహేశ్వరి చికిత్స పొందుతూ జూలై 5న మరణించింది. ఎందరు వైద్యులను సంప్రదించినా, ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఎవరూ ఏం జరిగిందో గుర్తించలేకపోయారు.పూర్ణేందర్ తన భార్యతో కలసి 2023 ఆగస్టు మొదటివారంలో ఆమె స్వస్థలమైన గుంటూరు వెళ్లాడు. అక్కడ ఒక సీనియర్ వైద్యుడిని ఈ దంపతులు సంప్రదించారు. దాదాపు నలభై ఏళ్ల కిందట ఇలాంటి రోగులకు చికిత్స చేసిన ఆయన, వారిపై ఆర్సెనిక్ పాయిజనింగ్ జరిగినట్లు గుర్తించారు. ఆయన సూచనపై జరిపించిన పరీక్షల్లో విషప్రయోగం జరిగినట్లు తేలడంతో, వారికి చికిత్స చేశారు. శిరీష దీని వెనుక తన భర్త అజిత్ పాత్రను అనుమానించి, 2023 ఆగస్టు 17న మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి, ప్రాథమిక ఆధారాలను అందించింది. శిరీష కుటుంబం నివసించే అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, వాటిలో బయటపడ్డ అంశాల ఆధారంగా వాచ్మన్ కొడుకు రమేష్ను అదుపులోకి తీసుకుని, విచారించారు. అతడి ద్వారా గుట్టు బయటపడటంతో పూర్ణచందర్, భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లను అరెస్టు చేశారు. తన అత్తింటివారంతా చనిపోలేదని తెలుసుకున్న అజిత్కుమార్ మరో కుట్రకు తెరలేపాడు. దీని అమలుకు వినోద్ను మళ్లీ హైదరాబాద్కు పంపాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అజిత్ సహా మొత్తం పది మంది నిందితులు ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులో 2023 ఆగస్టులోనే తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. అజిత్ అరెస్టు కోసం కోర్టు ఉత్తర్వులు పొంది, కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా లండన్ పోలీసులను సంప్రదించారు. కేసు వివరాలను, అజిత్పై అరెస్టు వారంట్ను వారికి పంపారు. ఈ ఏడాది జనవరి రెండోవారంలో లండన్ పోలీసులు అజిత్ను అరెస్టు చేశారు. అజిత్ తన బెయిల్ కోసం లండన్ కోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం లండన్ జైలులో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ∙శ్రీరంగం కామేష్ -
పన్నుపోటుండదు దేనికీ లోటుండదు
ఆ దేశాలలో ప్రజలకు ఆదాయపు ‘పన్ను’పోటు ఉండదు.అయినా అభివృద్ధికి, సంక్షేమానికి లోటు ఉండదు.పన్నులు లేకున్నా, ఖజానా నిండుగానే ఉంటుంది.అన్ని వర్గాల పౌరులకు సామాజిక భద్రత ఉంటుంది.పన్యాల జగన్నాథదాసుమన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెడతాయి. బడ్జెట్ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటా బడ్జెట్ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్ లైయన్ మెకంజీ కింగ్. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!ఆదాయపు పన్నులేని దేశాలుఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్లోని వాటికన్ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్ అండ్ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.‘పన్ను’పోటు లేని సంక్షేమంప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.కువైట్: కువైట్ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది. విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.ఒమన్: ఒమన్ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది. శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్షిప్లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది.ఖతర్: మిగిలిన గల్ఫ్ దేశాల మాదిరిగానే ఖరత్ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు. అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది.ఖతర్ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.యుఏఈలోని ఏడు ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్ చెల్లిస్తోంది.సౌదీ అరేబియా: గల్ఫ్లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా చెల్లిస్తోంది.సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.ఉత్తర కొరియా రూటే సెపరేటు!పౌరులపై కొన్ని దేశాలు ఆదాయపు పన్ను విధించకపోయినా, ఇతరేతర పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ ఒక ఎత్తయితే, ఉత్తర కొరియా రూటే సెపరేటు! ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదాయపు పన్నునే కాదు, అన్ని రకాల పన్నులనూ 1974లోనే రద్దు చేసింది. నరకానికి నకలుగా పేరుమోసిన ఉత్తర కొరియాలో పౌరులకు ‘పన్ను’పోటు లేదు గాని, ప్రభుత్వం కోరుకున్నప్పుడు పౌరులు ఉచితంగా సేవలందించాల్సి ఉంటుంది. అణ్వాయుధాల తయారీలోను, క్షిపణి ప్రయోగాల్లోను తలమునకలుగా ఉంటూ తరచు వార్తలకెక్కే ఉత్తర కొరియాలో ప్రజాసంక్షేమం మృగ్యం.మన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెడతాయి. బడ్జెట్ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటా బడ్జెట్ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్ లైయన్ మెకంజీ కింగ్. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!ఆదాయపు పన్నులేని దేశాలుఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్లోని వాటికన్ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్ అండ్ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.‘పన్ను’పోటు లేని సంక్షేమంప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది.బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.కువైట్: కువైట్ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది.విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఒమన్: ఒమన్ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది.శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్షిప్లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది. ఖతర్: మిగిలిన గల్ఫ్ దేశాల మాదిరిగానే ఖరత్ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు.అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది. ఖతర్ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.\యుఏఈలోని ఏడు ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్ చెల్లిస్తోంది.సౌదీ అరేబియా: గల్ఫ్లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా చెల్లిస్తోంది.సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.‘పన్ను’పోటు లేని గల్ఫ్ దేశాలు⇒ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్⇒ ఖతర్⇒బహ్రెయిన్⇒సౌదీ అరేబియా⇒ కువైట్⇒ ఒమన్‘పన్ను’పోటు లేని చిన్న దేశాలుచమురు ఎగుమతుల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడే గల్ఫ్ దేశాలు పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. కాని, ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లోని మొదటి మూడు దేశాలైన వాటికన్ సిటీ, మొనాకో, నౌరు కూడా పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకుండానే మనుగడ సాగిస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఆదాయపు పన్ను ద్వారా ఖజానాకు రాబడి లేకపోయినా, ఈ దేశాలు ఎలా మనుగడ సాగిస్తున్నాయో చూద్దాం.వాటికన్ సిటీ: పోప్ పాలనలో ఉండే వాటికన్ సిటీ క్రైస్తవులకు ప్రధాన కేంద్రం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇక్కడ పౌరులెవరూ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వాటికన్ సిటీకి ప్రపంచవ్యాప్తంగా ఉండే రోమన్ కేథలిక్ క్రైస్తవుల ద్వారా వచ్చే స్వచ్ఛంద విరాళాలు, నగరంలో ప్రవేశానికి విదేశీయులకు విక్రయించే టికెట్లు, స్టాంపులు, నాణేలు, జ్ఞాపికల విక్రయాలు, పెట్టుబడులపై వడ్డీల ద్వారా భారీగా ఈ దేశానికి ఆదాయం వస్తుంది. వాటికన్ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా జరిపే ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం వస్తుంది.మొనాకో: ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో రెండోస్థానంలో నిలిచే దేశం మొనాకో. ఇక్కడి పౌరులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పర్యాటకం, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, శాస్త్ర సాంకేతిక కార్యకలాపాల ద్వారా మొనాకోకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుంది. తమ తమ దేశాల్లోని ‘పన్ను’పోటు తప్పించుకోవడానికి చాలామంది విదేశీయులు ఇక్కడి బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటుంటారు.ఇక్కడి క్యాసినోలు భారీ స్థాయిలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వివిధ మార్గాల్లో గణనీయంగా ఆదాయం వస్తుండటంతో ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, మొనాకో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించగలుగుతోంది. మొనాకో ప్రభుత్వం తన పౌరులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు మాతృత్వ, పితృత్వ భృతి, పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి పింఛన్ల చెల్లింపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది.నౌరు: ఓషియానా ప్రాంతంలోని నౌరు ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో మూడో స్థానంలో నిలుస్తుంది. నౌరు ప్రభుత్వం తన పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు. చుట్టూ సముద్రం తప్ప మరే సహజ వనరులు లేకపోయినా, నౌరు ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతోంది.చేపల వేటకు లైసెన్సులు, ఆశ్రయం కోరి వచ్చే శరణార్థుల నుంచి వీసా రుసుములు, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు, విదేశాలలో నిర్వహించే బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా నౌరుకు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి ఏటా ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. నౌరు ప్రభుత్వం వార్ధక్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, జనన మరణాల భృతి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించని పలు చిన్నా చితకా దేశాలు ప్రధానంగా పర్యాటక ఆదాయంపై ఆధారపడుతున్నాయి. పౌరసత్వం కోరుకునే విదేశీయుల నుంచి పెట్టుబడుల సేకరణ, రియల్ ఎస్టేట్, మత్స్యసంపద తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. వివిధ మార్గాల ద్వారా సంపద సృష్టించుకుంటూ, ఇవి తమ పౌరులపై పన్నుభారం మోపకుండా మనుగడ సాగిస్తున్నాయి. -
స్టార్స్ లక్కీ చార్మ్
ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఎంత ముఖ్యమో, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తానేంటో నిరూపించుకుంది లీపాక్షి ఎల్లవాడి. నేడు సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్గా మారిన ఆమె విశేషాలు..నిజం చెప్పాలంటే, పదహారేళ్ల నా ఈ కెరీర్లో ‘ఐ మేడ్ ఇట్’ అనే క్షణం ఇంకా రాలేదు. కేవలం, కొన్ని క్షణాలు మాత్రమే గర్వంగా అనిపించాయి. కాని, నేను సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. – లీపాక్షి ఎల్లవాడి(Leepakshi Ellawadi)ఢిల్లీలో పుట్టిపెరిగిన లీపాక్షి ఎల్లవాడి. లండన్లో ఫ్యాషన్ కోర్సు చేసి, తిరిగి స్వదేశం వచ్చి, కెరీర్ స్టార్ చేసింది. తొలి అవకాశమే అమితాభ్ బచ్చన్ నటించిన ‘బుడ్ఢా హోగా తేరా బాప్’ సినిమాకు లీపాక్షి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. బ్లాక్ అండ్ వైట్తో పాటు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మ్యాజిక్ చేసి, అమితాభ్ను సూపర్ చార్మింగ్గా చూపించి, ప్రశంసలు అందుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్గా మారింది.ఇలా తను మారడానికి కారణం తను ఫాలో అయ్యే ఆ మూడు సూత్రాలేనట.. ‘ఒకటి: కొత్త డిజైనర్లు, స్టయిలిస్ట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం. రెండు: చివరి నిమిషంలో కూడా మార్పులు చేయడానికి కావాల్సిన వనరులతో సిద్ధంగా ఉండటం. మూడు: ట్రెండ్ గేమ్ను ఫాలో అవటం’ అని తన సీక్రెట్ ఫార్ములాను వివరించింది లీపాక్షి.అందుకే, లీపాక్షితో స్టయిలింగ్ చేయించుకోవడానికి చాలామంది స్టార్స్ ఇష్టపడతారు. అమితాభ్తోపాటు షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కియారా ఆడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్కు లీపాక్షీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. -
చదువుకున్న మారాజు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలాచోట్ల ఇంకా రాచరికాలు లాంఛనప్రాయంగా మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాజ సంస్థానాల వారసులకు పట్టాభిషేకాల వంటి లాంఛనాలు కొనసాగుతుండటం మనకు తెలిసిన సంగతే! నాగరిక రాజ్యాలు, సంస్థానాల వ్యవహారాలు సరే, దక్షిణాదిన ఏకైక ఆదివాసీ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు కూడా ఉన్నాడు.అదే కేరళలోని మన్నన్ రాజ్యం. పుష్కరం కిందట ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. ఆయన పట్టభద్రుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ ఆహ్వానంపై హాజరైన ఈ చదువుకున్న మారాజు కథా కమామిషూ..కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన గ్రామానికి చేరువలో ఉంటుంది మన్నన్ రాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దక్షిణాదిన మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ రాజ్యం ఇది. ఈ రాజ్యానికి 2012లో కొత్త రాజు వచ్చాడు. ‘రామన్ రాజమన్నన్(Raman Rajamannan)’గా పట్టాభిషిక్తు డయ్యాడు. అతడి అసలు పేరు బిను. అతడికి ముందున్న రాజు ‘అరియన్ రాజమన్నన్’. అతడు 29 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అరియన్ రాజమన్నన్కు ముందున్న రాజు ‘దేవన్ రాజమన్నన్’ తన 54వ ఏట చనిపోయాడు. ఇప్పటి రాజు రామన్ రాజమన్నన్ అలియాస్ బిను మన్నన్ రాజ్యానికి పదిహేడో రాజు. అతడికి ముందున్న రాజులందరూ నిరక్షరాస్యులే! రామన్ రాజమన్నన్ ఎర్నాకుళం మహారాజా కాలేజీ నుంచి ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తిచేశాడు.మన్నన్ రాజ్యానికి ఎవరు రాజైనా, వారికి ‘రాజమన్నన్’ గౌరవ బిరుదనామం వస్తుంది. మన్నన్ తెగ ప్రజలది మాతృస్వామ్య సమాజం. దేశ పాలనా యంత్రాంగానికి లోబడే ఈ రాజ్యం నడుస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇడుక్కి జిల్లావ్యాప్తంగా 62 చోట్ల విస్తరించి ఉన్న మూడువందలకు పైగా మన్నన్ తెగ కుటుంబాల మంచిచెడ్డలను ప్రస్తుత రాజు రామన్ రాజమన్నన్ చూసుకుంటారు. ఈ రాజుకు ఒక ఆస్థానం, ఆ ఆస్థానంలో తొమ్మిదిమంది మంత్రులు ఉంటారు. ప్రజల పెళ్లిళ్లు, విడాకులు సహా తెగకు సంబంధించిన అంతర్గత సమస్యలు, బయటి నుంచి తెగ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం రాజు బాధ్యతే! రాజుకు హఠాత్తుగా అనారోగ్యం వాటిల్లినా, రాజు మరణించినా, కొత్తరాజు వచ్చేంత వరకు రాజ్యభారాన్ని మంత్రులు చూసుకుంటారు. మన్నన్ ప్రజలు రాజును తమ పాలకుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా గౌరవిస్తారు. ఒక రాజు, అతడికి ఒక ఆస్థానం అంటే భారీగా ఊహించుకుంటారేమో! ఈ రాజుకు, ఆయన ఆస్థానానికి భారీ భవంతులు, రాజప్రాసాదాలూ ఉండవు. మామూలు పక్కా ఇల్లే ఆయన నివాసం, ఆస్థానం.రామన్ రాజమన్నన్ భార్య బినుమాల్ మన్నన్ తెగప్రజలకు రాణి. వీరి కూతురు అర్చన యువరాణి. మన్నన్ ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరిలో కొందరు అటవీశాఖలో చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రామన్ రాజమన్నన్ సకుటుంబంగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేడుకలకు ఆహ్వానం అందుకున్న తొలి మన్నన్ రాజుగా ఆయన దేశ ప్రజలకు కనిపించారు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక రాజదంపతులు ఢిల్లీలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి జనవరి 31 వరకు అక్కడే ఉన్నారు. వారు ఫిబ్రవరి 2న తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను గిరిజనాభివృద్ధి శాఖ పెట్టుకుంది. మన్నన్ల చరిత్ర!ఏడు వందల ఏళ్ల క్రితం పాండ్య, చోళ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండ్యరాజు చిరై వర్మన్ ఓడిపోయాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని తన రాజ్యం నుంచి పారిపోయి, ఇప్పటి ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చి, కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే ఈ మన్నన్ రాజ్యమని స్థానిక మన్నన్ తెగ ప్రజలు చెబుతారు.విద్యను అందించడమే లక్ష్యంరాజుగా నా ప్రజలందరికీ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం. విద్యతోనే ఆదివాసీల జీవితాలు మెరుగుపడతాయి. నేటితరానికి ఈ అవగాహనను కల్పించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలం – రామన్ రాజమన్నన్పిల్లల్ని చదివించటం అంటే వారికి రాయల్ లైఫ్ను ఇవ్వటమే. – రాజమన్నన్ -
డొల్ల విలాస్
పైన పటారం, లోన లొటారం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 1987లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ది ర్యుంగ్యాంగ్ హోటల్(The Ryungyang Hotel)’ అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. ‘ది హోటల్ ఆఫ్ డూమ్’( The Hotel of Doom) అని పిలిచే ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఆరువందల మిలియన్ల పౌండ్లు (అంటే రూ.6,330 కోట్లు) ఖర్చు చేసింది.తాజాగా, ఈ హోటల్కెళ్లిన యూట్యూబర్ కాకెరల్, ‘వెయ్యి అడుగుల ఎత్తు, 105 అంతస్తులతో పిరమిడ్ ఆకారంలో, బయటకు అందంగా కనిపించే ఈ హోటల్ లోపల అంతా డొల్ల్ల. చుట్టూ సిమెంట్ గోడలతో, చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి, అతిథుల కోసం లగ్జరియస్ సదుపాయాలు, మూడువేల గదులతో డిజైన్ చేసిన ఈ హోటల్ను ఇప్పటి వరకు తెరవలేదు.వనరుల లోపం కారణంగా మధ్యలోనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అప్పటి నుంచి కేవలం చూడటానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది కాని, ఇప్పటి వరకు ఈ హోటల్ ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న హోటల్ ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు, కేవలం చూడటానికే ఈ హోటల్ను నిర్మించినట్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. -
నేషనల్ క్రష్మికా
భాష ఏదైనా; ప్రాంతం ఏదైనా; తన ఎంట్రీతో రికార్డులన్నీ క్రాష్ చేసేస్తున్న నటి, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే బ్యూటీ; నేషనల్ (National Crush) క్రష్ రష్మికా మందన్న(Rashmika Mandanna) గురించిన కొన్ని విషయాలు.⇒ రష్మిక పుట్టింది కర్ణాటకలోని కొడగు జిల్లా. బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య కళాశాలలో సైకాలజీ, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో జరిగిన అందాల పోటీలు రష్మికను సినీ ప్రపంచంవైపు నడిచేలా చేశాయి.⇒ కన్నడ చిత్రం ‘కిరాక్ పార్టీ’తో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పలకరించి, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’,‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో నటించి, వరుస విజయాలు అందుకుంది.⇒ ‘పుష్ప: దిరైజ్’.. రష్మికకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రీవల్లిగా తను కనబరచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. తాజాగా విక్కీ కౌశల్తో కలిసి ‘ఛావా’ అంటూ సందడి చేయనుంది.⇒ జపానీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’కు రష్మిక వీరాభిమాని. అంతేకాదు, జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్’కు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించింది.⇒ రష్మికకు అన్నింటికంటే ఆనందాన్నిచ్చే ప్రదేశం తన ఇల్లు. సినీ స్టార్గా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా తన జీవితాన్ని గౌరవిస్తుంది. ⇒ గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దన చేసుకోవటమే రష్మిక సౌందర్య రహస్యం. ఆరోగ్యకరమైన ఆమె జుట్టుకు, చర్మసౌందర్యానికి అదే కారణం.⇒ కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులు, ఎదుటివారిని గౌరవించే వారంటే నాకు ఇష్టం. – రష్మికా మందన్న. -
యువ కథ: మలిసంధ్య
అప్పుడప్పుడే పడమటి కొండల్లోకి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, నిట్టూర్పుతో మరుసటి రోజు కోసం ఎదురుచూద్దాం అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంది పెద్దావిడ అన్నపూర్ణమ్మ. ఊళ్లో వాళ్లంతా ఆమెను పెద్దమ్మ అని ప్రేమతో పిలుస్తారు. అందరికీ ప్రేమను పంచుతూ, ఒకరికి కష్టం వస్తే, అది తనకే వచ్చిందనుకుని తపనపడే దొడ్డమనసు అన్నపూర్ణమ్మ సొంతం. ఊళ్లోని సాటి ఆడవాళ్లు ‘వదినగారు’ అని, పిల్లలందరూ ‘బామ్మ’ అని ఏదో ఒక వరుస కలుపుకొని ఆమెను పిలుస్తుంటారు. ఊరి మనుషులందరి అభిమానాన్ని సంపాదించుకున్న మహానుభావురాలు అన్నపూర్ణమ్మ.ఈ రోజు ఒంటరిగా మిగిలినా, ఒకప్పుడు ఆమె కుటుంబం చాలా పెద్దది. భర్త పరంధామయ్య శ్రీరాముడంతటి మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంలో లాభాలు గడిస్తూ, పదిమందికీ పెట్టే గుణం గల దయార్ద్ర హృదయుడు పరంధామయ్య. పేరుకు తగ్గట్లే అడగకుండానే కడుపు నింపే చల్లనితల్లి అన్నపూర్ణమ్మ. ఆ దంపతుల కొడుకులు సరస్వతీపుత్రులు, కూతుళ్లు చదువుల తల్లులు. ఊళ్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మనే! సజావుగా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని కష్టం కెరటంలా ముంచుకొచ్చి, పరంధామయ్యగారిని తీసుకుపోయింది. ఆయన మరణంతోనే అన్నపూర్ణమ్మ సంతోషం దూరమైంది.చదువులు పూర్తయ్యాక పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చుకుంది అన్నపూర్ణమ్మ. ఊళ్లోని పెద్దల సమక్షంలో ఆస్తిని సమ భాగాలు చేసి, పిల్లలందరికీ సమానంగా పంచింది. పంపకాల తర్వాత ఉద్యోగాల పేరిట ఎవరి దారి వారు చూసుకున్నారు. మిగిలింది వైభవంగా బతికిన ఇల్లు, దేవాలయంలాంటి ఆ ఇంట్లో దేవతలాంటి అన్నపూర్ణమ్మ. ఆ రోజు అన్నపూర్ణమ్మ పనిమనిషి రంగిని తోడుగా తీసుకుని, రామాలయానికి వెళ్లింది. అక్కడ భజనలో కూర్చుని, రామాయణాన్ని ఆలకిస్తూ, రామాయణ సారంలో తన సంసారాన్ని గుర్తు తెచ్చుకుని, ఆ శ్రీరామునికి నమస్కరించి, రంగితో కలిసి ఇంటికి బయలుదేరింది.మర్నాడు తెల్లారింది. రంగి కళ్లాపి చల్లి, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న రంగి మెదడులో ఒకటే ఆలోచన– ఎప్పుడూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచే అన్నపూర్ణమ్మ ఇంకా నిద్రలేవలేదేంటా అనుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి వసారాలోకి చూస్తూ, ముగ్గు ముగించింది.‘అమ్మగారూ!.. అమ్మగారూ!’ అని పిలుస్తూ, అన్నపూర్ణమ్మను లేపడానికి వెళ్లింది. రంగి పిలుపుతో అన్నపూర్ణమ్మ నెమ్మదిగా లేచింది. ‘ఏమైందమ్మా! ఇంతసేపు ఎప్పుడూ పడుకోలేదు’.. అంటూ రంగి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.‘ఏమీ లేదే! రాత్రంతా మగత నిద్ర. తెల్లవారుతుండగా నిద్రొచ్చి, రెప్పల మీద వాలింది’ అంటూ ‘కాఫీ తెమ్మ’ని పురమాయించింది అన్నపూర్ణమ్మ. రంగి తీసుకొచ్చిన కాఫీ తాగింది. మనసులో ఏదో ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడట్లేదు.పని ముగించుకుని, రంగి ఇంటికి వెళుతుండగా, ‘రంగీ! ఒకసారి ఇలా రా!’ అని పిలిచింది. రంగి వాలుకుర్చీ పక్కనే కూర్చుని, ‘సెప్పండమ్మా!’ అంది. ‘ఏంలేదే, నీతో మాట్లాడాలి. కాసేపాగి వెళుదువుగాని’ అంది అన్నపూర్ణమ్మ. ‘అలాగే, అమ్మగారు’ అంటూ సర్దుకుని కూర్చుంది. ‘అసలు మీకేమైనాది? అంత పరాగ్గా ఉన్నారేటి అమ్మగారు? నేనే అడుగుదామను కుంటుండా. అందరికీ ఏం అక్కర ఉన్నా సాయం చేసేటోళ్లు, మనసులో బాధ కూడా సెప్పకనే తెలుసుకునేటోళ్లు– అట్టాంటిది, మీకేమైనాదమ్మా! నాతో సెప్పండమ్మా’ అని అడిగింది. ‘ఏమిటే, నీతో మాట్లాడదాం అని నిన్ను నేను పిలిస్తే, నాకు ఊరటనిస్తున్నావా?’ అంది అన్నపూర్ణమ్మ.‘సరేగాని, నీ బిడ్డడు పనిలో కుదురుకున్నాడా?’ అడిగింది.‘ఎక్కడమ్మా! ఆడికొచ్చిన అరకొర సదువుతో యాడ కుదురుకుంటాడు తల్లీ!’ నిట్టూర్చింది రంగి.‘సరేలే! అయితే, నువ్వూ నీ కొడుకు ఇద్దరే కదా, నాతో ఉంటారా?’ అడిగింది అన్నపూర్ణమ్మ.ఆ మాటకు రంగి బిగుసుకుపోయి, ‘అదేటమ్మా? మీతో మేమెలా?’ అంటూ తల గోక్కుంటూ ఇబ్బంది పడుతుంటే, ‘సామానంతా సర్దుకుని, తయారుగా ఉండండి. రేపు మొదటి బండికి మనం పట్నం బయలుదేరుతున్నాం’ అంటూ రంగి సమాధానం తెలిసినట్లుగా ఆజ్ఞాపించింది అన్నపూర్ణమ్మ. ఎందుకో, ఏమిటో అనుకుంటూ అయోమయంలో ఇంటికి బయల్దేరింది రంగి.మరుసటి రోజు పొద్దున్నే రంగి, ఆమె కొడుకు నాగ అన్నపూర్ణమ్మ ఇంటికి సామానుతో వచ్చారు. బండికి ఇంకాస్త సమయం ఉంది. ప్రయాణంలో తినడానికి కొన్ని తినుబండారాలను బ్యాగులో సర్దింది రంగి. ఈలోగా అన్నపూర్ణమ్మ తయారై, బండి తెమ్మని పురమాయించింది. ముగ్గురూ రైల్వేస్టేషన్కు చేరుకుని, రైలులో కూర్చున్నారు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న అన్నపూర్ణమ్మ కళ్లు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. నీటి తెరల వెనుక జ్ఞాపకాల అలలు ఒక్కొక్కటిగా మెదిలాయి. ఆ రోజు అన్నపూర్ణమ్మ కూతురికి డెలివరీ టైమ్ దగ్గరపడుతుండటంతో కూతురి దగ్గరకు వెళ్లింది.అన్నీ సవ్యంగా జరిగాయి. మహాలక్ష్మి రూపంలో కవలలు పుట్టారు కాని, అతుక్కుని పుట్టారు. హాస్పటిల్లోనే చాలా రోజులు ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు.హారతితో ఎదురువెళ్లిన అన్నపూర్ణమ్మకు బిడ్డలు కనబడలేదు. కూతురు, అల్లుడు– అంతే! ‘ఏమైంద’ని అడిగితే, ఆధునికతను అణువణువూ నింపుకున్న వాళ్లకు బిడ్డలు బరువు అనిపించి, ఆశ్రమంలో వదిలేసి వచ్చామన్నారు, ఏ బాధ లేకుండా. అన్నపూర్ణమ్మ మనసు భారమైంది. మానవత్వం, తల్లిప్రేమ ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. మర్నాడు ఆశ్రమానికి వెళ్లింది. పిల్లలను తీసుకుని, ఆస్పత్రిలో పెద్ద డాక్టర్ను కలిసి, వారి ఆపరేషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత ఆపరేషన్ మొదలైంది. వరుసగా ఐదు నుంచి ఏడుసార్లు ఆపరేషన్ చేయాలని, అంతవరకు తామే చూసుకుంటామని వారు చెప్పారు. ‘అలాగే’నని వారికి కావలసిన డబ్బును ఒకేసారి జమచేసింది అన్నపూర్ణమ్మ.ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు. పిల్లలను తీసుకెళ్లమని డాక్టర్ ఫోన్ చేయడంతో అన్నపూర్ణమ్మ చూడటానికి వెళ్లింది. అక్కడ తన మనవరాళ్లలాగ ఉన్న చాలామంది నిస్సహాయులైన పిల్లలు కనిపించారు. ఒక నిర్ణయంతో ఆ ఊరికి బయలుదేరింది. ‘అమ్మగారు! మనం ఇక్కడేనా దిగాలి?’ అడిగింది రంగి. ఔనన్నట్లు లేచింది అన్నపూర్ణమ్మ.అందరూ బండి దిగారు. బయట వారికోసం కారు ఆగి ఉంది. అందరూ అందులో బయలుదేరారు. ఒక విశాలమైన పచ్చిక బయలులాంటి మైదానంలో చుట్టూ చెట్టు చేమలతో, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదభరితంగా ఉన్న ప్రదేశంలో దేవాలయంలాంటి ఇంటి ముందు ఆగింది కారు.అన్నపూర్ణమ్మ రాగానే ‘బామ్మ! బామ్మ!’ అంటూ చేతికర్రల ఊతంతో ఉన్న పిల్లలు, చక్రాల బళ్లలో ఉన్న పిల్లలు ఆమె చుట్టూ చేరారు. వారిలో అన్నపూర్ణమ్మ మనవరాళ్లు కూడా ఉన్నారు. ఆపరేషన్ అయ్యాక పిల్లలు సరిగా నడవలేరు అనే నిజం తెలుసుకున్నాక, అన్నపూర్ణమ్మ అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించింది. వారందరికీ తానే భోజన, వసతి ఖర్చులను భరించింది. తనకు మిగిలిన ఆస్తినంతా ఆశ్రమానికి రాసేసింది. ఆ ఆశ్రమంలోనే ఉంటూ, పిల్లల బాగోగులను చూసుకుంటూ తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది అన్నపూర్ణమ్మ. అక్కడ అడుగుపెడుతూనే, పిల్లలందరూ అన్నపూర్ణమ్మ చుట్టూ చేరడం చూసి, రంగి, ఆమె కొడుకు నాగ ఆమెను దేవతను చూసినట్లుగా తన్మయం పొందారు. అన్నపూర్ణమ్మకు చేదోడు వాదోడుగా ఆ తల్లీకొడుకులు అక్కడే ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ తీసుకున్న నిర్ణయం రేపటి తరపు సూర్యోదయం కోసం ఎదురుచూసే మలిసంధ్య. -
చెల్లింపుతో చిక్కాడు
రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు. ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్పై ఒత్తిడి చేసింది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్ఫోన్ ద్వారా యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్ఫోన్ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు. -
నిర్మలాను ఎవరు చంపారు?
2018 జూలై 26, ఉదయం 11 గంటలు– ‘అమ్మా! చదువుకోవడానికి రోషనీ ఇంటికి వెళుతున్నాను’ తల్లితో చెప్పింది నిర్మలా. ‘సరే, సాయంత్రంలోగా వచ్చేసేయ్’ అని చెప్పి, కూతురిని సాగనంపింది తల్లి దుర్గాదేవి.సైకిల్ మీద బయలుదేరింది నిర్మలా. నేపాల్లోని కాంచన్పూర్ గర్ల్స్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోందామె. సాయంత్రం ఆమె తండ్రి యజ్ఞరాజ్ పంత్ ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడినా నిర్మలా ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాలు రోషనీ ఇంటికి వెళ్లి కనుక్కున్నాడు.‘నిర్మలా ఇక్కడకు వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం. మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరింది’ అని చెప్పింది రోషనీ.రాత్రి పదిగంటలకు యజ్ఞరాజ్, దుర్గాదేవి దంపతులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ‘రేప్పొద్దున్న రండి, ఫిర్యాదు తీసుకుంటాం’ అని పోలీసులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. చేయగలిగిందేమీ లేక యజ్ఞరాజ్, దుర్గాదేవి ఇంటికి వెళ్లిపోయారు.మర్నాడు ఉదయం నిర్మలా మృతదేహం ఒక చెరుకుతోటలో నగ్నంగా పడి ఉంది. ఆ చెరుకుతోట రోషనీ ఇంటికి అరకిలోమీటరు దూరంలో నిర్మలా ఇంటికి వెళ్లే తోవలో ఉంది. తోట బయట ఆమె సైకిలు పడేసినట్లుగా ఉంది. స్థానికులు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎవరో ఆమెపై అత్యాచారం చేసి, చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.ఈ సంఘటనపై నేపాల్లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు మర్నాడు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పడంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.స్థానిక పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో సంఘటన జరిగిన నాలుగు రోజులకు నేపాల్ జాతీయ దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీఐబీ) రంగంలోకి దిగింది. అయినప్పటికీ నేపాల్లో ఈ సంఘటనపై ఆందోళనలు చల్లారలేదు. కాంచన్పూర్లో ఆగస్టు 24న జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తూటా గాయానికి గురయ్యారు.పరిస్థితి నానాటికీ జటిలంగా మారుతుండటంతో సీఐబీ పోలీసులు దిలీప్సింగ్ బిస్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పంత్ కుటుంబం నివసించే వీథిలోనే బిస్తా నివాసం. నిర్మలా హత్యకు కొద్దిరోజుల ముందే అతడు హత్యకేసులో శిక్ష అనుభవించి, జైలు నుంచి విడుదలై వచ్చాడు. పలుమార్లు జరిపిన ఇంటరాగేషన్లో బిస్తా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో జరిగిన సంఘటనలో అతడి ప్రమేయం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా అభిశంసించింది. కొన్నాళ్లకు పోలీసులు పంత్ కుటుంబానికి పొరుగునే ఉండే ప్రదీప్ రావల్ను, అతడి స్నేహితుడు బిశాల్ చౌధరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లను సీఐబీ ఐజీ సర్బేంద్ర ఖనాల్, డీఐజీ నీరజ్ బహదూర్ షాహీ స్వయంగా విచారించారు. వారిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టక ముందే నేపాల్ రక్షణమంత్రి ఈశ్వర్ పొఖ్రేల్ ఆదరబాదరగా ప్రెస్మీట్ పెట్టి, నిర్మలా పంత్ కేసులో దోషులు పట్టుబడ్డారు అని ప్రకటించారు.తర్వాత రావల్, చౌధరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో వారి నమూనాలు సరిపోలడం లేదని వైద్యులు తేల్చారు. కోర్టు వారిని విడుదల చేసింది. బయటకు వచ్చాక వారిద్దరూ పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు చెప్పారు. పోలీసులు వారిద్దరి నమూనాలతో పాటు, భీమ్దత్తా మునిసిపాలిటీ మేయర్ సురేందర్ బిస్తా సోదరుడి కొడుకు ఆయుష్ బిస్తా, సురేందర్ బిస్తా సోదరుడు ఎస్పీ బిస్తా, ఆయన కొడుకు కిరణ్ బిస్తాల నుంచి కూడా నమూనాలు సేకరించారు. వారి నమూనాలేవీ మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలేదు. ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ప్రహసనంగా మార్చడంతో కోపోద్రిక్తులైన జనాలు నేపాల్లో దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిదిమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా, ఆందోళనలు సద్దుమణిగాక కొద్దినెలల్లోనే వాళ్లందరికీ తిరిగి పోస్టింగులు ఇచ్చారు. సంఘటన జరిగి ఆరున్నరేళ్లయినా, నిర్మలా పంత్ హత్యాచారానికి కారకులైన అసలు నేరస్థులు ఎవరనేది పోలీసులు కనుక్కోలేక పోయారు. నేపాల్ను అట్టుడికించిన ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. -
నాన్సీ త్యాగీ
లైఫ్స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ వరల్డ్లోని తన అనుభవాలను, లైఫ్స్టయిల్ థింగ్స్ని, ఫ్యాషన్ టిప్స్ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది. -
ట్రెండ్సెట్టర్
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్సెట్టర్ స్టయిలిస్ట్గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్గా చేరి, ఫ్యాషన్పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్ను గమనించింది. డిజైనింగ్పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్ను క్రియేట్ చేసుకుంది.ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్ను తీర్చిదిద్దే చాన్స్నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్కి కొంతకాలం స్టయిలిస్ట్గా పనిచేసింది. -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్లో కోవిడ్ వైరస్ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్లుక్స్ వరకు ప్రతిదీ సూపర్గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు. అలా చాలామంది బ్రైడల్స్కు బెస్ట్ ఫ్రెండ్గా మారి, వారి ఫొటో షూట్స్కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. ఆ స్టయిలింగ్కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండి -
వాటి వల్ల ప్రమాదమా?
నేను ఇప్పుడు మూడునెలల గర్భవతిని. ఇంట్లో చాలా సంవత్సరాలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వీటి వలన నాకు ఏదైనా ప్రమాదం ఉందా? – నైనిక, వరంగల్ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, శిశువుకు వ్యాపిస్తుంది. దానితో కొన్ని ఆరోగ్య సమస్యలను చూస్తాం. జంతువుల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం చాలా సాధారణం. వాటికి వాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వాక్సినేట్ చేయించాలి. పిల్లులు పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లుల మల విసర్జనలో టాక్సోప్లాస్మా అనే ఆర్గానిజమ్ ఉంటుంది. ఇది వ్యాపిస్తే, టోక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హానికరం. అందుకే, మీరు పిల్లులకు సంబంధించిన కొన్ని పనులను చేయకూడదు. అంటే పిల్లి పరుపు, బొమ్మలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే రబ్బర్ గ్లౌవ్స్ వేసుకొని చెయ్యాలి. జబ్బు పడిన పిల్లులకు దూరంగా ఉండాలి. తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లులు మాత్రమే కాదు, గొర్రెలు, గొర్రె పిల్లలను పెంచుకునే వారు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అసలు జాగ్రత్త తీసుకోని వారికి ఈ పెంపుడు పిల్లుల బాధ్యత తీసుకోవటం వలన బేబీకి ఇన్ఫెక్షన్స్, పుట్టిన శిశువు తక్కువ బరువుతో ఉండటం, గర్భస్రావం, శిశువుకు గర్భస్థ వైకల్యాలు లాంటి సమస్యలు వస్తాయి. మొదటి మూడు నెలల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. బేబీ బ్రెయిన్ డామేజ్, బేబీ కళ్లు, ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫెక్షన్స్ వస్తే, పెంపుడు జంతువులకు చాలా వరకు వాక్సినేట్ చేస్తాం. కాని, కొంతమందికి రేబిస్ వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు ఈ రేబిస్ వైరస్ని క్యారీ చేస్తాయి. వాటి గోళ్లను రోజూ శుభ్రం చేయాలి. ఈ జంతువుల టేబుల్వేర్, పెట్ నెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్గా వాక్సినేట్ చెయ్యాలి. పెట్స్ని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కాని ఈ పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి పెట్స్తో ప్రెగ్నెన్సీలో అలెర్జీ, దురదలు వస్తాయి. వీటితో ఇనెఫెక్షన్స్ కావచ్చు. బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ పెంపుడు జంతువుల ద్వారా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎంత ఉందని ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పరీక్షలు చేసి కనిపెట్టవచ్చు. మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెక్ చేసే టార్చ్ టెస్ట్ (ఖీౖఖఇఏ ఖీఉ ఖీ) ఉంది. మీకు యాంటీబాడీస్ లేకపోతే ఇన్ఫెక్షన్ చాన్స్ ఎక్కువ అని అర్థం. ఈ పెంపుడు జంతువుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాక్సిన్ ద్వారా అరికట్టలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కుంటూ, పరిశుభ్రత పాటిస్తున్నట్లయితే, చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
శిల్పీ–గౌతమ్ హత్య
1999 జూలై 3 – ఆరోజు మధ్యాహ్నం వేళ. బిహార్ రాజధాని పట్నాలోని ఫ్రజేర్ రోడ్– నగరంలోని రాజకీయ ప్రముఖులు ఉండే ప్రదేశం. ఆ వీథి గల్లీల్లో పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. దాగుడు మూతలు ఆడుకుంటూ ఒక చిన్నారి బుడతడు, ఒక చిన్నారి పాప వీథిలో నిలిపి ఉన్న కారు పక్కన దాగుందామని, కారు వద్దకు చేరుకున్నారు. తెరిచి ఉన్న కారు కిటికీలోంచి కనిపించిన దృశ్యం వాళ్లను భయభ్రాంతులను చేసింది. గుక్కపట్టి ఏడుస్తూ పరుగు తీశారు. దారినపోయే ఒక పెద్దమనిషి వాళ్లను ఆపి, ‘ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు.‘మరేమో, ఆ కారులో ఒక అన్న, ఒక అక్క చచ్చిపోయి ఉన్నారు’ వెక్కిళ్లు పెడుతూ, ఆ కారుకేసి వేలితో చూపిస్తూ, బదులిచ్చాడు బుడతడు. ఆ కారు ఎమ్మెల్యే సాధు యాదవ్ క్వార్టర్కు చేరువలో నిలిపి ఉంది. సాధు యాదవ్ సాక్షాత్తు బిహార్ ముఖ్యమంత్రి రబ్డీదేవి సోదరుడు, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బావమరిది. ఆర్జేడీ పార్టీలో పలుకుబడిగల నాయకుడు. బుడతడి సమాచారంతో ఆ పెద్దమనిషి కనిపించిన అందరికీ సంగతి చెబుతూ, దాదాపు పరుగు పెడుతున్నట్లే కారు వద్దకు చేరుకున్నాడు. కారులో ఒక యువతి, ఒక యువకుడు విగతజీవులై ఉన్నారు. యువతి శరీరంపై దుస్తులు సగం తొలగి ఉన్నాయి. కారు వద్ద గుమిగూడిన జనంలోంచి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. క్వార్టర్ సమీపంలో కలకలం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల కంటే ముందే కారు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మృతులను శిల్పీ జైన్, గౌతమ్ సింగ్గా గుర్తించారు. ముందురోజు ఇంటి నుంచి బయలుదేరిన వారిద్దరూ తిరిగి ఇంటికి చేరుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శిల్పీ తండ్రి ఉజ్వల్కుమార్ జైన్. పట్నాలోని ప్రముఖ వస్త్రదుకాణం కమలా స్టోర్ యజమాని. గౌతమ్ తండ్రి డాక్టర్ బి.ఎన్.సింగ్. లండన్లో ఆయన సొంత క్లినిక్ నడుపుకుంటున్నాడు. శిల్పీ, గౌతమ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని పెద్దలు కూడా అనుకున్నారు. శిల్పీ చదువు పూర్తయ్యాక పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవాలని ఇరువురి కుటుంబాలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈలోగానే ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై దర్యాప్తులో పట్నా పోలీసులు చేయరాని పొరపాట్లన్నీ చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లనే వారు ఉద్దేశపూర్వకంగా అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల సేకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పైగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక కానిస్టేబుల్ ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయాడు. ఈ చర్యతో స్టీరింగ్పై వేలిముద్రలు సేకరించే అవకాశం లేకుండాపోయింది. కనీసం మృతదేహాలకు శవపంచనామా గాని, పోస్ట్మార్టం గాని జరగకముందే, కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఈ సంఘటనను జంట ఆత్మహత్యలంటూ మీడియా ముందు ప్రకటించారు. ఆర్జేడీ కార్యకర్తలు మధ్యలో కలగజేసుకుని, మృతదేహాలకు పోస్ట్మార్టం జరిపించడానికి కూడా నిరాకరించారు. పోలీసులు ఎలాగోలా వాళ్లకు సర్దిచెప్పి, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలు దొరికితే, పోస్ట్మార్టం రిపోర్టు రాకుండానే, పోలీసులు ఆత్మహత్యలంటూ ప్రకటించడంపై కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శలు చేశాయి. తర్వాత పోస్ట్మార్టం రిపోర్టు వచ్చాక, విషం పుచ్చుకోవడం వల్లనే వారు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఈలోగా వారు హడావుడిగా గౌతమ్ మృతదేహాన్ని దహనం చేసేశారు. శిల్పీ జైన్ పట్నా విమెన్స్ కాలేజీకి అందాలరాణి. కాలేజీ అందాల పోటీలో కిరీటాన్ని అందుకుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండేది. కాలేజీలో ఆమె సన్నిహితులకు గౌతమ్ గురించి కూడా తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోయారు. సంఘటన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ఆరు రోజులకు శిల్పీ తల్లిదండ్రులు తమ కూతురిది, ఆమె సహచరుడిది ఆత్మహత్య కాదని, ఎవరో వారిని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పట్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు.కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు పట్నా పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ అధికారులు శిల్పీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ లాబొరేటరీకి పంపారు. హైదరాబాద్ లాబొరేటరీ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు శిల్పీపై పలువురు అత్యాచారం జరిపారని, ఆ హింస తట్టుకోలేకనే ఆమె మరణించి ఉండవచ్చని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఆమె సహచరుడు గౌతమ్ మృతికి కారణాలు తెలుసుకుందామనుకుంటే, అప్పటికే అతడి మృతదేహాన్ని దహనం చేయడంతో కనీసమైన ఆధారాలు కూడా లేకుండాపోయాయి.ఈ సంఘటనలో సీబీఐ అధికారులు సాధు యాదవ్ను అనుమానితుడిగా గుర్తించారు. దర్యాప్తు కోసం రక్త నమూనాలు అడిగితే, ఆయన నిరాకరించాడు. నాలుగేళ్ల పాటు దర్యాప్తు సాగదీసిన సీబీఐ, ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయింది. ఒక్క నిందితుడినైనా పట్టుకోలేకపోయింది. చివరకు ఏమీచేయలేక కేసు మూసేసింది. సీబీఐ ఎటూ తేల్చకుండా కేసును మూసివేయడంపై శిల్పీ జైన్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకు శిల్పీ సోదరుడు ప్రశాంత్ జైన్ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అతడి కిడ్నాప్ కేసులో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు.